krishna district
-
అరగంట కేటాయిస్తే పనైపోద్ది.. రోడ్డెక్కిన జనసేన
సాక్షి, కృష్ణాజిల్లా: పెడనలో న్యాయం కోసం జనసేన పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. టీడీపీ నేతల అరాచకాలపై జనసేన పోరాట దీక్షకు దిగింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వాహనం ముందు జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ కార్యక్తలకు అన్యాయం జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోరుతూ జనసేన కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పెడన నియోజకవర్గం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సీరం సంతోష్ ఆధ్వర్యంలో దీక్షకు దిగారు. అరగంట కేటాయిస్తే పనైపోద్ది.. మా గోడు తెలియజేయడానికి సమయం ఇవ్వాలంటూ బ్యానర్లు కట్టారు.కార్యకర్తలకు అవమానాలు జరుగుతున్నా పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడంతో ఆయన అపాయింట్మెంట్ కోరుతూ ఆమరణదీక్ష చేపట్టిన సీరం సంతోష్ దీక్షతో టీడీపీ,జనసేన పార్టీలో కలవరం రేగుతోంది. జనసేన కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దీక్షా శిబిరానికి చేరుకున్నారు. దీక్ష విరమింపజేయాలని ప్రయత్నాలు చేస్తుండగా, సీరం సంతోష్ మాత్రం ససేమిరా అంటున్నారు. మరో వైపు, నిన్న(బుధవారం) కోనసీమలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పి.గన్నవరంలో మంత్రి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి సమావేశంలో గందరగోళం నెలకొంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడతారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.జనసేన ఎమ్మెల్యే ఉన్న చోటే పవన్ పేరు పలకరా అంటూ నిరసన వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పవన్ పేరు ప్రస్తావించక పోవడంతో టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోబోయారు. దీంతో వివాదం మరింత ముదిరింది. షాక్ తిన్న అచ్చెన్నాయుడు సభ నుంచి వెళ్లిపోయారు. -
బాలికపై అత్యాచారం.. నాగబాబు అరెస్ట్..
-
కూటమిలో కుమ్ములాటలు
-
ఫీజు కట్టలేదని విద్యార్థిని గెంటేశారు
కంకిపాడు: ఫీజు కట్టలేదని విజయవాడ సమీపంలోని గోసాల శ్రీచైతన్య కళాశాల నుంచి యాజమాన్యం ఓ విద్యార్థిని అర్థరాత్రి వేళ బయటకు పంపించేసింది. దీంతో ఆ విద్యార్థి, అతని తండ్రి కళాశాల గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. మీడియాకు సమాచారం వెళ్లటంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. బాధితుడి కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆబోతు టార్జాన్ కుమారుడు గౌతమ్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.సంక్రాంతికి ఇంటికి వెళ్లిన గౌతమ్ ఆదివారం రాత్రి తన తండ్రితో కలసి కళాశాలకు వచ్చాడు. ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తామని కళాశాల సిబ్బంది చెప్పారు. టార్జాన్ తన వద్ద ఉన్న రూ 20 వేలు నగదును చెల్లించాడు. మిగిలిన రూ. 50 వేలు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని బతిమలాడారు. అందుకు యాజమాన్యం ససేమిరా అని విద్యార్థిని కళాశాల నుంచి పంపించేసింది. దీంతో విద్యార్థి గౌతమ్, అతని తండ్రి టార్జాన్ అర్ధరాత్రి కళాశాల గేటు వద్దే నిరసన వ్యక్తం చేశారు.పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఏప్రిల్లో పరీక్షలు ఉన్నాయని, ఆ లోపు ఫీజు చెల్లిస్తానని చెప్పినా యాజమాన్యం అంగీకరించలేదని వాపోయారు. నిర్దాక్షిణ్యంగా తమను బయటకు పంపించేశారని తెలిపారు. పోలీసులు కూడా కళాశాలకు చేరుకుని ఆరా తీశారు. దీంతో యాజమాన్యం విద్యార్థి, అతని తండ్రితో మాట్లాడి విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. -
రౌడీ సర్కార్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ /హనుమాన్ జంక్షన్ రూరల్ : శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకే ఇళ్ల చుట్టూ పోలీసులు.. అక్రమంగా గృహ నిర్భంధం.. అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి.. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే సమాధానం చెప్పేవారే లేరు.. అక్కడందరూ తీవ్రవాదులు, దొంగలున్నట్లు ఈ పోలీసులేంటి.. వారి హడావుడి ఎందుకో తెలియక కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి వాసులు తల్లడిల్లిపోయారు. తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వమే ఇలా దౌర్జన్యం చేస్తోందని తెలుసుకుని మండిపడ్డారు. పరిహారం కూడా ఇవ్వకుండా ఇలా బలవంతంగా లాక్కోవడమేమిటని నిలదీస్తున్నారు. మల్లవల్లిలోని రీ సర్వే నంబర్ 11లో 1,460 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయించింది. అప్పటికే ఆ భూమిని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నిరుపేదలకు ఎకరాకు రూ.7.50 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా సేకరించిన భూమిలోంచి గ్రామ సామాజిక అవసరాలు, ఇళ్ల స్థలాల పంపిణీ నిమిత్తం 100 ఎకరాలు కేటాయిస్తామని జీవో 456 కూడా జారీ చేసింది. రైతు కూలి పనులు చేసుకుని బతికే భూమి లేని తెల్లరేషన్ కార్డుదారులకు రూ.50 వేలు సాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో రీ సర్వే నంబర్ 11లోని సాగుదారుల ఎంపిక ప్రహసనంగా మారింది. రాజకీయ కక్ష సాధింపులకు వేదికైంది. టీడీపీ నేతల ప్రోద్బలంతో రెవిన్యూ అధికారులు పలువురు సాగుదారులకు పరిహారం దక్కకుండా చేశారు. దీంతో దాదాపు 150 మంది రైతులు నాటి నుంచి పరిహారం కోసం దఫదఫాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. స్వయంగా మల్లవల్లి వచ్చి ఏపీఐఐసీ భూ నిర్వాసితుల అందోళనకు మద్దతు తెలిపారు. త్వరలో ప్రభుత్వం తప్పక మారుతుందని, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక సీన్ రివర్స్ అయింది. పరిహారం ఇవ్వకుండానే భూములు లాక్కోవాలని చూస్తోంది. సామాజిక అవసరాలకు కేటాయించిన 100 ఎకరాల భూమిని కూడా తిరిగి వెనక్కు తీసుకునేందుకు తెర వెనుక మంత్రాంగం మొదలుపెట్టింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టారు.పోలీసుల బలగాలతో భూముల స్వాధీనం మల్లవల్లిలో ఏపీఐఐసీ పారిశ్రామికవాడకు ప్రభుత్వం కేటాయించిన భూమిలో దాదాపు 300–400 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించక పోవటంతో ఇంకా ఆ భూమి సాగుదారుల చేతిలోనే ఉంది. ఈ భూమితో పాటు సామాజిక అవసరాలు, ఇళ్ల స్థలాల పంపిణీకి కేటాయించిన 100 ఎకరాల భూమిని కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కార్యాచరణ చేపట్టింది. దీని కోసం 15 మంది తహసీల్దార్లు, రెవెన్యూ యంత్రాంగంతో గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు సుబ్రహ్మణ్యం, బీఎస్ హేలా షారోన్ రంగంలోకి దిగారు. హనుమాన్ జంక్షన్ సీఐ కేవీవీఎన్ సత్యనారాయణ నేతృత్వంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు వెయ్యి మంది పోలీసులు గ్రామంలో, పారిశ్రామికవాడలో మోహరించారు. భూ నిర్వాసితుల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న చిన్నాల వర ప్రసాద్, పంతం కామరాజు, బొకినాల సాంబశివరావులతో పాటుగా మరో ఎనిమిది మందిని శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వారి సెల్ ఫోన్లు లాక్కున్నారు. వీరి ఇళ్ల వద్ద ఒక ఎస్ఐ, ఏఎస్ఐ, తహసీల్దార్ స్థాయి అధికారులు సహా పది మంది కానిస్టేబుళ్లను బందోబస్తులో ఉంచారు. ప్రతి సాగుదారుని ఇంటి వద్ద పోలీసులను ఉంచి, వారిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు. గ్రామంలోని ముఖ్య కూడళ్లు, పారిశ్రామికవాడలోని వివాదాస్పద ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్లు, సర్వేయర్లను రప్పించి.. ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి పర్యవేక్షణలో పారిశ్రామికవాడలో సర్వే పనులు చేపట్టారు. ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లు, ఇతర యంత్రాలను పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా మొదలు పెట్టారు. సాగుదారుల చేతుల్లో ఉన్న భూములను సైతం చదును చేశారు. ఆ వెంటనే ఏపీఐఐసీ ప్లాట్ల విభజన పనులు కూడా శరవేగంగా చేపట్టారు.ప్రభుత్వ ముఖ్య నేత కన్నుమల్లవల్లి పారిశ్రామికవాడలో రూ.కోట్ల విలువైన భూమిపై ప్రభుత్వంలోని ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కన్ను పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో సాగుదారుల చేతిలో ఉన్న భూమితో పాటు గతంలో సామాజిక అవసరాలు, ఇళ్ల స్థలాల పంపిణికి కేటాయించిన భూమిని సైతం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధిని రంగంలోకి దింపి, ఈ వ్యవహారం చక్కబెట్టేలా దిశా నిర్దేశం చేసిందని తెలుస్తోంది. వందల ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసి, ఆపై పారిశ్రామిక వేత్తలకు అధిక ధరతో అప్పగించాలని వ్యూహం రచించింది. -
అందాల దీవిలో కడలి కల్లోలం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సహజసిద్ధ ప్రకృతి అందాలతో కనువిందు చేసే సుందర ద్వీపం చిన్నగొల్లపాలేనికి కష్టం వచ్చింది. దీనిని కడలి ఏటా మింగేస్తోంది. మరికొన్నేళ్లు గడిస్తే దీవి అనవాళ్లు కనబడవేమో అనే బెంగ ఆ గ్రామ వాసులను పీడిస్తోంది. మూడువైపులా ఉప్పుటేర్లు, ఒకవైపు బంగాళాఖాతం (Bay of Bengal) ఉండటంతో చుట్టూ నీటితో నిండిన చినగొల్లపాలెం కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో ఉంది. రెండు జిల్లాల సంస్కృతి మేళవింపు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సరిహద్దులో రెండు జిల్లాల సంస్కృతికి అద్దం పడుతూ భౌగోళికంగానే కాక జీవన విధానంలోనూ భిన్న సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా చినగొల్లపాలెం (chinna gollapalem) నిలుస్తోంది. 1962వ సంవత్సరానికి ముందు దీవి మూడువైపులా నీటితో ఒక వైపు భూభాగంతో ద్వీపకల్పంగా ఉండేది. 1962లో కొల్లేరు పరీవాహక ప్రాంత ముంపునీరు సముద్రంలో కలిసేందుకు చినగొల్లపాలెం, పడతడిక గ్రామాల మధ్య కాలువ తవ్వారు. అప్పటి నుంచి ఇది మానవ నిర్మింత దీవిగా మారిపోయింది. నాటినుంచి దాదాపు అర్ధ శతాబ్దంపాటు బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. జల రవాణా మాత్రమే ఉండటంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉప్పుటేరుపై (Upputeru) వారధి నిర్మాణం జరిగింది. దీంతో రవాణా సంబంధాలు పునరుద్ధరణకు నోచుకున్నాయి. ప్రతిపాదనలతోనే సరి చినగొల్లపాలెం కోత నివారణకు సీ కోస్టల్ ఏరియా (ప్రొటెక్షన్ కీ)లో భాగంగా రూ.210 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్త కాలువ, పాత కాలువల పూడికతీత, రెగ్యులేటర్ల నిర్మాణాలకు, పాత కాలువపై రెగ్యులేటర్కు రూ.364 కోట్లు, కొత్త కాలువపై రెగ్యులేటర్ కోసం రూ.166.35 కోట్లతో పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించినప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఆగిపోయాయి. ప్రభుత్వం అక్కడి ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోత నివారణకు శాశ్వత పరిష్కారంగా రాతి కట్టడం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.సముద్ర గర్భంలో కొబ్బరి తోటలు ఆరువేల ఎకరాలకుపైగా విస్తీర్ణంతో 10వేల జనాభా గల చినగొల్లపాలెం ప్రజల భద్రతకు భరోసా లేకుండాపోయింది. ప్రస్తుతం దీవిని రెండువైపుల నుంచి సముద్రం కోతకు గురిచేస్తోంది. గతంలో ఏటిమెండి వద్ద పాతకాలువ ముఖద్వారంతో పాటు ప్రస్తుతం కొత్తకాలువ ముఖద్వారం సైతం పూడుకుపోవడంతో సముద్రం దీవిని కోసేస్తోంది. ఇప్పటికే దాదాపు 800 ఎకరాల వరకు సరుగుడు, కొబ్బరి తోటలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే దీవిని సముద్రం (Sea) మింగేయడం ఖాయమని ప్రజలు భయపడుతున్నారు.పూడిక తీయాలి సముద్రం వేగంగా కోతకు గురి చేస్తోంది. దీనికి ప్రధాన కారణం దీవికి తూర్పు, పశ్చిమ దిక్కున ఉన్న పాత, కొత్తకాలువలు పూడుకుపోవడమే. వెంటనే సముద్ర ముఖద్వారాల వద్ద పూడిక తీయాలి. ప్రకృతి ప్రసాదించిన అరుదైన సహజసిద్ధ సంపదను కాపాడాలి. – కొప్పినేటి హనుమంతరావు, మాజీ సర్పంచ్, చినగొల్లపాలెంకోతకు కళ్లెం వేయాలి మా గ్రామాన్ని సముద్రం కోసేస్తూ ఊరివైపు దూసుకువస్తోంది. ఇప్పటికే వందలాది ఎకరాల భూములు సముద్రంలో కలిసిపోయాయి. కోత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అతి త్వరలో దీవి కనుమరుగైపోతుంది. – మాసాబత్తుల శ్రీనివాసరావు, దీవి పరిరక్షణ అధ్యక్షుడు -
కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో అపశ్రుతి
-
‘అమ్మా’నవీయం!
గన్నవరం/కొమరోలు: కన్న తల్లులే బిడ్డలకు భారమవుతున్నారు. నవ మాసాలు మోసి కనీపెంచిన అమ్మలను అమానవీయంగా వదిలించుకుంటున్నారు. గన్నవరం సమీపంలో ఎముకలు కొరికే చలిలో శనివారం రాత్రి ఓ తల్లిని వదిలి వెళ్లగా, ప్రకాశం జిల్లా కొమరోలులో ఓ తల్లి వారం రోజులుగా నడిరోడ్డుపై నరకయాతన అనుభవిస్తున్నా.. కుమారుల మనసు కరగలేదు. ఎముకలుకొరిచే చలిలో 85 ఏళ్ల అవ్వ కృష్ణా జిల్లా గన్నవరం శివారు ఆల్ఫా హోటల్కు సమీపంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారులో 85 ఏళ్ల ఓ వృద్ధురాలిని కొంత మంది వ్యక్తులు తీసుకొచ్చారు. కిందికి దింపి అక్కడో ఓ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయారు. చలికి గజగజ వణుకుతున్న ఆ వృద్ధురాలిని కొంతమంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధురాలి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండడంతో స్థానిక బీకేఆర్ వృద్ధాశ్రమానికి తరలించారు. ఆమె వద్ద లభ్యమైన ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం ఆమె గన్నవరం మండలం కొండపావులూరుకు చెందిన నక్కా లక్ష్మీకాంతంగా గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా పోలీసులు ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులను పిలిపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. దుప్పటి కూడా లేక నడిరోడ్డుపైనే 75 ఏళ్ల అమ్మ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వెన్నంపల్లికి చెందిన కలిగవిన వెంకటలక్ష్మమ్మ(75) భర్త కొంత కాలం కిందట మృతిచెందాడు. అనంతరం ఆమె ముగ్గురు కుమారుల వద్ద ఉంటూ కాలం గడుపుతోంది. ఆస్తుల పంపకాల అనంతరం తల్లిని మాత్రం వారు పట్టించుకోవడం మానేశారు. ఏడాది కాలంగా ఓ గుడిసెలో వదిలేశారు. ప్రతినెలా వచ్చే వృద్ధాప్య పింఛన్ను కూడా వారే బలవంతంగా తీసుకెళుతున్నారు. వెంకట లక్ష్మమ్మ నివాసం ఉంటున్న గుడిసె కూడా శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో ఇటీవల కుమారులు తల్లిని ఇళ్లకు తీసుకెళ్లి.. మళ్లీ వారం కిందట వెన్నంపల్లెలో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారం రోజులుగా చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ నానా యాతనపడుతోంది.కట్టుబట్టలు తప్ప కనీసం దుప్పటి కూడా లేకపోవడంతో ఆ అమ్మ కష్టాలు వర్ణనాతీతం. గ్రామస్తులే అన్నం పెడుతున్నారు. వృద్ధురాలి దీన స్థితిని చూసి చలించిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొమరోలు ఎస్ఐ వెంకటేశ్వర్లునాయక్కు గ్రామానికి చేరుకుని కుమారులతో ఫోన్లో మాట్లాడారు. తల్లి బాగోగులు చూసుకోవాలని లేకుంటే.. అనాథాశ్రమానికి తరలిస్తామని చెప్పారు. -
పెడన టీడీపీలో ఆధిపత్య పోరు.. ఎన్నికల అధికారిపై కత్తితో దాడికి యత్నం
సాక్షి, కృష్ణా జిల్లా: పెడన నియోజకవర్గం నీటి సంఘం ఎన్నికల్లో టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎలక్షన్ ఆఫీసర్పై కత్తితో దాడికి యత్నించారు. పామర్తి వెంకటేశ్వరావును పెడన మండల పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ బలపరచగా, పామర్తి బ్రహ్మయ్యను నందిగామ సర్పంచ్ బొడ్డు సీతయ్య (చినబాబు) బలపర్చారు. ఎన్నికల్లో బ్రహ్మయ్యకు 10 ఓట్లు, వెంకటేశ్వరరావుకు 2 ఓట్లు వచ్చాయి.ఎన్నిక పూర్తయిన తర్వాత ఓటమిని తట్టుకోలేకపోయిన పామర్తి వెంకటేశ్వరరావు.. ఇంటికెళ్లి కత్తి తీసుకొచ్చారు. ఎన్నికల అధికారి వద్ద ఉన్న పత్రాలు లాక్కునేందుకు యత్నించారు. పత్రాలు ఇవ్వకపోవడంతో ఎన్నికల అధికారి జి.మధుశేఖర్పై కత్తితో దాడికి యత్నించారు. దాడిని అడ్డుకోవడంతో మధుశేఖర్ చేతికి స్వల్పగాయమైంది. దాడి అనంతరం తన చేతిని గాయపరచుకుని పామర్తి వెంకటేశ్వరరావు కిందపడిపోయారు. పామర్తి వెంకటేశ్వరరావుపై ఎన్నికల అధికారి మధుశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
సాక్షి, కృష్ణా జిల్లా: చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్కు చేదు అనుభవం ఎదురైంది. ధాన్యం కొనుగోళ్లపై మంత్రిని రైతులు నిలదీశారు. 10 రోజులైనా ధాన్యం కొనడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేదని మంత్రికి రైతులు ఫిర్యాదు చేశారు.ఈ క్రాప్ జరిగినప్పటికీ అధికారులెవరూ పట్టించుకోవడం లేదన్న రైతులు.. 1262 ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ప్రశ్నించడంతో అధికారులపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదేశించినా ఎందుకు కొనడం లేదంటూ మండిపడ్డారు. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. సాయంత్రానికల్లా ధాన్యం కొని.. రేపటికల్లా డబ్బులు పడేలా చేస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: మళ్లీ మొదటికొచ్చిన ‘సీజ్ ది షిప్’ -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి, కృష్ణాజిల్లా: కంకిపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల వ్యాన్ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను మచిలీపట్నం బలరాంపేటకు చెందిన చీలి ప్రభు(30) ,భానుప్రకాశ్ (26), చింత బాబీ(36)గా గుర్తించారు.కారు మచిలీపట్నం వైపు వెళ్తుండగా, చేపల లోడుతో మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు బొలేరో వ్యాన్ వెళ్తుంది. టైరు పేలడంతో డివైడర్ దాటుకుని వెళ్లి చేపల వ్యాన్ను కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. చేపల వ్యాన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
ఇది రెడ్బుక్ పాలన: వైఎస్ జగన్ ధ్వజం
అబద్ధాలు చెప్పడం మనకు చేతగాదు. అతి నిజాయితీ, అతి మంచితనం మనకున్న సమస్యలు. కానీ రేపు మనమనుకుంటున్న ఈ సమస్యలే మళ్లీ మనల్ని అధికారంలోకి తెస్తాయి. ఆరు నెలలు తిరక్క మునుపే ఇవాళ పరిస్థితి చూస్తే.. ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతోంది. జగన్ కనీసం పలావు అయినా పెట్టేవాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందని చర్చ జరుగుతోంది. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి : ‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుడ్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రజలకు మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి.. అని అడిగే పరిస్థితి టీడీపీకి లేదు. ఎక్కడ చూసినా వ్యవస్థలన్నీ కూప్పకూలిపోయిన పరిస్థితే కనిపిస్తోంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘మన ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య ఇప్పటికే ప్రతి ఇంట్లో పోలిక మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది.. ఈ ఆరు నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలా పని చేస్తోంది.. అన్న చర్చ ప్రతి ఇంట్లో నడుస్తోంది’ అని స్థానిక సంస్థల ప్రజానిధులకు చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లతో సమావేశమయ్యారు. సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్గా జిల్లాల బాట పడతానని, దాదాపు జనవరి ఆఖరు నుంచి ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని చెప్పారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, ప్రతి పార్లమెంటును ఒక యూనిట్గా తీసుకుని అక్కడకి వచ్చి బస చేస్తానన్నారు. బుధవారం మూడు నియోజకవర్గాల కార్యకర్తలతో, గురువారం మరో నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలతో మమేకం అవుతానని చెప్పారు. పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని, అక్కడే ఉంటూ వారితో మమేకమవుతూ, వారికి తోడుగా ఉంటూ వారికి మరింత దగ్గరయ్యే కార్యక్రమం చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. స్థానిక సంస్థల్లో ఎక్కడ చూసినా మనమే » రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంపీపీల పరంగా, జెడ్పీటీసీ సభ్యుల పరంగా, మేయర్ల పరంగా జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో మన వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 46 చోట్ల ఎన్నికలు జరిగితే 44 జెడ్పీటీసీ స్థానాల్లో మన పార్టీ గెలిచింది. ఎంపీపీలు, ఎంపీటీసీల స్థానాల్లో కూడా దేవుడి దయతో గొప్ప విజయాన్ని అందుకున్నాం. ఇవాళ స్థానిక సంస్థల్లో ఎక్కడ చూసినా మనమే కనిపిస్తాం. అయినా జనరల్ బాడీ మీటింగ్ ఎక్కడ జరిగినా మనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు. » మనం చెడు చేసి ప్రతిపక్షంలో కూర్చోలేదు. మీరంతా ప్రజాప్రతినిధులుగా ఎన్నికలప్పుడు తిరిగిన వాళ్లే. ప్రతి ఇంటికి, గడప గడపకూ మనం వెళ్లినప్పుడు ఏ ఇంటికి వెళ్లినా చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలు అక్కున చేర్చుకున్నారు. కారణాలు ఏమైనా ఎన్నికలకు వచ్చే సరికి మనం అనుకున్న ఫలితాలు రాలేదు. మనందరికి తెలిసిన విషయం ఏమిటంటే.. జగన్ కుటుంబానికి అంతా మేలు చేశాడు. కానీ చంద్రబాబునాయుడు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ ప్రలోభాలకు మొగ్గు చూపిన పరిస్థితులు మనం చూశాం. అతి నిజాయతీ.. అతి మంచితనం మనకున్న సమస్యలు » అబద్ధాలు చెప్పడం మనకు చేతగాదు. అతి నిజాయితీ, అతి మంచితనం మనకున్న సమస్యలు. జగన్ ఇవన్నీ చేయగలిగాడు.. చంద్రబాబునాయుడు వీటికన్నా ఓ రెండు మూడింతలు ఎక్కువ చెబుతున్నాడు.. అదీ మోడీతో కలిసి వస్తున్నాడు చేయగలుగుతాడేమోనని ఆశపడ్డారు. మన పరిపాలన కాలంలో మనం ఇంత చక్కగా బటన్లు నొక్కాం కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనన్న ఆశ ప్రజలకు కలిగింది. దానివల్ల 10 శాతం మన ఓటు బ్యాంకు తగ్గింది. కానీ ఆరు నెలలు తిరక్క మునుపే ఇవాళ పరిస్థితి చూస్తే.. ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతోంది. » జగన్ కనీసం పలావు అయినా పెట్టేవాడు.. చంద్రబాబునాయుడు బిర్యానీ పెడతానన్నాడు.. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందని చర్చ జరుగుతోంది. కానీ రేపు మనమనుకుంటున్న సమస్యలే మళ్లీ మనల్ని అధికారంలోకి తెస్తాయి. అన్నింటా తిరోగమనమే » ఫీజులు ఇవ్వక పిల్లలు కాలేజీలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. జనవరి నుంచి ఫీజులు పెండింగ్. మన హయాంలో ప్రతి త్రైమాసికం అయిన వెంటనే ఒక నెల తనిఖీలకు గడువు ఇచ్చి, మరుసటి నెల ఇచ్చే పరిస్థితి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇచ్చాం. » ఇవాళ జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్, జూలై, ఆగషు్ట, సెపె్టంబరు క్వార్టర్.. అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ జనవరి నాటికి సంవత్సరం ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే రూ.2,800 కోట్లు. మన హయాంలో ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. అవి కూడా బకాయిలే. వ్యవస్థని నడిపించే ఈ కార్యక్రమాలు కుప్పకూలుతున్న పరిస్థితి. దాదాపు రూ.3,900 కోట్లు కేవలం పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. » ఆరోగ్యశ్రీకి సంబంధించి మార్చి నుంచి నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.2,200 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ పేదవాడు ఆసుపత్రి గడప ఎక్కాలంటే, డాక్టర్లు ఉచితంగా వైద్యం అందిస్తారన్న నమ్మకం సన్నగిల్లింది. ఆరోగ్య ఆసరా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎక్కడుంది అనుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారు. 108, 104 డయల్ చేసినా ఆంబులెన్స్ వస్తుందన్న పరిస్థితి లేదు. వాళ్లు స్ట్రైక్లు, ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై నిలదీయండి » ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం’ కార్యక్రమాన్ని మొదలు పెట్టేలోగా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్ధాయి వరకు వివిధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, అన్ని కమిటీలు పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే చెప్పాం. నా కార్యక్రమం మొదలైన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత బూత్ కమిటీల నుంచి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేపడతాం. » సంవత్సరం పూర్తయ్యే సరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్ రావాలి. చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను నిలదీయాలి. ఇది జరగాలంటే మండల, మున్సిపాల్టీ , వార్డు స్ధాయిలో మీరు చాలా కీలకమైన పాత్ర పోషించాలి. మండల, గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే దిశగా మీరంతా అడుగులు ముందుకు వేయాలి.అబద్ధాలు చెప్పలేదు.. చెప్పగలిగిందే చేశాం » మనం కుటుంబం మొత్తాన్ని ఒకటిగా చేసి మంచి చేశాం. మనం అబద్ధాలు చెప్పలేదు. మనం చేయగలిగింది మాత్రమే చెప్పాం. వాళ్లు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరు కనిపించినా అబద్ధపు హామీలు ఇచ్చారు. ఇద్దరు పిల్లలు కనిపిస్తే.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని.. కాస్త పెద్ద వయస్సులో 50 ఏళ్లు దాటిన అమ్మలు, అత్తలు కనిపిస్తే మీకు రూ.48 వేలు అని.. ఆ ఇంట్లో ఉద్యోగం వెతుక్కుంటున్న 20 ఏళ్ల పిల్లవాడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని.. అదే ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. చెప్పే పరిస్థితి చూశాం. » ‘వాళ్లు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు సీఎం అయితే ఇవన్నీ జరగబోతున్నాయని ప్రలోభాలు పెట్టారు.. సాధ్యం కాని హామీలిచ్చారు.. అవి సాధ్యం కాదని తెలిసినా హామీలిస్తూ వాళ్లు ప్రచారం చేస్తున్నారు.. ప్రతి ఒక్కరినీ చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు’ అని చాలామంది నాకు చెప్పారు. చీకటి తర్వాత వెలుగు తప్పదు » కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత పగలు రాక తప్పదు. ఇది సృష్టి ధర్మం. కాబట్టి ఇది కచి్చతంగా గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేయగలిగితే మనం తిరిగి నిలబడగలుగుతాం. కాలం గడిచే కొద్దీ ఈ భయాలు పోతాయి. మరో రెండు మూడు నెలల్లో అందరూ ధైర్యంగా రోడ్డు మీదకు వస్తారు. అందరిలో ఈ ధైర్యం రావాలి. ఎందుకంటే ప్రజల తరపున, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. ప్రజల తరఫున వారికి అండగా నిలవగలిగితే.. ప్రజలు మనతో పాటు నడుస్తారు. మీరందరూ ఎంపీపీ, జడ్పీటీసీ వంటి మండల స్థాయి నాయకులు.. మీరు ఇంకా ఎదగాలంటే ప్రతిపక్షంలో మీరు ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నదే నిర్ణయిస్తుంది. » కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ వేస్తే.. రిజెక్ట్ అయ్యేది. ప్రతిపక్షంలో ఉంటూ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్తో యుద్ధం చేశా. టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి నా మీద పిటిషన్లు వేశాయి. ఇంత మందితో యుద్ధం చేస్తున్నా.. నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడల్లా అన్న మాటేమిటంటే.. నేను బయటకు వస్తే ఇన్ప్లూయన్స్ చేస్తానని చెప్పే వారు. కేంద్రంలో, రాష్ట్రంలో వాళ్ల ప్రభుత్వాలే ఉన్నప్పటికీ నేను ప్రభావితం చేస్తానని బెయిల్ తిరస్కరించారు. ఇలా 16 నెలలు గడిపారు. కానీ ఏమైంది? ఆ తర్వాత బయటకు వచ్చా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన సాగించాం. » నా కార్యక్రమం మొదలైన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాతో పాటు మీరూ, నేనూ ఇద్దరం కలిసి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. ఇది మన ఎజెండా. గతంలో మనకు 151 స్థానాలు వచ్చాయి. ఈసారి తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలి. కచ్చితంగా దేవుడు ఈ పని చేయిస్తాడన్న నమ్మకం ఉంది. ఏ మంచీ చేయకుండా కేవలం అబద్ధాలు, మోసం చేసినప్పుడు అది కోపం కింద మారుతుంది. ప్రజల్లో ఆ కోపం రెట్టింపు అవుతుంది. మన మీద ప్రేమ పెరుగుతుంది. ఆ రోజు మనం తప్పకుండా చూస్తాం. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో కూడా మనం చూస్తాం. ఈ రోజు నుంచి ఎన్నికలు అయ్యే వరకు.. అది రెండేళ్లయినా, మూడేళ్లయినా నేను మిమ్నల్ని కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎల్లకాలం అధికారంలోనే ఉండం. కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎలా ప్రవర్తించాం అన్నది మాత్రమే మనల్ని పైకి తీసుకువస్తుంది. అది కచి్చతంగా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయతలను మనం పడేస్తే మళ్లీ దక్కించుకోవడం కష్టం. కష్టకాలం అనేది మనకొక పరీక్ష. గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఫేస్ బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్ లోడ్ చేయాలి. యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయాలి. సంవత్సరం పూర్తయ్యే సరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్ రావాలి. అది మనం చేస్తూ, మన కార్యకర్తలతో చేయించాలి. సూపర్ సిక్స్ ఏమైంది? ఏమైంది సూపర్ సెవన్? మాకు చెప్పిన మాటలు ఏమయ్యాయి? అన్న దగ్గర నుంచి మొదలయ్యే ప్రశ్నల వర్షం.. ఏమైంది మా స్కూల్? ఏమైంది మా హాస్పిటల్? ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి? ఏమైంది మా ఆర్బీకే? అంటూ ప్రశ్నల పరంపర కొనసాగాలి. ఆ దిశగా అడుగులు ముందుకు పడాలి. విద్య, వైద్యంతోపాటు చివరకు ధాన్యం కొనుగోలు పరిస్థితీ దయనీయంగా ఉంది. దళారీలు కొనేదాకా ప్రభుత్వం అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా లేదు. ధాన్యం కొనుగోలుకు ఎంఎస్పీ రూ.1,720 అయితే రైతులు కృష్ణా జిల్లాలోనే రూ.300 తక్కువకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేల ద్వారా దళారీల వ్యవస్ధను తీసేసి, ఈ–క్రాప్ చేసి పారదర్శకంగా మనం కొనుగోలు చేసినట్టు.. ఈ ప్రభుత్వం కొనాల్సిన సమయంలో కొనుగోలు చేస్తే.. రైతులకు మద్దతు ధర వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం అలా చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఇలా ప్రతి వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. రాష్ట్రంలో మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దొంగ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వాన పరిస్థితులు చూస్తున్నాం. ఒక వైపు మంచి చేయకపోగా.. మరోవైపు ప్రశ్నించే గొంతులను అణిచి వేయాలని చూస్తున్నారు. మామూలుగా ఆరు నెలలకు ఊహించిన దానికన్నా అధ్వానంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. ఎన్నికలు ఎప్పుడు వచి్చనా మంచిదే. వీళ్లు ఈ మాదిరిగా ఇన్నిన్ని అబద్ధాలు ఆడి, ఇన్ని మోసాలు చేసిన వీళ్ల పరిస్థితి రేపు ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్నది నేను చెప్పాల్సిన పనిలేదు. – వైఎస్ జగన్ -
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గతి ఇదే.. వైఎస్ జగన్ (ఫోటోలు)
-
ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా ప్రతినిధులతో వైయస్ జగన్
-
అన్నదాత ఆక్రందన
-
కాగితం కళ: పేపర్ సూపర్
‘హౌ టూ....’ అని గాలించేందుకు అప్పట్లో గూగులమ్మ లేదు. రిఫర్ చేసేందుకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేవు. ‘కాగితం కళ’పై చిన్నప్పటి నుంచి ఇష్టం పెంచుకున్న మేడా రజని ఎలాంటి సౌకర్యాలు లేని కాలంలో తనకు తోచిన రీతిలో రకరకాల డిజైన్లు చేసేది. ‘కాగితం కళ’ అనేది ఆమె బాల్య జ్ఞాపకం కాదు. బతుకు బాట వేసిన సాధనం. ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న ఉత్తేజం....ప్రకృతి పాఠశాలలో ఎన్నో నేర్చుకోవచ్చు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం గిలకలదిండికి చెందిన రజనికి ప్రకృతి ప్రసాదమైన పూలను చూస్తూ గడపడం అంటే ఎంతో ఇష్టం. విరబూసిన పూల నుంచి స్ఫూర్తిపొంది, తనలోని సృజనాత్మకతకు పదును పెట్టేది. ‘పేపర్ క్విల్లింగ్’ ఆర్ట్ని సాధన చేసేది. ఇది తన అభిరుచి మాత్రమే కాదు ఆర్థికంగా బలాన్ని ఇచ్చింది. తన పరిధిలో మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. గ్రామీణప్రాంంతాలకు వెళుతూ పేద విద్యార్థులకు ‘పేపర్ క్విల్లింగ్’లో ఉచిత శిక్షణ ఇచ్చేలా చేస్తోంది.‘శ్రీ క్రియేషన్స్’ అనే సంస్థకు శ్రీకారం చుట్టి క్రియేటివ్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ శిక్షణా తరగతులను ఆఫ్ లైన్, ఆన్లైన్లో నిర్వహిస్తోంది. ‘సింధు డిజైన్స్’ పేరుతో శుభకార్యాల కోసం అందమైన ఆకృతిలో పేపర్ బ్యాగులు, కాగితపు పూలతో చేసిన ఫ్లవర్ వాజ్లు, బొకేలు, పూల జడలు, పేపర్ క్విల్లింగ్ ఆర్ట్స్తో చేసిన ఫొటో ఫ్రేమ్లు... మొదలైనవి తయారు చేస్తోంది.‘కళ’కున్న గుణం ఏమిటంటే మనల్ని ఖాళీగా కూర్చోనివ్వదు! ఎప్పుడూ ఏదో తెలుసుకునేలా చేస్తుంది. నేర్చుకునేలా చేస్తుంది.‘పేవర్ ఆర్ట్ గురించి నాకు బాగా తెలుసు’ అని ఎప్పుడూ అనుకోలేదు రజిని. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటుంది. విదేశీ కళలకు లోకల్ ఫ్లేవర్ జోడించడం గురించి రకరకాలుగా ఆలోచిస్తుంటుంది.చండీగఢ్ కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన రజని ‘నా కళ నా దగ్గరే ఉండాలి’ అని అనుకోలేదు. తనకు తెలిసిన కళకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి మరీ కొత్త తరానికి పరిచయం చేస్తోంది.‘క్రియేటివ్ హార్ట్స్– ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అకాడమీ’ జాతీయ స్థాయిలో నిర్వహించినపోటీలో రజని తయారు చేసిన రాధాకృష్ణ పేపర్ క్విల్లింగ్ ఆర్ట్ ‘గోల్డెన్ బ్రష్ అవార్డు’ గెలుచుకుంది. ఇలాంటి పురస్కారాలు ఆమె ప్రయాణంలో ఎన్నో ఉన్నాయి.‘అవార్డ్ అందుకున్నాను అనే ఆనందం కన్నా నా వల్ల పదిమంది ఈ కళలో ప్రాంవీణ్యం సాధించారనే విషయం గొప్పగా ఉంటుంది’ అంటుంది రజిని. తన ఆర్ట్వర్క్కు సంబంధించిన ప్రదర్శనలను దేశంలో ఎన్నోచోట్ల ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్న రజని పేపర్ ఆర్ట్లో మరెన్నో ప్రయోగాలు చేయాలనుకుంటోంది.‘నేర్చుకున్నది ఎప్పుడూ వృథాపోదు’ అనేది ఆమె నోటినుంచి వినిపించే మాట. నిజమే కదా! ఉత్సాహం ఇస్తుంది. ఉపాధి ఇస్తుంది. ఇతరులకు ఉపాధి కలిగించేలా చేస్తుంది. ఎంతో ఇచ్చింది...చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ నేర్చుకున్న పేపర్ క్రాఫ్ట్ నాకు ఉత్సాహాన్నిచ్చింది. ఉపాధి కల్పించింది. పేరు తెచ్చింది. నేను కన్న కలలు నిజం చేసుకునేందుకు ఉపయోగపడింది. ఈ కళలో రాణించేందుకు ఓర్పు, శ్రద్ధ, ఏకాగ్రత, సృజనాత్మకత ఉండాలి. నేర్చుకున్నచోటే ఉండి΄ోకుండా కాలంతో పాటు కొత్త కళలు, సాంకేతికతపై దృష్టి పెట్టాలి.– మేడా రజని– ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం -
కృష్ణా జిల్లా యనమలకుదురులో గ్యాంగ్ వార్
-
విద్యార్థిని తొడ కొరికిన కీచక టీచర్
కోడూరు: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నరసింహపురంలో చోటుచేసుకుంది. నరసింహపురం ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు పది మంది పిల్లలు చదువుతున్నారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న అవనిగడ్డకు చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు కటికల వేణుగోపాలరావు.. విద్యాశాఖ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ టీచర్ను నియమించుకుని విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. బాధ్యత మొత్తం ఆ టీచర్ మీద వదిలేసి వేణుగోపాలరావు పాఠశాలలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వేణుగోపాలరావు మూడో తరగతి విద్యార్థినితో నాలుగు రోజుల నుంచి అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. చెప్పుకోలేని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. సోమవారం ఉదయం ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది. ఉపాధ్యాయుడు నాలుగు రోజుల నుంచి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడని చెప్పింది. తల్లిదండ్రులు విద్యార్థిని తొడపై పంటిగాట్లు గమనించారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోడూరు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వేణుగోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు మండలం కొండాయపాలెం వద్ద కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుడివాడ నుంచి పామర్రు వైపు వెళ్తున్న కారు.. కొండాయపాలెం వద్దకు రాగానే అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయింది.కాల్వలో నీరు ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పామర్రు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను గుడివాడ ఆసుపత్రి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి -
జనం లేని పవన్ ‘పల్లె పండుగ’ సభ
విజయవాడ, సాక్షి: గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే ‘పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు’ రాష్ట్రం వ్యాప్తంగా ఇవాళ(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో సోమవారం డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జనం లేక ఖాళీ కూర్చిలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.JUST IN | No crowd at Deputy Chief Minister #PawanKalyan's Palle Panduga program in Kankipadu, Krishna district, on Monday.📹: G N Rao (@hindugnr1) pic.twitter.com/KsCfT77m6V— The Hindu (@the_hindu) October 14, 2024చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’ -
పామర్రు టీడీపీలో రచ్చకెక్కిన ఇసుక టెండర్ల వివాదం..
సాక్షి, కృష్ణా: ఓ వైపు మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఇసుక మాఫియాకు గేట్లు ఎత్తేసింది. ఉచితం పేరుతో ఇసుకను బంగారంలా మార్చింది చాలదన్నట్లు.. మరింతగా దోపిడీ చేసేందుకు రహస్యంగా పెద్ద స్కెచ్చే వేసింది. జనమంతా పండుగ సందడిలో ఉంటే.. సందట్లో సడేమియాలా ఇసుక రీచ్లను తను అనుకున్న వారికి హస్తగతం చేసింది. ఎటువంటి ఇసుక పాలసీ లేకుండానే 70 లక్షల టన్నులకంటూ 108 ఇసుక రీచ్లకు టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వాటిని ఖరారు చేసేసింది.తాజాగా కృష్ణా జిల్లా పామర్రు టీడీపీలో ఇసుక టెండర్ల వివాదం రచ్చకెక్కింది. ఇసుక టెండర్ కోసం టీడీపీ నేతలు మధ్య తగాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇసుక టెంబర్ బెదిరింపు వీడియో ఒకటి కలకలం రేపుతోంది. బెనర్జీ అనే టీడీపీ నేతకు ఇసుక టెండర్ వేయొద్దంటూ ఎమ్మెల్యే వర్గం నేత సురేష్ బెదిరింపులకు పాల్పడినట్లు ఇందులో ఉంది. ఇసుక టెండర్లలో ఎవ్వరూ పాల్గొనకూడదని సురేష్ హుకుం జారీ చేశారు. ఇసుక టెండర్ వేసిన బెనర్జీని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడించిన వీడియో లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. -
మచిలీపట్నంలో టీడీపీ Vs జనసేన
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ, జనసేనల మధ్య బ్యానర్ గొడవ తారాస్థాయికి చేరింది. పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్ను జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు చింపివేశారు.దీంతో యర్రంశెట్టి నానిపై టీడీపీ నేతలు దాడి చేయడమే కాకుండా ఆయన ఇళ్లంతా ధ్వంసం చేశారు. ఈ దాడిలో యర్రంశెట్టి నాని గాయపడ్డారు.అనంతరం ఇరువర్గాల మధ్య పార్టీ పెద్దలు సెటిల్మెంట్ చేశారు. అయితే, సెటిల్మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి యర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును రక్తం కారేలా టీడీపీ నేతలు తీవ్రంగా కొట్టారు.బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని టీడీపీ నేతలు క్షమాపణ చెప్పించుకున్నారు. టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని యర్రంశెట్టి నాని , శాయన శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు. జనసేన, టీడీపీ నేతలు ఒకరిపైఒకరు చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.ఇదీ చదవండి: తమ వాళ్ల కోసం సోషల్ మీడియా పోస్టులు -
నాడు జగన్ హయాంలో... నేనున్నా...!
వస్తున్న వర్షాన్నో... వచ్చే వరదనో ఆపటం సాధ్యం కాకపోవచ్చు. కానీ ముందుగా తెలుసుకుని హెచ్చరించే వ్యవస్థలొచ్చాయి. వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగే సామర్థ్యం ఉండనే ఉంది. శిబిరాలకు చేరిన వారికి ఆహారం, నీళ్లు అందిస్తే చాలు. అప్పటికి వాళ్ల ప్రాణాలు కుదుటపడతాయి. వరద తగ్గాక మళ్లీ వారి జీవితాలు మొదలవుతాయి. ఈ ప్రక్రియలోనే వాళ్లకి ప్రభుత్వ అండ కావాలి. ముందుగా హెచ్చరించి... శిబిరాలకు తరలించి... సాయం అందించగలిగే యంత్రాంగం ప్రభుత్వానికే ఉంటుంది. ఆ బాధ్యత కూడా ప్రభుత్వానిదే. గత జగన్ ప్రభుత్వ హయాంలో వలంటీర్ల వ్యవస్థ ఎలా పని చేసిందో చెప్పడానికి ఈ ఒక్క ఫోటోనే నిదర్శనం నాడు జగన్ హయాంలో బాధితులకు పునరావాసం ఇలా.. రెండేళ్ల కిందట ఇదే స్థాయిలో వరదలు ఉభయగోదావరి జిల్లాలను ముంచెత్తినపుడు... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏ ఒక్కరినీ కన్నీరు పెట్టనివ్వలేదు. ముందుగా హెచ్చరించి శిబిరాలకు తరలించడానికి, శిబిరాల వద్ద అప్పటికప్పుడు వండిన ఆహారం అందించడానికి వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా అక్కరకొచ్చింది. ముఖ్యమంత్రి తన కార్యాలయం నుంచే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలివ్వటంతో సహాయ కార్యక్రమాలు పక్కాగా జరిగాయి. సహాయ కార్యక్రమాలకు అడ్డు రాకూడదన్న ఉద్దేశంతో నాలుగు రోజుల తరవాత పరిస్థితి ఉపశమించాక ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వెళ్లారు. బాధితుల్లో ఏ ఒక్కరైనా ఫిర్యాదు చేస్తే ఒట్టు!!. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లేటపుడు చేతిలో రూ.2వేలు పెట్టి మరీ పంపింది నాటి ప్రభుత్వం.నేడు బాబు హయాంలో... ఎక్కడన్నా..?మరిప్పుడో..? ఇదేమీ అకస్మాత్తుగా పడిన వర్షాల వల్ల వచ్చిన ముప్పు కూడా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నా... ఎగువ నుంచి వస్తున్న వరదను ప్రస్తుత చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో కృష్ణా నదికి ఉధృతంగా ప్రవాహం వచ్చి ఎగదన్నింది. దీంతో బుడమేరుకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. ఇది చాలదన్నట్లు... ముందస్తు హెచ్చరికలు కూడా లేకుండా బుడమేరు గేట్లు ఎత్తేశారు. దీంతో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు రూరల్ ప్రాంతాలూ దారుణంగా మునిగిపోయాయి. ఒక్కరినైనా ముందుగా హెచ్చరిస్తే ఒట్టు. ఇక శిబిరాలూ లేవు.. వాటికి తరలించటాలూ లేవు. సహాయ కార్యక్రమాల ఊసేలేదు. పైపెచ్చు కరకట్టపై కట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికే దిక్కులేదు. ఆ విషయం బయటపడకుండా ఆయన సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ పేరిట కలెక్టరేట్లో మకాం వేశారు. అక్కడికొక క్యారవాన్ తెప్పించుకుని... దాన్లోనే బస చేశారు. తన ఇల్లు మునుగుతోందన్న వార్తలపై అడ్డంగా దబాయిస్తూ... చరిత్రలో ఎన్నడూ ఎరుగని వర్షం వచ్చింది కాబట్టి పరిస్థితి ఇలా అయిందని బుకాయిస్తూ... తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు తప్పవని బెదిరిస్తూ హుంకరింపులకు దిగారు. ఎల్లో మీడియా... సేమ్ టు ‘షేమ్’చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా వైఖరి షరా మామూలే. ఉభయగోదావరి వరదల్లో ఎక్కడో ఒకరికో, ఇద్దరికో సాయం అందకపోతే ఆ ఒక్కరి గురించే పేజీలకు పేజీలు వండేసి అబద్ధాలతో నాటి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన ఎల్లో మీడియా... ఇప్పుడు కూడా ముందస్తు సమాచారం ఉన్నా అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టలేకపోయిందంటూ... అనుకున్న విధంగా సహాయక చర్యలు లేవంటూ సుతిమెత్తగా సన్నాయి నొక్కులు నొక్కింది. ముఖ్యమంత్రి కలెక్టరేట్లో బస చేసిన వార్తలకే పెద్దపీట. అక్కడ బస చేయటం వల్ల ఉపయోగం ఏంటన్నది దుర్గమ్మకెరక. బాధితుల్లో ఎవరిని పలకరించినా... తమ చెంతకు ఎవరూ రాలేదని, ఎలాంటి సహాయమూ చేయలేదనే చెబుతున్నారు. బోట్లు లేవు.. తరలింపులు లేవు... నీళ్లు లేవు.. ఆహారం లేదు.. సహాయ సామగ్రి లేవు. అసలు ప్రభుత్వ యంత్రాంగమే కనిపించలేదు. ఈ విషయం వరద ప్రాంతాలను సందర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెళ్లినపుడు స్పష్టంగా బయటపడింది. బాధితుల ఆవేదనంతా బయటపడింది. ‘‘ఇప్పటిదాకా మీరు తప్ప ఇక్కడకు వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్లు ఎవ్వరూ లేరు’’ అని విజయవాడలోని సింగ్ నగర్ వాసులు వ్యాఖ్యానించారంటే పరిస్థితి చెప్పకనే తెలుసుకోవచ్చు.కృష్ణలంక వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్(ఫోటో గ్యాలరీ) -
హాస్టల్ బాత్రూంలో స్పై కెమెరాలు..
-
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలం
-
AP: గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు.. విద్యార్థినిల ఆందోళన
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వాష్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టి విద్యార్థినిల వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థే ఇందుకు కారణమని అతడిని చితకబాదారు. ఈ సందర్భంగా రాత్రంతా విద్యార్థులు ధర్నాకు దిగారు.వివరాల ప్రకారం.. గుడివాడ మండలం శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో రహస్య కెమెరాలు అమర్చారు. ఓ విద్యార్థిని సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినిలు.. మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు చర్యలు తీసుకోకపోవడంతో వారంతా ఆందోళనలు చేపట్టారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము 3:30 గంటల వరకు విద్యార్థినిలు నిరసనల్లో పాల్గొన్నారు. గుడివాడ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లోని అమ్మాయిల హాస్టల్ బాత్రూం లో స్పై కెమెరా లు అమర్చి - వాళ్ల వీడియో లు చిత్రీకరించి - వాటిని బాయ్స్ హాస్టల్ వాళ్లకి అమ్మి డబ్బులు తీసుకుంటున్నారు - ఇప్పటికి 300 వీడియో లు అమ్మినట్టు సమాచారం ఈ మొత్తం ప్రక్రియ ని నాల్గవ సంవంత్సరం… https://t.co/WPuHnUa0Vh pic.twitter.com/xhIuXZQnlh— 𝐀𝗋α𝗏𝗂𐓣ᑯα𝐒αꭑ𝖾𝗍α🚩 (@HarieswarH) August 30, 2024 ఈ ఘటనకు కారణమైన విజయ్ను అక్కడికి తీసుకురావడంతో అతడిపై విద్యార్థినిలు దాడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ.. వాష్రూమ్లో కెమెరాలు అమర్చి.. వీడియోలు తీశారు. ఆ వీడియోలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనంతరం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విజయ్ను ఆసుపత్రికి తరలించారు. అలాగే, విజయ్ను విచారించిన తర్వాత.. అతడి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక, విద్యార్థినిలకు సంబంధించి దాదాపు 300 వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించినట్టు సమాచారం. 🚨 గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోర దుర్ఘటన.లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు వినికిడి. వీటిని బాయ్స్… pic.twitter.com/3rALM0f5D8— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) August 30, 2024 -
గుడివాడ కూటమిలో భగ్గుమన్న విభేదాలు
గుడివాడరూరల్: కృష్ణాజిల్లా గుడివాడ కూటమి పార్టీల్లో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. పట్టణంలోని నాగవరప్పాడు సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవలే ఏర్పాటు చేసిన ఆ జెండా దిమ్మను ప్రారంభించడానికి వీల్లేదని, దానిని తొలగించాలని టీడీపీ నేత దారం నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం అర్ధరాత్రి నరసింహారావుకు జన సైనికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నరసింహారావు పలుగుతో జెండా దిమ్మను ధ్వంసం చేశాడు.ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ జనసేన కార్యకర్తలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నరసింహారావు వెళ్లిపోయారు. వెంటనే జనసేన కార్యకర్తలు ఎంఎన్కె రహదారిపై బైఠాయించారు. నరసింహారావును అప్పగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.లిఖితపూర్వక ఫిర్యాదు ఇస్తే అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జనసైనికులు ఆందోళన విరమించి బైక్ ర్యాలీగా వన్టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి నరసింహారావుపై ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసిన దారం నరసింహారావును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని బూరగడ్డ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆధిపత్యం కోసం దారం నరసింహారావు పట్టణంలో వర్గ విభేదాలు సృష్టించి సంఘ విద్రోహ శక్తిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
ప్రైవేటు బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
కృత్తివెన్ను (పెడన) : ప్రైవేటు బస్సు, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న 21 మంది, కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. కృత్తివెన్ను ఎస్ఐ కె. నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. పశి్చమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి ఓ ప్రైవేటు బస్సు బుధవారం హైదరాబాద్కు బయల్దేరింది.రాత్రి 8.30 గంటల సమయంలో కృత్తివెన్ను మండలం యండపల్లి–మునిపెడ గ్రామాల మధ్య విజయవాడ నుంచి రావులపాలెం వెళ్తున్న కారు, ఈ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బస్సు రోడ్డు మార్జిన్లో పలీ్టకొట్టింది. కారు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు, బస్సు డ్రైవరు, క్లీనరు ఉండగా వారిలో డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక కారులో ఉన్న నలుగురూ గాయపడ్డారు. వీరిని మచిలీపట్నం సర్వజనాసుపత్రికి తరలించారు. బస్సు ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. -
దివిసీమ బిడ్డకు ‘జగనన్న దీవెన’
మోపిదేవి(అవనిగడ్డ): పేదింటి బిడ్డలు ఉన్నతంగా జీవించాలనేదే వైఎస్ జగన్ తపన. అందులో భాగంగానే జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చారు. ఎందరో భావి భారత పౌరులకు అందించారు. ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కృష్ణాజిల్లా దివిసీమ బిడ్డ. ఐక్యరాజ్య సమితిలో ఉన్నత స్థాయి రాజకీయ సమూహం ముందు ’సుస్థిర అభివృద్ధి’ అనే అంశంపై ప్రసంగించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు.వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ దంపతుల రెండో కుమారుడు కృష్ణకిషోర్ ఆగస్టు 2023 నుంచి యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ (సీపా–ఎస్ఐపీఏ)లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మిని్రస్టేషన్ విద్య అభ్యసిస్తున్నాడు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణకిషోర్కు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ.కోటి మంజూరు చేసింది. నాటి ప్రభుత్వం అందించిన సాయానికి పూర్తి న్యాయం చేస్తూ కృష్ణకిషోర్ అమెరికాలో అదీ ఐక్యరాజ్య సమితి ఆహా్వనంతో ఉన్నత స్థాయి ప్రతినిధుల ముందు తన వాణి వినిపించే అద్భుత అవకాశాన్ని పొందాడు.న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన సుస్థిర అభివృద్ధి (సస్టైనబుల్ డెవలప్మెంట్) అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆహా్వనం అందుకున్నాడు. ఎస్ఐపీఏ స్టూడెంట్ అసోసియేషన్ అకడమిక్ చైర్మన్గా, సౌత్ ఏసియన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న కృష్ణకిషోర్ ప్రపంచ విశ్వవిద్యాలయాల అధ్యక్షులు, కార్పొరేట్ నాయకులు, సీనియర్ యునైటెడ్ నేషన్స్ అధికారులతో వేదికను పంచుకుని పది నిమిషాల పాటు ప్రసంగించి ఆకట్టుకున్నాడు.జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన అందించిన జగనన్న విదేశీ విద్యా దీవెనతోనే మా బాబు కృష్ణకిషోర్ అమెరికా వెళ్లాడు. అటు ప్రభుత్వానికి, ఇటు మాకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. – తల్లిదండ్రులు పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ -
లోకేష్ను బుట్టలో వేసుకునే ప్లాన్.. మొత్తానికే మోసం!
వారికి ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకమే లేదు. కాని ఊహించని విజయం వారిని వరించింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. గెలవం అనుకున్న సీట్లలో గెలిచిన ఆ ఇద్దరికీ మంత్రి పదవులపై కన్ను పడింది. క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ కావాలంటే పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలి. ఇందుకోసం ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ ప్లాన్ చేశారు. మంత్రి పదవుల కోసం బరితెగించి తమ ప్రత్యర్థులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగించారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు?తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం కృష్ణాజిల్లా. సామాజికవర్గం పరంగానూ...పార్టీ పరంగానూ బలమైన జిల్లా కావడంతో ఇక్కడినుంచి గెలుపొందిన నేతలకు పార్టీలోనూ అంతే వెయిటేజ్ ఉంటుంది. ఐతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్ధులు గెలవడంతో మంత్రివర్గంలో తమకు స్థానం దక్కదేమో అనే టెన్షన్ గన్నవరం, గుడివాడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మొదలైందట. గెలిచినవారందరూ మంత్రి పదవుల కోసం తమకున్న పరిచయాలతో లాబీయింగ్ చేస్తుంటే ఈ ఇద్దరు మాత్రం...పార్టీలో చంద్రబాబు తర్వాత అంతటి అధికారం చెలాయించే చినబాబు లోకేష్ను ప్రసన్నం చేసుకుంటే తమ పని సులువు అవుతుందని భావించారట. పార్టీలో నెంబర్ టూగా ఉన్న లోకేష్ దృష్టిలో పడితే తమ స్థానం పదిలమనే ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల్ని టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.తమ లక్ష్యం నెరవేరాలంటే వైఎస్ఆర్సీపీలోని చిన్నా చితకా నాయకులు, క్యాడర్ను లక్ష్యంగా చేసుకుంటే వర్కవుట్ కాదని భావించారట. అందుకే గుడివాడలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెనిగండ్ల రాము వైఎస్ఆర్సీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారని తెలుస్తోంది. గుడివాడలో ఎలాగైనా గెలవాలనుకున్న చంద్రబాబు కోరిక తీరింది కాబట్టి...కొడాలి నానిని కూడా ఇబ్బంది పెడితే పార్టీ దృష్టి ...చినబాబు దృష్టి తనపై పడుతుంది....అప్పుడు మంత్రి పదవి రేసులో తన పేరు కూడా ఉంటుందనే ఆలోచన చేశారట వెనిగండ్ల రాము. ఈ ఆలోచనతోనే కౌంటింగ్ పూర్తయిన రోజు రాత్రి కొడాలి నాని కార్యాలయంపై దాడి చేయించిన వెనిగండ్ల రాము..తర్వాత కొడాలి నాని ఇంటి పైకి కూడా కొంత మందిని టీడీపీ గూండాలను ఉసిగొల్సి పార్టీ వర్గాల్లో చర్చకు తెరతీసారట.గుడివాడలో వెనిగండ్ల రాము అనుసరించిన స్ట్రాటజీనే గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన యార్లగడ్డ వెంకట్రావ్ కూడా అమలు చేశారట. కొడాలి నాని తర్వాత టీడీపీ ఓడించాలనుకున్న నేతల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. అటు గుడివాడతో పాటు ఇటు గన్నవరంలోనూ టీడీపీ గెలవడంతో కచ్చితంగా తనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని యార్లగడ్డ ఆశపడ్డారట. అందుకే విజయవాడలోని వల్లభనేని వంశీ ఇంటి పై టీడీపీ గూండాలు ... కిరాయి మూకలతో దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది. వంశీ ఇంటిపై కత్తులు...కర్రలు...రాళ్లతో దాడి చేశారు. భారీగా మోహరించిన పోలీసులు అతికష్టం మీద వంశీ ఇంటి పరిసరాల నుంచి టీడీపీ గూండాలను తరిమికొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంశీ ఇంటిపైకి యార్లగడ్డ వెంకట్రావ్ మనుషులతో పాటు విజయవాడ సెంట్రల్ నుంచి గెలిచిన బొండా ఉమా కూడా తన గూండాలను పంపించి దాడి చేయించారని తెలుస్తోంది.టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు , లోకేష్ కు టార్గెట్ లిస్ట్ లో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్ళపై అటాక్ చేయడం వల్ల అధిష్టానంతో పాటు చినబాబు దృష్టిలో తాము హీరోలుగా నిలుస్తామని...తద్వారా క్యాబినెట్ లో చోటు దక్కడం ఖాయమని యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, బొండా ఉమా భావించారట. కట్ చేస్తే.. చంద్రబాబు మంత్రుల జాబితా ప్రకటించాక వారి ఆలోచనలు తారుమారై..ఆశలు ఆవిరయ్యాయట. కూటమి క్యాబినెట్ లో యార్లగడ్డకు కానీ ... వెనిగండ్ల రాముకి కానీ.. బోండా ఉమాకు కానీ చోటు దక్కపోవడంతో ముగ్గురూ షాక్కు గురయ్యారట. చినబాబును బుట్టలో వేసుకుందామని ఆలోచిస్తే... మొత్తానికే మోసం వచ్చిందని... ఇప్పుడేం చేయాలో అంటూ దిక్కులు చూస్తున్నారని కృష్ణా జిల్లాలో టాక్ నడుస్తోంది. -
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం... 24 మందితో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అత్తింటి వేధింపులతో గర్భిణి బలవన్మరణం
పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో ఓ గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. వారసుడు కావాలని అత్తింటివారు వేధించడంతో కడుపులో ఉన్న ఆడబిడ్డను చంపలేక తానే ప్రాణాలు తీసుకుంది. సీఐ టి.వి.వి.రామారావు కథనం మేరకు.. యనమలకుదురు పుట్టరోడ్డుకు చెందిన కావ్యశ్రీ (19)కి రెండేళ్ల కిందట విజయవాడ కండ్రికకు చెందిన సందు శ్రీకాంత్తో(31) వివాహమైంది. శ్రీకాంత్ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. పదినెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కావ్యశ్రీ, ఇటీవల మళ్లీ గర్భం దాల్చింది. ఆమెకు ప్రస్తుతం ఐదో నెల. భర్త శ్రీకాంత్ నాలుగు రోజుల క్రితం కావ్యశ్రీకి విజయవాడలో స్కానింగ్ చేయించగా, ఆడపిల్ల పుడుతుందని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో దంపతుల మధ్య గొడవ మొదలైంది. ఆడపిల్ల వద్దు, వారసుడే కావాలని కావ్యశ్రీపై భర్త శ్రీకాంత్తోపాటు అత్త వెంకటేశ్వరమ్మ, మామ లక్ష్మణరావు ఒత్తిడి తెచ్చారు. దీంతో భార్యాభర్తలు గత బుధవారం ఆస్పత్రికి వెళ్లగా, అబార్షన్ చేస్తే ప్రమాదమని డాక్టర్ హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. అయితే శ్రీకాంత్ స్నేహితుడు కానిస్టేబుల్ శ్యామ్ తన పరపతితో అబార్షన్ చేయిస్తానని చెప్పడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. అబార్షన్ చేయించుకోనని కడుపులో బిడ్డను చంపలేనని శుక్రవారం రాత్రి కావ్యశ్రీ తన భర్తకు తేల్చి చెప్పింది. శనివారం ఉదయం భార్యాభర్తలు మళ్లీ అబార్షన్ విషయమై చర్చించుకున్నారు. అనంతరం కావ్యశ్రీ స్నానానికి వెళ్తూ భర్తకు ఫోన్ ద్వారా ఓ మెసేజ్ చేసింది. ‘తాను వారసుడిని ఇవ్వలేనని,..కడుపులోని బిడ్డను చంపలేనని.. తనను ఛీదరించుకోవద్దని.. పదినెలల కుమార్తెను తన తల్లిదండ్రులే పెంచాలని..తనను క్షమించాలని’ ఆ మెసేజ్లో పేర్కొంది. కావ్యశ్రీ బాత్రూమ్ నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కటుంబసభ్యులు, భర్త బాత్రూమ్ తలుపులు తెరిచి చూడగా వెంటిలేటర్కు కావ్యశ్రీ ఉరేసుకుని కొనఊపిరితో ఉంది. ఆమెను వెంటనే కానూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో కావ్యశ్రీ ఆదివారం ఉదయం మృతి చెందింది. మృతిరాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కావ్యశ్రీ భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం: ఇంజినీరింగ్, బీ–ఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు పొందడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్–2024 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి గురువారం విడుదల చేశారు. ఏపీ ఈసెట్ నిర్వహించిన జేఎన్టీయూ(అనంతపురం)లో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. 8 దఫాలుగా ఏపీ ఈసెట్ను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ(ఏ) ఈసెట్ నిర్వహణ కమిటీని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అభినందించారు.ఏపీ ఈసెట్కు రాష్ట్రవ్యాప్తంగా 37,767 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,369 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 32,881 మంది(90.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిలు 27,787 మంది దరఖాస్తు చేసుకోగా 26,693 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 23,849(91.68 శాతం) మంది అర్హత సాధించారు. అమ్మాయిలు 9,980 మంది దరఖాస్తు చేసుకోగా, 9,676 మంది హాజరయ్యారు. వీరిలో 9,032(93.34 శాతం) మంది ఉత్తీర్ణలుయ్యారు. ఈసెట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,071 మంది పరీక్ష రాయగా 1,002 (93.56 శాతం) మంది అర్హత సాధించారు. ఉదయం సెషన్లో మొత్తం 145 ప్రశ్నలకు గాను 272 అభ్యంతరాలు రాగా.. నాలుగు ఆమోదం పొందాయి.మధ్యాహ్నం సెషన్లో మొత్తం 171 ప్రశ్నలకు గాను 444 అభ్యంతరాలు రాగా 19 ఆమోదం పొందాయి. ఈ ప్రశ్నలకు జవాబు రాసిన వారికి మార్కులు లభించాయి. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఏపీ సెట్స్ స్పెషల్ ఆఫీసర్ ఎం.సుధీర్రెడ్డి, ఏపీ ఈసెట్ చైర్మన్ జీవీఆర్ శ్రీనివాసరావు, కన్వీనర్ పీఆర్ భానుమూర్తి, జేఎన్టీయూ(ఏ) రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, పాలకమండలి సభ్యులు బి.దుర్గాప్రసాద్, డాక్టర్ ఎం.రామశేఖర్రెడ్డి పాల్గొన్నారు.వలంటీర్ శిల్ప స్టేట్ ఫస్ట్రణస్థలం: సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థలో చేరి ప్రజలకు సేవ చేస్తున్న ఓ యువతి ఏపీ ఈసెట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో వలంటీర్గా సేవలందిస్తున్న మైలపల్లి శిల్ప రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. శిల్ప ప్రస్తుతం శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డీ–ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది.ఇంజనీరింగ్ చదవాలనే ఆశయంతో ఆమె ఈసెట్ రాయగా.. బయో టెక్నాలజీ విభాగంలో ఫస్ట్ ర్యాంకు వచ్చిందని ఆమె తెలిపింది. ఆమె తండ్రి పేరు పోలీసు.. టైలర్గా పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి గృహిణి. కుమార్తెకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. గ్రామస్తులు శిల్పను అభినందించారు. శిల్ప మాట్లాడుతూ.. బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసి అత్యుత్తమంగా రాణించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. -
కృష్ణా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి
కృష్ణా, సాక్షి: కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోడూరుపాడు వద్డ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్వామినాథన్ (40), రాకేష్ (12), రాధప్రియ (14), గోపి(23) అక్కడిక్కడే మృతి చెందగా సత్య (28) (స్వామినాథన్ భార్య ) తీవ్రంగా గాయపడింది. దీంతో, ఆమెను వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇక, వీరంతా కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, ప్రమాదంలో మృతుందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాదఛాయలు అములుకున్నాయి. మరోవైపు.. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై వివరాలను సేకరిస్తున్నారు. -
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
సాక్షి, విజయవాడ: ఏపీలో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో నల్లటి మేఘాలు కమ్మేసి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీటితలో లోతట్లు ప్రాంతాలన్నీ నిటమునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బైక్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. దురుగాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు నెలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిసింది.ఉమ్మడి కృష్ణా జిల్లాలో అకాల వర్షం కురిసింది. నూజివీడు తరువూరు కైకలూరు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు సిటీ, కైకలూరు, కలిదిండి, ఆచంట ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయంగా మారాయి. ఏలూరుజిల్లా పోలవరం మండలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరి, మొక్క జొన్న పంటంతా వర్షపు నీటిపాలు అయ్యింది. రైతులు పరదాలు కప్పి పంట రక్షించుకుంటున్నారు.కృష్ణాజిల్లా :బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో అకాల వర్షం.ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం.ఉదయం నుండి భానుడి భగభగలతో అల్లాడిన జనం.భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.ఏలూరు జిల్లానూజివీడు డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం.మధ్యాహ్నం మూడు గంటలకు పట్టపగలే కారుమబ్బులు, నల్లని మబ్బులతో కమ్మేసిన ఆకాశం.అకాల వర్షంతో సేద తీరుతున్న నూజివీడు ప్రాంత ప్రజలు.అల్లూరి సీతారామరాజు జిల్లాచింతూరు,కూనవరం, విఆర్ పురం మండలాల్లో ఈదురుగాలల భీభత్సంపలు ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడిన విద్యుత్తు స్థంభాలు, వృక్షాలు. -
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)
-
పెనమలూరులో తుఫ్యాన్
కంకిపాడు: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సమయం సమీపించే కొద్దీ పెనమలూరులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. గెలుపుపై వైఎస్సార్ సీపీలో ధీమా వ్యక్తమవుతుండగా, టీడీపీ డీలా పడుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోగి రమేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామగ్రామాన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాల లబ్ధి, అభివృద్ధి కార్యక్రమాలతో వైఎస్సార్ సీపీకి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజలంతా పారీ్టకి వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. కూటమి విధానాలు నచ్చక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పారీ్టలను వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. ప్రచారంలో బీజేపీ అంటీముట్టనట్టు ఉండటం, జనసేనలోని వర్గాలు కలిసిరాకపోవడంతో టీడీపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైంది. నాలుగోసారి నియోజకవర్గానికి ఎన్నికలు పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య కృష్ణా జిల్లాలోనే అత్యధికం. ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు తాజాగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,94,928 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,42,349 మంది, మహిళలు 1,52,577 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. నియోజకవర్గ పునరి్వభజన ప్రక్రియతో 2009లో కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాలతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పాటైంది. ఆయా మండలాలతో పాటుగా ఉయ్యూరు నగర పంచాయతీ, తాడిగడప మునిసిపాలిటీ కూడా ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నియోజక వర్గంలో ఇప్పటి వరకూ 2009, 2014, 2019లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాలుగో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ 31,448 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 11,317 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. ఈ దఫా పెనమలూరు స్థానం కోసం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్తో పాటు మరో తొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బోడె.. నీకో దండం ‘టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ వ్యవహారశైలిలో ఇప్పటికీ మార్పులేదు. కనీసం కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించడంలేదు’ అని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదెక్కడి గోల. ఆయనకో దండం. ఇష్టం లేకున్నా కొనసాగుతున్నాం అంటూ ఆ పార్టీ శ్రేణులే మధనపడుతున్న పరిస్థితి. కూటమి నేతృత్వంలో చేపడుతున్న ప్రచారానికి స్పందన అంతంత మాత్రంగా ఉంటోంది. అధికారం లేకున్నా ఐదేళ్లు ప్రజలతోనే ఉన్నానని అండగా నిలవాలని ప్రచారంలో గొప్పగా చెప్పుకొంటున్నారు. 2014 నుంచి 2019 వరకూ కేవలం కొద్ది మంది అనుయాయులను పక్కనపెట్టుకుని అందలం ఎక్కించారంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. ఇసుక విక్రయాలు, మట్టి అక్రమ వ్యాపారం, సెక్స్రాకెట్, కాల్ మనీ, బిల్డర్ల నుంచి అక్రమ వసూళ్లు వంటి అనేక ఆరోపణలు బోడె ప్రసాద్ చుట్టూ ఉచ్చులా బిగుస్తున్నాయి. స్వపక్షంలోనూ విపక్షం ఉండటం, నాయకులు కలిసినా మనసులు కలవకపోవడంతో కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బీజేపీలోని ఓ వర్గం ఇప్పటికే దూరంగా ఉంటోంది. జనసేన వర్గాలు పూర్తిగా కలిసి పనిచేయటం లేదు. సీనియర్ నాయకుడు చలసాని వెంకటేశ్వరరావు (పండు) వర్గానికి అన్యాయం జరగడంతో ఆయన కుమార్తె చలసాని స్మిత, గౌతమ్, ఆమె వర్గం టీడీపీకి షాక్ ఇచ్చింది. వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారు. స్థానికుడు అన్న ఒక్క అనుకూలం తప్ప బోడె ప్రసాద్కు మిగిలినవన్నీ ప్రతికూల అంశాలే. తొలుత సీటు ఖరారు కాక అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తాననడం, ఆఖరికి ఎన్ఆర్ఐల పుణ్యమాని సీటు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందంటూ ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఎలాగూ ఎదురుగాలి వీస్తుండటంతో ఇండెంట్ వేసి చందాలు రాబడుతూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టే పనిలో నేతలు ఉన్నారన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. జోగికి ప్రజాదరణ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి ఫిరాయించటంతో వైఎస్సార్ సీపీ అధిష్టానం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమే‹Ùకు పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పటికే జోగి రమేష్ ప్రజలకు చేరువయ్యారు. ఆయన పారీ్టలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. వైఎస్సార్ సీపీ విజయాన్ని కాంక్షిస్తూ జోగి కుటుంబం యావత్తూ ప్రచారాన్ని సాగిస్తూ ప్రజాదరణ చూరగొంటోంది. సమస్యలు విన్న వెంటనే ‘నేనున్నా.. పరిష్కరించే బాధ్యత నాది’ అని జోగి భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ విధానాలు నచ్చి, టీడీపీ, జనసేన పక్షాల్లో ఇమడలేక అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికే వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ బలోపేతంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అర్హులందరికీ అందించింది. పాలనను గ్రామస్థాయికి తీసుకొచ్చింది. వలంటీరు వ్యవస్థ ద్వారా సంక్షేమాన్ని గడపకు చేర్చి అన్ని వర్గాల సంక్షేమానికి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పాల్పడుతోంది. ఇవన్నీ జోగికి అనుకూల అంశాలు. -
భారీగా టీడీపీ మద్యం పట్టివేత
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని మెట్లపల్లి శివారుల్లో టీడీపీ నేతలు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన గోవా మద్యం నిల్వలను ఆదివారం పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన టీడీపీ నేతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెట్లపల్లి శివారులో గన్నవరం మాజీ సర్పంచి, టీడీపీ నేత గూడపాటి తులసీమోహన్ సోదరుడైన దుర్గాప్రసాద్కు చెందిన శ్రీనివాస గార్డెన్స్లో భారీగా మద్యం నిల్వచేసినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వీరి ఆదేశాల మేరకు హనుమాన్జంక్షన్ సీఐ నరసింహమూర్తి, ఎక్సైజ్ స్క్వాడ్ ఎస్ఐ రామాంజనేయ, సెబ్ అధికారులు సంయుక్తంగా గార్డెన్స్లోని గెస్ట్హౌస్పై దాడిచేశారు. అక్కడ గోవా రాష్ట్రానికి చెందిన స్టీకర్స్తో మొత్తం 1,210 కేసుల్లో 58,032 క్వార్టర్ సీసాల మద్యం నిల్వల్ని గుర్తించి సీజ్ చేశారు. వీటివిలువ సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆత్కూరు ఎస్ఐ పైడిబాబు కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన శ్రీనివాస గార్డెన్స్ యాజమాని, టీడీపీ నేత గూడపాటి దుర్గాప్రసాద్ను, వాచ్మెన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్, ఎక్సైజ్ అధికారులు తెలిపారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ, నేతల్లో ఆందోళన ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఈ మద్యం కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి గూడ్స్ వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చి న ఈ మద్యాన్ని ఇక్కడినుంచి గ్రామాలకు పంపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.మద్యం పట్టుబడ్డడంతో యార్లగడ్డతో పాటు ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. అధికారులు దాడిచేసిన విషయం తెలుసుకున్న యార్లగడ్డ వర్గానికి చెందిన టీడీపీ నేతలు పొట్లూరి బసవరావు, జాస్తి శ్రీధర్బాబు, దొంతు చిన్నా, కేసరపల్లి ఎంపీటీసీ సభ్యుడు శొంఠి కిషోర్ గంటల వ్యవధిలోనే ఆ గ్రామానికి చేరుకున్నారు. -
రెట్టించిన ఉత్సాహంతో...
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) నుదిటిపై గాయం మానలేదు.. కుట్లు పచ్చి ఆరలేదు.. కంటిపైన వాపు తగ్గలేదు.. అయినా పెదాలపై చిరునవ్వు చెరగలేదు. ఆ ముఖంలో ఏ మాత్రం భయంలేదు. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో జగన్ సోమవారం తన బస్సుయాత్రను ముందుకు దూకించారు. దాడులతో మన యాత్రను ఆపలేరని, ధైర్యంగా ముందుగు సాగుదామని కేడర్లో జోష్ నింపారు. బస్సుయాత్రలో భాగంగా ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి జగన్ సంబంధిత నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. అలాగే, సోమవారం ఈ కార్యక్రమానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి పలువురు నాయకులు తరలివచ్చారు. వారిని కలిసిన అనంతరం వైఎస్ జగన్పై హత్యాయత్నం కారణంగా డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత కృష్ణాజిల్లా కేసరపల్లి నుంచి జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ రోజు బస్సుయాత్ర సోమవారం ఉదయం 10.25 నిమిషాలకు ప్రారంభమైంది. కేసరపల్లి బస ప్రాంతానికి అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులు జగన్ రాకతో జై జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. అక్కడి నుంచి వందలాది మోటార్ బైకులు ర్యాలీగా ముందు నడవగా.. బస్సుయాత్ర గన్నవరం చేరుకుంది. మార్గమధ్యంలో తన కోసం వచ్చిన ఓ మహిళా అభిమానితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం కొత్తపేటలో ప్రవేశించిన ముఖ్యమంత్రికి జాతీయ రహదారికి ఇరువైపులా బారులుతీరిన మహిళలు అఖండ స్వాగతం పలికారు. గన్నవరం వద్ద జాతీయ రహదారికి రెండువైపులా జనసందోహంతో నిండిపోయింది. గన్నవరం చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత జనంతో కూడళ్లు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. బస్సుపైకెక్కి వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. మహిళలు జననేతకు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులిచ్చారు. జగనన్నా.. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గాంధీబొమ్మ సెంటర్ జనసంద్రంగా మారింది. ఆపదను దాటి వచ్చిన నాయకుడికి అక్కడి ప్రజలు ప్రేమతో స్వాగతం పలికారు. జగన్ను చూసేందుకు పెద్దఎత్తున భవనాలపైకి స్థానికులు చేరుకున్నారు. జననేతను చూసి ఆనందంతో అభివాదం చేశారు. స్వచ్ఛందంగా తరలివస్తున్న జనం.. ఉమామహేశ్వరం మీదుగా ముందుకు సాగిన జగన్ను చూసేందుకు ఇళ్లల్లో నుంచి వృద్ధులు మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. హనుమాన్ జంక్షన్ క్రాస్ మీదుగా పెరికీడుకు చేరుకున్న జగన్కు భారీ జనసందోహం బాణాసంచాతో స్వాగతం పలికారు. కానుమోలులో శిరీష రీహాబిలిటేషన్ సెంటర్ (ఉయ్యూరు) నిర్వాహకులు, దివ్యాంగులతో వచ్చి జగన్ని కలిశారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ను అందించినందుకు వారు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. వారితో మాట్లాడి ముందుకు సాగిన జగన్కు గ్రామస్తులు భారీగా వచ్చి ఘనస్వాగతం పలికారు. ఆరుగొలనులో రహదారి కిక్కిరిసిపోయేలా అభిమానులు తరలివచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఆరుగొలను ఆరోగ్యమాత ఆలయం వద్ద స్కడ్ హాట్ ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యార్థులు జగన్ మావయ్యా అంటూ ఎదురొచ్చారు. వారిని దాటి వచ్చిన జగన్కు పుట్టగుంటలో దారిపొడవునా ప్రజలు స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఎదురొచ్చిన వేద పండితులు జగన్ను ఆశీర్వదించారు. మ.3.30 గంటలకు జగన్నాథపురం వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకున్న సీఎం జగన్ ప్రజాభిమానాన్ని దాటుకుంటూ సా.5.38 గంటలకు గుడివాడ బహిరంగ సభకు చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచే బహిరంగ సభకు జనం పోటెత్తడంతో సభా ప్రాంగణం జన సునామీని తలపించింది. ఆ అశేష జనవాహినినుద్దేశించి జగన్ ప్రసంగించారు. సభ అనంతరం 6.40 కి బస్సుయాత్ర తిరిగి ప్రారంభమైంది. హనుమాన్ జంక్షన్ హైవే మీదుగా కలపర్రు టోల్ప్లాజా చేరుకుంది. ఏలూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు, బాణాసంచా వెలుగులతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, పవన్ కుట్ర అది.. ఇక జగన్పై హత్యాయత్నం చంద్రబాబు, పవన్కళ్యాణ్ కుట్రేనని బస్సుయాత్రకు వచ్చిన ప్రతిఒక్కరూ నినదించారు. వాళ్లే వేయించారని, రాళ్లు పెట్టికొట్టండి పగోడు వస్తున్నాడు అని ఆ చంద్రబాబు, పవన్కళ్యాణ్ రెచ్చగొట్టారని దుమ్మెత్తిపోశారు. ‘రాళ్లుపెట్టి కొట్టండి అని చంద్రబాబు అన్నాడు. నీకు దమ్ముంటే గెలిపించుకో, నీకు దమ్ముంటే పథకాలివ్వు. నీ దగ్గర శక్తి ఉంటే జనం మనస్సులు గెలుచుకో. కానీ, నువ్వు ఏ ఒక్క పథకం ఇవ్వలేదు. జనానికి సున్నా చుట్టావు. నిన్నెలా నమ్ముతారు చంద్రబాబు.. అంటూ జనం సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎవరికీ న్యాయం చేయలేదని, అన్యాయమే చేశాడని, 175 సీట్లు జగన్కే వస్తాయి.. చంద్రబాబుకు ఒక్క సీటు కూడా రాదని ముక్తకంఠంతో చెప్పారు. ఏలూరు జిల్లాలో ఎగిసిన అభిమాన సంద్రం బస్సుయాత్ర కలపర్రు టోల్గేట్ వద్దకు చేరుకోగానే ఏలూరు జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఎదురొచ్చి గజమాలలు, డప్పులు బాణాసంచాతో జగన్కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు ఏర్పాటుచేసి మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీశారు. పొద్దుపోయినా జాతీయ రహదారిపై జనం బారులు తీరారు. బస్సు పైకెక్కి వారందరికీ జగన్ అభివాదం చేస్తూ ఏలూరు క్రాస్ నుంచి భీమడోలు మీదుగా యాత్ర కదిలింది. కైకరం వద్ద రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిపట్ల సీఎం తక్షణమే స్పందించి మానవత్వం చూపారు. ఒక పోలీస్ వాహనాన్ని (కాన్వాయ్ వాహనం కాదు) బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. సీఎం బస్సును ఆపి, ప్రమాదాన్ని చూసిన తర్వాత బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. సీఎం కాన్వాయ్లో ఉంచిన అంబులెన్స్ ద్వారానే క్షతగాత్రులను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ముందుకు సాగిన సీఎం జగన్ చేబ్రోలు మీదుగా నారాయణపురం బస ప్రాంతానికి రాత్రి 9.55 నిమిషాలకు చేరుకున్నారు. యాత్ర మొత్తం జగన్ను చూసేందుకు వచ్చిన ప్రజలు మీకు తోడుగా మేమున్నామంటూ ఆశీర్వదించంతో 15వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగిసింది. మొదటి ఓటు జగన్ మామకే.. ఫస్ట్టైమ్ ఓటు వేస్తున్నాను. నాకైతే చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే జగన్ వంటి మంచి వ్యక్తికి ఓటు వేయడమనేది చాలా గర్వంగా ఉంది. జగన్ మామకే ఓటు వేయాలనుకుంటున్నా. మంచి పథకాలిచ్చి జనానికి మంచి చేస్తున్నారు. అందుకోసమైనా గెలిపించుకోవడానికి ఆయనకే ఓటు వేస్తా. మంచిచేసే వ్యక్తిని కావాలని కోరుకుంటాంగానీ తప్పుడు పనులు చేసేవాళ్లకు వేయం కదా. ఇంతకుముందు పాలనలో పేదోడు అయితే బాగుపడింది లేదు. ఇప్పుడు జగన్ మామ వచ్చిన తర్వాత పేదోడు అనేవాడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు. మంచి గెలవాలి అంటే మనమంతా కలిసి గెలిపించుకోవాలి.. చెడు రాజకీయం చేయకూడదు. ఇక్కడికి వచ్చిన వాళ్లలో విద్యార్థులే ఎక్కువ.. అన్నయ్య గెలుపు కూడా విద్యార్థులతోనే మొదలవుతుంది.– కమలాకర్, విద్యార్థి జగనే మళ్లీ సీఎంగా రావాలి.. జగనన్న స్థలం ఇచ్చాడు.. ఇళ్లు కట్టించాడు. మగ్గం డబ్బులు కూడా ఇచ్చి ఆదుకున్నాడు. నాకు మగ్గంతో ఇంట్లో ఇరుకుగా ఉండేది. ఇల్లు ఇరుకుగా ఉండటంతో మగ్గాన్ని షెడ్డులో తెచ్చిపెట్టుకున్నాం. ఇప్పుడు మాకు బాగుంది. కాబట్టి మళ్లీ జగనన్నే సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. – బత్తూరి పద్మావతి, మంగళగిరి టీడీపీ హయాంలో నరకయాతన టీడీపీ ప్రభుత్వంలో చాలా యాతన పడ్డాం.. వాళ్లు వెయ్యి రూపాయల పెన్షన్ను కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. మా అమ్మ ఆఫీస్ చుట్టూ తిరగలేకపోయేది. మేం వెళ్తుంటే పెన్షన్ మాకు ఇచ్చేవారు కాదు. ఆవిడే రావాలి, ఆవిడే సంతకం పెట్టాలి అని టీడీపీ వాళ్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఆవిడ నడవలేని, లేవలేని మనిషి.. వాళ్ల అమ్మాయికివ్వండి అని ఎంతమంది చెప్పినా ఇవ్వలేదు. జగనన్న మాకు స్థలం ఇచ్చాడు. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు కూడా ఇచ్చాడు. మేం ఇల్లు కట్టుకున్నాం. పెన్షన్, రేషన్ ఇంటికే వస్తోంది. ఈరోజు ఈ ఇంట్లో ఉండి తినగలుగుతున్నామంటే అంతా జగనన్న చలవే. ఇంతవరకు మమ్మల్ని అలా ఆదరించిన వాళ్లు, అలా అనుగ్రహించి చూసిన వాళ్లు, సహాయం చేసినవాళ్లంటూ ఎవరూ లేరు. నా తోడబుట్టిన వాడిలా మాకు సహాయం చేశాడు. మళ్లీ మళ్లీ జగనే రావాలని మేం కోరుకుంటున్నాం. – కందుకూరి కల్పన, ప్రభుత్వ సంక్షేమ లబ్ధిదారు సూరీడు నిప్పులు చెరుగుతున్నా.. ఎర్రని సూరీడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నా లెక్కచేయకుండా జగన్ బస్సుపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. చినఅవుటపల్లి వద్దకు రాగానే అక్కడ మహిళలు జగన్కు ఎదురొచ్చారు. వారిని జననేత పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. హైవే బైపాస్వల్ల జాతీయ రహదారితో కనెక్షన్ కోల్పోయిన చినవాడిపల్లికి న్యాయం చేయాలంటూ ఆ గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లింగంపల్లి నేలవేణి సాయం చేయమని సీఎంను కోరారు. ఆమెకు భరోసా ఇచ్చి జగన్ ముందుకు కదిలారు. మరికొంత దూరం రాగానే పెదఅవుటపల్లి క్రాస్ వద్ద తనను చూసేందుకు పరుగుపరుగున వచ్చిన ప్రజలను చూసి జగన్ బస్సును ఆపించి వారితో మాట్లాడారు. సుభాషిణి అనే మహిళ తన అన్న బాలశౌరి ఆరోగ్యంపై వినతిపత్రం అందజేశారు. ఆత్కూరులో అభిమానులు జగన్కు వైఎస్సార్సీపీ జెండాలతో స్వాగతం పలికారు. అక్కడి మహిళల సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. పొట్టిపాడు టోల్గేట్ దాటగానే మహిళలు హైవేపై బంతిపూలతో వైఎస్సార్సీపీ అని రాసి స్వాగతం పలికారు. తేలప్రోలు వద్ద అభిమానుల స్వాగతాన్నందుకుని జగన్ ముందుకొచ్చారు. కోడూరుపాడు వద్ద మహిళలు, రైతులను జగన్ పలకరించారు. వీరవల్లి హైస్కూల్ బాలికలు జగన్ మావయ్యకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారితో జగన్ కాసేపు ముచ్చటించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలను చావబాదిన పోలీసులు
కోనేరు సెంటర్: టీడీపీ నేత సమక్షంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదిన కృష్ణా జిల్లా బందరు రూరల్ పోలీసుల తీరు వివాదస్పదంగా మారింది. బందరు మండలం ఉల్లిపాలెంలో ఇటీవల జరిగిన ఓ గ్రామ దేవత సంబరంలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారు ఆస్పత్రిలో చేరారు. దీనిపై పరస్పర ఫిర్యాదులు అందుకున్న బందరు రూరల్ ఎస్ఐ చాణక్య ఆస్పత్రి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు డిశ్చార్జ్ అయ్యాక వారిని మంగళవారం స్టేషన్కు పిలిపించారు. మరో ఏఎస్సై, కానిస్టేబుల్తో కలిసి సుల్తానగరంకు చెందిన ఓ టీడీపీ నేత సమక్షంలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను లాఠీలతో ఎస్ఐ కుళ్లబొడిచారు. అంతేకాకుండా పిడిగుద్దులు గుద్ది, కార్యకర్తల ముఖాలను గోడకు బలంగా నొక్కి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో ఒకరికి చేయి విరిగిపోగా, మరొకరికి తలపై గాయమైంది. ఇంకో కార్యకర్త వీపంతా రక్తపుమరకలతో నిండిపోయింది. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు, తదితర నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్కు చేరుకుని పోలీసుల తీరును ఖండించారు. కేసు నమోదు చేశాక తమ కార్యకర్తలను కొట్టే అధికారం మీకెవరిచ్చారంటూ పేర్ని నాని నిలదీశారు. టీడీపీ నేత సమక్షంలో తమ కార్యకర్తలను ఏకపక్షంగా కొట్టిన ఎస్ఐతోపాటు బాధ్యులందరినీ విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ సుభానీ, సబ్ డివిజన్కు చెందిన సీఐలు, ఎస్ఐలు పెద్ద ఎత్తున పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా వచ్చారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డీఎస్పీ ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్ని నానికి హామీ ఇచ్చారు. దీంతో ఆయన శాంతించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఘటనపై డీఎస్పీ విచారణకు ఆదేశించారు. -
నన్ను, సీఎం జగన్ను ఎవ్వరూ ఓడించలేరు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: ప్రజలు తనను నిలదీశారంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని టీడీపీ నేతలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను నిలదీశారంటూ ఎల్లోమీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోనన్నారు. గుడివాడలో తనను, రాష్ట్రంలో సీఎం జగన్ను ఎవ్వరూ ఓడించలేరని తెలపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. నేను వద్దన్నా నాపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల నా కాళ్లు కడిగారు. చంద్రబాబు, పవన్, లోకేష్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకొంటున్నారు. వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు, వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా, కార్యక్రమాలు నేను చేయడం లేదు. ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి. చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారు. ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా. నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల ఇళ్ల సమస్యలు పరిష్కరించేలా.. 23 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 12వందల కోట్లతో ఇల్లు కట్టిస్తున్నాం. రూ. 320 కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. మంచినీటి అవసరాల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేశాం. రూ. 200 కోట్లతో రోడ్లు వేశాం. ఎన్ని చేసినా ఎక్కడో ఒకచోట సమస్య అనేది ఉండటం సర్వసాధారణం. సమస్యలపై ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను అడుగుతారు. వారికి సమాధానం చెప్పుకుంటాం. మాకు మరో అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తామని ప్రజలకు చెబుతాం. ప్రజలు నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటుంటే నన్నేదో నిలదీశారంటూ ఎల్లో మీడియా హడావుడి చేస్తుంది’అని కొడాలి నాని అన్నారు. -
విషాదం.. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్దురాలు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్జా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెనమలూరు మండలం గంగూరులో పెన్షన్ కోసం వెళ్లిన వృద్దురాలు వడదెబ్బ తగిలి మృతిచెందింది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వజ్రమ్మ(80) ప్రాణాలు విడిచింది. ఉదయం నుంచి పెన్షన్ కోసం పడిగాపులు కాసిన వజ్రమ్మ వడదబ్బతో అక్కడే కుప్పకూలిపోయింది. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతోంది. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం వారి ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. పెన్షన్ల కోసం బారులు తీరారు. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు కారణంగా పింఛన్ల పంపిణీ నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. బాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు. -
జనసేనకు టికెట్ ఇస్తే ఓడిస్తాం.. చంద్రబాబుకు అల్టిమేటం
-
ఉమ్మడి జిల్లాలో కుదేలవుతున్న ‘కూటమి’
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ‘కూటమి’ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇంకా టికెట్ల పంచాయితీ కొలిక్కిరాకపోవడం.. ప్రకటించిన సీట్లలోనూ కొందరు అభ్యర్థుల ప్రవర్తన, మాటతీరుతో కూటమి మూడు పార్టీల నేతలను ఏకతాటిపైకి తీసుకురాకపోగా.. వంకరటింకరగా ఎవరిదారి వారిదే అన్నట్లు చేస్తోంది. మరోవైపు పార్టీ మారిన జంపింగ్ జపాంగ్లకు ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా తిరువూరు, మైలవరం, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో కూటమి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్. ఈయన ఆది నుంచి వివాదాస్పదుడే. అమరావతి రైతుల జేఏసీ కన్వీనర్ ముసుగులో పచ్చ మీడియాకు చంద్రబాబు డైరెక్షన్లో అద్దె మైకుగా పని చేశారు. చర్చా వేదికల్లో పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికి ప్రతిఫలంగానే చినబాబు సిఫారసుతో స్థానిక నేతలను కాదని తిరువూరు టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఏ.కొండూరు మండలంలో తాగునీరు సజావుగా సరఫరా అవుతున్నా.. గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పాదయాత్ర పేరుతో రెండు కిలోమీటర్లు కూడా నడవకుండానే హడావుడి చేసి అభాసుపాలయ్యారు. మూడునెలల తర్వాత రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలన్నీ కూల్చివేస్తామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నియోజకవర్గంలోని ప్రజల నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రెయినేజీలో ఉన్న కప్పలను పట్టి కూర వండి పంపిప్తాను తినండి అంటూ మున్సిపల్ అధికారులను కించపరిచేలా సందేశం పంపారు. ఆర్యవైశ్యుల సమావేశంలో మిగతా కులాలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేసి, ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు, క్యాడర్తో సఖ్యత పూర్తిగా లోపించింది. ఆయన ఒక్కరే బయటి నుంచి తెచ్చుకున్న యువకులతో కలిసి ప్రచారం చేయటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో టీడీపీ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఈయన మాకొద్దు బాబూ! అంటూ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చసాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీలో పోటీ చేసిన జవహర్, ఇక్కడ మళ్లీ పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. వెస్ట్లో వార్.. విజయవాడ వెస్ట్లో పోతిన మహేష్కే టికెట్ కేటాయించాలని జనసేన కార్యకర్తలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. పోతిన కాకుండా ఎవరికి టికెట్ కేటాయించినా.. జనసేన కార్యకర్తలు సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇక్కడ పొత్తులో భాగంగా సీటు బీజేపీకి కేటాయించింది. అక్కడ బీజేపీ తరఫున ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో అక్కడ పోటీచేసే అభ్యర్థి ఎవ్వరోననే సందిగ్ధత నెలకొంది. వసంతకు ఎదురుగాలి.. మైలవరం నియోజకవర్గంలో ఇటీవల వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టికెట్కు సంబంధించి టీడీపీ అధిష్టానం తాజాగా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. దీనిలో ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలో వసంత కృష్ణ ప్రసాద్పై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పార్టీమారి పోటీ చేయటాన్ని ప్రజలు సహించటం లేదు. డబ్బుతో నేతలను మేనేజ్ చేస్తున్నప్పటికీ, ప్రజలు మాత్రం ఈయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ మాత్రం బీసీ వర్గానికి చెందిన సామాన్య వ్యక్తికి సీటు కేటాయించింది. ఇక్కడ బీసీ వర్గానికి సంబంధించి లక్షకుపైగా ఓట్లు ఉండటం వసంతను ప్రస్తుతం కలవరపెడుతోంది. సామాన్యుని చేతిలో ఓటమి తప్పదేమో అనే బెంగ ఆయన పట్టి పీడిస్తోంది. దీంతో ఆయన కంగారు పడుతున్నట్లు ఆయన అనుచరులే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో అడిగిన ఓ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా తిట్ల దండకం అందుకోవడం ఆయనలో పెరుగుతున్న అసహనానికి అద్దం పడుతోంది. కృష్ణా జిల్లాలోనూ కంగారే.. కృష్ణా జిల్లాలోని పెనమలూరు టికెట్పై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. రోజుకొక పేరు తెరపైకి వస్తోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేన కోటాలోకి వెళ్లినా అక్కడ కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించపోవడంతో, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఆది నుంచి పార్టీ కోసం కష్టపడిన నేతలను కాదని, టీడీపీ అధినేత డైరెక్షన్లో అరువు నేతలకు టికెట్ కేటాయిస్తారనే అనుమానం జనసేన కార్యకర్తలను పట్టి పీడిస్తోంది. -
YSRCP కృష్ణా జిల్లా అభ్యర్థులు వీళ్లే
కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం
సాక్షి, కృష్ణా: సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డినే ప్రమాణస్వీకారం చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. శుక్రవారం ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. ‘మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగేవారు రాష్ట్రంలో లేరు. చంద్రబాబు.. పవన్.. సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే. సీఎం జగన్ను అధికారం నుండి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. నవ్వుతూ జైలుకెళ్ళిన సీఎం జగన్. 16 నెలల తర్వాత కూడా అదే చిరునవ్వుతో బయటకు వచ్చాడు. ...సీఎం జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదు. మాడు ముఖం, చించుకోవడం, ఫ్రస్టేషన్, గంతులు వేయడం ఇది ప్రతిపక్షాల తిరు. ఇలాంటి సైకోలందరూ కలిసి సీఎం జగన్ను వేధిస్తున్నారు. 58 నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తినా.. కరోనా ఇబ్బందులు వచ్చినా. ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించాడు. అదే చంద్రబాబు అయితే ఇంట్లో పడుకొని.. కరోనా కష్టాలతో ప్రజలను పస్తులుంచేవాడు’ అని కొడాలి నాని అన్నారు. -
ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో శిడిబండి వేడుక (ఫొటోలు)
-
టీడీపీ తొలి జాబితాపై మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవనిగడ్డ నుంచి టీడీపీ తరపున టిక్కెట్ ఆశిస్తున్న బుద్ధ ప్రసాద్.. ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అవనిగడ్డ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి అభ్యర్ధిగా తనకే టిక్కెట్ వస్తుందని బుద్ధ ప్రసాద్ ఆశపడ్డారు. పొత్తుల సీట్ల ప్రకటనలో అవనిగడ్డ సీటును చంద్రబాబు, పవన్ పెండింగ్లో పెట్టారు. మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ‘నేను పదవుల కోసం పుట్టలేదు. రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది. ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట! -
గ్రాఫిక్స్తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా?: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్రానికి మేలు జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేడని మాజి మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప.. రాజధాని రైతులు ఏ త్యాగం చేశారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో సీఎం జగన్కు తెలుసు. ఏ రాజధానిలోనైనా 150 ఎకరాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలుంటాయి. మిగిలిన 99 శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి. 33 వేల ఎకరాలు తీసుకున్న బాబు.. పిట్టలదొర కబుర్లు చేబుతున్నాడు. గ్రాఫిక్స్తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా? అని మండిపడ్డారు. దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి.. ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి. రాజధాని రైతులు ఏం త్యాగం చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప. మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్కత్తా ఏ రాజధానిలో అయినా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా?. రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడా?. దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా?. ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు. 25 లక్షల జనాభా, పోర్టు, అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే మహానగరంగా అయ్యి తీరుతుంది. ... వైజాగ్ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే, వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చేయొచ్చని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు. సీఎం జగన్ రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు, 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని రైతులు ఖాతాల్లో జమ చేసేవారు. కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం. నేనైతే సంపద సృష్టించే వాడిని, సీఎం జగన్కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు. సీఎం జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా.. ఓ సక్సెస్ఫుల్ బిజినెస్మాన్. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్’అని కొడాలి అన్నారు. -
చంద్రబాబు, లోకేష్ కుర్చీలను ఎప్పుడో మడతపెట్టేశాం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: 2019లో చంద్రబాబు, లోకేష్ కుర్చీలను మడతపెట్టేశామని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2024లో కూడా మళ్లీ వాళ్ల కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఊరూరా షామియానా కంపెనీలో కుర్చీలు అద్దెకు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదని..మీ సమావేశాల్లొ ఖాళీగా ఉన్న కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో చూసుకోండని చురకలంటించారు. గురివింద గింజకు ఒక్కచోటే మచ్చ.. కానీ బాబుకు నిలువెళ్లా మచ్చలేనని విమర్శించారు. చంద్రబాబు పేరు చెప్తే.. ఒక్క పథక కూడా గుర్తుకు రాదని అన్నారు. చంద్రబాబు సవాల్కుపేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడని మండిపడ్డారు. బందరులో ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. బందరు పోర్టును పూర్తిచేశావా?. మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నావ్.. మూడు గజాలైనా ఇచ్చావా అని ప్రశ్నించారు. ఆక్వా హబ్ను చేస్తానన్నావ్ చేశావా?. హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానని మోసం చేశాడన్నారు. ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు అని పేర్ని నాని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. 99 శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. సీఎం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కపథకమైనా ఉందా అని ప్రశ్నించారు. చదవండి: బాబుకన్నా దుర్మార్గులు ఎవరుంటారు? -
చంద్రబాబును భయపెడుతున్న టీడీపీ తమ్ముళ్లు
-
Krishna District: టీడీపీ సీనియర్ నేతలకు చంద్రబాబు భారీ షాక్..
ఇప్పటి వరకూ ఎమ్మెల్యే టికెట్ తమదేనంటూ ఆశల పల్లకీలో ఊరేగారు. ఎక్కువ కేసులు పెట్టించుకుని అధినేత దృష్టిలో పడేందుకు అడ్డగోలు చర్యలతో చెలరేగారు. చంద్రబాబుకు తాము ఎంత చెబితే అంత, తమకు కాక టికెట్ ఇంకెవరికి ఇస్తారంటూ విర్రవీగారు. డబ్బు మూటలే ప్రామాణికంగా పక్కపార్టీ నుంచి వచ్చేవారు, ఎన్ఆర్ఐలు, బడా పారిశ్రామికవేత్తలకు అధినేత టికెట్లు కేటాయిస్తుండటంతో దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆది నుంచి టీడీపీని నమ్ముకున్న నాయకులు ఎమ్మెల్యే టికెట్లపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతున్నాయి. ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తామన్న చంద్రబాబు, చినబాబు మాటలు నీటి మూటలేనని తేలాయి. అధినేతల మెప్పు కోసం నియోజకవర్గాల్లో హడావిడి చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, కేసులు పెట్టించుకోవడమే లక్ష్యంగా పని చేసిన వారికి నిరాశే మిగిలింది. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ డబ్బు మూటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్ఆర్ఐలు, బడా పారిశ్రామికవేత్తలకే ఎమ్మెల్యే సీట్లు కట్టబెడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ టికెట్ వెనిగండ్ల రాముకు, గన్నవరం టికెట్ యార్లగడ్డ వెంకటరావుకు కేటాయించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసి, పలు కేసులు పెట్టించుకున్న పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోడే ప్రసాద్ సీటు చింపేశారు. ఆయనకు టికెట్ లేదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారని సమాచారం. పక్క పార్టీల నుంచొచ్చే డబ్బున్న బడానేతలకు టికెట్ ఇస్తామన్న సంకేతాలు ఇచ్చారు. తనకే టికెట్ వస్తుందని బోడే ప్రసాద్ పాద యాత్రలు చేస్తున్నా, ఆయన భార్య, కుమారుడు కాళ్లకు బలపం కట్టుకుని గడప గడపకూ తిరుగుతున్నా ప్రయోజనం శూన్యమన్న చర్చ జరుగుతోంది. టికెట్ కోసం తమ ప్రత్యర్థి, పార్టీ మారుతున్న నేత పంచకు చేరి కాళ్లావేళ్ల పడగా, తనకే ఇక్కడ టికెట్ లేక వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని, అధిష్టానం వద్దే విన్నవించుకోవాలని ఆ నేత సూచించడంతో బోడే ప్రసాద్కు దింపుడు కల్లం ఆశ కూడా లేకపోయిందన్న చర్చ సాగుతోంది. ఉమాకు టికెట్ గల్లంతు పార్టీలో నంబరు–2, అధినేతకు తాను ఎంత చెబితే అంత అని విర్రవీగిన దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. అధినేత వద్ద మెప్పుకోసం నానా హంగామా చేసి కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లిన ఆయనను ఇప్పుడు అధినేత పట్టించుకోవటం లేదు. మైలవరం సీటు కోసం పక్క పార్టీల నుంచి వచ్చేవారు, పార్టీలోనే కొంత మంది డబ్బు మూటలు ఆశ చూపడంతో ఉమాకు చెక్ పెట్టినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. విజయవాడ ఎంపీ సీటు సైతం డబ్బే ప్రామాణికంగా కేశినేని చిన్నికి కేటాయిస్తున్నారని, పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ముద్దరబోయినకు షాక్ నూజివీడు నియోజకవర్గంలో పదేళ్లుగా పార్టీజెండా మోస్తూ తిరుగుతున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు, పార్టీ తరఫున పోరాటం చేసిన ముద్దరబోయినకు టికెట్ లేదని మొండి చెయ్యి చూపడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పక్క పార్టీ నుంచి వచ్చిన నేతకు టికెట్ కేటాయిస్తానని చెప్పడంపై, ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జనసేన పొత్తు నేపథ్యంలో పలుచోట్ల టీడీపీ అభ్యర్థులకు గండి పడింది. బీజేపీతో పొత్తు ఉంటుందన్న నేపథ్యంలో మరికొన్ని సీట్లు ఆ పార్టీకి కేటాయించాల్సి వస్తోంది. మిగిలిన సీట్లు ఎన్ఆర్ఐలు, బడా పారిశ్రామిక వేత్తలకు కేటాయిస్తే, ఆది నుంచి పార్టీని నమ్ముకొని పని చేసిన వారి పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో పార్టీ నేతల్లో అసంతృప్తి తారస్థాయికి చేరుతోంది. -
ఏపీలో డిజిటల్ బోధన సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విద్యావిధానం అద్భుతంగా ఉందని మెక్సికో దేశానికి చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) అమలులో భాగంగా ఐబీ ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు, పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆల్డో మంగళవారం కృష్ణా జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. విజయవాడలోని ఎంకే బేగ్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్లోని గదులను, ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. బోధనా అంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు విన్నారు. అనంతరం ‘జగనన్న గోరుముద్ద’ను రుచి చూసి మధ్యాహ్న భోజనం వంట కార్మికులను అభినందించారు. అనంతరం కంకిపాడు మండలం పునాదిపాడు, ఈడుపుగల్లు జెడ్పీ హైసూ్కళ్లను సందర్శించారు. పునాదిపాడులో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, ఈడుపుగల్లులో డ్రాయింగ్ ప్రదర్శన, సైన్స్ ల్యాబ్ను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ‘ఇండియన్ యోగా’ ప్రత్యేక ప్రదర్శనకు ఆల్డో ముగ్దులయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి, అడ్మిషన్ విధానంపై ప్రిన్సిపల్ను ఆరా తీశారు. విద్యార్థి నుల వివరాలు, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి బోధనా అభ్యసన పద్ధతులను పరిశీలించారు. అక్కడ గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాను విద్యార్థినులు ప్రదర్శించారు. స్కూళ్ల సందర్శన అనంతరం ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దిందని, వసతుల కల్పనలో ఉన్నతమైన ప్రమాణాలు పాటించిందని ఆల్డో అభినందించారు. ఈ పర్యటనలో ఐబీ ప్రతినిధి వెంటఎన్టీఆర్, కృష్ణా జిల్లాల విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ వై.గిరిబాబు యాదవ్, డీసీఈబీ సెక్రటరీ ఉమర్ అలీ ఉన్నారు. -
కృష్ణా జిల్లా కురుమద్దాలి హైవేపై కారు దగ్ధం
-
చంద్రబాబు మోసం చేశాడన్న... లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా
-
బందరు తీరంలో.. త్వరలో 'లంగరు'
కృష్ణాజిల్లా మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నం శరవేగంగా వాస్తవ రూపంలోకి వస్తోంది. దక్షిణాసియాకు అత్యంత సమీప ముఖ ద్వారంగా ఉన్న ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభించిన ఏడు నెలల్లోనే కీలకమైన బ్రేక్ వాటర్ పనులను పూర్తిచేయడం ద్వారా ఈ పోర్టు నిర్మాణంపై తన చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటోంది. ప్రత్యక్షంగా.. పరోక్షంగా 25,000 మందికి ఉపాధి క ల్పించే ఈ పోర్టు.. 2025 ఆరంభానికల్లా పూర్తయ్యేలా పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. – సాక్షి, అమరావతి బందరు పోర్టు తొలిదశ కింద రూ.5,254 కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ మే 22, 2023న భూమి పూజచేసి పనులు ప్రారంభించారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించడంతో పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే నార్త్బ్రేక్ వాటర్ నిర్మాణం పూర్తికాగా, సౌత్బ్రేక్ వాటర్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. అలాగే, రెండు బెర్తుల నిర్మాణ పనులూ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు మన రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా వేయగా.. వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్ బ్లాక్స్, ముడి ఇనుము, కంటైనర్ల ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుందని కూడా అంచనా. ఈ పోర్టు అందుబాటులోకి రావడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించనుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో.. ఇక రాష్ట్రంలో నిర్మిస్తున్న నాలుగు పోర్టుల్లో మచిలీపట్నం పోర్టు నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే.. ఇక్కడ సముద్రంలో ఇసుక మేటలు ఎక్కువగా ఉండడంతో పాటు తీరప్రాంతం కూడా ఇసుకతో ఉండటంతో భారీ కట్టడాల నిర్మాణానికి అనువుగా ఉండదు. ఇందుకోసం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేలను పటిష్టపరుస్తున్నారు. 2,075 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాంతాన్ని ప్రీఫ్యాబ్రికేటెడ్ వర్టికల్ డ్రెయిన్స్ (పీవీడీ) విధానంలో భూమిలోంచి నీటిని తోడి ఆ స్థానంలో మట్టిని పంపి భారీ కట్టడాలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. అదే విధంగా 52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడిపోయడం ద్వారా భారీ ఓడలు నిలుపుకునే విధంగా సముద్రాన్ని డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆ్రస్టేలియా నుంచి అత్యాధునిక డ్రెడ్జింగ్ మిషన్లను తీసుకొస్తున్నారు. ఏడు నెలల కాలంలోనే 12 శాతం నిర్మాణ పనులను పూర్తిచేయడం ద్వారా ఏపీ మారిటైమ్ బోర్డు రికార్డు సృష్టించింది. తండ్రి కోరికను నెరవేరుస్తున్న తనయుడు.. నిజానికి.. మచిలీపట్నం పోర్టు పునరుద్ధరణ అనేది స్థానిక ప్రజల చిరకాల స్వప్నమంటూ 2004 తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని తీసుకెళ్లారు. వారి కోరికను నెరవేర్చే విధంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి బందరు పోర్టు నిర్మాణానికి 2008, ఏప్రిల్ 23న శంకుస్థాపన చేశారు. వైఎస్ మరణానంతరం ఈ ప్రాజెక్టు అటకెక్కెంది. 2014 తర్వాత చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా 2019 ఎన్నికలకు కేవలం నెలన్నర ముందు కొబ్టరికాయ కొట్టి మమ అనిపించారు. కానీ, దీనికి భిన్నంగా ప్రసుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు సమకూర్చడం దగ్గర నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం.. సీఎం పదవి చేపట్టిన ఏడాదిలోపే 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలపమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటుచేశారు. రూ.5,254 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు చేయడమే కాకుండా జగన్ సర్కారు నిధులను కూడా సమకూర్చింది. ఆ తర్వాత ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.3,668.83 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించడానికి టెండరు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్తో 2023, ఫిబ్రవరి 26న ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన పర్యావరణ అనుమతులు కూడా 2023, ఫిబ్రవరి 28న వచ్చాయి. ఇలా అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించడమే కాక ఆ పనులు వేగంగా జరుగుతుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పోర్టు ఎప్పుడెప్పుడు ఎలా..? ♦ 1590 నుంచి ఎగుమతి దిగుమతులతో మచిలీపట్నం పోర్టు కళకళ.. ♦ 1970 నుంచి నిలిచిపోయిన పోర్టు కార్యకలాపాలు ♦ బందరు వాసుల చిరకాల వాంఛను తీరుస్తూ దివంగత సీఎం వైఎస్ 2008 ఏప్రిల్లో శంకుస్థాపన ♦ ఆయన మరణానంతరం అటకెక్కిన పోర్టు పనులు ♦ ఎన్నికలకు నెలన్నర ముందు ఎటువంటి అనుమతులు లేకుండా 2019లో చంద్రబాబు మరోసారి శంకుస్థాపన ♦ దీనికి భిన్నంగా ఇప్పుడు అన్ని అనుమతులతో పనులు ప్రారంభించిన సీఎం జగన్ ♦రూ.11,464 కోట్ల వ్యయంతో 116 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టు నిర్మాణం ప్రారంభం ♦తొలిదశలో రూ.5,254 కోట్ల పెట్టుబడితో పోర్టు పనులకు గత మే 22న శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్ ♦ 2,075 ఎకరాల్లో నాలుగు బెర్తులతో 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ♦ పోర్టును జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 6.5 కి.మీ మేర నాలుగులైన్ల రహదారి నిర్మాణం ♦అలాగే.. ఏడు కి.మీ రైల్వేలైన్ కూడా నిర్మాణం ♦ ఈ పోర్టుతో రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణకు ప్రయోజనం ♦ దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి ప్రాజెక్టు పూర్తి వ్యయం - 11,464 కోట్లు తొలిదశ పోర్టు సామర్థ్యం - 35 ఎంఎంటీపీఏ పూర్తిస్థాయి సామర్థ్యం - 116 ఎంఎంటీపీఏ బెర్తులు - 2,075ఎకరాల్లో నాలుగు బెర్తులతో నిర్మాణం కార్యకలాపాలు ప్రారంభం 2025ప్రారంభం నాటికి భారీ ఓడలు నిలిచేలా నిర్మాణం.. మచిలీపట్నం పోర్టు నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. భారీ ఓడలు నిలిచే విధంగా రాష్ట్రంలోని నాలుగు ఓడ రేవులను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ఓడరేవుల సగటు లోతు 7–8 మీటర్లు ఉండగా, ఇప్పుడు నిర్మిస్తున్న ఈ పోర్టుల్లో 16–18 మీటర్ల లోతు ఉండేలా నిర్మిస్తున్నాం. దీంతో భారీ ఓడలు రావడమే కాకుండా సరుకు రవాణా కూడా పెరుగుతుంది. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారం మొత్తం ఇప్పుడు మచిలీపటా్ననికే వస్తుంది. – రవీంద్రనాథ్రెడ్డి, డిప్యూటీ సీఈఓ, ఏపీ మారిటైమ్ బోర్డు 2025 నాటికి రెడీ.. అన్ని అనుమతులు ముందుగానే తీసుకోవడంతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏడు నెలల్లోనే 12 శాతం పనులు పూర్తిచేశాం. 6.5 కి.మీ కాంపౌండ్ వాల్ నిర్మాణం, నాలుగు బిల్డింగ్లు, జాతీయ రహదారి 216కు అనుసంధానం చేస్తూ 6.5 కి,మీ రోడ్డు అనుసంధానం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు బెర్తులకు సంబంధించి ఈ పైల్స్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. 2025 ప్రారంభం నాటికి ఈ పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నాం. – ఎం. దయాసాగర్, ఎండీ, మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంతోషంగాఉంది.. బందరు ప్రాంత అభివృద్ధి ఈ పోర్టు నిర్మాణంతో సాకారం కానుంది. పోర్టు నిర్మాణానికి నాకున్న భూమిని ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం నాకు కలిగింది. భావితరాల మేలు కోసం మాజీమంత్రి పేర్ని నాని చేసిన కృషి ఫలించింది. – పిప్పళ్ల వెంకటేశ్వరరావు, పోతేపల్లి, బందరు మండలం గర్వంగా ఉంది.. సొంత ఊరు అభివృద్ధికి కీలకమైన బందరు పోర్టు నిర్మాణంలో భాగస్వామి కావడం ఆనందంగాను, గర్వంగాను ఉంది. నేను ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉండేవాడిని. కానీ, ఈ పోర్టు నిర్మాణంలో నా వంతు కృషిచేయాలన్న తలంపుతో మచిలీపట్నంకు బదిలీ చేయించుకున్నా. బందరు పోర్టును జాతీయ రహదారికి అనుసంధానించే పనిలో పాలుపంచుకుంటున్నా. త్వరలో ఈ ప్రాంత ప్రజల కల సాకారం కానుంది. – బి.నాగసూర్య చంద్ర, అసిస్టెంట్ మేనేజర్, రైట్స్ సంస్థ -
మత్స్యకార ‘పథకాల’ అమలులో ఏపీ సహకారం భేష్
చిలకలపూడి(మచిలీపట్నం): మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాల అమలుకు కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో ఏపీ ప్రభుత్వ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారుల కృషి అభినందనీయమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి పరుషోత్తం రూపాల ప్రశంసించారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో అధికారులు భాగస్వామ్యులు కావాలని సూచించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండి హార్బర్ వద్ద సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం మత్స్యకారులు, ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం గిలకలదిండి హార్బర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. కాగా, నందివాడ మండలం రామాపురానికి చెందిన దావీదు, పెదలింగాలకు చెందిన తుమ్మల రామారావు, రవీంద్రబాబు, ప్రవీణ్లు కేంద్ర మంత్రికి పరిశ్రమల్లో ఎదుర్కొంటున్న కష్ట, నష్టాలను వివరించారు. మత్స్యరైతుల ఉత్పత్తిదారుల సంఘాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కేంద్ర మంత్రి సతీమణి సవితబెన్ రూపాల, కేంద్ర ప్రభుత్వ మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ నీతుకుమార్ ప్రసాద్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, కలెక్టర్ పి.రాజాబాబు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రతినిధి డాక్టర్ ఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కంకిపాడు జన కెరటం
కంకిపాడు: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార నినాదం గురువారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో మార్మోగింది. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా బహిరంగ సభకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు పెద్ద ఎత్తున కదం తొక్కారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్కు అక్కచెల్లెమ్మలు, యువత, అవ్వాతాతలు జేజేలు పలికారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగనన్నను సీఎంను చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. బాబు, పవన్ను తరిమికొట్టండి దొంగలకు, చంద్రబాబు, పవన్లకు తేడా లేదని మంత్రి జోగి రమేష్ చెప్పారు. వీరిద్దరూ పిక్పాకెటర్స్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి జేబు దొంగలను ప్రజలు మూకుమ్మడిగా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు సామాజిక న్యాయం చేశానని చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో అసమానతలు జగనన్న పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తలెత్తుకు బతుకుతున్నాయని మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణ చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సామాజిక న్యాయం లేకపోగా, అన్నీ అసమానతలు, అవమానాలు, వెలివేతలే మిగిలాయన్నారు. టీడీపీలో ముస్లింలకు స్థానమేది? ముస్లిం వర్గాలకు టీడీపీలో స్థానం లేదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ చెప్పారు. వారికి కనీస గుర్తింపు కూడా మృగ్యమేనన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క ముస్లింకు అయినా మంత్రి పదవి ఇచ్చారా.. అని ప్రశ్నించారు. సీఎం జగన్ ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పాలన అంతా చంద్రబాబు దోపిడీని సాగిస్తే.. జగనన్న సామాజిక న్యాయంతో అణగారిన వర్గాల ఉన్నతికి అహర్నిశలు పాటుపడుతున్నారని ప్రశంసించారు. విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రగతి.. సామాజిక న్యాయంతో అణగారిన వర్గాలకు జగన్ రాజ్యాధికారం చేరువ చేశారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం పాటుపడిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అణగారిన వర్గాలకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా.. అని సవాల్ విసిరారు. సామాజిక న్యాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకి ఎక్కడిదని, సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలతో అన్ని వర్గాల ప్రగతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. రోడ్లు, ప్రాజెక్టులు, విదేశీ పెట్టుబడులే కాదని, అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కూడా ముఖ్యమే అని చాటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణనిధి, సామినేని ఉదయభాను, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, కేడీసీసీ చైర్పర్సన్ తాతినేని పద్మావతి, డీసీఎంఎస్ చైర్పర్సన్ పడమట స్నిగ్ధ, నియోజకవర్గ పరిశీలకులు బొప్పన భవకుమార్, మంగళగిరి పార్టీ ఇన్చార్జి గంజి చిరంజీవి, కమ్మ, కాపు కార్పొరేషన్ చైర్మన్లు తుమ్మల చంద్రశేఖర్, అడపా శేషు, తదితరులు పాల్గొన్నారు. -
ఇవాళ కృష్ణా జిల్లా పెనమలూరులో సామజిక సాధికార యాత్ర
-
అక్కడ తమ్ముళ్ల పరిస్థితి అగమ్యగోచరం!
ఆ నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం డామినేషన్ ఉందని చెప్పుకునేవారు. కాని గత ఎన్నికల్లో అక్కడ టీడీపీ తుక్కు తుక్కుగా ఓడిపోయింది. అందుకే ఈ సారి అక్కడ మళ్ళీ పట్టు నిలుపుకోవాలని పచ్చ పార్టీ బాస్ తెగ ఆరాటపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేను కాకుండా బాగా డబ్బు ఖర్చు పెట్టగల అభ్యర్థిని దించాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. బాస్ తీరుతో ఈసారి టిక్కెట్ రాదేమోనని ఆ మాజీ ఎమ్మెల్యేకు గుండె దడ మొదలైందట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని తమ్ముళ్లు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందట. ఎవరికి వారే తమకే టిక్కెట్టు దక్కుతుందని ఇన్నాళ్లూ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న నేతలకు చంద్రబాబు నిర్ణయాలు షాకిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే..2014లో సైకిల్ జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ప్రభంజనంలో సైకిల్ పార్టీ ముక్క చెక్కలైంది. అయితే ఈ సారి ఎలాగైనా పెనమలూరు నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ పెద్ద కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పెనమలూరు టిక్కెట్ కోసం టీడీపీలో పెద్ద ఫైటే నడుస్తోందని సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, చలసాని వెంకటేశ్వరరావు మేనల్లుడు దేవినేని గౌతమ్ వేర్వేరు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారట. వీరంతా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ టిక్కెట్ తమదే అని చెప్పుకుంటున్నారట. ఇలాంటి సమయంలో చంద్రబాబు పెనమలూరు నియోజకవర్గంలో వీరందరినీ కాదని వేరే అభ్యర్ధిని బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే మూడు గ్రూపులతో ఎవరి వెంట నడవాలో అర్ధంకాక తలపట్టుకుంటున్న క్యాడర్ చంద్రబాబు తాజా నిర్ణయంతో మరింత కన్ఫ్యూజన్ లో పడ్డారట. పెనమలూరు నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజికవర్గాలు బలమైనవి. దీంతో ఇప్పుడు ఈ రెండు సామాజికవర్గాల ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనట. ప్రస్తుత టీడీపీ ఇంఛార్జి బోడే ప్రసాద్ కమ్మ సామాజికవర్గానికి చెందిన వాడే అయినప్పటికీ 2024 ఎన్నికల్లో దండిగా ఖర్చు పెట్టగలిగిన కమ్మనేతను బరిలోకి దించాలనుకుంటున్నారట చంద్రబాబు. బోడే ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్కు ధీటైన అభ్యర్ధి కాదని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే కమ్మ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు దేవినేని ఉమా లేదా కేశినేని చిన్ని పేర్లను పరిశీలిస్తున్నారట. వీరెవరూ కాకపోతే కొనకళ్ల నారాయణ తమ్ముడు కొనకళ్ల బుల్లయ్యను బరిలోకి దించి బిసి ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈక్రమంలోనే గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా దేవినేని ఉమా, కొనకళ్ల నారాయణ, కొనకళ్ల బుల్లయ్య పాల్గొంటున్నారట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇప్పటి వరకూ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న బోడే ప్రసాద్ కు ఈ పరిణామాలతో అసంతృప్తికి గురవుతున్నారు. నాలుగేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ ...ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా రోడ్డెక్కి నిరనసలు చేసిన తనను కాదని ఇప్పుడు మరో అభ్యర్ధిని నిలబెట్టాలని చూడటంపై బోడే లోలోన రగిలిపోతున్నాడట. ఆ మధ్య చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు దీక్షలు చేపట్టిన సమయంలో...బోడే మాట్లాడుతూ, ఎవరెవరో వచ్చి తమకే టిక్కెట్ అంటున్నారు.. పార్టీ కోసం కష్టపడిన తనను పక్కన పెట్టాలని చూడటం కరెక్ట్ కాదని బహిరంగంగానే తన ఆవేదన వెళ్ళగక్కారు. అప్పటి ఆవేదన ఇప్పుడు నిజమైతే తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక బోడే ప్రసాద్ కుమిలిపోతున్నారట. -
తండ్రిని చంపిన తనయుడు
నాగాయలంక (అవనిగడ్డ): చెడు వ్యసనాలకు బానిసైన ఓ కొడుకు అప్పులు తీర్చేందుకు ఇంటి స్థలం విక్రయించ లేదని తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణాజిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బండే హరిమోహనరావు(48) భార్య 20 ఏళ్ల కిందటే చనిపోయింది. కుమార్తెకు వివాహం చేశారు. 25 సంవత్సరాల కుమారుడు పవన్ కల్యాణ్ ఇదే గ్రామంలోని అమ్మమ్మగారి ఇంటివద్ద ఉంటున్నాడు. దీంతో చిన్న పూరిపాకలో హరిమోహనరావు ఒక్కడే నివసిస్తున్నాడు. కొడుకు పవన్ కల్యాణ్ చెడు వ్యసనాలకు బానిసగా మారి తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికి హరిమోహనరావు ఉంటున్న ఇంటి స్థలాన్ని విక్రయించాల్సింగా తరచూ గొడవపడుతున్నాడు. దీనికి తండ్రి అంగీకరించడంలేదు. దీనిని మనసులో పెట్టుకున్న పవన్కల్యాణ్ శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో తండ్రి ఉంటున్న ఇంటికి వచ్చి గొడవపడి బలమైన ఆయుధంతో అతని తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ఆపై డీజిల్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి పారిపోయాడు. హరిమోహనరావు మృతదేహం ఇంట్లోనే మంచంపై పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
అందుకే చంద్రబాబుకు ఏడుపు: కొడాలి నాని
సాక్షి, కృష్ణాజిల్లా: ఆగి ఉన్న లారీ కింద దూరిన కుక్క.. ఆ లారీని తానే మోస్తున్నానని అనుకుంటుందని, లారీ కింద దూరిన కుక్కకి టీడీపీ నేతలకు తేడా లేదంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ.. రేవంత్రెడ్డిని వీళ్లే సీఎం చేసినట్లు ఫీల్ అవుతున్నారని, సిగ్గులేకుండా గాంధీ భవన్లో టీడీపీ జెండాలు పట్టుకుని గంతులేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే కదా, ఒక శిష్యుడు దిగిపోయి మరొక శిష్యుడు పదవిలోకి వచ్చాడని చెప్పారు. తన శిష్యులు సీఎంలు అవుతున్నారని చంద్రబాబు వెక్కివెక్కి ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజలను పట్టించుకోకుండా హెరిటేజ్, ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే పట్టించుకున్నాడని ఫైర్ అయ్యారు. కోటాను కోట్లు దోచుకుంటాడు కాబట్టే చంద్రబాబు వంటి పనికిరాని వాళ్లు చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తుచేశారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినందుకు సీఎం జగన్మోహన్రెడ్డిపై వ్యతిరేకత ఉంటుందా? లేదా చంద్రబాబు దొంగ 420 అయినందుకు అనుకూలత ఉంటుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రావడం పగటికల అని అన్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీచేస్తే జనసేన పరిస్థితి ఏమైందో మనం చూశామని చెప్పారు. ఏపీలో చంద్రబాబుతో కలిసి జనసేన పోటీచేస్తే.. తెలంగాణ మాదిరిగానే అవుతుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షం కోసమే చంద్రబాబు.. అసెంబ్లీలో అధ్యక్షా అనడం కోసం పవన్ కళ్యాణ్ పొత్తుపెట్టుకున్నారని మండిపడ్డారు. గుడివాడ వైఎస్సార్సీపీకి కంచుకోట అని, తాను బతికుండగా గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా దించడం ఎవరివల్లా కాదని అన్నారు. ఈ వార్త కూడా చదవండి: సామాజిక జైత్ర యాత్ర.. హోరెత్తిన మడకశిర -
Michaung Cyclone: భారీ వర్షాలతో నీట మునిగిన వరి పంట
-
బీపీటీకి భలే గిరాకీ
అవనిగడ్డ: బీపీటీ ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర పలుకుతుండడంతో ‘దివిసీమ’ రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా వర్షాభావ పరిస్థితుల్లో సైతం అధిక దిగుబడులు రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో ఈ ఏడాది 62,548 ఎకరాల్లో బీపీటీ–5204 వరి రకాన్ని సాగు చేశారు. ఈ సంవత్సరం సరిగా వర్షాలు పడకపోయినా ఇరిగేషన్శాఖ అధికారులు రైతులను సమన్వయ పరచి వంతుల వారీ విధానం ద్వారా సాగునీరు అందించారు. దివిసీమలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి యంత్రాలతో వరికోత పనులు ముమ్మరం చేశారు. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎకరాకు ఐదు బస్తాల దిగుబడి పెరిగినట్లు కోడూరుకు చెందిన రైతులు తెలిపారు. 2014తో పోలిస్తే రెట్టింపైన ధర.. 2014–15 చంద్రబాబు పాలనలో సాధారణ వరి రకం క్వింటా రూ.1,360 ఉండగా, బస్తా ధాన్యం రూ.850కి కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.1,400 ఉండగా బస్తా ధాన్యం రూ.950కి కొన్నారు. 2022–23 నాటికి సాధారణ రకం రూ.2,040 ఉండగా, ఏ గ్రేడ్ రకం రూ.2,060 ఉంది. 2023–24లో సాధారణ రకం రూ.2,183 ఉండగా, ఏ గ్రేడ్ రకం రూ.2,203 ఉంది. అంటే 2014తో పోలిస్తే సాధారణ రకానికి క్వింటాల్కు రూ.823 ధర పెరగ్గా, ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్కు రూ.803 ధర పెరిగింది. 2014తో పోలిస్తే సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో బస్తాకు ధర రెట్టింపు స్థాయిలో పెరిగింది. కాగా, గతేడాది «కోతల తరువాత నాలుగైదు నెలలకు బస్తా రూ.1,800 ధర పలకగా, నేడు యంత్రాలతో కోసిన ధాన్యాన్ని కల్లంలోనే రూ.1,820కు కొంటుండడంతో రైతులు పట్టరాని ఆనందంలో ఉన్నారు. మిషన్కోత ధాన్యం ఇంత ధర పలకడం ఎప్పుడూ చూడలేదు.. ఆరున్నర ఎకరాల్లో వరిపంట సాగు చేశాం. మిషన్తో వరికోత కోశాం. ఎకరాకు 35 బస్తాల దిగుబడి వచి్చంది. బస్తా ధాన్యం రూ.1,820కి అమ్మేశాం. మిషన్కోత ధాన్యం ఇంత రేటు పలకడం నేను ఎప్పుడూ చూడలేదు. –మాలే రాధాకృష్ణ, ఇస్మాయేల్బేగ్పేట, కోడూరు మండలం ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు.. రెండెకరాలు కౌలుకు సాగు చేశాను. గతేడాదితో పోలిస్తే ఖర్చులు తగ్గి.. దిగుబడులు పెరిగాయి. యంత్రాలతో కోసిన ధాన్యంను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ ధరకు కొంటున్నారు. – జుజ్జువరపు రామస్వామి, కౌలురైతు, వెంకటాపురం, మోపిదేవి మండలం -
సామాజిక జైత్ర యాత్ర.. జై జగన్ నినాదాలతో హోరెత్తిన పామర్రు
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర సాగింది. మధ్యాహ్నం ప్రియా టవర్స్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభమైంది. భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, కొలుసు పార్ధసారధి, ముస్తఫా, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. సాయంత్రం పామర్రు సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ, సామాజిక సాధికార యాత్ర ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలన్నారు. అనేక మంది ఉద్ధండులు సామాజిక రుగ్మతలు పోవాలని ఉద్యమాలు చేశారన్నారు. ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన వ్యక్తి సీఎం జగన్. కోట్లు వెచ్చించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధికి కృషి చేశారు’’ అని మంత్రి నాగార్జున పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి పోటీ చేశారు. 600కు పైగా హామీలిచ్చి మోసం చేశాడు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు.. ఎస్సీలను ఘోరంగా అవమానించాడు. పేదలకు ఆరోగ్యం,ఇంగ్లీషు మీడియం చదువు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి సీఎం జగన్. చంద్రబాబును బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలెవరూ నమ్మొద్దు. సీఎం జగన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. బీసి, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలు ఐక్యతగా ఉండాలి. సీఎంకు మనం అండగా నిలిచి.. మళ్లీ గెలిపించుకోవాలి’ అని మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. ఏపీలో జైత్ర యాత్ర: ఎంపీ మోపిదేవి సామాజిక సాధికారత గతంలో మాటల్లోనే విన్నాం.. కానీ సామాజిక సాధికారత అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. సీఎంకు కృతజ్ఞతగా రాష్ట్రంలో జైత్ర యాత్ర సాగుతోంది. సీఎం కుర్చీలో దగ్గర్నుంచి మన కోసమే ఆలోచన చేసిన వ్యక్తి జగన్. సీఎం పేరు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. బీసీ కులాల నుంచి నలుగురిని రాజ్యసభకు పంపించారు. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా ప్రతీ ఒక్కరికీ సాధికారత దక్కింది’’ అని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు. మీది షణ్ముఖ వ్యూహమైతే.. మాది జగనన్న వ్యూహం: మంత్రి జోగి రమేష్ దేశంలో సామాజిక న్యాయం అమలు చేసిన ఏకైక సీఎం మన జగనన్న. సీఎం జగన్ను దించడం కోసం ఒకడు షణ్ముఖ వ్యూహం అంటాడు. ఛీటర్స్ అంతా చేరి వ్యూహం పన్నుతున్నారు. సీఎం జగన్కు వ్యూహాలతో పనిలేదు. జగనన్నకు ఊపిరిగా మేం ఉన్నాం.15 రోజులకోసారి టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాల్లో మీటింగ్లు పెట్టి ఏం సాధిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, కాపు సోదరుల దెబ్బకు మీరు తుడిచి పెట్టుకుపోతారు. జగనన్న కటవుట్ వేస్తేనే పామర్రు పోటెత్తింది. జగనన్న వస్తే ఆ సునామీలో మీరంతా కొట్టుకుపోతారు. మీది షణ్ముఖ వ్యూహమైతే.. మాది జగనన్న వ్యూహం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం పదవుల్లో అవకాశం కల్పించిన ఒకే ఒక్కడు జగన్. ఏపీకి 25 ఏళ్లు జగనన్నే సీఎంగా ఉంటాడు.. ఇది చరిత్ర నా ప్రాణం ఉన్నంత వరకూ సీఎం జగన్ వెంటే.. ఎమ్మెల్యే కైలే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ సీఎం జగన్ వెంటే ఉంటానని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యుల వల్లే నేను ఈ స్థాయికి ఎదిగా.. ఎప్పటికీ పామర్రు ప్రజలకు రుణపడి ఉంటా. ఎస్సీలు నీట్గా ఉండరన్న వ్యక్తి చంద్రబాబు.. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. .కానీ జగన్ మాత్రమే నా ఎస్సీ, బీసీ,మైనార్టీ అంటూ మనల్ని అక్కున చేర్చుకున్నారు.. ఊరికి ఇద్దరు బాగుపడితే చాలనుకుంటాడు చంద్రబాబు..ఊరంతా బాగుపడాలని కోరుకునేది వైఎస్ జగన్. ప్రత్యర్ధులకు కైలే మాస్ వార్నింగ్.. పామర్రు ప్రజల కోసం నేను ఎన్ని మెట్లు అయినా దిగుతా. కొందరు అనవసరంగా ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తున్నారు. వంగవీటి మోహనరంగా హత్య జరిగినపుడు ఎవరు ఎక్కడ ఉద్యోగంలో ఉన్నారో నాకు తెలుసు. మీ ఇంట్లో పిల్లోడు ఏడ్చినా కైలే కారణమని చెప్పడం మానుకోండి. నేను జీతానికి పనిచేయడం లేదు. పామర్రు ప్రజలకు సేవ చేసేందుకే పనిచేస్తున్నా -
ప్రజలు మళ్ళీ సీఎం జగనే కావాలని కోరుకుంటున్నారు..
-
మరో 4 జిల్లాల్లో ప్రైమ్ రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రజలు సులభంగా చేసుకునేలా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం కార్డ్ ప్రైమ్ మరో 4 జిల్లాల్లో ప్రారంభమైంది. నంద్యాల, విశాఖ, అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లోని 51 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోమవారం నుంచి ఈ విధానంలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల నుంచి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని 24 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో దశల వారీగా మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు. ఈ నెల 14న శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించనున్నారు. దశల వారీగా ఈ నెలాఖరుకల్లా అన్ని జిల్లాల్లో కొత్త రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై ఈ–సిగ్నేచర్తోనే.. ప్రస్తుతం డాక్యుమెంట్లో ఆస్తి యజమాని సంతకాలు పెట్టే విధానాన్ని కొనసాగిస్తున్నా త్వరలో ఈ–సిగ్నేచర్ను మాత్రమే అనుమతించనున్నారు. సబ్ రిజిస్ట్రార్ సంతకాలు ఇప్పటికే ఈ–సైన్ల ద్వారా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యవసాయ భూములైతే ఆన్లైన్లో నమోదు చేయించుకోవడానికి తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటోమేటిక్గా మ్యుటేషన్ కూడా కొత్త విధానంలో జరిగిపోతుంది. రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లను సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ–సేవా కేంద్రాలు, సీఎస్సీ కేంద్రాల్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. అవగాహన లేకే ‘జిరాక్సుల’ ప్రచారం కొత్త రిజిస్ట్రేషన్ల విధానంలో ప్రజల డాక్యుమెంట్లను వారికివ్వకుండా జిరాక్సులు మాత్రం వారికిచ్చి, ఒరిజినల్ డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఉంచుతారనే ప్రచారంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ స్పందించారు. లక్షల డాక్యుమెంట్లను దాచిపెట్టేటన్ని బీరువాలు, కప్బోర్డులు తమ ఆఫీసుల్లో లేవన్నారు. జిరాక్సుల ప్రచారం అపోహ మాత్రమేనని, అవగాహన లేకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం తగదన్నారు. -
సామాజిక జైత్రయాత్ర
-
సాక్షి స్పెల్ బి పరీక్షలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన
-
అవనిగడ్డలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పర్యటన
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సోమవారం పర్యటించారు. సామాజిక సాధికార బస్ యాత్ర ఏర్పాట్లను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి పరిశీలించారు. అదే విధంగా అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో ప్రారంభానికి సిద్ధమైన డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పరిశీలించారు. కాగా నవంబర్ 2న అవనిగడ్డలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా ళ్ల అయ్యోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. నాలుగేళ్ళలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 85 శాతం మందికి వారి అవసరాలు తీర్చామని చెప్పారు. ఆయా వర్గాల జీవన విధానం మెరుగు పడిందన్నారు. ఈ బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణులు, లబ్ధిదారులు వేడుకలా జరుపుకునే వాతావరణం ఏర్పడిందని తెలిపారు. బస్సు యాత్ర రూట్లో అన్ని వర్గాల వారిని కలుస్తామని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం ద్వారా కలిగిన లబ్ది ద్వారా కలిగిన సంతోషాన్ని పంచుకునే కార్యక్రమం సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆర్ధిక, సామాజిక సాధికారతకు సీఎం జగన్ పరిపాలన దోహదపడిందని తెలిపాఉ. -
అతడు.. ఆ ఆరుగురిలో సజీవం
లబ్బీపేట(విజయవాడ తూర్పు)/గన్నవరం/తిరుపతి తుడా: తనువు చాలించినా.. అవయవాల దానంతో ఆరుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు 23 ఏళ్ల యువకుడు గారపాటి జయప్రకాష్. కొడుకు ఇక లేడన్న చేదు నిజం గుండెలను పిండేస్తున్నా.. పుట్టెడు దుఃఖంలో కూడా అతడి కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవదానం నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాష్ (23) ఈ నెల 25న నిడుమోలు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. చిన్న వయసులోనే తమ బిడ్డ దూరమైనా, కనీసం ఇతరుల జీవితాల్లో అయినా వెలుగులు నింపాలని భావించిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జయ ప్రకాష్ గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో కిడ్నీని విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి, కళ్లను విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. గుండెను తిరుపతి తరలించేందుకు ఆయుష్ ఆస్పత్రి నుంచి గన్నవరం ఎయిర్పోర్టు వరకు పోలీసులు గ్రీన్చానల్ ఏర్పాటు చేశారు. 32 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి వైఎస్సార్ కడప జిల్లా వేముల ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గుండె సంబంధిత సమస్యతో తిరుపతిలోని శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో చేరాడు. గుండె మారి్పడి అనివార్యమని నిర్ధారించి తాత్కాలిక చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో జయప్రకాష్ అవయవదానం విషయమై శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్రెడ్డికి సమాచారం అందింది. సంబంధిత వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపగా వారు అనుమతి మంజూరు చేశారు. గుండె మార్పిడి చికిత్సకు అవసరమైన రూ.12 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా విడుదల చేశారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గుండెను తిరుపతికి తరలించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి గ్రీన్ చానల్ ద్వారా పద్మావతి కార్డియాక్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి వైద్య బృందం సుదీర్ఘంగా శ్రమించి విజయవంతంగా గుండె మార్పిడిని పూర్తి చేశారు. యువకుడికి పునర్జన్మను ప్రసాదించారు. అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ లభించింది. శ్రీకాకుళానికి చెందిన బి.రామరాజు, లావణ్య దంపతుల కుమారుడు బి.కృష్ణశ్రావణ్ (17) ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ నెల 25న స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో విశాఖపట్నం ఎంవీపీ కాలనీ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. శ్రావణ్కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర దుఖఃలోనూ శ్రావణ్ తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఒక కిడ్నీ మెడికవర్ ఆస్పత్రికి, మరో కిడ్నీ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
పవన్ అతి..వికటిచింది
-
దంపతులను బలి తీసుకున్న పాతకక్షలు
అయ్యంకి(మొవ్వ): గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన జంట హత్యలు కృష్ణాజిల్లాలో కలకలం రేపాయి. ఆస్తి తగాదాలు, పాత కక్షలు భార్య భర్తలను బలితీసుకున్నాయి. మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యంకి గ్రామానికి చెందిన వీరంకి చిన ఆంజనేయులుకు కుమారులు వీరంకి వీరకృష్ణ, వీరంకి పూర్ణచంద్రరావు, కుమార్తె అమ్ములు ఉన్నారు. ఆంజనేయులుకి గ్రామంలో 3.01 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వల్ల ఏర్పడిన వివాదాల కారణంగా 2008లో తండ్రి చినఆంజనేయులును, 2012లో తమ్ముడు పూర్ణచంద్రరావును వీరకృష్ణ హత్య చేశాడనే ఆరోపణలొచ్చాయి. అయితే ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది. కాగా, పూర్ణచంద్రరావు హత్యానంతరం అతడి భార్య స్వర్ణ, ముగ్గురు కుమారులు గణేశ్, లోకేశ్, భువనేశ్ అయ్యంకి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఇటీవల స్వర్ణ తన పొలానికి పట్టాదారు పాసు పుస్తకానికి అప్లయ్ చేయగా లింక్ డాక్యుమెంట్స్ లేవంటూ వీఆర్వో, ఆర్ఐలు రిజక్ట్ చేశారు. దీనిపై వివరణ కోరేందుకు తాజాగా ఆమె తన కుమారులు ముగు్గరితో కలిసి గురువారం మధ్యాహ్నం అయ్యంకిలోని వీఆర్వో కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా పాస్పుస్తకాల విషయంలో స్వర్ణ కుటుంబానికి, అక్కడే ఉన్న వీరకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన స్వర్ణ కుమారులు వెంట తెచ్చుకున్న కత్తులతో పెదనాన్న వీరకృష్ణను విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమం వద్ద ఉన్న వీరకృష్ణ భార్య వరలక్ష్మిని సైతం కత్తులతో పొడిచి హత్యచేసి పరారయ్యారు. గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు సీఐ ఎన్.వెంకటనారాయణ, కూచిపూడి ఎస్ఐ డి.సందీప్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ప్లాన్తోనే వీరకృష్ణ, వరలక్ష్మి దంపతుల హత్య జరిగినట్లు తెలిపారు. వీరకృష్ణ తమ్ముడి భార్య స్వర్ణ, ఆమె కొడుకులే హత్యలకు కారణమని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మృతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
దేశంలోనే నంబర్–1 బ్యాంక్ ఆప్కాబ్
సాక్షి, అమరావతి: సహకార బ్యాంకుల్లో ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) సత్తా చాటుకుంది. సహకార రంగంలో దేశంలోనే నంబర్–1 బ్యాంకుగా ఎంపికైంది. 2020–21, 2021–22 సంవత్సరాలకు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి అవార్డులు దక్కించుకుంది. కాగా.. 2020–21 సంవత్సరానికి కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీబీ), 2021–22 సంవత్సరానికి వైఎస్సార్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (వైడీసీసీబీ) మొదటి స్థానంలో నిలిచి అవార్డులు పొందాయి. ఏటా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన రాష్ట్ర అపెక్స్ బ్యాంకులతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య (నాఫ్స్కాబ్) అవార్డులను ప్రదానం చేస్తోంది. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలలో అత్యుత్తమ పురోగతి సాధించిన బ్యాంకులకు అవార్డులు ప్రకటించింది. ఆప్కాబ్ 2020–21లో రూ.30,587.62 కోట్లు, 2021–22లో రూ.36,732.43 కోట్ల టర్నోవర్తో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. రెండేళ్లపాటు వరుసగా రూ.238.70 కోట్లు, రూ.246.81 కోట్ల లాభాలను ఆప్కాబ్ ఆర్జించింది. -
దయచేసి రావాలి..!!
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినా పార్టీ నాయకులు, క్యాడర్ బయటకు రాకపోవడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ పార్టీ అధినేత ఇబ్బందుల్లో ఉన్నా ఎక్కడా నిరసనలు చేయకపోవడం సరికాదన్నారు. ఎందుకు ఆందోళనలు చేయడం లేదని చాలామంది తనను అడుగుతున్నారని, తనకు చాలా బాధగా ఉందని, ఇప్పటికైనా జనసమీకరణ చేయాలని పార్టీ నాయకులను ప్రాధేయపడ్డారు. ఆదివారం కృష్ణా జిల్లా టీడీపీ ఇన్ఛార్జీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఎలాగైనా జనాన్ని తరలించాలని అచ్చెన్నాయుడు వేడుకుంటున్న ఆడియో లీక్ అయింది. ‘పార్టీ అధ్యక్షుల వారిని అరెస్టు చేశారు. ఇంతకంటే మనకు, పార్టీకి ప్రాధాన్యత అంశం ఇంకొకటి లేదు.. రాదు కూడా! నేను ఈ కాన్ఫరెన్స్ నిర్వహించటానికి కారణం... ఆ చుట్కుపక్కల ప్రాంతాల్లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. పోలీసులు ఆపుతున్నారని మీరు అనవచ్చు. వాళ్లు చేస్తారు. దయ ఉంచి.. ఎక్కడి కక్కడ అర్బన్ నియోజకవర్గాల్లో బొండా ఉమ, గద్దె రామ్మోహన్, వన్టౌన్ నాయకులు, బోడె ప్రసాద్ బయటకు రావాలి. పెద్ద నాయకులను హౌస్ అరెస్టు చేస్తున్నారు గానీ సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్కు ఎక్కడా ఇబ్బంది లేదు. వెంటనే అందరూ రంగంలోకి దిగి జనసమీకరణ చేయాలి. అందులో మహిళలు ఎక్కువ మంది ఉండాలి’ అని అందులో అచ్చెన్న పేర్కొన్నారు. రాత్రి నుంచి చెబుతూనే ఉన్నా.. తాను రాత్రి 3 గంటల నుంచి జనసమీకరణ గురించి అందరికీ చెబుతూనే ఉన్నానని విజ యవాడ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురాం కాన్ఫరెన్స్లో వివరణ ఇచ్చారు. తమ నియోజకవర్గం వాళ్లను పో లీస్ స్టేషన్లో పెట్టారని, వాళ్లంతా చాలా చికాకుగా ఉందని ఫోన్లు చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాపోయారు. మహిళల్ని ఇబ్బంది పెట్టకపోయినా... వెళ్లిపోతారా? లేదా వ్యాన్ ఎక్కించమంటారా? అని అడుగుతున్నారని చెప్పారు. సెకండరీ లీడర్లు చాలా భయపడుతున్నారని, ప్రాక్టికల్గా చాలా ఇబ్బందిగా ఉందన్నారు. పోలీసులు బయటకు రానివ్వడం లేదని విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జి బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. చాలా ఇబ్బందులున్నాయని, 20 మంది కార్యకర్తలను పంపిస్తే రాత్రి 11 గంటలకు వదిలారని మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసి తిప్పుతున్నా చిన్న చిన్న కారణాలు చెప్పి బయటకు రాకపోవడం బాగోలేదని టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్థన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితి చంద్రబాబుది: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీమంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత 40 ఏళ్లలో చంద్రబాబు ఏనాడూ తన తండ్రి ఎవరో ఈ ప్రపంచానికి చెప్పుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితిలో చంద్రబాబు ఉన్నాడని మండిపడ్డారు. తాను రాజశేఖర్ రెడ్డి, విజయమ్మల కుమారుడినని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిత్యం చెప్పుకుంటారని తెలిపారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని చంద్రబాబు సీఎం జగన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి , తండ్రి చనిపోతే తలకొరివి పెట్టలేని వాడు.. నేటికీ రామారావు అల్లుడినని చెప్పుకుంటాడని చంద్రబాబుపై మండిపడ్డారు పేర్ని నాని. నేను ఫలానా వాడి కొడుకుని అని చెప్పుకోలేని వాడు కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. రాజకీయాల్లో చంద్రబాబు ఉండటం అనవసరమని అన్నారు. పొలాల్లో తాడిచెట్టుకు, మర్రిచెట్టుకు కూడా వయసొస్తుందన్న ఆయన.. 80 ఏళ్ల వయసులో రాజకీయాల కోసం ఉక్రోషంతో దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసినా వైఎస్సార్సీపీ జెండాను కూడా టచ్ చేయలేడని పేర్నినాని అన్నారు. చంద్రబాబు బతుకంతా ప్రజలకు తెలుసని, అధికారంలో రావడానికి అరచేతిలో వైకుంఠం చూపిస్తాడని.. అధికారంలోకి వచ్చాక ఎలా నేల నాకిస్తాడో అందరికీ తెలుసని తెలిపారు.. 80 ఏళ్ల ముసలినక్క చంద్రబాబు వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. చదవండి: చంద్రబాబు ఐటీ స్కామ్.. ఇద్దరు నిందితులు విదేశాలకు పరార్! -
లోకేష్ రాక.. టీడీపీ గుండాగిరి
సాక్షి, కృష్ణా: జిల్లాలో తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యాత్ర సందర్భంగా.. ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బజారు రౌడీల్లాగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. లోకేశ్ రాక సందర్భంగా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాయి టీడీపీ శ్రేణులు. అయితే అదే సమయంలో కౌంటర్గా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి వైఎస్సార్సీపీ శ్రేణులు. ఈ పరిణామాన్ని టీడీపీ గుండాలు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసి.. కర్రలతో ఇష్టానుసారంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వల్లభనేని పరామర్శ.. ఫిర్యాదు రంగన్నగూడెం చేరుకున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ మూకల దాడిలో గాయపడిన వైసీపీ శ్రేణులను పరామర్శించారు. లోకేష్ సమక్షంలోనే వంద మందికి పైగా మూకుమ్మడిగా తమ పై దాడిచేశారని వంశీ ఎదుట వాపోయారు బాధితులు. బాధితులతో కలిసి వీరవల్లి పోలీస్టేషన్ కు బయల్దేరిన ఎమ్మెల్యే వంశీ.. ఘటనపై వీరవల్లి పోలీసులకు ఫిర్యాదు చేయయనున్నారు. -
గోల్డ్ మెడలిస్ట్ సాదియాకి ఘన స్వాగతం! వాళ్ల వల్లే ఇది సాధ్యమైంది..
సాక్షి, విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్కి ఘన స్వాగతం లభించింది. షార్జాలో ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్లో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించి స్వదేశానికి వచ్చిన సదియాకి ఆమె తల్లిదండ్రులు, కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, విద్యార్థులు వెల్కమ్ చెప్పారు. కాగా సాదియా కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. గోల్డ్ మెడలిస్ట్ సాదియా ‘‘షార్జాలో ఈనెల 16 నుండి 22 వరకు ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ కప్లో పాల్గొన్నా. నాలుగు విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించాను. ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, కేఎల్ యూనివర్సిటీ సహకారంతో స్వర్ణ పతకం సాధించాను’’ అని సాదియా సంతోషం వ్యక్తం చేశారు. -
బుద్ధి తక్కువై లోకేష్ పాదయాత్రకెళ్లా!
Viral Video: పాదయాత్ర చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలి. ప్రజల కష్టాలు దగ్గరగా వెళ్లి చూడాలి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర అలా చేసి ప్రజల కష్టాలు చూశారు కాబట్టే.. ఆశీర్వదించి ఘన విజయం కట్టబెట్టారు ఏపీ ప్రజలు. పులిని చూసి నక్కవాత పెట్టుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది?.. అసలు తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు చేస్తోంది ఏం యాత్ర?.. ఆ అనుమానాల్ని నివృత్తి చేసే వీడియో మరొకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా యువగళం పాదయాత్రలో ఓ దివ్యాంగుడిని పరామర్శించిన(యాక్టింగ్లేండి) పరామర్శించాడు నారా లోకేష్. బ్యాక్గ్రౌండ్లో టీడీపీ సాంగ్ మారుమోగుతుంటే.. ఆ పెద్దాయనతో చిరునవ్వుతో రోడ్డు మీద ఓ ఫొటో కూడా దిగాడు. కానీ, ఈలోపు పక్క నుంచి ఓ పచ్చ నేత ఐదొందల నోటును ఆ దివ్యాంగుడి చేతిలో పెట్టాడు. దాన్ని ఆయన తీసుకున్నాడు. కట్ చేస్తే.. తన మానాన తాను చర్చికి వెళ్తుంటే.. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ఉందని చెబుతూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు తీసుకెళ్లాడని, 2వేల రూపాయలు ఇస్తామని చెప్పి.. కేవలం 500లే ఇచ్చారని, వికలాంగుడినైన తనని కూడా మోసం చేశారని, పాదయాత్రకెళ్లి బుద్ధి తక్కువ పని చేశానని చెంపలేసుకున్నాడు పాపం ఆ పెద్దాయన. -
సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాం..
చిలకలపూడి(మచిలీపట్నం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జోనల్ ఇన్చార్జ్ షేక్ సలార్దాదా, మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డెప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, పార్టీ యువజన విభాగం జోనల్ ఇన్చార్జ్ పేర్ని కృష్ణమూర్తి(కిట్టు), అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం, పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు పాల్గొన్నారు.