Paris Olympics 2024: క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన నిషా దాహియా | Wrestler Nisha Dahiya Lost In Quarter Finals Of Womens Freestyle 68kg Event | Sakshi

Paris Olympics 2024: క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన నిషా దాహియా

Aug 5 2024 8:38 PM | Updated on Aug 6 2024 9:05 AM

Wrestler Nisha Dahiya Lost In Quarter Finals Of Womens Freestyle 68kg Event

పారిస్‌ ఒలింపిక్స్‌లో ఇవాళ (ఆగస్ట్‌ 5) భారత్‌కు అస్సలు కలిసి రాలేదు. ఇవాళ జరిగిన రెండు కాంస్య పతక పోటీల్లో భారత్‌ ఆటగాళ్లు పరాజయాలు ఎదుర్కొన్నారు. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో లక్ష్య సేన్‌.. మలేషియాకు చెందిన జెడ్‌ జే లీ చేతిలో 21-13, 16-21, 11-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. షూటింగ్‌ స్కీట్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు జోడీ అనంత్‌జీత్‌ సింగ్‌ నరౌకా-మహేశ్వరి చౌహాన్‌ తృటిలో కాంస్యం చేజార్చుకుంది. 

క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన నిషా దాహియా 
మహిళల రెజ్లింగ్‌ 68 కేజీల ఫ్రీ స్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్‌ నిషా దాహియా క్వార్టర్‌ ఫైనల్లో పరాజయం పాలైంది. నిషా ఉత్తర కొరియాకు చెందిన పాక్‌ సోల్‌ గమ్‌తో చేతిలో 8-10 తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో నిషా ఆధిక్యంలో ఉన్నప్పుడు గాయపడింది. తద్వారా స్వల్ప తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. ఓటమి అనంతరం నిషా కన్నీటిపర్యంతమైంది. 

ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో నిషా.. ఉక్రెయిన్‌కు చెందిన టెటియానా సోవాపై 6-4 తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో నిషా 1-4తో వెనుకపడినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement