
మనం చెడు చేసి ప్రతిపక్షంలో కూర్చోలేదు. ప్రతి ఇంటికి, గడప గడపకూ మనం వెళ్లినప్పుడు ఏ ఇంటికి వెళ్లినా చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలు అక్కున చేర్చుకున్నారు.

కారణాలు ఏమైనా కానీ ఎన్నికలకు వచ్చేసరికి మనం అనుకున్న ఫలితాలు రాలేదు. మనందరికి తెలిసిన విషయం ఏమిటంటే... జగన్ కుటుంబానికి అంతా మేలు చేశాడు. కానీ చంద్రబాబునాయుడు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానని చెప్పి మోసం చేస్తున్నారు.

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం.. క్రమపద్ధతిలో వ్యవస్థల నిర్వీర్యం

ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారు. సోషల్ మీడియాలో నిలదీసినా.. ఆఖరికి సందేశాలు ఫార్వార్డ్ చేసినా దొంగ కేసులు పెడుతున్నారు.

ప్రతి ఒక్కరికీ ఫేస్ బుక్, ఇన్స్టా, వాట్సప్ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్ లోడ్ చేయాలి. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నించాలి. సూపర్ సిక్స్ ఏమైంది? ఏమైంది సూపర్ సెవన్? అని నిలదీయాలి.

మనకు కష్టకాలం నడుస్తోంది. ఈ కష్టకాలంలో అంతా నన్ను గుర్తుచేసుకోండి. నాపై కేసులు పెట్టి జైలుకు పంపారు. అయినా బయటకు వచ్చి ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను.

అబద్దాలు చెప్పడం మనకు చేతగాదు. అతి నిజాయితీ, అతి మంచితనం మనకున్న సమస్యలు... కానీ ఇదే రేపు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకొస్తుంది.

మోసమే పరమావధిగా ఉన్న వాళ్లకు ప్రజలు ఏం చేస్తారో వచ్చే ఎన్నికల్లో చూద్దాం

దెబ్బకు చంద్రబాబు పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితం కావాలి

