ప్రధాన వార్తలు

జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రెంటపాళ్ల పర్యటన కేసులో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే.. కారులో ఉన్నవాళ్లపై కేసు ఎలా పెడతారు? అంటూ పోలీసులను నిలదీసింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జరిగేదాకా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెన్నపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మరణించాడు. జగన్ కాన్వాయ్ వల్లే అతను మరణించాడని కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు.. నిందితుల జాబితాలో ఆయన పేరును కూడా చేర్చారు. అయితే రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని, ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంటూ వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్తో పాటు ఇదే కేసులో వైఎస్సార్సీపీ నేతలు వేసిన మరో నాలుగు క్వాష్ పిటిషన్లను కలిపి హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ‘‘కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా.. తదుపరి విచారణను మంగళవారానికి(జులై 1వ తేదీకి) వాయిదా వేసింది. అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. జగన్ క్వాష్ పిటిషన్లో ఏముందంటే..మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్ఎస్ సెక్షన్ 105 (హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్పై విడుదల చేశారు.కాన్వాయ్లోని గుర్తుతెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. నా పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలి

పుట్టగానే ప్లాస్టిక్ బ్యాగ్లో కట్టి పడేశారు.. 40 ఏళ్ల తర్వాత ఇలా..!
నీకు ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందనేది మనం కాదనలేని సత్యం. బ్రతకాలని రాసిపెట్టి ఉంటే ఎలా పడేసినా, ఎక్కడ పడేసినా బ్రతుకుతాం. కర్మ బాలేకపోతే ఎక్కడికి కదలకుండా ఉన్నా కూడా చావును మాత్రం తప్పించలేం. అందుకే విధి రాతను ఎవరూ తప్పించలేరనేది. అప్పుడే పుట్టిన శిశువును ప్లాస్టిక్ బ్యాగ్లో కట్టేసి పడేస్తే ఎవరైనా బ్రతుకుతాడని అనుకుంటారా..? విధి అంటే వింత నాటకం అంటే ఇదేనేమో.. యూకేకు చెందిన ఓ వ్యక్తి.. పుట్టగానే ప్లాస్టిక్ బ్యాగ్లోకి వెళ్లిపోయాడు. అతని ఇంట్లో ఏ పరిస్థితుల కారణమో కానీ ప్లాస్టిక్ బ్యాగ్లో కట్టేసి ఓ చోట పడేశారు. ఆ సమయంలో ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో ఉన్న శిశువును ముగ్గురు టీనేజర్లు బయటకు తీసి జన్మనిచ్చారు. ఆ తర్వాత అతను ఓ కుటుంబానికి దత్తత వెళ్లాడు. ఇప్పుడతను తనకు జన్మనిచ్చిన కుటుంబాన్ని కలిశాడు. అది కూడా 40 ఏళ్ల తర్వాత కావడం విశేషం. యూకేలోని ఓ టెలివిజస్ నిర్వహించే ‘లాంగ్ లాస్ట్ లైఫ్’ కార్యక్రమానికి వెళ్లిన జాన్ స్కార్లెట్ ఫిలిప్స్కు మళ్లీ పుట్టిన వాళ్లను కలిసే భాగ్యం దక్కింది. ఈ షో ద్వారా తన అన్న అతనే అని తెలుసుకున్న సోదరీ, సోదరీమణులు.. ఫిలిప్స్ను కలిశారు. అయితే తల్లి మాత్రం కలిసే పరిస్థితుల్లో లేదు. మానసికంగా, శారీరకంగా ఆమె అనారోగ్యంగా ఉండటంతో కేవలం తన కుమారుడికి ఓ సందేశాన్ని మాత్రమే పంపింది. కన్నవాళ్లను నాలుగు దశాబ్దాల తర్వాత కలిస్తే అదొక అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని భార్యతో ఉంటున్న ఫిలిప్స్.. ఇకమై కుటుంబంతో కలిసే ఉంటానని అంటున్నాడు. తన సోదరుడు కోసం ఇప్పటి వరకూ చేయని ప్రయత్నం లేదని, ఇన్నాళ్లకు ఇలా కలిశామని అతని కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

‘కలెక్టర్ కారు, ఫర్నీచర్ అటాచ్ చేయండి’.. విశాఖ కోర్టు సంచలన తీర్పు
సాక్షి,విశాఖ: విశాఖ 7వ అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రభుత్వ న్యాయవాదికి గౌరవ వేతనం చెల్లించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్ కుర్చీ,కారు, ఫర్నిచర్ అటాచ్ చెయ్యండి అంటూ ఆదేశాలు జారీ చేసింది.2015 ఏప్రిల్ నుంచి 2021 వరకు విశాఖ కోర్టులో రవి కుమార్ ప్రభుత్వ ప్లీడర్గా పని చేశారు. కానీ అతని వేతనాన్ని కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేయలేదు. సుమారు రూ. 54 లక్షల రూపాయల వేతన బకాయిలు పెండింగ్లో ఉంది. ఇదే విషయంపై రవికుమార్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కలెక్టర్ ఆఫీస్ సామాగ్రిని అటాచ్మెంట్ చేయాలని అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. వడ్డీతో సహా న్యాయవాది రవికుమార్కు బకాయిలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీన రవికుమార్కు చెల్లించాల్సిన 72 నెలల వేతన బకాయిలను 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలి కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తి ఆదేశాలతో కోర్టు వారెంట్ తీసుకుని కోర్టు అమీన్ కలెక్టర్ ఆఫీసుకు వచ్చింది. వారెంట్ ఎగ్జిక్యూటివ్ చేయడానికి వచ్చిన సిబ్బందికి కలెక్టరేట్ సిబ్బంది సహకరించలేదు. కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి కోర్టు సిబ్బందిని వెళ్ళిపోవాలని మహారాణిపేట సీఐ భాస్కర్ ఇబ్బంది పెట్టారు.

ట్రంప్.. మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి: జపాన్
ఇరాన్పై తాము చేసిన దాడులు హిరోషిమా-నాగసాకిలపై చేసిన దాడుల మాదిరిగా ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని జపాన్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలను ట్రంప్ వెనక్కి తీసుకోవాలని జపాన్ డిమాండ్ చేసింది.అదొక దేశాల్ని నాశనం చేసిన విధ్వంసకర ఘటన అని, దాన్ని ఇప్పుడు మళ్లీ ట్రంప్ ఎత్తి చూపడం దారుణమని జపాన్లోని నాగసాకికి చెందిన నేతలు మండిపడుతున్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. అణుబాంబులను, అణ్వాయుధ దాడులను సమర్ధించేలా ఉన్నాయని మండిపడ్డారు. నాగసాకిపై జరిగిన అణుబాంబు దాడి ఎప్పటికీ మాసిపోని వ్యథ అని, మరి దాన్ని మళ్లీ ట్రంప్ ఎత్తిచూపడం ఏంటని ప్రశ్నించారు.అదే సమయంలో ట్రంప్ వ్యాఖ్యలపై హిరోషిమాలో పెద్ద ఎత్తును నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హిరోషిమా శాసనసభ్యులు అణ్వాయుధాల వాడకాన్ని సమర్థించే ఏ ప్రకటననైనా తిరస్కరిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఏ యుద్ధాలనైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఈ మేరకు పిలుపునిచ్చారు,జపాన్ కు చెందిన చారిత్రక పట్టణం హీరోషిమా. ఇది జపాన్ పెద్ద ద్వీపమైన హోంషులో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో 1945, ఆగస్టు 6వ తేదీన అమెరికా అణుబాంబుకు గురైన ఈ నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరంగా నిలిచింది. అమెరికా అణుబాంబు దాడితో వేల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.

ఇంగ్లండ్ గడ్డపై విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2025 ద్వారా పరిచయమై (రాజస్తాన్ రాయల్స్), 14 ఏళ్ల వయసులోనే క్యాష్ రిచ్ లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ.. తన విధ్వంసాల పరంపరను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ సంచలన ప్రదర్శనల (7 మ్యాచ్ల్లో 206.56 స్ట్రయిక్రేట్తో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 252 పరుగులు) అనంతరం ఎన్సీఏలో జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్లో 90 బంతుల్లోనే 190 పరుగులు చేసిన వైభవ్.. ఇవాళ (జూన్ 27) ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో మరోసారి చెలరేగిపోయాడు. భారత్-ఏ తరఫున 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. VAIBHAV SURYAVANSHI MADNESS..!! 🥶🔥- Smashed 48 runs in just 19 balls.- With 3 fours and 5 sixes. pic.twitter.com/HOKgnYGd4m— Sports Culture (@SportsCulture24) June 27, 2025ఈ మ్యాచ్లో మరో ఐపీఎల్ చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రేతో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించిన వైభవ్.. ఇంగ్లండ్ యువ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వైభవ్ ధాటికి భారత్ 7 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో వైభవ్ హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. వైభవ్ క్రీజ్లో ఉన్నంత సేపు నిదానంగా ఆడిన ఆయుశ్ మాత్రే.. వైభవ్ ఔటయ్యాక వరుసగా రెండు బౌండరీలు బాది ఔటయ్యాడు. మాత్రే 30 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో యంగ్ ఇండియా ఇంగ్లండ్ నిర్దేశించిన 175 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తుంది. 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 104/3గా ఉంది. విహాన్ మల్హోత్రా (4), అభిగ్యాన్ కుందు (4) క్రీజ్లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో వైభవ్, మాత్రేతో పాటు మౌల్యరాజ్సింగ్ చవ్డా (16) కూడా ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్ 2, రాల్ఫీ అల్బర్ట్ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ను భారత బౌలర్లు 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూల్చారు. కనిష్క్ చౌహాన్ (10-1-20-3), మొహమ్మద్ ఎనాన్ (10-1-37-2) తమ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టగా.. పేసర్లు ఆర్ఎస్ అంబరీష్, హెనిన్ పటేల్ తలో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో రాకీ ఫ్లింటాఫ్ (ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు) అర్ద సెంచరీతో (90 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. ఇస్సాక్ మొహమ్మద్ (28 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో సత్తా చాటాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డాకిన్స్ (18), బెన్ మేయర్స్ (16), జేమ్స్ మింటో (10) రెండంకెల స్కోర్లు చేయగా.. కెప్టెన్ థామస్ ర్యూ (5), జోసఫ్ మూర్స్ (9), రాల్ఫీ ఆల్బర్ట్ (5), జాక్ హోమ్ (5), తజీమ్ చౌద్రీ అలీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కాగా, 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల కోసం భారత అండర్-19 జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది.

నాకు కష్టమొచ్చింది.. ఇక ఈ ట్రైన్ ఎందుకు?.. అందులో ఉన్న మీరెందుకు?
మనిషికొక్క తీరు.. మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది కొంతమంది ఆలోచిస్తే, ఆ సమస్యనే తన చుట్టంగా చేసుకుని బాధపడే వాళ్లు మరికొందరు. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలయ్యే వాళ్లు ఇంకొందరు. ఇది చాలా ప్రమాదం. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలవ్వాలని కోరుకుంటారు.కానీ ప్రపంచంలోని సమస్యతో మాత్రం వీరికి అవసరం ఉండదు. ఇలాంటి వాళ్లు చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచిపోతారు. ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే చాలు.. మన చుట్టూ ఉన్న వాళ్లు ఎంత సుఖంగా ఉన్నారో అనే భ్రాంతిలో ఉండి వారికి తీవ్ర నష్టం చేయడానికి యత్నించడంలో ముందుంటారు. ఈ తరహాలోనే తన భార్య తనకు విడాకులు ఇచ్చిందనే కారణంతో మొత్తం ట్రైన్నే తగలబెట్టాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన వెంట బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను ఒక్కసారిగా ట్రైన్లో చల్లుకుంటా వచ్చి ఒక్కసారిగా నిప్పంటించాడు. అసలు ఏం జరుగుతుందనే ప్రయాణికులు తేరుకుని పరుగులు తీసే లోపే ఆ ట్రైన్ లోపల ఒక్కసారిగా భగ్గుమంది. భార్య విడాకులిచ్చిందనే ఫ్రస్టేషన్లో..ఈ ఘటన దక్షిణాకొరియా దేశంలో చోటు చేసుకంది. ఇటీవల సియోల్కు చెందిన వాన్ అనే వ్యక్తికి భార్యతో విడాకులయ్యాయి. దీన్ని భరించలేకపోయాడు. సుమారు 67 ఏళ్ల వయసులో తనకు విడాకులు మంజూరు కావడాన్ని వాన్ తట్టుకోలేకపోయాడు. ఇక తాను ఎందుకు అనుకున్నాడు. అలా అనుకుంటూనే ట్రైన్ ఎక్కాడు. అప్పటికే ఓ పెట్రోల్ డబ్బా బ్యాగ్తో పాటు వెంట తెచ్చుకున్నాడు. అయితే ఆ ట్రైన్ కోచ్లో జనం కాస్త సంతోషంగా కనిపించారు. తనకు కష్టం వచ్చింది.. వీరి ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి అనుకున్నాడో ఏమో కానీ.. ఒక్కసారిగా పెట్రోల్ డబ్బా బయటకు తీశాడు. పెట్రోల్ డబ్బా బయటకు తీసిన క్షణంలోనే అనుమానం వచ్చిన ఆ కోచ్లోని ప్రయాణికులు పరుగులు తీశారు. పెట్రోల్ మొత్తం కోచ్ అంతా చల్లడం.. ఆపై నిప్పంటించడం జరిగిపోయాయి. సముద్రగర్భంలోని టన్నెల్లో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 22 మంది ఆస్పత్రి పాలు కాగా, మరొక 129 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిందితుడు వాన్ కూడా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా 240,000 యూఎస్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.వాన్పై హత్యాభియోగాలుఈ దారుణానికి పాల్పడ్డ వాన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కదులుతున్న ట్రైన్లో ఘటన జూన్ 9న జరగ్గా, ఇది ఆలస్యంగా వెలుగుచూసింది. వాన్పై హత్యాయత్నం అభియోగాలతో పాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వాన్.. భార్యతో విడాకులు మంజూరు అయినందుకే ఇలా చేశానని స్పష్టం చేశాడు. ట్రైన్లో పెట్రోల్ పోసిన ఘటన వీడియో వైరల్గా మారింది.서울지하철 5호선 방화범 CCTV사망자 없는게 기적이네요 pic.twitter.com/IQMowGZkWH— 브이몬 (@XXV_mon) June 25, 2025

‘కన్నప్ప’ మూవీ రివ్యూ
టైటిల్ : కన్నప్పనటీనటులు: విష్ణు మంచు, మోహన్ బాబు, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీనిర్మాత: మోహన్ బాబుకథ:పరుచూరి గోపాల కృష్ణ,ఈశ్వర్ రెడ్డి, జి. నాగేశ్వర రెడ్డితోట ప్రసాద్దర్శకత్వం: ముకేశ్ కుమార్ సింగ్సంగీతం : స్టీఫెన్ దేవస్సీసినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌఎడిటర్: ఆంథోనీవిడుదల తేది: జూన్ 27, 2025కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కథకుడిగా, నిర్మాతగాను వ్యవహరించాడు. మంచు ఫ్యామిలికి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించాయి. అలాగే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్ వచ్చాక ఈ సినిమాపై ఉన్న నెగెటివిటీ తగ్గిపోయింది. ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(Kannappa Movie Review).కథేంటంటే..తిన్నడు(మంచు విష్ణు) పరమ నాస్తికుడు. అతని తండ్రి నాథ నాథుడు(శరత్ కుమార్) మాటే ఆయనకు వేదం. గూడెం ప్రజలకే ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. పక్క గూడానికి చెందిన యువరాణి నెమలి(ప్రీతీ ముకుందన్)తో ప్రేమలో పడతాడు. ఓసారి గూడెంలో ఉన్న వాయు లింగం కోసం వచ్చిన కాల ముఖుడు (అర్పిత్ రాంకా) సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు. ఈ విషయం కాల ముఖుడికి తెలిసి.. గూడెంపై దండయాత్రకు బయలుదేరుతాడు. అదే సమయంలో ఓ కారణంగా తిన్నడు గూడాన్ని వీడాల్సి వస్తుంది. నెమలితో కలిసి అడవికి వెళ్తాడు. శివుడి పరమభక్తురాలైన నెమలి.. దేవుడినే నమ్మని తిన్నడు కలిసి జీవితం ఎలా సాగించాడు? వీరి జీవితంలోకి రుద్ర(ప్రభాస్) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయు లింగం కోసం కాల ముఖుడు ఎందుకు వెతుకుతున్నాడు? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడు పరమ భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కన్నప్ప కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పరమ నాస్తికుడైన తిన్నడు పరమ భక్తుడిగా ఎలా మారాడు అనేది 50 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘భక్త కన్నప్ప’ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అదే కథతో ఇప్పుడు మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఓ భక్తి కథకు కావాల్సినంత కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ ను నేటి తరానికి నచ్చేలా ‘కన్నప్ప’ కథను చెప్పాలనుకున్నారు. ఈ విషయంలో మంచు విష్ణుని అభినందించాల్సిందే. అయితే టెక్నికల్గా సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. సీజీ వర్క్ పేలవంగా ఉంది. వార్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎమోషన్ని తెరపై బాగా పండించి ఆ లోపాలను కాస్త కప్పిపుచ్చారు. భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమా చాలా ఎమోషనల్గా సాగుతూ.. శివ భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. శివుడు గొప్పతనాన్ని పాట రూపంలో చెబుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత తిన్నడు ఎందుకు నాస్తికుడిగా మారాల్సి వచ్చిందో అర్థవంతంగా చూపించారు. మంచు విష్ణు ఎంట్రీ కథనం ఆసక్తి పెరుగుతుంది. యువరాణి నెమలితో ప్రేమలో పడడం.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ని ఆకట్టుకుంటాయి. పాటల పేరుతో భక్తి చిత్రంలోనూ శృంగార రసాన్ని బాగానే పండించారు. కొన్ని చోట్ల ఆ శృంగార రసం మితిమీరిపోయింది కూడా. ఇక మోహన్ బాబు ఎంట్రీ, మోహన్ లాల్ ఎంట్రీ సీన్స్ అదిరిపోతాయి. అయితే ఫస్టాఫ్లో వచ్చే యుద్ద సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఓవరాల్గా ఫస్టాఫ్ పర్లేదులే అన్నట్లుగా సాగుతుంది. ఇక సెకండాఫ్లో కథనం పరుగులు పెడుతుంది. ముఖ్యంగా రుద్రగా ప్రభాస్ ఎంట్రి ఇచ్చిన తర్వాత కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ప్రభాస్ కనిపించేది 20 నిమిషాలే అయినా.. ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోతారు. క్లైమాక్స్లో విష్ణు నటన ఆకట్టుకుంటుంది. శివ భక్తులకు చివరి 40 నిమిషాలు అయితే విపరీతంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. తిన్నడు అలియాస్ కన్నప్పగా మంచు విష్ణు బాగా నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్లో విష్ణు నటన అదిరిపోతుంది. ఆయన కెరీర్లో బెస్ట్ ఫెర్పార్మెన్స్గా కన్నప్ప నిలిచిపోతుంది. గూడెపు యువరాణి, శివుడి పరమ భక్తురాలు నెమలిగా ప్రీతి ముకుందన్ మంచి నటనతో ఆకట్టుకుంది. తెరపై కావాల్సినంత అందాలను ప్రదర్శిస్తూనే.. నటన పరంగాను మంచి మార్కులే సంపాదించుకుంది. విష్ణు, ప్రీతీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక రుద్రగా ప్రభాస్ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తెరపై కనిపించేది 20 నిమిషాలే అయినా.. అవే సినిమాకు కీలకంగా మారుతాయి. తిన్నడు, నెమలితో పాటు మహాదేవ శాస్త్రీ పాత్రలకు రుద్రకు మధ్య వచ్చే సీన్స్ అదిరిపోతాయి. ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్లో విజిల్స్ వేయిస్తాయి. ఇక శివుడికి తనకంటే గొప్ప భక్తుడు లేడని భావించే మహాదేవ శాస్త్రీగా మోహన్బాబు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన డైలాగు డెలివరీ ఆ పాత్రకు హుందాతనం తెచ్చింది. మోహన్లాల్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతీదేవి పాత్రలో కాజల్ ఒదిగిపోయారు. ఇక తిన్నడు తండ్రిగా శరత్కుమార్ నటన బాగుంది. కానీ, ఓన్ వాయిస్తో చెప్పిన డబ్బింగ్ బాగోలేదు. చిన్నప్పటి తిన్నడుగా నటించిన అవ్రామ్.. నటన పరంగా ఓకే కానీ డబ్బింగ్ దారుణంగా ఉంది. తెలుగు పదాలు సరిగా పలకలేకపోయాడు. బ్రహానందం, మధుబాల, శివబాలాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా బాగుంది. స్టీఫెన్ దేవస్సీ పాటలు పర్వాలేదు కానీ నేపథ్య సంగీతమే అంతగా బాగోలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను గుర్తు చేసేలా బీజీఎం ఉంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. న్యూజిలాండ్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్

గిన్నిస్ బుక్లోని బాబు మోసాలు, దుర్మార్గాలు: సజ్జల
ప్రజలకు ఎన్నికల వేళ హామీలను ఎంత తేలికగా ఇచ్చారో.. వాటిని అంతే తేలికగా ఇప్పుడు చంద్రబాబు కొట్టేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందని.. అందుకే బాబు మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారాయన. అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్పై సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం ఉండదని సజ్జల తేల్చేశారాయన. సాక్షి, అనంతపురం: అబద్దాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించినవారు లేరని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో(Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు!. హామీలను తేలికగా ఇచ్చినట్లే.. అంతే తేలికగా కొట్టిపారేస్తుంటారాయన. అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం... జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్ బుక్లోకి ఎక్కించొచ్చు. అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తోంది. కూటమి నేతలు ఇళ్లకు వస్తే నిలదీయడానికి.. చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టం లేదు.. లేకపోతే చంద్రబాబు సర్కార్కు పదవీ గండం ఉండేది. .. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎస్వోజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దారుణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది. పేరుకే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. ఆచరణలో అమలు చేయడం లేదు. .. సింగయ్య మృతి కేసులో జగన్పై కేసు నమోదు.. దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్ను ఎంత అణచి వేయాలని చూస్తే... అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్కు మద్దతుగా లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. .. హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి’’ అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఇంకా రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్ట్ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు మోసాలను వివరించారు. ‘‘టీడీపీ కూటమి గెలుపు పై ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల అక్రమాల ద్వారా గెలిచారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. చంద్రబాబు అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరు. నారా లోకేష్ రెడ్ బుక్ను ఎడమ కాలితో తన్ని ఎదిరిస్తాం. ప్రజలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు’’:::మాజీ మంత్రి శైలజానాథ్ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?. దళిత, గిరిజన బాలికల పై అఘాయిత్యాలు జరిగితే పవన్కు పట్టదా?. :::మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్చంద్రబాబు మోసాలను ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు. అప్పుడు ఎన్టీఆర్ కు... ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే. నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. :::వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ కూటమి పై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ ఓటమి ఖాయం అని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతి రోజూ జగన్ జపం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు. రైతులను గాలికొదిలేసి... మద్యం వ్యాపారులకు మాత్రమే చంద్రబాబు గిట్టుబాటు ధరలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ అమరావతి లో ఖర్చు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. :::వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి

‘నేను కదా ఫోన్ ట్యాపింగ్ బాధితుడ్ని.. నన్ను కదా పిలవాల్సింది’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల టైమ్లోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు ఇచ్చానని, కానీ ఇప్పటివరకూ తనను విచారణకు పిలవలేదన్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేని కాంగ్రెస్ నేతలను విచారణకు పిలుస్తున్నారన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని, తనను విచారణకు పిలవకుంటా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును గాంధీ భవన్, జూబ్లీహిల్స్ మధ్య పంచాయతీలా మార్చారని, సిట్కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. డైలీ సీరియల్లా రోజుకొకరిని పిలుస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ములాఖత్ అయ్యి పని చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. కాళేశ్వరం కమిషన్, ట్యాపింగ్ కేసులో చివరగా ప్రజల ముందు ప్రభుత్వం పెట్టేది గాడిద గుడ్డే. కాంంగ్రెస్కు కేసులలో చిత్తశుద్ధి లేదు. ఇండిరమ్మ ఇళ్లు రైతు భరోసాలో చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలే తప్ప మరో ధ్యాసే లేదు’ అని రఘునందన్రావు మండిపడ్డారు.అన్నపూర్ణా క్యాంటీన్ల పేరు ఎందుకు మారుస్తున్నారు?జీహెచ్ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై రఘునందన్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగితజ్ఞానం పక్కన పెట్టి అన్నపూర్ణ క్యాంటిన్ల పేర్లు మార్చారన్నారు. పేర్ల మార్పుతో డైవర్షన్ పాలనను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. బల్దియాలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. మేయర్ కనీసం అవగాహనతో మాట్లాడాలి. కాంగ్రెస్ పాలన చూసి గ్రామాల్లో ప్రజలు నవ్వుకుంటున్నారు’ అని విమర్శించారు.

పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీలోనే లా విద్యార్థినిపై గ్యాంగ్రేప్
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో ఆర్జీకర్ ఆస్పత్రిలో (rg kar medical college and hospital) జూనియర్ వైద్యురాలి ఘటన మరువకముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందనే అకారణంగా లా కాలేజీలో (Calcutta Law College) న్యాయవిద్యను అభ్యసిస్తున్న లా విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. కాలేజీ క్యాంపస్లోని సెక్యూరిటీ గార్డు రూమ్లో నిందితులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాధితురాలు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీ పూర్వ విద్యార్థి కాగా.. మరో ఇద్దరు పూర్వ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. Kolkata Law student gang-raped inside college campusDo not repost @ravish_journo will get angry if news go viral. pic.twitter.com/Q8sqXyeCmt— Lala (@FabulasGuy) June 27, 2025కోల్కతా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ కోల్కతాలోని కస్బా ప్రాంతంలోని సౌత్ కోల్కతా లా కాలేజీలో జూన్ 25 రాత్రి 7.30 నుంచి 10.30 సమయంలో కాలేజీ క్యాంపస్లోనే లా విద్యార్థినిపై ముగ్గురు నిందితులు గ్యాంగ్రేప్ జరిగినట్లు తెలిపారు. వారిలో ఒకరు మోనోజిత్ మిశ్రా (31) ఆ కాలేజీకి కాలేజీకి అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం యూనిట్ ప్రెసిడెంట్గా పనిచేశారు. టీఎంసీ నేతలతో మిశ్రా సన్నిహితంగా ఉన్న ఫొటోలు సైతం వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మిగిలిన ఇద్దరు ప్రస్తుతం అదే కాలేజీలో లా చదువుతున్న జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20)గా గుర్తించారు. కాళ్లమీద పడ్డా కనికరించని నిందితులుబాధిత విద్యార్థిని ఘటన జరిగిన బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో పరీక్షకు సంబంధించిన ఫారాలను ఫిల్ చేసేందుకు వచ్చారు. ఆ సమయంలో కాలేజీ యూనియన్ రూమ్ లోపల కూర్చున్నారు. అప్పుడే నిందితుడు ఆదేశాలతో గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీ మెయిన్ గేటు కాలేజీకి తాళం వేశారు. తరువాత క్యాంపస్లోని సెక్యూరిటీ గార్డు రూమ్లో అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ముగ్గురిలో నిందితుల్లో ఒకరైన మిశ్రా నన్ను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. దీంతో ఇప్పటికే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా. అంతే మిశ్రా కోపంతో రగిలిపోయాడు. నన్ను ఓ రూమ్లోకి నెట్టి తాళం వేశాడు. నన్ను,నా స్నేహితుడిని చంపేస్తామని, నా తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేయిస్తానని బెదిరించాడు.దారుణం జరుగుతుండా వీడియోలు తీసివద్దని మిశ్రా కాళ్లమీద పడ్డా కనికరించలేదు. గార్డ్ రూమ్కి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దారుణం జరిగే సమయంలో నిందితులు వీడియోలు తీశారు. సహకరించపోతే ఆ వీడియోలను లీక్ చేస్తామని బెదిరించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులు హాకీ స్టిక్తో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయ’ని బాధితురాలి ఫిర్యాదుతో కస్బా పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి, ఫోరెన్సిక్ పరీక్షల కోసం సంఘటన స్థలాన్ని భద్రపరిచారు.నిందితులకు ఐదురోజుల పోలీస్ కస్టడీజూన్ 26న తల్బాగన్ క్రాసింగ్లోని సిద్ధార్థ శంకర్ రాయ్ శిశు ఉద్యాన్ సమీపంలో మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్లను అరెస్టు చేయగా, జూన్ 27 తెల్లవారుజామున ప్రమిత్ ముఖర్జీని అతని నివాసంలో అరెస్టు చేశారు. ముగ్గురి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం అలీపోర్ కోర్టులోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పద్నాలుగు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి దర్యాప్తు కోసం కోర్టు ముగ్గురినీ ఐదు రోజుల పోలీసు కస్టడీకి మంజూరు చేసింది. పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలు గతేడాది ఆగస్టులో కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. లా విద్యార్థిని ఘటన వెలుగులోకి రావడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. లా కాలేజీలో దుర్ఘటనలో నిందితుల్లో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలక నేతగా వ్యవహరించడంతో అక్కడ రాజకీయ దుమారం చెలరేగింది. ఈ సంఘటనపై అధికార టీఎంసీపై ప్రతిపక్ష బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.స్పందించిన టీఎంసీఈ తరుణంలో లా విద్యార్థినిపై జరిగిన ఘటన నిజంగా సిగ్గుచేటు.అయినప్పటికీ, కాలేజీలు, విద్యాసంస్థలలో పోలీసులను మోహరించడం సాధ్యం కాదు’ అని తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. మహిళా సహోద్యోగులను రక్షించడం పురుష సహోద్యోగుల విధి. కొంతమంది వికృత పురుషులు ఇలాంటి నేరాలు చేస్తారు. ఈ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలు సైతం ఈ తరహా నిందితులపై పోరాడాలి. అది ప్రభుత్వ కళాశాల అయినా.. కళాశాల పరిపాలనపై విభాగంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులే బాధ్యత వహించాలిఈ సంఘటనపై ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ దారుణానికి పోలీసులే బాధ్యత వహించాలి. కోల్కతాలోని మొత్తం పోలీసులను దిఘా (రథ యాత్రలో)కి పాల్గొన్నారు. కోల్కతా పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు? మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కొనసాగే హక్కులేదని మండిపడ్డారు. কলকাতার কসবা ল' কলেজ ক্যাম্পাসের মধ্যে এক তরুণীর উপর নৃশংস গণধর্ষণের ঘটনায় আমি স্তম্ভিত। এই জঘন্য অপরাধের সঙ্গে জড়িত তিনজন অভিযুক্তের মধ্যে মূল মাথা হিসেবে চিহ্নিত হয়েছে তৃণমূল ছাত্র পরিষদের প্রভাবশালী নেতা মনোজিৎ মিশ্র (৩১)। পুলিশ তাকে গতকাল সন্ধ্যায় তালবাগান ক্রসিংয়ের কাছে… pic.twitter.com/ishPpC7Iui— Suvendu Adhikari (@SuvenduWB) June 27, 2025 బాధితురాలికి అండగా బీజేపీమరో బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ సంఘటనను భయంకరమైనదని అభివర్ణించారు. ఈ నేరాన్ని ఒక మాజీ విద్యార్థి,ఇద్దరు కళాశాల సిబ్బంది, ఒక టీఎంసీ సభ్యుడు సైతం ఉన్నాడని ఆరోపించారు. ఆర్జీ కార్ ఆసుపత్రి సంఘటనను ప్రస్తావిస్తూ..పశ్చిమ బెంగాల్లో మహిళలపై నేరాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా నిలుస్తోందని, నిందితులందరికీ శిక్ష పడేలా చూడాలని అన్నారు. 🔴 RAPE IN A REPUTED LAW COLLEGE IN KOLKATA BY A TMC LEADERAnother shameful chapter has been added to Bengal’s collapsing law and order under TMC rule.▶️ A female student of a prestigious law college in South Kolkata was brutally gang-raped—not in some dark alley, but right… pic.twitter.com/PFVpEOR7Mj— Amit Malviya (@amitmalviya) June 27, 2025
కన్నప్ప రిలీజ్.. మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్!
బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ దివి.. డిఫరెంట్ లుక్లో హీరోయిన్ సమంత!
శాంసంగ్ నుంచి కొత్త ఫోన్.. ధర తక్కువే..
చారిత్రక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
'నా జీవితంలో అత్యుత్తమమైన రోజు'.. పెళ్లి తర్వాత అఖిల్ పోస్ట్
‘కలెక్టర్ కారు, ఫర్నీచర్ అటాచ్ చేయండి’.. విశాఖ కోర్టు సంచలన తీర్పు
జూలైలో బ్యాంకు సెలవులు.. ఇదిగో ఈ రోజుల్లోనే..
పుట్టగానే ప్లాస్టిక్ బ్యాగ్లో కట్టి పడేశారు.. 40 ఏళ్ల తర్వాత ఇలా..!
ఇంగ్లండ్ గడ్డపై విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఒక్క రూపాయి క్యాండీ.. రూ.750 కోట్ల బ్రాండ్..
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే..
అమ్మ ఓడి.. 'పోయింది'
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన - అయినా కొనసాగిన దాడులు
క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
ఆధ్యాత్మిక పర్యటనలో అనసూయ (ఫోటోలు)
ఈ రాశి వారికి ఊహించని ఉద్యోగాలు.. సంఘంలో గౌరవం
విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్ హోటల్స్లో వసతి అక్కర్లేదు: లయ
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ధార్మిక చింతన
బంగారం కంటే వెండి ముద్దు
పెరగనున్న రైలు చార్జీలు
అబ్బే నోబెల్ కాదు! పోరు పడలేక ఓ డూప్లికేట్ తయారుచేసి ఇచ్చాం! ఇక ఆ లోకంలోనే ఉన్నారు!
జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మన దాడులు సరే సార్.. వాళ్ల బాంబులు మన నెత్తిమీద పడేలా ఉన్నాయ్!
క్యాబ్ డ్రైవర్లకు ఇక గడ్డుకాలమే!
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ ప్రవస్తి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
కన్నప్ప రిలీజ్.. మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్!
బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ దివి.. డిఫరెంట్ లుక్లో హీరోయిన్ సమంత!
శాంసంగ్ నుంచి కొత్త ఫోన్.. ధర తక్కువే..
చారిత్రక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
'నా జీవితంలో అత్యుత్తమమైన రోజు'.. పెళ్లి తర్వాత అఖిల్ పోస్ట్
‘కలెక్టర్ కారు, ఫర్నీచర్ అటాచ్ చేయండి’.. విశాఖ కోర్టు సంచలన తీర్పు
జూలైలో బ్యాంకు సెలవులు.. ఇదిగో ఈ రోజుల్లోనే..
పుట్టగానే ప్లాస్టిక్ బ్యాగ్లో కట్టి పడేశారు.. 40 ఏళ్ల తర్వాత ఇలా..!
ఇంగ్లండ్ గడ్డపై విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఒక్క రూపాయి క్యాండీ.. రూ.750 కోట్ల బ్రాండ్..
సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే..
అమ్మ ఓడి.. 'పోయింది'
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన - అయినా కొనసాగిన దాడులు
క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
ఈ రాశి వారికి ఊహించని ఉద్యోగాలు.. సంఘంలో గౌరవం
విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్ హోటల్స్లో వసతి అక్కర్లేదు: లయ
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ధార్మిక చింతన
బంగారం కంటే వెండి ముద్దు
పెరగనున్న రైలు చార్జీలు
అబ్బే నోబెల్ కాదు! పోరు పడలేక ఓ డూప్లికేట్ తయారుచేసి ఇచ్చాం! ఇక ఆ లోకంలోనే ఉన్నారు!
జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మన దాడులు సరే సార్.. వాళ్ల బాంబులు మన నెత్తిమీద పడేలా ఉన్నాయ్!
క్యాబ్ డ్రైవర్లకు ఇక గడ్డుకాలమే!
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ ప్రవస్తి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
కుమార్తెలపై కోపంతో.. రూ.4 కోట్ల ఆస్తి పత్రాలు హుండీలో వేసిన తండ్రి
సినిమా

బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ దివి.. డిఫరెంట్ లుక్లో హీరోయిన్ సమంత!
నెదర్లాండ్స్ వేకేషన్లో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్..పింక్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఆలియా భట్ పోజులు..బీచ్లో బిగ్బాస్ బ్యూటీ విష్ణుప్రియ చిల్..బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్స్.. వెరైటీ డ్రెస్లో హీరోయిన్ సమంత లుక్స్.. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73)

హీరోగా గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు.. టీజర్ చూశారా?
గాలి జనార్దనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బ్యానర్లో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.మూవీ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ టీజర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే కాలేజీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా జులై 18న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో రవి చంద్రన్, జెనీలియా, రావు రమేష్, సుధారాణి, అచ్యుత్ రావు, సత్య, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు.

తొలిసారి మాస్ సాంగ్ పాడిన 'సుహాస్'
టాలీవుడ్ హీరో సుహాస్ తొలిసారి గాయకుడిగా మారాడు. తను నటిస్తున్న కొత్త సినిమా 'ఓ భామ అయ్యే రామ' కోసం అదిరిపోయే మాస్ సాంగ్ను ఆయన పాడారు. ఈ చిత్రంలో సుహాస్కు జోడిగా మాళవిక మనోజ్ నటించింది. ఈ ప్రేమకథ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్లో హరీశ్ నల్లా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ దశలో ఉంది. జూలై 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రవీందర్ విజయ్, బబ్లూ పృథ్వీ రాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, సాథ్విక్ ఆనంద్, నయని పావనిముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధన్ సంగీతమందిస్తున్నారు.

కన్నప్ప మూవీ రిలీజ్.. ఆనందంతో చొక్కా చింపుకున్న అభిమాని!
మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన చిత్రం కన్నప్ప అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. తొలి ఆట నుంచే ఈ మూవీకి పాజిటివ్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాపై మంచు మనోజ్ సైతం ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ రోల్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్ల వద్ద అభిమానులు మంచు విష్ణు, ప్రభాస్ అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు.అయితే కన్నప్ప చూసిన ఓ అభిమాని థియేటర్ వద్ద తన ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. థియేటర్కు వచ్చిన అభిమాని కన్నప్ప మూవీపై బ్లాక్బస్టర్ హిట్ అంటూ కేకలు వేశాడు. మంచు విష్ణును ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరి చెబుతున్నా.. పక్కా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా హిట్ అంటూ ఏకంగా తన షర్ట్నే చింపుకుని మరి కన్నప్పపై తన అభిమానం చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమా చూసిన ప్రభాస్ అభిమానులు సైతం సూపర్ హిట్ అంటూ కామెంట్స్ చేశారు.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఓటమి దిశగా బంగ్లాదేశ్
కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ ఓటమి దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు బంగ్లాదేశ్ ఇంకా 96 పరుగులు వెనుకపడి ఉంది. లిట్టన్ దాస్ (13) క్రీజ్లో ఉన్నాడు. శ్రీలంక బౌలర్లు ధనంజయ డిసిల్వ (4-1-13-2), ప్రభాత్ జయసూర్య (15-2-47-2), తిరిండు రత్నాయకే (2.4-0-10-1), అశిత ఫెర్నాండో (8-1-22-1) చెలరేగడంతో బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్లో పేకమేడలా కూలుతుంది. బంగ్లా ఆటగాళ్లలో ఒక్కరు కూడా క్రీజ్లో కుదురుగా నిలబడలేకపోతున్నారు. ఇప్పటివరకు ఔటైన ఆరుగురు రెండంకెల స్కోర్లు చేయగలిగారు కానీ, ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. షద్మాన్ ఇస్లాం 12, అనాముల్ హక్ 19, మొమినుల్ హక్ 15, నజ్ముల్ షాంటో 19, ముష్ఫికర్ రహీం 26, మెహిది హసన్ 11 పరుగులకు ఔటయ్యారు.290/2 స్కోర్ వద్ద ఇవాళ (మూడో రోజు) ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 168 పరుగులు జోడించి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్ నిస్సంక తన సెంచరీకి మరో 12 పరుగులు జోడించి 158 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరో ఓవర్నైట్ బ్యాటర్ ప్రభాత్ జయసూర్య తన వ్యక్తిగత స్కోర్కు మరో 5 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లలో కుసాల్ మెండిస్ (84) సెంచరీకి చేరువై ఔట్ కాగా.. కమిందు మెండిస్ (33) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. అంతకుముందు దినేశ్ చండీమల్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. లహీరు ఉడార 40 పరుగులు చేశాడు. మొత్తంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 458 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 5 వికెట్లు తీశాడు. నయీమ్ హసన్ 3, నహిద్ రాణా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్ కాగా.. మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్ రహీం (163),పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు.

అతడి భార్య పోటీకి వస్తుందేమో!.. నేనే నంబర్ వన్!
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. అద్భుత నైపుణ్యాలు జెస్సీ సొంతమని.. బ్యాటింగ్ లెజెండ్స్ సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి (Virat Kohli)లతో సరిసమాన గౌరవానికి అతడు అర్హుడని పేర్కొన్నాడు. బుమ్రా తన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడన్న అశూ.. అందరికంటే తానే వీరాభిమానినని తెలిపాడు.ఇంగ్లండ్ పర్యటనలోకాగా ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బుమ్రా.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో అతడు సత్తా చాటాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 24.4 ఓవర్ల బౌలింగ్లో 83 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఈ కుడిచేతివాటం పేసర్ స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది.సమాన గౌరవం దక్కాలిఇదిలా ఉంటే.. గిల్ సేన మ్యాచ్ ఓడినా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బుమ్రా ప్రదర్శన పట్ల మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తాను బుమ్రాకు వీరాభిమానినంటూ అశూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘టెండుల్కర్, కోహ్లి మాదిరే బుమ్రాకు సమాన గౌరవం దక్కాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సచిన్ టెండుల్కర్ల విషయంలో మనమేం చేశామో.. జెస్సీ విషయంలోనూ అదే చేయాలి. నిజానికి బౌలర్గా అతడికి అందరికంటే ఎక్కువ గౌరవమే దక్కాలి.అతడి భార్య పోటీకి వస్తుందేమో!.. నేనే నంబర్ వన్అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎంతో మంది అతడిని ప్రేమిస్తున్నారు. నేనైతే అతడి నంబర్ వన్ ఫ్యాన్ని. నాకు తెలిసి ఈ నంబర్ వన్ ఫ్యాన్ విషయంలో బుమ్రా భార్య నాతో పోటీకి వస్తుందేమో! కానీ నేను మాత్రం నేనే నంబర్ వన్ అని చెప్తా’’ అంటూ అశ్విన్ బుమ్రా పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు.కాగా బుమ్రా సతీమణి సంజనా గణేషన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ అన్న విషయం తెలిసిందే. ఐసీసీ ఈవెంట్లతో పాటు ఐపీఎల్లోనూ వ్యాఖ్యాతగా సత్తా చాటుతోందామె. ఈ జంటకు కుమారుడు అంగద్ బుమ్రా ఉన్నాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకబడి ఉన్న టీమిండియా.. జూలై 2-6 వరకు రెండో టెస్టు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్లో బుమ్రా ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. పనిభారం తగ్గించే నిమిత్తం యాజమాన్యం అతడికి రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చినట్లు సమాచారం.చదవండి: సచిన్ సర్ కొడుకు.. అర్జున్పై ఎలా అరవగలను?.. కెప్టెన్గా ఉన్నపుడు జరిగిందిదే!

IND VS ENG: బుమ్రాపై వర్క్ లోడ్.. ఒక్కడు ఎంతని చేయగలడు..?
ఇటీవలికాలంలో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తావన వచ్చే సరికి వర్క్ లోడ్ అన్న పదం వినిపిస్తుంది. చాలామందికి ఈ పదం చాలా సాధారణంగా అనిపించవచ్చు. క్రికెట్పై పెద్దగా అవగాహన లేని వారు.. ఈ ఇంత దానికే వర్క్ లోడ్ అంటే ఎలా అని అంటుంటారు. గతంలో చాలామంది పేసర్లు బుమ్రా కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడి, లెక్కలేనన్ని ఓవర్లు వేశారని గుర్తు చేస్తుంటారు.అయితే అప్పటి క్రికెట్కు, ఇప్పటి క్రికెట్కు పోల్చుకోలేని వ్యత్యాసం ఉందన్న విషయం వారికి అర్దం కాదు. అప్పట్లో పేసర్లు టెస్ట్ మ్యాచ్లు, అప్పుడప్పుడు వన్డేలు ఆడేవారు. అది కూడా ఏడాదిలో కొంతకాలం మాత్రమే. అయితే పొట్టి క్రికెట్ ఆగమనంతో పరిస్థితి చాలా మారింది. ఏడాది పొడవునా ఏదో ఒక ఫార్మాట్లో మ్యాచ్లు జరుగుతుంటాయి. మధ్యలో ప్రైవేట్ లీగ్లు, ఖాళీగా ఉంటే దేశవాలీ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.ఇలాంటి పరిస్థితుల్లో పేస్ బౌలర్లపై సహజంగానే పని భారం ఉంటుంది. శరీరం పెద్దగా సహకరించదు. ఒకవేళ ధైర్యం చేసి బరిలోకి దిగినా గాయాలు తప్పవు. గాయాల బారిన పడితే కొన్ని సందర్భాల్లో అర్దంతరంగా కెరీర్లే ముగిసిపోతాయి. కెరీర్ ముగిస్తే సదరు బౌలర్ జీవితం కూడా ముగిసినట్లే. ఇవన్నీ చూసుకొనే పేసర్లు ఆచితూచి మ్యాచ్లు ఆడుతుంటారు. సంబంధిత క్రికెట్ బోర్డులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే వారిని ఎంపిక చేస్తుంటారు. బుమ్రా సహా ప్రపంచ క్రికెట్లో పేసర్లందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. అయితే, గత ఏడాదిన్నర కాలంగా మిగతా పేసర్లతో పోలిస్తే బుమ్రాపై అదనపు పని భారం పడుతుంది. టెస్ట్ల్లో ప్రపంచ ప్రఖ్యాత పేసర్లు మిచెల్ స్టార్క్ (362), కగిసో రబాడ (298) వంటి వారు 2024 నుంచి గరిష్టంగా 362 ఓవర్లు వేస్తే, బుమ్రా ఏకంగా 410 ఓవర్లు వేశాడు. ఈ గణాంకాలు చేస్తే చాలు బుమ్రాపై ఎంత పని భారం పడుతుందో చెప్పడానికి.టీమిండియా బుమ్రాపై అతిగా ఆధారపడుతూ, అతనిచే సామర్థ్యానికి మించి బౌలింగ్ చేయిస్తుంది. ఇదే కొనసాగితే బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్ ఆడే అవకాశం ఉండదు. వర్క్ లోడ్ ఎక్కువై గాయాల బారిన పడి, బుమ్రా కెరీర్ అర్దంతరంగా ముగిసే ప్రమాదం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొనే భారత మేనేజ్మెంట్ బుమ్రాను పరిమితంగా వినియోగించుకుంటుంది. ఇంగ్లండ్ టూర్లో కేవలం మూడు మ్యాచ్లే ఆడించాలని నిర్ణయించుకుంది.బుమ్రా గురించి ఆలోచిస్తే ఇది ఓకే. మరి టీమిండియా ప్రదర్శన మాటేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత కొంతకాలంగా టెస్ట్ల్లో బుమ్రా లేకపోతే టీమిండియా సున్నా అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది తెలిసి కూడా బీసీసీఐ బుమ్రాకు ప్రత్యామ్నాయాన్ని తయారు చేసుకోలేకపోతుంది. బుమ్రా ఒక్కడు ఎంత వరకు చేయగలడని మాజీలు చాలాకాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. బుమ్రా రాణించకపోతే టీమిండియా పరిస్థితి ఏంటన్నది తాజాగా ముగిసిన లీడ్స్ టెస్ట్ సూచిస్తుంది. ఆ మ్యాచ్లో బుమ్రా తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసినా, రెండో ఇన్నింగ్స్లో ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియా ఓటమిపాలైంది. ఇకనైనా భారత్ బుమ్రాపై అతిగా ఆధారపడకుండా, ప్రత్యామ్నాయాలను చూసుకోవాలి.

ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన కమిన్స్
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) చరిత్ర సృష్టించాడు. అరవై రెండేళ్లుగా రిచీ బెనాడ్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన కెప్టెన్గా అవతరించాడు. వెస్టిండీస్ (WI vs AUS)తో మ్యాచ్ సందర్భంగా కమిన్స్ ఈ ఘనత సాధించాడు.విండీస్ పర్యటనలో ఆసీస్ జట్టువిండీస్తో మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం (జూన్ 25) మొదలైన తొలి టెస్టుకు బార్బడోస్లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానం వేదిక.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పర్యాటక ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. విండీస్ పేసర్ల ధాటికి తాళలేక 180 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ పేసర్లలో జేడన్ సీల్స్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షమార్ జోసెఫ్ (Shamar Joseph) నాలుగు వికెట్లు పడగొట్టాడు. జస్టిన్ గ్రీవ్స్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.రెండు వికెట్లు తీసిన కెప్టెన్ఈ క్రమంలో తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆతిథ్య వెస్టిండీస్ 190 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ అత్యధికంగా మూడు వికెట్లు కూల్చగా.. జోష్ హాజిల్వుడ్, కెప్టెన్ కమిన్స్, బ్యూ వెబ్స్టర్ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. స్పిన్నర్ నాథన్ లియాన్కు ఒక వికెట్ దక్కింది.ఇక విండీస్ తొలి ఇన్నింగ్స్లో కమిన్స్ కేసీ కార్టీ (20), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (44) వికెట్లు తీయడం ద్వారా.. అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసీస్ కెప్టెన్గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు రిచీ బెనాడ్ పేరిట ఉండేది. ఇక ఈ జాబితాలో ఓవరాల్గా పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రథమ స్థానంలో ఉండగా.. కమిన్స్ రెండో స్థానానికి చేరుకున్నాడు.టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్లు🏏ఇమ్రాన్ ఖాన్(పాకిస్తాన్): 1982-1992 మధ్య కాలంలో కెప్టెన్గా 187 వికెట్లు🏏ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా): 2021-2025* మధ్య కాలంలో కెప్టెన్గా 139 వికెట్లు🏏రిచీ బెనాడ్ (ఆస్ట్రేలియా): 1958- 1963 మధ్య కాలంలో కెప్టెన్గా 138 వికెట్లు🏏గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్): 1965- 1972 మధ్య కాలంలో కెప్టెన్గా 117 వికెట్లు🏏డానియల్ వెటోరి (న్యూజిలాండ్): 2007-2011 మధ్య కెప్టెన్గా 116 వికెట్లు🏏కపిల్ దేవ్ (ఇండియా): 1983- 1997 మధ్య కాలంలో కెప్టెన్గా 111 వికెట్లు.చదవండి: సచిన్ సర్ కొడుకు.. అర్జున్పై ఎలా అరవగలను?.. కెప్టెన్గా ఉన్నపుడు జరిగిందిదే!
బిజినెస్

బీఎస్ఎన్ఎల్ ఫ్లాష్ సేల్ త్వరలో.. ఎలాంటి ఆఫర్లు ఉంటాయో..
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) త్వరలో ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఫ్లాష్ సేల్ ద్వారా వినియోగదారులకు ఉచిత డేటా, బ్రాడ్ బ్యాండ్ డీల్స్ లేదా డిస్కౌంట్లు లభించనున్నాయి. దేశంలో ఇటీవలే 5జీ సేవలను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్ కార్డుల డోర్ డెలివరీని కూడా ప్రారంభించింది. తాజాగా వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు త్వరలో బీఎస్ఎన్ఎల్ఫ్లాష్ సేల్ ఉంటుందని ప్రకటించింది.బీఎస్ఎన్ఎల్ ఫ్లాష్ సేల్ వివరాలుఫ్లాష్ సేల్ గురించి బీఎస్ఎన్ఎల్ ఎక్స్ (ట్విట్టర్) లో టీజర్ను పోస్ట్ చేసింది. దానితో పాటు ఉన్న వీడియో క్లిప్ ఇలా ఉంది.. "ఏదో పెద్దది ల్యాండ్ కాబోతోంది! ఊహించని అనుభూతిని అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అయితే ఫ్లాష్ సేల్ తేదీని మాత్రం వెల్లడించకుండా త్వరలోనే రానుందని పేర్కొంది. సేల్ సమయంలో ఎలాంటి ఆఫర్లు ఉంటాయో ఊహించండి అంటూ టీజ్ చేసింది. టీజర్ ప్రకారం బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఉచిత డేటా, బ్రాడ్ బ్యాండ్ డీల్స్ లేదా భారీ డిస్కౌంట్లు లభించవచ్చు.వేగంగా వినియోగదారులను కోల్పోతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ ఫ్లాష్ సేల్ చేపడుతుండటం గమనార్హం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన టెలికాం సబ్స్క్రిప్షన్ డేటా ప్రకారం ఏప్రిల్లో బీఎస్ఎన్ఎల్ మొత్తం 2 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. ఇదే కాలంలో యాక్టివ్ బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1.8 మిలియన్లు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

‘సారీ సర్.. వెజిటేరియన్ ఫ్యామిలీ కావాలి’
చెన్నైలో అద్దెకు ఉండేందుకు ఫ్లాట్ల కోసం వెతుకుతున్న ఓ వ్యక్తికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. మీలో చాలామందికి ఇలాంటి అనుభవమే ఎదురై ఉంటుంది. ఇదే అంశంపై ఆన్లైన్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ రోజుల్లో దాదాపు చాలామందికి ముక్కలేనిదే ముద్దదిగదనే ధోరణి వచ్చేసింది. అలాంటిది నాన్వెజ్ తింటే ఇల్లు అద్దెకు అవ్వబోమని ఓ యజమాని చెప్పడం చర్చకు దారితీసింది.సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ రంగస్వామి అనే వ్యక్తి చెన్నైలో ఇంటి అద్దె కోసం వెతుకుతున్నాడు. ఓ ఫ్లాట్ యజమానిని వాట్సప్ ద్వారా సంప్రదించాడు. ‘మీరు నాన్వెజ్ తింటే ఇల్లు అద్దెకు ఇవ్వబోం. సారీ సర్.. వెజిటేరియన్ ప్యామిలీ కోసం చూస్తున్నాం’ అంటూ యాజమాని చెప్పాడు. దాంతో ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిబంధనలు పెట్టడంపై ప్రశాంత్ ఆందోళన చెందుతూ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను స్క్రీన్షాట్ తీసి సామాజిక మాధ్యామాల్లో షేర్ చేశారు. ‘చెన్నైలో అద్దెకు ఫ్లాట్లు దొరకాలంటే నాన్ వెజ్ తినడం హానికరం’ అని ఆ పోస్ట్కు క్యాప్షన్ పెట్టారు.Eating non veg is injurious to finding flats for rent in Chennai . pic.twitter.com/MyWWYuJ0vB— Prashanth Rangaswamy (@itisprashanth) June 26, 2025ఇదీ చదవండి: సిబిల్ సరిగా లేదని ఎస్బీఐ ఉద్యోగం రద్దుమీలో లేదా మీకు తెలిసిన వారిలో చాలామంది ఈ సమస్యను ఏదుర్కొనే ఉంటారు. ఈ తంతు ఇంకెంత కాలం అంటూ కొందరు ఈ పోస్ట్కు రిప్లై ఇస్తుంటే.. సైలెంట్గా వేరే ఇల్లు చూసుకోండంటూ ఇంకొందరు చెప్పారు. ‘నేను శాకాహారినే. కానీ చుట్టూ మాంసం తినేవారున్న యూరప్లో నివసించాను. ఎప్పుడూ సమస్య లేదు. కానీ ఇక్కడ, ఈ ఆంక్షలు హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి’ అని ఒక యూజర్ అన్నారు. అయితే కొందరు మాత్రం తమ ఆస్తిని ఎవరికి అద్దెకు ఇవ్వాలో నిర్ణయించే హక్కు ఇంటి యజమానులకు ఉందని తెలిపారు.

సిబిల్ సరిగా లేదని ఎస్బీఐ ఉద్యోగం రద్దు
సిబిల్ స్కోర్ సరిగాలేని కారణంగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీఓ) పోస్టులో ఉన్న ఓ అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. నియామకానికి సంబంధించిన అన్ని పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ అభ్యర్థి గతంలో చేసిన క్రమరహిత చెల్లింపులు, సిబిల్ స్కోర్ను పరిగణించి రిక్రూట్మెంట్ రద్దు చేశారు.ఎస్బీఐ తన నియామకాన్ని రద్దు చేసినందుకు మాద్రాస్ హైకోర్టులో ఆ అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశాడు. దాన్ని పరిశీలించిన మద్రాస్ హైకోర్లు ఎస్బీఐ చర్యలను సమర్థించింది. నియామక నోటిఫికేషన్లో స్పష్టంగా సిబిల్ స్కోర్, గత ఆర్థిక లావాదేవీల గురించి ఎస్బీఐ తెలిపిందని పేర్కొంది. జస్టిస్ ఎన్.మాలా ఈ కేసులో తీర్పు చెబుతూ ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఉద్యోగాలకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అన్నారు. ఎస్బీఐ రిక్రూట్మెంట్ క్లాజ్ (క్లాజ్ 1(ఈ)) ప్రకారం సిబిల్ లేదా ఇతర ఏజెన్సీల నుంచి నెగెటివ్ క్రెడిట్ హిస్టరీ లేదా ప్రతికూల రిపోర్టులు ఉన్న అభ్యర్థులు అనర్హులని చెప్పారు. నియామకానికి ముందే బకాయిలు చెల్లించినట్లు అభ్యర్థి పేర్కొన్నప్పటికీ క్లీన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ అనేది కేవలం రుణ క్లియరెన్స్ మాత్రమే కాదని, దాన్ని నియామకాల్లో బెంచ్ మార్క్గా పరిగణిస్తారని కోర్టు నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: పిక్సెల్ స్మార్ట్పోన్ల నిషేధంసిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గాలుక్రెడిట్ కార్డు బిల్స్, ఈఎంఐ వంటివి సకాలంలో చెల్లించాలి. ఇది మీ సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ.. గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి.లోన్ కోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్ను తగ్గిస్తుంది.మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసి ఇవ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే.. హామీదారుగా ఉండటానికి అంగీకరించండి.క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఖర్చులను కొంత ఆచితూచి చేయాల్సి. ఖర్చులు పెరిగితే.. మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.సిబిల్ స్కోరును పెంచుకోవడానికి సరైన మార్గం.. క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు. సకాలంలో తిరిగి చెల్లించడం. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు.

పిక్సెల్ స్మార్ట్పోన్ల నిషేధం
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్కు జపాన్ కోర్టులో చుక్కెదురైంది. గూగుల్ పేటెంట్ ఉల్లంఘించిందంటూ వేసిన దావాకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. జపాన్లో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ఫోన్ల అమ్మకాలను నిషేధించాలని పేర్కొంది. పేటెంట్ పొందిన ఎల్టీఈ టెక్నాలజీని అనుమతి లేకుండా గూగుల్ చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ ఇటీవల కోర్టులో వేసిన దావాకు అనుకూలంగా తీర్పు వెలువడింది.ఈటీన్యూస్ ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం.. 4జీ నెట్వర్క్లో ఉపయోగించే నిర్దిష్ట కమ్యూనికేషన్ పద్ధతిపై వివాదం మొదలైంది. ఎల్టీఈ టెక్నాలజీపై జపాన్లో ఇప్పటికే పేటెంట్ తీసుకున్నట్లు పాన్టెక్ సంస్థ దావాలో పేర్కొంది. దేశ చట్టాలకు విరుద్ధంగా గూగుల్ పిక్సెల్ ఫోన్లో ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిపింది. దాంతో విచారణ జరిపిన జపాన్ కోర్టు ఆ దేశంలో పిక్సెల్ సిరీస్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ‘అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్’ లేదా ఏసీకే అని పిలువబడే నియంత్రణ సిగ్నల్ పరికరాలు, బేస్ స్టేషన్ల మధ్య కమ్యునికేషన్ ఎలా ప్రసారం అవుతుందనే దానిపై కంపెనీ, దావా వేసిన వారిలో పరస్పరం భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఈ ఎల్టీఈ టెక్నాలజీ జపాన్ పేటెంట్ చట్టం కింద సంరక్షించబడుతుంది. దాంతో జపాన్ కోర్టు చర్యలు తీసుకుంది.ఇదీ చదవండి: పుత్తడి ప్రియుల్లో కోటి ఆశలు.. బంగారం తగ్గుముఖంకోర్టులో దావా వేసిన పాన్టెక్ కంపెనీ స్వయంగా స్మార్ట్ ఫోన్ వ్యాపారం నుంచి నిష్క్రమించినప్పటికీ, దాని మిగిలి ఉన్న పేటెంట్లు ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నట్లు తెలిపింది. గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో సరైన లైసెన్సింగ్ లేకుండా ఈ సాంకేతికతను ఉపయోగించాయని టోక్యో డిస్ట్రిక్ట్ కోర్టు తెలిపింది. దాంతో ఈ మోడళ్ల అమ్మకాలపై మాత్రమే కాకుండా దిగుమతులు, ప్రకటనలు, జపాన్లో ఈ మోడళ్ల ప్రదర్శనపై కూడా నిషేధాన్ని విధించింది. విచారణ సందర్భంగా కంపెనీ ప్రవర్తనపై కోర్టు తీవ్ర విమర్శలు చేసింది. గూగుల్ది ‘చిత్తశుద్ధి లేని వైఖరి’గా అభివర్ణించింది.
ఫ్యామిలీ

విదేశీ వంటకాలకు కేరాఫ్గా భాగ్యనగరం..!
భాగ్యనగరం రుచికరమైన కాంటినెంటల్ వంటకాలకు నెలవన్న విషయం విదితమే. అయితే ప్రస్తుతం నగరంలో సియోల్, బ్యాంకాక్, టోక్యో వంటి ఆసియన్ దేశాలకు చెందిన వినూత్న రుచులకు కేంద్రంగా మారుతోంది. ఇందులో భాగంగా గన్రాక్తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో తమాషా పేరుతో ఆసియన్ వెజ్ కెఫేలు నగరంలోని ఫుడ్ లవర్స్కు సరికొత్త రుచులను అందిస్తున్నాయి. ఆసియా వంటకాలకు కొత్త దిశ చూపేలా ప్రారంభమైన తమాషా 100 శాతం శాకాహారి వంటకాలతో, ఓల్డ్ స్కూల్ రెట్రో లుక్తో, లైవ్ మ్యూజిక్తో, ఓపెన్ ఎయిర్లో, యాంటీ ఫొటోలు తీసుకునే స్పాట్లతో ఆకర్షిస్తున్నాయి.నగరవాసులకు ప్రతిదీ వింతే.. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహారం విషయంలో కొత్త వెరైటీలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. పైగా నగరంలోని ఆహార ప్రియులు కొందరు, ఆహ్లాదం కోసం కొందరు రెగ్యులర్గా రెస్టారెంట్లు, కెఫేలు, హోటళ్లను సందర్శిస్తుంటారు. వీరిలో కొందరు ఆకట్టుకునే వాతావరణం కోసం.. అద్భుతమైన యాంబియన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు నిర్వాహకులు కూడా కొత్త తరహా యాంబియన్స్ కోసం అన్వేషిస్తుంటారు. ఇందులో భాగంగానే నగరంలో తమాషా డిషెస్ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ సందర్శకులను, ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు వివిధ దేశాలకు చెందిన వెరైటీ వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతోంది.. ముఖ్యంగా శాకాహార వంటకాలకు ప్రాముఖ్యతను ఇస్తూ.. సియోల్, బ్యాంకాక్, టోక్యో దేశాల ఆహారాలను వండి వడ్డిస్తున్నారు. నోస్టాల్జిక్ అనుభూతి.. అయితే ఈ కెఫే విశిష్టత కేవలం ఆహారంలోనే కాదు –యాంబియన్స్లోనూ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వింటేజ్ టీవీలు, బుక్షెల్ఫ్లు, గిటార్లు, బ్యాంబూ లైట్స్, ఆర్టిస్టిక్ కార్నర్లు.. ప్రతి మూల కూడా ఇన్స్టా మెంట్!, స్టేజిపై లైవ్ మ్యూజిక్ వింటూ, వెనక నోస్టాలజిక్ వీడియోలు చూసే అనుభవాన్ని విభిన్నమైన తరహాలో అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఈ మధ్య కాలంలో ఆదరణ పొందుతున్న పికిల్ బాల్ కోర్ట్ కూడా ఉండటం విశేషం! ఇదొక భావోద్వేగం.. ఇది కేవలం కెఫే కాదు– ఒక భావోద్వేగం. మేము మళ్లీ భౌతికంగా అనుసంధానం కావడానికి అనువైన వాతావరణాన్ని ఆహారంతో ముడిపెట్టే ప్రదేశాన్ని సృష్టించాలనుకున్నాం. – ఏకె.సోలంకీ, తమాషా కో–ఫౌండర్ గ్రీన్ థాయ్ మొదలు జైన్ వరకు.. కోరియన్ చిల్లీ టోఫూ నుంచి జపనీస్ కాటేజ్ చీజ్ కాట్సు వరకు, గ్రీన్ థాయ్ కర్రీ నుంచి కిమ్చీ పిజ్జా వరకు – ప్రతి ఐటమ్లోనూ కొత్తదనం, ఆరోగ్యం, ఆసియన్ స్పైసీ టచ్ ఉండేలా చూస్తున్నారు. వెజ్జీ థిన్ క్రస్ట్ పిజ్జా, రోస్ కూలర్, క్యూకంబర్ ఫిజ్ వంటి పానీయాలు, థాయ్ మాంగో స్టికీ రైస్ వంటి డెజర్ట్స్తో వావ్ అనిపిస్తున్నాయి. జైన్ భోజనాన్ని కోరేవారికీ ప్రత్యేక ఐటమ్స్ సిద్ధంగా ఉన్నాయి.

‘మిసెస్ ఆసియా వరల్డ్–2025’ విజేత రేవతి
యుఎస్తో పాటు భారత్లో 16 ఏళ్లకు పైగా సామాజిక సేవ, మహిళా సాధికారత, ప్రపంచ మానవతా విలువల కోసం కృషి చేస్తున్నందుకు గానూ ‘మిసెస్ ఆసియా వరల్డ్ విన్నర్–2025’ కిరీటాన్ని నగరానికి చెందిన డాక్టర్ రేవతి దక్కించుకున్నారు. ఈ విషయాన్ని మనస్వ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలైన డాక్టర్ సూర్య రేవతి మెట్టుకూరు గురువారం తెలిపారు. జూన్ 22న దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత మహిళగా ఈ అరుదైన గౌరవం దక్కిందని అన్నారు. ఐటీ, ఫైనాన్స్, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో సీఈఓగా పనిచేశాసిన, తెలంగాణ రాష్ట్రంలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సంక్షేమం, యువత ఉపాధిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధించినందుకు రాష్ట్రపతి అవార్డు పొందినట్లు తెలిపారు. (చదవండి: నేషనల్ కాదు ఇంటర్నేషనల్..! లగ్జరీ బ్రాండ్లతో జత కట్టిన అందాల భామలు వీరే)

'అమేయ డబ్లి' పాన్ ఇండియా టూర్.
ప్రముఖ పాన్ ఇండియా సింగర్ అమేయ డబ్లి తన స్వర మాధుర్యంతో నగరంలో సందడి చేయనున్నారు. గత 14 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా సంగీత కచేరీలు, ప్రదర్శనలు చేసిన అమేయ డబ్లి ఈ నెల 28న నగరంలోని శిల్పకళావేదికగా లైవ్ కాన్సర్ట్తో సంగీత ప్రియులను అలరించనున్నారు. ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పాన్ ఇండియా కృష్ణా టూర్’లో భాగంగా హైదరాబాద్తో పాటు భారత్లోని 11 నగరాల్లో ఈ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ మ్యూజికల్ టూర్ కృష్ణునిపై మాత్రమే సంగీత విభావరి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇటీవల సన్నాహక కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో ‘సాక్షి’తో ముచ్చటించారు.. ఆ విశేషాలు.. టాలీవుడ్ స్టార్ రాణా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లి మొదలు కపూర్ ఖండన్, రాణీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా, జిందాల్ కుటుంబం, ఇమామి గ్రూప్లోని అగర్వాల్ కుటుంబం, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వంటి లగ్జరీ వేడుకల్లో పాడిన డబ్లి మొదటి సారి నగరంలో సంగీత ప్రదర్శన చేపట్టడం విశేషం. ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. సంగీతం ఒక సాంత్వన, పాటలు ఒక సంతృప్తి..!! నా ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా ప్రదర్శనలిచ్చాను. ఈ సారి వినూత్నంగా కృష్ణుని ఇతివృత్తంతో ఈ పాన్ ఇండియా టూర్ చేయడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా సామాజిక బాధ్యతగా నా సంపాదనలో 25 నుంచి 50 శాతం వరకూ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటాను. ఇందులో భాగంగానే ఏకమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ టూర్ను జైపూర్, జోద్పూర్, సూరత్, ముంబై, పుణె, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో ప్రదర్శిస్తున్నాను. ప్రదర్శనలో 25 శాతం వారికే.. దేశం కోసం నిరంతరం పోరాడుతున్న ఆర్మీ కోసం ప్రత్యేకంగా సంగీత ప్రదర్శనలిచ్చాను. అంతేకాకుండా నా ప్రతి ప్రదర్శనలో 25 శాతం సీట్లు ఆర్మీ వారి కోసం ఉచితంగా కేటాయిస్తాను.. ఈ ఆనవాయితి నగరంలోని ప్రదర్శనలో కూడా కొనసాగుతోంది. ఈ ప్రదర్శన కోసం మొదటిసారి తెలుగు పాటను కూడా పాడబోతున్నా. అనాది నుంచి హైదరాబాద్కు సంగీతానికీ విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడి సంగీత ప్రియుల గురించి దేశవ్యాప్తంగా తెలుసు. 16 మంది ప్రముఖ సంగీత విద్వాంసులు, ఐదుగురు ప్రముఖ సింగర్లు.. మొత్తం నాతో పాటు 25 మంది భారీ బృందంతో ఈ ప్రతిష్టాత్మక కచేరీ హైదరాబాద్ నగరాన్ని సంగీత సాగరంలో ముంచెత్తనుంది. – సింగర్ అమేయ డబ్లి

ట్యూషన్ ఎవరికి అవసరం? ట్యూషన్ టీచర్ ఎలా ఉండాలి?
మూడేళ్లు రావడంతోటే పిల్లల్ని స్కూల్లో వేయడం,ఉద్యోగాల నుంచి వచ్చే వరకూ ట్యూషన్లో ఉండేలా ప్లాన్ చేయడంమన దగ్గర సర్వసాధారణం.ఏ వయసు పిల్లలకైనా ఏ తరగతుల్లో అయినాట్యూషన్ చెప్పించడం ప్రిస్టేజ్ ఇష్యూగా మారింది.నిజంగా పిల్లలకు ట్యూషన్ అవసరమా? ఏ వయసులో అవసరం? దాని వల్ల జరిగే మంచి ఏమిటి, ప్రతికూలత ఏమిటి... తెలుసుకుందాం.మన దగ్గర ట్యూషన్ చెప్పించడం రెండు ఆలోచనల్లో భాగంగా ఉంటుంది. ఒకటి: పిల్లలు బాగా చదువుకోవాలి రెండు: టైమ్ వేస్ట్ జరగకుండా ట్యూషన్కు పంపడం మంచిది.ఈ రెండో విధానానికి తెలివైన పిల్లలు, తెలివితక్కువ పిల్లలు అనే తేడా లేదు. ట్యూషన్కు పంపడం వల్ల వారిని క్రమశిక్షణలో పెడుతున్నామనే సంతృప్తి తప్ప. దీనివల్ల తెలివైన పిల్లల వికాసానికి కొంతమేర నష్టం జరగొచ్చు. ఎందుకంటే ఈ పిల్లలు స్వయంగా చదువుకోగలరు. స్వయంగా చదువుకోవడం వల్ల వారికి ఇంకా తెలివితేటలు పెరుగుతాయి. ఇలాంటి పిల్లలను ట్యూషన్కు పంపితే భారం టీచరు మీద వేసి తమ తెలివికి విరామం ప్రకటించవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలు సాయంత్రాలు ఇంట్లో ఉండకుండా ఏదో ఒక ట్యూషన్కు వెళ్లడం మంచిది అనే ఆలోచన చేస్తూ ఉంటే ఆ ఆలోచన మీ పిల్లలకు ఏ మేరకు వర్తిస్తుందో గమనించుకోవాలి.అసలు ట్యూషన్ చెప్పించడం ఎవరికి అవసరం?చాలా మంది తల్లిదండ్రులు తమ మూడేళ్ల చిన్నారులను కూడా ట్యూషన్లో చేర్పిస్తున్నారు. ఇది వారికి మేలు చేయక΄ోగా మొత్తం పెరుగుదల, ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా పిల్లలకు ఆరేళ్లు వచ్చాక ట్యూషన్ గురించి ఆలోచించవచ్చు. హైస్కూల్ స్థాయి వరకు వీరికి ట్యూషన్ అవసరం కావచ్చు. అయితే అందరికీ ఇది అక్కర్లేదు. మరి ఎవరికి కావాలి?చదువులో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు... మేథ్స్, సైన్స్ వంటి సబ్జెక్ట్లు స్కూల్లో చెప్పినవి మరింత అర్థం కావాలంటే ట్యూషన్ పెట్టాలి. కొందరు పిల్లలకు చదువు చాలా ఆసక్తిగా ఉంటుంది. వీరు స్కూల్లో చదివిందే కాక ఇంకా నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు. ట్యూషన్ పెడితే టీచర్ను సందేహాలు అడిగి ఆ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ కావాలనుకుంటే లేదా పరీక్షల్లో మార్కులు బాగా రావాలనుకుంటే అలాంటి పిల్లలకు ట్యూషన్ కావాలి. కొందరు పిల్లలకు స్వతహాగా తెలివితేటలు ఉన్నా టీచరు సహాయం ఉంటేనే ఆత్మవిశ్వాసంతో చదువుకుంటారు. లేదంటే ఒత్తిడి ఫీలవుతారు. ఇలాంటి వారికి ట్యూషన్ అవసరం.కొందరు పిల్లలు చదువుతున్న స్కూళ్లలో టీచర్లు సరిగా ఉండరు. లేదా ఫలానా సబ్జెక్ట్ను సరిగ్గా చెప్పరు. పిల్లలు ఇది గమనించి ఇంట్లో చెబుతారు. అప్పుడు ఆ సబ్జెక్టుల్లో తప్పనిసరిగా ట్యూషన్ పెట్టించాలి. కొందరు పిల్లలకు తల్లిదండ్రులే ట్యూషన్ చెప్పగలరు. కాని వారికి వివిధ కారణాల వల్ల వీలు ఉండదు. ట్యూషన్ పెట్టించి తాము పైనుండి అజమాయిషీ చేద్దామనుకుంటే అలాంటి సమయంలో ట్యూషన్ పెట్టించాలి. స్కూల్లో ఎన్ని పిరియడ్స్ ఉన్నాయి, వారానికి ఐదు రోజుల బడినా లేదా ఆరు రోజుల బడినా అనేదాన్ని బట్టి కూడా ట్యూషన్ అవసరమా కాదా అనేది నిర్ణయించాలి. స్కూల్లో పిరియడ్లు రోజుకు 8 ఉండి, వారానికి ఆరు రోజులు బడి నడుస్తుంటే అలాంటి పిల్లలకు రోజూ ట్యూషన్ చాలా భారమవుతుంది. వీరికి వారానికి ఒకరోజు ట్యూషన్ చాలు. అదే ఐదు రోజుల బడి ఉంటే వారానికి రెండు రోజులు ట్యూషన్ చాలు. అంతిమంగా పిల్లలు చదువుకోవాలి... బెంబేలు పడకూడదు.ఆన్లైన్ ట్యూషన్లు పెట్టించవచ్చని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. ఇవాళ ఆన్లైన్లో ఇబ్బడి ముబ్బడిగా ట్యూషన్లు ఉన్నాయి. కాని ముఖాముఖి ట్యూషన్లే ఎక్కువ ప్రభావవంతమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక ఆన్లైన్ ట్యూషన్లను వీలైనంతగా పరిహరించాలి. (Hyderabad: సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్కు నగరం చిరునామా)ట్యూషన్ టీచర్ ఎలా ఉండాలి?చాలా మధ్యతరగతి ఇళ్లలో ఇరుగు పొరుగున ఎవరైనా ట్యూషన్ చెబుతుంటే వారి దగ్గరకు ట్యూషన్కు పంపి చేతులు దులుపుకోవడం అలవాటు. కాని ట్యూషన్కు పంపాలంటే ఆ ట్యూషన్ చెప్పేవారి యోగ్యతలు కూడా కచ్చితంగా చూడాలి.వారి విద్యార్హత ఏమిటి? : తాను బోధించే సబ్జెక్టులో మంచి నైపుణ్యం కలిగి ఉందా? విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలుగుతోందా? క్లిష్టమైన భావనలను సులభంగా అర్థమయ్యేలా వివరించగలగాలి.బోధనా నైపుణ్యాలు : సహనం ఏ మేరకు ఉంది. చిరాకు పడుతున్నదా? విద్యార్థులు తప్పులు చేసినప్పుడు లేదా ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడినప్పుడు, ఓపికగా మరియు అర్థమయ్యేలా వారికి వివరించగలుగుతోందా?గుంపును కూచోబెట్టి ‘చదువుకోండ్రా’ అనే టీచర్లు కూడా ఉంటారు. ఈ గుంపులో రకరకాల తరగతుల విద్యార్థులు ఉంటారు. ఇలాంటి ట్యూషన్ వల్ల ఉపయోగం లేదు. మన పిల్లలనే కేంద్రంగా చేసుకుని ట్యూషన్ చెప్పే టీచర్ వద్దకే పంపాలి.
ఫొటోలు
అంతర్జాతీయం

NATO Summit 2025: డాడీ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కొత్తగా ఒక నిక్నేమ్ వచ్చి చేరింది. అదేమిటో తెలుసా?.. డాడీ. అంటే నాన్న అని తెలిసిందేగా. నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ను డాడీ అని పిలుస్తున్న వీడియోను వైట్హౌస్ తాజాగా విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్ను పక్కనే ఉన్న నాటో చీఫ్ మార్క్ రుట్టే సరదాగా డాడీ అని సంబోధించారు. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను ‘డాడీస్ హోమ్. హే, హే, హే, డాడీ’ అని శీర్షికతో శ్వేతసౌధం షేర్ చేసింది. ఇది జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు తమకు తోచిన రీతిలో ప్రతిస్పందిస్తున్నారు. నెదర్లాండ్స్లోని హేగ్ నగరంలో నాటో సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ముగిసిపోయేలా తానే చొరవ తీసుకున్నానని ఆయన చెప్పారు. ఇంతలో నాటో చీఫ్ మార్క్ రుట్టే మాట్లాడుతూ.. డాడీ (ట్రంప్) ఇరు దేశాలకు బలమైన భాషలో చెప్పారని వ్యాఖ్యానించారు. తర్వాత డాడీ అన్ని సంబోధనపై ట్రంప్ స్పందించారు. అది చాలా ఆప్యాయత, అనురాగంతో కూడిన సంబోధన అని ఆనందం వ్యక్తం చేశారు.

అమెరికా చెంప చెళ్లుమనిపించాం
దుబాయ్: ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులు ప్రయోగించి ఇరాన్ తన సత్తాను చాటిందని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. దాడులతో అమెరికా చెంప చెళ్లుమనిపించామని ఆయన అన్నారు. యుద్ధంలో మేమే గెలిచామని ఆయన ప్రకటించారు. ఇరాన్పై బాంబుదాడులు చేసిన అమెరికాకు ఒనగూరింది శూన్యమని ఆయన ఎద్దేవాచేశారు. మరోసారి ఇరాన్పై దాడికి సాహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. యుద్ధం ముగిశాక తొలిసారి ఖమేనీ ఒక వీడియో సందేశం ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్లకు హెచ్చరికలు చేస్తూ పది నిమిషాలకుపైగా ఖమేనీ మాట్లాడిన ఆ వీడియోను ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ గురువారం ప్రసారం చేసింది. I offer my congratulations on the victory over the fallacious Zionist regime.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025 My congratulations on our dear Iran’s victory over the US regime. The US regime entered the war directly because it felt that if it didn’t, the Zionist regime would be completely destroyed. It entered the war in an effort to save that regime but achieved nothing.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025 The fact that the Islamic Republic has access to key US centers in the region and can take action whenever it deems necessary is a significant matter. Such an action can be repeated in the future too. Should any aggression occur, the enemy will definitely pay a heavy price.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025అమెరికా రాకుంటే ఇజ్రాయెల్ ధ్వంసమయ్యేది‘‘యుద్ధంలో ఇజ్రాయెల్ను రక్షించేందుకే అమెరికా తప్పని పరిస్థితుల్లో రంగప్రవేశం చేసింది. అమెరికా గనక జోక్యంచేసుకోకపోయి ఉంటే మా దాడుల్లో ఇజ్రాయెల్ దారుణంగా ధ్వంసమయ్యేది. అయినా సరే అమెరికా స్థావరాలపైనా క్షిపణుల్ని ప్రయోగించి మా సత్తా చాటాం. ఖతార్లోని దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్బేస్పై క్షిపణి దాడులు చేశాం. ఇరాన్పై అమెరికా దాడులను ట్రంప్ అతిశయోక్తిగా చెప్తున్నారు. నిజానికి ఇరాన్పై దాడులతో అమెరికా సాధించింది శూన్యమే. జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ నాశనమవుతుందన్న అంచనాతోనే అమె రికా యుద్ధంలోకి అడుగుపెట్టింది. కానీ లక్ష్యసాధనలో పూర్తిగా విఫలమైంది. మా ఇస్లామిక్ రిపబ్లిక్ జయకే తనం ఎగరేసింది. ఇది అమెరికాకు ఘోర పరాభవం. భవిష్యత్తులో మరోసారి మాపై దాడి చేయాలని అమెరికా భావిస్తే ఇంతకంటే పెద్దస్థాయిలో పరాభవం ఎదుర్కోక తప్పదు’’ అని ఖమేనీ హెచ్చరించారు. అయితే ఈ వీడియోలో ఖమేనీ కాస్తంత నీరసంగా కనిపించారు.

దేశపు యువరాణి ట్రంప్ను వెక్కిరించింది?!.. వీడియో వైరల్
ఆమ్స్టర్డ్యామ్: అధికారిక పర్యటనలో భాగంగా నెదర్లాండ్ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను (Donald Trump) ఆ దేశపు క్వీన్ మాక్సిమా (Queen Maxima) వెక్కిరించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల నెదర్లాండ్స్ (Netherlands)లో నాటో సమ్మిట్ జరింగింది. ఆ సమ్మిట్కు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. అక్కడ రాజకీయ అతిథిగా హుయిస్ టెన్ బోష్ అనే రాయల్ ప్యాలెస్లో కింగ్ విలెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమా అతిథిలుగా వచ్చారు. అక్కడ జరిగిన అధికారిక ఫోటోషూట్ సమయంలో ట్రంప్ మాట్లాడిన తరవాత, క్వీన్ మాక్సిమా అతని ముఖభావాలను అనుకరించినట్లు కనిపించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని భావించగా, మరికొంతమంది మాత్రం ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అంటున్నారు. ఇది నిజంగా ట్రంప్ను వెక్కిరించారా? లేక కేవలం సరదాగా జరిగిన సంఘటనా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. Queen #Máxima of the #Netherlands mocked #Trump's facial expressions.🙃No hint of condemnation – just understanding. pic.twitter.com/hNP3Rp2UaM— Boris Alexander Beissner (@boris_beissner) June 25, 2025

Bangui: స్కూల్లో తొక్కిసలాట.. 26 మంది విద్యార్థులు మృతి
బంగుయ్: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బంగుయ్లోని బార్తెలెమీ బోగాండా హై స్కూల్లో గురువారం ( జూన్ 26)న ఘోర ప్రమాదం జరిగింది.విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే సమయంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా విద్యార్థులు భయంతో పరుగులు తీయగా, తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 29 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 260 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో 16 మంది బాలికలు ఉన్నారు.ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 5,000 మంది విద్యార్థులు పరీక్షల కోసం అక్కడ ఉన్నారు. ఈ ఘటనపై ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. గాయపడిన విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన ఆ దేశ విద్యా చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటనగా నిలిచింది.#Breaking Une #bousculade suite à une explosion de transformateur fait une dizaine de morts cet après-midi au lycée Barthélémy #Boganda de #Bangui en #Centrafrique 🇨🇫. De nombreux blessés ont été transportés vers des hopitaux proches. pic.twitter.com/5loUFDnh5n— KOUAM JOEL HONORE (@honore123) June 25, 2025
జాతీయం

శుభాంశు వెంట అంతరిక్షంలోకి జ్యోతి, ఉమ, సూర్య.. ఎలా తీసుకెళ్లాడంటే?
ఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయానికి తెరలేచింది. భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ రోదసిలోకి దూసుకెళ్లి కెప్టెన్ శుభాంశు శుక్లా మరో చరిత్ర లిఖించారు. గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి విజయవంతంగా ప్రవేశించారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు అది భూమి నుంచి 418 కి.మీ.ల ఎత్తున ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. తర్వాత ఐఎస్ఎస్తో డ్రాగన్ అనుసంధాన (డాకింగ్) ప్రక్రియ కొనసాగాయి. శుభాంశు బృందం ఆనంద హేలను కెమెరాల్లో ఆ క్షణాలను బంధించి భద్రపరిచారు. ఇక, శుభాంశు బృందం 14 రోజులపాటు అక్కడ గడపనుంది. 60కి పైగా వినూత్న ప్రయోగాలు చేసి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది.14 పాటు పరిశోధనలు..అయితే, ఈ అంతరిక్ష ప్రయాణానికి శుభాంశు తనతో పాటు కేరళకు చెందిన జ్యోతి, ఉమ, విజయ్, సూర్యను కూడా తీసుకెళ్లారట. మరి ఈ జ్యోతి, ఉమను శుభాంశు ఎలా తీసుకెళ్లాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటంటే.. శుక్లాతో కూడిన నలుగురు సభ్యుల బృందం ఆక్సియం-4 మిషన్లో భాగంగా 14 రోజుల పాటు అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు చేయనున్నారు. ఈ ప్రయోగాల్లో విత్తనాల అధ్యయనం అనేది అతిముఖ్యమైనది. ఈ అంతరిక్ష ప్రయోగంలో ఉపయోగించనున్న అన్ని విత్తనాలు కేరళ నుంచి పంపినవే కావడం గమనార్హం. వీటిని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వెల్లాయణి, పట్టాంబి వంటి ప్రాంతీయ కేంద్రాలు అభివృద్ధి చేశాయి.విత్తనాలను అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో ఉంచి, తిరిగి భూమికి తీసుకొచ్చిన తర్వాత వాటిలో చోటుచేసే మార్పులను అధ్యయనం చేస్తారు. తద్వారా వాతావరణ మార్పులకు తట్టుకునే పంట రకాలను అభివృద్ధి చేయాలన్నది ఈ పరిశోధనల ప్రధాన లక్ష్యం. ఈ అధ్యయనం శాస్త్రీయంగా వాతావరణ మార్పులతో పోరాడేలా విత్తనాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకుల నమ్మకం.ఇంతకీ జ్యోతి, ఉమ ఎవరంటే?జ్యోతి, ఉమ అనేవి కేరళలో చాలా పాపులర్ వరి విత్తనాలు. ఈ రెండు అధిక దిగుబడినిచ్చే వరి రకాలు. వరి సాగు కోసం రైతులు వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. వరి విత్తనాలతో పాటు కింద చెప్పిన సీడ్స్ను కూడా శుభాన్షు తనతో తీసుకెళ్లారు. వీటిని పలుచోట్లలో అభివృద్ధి చేశారు. వ్యోమనౌకలో బరువు పరిమితి కారణంగా ఇస్రో (ISRO), ఈఎస్ఏ (ESA), నాసా (NASA) సూచనల మేరకు ఈ విత్తనాలను తగిన పరిమాణంలో తీసుకెళ్లారు. వరి విత్తనాలు – 20 గ్రాములు, టమాటా, వంకాయ, నువ్వులు, కూట్ల పప్పులు – ఒక్కోటి 4 గ్రాములు చొప్పున తీసుకెళ్లారు.జ్యోతి: (పట్టాంబి పరిశోధన కేంద్రం)ఉమ: (మంకొంబు పరిశోధన కేంద్రం)టమాటా: వెల్లాయణి విజయ్ (వెల్లాయణి వ్యవసాయ కళాశాల)కుట్ల పప్పు: కనకమణి (పట్టాంబి ప్రాంతీయ పరిశోధన కేంద్రం)వంకాయ: సూర్య (త్రిస్సూర్ వ్యవసాయ కళాశాల)నువ్వులు: తిలతార (కాయంకుళం ఓనట్టుకర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది)ఈ ప్రయోగం ఎందుకు?ఈ ప్రయోగం ద్వారా విత్తనాలు అంతరిక్ష పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందిస్తాయి?. ఎలా మనుగడ సాగిస్తాయో తెలుసుకోవచ్చు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత మొలకెత్తించి, వాటిలో సంభవించిన శారీరక, జన్యు మార్పులను విశ్లేషిస్తారు. భారతదేశం ఈ తరహా ప్రయోగాన్ని మొదటిసారిగా చేపడుతోంది. గతంలో చైనా ఇలాంటి ప్రయోగాలు చేసింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి విత్తనాలు అంతరిక్షానికి వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ ప్రయోగం విజయం సాధిస్తే అది కేవలం కేరళకే కాకుండా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి శాస్త్రీయ పురోగతిలో ఓ మైలురాయి అవుతుంది. అటు శుభాంశు సైతం చరిత్రలో నిలిచిపోతారు. ఇదిలా ఉండగా.. ఫాల్కన్ 9 రాకెట్ రాకెట్ లాంచ్ అవ్వడానికి కొన్ని గంటల ముందు తన భార్య కోసం శుభాంశు ఒక భావోద్వేగమైన లేఖ రాశారు. అందులో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ.. తన ప్రయాణంలో నువ్వులేని లేటుని భర్తీ చేయలేనిది అని భావోద్వేగంగా రాశారు. దానికి శుభాంశు భార్య కామ్నా గర్వంతో కూడిన ప్రేమతో స్పందించారు. అదే సమయంలో, శుభాన్షు తల్లి ఆశా శుక్లా, యాక్సియం మిషన్-4కు ముందు తన కుమారుడికి కోడలు అందించిన మద్దతును ప్రశంసించారు. ‘ఇది మనందరికీ గర్వకారణమైన క్షణం. దేశంలోని త్రివేణి నగర్కు చెందిన ఒక అబ్బాయి ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నాడని అందరూ సంతోషంగా ఉన్నారు. మా కోడలు లేకుండా ఇది సాధ్యం కాదు. ఈ విజయంలో తను అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది’ అని ఆమె అన్నారు.

భవనం టెర్రస్ పైకి యువతి.. రీల్స్ పిచ్చే బలి తీసుకుందా?
బెంగళూరు: తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్లిన ఒక యువతి, నిర్మాణంలో ఉన్న భవనంలోని 13వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం రాత్రి ఆ మహిళ తన స్నేహితుల బృందంతో కలిసి పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ భవనానికి వెళ్లిందని పోలీసులు వెల్లడించారు.పార్టీ మధ్యలో యువతి రీల్స్ కోసం టెర్రస్పైకి వెళ్లింది.. అక్కడ వీడియో తీసుకుంటూ కాలుజారి నుంచి కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు బీహార్కు చెందిన యువతిగా గుర్తించారు. నగరంలోని ఓ షాపింగ్ మార్ట్లో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటననుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అయితే, ఆమె రీల్ షూట్ కోసమే భవనం టెర్రస్పైకి వెళ్లినట్లు చెబుతున్నప్పటికి.. ఆమె ఫోన్ నుంచి అలాంటి రికార్డింగ్ ఏదీ లభించలేదని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. ఆ యువతి ప్రమాదవశాత్తు పడిపోయిందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

కాసేపట్లో పూరీ రథయాత్ర.. భారీగా తరలిన భక్తులు
భువనేశ్వర్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్ర కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు పూరీ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అంచనావేసిన అధికారులు, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు.ఇక, జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాముడు, వారి చెల్లి సుభద్ర రథాలలో కొలువై భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాది భక్తులు వెంటరాగా ఈ రథాలు జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి.#WATCH | Odisha: Devotees gather in large numbers at Puri's Jagannath Temple for the annual Rath Yatra, which is set to begin today. pic.twitter.com/jOCJphlKVx— ANI (@ANI) June 27, 2025Every single day, at 214 feet high, a priest fearlessly climbs the Jagannath Temple in Puri without ropes or safety - to change the flag. pic.twitter.com/qgqgLgvmX9— urvi (@itsmiling_face) June 26, 2025సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ, దీనికి భిన్నంగా పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు, ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్ర దేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని.. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. పూరీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా మందిరం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకరోజు యాత్ర తర్వాత మూడు మూర్తులూ ఏడు రోజులపాటు గుండిచా ఆలయంలో విడిది చేస్తారు. తొమ్మిదో రోజున తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు.VIDEO | Odisha: Several foreign devotees gather to attend the Jagannath Rath Yatra in Puri. Here’s what one foreign devotee, Premdas, said: “We came from Vrindavan under the guidance of our Gurudev. We feel extremely happy to be in such a sacred place to have the darshan of… pic.twitter.com/8WwwyPIPzX— Press Trust of India (@PTI_News) June 27, 2025

వీడియో: నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం
ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 2లోని ఓ ప్రైవేట్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటన ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.భారీగా మంటలు వ్యాపించడంతో అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా తెలియలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, గత వారం రోహిణిలోని రిథాల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.#WATCH | Uttar Pradesh | Updated visuals: A fire breaks out at a private firm in Noida Sector 2. Fire tenders are at the spot. Fire being doused. https://t.co/PJBThX8uSH pic.twitter.com/vPSt1vMoFk— ANI (@ANI) June 27, 2025
ఎన్ఆర్ఐ

చెవిరెడ్డి అరెస్ట్ దారుణం: ఆస్ట్రేలియా ఎన్నారైలు
తన జీవితంలో ఏనాడు మద్యం వాసన కూడా తెలియనటువంటి నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఆ కేసులో ఇరికించటం అత్యంత హేయమైన చర్య అని ఆస్ట్రేలియా ఎన్నారైలు ఖండించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని ఏదో ఒక కేసులో ఇరికించటం దారుణమన్నారు. ఈ పరిణామాలు అన్నిటికీ రిటర్న్ గిఫ్టులు కచ్చితంగా ఉంటాయని ఆస్ట్రేలియా ఎన్నారై సూర్యనారాయణ రెడ్డి అన్నారు

పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు
డల్లాస్: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్ సంస్థ సంయుక్తంగా పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు వేల ఆహార కిట్లను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగు ప్రజలు, విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని ఆహార కిట్లను సిద్ధం చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వెనుకబడిన దేశాల్లో వేల మంది చిన్నారుల ఆకలి తీర్చడంలో దోహదపడనుంది. మానవ సేవే మాధవ సేవ అనే నాట్స్ చేపట్టే అనేక కార్యక్రమాల్లో ఉంటుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచుతాయని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని, సమిష్టి శక్తిని చూపించడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలే మంచి ఉదాహరణలు అని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డల్లాస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలకు నాట్స్ నాయకత్వం అభినందించింది. అలాగే స్పాన్సర్లకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సహ కోశాధికారి రవి తాండ్ర, నాట్స్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, నాట్స్ డల్లాస్ జట్టు సభ్యులు బద్రి బియ్యపు, పద్మసుందరి రాతినం, శ్యామల తూనుగుంట్ల తదితరులతో పాటు 20 కి పైగా యువ వాలంటీర్లు పాల్గొన్నారు. సమాజంలో సేవా స్ఫూర్తిని పెంచేలా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డల్లాస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

సెయింట్ లూయిస్లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా సెయింట్ లూయిస్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్లోని మహాత్మగాంధీ సెంటర్లో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక తెలుగు వారు వినియోగించుకున్నారు. నాట్స్ బోర్డు సలహా సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి, డాక్టర్ బాపూజీ దర్శిలు ఈ ఉచిత వైద్య శిబిరంలో సేవలు అందించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు శ్రీనివాస్ మంచికలపూడి, రమేశ్ బెల్లం, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర్ల, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాల, నాగ శ్రీనివాస్ శిష్ట్ల తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న నాట్స్ మిస్సోరీ విభాగాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జూన్ 16 : శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డేగా ప్రకటించిన ఫ్లోరిడా
జాక్సన్విల్, ఫ్లోరిడా, జూన్ 16ను శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే అని ప్రకటించింది. జాక్సన్విల్, ఫ్లోరిడా శ్రీ శ్రీ రవిశంకర్ గారి నిరంతర సేవను.ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సమాజంలో పరస్పర అవగాహన, ఐక్యత, స్వస్థత చేకూరుట కోసం చేస్తున్న నిరంతర ప్రయత్నాలను గౌరవిస్తూ, జూన్ 16 తేదీని అధికారికంగా "శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే" అని ప్రకటించింది. ఈ ప్రకటనను జాక్సన్విల్ మేయర్, నార్త్ ఫ్లోరిడా యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా అందజేశారు. దీని ద్వారా, జాక్సన్విల్ ప్రపంచంలో "శ్రీ శ్రీ రవిశంకర్ దినోత్సవం"ను ప్రకటించిన 32వ నగరంగా నిలిచింది.ఇదీ చదవండి: Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు తప్పిన పెను ప్రమాదం
ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యవేములవాడరూరల్: ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్లకు చెందిన వాణి–లింగయ్యలకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి ఫ్యాన్లు రిపేర్ చేస్తుండగా, తల్లి గ్రామంలోనే గాజులషాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె చేని వైష్ణవి(20) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. 15 రోజుల క్రితం ఇంటికొచి్చంది. పలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది గురువారం ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఇంట్లోకి దూసుకెళ్లిన కారు తప్పిన పెను ప్రమాదంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో సిరిసిల్ల బైపాస్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. టీవీ చూస్తున్న ఇద్దరు చిన్నారులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కామారెడ్డికి చెందిన ఇద్దరు వేములవాడ నుంచి సిరిసిల్ల బైపాస్ మీదుగా కారులో వెళ్తున్నారు. వెంకటాపూర్ వద్ద కుడివైపు మళ్లకుండా ఎదురుగా వెళ్లి వాగుమడి రాజయ్య ఇంటిని ఢీకొట్టారు. ఆ సమయంలో ఇంట్లో టీవీ చూస్తున్న ఇద్దరు చిన్నారులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటికే గ్రామస్తులు గుమిగూడారు. కారు డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. దీంతో కారును అక్కడే వదిలేసి ఇద్దరు పరారయ్యారు. కారులో బీరు బాటిళ్లు, బిర్యాని పొట్లాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నారని చెప్పారు. కారును పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.

మళ్లీ చిక్కిన ఘరానా దొంగ మహ్మద్ సలీం
సాక్షి, సిటీబ్యూరో/పహాడీషరీఫ్: అసలు పేరు మహ్మద్ సలీం... మారు పేరు సునీల్శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు... 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 187 చోరీలు చేశాడు... ఇప్పటి వరకు 25 సార్లు అరెస్టై కటకటాల్లోకి వెళ్ళాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడే సునీల్ గత నెల 5న జైలు నుంచి బయటకు వచ్చాడు... మరో రెండు నేరాలు చేసి బండ్లగూడ పోలీసులకు చిక్కాడు. చోరీ సొత్తుతో ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజం ఈ సునీల్ శెట్టి నైజం. ఈ ఘరానా దొంగను బండ్లగూడ పోలీసులు అరెస్టు చేసినట్లు చంద్రాయణగుట్ట ఏసీపీ ఎ.సుధాకర్ గురువారం వెల్లడించారు. మార్చిన ‘ఆమె’ పరిచయం... ఫతేదర్వాజా సమీపంలోని కుమ్మరివాడికి చెందిన సలీం నిరక్షరాస్యుడు. తొలుత కిరోసిన్ లాంతర్ల కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రికి చెందిన కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం తమ దుకాణంలోనే చోరీలు చేయడం మొదలెట్టాడు. ఈ విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోయి చాదర్ఘాట్లోని ఓ హోటల్లో కారి్మకుడిగా మారాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించడం మొదలెట్టాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్ఘాట్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెళకువలు నేర్చుకున్నాడు. ఇంటి తాళం ముట్టనే ముట్టడు... ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్ళనే టార్గెట్గా చేసుకుంటాడు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే చోరీ చేస్తాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్ఫోన్లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్పాస్ చేస్తాడు. చిన్న టార్చ్లైట్, కటింగ్ ప్లేయర్తో ‘రంగం’లోకి దిగే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచి్చనా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు దృష్టిపెట్టరని ఇలా చేస్తుంటాడు. లోపలకు వెళ్లాక చెంచాల సహా అక్కడ ఉన్న ఉపకరణాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్న ఈ సునీల్శెట్టి ఇప్పుడు ఏడుగురి పిల్లలకు తండ్రి.

తల్లి మృతి.. అనాథలుగా మారిన చిన్నారులు
మంచిర్యాల: భర్త చేతిలో భార్య హతమైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని దర్బాతాండకు చెందిన ఆడె నటరాజన్కు 2021లో మామడ మండలం గాయిది పల్లకి చెందిన సుజాత (25)తో వివాహమైంది. మండల కేంద్రంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నటరాజన్ కోరమండల్ కంపెనీలో పనిచేస్తుండగా సుజాత టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. క్షణికావేశంలో గొంతునొక్కడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తరచూ అదనపు కట్నంకోసం వేధిస్తుండేవాడని, ఈక్రమంలో హత్య చేశాడని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ కాజల్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టింది. కాగా బోథ్ నుంచి మృతదేహాన్ని ఆదిలాబాద్ రిమ్స్కు పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు.

ఛీ.. వీడేం టీచర్.. టెన్త్ నుంచి వేధింపులు.. పెళ్లి తర్వాత..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో చదివే బా లికను వేధించి, లోబర్చుకొని శారీరకంగా వాడుకున్న ఇంగ్లిష్ టీచర్ సాతూరి మధుకర్(52)కు 17 ఏళ్ల కారాగార శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ ఫాస్ట్ట్రాక్ స్పెషల్ జడ్జి సునీత తీర్పు చెప్పారు. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉండే మధుకర్ 2013లో కాల్వశ్రీరాంపూర్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్గా పని చేశాడు. ఆ సమయంలో 10వ తరగతి బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, బలవంతంగా లో బర్చుకున్నాడు. రాత్రి క్లాస్ల పేరిట స్కూల్కు పిలిచి స్టాఫ్ రూమ్లో చాలాసార్లు శారీరకంగా అనుభవించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నను చంపేస్తానని బెదిరించాడు. తర్వాత బాలిక హనుమకొండలో డిగ్రీ చదువుతున్న సమయంలో మధుకర్ అక్కడి కూడా వెళ్లి ఆమెను భయపెట్టి శారీరకంగా వాడుకున్నాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. తాను పిలిచినప్పుడల్లా రాకుంటే ఫొటోలు, వీడియోలు అందరికీ పంపిస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెకు పెళ్లయినా వదిలిపెట్టలేదు. ఆమె భర్తకు ఫోన్లో ఫొటోలు, వీడియోలు పంపించాడు. అవి చూసిన ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై ఎస్కే జానీపాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని రిమాండ్కు పంపించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాదం రమేశ్ సాక్షులను ప్రవేశపెట్టి తన వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేయడంలో కీలకపాత్ర పోషించారు. జడ్జి సునీత సాక్ష్యాధారాలు పరిశీలించి నిందితుడికి కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించారు.