paris olympics
-
అరుదైన ఒలింపిక్ స్వర్ణానికి రూ.5 కోట్లు
బోస్టన్: అమెరికా గడ్డపై 1904లో జరిగిన తొలి ఒలింపిక్స్ నాటి బంగారు పతకం శుక్రవారం వేలంలో దాదాపు రూ.5 కోట్లు పలికింది! దానిపై ‘ఒలింపియాడ్, 1904’అని రాసుంది. ముందువైపు విజేత పుష్పగుచ్ఛం పట్టుకొని ఉండగా వెనకవైపు పురాతన గ్రీస్లో విజయానికి అధిదేవత నైక్, దేవతల రాజు జ్యూస్ ఉన్నారు.దీన్ని అమెరికన్ అథ్లెట్ ఫ్రెడ్షూల్కు ప్రదానం చేశారు. ఆ ఒలింపిక్స్లో అమెరికన్లు 96 ఈవెంట్లలో ఏకంగా 78 స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నేటి ఒలింపిక్స్ వెండిపై బంగారు పూత పూసిన పతకాలిస్తున్నారు. అప్పట్లో మాత్రం అచ్చమైన బంగారంతో చేసిన పతకాలే ఇచ్చేవారు. ఇలాంటి పతకాలు వేలానికి రావడం అసాధారణమని వేలం సంస్థ ఆర్ఆర్ ఆక్షన్ పేర్కొంది.2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకంతో పాటు 1932, 1964, 1998 2012 ఒలింపిక్స్ పతకాలతో సహా వందలాది ఒలింపిక్ వస్తువులు వేలంలో అమ్మకానికి వచ్చాయి. ఒలింపిక్ స్మృతి చిహ్నాలకు ఎప్పటినుంచో మంచి ధర లభిస్తోంది. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెలెస్లో జరగనున్నాయి. ఈ నగరం ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వనుండటం 1932, 1984 తరువాత ఇది మూడోసారి.ఇదీ చదవండి: రోమ్లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్ -
నలుగురు ‘ఖేల్ రత్న’లు
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన మేటి క్రీడాకారులకు ‘ఖేల్ రత్న’ అవార్డు వరించింది. పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలతో మెరిసిన మహిళా షూటర్ మనూ భాకర్... పిన్న వయసులో చెస్ ప్రపంచ చాంపియన్గా అవతరించిన తమిళనాడు గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్... భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్... పారాథ్లెట్ ప్రవీణ్ కుమార్... 2024 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరితోపాటు మరో 32 మంది ప్లేయర్లకు ‘అర్జున అవార్డు’ దక్కింది. ఇందులో 17 మంది పారాథ్లెట్లు కూడా ఉండటం విశేషం. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం అవార్డుకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. » స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్గా మనూ రికార్డు నెలకొల్పింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో హరియాణాకు చెందిన 22 ఏళ్ల మనూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్యాలు నెగ్గింది. కొన్ని రోజుల క్రితం ఈ అవార్డు కోసం మనూ భాకర్ దరఖాస్తు చేసుకోలేదనే వార్తలు వచి్చనా... చివరకు ‘పారిస్’లోని ఆమె ప్రదర్శనకు అవార్డు దక్కింది. » గత ఏడాది చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టుకు స్వర్ణ పతకం దక్కడంలో కీలకపాత్ర పోషించిన గుకేశ్ ఆ తర్వాత సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ను ఓడించి జగజ్జేత అయ్యాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (1991–1992లో) ‘ఖేల్ రత్న’ అవార్డు పొందనున్న రెండో చెస్ ప్లేయర్ గుకేశే కావడం విశేషం. » 2024 పారిస్ ఒలింపిక్స్లో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్ప్రీత్ సింగ్... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. మూడుసార్లు అతను అంతర్జాతీయ హాకీ సమాఖ్య అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. » పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ‘ఖేల్రత్న’ కోసం సిఫారసు చేసింది. పారిస్ పారాలింపిక్స్ హైజంప్ (టి64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. »‘ఖేల్ రత్న’ అవార్డు గ్రహీతలకు అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహకం, అర్జున అవార్డీలకు రూ. 15 లక్షల నగదు బహుమతి లభించనుంది. జ్యోతి, దీప్తిలకు ‘అర్జున’ ఆంధ్రప్రదేశ్ వర్ధమాన అథ్లెట్ జ్యోతి యర్రాజీ...తెలంగాణ పారాథ్లెట్ దీప్తి జివాంజిలకు ఉత్తమ క్రీడాకారులకు అందించే ‘అర్జున అవార్డు’ లభించింది. వైజాగ్కు చెందిన 25 ఏళ్ల జ్యోతి పారిస్ ఒలింపిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో పోటీపడింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచింది. 2023 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది. 2023, 2024లలో జరిగిన ఆసియా ఇండోర్ చాంపియన్షిప్లో జ్యోతి 60 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ, రజతాలు గెలిచింది. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల దీప్తి 2024 పారిస్ పారాలింపిక్స్లో 400 మీటర్ల టి20 కేటగిరీలో కాంస్యం... 2024 ప్రపంచ పారాథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. 2023 హాంగ్జౌ పారా ఆసియా క్రీడల్లో దీప్తి బంగారు పతకం గెలిచింది. దీప్తికి భారత స్పోర్ట్స్ అథారిటీ కోచ్ నాగపురి రమేశ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు.అవార్డీల వివరాలు‘ధ్యాన్చంద్ ఖేల్రత్న’: దొమ్మరాజు గుకేశ్ (చెస్), హర్మన్ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా–అథ్లెటిక్స్), మనూ భాకర్ (షూటింగ్). అర్జున అవార్డు (రెగ్యులర్): జ్యోతి యర్రాజీ, అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు, స్వీటీ బూరా (బాక్సింగ్), వంతిక అగర్వాల్ (చెస్), సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్ప్రీత్, సుఖ్జీత్ సింగ్ (హాకీ), రాకేశ్ కుమార్ (పారా ఆర్చరీ), దీప్తి జివాంజి, ప్రీతి పాల్, అజీత్ సింగ్, సచిన్ ఖిలారి, ధరమ్వీర్, ప్రణవ్ సూర్మ, హొకాటో సీమ, సిమ్రన్, నవ్దీప్ (పారా అథ్లెటిక్స్), నితీశ్, తులసిమతి, నిత్యశ్రీ, మనీషా (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా జూడో), మోనా అగర్వాల్, రుబీనా (పారా షూటింగ్), స్వప్నిల్ కుసాలే, సరబ్జోత్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (లైఫ్టైమ్): సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ పేట్కర్ (పారా స్విమ్మింగ్). ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్): సుభాశ్ రాణా (పారా షూటింగ్), దీపాలి దేశ్పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్ (హాకీ). ద్రోణాచార్య అవార్డు (లైఫ్టైమ్): మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండో అనెలో కొలాకో (ఫుట్బాల్). -
పిస్టల్ వదిలి.. వయోలిన్ చేతబట్టి (ఫొటోలు)
-
అంబానీ నివాసంలో తళుక్కుమన్న పతక విజేతలు.. వాళ్లిద్దరు హైలైట్(ఫొటోలు)
-
ఉగాండా మహిళా అథ్లెట్ విషాదాంతం
నైరోబి: తన భాగస్వామితో ఏర్పడిన స్థల వివాదం చివరకు ఉగాండా మహిళా ఒలింపియన్ అథ్లెట్ రెబెకా చెపె్టగె ప్రాణాలను తీసింది. గత నెలలో జరిగిన పారిస్ ఒలింపిక్స్లో రెబెకా మారథాన్ ఈవెంట్లో పాల్గొని 44వ స్థానంలో నిలిచింది.పలు అథ్లెటిక్ శిక్షణ కేంద్రాలున్న ట్రాన్స్ ఎన్జొయా ప్రాంతంలో 33 ఏళ్ల రెబెకా స్థలం కొని ఇల్లు కట్టుకుంది. దీనిపై రెబెకా, ఆమె భాగస్వామి డిక్సన్ డియెమా మధ్య గత ఆదివారం పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాతి రోజు సోమవారం డిక్సన్ తనవెంట గ్యాసోలిన్ (పెట్రోలియం ఉత్పాదన)ను క్యాన్లో తీసుకొచ్చి రెబెకాపై పోసి నిప్పంటించాడు. వెంటనే ఆమె శరీరమంతా మంటలు అంటుకోవడంతో పాటు డిక్సన్కూ కాలిన గాయాలయ్యాయి. అనంతరం ఇద్దరిని కెన్యాలోని హాస్పిటల్లో చేర్పించగా గురువారం ఉదయం రెబెకా మృతి చెందింది. 30 శాతం కాలిన గాయాలున్న డిక్సన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీస్ కమాండర్ జెరెమా ఒలీ కొసిమ్ తెలిపారు. -
శెభాష్ ధరంబీర్.. భారత్ ఖాతాలో మరో గోల్డ్మెడల్
ప్యారిస్ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగిస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్లో ధరంబీర్ నైన్ స్వర్ణం పతకంతో మెరిశాడు. బుధవారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 34.92 మీటర్ల త్రో సాధించిన ధరంబీర్.. పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.తద్వారా పారాలింపిక్స్ చరిత్రలోనే క్లబ్ త్రో ఈవెంట్లో గోల్డ్మెడల్ గెలుచుకున్న తొలి భారత అథ్లెట్గా ధరంబీర్ నిలిచాడు. మరోవైపు ఇదే ఈవెంట్లో ప్రణవ్ సూర్మ రజతం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో 34.59 మీటర్ల త్రో సాధించిన ప్రణవ్.. సిల్వర్ మెడల్ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ పారాలింపిక్స్లో భారత్ సాధించిన పతకాలు సంఖ్య 24కు చేరింది. అందులో ఐదు బంగారు పతకాలు, 9 కాంస్య, 10 రజత పతకాలు ఉన్నాయి.చదవండి: ‘టోక్యో’ను దాటేసి... -
పారాలింపిక్స్: భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
ప్యారిస్ పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. పారా షూటర్ మనీష్ నర్వాల్ అదరగొట్టాడు. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ ఫైనల్ లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని సాధించాడు.మూడు రౌండ్లలో మనీష్ 234.9 పాయింట్స్ సాధించి రెండో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన జియోంగ్డు జో గోల్డ్మెడల్ సొంతం చేసుకోగా.. చైనా షూటర్ యాంగ్ చావో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల 100 మీ. టీ35 పరుగు పందెంలో ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. నిర్దేశిత లక్ష్యాన్ని ప్రీతి 14.21 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. దీంతో భారత్ మొత్తం 4 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.అంతకుముందు ఇవాళ(శుక్రవారం) మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించింది. ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్గా భారత్ ఖాతాలో మొత్తం 4 పతకాలు ఉన్నాయి. -
లీలా ప్యాలెస్లో మనూ భాకర్కు అపూర్వ స్వాగతం
చెన్నైలోని సుప్రసిద్ధ ఫైవ్ స్టార్ హోటల్ లీలా ప్యాలెస్లో పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్కు అపూర్వ స్వాగతం లభించింది. మనూ గౌరవార్థం హోటల్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సన్మానించింది. హోటల్ రూమ్స్లో టవల్స్, పిల్లోస్, న్యాప్కిన్స్ ఇతరత్రా వస్తువులపై మనూ పేరును ముద్రించారు హోటల్ నిర్వహకులు. హోటల్ సిబ్బంది మనూను సంప్రదాయ బద్ధంగా హోటల్లోకి ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. The Leela Palace Chennai welcomes Manu Bhaker, the Olympic Champion ! Just WoW pic.twitter.com/Dc2lhQpnE4— Megh Updates 🚨™ (@MeghUpdates) August 27, 2024హోటల్ నిర్వహకులు మనూ కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. లీలా ప్యాలెస్ ఆతిథ్యానికి మనూ పరవశించి పోయింది. మనూ లీలా ప్యాలెస్లో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. కాగా, మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్ రెండు పతకాలు సాధించాక దేశవ్యాప్తంగా చాలామంది ఆమెను తమతమ స్థానాలకు ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే మనూ చెన్నైలోని ఓ కాలేజీలో పర్యటించింది. అక్కడ కూడా కాలేజీ యాజమాన్యం మనూను ఘనంగా సన్మానించింది. ఒలింపిక్స్లో పతకాలు సాధించాక మనూకు దేశవ్యాప్తంగా పిచ్చి క్రేజ్ వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్లినా జనాలు సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడుతున్నారు. మనూ పారిస్ ఒలింపిక్స్లో షూటింగ్లోని రెండు ఈవెంట్స్లో కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
నేటి నుంచి దివ్యాంగుల విశ్వ క్రీడలు ప్రారంభం
పారిస్: యావత్ క్రీడా ప్రపంచాన్ని ఏకం చేసిన సమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్కు తెరలేవనుంది. 11 రోజుల పాటు సాగనున్న ఈ క్రీడల్లో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో 549 పతకాలు సాధించే అవకాశం ఉండగా... నేడు ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఘనంగా ఆరంభ వేడుకలు జరగనున్నాయి. టోక్యో పారాలింపిక్స్తో పోలిస్తే... పారిస్ క్రీడల్లో మహిళల విభాగాల్లో మరో 10 మెడల్ ఈవెంట్స్ను జోడించారు. 100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్ నిర్వహించిన పారిస్ నగరం... ఇప్పుడు పారాలింపిక్స్ను కూడా అదే రీతిలో విజయవంతం చేసేందుకు అన్నీ చర్యలు చేపట్టింది. పోటీల తొలి రోజు తైక్వాండో, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, సైక్లింగ్ క్రీడాంశాల్లో మెడల్ ఈవెంట్స్ జరగనున్నాయి. సమ్మర్, వింటర్ పారాలింపిక్స్లో కలిపి ఇప్పటికే 7 స్వర్ణాలు సహా 17 పతకాలు నెగ్గిన అమెరికా మల్టీ స్పోర్ట్స్ స్పెషలిస్ట్ ఒక్సానా మాస్టర్స్ హ్యాండ్ సైక్లింగ్లో మరిన్ని పతకాలపై దృష్టి పెట్టగా.. పారాలింపిక్స్లో మూడు స్వర్ణాలు నెగ్గిన ఈజిప్ట్ పారా పవర్లిఫ్టర్ షరీఫ్ ఉస్మాన్ నాలుగో పసిడి సాధించాలనే లక్ష్యంతో పారిస్ పారాలింపిక్స్లో బరిలోకి దిగనున్నాడు.భారీ అంచనాలతో భారత్..మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్లో రికార్డు స్థాయిలో పతకాలు సాధించిన భారత పారా అథ్లెట్లు... ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచాలనే లక్ష్యంతో పారిస్లో అడుగు పెట్టారు. ఈసారి భారత్ నుంచి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. దివ్యాంగుల విశ్వక్రీడల్లో భారత్ నుంచి అత్యధికంగా ఈసారే పోటీ పడుతున్నారు. టోక్యో క్రీడల్లో 54 మంది పోటీపడగా భారత్ 5 స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించి పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 12 క్రీడాంశాల్లో 10కి పైగా స్వర్ణాలతో పాటు 25 పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారాలింపిక్స్ చరిత్రలో తొలిసారి స్టేడియం బయట నిర్వహించనున్న ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్పుటర్ భాగ్యశ్రీ జాధవ్ త్రివర్ణ పతాకధారులుగా వ్యవహరించనున్నారు.గత కొంతకాలంగా పారా క్రీడల్లో భారత అథ్లెట్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. గత ఏడాది హాంగ్జూలో జరిగిన ఆసియా పారా క్రీడల్లో మనవాళ్లు 29 స్వర్ణాలు సహా 111 పతకాలతో సత్తాచాటారు. ఇక ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆరు స్వర్ణాలతో పాటు మొత్తం 17 పతకాలు సాధించి ఆరో స్థానంలో నిలిచారు. పురుషుల జావెలిన్త్రో ఎఫ్ 64 విభాగంలో ప్రపంచ రికార్డు హోల్డర్ సుమిత్ అంటిల్, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్1 విభాగం అవని లేఖరా డిఫెండింగ్ పారాలింపిక్ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్నారు. చేతులు లేకున్నా కాళ్లతో గురి తప్పకుండా బాణాలు సంధించగల పారా ఆర్చర్ శీతల్ దేవి, మందుపాతర పేలిన దుర్ఘటనలో కాళ్లు కోల్పోయిన షాట్పుటర్ హొకాటో సెమా, ఆంధ్రప్రదేశ్ రోయింగ్ ప్లేయర్ నారాయణ కొంగనపల్లె వంటి వాళ్లు కూడా పారాలింపిక్స్లో పోటీ పడుతున్నారు. తెలంగాణ నుంచి జివాంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 విభాగంలో పోటీ పడుతోంది. -
వినేశ్ ఫోగట్కు బంగారు పతకం
ఇటీవలి ముగిసిన పారిస్ ఒలింపిక్స్లో అనర్హతకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ను రోహ్తక్లోని (హర్యానా) సర్వ్ఖాప్ పంచాయతీ బంగారు పతకంతో సత్కరించింది. ఈ సందర్భంగా వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ..Haryana Khap Panchayat gave gold medal to Vinesh Phogat. Can someone tell me what is India's ranking at Olympics after this medal? pic.twitter.com/h6EBOCXQrj— BALA (@erbmjha) August 25, 2024“మా పోరాటం ముగియలేదు, మా బిడ్డల పరువు కోసం పోరాటం ఇప్పుడే మొదలైంది. మహిళా రెజర్లపై లైంగిక దాడుల సమయంలో ఇదే విషయాన్ని చెప్పాము” అంటూ ప్రసంగించింది. తనను సన్మానించిన ఖాప్ పెద్దలకు ఫోగట్ ధన్యవాదాలు తెలిపింది. ఖాప్ పెద్దలంతా మద్దతుగా నిలవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొంది. మహిళా క్రీడాకారులకు కష్ట సమయాల్లో ఖాప్ పెద్దలు తోడుగా ఉంటే ప్రోత్సాహకంగా ఉంటుందని అంది.కాగా, వినేశ్ ఫోగట్ గతేడాది లైంగిక వేధింపుల ఆరోపణలపై అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బిజేపీ సీనియర్ లీడర్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా హర్యానా రెజ్లర్లతో కలిసి పోరాటం చేసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ ఫైనల్కు చేరింది. ఫైనల్కు ముందు ఫోగట్ నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో ఆమె కనీసం రజత పతకాన్ని కూడా నోచుకోలేకపోయింది. తనకు జరిగిన అన్యాయం విషయంలో వినేశ్ సీఏఏస్ను ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది. రూల్స్ రూల్సే అని సీఏఏస్ ఫోగట్ అభ్యర్థనను కొట్టిపారేసింది. -
భారత హాకీ జట్టకు ఘన సన్మానం.. అమిత్కు రూ. 4 కోట్ల నజరానా
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టుకు తమ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహకారం కొనసాగిస్తుందని... 2036 వరకు భారత హాకీ జట్టుకు ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్గా కొనసాగుతుందని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు.బుధవారం భువనేశ్వర్లో భారత జట్టు సభ్యులకు ఒడిశా ప్రభుత్వం సన్మానించింది. పారిస్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో కీలక సభ్యుడైన ఒడిశాకు చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్కు రూ. 4 కోట్ల నజరానాను చెక్ రూపంలో అందించింది. జట్టులోని ఇతర ఆటగాళ్లకు తలా రూ. 15 లక్షల, సహాయక సిబ్బదికి రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేసింది. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్గా వ్యవహరిస్తోంది.ఈ సందర్భంగా భారత సారథి హర్మన్ప్రీత్ మాట్లాడుతూ.. ‘జర్మనీతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో విజయానికి చేరువగా వచ్చాం. చాలా అవకాశాలు సృష్టించుకున్నాం. అయితే అది మా రోజు కాదు. అయినా కాంస్య పతక పోరులో తిరిగి సత్తాచాటాం. స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పారిస్కు వెళ్లాం. కానీ అది సాధ్యపడలేదు. వరసగా రెండు విశ్వక్రీడల్లో పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఒడిశా ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరవలేనివని.. ఇక్కడ హాకీకి కావాల్సిన సకల సదుపాయాలు ఉన్నాయి’ అని అన్నాడు. -
ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ అర్చన కామత్ సంచలన నిర్ణయం తీసుకుంది. టేబుల్ టెన్నిస్కు అర్చన కామత్ రిటైర్మెంట్ ప్రకటించింది. 24 ఏళ్ల కామత్ ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్కు ఆమె వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని కామత్ కోచ్ అన్షుల్ గార్గ్ ధ్రువీకరించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ ముగించుకుని భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కామత్ తన కెరీర్ గురుంచి చర్చించినట్లు అన్షుల్ తెలిపాడు. "లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్-2028లో పతకం సాధించడం చాలా కష్టమైన పని నేను కమత్కు చెప్పాను. అందుకోసం తీవ్రంగా శ్రమించివలసి ఉంటుంది. ఎందుకంటే ఆమె టాప్- 100 ర్యాంకు జాబితాలో లేదు.అయితే గత రెండు నెలల్లో ఆమె చాలా మెరుగుపడింది. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని నిర్ణయించుకుంది. ఒక్కసారి ఆమె నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం ఎవరి తరం కాదు. అయితే ఏ క్రీడలోనైనా అగ్రశ్రేణి ఆటగాళ్లకు సాధారణంగా ఎటువంటి సమస్య ఉండదు. వారికి అన్నిరకాల సపోర్ట్ ఉంటుంది. కానీ యువ ఆటగాళ్లు పరిస్థితి వేరు. వారికి శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎవరూ భరోశా ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా వారు జీవనోపాధిని కూడా కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కమత్ తన కెరీర్ను దృష్టిలో పెట్టుకుని ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందని ఇండియన్ ఎక్స్ప్రెస్తో అన్షుల్ పేర్కొన్నాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్లో కమత్ పతకం సాధించికపోయినప్పటకి తన పోరాటంతో అందరిని ఆకట్టుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో భారత టేబుల్ టెన్నిస్ జట్టు తొలిసారి క్వార్టర్ ఫైనల్కు చేరుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. జర్మనీతో జరిగిన క్వార్టర్స్లో భారత జట్టు 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారత్ తరుపున గెలిచింది అర్చన మాత్రమే. -
Paris Paralympics 2024: చరిత్ర, భారత అథ్లెట్లు, షెడ్యూల్ తదితర వివరాలు
పారిస్లో విశ్వక్రీడలు ముగిసి రోజులు గడవక ముందే అదే చోట మరో మహాసంగ్రామం మొదలుకానుంది. ఆగస్ట్ 28 నుంచి పారిస్ వేదికగా 2024 పారాలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. పారిస్ తొలిసారి సమ్మర్ పారాలింపిక్స్కు ఆతిథ్యమివ్వనుంది. ఈ పోటీలు సెప్టెంబర్ 8న జరిగే క్లోజింగ్ సెర్మనీతో ముగుస్తాయి.2021 టోక్యో పారాలింపిక్స్లా కాకుండా ఈసారి పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతిస్తారు. కరోనా కారణంగా గత పారాలింపిక్స్ జనాలు లేకుండా సాగాయి.ఈసారి పారాలింపిక్స్లో మొత్తం 22 క్రీడావిభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 4400 క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. భారత్ ఈసారి 84 సభ్యుల బృందాన్ని పారిస్కు పంపుతుంది.ఈసారి పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు రెగ్యులర్ ఒలింపిక్స్ తరహాలో స్టేడియం బయట జరుగనున్నాయి. పెరేడ్ సందర్భంగా అథ్లెట్లు పారిస్లోనే ఐకానిక్ ల్యాండ్మార్క్స్ చుట్టూ మార్చ్ చేస్తారు.తొలి రోజు పారాలింపిక్స్ పోటీలు ఆగస్ట్ 29న మొదలవుతాయి. ఆ రోజు మొత్తం 22 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి.పారిస్ పారాలింపిక్స్లోని క్రీడా విభాగాలు..బ్లైండ్ ఫుట్బాల్పారా ఆర్చరీపారా అథ్లెటిక్స్బోసియాగోల్బాల్పారా బ్యాడ్మింటన్పారా కనోయ్పారా సైక్లింగ్పారా ఈక్వెస్ట్రియాన్పారా తైక్వాండోపారా ట్రయథ్లాన్పారా టేబుల్ టెన్నిస్సిట్టింగ్ వాలీబాల్వీల్చైర్ బాస్కెట్బాల్వీల్చైర్ ఫెన్సింగ్వీల్చైర్ రగ్బీవీల్చైర్ టెన్నిస్పారా స్విమ్మింగ్షూటింగ్ పారా స్పోర్ట్పారాలింపిక్స్లో ఈసారి భారత్ నుంచి రికార్డు స్థాయిలో 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. క్రితం ఎడిషన్లో భారత్ 54 మంది మాత్రమే విశ్వక్రీడలకు పంపింది. ఆ క్రీడల్లో భారత్ 19 పతకాలు (ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు) సాధించి ఆల్టైమ్ హై రికార్డు సెట్ చేసింది. ఈసారి భారత్ గతంలో కంటే ఎక్కువగా కనీసం 25 పతకాలను లక్ష్యంగా పెట్టుకుంది.క్రీడాంశాల వారీగా 2024 పారాలింపిక్స్లో పాల్గొంటున్న భారత్ అథ్లెట్లు..పారా ఆర్చరీ (6)హర్విందర్ సింగ్ - పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)రాకేష్ కుమార్ - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)శ్యామ్ సుందర్ స్వామి - పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)పూజ - మహిళల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ (కేటగిరీ - ST)సరిత - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - W2)శీతల్ దేవి - మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్, మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ (కేటగిరీ - ST)పారా అథ్లెటిక్స్ (38)దీప్తి జీవన్జీ - మహిళల 400మీ -టీ20సుమిత్ యాంటిల్ - పురుషుల జావెలిన్ త్రో - F64సందీప్ - పురుషుల జావెలిన్ త్రో - F64అజీత్ సింగ్ - పురుషుల జావెలిన్ త్రో - F46సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో - F46రింకు - పురుషుల జావెలిన్ త్రో - F46నవదీప్ - పురుషుల జావెలిన్ త్రో - F41యోగేష్ కథునియా - పురుషుల డిస్కస్ త్రో - F56ధరంబీర్ - పురుషుల క్లబ్ త్రో - F51ప్రణవ్ సూర్మ - పురుషుల క్లబ్ త్రో - F51అమిత్ కుమార్ - పురుషుల క్లబ్ త్రో - F51నిషాద్ కుమార్ - పురుషుల హైజంప్ - T47రామ్ పాల్ - పురుషుల హైజంప్ - T47మరియప్పన్ తంగవేలు - పురుషుల హైజంప్ - T63శైలేష్ కుమార్ - పురుషుల హైజంప్ - T63శరద్ కుమార్ - పురుషుల హైజంప్ - T63సచిన్ సర్జేరావ్ ఖిలారీ - పురుషుల షాట్పుట్ - F46మొహమ్మద్ యాసర్ - పురుషుల షాట్ పుట్ - F46రోహిత్ కుమార్ - పురుషుల షాట్ పుట్ - F46ప్రీతి పాల్ - మహిళల 100 మీ - T35, మహిళల 200m - T35భాగ్యశ్రీ మాధవరావు జాదవ్ - మహిళల షాట్పుట్ - F34మను - పురుషుల షాట్ పుట్ - F37పర్వీన్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F57రవి రొంగలి - పురుషుల షాట్పుట్ - F40సందీప్ సంజయ్ గుర్జార్- పురుషుల జావెలిన్ త్రో-F64అరవింద్ - పురుషుల షాట్ పుట్ - F35దీపేష్ కుమార్ - పురుషుల జావెలిన్ త్రో - F54ప్రవీణ్ కుమార్ - పురుషుల హైజంప్ - T64దిలీప్ మహదు గావిత్ - పురుషుల 400 మీ - T47సోమన్ రాణా - పురుషుల షాట్పుట్ - F57హొకాటో హొటోచే సేమా- పురుషుల షాట్ పుట్ - F57సాక్షి కసానా- మహిళల డిస్కస్ త్రో- F55కరమ్జ్యోతి- మహిళల డిస్కస్ త్రో- F55రక్షిత రాజు- మహిళల 1500 మీటర్ల T11అమీషా రావత్: మహిళల షాట్పుట్ - F46భావనాబెన్ అజబాజీ చౌదరి- మహిళల జావెలిన్ త్రో - F46సిమ్రాన్- మహిళల 100మీ టీ12, మహిళల 200మీ టీ12కంచన్ లఖానీ - మహిళల డిస్కస్ త్రో - F53పారా బ్యాడ్మింటన్ (13)మనోజ్ సర్కార్- పురుషుల సింగిల్స్ SL3నితేష్ కుమార్- పురుషుల సింగిల్స్ SL3, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5కృష్ణ నగర్- పురుషుల సింగిల్స్ SH6శివరాజన్ సోలైమలై- పురుషుల సింగిల్స్ SH6, మిక్స్డ్ డబుల్స్ SH6సుహాస్ యతిరాజ్- పురుషుల సింగిల్స్ SL4, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5సుకాంత్ కదమ్- పురుషుల సింగిల్స్ S4తరుణ్ - పురుషుల సింగిల్స్ S4మానసి జోషి- మహిళల సింగిల్స్ SL3మన్దీప్ కౌర్- మహిళల సింగిల్స్ SL3పాలక్ కోహ్లీ- మహిళల సింగిల్స్ SL4, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5మనీషా రామదాస్- మహిళల సింగిల్స్ SU5తులసిమతి మురుగేషన్- మహిళల సింగిల్స్ SU5, మిక్స్డ్ డబుల్స్ SL3-SU5నిత్య శ్రీ శివన్- మహిళల సింగిల్స్ SH6, మిక్స్డ్ డబుల్స్ SH6పారా కనోయ్ (3)ప్రాచీ యాదవ్- మహిళల వా' సింగిల్ 200మీ VL2యశ్ కుమార్- పురుషుల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1పూజా ఓజా- మహిళల కయాక్ సింగిల్ 200మీ -కేఎల్1పారా సైక్లింగ్ (2)అర్షద్ షేక్- రోడ్ - పురుషుల C2 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - పురుషుల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - పురుషుల C1-3 1000m టైమ్ ట్రయల్, ట్రాక్ - పురుషుల C2 3000m Ind. పర్స్యూట్జ్యోతి గదేరియా- రోడ్ - మహిళల C1-3 ఇండీ. టైమ్ ట్రయల్, రోడ్ - మహిళల C1-3 రోడ్ రేస్, ట్రాక్ - మహిళల C1-3 500m టైమ్ ట్రయల్, ట్రాక్ - మహిళల C1-3 3000m ఇండో. పర్స్యూట్బ్లైండ్ జూడో (2)కపిల్ పర్మార్: పురుషుల -60 కేజీలు J1కోకిల: మహిళల -48కిలోల జె2పారా పవర్ లిఫ్టింగ్ (4)పరమజీత్ కుమార్ - పురుషుల 49 కేజీల వరకుఅశోక్ - పురుషుల 63 కేజీల వరకుసకీనా ఖాతున్ - 45 కిలోల వరకు మహిళలకస్తూరి రాజమణి - 67 కేజీల వరకు మహిళలపారా రోయింగ్ (2)అనిత - PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2xనారాయణ కొంగనపల్లె - PR3 మిక్స్ Dbl స్కల్స్-PR3Mix2xపారా షూటింగ్ (10)అమీర్ అహ్మద్ భట్- P3 - మిక్స్డ్ 25m పిస్టల్ SH1అవని లేఖా: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R3 - మిక్స్డ్ 10m Air Rfl Prn SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1మోనా అగర్వాల్: R2 - మహిళల 10m Air Rfl Std SH1, R6 - మిక్స్డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1, R8 - మహిళల 50మీ రైఫిల్ 3 పోస్. SH1నిహాల్ సింగ్: P3 - మిక్స్డ్ 25m పిస్టల్ SH1, P4 - మిక్స్డ్ 50m పిస్టల్ SH1మనీష్ నర్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1రుద్రాంశ్ ఖండేల్వాల్: P1 - పురుషుల 10m ఎయిర్ పిస్టల్ SH1, P4 - మిక్స్డ్ 50m పిస్టల్ SH1సిద్ధార్థ బాబు: R3 - మిక్స్డ్ 10m Air Rfl Prn SH1, R6 - మిక్స్డ్ 50m రైఫిల్ ప్రోన్ SH1శ్రీహర్ష దేవారెడ్డి రామకృష్ణ- R4 - మిక్స్డ్ 10మీ ఎయిర్ Rfl Std SH2, R5 - మిక్స్డ్ 10మీ ఎయిర్ Rfl Prn SH2స్వరూప్ మహావీర్ ఉంహల్కర్- R1 - పురుషుల l0m ఎయిర్ రైఫిల్ St SH1రుబీనా ఫ్రాన్సిస్: P2 - మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ SH1పారా స్విమ్మింగ్ (1)సుయాష్ నారాయణ్ జాదవ్- పురుషుల 50 మీటర్ల బటర్ఫ్లై - S7పారా టేబుల్ టెన్నిస్ (2)సోనాల్బెన్ పటేల్- మహిళల సింగిల్స్- WS3, మహిళల డబుల్స్- WD10భావినాబెన్ పటేల్- మహిళల సింగిల్స్- WS4, మహిళల డబుల్స్- WD10పారా తైక్వాండో (1)అరుణ- మహిళల కే44- 47 కేజీలుపారలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు 31 పతకాలు సాధించింది. ఇందులో 9 స్వర్ణాలు, 12 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. భారత్ గత పారాలింపిక్స్లోనే 19 పతకాలు సాధించింది.1. మురళీకాంత్ పెట్కర్ - హైడెల్బర్గ్ 1972 ( స్విమ్మింగ్లో స్వర్ణం, పురుషుల 50 మీ ఫ్రీస్టైల్ 3 )2. భీమ్రావ్ కేసర్కర్ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల జావెలిన్ త్రో L6లో రజతం)3. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల జావెలిన్ త్రో L6లో కాంస్యం)4. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల షాట్పుట్ L6లో రజతం)5. జోగిందర్ సింగ్ బేడీ - స్టోక్ మాండెవిల్లే/న్యూయార్క్ 1984 (పురుషుల డిస్కస్ త్రో L6లో కాంస్యం)6. దేవేంద్ర ఝఝరియా - ఏథెన్స్ 2004 ( పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం F44/ 46)7. రాజిందర్ సింగ్ రహేలు - ఏథెన్స్ 2004 (పురుషుల 56 కేజీలలో కాంస్యం)8. గిరీషా ఎన్ గౌడ - లండన్ 2012 (పురుషుల హైజంప్ F42లో రజతం)9. మరియప్పన్ తంగవేలు - రియో 2016 (పురుషుల హైజంప్ F42లో స్వర్ణం)10. వరుణ్ సింగ్ భాటి - రియో 2016 (పురుషుల హైజంప్ F42లో కాంస్యం)11. దేవేంద్ర ఝఝరియా- రియో 2016 (పురుషుల జావెలిన్ త్రో F46లో స్వర్ణం)12. దీపా మాలిక్ - రియో 2016 (మహిళల షాట్పుట్ F53లో రజతం)13. భావినా పటేల్ - టోక్యో 2020 (మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ క్లాస్ 4లో రజతం)14. నిషాద్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T47లో రజతం)15. అవని లేఖరా - టోక్యో 2020 (మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ స్టాండింగ్ SH1లో స్వర్ణం)16. దేవేంద్ర ఝఝరియా - టోక్యో 2020 (పురుషుల జావెలిన్ త్రో F46లో రజతం)17. సుందర్ సింగ్ గుర్జార్ - పురుషుల జావెలిన్ త్రో F46లో టోక్యో 2020 కాంస్యం)18. యోగేష్ కథునియా - టోక్యో 2020 (పురుషుల డిస్కస్ త్రో F56లో రజతం)19. సుమిత్ యాంటిల్ - టోక్యో 2020 (పురుషుల జావెలిన్ త్రో F64లో స్వర్ణం)20. సింగ్రాజ్ అధానా - టోక్యో 2020 (పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ SH1లో కాంస్యం)21. మరియప్పన్ తంగవేలు - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T42లో రజతం)22. శరద్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T42లో కాంస్యం)23. ప్రవీణ్ కుమార్ - టోక్యో 2020 (పురుషుల హైజంప్ T64లో రజతం)24. అవని లేఖరా - టోక్యో 2020 (మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో SH1లో కాంస్యం)25. హర్విందర్ సింగ్ - టోక్యో 2020 (పురుషుల వ్యక్తిగత రికర్వ్ - ఓపెన్ ఆర్చరీలో కాంస్యం)26. మనీష్ నర్వాల్ - టోక్యో 2020 (పురుషుల 50 మీటర్ల పిస్టల్ SH1లో స్వర్ణం)27. సింగ్రాజ్ అధానా - టోక్యో 2020 (పురుషుల 50 మీటర్ల పిస్టల్ SH1లో రజతం28. ప్రమోద్ భగత్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో స్వర్ణం)29. మనోజ్ సర్కార్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3లో కాంస్యం)30. సుహాస్ యతిరాజ్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL4లో రజతం)31. కృష్ణ నగర్ - టోక్యో 2020 (పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SH6లో కాంస్యం) -
క్రీడలను కెరీర్గా ఎంచుకోండి, జీవితం అందంగా ఉంటుంది: మనూ భాకర్
చెన్నై: పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన భారత మహిళా షూటర్ మనూ భాకర్ క్రీడారంగంలోనూ అందమైన కెరీర్ ఉంటుందని చెప్పింది. డాక్టర్లు, ఇంజినీర్లే కాదు క్రీడాకారులుగా కూడా అందమైన జీవితాన్ని గడపొచ్చని 22 ఏళ్ల మనూ చెన్నై విద్యార్థులకు సూచింది. మంగళవారం వేళమ్మాల్ నెక్సస్ స్కూల్ మనూను ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల క్రితం టోక్యోలో ఎదురైనా పరాభవాన్ని పారిస్లో రెండు పతకాలతో అధిగమించిన తీరును వివరించింది. ఓటమిని రుచి చూసి... ‘ప్రపంచ రెండో ర్యాంక్ షూటర్గా టోక్యోకు వెళ్లాను. కానీ ఒలింపిక్స్లో నా గురి అస్సలు కుదర్లేదు. పాల్గొన్న ప్రతి ఈవెంట్లోనూ ఎదురైన చేదు అనుభవం కొన్నాళ్లు నా ప్రయాణాన్ని కష్టంగా మార్చింది. అయినా నేనెప్పుడూ దాన్నే తలచుకొని దిగులుపడలేదు. ఓటమిని రుచి చూసిన నాకు విజయం దక్కుతుందని తెలుసు. స్పోర్ట్స్ అంటేనే అది! ఒకదాంట్లో పరాజయం, మరోదాంట్లో విజయం సహజం. అయితే ఇవన్నీ కూడా కష్టపడితేనే సాధ్యం’ అని పేర్కొంది. మనం కనే పెద్ద పెద్ద కలల్ని సాకారం చేసుకోవాలంటే ఆ స్థాయిలో కఠోరంగా శ్రమించాల్సిందేనని మనూ తెలిపింది. లక్ష్యాన్ని పెట్టుకుంటే దాని కోసం చెమటోడ్చాలని, ఒక్కసారిగా అవి సాకారం కాకపోవచ్చని... కానీ అంతమాత్రాన నిరాశ చెందకుండా లక్ష్యం కోసం నిరంతరం పనిచేయాలని వివరించింది. Badhiya pradarshani chal rahi is desh main Bronze medal ki. pic.twitter.com/sX2FpS4vZX— Prayag (@theprayagtiwari) August 20, 2024ఆత్మవిశాస్వంతో... ‘నేనెప్పుడు కూడా పోటీల్లో జయాపజయాల గురించి పట్టించుకోలేదు. ప్రతీసారి ఆత్మవిశ్వాసంతో ఉంటాను. ప్రతీ పరీక్షను ఆ ఆత్మవిశ్వాసంతోనే నెట్టుకొస్తాను. మనకు కెరీర్లో ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు, ప్రత్యామ్నాయాలుంటాయి. చాలామంది డాక్టరో, ఇంజనీర్తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనుకుంటారు. కానీ క్రీడల్లోనూ అపారమైన అవకాశాలున్నాయన్న సంగతి గుర్తుంచుకోండి. ఆర్థికపరమైన మద్దతు కావొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు. క్రీడల్లో అవన్నీ దక్కుతాయి’ అని మనూ భాకర్ వివరించింది. అమ్మ చూపిన దారి... తనకు తన అమ్మ స్ఫూర్తి అని ఆమె చూపించిన దారే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పింది. అడుగడుగునా తల్లిదండ్రుల సహాయ సహకారాలు లేకపోతే పిల్లలకు ఇవేవి సాధ్యం కానేకావని తెలిపింది. ‘ఏ క్రీడయినా సరై బీజం పడేది ఇంట్లోనే! ఆ తర్వాత స్కూల్లో మొదలవుతుంది. తల్లిదండ్రులు, టీచర్లు విద్యార్థుల భవితకు చక్కని బాట వేయడంలో కీలక భూమిక పోషిస్తారు’ అని వినమ్రంగా చెప్పింది. మన సంస్కృతి, నేపథ్యం ఏదైనా మనం ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకూడదని, చిన్న చిన్న అవరోధాలు ఎదురైనంత మాత్రాన ఆగిపోకూడదని స్ఫూర్తివంతమైన మాటలతో విద్యార్థులను మనూ ఉత్తేజపరిచింది. మన ప్రదర్శన బాలేకపోయినా, కొన్నిసార్లు విఫలమైనా, క్రీడల్లో పతకాలు గెలవలేకపోయినా, పరీక్షల్లో పాస్ కాకపోయినా ఎట్టిపరిస్థితుల్లోనూ కుంగిపోకూడదని ఉద్బోధించింది. పారిస్ ఒలింపిక్స్లో మనూ మహిళల 10 మీటర్ల ఎయిర్పిస్టల్, 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు కాంస్య పతకాలు గెలుపొందింది. సరదాగా ఆడి పాడిన మనూ..కార్యక్రమం ముగింపు సందర్భంగా మనూ విద్యార్థులతో కలిసి ప్రముఖ హిందీ పాటకు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. -
దేశం మారనున్న పారిస్ ఒలింపిక్స్ మూడు పతకాల విజేత
మెల్బోర్న్: విశ్వక్రీడల్లో మూడు పతకాలు సాధించిన ఓ అథ్లెట్... వారం రోజుల వ్యవధిలో దేశం మారాలని నిర్ణయించుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు. పారిస్ ఒలింపిక్స్లో ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగి అద్వితీయ ప్రదర్శనతో మూడు పతకాలు సాధించిన ట్రాక్ సైక్లిస్ట్ మాథ్యూ రిచర్డ్సన్.. అనూహ్య నిర్ణయంతో అభిమానులను విస్మయ పరిచాడు. ఇకపై ఆ్రస్టేలియాకు ప్రాతినిధ్యం వహించబోనని తాను పుట్టి పెరిగిన బ్రిటన్ తరఫున బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ‘పారిస్’ క్రీడల్లో రిచర్డ్సన్ రెండు వ్యక్తిగత రజతాలు, ఒక టీమ్ కాంస్యం గెలుచుకున్నాడు. 25 ఏళ్ల రిచర్డ్సన్ తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఆ్రస్టేలియాకు వలస వచ్చాడు. ‘మాథ్యూ నిర్ణయం అనూహ్యం. చాలా వేదనకు గురయ్యాం. అయితే అతడు మాతృదేశానికి ప్రాతినిధ్యం వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అని ఆ్రస్టేలియా సైక్లింగ్ సమాఖ్య మేనేజర్ జెస్ కోర్ఫ్ తెలిపాడు. ఇదేదో ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని.. బాగా ఆలోచించి తీసుకున్నదని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. ‘ఆస్ట్రేలియాపై గౌరవం ఉంది. అయినా ఇది అనాలోచిత నిర్ణయం కాదు. ఇకపై బ్రిటన్ తరఫున పోటీ పడాలనుకుంటున్నా’ అని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. మరోవైపు బ్రిటన్ సైక్లింగ్ సమాఖ్య సోషల్ మీడియా వేదికగా రిచర్డ్సన్కు స్వాగతం పలికింది. -
సౌరభ్ చౌదరి ఎక్కడ? రైఫిల్ సమాఖ్యపై మండిపడ్డ మను కోచ్
ప్యారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ షూటర్ మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం విధితమే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ జస్పాల్ రాణా.. ఒలింపిక్స్ భారత షూటర్ల సెలక్షన్ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్ విధానాల వల్ల యువ షూటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని రాణా అసహనం వ్యక్తం చేశాడు. "ఫెడరేషన్ సెలక్షన్ పాలసీ ప్రతీ ఆరు నెలలకోసారి మారుతుంది. ఈ విషయం గురించి ఇప్పటికే క్రీడా మంత్రితో నేను మాట్లాడాను. ఫెడరేషన్ నుంచి సెలక్షన్ పాలసీని తెప్పించుకోని, ఓసారి పరిశీలించాలని కోరాను.అది చూశాక వారు ఏ నిర్ణయం తీసుకున్న మేము కట్టుబడి ఉంటాము. ఆ తర్వాత ఈ విషయం గురించి అస్సలు చర్చించం. షూటర్లకు అండగా నిలిస్తే కచ్చితంగా వారి ప్రదర్శనలలో మనం మార్పులు చూస్తాం. భారత షూటింగ్ ఫెడరేషన్ విధి విధానాల వల్ల ఎంతో మంది యువ షూటర్లు ముందుకు వెళ్లలేకపోతున్నారు. భారత్లో అత్యుత్తమ షూటర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి సపోర్ట్గా నిలిచే వారు ఎవరూ లేరు. పిస్టల్ షూటర్ సౌరభ్ చౌదరి ఎక్కడ? ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ పిస్టల్ షూటర్ జితూ రాయ్ ఎక్కడ? వీరిగురించి ఎవరూ మాట్లడటం లేదు. పారిస్లో నాలుగో స్థానంలో నిలిచిన (10మీ ఎయిర్ రైఫిల్ షూటర్) అర్జున్ బాబుటా గురించి అస్సలు చర్చే లేదు. అతను స్వల్ప తేడాతో పతకాన్ని కోల్పోయాడు. మళ్లీ అతడిని ఈ ప్లాట్ఫామ్కు తీసుకు రావాలని ఎవరూ ఆలోచించడం లేదని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్పాల్ రాణా పేర్కొన్నాడు. -
గ్రాండ్ వెల్కమ్.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్( వీడియో)
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో అనర్హత వేటు కారణంగా పతకం కోల్పోయిన ఫోగాట్.. సోమవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ వద్ద ఆమెకు అభిమానులు, మద్దతుదారులు ఆపూర్వ స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ వ్యాన్లో ర్యాలీగా ఆమెను ఊరేగించారు. ఈ సందర్భంగా వినేశ్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమైంది. ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, రెజర్లు సాక్షిమలిక్, బజరంగ్ పునియా తదితరులు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా 55 కేజీల విభాగంలో ఫైనల్కు ముందు 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు ఫోగాట్ గురైంది. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీలు చేసినా సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె అభ్యర్ధనను స్పోర్ట్స్ కోర్డు కొట్టిపారేసింది. #WATCH | Indian wrestler Vinesh Phogat receives a warm welcome at Delhi's IGI AirportCongress MP Deepender Hooda, wrestlers Bajrang Punia, Sakshee Malikkh and others welcomed her. pic.twitter.com/rc2AESaciz— ANI (@ANI) August 17, 2024 -
వినేశ్ ఫోగట్ కీలక నిర్ణయం.. రిటైర్మెంట్ వెనక్కి!?
ప్యారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆధిక బరువు కారణంగా అనర్హత వేటు పడి పతకాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే ఆమె తన రెజ్లింగ్ కెరీర్కు విడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసింది.అయితే ఇప్పుడు వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎక్స్లో ఉద్వేగభరిత పోస్టు షేర్ చేసిన ఆమె.. అందులో పలు విషయాలను ప్రస్తావించింది. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేను కానీ, రెజ్లింగ్ కొనసాగించే సత్తా మాత్రం తనకు ఉందని ఫోగట్ తెలిపింది."నా బృందానికి, నా తోటి భారతీయులకు, నా ఫ్యామిలీకి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మా లక్ష్యాన్ని మేము ఇంకా చేరుకోలేదు. ఏదో మిస్ అయినట్లు అన్పిస్తోంది. అయితే పరిస్థితులు ఇకపై మునపటిలా ఉండకపోవచ్చు. నేను 2032 వరకు రెజ్లింగ్ వృత్తిని కొనసాగించాలని భావిస్తున్నాను. కానీ భవిష్యత్ నా కేరీర్ ను ఎలా నిర్ణయిస్తుందో తెలియదు. కానీ నేను నమ్మిన దాని కోసం నా పోరాటం ఆపనని వినేష్ పేర్కొంది.అదే విధంగా ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ టీమ్పై ఫోగట్ ప్రశంసల వర్షం కురిపించింది. వీరేన్ రస్కిన్హా, యతిన్ భట్కర్లతో పాటు చాలా మంది ఇతర అథ్లెట్లు నాకు మద్దతుగా నిలిచారు. వారి సపోర్ట్తోనే నేను ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించగలిగాను. నాకు మద్దతుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు అంటూ ఫోగట్ ఎక్స్లో రాసుకొచ్చింది. -
ప్రతి ఒక్కరూ చాంపియనే
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందాన్ని గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం న్యూఢిల్లీలోని తన నివాసంలో అథ్లెట్ల బృందంతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారిస్ క్రీడల్లో రెండు పతకాలు సాధించి కొత్త చరిత్ర లిఖించిన షూటర్ మనూ భాకర్.. ఒలింపిక్స్లో వినియోగించిన పిస్టల్ ను ప్రధానికి చూపించింది. ఇక వరుసగా రెండో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్, కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్తో మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లంతా సంతకాలు చేసిన జెర్సీతో పాటు ఓ హాకీ స్టిక్ను ప్రధానికి అందించారు. పారిస్ క్రీడల్లో కాంస్య పతకం అందుకున్న రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా భారత జెర్సీని ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్తో కలిసి కాంస్య పతకం గెలిచిన సరబ్జ్యోత్ సింగ్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో కాంస్యం నెగ్గిన స్వప్నిల్ కుసాలేను కూడా ప్రధాని అభినందించారు. అనంతరం క్రీడాకారుల మధ్య కలియదిరిగిన ప్రధాని వారితో సంభాíÙంచారు. ఒలింపిక్స్లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయా, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు. ‘పారిస్ ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. విశ్వక్రీడల్లో వారి అనుభవాలు వినడం.. వారి విజయాలను ప్రశంసించడం తృప్తినిచ్చింది. పారిస్కు వెళ్లిన ప్రతీ భారత క్రీడాకారుడు చాంపియనే. ప్రభుత్వం క్రీడలకు మద్దతునిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటుంది’ అని ప్రధాని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఒలింపిక్స్లో రజతం నెగ్గిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. పారిస్ క్రీడలు ముగిసిన వెంటనే చికిత్స కోసం జర్మనీకి వెళ్లడంతో అతడు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. త్రుటిలో పతకానికి దూరమైన షట్లర్ లక్ష్యసేన్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్తో పాటు ఇతర అథ్లెట్లతోనూ ప్రధాని సంభాషించారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు. ఓవరాల్గా ఈ క్రీడల్లో దేశానికి ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలు వచ్చాయి. అంతకుముందు ఎర్రకోట వద్ద జరిగిన 78వ స్వాతంత్య్ర వేడుకల్లో ఒలింపిక్ అథ్లెట్ల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ప్రధాని ‘పారిస్’ క్రీడల్లో పాల్గొన్న అథ్లెట్లకు ధైర్యం చెబుతూనే.. పారాలింపిక్స్కు వేళ్లనున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వడం భారత్ కల అని.. 2036లో విశ్వక్రీడలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని ప్రధాని పునరుద్ఘాటించారు. ఫీల్డ్ గోల్స్తోనే అది సాధ్యం: శ్రీజేశ్ న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో నిలకడగా పతకాలు సాధించాలంటే.. ఫీల్డ్ గోల్స్పై దృష్టి పెట్టాల్సిన అవసరముందని అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన భారత గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ అన్నాడు. ఒలింపిక్స్ వంటి మెగా టోర్నీల్లో సత్తా చాటాలంటే.. పెనాల్టీ కార్నర్లను వినియోగించుకోవడంతో పాటు.. ఫీల్డ్గోల్స్ ఎక్కువ చేయాలని శ్రీజేశ్ పేర్కొన్నాడు. పారిస్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత జట్టు మెగా టోరీ్నలో మొత్తం 15 గోల్స్ చేసింది. అందులో 9 పెనాల్టీ కార్నర్లు, మూడు పెనాల్టీ స్ట్రోక్స్ ఉన్నాయి. అంటే కేవలం మూడే ఫీల్డ్ గోల్స్ చేయగలిగింది. అదే సమయంలో స్వర్ణం గెలిచిన నెదర్లాండ్స్ 14 ఫీల్డ్ గోల్స్, రజతం నెగ్గిన జర్మనీ 15 ఫీల్డ్ గోల్స్ చేశాయి. కాంస్య పతక పోరులో భారత్ చేతిలో ఓడి నాలుగో స్థానంలో నిలిచిన స్పెయిన్ కూడా 10 ఫీల్డ్ గోల్స్తో ఆకట్టుకుంది. ‘పెనాల్టీ కార్నర్ల విషయంలో మన ప్లేయర్ల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరముంది. వరుస విజయాలు సాధించాలంటే మనం ఎందులో మెరుగ్గా ఉన్నామో దానిపైనే కాకుండా.. ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టాలి. ఫీల్డ్ గోల్స్లో సత్తా చాటితే హాకీలో పూర్వవైభవం సాధ్యమే’ అని శ్రీజేశ్ అన్నాడు. -
వినేశ్కు చుక్కెదురు
కోట్లాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. పారిస్ ఒలింపిక్స్లో అసమాన పోరాటంతో ఫైనల్కు చేరి... అనంతరం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు న్యాయ పోరాటంలోనూ ఊరట దక్కలేదు. తుదిపోరుకు చేరినందుకు రజత పతకమైనా ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)ను ఆశ్రయించిన వినేశ్ ఫొగాట్ అప్పీలు తిరస్కరణకు గురైంది. పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో చుక్కెదురైంది. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్కు చేరిన వినేశ్ ఫొగాట్... నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో అనుమతించిన బరువుతోనే ఫైనల్ వరకు చేరినందుకు గానూ... రజత పతకం అందించాలని వినేశ్ సీఏఎస్ను ఆశ్రయించింది. అయితే ఈ అంశంపై ఇప్పటికే రెండుసార్లు తీర్పు వాయిదా వేసిన సీఏఎస్... ఎట్టకేలకు బుధవారం రాత్రి ఏకవాక్యంలో తుది తీర్పు వెల్లడించింది. వినేశ్ పిటిషన్ను సీఏఎస్ అడ్హాక్ డివిజన్ కొట్టి వేసింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వివరాలు వెల్లడించింది. అథ్లెట్లు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకోవడంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ విఫలమైందని... ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష అభిప్రాయపడింది.‘నిరాశాజనక తీర్పు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి వ్యతిరేకంగా వినేశ్ ఫొగాట్ అభ్యర్థనను ఆర్బిట్రేటర్ తిరస్కరించారు. మహిళల 50 కేజీల విభాగంలో తనకు కూడా రజత పతకం ఇవ్వాలన్న వినేశ్ దరఖాస్తూను కొట్టేశారు’ అని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష ఒక ప్రకటనలో తెలిపింది. తొలి రోజు నిబంధనల ప్రకారమే బరువు ఉన్నందుకుగానూ దాన్ని పరిగణనలోకి తీసుకొని మానవీయ కోణంలో తీర్పు ఇవ్వాల్సిందని... కానీ అది జరగలేదని పీటీ ఉష వాపోయింది.కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పేర్కొంది. దీంతో ‘పారిస్’ క్రీడల్లో భారత్కు మరో పతకం వస్తుందనే ఆశలు ఆవిరయ్యాయి. ఫలితంగా విశ్వక్రీడల్లో భారత్ ఆరు (ఒక రజతం, 5 కాంస్యాలు) పతకాలతోనే సరిపెట్టుకోనుంది. అనర్హత వేటు అనంతరం మానసికంగా కుంగిపోయిన 29 ఏళ్ల వినేశ్.. కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. సీఏఎస్ తీర్పుపై అప్పీల్ చేయవచ్చా? కష్ట కాలంలో వినేశ్కు అండగా నిలుస్తామని ఐఓఏ ప్రకటించింది. తదుపరి న్యాయ పరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం సీఏఎస్ తీర్పుపై అప్పీలు చేసే అవకాశం ఉంది. అయితే సీఏఎస్ తీర్పు మారే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి.‘ప్రాథమిక విధానపరమైన నియమాల ఉల్లంఘన, ప్రజా పాలసీతో సంబంధం ఉన్న చాలా పరిమిత అంశాలపైనే తీర్పు మార్చే అవకాశం ఉంది. అది మినహా స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్కు న్యాయపరిధి పరిమితం’ అని వినేశ్ కేసు వాదించిన ఫ్రాన్స్ లాయర్లు తెలిపారు. -
ఒలింపిక్ బృందాన్ని అభినందించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పారిస్లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందాన్ని బుధవారం అభినందించారు. రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండప్లో భారత బృందంతో భేటీ అయిన ముర్ము... దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పతకాలు తెచ్చిన క్రీడాకారులతో పాటు పతకాల కోసం పారిస్లో శ్రమించిన అథ్లెట్లను ఆమె ప్రశంసించారు. పలువురు అథ్లెట్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చటించిన ఫొటోలు, బృందంతో దిగిన ఫొటోల్ని రాష్ట్రపతి భవన్ అధికారిక ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. మరోవైపు ఈరోజు ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని పారిస్ ఒలింపిక్స్లో బరిలోకి దిగిన భారత క్రీడాకారులకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆహా్వనం అందింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత క్రీడాకారులు కూడా ఆ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. -
వినేశ్ ఫోగట్కు నిరాశ.. సిల్వర్ మెడల్ ఇవ్వాలన్న అభ్యర్థన తిరస్కరణ
భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్కు నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తిరస్కరించింది.మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీ ఫైనల్కు ముందు నిర్దిష్ట బరువు కంటే 100 గ్రాముల ఎక్కువగా ఉందన్న కారణంగా వినేశ్ ఫోగట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. ఫైనల్కు చేరిన నేపథ్యంలో సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలని వినేశ్ సీఏఎస్ను ఆశ్రయించింది. -
2028లో మళ్లీ కలుద్దాం!
పారిస్: ప్రపంచ సినిమా కలల ప్రపంచం హాలీవుడ్... లాస్ఏంజెలిస్ నగర శివారులో వెలసిన వినోదనగరి... నాలుగేళ్ల తర్వాత ఆ సినీ అడ్డా వద్ద ప్రపంచ క్రీడా సంబరం నిర్వహణకు రంగం సిద్ధమైంది... మరి దాని గురించి ప్రపంచానికి చెప్పాలంటే మామూలు పద్ధతిలో చేస్తే ఏం బాగుంటుంది? అందుకే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు కొత్తగా ప్రయత్నించారు. అందుకోసం హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్కంటే సరైన వ్యక్తి ఎవరుంటారు. పారిస్ నేషనల్ స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ముగింపు ఉత్సవం మధ్యలో క్రూజ్ స్టేడియం పైభాగం నుంచి దూకి స్టేడియంలోకి వచ్చాడు. ఆ తర్వాత అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ నుంచి ఒలింపిక్ పతాకాన్ని అందుకున్నాడు. లాస్ఏంజెలిస్లో క్రీడలు జరిగే సమయంలో ప్రధానాకార్షణగా మారే అవకాశం ఉన్న టామ్ క్రూజ్ను ఇలా అందరి ముందు తీసుకొచ్చారు. మోటార్ సైకిల్, విమానం, పారాచూట్తో టామ్ క్రూజ్ ఒలింపిక్స్కు ప్రచారం చేస్తూ గతంలోనే రికార్డు చేసిన వీడియోను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంతో అధికారికంగా ఒలింపిక్స్ నిర్వహణ బాధ్యత పారిస్ నుంచి లాస్ ఏంజెలిస్కు మారింది. ఈ అమెరికా నగరంలో ఒలింపిక్స్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 1932, 1984లో లాస్ ఏంజెలిస్లో విశ్వ క్రీడలు జరిగాయి. అలరించిన కార్యక్రమాలు... సెన్ నదిపై ఘనంగా నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుకల తరహాలోనే ఒలింపిక్స్ ముగింపు ఉత్సవం కూడా ఘనంగానే ముగిసింది. దాదాపు 70 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో రెండున్నర గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. పారిస్ నగర ఘనతను చెబుతూ సాగిన సంగీత కార్యక్రమంతో ఇది మొదలు కాగా... అనంతరం 206 దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ పతాకాలతో పరేడ్లో పాల్గొన్నారు. ‘రికార్డ్స్’ పేరుతో సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. వచ్చే ఒలింపిక్స్ అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన సంగీతకారులకు కూడా ఇందులో చోటు కల్పించారు. సంప్రదాయం ప్రకారం అన్నింటికంటే ముందుగా తొలి ఒలింపిక్స్ జరిగిన గ్రీస్ జాతీయ పతాకాన్ని, ఆ తర్వాత ఫ్రాన్స్ జాతీయ పతకాన్ని ప్రదర్శించారు. మెగా ఈవెంట్ విజయవంతం కావడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చైర్మన్ థామస్ బాక్ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. ‘అథ్లెట్లు ఒక మ్యాజిక్ను ప్రదర్శించారు. కోట్లాది మంది క్రీడాభిమానుల తరఫున కృతజ్ఞతలు. మళ్లీ 2028లో కలుస్తాం. ఒలింపిక్స్ ఇంకా పైపైకి ఎదుగుతూనే ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నా 206 దేశాల నుంచి ఆటగాళ్లు ఇక్కడకు చేరారు. పతకాల కోసం హోరాహోరీగా పోరాడారు. ఒలింపిక్స్తో వెలుగుల నగరం మరింతగా శోభిల్లింది. అత్యుత్తమ క్రీడా ప్రదర్శనే కాదు, ఆటగాళ్లకు సంబంధించి ఇదే సంబరాల వేడుక’ అని బాక్ వ్యాఖ్యానించారు. ఈ వేదికపై ఐఓసీ రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్ మహిళా బాక్సర్ సిండీ ఎన్గాంబా, చైనా టేబుల్ టెన్నిస్ స్టార్ సన్ యింగ్షా, కెన్యా స్టార్ మారథాన్ రన్నర్ కిప్చోగే, క్యూబా దిగ్గజ రెజ్లర్ మిజైన్ లోపెజ్, ఫ్రాన్స్ జూడో స్టార్ టెడ్డీ రైనర్, ఆ్రస్టేలియా స్విమ్మర్ ఎమ్మా మెకీన్ కూడా ఉన్నారు. ఐదు ఖండాల దేశాలకు ప్రతినిధులుగా వీరు వ్యవహరించారు. అనంతరం పారిస్ నగర మేయర్ అన్నె హిడాల్గో ఒలింపిక్ పతాకాన్ని థామస్ బాక్కు అందజేశారు. ఆయన నుంచి తదుపరి విశ్వ క్రీడలు జరిగే లాస్ ఏంజెలిస్ నగరానికి మేయర్గా వ్యహరిస్తున్న కరెన్ బాస్ ఈ పతాకాన్ని స్వీకరించారు. అనంతరం ఇదే వేదికపై ఉన్న అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్కు కరెన్ బాస్ ఒలింపిక్ పతాకాన్ని అందించింది. పారిస్, లాస్ఏంజెలిస్ నగరాలకు అన్నె హిడాల్గో, కరెన్ బాస్ తొలి మహిళా మేయర్లు కావడం విశేషం.ఒలింపిక్ పతాకం స్వీకరించాక ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్ అవార్డుల గ్రహీత, అమెరికా సింగర్ గాబ్రియేలా సారిమెంటో విల్సన్ అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించింది. ఫ్రాన్స్ స్విమ్మర్ లియాన్ మర్చండ్ ఒలింపిక్ జ్యోతిని స్టేడియంలోకి తీసుకురాగా, ఆ తర్వాత దానిని ఆర్పేసి అధికారికంగా క్రీడలు ముగిసినట్లు ప్రకటించారు. ఫ్లాగ్ బేరర్లుగా శ్రీజేశ్, మనూ... ముగింపు వేడుకల పరేడ్లో భారత్ నుంచి షూటర్ మనూ భాకర్, హాకీ జట్టు గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. పారిస్ ఒలింపిక్స్లో మనూ భాకర్ రెండు కాంస్యాలు సాధించగా... కాంస్యం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టులో సభ్యుడైన శ్రీజేశ్ ఈ పోటీల తర్వాత అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఆఖరి ఈవెంట్లలో పాల్గొన్న కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మాత్రమే పరిమిత సంఖ్యలో భారత్ నుంచి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. మనూ, ఆమె కోచ్ జస్పాల్ రాణా ముగింపు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా భారత్ నుంచి తిరిగి వెళ్లారు. రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అక్కడే ఉన్నా ఆమె క్రీడాగ్రామానికే పరిమితమైంది. -
వినేశ్ రజత పతకం అప్పీల్పై తీర్పు నేడు!
పారిస్: క్రీడాలోకమే కాదు... యావత్ దేశం ఎదురుచూపులకు నేడు తెరపడే అవకాశముంది. భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీల్పై నేడు తీర్పు వెలువడనుంది. పారిస్ విశ్వక్రీడల్లో మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్లోకి ప్రవేశించిన ఆమె సరిగ్గా బౌట్కు ముందు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. దీంతో ఫైనల్లో ఓడినా కనీసం ఖాయమనుకున్న రజతం చేజారడంతో పాటు... అమె పాల్గొన్న వెయిట్ కేటగిరీ జాబితాలో చివరి స్థానంలో నిలవడం భారతావనిని నిర్ఘాంత పరిచింది. తన అనర్హతపై సవాలుకు వెళ్లిన ఫొగాట్... సంయుక్త రజతం డిమాండ్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో అప్పీలు చేసింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిష్ణాతులైన లాయర్లతో ఈ అప్పీలుపై వాదించింది. విచారణ పూర్తికావడంతో నేడు సీఏఎస్ తుది తీర్పు వెలువరించనుంది. కాగా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ... వినేశ్ బరువు పెరగడం, అనర్హతకు బాధ్యుడిని చేస్తూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దివాలాపై విమర్శలకు దిగడం సమంజసం కాదని చెప్పింది.సంబంధిత అథ్లెట్ల బరువు, ఈవెంట్ల నిబంధనలపై కోచ్, వ్యక్తిగత సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడింది. -
ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మాజీ క్రికెటర్ కొడుకు
పారిస్ ఒలింపిక్స్లో వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ విన్స్టన్ బెంజమిన్ కొడుకు రాయ్ బెంజమిన్ గోల్డ్ మెడల్ సాధించాడు. విశ్వక్రీడల్లో యూఎస్ఏకు ప్రాతినిథ్యం వహించిన రాయ్.. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో 46.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో రాయ్ ప్రపంచ రికార్డు హోల్డర్, నార్వేకు చెందిన కార్స్టన్ వార్హోమ్ను ఓడించి పసిడి పతకం నెగ్గాడు.రాయ్ ఒలింపిక్స్ స్వర్ణం సాధించడం పట్ల తండ్రి విన్స్టన్ ఎనలేని ఆనందం వ్యక్తం చేశాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని విన్స్టన్ ప్రపంచ కప్ ఫైనల్ గెలుపుతో పోల్చాడు. రాయ్ ఈ విజయం సాధించడానికి ఎంతో కష్టపడ్డాడని విన్స్టన్ తెలిపాడు. రాయ్ విజయం యునైటెడ్ స్టేట్స్కే కాకుండా తాను పుట్టి పెరిగిన ఆంటిగ్వాకు కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిందని విన్స్టన్ అన్నాడు.59 ఏళ్ల విన్స్టన్ 80, 90 దశకాల్లో వెస్టిండీస్ తరఫున 21 టెస్ట్లు, 85 వన్డేలు ఆడి 161 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా అయిన విన్స్టన్ టెస్ట్ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. 27 ఏళ్ల రాయ్ బెంజమిన్.. విన్స్టన్ ఆరుగురు సంతానంలో ఒకరు. రాయ్ టోక్యో ఒలింపిక్స్లో రజతం సాధించాడు. చిన్నతనంలో క్రికెట్ పట్ల ఆకర్శితుడైన రాయ్.. ఆతర్వాత మనసు మార్చుకుని ట్రాక్ ఆండ్ ఫీల్డ్ గేమ్స్ వైపు మళ్లాడు. -
ఏడు నుంచి ఆరుకు...48 నుంచి 71కి..!
టోక్యో ఒలింపిక్స్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్ల సన్నాహాలు మొదలయ్యాయి. సాధారణంగా ఉండే నాలుగేళ్లతో పోలిస్తే ఒక ఏడాది తక్కువ సమయం ఉండటంతో అన్ని క్రీడల్లోనూ పారిస్ లక్ష్యంగానే హడావిడి కనిపించింది. అధికారులు, ప్రభుత్వం కూడా రెండంకెల పతకాలు ఖాయమంటూ నమ్మకం పెట్టుకున్నాయి. అందుకు తగినట్లుగా ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. అథ్లెట్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకుండా ఒలింపిక్స్ సన్నద్ధత కోసమే 16 క్రీడాంశాల్లో సౌకర్యాల కల్పన, విదేశాల్లో ప్రత్యేక శిక్షణ, పోటీల్లో పాల్గొనేందుకు రూ. 470 కోట్లు ఖర్చు కూడా చేసింది. 117 మందితో మన బృందం బరిలోకి దిగింది. అద్భుతాల గురించి కాకపోయినా ఎక్కువ మంది కచ్చితంగా బాగా ఆడతారనే అంచనాలు, ఆశలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి. కానీ ఒక్కో రోజు కరుగుతున్న కొద్దీ పరిస్థితి మారిపోతూ వచ్చింది. పతకం కోసం ఎంతో ఎదురు చూడాల్సిన స్థితి. చివరకు ఒక రజతం, ఐదు కాంస్యాలతో మన టీమ్ ముగించింది. గత ఒలింపిక్స్తో పోలిస్తే పతకాల సంఖ్య తగ్గడమే కాదు... స్వర్ణం కూడా లేకపోవడంతో పతకాల పట్టికలో కూడా భారత్ చాలా దిగువకు పడిపోయింది. –సాక్షి క్రీడా విభాగంపారిస్: అథ్లెటిక్స్లో భారత మహిళల 4్ఠ400 రిలే జట్టు పారిస్ ఒలింపిక్స్లో 3 నిమిషాల 32.51 సెకన్ల టైమింగ్ నమోదు చేసింది... ఇదే ఈవెంట్లో 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో భారత బృందం టైమింగ్ 3 నిమిషాల 32.49 సెకన్లు మాత్రమే! అంటే 40 సంవత్సరాల తర్వాత కూడా మన జట్టు టైమింగ్ మెరుగుకాకపోగా, అంతకంటే పేలవంగా రిలే టీమ్ ముగించింది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, విదేశాల్లో శిక్షణ, మంచి డైట్ వంటివి మాత్రమే ఫలితాన్ని ఇవ్వలేవనే దానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. నిజాయితీగా చెప్పాలంటే అథ్లెటిక్స్లో మన ఆటగాళ్ల విషయంలో పెద్దగా అంచనాలు లేవు కానీ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మేమూ ఉన్నామని గుర్తు చేసే కనీస స్థాయి ప్రదర్శన కూడా రాలేదు. మొత్తం 29 మంది అథ్లెట్లు పాల్గొంటే జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్కడే తన స్థాయిని ప్రదర్శించాడు. భారత ప్రదర్శన విషయంలో ఈ ఒక్క క్రీడాంశాన్నే విమర్శించడానికి లేదు. ఓవరాల్గా కూడా టోక్యో ఒలింపిక్స్ ప్రదర్శనను దాటలేకపోగా, అది పునరావృతం కూడా కాలేదు. ప్రతీ ఒలింపిక్స్ తర్వాత జరిగే సమీక్ష తరహాలోనే ఈసారి కూడా దాదాపు అవే కారణాలు. మన ప్రమాణాలు బాగా పెరిగాయని చెప్పుకోవడమే తప్ప అసలైన సమయంలో పోటీకి దిగినప్పుడు ఇంకా మనం చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నామని తేలిపోయింది. చాలా మంది భారత ఆటగాళ్లకు ఒలింపిక్స్లో పాల్గొనడమే ఒక ఘనతగా కనిపిస్తోంది తప్ప అంతకు మించి ముందుకు వెళ్లడం సాధ్యం కావడం లేదు. 20 కిలోమీటర్ల రేస్వాక్లో 43 మంది పాల్గొంటే 41వ స్థానంలో నిలిచిన ప్రియాంక గోస్వామి గేమ్స్ విలేజ్ గదిలో సరదాగా ‘రీల్స్’ చేస్తున్న వీడియో చూస్తే ఆమె తన ఆట పట్ల ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది.తాము అడిగిన కోచ్లు, ఫిజియోలు... తాము కోరిన చోట శిక్షణ... ఇలా ఒక్కటేమిటి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచింది. అయినా మెడల్స్ విషయంలో మన రాత మారలేదంటే లోపం ఆటగాళ్లలోనే ఉన్నట్లు అర్థం. తమకు సౌకర్యాలు లేవనే మాట ఇకపై ఆటగాళ్ల నుంచి రాకూడదని... ప్లేయర్లు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పడుకోన్ చేసిన వ్యాఖ్య ఈ ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లందరికీ వర్తిస్తుంది. పతకవీరులు... టోక్యోలో 19 ఏళ్ల టీనేజర్గా బరిలోకి దిగి తీవ్రంగా నిరాశపర్చిన షూటర్ మనూ భాకర్ ఈసారి నాటి తప్పులను సరిదిద్దుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ విభాగాల్లో రెండు కాంస్యాలు గెలిచి తనను తాను నిరూపించుకుంది. మిక్స్డ్లో ఆమె భాగస్వామిగా సరబ్జోత్ సింగ్ కూడా కాంస్యాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రైఫిల్ త్రీ పొజిషన్స్లో అనూహ్యంగా స్వప్నిల్ కుసాలే మూడో స్థానంలో నిలవడంతో భారత్ ఖాతాలో మూడో కాంస్యం చేరింది.భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో ఒలింపిక్స్లోనూ కాంస్యం సాధించడం మన అభిమానులకు ఊరట కాగా... యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా కంచు మోత మోగించి తానేంటో చూపించాడు. అయితే పట్టికలో భారత్ స్థానాన్ని పైకి చేర్చగల స్వర్ణం మాత్రం మనకు రాలేదు. ‘టోక్యో’ పసిడితో సత్తా చాటిన నీరజ్ చోప్రా గత మూడేళ్ల ప్రదర్శనను చూస్తే ఈసారి గోల్డ్ ఖాయమనిపించింది.అయితే దురదృష్టవశాత్తూ అది చేజారినా... రజతంతో కాస్త మెరుగైన పతకం మన ఖాతాలో చేరింది. వరుసగా రెండు ఒలింపిక్స్లలో మెడల్స్ గెలిచిన అరుదైన జాబితాలో నీరజ్ చేరగా... ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలతో మనూ భాకర్ తన కీర్తిని పెంచుకుంది. అంచనా తప్పారు... టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాతి నుంచి ప్రదర్శన, తాజా ఫామ్, ఆటగాళ్ల స్థాయిని బట్టి చూసుకుంటే కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపర్చారు. బ్యాడ్మింటన్లో పీవీ సింధు విఫలం కాగా... కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న డబుల్స్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లోనే పరాజయంపాలయ్యారు. బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, వరల్డ్ రికార్డు ఉన్న షూటర్ సిఫ్ట్ కౌర్ సామ్రా కనీసం పతకానికి చేరువగా కూడా రాలేకపోవడం గమనార్హం. బాక్సింగ్లో నిశాంత్ దేవ్, అమిత్ పంఘాల్ కూడా అంచనా తప్పగా... గత ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఓడింది. ఇక ఆర్చరీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. నాలుగో ఒలింపిక్స్లో కూడా దీపిక కుమారి ఉత్త చేతులతోనే తిరిగొచ్చింది. ఇక టేబుల్ టెన్నిస్, జూడో, స్విమ్మింగ్, రోయింగ్, సెయిలింగ్, గోల్ఫ్, ఈక్వె్రస్టియన్లు మనం పతకాలు ఆశించే క్రీడలు కావు. టెన్నిస్లో రోహన్ బోపన్న తన ఏటీపీ టోర్నీల స్థాయి ఆట ఇక్కడ ప్రదర్శించలేకపోయాడు. నాలుగో స్థానాలతో సరి... విజయం సాధించిన వాడినే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. రెండో స్థానానికి కూడా విలువుండదు... స్పోర్ట్స్లో మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చేటప్పుడు చాలా మంది తరచుగా వాడే మాట ఇది. కానీ మన భారతీయులు ఇప్పుడు నాలుగో స్థానాన్ని చూసి కూడా అయ్యో... కొద్దిలో చేజారిందే అనుకుంటున్నాం. ఇది ఏదో ఆత్మ సంతృప్తి కోసమే తప్ప ఒలింపిక్స్లో నాలుగో స్థానానికి ఎలాంటి విలువ లేదు. అదృష్టం కలిసొస్తే మరో ఆరు పతకాలు మన ఖాతాలో చేరేవేమో కానీ అలాంటి వాటికి ఆటల్లో చోటు లేదు. మనూ భాకర్, అర్జున్ బబూతా, మహేశ్వరి–అనంత్జీత్ జోడీ (షూటింగ్), మీరాబాయి చాను (వెయిట్లిఫ్టింగ్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్–అంకిత జోడీ (ఆర్చరీ) అసలు సమయంలో తమ ఆట స్థాయిని పెంచలేకపోయారు. చివరగా... గెలుపు కూడా ఓటమిగా మారిన వైనం వినేశ్ ఫొగాట్ విషయంలో జరిగింది. ఫైనల్ చేరిన తర్వాత వచ్చిన పతకం బరువు ఎక్కువై చేజారడం వినేశ్కే కాదు భారతీయులందరికీ వేదన కలిగించింది. -
‘రికార్డ్స్’తో ముగిసిన క్రీడా సంబరం
పారిస్: అద్భుత ప్రదర్శనలతో అసామాన్య ఘనతలతో అత్యుత్తమ వేదికగా నిలిచిన పారిస్ ఒలింపిక్స్కు తెర పడింది. 16 రోజుల పాటు 329 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పతకాల కోసం హోరాహోరీగా పోటీ పడిన తర్వాత 2024 ఒలింపిక్స్ పోటీలు ఘనంగా ముగిశాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భిన్నంగా పారిస్ నేషనల్ స్టేడియంలో సుమారు 70 వేల మంది ప్రేక్షకుల మధ్య ఈ ముగింపు వేడుకలు జరిగాయి.థామస్ జాలీ నేతృత్వంలో ముగింపు ఉత్సవాలను ‘రికార్డ్స్’ పేరుతో నిర్వహించారు. ఫ్రాన్స్ స్విమ్మర్ లియోన్ మర్చండ్ క్రీడా జ్యోతిని తీసుకొని వేదిక వద్దకు రాగా... ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్, ఐఓసీ చైర్మన్ థామస్ బాక్ వేదికపై కూర్చున్నాడు. ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని వినిపించిన తర్వాత అన్ని దేశాల ఫ్లాగ్బేరర్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి అడుగుపెట్టారు. భారత్ తరఫున మనూ భాకర్, పీఆర్ శ్రీజేశ్ పతాకధారులుగా వ్యవహరించారు. వచ్చే ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరంలో జరగనున్న నేపథ్యంలో పారిస్ క్రీడల నిర్వాహకులు ఒలింపిక్ ఫ్లాగ్ను లాస్ ఏంజెలిస్ క్రీడల చైర్పర్సన్ కేసీ వాసర్మన్కు అందజేశారు. ఫ్రెంచ్ భాషలో ‘మెర్సీ పారిస్’ (థ్యాంక్యూ పారిస్) నినాదాలు హోరెత్తుతుండగా ఆఖరి ఘట్టం ముగిసింది. -
పతకాల సంఖ్య ప్రామాణికం కాదు
పారిస్ ఒలింపిక్స్ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. గతంతో పోలిస్తే జావెలిన్ను ఎక్కువ దూరం విసిరి రజతం గెలవడం ఆనందంగా ఉంది. అయితే విశ్వక్రీడా వేదికపై మన జాతీయ గీతం వినడాన్ని ఎక్కువ సంతోíÙస్తా. మరింత మెరుగవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. దాని కోసం కృషి చేస్తా. ఒలింపిక్స్లో వరుసగా రెండో పతకం గెలిచిన సమయంలో అభిమానుల నుంచి లభించిన మద్దతును ఎప్పటికీ మరవలేను. నాతో పాటు.. మన అథ్లెట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రేరణ నింపారు. ‘పారిస్’ క్రీడల్లో భారత ప్రదర్శనను అంచనా వేయడానికి కేవలం పతకాల సంఖ్య ప్రామాణికం కాదు. చాలా మంది త్రుటిలో పతకాలను కోల్పోయారు. ఆ స్థాయికి రావడానికి వారు పడ్డ శ్రమను తక్కువ చేయలేము. హాకీ జట్టులోని 16 మంది సభ్యులతో పాటు మొత్తం 21 మంది అథ్లెట్లు పారిస్ నుంచి పతకాలతో తిరిగి వస్తున్నారు. మొత్తంగా ఈ క్రీడల్లో మన అథ్లెట్లు ఆరు విభాగాల్లో నాలుగో స్థానాల్లో నిలిచారు. మరొక దాంట్లో అనర్హత వేటుకు గురయ్యారు. 1960 ఒలింపిక్స్లో దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్, 1984 క్రీడల్లో పీటీ ఉష ఇలాగే నాలుగో స్థానంలో నిలిచి... యువతకు మార్గదర్శకులు అయ్యారు. ఇప్పుడు తాజా ఒలింపిక్స్లో పతకం సాధించగల ఏడుగురు అథ్లెట్లు... వివిధ క్రీడాంశాల్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్న మరో 15 మంది అథ్లెట్లు మన బృందంలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్లో ఏడు పతకాలు సాధించినప్పుడు... మరో ఇద్దరు మాత్రమే నాలుగో స్థానంలో నిలిచారు. అప్పటితో పోల్చితే ఇప్పుడా సంఖ్య భారీగా పెరిగింది. క్రీడా సంస్కృతి పెరుగుదలకు ఇది నిదర్శనం. దేశంలో క్రీడారంగంపై భారీగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభమైంది. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ నాలుగో స్థానాలను పతకాలుగా మలవగలమనే నమ్మకం ఉంది. అర్జున్ బబూతా, అంకిత, బొమ్మదేవర ధీరజ్, మహేశ్వరీ చౌహాన్, అనంత్జీత్ సింగ్, మనూ భాకర్, వినేశ్ ఫొగాట్ ఇలా వీళ్లంతా త్రుటిలో పతకాలు కోల్పోయారు. అథ్లెట్లు నిరంతరం మెరుగవడంపై దృష్టి పెట్టడం ముఖ్యం. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న మన అథ్లెట్లందరూ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగంగా ఉన్నారు. దీని వల్ల నిపుణుల పర్యవేక్షణలో విదేశీ శిక్షణకు అవకాశం ఉంటుంది. గత మూడేళ్లలో నేను 310 రోజుల పాటు వివిధ దేశాల్లో శిక్షణ పొందాను. దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే.. మెరుగైన ఫలితాలు సాధించడం పెద్ద కష్టం కాదు. -నీరజ్ చోప్రా -
సూపర్ సిఫాన్...
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలు గెలిచిన నెదర్లాండ్స్ మహిళా అథ్లెట్ సిఫాన్ హసన్ ‘పారిస్’లోనూ మూడు పతకాలతో మెరిసింది. ‘పారిస్’లో ఇప్పటికే 5000 మీటర్లు, 10000 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించిన 31 ఏళ్ల సిఫాన్... ఆదివారం జరిగిన మారథాన్ రేసులో ఏకంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని సిఫాన్ 2 గంటల 22 నిమిషాల 55 సెకన్లలో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా పూర్తి చేసి కొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేసింది. 2012 లండన్ గేమ్స్లో 2 గంటల 23 నిమిషాల 7 సెకన్లతో జెలెనా టికి (ఇథియోపియా) నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును సిఫాన్ సవరించింది. తాజా విజయంతో సిఫాన్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్లో డిస్టెన్స్ రన్నింగ్ (5000, 10000 మీటర్లు, మారథాన్)లోని మూడు ఈవెంట్లలో పతకాలు గెలిచిన తొలి మహిళా అథ్లెట్గా సిఫాన్ గుర్తింపు పొందింది. పురుషుల్లో ఎమిల్ జటోపెక్ (చెక్ రిపబ్లిక్; 1952 హెల్సింకి ఒలింపిక్స్లో... 5000, 10000 మీటర్లు, మారథాన్) మూడు స్వర్ణ పతకాలు గెలిచాడు. -
అమెరికాకే అందలం
పారిస్: విశ్వ క్రీడల్లో చివరిరోజు ఆఖరి మెడల్ ఈవెంట్లో అమెరికా అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. చివరి మెడల్ ఈవెంట్గా జరిగిన మహిళల బాస్కెట్బాల్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా 67–66 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును ఓడించింది. మహిళల బాస్కెట్బాల్ జట్టు స్వర్ణ పతకంతో పతకాల పట్టికలో అమెరికా జట్టు టాప్ ర్యాంక్ను ఖరారు చేసుకోవడం విశేషం. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణ పతకాలతో సమంగా నిలిచాయి. అయితే చైనాకంటే అమెరికా ఎక్కువ రజత పతకాలు, ఎక్కువ కాంస్య పతకాలు సాధించింది. దాంతో అమెరికాకు అగ్రస్థానం దక్కింది. ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో అమెరికా మహిళల జట్టుకు గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో అమెరికాకు ఓటమి తప్పదా అనిపించింది. ఆఖరి క్వార్టర్లో నాలుగు నిమిషాలు మిగిలి ఉన్నంతవరకు ఫ్రాన్స్ 53–52తో ఒక్క పాయింట్ ఆధిక్యంలో ఉంది. ఈ దశలో తమకు లభించిన ఫ్రీ త్రోను అమెరికా పాయింట్గా మలిచి స్కోరును 53–53తో సమం చేసింది. ఆ తర్వాత అమెరికా కీలక పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి వెళ్లింది. 17 సెకన్లు మిగిలి ఉన్నాయనగా అమెరికా 63–59తో ముందంజలో నిలిచింది. ఈ దశలో తమకు లభించిన రెండు ఫ్రీ త్రోలను ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ పాయింట్లుగా మలిచింది. దాంతో అమెరికా ఆధిక్యం 63–61గా మారింది. 11 సెకన్లు ఉన్నాయనగా అమెరికా ప్లేయర్ కెల్సీ ప్లమ్ రెండు పాయింట్లు సాధించి 65–61తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ గ్యాబీ విలియమ్స్ మూడు పాయింట్ల షాట్ సంధించడంతో అమెరికా ఆధిక్యం 65–64కు తగ్గింది. మూడు సెకన్లు ఉన్నాయనగా ఫ్రాన్స్ ప్లేయర్ ఫౌల్ చేయడంతో అమెరికాకు రెండు ఫ్రీ త్రోలు రావడం, వాటిని పాయింట్లుగా మలచడం జరిగింది. దాంతో అమెరికా 67–64తో ముందంజలోకి వెళ్లింది. చివరి క్షణంలో ఫ్రాన్స్ ప్లేయర్ మరీన్ జోన్స్ రెండు పాయింట్లు సాధించినా ఆతిథ్య జట్టు పాయింట్ తేడాతో ఓటమి చవిచూసింది. అమెరికా జట్టులో విల్సన్ అజా 21 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలువగా... కెల్సీ ప్లమ్, కాపర్ కాలీ 12 పాయింట్ల చొప్పున సాధించారు. ఈ గెలుపుతో అమెరికా మహిళల బాస్కెట్బాల్ జట్టు ఒలింపిక్స్లో వరుసగా ఎనిమిదో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఓవరాల్గా అమెరికా మహిళల జట్టుకిది పదో స్వర్ణం. 1984 లాస్ ఏంజెలిస్, 1988 సియోల్ ఒలింపిక్స్లో స్వర్ణాలు నెగ్గిన అమెరికా జట్టు 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో కాంస్యం సాధించింది. ఆ తర్వాత 1996 అట్లాంటా ఒలింపిక్స్లో అమెరికా మహిళల జట్టు పసిడి పతకాల వేట మళ్లీ మొదలై 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగుతూనే ఉంది. మరోవైపు శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల బాస్కెట్బాల్ ఫైనల్లో అమెరికా జట్టు 98–87 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టుపై గెలిచి ఓవరాల్గా 17వసారి పసిడి పతకాన్ని దక్కించుకుంది. అమెరికా జట్టులో స్టీఫెన్ కర్రీ త్రీ పాయింటర్ షాట్లను ఎనిమిదిసార్లు వేయడం విశేషం. దిగ్గజ ప్లేయర్లు కెవిన్ డురాంట్ 15 పాయింట్లు, లెబ్రాన్ జేమ్స్ 14 పాయింట్లు, డేవిడ్ బుకెర్ 15 పాయింట్లు సాధించారు. 14 అమెరికా సాధించిన స్వర్ణాల సంఖ్యలో అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి 14 పసిడి పతకాలు లభించాయి. ఆ తర్వాత స్విమ్మింగ్లో 8, జిమ్నాస్టిక్స్లో 3, బాస్కెట్బాల్, సైక్లింగ్ ట్రాక్, ఫెన్సింగ్, రెజ్లింగ్లో 2 చొప్పున స్వర్ణాలు దక్కాయి. సైక్లింగ్ రోడ్, ఫుట్బాల్, గోల్ఫ్, రోయింగ్, షూటింగ్, సరి్ఫంగ్, వెయిట్లిఫ్టింగ్లో ఒక్కో స్వర్ణం చొప్పున లభించాయి. 19 ఇప్పటి వరకు 30 సార్లు ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 19 సార్లు అమెరికా జట్టు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. సోవియట్ యూనియన్ ఆరుసార్లు టాప్ ర్యాంక్ను దక్కించుకుంది. యూనిఫైడ్ టీమ్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ ఒక్కోసారి మొదటి స్థానంలో నిలిచాయి. -
అమెరికాను బోల్తా కొట్టించి స్వర్ణం గెలిచిన ఇటలీ మహిళల వాలీబాల్ జట్టు
పారిస్ ఒలింపిక్స్లో చివరి రోజు సంచలన ఫలితం వచ్చి0ది. మహిళల వాలీబాల్ ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ అమెరికా జట్టుకు ఊహించని పరాజయం ఎదురైంది. తొలిసారి ఫైనల్ చేరిన ఇటలీ జట్టు 25–18, 25–20, 25–17తో అమెరికా జట్టును ఓడించి మొదటిసారి ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఇటలీ సీనియర్ క్రీడాకారిణి, నాలుగోసారి ఒలింపిక్స్లో పోటీపడ్డ మోనికా డి జెనారోను సభ్యులంతా గాల్లో ఎగరేసి సంబరం చేసుకున్నారు. మాజీ చాంపియన్ బ్రెజిల్ 25–21, 27–25, 22–25, 25–15తో టర్కీ జట్టును ఓడించి కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో అమెరికా జట్టు ఓడిపోయినా ఒలింపిక్స్ మహిళల వాలీబాల్లో అత్యధికంగా ఏడు పతకాలు సాధించిన జట్టుగా అవతరించింది. అమెరికా జట్టు ఒలింపిక్స్లో ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు దక్కించుకుంది. సోవియట్ యూనియన్, చైనా, జపాన్, బ్రెజిల్ ఆరు పతకాల చొప్పున నెగ్గాయి. -
లిన్ యూ టింగ్ పంచ్ అదిరె...
పారిస్ ఒలింపిక్స్లో లింగ వివాదాన్ని ఎదుర్కొన్న మరో బాక్సర్ స్వర్ణంతో సత్తా చాటింది. మహిళల 57 కేజీల విభాగంలో చైనీస్ తైపీ బాక్సర్ లిన్ యూ టింగ్ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో లిన్ యూ టింగ్ 5–0తో జూలియా (పోలాండ్)పై గెలిచింది. అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ పతకం సాధించిన మరుసటి రోజే లిన్ యూ టింగ్ కూడా మెడల్తో మెరిసింది. బాక్సింగ్లో చైనీస్ తైపీకిదే తొలి ఒలింపిక్ స్వర్ణం కావడం విశేషం. ‘పారిస్’ క్రీడల ఆరంభం నుంచే సూటిపోటి మాటలు ఎదుర్కొన్న లిన్ యూ టింగ్ బహుమతి ప్రదానోత్సవం సమయంలో కన్నీటి పర్యంతమైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుతూ.. తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని పేర్కొంది. ‘ప్రత్యర్థితోనే కాదు.. పరిస్థితులపై కూడా గెలిచా. ఓ ప్రొఫెషనల్ బాక్సర్గా ఒలింపిక్స్ సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ లక్ష్యంపైనే దృష్టి పెట్టా. అయినా కోచ్ ద్వారా కొన్ని వార్తలు వినాల్సి వచ్చేది. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆహ్వానంతోనే పారిస్లో అడుగుపెట్టా. అలాంటప్పుడు వచ్చిన పని వదిలేసి అనవసర విషయాలను దరి చేరనివ్వలేదు. పూర్తి ఏకాగ్రత బౌట్పైనే పెట్టా. ఈ పతకంతో ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అయింది. నాకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని లిన్ యూ టింగ్ వెల్లడించింది. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్íÙప్లో లిన్తో పాటు ఖలీఫ్పై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం వేటు వేసింది. ఈ ఇద్దరిలో పురుషులకు చెందిన జన్యువులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ... లిన్ సాధించిన కాంస్యాన్ని సైతం రద్దు చేసింది. దీంతో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగిన లిన్... విశ్వక్రీడల ఆరంభం నుంచే ప్రత్యర్థులపై పంచ్ల వర్షం కురిపిస్తూ చివరకు చాంపియన్గా నిలిచింది. -
గోల్డ్ మెడల్ గెలిచిన బాక్సర్.. హెడ్కోచ్కు గుండె పోటు
ప్యారిస్ ఒలింపిక్స్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఉజ్బెకిస్థాన్ బాక్సింగ్ జట్టు ప్రధాన కోచ్ తుల్కిన్ కిలిచెవ్ గుండె పోటుకు గురయ్యాడు. అయితే సకాలంలో స్పందించిన బ్రిటన్ బాక్సింగ్ వైద్య బృందం తుల్కిన్ ప్రాణాలను కాపాడారు. అతడు ప్రస్తుతం ప్యారిస్లోని ఓ అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుల్కిన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఒలింపిక్స్ ప్రతినిథులు తెలిపారు.అసలేం జరిగిందంటే?ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఈ విశ్వక్రీడల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ హసన్బాయ్ దుస్మాటోవ్ బంగారు పతకం సాధించాడు. దీంతో కోచ్ తుల్కిన్ కిలిచెవ్ బాక్సర్తో కలిసి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తుల్కిన్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు.అయితే వెంటనే అక్కడే బ్రిటన్ బాక్సింగ్ వైద్యుడు హర్జ్ సింగ్, ఫిజియో రాబీ లిల్లీస్ అతడికి సీపీఆర్ చేశారు. సీపీఆర్, డీఫిబ్రిలేటర్తో షాక్ ట్రీట్మెంట్ ఇచ్యి కిలిచెవ్ ప్రాణాలను రక్షించారు. అనంతరం అతడికి అస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో హర్జ్ సింగ్, రాబీ లిల్లీస్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఒలింపిక్స్ క్రీడలు నేటితో ముగియనున్నాయి. -
అభినవ్ బింద్రాకు ‘ఒలింపిక్ ఆర్డర్’
పారిస్: ఒలింపిక్స్లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడైన షూటర్ అభినవ్ బింద్రాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సముచిత రీతిలో గౌరవించింది. స్వర్ణం సాధించడంతో పాటు ఒలింపిక్ ఉద్యమాన్ని విస్తృతపర్చడంలో కీలకపాత్ర పోషించినందుకు బింద్రాకు ‘ఒలింపిక్ ఆర్డర్’ను అందజేసింది. ఒలింపిక్ క్రీడల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఆటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుహృద్భావ వాతావరణం నెలకొల్పడంతో ఒలింపిక్ ఉద్యమం పాత్ర ఉంది. 1975 నుంచి ఈ ఒలింపిక్ ఆర్డర్ను అందజేస్తున్నారు. ఐఓసీ 142వ సెషన్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చైర్మన్ థామస్ బాక్ ఈ అవార్డును బింద్రాకు అందజేశారు. -
Vinesh Phogat: తీర్పు 13కు వాయిదా!
పారిస్: ఒలింపిక్స్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ను డిస్క్వాలిఫై చేసిన అంశంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) తీర్పు మరో సారి వాయిదా పడింది. భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ నెల 13న తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి శుక్రవారమే దీనిపై వాదనలు ముగిశాయి. దాంతో భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు తీర్పు రానుందని సమాచారం రాగా అది జరగలేదు. అనంతరం ఆదివారం అదే సమయానికి రావచ్చని వినిపించినా... చివరకు మంగళవారానికి వాయిదా పడినట్లు తెలిసింది. నిజానికి ఒలింపిక్స్ ముగిసేలోగానే దీనిపై స్పష్టత ఇస్తామని సీఏఎస్ పేర్కొంది. అయితే వినేశ్ అంశాన్ని ‘ప్రత్యేక కేసు’గా చూస్తుండటంతో తీర్పు ఆలస్యమవుతూ వస్తోంది. కేసుకు సంబంధించి మరికొన్ని అదనపు డాక్యుమెంట్లను ఆదివారం సాయంత్రంలోగా తమకు అందించాలని సీఏఎస్ ఇరు పక్షాలను కోరింది. రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో ఫైనల్కు ముందు 100 గ్రాముల బరువు ఉండటంతో వినేశ్ను నిర్వాహకులు డిస్క్వాలిఫై చేశారు. దాంతో ఆమె న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తొలి రోజు ఫైనల్ చేరే వరకు నిబంధనలకు అనుగుణంగా తన బరువు పరిమితికి లోబడే ఉందని... కాబట్టి అప్పటి వరకు వచ్చిన ఫలితాన్ని పరిగణలోకి తీసుకుంటూ తనకు సంయుక్తంగా రజత పతకం ఇవ్వాలని వినేశ్ అప్పీల్ చేసింది. ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా ఆమె తరఫున సీఏఎస్లో వాదించారు. ఈ వ్యవహారంలో సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు ఐఓఏ అధికారులు చెప్పారు. -
నఫీసాటు సంచలనం
పారిస్: ఒక్క క్రీడాంశంలో పోటీపడి ఒలింపిక్ పతకం గెలవాలంటేనే ఎన్నో ఏళ్లు శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఒకే ఈవెంట్లో ఏడు క్రీడాంశాలు ఉంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో బెల్జియం క్రీడాకారిణి నఫీసాటు థియామ్ను ఎంత ప్రశంసించినా తక్కువే. ఏడు క్రీడాంశాల సమాహారమైన ‘హెప్టాథ్లాన్’లో ఆమె వరుసగా మూడో ఒలింపిక్స్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో హెప్టాథ్లాన్లో మూడు స్వర్ణాలు గెలిచిన ఏకైక క్రీడాకారిణిగా నఫీసాటు థియామ్ కొత్త చరిత్ర లిఖించింది. హెప్టాథ్లాన్లో 100 మీటర్ల హర్డిల్స్ రేసు, హైజంప్, షాట్పుట్, 200 మీటర్ల రేసు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్ల రేసు ఉంటాయి. ఈ ఏడింటిలో ఆయా అథ్లెట్స్ సాధించిన పాయింట్ల ఆధారంగా టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందజేస్తారు. పారిస్ ఒలింపిక్స్లో 29 ఏళ్ల నఫీసాటు 6880 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్లో నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్లోనూ నఫీసాటు పసిడి పతకాలు సాధించింది. ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కాటరీనా జాన్సన్ థాంప్సన్ (బ్రిటన్; 6844 పాయింట్లు) రజతం, నూర్ విడిట్స్ (బెల్జియం; 6707 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. -
చైనా అద్భుతం... రిథమిక్ జిమ్నాస్టిక్స్లో తొలిసారి స్వర్ణం
పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో ముందు వరుసలో దూసుకెళుతున్న చైనా మరో రికార్డు సొంతం చేసుకుంది. రిథమిక్ జిమ్నాస్టిక్స్లో స్వర్ణం గెలిచిన తొలి యూరోపేతర జట్టుగా చైనా నిలిచింది. ఒలింపిక్స్ రిథమిక్ జిమ్నాస్టిక్స్లో ఇప్పటి వరకు యూరప్ దేశాల ఆధిపత్యం కొనసాగుతుండగా... శనివారం చైనా మహిళల జట్టు దానికి గండి కొడుతూ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఐదుగురు సభ్యులతో కూడిన చైనా టీమ్ ఫైనల్లో 69.800 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. హూప్స్, రిబ్బన్స్, బాల్స్ విభాగాల్లో చైనా జిమ్నాస్ట్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఇజ్రాయిల్ (68.850 పాయింట్లు), ఇటలీ (68.100 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నాయి. డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ బల్గేరియా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ రిథమిక్స్ జిమ్నాస్టిక్స్లో రజతం గెలిచిన చైనా ఈసారి పసిడి పతకం సాధించింది. -
అజేయ అమెరికా
ఒలింపిక్స్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రికార్డును అమెరికా మహిళల బాస్కెట్బాల్ జట్టు సొంతం చేసుకుంది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో అమెరికా మహిళల బాస్కెట్బాల్ జట్టు పరాజయం అన్నదే ఎరగకుండా దూసుకెళుతోంది. ఈ క్రమంలో వరుసగా 60 మ్యాచ్లు గెలవడం విశేషం. ‘పారిస్’ క్రీడల్లో ఫైనల్ చేరడం ద్వారా అమెరికా ఈ ఘనత సాధించింది. శనివారం జరిగిన మహిళల సెమీఫైనల్లో అమెరికా 85–64తో ఆ్రస్టేలియాపై గెలిచి ఫైనల్కు చేరింది. నేడు ఫ్రాన్స్తో స్వర్ణం కోసం తలపడనుంది. ఇప్పటి వరకు ఒలింపిక్స్లో అమెరికా మహిళల బాస్కెట్బాల్ జట్టు వరుసగా ఏడు స్వర్ణాలు గెలిచింది. ఈసారి కూడా పసిడి కైవసం చేసుకుంటే.. విశ్వక్రీడల చరిత్రలో వరుసగా 8 బంగారు పతకాలు గెలిచిన తొలి టీమ్గా చరిత్ర కెక్కనుంది. -
డైవింగ్లో చైనా క్లీన్స్వీప్
పారిస్ ఒలింపిక్స్ డైవింగ్ క్రీడాంశంలో చైనా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. అక్వాటిక్ సెంటర్లో అద్భుతాలు చేసిన చైనా డైవర్లు రికార్డు స్థాయిలో ఎనిమిది స్వర్ణాలతో ఈ విభాగంలో అందుబాటులో ఉన్న అన్ని పసిడి పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. శనివారం పురుషుల 10 మీటర్ల ప్లాట్ఫామ్ ఫైనల్లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ కావో యున్ (చైనా) 547.50 పాయింట్లతో టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ డైవింగ్లో 1988 తర్వాత స్వర్ణం నిలబెట్టుకున్న మొదటి స్విమ్మర్గా కావో యున్ నిలిచాడు. అమెరికాకు చెందిన గ్రెగ్ లుగానిస్ 1984 లాస్ ఏంజెలెస్, 1988 సియోల్ ఒలింపిక్స్లో పసిడి పతకాలు నెగ్గాడు. తమాయి రికుటో (జపాన్; 507.65 పాయింట్లు), విలియమ్స్ నోహ్ (గ్రేట్ బ్రిటన్; 497.35 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. గతంలో ఎనిమిదింట ఏడు పతకాలు నెగ్గిన చైనా... ఈసారి మాత్రం క్లీన్స్వీప్ చేసింది. ‘పారిస్’ క్రీడల్లో డైవింగ్ విభాగంలో జరిగిన మహిళల 3 మీటర్ల స్ప్రింగ్బోర్డ్, పురుషుల 3 మీటర్ల స్ప్రింగ్బోర్డ్, మహిళల 10 మీటర్ల ప్లాట్ఫామ్, పురుషుల సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్బోర్డ్, మహిళల సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్బోర్డ్, మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్ఫామ్, పురుషుల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్ఫామ్ పోటీల్లో చైనా స్విమ్మర్లు అగ్రస్థానాల్లో నిలిచి పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. చైనా డైవర్లు ఈ ఎనిమిది విభాగాల్లో స్వర్ణాలే కాకుండా.. మరో రెండు రజతాలు, ఒక కాంస్యం కూడా గెలిచి మొత్తంగా డైవింగ్లోనే 11 పతకాలు పట్టారు. -
Paris olympics: ముగిసిన భారత ప్రస్థానం.. ఆరుతో సరి
టోక్యో ఒలింపిక్స్లో ఏడు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారుల బృందం పారిస్ ఒలింపిక్స్లో మాత్రం దానిని పునరావృతం చేయలేకపోయింది. ‘పారిస్’లో భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. శనివారం రెజ్లింగ్ ఈవెంట్తో భారత పోరాటం ముగిసింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 76 కేజీల విభాగంలో రీతిక క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ఆమెను ఓడించిన కిర్గిస్తాన్ రెజ్లర్ ఫైనల్ చేరకుండా సెమీఫైనల్లో పరాజయం పాలైంది. ఫలితంగా రీతికకు ‘రెపిచాజ్’ పద్ధతిలో కనీసం కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం లేకుండా పోయింది. ‘పారిస్’లో భారత్కు 1 రజతం, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలు లభించాయి. ప్రస్తుతం భారత్ 70వ స్థానంలో ఉంది. ఆదివారంతో పారిస్ ఒలింపిక్స్ ముగియనున్నాయి. ఫలితంగా చివరిరోజు పతకాల పట్టికలో భారత్ స్థానంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత టోక్యో ఒలింపిక్స్లో భారత్ 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 7 పతకాలు గెలిచి 48వ స్థానంలో నిలిచింది. పారిస్: విశ్వ క్రీడల్లో భారత ప్రస్థానం ముగిసింది. శనివారంతో పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల ఈవెంట్స్ పూర్తయ్యాయి. మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ 76 కేజీల విభాగంలో రీతిక కాంస్య పతక పోరుకు అర్హత సాధించి ఉంటే ఆదివారం కూడా భారత్ పతకం రేసులో నిలిచేది. కానీ రీతిక పతకం రేసులో స్థానం సంపాదించలేకపోయింది. తొలిసారి ఒలింపిక్స్లో పోటీపడ్డ రీతిక క్వార్టర్ ఫైనల్లో కిర్గిస్తాన్ రెజ్లర్ ఐపెరి మెదెత్ కిజీ చేతిలో ఓడిపోయింది. మూడు నిమిషాల నిడివి గల రెండు భాగాలు ముగిశాక ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. స్కోరు సమమైతే నిబంధనల ప్రకారం చివరి పాయింట్ సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ బౌట్లో ముందుగా రీతిక ఒక పాయింట్ సాధించింది. రెండో భాగంలో కిర్గిస్తాన్ రెజ్లర్ పాయింట్ స్కోరు చేసి సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరికీ పాయింట్ లభించలేదు. దాంతో చివరి పాయింట్ స్కోరు చేసిన కిర్గిస్తాన్ రెజ్లర్ను విజేతగా ప్రకటించారు. అనంతరం కిర్గిస్తాన్ రెజ్లర్ సెమీఫైనల్లో 6–8 పాయింట్ల తేడాతో కెన్నీడీ అలెక్సిస్ బ్లేడ్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. దాంతో ‘రెపిచాజ్’ రూపంలో రీతికకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం చేజారింది. అంతకుముందు తొలి రౌండ్లో రీతిక కేవలం 29 సెకన్లలో హంగేరి రెజ్లర్ బెర్నాడెట్ నగీపై ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో గెలిచింది. ఇద్దరు రెజ్లర్ల మధ్య పాయింట్ల తేడా 10 పాయింట్లకు చేరుకున్న వెంటనే రిఫరీ బౌట్ను నిలిపి వేస్తారు. బెర్నాడెట్తో జరిగిన బౌట్లో 29 సెకన్ల సమయానికి రీతిక 12–2తో 10 పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. దాంతో రిఫరీ బౌట్ను నిలిపివేసి రీతికను విజేతగా ప్రకటించారు. -
ఖలీఫ్ పసిడి పంచ్
పారిస్: అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్లో యాంగ్ ల్యూ (చైనా)ను ఓడించి ఖలీఫ్ తన కెరీర్లో తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ఆరంభమైనప్పటి నుంచి ఖలీఫ్పై వివాదం చెలరేగింది. పేరుకు ఆమె మహిళే అయినా శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని... గతంలో ఇదే విషయంలో ఆమె నిషేధానికి గురైందని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మగాడి తరహాలో ఉన్న బాక్సర్ను మహిళల విభాగంలో అనుమతించారంటూ నిర్వాహకులను అంతా తిట్టిపోశారు. అయితే ఐఓసీ మాత్రం ఈ విమర్శలను లెక్క చేయకపోగా... ఖలీఫ్ కూడా ఆ ప్రభావం తనపై పడకుండా వరుసగా గెలుస్తూ పోయింది. ఇప్పుడు స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎనిమిదేళ్లుగా ఈ పతకం కోసం కలగన్నా. నేనిప్పుడు ఒలింపిక్ చాంపియన్ను. ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాను. అందుకే ఈ గెలుపు నాకు రెట్టింపు ఆనందాన్నిస్తోంది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు. నేను పుట్టుకతో మహిళను. ఇతర మహిళల్లాగే నేను కూడా. అలాగే జీవిస్తాను కూడా. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్నదానిని కాబట్టే క్వాలిఫై అయ్యాను’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఖలీఫ్ వ్యాఖ్యానించింది. అల్జీరియా దేశ చరిత్రలో ఇది ఏడో స్వర్ణపతకం. -
Paris olympics: ఖలీఫ్ పసిడి పంచ్
పారిస్: అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్ ఇమాన్ ఖలీఫ్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్లో యాంగ్ ల్యూ (చైనా)ను ఓడించి ఖలీఫ్ తన కెరీర్లో తొలి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ఆరంభమైనప్పటి నుంచి ఖలీఫ్పై వివాదం చెలరేగింది. పేరుకు ఆమె మహిళే అయినా శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని... గతంలో ఇదే విషయంలో ఆమె నిషేధానికి గురైందని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మగాడి తరహాలో ఉన్న బాక్సర్ను మహిళల విభాగంలో అనుమతించారంటూ నిర్వాహకులను అంతా తిట్టిపోశారు. అయితే ఐఓసీ మాత్రం ఈ విమర్శలను లెక్క చేయకపోగా... ఖలీఫ్ కూడా ఆ ప్రభావం తనపై పడకుండా వరుసగా గెలుస్తూ పోయింది. ఇప్పుడు స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎనిమిదేళ్లుగా ఈ పతకం కోసం కలగన్నా. నేనిప్పుడు ఒలింపిక్ చాంపియన్ను. ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాను. అందుకే ఈ గెలుపు నాకు రెట్టింపు ఆనందాన్నిస్తోంది. నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు. నేను పుట్టుకతో మహిళను. ఇతర మహిళల్లాగే నేను కూడా. అలాగే జీవిస్తాను కూడా. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్నదానిని కాబట్టే క్వాలిఫై అయ్యాను’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఖలీఫ్ వ్యాఖ్యానించింది. అల్జీరియా దేశ చరిత్రలో ఇది ఏడో స్వర్ణపతకం. -
‘మహిళల స్వేచ్ఛ’పై నినదించినందుకు...
పారిస్: ఒలింపిక్స్ క్రీడల ‘బ్రేకింగ్’ (బ్రేక్ డ్యాన్స్) ఈవెంట్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ ప్లేయర్ ఇండియా సర్జో, ఐఓసీ శరణార్ధి టీమ్కు చెందిన మనీజా తలాష్ మధ్య ప్రి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఈ పోరు కొనసాగుతున్న సమయంలో మనీజా అఫ్గనిస్తాన్లోని మహిళలను స్వేచ్ఛను ప్రసాదించమంటూ ‘ఫ్రీ అఫ్గాన్ ఉమెన్’ అంటూ రాసి ఉన్న కేప్ను తన డ్రెస్పై ధరించి డ్యాన్సింగ్ చేసింది. అయితే రాజకీయపరమైన వ్యాఖ్యలు, నినాదాలు ప్రదర్శించడంపై ఒలింపిక్స్లో నిషేధం ఉంది. దాంతో వెంటనే పోటీని నిలిపివేసిన అధికారులు ఆమెను డిస్క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించారు. మనీజా స్వదేశం అఫ్గానిస్తాన్ కాగా... ఆ దేశం తాలిబాన్ల ఆ«దీనంలోకి వచ్చిన తర్వాత అఫ్గాన్ నుంచి పారిపోయి స్పెయిన్లో శరణార్థిగా తలదాచుకుంది. క్రీడల్లో కల నెరవేర్చుకునేందుకు వచ్చానంటూ 21 ఏళ్ల మనీజా తన గురించి చెప్పుకుంది. ఇప్పుడు శరణార్ధి జట్టు ద్వారా ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం రాగా, బరిలోకి దిగి తమ మహిళల గురించి ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె చేసిన పనికి ఒలింపిక్స్లో అనర్హత వేటును ఎదుర్కొంది. -
ఇక సౌకర్యాలు లేవని చెబితే కుదరదు
ఒలింపిక్స్ చరిత్రలో ఘనమైన రికార్డు ఉన్న భారత హాకీ జట్టు ‘పారిస్’ క్రీడల్లోనూ దాన్ని కొనసాగించింది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో తలపడి కాంస్యం పతకం సాధించడం ఆనందంగా ఉంది. సహచరుల నుంచి ఇంతకు మించిన వీడ్కోలు బహుమతి అడగలేను. రెండు దశాబ్దాలకు పైగా జట్టుతో ఉన్నా. ఇప్పుడిక యువతరానికి పాఠాలు చెబుతా. వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవడం ద్వారా యువ ఆటగాళ్లలో స్థయిర్యం నింపే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగిందనుకుంటున్నా. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో యువ షూటర్ మనూ భాకర్తో కలిసి త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించనున్నా. మనూ నాకంటే 14 ఏళ్లు చిన్నది. అయినా ఆమె విశ్వక్రీడల్లో అద్భుతాలు చేసింది. ప్రతి అథ్లెట్ ఏకైక లక్ష్యం దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే. అది మనూలో సమృద్ధిగా ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్తో నా విశ్వక్రీడల ప్రయాణం ప్రారంభమైంది. ఈ పుష్కర కాలంలో క్రీడలకు ప్రోత్సాహం ఎలా మారిందో నేను ప్రత్యక్షంగా చూశాను. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు సరైన సౌకర్యాలు లేవని సాకులు చెప్పే అవకాశమే లేదు. హాకీలో సాధించిన పతకం కోట్లాది మంది భారతీయుల సమష్టితత్వానికి నిదర్శనమని ప్రధాని అన్నప్పుడు... గర్వంతో నరాలు ఉప్పొంగాయి. పారిస్ క్రీడల్లో బ్రిటన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మా జట్టు కలిసికట్టుగా ఆడిన తీరు అద్భుతం. దాదాపు 75 శాతం సమయం కేవలం 10 మందితోనే ఆడాం. ఆ పట్టుదలే ఇక్కడి వరకు చేర్చింది. మన జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఇప్పుడే వాళ్ల ప్రయాణాన్ని ప్రారంభించగా... మిగిలిన 11 మంది టోక్యో ఒలింపిక్స్లోనూ పాల్గొన్నారు.ప్రపంచంలోనే మేటి జట్లతో పోటీపడేందుకు బెంగళూరులోనూ ‘సాయ్’ శిక్షణ కేంద్రం మాకు అన్ని విధాలుగా సçహాయపడింది. గత పదిహేనేళ్లుగా ఈ కేంద్రమే నా ఇల్లు. కుటుంబ సభ్యులతో కన్నా అక్కడే ఎక్కువ గడిపా. అంతర్జాతీయ స్థాయి జిమ్, పారిస్లో మాదిరి సరికొత్త టర్ఫ్ ఇలా... ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. ఈ విజయంలో సహాయక సిబ్బంది పాత్ర కూడా మరవలేనిది. కోచ్ క్రెయిగ్ ఫల్టన్ జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ఆటగాళ్లందరికి ఒక్క తాటిపై నడిపించారు. ‘ఖేలో ఇండియా’ వ్యవస్థ భవిష్యత్తును మరింత మెరుగు పరుస్తుందని ఆశిస్తున్నా. -పీఆర్ శ్రీజేశ్ -
Paris Olympics: బాధ్యత పెంచిన విజయం
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత పురుషుల హాకీ జట్టుకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనున్న గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్తో పాటు కొందరు ప్లేయర్లు పారిస్లోనే ఉండిపోగా... కెప్టెన్ హర్మన్ప్రీత్సింగ్ సహా పలువురు క్రీడాకారులు శనివారం స్వదేశానికి చేరుకున్నారు. దీంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హాకీ అభిమానులతో కిక్కిరిసిపోయింది.‘యావత్ దేశం మా విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ భావన అద్భుతంగా ఉంది. ఒలింపిక్స్ సమయంలో మాకు అభిమానుల నుంచి విశేష మద్దతు లభించింది. దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. అభిమానులు చూపుతున్న ప్రేమాభిమానాలు మా బాధ్యతను మరింత పెంచాయి’అని భారత కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ అన్నాడు. బ్రిటన్తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా మిడ్ఫీల్డర్ అమిత్ రోహిదాస్ ‘రెడ్ కార్డ్’కు గురై మైదానాన్ని వీడాల్సి రాగా.. మిగిలిన 10 మందితోనే పోరాడిన భారత జట్టు అద్వితీయ ప్రదర్శనతో సెమీస్ చేరింది. దీనిపై వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ స్పందిస్తూ.. ‘ఇది జట్టులోని సభ్యులందరి పరస్పర నమ్మకానికి సంబంధించిన విషయంలో ఒక ప్లేయర్ లేకున్నా మ్యాచ్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. గోల్ పోస్ట్ ముందు పీఆర్ శ్రీజేశ్ అయితే లెక్కకు మిక్కిలిసార్లు మమ్మల్ని కాపాడాడు’అని వివరించాడు. ప్రేరణ పెంచిన విజయం: మాండవీయా పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టును కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా భారత జట్టుకు కేంద్ర మంత్రి రూ. 2 కోట్ల 40 లక్షల చెక్ను అందజేశారు. ‘దేశానికి అపారమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. మీ విజయం లక్షలాది మంది యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుంది. మీ ఘనతలు చూసి యావత్ దేశం గర్విస్తోంది. ఈ విజయం మీ పట్టుదల, సమష్టి కృషి, తిరుగులేని స్ఫూర్తికి నిదర్శనం’ అని మాండవీయా అన్నారు. మంచుకొండల్లో శిక్షణ ఫలితాన్నిచ్చింది పారిస్ ఒలింపిక్స్ బరిలో దిగడానికి ముందు స్విట్జర్లాండ్లోని మంచు కొండల్లో మూడు రోజుల ప్రత్యేక క్యాంప్లో పాల్గొనడం తమకెంతో ఉపయోగపడిందని కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ అన్నాడు. మంచుకొండల్లో వాకింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ జట్టు సభ్యుల్లో అనుబంధాన్ని పెంచేందుకు ఉపయోగపడిందని పేర్కొన్నాడు. ఇక 2011లో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన సమయంలో టీమిండియా సçహాయక బృందంలో కీలక సభ్యుడైన మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ రాక కూడా తమకు కలిసొచ్చిందని హర్మన్ అన్నాడు. ‘ఒకరికి ఒకరు అండగా నిలవడం.. ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందడం. ఇలాంటి చిన్న చిన్న అంశాలే పెద్ద ఫలితాలు తెచ్చాయి.పారిస్ క్రీడల్లో మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి వరకు మేమంతా ఒక జట్టుగా ముందుకు సాగాం. ఇందులో ప్యాడీ ఆప్టన్ పాత్ర కీలకం. అతడి వల్లే స్విట్జర్లాండ్లో మూడు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్కు వెళ్లాం. దాని వల్ల ఆటగాళ్లలో పట్టుదల, పరస్పర విశ్వాసం మరింత పెరిగింది’ అని హర్మన్ప్రీత్ పేర్కొన్నాడు. -
24 ఏళ్ల తర్వాత... ఇథోయోపియా అథ్లెట్కు పసడి పతకం
పారిస్: ఒలింపిక్స్ క్రీడలు ముగియడానికి ఒక రోజు ముందు ఇథియోపియా జట్టు పసిడి పతకం బోణీ కొట్టింది. పురుషుల మారథాన్ ఈవెంట్లో తమిరాత్ తోలా విజేతగా నిలిచి ఇథియోపియాకు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన మారథాన్ రేసులో నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 32 ఏళ్ల తోలా అందరికంటే వేగంగా 2 గంటల 6 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బషీర్ ఆబ్ది (బెల్జియం; 2గం:06ని:47 సెకన్లు) రజతం... బెన్సన్ కిప్రోతో (కెన్యా; 2గం:7ని:00 సెకన్లు) కాంస్యం సాధించారు. 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పురుషుల మారథాన్లో ఇథియోపియా అథ్లెట్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్లో ఇథియోపియా అథ్లెట్ గెజాహెగ్నె అబెరా మారథాన్ విజేతగా నిలిచాడు. మరోవైపు మారథాన్లో ‘హ్యాట్రిక్’ ఒలింపిక్ స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన కెన్యా దిగ్గజం ఎలూడ్ కిప్చోగే అనూహ్యంగా విఫలమయ్యాడు. 40 ఏళ్ల కిప్చోగే 30 కిలోమీటర్లు పరుగెత్తాక రేసు నుంచి వైదొలిగాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్లో కిప్చోగే స్వర్ణ పతకాలు సాధించాడు. కిప్చోగే ‘పారిస్’లోనూ విజేతగా నిలిచిఉంటే ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో మూడు బంగారు పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్గా కొత్త చరిత్ర సృష్టించేవాడు. -
భారత గోల్ఫర్ అదితికి 29వ స్థానం
మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన భారత మహిళా గోల్ఫర్ అదితి అశోక్ ‘పారిస్’ క్రీడల్లో ప్రభావం చూపలేకపోయింది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్ప్లేలో అదితి 290 పాయింట్లతో 29వ స్థానంతో సరిపెట్టుకుంది. తొలి మూడు రోజులు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అదితి... పోటీల చివరి రోజు శనివారం మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 11 స్థానాలు మెరుగు పర్చుకుంది. భారత్కే చెందిన మరో గోల్ఫర్ దీక్ష డాగర్ 301 పాయింట్లతో 49వ స్థానంతో సరిపెట్టుకుంది. న్యూజిలాండ్ గోల్ఫర్ లిడియా కో 278 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఎస్తెర్ హెన్సెలైట్ (280 పాయింట్లు; జర్మనీ), లిన్ జియా జానెట్ (281 పాయింట్లు; చైనా) వరసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. ‘తొలి మూడు రోజులు సరైన షాట్లు ఆడలేకపోయా. అందుకే వెనుకబడ్డా.. చివర్లో పుంజుకున్నా అప్పటికే ఆలస్యమైంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం సాధించేందుకు ప్రయత్నిస్తా’ అని అదితి పేర్కొంది. -
అర్షద్ నదీమ్పై కాసుల వర్షం.. 10 కోట్ల భారీ నజరానా
ప్యారిస్ ఒలింపిక్స్లో పసిడి పతకం సాధించిన పాకిస్తాన్ అథ్లెట్, బల్లెం వీరుడు అర్షద్ నదీమ్పై కాసుల వర్షం కురుస్తోంది. పంజాబ్ ప్రావిన్స్ రాష్ట్రం ముఖ్యమంత్రి మరియం నవాజ్ (మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె) ఒలింపిక్ చాంపియన్కు పాకిస్తాన్ కరెన్సీలో రూ. 10 కోట్లు (భారత కరెన్సీలో రూ. 3 కోట్లు) నజరానా ప్రకటించారు. ఇప్పటికే కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సైతం రూ. 5 కోట్లు (భారత కరెన్సీలో రూ. 1.50 కోట్లు) నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా గురువారం(ఆగస్టు 8) ఆర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరిన అర్షద్.. తొలి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో పాక్ తరపున వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్గా నదీమ్ నిలిచాడు. కాగా ఈ పోటీల్లో రెండో స్ధానంలో నిలిచిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నిరజ్ చోప్రా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
శెభాష్ అమన్.. 10 గంటల్లో 4.6 కేజీలు తగ్గిన రెజ్లర్! లేదంటే?
ప్యారిస్ ఒలింపిక్స్లో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకంతో మెరిశాడు. 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన అమన్ సెమీస్లో ఓడినా.. కాంస్య పతక పోరులో మాత్రం అదరగొట్టాడు.ప్రత్యర్ధి క్రజ్ డెరియన్ (పూర్టోరికో)ను 13-5తో ఓడించిన అమన్.. తొలి ఒలింపిక్ పతకాన్ని ముద్దాడాడు. తద్వారా ఒలిపింక్స్లో భారత తరపున పతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా అమన్ చరిత్ర సృష్టించాడు.కాంస్యం వెనక కఠోర శ్రమ..అయితే అమన్ సెహ్రావత్ కాంస్య పతకం సొంతం చేసుకోవడం వెనక కఠోర శ్రమ దాగింది. అమన్ తృటిలో ఆనర్హత వేటును తప్పించుకున్నాడు. అమన్ కాంస్య పతక మ్యాచ్కు ముందు భారత రెజ్లింగ్ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమన్ బరువు(57 కేజీలు) ఉండాల్సిన కంటే 4.5 కేజీలు ఆధికంగా ఉండటమే అందుకు కారణం . సెమీస్లో ఓటమి తర్వాత గురువారం(ఆగస్టు 8) నాడు సాయంత్రం 6: 30 గంటలకు అమన్ బరువు 61.5 కేజీలు ఉందట. ఇప్పటికే స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై ఆధిక బరువు కారణంగా అనర్హత వేటు పడినందున.. అమన్ విషయంలో మాత్రం భారత మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంది. దీంతో కాంస్య పతక పోరుకు ముందు బరువు తూచే సమయానికి అమన్ 4.6 కిలోల బరువు తగ్గాల్సి ఉంది. ఈ క్రమంలో అమన్ తన బరువు తగ్గడానికి కఠినంగా శ్రమించాడు. గురువారం రాత్రి మొత్తం అమన్ నిద్ర పోలేదు. హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. కోచ్లు వీరేంద్ర దహియా, జగ్మందర్ సింగ్ సెహ్రావత్ బరువు తగ్గించడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు.అమన్ మిషన్ సాగింది ఇలా..తొలుత ఇద్దరు కోచ్లతో గంటన్నర సుదీర్ఘ మ్యాట్ సెషన్తో అమన్ వెయిట్ లాస్ మిషన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ యువ రెజ్లర్ ఒక గంట పాటు హాట్ బాత్(వేడి నీళ్ల స్నానం) సెషన్లో పాల్గోన్నాడు. అనంతరం అర్ధరాత్రి దాటాక జిమ్లో 30 నిమిషాల నాన్స్టాప్ ట్రెడ్మిల్పై సాధన చేశాడు. ఆ తర్వాత అతడికి 30 నిమిషాల పాటు విరామం ఇచ్చారు. బ్రేక్ తర్వాత దాదాపు ఐదు సెషన్లపాటు ఐదేసి నిమిషాల చొప్పున సానా బాత్( ఆవిరి స్నానం) చేయించారు.అప్పటికి అతడు 3.6 కిలోలు తగ్గాడు. కానీ అమన్పై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు మరింత బరువు తగ్గాల్సి ఉంది. ఈ క్రమంలో అతడికి మసాజ్ సెషన్ నిర్వహించారు. ఆ తర్వాత లైట్ జాగింగ్, 15 నిమిషాల రన్నింగ్ సెషన్లో పాల్గోన్నాడు. సరిగ్గా ఉదయం 4:30 గంటలకు అతని బరువు 4.6 కేజీల తగ్గి 56.9 కిలోలకు వచ్చింది. దీంతో భారత బృందం ఊపిరిపీల్చుకుంది. దాదాపు 10 గంటల పాటు తీవ్రంగా శ్రమించి అమన్ తన బరువును తగ్గించుకున్నాడు. శుక్రవారం మ్యాచ్ జరిగే ముందు బరువు తూచే సమయానికి అమన్ సరిగ్గా 56.9 కిలోల బరువు ఉన్నాడు. దీంతో మ్యాచ్లో పాల్గోని కాంస్య పతకాన్ని భారత్కు అందించాడు. ఈ క్రమంలో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా నీవు వారియర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం.. వీడియో వైరల్
ఒలింపిక్స్ కాంస్య పతకంతో స్వదేశానికి చేరుకున్న భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం లభించింది. శనివారం ప్యారిస్ నుంచి ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన భారత హాకీ జట్టుకు అభిమానులు పుష్ప గుచ్చాలతో ఆపూర్వ స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ విశ్వ క్రీడల్లో భాగంగా గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్పై భారత్ విజయం సాధించింది.అంతకుముందు సెమీఫైనల్లో జెర్మనీ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. కానీ కాంస్య పతక మ్యాచ్లో హర్మన్ ప్రీత్ సేన పంజా విసిరింది. ఇక కాంస్య పతకం విజయంతో భారత స్టార్ గోల్ కీపర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు విడ్కోలు పలికాడు. 🇮🇳Indian Men's Hockey Team players arrive at Delhi airport after winning a bronze medal at the #Paris2024 🥉#Hockey #HarmanpreetSingh #Olympics pic.twitter.com/6O7BTlOy4u— InsideSport (@InsideSportIND) August 10, 2024 -
భారత జూనియర్ హాకీ జట్టు కోచ్గా శ్రీజేశ్!
పారిస్ ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా రెండో కాంస్య పతకం సాధించిన అనంతరం కెరీర్కు వీడ్కోలు పలికిన భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ త్వరలోనే కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు. గోల్ పోస్ట్ ముందు తన అసమాన ప్రతిభతో దేశానికి ఎన్నో మధుర విజయాలు అందించిన శ్రీజేశ్.. ఇకపై జాతీయ జూనియర్ జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నాడు. ‘త్వరలోనే శ్రీజేశ్ను జూనియర్ (అండర్–21) జట్టు కోచ్గా నియమిస్తాం. దీని గురించి అతడితో మాట్లాడాం. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో అతడికి మించిన వారు మరొకరు లేరు. దీంతో పాటు శ్రీజేశ్ స్థానాన్ని భర్తీ చేయనున్న గోల్ కీపర్లు సూరజ్ కార్కెరా, క్రిషన్ బహదూర్ పాఠక్కు కూడా దిశా నిర్దేశం చేయాల్సి ఉంటుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. -
వినేశ్కు రజతం ఇవ్వాలి: సచిన్ టెండూల్కర్
పారిస్ ఒలింపిక్స్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలేనని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. మహిళల 50 కేజీల విభాగంలో వరస విజయాలతో ఫైనల్కు చేరిన ఫొగాట్.. వంద గ్రాములు అదనపు బరువు కారణంగా పతకానికి దూరమై రెజ్లింగ్ కెరీర్కు వీడ్కోలు పలికింది.ఈ నేపథ్యంలో సచిన్ సోషల్ మీడియాలో స్పందించాడు. ‘ప్రతి ఆటలో నిబంధనలు ఉంటాయి. వాటిని సందర్భానుసారంగా చూడాలి. అవసరమైతే మార్పులు చేయాలి. వినేశ్ చక్కటి ఆటతీరుతో ఫైనల్కు చేరింది. తుదిపోరుకు ముందు అదనపు బరువు కారణంగా అనర్హత వేటు పడి రజత పతకానికీ దూరమైంది. దీనికి సరైన కారణం కనిపించడం లేదు. ఇందులో క్రీడా స్ఫూర్తి లోపించినట్లే’ అని సచిన్ ఎక్స్లో పేర్కొన్నాడు. డ్రగ్స్ వంటి అనైతిక చర్యలతో అనర్హతకు గురై ఉంటే చివరి స్థానం ఇవ్వడం సబబే అని.. కానీ వినేశ్ న్యాయంగా పోరాడి ఫైనల్కు చేరిందని సచిన్ గుర్తు చేసుకున్నాడు. ఫొగాట్ రజత పతకానికి అర్హురాలే అని.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్) తీర్పు తర్వాత అయినా వినేశ్కు పతకం వస్తుందని ఆశిస్తున్నట్లు సచిన్ ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. -
నిజమైన విజేతవు నీవే బంగారం!
క్రీడలే జీవితంగా భావించే వారు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఒలింపి క్స్లో పతకం సాధించాలని కోరుకొంటారు. పతకం కోసం అహరహం శ్రమిస్తూ సంవ త్సరాల తరబడి సాధన చేస్తూ ఉంటారు. అయితే... గెలుపు, ఓటమితో సంబంధం లేని ఓ సాంకేతిక కారణంతో స్వర్ణపతకం చేజారితే... కనీసం రజత పతకమైనా దక్కకుంటే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు. ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల కుస్తీ 50 కిలోల విభాగంలో భారత మల్లయోధురాలు వినేశ్ పోగట్కు అదే పరిస్థితి ఎదు రయ్యింది. వంద గ్రాముల అదనపు బరువు కొండంత దురదృష్టాన్ని, గుండెబరువును మిగిల్చింది.ఒలింపిక్స్లో పతకం మినహా ప్రపంచ కుస్తీలోని అన్ని రకాల పోటీలలో పతకాలు సాధించిన ఘనత వినేశ్కు ఉంది. 49 కిలోలు, 50 కిలోలు, 53 కిలోల విభాగాలలో పాల్గొంటూ చెప్పుకోదగ్గ విజయాలు, ఎన్నో పతకాలు సాధించిన ఘనత ఉంది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ పోటీలలో సైతం స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన వినేశ్కు ఒలింపిక్స్ పతకం మాత్రం గత పుష్కరకాలంగా అందని ద్రాక్షలా ఉంటూ వచ్చింది.2016 రియో ఒలింపిక్స్లో పాల్గొంటూ గాయంతో వైదొలిగిన వినేశ్ 2020 టోక్యో ఒలింపి క్స్లో మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయింది. ఇక 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్దిమాసాల ముందు వినేశ్ న్యాయం కోసంముందుగా రోడ్లు, ఆ తరువాత న్యాయస్థానాల మెట్లు ఎక్కి పోరాడాల్సి వచ్చింది.అంతర్జాతీయ కుస్తీ పోటీలలో పాల్గొంటూ, దేశానికి పతకాలతో ఖ్యాతి తెస్తున్న ఏడుగురు మహిళా వస్తాదులపై బీజెపీ మాజీ ఎంపీ, జాతీయ కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్, ఆయన పరివారం లైంగిక వేధింపులకు పాల్పడటానికి నిరసనగా భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లాంటి దిగ్గజ వస్తాదులతో కలసి వినేశ్ గొప్ప పోరాటమే చేసింది. చివరకు ఢిల్లీ పోలీసుల కాఠిన్యాన్ని రుచి చూడాల్సి వచ్చింది. న్యాయస్థానాల జోక్యంతో బ్రిజ్ భూషణ్ అధ్యక్షపదవిని వీడక తప్పలేదు.మొక్కవోని దీక్షతో, మోకాలి శస్త్ర చికిత్సను సైతం భరించి, పోరాడి ప్యారిస్ ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో పాల్గొనటానికి అర్హత సంపాదించింది. 53 కిలోల విభాగంలో తనకు అవకాశం లేకపోడంతో యాభై కిలోల విభాగంలో పాల్గొనటం కోసం బరువు తగ్గించుకొని మరీ ప్యారిస్లో అడుగుపెట్టింది. మహిళా కుస్తీ 50 కిలోల విభాగం పోటీల తొలిరోజున 50 కిలోల బరువుతోనే జపాన్, ఉక్రెయిన్, క్యూబా బాక్సర్లను చిత్తు చేయడం ద్వారా ఫైనల్లో అడుగు పెట్టింది. వినేశ్ ఫైనల్స్ చేరడంతో బంగారు పతకం ఖాయమనే శతకోటి భారత క్రీడాభిమానులు ఆశ పడ్డారు. కానీ జరిగింది వేరు. అంతర్జాతీయ కుస్తీ సమాఖ్య నిబంధనల ప్రకారం పోటీలు జరిగే ప్రతి రోజూ వివిధ విభాగాలలో పోటీకి దిగే వస్తాదుల బరువును చూసిన తరువాతే పోటీకి అనుమతిస్తారు. అయితే...పోటీల తొలిరోజున 50 కిలోల బరువున్న వినేశ్... స్వర్ణపతం కోసం పోటీపడే రోజున మాత్రం 100 గ్రాముల బరువు అదనంగా ఉండడంతో అనర్హత వేటు వేశారు. బరువును నియంత్రించుకోడం కోసం ఫైనల్కు ముందురోజు రాత్రి వినేశ్, ఆమె శిక్షకులు చేయని ప్రయత్నం అంటూ ఏమీలేదు. తెల్లవార్లూ నడకతో, సైక్లింగ్ చేస్తూ, విపరీతమైన వేడితో ఉండే ఆవిరి గదిలో వినేశ్ గడిపింది. చివరకు బరువు తగ్గించుకోవటం కోసం శిరోజాలను సైతం కత్తిరించుకొన్నా ప్రయోజనం లేకపోయింది. వంద గ్రాముల అదనపు బరువు కారణంగా బంగారు పతకం కోసం పోటీ పడే అవకాశాన్ని కోల్పోడంతో పాటు... కనీసం రజత పత కానికి సైతం నోచుకోలేకపోయింది. అదనపు బరువు నిబంధన కారణంగా వినేశ్కు బంగారు పతకం పోరులో పాల్గొనే అవకాశాన్ని నిరాకరించడం గుండె కోతను మిగిల్చింది. వినేశ్తో పాటు కోట్లాది క్రీడాభి మానులు, యావత్ భారతజాతి తల్లడిల్లిపోయింది.అదనంగా ఉన్న 100 గ్రాముల బరువే తనకు ఒలింపిక్స్ పతకం సాధించే అవకాశం లేకుండా చేయటాన్ని జీర్ణించుకోలేని వినేశ్ అర్ధంతరంగా రిటై ర్మెంట్ ప్రకటించింది. వినేశ్కు న్యాయం చేయాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘానికి భారత కుస్తీ సమాఖ్య అప్పీలు చేసింది. ఫైనల్ బరిలో దిగకుండానే సర్వం కోల్పోయిన వినేశ్కు కనీసం రజత పతకమైనా ఇవ్వాలంటూ మొరపెట్టుకొన్నారు. రజత పతకాలు ఇద్దరికీ ఇచ్చినా ఇబ్బంది రాదని అంటున్నారు.వినేశ్కు ప్రధాని, కేంద్ర క్రీడామంత్రి; భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు పలు వురు క్రీడాదిగ్గజాలు, సింధు లాంటి ఒలింపియన్లు అండగా నిలిచారు.ప్రతిభకు, బరువుకు సంబంధం ఏంటని పలు వురు నిపుణులు, ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. 100 గ్రాముల అదనపు బరువుతో ప్రత్యర్థికి జరిగే నష్టమేంటని నిలదీస్తున్నారు. హార్మోనుల అసమతౌల్యత వల్ల మహిళల బరువు తరచూ మారిపోతూ ఉంటుందని, ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని మినహా యింపు ఇవ్వాలంటూ సూచిస్తున్నారు.భారత ఒలింపిక్స్ సంఘం మొరను అంతర్జా తీయ ఒలింపిక్స్ సంఘం ఆలకించినా... ఆలకించ కున్నా, కనీసం రజత పతకం ఇచ్చినా, ఇవ్వకున్నా... నిజమైన విజేతగా కోట్లాది మంది క్రీడాభిమానుల గుండెల్లో వినేశ్ పోగట్ నిలిచిపోతుంది.వ్యాసకర్త సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మొబైల్: 84668 64969 -
భారత మహిళల, పురుషుల 4*400 రిలే జట్లు విఫలం..
పారిస్: ఒలింపిక్స్లో కనీస అంచనాలను అందుకోలేకపోయిన భారత మహిళల, పురుషుల జట్లు 4*400 మీటర్ల రిలే ఈవెంట్లలో నిరాశపరిచి హీట్స్లోనే వెనుదిరిగాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ, విత్యా రాంరాజ్, పూవమ్మ రాజు, శుభా వెంకటేశన్లతో కూడిన భారత మహిళల జట్టు హీట్స్లో పోటీపడ్డ ఎనిమిది జట్లలో చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలవడం గమనార్హం.భారత బృందం 3 నిమిషాల 32.51 సెకన్లలో రేసును పూర్తి చేసి చివరి స్థానాన్ని దక్కించుకుంది. ముందుగా విత్యా రేసును ఆరంభించి 53.46 సెకన్ల తర్వాత బ్యాటన్ను జ్యోతిక శ్రీకి అందించింది. జ్యోతిక శ్రీ వాయువేగంగా పరుగెత్తి 51.30 సెకన్ల తర్వాత బ్యాటన్ను పూవమ్మ రాజుకు అందించింది. పూవమ్మ 54.80 సెకన్ల తర్వాత శుభకు బ్యాటన్ ఇచ్చింది. శుభ 52.95 సెకన్లలో 400 మీటర్లను పూర్తి చేసింది. ఈ నలుగురిలో జ్యోతిక శ్రీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అనస్, అజ్మల్, అమోజ్, రాజేశ్లతో కూడిన భారత పురుషుల జట్టు 3 నిమిషాల 00.58 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్గా భారత బృందం పదో స్థానాన్ని దక్కించుకుంది. -
Paris Olympics 2024: చిన్న దేశాలు... పెద్ద విజయాలు
మహిళల 100 మీటర్ల పరుగులో సెయింట్ లూసియాకు చెందిన అల్ఫ్రెడ్ జూలియన్ 10.72 సెకన్లలో లక్ష్యానికి చేరి స్వర్ణం గెలిచింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో డొమెనికాకు చెందిన లెఫాండ్ థియా 15.02 మీటర్ల దూరం దూకి పసిడి పతకం కైవసం చేసుకుంది. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.. సెయింట్ లూసియా జనాభా 1,80,000 కాగా.. డొమెనికా జనాభా 73 వేలు మాత్రమే. కరీబియన్ దీవుల్లోని అతి చిన్న దేశాలు విశ్వక్రీడల్లో సత్తా చాటుతున్నాయనడానికి ఇది నిదర్శనం. ఒలింపిక్స్ చరిత్రలో పసిడి గెలిచిన అతి తక్కువ జనాభా గల దేశంగా డొమినికా రికార్డుల్లోకెక్కింది. ఇవే కాకుండా.. పట్టుమని 10 లక్షల జనాభా కూడా లేని పదికి పైగా దేశాలు ఒలింపిక్స్లో చక్కటి ప్రదర్శన కనబరిచాయి. –సాక్షి క్రీడా విభాగం ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో ఇప్పటి వరకు వందకు పైగా దేశాలు పతకాలు సాధించాయి. వాటిలో జనాభా పరంగా స్వర్ణం గెలిచిన అతిచిన్న దేశంగా డొమెనికా నిలిచింది. విశ్వక్రీడల్లో ఆ దేశానికి ఇదే తొలి పతకం కావడం మరో విశేషం. ఇప్పటి వరకు తమ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు లేకున్నా... ఈ మెడల్ అనంతరం డొమినికాను ప్రపంచ చాంపియన్గా అందరూ గుర్తిస్తారని... ఆ దేశానికి తొలి పతకం అందించిన ట్రిపుల్ జంపర్ లెఫాండ్ థియా ఆశాభావం వ్యక్తం చేసింది. భిన్న భౌగోళిక పరిస్థితులు ఉండే డొమెనికాలో... క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యం అంతంత మాత్రమే. అలాంటి చోటు నుంచి ‘పారిస్’ క్రీడలకు నలుగురు అథ్లెట్లు అర్హత సాధించగా అందులో లెఫాండ్ థియా సాధించిన బంగారు పతకం... ఆ దేశానికి కీర్తి ప్రతిష్టలు కట్టబెట్టింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ నుంచి డొమెనికా విశ్వక్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తుండగా.. 28 ఏళ్ల తర్వాత ఆ దేశానికి మొదటి పతకం దక్కింది. ఈ ఏడాది ప్రపంచ ఇండోర్ చాంపియన్íÙప్లో పతకం నెగ్గి ఆశలు రేపిన లెఫాండ్... ‘పారిస్’ క్రీడల్లోనూ అదే జోరు కొనసాగించింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో 15.02 మీటర్ల దూరం లంఘించి పసిడి పతకం కైవసం చేసుకుంది. ‘ఇప్పుడు మేం కూడా ప్రపంచ చాంపియన్లమే. డొమెనికాకు ఒలింపిక్స్లో తొలి పతకం. అది కూడా పసిడి. చాలా గొప్పగా అనిపిస్తోంది. ఈ ఫలితంతో మా దేశంలో క్రీడలకు మరింత ప్రాధాన్యత దక్కుతుందనే నమ్మకం పెరిగింది. మా దేశ జనాభా సుమారు 73 వేలు. దేశానికి తొలి స్వర్ణం అందించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. దేశం తరఫున ఒలింపిక్స్లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్గా నిలవడం... అందులోనూ పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది. చిన్న దేశం అంటే... పరిమిత వనరులు ఉంటాయనుకుంటారు. అయితే సంఖ్య కన్నా నాణ్యత ముఖ్యం అని నా ఉద్దేశం. ఈ విజయాన్ని దేశమంతా ఆస్వాదిస్తుంది. డొమెనికా స్టేడియంలో అథ్లెటిక్స్ కోసం మెరుగైన ట్రాక్ కూడా లేదు. ఇప్పుడు ఈ పతకం వల్ల దేశంలో క్రీడా మౌలిక వసతులు మెరుగు పడతాయని ఆశిస్తున్నా. భవిష్యత్తు తరాలు క్రీడలను కెరీర్గా ఎంచుకునేందుకు నా వంతు కృషి చేస్తా’ అని పతకం గెలిచిన అనంతరం లెఫాండ్ వివరించింది. జూలియన్ కథే వేరు... పారిస్ ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం, 200 మీటర్లలో రజతం నెగ్గిన సెయింట్ లూసియా అథ్లెట్ జూలియన్ అ్రల్ఫెడ్ కథే వేరు! అమెరికా అథ్లెట్లు షకారీ రిచర్డ్సన్, జెఫెర్సన్ మెలీస్సాలతో పోటీపడి అగ్రస్థానం దక్కించుకున్న జూలియన్... ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరింది. ప్రాక్టీస్ చేసేందుకు షూస్ కాదు కదా... కనీసం చెప్పులు కూడా లేని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన జూలియన్... చిన్నతనంలో ఎక్కువగా స్కూల్ యూనిఫామ్లోనే పరుగు పెట్టేది. రన్నింగ్ కోసం ప్రత్యేక దుస్తులు కొనే స్థోమత లేని జూలియన్... చిన్నప్పటి నుంచే పరుగును ప్రేమించింది. ఒలింపిక్స్లో దేశానికి పతకం అందించాలని ఊహ తెలిసినప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకున్న జూలియన్... పారిస్లో తన కల సాకారం చేసుకుంది. ‘ఇది నాకు, నా దేశానికి ఎంతో విలువైంది. యావత్ దేశం సంబరాలు జరుపుకోవడం ఖాయం. చిన్నప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా పరుగులు తీసే దాన్ని. కనీస వసతులు లేకుండానే ఈ స్థాయికి వచ్చా. ఈ ప్రదర్శన అనంతరం మా దేశంలో స్టేడియం నిర్మాణం జరుగుతుందనుకుంటున్నా. యువత క్రీడలను కెరీర్గా ఎంచుకోవడం పెరుగుతుందని భావిస్తున్నా. దేశానికి అంబాసిడర్ అనే భావన కలుగుతోంది. ప్రపంచంలో చాలా మందికి సెయింట్ లూసియా గురించి తెలిసి ఉండకపోవచ్చు. అదెక్కడ ఉంది అని నన్ను ఎంతో మంది అడిగారు. కాని ఇప్పుడు ఒలింపిక్ చాంపియన్ కాబట్టి... ప్రజలు సెయింట్ లూసియా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. దేశం కోసం పరుగెత్తడాన్ని గౌరవంగా భావిస్తా. ఇంటికి వెళ్లాక ప్రజలతో కలిసి సంబరాలు చేసుకుంటా’అని జూలియన్ చెప్పింది.వీరిద్దరే కాదు... 1,25,000 జనాభా ఉన్న గ్రెనెడా అథ్లెట్లు ‘పారిస్’ క్రీడల్లో రెండు కాంస్యాలు సాధించగా... 2,82,000 జనాభా ఉన్న బార్బడోస్ ఒక పతకం నెగ్గింది. ఇక సుమారు 4 లక్షల జనాభా గల బహామస్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఇప్పటి వరకు 8 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 16 పతకాలు గెలిచింది. -
అమన్ కంచు పట్టు.. కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్
కుస్తీ క్రీడలో బీజింగ్ ఒలింపిక్స్ నుంచి మొదలైన భారత ‘పట్టు’ పారిస్ ఒలింపిక్స్లోనూ కొనసాగింది. వరుసగా ఐదో ఒలింపిక్స్లో రెజ్లింగ్ క్రీడాంశంలో భారత్కు పతకం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో ఈసారి భారత్ నుంచి అమన్ సెహ్రావత్ రూపంలో ఒక్కడే అర్హత సాధించాడు. ఆ ఒక్కడే పతక వీరుడయ్యాడు. 57 కేజీల విభాగంలో పోటీపడ్డ అమన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో 57 కేజీల విభాగంలోనే భారత్కు రజత పతకం అందించిన రవి దహియాను జాతీయ ట్రయల్స్లో ఓడించిన అమన్ తనలో ఒలింపిక్ పతకం తెచ్చే సత్తా ఉందని తాజా ప్రదర్శనతో నిరూపించాడు. అమన్ కాంస్యంతో పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో ఆరో పతకం చేరింది.పారిస్: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగం కాంస్య పతక బౌట్లో అమన్ 13–5 పాయింట్ల తేడాతో డారియన్ టోయ్ క్రూజ్ (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు. అండర్–23 విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన 21 ఏళ్ల అమన్ భారత్ నుంచి పురుషుల విభాగంలో ఒక్కడే ప్రాతినిధ్యం వహించాడు. డారియన్తో జరిగిన కాంస్య పతక బౌట్ ఆరంభంలో హోరాహోరీగా సాగింది. ఒకదశలో 2–3తో వెనుకబడ్డ అమన్ నెమ్మదిగా తన పట్టు ప్రదర్శించాడు. మూడు నిమిషాల నిడివిగల తొలి భాగం ముగిసేసరికి అమన్ 6–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో భాగంలోనూ అమన్ నేర్పుతో పోరాడాడు. మొదట్లో రెండు పాయింట్లు కోల్పోయినా... వెంటనే తేరుకొని పొరపాట్లకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా ఆడాడు. ఈ క్రమంలో దూకుడు పెంచి డారియన్ను ఉక్కిరిబిక్కిరి చేసి వరుసగా 2,2,2,1 పాయింట్లు సాధించి 13–5తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంతోపాటు కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. 7 ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన ఏడో భారతీయ రెజ్లర్గా అమన్ గుర్తింపు పొందాడు. గతంలో ఖాషాబా జాదవ్ (1952 హెల్సింకి; కాంస్యం), సుశీల్ కుమార్ (2008 బీజింగ్; కాంస్యం... 2012 లండన్; రజతం), యోగేశ్వర్ దత్ (2012 లండన్; కాంస్యం), సాక్షి మలిక్ (2016 రియో; కాంస్యం), రవి దహియా (2020 టోక్యో; రజతం), బజరంగ్ పూనియా (2020 టోక్యో; కాంస్యం) ఈ ఘనత సాధించారు. -
Olympic 2024: అనాథగా వచ్చి అద్భుతం చేసి... అమన్ 'కాంస్య' కథ
‘గెలవడం అనేది నిజంగా అంత సులువే అయితే అందరూ అదే చేసేవాళ్లు’... ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రెజ్లింగ్ శిక్షణా కేంద్రం ‘ఛత్రశాల్’లో అమన్ సెహ్రావత్ గదిలో అతని మంచం పక్కన చేతి రాతతో రాసుకున్న ఈ క్యాప్షన్ కనిపిస్తుంది. పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించినప్పుడు ‘క్వాలిఫైడ్ అథ్లెట్’ అంటూ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా మరో పక్కన ఉంటుంది. ఒలింపిక్స్ ఐదు రింగులతో పాటు పతకం చిత్రాన్ని కూడా అక్కడ అతను అంటించుకున్నాడు. ఇప్పుడు అక్కడ బొమ్మ మాత్రమే కాదు అసలు ఒలింపిక్ పతకమే వేలాడనుంది! ఈ మెగా ఈవెంట్లో పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన 21 ఏళ్ల అమన్ తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. భారత్ తరఫున అన్ని కేటగిరీలు కలిపి పురుషుల విభాగంలో బరిలోకి దిగిన ఒకే ఒక్కడు ఇప్పుడు కాంస్యంతో మెరిశాడు. ఛత్రశాల్ సెంటర్లో యువ రెజ్లర్లకు స్ఫూర్తినివ్వడం కోసం దేశానికి కీర్తిని తెచ్చిన రెజ్లర్ల ఫొటోలను పెట్టారు.ఒలింపిక్స్లో పతకాలు సాధించిన సుశీల్ కుమార్, బజరంగ్ పూనియా, యోగేశ్వర్ దత్, రవి దహియాలతో పాటు వరల్డ్ చాంపియన్ షిప్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడైన అమిత్ దహియా ఫోటో కూడా ఉంటుంది. ప్రతీ రోజూ ప్రాక్టీస్ కోసం అక్కడి నుంచే నడిచే అమన్ తన గురించి కూడా కలకన్నాడు. అతను ఢిల్లీ చేరేసరికి అతని ఫొటో కూడా సిద్ధమైపోతుందేమో! తల్లిదండ్రులను కోల్పోయి... హరియాణాలోని బిరోహర్కు చెందిన అమన్ తొమ్మిదేళ్ల వయసులో నాన్న ప్రోత్సాహంతో మట్టిలో రెజ్లింగ్లో ఓనమాలు నేర్చుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో సుశీల్ రజతం గెలిచిన క్షణాన్ని టీవీలో చూసిన అతను ఎప్పటికైనా ఢిల్లీలో ఛత్ర్శాల్ స్టేడియానికి వెళ్లి గొప్ప రెజ్లర్ను అవుతానంటూ నాన్నకు చెప్పేవాడు. దురదృష్టవశాత్తూ ఏడాది తిరిగేలోగా అతని తల్లిదండ్రులు అనూహ్యంగా మరణించారు. దాంతో కొందరు సన్నిహితులు 11 ఏళ్ల వయసులో ఛత్రశాల్ స్టేడియంకు తీసుకొచ్చి చేర్పించారు. అప్పటి నుంచి అతనికి ఆ కేంద్రమే సొంత ఇల్లుగా, అతని లోకమంతా రెజ్లింగ్మయంగా మారిపోయింది. ప్రాక్టీస్ తప్ప మరో పని లేకుండా అమన్ గడిపేవాడు. కోచ్ లలిత్ కుమార్ అతడిని తీర్చిదిద్దాడు. అండర్–23 ప్రపంచ విజేతగా... 18 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ విజేతగా నిలిచిన అనంతరం అమన్ జూనియర్ స్థాయిలో పలు అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్నాడు. ఆసియా క్యాడెట్స్, వరల్డ్ క్యాడెట్స్, ఆసియా అండర్–20, ఆసియా అండర్–23 చాంపియన్íÙప్లలో అతను సాధించిన విజయాలు అమన్కు గుర్తింపు తెచ్చి పెట్టాయి. అయితే 19 ఏళ్ల వయసులో అండర్–23 వరల్డ్ చాంపియన్íÙప్లో స్వర్ణం సాధించడంతో అతనిపై అందరి దృష్టి పడింది. భవిష్యత్తులో అద్భుతాలు చేయగల ఆటగాడిగా అందరూ అంచనాకు వచ్చారు. వేర్వేరు గ్రాండ్ప్రిలు, ఇన్విటేషన్ టోర్నీలలో కూడా వరుస విజయాలు సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ క్రమంలో సీనియర్ స్థాయిలో సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. అమన్ ఎక్కడా తగ్గకుండా తన ఆటలో మరింత పదును పెంచుకున్నాడు. ఫలితంగా 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం, గత ఏడాది ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం అతని ఖాతాలో చేరాయి. సుశీల్ ఫోన్ కాల్తో... ఆసియా క్రీడల సెమీఫైనల్లో, ఆ తర్వాత ఆసియా క్వాలిఫయిర్స్లో బలహీన డిఫెన్స్తో అమన్ పరాజయంపాలై కాస్త నిరాశ చెందాడు. ఆ సమయంలో అతనికి తీహార్ జైలు నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చి0ది. అది చిరపరిచితమైన గొంతే. తన కెరీర్ ఆరంభంలో తనను ప్రోత్సహించి నువ్వు గొప్పవాడిని అవుతావని ఆశీర్వదించిన సుశీల్ కుమార్ చేసిన ఫోన్ అది. ‘నీ ఆటకు డిఫెన్స్ పనికిరాదు. అలా చేస్తే ఎప్పటికీ గెలవలేవు. ఒక్క సెకను కూడా డిఫెన్స్పై దృష్టి పెట్టకుండా ఆరంభం నుంచి అటాక్ చేస్తేనే నీకు సరిపోతుంది. సీనియర్ స్థాయిలో డిఫెన్స్ టెక్నిక్ చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ ఫలితాన్ని ఇవ్వదు. నేను కూడా అలాగే చేశాను’ అంటూ సుశీల్ చెప్పడం అమన్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత అతని ఆటలో దూకుడు మరింత పెరిగింది. గురువునే ఓడించి... పారిస్ ఒలింపిక్స్ అవకాశం అమన్కు అంత సులువుగా రాలేదు. ఛత్ర్శాల్లో తాను ఎంతో అభిమానించే రెజ్లర్ రవి దహియా. అతడిపై ఇష్టం కారణంగా అన్ని చోట్లా అతడినే అనుకరిస్తూ అతని శిష్యుడిగా తనను తాను భావించుకునేవాడు. కానీ గురువుతోనే పోటీ పడాల్సిన స్థితి వస్తే! అమన్కు అదే అనుభవం ఎదురైంది. రవి దహియా కేటగిరీ అయిన 57 కేజీల విభాగంలోనే తానూ పోటీ పడుతున్నాడు. పారిస్ ఒలింపిక్స్కు వెళ్లేందుకు ఒకరికే అవకాశం ఉంది. కామన్వెల్త్ క్రీడల ట్రయల్స్లో రవి చేతిలో 0–10తో అమన్ చిత్తుగా ఓడాడు. కానీ ఆ తర్వాత అర్థమైంది తాను గురుభావంతో చూస్తే పని కాదని, ఒక ప్రత్యర్థి గా మాత్రమే చూడాలని. 2024 ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్స్లో చెలరేగి రవిని ఓడించడంలో సఫలమైన అమన్... గురువు స్థానంలోకి వచ్చి కొత్త శకానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత క్వాలిఫయర్స్లోనూ చెలరేగి ఒలింపిక్ బెర్త్ను సాధించాడు. ఈ క్రమంలో వాంగెలోవ్, ఆండ్రీ యెట్సెంకో, చోంగ్ సాంగ్వంటి సీనియర్లను అతను ఓడించగలిగాడు. ఘనమైన రికార్డుతో... ఒలింపిక్స్కు అర్హత సాధించిన తర్వాత ప్రపంచ రెజ్లింగ్కు రాజధాని లాంటి ‘డేగిస్తాన్’లో అతను సన్నద్ధమయ్యాడు. ఛత్రశాల్లో మినహా అతని కెరీర్లో శిక్షణ తీసుకున్న మరో చోటు డేగిస్తాన్ (రష్యాకు సమీపంలో) మాత్రమే. అత్యుత్తమ సౌకర్యాలతో పాటు పలువురు చాంపియన్ ప్లేయర్ల మధ్య సాధన చేయడం, పదునైన స్పేరింగ్ పార్ట్నర్లు ఉండటంతో అమన్ ప్రాక్టీస్ జోరుగా సాగింది. చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు అమన్ ఆగలేదు. ఫిబ్రవరి 2022లో సీనియర్ స్థాయిలో తొలిసారి అంతర్జాతీయ రెజ్లింగ్లో బరిలోకి దిగిన అమన్ అప్పటి నుంచి ఈ ఒలింపిక్స్కు ముందు వరకు 39 బౌట్లలో పాల్గొంటే 31 విజయాలు సాధించాడు. అంటే 79.4 విజయశాతం. ఇదే అతనిపై ఒలింపిక్ పతకం అంచనాలను పెంచింది. ఇప్పుడు తనకంటే ముందు ఒలింపిక్ పతకాలు సాధించిన తనలో స్ఫూర్తిని నింపిన దిగ్గజాల సరసన అతను సగర్వంగా నిలబడ్డాడు. –సాక్షి క్రీడా విభాగం -
అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు
పారిస్: ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో ఆసక్తికర ఈవెంట్లలో ఒకటైన పురుషుల 200 మీటర్ల పరుగులో కొత్త చాంపియన్ అవతరించాడు. బోట్స్వానాకు చెందిన లెట్సిల్ టెబోగో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 21 ఏళ్ల టెబోగో 19.46 సెకన్లలో పరుగు పూర్తి చేశాడు. టోక్యోలో రజతం సాధించిన బెడ్నారెక్ (అమెరికా; 19.62 సెకన్లు) ఈసారి కూడా రజతంతో సరి పెట్టుకున్నాడు. 100 మీటర్ల పరుగు విజేత అయిన మరో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్కు (19.70 సెకన్లు) కాంస్యం దక్కింది. గత ఒలింపిక్స్లోనూ లైల్స్కు కాంస్యమే లభించింది. కోవిడ్తో బాధపడుతూనే బరిలోకి దిగిన లైల్స్ అంచనాలకు తగినట్లుగా రాణించలేకపోయాడు. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికాకు పొరుగున బోట్స్వానా ఉంది. 26 లక్షల జనాభా కలిగిన ఈ దేశ చరిత్రలో ఇదే తొలి ఒలింపిక్ స్వర్ణ పతకం కావడం విశేషం. గత ఏడాది బుడాపెస్ట్లో జరిగిన వరల్డ్ చాంపియన్íÙప్లో టెబోగో 100 మీటర్లలో రజతం, 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించాడు. అతని కెరీర్ ఎదుగుదలలో తల్లి ఎలిజబెత్ సెరాతివా పాత్ర ఎంతో ఉంది. అయితే అతను ఒలింపిక్ సన్నాహాల్లో ఉన్న సమయంలో 44 ఏళ్ల వయసులో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్తో మరణించింది.తన చేతి వేలి గోర్లపై తల్లి పేరు రాసుకొని అతను రేస్లో పాల్గొన్నాడు. పరుగు పూర్తి కాగానే జాతీయ పతాకాన్ని ఒంటిపై కప్పుకున్న టెబోగో భుజాలపై తన రెండు షూస్ వేసుకొని భావోద్వేగంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అందులో ఒక షూను తీసి అతను కెమెరాకు చూపించాడు. దానిపై అతని తల్లి పేరు, పుట్టిన తేదీ రాసి ఉన్నాయి. ప్రేక్షక సమూహంలో ఉన్న అతని చెల్లెలు కూడా అన్న ప్రదర్శనకు జేజేలు పలకింది. ‘నేను ఒలింపిక్ పతకం గెలవాలని ఆమె ఎంతో కోరుకుంది’ అని టెబోగో చెప్పాడు. మరోవైపు టెబోగో విజయంతో బోట్స్వానా దేశంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విజయంపై ప్రజలంతా సంబరాలు చేసుకోవాలంటూ దేశాధ్యక్షుడు మాగ్వీట్సీ మసీసీ శుక్రవారం ‘హాఫ్ డే’ సెలవు ప్రకటించడం విశేషం. -
బ్రేక్ డ్యాన్స్లో ‘ఇండియా’ జోరు
విశ్వక్రీడల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన బ్రేక్ డ్యాన్స్ (బ్రేకింగ్) ఈవెంట్లో ఇండియా జోరు సాగుతోంది. అదేంటి ఈ విభాగంలో భారత్ నుంచి ఒక్క డాన్సర్ కూడా పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించలేదు కదా అని అనుకుంటున్నారా.. ఇండియా అంటే భారత్ అనుకుంటే మీరు పొరబడినట్లే. నెదర్లాండ్స్కు చెందిన 16 ఏళ్ల యువ డాన్సర్ ఇండియా సర్జో... ‘పారిస్’ క్రీడల్లో తాను పోటీపడుతున్న నాలుగు విభాగాల్లోనూ సెమీ ఫైనల్కు చేరింది. సాధారణంగా బ్రేక్డ్యాన్స్లో పాల్గొనే డాన్సర్లు ‘బి’ గర్ల్స్, ‘బి’ బాయ్స్ అని ఆసక్తికర పేర్లు వినియోగిస్తారు. కానీ 16 ఏళ్ల సర్జో మాత్రం తన అసలు పేరుతోనే పోటీల్లో దిగింది. ‘బి–గర్ల్ పేరు ఎందుకు పెట్టుకోలేదని చాలా మంది అడుగుతున్నారు. కానీ చిన్నప్పటి నుంచి నాకు అలాంటి ప్రత్యేకమైన పేరు ఎవరూ పెట్టలేదు. అందుకే ఇండియా పేరుతోనే బరిలోకి దిగుతున్నా’ అని సర్జో వెల్లడించింది. -
ప్రపంచ రికార్డు... పసిడి పతకం
పారిస్: ఒలింపిక్స్లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్ను ప్రవేశపెట్టి 40 ఏళ్లయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఈ విభాగంలో ఏ అథ్లెట్ వరుసగా రెండు స్వర్ణాలు సాధించలేదు. కానీ ‘పారిస్’లో అమెరికా క్రీడాకారిణి సిడ్నీ మెక్లాఫ్లిన్ లెవ్రోన్ ఈ ఘనత సాధించింది. టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకం గెలిచిన సిడ్నీ మెక్లాఫ్లిన్ అదే ఫలితాన్ని పారిస్లో పునరావృతం చేసింది. ఈసారి ఏకంగా కొత్త ప్రపంచ, ఒలింపిక్ రికార్డులను కూడా సృష్టించింది. శుక్రవారం జరిగిన 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 25 ఏళ్ల సిడ్నీ 50.37 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ, ఒలింపిక్ రికార్డులను నెలకొల్పింది. ఈ ఏడాది జూన్ 30న 50.65 సెకన్లతో తానే సాధించిన ప్రపంచ రికార్డును సిడ్నీ తిరగరాసింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో సిడ్నీ 51.46 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకం నెగ్గింది. ఈ సమయాన్ని కూడా ఆమె ‘పారిస్’లో అధిగమించింది. ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ విభాగంలో సిడ్నీ మెక్లాఫ్లిన్ ఐదుసార్లు కొత్త ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. -
పారిస్ ఒలింపిక్స్లో.. అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్టు! ఎంతంటే?
పారిస్ ఒలింపిక్స్లో చైనాకు చెందిన స్కేట్ బోర్డర్ జెంగ్ హావోహావో అత్యంత పిన్న వయస్కురాలైన ఒలింపియన్గా చరిత్ర సృష్టించింది. జెంగ్ వయసు పదకొండు సంవత్సరాలు. ఏడు సంవత్సరాల వయసులో స్కేట్ బోర్డింగ్ మొదలు పెట్టింది. 2022లో గ్వాంగ్డాంగ్ ్రపావిన్షియల్ గేమ్స్లో పార్క్ స్కేట్ బోర్డింగ్ ఈవెంట్లో జెంగ్ విజేతగా నిలిచింది. ‘వేగంగా నేర్చుకొని తనదైన శైలిలో ప్రతిభ ప్రదర్శించడం జెంగ్ సొంతం’ అంటున్నాడు జెంగ్ కోచ్. సరదాగా మొదలు పెట్టిన స్కేట్బోర్డింగ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జెంగ్కు పేరు తీసుకువచ్చింది. -
కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా
ఆ దేశ జనాభా సుమారు 25 కోట్లు. కానీ విశ్వక్రీడలైన ఒలింపిక్స్లో పాల్గొనేందుకు కేవలం ఏడుగురు అథ్లెట్లు మాత్రమే ఆ దేశం నుంచి ప్యారిస్ గడ్డపై అడుగుపెట్టారు. ఆ కొద్దిమందికి కూడా ఆర్థిక సహాయం అందించలేని దుస్థితి ఆ దేశానిది. అయితే వారిలో ఓ అథ్లెట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఒలింపిక్స్లో 40 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న పసిడి పతకాన్ని గెలిచి తమ దేశ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. తన విజయంతో కష్టాలతో కొట్టిమిట్టాడుతున్న దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపాడు. అతడే పాకిస్తాన్ బల్లెం వీరుడు అర్షద్ నదీమ్. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో జావెలిన్ త్రో ఈవెంట్లో పసిడి పతకాన్ని నదీమ్ సొంతం చేసుకున్నాడు. గురువారం జరిగిన ఫైనల్లో ఏకంగా జావెలిన్ను 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి గోల్డ్మెడల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ విశ్వవేదికపై సత్తాచాటిన నదీమ్ తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. నదీమ్ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.1ఎవరీ అర్షద్ నదీమ్?27 ఏళ్ల నదీమ్ జనవరి 2, 1997న పంజాబ్ ప్రావిన్స్లో ఖనేవాల్ అనే గ్రామంలో జన్మించాడు. నదీమ్కు ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు. అందులో అతడు మూడోవాడు. నదీమ్ తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. అతడొక్కడే ఆ కుటుంబానికి జీవనాధారం. దీంతో ఒకకానొక సమయంలో తిండికి కూడా నదీమ్ ఇబ్బంది పడిన దుస్థితి.కానీ నదీమ్ లక్ష్యానికి తన పేదరికం అడ్డు రాలేదు. తన చిన్నతనం నుంచే క్రీడాకారుడు కావాలని కలలు కన్నాడు. స్కూల్ డేస్లోనే క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్,అథ్లెటిక్స్ వంటి క్రీడలలో సత్తాచాటేవాడు. ముఖ్యంగా నదీమ్కు క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. క్రికెట్పై అతడి అభిరుచి జిల్లా స్ధాయిలో ఆడేలా చేసింది.నదీమ్ క్రికెట్తో పాటు అథ్లెటిక్స్ పోటీల్లో కూడా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలో ఓ అథ్లెటిక్స్ ఈవెంట్లో జావెద్ ప్రదర్శనకు కోచ్ రషీద్ అహ్మద్ సాకీ ఫిదా అయిపోయాడు. దీంతో అతడిని అథ్లెట్గా తీర్చిదిద్దాలని అహ్మద్ సాకీ నిర్ణయించుకున్నాడు. జావెలిన్ త్రోపై దృష్టి పెట్టడానికి ముందు నదీమ్ షాట్ పుట్, డిస్కస్ త్రోను ప్రాక్టీస్ చేసేవాడు.ఆ తర్వాత పూర్తిస్ధాయిలో జావెలిన్ త్రోయర్గా నదీమ్ మారాడు. వరుసగా పంజాబ్ యూత్ ఫెస్టివల్స్లో బంగారు పతకాలు, ఇంటర్-బోర్డ్ మీట్లతో సహా జాతీయ స్ధాయిలో సత్తాచాటాడు. అతడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సర్వీస్ అథ్లెటిక్స్ జట్ల నుండి ఆఫర్లు వచ్చాయి. అయినప్పటికీ ఆర్ధికంగా అర్షద్ నదీమ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఇదే సమయంలో 2016లో అతడికి వరల్డ్ అథ్లెటిక్స్ నుండి స్కాలర్షిప్ వచ్చింది.దీంతో మారిషస్లోని ఐఏఏఎఫ్ (IAAF) హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందేందుకు అవకాశం నదీమ్కు లభించింది. ఇదే అతడి కెరీర్కు టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం పతకం గెలిచి తన పేరును ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. అనంతరం అతడికి కొన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ తన ప్రయాణాన్ని మాత్రం నదీమ్ కొనసాగించాడు.2022 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం, 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్లో గోల్డ్మెడల్ సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో పాక్ తరపున వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్గా నదీమ్ నిలిచాడు.అదేవిధంగా జావెలిన్ను 92.97 మీటర్ల విసిరిన నదీమ్.. ఒలింపిక్స్లో ఈటెను అత్యధిక దూరం విసిరిన అథ్లెట్గా నిలిచాడు. అయితే నదీమ్ ఒలింపిక్స్ బంగారు పతక విజేతగా నిలవడంలో అతడి గ్రామ ప్రజల సాయం మరవలేనది. చాలా సందర్భాల్లో అతడికి ఖనేవాల్ ప్రజలు ఆర్ధికంగా సహాయం చేసి పోటీల్లో పాల్గొనేలా తోడ్పడ్డారు. -
కాంస్య పతకంతో వీడ్కోలు పలికిన భారత హాకీ లెజెండ్...
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. ఈ విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని భారత హాకీ జట్టు సొంతం చేసుకుంది. సెమీస్లో జర్మనీ చేతిలో పోరాడి ఓడిన టీమిండియా.. స్పెయిన్తో కాంస్య పతక పోరులో మాత్రం సత్తాచాటింది. 2-1 తేడాతో స్పెయిన్ ఓడించిన భారత జట్టు కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఇక ఈ చిరస్మరణీయ విజయంతో భారత స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు విడ్కోలు పలికాడు. కాగా తన రిటైర్మెంట్ విషయాన్ని ఒలింపిక్స్ ఆరంభానికి ముందే శ్రీజేశ్ ప్రకటించాడు.ఈ క్రమంలో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన పీఆర్ శ్రీజేష్కు సహచర ఆటగాళ్లు ఘన వీడ్కోలు పలికారు. ఆటగాళ్లంతా శ్రీజేష్కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తమ భుజాలపై ఎత్తుకొని గోల్ పోస్ట్ పోల్పై కూర్చోబెట్టారు. తమ హాకీ స్టిక్స్తో జేజేలు కొట్టారు. కాగా భారత్ కాంస్య పతకం సాధించడంలో శ్రీజేష్ది కీలక పాత్ర. ముఖ్యంగా బ్రిటన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో శ్రీజేష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్ బ్రిటన్కు ఎక్స్ట్రా గోల్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు.ఇక 2006లో సౌత్ ఆసియన్ గేమ్స్తో అరంగేట్రం చేసిన శ్రీజేష్.. ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్గా, గోల్కీపర్గా భారత్కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. రియో ఒలింపిక్స్లో భారత జట్టుకు శ్రీజేష్ సారథ్యం వహించాడు.2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హారీ జట్టులో శ్రీజేష్ సభ్యునిగా ఉన్నాడు. ఇది శ్రేజేష్కు నాలుగో ఒలింపిక్స్ కావడం గమనార్హం. అతడి కెరీర్లో రెండు ఆసియా గేమ్స్ బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2021లో శ్రేజేష్ 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు."నా ఆటను ముగించేందుకు ఇంతకంటే సరైన సమయం ఉండదు. మేం పతకంతో తిరిగి వెళుతున్నాం. కొందరు అభిమానులు నన్ను కొనసాగించమని కోరుతున్నారు. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. కొన్ని నిర్ణయాలు కఠినమైనవే అయినా వాటిని సరైన సమయంలో తీసుకోవడమే బాగుంటుంది. మా జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. టోక్యోలో గెలిచిన కాంస్యానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒలింపిక్స్లో మేం పతకం గెలవగలమనే నమ్మకాన్ని అది కల్పించిందని" తన రిటైర్మెంట్ ప్రకటనలో శ్రీజేష్ పేర్కొన్నాడు. -
ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్.. అర్షద్ నదీమ్కు భారీ నజరానా ప్రకటించిన పాక్
ఒలింపిక్ గోల్డ్ మెడల్ కోసం 40 ఏళ్లగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ సుదీర్ఘ నిరీక్షణకు స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ తెరదించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న అర్షద్ నదీమ్.. విశ్వవేదికపై తన జాతీయ జెండాను రెపాలపడించాడు. గురువారం జరిగిన ఫైనల్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టి స్వర్ణ పతకాన్ని ఈ పాకిస్తానీ కైవసం చేసుకున్నాడు. ఏకంగా జావెలిన్ను 92.97 మీటర్ల దూరం విసిరిన నదీమ్.. పసిడి పతకంతో పాటు అరుదైన ఒలింపిక్ రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.ఇక అర్షద్ గోల్డ్మెడల్ సాధించడంతో పాకిస్తాన్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. ఈ క్రమంలోసిద్ధిఖీ గోల్డెన్ బాయ్ నదీమ్కు కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ భారీ నజరానా ప్రకటించారు. సింధ్ ప్రావిన్స్ తరపున రూ.5 కోట్లు(పాకిస్తానీ కరెన్సీ)ను నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు వహాబ్ సిద్ధిఖీ వెల్లడించారు. అదేవిధంగా ఒలింపిక్స్ చరిత్రలోనే పాకిస్తాన్ తరపున వ్యక్తిగత విభాగంలో గోల్డ్మెడల్ గెలుచుకున్న తొలి అథ్లెట్ కూడా అర్షద్ కావడం విశేషం. -
చరిత్ర సృష్టించిన అర్షద్ నదీమ్.. ఒలింపిక్స్ హిస్టరీలోనే
ప్యారిస్ ఒలింపిక్స్లో పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పసడి పతకంతో మెరిశాడు. జావెలిన్ త్రో ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అర్షద్ నదీమ్ స్వర్ణపతకం కైవసం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. గురువారం ఆర్ధ రాత్రి దాటాక జరిగిన ఫైనల్లో తన జావెలిన్ను 92.97 మీటర్లు విసిరిన జావెద్ ..తొలి ఒలింపిక్స్ గోల్డ్మెడల్ను ముద్దాడాడు. ఫైనల్లో 27 ఏళ్ల జావెద్ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను వెనక్కినెట్టి అగ్రస్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. నీరజ్ చోప్రా జావెలిన్ను 89.45 మీటర్లు విసిరి రజత పతకం సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్రపంచ మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 88.54 మీటర్లతో కాంస్య పతకాన్ని సాధించాడు.చరిత్ర సృష్టించిన అర్షద్ నదీమ్..ఇక ఈ విశ్వక్రీడల్లో అర్షద్ నదీప్ గోల్డ్మెడల్తో పాటు మరో అరుదైన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒలింపిక్స్లో జావెలిన్ను అత్యధిక దూరం విసిరిన భల్లెం వీరుడుగా అర్షద్ రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు నార్వేకు చెందిన ఆండ్రియాస్ పేరిట ఉండేది. బీజింగ్ 2008 ఒలింపిక్స్లో ఆండ్రియాస్ 90.57 మీటర్లు విసిరి ఈ ఫీట్ సాధించాడు. అయితే ప్యారిస్ ఒలింపిక్స్లో 92.97 మీటర్లు విసిరిన జావెద్ ఆండ్రియాస్ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. అదేవిధంగా ఒలింపిక్స్ చరిత్రలోనే పాకిస్తాన్ తరపున వ్యక్తిగత విభాగంలో గోల్డ్మెడల్ గెలుచుకున్న తొలి అథ్లెట్గా అర్షద్ నిలిచాడు. ARSHAD NADEEM REWRITES OLYMPIC HISTORY WITH 9️⃣2️⃣.9️⃣7️⃣ Catch him in the Javelin final LIVE NOW on #Sports18 and stream for FREE on #JioCinema https://t.co/4IZVAsktjp#OlympicsOnJioCinema #OlympicsOnSports18 #Olympics #JavelinThrow #Athletics pic.twitter.com/5gP5iRHgph— JioCinema (@JioCinema) August 8, 2024 -
దేశం మొత్తం గర్విస్తోంది.. నీరజ్కు ప్రధాని మోదీ అభినందనలు
ప్యారిస్ ఒలింపిక్స్లో భారత ఖాతాలో తొలి రజత పతకం వచ్చి చేరింది. జావెలిన్ త్రో ఈవెంట్లో భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. గురువారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో జావెలిన్ను 89.45 మీటర్లు విసిరిన నీరజ్.. రెండో స్ధానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. "నీరజ్ చోప్రా ఒక అద్భుతమైన అథ్లెట్. మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. అతడి కెరీర్లో మరో ఒలింపిక్ మెడల్ చేరడం పట్ల యావత్తు భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. రజత పతకం సాధించినందుకు నిరాజ్కు అభినందనలు. ఎంతో మంది యువ అథ్లెట్లకు నీరాజ్ ఆదర్శమని" ఎక్స్లో మోదీ ప్రశంసించారు. ఇక ఈ జావెలిన్ త్రో ఈవెంట్లో పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. నదీమ్ జావెలిన్ను 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ తన ఖాతాలో వేసుకున్నాడు. Neeraj Chopra is excellence personified! Time and again he’s shown his brilliance. India is elated that he comes back with yet another Olympic success. Congratulations to him on winning the Silver. He will continue to motivate countless upcoming athletes to pursue their dreams… pic.twitter.com/XIjfeDDSeb— Narendra Modi (@narendramodi) August 8, 2024 -
నేను అలసిపోయాను!
‘‘అమ్మలాంటి రెజ్లింగ్ నా మీద గెలిచింది. నేనేమో ఓడిపోయాను. దయచేసి... మీరంతా నన్ను క్షమించండి. మీ కలలు, నా ధైర్యం అన్నీ ముక్కలయ్యాయి. ఇకపై నాకు పోరాడే శక్తి లేదు. గుడ్బై రెజ్లింగ్ 2001–2024. నన్ను అభిమానించిన, మద్దతు తెలిపిన మీ అందరికీ నేనెప్పుడు రుణపడే ఉంటాను’’... కుస్తీనే లోకంగా, ఒలింపిక్స్ పతకమే ధ్యేయంగా ఎదిగి... ఇంటా బయటా క్రీడ, క్రీడేతర శక్తులతో పోరాడిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఈ రిటైర్మెంట్ నిర్ణయంతో మళ్లీ మన గుండెల్ని బరువెక్కించింది. పారిస్: సెమీస్లో గెలిచి... ఫైనల్కు ముందు 100 గ్రాముల తేడాతో అనర్హతకు గురైన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మళ్లీ మ్యాట్పైకి దిగే ఉద్దేశం లేదని ప్రకటించింది. రెజ్లింగ్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని గురువారం 29 ఏళ్ల వినేశ్ వెల్లడించింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఎఎస్) అప్పీలుకు సైతం వెళ్లిన ఆమె తీర్పు వెలువడక ముందే అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది. అలసిపోయిన తనకు ఇకపై కుస్తీలో ప్రత్యర్థులను పట్టుపట్టే బలం లేదంటూ గురువారం సోషల్ మీడియా వేదికగా గుడ్బై చెప్పింది. ఊహించని ఆమె నిర్ణయానికి భారత క్రీడాలోకం నిర్ఘాంతపోయింది. ఆమెను పోరాట యోధురాలిగా చూసిన క్రీడాకారులంతా వారిస్తున్నారు. ఆమెను అభిమానించే వారంతా రెజ్లర్ అధైర్యపడొద్దని వేడుకొంటున్నారు. తల్లిలాంటి రెజ్లింగ్పై తన ఉక్కు సంకల్పం సడలించవద్దని అదేపనిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వినేశ్ పెదనాన్న ద్రోణాచార్య అవార్డీ, కోచ్ మహావీర్ ఫొగాట్ మాట్లాడుతూ భారత్కు చేరగానే తనతో మాట్లాడి వీడ్కోలు నిర్ణయాన్ని విరమించుకునేలా చేస్తానని తెలిపారు. ‘నేను బజరంగ్ పూనియా, గీత కలిసి కూర్చొని అమెతో మాట్లాడతాం. అంతా కలిసి ఆమెకు నచ్చజెబుతాం. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ కోసం లక్ష్య నిర్దేశం చేస్తాం’ అని మహావీర్ అన్నారు. వినేశ్ పోటీపడ్డ ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన సారా హిల్డర్బ్రంట్ (అమెరికా) మాట్లాడుతూ ‘వినేశ్ అనర్హతకు గురవడం బాధాకరం. బరువు తగ్గడం కోసం పడే పాట్లు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అమె కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను’ అని పేర్కొంది. కల కాదు... ఆమెకు ఒలింపిక్స్ ఓ పీడకల! ప్రపంచ చాంపియన్íÙప్లు, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో మంచి రికార్డే ఉన్న వినేశ్కు ఏ ఒలింపిక్స్ కూడా అచ్చి రాలేదు. అందుకే ఆమె కెరీర్లో ఒలింపిక్స్ కల కాదు ఓ పీడకలగా మిగిలిపోయింది. 2016 రియో ఒలింపిక్స్లో కీలకమైన క్వార్టర్ ఫైనల్ బౌట్లో గాయం వల్ల ముందంజ వేయలేకపోయింది. మళ్లీ ఐదేళ్ల (కోవిడ్ వల్ల 2021లో) తర్వాత టోక్యో విశ్వక్రీడల్లో క్వార్టర్స్లోనే ఓటమితో ని్రష్కమించింది. ఇప్పుడు మూడేళ్లకే జరిగిన పారిస్ ఈవెంట్లో కనీసం ఖాయమనుకున్న రజతాన్ని అనర్హత వేటు అవహేళన చేసింది. క్రీడ అనేది మానవ సంకల్పానికి వేడుకలాంటింది. నా కెరీర్లో ఇలాంటి సందర్భాల్ని, వేడుకల్ని చాలాసార్లు చవిచూశాను. వినేశ్ సంకల్పానికి దేశం ఒక్కటై పలికిన జేజేలను మాత్రం ఎప్పుడూ చూడలేదు. పట్టు సడలించని ఆమె సంకల్పాన్ని జాతి యావత్తు వేడుక చేసుకుంటోంది. –అభినవ్ బింద్రా, షూటింగ్లో బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత క్రీడాకారులు జీవితమంతా సవాళ్లతోనే సహవాసం చేస్తారు. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూస్తారు. కలను నెరవేర్చుకునే రోజు నైపుణ్యంతో రాణిస్తే విజయం చేకూరుతుంది. కానీ ఊహకందని ఈ పొరపాట్లు (స్వల్ప బరువుతో అనర్హత) జరిగితే మాత్రం ఎవరికైనా గుండె బద్దలవుతుంది. –కేంద్ర క్రీడల మాజీ మంత్రి, షూటర్ రాజ్యవర్ధన్ రాథోడ్ మేమంతా వినేశ్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. కఠోర సాధనతో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ (2028)లో స్వర్ణం గెలిచి మా పిన్ని (వినేశ్ తల్లి), మా నాన్న మహావీర్ కలల్ని సాకారం చేసుకుంటుంది. ఇంటికొచ్చాక నాన్న ఆమెతో మాట్లాడి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తారు. –మాజీ రెజ్లర్ బబితా ఫొగాట్ వినేశ్... అంతపని (రిటైర్మెంట్) చేయొద్దు. బాధలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తగదు. నేను భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తరఫున ఆమె వీడ్కోలుకు బై చెప్పి ఎప్పట్లాగే బౌట్లో సత్తాచాటాలని విజ్ఞప్తి చేస్తున్నాను. –డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్ వినేశ్ ప్రొఫైల్ -
కాంస్యం కోసం అమన్ పోరు
పారిస్: ఒలింపిక్స్లో పాల్గొంటున్న తొలి ప్రయత్నంలోనే పతకం సొంతం చేసుకునేందుకు భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఒక విజయం దూరంలో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో అమన్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత రె హిగుచి (జపాన్)తో జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల అమన్ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో పరాజయం చవిచూశాడు. మూడు నిమిషాల నిడివిగల తొలి భాగంలో 2 నిమిషాల 14 సెకన్లలో రె హిగుచి 10–0తో ఆధిక్యాన్ని సంపాదించడంతో రిఫరీ బౌట్ను ముగించాడు. ఇద్దరి రెజ్లర్ల మధ్య 10 పాయింట్ల తేడా వచ్చిన వెంటనే రిఫరీ బౌట్ను నిలిపి వేసి పది పాయింట్ల ఆధిక్యం సాధించిన రెజ్లర్ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. నేడు జరిగే కాంస్య పతక బౌట్లో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్తో అమన్ తలపడతాడు. రెండు ఘనవిజయాలతో... అంతకుముందు అమన్ రెండు వరుస ఘనవిజయాలతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో అమన్ 3 నిమిషాల 59 సెకన్లలో 10–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో వ్లాదిమిర్ ఇగొరోవ్ (నార్త్ మెసడోనియా)ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో అమన్ 3 నిమిషాల 56 సెకన్లలో 12–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అబాకరోవ్ జెలీమ్ ఖాన్ (అల్బేనియా)పై గెలుపొందాడు. అబాకరోవ్ 2022 ప్రపంచ చాంపియన్షిప్లో 57 కేజీల విభాగంలో స్వర్ణం, 2023 ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్యం సాధించడం విశేషం. అమన్ తన సహజశైలిలో ఆడితే నేడు జరిగే కాంస్య పతక బౌట్లో దరియన్పై నెగ్గడం అంత కష్టమేమీ కాదు. అన్షు తొలి రౌండ్లోనే... మహిళల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అన్షు మలిక్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. హెలెన్ లూసీ మరూలిస్ (అమెరికా)తో జరిగిన బౌట్లో అన్షు 2–7 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. అయితే హెలెన్ ఫైనల్ చేరుకోకపోవడంతో అన్షుకు రెపిచాజ్ రూపంలో కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం చేజారింది. భారత్ ః పారిస్ ఒలింపిక్స్నాలుగో స్థానంలో నిలిచిన ప్లేయర్లులక్ష్య సేన్బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్అంకిత భకత్–బొమ్మదేవర ధీరజ్ఆర్చరీ మిక్స్డ్ టీమ్ మహేశ్వరీ చౌహాన్–అనంత్జీత్ సింగ్ షూటింగ్ స్కీట్ మిక్స్డ్ టీమ్ అర్జున్ బబూతాషూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్మనూభాకర్ షూటింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ 10 మీటర్ల వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో రెండు కాంస్యాలు గెలిచింది.మీరాబాయి చానూవెయిట్ లిఫ్టింగ్ మహిళల 49 కేజీలు ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం...పారిస్ ఒలింపిక్స్లో అదృష్టం కూడా కలిసి వచ్చి ఉంటే భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటేది. ఇప్పటికే ఐదు పతకాలు నెగ్గిన భారత్ త్రుటిలో నాలుగు కాంస్య పతకాలను కోల్పోయింది. షూటర్లు అదరగొట్టగా... ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్లిఫ్టింగ్లో మనవాళ్లు నిరాశ పరిచారు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న ఆటగాళ్లు తడబడగా... మరో ఆరుగురు ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో మెడల్ చేజార్చుకున్నారు. -
పడి.. లేచి.. మరో పతకం వైపు...
2023 మార్చి... సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్లో భారత జట్టు అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. పేలవ ఆటతో సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచిన టీమ్... గతంలో ఏ ఆతిథ్య జట్టూ ఎదుర్కోని అవమానాన్ని భరించాల్సి వచ్చింది. దాంతో మరోసారి భారత హాకీ పాత రోజులు గుర్తుకొచ్చాయి. దాదాపు రెండేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన జట్టు ఇదేనా అనిపించింది. అప్పుడప్పుడే మళ్లీ ఆటపై ఆసక్తి పెరుగుతున్న దశలో స్వదేశంలో జట్టు ఆట మళ్లీ నిరాశపర్చింది. దాంతో సహజంగానే జరిగిన మార్పుల్లో భాగంగా ముందుగా కోచ్ గ్రాహం రీడ్పై వేటు పడింది. కొత్త కోచ్గా దక్షిణాఫ్రికాకు చెందిన క్రెయిగ్ ఫుల్టన్ వచ్చాడు. ఆటగాడిగా, కోచ్గా విశేష అనుభవం ఉన్న అతను భారత జట్టును మళ్లీ దారిలోకి తీసుకురాగలడని అంతా భావించారు. ఈ నమ్మకాన్ని ఫుల్టన్ నిలబెట్టుకున్నాడు. తనదైన శైలిలో ఆటగాళ్లను మరింత పదునుగా మార్చే పనిలో పడ్డాడు. అప్పటికే సీనియర్లుగా దేశం తరఫున ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్లు ఆడిన వారిని కూడా తనకు కావాల్సిన రీతిలో మలచుకున్నాడు. ముఖ్యంగా అవుట్ఫీల్డ్లో వేగం పెంచడం, ఆరంభం నుంచే దూకుడు పెంచి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడంవంటి విషయంలో ఆటగాళ్లలో కొత్త తరహా ఆటను తీసుకొచ్చాడు. ముందుగా ఆటగాళ్లు కొంత ఇబ్బంది పడ్డా మెల్లగా ఇవి మంచి ఫలితాలు అందించాయి.ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో స్వర్ణాలు గెలిచిన భారత్ ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఆటగాళ్లందరిలోనూ కొత్త ఉత్సాహం కనిపించింది. వరల్డ్ కప్ వైఫల్యాన్ని దాటి మున్ముందు పెద్ద విజయం సాధించాలనే కసి, పట్టుదల వారిలో పెరిగాయి. ఒలింపిక్స్లో భారత జట్టు ఆట చూస్తే ఫుల్టన్ ప్రణాళికలు ఎంత అద్భుతంగా పని చేశాయో తెలుస్తుంది. సరిగ్గా చెప్పాలంటే ఒకే తరహా ఆటతో కాకుండా వేర్వేరు ప్రత్యర్థుల కోసం జట్టు వేర్వేరు వ్యూహాలు పన్నింది. బెల్జియం జట్టు తమ డిఫెన్స్ను పటిష్టంగా ఉంచుకుంటూనే దూకుడుగా ఆడింది. అదే ఆ్రస్టేలియాపై వచ్చేసరికి ఆట మారింది. క్షణకాలం డిఫెన్స్లో పడినా ప్రత్యర్థి పైచేయి సాధిస్తుందని తెలుసు కాబట్టి తొలి నిమిషం నుంచి పూర్తిగా అటాకింగ్పైనే దృష్టి పెట్టింది. మళ్లీ బ్రిటన్తో మ్యాచ్ వచ్చేసరికి డిఫెన్స్కు కట్టుబడింది. ఒక ఆటగాడు తగ్గినా కీపర్తో కలిసి గోల్స్ను కాపాడుకోవడంలో జట్టు సఫలమైంది. సెమీస్లో జర్మనీతో ఓడినా గతంలో ఎన్నడూ చూడని అటాకింగ్, ఓటమిని అంగీకరించకుండా పోరాడే తత్వం మన టీమ్ నుంచి కనిపించిందని మాజీ ఆటగాడు వీరేన్ రస్కిన్హా వ్యాఖ్యానించడం విశేషం. క్షణాల వ్యవధిలో వ్యూహాలు మార్చుకోవడం, పరిస్థితికి అనుగుణంగా అప్పటికప్పుడు ఆటతీరును మలచుకోవడం గతంలో భారత జట్టు విషయంలో ఎప్పుడూ చూడనిది. భారత జట్టు గెలుపు మరో వ్యక్తి ప్రధాన పాత్ర పోషించాడు. అతనే ప్యాడీ ఆప్టన్. స్పోర్ట్స్ సైకాలిజిస్ట్ అయిన ఆప్టన్ భారత హాకీ ఆటగాళ్లను మానసికంగా సంసిద్ధం చేయడంలో, ఒత్తిడిని ఎదుర్కోకుండా బలంగా నిలబడే విషయంలో సరైన దిశలో తీర్చిదిద్దాడు. 2011లో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన సమయంలో భారత జట్టు ఇదే ఆప్టన్ స్పోర్ట్స్ సైకాలజిస్ట్గా వ్యవహరించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కోచ్ల వ్యూహాలను అమలు చేసే విషయంలో ఆటగాళ్లు ఎక్కడా గతి తప్పలేదు. ఒలింపిక్స్తో రిటైర్ అవుతున్న గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడలా ప్రత్యర్థులను నిలువరించాడు. ఎనిమిది మ్యాచ్లలో అతను 62 షాట్లను ఎదుర్కొంటే 50 షాట్లను ఆపడం విశేషం. కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ పెనాల్టీలను గోల్స్గా మలచడంలో అద్భుత నైపుణ్యం చూపిస్తూ ఒలింపిక్స్లో 10 గోల్స్ నమోదు చేశాడు. డిఫెండర్లు రోహిదాస్, జర్మన్ప్రీత్లు అద్భుతంగా ప్రత్యర్థి ఆటగాళ్లను అడ్డుకున్నారు. అత్యంత సీనియర్ అయిన మాజీ కెపె్టన్ మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్ మిడ్ఫీల్డ్లో తన పదును చూపించగ, మరో సీనియర్ మన్దీప్ ఫార్వర్డ్గా జట్టును నడిపించాడు. అందరి సమష్టి ప్రదర్శన, పోరాటం, పట్టుదల భారత్కు వరుసగా రెండో కాంస్యాన్ని అందించాయి. గత టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత జట్టులోని 11 మంది సభ్యులు ‘పారిస్’లోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. –సాక్షి క్రీడా విభాగం జ్యోతికి మళ్లీ నిరాశ పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ నిరాశ పరిచింది. గురువారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రేసులో జ్యోతి నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. అంతకుముందు బుధవారం హీట్స్లో ఏడో స్థానంలో నిలిచిన జ్యోతి... రెపిచాజ్లోనూ ఆకట్టుకోలేకపోయింది. ఈ విభాగంలో పోటీ పడుతున్న తొలి భారతీయ అథ్లెట్గా గుర్తింపు పొందిన జ్యోతి 13.17 సెకన్లలో గమ్యానికి చేరింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన 24 ఏళ్ల జ్యోతి గతంలో 12.78 సెకన్లతో 100 మీటర్ల హర్డిల్స్లో జాతీయ రికార్డు నెలకొల్పింది. వెనుకంజలో గోల్ఫర్లు పారిస్ ఒలింపిక్స్ గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో భారత గోల్ఫర్లు ఆకట్టుకోలేకపోయారు. గురువారం రెండు రౌండ్లు ముగిసేసరికి దీక్ష డాగర్, అదితి అశోక్ చెరో 143 పాయింట్లతో మరో ముగ్గురు గోల్ఫర్లతో కలిసి సంయుక్తంగా 14వ స్థానంలో ఉన్నారు. -
వహ్వా హాకీ.. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు కాంస్య పతకం
టోక్యోలో అద్భుత ఆటతో అదరగొట్టిన భారత హాకీ జట్టు పారిస్ వరకు దానిని కొనసాగించింది. నాటి విజయం తర్వాత అంచనాలను పెంచిన మన టీమ్ ఈసారి కూడా దానికి తగినట్లుగా పతకాన్ని అందించింది. వరుసగా రెండో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించి తమ సత్తాను చాటింది. 1952–1972 మధ్య వరుసగా ఒలింపిక్ మెడల్ పోడియంపై నిలిచిన భారత జట్టు ఆ తర్వాత ఎప్పుడూ వరుసగా రెండు ఒలింపిక్స్లలో పతకాలు గెలవలేకపోయింది. ఈసారి మాత్రం గత ఒలింపిక్స్ కాంస్యపు ప్రదర్శనను పునరావృతం చేసింది. రెండు సందర్భాల్లోనూ జట్టు విజయాల్లో కీలకంగా నిలిచిన గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఈ గెలుపు తర్వాత ఘనంగా తన అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఓవరాల్గా ఒలింపిక్స్ చరిత్రలో భారత హాకీకిది 13వ పతకం కావడం విశేషం. పారిస్: మ్యాచ్లో 58 నిమిషాలు ముగిసేసరికి 2–1తో ఆధిక్యంలో భారత్... మరో రెండు నిమిషాలు బంతిపై పట్టు ఉంచుకుంటే చాలు మ్యాచ్ మనదే... అయితే సరిగ్గా 59వ నిమిషంలో స్పెయిన్కు పెనాల్టీ కార్నర్ లభించింది. దాంతో అందరిలో కాస్త ఆందోళన... గతంలో చాలా సందర్భాల్లో భారత జట్టు గెలిచే స్థితిలో ఉండి ఆఖరిలో పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్స్ ఇచ్చి మ్యాచ్ కోల్పోయింది. కాబట్టి కొంత ఉత్కంఠ! అయితే స్పెయిన్ ప్లేయర్ మిరాల్స్ ప్రయత్నాన్ని భారత గోల్ కీపర్ శ్రీజేశ్ అడ్డుకున్నాడు. ఆ వెంటనే 60వ నిమిషంలో కూడా వారికి మరో పెనాల్టీ కార్నర్. ఈసారి కూడా శ్రీజేశ్ నిలువరించాడు. దాంతో పాటు చురుగ్గా ఉన్న మన ఆటగాళ్లు బంతిని అందుకొని తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. స్పెయిన్ ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించినా మళ్లీ మన సర్కిల్లోకి రాలేకపోయారు. అంతే... టీమిండియా బృందంలో సంబరాలు మొదలయ్యాయి. శ్రీజేశ్ తన కీపింగ్ పోస్ట్ వద్ద కుప్పకూలిపోగా... సహచరులంతా చుట్టుముట్టి తమ ఆనందాన్ని ప్రదర్శించారు. సెమీస్లో అనూహ్యంగా ఓడినా... చివరకు కాంస్య పతకం గెలుచుకొని భారత జట్టు తమ స్థాయిని ప్రదర్శించింది. ఈ ‘ప్లే ఆఫ్’ పోరులో భారత్ 2–1 గోల్స్ తేడాతో స్పెయిన్పై విజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ 2 గోల్స్ (30వ నిమిషం, 33వ నిమిషం) సాధించగా... స్పెయిన్ తరఫున మార్క్ మిరాల్స్ (18వ నిమిషం) ఏకైక గోల్ కొట్టాడు. తాజా ఫలితంతో పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ ఖాతాలో నాలుగో కాంస్యం చేరింది. సమష్టి ప్రదర్శనతో... 1980 తర్వాత ఒలింపిక్స్లో పతకం సాధించలేకపోయిన భారత్ 41 ఏళ్ల తర్వాత టోక్యోలో కాంస్యం గెలిచి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ అదే తరహాలో భారతీయుల నమ్మకాన్ని జట్టు వమ్ము చేయలేదు. అటు అటాకింగ్లో, ఇటు డిఫెన్స్లో కూడా జట్టు ప్రభావం చూపించింది. సస్పెన్షన్ కారణంగా గత మ్యాచ్ ఆడని డిఫెండర్ అమిత్ ఈ మ్యాచ్లో తిరిగొచ్చి బలంగా నిలబడ్డాడు. 6వ నిమిషంలో సుఖ్జీత్కు గోల్ అవకాశం వచ్చినా అతను పోస్ట్కు దూరంగా కొట్టాడు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా పోరాడటంతో గోల్ నమోదు కాలేదు. అయితే రెండో క్వార్టర్లో స్పెయిన్ శుభారంభం చేసింది. క్లేప్స్ను టాకింగ్ చేసే ప్రయత్నంలో ‘డి’లో మన్ప్రీత్ ఫౌల్ చేయడంతో స్పెయిన్ పెనాల్టీ స్ట్రోక్ లభించగా, దానిని మిరాల్స్ సులువుగా గోల్గా మలిచాడు. అయితే 21 సెకన్లలో రెండో క్వార్టర్ ముగుస్తుందనగా పెనాల్టీతో భారత్ స్కోరు సమం చేసింది. మరో మూడు నిమిషాలకే మళ్లీ పెనాల్టీ ద్వారానే హర్మన్ స్కోరు చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మన జట్టు దానిని చివరి వరకు నిలబెట్టుకోగా... ఆఖరి మూడు నిమిషాల్లో గోల్ కీపర్ను తప్పించి స్కోరును సమం చేసేందుకు స్పెయిన్ తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. తమకు లభించిన 6 పెనాల్టీ కార్నర్లను భారత్ 2 గోల్స్తో సద్వినియోగం చేసుకోగా... స్పెయిన్కు 9 పెనాల్టీలు లభించినా ఆ జట్టు ఒక్కదానినీ గోల్గా మలచలేకపోయింది.‘గ్రేట్ వాల్ ఆఫ్ భారత్’ శ్రీజేశ్ అద్భుత ప్రదర్శనే అందుకు కారణం. ఈ మ్యాచ్తో అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు శ్రీజేశ్ ముందే ప్రకటించాడు. అతనికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్లు జట్టు సభ్యులు వెల్లడించారు. ఒక్కొక్కరికీ 15 లక్షలు ప్లేయర్లకు హాకీ ఇండియా నజరానా పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి ఏడున్నరల లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు హాకీ ఇండియా వెల్లడించింది. ఒలింపిక్స్ హాకీలో ఘనచరిత్ర ఉన్న భారత్కు విశ్వక్రీడల్లో ఇది 13వ పతకం కావడం విశేషం. నెదర్లాండ్స్కు స్వర్ణం 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో నెదర్లాండ్స్ పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో నెదర్లాండ్స్ ‘పెనాల్టీ షూటౌట్’లో 3–1తో జర్మనీ జట్టుపై గెలిచింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. గతంలో నెదర్లాండ్స్ జట్టు 1996 అట్లాంటా, 2000 సిడ్నీ ఒలింపిక్స్లలో పసిడి పతకాలు సాధించింది. భారత జట్టు అత్యధికంగా 8 స్వర్ణాలు నెగ్గగా... నెదర్లాండ్స్, పాకిస్తాన్, బ్రిటన్, జర్మనీ జట్లు మూడు సార్లు చొప్పున బంగారు పతకాలు గెలిచాయి. నా ఆటను ముగించేందుకు ఇంతకంటే సరైన సమయం ఉండదు. మేం పతకంతో తిరిగి వెళుతున్నాం. కొందరు అభిమానులు నన్ను కొనసాగించమని కోరుతున్నారు. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. కొన్ని నిర్ణయాలు కఠినమైనవే అయినా వాటిని సరైన సమయంలో తీసుకోవడమే బాగుంటుంది. మా జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. టోక్యోలో గెలిచిన కాంస్యానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒలింపిక్స్లో మేం పతకం గెలవగలమనే నమ్మకాన్ని అది కల్పించింది. –పీఆర్ శ్రీజేశ్ కాంస్యపతక పోరు మాకూ, మా దేశానికి ఎంతో కీలకం. ఒలింపిక్స్లో పోటీ పడేందుకు ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఫలితం మనకు అనుకూలంగా రాదు. భారత్ వరుసగా రెండు సార్లు పతకం సాధించడం గొప్ప విషయం. ఇది అంత సులువు కాదు. పెనాల్టీ కార్నర్లను మా బృందం చాలా అద్భుతంగా నిలువరించగలిగింది. హాకీపై ఆదరణ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా. –హర్మన్ప్రీత్ సింగ్, కెప్టెన్ఎన్నో తరాల పాటు గుర్తుంచుకునే ప్రదర్శన ఇది. భారత హాకీ జట్టు ఒలింపిక్ కాంస్యంతో మెరిసింది. ఇది వరుసగా రెండో పతకం కావడం మరింత ప్రత్యేకం. ప్రతిభ, పట్టుదలకు తోడు సమష్టి కృషి దీనిని అందించింది. ఆటగాళ్లకు నా అభినందనలు. ప్రతీ భారతీయుడికి మానసికంగా హాకీతో బలమైన బంధం ఉంది. ఈ విజయం వల్ల యువతలో ఆటపై మరింత ఆసక్తి పెరుగుతుంది. –నరేంద్ర మోదీ, ప్రధాని Harmanpreet Singh has 10 goals from 8 matches at the Paris Olympics. 🥶🇮🇳pic.twitter.com/Y7sxmI5jDF— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2024One of the crucial saves of PR Sreejesh. 🫡🇮🇳pic.twitter.com/2Qw7MghpqY— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2024 -
Paris Olympics 2024: సెమీస్కు చేరిన అమన్ సెహ్రావత్.. పతకానికి అడుగు దూరంలో..!
పారిస్ ఒలింపిక్స్ పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ సెమీఫైనల్కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో సెహ్రావత్.. అల్బేనియాకు చెందిన జెలిమ్ఖాన్ అబాకరోవ్పై 12-0 తేడాతో గెలుపొందాడు. AMAN SEHRAWAT, THE NEW HERO OF INDIAN WRESTLING. 🌟🔥 pic.twitter.com/rafzNRz9q4— Johns. (@CricCrazyJohns) August 8, 2024ఇవాళ (ఆగస్ట్ 8) రాత్రే జరిగే సెమీఫైనల్లో సెహ్రావత్.. జపాన్కు చెందిన రె హిగుచితో తలపడతాడు. ఈ బౌట్లో సెహ్రావత్ గెలిస్తే భారత్కు మరో పతకం ఖాయమవుతుంది. భారత కాలమానం ప్రకారం సెమీఫైనల్ బౌట్ రాత్రి 9:45 గంటలకు ప్రారంభమవుతుంది. -
Paris Olympics 2024: భారత రెజ్లర్పై మూడేళ్ల నిషేధం
పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్పై భారత ఒలింపిక్ సంఘం (IOA) చర్యలు తీసుకుంది. అంతిమ్పై మూడేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది. అంతిమ్తో పాటు ఆమె సహాయక సిబ్బంది మొత్తాన్ని తక్షణమే స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘం ఆదేశించింది. అంతిమ్ అక్రిడేషన్పై ఆమె సోదరి ఒలింపిక్ విలేజ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐఓఏ అంతిమ్పై సస్పెన్షన్ వేటు వేసింది. 19 ఏళ్ల అంతిమ్ ఒలింపిక్స్ తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. టర్కీ రెజ్లర్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. -
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్కు చేరిన భారత రెజ్లర్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ క్వార్టర్ ఫైనల్కు చేరాడు. ఇవాళ (ఆగస్ట్ 8) జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో సెహ్రావత్.. ఉత్తర మాసిదోనియాకు చెందిన వ్లాదిమిర్ ఎగొరోవ్పై 10-0 తేడాతో గెలుపొందాడు. ఏకపక్షంగా సాగిన ఈ బౌట్లో సెహ్రావత్ ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ఇవాళే జరిగే క్వార్టర్ ఫైనల్లో సెహ్రావత్.. జెలిమ్ఖాన్ అబాకరోవ్ లేదా దియామ్యాంటినో లూనా ఫఫేతో తలపడతాడు. -
రాజ్యసభలో వినేశ్ ఫొగట్ అంశం .. విపక్షాలపై ధన్ఖడ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజ్యసభ్య నుంచి ఇండియా కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు వేయడంపై చర్చకు అనుమతించకపోవడంతో ఇండియా కూటమి సభ్యులు రాజ్యసభ్య నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు నాలుగో పతకం ఖాయమైన తర్వాత బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో తలపడాల్సిన మన రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు పడింది. పోరుకు కొన్ని గంటల ముందు నిర్వహించే వెయింగ్లో ఆమె బరువు 50 కేజీల 100 గ్రాములుగా వచ్చింది. ఉండాల్సిన బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువుంది. దాంతో నిబంధనల ప్రకారం ఆమెను డిస్క్వాలిఫై చేస్తు న్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో గురువారం రాజ్యసభలో వినేశ్ ఫొగాట్ డిస్క్వాలిఫై అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఒక్కరికే (ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ) హృదయం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. దేశం మొత్తం ఆమె పరిస్థితి చూసి బాధపడుతోంది. మీరిలా ప్రతీ (ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై) అంశాన్ని రాజకీయం చేస్తే ఆమెను అవమానించినట్లు కాదా అని వ్యాఖ్యానించారు. ప్రతి స్పందనగా విపక్షనేతలు నినాదాలు చేయడంతో.. ఆగ్రహించిన ధన్కర్ కుర్చీలోంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం, సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఇండియా కూటమి నేతలు ప్రకటించారు. #WATCH | Congress MP Deepender Hooda says, "Vinesh has not lost but she has won the hearts of crores of people. The sports system has lost. The government should give her all the facilities that are given to a gold medallist... Today a Rajya Sabha seat is vacant (in Haryana), we… pic.twitter.com/456mQEYea5— ANI (@ANI) August 8, 2024వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ అనర్హతకు సంబంధించిన అంశంపై చర్చించాలని మేము కోరాం. కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు అని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై కావడంతో వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె రిటైర్మెంట్పై స్పందించిన తివారీ.. ఆశ కోల్పోవద్దని, దేశం మొత్తం ఆమెకు అండగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. -
పతకం లేకపోతేనేమి.. నువ్వే మా బంగారం!
వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరి ఒలింపిక్ పతకం ఖాయం చేసుకున్న సమయాన దేశం మొత్తం పులకించింది. ప్రజలంతా ‘దేశ్ కీ బేటీ’ గెలుపును తమ గెలుపుగా భావించారు. ఆమెను ఒక్క క్రీడాకారిణిగానే కాకుండా ఒక పోరాట యోధురాలిగా చూశారు. గత ఏడాదిన్నర కాలంగా వినేశ్ వ్యవస్థతో పోరాడటం, ఆపై మళ్లీ బరిలోకి దిగి విజయాలు సాధించిన తీరు ఫొగాట్పై ఆదరణను పెంచాయి. ఫైనల్ చేరినప్పుడు వచ్చిన స్పందన దానినే ప్రతిఫలించింది. ఎవరు గెలిచినా గెలవకపోయినా వినేశ్ పతకం గెలిస్తే చాలనుకున్నారు. ఇప్పుడు పతకం చేజారడం కూడా అంతే స్థాయిలో ఆవేదనను కలిగించింది. అందుకే అన్ని వైపుల నుంచి బాధతో కూడిన స్పందనలు. ఇదీ వినేశ్ సంపాదించుకున్న అభిమాన ధనం! ఒక్కసారి కొంత వెనక్కి వెళ్లి చూస్తే రెజ్లింగ్ ప్రపంచంలో ఆమె ఎన్నో పెద్ద విజయాలు అందుకుంది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్షిప్లలో పతకాలు మాత్రమే కాదు వరల్డ్ చాంపియన్íÙప్లలో కూడా ఆమె రెండు పతకాలు గెలుచుకుంది. ఢిల్లీలో నిరసనల సమయంలో ఆమె తెగింపును, రెజ్లింగ్ పెద్దలతో తలపడిన ఘటనలను చూస్తే కెరీర్ను ముగించడానికే సిద్ధపడినట్లుగా అనిపించింది. ఆ సమయంలో మరో ఒలింపిక్ ప్రయత్నం అవకాశాలు కూడా కనిపించలేదు. కానీ నాటి ఘటనలు ఆమెలో మరింత పట్టుదలను పెంచాయి. తాను పోరాడుతోంది తన కోసం కాదని, సహచర మహిళా రెజ్లర్ల కోసమని నినదించిన వినేశ్ ఆ పోరాటంలో కొంత వరకు సఫలమైంది. కానీ అక్కడితే ఆగిపోతే రాజకీయాలు మొదలవుతాయని ఆమెకు అర్థమైంది. అందుకే మళ్లీ ఆటలోకి దిగేందుకు నిశ్చయించుకుంది. కెరీర్లో మిగిలిన ఒలింపిక్ పతకం కోసం ఆమె ఎంతో శ్రమించింది. వెయిట్ కేటగిరీలో మార్చుకొని మరీ ప్రయాణాన్ని కొత్తగా మొదలు పెట్టింది. మధ్యలో గాయాలు ఎదురైనా తగ్గలేదు. బుధవారం ఆమె అనుభవించిన వేదనను లెక్క కట్టేందుకు ఎలాంటి పరికరాలు లేవు. 100 గ్రాముల బరువు విలువ ఇంత భారంగా ఉంటుందని ఆమె ఊహించలేదు. ఇక్కడ ఒక మెడల్ ఆమె మెడను అలంకరించకపోవచ్చు. కానీ ఆమె ఓడిపోలేదు. బంగారం, వెండి పతకాలతో పోలిస్తే ఆమె చూపించిన పోరాటం, పట్టుదల అమూల్యం. బరువు లెక్కలు తప్పడం తప్ప బాధపడేందుకు వినేశ్ ఎలాంటి తప్పూ చేయలేదు. ఆమె డోపింగ్కు పాల్పడలేదు. ఉద్దేశపూర్వకంగా ఓడలేదు. అయినా మ్యాచ్ ఫిక్సర్లను కూడా మళ్లీ పిలిచి ఆడించే మన దేశంలో వినేశ్ సాధించిన ఘనతను చూసి సంతోషించాలి. అందరూ గర్వించేలా చేసిన ఈ అమ్మాయే అసలు బంగారం!- సాక్షి క్రీడా విభాగం -
Paris Olympics: భారత క్రీడాకారుల నేటి షెడ్యూల్
ప్యారిస్ ఒలింపిక్స్లో 13వ రోజు భారత క్రీడాకారులు తమ ఆదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్దమయ్యారు. గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ రౌండ్లో పోటీపడనున్నాడు. ఈ ఫైనల్ పోరు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 11:55 నుంచి ప్రారంభం కానుంది.13వ రోజు భారత షెడ్యూల్ ఇదే..పురుషుల కాంస్య పతక పోరు: భారత్ వర్సెస్ స్పెయిన్ (సాయంత్రం గం. 5:30 నుంచి)మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపిచాజ్ రౌండ్: జ్యోతి యర్రాజీ (మధ్యాహ్నం గం. 2:05 నుంచి). పురుషుల జావెలిన్ త్రో ఫైనల్: నీరజ్ చోప్రా (రాత్రి గం. 11:55 నుంచి)పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్: అమన్ సెహ్రావత్ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి). మహిళల ఫ్రీస్టయిల్ 57 కేజీలు: అన్షు మలిక్ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) -
ఒలింపిక్స్లో అనర్హతపై వినేశ్ ఫొగట్ భావోద్వేగం
-
ఒలింపిక్స్లో మరో ప్రేమ జంట.. లవ్ ప్రపోజల్ వీడియో వైరల్
ప్యారిస్ ఒలింపిక్స్లో క్రీడాకారుల ప్రదర్శనతో పాటు లవ్ ప్రపోజల్స్ కూడా అందరని ఆకట్టుకుంటున్నాయి. ఈ విశ్వ క్రీడల వేదికగా మరో ప్రేమ జంట ప్రపంచానికి పరిచయమైంది. 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రెంచ్ అథ్లెట్ అలిస్ ఫినోట్ తన ప్రియుడికి లవ్ ప్రపోజ్ చేసింది. కాగా ఆలిస్ ఫినోట్ రేసు ప్రారంభానికి ముందు ఓ ఛాలెంజ్ చేసింది. ఈ రేసును తొమ్మిది నిమిషాలలోపు పూర్తి చేస్తే తన ప్రియుడికి అందరి ముందు తన ప్రేమను తెలియజేస్తానని స్నేహితులతో కండీషన్ పెట్టుకుంది. అయితే అనుకున్న విధంగానే 9 నిమిషాల్లో పరుగు పూర్తి చేసిన ఈ ఫ్రెంచ్ క్రీడాకారణి.. బహిరంగంగా తన బాయ్ఫ్రెండ్కు తన ప్రేమను తెలియజేసింది.రేసును ముగించిన వెంటనే తన ప్రియుడు వద్దకు వెళ్లిన ఫినోట్.. ఉంగరాన్ని తీసి మోకాళ్లపై కూర్చోని లవ్ ప్రపోజ్ చేసింది. తన ప్రేయసి తనకోసం వేసిన ప్రపోజల్ ప్లాన్తో ఒక్కసారిగా సదరు బాయ్ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడు.ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 3000 మీటర్ల రేసును అలిస్ ఫినోట్ ఎనిమిది నిమిషాల 58.67 సెకన్లలో పూర్తి చేసింది. తద్వారా ఈ రేసును అత్యంత వేగంగా పూర్తి చేసిన తొలి యూరోపియన్గా ఆమె రికార్డులకెక్కింది. కాగాఇంతకుముందు అర్జెంటీనా అథ్లెట్స్ సిమొనెట్, పిలర్ కంపోయ్.. చైనా బ్యాడ్మింటన్ జోడీ హువాంగ్ యా కియోంగ్ ,లీ యుచెన్ జోడీ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ వేదికగానే ఒక్కటయ్యారు. French athlete came in fourth in the 3000m steeplechase, a European record, and asked for her boyfriend's hand ...pic.twitter.com/ofs9DocirE— Figen (@TheFigen_) August 7, 2024 -
ఫైనల్కు ముందు హార్ట్ బ్రేకింగ్.. వినేశ్కు రజతం ఇస్తారా?
ప్యారిస్ ఒలింపిక్స్లో పతకం ఖాయం చేసుకున్న భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్కు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. మహిళల 50కేజీల విభాగం ఫైనలో పోటీ పడాల్సిన వినేష్పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. పోటీ విభాగం(50 కేజీల) కంటే 100 గ్రాముల బరువు ఆధికంగా ఉండటంతో ఆమెను డిస్క్వాలిఫై చేశారు. దీంతో వినేష్ పతక ఆశలు అవిరయ్యాయి.సంచలన ప్రదర్శనతో ఫైనల్కు చేరిన ఫోగట్ కచ్చితంగా బంగారు పతకం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ కేవలం 100 గ్రాముల బరువు 140 కోట్ల భారతీయుల గుండె పగిలేలా చేసింది. ఈ క్రమంలో వినేష్ ఫోగట్కు రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించేసింది.గురువారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ఫోగట్ వెల్లడించింది. తనకు మరి పోరాడే బలం లేదని వినేష్ తన రిటైర్మెంట్ పోస్ట్లో రాసుకొచ్చింది. అయితే తనపై ఫొగాట్ తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని ఛాలంజ్ చేస్తూ.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది. తను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీనిపై ఆర్భిట్రేషన్ ఇంకా తీర్పు వెల్లడించలేదు. ఈ క్రమంలో ఆర్భిట్రేషన్ తీర్పు ఫోగట్కు అనుకూలంగా రావాలని యావత్ భారత్ కోరుకుంటుంది.ఫోగాట్కు సిల్వర్ మెడల్ ఇస్తారా?2016 రియో ఒలింపిక్స్ తర్వాత రెజ్లింగ్ పోటీలను రెండు రోజులు నిర్వహిస్తున్నారు. అప్పటి వరకు ఒకసారి తొలి మ్యాచ్కు ముందు బరువు చూశాక కొందరు బలమైన ఆహారాన్ని తీసుకుంటూ తర్వాతి రౌండ్లలో చెలరేగారు. రెజ్లింగ్, బాక్సింగ్, జూడో తదితర యుద్ధ క్రీడల్లో సమ ఉజ్జీల మధ్యే పోరాటం జరగాలని, ఎక్కువ బరువు ఉన్నవారికి ఎలాంటి అదనపు ప్రయోజనం దక్కరాదనే కారణంతో రూల్ మార్చారు. నిబంధనల ప్రకారం రెండు రోజులూ బరువు చూస్తారు. రెండో రోజు 15 నిమిషాల సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అందుకే ప్లేయర్లు 48 గంటల పాటు కడుపు మాడ్చుకొని అయినా సరే బరువు పెరగకుండా జాగ్రత్త పడతారు. సెమీస్ వరకు గెలిచింది కాబట్టి రజతం ఇవ్వవచ్చనే వాదన కొందరు లేవనెత్తారు. కానీ నిబంధనల ప్రకారం ఏ దశలో బరువు లెక్క తప్పినా అన్ని బౌట్ల ఫలితాలను రద్దు చేస్తారు. బరువు తగ్గే అవకాశం లేదని అర్థం కాగానే గాయం సాకుతో ఫైనల్కు ముందు ఓటమిని ఒప్పుకొని తప్పుకోవాల్సిందని కూడా అభిమానులు అనుకున్నారు. కానీ అదీ నిబంధనలకు విరుద్ధం. అంతకుముందు మ్యాచ్లలో పోటీ పడుతూ మధ్యలో గాయమైతే తప్ప ప్లేయర్ రెండో వెయింగ్లో తప్పనిసరిగా బరువు చూపించాల్సిందే. అలా చేయకపోయినా అనర్హత వేటు పడుతుంది కాబట్టి వినేశ్కు ఆ అవకాశమూ లేకపోయింది. -
కాంస్యం కోసం ఆఖరి పోరు
పారిస్: భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగి ఫైనల్కు అర్హత సాధించలేకపోయిన భారత పురుషుల హాకీ జట్టు.. గురువారం కాంస్య పతకం కోసం స్పెయిన్తో తలపడనుంది. టోర్నీ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబర్చిన హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా.. మంగళవారం సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓడి కాంస్య పతక పోరుకు చేరింది. మూడేళ్ల క్రితం జరిగిన టోక్యో ఒలింపిక్స్లోనూ భారత్ కాంస్య పతకమే సాధించగా... వరుసగా రెండోసారి పోడియంపై నిలిచే అవకాశం టీమిండియా ముందుంది. జర్మనీతో సెమీఫైనల్లో భారత్ హోరాహోరీగా పోరాడి ఓడగా... మరో సెమీస్లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ పరాజయాం పాలైంది. బ్రిటన్తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ‘రెడ్ కార్డు’కు గురై సెమీస్కు అందుబాటులో లేకుండా పోయిన డిఫెండర్ అమిత్ రోహిదాస్... ఈ మ్యాచ్లో ఆడనుండటం భారత్కు సానుకూలాంశం. జర్మనీతో పోరులో పెనాల్టీ కార్నర్ అవకాశాలను సది్వనియోగ పర్చుకోలేకపోయిన భారత్.. ఆ విషయంలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఈ టోరీ్నతో కెరీర్కు వీడ్కోలు పలుకనున్న గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ మరోసారి కీలకం కానున్నాడు. ‘సెమీస్ పరాజయం చాలా బాధించింది. పసిడి నెగ్గే సువర్ణ అవకాశం చేజారింది. అయితే ఆ ఓటమిని మరిచి కాంస్య పతక పోరుపై దృష్టి పెట్టాం. దేశానికి పతకం అందించేందుకు ఇదే చివరి అవకాశం. అందుకే ప్రతి ఆటగాడు దీన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నాడు’అని శ్రీజేశ్ అన్నాడు. ఒలింపిక్స్ వేదికగా స్పెయిన్తో భారత్ పది సార్లు తలపడగా.. అందులో ఏడింట గెలిచింది. ఒక మ్యాచ్ స్పెయిన్ నెగ్గగా.. మరో రెండు ‘డ్రా’గా ముగిశాయి.