ప్రధాన వార్తలు

అప్రజాస్వామిక, అరాచకవాది చంద్రబాబు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక, అరాచక వాది అని.. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చిని లాక్కోవాలని చూస్తున్నారనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయంటూ దెప్పి పొడిచారు.పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలు అంటూ ఎత్తిచూపారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్ర పూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే కొంత మంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే మరికొంత మంది పోలీసులు.. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత పన్నాగాన్ని సాక్ష్యాధారాలతో వివరిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచి్చంది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందల మంది వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండోవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్స్టేషన్ గడప తొక్కని వారిని, ఎలాంటి కేసులు లేని వారిని కూడా బైండోవర్ చేసి, వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తున్న వారిని, ప్రచారం చేస్తున్న వారిని పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.⇒ ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడి చేశాయి. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లి వారిని, శ్రీకాంత్, నాగేశ్, తన్మోహన్ రెడ్డి తదితరులపైనా దాడికి దిగారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడ్డారు.⇒ ఆగస్టు6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయడమే లక్ష్యంగా నల్లగొండువారిపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేసి, వీరిని తీవ్రంగా గాయపరిచారు. కారుని బద్దలు కొట్టారు.పెట్రోల్ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నం కూడా చేశారు. రమేష్ యాదవ్కు గాయాలుకాగా, తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆస్పత్రిలో చేరి్పంచారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్సార్సీపీ నాయకులెవ్వరినీ పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈ రకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు.⇒ తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి, ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్సార్సీపీ నాయకులపైనే తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా, జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి, దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాము సహా మరో 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకుని, ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరింత మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను అమలు చేస్తున్నారు.⇒ ఆగస్టు 8న వైఎస్సార్సీపీకి చెందిన ఒక నాయకుడిని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి, తమ వైపునకు లాక్కుని, అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకుని.. తప్పుడు కేసుపెట్టి, దాని ఆధారంగా వైఎస్సార్సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధరరెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ⇒ అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు.. ఆగస్టు 8న వైఎస్సార్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జెడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు 4 వేల మంది ఓటర్లను, పక్కా వైఎస్సార్సీపీకి చెందిన గ్రామాలకు చెందిన వారిని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు.వీళ్లు ఓటేయడానికి వెళ్లకుండా బెదిరించడం, భయపెట్టడం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకుని, తద్వారా ఓటింగ్ను తగ్గించడం, బూత్లను ఆక్రమించుకుని రిగ్గింగ్కు పాల్పడటం.. ఈ మాదిరి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. (పోలింగ్ బూత్లను అడ్డగోలుగా ఎలా మార్చారన్నది టేబుల్లో పరిశీలించగలరు.)⇒ నల్లగొండువారిపల్లి వద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే ఆగస్టు 8వ తేదీ రాత్రి ఎస్సీ, ఎస్టీ తప్పుడు కేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో కొంత మంది, ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెబుతున్న సమయంలో బైండోవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్స్టేషన్లో, పోలీసుల సమక్షంలోనే ఉన్నారు.అయినా వారి మీద కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు వీరిని వదిలి పెట్టాల్సి వచి్చంది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్లు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే, టీడీపీ కండువా కప్పుకోగానే ఒకర్ని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు.⇒ ఎన్నికల పోలింగ్ రోజున ఓటింగ్ శాతం తగ్గించేందుకు, తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్లు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడి చేస్తున్నారు. వారిపైనా దాడులకు సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసం చేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలి. అయినా దేవుడి మీద, ప్రజల మీద నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది.

బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. కారణం ఇదే..
పట్నా: బీహార్లో ఓటర్ల జాబితా సవరణతో మొదలైన వివాదం ఇప్పుడు డబుల్ ఓటరు ఐడీ నోటీసుల వరకూ దారి తీసింది. తాజాగా రెండు ఓటరు ఐడీ కార్డులు కలిగి, రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకున్నందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు పోల్ బాడీ నోటీసు జారీ చేసింది. నకిలీ ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పలు విమర్శలు చేస్తున్న తరుణంలో విజయ్ కుమార్ సిన్హా ఎన్నికల కమిషన్ నుండి నోటీసు రావడం గమనార్హం.తాజాగా బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్ఫారం‘ఎక్స్’లోచేసిన ఒక పోస్ట్లో తన అసెంబ్లీ సీటు అయిన లఖిసరైలో ఓటరుగా సిన్హా పేరు ఉందంటూ, దానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా స్క్రీన్షాట్ను పంచుకున్నారు. అలాగే పట్నాలోని బంకిపూర్లో కూడా ఓటరుగా సిన్హా పేరు ఉందంటూ ఆధారం చూపించారు. ఈ నేపధ్యంలో రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో పేరు ఉండటంపై వివరణ కోరుతూ, బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు నోటీసు పంపారు. ఆగస్టు 14 సాయంత్రం ఐదు గంటలలోపు దీనికి సమాధానం ఇవ్వాలని కోరారు.రాష్ట్రీయ జనతాదళ్కు చెందిన తేజస్వి యాదవ్ తాజాగా ఉప ముఖ్యమంత్రికి రెండు ఓటరు ఐడీ కార్డులు ఉన్నాయని ఆరోపిస్తూ, సిన్హాపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సిన్హా మాట్లాడుతూ తాను ఒకేచోట నుండి ఓటు వేశానని, తేజశ్వి యాదవ్ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తన పేరు ఒటరు జాబితాలో రెండు చోట్ల ఉండటానికిగల కారణాలను వివరిస్తూ.. తొలుత తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లు బంకిపూర్ అసెంబ్లీ స్థానంలో ఉన్నాయన్నారు. అయితే 2024 ఏప్రిల్ లో, తాను లఖిసరైలో తన పేరును జతచేర్చుకునేందుకు దరఖాస్తు చేశానన్నారు. అదే సమయంలో తనతోపాటు తన కుటుంబ సభ్యుల పేర్లను బంకిపూర్ నుండి తొలగించేందుకు ఫారమ్ను కూడా నింపి సమర్పించానన్నారు. అయితే ఏవో కారణాలతో బంకిపూర్ నుండి తన పేరు తొలగించలేదని విజయ్ కుమార్ సిన్హా వివరణ ఇచ్చారు.

ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!
కడప అర్బన్: మోస్ట్వాంటెడ్ స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లలో ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ ముదిరెడ్డి రామమోహన్రెడ్డి కూడా ఉండటం వైఎస్సార్ కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎర్ర చందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురు ముఠాలో రామమోహన్రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నాడు.రామమోహన్రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడిగా చాలాకాలంగా చెలామణి అవుతున్నాడు. ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి అలియాస్ ఉక్కు ప్రవీణ్కు ప్రధాన అనుచరుడు. కొన్నేళ్లుగా ప్రొద్దుటూరులోని అరవింద ఆశ్రమం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడిని వాటర్ప్లాంట్ రాము అని కూడా పిలుస్తుంటారు. ఎన్నికల ముందు ప్రొద్దుటూరులోని గాంధీబజార్ సర్కిల్లో బెనర్జీ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో రామమోహన్రెడ్డి నిందితుడు. ఉక్కు ప్రవీణ్కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. రామమోహన్రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో అతడు నారా లోకేశ్ను కలిసినప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడి వ్యవహారాలపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్లో ట్విస్ట్.. కీలక పదవికి సీనియర్ నేత ఆనంద్ శర్మ రాజీనామా
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హస్తం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ.. విదేశీ వ్యవహారాల విభాగ అధ్యక్ష పదవికి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామాలో లేఖలో కీలక విషయాన్ని వెల్లడించారు. ఆ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి సమర్థులైన యువ నేతలకు అవకాశం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీంతో, రాజీనామాకు ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా తన లేఖలో ఆనంద్ శర్మ..‘ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు పార్టీ నాయకత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి సమర్థులైన యువ నేతలకు అవకాశం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇక, ఆనంద్ శర్మ.. ఏఐసీసీ విదేశీ వ్యవహారాల విభాగం అధ్యక్షుడిగా దశాబ్ద కాలం పనిచేశారు. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆనంద్ శర్మ.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ వ్యవహారాలపై కాంగ్రెస్కు ప్రముఖ వ్యక్తిగా కొనసాగుతున్నారు. అయితే, ఆనంద్ శర్మ కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగనున్నారు.Former Union Minister and Congress leader Anand Sharma has resigned from the post of the Chairman of Foreign Affairs Department of AICC. He continues to be a member of CWC. (File photo) pic.twitter.com/RsIGBDgTOz— ANI (@ANI) August 10, 2025గతంలో ఇండో-యుఎస్ అణు ఒప్పందం చర్చలలో ఆయన గతంలో కీలక పాత్ర పోషించారు. నిర్మాణాత్మక పద్ధతిలో భారత్-ఆఫ్రికా భాగస్వామ్యం, మొదటి భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ వైఖరిని చాటిచెప్పేందుకు విదేశాలకు వెళ్లిన అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధులలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ వైఖరిని శర్మ ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశారు. వాణిజ్య మంత్రిగా తన పదవీకాలంలో మొట్టమొదటి WTO ఒప్పందం, సమగ్ర వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు.

తెలంగాణకు అలర్ట్.. 17 జిల్లాల్లో 13 నుంచి భారీ వానలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, సోమవారం, మంగళవారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు.. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :10-08-2025@TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather @Indiametdept pic.twitter.com/7Vx8ZrRLag— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) August 10, 2025నేడు, రేపు భారీ వర్షాలు.. సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడనున్నాయి.Overnight, as expected, South, East TG like Rangareddy, Mahabubnagar, Nagarkurnool, Narayanpet, Khammam, Suryapet, Yadadri - Bhongir, Vikarabad rocked 💥🌧️ Next 2hrs, NON STOP MODERATE RAINS to continue in Gadwal, Wanaparthy, NagarkurnoolScattered rains ahead in Asifabad,…— Telangana Weatherman (@balaji25_t) August 11, 2025ఇక, ఆదివారం నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 11.05 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 8.93, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 7.28, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 6.70 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్తో పాటు నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.మరోవైపు.. ఏపీలో రాబోయే రోజుల్లో వర్షాలు జోరందుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.సోమ, మంగళవారాల్లో రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ, వాయవ్య గాలుల ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మంచినీళ్లు అమ్ముతున్న హీరోయిన్.. 750 ml @ రూ.200
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. సోదరి సమీక్షా పెడ్నేకర్ (Samiksha Pednekar)తో కలిసి బ్యాక్బే అనే బ్రాండ్ స్థాపించి ఎంటర్ప్రెన్యూర్గా మారింది. ప్రజలకు సురక్షితమైన మంచినీళ్లు అందివ్వడమే తన లక్ష్యం అని చెప్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపింది. భూమి ఇంకా మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్లో సొంతంగా ఓ ప్లాంట్ స్థాపించాం. అందుకు మాకెంతో గర్వంగా ఉంది. ప్లాస్టిక్ వాడకుండా..అక్కడ మహిళలే పని చేస్తున్నారు. మాది ప్రీమియం వాటర్ బ్రాండ్ కంపెనీ. మూడు రకాల ఫ్లేవర్స్తో లభ్యం అవుతుంది. ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ను వాడలేదు. బాటిల్ క్యాప్ భూమిలో కలిసిపోయేదిగా తయారు చేశాం. ఇలా పర్యావరణ స్పృహతో పనిచేస్తున్న వాటర్ కంపెనీ ఏదైనా ఉందా అంటే అది మాది మాత్రమే! అరలీటర్ వాటర్ బాటిల్ రూ.150, రూ.750 ml వాటర్ బాటిల్ ధర రూ.200గా నిర్ణయించాం. రూ.200కే మంచినీరుఅందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే రూ.200కే హిమాలయ వాటర్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజుల్లో అందరూ ఎనర్జీ డ్రింక్స్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది స్వచ్ఛమైన నీళ్లు. మా బాటిల్లో సహజసిద్ధమైన మినరల్స్, ఎలెక్టోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. వచ్చే నాలుగేళ్లలో రూ.100 కోట్ల మార్కెట్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. 15 ఏళ్లలో ప్రతి ఇంట్లో మా బాటిల్ కనిపించాలని ఆశపడుతున్నాం.పెట్టుబడి ఎలా?17 ఏళ్ల వయసులో నా సంపాదన మొదలైంది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో పనిచేసినప్పుడు నాకు ఇచ్చిన తొలి పారితోషికం రూ.7 వేలు. అప్పటినుంచే నాకు పొదుపు చేయడం అలవాటు. అలా నా సంపాదనలో కొంతభాగాన్ని కూడబెడుతూ వచ్చాను. ఆ డబ్బుతోనే బ్యాక్బే ప్రారంభించగలిగాం అని చెప్పుకొచ్చింది. భూమి పెడ్నేకర్ చివరగా మేరే హజ్బెండ్ కి బివి సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) చదవండి: ఆ సినిమాకు ఫహద్ ఫాజిల్ రెమ్యునరేషన్ రూ.1 లక్ష మాత్రమే!

సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నిన్న (ఆగస్ట్ 10) జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవరల్లో 178 పరుగులకు ఆలౌటైంది. పొట్టి క్రికెట్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయడం ఇదే తొలిసారి (26 టీ20ల్లో).ఈ మ్యాచ్లో మరిన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో వరుసగా 9 టీ20 మ్యాచ్ల్లో గెలుపొందింది. గతంలో ఆసీస్ వరుసగా ఇన్ని టీ20 మ్యాచ్ల్లో ఎప్పుడూ గెలవలేదు. ఈ సిరీస్కు ముందు ఆసీస్ వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై 5-0 తేడాతో ఓడించింది.ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు 13 సిక్సర్లు బాదారు. టీ20ల్లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా (ఓ మ్యాచ్లో) బాదిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2023లో డర్బన్లో జరిగిన టీ20లోనూ ఇన్నే సిక్సర్లు నమోదయ్యాయి.ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా యువ పేసర్ క్వేనా మపాకా ఓ ఆల్టైమ్ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మపాకా టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో నాలుగు వికెట్ల ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (19 ఏళ్ల 318 రోజులు) రికార్డు సాధించాడు. అలాగే పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన సౌతాఫ్రికా బౌలర్గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మపాకా (4-0-20-4), రబాడ (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా 178 పరుగులకు ఆలౌటైంది. వాస్తవానికి ఆసీస్ ఈ స్కోర్ కూడా సాధించలేకపోయేది. 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (52 బంతుల్లో 83; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి ఆసీస్కు ఈ స్కోర్ అందించాడు. గ్రీన్ ఓ మోస్తరు ప్రదర్శన (13 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. వీరు మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో అంతా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ 13, ట్రవిస్ హెడ్ 2, జోస్ ఇంగ్లిస్ 0, మిచెల్ ఓవెన్ 2, మ్యాక్స్వెల్ 1, డ్వార్షుయిస్ 17, ఎల్లిస్ 12, జంపా ఒక్క పరుగు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో మపాకా, రబాడతో పాటు ఎంగిడి, లిండే, ముత్తాసామి వికెట్లు తీశారు (తలో వికెట్).అనంతరం సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో తడబడింది. హాజిల్వుడ్ (4-0-27-3), డ్వార్షుయిస్ (4-0-26-3), జంపా (4-0-33-2), మ్యాక్స్వెల్ (4-0-29-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 161 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో ఓపెనర్ రికెల్టన్ (55 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (27 బంతుల్లో 37) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లలో మార్క్రమ్ 12, ప్రిటోరియస్ 14, బ్రెవిస్ 2, లిండే 0, బాష్ 2, ముత్తుసామి 0, రబాడ 10, మపాకా 3 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ సిరీస్లో రెండో టీ20 ఆగస్ట్ 12న జరుగనుంది.

మంత్రి పదవులే ముద్దు!
సాక్షి, అమరావతి: చట్టసభల్లో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు తమకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఒకేసారి కోరుతుండడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులు తమను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో కొత్తగా కొందరు సీనియర్లను క్యాబినెట్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడం లేదని చాలా రోజులుగా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పనితీరు మార్చుకోకపోతే పదవుల నుంచి తప్పిస్తానని పదేపదే హెచ్చరిస్తున్నారు. ఏడాదిగానే ప్రతిపక్షం మరింత చురుగ్గా వ్యవహరిస్తోందని, వైఎస్సార్సీపీని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నామని, ఈ విషయంలో మంత్రులు విఫలమవుతున్నారనే అభిప్రాయం చంద్రబాబులో బలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా రాయించడం, వ్యతిరేక వార్తలు ప్రసారం చేయించడం ద్వారా బురద చల్లడం మినహా మంత్రులెవరూ విపక్షాన్ని ఎదుర్కోలేకపోతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదన తెరపైకి రావడంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సీనియర్ నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడు తనకు మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని భావించారు. అయితే ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. ఇక డిప్యూటీ స్పీకర్ హోదాలో రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన రఘురామ నేరుగా కొన్ని టీవీ ఛానళ్ల డిబేట్లలో పాల్గొంటూ తనకు ఆ రూలు వర్తించదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోణంలో అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం చంద్రబాబులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు లోకేష్ అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

వరదను కట్టడి చేద్దాం.. 'ట్రంక్ లైన్' గీద్దాం
సాక్షి, హైదరాబాద్/అమీర్పేట: భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్లోని అమీర్పేట, ఎస్సార్నగర్ల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. ఆయా ప్రాంతాలను వరద, ముంపు ముప్పు నుంచి తప్పించడానికి ప్రత్యేకంగా ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. బౌద్ధనగర్, గంగుబాయి బస్తీ, రిలయన్స్ లైన్లలో ఉన్న డ్రైనేజీ నాలాలను పరిశీలించారు. మైత్రి వనం వద్ద నీరు నిలిచిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్ నగర్ నుంచి బౌద్ధనగర్ వరకు ఉన్న మురుగునీటి కాలువను చూసిన ఆయన ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ ఎక్కువ ఎత్తులో ఉండటంపై ఆరా తీశారు. ఈ కారణంగానే రోడ్డు ఇరుకుగా మారడంతో పాటు వరద బౌద్ధనగర్ను ముంచుతోందని గుర్తించారు. తక్షణమే డ్రైనేజీ వ్యవస్థ మార్పు చేర్పులపై జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. కాగా గంగూబాయి కుంట ప్రాంతంలో 25 ఏళ్ల క్రితం చెరువు ఉండేదని, అక్కడ బతుకమ్మ ఆడేవారమని స్థానికులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ కుంటను కొంతమంది పూడ్చేసి ప్రైమ్ ఆసుపత్రికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఆ కుంట పూర్వాపరాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సూచించారు. బాలుడి భుజంపై చేయి వేసి నడుస్తూ.. బౌద్ధనగర్లో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డికి ఏడో తరగతి బాలుడు జశ్వంత్ వరద సమస్యను వివరించాడు. బస్తీలో మహిళలతో కలిసి నిలబడి ఉన్న జశ్వంత్ను పిలిచిన రేవంత్రెడ్డి వరద పరిస్థితిపై ఆరా తీశారు. ఆ బాలుడి భుజంపై చేయి వేసి కాలనీలో నడుచుకుంటూ వివరాలను తెలుసుకున్నారు. తాను ఏడో తరగతి చదువుతున్నానని, వర్షాకాలంలో చదువులకు దూరం అవుతున్నానని బాలుడు సీఎంకు తెలిపాడు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని చెప్పాడు. దీంతో భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు వరద నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అమీర్పేట కార్పొరేటర్ కేతినేని సరళ.. సీఎంను కోరారు. స్థానిక డ్రైనేజీ వ్యవస్థ వివరాలను ఆమె వెల్లడించారు. ఎర్రగడ్డ, యూసుఫ్గూడ ప్రాంతం నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తోందని, లెవలింగ్ సరిగా లేకపోవడంతో వరద నీరు నాలాల్లోకి వెళ్లక కొన్ని బస్తీలు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ, జల మండలి అధికారులు సీఎం వెంట ఉన్నారు. ట్రంక్ లైన్ అంటే ఏమిటి? హైదరాబాద్ మహానగర మురుగునీటి వ్యవస్థలో సుమారు 612 కిలోమీటర్ల మేర ప్రధాన సీవరేజీ ట్రంక్ లైన్ ఉండగా వాటికి అనుబంధంగా సుమారు 9,769 కిలోమీటర్ల వరకు మురుగు నీటి పైప్లైన్ విస్తరించి ఉంది. ఈ మొత్తం వ్యవస్థలో ట్రంక్ లైన్ కీలకం. చిన్న చిన్న పైపుల ద్వారా వచ్చే మురుగునీటిని భారీ పైపుల్లోకి మళ్ళించి వ్యర్థ జలాల శుద్ధి కేంద్రానికి లేదా మురుగు నీటిని వదిలే ప్రదేశానికి పంపించడాన్ని ట్రంక్ లైన్ వ్యవస్ధగా పిలుస్తున్నారు. ట్రంక్ లైన్లు సాధారణంగా పెద్ద వ్యాసం (600 డయా (2.5 మీటర్లు)తో కూడిన పైపులను కలిగి ఉంటాయి. పెద్ద మొత్తంలో మురుగునీటిని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మంచిగా చదువుకో అన్నారు..! జస్వంత్తో కలిసి కాలనీలో తిరుగుతున్న సీఎం రేవంత్ మా కాలనీలో నన్ను చూసిన ముఖ్యమంత్రి..‘బాబు ఇక్కడ రా’ అని పిలిచారు. ‘నిన్న మీ ఇంటి దగ్గరకు వాటర్ వచ్చాయి కదా? ఎంత వచ్చాయి?’ అని అడిగారు. నేను మునిగిపోయేంత వచ్చాయని చెప్పా. మీకు ఇంటికి ఏమైనా మరమ్మతులు కావాలా? అని అడిగితే..అవును సార్..గేట్లు పెట్టియ్యాలె సార్ అని అన్నా. పెట్టిస్తానన్న సీఎం..పుస్తకాలు తడిచాయా? అంటూ ఆరా తీశారు. ‘మంచిగా చదువుకో.. మళ్లీ వాటర్ వస్తే నాకు ఫిర్యాదు చెయ్యి కవర్ చేసేస్తా..’ అని హామీ ఇచ్చారు. – జశ్వంత్, ఏడో తరగతి విద్యార్థి, బౌద్ధనగర్

అలస్కా చర్చల్లో జెలెన్స్కీకీ చోటు?
వాషింగ్టన్: ఈ నెల 15వ తేదీన అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన దౌత్యపరమైన విభేదాలకు తెరతీసింది. ఈ సమావేశంలో కుదరబోయే ఒప్పందంపై ఉప్పందుకున్న యూరప్ దేశాల నేతలు ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ణయించే భేటీలో అధ్యక్షుడు జెలెన్స్కీకి చోటు కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో సమావేశమైన యూరప్ దేశాల ఉన్నతాధికారులు..ట్రంప్ దౌత్య ప్రయత్నాలకు మద్దతు పలికారు. అదే సమయంలో, ట్రంప్–పుతిన్ చర్చల తర్వాత ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలని, ఉక్రెయిన్కు సైతం ఒప్పందంలో భాగస్వామి అయ్యే అవకాశమివ్వాలని జేడీ వాన్స్ను కోరారు. అలస్కాలో శుక్రవారం పుతిన్–ట్రంప్ మధ్య జరిగే శిఖరాగ్రంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు లేదు. అయితే, జెలెన్స్కీ పాల్గొనే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. ట్రంప్–పుతిన్ల సమావేశం తర్వాత మాత్రమే జెలెన్స్కీకి చాన్సుంటుందని చెబుతున్నారు. వేగంగా చోటుచేసుకున్న పరిణామాల నడుమ అలస్కా శిఖరాగ్రంపై నిర్ణయం వెలువడింది. శిఖరాగ్రం వేదికను ఇంకా ఖరారు చేయలేదు. అంతేకాదు, ఇద్దరు నేతల మధ్య చర్చకు రావాల్సిన అంశాలపైనా స్పష్టత రాలేదని చెబుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు నేతలతో కలిసి త్రైపాక్షిక చర్చలకు సైతం సిద్దంగా ఉన్నా, పుతిన్ వినతి మేరకు ద్వైపాక్షిక చర్చలకు అవసరమైన ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నామని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. యూరప్ నేతల డిమాండ్లివీ..అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అవనున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..ఇందులో జెలెన్స్కీ పాల్గొనేదీ లేనిదీ మాత్రం స్పష్టం చేయలేదు. యుద్ధానికి ముగింపు పలికే విషయంలో ఉక్రెయిన్ను కూడా భాగస్వామిగా చేర్చుకోవాలని జెలెన్స్కీతోపాటు యూరప్ దేశాల నేతలు కోరుతున్నారు. ట్రంప్ ప్రకటనను స్వాగతించిన జెలెన్స్కీ, తమ భూభాగాన్ని రష్యాకు ధారాదత్తం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తోసిపుచ్చారు. పుతిన్–ట్రంప్ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అంశాలేమిటి, కుదరనున్న ఒప్పందం వివరాలేమిటి? అంటూ జేడీ వాన్స్తో సమావేశమైన యూరప్ దేశాల ఉన్నతాధికారులు కూపీ లాగారు. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్కు పుతిన్ బుధవారం అందించిన పత్రాల్లో ఏముందంటూ ఆరా తీశారు. ‘ఈ చర్చల్లో ఉక్రెయిన్కు భాగస్వామ్యం ఉండాలి. చర్చల అనంతరం ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలి. ఆ తర్వాతే మిగతా అంశాల అమలు విషయం తేల్చాలి. ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని కోల్పోవాల్సి వస్తే..ప్రస్తుతం రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలి...’వంటి షరతులను వారు జేడీ వాన్స్కు వినిపించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనపై ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలండ్, యూకే, ఈయూ, ఫిన్లాండ్ దేశాల నేతలు సంతకాలు చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకూ గ్యారెంటీ ఇవ్వాలని కోరారు. తమ ప్రతినిధి విట్కాఫ్ మాస్కోలో పుతిన్తో జరిపిన సమావేశంలో కుదిరిన ఒప్పందంపై మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్.. కొన్ని భూభాగాలను వదులుకోవడం వంటి అంశాలున్నాయని చెప్పడం యూరప్ దేశాలతోపాటు జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పుతిన్ అందజేసిన పత్రంలో తాము పాక్షికంగా ఆక్రమించుకున్న ప్రాంతాలతోపాటు డోన్బాస్ ప్రాంతం పూర్తిగా స్వాధీనం చేయాలనే అంశం ఉన్నట్లు యూరప్ దేశాలంటున్నాయి. ఖెర్సన్, జపొరిజియాల్లోనూ రష్యా ఆర్మీ తిష్టవేసింది. వీటి విషయం తేల్చలేదు. అమెరికా ఇచ్చే భద్రతాపరమైన గ్యారంటీల విషయం సైతం అస్పష్టంగా ఉంది. దీనిపై వైట్ హౌస్ అధికారులను ఈయూ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నా స్పందనలేదు.
కాంగ్రెస్లో ట్విస్ట్.. కీలక పదవికి సీనియర్ నేత ఆనంద్ శర్మ రాజీనామా
Gaza: ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మృతి.. ఒకరు ఉగ్రవాది?
తెలంగాణకు అలర్ట్.. 17 జిల్లాల్లో 13 నుంచి భారీ వానలు
బాబర్ ఆజమ్ డకౌట్.. పాక్ను చిత్తు చేసిన విండీస్
బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. కారణం ఇదే..
ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
మంచినీళ్లు అమ్ముతున్న హీరోయిన్.. 750 ml @ రూ.200
భారత విమానాలకు గగనతలం మూసేసి.. రూ.1,240 కోట్లు నష్టపోయిన పాక్
ఈ ఇల్లు ఎవరిదో తెలుసా?
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన షాహిన్ ఆఫ్రిది
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
హయగ్రీవ పూజ చేసిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వ్యాపారవృద్ధి
నా బలం, నా సర్వస్వం.. మహేశ్కి నమ్రత స్పెషల్ విషెస్
పారాణి ఆరలేదు.. గోరింట చెరగలేదు
ఒకే కుటుంబంలో ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్లు?
మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ'
ఎలా డీల్ చేయాలో ప్రతీ దేశానికి చెప్పే బదులు ప్రపంచంతో ఎలా డీల్ చేయాలో ట్రంప్కే చెబితే సరిపోతుందిగా సార్!
ఈ ఒక్క నామంతో విష్ణు సహస్రనామం పఠించినంత పుణ్యం
జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. అప్రయత్న కార్యసిద్ధి
ఈ విషయమేదో ఎన్నికల ముందు చెపితే వేరేలా నిర్ణయం తేసుకునే వాళ్లం కదా అని అంటున్నార్సార్!
అమెరికా టు పాలమూరు
పనిలోపని ఆ పార్టీని కూడా తీసేస్తే పోలా!
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డు
ఐదు కిలోమీటర్ల మేర.. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్!
ప్రపంచంలోనే ఖరీదైన పెద్ద ప్యాలెస్.. మహారాణి మాటల్లో..
'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫైనల్
కాంగ్రెస్లో ట్విస్ట్.. కీలక పదవికి సీనియర్ నేత ఆనంద్ శర్మ రాజీనామా
Gaza: ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మృతి.. ఒకరు ఉగ్రవాది?
తెలంగాణకు అలర్ట్.. 17 జిల్లాల్లో 13 నుంచి భారీ వానలు
బాబర్ ఆజమ్ డకౌట్.. పాక్ను చిత్తు చేసిన విండీస్
బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. కారణం ఇదే..
ఆ ఎర్ర స్మగ్లర్.. పచ్చనేతే!
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
ఎట్టకేలకు వీడిన సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ.. అసలు కథ ఇదే..
మంచినీళ్లు అమ్ముతున్న హీరోయిన్.. 750 ml @ రూ.200
భారత విమానాలకు గగనతలం మూసేసి.. రూ.1,240 కోట్లు నష్టపోయిన పాక్
ఈ ఇల్లు ఎవరిదో తెలుసా?
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన షాహిన్ ఆఫ్రిది
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వ్యాపారవృద్ధి
నా బలం, నా సర్వస్వం.. మహేశ్కి నమ్రత స్పెషల్ విషెస్
పారాణి ఆరలేదు.. గోరింట చెరగలేదు
ఒకే కుటుంబంలో ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్లు?
మరో హిస్టరీ క్రియేట్ చేసిన 'మహావతార నరసింహ'
ఎలా డీల్ చేయాలో ప్రతీ దేశానికి చెప్పే బదులు ప్రపంచంతో ఎలా డీల్ చేయాలో ట్రంప్కే చెబితే సరిపోతుందిగా సార్!
జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?
ఈ ఒక్క నామంతో విష్ణు సహస్రనామం పఠించినంత పుణ్యం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. అప్రయత్న కార్యసిద్ధి
ఈ విషయమేదో ఎన్నికల ముందు చెపితే వేరేలా నిర్ణయం తేసుకునే వాళ్లం కదా అని అంటున్నార్సార్!
అమెరికా టు పాలమూరు
పనిలోపని ఆ పార్టీని కూడా తీసేస్తే పోలా!
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డు
ఐదు కిలోమీటర్ల మేర.. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్!
ప్రపంచంలోనే ఖరీదైన పెద్ద ప్యాలెస్.. మహారాణి మాటల్లో..
'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫైనల్
అనకాపల్లి: మత్స్యకారులకు చిక్కిన 500 కిలోల చేప.. ధర ఎంతంటే?
సినిమా

ఉపాసన పెట్టిన 'లవ్ టెస్ట్'.. చరణ్ ఏం చేశాడంటే?
మెగా హీరో రామ్ చరణ్.. 13 ఏళ్ల క్రితం ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం తర్వాత లో ప్రొఫైల్ మెంటైన్ చేస్తూ వచ్చారు గానీ గత కొన్నేళ్లలో మాత్రం సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్గా కనిపిస్తున్నారు. అలా ఇప్పుడు ఓ ఫుడ్ వ్లాగ్స్ చేసే హిందీ యూట్యూబర్.. ఉపాసనని ఇంటర్వ్యూ చేసింది. స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి, ఫుడ్ తింటూ ఆనాటి సంగతుల్ని అడిగింది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు రామ్ చరణ్కి పెట్టిన లవ్ టెస్ట్ గురించి ఉపాసన బయటపెట్టింది.(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)చరణ్-ఉపాసనలది పెద్దల కుదిర్చిన సంబంధమే అయినప్పటికీ.. పెళ్లికి ముందే కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఆ సమయంలో ఓ రోజు ఉపాసన.. 'చరణ్ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే 'ఫేమస్ ఐస్ క్రీమ్' షాప్కి తీసుకెళ్లు అని అడిగాను. అప్పుడు మా ఫ్యామిలీ ఓల్డ్ సిటీకి దగ్గరలో ఉండేవాళ్లం. అక్కడే మొజంజాహి మార్కెట్లో ఫేమస్ ఐస్ క్రీం షాప్ ఉంటుంది. అక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. అది నా ఫేవరెట్' 'హైదరాబాద్లో ఉన్న పాత ఐస్ క్రీమ్ షాప్స్లో అదొకటి. అది మార్కెట్ మధ్యలో ఉంటుంది. అప్పటికే చరణ్ స్టార్. అందరూ గుర్తుపడతారు. అయినా సరే నేను అడిగానని ఓకే చెప్పి తీసుకెళ్లాడు. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. కానీ అక్కడి జనాలు చరణ్ని గుర్తుపట్టి మమ్మల్ని చుట్టుముట్టేశారు. నేను అతడికి పెట్టిన నిజమైన లవ్ టెస్ట్ అదే' అని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మెగా కోడలికి తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)అలానే తమ కుటుంబంలో ప్రారంభించిన 'అత్తమ్మాస్ కిచెన్' ఎలా ప్రారంభమైందో కూడా ఉపాసన చెప్పుకొచ్చింది. 'మా ఇంట్లో అందరూ బాగా తింటారు. బాగా వండుతారు కూడా. మేం వేరే దేశాలకు వెళ్లినప్పుడు బెస్ట్ రెస్టారెంట్స్కి వెళ్తాం. అయినా సరే అక్కడ రాత్రయ్యేసరికి.. సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలని చరణ్ అడుగుతాడు. ఆ టైంలో ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది. బయట దేశాలకు వెళ్లినప్పుడు ఇలా చరణ్ చాలా కష్టపడేవాడు. అలా అత్తమ్మాస్ కిచెన్ ఆలోచన వచ్చింది' అని చెప్పింది.'అయితే ఈ బిజినెస్ గురించి తొలుత మా అత్తమ్మకు(సురేఖ) చెబితే ఎందుకు అని అన్నారు. విదేశాలకు వెళ్లినా మనలానే చాలామంది సౌత్ ఇండియన్ ఫుడ్ వెతుక్కోవడం కష్టం. అందుకే ఈ బిజినెస్ అని చెప్పాను. ఈ బిజినెస్కి చాలా పేర్లు అనుకున్నాం కానీ చివరకు అత్తమ్మాస్ కిచెన్ అని ఫిక్సయ్యాం' అని ఉపాసన చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా?)

రవితేజ 'మాస్ జాతర'.. టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ఈ యాక్షన్ థ్రిల్లర్కు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా కనిపించనుది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.(ఇది చదవండి: Mass Jathara: ‘ఓలే ఓలే' పాట రిలీజ్.. రవితేజ, శ్రీలీల డ్యాన్స్ అదుర్స్)కొద్ది రోజుల క్రితమే ఓలే ఓలే అనే మాస్ సాంగ్ను విడుదల చేసిన మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. మాస్ జాతర టీజర్ను ఈనెల 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తామని సితార ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాతో అభిమానులకు మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. A full meal of MASS 🔥A full heart of ENTERTAINMENT 🤩All served together with #MassJatharaTeaser tomorrow at 11:08 AM ❤️🔥#MassJathara #MassJatharaOnAug27th Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna… pic.twitter.com/9QIbjkvgF0— Sithara Entertainments (@SitharaEnts) August 10, 2025

ఉదయభాను మాల్దీవులు టూర్.. ప్రియాంక ఓరచూపు
మాల్దీవులు టూర్ వేసిన యాంకర్ ఉదయభానుఓరచూపు చూస్తున్న ప్రియాంక జవాల్కర్వయ్యారాలు ఒలకబోస్తున్న హాట్ బ్యూటీ రాశీ సింగ్చెన్నై జ్ఞాపకాలు పంచుకున్న కీర్తి సురేశ్అవార్డ్ అందుకున్న యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Udaya Bhanu (@iamudayabhanu)

'ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే'.. బిగ్ బాస్పై బిగ్ ట్విస్ట్!
టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్. ఈ షో తొమ్మిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి రణరంగమే అంటూ నాగార్జున ఇప్పటికే అంచనాలు పెంచేశారు. కామన్ మ్యాన్ కేటగిరీలో కంటెస్టెంట్స్ను సెలెక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష అంటూ ఇప్పటికే ప్రోమోను రిలీజ్ చేశారు. దాదాపుగా 40 మందిని ఫైనలైజ్ చేసిన వీరికి బిగ్బాస్ అగ్నిపరీక్ష ఈ పరీక్షలో నెగ్గినవారే షోలో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టనున్నారు.ఈ ప్రాసెస్ నడుస్తుండగానే బిగ్బాస్ మేకర్స్ మరో ప్రోమోను రిలీజ్ చేశారు. బిగ్ బాస్ కమింగ్ సూన్ అంటూ టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్తో జరిగిన సరదా సంభాషణ ఆడియన్స్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. బిగ్బాస్ హౌస్లోకి వెళ్లడానికి వచ్చావా? అంటూ నాగార్జున అడగ్గా.. కాదు.. ఏలడానికి వచ్చాను అంటూ వెన్నెల కిశోర్ అంటారు. అది నీవల్ల కాదులే.. ఈసారి వెరీ టఫ్ అని నాగార్జున అనడంతో.. నేను చాలా రఫ్ అని చెప్తాడు.(ఇది చదవండి: 40 మంది సామాన్యుల ఎంపిక.. హాట్స్టార్లో 'బిగ్బాస్' అగ్నిపరీక్ష)ఈ సారీ బిగ్బాస్ డబుల్ హౌస్.. డబుల్ డోస్ అంటూ వెన్నెల కిశోర్కు నాగార్జున చిన్న ఝలక్ ఇస్తాడు. ఎప్పుడైనా పాత సిలబస్తో కొత్త ఎగ్జామ్ రాస్తావా? అంటూ వెన్నెల కిషోర్ను నాగార్జున ప్రశ్నిస్తాడు. నేను డైరెక్ట్గా బిగ్బాస్తోనే మాట్లాడుకుంటానని వెన్నెల కిశోర్ చెప్పడంతో.. ఈసారీ ఏకంగా బిగ్బాస్నే మార్చేశా అంటూ మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. అందరి సరదాలు తీరిపోతాయి.. ఈ సారీ చదరంగం కాదు.. రణరంగమే.. అనే డైలాగ్లో ప్రోమో ముగిసింది. ఇది చూస్తుంటే ఈ బిగ్బాస్ సీజన్లో పాత బిగ్బాస్ ఉంటాడా? లేదా నిజంగానే కొత్త బాస్ను తీసుకొస్తున్నారా? మొత్తానికి ఈ ప్రోమోతో మరింత ఆసక్తి పెంచేశారు.
క్రీడలు

కష్టాల్లో క్లబ్ ఫుట్బాల్!
న్యూఢిల్లీ: దేశంలోని అగ్రశ్రేణి ఫుట్బాల్ టోర్నమెంట్... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా క్లబ్ ఫుట్బాల్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అఖిల భారత ఫుట్బాట్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు కల్యాణ్ చౌబే అన్నారు. ఈ కఠిన పరిస్థితులను అధిగమించడానికి సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. 2010లో ఏఐఎఫ్ఎఫ్ చేసుకున్న మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ (ఎంఆర్ఏ) పునరుద్ధరణపై అనిశ్చితి కారణంగా 2025–26 ఐఎస్ఎల్ సీజన్ను నిలిపేయాల్సి వచ్చింది. లీగ్ నిర్వాహకుల నిర్ణయం అనంతరం ఐఎస్ఎల్లోని మూడు క్లబ్లు తమ జట్టు కార్యకలాపాలను ఆపేశాయి. ఇందులో భాగంగా ఆటగాళ్లు, సిబ్బందికి వేతనాలు సైతం నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో కల్యాణ్ చౌబే మాట్లాడుతూ... ‘సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామన్నది నిజమే. స్వార్థ ప్రయోజనాలతో కొంతమంది ఈ పరిస్థితిని సృష్టించారు. అయితే సమష్టి కృషితోనే దీన్ని దాటి ముందుకు సాగగలమనే నమ్మకముంది’ అని 1999 నుంచి 2006 వరకు భారత సీనియర్ జట్టుకు గోల్కీపర్గా వ్యవహరించిన కల్యాణ్ చౌబే అన్నారు. క్లబ్ సీఈవోలతో చర్చలు విఫలం భారత ఫుట్బాల్లోని ప్రస్తుత పరిస్థితిని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావాలని ఐఎస్ఎల్లోని 11 క్లబ్లు కోరడంపై కల్యాణ్ చౌబే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏఐఎఫ్ఎఫ్ తమ అభ్యర్థనపై చర్య తీసుకోకపోతే స్వతంత్రంగా న్యాయ సహాయం కోరడం తప్ప తమకు వేరే మార్గం లేదని ఐఎస్ఎల్ క్లబ్లు ఒక లేఖలో పేర్కొన్నాయి. మొత్తం 13 క్లబ్లలో మోహన్ బగాన్ సూపర్ జెయింట్, ఈస్ట్ బెంగాల్ మినహా మిగిలిన 11 జట్లు దానిపై సంతకం చేశాయి. క్లబ్ సీఈవోలతో చర్చించిన మరుసటి రోజే ఈ లేఖ వెలుగు చూడటం ఆశ్చర్యపరిచిందని కల్యాణ్ అన్నారు. ‘ఈనెల 7న ఢిల్లీలో 13 క్లబ్ల సీఈవోలతో జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చించాం. అయితే మరుసటి రోజే 11 క్లబ్లు లేఖ రాయడం ఆశ్చర్యం కలిగించింది. ఈ సమాచార లోపాన్ని నివారించి ఉండాల్సింది. ఏదేమైనా దేశంలో ఫుట్బాల్ అభివృద్ధికి ఏఐఎఫ్ఎఫ్ కట్టుబడి ఉంది. ఆటకు ఏది మంచిదో అది చేసేందుకు సదా సిద్ధంగా ఉంటాం. దీనిపై న్యాయ సలహా తీసుకునే ఆలోచనలో ఉన్నాం. ఆ తర్వాత తిరిగి క్లబ్ల సీఈవోలతో భేటీ అవుతాం. ఈ నెల 17 తర్వాత మరోసారి సమావేశమవుతాం. క్లబ్ల ఆదాయ మార్గాలు పెంపొందించేందుకు ప్రణాళికలు రచించే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నాం. తక్షణం తీసుకోవాల్సిన చర్యలతో కూడిన 5 అంశాల అజెండాను రూపొందిస్తున్నాం’ అని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు పేర్కొన్నారు. సొంతంగా ఐఎస్ఎల్ సాధ్యమా.. మాస్టర్స్ రైట్స్ అగ్రిమెంట్ పునరుద్ధరణ అంశంలో అనిశ్చితి నెలకొనడంతో... ఐఎస్ఎల్ లీగ్ను సొంతంగా నిర్వహించే అంశాన్ని కూడా ఏఐఎఫ్ఎఫ్ పరిశీలిస్తోంది. ‘ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేం లేదు. అయితే అన్ని దారులు తెరిచే ఉన్నాయి. వాటాదారులతో చర్చిస్తున్నాం. ఎంఆర్ఏ పునరుద్ధరణ అంశంలో ఆలస్యం జరిగింది. దేశంలో ఫుట్బాల్ అభివృద్ధి కోసం ఎలాంటి సమావేశానికి అయినా ఫుట్బాల్ సమాఖ్య సదా సిద్ధంగా ఉంటుంది. ఐఎస్ఎల్తో దేశంలో ఫుట్బాల్ మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయనేది ముమ్మాటికి నిజం. మైదానాలు, ఆటగాళ్ల జీతాలు, విదేశీ ప్లేయర్ల సూచనలు, ప్రముఖ కోచ్ల మార్గనిర్దేశం, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం, సినీ రంగ ప్రముఖుల ప్రమేయం ఇలా అన్నీ అంశాల్లో భారత ఫుట్బాల్లో గణనీయమైన మార్పుకు ఈ లీగ్ కారణమైంది. దీంతో భారత ఫుట్బాల్ బ్రాండ్ విలువ పెరిగింది. ఈ సహకారం ఇలాగే కొనసాగుతూ... యువ నైపుణ్యాన్ని సరైన పద్ధతిలో వినియోగిస్తే వచ్చే పదేళ్లలో భారత జాతీయ జట్టు ర్యాంకింగ్ మెరుగవడం ఖాయమే’ అని 48 ఏళ్ల కల్యాణ్ అన్నారు. ర్యాంకింగ్స్లో మెరుగవ్వాలంటే... గత నెల విడుదల చేసిన ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో భారత పురుషుల జట్టు 133వ స్థానంలో నిలిచింది. తొమ్మిదేళ్లలో మన జట్టుకు ఇదే అత్యల్ప ర్యాంకు. ఇటీవలి కాలంలో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తుండటంతో ఆరు స్థానాలు కోల్పోవాల్సి వచి్చంది. దీనిపై కల్యాణ్ స్పందిస్తూ... ‘అంతర్జాతీయ మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తేనే ర్యాంకింగ్స్లో పురోగతి ఉంటుంది. అయితే ఈ ర్యాంకింగ్ విధానం కూడా కాస్త సంక్లిష్టమైంది. ఆడిన మ్యాచ్లు, ప్రత్యర్థి ర్యాంక్ల ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. 2023లో ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న సమయంలో మన జట్టు 106వ ర్యాంక్ నుంచి 99వ స్థానానికి చేరింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత 133వ ర్యాంక్లో నిలిచింది. ఆ్రస్టేలియా, ఉజ్బెకిస్తాన్ వంటి బలమైన జట్ల చేతిలో ఓడటంతో ర్యాంకింగ్స్పై అధిక ప్రభావం చూపింది. అయితే ఆటగాళ్లపై విశ్వాసం కోల్పోము. సీఏఎఫ్ఏ నేషన్స్ కప్, ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో మన జట్టు మెరుగైన ఆటతీరు కనబరుస్తుందనే నమ్మకముంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్ వ్యవస్థ ప్రవేశపెట్టిన సమయంలో భారత్ 143వ ర్యాంక్తో ప్రారంభించింది. ఆ తర్వాత అత్యల్పంగా 173వ స్థానానికి పడిపోయింది. 1996లో అత్యుత్తమంగా 94వ ర్యాంక్లో నిలిచింది. ఐఎస్ఎల్ ద్వారా దేశంలో క్లబ్ క్రికెట్కు మంచి ఆదరణ లభిస్తోంది. ఆసియాలో అత్యధిక మంది వీక్షించిన ఫుట్బాల్ టోర్నీ ఐఎస్ఎల్నే. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఐఎస్ఎల్ ఫలాలు జాతీయ జట్టుకు అందడం లేదు. కానీ కష్టం ఎప్పటికే వృథా పోదు. దాని ప్రభావం టీమిండియాపై కనిపించే రోజులు ఎక్కువ దూరంలో లేవు’ అని కల్యాణ్ వివరించారు.

భారత మహిళల రగ్బీ జట్టుకు కాంస్యం
రాజ్గిర్ (బిహార్): ఆసియా రగ్బీ మహిళల అండర్–20 సెవెన్–ఎ–సైడ్ టోర్నమెంట్లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. ఆదివారం బిహార్లోని రాజ్గిర్లో ముగిసిన ఈ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్లో 12–5 పాయింట్ల తేడాతో ఉజ్బెకిస్తాన్ జట్టును ఓడించింది. భారత జట్టు తరఫున భూమిక శుక్లా 7 పాయింట్లు, గురియా కుమారి 5 పాయింట్లు స్కోరు చేశారు. ఉజ్బెకిస్తాన్ తరఫున హుల్కర్ ఒలెమ్బెర్గనోవా 5 పాయింట్లు సాధించింది.అంతకుముందు లీగ్ దశలో భారత జట్టు కజకిస్తాన్, యూఈఏ జట్లపై గెలిచి హాంకాంగ్ చేతిలో ఓడిపోయి తమ గ్రూప్లో రెండో స్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన హాంకాంగ్ తొలి స్థానంలో నిలిచి భారత్తోపాటు సెమీఫైనల్ చేరుకుంది. మరో గ్రూప్ నుంచి చైనా, ఉజ్బెకిస్తాన్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సెమీఫైనల్స్లో భారత్ 7–28తో చైనా చేతిలో, ఉజ్బెకిస్తాన్ 5–24తో హాంకాంగ్ చేతిలో ఓడిపోయాయి. ఫైనల్లో చైనా 29–21తో హాంకాంగ్ను ఓడించి చాంపియన్గా అవతరించింది.

మళ్లీ ఓడిన భారత మహిళల ‘ఎ’ జట్టు
మెక్కే: భారత ‘ఎ’ మహిళల జట్టు వరుసగా మూడో మ్యాచ్లోనూ ఓడింది. ఇదివరకే అనధికారిక టి20 సిరీస్ను చేజార్చుకున్న అమ్మాయిల జట్టు ఆఖరి పోరులో గెలుపు తీరానికి చేరువై చివరకు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో అనధికారిక టి20 సిరీస్లో ఆ్రస్టేలియా ‘ఎ’ 3–0తో క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. స్పిన్ ద్వయం రాధా యాదవ్ (3/31), ప్రేమ రావత్ (3/24)ల మాయాజాలానికి ఆసీస్ ఇన్నింగ్స్ తడబడింది. మేడ్లైన్ (32 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్), అలీసా హీలీ (21 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్), అనిక (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడారు. అయితే వరుస విరామాల్లో రాధ, ప్రేమలిద్దరు వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ జోరుకు అడ్డుకట్ట పడింది. తర్వాత ఛేదించదగిన లక్ష్యమే అయినా... టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్ల నిర్లక్ష్యంతో భారత్ ‘ఎ’ అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులే చేశారు. ఓపెనర్ వృంద (4), ఉమా ఛెత్రి (3) నిరాశపరిచారు. షఫాలీ వర్మ (25 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే బాధ్యతగా ఆడింది. రాఘ్వి బిస్త్ (25 బంతుల్లో 25; 2 ఫోర్లు), మిన్ను మణి (29 బంతుల్లో 30; 4 ఫోర్లు)ల పోరాటంతో గెలుపు దారిలో పడిన భారత్ను 19వ ఓవర్ దెబ్బ కొట్టింది. 12 బంతుల్లో 18 పరుగుల సమీకరణం టి20ల్లో ఏమాత్రం కష్టం కాదు. కానీ 19వ ఓవర్ వేసిన సియానా జింజర్ (4/16) తొలి బంతికి సజన (3), ఐదో బంతికి రాధ (9)ను అవుట్ చేయడంతో భారత్ విజయానికి దూరమైంది. ఆఖరి ఓవర్లో ప్రేమ రావత్ (8 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా... ఇంకా 4 పరుగుల దూరంలోనే ఉండిపోయింది. మూడు అనధికారిక వన్డేల సిరీస్ బ్రిస్బేన్లో 13న జరిగే తొలి మ్యాచ్తో మొదలవుతుంది.

చరిత్ర పుటల్లో రమేశ్
చెన్నై: ఆసియా సర్ఫింగ్ చాంపియన్షిప్లో భారత యువ సర్ఫర్ రమేశ్ బుధియాల్ కాంస్య పతకంతో మెరిశాడు. పురుషుల ఓపెన్ విభాగంలో ఫైనల్కు చేరిన తొలి భారత సర్ఫర్గా చరిత్ర సృష్టించిన రమేశ్ కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నమెంట్లో భారత జట్టుకు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఆదివారం జరిగిన ఓపెన్ పురుషుల కేటగిరీ ఫైనల్లో రమేశ్ 12.60 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన కనోవా హీజే 15.17 పాయింట్లతో పసిడి పతకం గెలుచుకోగా... పజార్ అరియానా (14.57 పాయింట్లు; ఇండోనేసియా) రజతం దక్కించుకున్నాడు. మహిళల ఓపెన్ విభాగంలో జపాన్కు చెందిన అన్రి మసునో (14.90 పాయింట్లు) స్వర్ణం గెలుచుకోగా... సుమోమో సటో (13.70 పాయింట్లు; జపాన్), ఇసాబెల్ హిగ్స్ (11.76 పాయింట్లు; థాయ్లాండ్) వరుసగా రజత, కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు. ఐదేళ్ల ప్రాయం నుంచే... కేరళలోని కోవలంకు చెందిన 24 ఏళ్ల రమేశ్ బుధియాల్... ఐదేళ్ల ప్రాయం నుంచే అలలపై తేలియాడే క్రీడలో ఆరితేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలించకపోగా... ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో ముందడుగు వేశాడు. ప్రాణాంతక క్రీడ కావడంతో కుటుంబ సభ్యులు ప్రోత్సాహించకపోగా... తన నైపుణ్యంపై విశ్వాసమున్న రమేశ్ ఎనిమిదో తరగతిలో చదువుకు స్వస్తి చెప్పి సర్ఫింగ్నే సర్వస్వంగా సాధన ప్రారంభించాడు. అతడి కష్టానికి తాజాగా ఆసియా సర్ఫింగ్ చాంపియన్షిప్లో ఫలితం దక్కింది. ఈ టోర్నమెంట్ ఫైనల్కు చేరిన తొలి భారతీయుడిగా నిలిచిన అనంతరం రమేశ్ మాట్లాడుతూ... ‘నా కెరీర్లో ఇదే అతిపెద్ద ఘనత. ఆసియా క్రీడలకు ముందు ఇది నాలో ఆత్మవిశ్వాసం నింపింది. ఈ టోర్నీ భారత్లో జరగడంతో మరింత మెరుగైన ప్రదర్శన చేయగలిగా. భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తా’ అని పేర్కొన్నాడు. రమేశ్ తండ్రి మృతిచెందగా... తల్లి కోవలం తీరప్రాంతంలో ఓ చిన్న హస్తకళల దుకాణం నిర్వహిస్తోంది.
బిజినెస్

పెరుగుతున్న బంగారం ధరలు: ప్రధాన కారణాలు
బంగారం ధరలు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గోల్డ్ రేటు మరింత పెరిగి పసిడి ప్రియులను అవాక్కయ్యాలా చేసింది. ఈ స్థాయిలో కనకం ధరలు పెరగడానికి కారణం ఏమిటనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత పెంచిన సుంకాలు చాలామంది పెట్టుబడిదారుల్లో భయాన్ని రేకెత్తించింది. స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతుంటే.. బంగారం రేటు మాత్రం ఆకాశాన్నంటుతోంది. దీనికి ప్రధాన కారణం పెట్టుబడిదారులు.. గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమే అని నిపుణులు భావిస్తున్నారు.2025 ఆగస్టు 01న గరిష్టంగా రూ. 210 తగ్గి రూ.99,820 (10 గ్రా 24 క్యారెట్స్) వద్ద నిలిచిన గోల్డ్ రేటు.. ఆ తరువాత ఆగస్టు 08 నాటికి రూ. 1,03,310 కు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర ఈ మధ్య కాలంలోనే రూ. 3490 పెరిగింది. ఇది బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి తెలుపడానికి నిదర్శనం.బంగారు కడ్డీలపై అమెరికా సుంకాలు, బలహీనమైన అమెరికా డాలర్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుపై మార్కెట్ అంచనాలు, ఆర్థిక అనిశ్చితి మధ్య పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ వంటివన్నీ గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతున్నాయి.ఇదీ చదవండి: ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..అస్థిర ఆర్థిక పరిస్థితుల్లో బంగారం సురక్షితమైన ఆస్తి. కాబట్టి గోల్డ్ కొనుగోలు చేసే పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరిగింది. ఓ వైపు శ్రావణమాసం.. మరోవైపు వస్తున్న పండుగ సీజన్. ఇవన్నీ కూడా బంగారం ధరలను మరింత పెంచే అవకాశం ఉంది. 2005లో రూ. 7000 వద్ద ఉన్న గోల్డ్ రేటు.. 2025లో రూ. 100000 దాటేసింది. దీన్నిబట్టి చూస్తే దశాబ్దంలో రేటు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?
ఉద్యోగం దొరక్క కొంతమంది బాధపడుతుంటే.. ఉన్న ఉద్యోగంలో ఇమడలేక కొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన కేవలం ఒక నెల తరువాత ఒక ఉద్యోగి రాజీనామా చేసిన సంఘటన సోషక్ నీడియాలో వైరల్ అవుతోంది.హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్ ప్రియవర్షిణి చేసిన లింక్డ్ఇన్ పోస్టులో.. ఉద్యోగంలో చేరిన ఒక నెల తర్వాత రాజీనామా చేసిన ఉద్యోగి గురించి వెల్లడించింది. ఉదయం 10:00 గంటలకు జీతం అందుకున్న ఉద్యోగి.. తన రాజీనామాను ఉదయం 10:05 గంటలకు ఈమెయిల్ ద్వారా పంపినట్లు వెల్లడించింది. ఇటువంటి చర్య మంచిదేనా?, ఇది న్యాయంగా ఉందా? అంటూ హెచ్ఆర్ ప్రశ్నించారు.నువ్వు ఇక్కడే ఉండాలి అనుకోకపోతే.. ఉద్యోగంలో ఎందుకు చేరాలి?, ప్రాసెస్ ప్రక్రియలను ఎందుకు పూర్తి చేయాలి?, ట్రైనింగ్ సమయంలో ఎందుకు మౌనంగా ఉండాలి? అని కూడా హెచ్ఆర్ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదీ చదవండి: ఏఐ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: గౌడత్ హెచ్చరికజీతం వచ్చిన వెంటనే.. రాజీనామా చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం.. జవాబుదారీతనం లేకపోవడం అని కొందరు చెబుతున్నారు. ఆకస్మికంగా ఉద్యోగానికి రాజీనామా చేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఇంకొందరు చెబుతుంటే.. ఉద్యోగం నచ్చలేదేమో అని మరికొందరు సమర్థిస్తున్నారు.

ట్రంప్ గ్రేట్ అంటున్న ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ కియోసాకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రేట్ అంటున్నారు ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి. క్రిప్టోకరెన్సీలో పెన్షన్ పొదుపు చేసే అవకాశాన్ని కల్పించినందుకు ప్రశంసించారు. అమెరికన్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన 401(కె) రిటైర్మెంట్ ప్లాన్ల బ్యాలెన్స్లలో ఉన్న నిధులను డిజిటల్ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ ఇటీవల సంతకం చేశారు.నేడు ఈ పొదుపు మొత్తం 12,5 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.కాబట్టి వర్చువల్ కరెన్సీ మార్కెట్లోకి బిలియన్ డాలర్లు ప్రవహించవచ్చు. అయితే, డిజిటల్ ఆస్తుల యజమానులు ఇప్పుడే సంతోషించడం తొందరపాటు అవుతుంది. రిస్క్ లను తగ్గించడానికి, యూఎస్ నివాసితుల ప్రయోజనాలను రక్షించడానికి పెన్షన్ పొదుపును ఖర్చు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించిన తరువాత మాత్రమే ఈ చట్టం ఆచరణలోకి వస్తుంది.క్రిప్టోకరెన్సీల్లోనే కాకుండా రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి ఇతర ప్రత్యామ్నాయ ఆస్తుల్లో కూడా పొదుపు చేసే హక్కును రెగ్యులేటరీ చట్టం కల్పించడం గమనార్హం. అందువల్ల వర్చువల్ కరెన్సీల్లో ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తారో తెలియదు.డోనాల్డ్ ట్రంప్కు తన ఆమోదాన్ని తెలియజేస్తూ రాబర్ట్ కియోసాకి ‘ఎక్స్’(ట్విటర్)లో ఇలా పోస్ట్ చేశారు.. ‘బిట్ కాయిన్ కొనుగోలుకు ప్రజలు తమ రిటైర్మెంట్ పొదుపును ఖర్చు చేయడానికి ట్రంప్ అనుమతించడం గొప్ప వార్త. గొప్ప అధ్యక్షుడు, గొప్ప నాయకుడు. మీరు బిట్ కాయిన్ సేవ్ చేస్తున్నారా?’ అంటూ రాసుకొచ్చారు. TRUMP allowing retirement accounts to save Bitcoin is big news. Great President…great leader.Are you saving Bitcoin?— Robert Kiyosaki (@theRealKiyosaki) August 7, 2025

భారత్లో టెస్లా బిగ్ డీల్!.. నెలకు రూ.17.22 లక్షల రెంట్
ప్రపంచం కుబేరుడు 'ఎలాన్ మస్క్' యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం 'టెస్లా'.. ముంబైలో తన మొదటి షోరూమ్ ప్రారంభించింది. ఇప్పుడు తన రెండో షోరూంను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.తన రెండో షోరూమ్ కోసం టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీలోని ఏరోసిటీలో 8,200 చదరపు అడుగుల స్థలాన్ని తొమ్మిది సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. దీని నెలవారీ అద్దె రూ. 17.22 లక్షలు. ఈ విషయాన్ని డాక్యుమెంట్స్ను అసెస్ చేసిన 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' వెల్లడించింది.టెస్లా ఈ స్థలాన్ని ఓక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చదరపు అడుగుకు రూ. 210 చొప్పున.. రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్తో లీజుకు తీసుకుంది. అంతే కాకుండా టెస్లా నెలకు రూ. 6,000 చొప్పున 10 పార్కింగ్ స్లాట్లను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..జూలై 15, 2025న ప్రారంభమయ్యే లీజు మొదటి సంవత్సరానికి రూ. 40.17 లక్షలు, రెండవ సంవత్సరంలో రూ. 42.07 లక్షలు, మూడవ సంవత్సరంలో రూ. 44.07 లక్షలు, నాల్గవ సంవత్సరంలో రూ. 46.17 లక్షలు, ఐదవ సంవత్సరంలో రూ. 48.36 లక్షలు, ఆరవ సంవత్సరంలో రూ. 50.66 లక్షలు, ఏడవ సంవత్సరంలో రూ. 53.06 లక్షలు, ఎనిమిదవ సంవత్సరంలో రూ. 55.58 లక్షలు, తొమ్మిదవ సంవత్సరంలో రూ. 58.22 లక్షలకు చేరుకుంటుంది.
ఫ్యామిలీ

ఇవోరకం పూతరేకులు..!
వీటిని దూరం నుంచి చూస్తే, బొగ్గుముక్కల్లా కనిపిస్తాయి. దగ్గరగా చూస్తే, మాడిపోయిన పూతరేకుల్లా కనిపిస్తాయి. నిజానికి ఇవి పూతరేకుల్లాంటి వంటకమే! కాకుంటే, మాడిపోలేదు, ఎవరూ కావాలని వీటిని మాడ్చేయలేదు. వీటి తయారీకి వాడే ముడిపదార్థాల కారణంగానే నల్లగా కనిపిస్తాయి. ‘పికి బ్రెడ్’ అని పిలుచుకునే ఈ సంప్రదాయ వంటకం తయారీలో నల్లని మొక్కజొన్న గింజల నూక, నల్లగా నిగనిగలాడే జూనిపర్ బెర్రీలను కాల్చి తయారు చేసిన బూడిదను ప్రధానంగా వాడతారు. తయారీ ప్రక్రియ దాదాపు మన పూతరేకుల మాదిరిగానే ఉంటుంది. పూతరేకుల తయారీలో కుండ అడుగున మంటపెట్టి, పిండిని కుండ మీద ఒక్కోపూతగా పూసి, వాటిని ఒద్దికగా చుడతారు. ‘పికో బ్రెడ్’ తయారీకి రాతిపలక కింద మంట పెడతారు. వేడెక్కిన రాతి పలక మీద ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని అతి సన్నని పొరలుగా కాలుస్తారు. కొన్ని పొరల దొంతరలను ఇలా పూతరేకుల్లా చుడతారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో నివసించే ‘హోపీ’ తెగవారి సంప్రదాయ వంటకం ఇది. ఈ తీపి వంటకాన్ని పండుగలు, పుట్టినరోజులు వంటి ప్రత్యేక సందర్భాలలో తయారు చేసుకుంటారు.(చదవండి: కొరకరాని గింజలే గాని...)

రోజుకింత 'పీచు' చాలు..!
షుగర్ ఉన్నవారు, లేదా షుగర్ వచ్చే దశకు (ప్రీడయాబెటిస్) చేరుకున్నవారు నిరంతరం జాగ్రత్తగా ఉండటం అవసరం. మందులు సక్రమంగా వేసుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. తరచు షుగర్ టెస్ట్ చేయించుకుంటుండాలి. ఇదంతా కూడా ఒక ప్రణాళికలా ఉంటుంది. అయితే ఆ ప్రణాళికను పాటిస్తూనే, మీ షుగర్ను మీరు నియంత్రణలో ఉంచుకోటానికి ఒక తేలికైన మార్గం కూడా ఉంది. అదేమిటంటే, ఆహారంలోకి మీరు తీసుకునే పీచుపదార్థాలను (డైటరీ ఫైబర్) మరికాస్త ఎక్కువ చేయటం! ‘అమెరికన్ డయబెటిస్ అసోసియేషన్’ (ఎ.డి.ఎ.) తాజాగా పూర్తి చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. షుగర్ ఉన్నవారు లేదా షుగర్ వచ్చే దశలో ఉన్నవారు డైటరీ ఫైబర్ను ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని వెల్లడైంది. డైటరీ ఫైబర్ అంటే?పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు వంటి శాకాహారాల్లో కనిపించే ఒక రకమైన కార్బోహైడ్రేటే.. డైటరీ ఫైబర్. ఇతర కార్బోహైడ్రేట్ల (పిండి పదార్థాల) మాదిరిగా ఈ డైటరీ ఫైబర్ మీ శరీరంలో త్వరగా జీర్ణం కాకపోగా, ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడుతుంది. మీ రక్తప్రవాహంలోకి చక్కెర ప్రవేశించే వేగాన్ని నెమ్మదింపజేస్తుంది జీర్ణకోశంలోని మంచి బాక్టీరియాకు దన్నుగా ఉంటుంది. అధ్యయనంలో ఏం తేలింది?అధ్యయనం కోసం ఎ.డి.ఎ. పరిశోధకులు డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్న 3,000 కంటే ఎక్కువమంది అమెరికన్ల ఆరోగ్య వివరాలను అనేక ఏళ్ల పాటు నిశితంగా పరిశీలించారు. వారు ఎంత ఫైబర్ను తీసుకున్నారు, వారిలో ఎంతమంది ఎంతకాలానికి మరణించారు, మరణించినవారు ఏదైనా ఇతర కారణం వల్ల మరణించారా లేదా గుండె జబ్బుల వల్ల మరణించారా అన్నది చూశారు. ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. వాటి ప్రకారం, ఎక్కువ ఫైబర్ తీసుకున్న వ్యక్తులు ఏ కారణం చేతనైనా చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే వారు ప్రతిరోజూ తీసుకునే ప్రతి అదనపు గ్రాము ఫైబర్కు, వారు మరణించే అవకాశం దాదాపు 2 శాతం తగ్గింది. ఫైబర్తో గుండె ఆరోగ్యంహృద్రోగ మరణాల విషయానికి వస్తే... ఫైబర్కు, గుండె ఆరోగ్యానికి మధ్య సంబంధం కొంచెం సంక్షిష్టంగానే ఉంది. ఎక్కువ ఫైబర్ తీసుకోవటం వల్ల మరణ ప్రమాదం తగ్గింది కాని, అయితే అది ఒక నిర్దిష్ట పరిమితి వరకే. ఫైబర్ వల్ల గుండెకు చేకూరే ప్రయోజనాలు రోజుకు దాదాపు 26 గ్రాముల ఫైబర్తో ఆగిపోయాయి. ఫైబర్ అంతకు మించితే ప్రయోజనం లేకపోగా, ప్రమాదం పెరిగే అవకాశం కనిపించింది. అయినప్పటికీ ఇది పూర్తిగా నిర్ధారణ కాని విషయంగానే మిగిలింది. దీనిని బట్టి ఫైబర్ గుండెకు మంచిదే అయినప్పటికీ, ఎక్కువ తీసుకోవడం అన్నది అంత మంచిది కాకపోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.ఇలా చేయండిమీకు ఫైబర్ను తీసుకునే అలవాటు లేకపోతే, కడుపులో అసౌకర్యాన్ని నివారించటం కోసం మొదట కొద్ది మొత్తంలో ఫైబర్ను మీ ఆహారంలో చేర్చుకోండి. మీ జీర్ణ వ్యవస్థలోకి చేరిన ఫైబర్ క్రియాశీలం అవటానికి నీరు తాగటం అవసరం.ఫైబర్ ఫలితాన్ని సంపూర్ణంగా పొందటానికి పండ్ల రసాలు కాకుండా పండ్లుగా తినండి. అలాగే మీ ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. తృణధాన్యాలను ఎంచుకోండి. తెల్ల బియ్యం, బ్రెడ్ నుండి బ్రౌన్ రైస్, హోల్–వీట్ బ్రెడ్కు మారండి.∙చిక్కుళ్లను మీ ఆహారానికి జోడించండి. బీన్స్, కాయధాన్యాలు, సెనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మాంసకృత్తులు కూడా దండిగా ఉంటాయి. తీసుకోవలసిన జాగ్రత్తలుఒకేసారి ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల ఉబ్బరం లేదా కడుపులో గ్యాస్ వస్తుంది. కనీసం ఫైబర్ మీకు అలవాటయ్యే వరకైనా పూర్తి మొత్తం ఫైబర్ను తీసుకోకండి. అధిక మోతాదులో ఫైబర్ తీసుకోవడం వల్ల కాల్షియం లేదా ఇనుము వంటి కొన్ని ఖనిజాల శోషణ (శరీరం పీల్చుకోవటం) తగ్గుతుంది. కాబట్టి సమతులం అన్నది కీలకం.డయాబెటిక్ గ్యాస్ట్రోపరేసిస్ (తిన్న తర్వాత కడుపు ఎంతకూ ఖాళీ అయినట్లు ఉండకపోవటం) వంటి కొన్ని పరిస్థితులు ఉన్నవారు ఫైబర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే వైద్యుడిని సంప్రదించాలి. ఎంత ఫైబర్ తీసుకోవాలి?తాజా అధ్యయనం ఆధారంగా, రోజుకు 25 నుండి 26 గ్రాముల ఫైబర్ తీసుకోవటం సురక్షితం, ప్రభావవంతం అని తెలుస్తోంది. అనేక ఆరోగ్య సంస్థల సిఫారసులకు అనుగుణంగా ఈ మోతాదును నిర్ణయించారు. డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలోకి ఫైబర్ను తగినంతగా తీసుకోవటం వల్ల రక్తంలో షుగర్ నియంత్రణ ఒక సహజ ప్రక్రియగా జరిగిపోతుంది.కొంతమందికి సాధారణ స్థాయిలో ఫైబర్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఎక్కువ మోతాదులో ఫైబర్ను తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించటం తప్పనిసరి. నేడు మీరు ఫైబర్ తీసుకుంటే అది మీ రేపటి జీవితానికి ఆరోగ్యకరమని గుర్తుంచుకోండి. సాక్షి, స్పెషల్ డెస్క్(చదవండి: కొరకరాని గింజలే గాని...)

కొరకరాని గింజలే గాని...
ఇవి కొరకరాని గింజలు. కొయ్య కంటే గట్టిగా ఉండే గింజలు. అలాగని, ఆషామాషీగా తీసిపారేసే గింజలు కావివి. వీటిని ఏనుగు దంతాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. దక్షిణ అమెరికాలో పెరిగే ‘టాగ్వా’ అనే తాటిజాతి వృక్షాలకు కాసే కాయల్లో ఇవి దొరుకుతాయి. ఈ గింజలను ‘టాగ్వా నట్స్’ అంటారు. ఇవి పోకచెక్కల కంటే గట్టిగా ఉంటాయి. కాబట్టి ఈ కొరకరాని గింజలను ఎవరూ తినలేరు. ఏనుగుదంతంలా నునుపుగా, దృఢంగా ఉండటం వల్ల వీటిని ‘వెజిటబుల్ ఐవరీ’ అంటారు. ఏనుగు దంతాలతో తయారు చేసేలాగానే వీటితో కూడా రకరకాల బొమ్మలను, పూసలు తదితర అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. పద్దెనిమిదో శతాబ్దంలో వీటితో తయారు చేసే గుండీలకు చాలా గిరాకీ ఉండేది. మన్నికకు పేరుపొందిన ఈ గుండీలతో కుట్టించుకున్న దుస్తులను సంపన్నులు ధరించేవారు. పురాతన కాలంలో వీటితో పాచికలను తయారు చేసేవారు. ఇటీవలి కాలంలో వీటిని పొగతాగడానికి ఉపయోగించే పైపులు, చదరంగం బొమ్మలు, కొయ్యబొమ్మల్లాంటి శిల్పాలు, వీటి పూసలతో హారాలు మొదలైన వాటి తయారీకి కూడా ఉపయోగిస్తున్నారు.(చదవండి: కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!)

‘కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!
‘కోవిడ్–19’ మహమ్మారి తర్వాత చాలామంది చాలారకాల ఆరోగ్య సమస్యలకు లోనవుతున్న వార్తలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల, ఆ తర్వాత తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ వల్ల పలువురు మహిళలు రుతుక్రమంలో అస్తవ్యస్తతలు, దానికి తోడు అసాధారణ రక్తస్రావంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్, కోవిడ్ వ్యాక్సిన్ల కారణంగా పలువురు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, అధిక రక్తస్రావం సమస్య తలెత్తుతోందని లండన్లోని వైద్య నిపుణులు ఇటీవల గుర్తించారు. ఈ సమస్యపై వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తమ అధ్యయన వివరాలను ‘క్లినికల్ సైన్స్’ జర్నల్లో ప్రచురించారు. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్కు గురైన వారిలో దాదాపు 33.8 శాతం మహిళలకు రుతుక్రమంలో అస్తవ్యస్తతలు ఏర్పడ్డాయి. 26 శాతం మహిళల్లో అస్తవ్యస్తమైన రుతుక్రమంతో పాటు అధిక రక్తస్రావం సమస్య ఏర్పడింది. 19.7 శాతం మహిళల్లో రుతుక్రమంలో అస్తవ్యస్తతలు లేకున్నా, అధిక రక్తస్రావం సమస్య తలెత్తింది. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ‘కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!)
ఫొటోలు
అంతర్జాతీయం

పరాయి దేశాలపై సైనిక చర్య?.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం వైపు అడుగులేస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో సైనిక చర్య చేపట్టే యోచనలో ఉన్నారు. డ్రగ్ కార్టెల్స్ను ఇదివరకే ఉగ్రసంస్థలుగా గుర్తించిన ఆయన.. వాటిపై ఉక్కుపాదం మోపే క్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.జనవరిలో అధ్యక్ష హోదాలో వైట్హౌజ్లో అడుగుపెట్టిన వెంటనే.. లాటిన్ దేశాలకు చెందిన పలు కార్టెళ్లను జాతీయ భద్రతా ప్రమాదంగా గుర్తించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారాయన. ‘‘లాటిన్ అమెరికాలో చాలా కార్టెళ్లు ఉన్నాయి. వాటిల్లో మాదకద్రవ్యాలు ప్రవహిస్తున్నాయి. వాటి నుంచి మన దేశాన్ని ఎలాగైనా రక్షించాలి’’ అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలోనే అలాంటి కార్టెళ్లను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.2025 ఫిబ్రవరిలో మెక్సికో, వెనిజులా దేశాల్లోని ఎనిమిది డ్రగ్ కార్టెళ్లను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా గుర్తించింది. ఇందులో మెక్సికో సినాలోవ్, వెనిజులా ట్రెన్ డె అరగ్వా ప్రధానంగా ఉన్నాయి. తర్వాతి రోజుల్లో వెనిజులాకే చెందిన సన్స్(Suns) అనే మరో కార్టెల్ను చేర్చింది అమెరికా. గత 20 ఏళ్లుగా ఈ కార్టెల్ నుంచే అమెరికాకు టన్నుల కొద్దీ మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయని అమెరికా అంటోంది. అంతేకాదు ఈ కార్టెల్ను వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోనే నడిపిస్తున్నారని అమెరికా ఆరోపించగా.. ఆయన ఆ ఆరోపణలను ఖండించారు కూడా. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్ మద్దతుతో సైనిక చర్యకు సిద్ధమవ్వాలని.. అవసరమైతే అంతర్జాతీయ మిత్రదేశాల సహకారంతో ముందుకు వెళ్లాలని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ను ట్రంప్ ఆదేశించారు. ఇదే విషయాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ సైతం ప్రచురించింది. అయితే.. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌజ్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. కానీ అధ్యక్ష భవన ప్రతినిధి అన్నా కెల్లీ మాట్లాడుతూ.. అమెరికాను రక్షించడం ట్రంప్ తొలి ప్రాధాన్యం. ఇప్పటికే పలు కార్టెల్స్ను ఉగ్రసంస్థలుగా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ఆయన వెనకాడరని గుర్తించాలి అని అన్నారు. సైనిక చర్యను అనుమతిస్తాయా?ఒక దేశపు సైన్యాన్ని.. మరొక దేశంలో ప్రయోగిస్తామంటే ఊరుకుంటారా?. తాజా అమెరికా సైనిక చర్య కథనాలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బౌమ్ స్పందించారు. ‘‘మాదక ద్రవ్యాల కట్టడికి ఇరు దేశాలు(అమెరికా, మెక్సికో) కలిసే పని చేస్తున్నాయి. ఇప్పటికే మేం ఆ దేశానికి సహకరిస్తున్నాం కూడా. అలాంటప్పుడు సైనిక చర్య దేనికి?. ఇది స్వాగతించదగ్గ నిర్ణయం ఏమాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా సైన్యాన్ని మా దేశంలో అడుగుపెట్టనివ్వం’’ అని పేర్కొన్నారు. మెక్సికో విదేశాంగ శాఖ కూడా అమెరికా సైనిక జోక్యం కథనాలను ఖండిస్తూ.. అలాంటి చర్యలకు అనుమతించబోమని స్పష్టం చేసింది.సైనిక చర్య.. ట్రంప్ ప్లాన్ ఎలాగంటే.. విదేశీ మిత్ర దేశాలతో సమన్వయంసముద్రంలో, విదేశీ భూభాగాల్లో నేరగాళ్లపై దాడులుఈ దాడుల్లో స్పెషల్ ఫోర్సెస్, గూఢచర్య సంస్థలు పాల్గొనే ఛాన్స్అమెరికా తగ్గేదే లే..అయితే.. అమెరికా మాత్రం ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని చెబుతోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కార్టెల్స్ అనే వాటిని కేవలం మాదకద్రవ్యాల విక్రయ సంస్థలుగా కాకుండా ఆయుధాలతో కూడిన ఉగ్రవాద సంస్థలుగానే పరిగణించాలి. ఈ గుర్తింపుతోనే ఇకపై ఇది అమెరికాకు జాతీయ భద్రతా సమస్యగా మారింది. తద్వారా వాటి కార్యకలాపాలపై అమెరికా గూఢచర్య సంస్థలు, రక్షణ శాఖలను ప్రయోగించబోతున్నాం అని పేర్కొన్నారాయన.

ఇక రంగంలోకి ట్రంప్.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాడా?
ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల భేటీ తేదీ, వేదిక ఖరారు అయ్యింది. ఆగస్టు 15వ తేదీన అలస్కాలో తాను పుతిన్తో భేటీ కాబోతున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు.నాకు, పుతిన్కు మధ్య భేటీ కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ సమావేశం వచ్చే శుక్రవారం ఆగస్టు 15వ తేదీన గ్రేట్ అలస్కా స్టేట్లో జరగోబోతోంది అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారాయన. మరోవైపు.. క్రెమ్లిన్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. అయితే ఈ చర్చలతో ట్రంప్ ఏం సాధించబోతున్నారనే విశ్లేషణ ఇప్పటికే మొదలైంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి శాంతి చర్చలు పలు దఫాలుగా జరిగాయి. ఇస్తాంబుల్(టర్కీ)లో చర్చలు జరిగినా, తన రాయబారితో ట్రంప్ స్వయంగా ఇరు దేశాల మధ్య ట్రంప్ సంప్రదింపులు ఇప్పటివరకు శాంతి ఒప్పందం కుదరలేదు. అయితే ఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనడం కోసం స్వయంగా ట్రంపే ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారని వైట్హౌజ్ అంటోంది. తద్వారా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడనున్నాయని అంటోంది. భౌగోళికంగా తటస్థ ప్రాంతం కావడం వల్ల ఉక్రెయిన్ చర్చలకు అలస్కా ఎంపిక చేసినట్లు చెబుతోంది. కొసమెరుపు ఏంటంటే.. యుద్ధ రుణభారంతో కుంగిపోయిన పూర్వపు రష్యా సామ్రాజ్యపు అధినేత జార్ అలెగ్జాండర్-2 1867లో అలస్కాను అమెరికాకు 7.2 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. రష్యా డిమాండ్లు• క్రిమియా, డోనెత్స్క్, లుహాన్స్క్ వంటి ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని రష్యా కోరుతోంది.• నాటోలో చేరే ఉక్రెయిన్ ఆలోచనను విరమించుకోవాలని రష్యా పట్టుబడుతోంది.ఉక్రెయిన్ వైఖరి• భూభాగాలపై రాజీకి ఉక్రెయిన్ నిరాకరణ• అంతర్జాతీయ మద్దతుతో శాంతి చర్చలు కొనసాగించాలన్న పట్టుదలఇప్పటివరకు రష్యా కాల్పుల విరమణకు అంగీకరించింది లేదు. అమెరికా ప్రతినిధులు జెలెన్స్కీతో కూడిన త్రైపాక్షిక సమావేశాన్ని ప్రతిపాదించినా, రష్యా ఇంకా స్పందించలేదు. మరోవైపు.. పుతిన్ శాంతి చర్చలు నాటకీయంగా మార్చేశారని జెలెన్స్కీ విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో.. తమ భాగస్వామ్యం లేకుండా శాంతి చర్చలు జరగడం సరికాదని అంటున్నారాయన. ఈ తరుణంలో.. మొన్నటిదాకా నియంతగా జెలెన్స్కీపై మండిపడ్డ ట్రంప్, ఇప్పుడు భేటీ కావడానికి సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం. తాను ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్ తీవ్రంగా భావిస్తున్నారు. జెలెన్స్కీని తన దగ్గరకు రప్పించుకున్నప్పటికీ.. విమర్శించి పంపించారే తప్ప చర్చల్లో పురోగతి సాధించలేకపోయారు. ఆపై అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ను ఇరు దేశాలకు పంపించి దౌత్యం నడిపించారు కూడా. ఈ క్రమంలో ఇటు రష్యా డిమాండ్లకు తలొగ్గాలని ఉక్రెయిన్కు సూచించడంతో పాటు చర్చల్లో ఉక్రెయిన్ను భాగం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.పుతిన్ స్పందనట్రంప్ ఉంటే అసలు ఈ యుద్ధం జరిగేదే కాదు ట్రంప్తో చర్చలకు సిద్ధంగా ఉన్నానుఅమెరికా, రష్యా ప్రశాంతంగా మాట్లాడుకోవాలిజెలెన్స్కీ అభిప్రాయంఅమెరికా నాయకత్వంపై ఆశ ఉంది రష్యా దాడులు ఆగకపోతే శాంతి సాధ్యం కాదుట్రంప్–పుతిన్ చర్చల్లో ఉక్రెయిన్ ఉండాల్సిందేపుతిన్, ట్రంప్ చివరిసారిగా 2018 ఫిన్లాండ్ రాజధాని హెల్సెంకీలో భేటీ అయ్యారు. అలాగే దాదాపు పదేళ్ల తర్వాత పుతిన్ అమెరికాకు రానున్నారు. శాంతి చర్చల్లో ఈ ఇద్దరి భేటీ కీలకం కానుంది. అలాగే ఈ సమావేశం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.తనను తాను శాంతికాముకుడిగా ప్రకటించుకున్న ట్రంప్.. ఇప్పటిదాకా పలు దేశాల మధ్య యుద్ధాలను ఆపానంటూ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ యుద్ధాన్ని కూడా ఆపేస్తాడా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే ఉక్రెయిన్ యుద్ధాన్ని తానే ఆపేస్తానంటూ మొదటి నుంచి ట్రంప్ చెబుతూ వస్తున్నారు. అయితే.. ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చల విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆర్థిక ఒత్తిడి, రాయబార చర్చలు, వ్యక్తిగత సంబంధాలు ద్వారా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. మూడు దేశాల మధ్య సహకారం, నమ్మకం, ప్రామాణిక చర్చలపైనే ఈ సంక్షోభం ముగియడం అనేది ఆధారపడి ఉంటుందన్నది విశ్లేషకుల మాట.

‘1929 నాటి మహా మాంద్యం చూస్తారు’: ట్రంప్ తీవ్ర హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా విధిస్తున్న సుంకాలపై పలు దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సుంకాల వాదనను పదేపదే సమర్థించుకుంటున్నారు. తాజాగా ఆయన అమెరికా విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా కోర్డు తీర్పు ఇస్తే మరోమారు 1929 నాటి ఆర్థికమాంద్యం ఏర్పడుతుందని హెచ్చరించారు.ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా దాఖలైన కేసుపై యూఎస్ ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు త్వరలో తీర్పును వెల్లడించనున్న సమయంలో ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అలాగే స్టాక్ మార్కెట్పై సుంకాల ప్రభావం సానుకూలంగా ఉండబోతున్నదని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రాశారు. సుంకాల కారణంగా దాదాపు ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఫలితంగా మన దేశం(అమెరికా) ఖజానాలోకి బిలియన్ డాలర్లు చేరుతున్నాయి. సుంకాల విధింపు దేశీయ తయారీని ప్రోత్సహిస్తుంది. ఆదాయపు పన్నుకు ప్రత్యామ్నాయంగా మారుతుందని ట్రంప్ పేర్కొన్నారు.సుంకాల కారణంగా అమెరికాకు ఇప్పటివరకు చూడని సంపద సమకూరనున్నదని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇటువంటి సంపద సృష్టి ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఒక రాడికల్ వామపక్ష కోర్టు తీర్పు ఇస్తే, అంత పెద్ద మొత్తంలో ధనాన్ని, గౌరవాన్ని తిరిగి ఎప్పటికీ పొందలేమని ట్రంప్ పేర్కొన్నారు. మన దేశం విజయానికి, గొప్పతనానికి అర్హమైనదని, గందరగోళం, వైఫల్యం, అవమానానికి ఆస్కారం లేదని ట్రంప్ పేర్కొన్నారు. దేవుడు అమెరికాను ఆశీర్వదిస్తున్నాడు అని ట్రంప్ తన ‘ట్రూత్’లో రాశారు.చైనా, కెనడా,మెక్సికో తదితర దేశాలు అమెరికా విధించిన సుంకాలపై కోర్టును ఆశ్రయించాయి. ఈ తరహా సుంకాల విధింపునకు అధ్యక్షుడు ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ)ను ఉపయోగించడంపై ఈ కేసు దృష్టి సారించనుంది. ఒక వేళ ఈ కేసులో ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పువస్తే, కొత్త సుంకాల అమలుకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే ఈ విధంగా ఓడిపోయిన పార్టీ తరువాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. 1929లో తలెత్తిన మహా మాంద్యం.. ఆధునిక చరిత్రలో తీవ్రమైన ఆర్థిక మాంద్యాలలో ఒకటి. ఇది యునైటెడ్ స్టేట్స్ లో ప్రారంభమై, ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. పారిశ్రామిక ఉత్పత్తి, ధరలు, వాణిజ్యం గణనీయంగా పడిపోయాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. బ్యాంకులు మూతపడ్డాయి. ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పేదరికం తాండవించింది.

గాజాపై పూర్తి నియంత్రణ.. నెతన్యాహు సంచలన నిర్ణయం
టెల్అవీవ్: గాజాను పూర్తిగా ఆక్రమించుకోవాలన్న వివాదాస్పద నిర్ణయాన్ని ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదించింది. శుక్రవారం జరిగిన రక్షణ కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుమారు 10 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. గాజాపై పూర్తి స్థాయి నియంత్రణ సాధించడమే తన లక్ష్యమని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. ఆయన కార్యాలయం ఇందుకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఆక్రమణ అనే మాటను వాడనప్పటికీ, వాస్తవానికి ఈ ప్రణాళిక ఉద్దేశం అదేనని తెలుస్తోంది.ఒక వైపు హమాస్ చెరలోని బందీల భద్రతపై బాధిత కుటుంబాలు, మరో వైపు మరింత మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ నెతన్యాహూ ప్రభుత్వం ఈ ప్రణాళికను ముందుకు తెచ్చింది. గాజాలో మూడొంతుల ప్రాంతం ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీ నియంత్రణలో ఉంది. అయితే, తాజా ప్రణాళిక ఇజ్రాయెల్ను అంతర్జాతీయంగా ఏకాకిగా మార్చే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు.గాజాను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చేందుకు కొన్ని నెలలపాటు పట్టే ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో స్పష్టత లేదు. అయితే, అక్టోబర్ 7వ తేదీ నాటికి గాజా సిటీని ఖాళీ చేయించాలని డెడ్లైన్ పెట్టుకుంది. నగరంలో ఆహార పంపిణీ నిలిపివేయడం, అక్కడి వారిని బలవంతంగా ఖాళీ చేయిండం ఈ ప్రణాళికలో భాగాలు. ఇందుకోసం వేలాది మంది అదనపు బలగాలను రంగంలోకి దింపాల్సి ఉంటుంది. ఇప్పటికే గాజాలో కరవు కాటకాలు, ఆకలి చావులకు కారణమవుతోందంటూ ఇజ్రాయెల్పై ఆగ్రహంతో ఉన్న పలు దేశాలు తాజా ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.పలు దేశాల ఖండన..ఇజ్రాయెల్ది తప్పుడు నిర్ణయమని యూకే ప్రధాని స్టార్మర్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైనిక అవసరాలు తీర్చే రెండో అతిపెద్ద సరఫరాదారు జర్మనీ కూడా..మిలటరీ పరికరాలను ఇకపై విక్రయించబోమని స్పష్టం చేసింది. నెతన్యాహూ మాత్రం ఈ విషయంలో మనస్సు మార్చుకునే ఉద్దేశంతో లేరు. ఇజ్రాయెలీలు సైతం హమాస్తో ఒప్పందం కుదుర్చుకుని బందీలను త్వరగా బయటకు తీసుకురావాలనే కోరుకుంటున్నారు. అయితే, షరతులు పెట్టకుండా హమాస్పై ఒత్తిడి తెచ్చి, బందీలను విడుదల చేయించడమే లక్ష్యంగా నెతన్యాహూ గాజా పూర్తి నియంత్రణ అనే బెదిరింపునకు దిగారని భావిస్తున్నారు. దీనిని ట్రంప్ యంత్రాంగం సైతం వ్యతిరేకించలేదు.అతివాద పార్టీలతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న నెతన్యాహూ అధికారంలో కొనసాగేందుకే ఈ సంక్షోభాన్ని వాడుకుంటున్నారన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఇప్పటికే గాజాలోని 8 లక్షల మంది పాలస్తీనియన్లను బలవంతంగా ఉత్తరం నుంచి దక్షిణానికి, తిరిగి ఉత్తరాదికి ఖాళీ చేయిస్తూ, క్షేత్రస్థాయిలో దాడులు, వైమానిక నిఘాలతో ఆర్మీ అసహనంతో ఉంది. గాజాను నియంత్రణలోకి తెచ్చుకోవడమంటే మరింత ఊబిలోకి దిగడమేనని ఆర్మీ వర్గాలు అంటున్నాయి.
జాతీయం

మన ఆదాయం పెరిగింది!
కాలం వేగంగా పరుగెడుతోంది. అందుకు తగ్గట్టుగా సాంకేతికంగానే కాదు, ఆర్థికంగానూ మార్పులను చూస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగయ్యాయి. సగటు ఆదాయాలూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1987లో అల్పాదాయ దేశాలు 49 ఉంటే.. 2024 నాటికి ఈ సంఖ్య దాదాపు సగానికి వచ్చిందంటే అభివృద్ధి దిశగా ఏ స్థాయిలో మార్పులొచ్చాయో అర్థం చేసుకోవచ్చు. మనదేశం గత 20 ఏళ్ల కాలంలో విశేష పురోగతి సాధించింది. ప్రపంచ బ్యాంకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఒకప్పుడు అల్పాదాయ దేశాల జాబితాలో ఉన్న మనదేశం.. 2007లోనే దిగువ మధ్య ఆదాయ దేశంగా అవతరించడం విశేషం. 1987లో అల్పాదాయ దేశాల జాబితాలో ఉన్న దక్షిణాసియాలోని ఆరు దేశాల్లో 2024 నాటికి అయిదు దేశాలు దిగువ మధ్య దేశాల జాబితాలోకీ, ఒకటి ఎగువ మధ్య దేశాల జాబితాలోకీ చేరాయి. 37 ఏళ్లలో అల్పాదాయ దేశాల సంఖ్య సగానికి పడిపోవడం ప్రజల ఆదాయాల పెరుగుదల తీరుతెన్నులకు అద్దం పడుతోంది. ఇక ఎగువ మ ధ్య తరగతి దేశాలు 28 నుంచి 54కు చేరాయి. అధిక ఆదాయ దేశాల సంఖ్య 41 నుంచి రెండింతలకుపైగా దూసుకెళ్లి 87 అయ్యాయి. తగ్గిన పేదలు..: 2004–24 మధ్య ఎగువ మధ్య ఆదాయ గ్రూప్ దేశాల జనాభా 8.9 నుంచి 34.7%కి ఎగబాకడం గమనార్హం. 2004లో అల్పాదాయ గ్రూప్ దేశాల్లో నివసించిన జనాభా 37.4% ఉండగా.. రెండు దశాబ్దాల్లో ఇది 7.6%కి దిగొచ్చింది. అయితే యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు ఆదాయాల్లో ఒక మెట్టు దిగేలా చేస్తాయనడానికి సిరియా, యెమెన్ ఉదాహరణ. 2017లో తక్కువ–మధ్య ఆదాయ గ్రూప్ నుంచి ఇవి అల్పాదాయ గ్రూప్నకు వచ్చాయి. నాలుగు గ్రూపులుగా..: ప్రపంచంలోని దేశాలను.. ప్రపంచ బ్యాంకు ఏటా తలసరి స్థూల జాతీయ ఆదాయం (జీఎన్ఐ) ఆధారంగా అల్ప, దిగువ–మధ్య, ఎగువ–మధ్య, అధిక–ఆదాయ దేశాలుగా వర్గీకరిస్తోంది. 2025–26 (2025 జూలై–2026 జూన్) సంవత్సరానికిగాను ప్రపంచవ్యాప్తంగా 216 దేశాల జాబితా విడుదల చేసింది. తలసరి జీఎ న్ ఐ అనేది విదేశీ సంపాదనతో సహా ఏదైనా దేశంలోని జనాభా సగటు ఆదాయానికి కొలమానం. రాయితీ రుణాలకు ఏ దేశాలు అర్హమైనవో నిర్ణయించడానికి సగటు ఆదాయాలను ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకుంటోంది. యూరప్, మధ్య ఆసియా: 1987–2024 మధ్య తక్కువ ఆదాయ దేశం ఒక్కటీ లేదు. అధిక ఆదాయ దేశాల శాతం 71 నుంచి 69కి తగ్గింది.తూర్పు ఆసియా, పసిఫిక్: 1987లో 26% దేశాలు తక్కువ ఆదాయ గ్రూప్లో ఉండగా.. 2024 నాటికి కేవలం 3%కి తగ్గాయి.లాటిన్ అమెరికా, కరేబియన్: తక్కువ ఆదాయ దేశాలు 2 నుండి సున్నాకి వచ్చాయి. అధిక ఆదాయ దేశాలు 9% నుంచి 46%కి పెరిగాయి.మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా: తక్కువ ఆదాయ దేశాలు 2 నుండి 3కి పెరిగాయి. అధిక ఆదాయ దేశాలు 35%కి చేరాయి.సబ్–సహారన్ ఆఫ్రికా: తక్కువ ఆదాయ దేశాలు 75% నుండి 45%కి తగ్గాయి. ఒక దేశం అధిక ఆదాయ గ్రూప్లో చేరింది.

పదేపదే యాడ్స్.. విసిగిస్తున్నాయ్..!
టీవీ చూస్తున్నప్పుడు ప్రకటనలు రావడం సహజం. మనం చూస్తున్న ఛానల్లో కొన్ని యాడ్స్ పదేపదే ప్రత్యక్షం అవుతుంటాయి. ఇలా ఒకే ఛానల్లో ఎక్కువసార్లు ప్రసారం కావడంతో ప్రేక్షకులు విసిగిపోతారు. సింపుల్గా ఛానల్ మారుస్తారు. ప్రకటన ప్రభావమేకాదు యాడ్స్పట్ల వీక్షకుడికి శ్రద్ధ కూడా తగ్గిపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం పదేపదే వచ్చే ప్రకటనల కారణంగా 70% మంది భారతీయ వినియోగదారులు విసిగిపోతున్నారట. ఇలా యాడ్స్తో విసుగుచెందుతున్న వారి సంఖ్య శాతం పరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది.చూస్తున్న ఛానల్లో పదేపదే ఒకే యాడ్ వస్తే సహజంగానే ఎవరికైనా విసుగొస్తుంది. ఇలా విసుగుచెందుతున్న వారి అంతర్జాతీయ సగటు 68 శాతం ఉందని యాడ్స్ టెక్నాలజీ కంపెనీ ‘ది ట్రేడ్ డెస్క్’ ఇటీవల నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఇలా అత్యధికంగా విసుగు చెందినవారితో ప్రపంచంలో యూఎస్, ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉన్నాయి. ప్రకటనలపట్ల నిరాసక్తత పెరుగుతున్న నేపథ్యంలో బ్రాండ్స్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు అమలు చేయాల్సిన ఆవశ్యకతను నివేదిక వివరించింది. ఐదుకుపైగా ఛానళ్ల వీక్షణంకేబుల్ టీవీ, ఓటీటీ.. వేదిక ఏదైనా సినిమాలు, వెబ్ సిరీస్, సంగీతం, వార్తలు, గేమింగ్.. ఇలా విభిన్న మాధ్యమాల కోసం సగటున ఒక్కో వ్యక్తి రోజుకు 5.4 మీడియా ఛానళ్లను వీక్షిస్తున్నారట. ఇందుకు 9 గంటలు సమయం వెచ్చిస్తున్నారు. ఆడియోతో స్వల్వ, దీర్ఘకాలంలో ప్రకటనలు గుర్తుండిపోతున్నాయి. వినియోగదారులకు మరింత ప్రభావశీలమైన అనుభవాన్ని అందించగలిగితే.. ప్రకటన పట్ల ఉన్న విసుగును 2.2 రెట్లు తగ్గించడంతోపాటు ఉత్పాదన కొనుగోలు చేసేలా ఒప్పించే ప్రభావం 1.5 రెట్లు పెరుగుతుందని నివేదిక తెలిపింది.కేబుల్ టీవీ, ఓటీటీలతో..» బ్రాండ్స్ గురించి తెలుసుకోవడానికి కేబుల్ టీవీ, ఓటీటీలు ప్రధాన మాధ్యమాలుగా నిలిచాయి. వీటిద్వారా బ్రాండ్స్ను తెలుసుకున్నామని 73 శాతం భారతీయులు చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 51 శాతం మాత్రమే.» ప్రకటనలతో కూడిన స్ట్రీమింగ్ సేవలను మనదేశంలో 72% మంది సబ్స్క్రైబ్ చేశారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 42%.» భారత్లో 18–34 ఏళ్ల వయసువారిలో 55% మంది ఒకే ప్లాట్ఫామ్పై కాకుండా ప్రీమియంగా భావించి కేబుల్ టీవీ, ఓటీటీల్లో ప్రకటనలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.ప్రకటనలు గుర్తుపెట్టుకుంటున్నారు» వీక్షిస్తున్నప్పుడు కొత్త బ్రాండ్స్, సేవలు, ఉత్పత్తులను 73% మంది గుర్తించారు.» ఇతర మాధ్యమాలతో పోలిస్తే 66% మంది కేబుల్ టీవీ, ఓటీటీ ప్రకటనలను విశ్వసిస్తున్నారు.» కేబుల్ టీవీ, ఓటీటీల్లో ప్రకటనల్లో కనపడిన ఉత్పత్తులను 69% మంది గుర్తు చేసుకుంటున్నారు.» 47% మంది.. పోస్టర్లు, బిల్బోర్డులు లాంటి డిజిటల్ అవుట్ ఆఫ్ హోమ్ (డీఓఓహెచ్) మీడియాను గుర్తిస్తున్నట్టు, అవి తమకు గుర్తుంటున్నాయని చెప్పారు.» ప్రకటనలు వింటున్న 86% సందర్భాలలో కస్టమర్లు మమేకం అవుతున్నారు. » జెన్ జీ (1997–2012 మధ్య పుట్టినవారు)లో 75% మ్యూజిక్ స్ట్రీమింగ్ ఇష్టపడుతున్నారు.

మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ కాదు.. మూడో స్థానానికి ఎదుగుతున్నాం
సాక్షి, బెంగళూరు: భారతదేశ ఆర్థిక వ్యవస్థ మృతప్రాయంగా మారిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా తిప్పికొట్టారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారత్ పరుగులు తీస్తోందని తేలి్చచెప్పారు. స్పష్టమైన ఉద్దేశాలు, నిజాయితీగల ప్రయత్నాలతో ముందుకెళ్తున్నామని వివరించారు. మన ఆర్థిక వ్యవస్థలో వేగానికి ‘సంస్కరణ, పనితీరు, మార్పు’ చోదక శక్తిగా పని చేస్తున్నాయని వెల్లడించారు. 11 ఏళ్ల క్రితం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ పదో స్థానంలో ఉండేదని, ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుందని గుర్తుచేశారు. మూడో స్థానానికి ఎగబాకడం ఇక ఎంతో దూరంలో లేదన్నారు. ప్రధాని మోదీ ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించారు. బెంగళూరు మెట్రోరైలు నెట్వర్క్కు సంబంధించిన ‘ఎల్లో లైన్’ను ప్రారంభించారు. ఆర్.వి.రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సంభాíÙంచారు. బెంగళూరు మెట్రోరైల్ ప్రాజెక్టు మూడో దశకు(ఆరెంజ్ లైన్) మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే మూడు వందేభారత్ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. 2014లో ఇండియాలో మెట్రో రైలు వ్యవస్థ కేవలం ఐదు నగరాల్లోనే ఉండేదని, ప్రస్తుతం 24 నగరాల్లో అందుబాటులోకి వచి్చందని చెప్పారు. ఈ వ్యవస్థ వెయ్యి కిలోమీటర్లకు విస్తరించిందని తెలియజేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్ మన దేశంలోనే ఉందన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... పట్టణ ప్రణాళిక అత్యంత కీలకం ‘‘దేశంలో 2014 కంటే ముందు కేవలం 20 వేల కిలోమీటర్ల రైలు మార్గం విద్యుదీకరణ జరిగింది. గత 11 ఏళ్లలో 40 వేల కిలోమీటర్లకు పైగా విద్యుదీకరణ పూర్తిచేశాం. 2014లో దేశంలో కేవలం 74 ఎయిర్పోర్టులు ఉండేవి, ఇప్పుడు వాటి సంఖ్య 160కి చేరింది. 2014లో జాతీయ జలరహదారులు కేవలం మూడు ఉండగా, ప్రస్తుతం అవి 30కి చేరుకున్నాయి. మన నగరాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది, ప్రభావంతంగా మారితేనే మన దేశం ప్రగతి పథంలో సాగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకే నగరాల్లో అధునిక మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. 21వ శతాబ్దంలో పట్టణ ప్రణాళిక, పట్టణ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దుకోవాలి. నవ భారత్ ఎదుగుదలకు బెంగళూరు ఒక ప్రతీక. ఆధ్యాతి్మక జ్ఞానం, సాంకేతిక విజ్ఞానం బెంగళూరు ఆత్మలో మిళితమయ్యాయి. ‘సిందూర్’ విజయం వెనుక సాంకేతికత‘మేక్ ఇన్ ఇండియా’ ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక భారతీయ సాంకేతికత, ‘మేక్ ఇన్ ఇండియా’ ఉన్నాయి. మన దేశంపైకి ఉగ్రవాదులను ఏగదోసిన పాకిస్తాన్ను కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మోకాళ్లపై నిల్చోబెట్టాం. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంలో కొత్త ముఖాన్ని ప్రపంచం తొలిసారిగా దర్శించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం, మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాం. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ‘మేక్ ఇన్ ఇండియా’ బలం మనకు విజయం చేకూర్చిపెట్టాయి. ఆపరేషన్ సిందూర్లో బెంగళూరుతోపాటు ఇక్కడి యువత కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా బెంగళూరు గుర్తింపు పొందడం సంతోషంగా ఉంది. మనదేశం ప్రపంచంతో పోటీ పడడమే కాకుండా, ప్రపంచాన్ని స్వయంగా ముందుకు నడిపిస్తోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

నష్టాల్లో 81 విమానాశ్రయాలు!
భారతీయ విమానాశ్రయాల నుంచి ఏటా కోట్ల మంది దేశ, విదేశాలకు విమానయానం చేస్తున్నారు. ఎయిర్పోర్టులూ పెరిగాయి. ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. విమానాశ్రయాల్లో రెస్టారెంట్లు, షాపింగ్ కేంద్రాలు విస్తరించాయి. వీటి వ్యాపారం, ప్రయాణికుల రాకపోకలు, వాహనాల పార్కింగ్ ఫీజు, ఇతర ఆదాయాలతో విమానాశ్రయాలు లాభాల జడివానలో తడిసిపోతున్నాయి అనుకుంటే పొరపాటే. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా–ఏఏఐ) నిర్వహణలో ఉన్న 81 విమానాశ్రయాలు నష్టాల్లో ఉన్నాయి.దశాబ్ద కాలంలో ఇవి రూ.10 వేల కోట్లకుపైగా నష్టాన్ని మూటగట్టుకోవడం గమనార్హం. వీటిలో 22 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. నష్టాల జాబితాలో ఉన్న ఏఏఐ ఎయిర్పోర్టుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు ఉన్నాయి.ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2015–2016 నుంచి 2024–2025 మధ్య దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో ఉన్న 81 విమానాశ్రయాలు మొత్తం రూ.10,852.9 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం అత్యధికంగా రూ.673.91 కోట్లు నష్టపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో అగర్తల, బేగంపేట (హైదరాబాద్), డెహ్రాడూన్, విజయవాడ విమానాశ్రయాలు ఉన్నాయి.రూ.363 కోట్ల నష్టంతో తిరుపతి 8వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి రూ.339.16 కోట్లు, కడప రూ.103.39 కోట్లు, ప్రకాశం జిల్లాలోని దొనకొండ రూ.1.84 కోట్లు, తెలంగాణలోని వరంగల్ రూ.5.76 కోట్ల నష్టాన్ని నమోదుచేశాయి. సఫ్దర్జంగ్ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం వాణిజ్య విమానాలు కార్యకలాపాలు సాగించడం లేదు. ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వీవీఐపీలను తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు.13 కోట్లకు పైచిలుకు..ఏఏఐ ఖాతాలో దేశవ్యాప్తంగా మొత్తం 133 ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఇందులో 35 విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. రెండు జాయింట్ వెంచర్, ఆరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విమానాశ్రయాలు మినహా.. మిగిలిన ఎయిర్పోర్టుల నుంచి 2023–24లో 13 కోట్లకుపైచిలుకు ప్రయా ణికులు దేశ, విదేశాలకు రాకపోకలు సాగించారు. 6.88 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా అయింది.బేగంపేటలో ఇలా..ఇక బేగంపేట విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాలు నడపడం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గానూ ఈ ఎయిర్పోర్ట్ సేవలు అందిస్తోంది. అలాగే ప్రైవేట్ విమాన సర్వీసులు ఇక్కడి నుంచి విరివిగా నడుస్తున్నాయి. 2008 మార్చి 23న శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత బేగంపేట ఎయిర్పోర్టు అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది. అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శనకు రెండేళ్లకోసారి బేగంపేట విమానాశ్రయం వేదిక అవుతోంది.రూ.96 వేల కోట్ల వ్యయంప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఎయిర్పోర్టులు, ఉన్న వాటి విస్తరణ, కొత్త టెర్మినళ్లు, ఇతర సౌకర్యాల కల్పన వంటి వాటికోసం 2019–20 నుంచి 2024–25 మధ్య ఏఏఐ, పీపీపీ భాగస్వాములు కలిపి రూ.96,000 కోట్ల మూలధన వ్యయం చేశాయి. ఇందులో ఏఏఐ వాటా రూ.25,000 కోట్లు.తెలుగు రాష్ట్రాల్లో మూడు..మూతపడ్డ విమానాశ్రయాల్లో తెలంగాణ నుంచి నాదర్గుల్, వరంగల్; ఏపీ నుంచి దొనకొండ ఉన్నాయి.ఉడాన్ పథకంతో..దేశంలోని సేవలు లేని, తక్కువ సేవలు అందిస్తున్న విమానాశ్రయాల నుంచి ప్రాంతీయ విమాన కనెక్టివిటీని పెంచడానికి 2016 అక్టోబర్ 21న ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఆర్సీఎస్–ఉడాన్ ) పథకం ప్రారంభమైంది. నిర్వహణ ఖర్చులు, అంచనా ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి విమానయాన సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ను ఈ పథకం కింద ప్రభుత్వం అందిస్తోంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విమానాశ్రయ నిర్వాహకుల నుంచి విమానయాన సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయి. తద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించి వారి కార్యకలాపాలను ప్రోత్సహించవచ్చన్నది ప్రభుత్వ భావన. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి ఆర్సీఎస్–ఉడాన్ కోసం కేంద్రం రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 15 హెలిపోర్ట్లు, రెండు వాటర్ ఏరోడ్రోమ్స్ సహా మొత్తం 92 సేవలు లేని, తక్కువ సేవలు అందించే విమానాశ్రయాలను ఉడాన్ కింద పూర్తి స్థాయి వినియోగంలోకి తీసుకొచ్చారు.
ఎన్ఆర్ఐ

ఘనంగా ముగిసిన కార్గిల్ విజయ్ దివస్-సురభి ఏక ఎహసాన్
తన చిన్ననాటి కల 'దేశం కోసం ఏమైనా చెయ్యాలి' అనే తపన పూర్తీ కాలేదు ఎందుకంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ లో సీటు దక్కలేదు. ఒక రేడియో వ్యాఖ్యాతగా, ఆ కాలనీ సాకారం చేసే అవకాశం లభిస్తుందని ఊహించలేదు టోరీ రేడియో వ్యాఖ్యాత జయ. తన రేడియో షో పేరు జై హింద్, ఈ పేరు ఎంచుకున్నందుకు రెండు కారణాలు - ఒకటి భారత్ దేశం కోసం కాబట్టి, రెండవ ది హిందీ వివిధభారతి లో 'జయ్ మాల' అని సైనికుల కార్యక్రమం తనకు అత్యంత ప్రియమైన ప్రోగ్రాం కాబట్టి దానికి తగినట్టుగా ఉండాలనే యత్నంలో 'జై హింద్' నిలిచిపోయింది.అయితే షో పేరుకి కార్గిల్ విజయ్ దివస్ కి ఏమిటి సంబంధం? జై హింద్ లో అనేక హోదాల్లో వున్న విశ్రాంత సైనికులు, వారిలో ఎక్కువగా 'గాలంటరీ అవార్డ్స్ 'అందుకున్న వారు, వీర నారీలతో పరిచయాలు మరియు త్రిదళాల కుటుంబాలకు సేవలు అందచేసే స్వచ్చంద సంస్థలతో పరిచయాలు చెయ్యడం జరిగింది. వీరిలో కొందరు కార్గిల్ యుద్ధం లో సేవలు అందించిన వారున్నారు కనుక కార్గిల్ విజయ్ దివస్ వెనుక వున్న త్యాగం, భావోద్వేగాలు మరియు ఆనందాల విలువలు నెమ్మదిగా అర్ధం చేసుకొన్న జయ, కార్గిల్ విజయ దివస్ ని తన కర్మ భూమి హాంగ్ కాంగ్ లో చేయడం ప్రారంభించి 'సురభి ఏక ఎహసాన్ ' గా తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొంది.జయ మాట్లాడుతూ తన రేడియో షో ముఖ్య ఉద్దేశాన్ని పునరుద్ధరిస్తూ సైనికుల జీవితాలను వారి కుటుంబ త్యాగాలను సామాన్య పౌరులకు తెలియజేసే ప్రయత్నమని అందుకు టోరీ రేడియో యాజమాన్యం మరియు శ్రోతలు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని, ఆ స్ఫూర్తి తో ఒక పుష్కర కాలంగా 'జై హింద్' షో చేస్తున్నాని తెలిపారు. హాంగ్ కాంగ్ ప్రవాస భారతీయులందరు , ప్రతి సంవత్సరం "సురభి ఏ ఎహసాన్ " కార్యక్రమాన్నికి ఎంతో ఆదరణ అభిమానంతో వారందరూ దీనిని వారి వార్షిక క్యాలెండర్ ఈవెంట్లలో ఒకటిగా ఎదురు చూస్తారు. వారి హృదయాలలో ఈ స్థానం సంపాయించగలిగాను అంటే వారు మన రక్షణ దళాల గురించి ముఖ్యం గా మన సానికుల గురించి ఆలోచిస్త్రున్నారు అన్న తృప్తి నాకు ఒక వరం గా భావిస్తాను అంటారు టోరీ వ్యాఖ్యాత జయ పీసపాటి.ఈ సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్' కార్యక్రమం లో భాగంగా పిల్లలకు చిత్రలేఖనం పోటీలు మరియు మన జాతీయ భాష హిందీ లో కవితలు / గీత రచనల పోటీలు కూడా నిర్వహించడం ఒక విశేషం. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత తాత్కాలిక కాన్సుల్ జనరల్ మిస్ సురభి గోయల్ గారు మరియు భారతీయ గోర్ఖా రెజిమెంట్ విశ్రాంత జవాన్లు విచ్చేసారు. స్థానిక ప్రముఖులు, తమ అనేక కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించే స్వచ్చంద సంస్థ - టచ్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ మిస్ కోనీ వాంగ్ కూడ కార్యక్రమానికి సంతోషంగా హాజరయ్యారు.గౌరవ సత్కారాలనంతరం గౌరవనీయ మిస్ సురభి గోయల్ గారు తమ సందేశంలో, ఇటువంటి కార్యక్రమం ద్వారా భారతీయ పౌరులని ఒక తాటి పై తేవడం మరియు దేశ రక్షకుల గురించి అవగాహన కల్పించడాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఈ తరం వారికి చక్కటి సందేశాన్ని అందించే కార్యక్రమ స్ఫూర్తిని అభినందించారు. ప్రతి యేటా తన టాక్ షో అతిదులైన సైనికుల సందేశాన్ని హాంగ్ కాంగ్ ప్రేక్షకులకి చూపిస్తారు, అలా ఈ సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్ లో కార్గిల్ వెటరన్ కెప్టెన్ అఖిలేష్ సక్సేనా గారి కార్గిల్ యుద్ధంలో వారి స్వీయ అనుభవాలని తెలియజేస్తూ సందేశాన్ని అందించారు .అనంతరం పిల్లలు,పెద్దలు మరియు విశేషంగా జాలీ గుడ్ మైత్రివన్ క్లబ్ యొక్క సీనియర్ సిటిజన్లు దేశభక్తి గీతాలు మరియు నృత్యాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చిత్రలేఖనం పోటీలో పాల్గొన్నవారందరికీ కషునుట్జ్ ఆర్ట్ స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ మిస్ కశ్మీరా మెహతా దోషి బహుమతులు అందజేశారు. హిందీ కవిత / గీత రచన పోటీ విజేతలకు మరియు జడ్జెస్ కి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి, పోటీల విజేతలకు సర్టిఫికెట్లు మరియు బహుమతులను గౌరవనీయ మిస్ సురభి గారు అందజేశారు.వందన సమర్పణలో రేడియో వ్యాఖ్యాత జయ గౌరవప్రదమైన హాజరుతో మరియు వారి వివేకవంతమైన మాటలతో అందరికి స్ఫూర్తినిచ్చినందుకు యాక్టింగ్ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీమతి సుర్భి గోయల్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గూర్ఖా రెజిమెంట్ నుండి వచ్చిన ధైర్యవంతులైన విశ్రాంత సైనిక అనుభవజ్ఞులకు ప్రత్యేక వందనాలందించారు. లీజుర్ అండ్ కల్చరల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ట, టచ్ సెంటర్ కి , జడ్జెస్ కి, కార్యక్రమ స్వచ్చంద సేవకులకు, నిర్వాహకులు శ్రీ పరేష్ న్యాతికి, పాల్గొన్న వారికి మరియు విచ్చేసిన వారికి కృతజ్ఞత వ్యక్తం చేశారు. అనంతరం అందరు జాతీయ గీతాన్ని ఆలపించి మళ్ళి వచ్చే సంవత్సరం 'సురభి ఏక ఎహసాన్' పదవ వార్షికోత్సవం ఇంతకన్నా ఘనంగా చేద్దామంటూ వీడ్కోలు చెప్పారు. టోరీ 'జై హింద్' కార్యక్రమ వివరాలకు ఈ లింక్ ను అనుసరించగలరు : https://whatsapp.com/channel/0029VaBqh4rCxoAmoITb0w0V

నిమిష ప్రియ మరణశిక్ష రద్దు కాలేదు: కేంద్రం
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్లో మరణశిక్ష రద్దు అయ్యిందన్న కథనాలను కేంద్ర విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆమె మరణశిక్ష రద్దు వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. తన సహచర భాగస్వామిని హత్య చేసిన అభియోగాల మీద ఆమెకు ఈ శిక్ష పడిన సంగతి తెలిసిందే.కేరళకు చెందిన ప్రముఖ మత గురువు, సున్నీ నేత కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ కార్యాయలం నుంచి ఆమెకు మరణశిక్ష తప్పిందనే ప్రకటన వెలువడింది. యెమెన్ రాజధాని సనాలోని ఓ జైలులో ఖైదీకి ఉన్న నిమిషకు.. హౌతీ మిలిటరీ ప్రభుత్వం నుంచి ఊరట లభించిందని తెలిపింది. అయితే ఆ ప్రకటనపై ఎలాంటి అధికారిక సమాచారం లేదంటూ కేంద్రం కాసేపటి కిందట స్పష్టత ఇచ్చింది. నిమిష ప్రియ కేసులో వ్యక్తిగతంగా చేసే ప్రకటనలతో సంబంధం లేదని.. అక్కడి అధికారులు ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలతో ప్రముఖ వెబ్సైట్ హిందూ ఓ కథనం ఇచ్చింది.#Government denies claim of #NimishaPriya's #deathpenalty being revoked: Sources https://t.co/sNMZ3AhC9S #WeRIndia pic.twitter.com/PszX95Kbz1— Werindia (@werindia) July 29, 2025సనాలో అత్యున్నత సమావేశం తర్వాత.. సోమవారం అర్ధరాత్రి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం మరణశిక్ష రద్దు అంటూ ప్రకటన చేసింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు.అబుబాకర్ ప్రకటనను యెమెన్లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ధ్రువీకరించారు. మత పండితుల బలమైన చొరవతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు ట్విస్ట్ ఇస్తూ కేంద్రం ఇప్పుడు ఆ ప్రకటనను తోసిపుచ్చడం గమనార్హం. మరణించిన యెమెన్ పౌరుడు తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరమే స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారత్ పలుమార్లు కోరడంతో జులై 16న అమలు కావాల్సిన మరణశిక్షను వాయిదా పడింది. అప్పటి నుంచి యెమెన్ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను ఫలించి.. మరణశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది.

అమెరికాలో శానోజె నగరంలో అద్భుత శివపదం కార్యక్రమం
అమెరికాలో శానోజె నగరంలో అద్భుత శివపదం కార్యక్రమం జూలై 26న ఘనంగా జరిగింది. శివపదం రచయితసామవేదం షణ్ముఖ శర్మ సమక్షంలో వాణి గుండ్లాపల్లి నిర్వహణలో జరిగిన ఈకార్యక్రమానికి 900 మంది హాజరయ్యారు. ఈ శక్తి ఆ గీతాల్లో ఉందా, భారతీయ నృత్య రీతుల్లో భక్తి తత్త్వం ఉప్పొంగేలా అభినయించిన ఆ కళాకారుల్లో ఉందా అన్నంత సంశయాత్మక సమ్మోహనాన్ని కలిగించాయి దాదాపు 40 మంది కళాకారులు పాల్గొన్నారు.సామవేదం షణ్ముఖ శర్మ కాలిఫోర్నియాలోని బే ఏరియాలో అయిదురోజులపాటు (జూలై 22-26) జ్ఞానయజ్ఞంగా నిర్వహించిన 'శివ మహిమామృతం 'ప్రవచనోత్సవాలకు పూర్ణాహుతి ఇదే అన్నంత నేత్రపర్వంగా ఆయన రచించిన శివపదాలను వివిధ భారతీయ నృత్య రీతుల్లో అమెరికాలోని కళాకారులు శివ విష్ణు దేవాలయ ప్రాంగణంలోని లకిరెడ్డి ఆడిటోరియంలో ప్రదర్శించారు. మోహినీయాట్టంలో బాలా త్రిపుర సుందరి శక్తివర్ణన, కూచిపూడిలో నదీ రూపంతో - పరబ్రహ్మ స్వరూపమైన సాగరంలోకి - ఒంపుసొంపులతో సరస్వతి ప్రయాణం, మైసూర్ భరతనాట్యంలో శివకామ సుందరిగా అమ్మవారి మూర్తి-శక్తి వర్ణన, ఒడిస్సీలో 'వారాహీ రక్షతు మాం ' అంటూ వారాహి రూపంలో అమ్మవారి ఆరాధన, కథక్ లో కాళీమాత శక్తి స్వరూప పరమార్థం, మోహినీయాట్టం + భరతనాట్యంలో 'శ్రీగజలక్ష్మి చింతయామ్యహం ', భరతనాట్యంలో 'నీ కాలిగోటి రాకా సుధాంశువులు ' అంటూ అమ్మవారి శక్తివర్ణన, భరతనాట్యంలో 'అగజాధరమున నగవులవే, సిగపై వెన్నెల చిన్నబోయెరా..' అంటూ అమ్మవారి చిరునవ్వుల కాంతి వర్ణన .., ఇంకా శివ శివాని ఛిద్రస రూపా, పాయసాన్న ప్రదాత కాశీ అన్నపూర్ణ, ఆది పరాశక్తి తత్త్వం తదితర నృత్య రూపాల్లో ప్రతి ఒక్కటీ - నేపథ్యంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, మల్లాది సూరిబాబు వంటి గాయకుల గాత్రంతో - ప్రేక్షకుల్ని భక్తి తన్మయుల్ని చేశాయి. ముఖ్యంగా 'అమ్మా వాణి అక్షర వాణి...' అంటూ మనస్విని (రెండు రోజుల వ్యవధిలో సాధన చేసిన) అణువణువునా భక్తి భావన పలికించే అభినయంతో, ముద్రలతో, మెరుపు వేగంతో చేసిన నృత్యం ప్రేక్షకుల్ని ఎంత మంత్రముగ్ధుల్ని చేసిందంటే, ఒక్కసారిగా అందరూ లేచి నిలబడి కరతాళధ్వనులతో (Standingg Ovation) హర్షం వ్యక్తం చేశారు. "సరస్వతి దేవిని ఇక్కడ మనస్విని సాక్షాత్కరింపజేసింది " అని షణ్ముఖ శర్మ ప్రశంసించారు.ఒడిస్సి + భరతనాట్యంలో కళాకారుల బృందం 'శివుడు ధరించిన మాతృరూపమిది..' అంటూ నయనాందకరంగా ప్రదర్శించిన శివ-శక్తి రూపాల వర్ణన కూడా ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేసింది. మిల్పిటాస్ నగర మేయర్ కార్మెన్ మొంటానో భారతీయ నృత్య రీతులను ప్రశంసించారు. షణ్ముఖ శర్మ నిర్వాహకులకు మల్లాది రఘు బృందాన్ని, శివవిష్ణు ఆలయ కమిటీని అభినందించారు. ముఖ్యంగా వేయికి పైగా శివపదాల్లోంచి ఎంపిక చేసిన వాటికి వాణి గుండ్లాపల్లి 12 దేశాల్లో ఇలా భారతీయ నృత్య రీతుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తూండాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడు పారిస్ నగరంలోకూడా వాణి ప్రదర్శన ఇవ్వబోతున్నారని ప్రకటించారు.

మరో భారత సంతతి వ్యక్తిపై అమానుషం : చేయి తెగి వేలాడింది, కానీ
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని భారతసంతతికి చెందిన వ్యక్తిపై దుండగులు దాడి చేశాడు. సౌరభ్ ఆనంద్ (33) మందులు కొనుగోలు చేసి ఫార్మసీ నుండి ఇంటికి వెళుతుండగా, ఐదుగురు యువకులు కత్తితో దారుణంగా దాడి చేశారు. దీంతో అతనుతీవ్రంగా గాయపడ్డాడు.మెల్బోర్న్లో ఈ నెల(జూలై) 19న ఘటన చోటు చేసుకుంది. దీంతో భారతీయులపై వరుస జాత్యహంకార దాడులపై ఆందోళన వ్యక్తమవుతోంది.జూలై 19న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆల్టోనా మెడోస్లోని సెంట్రల్ స్క్వేర్ షాపింగ్ సెంటర్లోని మందుల దుకాణంలో సౌరభ్ మందులు తీసుకున్నాడు. తన స్నేహితుడితో కాల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఐదుగురు యువకులు అతన్ని చుట్టుముట్టి, చితకబాదారు. మరొకరు అతని తలపై నేలపై పడే వరకు కొట్టారు. మూడవ యువకుడు ఒక కత్తితో గొంతుకు పట్టుకుని దాడిచేయబోతే వెంటనే తన చేతిని రక్షణ కోసం పైకి లేపాడు. దీంతో అతని ఎడమ చేయి దాదాపు వేరుపడి పోయింది. ఒక చిన్న నూలుపోగు లాంటి నరం సాయంతా వేలాడుతూ ఉండింది. అతని భుజంపై, వీపుపై కూడా పొడిచారు. దీంతో వెన్నెముక విరిగింది ఇతర ఎముకలు కూడా విరిగిపోయాయి. తనను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, కత్తి నా మణికట్టుపై వేటు పడింది. రెండో కత్తిపోటు మరో చేతితి గుండా పోయింది. మూడవ దాడి ఎముక గుండా పోయిందనీ, నొప్పి మాత్రమే గుర్తుంది, నా చేయి దాదాపు వేరుపడిన స్థితిలో ఉంది అంటూ బాధితుడు ఆస్ట్రేలియన్ మీడియాతో తెలిపాడు. చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదనతీవ్రగాయాలతో రక్తపు మడుగులతో పడి వున్న సౌరభ్ షాపింగ్ సెంటర్ బయటకొచ్చి సహాయాన్ని అర్థించాడు. దీంతో అతడిని సమీపంలోని రాయల్ మెల్బోర్న్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మొదట అతని చేతిని తీసివేయాల్సి వస్తుందని భావించారు. కానీ అదృష్టవశాత్తూ చేతిని తిరిగి అటాచ్ చేయగలిగారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఐదుగురు యువకులలో నలుగురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. కాగా గత వారం ఆస్ట్రేలియాలో ఇలాంటి సంఘటనే జరిగింది. కారు పార్కింగ్ వివాదంలో గుర్తు తెలియని వ్యక్తులు చరణ్ప్రీత్ సింగ్ అనే భారతీయుడిపై దారుణంగా దాడి చేసి, జాతిపరంగా దుర్భాషలాడిన సంగతి తెలిసిందే.
క్రైమ్

కన్నతల్లిని కత్తితో నరికి హత్యాయత్నం
కొయ్యలగూడెం: కన్నతల్లిపై కొడుకు నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని అశోక్నగర్ ప్రాంతంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొయ్యలగూడెంలో జక్కు లక్ష్మీనరసమ్మ (50) రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ నివసిస్తోంది. ఆమె భర్త గతంలోనే మృతి చెందాడు. వీరికి కొడుకు, కూతురు ఉండగా, కుమార్తెకు వివాహమైంది. కుమారుడు శివాజీ (32)కి వివాహం కాగా, అతను భార్య, ఇద్దరు పిల్లలతో దేవరపల్లి మండలం బుచ్చియ్యపాలెంలో తాపీమే్రస్తిగా పనిచేస్తూ నివసిస్తున్నాడు. లక్ష్మీ నరసమ్మ తన సొంత ఇంటిలోనే నివాసముంటోంది. ఇటీవల ఆస్తి విషయంలో తల్లితో శివాజీ తరచూ కొయ్యలగూడెం వచ్చి ఘర్షణ పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. తల్లి అంగీకరించకపోవడంతో గతంలోనూ రెండుసార్లు ఆమెపై దాడికి యత్నించాడు. ఆదివారం వారి ఇంటికి సమీపంలో తల్లిని కుమారుడు అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి పరారయ్యాడు. లక్ష్మీనరసమ్మకు ఈ దాడిలో తలపై నాలుగు, మెడపై నాలుగు, శరీరంపై మరో రెండు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108 కోసం పలుమార్లు ప్రయత్నించినా స్పందన కనిపించలేదు. దీంతో సురక్ష ఆస్పత్రి అంబులెన్సులో లక్ష్మీనరసమ్మను కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. ఆమె పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువకుల నిరసన అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆస్పత్రికి తరలించేందుకు అందుబాటులో ఉండాల్సిన 108 అంబులెన్సు నిరుపయోగంగా పడి ఉండటంపై యువకులు కొయ్యలగూడెంలో నిరసన తెలిపారు. లక్ష్మీ నరసమ్మపై హత్యాయత్నం జరిగిన తరువాత స్థానికులు 108కి ఫోన్ చేసినా కనీస స్పందన రాలేదు. దీంతో స్థానిక యువకులు ఆగ్రహానికి గురై నిరుపయోగంగా ఉన్న 108 అంబులెన్సు వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈక్వెడార్ నైట్ క్లబ్లో కాల్పులు..8 మంది మృతి
శాంటా లుకా: దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్లోని ఓ నైట్ క్లబ్లో ఆదివారం చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీరప్రాంత గుయాస్ ప్రావిన్స్లోని శాంటా లుకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా 20–40 ఏళ్ల వారేనని పోలీసులు తెలిపారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఒకటిగా దీనికి పేరుంది. రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన సాయుధులైన దుండగులు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు వెల్లడించారు. కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి
నెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇంటర్ విద్యార్థిని ఆదివారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఆమె హాస్టల్ బాత్రూమ్లో ఉరేసుకున్నట్లు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన పి.తిరుమలయ్య, వేదవతి దంపతులకుమార్తె హేమశ్రీ (16) నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తనను మరో సెక్షన్కు మార్చాలని ఆమె యాజమాన్యాన్ని కొంతకాలంగా అడుగుతోంది. హేమశ్రీ చెప్పటంతో ఆమె తల్లిదండ్రులు కూడా సెక్షన్ మార్చాలని కళాశాల సిబ్బందిని కోరారు. శనివారం రాత్రి కూడా హేమశ్రీ తన తల్లిదండ్రులకు ఫోన్చేసి సెక్షన్ మార్పించాలని కోరింది. ఆదివారం ఉదయం కూడా ఆమె తల్లిదండ్రులకు వీడియోకాల్ చేసి మాట్లాడింది. వారు తాము నెల్లూరు వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడతామని చెప్పారు. తరువాత కొంతసేపటికి హేమశ్రీ అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్చామని, పరిస్థితి విషమంగా ఉందని హాస్టల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్చేసి చెప్పారు. వారు వచ్చేసరికే ఆమె మరణించింది. ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే హేమశ్రీ మృతిచెందిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థిసంఘాల వారు కళాశాల యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్లారు. అప్పటికే కాలేజీలో ఎవరూ లేరు. హాస్టల్ విద్యార్థులను సైతం అక్కడి నుంచి మార్చేశారు. దీంతో కోపోద్రిక్తులైన వారు అక్కడున్న ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేసి కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు కళాశాలకు చేరుకుని పరిశీలించారు. ఘటన జరిగిన ప్రదేశం వేదాయపాళెం పోలీస్స్టేషన్ పరిధిలోది కావడంతో ఆ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఇ¯న్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు కళాశాల వద్దకు చేరుకుని బాధిత తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య హాస్టల్ బాత్రూమ్లను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. అక్కడ ఉరేసుకున్న హేమశ్రీని గమనించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే హాస్టల్ సిబ్బంది, యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, హాస్టల్ను ఖాళీ చేయించడంపై హేమశ్రీ తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. విద్యార్థిసంఘాల వారు కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. హేమశ్రీ మృతిపై నిష్పక్షపాత విచారణ జరపాలని వారు కోరారు.

ఆమెకు 30.. అతనికి 19!
కాటారం: ఆమె వయసు 30.. అతని వయసు 19. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అంగరాజ్పల్లికి చెందిన దుర్గం సరళ(30).. అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల జాడి రాజేశ్ గత జూన్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుతెరువు నిమిత్తం కాటారం మండల కేంద్రానికి వచ్చి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాజేశ్ కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. ఈక్రమంలో రాజేశ్ను కుటుంబ సభ్యులు ఉసిగొల్పడంతో.. సరళను హింసించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తట్టుకోలేక సరళ శనివారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.