Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

No Coercive Action Till AP High Court On YS Jagan Quash Petition1
జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: రెంటపాళ్ల పర్యటన కేసులో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే.. కారులో ఉన్నవాళ్లపై కేసు ఎలా పెడతారు? అంటూ పోలీసులను నిలదీసింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జరిగేదాకా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త మరణించాడు. జగన్‌ కాన్వాయ్‌ వల్లే అతను మరణించాడని కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు.. నిందితుల జాబితాలో ఆయన పేరును కూడా చేర్చారు. అయితే రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని, ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంటూ వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌తో పాటు ఇదే కేసులో వైఎస్సార్‌సీపీ నేతలు వేసిన మరో నాలుగు క్వాష్‌ పిటిషన్లను కలిపి హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్‌ మరింత గడువు కోరగా.. తదుపరి విచారణను మంగళవారానికి(జులై 1వ తేదీకి) వాయిదా వేసింది. అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జగన్‌ క్వాష్‌ పిటిషన్‌లో ఏముందంటే..మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్‌ఎస్‌ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్‌ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 105 (హత్య కిందకు రాని కల్పబుల్‌ హోమిసైడ్‌), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్‌పై విడుదల చేశారు.కాన్వాయ్‌లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. నా పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలి

UK Man Reunites With Birth Family After Four Decades2
పుట్టగానే ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో కట్టి పడేశారు.. 40 ఏళ్ల తర్వాత ఇలా..!

నీకు ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందనేది మనం కాదనలేని సత్యం. బ్రతకాలని రాసిపెట్టి ఉంటే ఎలా పడేసినా, ఎక్కడ పడేసినా బ్రతుకుతాం. కర్మ బాలేకపోతే ఎక్కడికి కదలకుండా ఉన్నా కూడా చావును మాత్రం తప్పించలేం. అందుకే విధి రాతను ఎవరూ తప్పించలేరనేది. అప్పుడే పుట్టిన శిశువును ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో కట్టేసి పడేస్తే ఎవరైనా బ్రతుకుతాడని అనుకుంటారా..? విధి అంటే వింత నాటకం అంటే ఇదేనేమో.. యూకేకు చెందిన ఓ వ్యక్తి.. పుట్టగానే ప్లాస్టిక్‌ బ్యాగ్‌లోకి వెళ్లిపోయాడు. అతని ఇంట్లో ఏ పరిస్థితుల కారణమో కానీ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో కట్టేసి ఓ చోట పడేశారు. ఆ సమయంలో ఆ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఉన్న శిశువును ముగ్గురు టీనేజర్లు బయటకు తీసి జన్మనిచ్చారు. ఆ తర్వాత అతను ఓ కుటుంబానికి దత్తత వెళ్లాడు. ఇప్పుడతను తనకు జన్మనిచ్చిన కుటుంబాన్ని కలిశాడు. అది కూడా 40 ఏళ్ల తర్వాత కావడం విశేషం. యూకేలోని ఓ టెలివిజస్‌ నిర్వహించే ‘లాంగ్‌ లాస్ట్‌ లైఫ్‌’ కార్యక్రమానికి వెళ్లిన జాన్‌ స్కార్‌లెట్‌ ఫిలిప్స్‌కు మళ్లీ పుట్టిన వాళ్లను కలిసే భాగ్యం దక్కింది. ఈ షో ద్వారా తన అన్న అతనే అని తెలుసుకున్న సోదరీ, సోదరీమణులు.. ఫిలిప్స్‌ను కలిశారు. అయితే తల్లి మాత్రం కలిసే పరిస్థితుల్లో లేదు. మానసికంగా, శారీరకంగా ఆమె అనారోగ్యంగా ఉండటంతో కేవలం తన కుమారుడికి ఓ సందేశాన్ని మాత్రమే పంపింది. కన్నవాళ్లను నాలుగు దశాబ్దాల తర్వాత కలిస్తే అదొక అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని భార్యతో ఉంటున్న ఫిలిప్స్‌.. ఇకమై కుటుంబంతో కలిసే ఉంటానని అంటున్నాడు. తన సోదరుడు కోసం ఇప్పటి వరకూ చేయని ప్రయత్నం లేదని, ఇన్నాళ్లకు ఇలా కలిశామని అతని కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

Visakhapatnam Court Shocks Administration: Collector Office Items Seized3
‘కలెక్టర్‌ కారు, ఫర్నీచర్‌ అటాచ్‌ చేయండి’.. విశాఖ కోర్టు సంచలన తీర్పు

సాక్షి,విశాఖ: విశాఖ 7వ అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రభుత్వ న్యాయవాదికి గౌరవ వేతనం చెల్లించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్ కుర్చీ,కారు, ఫర్నిచర్ అటాచ్ చెయ్యండి అంటూ ఆదేశాలు జారీ చేసింది.2015 ఏప్రిల్ నుంచి 2021 వరకు విశాఖ కోర్టులో రవి కుమార్ ప్రభుత్వ ప్లీడర్‌గా పని చేశారు. కానీ అతని వేతనాన్ని కలెక్టర్‌ కార్యాలయంలో విడుదల చేయలేదు. సుమారు రూ. 54 లక్షల రూపాయల వేతన బకాయిలు పెండింగ్‌లో ఉంది. ఇదే విషయంపై రవికుమార్‌ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కలెక్టర్ ఆఫీస్ సామాగ్రిని అటాచ్‌మెంట్‌ చేయాలని అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. వడ్డీతో సహా న్యాయవాది రవికుమార్‌కు బకాయిలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీన రవికుమార్‌కు చెల్లించాల్సిన 72 నెలల వేతన బకాయిలను 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలి కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తి ఆదేశాలతో కోర్టు వారెంట్ తీసుకుని కోర్టు అమీన్ కలెక్టర్ ఆఫీసుకు వచ్చింది. వారెంట్ ఎగ్జిక్యూటివ్ చేయడానికి వచ్చిన సిబ్బందికి కలెక్టరేట్ సిబ్బంది సహకరించలేదు. కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి కోర్టు సిబ్బందిని వెళ్ళిపోవాలని మహారాణిపేట సీఐ భాస్కర్ ఇబ్బంది పెట్టారు.

Japan Lodges Strong Protest After Trump Comments4
ట్రంప్‌.. మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి: జపాన్‌

ఇరాన్‌పై తాము చేసిన దాడులు హిరోషిమా-నాగసాకిలపై చేసిన దాడుల మాదిరిగా ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించడాన్ని జపాన్‌ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలను ట్రంప్‌ వెనక్కి తీసుకోవాలని జపాన్‌ డిమాండ్‌ చేసింది.అదొక దేశాల్ని నాశనం చేసిన విధ్వంసకర ఘటన అని, దాన్ని ఇప్పుడు మళ్లీ ట్రంప్‌ ఎత్తి చూపడం దారుణమని జపాన్‌లోని నాగసాకికి చెందిన నేతలు మండిపడుతున్నారు. ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు.. అణుబాంబులను, అణ్వాయుధ దాడులను సమర్ధించేలా ఉన్నాయని మండిపడ్డారు. నాగసాకిపై జరిగిన అణుబాంబు దాడి ఎప్పటికీ మాసిపోని వ్యథ అని, మరి దాన్ని మళ్లీ ట్రంప్‌ ఎత్తిచూపడం ఏంటని ప్రశ్నించారు.అదే సమయంలో ట్రంప్‌ వ్యాఖ్యలపై హిరోషిమాలో పెద్ద ఎత్తును నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్‌ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. హిరోషిమా శాసనసభ్యులు అణ్వాయుధాల వాడకాన్ని సమర్థించే ఏ ప్రకటననైనా తిరస్కరిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఏ యుద్ధాలనైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఈ మేరకు పిలుపునిచ్చారు,జపాన్ కు చెందిన చారిత్రక పట్టణం హీరోషిమా. ఇది జపాన్ పెద్ద ద్వీపమైన హోంషులో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో 1945, ఆగస్టు 6వ తేదీన అమెరికా అణుబాంబుకు గురైన ఈ నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరంగా నిలిచింది. అమెరికా అణుబాంబు దాడితో వేల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.

IND U19 VS ENG U19 1st Youth ODI: Vaibhav Suryavanshi Smashes 48 Runs In Just 19 Balls5
ఇంగ్లండ్‌ గడ్డపై విధ్వంసం సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

ఐపీఎల్‌ 2025 ద్వారా పరిచయమై (రాజస్తాన్‌ రాయల్స్‌), 14 ఏళ్ల వయసులోనే క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో) బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన వైభవ్‌ సూర్యవంశీ.. తన విధ్వంసాల పరంపరను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్‌ సంచలన ప్రదర్శనల (7 మ్యాచ్‌ల్లో 206.56 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, హాఫ్‌ సెంచరీ సాయంతో 252 పరుగులు) అనంతరం ఎన్‌సీఏలో జరిగిన ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో 90 బంతుల్లోనే 190 పరుగులు చేసిన వైభవ్‌.. ఇవాళ (జూన్‌ 27) ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో మరోసారి చెలరేగిపోయాడు. భారత్‌-ఏ తరఫున 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. VAIBHAV SURYAVANSHI MADNESS..!! 🥶🔥- Smashed 48 runs in just 19 balls.- With 3 fours and 5 sixes. pic.twitter.com/HOKgnYGd4m— Sports Culture (@SportsCulture24) June 27, 2025ఈ మ్యాచ్‌లో మరో ఐపీఎల్‌ చిచ్చరపిడుగు ఆయుశ్‌ మాత్రేతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వైభవ్‌.. ఇంగ్లండ్‌ యువ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వైభవ్‌ ధాటికి భారత్‌ 7 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ హాఫ్‌ సెంచరీకి రెండు పరుగుల దూరంలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. వైభవ్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు నిదానంగా ఆడిన ఆయుశ్‌ మాత్రే.. వైభవ్‌ ఔటయ్యాక వరుసగా రెండు బౌండరీలు బాది ఔటయ్యాడు. మాత్రే 30 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో యంగ్‌ ఇండియా ఇంగ్లండ్‌ నిర్దేశించిన 175 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తుంది. 13 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోర్‌ 104/3గా ఉంది. విహాన్‌ మల్హోత్రా (4), అభిగ్యాన్‌ కుందు (4) క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో వైభవ్‌, మాత్రేతో పాటు మౌల్యరాజ్‌సింగ్‌ చవ్డా (16) కూడా ఔటయ్యాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఫ్రెంచ్‌ 2, రాల్ఫీ అ‍ల్బర్ట్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూల్చారు. కనిష్క్‌ చౌహాన్‌ (10-1-20-3), మొహమ్మద్‌ ఎనాన్‌ (10-1-37-2) తమ స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లండ్‌ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టగా.. పేసర్లు ఆర్‌ఎస్‌ అంబరీష్‌, హెనిన్‌ పటేల్‌ తలో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు.ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో రాకీ ఫ్లింటాఫ్‌ (ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కొడుకు) అర్ద సెంచరీతో (90 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. ఇస్సాక్‌ మొహమ్మద్‌ (28 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. మిగతా బ్యాటర్లలో బెన్‌ డాకిన్స్‌ (18), బెన్‌ మేయర్స్‌ (16), జేమ్స్‌ మింటో (10) రెండంకెల స్కోర్లు చేయగా.. కెప్టెన్‌ థామస్‌ ర్యూ (5), జోసఫ్‌ మూర్స్‌ (9), రాల్ఫీ ఆల్బర్ట్‌ (5), జాక్‌ హోమ్‌ (5), తజీమ్‌ చౌద్రీ అలీ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. కాగా, 5 వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం భారత అండర్‌-19 జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది.

Divorce-Raged Man Sets Fire Inside Moving Train6
నాకు కష్టమొచ్చింది.. ఇక ఈ ట్రైన్‌ ఎందుకు?.. అందులో ఉన్న మీరెందుకు?

మనిషికొక్క తీరు.. మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది కొంతమంది ఆలోచిస్తే, ఆ సమస్యనే తన చుట్టంగా చేసుకుని బాధపడే వాళ్లు మరికొందరు. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలయ్యే వాళ్లు ఇంకొందరు. ఇది చాలా ప్రమాదం. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలవ్వాలని కోరుకుంటారు.కానీ ప్రపంచంలోని సమస్యతో మాత్రం వీరికి అవసరం ఉండదు. ఇలాంటి వాళ్లు చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచిపోతారు. ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే చాలు.. మన చుట్టూ ఉన్న వాళ్లు ఎంత సుఖంగా ఉన్నారో అనే భ్రాంతిలో ఉండి వారికి తీవ్ర నష్టం చేయడానికి యత్నించడంలో ముందుంటారు. ఈ తరహాలోనే తన భార్య తనకు విడాకులు ఇచ్చిందనే కారణంతో మొత్తం ట్రైన్‌నే తగలబెట్టాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన వెంట బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్‌ డబ్బాను ఒక్కసారిగా ట్రైన్‌లో చల్లుకుంటా వచ్చి ఒక్కసారిగా నిప్పంటించాడు. అసలు ఏం జరుగుతుందనే ప్రయాణికులు తేరుకుని పరుగులు తీసే లోపే ఆ ట్రైన్‌ లోపల ఒక్కసారిగా భగ్గుమంది. భార్య విడాకులిచ్చిందనే ఫ్రస్టేషన్‌లో..ఈ ఘటన దక్షిణాకొరియా దేశంలో చోటు చేసుకంది. ఇటీవల సియోల్‌కు చెందిన వాన్‌ అనే వ్యక్తికి భార్యతో విడాకులయ్యాయి. దీన్ని భరించలేకపోయాడు. సుమారు 67 ఏళ్ల వయసులో తనకు విడాకులు మంజూరు కావడాన్ని వాన్‌ తట్టుకోలేకపోయాడు. ఇక తాను ఎందుకు అనుకున్నాడు. అలా అనుకుంటూనే ట్రైన్‌ ఎక్కాడు. అప్పటికే ఓ పెట్రోల్‌ డబ్బా బ్యాగ్‌తో పాటు వెంట తెచ్చుకున్నాడు. అయితే ఆ ట్రైన్‌ కోచ్‌లో జనం కాస్త సంతోషంగా కనిపించారు. తనకు కష్టం వచ్చింది.. వీరి ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి అనుకున్నాడో ఏమో కానీ.. ఒక్కసారిగా పెట్రోల్‌ డబ్బా బయటకు తీశాడు. పెట్రోల్‌ డబ్బా బయటకు తీసిన క్షణంలోనే అనుమానం వచ్చిన ఆ కోచ్‌లోని ప్రయాణికులు పరుగులు తీశారు. పెట్రోల్‌ మొత్తం కోచ్‌ అంతా చల్లడం.. ఆపై నిప్పంటించడం జరిగిపోయాయి. సముద్రగర్భంలోని టన్నెల్‌లో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 22 మంది ఆస్పత్రి పాలు కాగా, మరొక 129 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిందితుడు వాన్‌ కూడా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా 240,000 యూఎస్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.వాన్‌పై హత్యాభియోగాలుఈ దారుణానికి పాల్పడ్డ వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కదులుతున్న ట్రైన్‌లో ఘటన జూన్‌ 9న జరగ్గా, ఇది ఆలస్యంగా వెలుగుచూసింది. వాన్‌పై హత్యాయత్నం అభియోగాలతో పాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వాన్‌.. భార్యతో విడాకులు మంజూరు అయినందుకే ఇలా చేశానని స్పష్టం చేశాడు. ట్రైన్‌లో పెట్రోల్‌ పోసిన ఘటన వీడియో వైరల్‌గా మారింది.서울지하철 5호선 방화범 CCTV사망자 없는게 기적이네요 pic.twitter.com/IQMowGZkWH— 브이몬 (@XXV_mon) June 25, 2025

Kannappa Movie Review And Rating In Telugu7
‘కన్నప్ప’ మూవీ రివ్యూ

టైటిల్‌ : కన్నప్పనటీనటులు: విష్ణు మంచు, మోహన్‌ బాబు, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, ప్రీతి ముకుందన్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీనిర్మాత: మోహన్‌ బాబుకథ:పరుచూరి గోపాల కృష్ణ,ఈశ్వర్ రెడ్డి, జి. నాగేశ్వర రెడ్డితోట ప్రసాద్దర్శకత్వం: ముకేశ్‌ కుమార్‌ సింగ్‌సంగీతం : స్టీఫెన్‌ దేవస్సీసినిమాటోగ్రఫీ: షెల్డన్‌ చౌఎడిటర్‌: ఆంథోనీవిడుదల తేది: జూన్‌ 27, 2025కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కథకుడిగా, నిర్మాతగాను వ్యవహరించాడు. మంచు ఫ్యామిలికి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించాయి. అలాగే ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌ లాంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్‌, ట్రైలర్‌ వచ్చాక ఈ సినిమాపై ఉన్న నెగెటివిటీ తగ్గిపోయింది. ప్రమోషన్స్‌ గట్టిగా చేయడంతో హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్‌ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(Kannappa Movie Review).కథేంటంటే..తిన్నడు(మంచు విష్ణు) పరమ నాస్తికుడు. అతని తండ్రి నాథ నాథుడు(శరత్‌ కుమార్‌) మాటే ఆయనకు వేదం. గూడెం ప్రజలకే ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. పక్క గూడానికి చెందిన యువరాణి నెమలి(ప్రీతీ ముకుందన్‌)తో ప్రేమలో పడతాడు. ఓసారి గూడెంలో ఉన్న వాయు లింగం కోసం వచ్చిన కాల ముఖుడు (అర్పిత్ రాంకా) సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు. ఈ విషయం కాల ముఖుడికి తెలిసి.. గూడెంపై దండయాత్రకు బయలుదేరుతాడు. అదే సమయంలో ఓ కారణంగా తిన్నడు గూడాన్ని వీడాల్సి వస్తుంది. నెమలితో కలిసి అడవికి వెళ్తాడు. శివుడి పరమభక్తురాలైన నెమలి.. దేవుడినే నమ్మని తిన్నడు కలిసి జీవితం ఎలా సాగించాడు? వీరి జీవితంలోకి రుద్ర(ప్రభాస్‌) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయు లింగం కోసం కాల ముఖుడు ఎందుకు వెతుకుతున్నాడు? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడు పరమ భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కన్నప్ప కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పరమ నాస్తికుడైన తిన్నడు పరమ భక్తుడిగా ఎలా మారాడు అనేది 50 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘భక్త కన్నప్ప’ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అదే కథతో ఇప్పుడు మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఓ భక్తి కథకు కావాల్సినంత కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ ను నేటి తరానికి నచ్చేలా ‘కన్నప్ప’ కథను చెప్పాలనుకున్నారు. ఈ విషయంలో మంచు విష్ణుని అభినందించాల్సిందే. అయితే టెక్నికల్‌గా సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. సీజీ వర్క్‌ పేలవంగా ఉంది. వార్‌ సీన్స్‌ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎమోషన్‌ని తెరపై బాగా పండించి ఆ లోపాలను కాస్త కప్పిపుచ్చారు. భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగా హ్యాండిల్‌ చేశాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమా చాలా ఎమోషనల్‌గా సాగుతూ.. శివ భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. శివుడు గొప్పతనాన్ని పాట రూపంలో చెబుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత తిన్నడు ఎందుకు నాస్తికుడిగా మారాల్సి వచ్చిందో అర్థవంతంగా చూపించారు. మంచు విష్ణు ఎంట్రీ కథనం ఆసక్తి పెరుగుతుంది. యువరాణి నెమలితో ప్రేమలో పడడం.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌ని ఆకట్టుకుంటాయి. పాటల పేరుతో భక్తి చిత్రంలోనూ శృంగార రసాన్ని బాగానే పండించారు. కొన్ని చోట్ల ఆ శృంగార రసం మితిమీరిపోయింది కూడా. ఇక మోహన్‌ బాబు ఎంట్రీ, మోహన్‌ లాల్‌ ఎంట్రీ సీన్స్‌ అదిరిపోతాయి. అయితే ఫస్టాఫ్‌లో వచ్చే యుద్ద సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌ పర్లేదులే అన్నట్లుగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం పరుగులు పెడుతుంది. ముఖ్యంగా రుద్రగా ప్రభాస్‌ ఎంట్రి ఇచ్చిన తర్వాత కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ప్రభాస్‌ కనిపించేది 20 నిమిషాలే అయినా.. ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోతారు. క్లైమాక్స్‌లో విష్ణు నటన ఆకట్టుకుంటుంది. శివ భక్తులకు చివరి 40 నిమిషాలు అయితే విపరీతంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. తిన్నడు అలియాస్‌ కన్నప్పగా మంచు విష్ణు బాగా నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో విష్ణు నటన అదిరిపోతుంది. ఆయన కెరీర్‌లో బెస్ట్‌ ఫెర్పార్మెన్స్‌గా కన్నప్ప నిలిచిపోతుంది. గూడెపు యువరాణి, శివుడి పరమ భక్తురాలు నెమలిగా ప్రీతి ముకుందన్‌ మంచి నటనతో ఆకట్టుకుంది. తెరపై కావాల్సినంత అందాలను ప్రదర్శిస్తూనే.. నటన పరంగాను మంచి మార్కులే సంపాదించుకుంది. విష్ణు, ప్రీతీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. ఇక రుద్రగా ప్రభాస్‌ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తెరపై కనిపించేది 20 నిమిషాలే అయినా.. అవే సినిమాకు కీలకంగా మారుతాయి. తిన్నడు, నెమలితో పాటు మహాదేవ శాస్త్రీ పాత్రలకు రుద్రకు మధ్య వచ్చే సీన్స్‌ అదిరిపోతాయి. ఆయన చెప్పే డైలాగ్స్‌ థియేటర్స్‌లో విజిల్స్‌ వేయిస్తాయి. ఇక శివుడికి తనకంటే గొప్ప భక్తుడు లేడని భావించే మహాదేవ శాస్త్రీగా మోహన్‌బాబు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన డైలాగు డెలివరీ ఆ పాత్రకు హుందాతనం తెచ్చింది. మోహన్‌లాల్‌ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శివుడి పాత్రలో అక్షయ్‌ కుమార్‌, పార్వతీదేవి పాత్రలో కాజల్‌ ఒదిగిపోయారు. ఇక తిన్నడు తండ్రిగా శరత్‌కుమార్‌ నటన బాగుంది. కానీ, ఓన్‌ వాయిస్‌తో చెప్పిన డబ్బింగ్‌ బాగోలేదు. చిన్నప్పటి తిన్నడుగా నటించిన అవ్రామ్‌.. నటన పరంగా ఓకే కానీ డబ్బింగ్‌ దారుణంగా ఉంది. తెలుగు పదాలు సరిగా పలకలేకపోయాడు. బ్రహానందం, మధుబాల, శివబాలాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా బాగుంది. స్టీఫెన్‌ దేవస్సీ పాటలు పర్వాలేదు కానీ నేపథ్య సంగీతమే అంతగా బాగోలేదు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలను గుర్తు చేసేలా బీజీఎం ఉంది. షెల్డన్‌ చౌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. న్యూజిలాండ్‌ అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌

Chandrababu Lies Guinness Book Says Sajjala At Anantapur Singanamala8
గిన్నిస్‌ బుక్‌లోని బాబు మోసాలు, దుర్మార్గాలు: సజ్జల

ప్రజలకు ఎన్నికల వేళ హామీలను ఎంత తేలికగా ఇచ్చారో.. వాటిని అంతే తేలికగా ఇప్పుడు చంద్రబాబు కొట్టేస్తున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందని.. అందుకే బాబు మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారాయన. అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్‌ జగన్‌పై సర్కార్‌ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం ఉండదని సజ్జల తేల్చేశారాయన. సాక్షి, అనంతపురం: అబద్దాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించినవారు లేరని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. రీకాలింగ్ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో(Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్‌ సిక్స్‌ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు!. హామీలను తేలికగా ఇచ్చినట్లే.. అంతే తేలికగా కొట్టిపారేస్తుంటారాయన. అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం... జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కించొచ్చు. అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తోంది. కూటమి నేతలు ఇళ్లకు వస్తే నిలదీయడానికి.. చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టం లేదు.. లేకపోతే చంద్రబాబు సర్కార్‌కు పదవీ గండం ఉండేది. .. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎస్వోజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దారుణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది. పేరుకే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. ఆచరణలో అమలు చేయడం లేదు. .. సింగయ్య మృతి కేసులో జగన్‌పై కేసు నమోదు.. దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్‌ను ఎంత అణచి వేయాలని చూస్తే... అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్‌కు మద్దతుగా లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. .. హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి’’ అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఇంకా రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్ట్‌ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రబాబు మోసాలను వివరించారు. ‘‘టీడీపీ కూటమి గెలుపు పై ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల అక్రమాల ద్వారా గెలిచారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. చంద్రబాబు అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరు. నారా లోకేష్ రెడ్ బుక్‌ను ఎడమ కాలితో తన్ని ఎదిరిస్తాం. ప్రజలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు’’:::మాజీ మంత్రి శైలజానాథ్ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?. దళిత, గిరిజన బాలికల పై అఘాయిత్యాలు జరిగితే పవన్‌కు పట్టదా?. :::మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్చంద్రబాబు మోసాలను ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు. అప్పుడు ఎన్టీఆర్ కు... ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే. నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. :::వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ కూటమి పై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ ఓటమి ఖాయం అని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతి రోజూ జగన్ జపం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు. రైతులను గాలికొదిలేసి... మద్యం వ్యాపారులకు మాత్రమే చంద్రబాబు గిట్టుబాటు ధరలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ అమరావతి లో ఖర్చు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. :::వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి

BJP MP Raghunandan Rao On SIT Investigation9
‘నేను కదా ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుడ్ని.. నన్ను కదా పిలవాల్సింది’

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణపై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణ ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల టైమ్‌లోనే తన ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఫిర్యాదు ఇచ్చానని, కానీ ఇప్పటివరకూ తనను విచారణకు పిలవలేదన్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేని కాంగ్రెస్‌ నేతలను విచారణకు పిలుస్తున్నారన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు ఫోన్‌ ట్యాపింగ్‌ బాధితుడినని, తనను విచారణకు పిలవకుంటా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును గాంధీ భవన్‌, జూబ్లీహిల్స్‌ మధ్య పంచాయతీలా మార్చారని, సిట్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. డైలీ సీరియల్‌లా రోజుకొకరిని పిలుస్తున్నారని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ములాఖత్‌ అయ్యి పని చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. కాళేశ్వరం కమిషన్, ట్యాపింగ్ కేసులో చివరగా ప్రజల ముందు ప్రభుత్వం పెట్టేది గాడిద గుడ్డే. కాంంగ్రెస్‌కు కేసులలో చిత్తశుద్ధి లేదు. ఇండిరమ్మ ఇళ్లు రైతు భరోసాలో చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలే తప్ప మరో ధ్యాసే లేదు’ అని రఘునందన్‌రావు మండిపడ్డారు.అన్నపూర్ణా క్యాంటీన్ల పేరు ఎందుకు మారుస్తున్నారు?జీహెచ్‌ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగితజ్ఞానం పక్కన పెట్టి అన్నపూర్ణ క్యాంటిన్ల పేర్లు మార్చారన్నారు. పేర్ల మార్పుతో డైవర్షన్‌ పాలనను కాంగ్రెస్‌ కొనసాగిస్తోంది. బల్దియాలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. మేయర్‌ కనీసం అవగాహనతో మాట్లాడాలి. కాంగ్రెస్ పాలన చూసి గ్రామాల్లో ప్రజలు నవ్వుకుంటున్నారు’ అని విమర్శించారు.

Police Arrest Three Suspects For West Bengal Law Student Incident10
పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీలోనే లా విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఆర్జీకర్‌ ఆస్పత్రిలో (rg kar medical college and hospital) జూనియర్‌ వైద్యురాలి ఘటన మరువకముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందనే అకారణంగా లా కాలేజీలో (Calcutta Law College) న్యాయవిద్యను అభ్యసిస్తున్న లా విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. కాలేజీ క్యాంపస్‌లోని సెక్యూరిటీ గార్డు రూమ్‌లో నిందితులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాధితురాలు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీ పూర్వ విద్యార్థి కాగా.. మరో ఇద్దరు పూర్వ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. Kolkata Law student gang-raped inside college campusDo not repost @ravish_journo will get angry if news go viral. pic.twitter.com/Q8sqXyeCmt— Lala (@FabulasGuy) June 27, 2025కోల్‌కతా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలోని సౌత్‌ కోల్‌కతా లా కాలేజీలో జూన్ 25 రాత్రి 7.30 నుంచి 10.30 సమయంలో కాలేజీ క్యాంపస్‌లోనే లా విద్యార్థినిపై ముగ్గురు నిందితులు గ్యాంగ్‌రేప్‌ జరిగినట్లు తెలిపారు. వారిలో ఒకరు మోనోజిత్ మిశ్రా (31) ఆ కాలేజీకి కాలేజీకి అధికార పార్టీ తృణముల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం యూనిట్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. టీఎంసీ నేతలతో మిశ్రా సన్నిహితంగా ఉన్న ఫొటోలు సైతం వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మిగిలిన ఇద్దరు ప్రస్తుతం అదే కాలేజీలో లా చదువుతున్న జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20)గా గుర్తించారు. కాళ్లమీద పడ్డా కనికరించని నిందితులుబాధిత విద్యార్థిని ఘటన జరిగిన బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో పరీక్షకు సంబంధించిన ఫారాలను ఫిల్‌ చేసేందుకు వచ్చారు. ఆ సమయంలో కాలేజీ యూనియన్ రూమ్ లోపల కూర్చున్నారు. అప్పుడే నిందితుడు ఆదేశాలతో గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీ మెయిన్‌ గేటు కాలేజీకి తాళం వేశారు. తరువాత క్యాంపస్‌లోని సెక్యూరిటీ గార్డు రూమ్‌లో అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ముగ్గురిలో నిందితుల్లో ఒకరైన మిశ్రా నన్ను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. దీంతో ఇప్పటికే నాకు ఒక బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని చెప్పా. అంతే మిశ్రా కోపంతో రగిలిపోయాడు. నన్ను ఓ రూమ్‌లోకి నెట్టి తాళం వేశాడు. నన్ను,నా స్నేహితుడిని చంపేస్తామని, నా తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేయిస్తానని బెదిరించాడు.దారుణం జరుగుతుండా వీడియోలు తీసివద్దని మిశ్రా కాళ్లమీద పడ్డా కనికరించలేదు. గార్డ్ రూమ్‌కి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దారుణం జరిగే సమయంలో నిందితులు వీడియోలు తీశారు. సహకరించపోతే ఆ వీడియోలను లీక్ చేస్తామని బెదిరించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులు హాకీ స్టిక్‌తో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయ’ని బాధితురాలి ఫిర్యాదుతో కస్బా పోలీసులు నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాధితురాలికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి, ఫోరెన్సిక్ పరీక్షల కోసం సంఘటన స్థలాన్ని భద్రపరిచారు.నిందితులకు ఐదురోజుల పోలీస్‌ కస్టడీజూన్ 26న తల్బాగన్ క్రాసింగ్‌లోని సిద్ధార్థ శంకర్ రాయ్ శిశు ఉద్యాన్ సమీపంలో మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్‌లను అరెస్టు చేయగా, జూన్ 27 తెల్లవారుజామున ప్రమిత్ ముఖర్జీని అతని నివాసంలో అరెస్టు చేశారు. ముగ్గురి మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం అలీపోర్ కోర్టులోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పద్నాలుగు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి దర్యాప్తు కోసం కోర్టు ముగ్గురినీ ఐదు రోజుల పోలీసు కస్టడీకి మంజూరు చేసింది. పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలు గతేడాది ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. లా విద్యార్థిని ఘటన వెలుగులోకి రావడంతో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. లా కాలేజీలో దుర్ఘటనలో నిందితుల్లో ఒకరు తృణమూల్‌ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలక నేతగా వ్యవహరించడంతో అక్కడ రాజకీయ దుమారం చెలరేగింది. ఈ సంఘటనపై అధికార టీఎంసీపై ప్రతిపక్ష బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.స్పందించిన టీఎంసీఈ తరుణంలో లా విద్యార్థినిపై జరిగిన ఘటన నిజంగా సిగ్గుచేటు.అయినప్పటికీ, కాలేజీలు, విద్యాసంస్థలలో పోలీసులను మోహరించడం సాధ్యం కాదు’ అని తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. మహిళా సహోద్యోగులను రక్షించడం పురుష సహోద్యోగుల విధి. కొంతమంది వికృత పురుషులు ఇలాంటి నేరాలు చేస్తారు. ఈ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలు సైతం ఈ తరహా నిందితులపై పోరాడాలి. అది ప్రభుత్వ కళాశాల అయినా.. కళాశాల పరిపాలనపై విభాగంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులే బాధ్యత వహించాలిఈ సంఘటనపై ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ దారుణానికి పోలీసులే బాధ్యత వహించాలి. కోల్‌కతాలోని మొత్తం పోలీసులను దిఘా (రథ యాత్రలో)కి పాల్గొన్నారు. కోల్‌కతా పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు? మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కొనసాగే హక్కులేదని మండిపడ్డారు. কলকাতার কসবা ল' কলেজ ক্যাম্পাসের মধ্যে এক তরুণীর উপর নৃশংস গণধর্ষণের ঘটনায় আমি স্তম্ভিত। এই জঘন্য অপরাধের সঙ্গে জড়িত তিনজন অভিযুক্তের মধ্যে মূল মাথা হিসেবে চিহ্নিত হয়েছে তৃণমূল ছাত্র পরিষদের প্রভাবশালী নেতা মনোজিৎ মিশ্র (৩১)। পুলিশ তাকে গতকাল সন্ধ্যায় তালবাগান ক্রসিংয়ের কাছে… pic.twitter.com/ishPpC7Iui— Suvendu Adhikari (@SuvenduWB) June 27, 2025 బాధితురాలికి అండగా బీజేపీమరో బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ సంఘటనను భయంకరమైనదని అభివర్ణించారు. ఈ నేరాన్ని ఒక మాజీ విద్యార్థి,ఇద్దరు కళాశాల సిబ్బంది, ఒక టీఎంసీ సభ్యుడు సైతం ఉన్నాడని ఆరోపించారు. ఆర్‌జీ కార్ ఆసుపత్రి సంఘటనను ప్రస్తావిస్తూ..పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై నేరాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా నిలుస్తోందని, నిందితులందరికీ శిక్ష పడేలా చూడాలని అన్నారు. 🔴 RAPE IN A REPUTED LAW COLLEGE IN KOLKATA BY A TMC LEADERAnother shameful chapter has been added to Bengal’s collapsing law and order under TMC rule.▶️ A female student of a prestigious law college in South Kolkata was brutally gang-raped—not in some dark alley, but right… pic.twitter.com/PFVpEOR7Mj— Amit Malviya (@amitmalviya) June 27, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement