
ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో ముఖ్యమైన శిడిబండి వేడుక గురువారం నయనానందకరంగా సాగింది.

ఈ వేడుకకు అశేష భక్తజనం హాజరై కనులారా తిలకించి పులకించింది

తిరునాళ్లలో 11వ రోజున శిడి బండి ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. ఉయ్యూరు ఎస్సీ కాలనీకి చెందిన అనుపమ్ను శిడి బుట్టలో కూర్చోబెట్టి మూడుసార్లు శిడిబండి ఆడించారు

అనంతరం ఆలయ ప్రదక్షిణ చేయించి అమ్మవారి ఆలయం ఎదురుగా శిడిబండిని నిలిపి వేడుకను పూర్తిచేశారు. వేడుక జరిగే క్రమంలో భక్తులు శిడి బండి, శిడిబుట్టపై అరటికాయలు విసురుతూ వీరమ్మతల్లికి జై అంటూ భక్తిపారవశ్యం చెందారు



















