ప్రధాన వార్తలు

ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
సాక్షి, అమరావతి: అక్రమ కేసులపై కూటమి సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట లభించింది. కేఎస్ఆర్(కొమ్మినేని శ్రీనివాసరావు) లైవ్ షోకు సంబంధించి సాక్షి టీవీపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. సాక్షి టీవీపై తదుపరి చర్యలను నిలిపేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.పాత్రికేయుల వాక్ స్వాతంత్య్ర హక్కును హరించిన టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ను తప్పుపట్టింది. లైవ్ షోలో ఓ ప్యానలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. సాక్షి మీడియాపై కుట్రతోనే..ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసింది. కొమ్మినేని శ్రీనివాసరావు. సాక్షి మీడియా యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అందుకు నిదర్శనం. అసలు ఉదంతంతో ఏ మాత్రం సంబంధం లేని బీఎన్ఎస్ సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్లు 79, 196(1), 353(2), 299, 356(2) 61(1) కింద కేసు నమోదు చేయడం. ప్రభుత్వ కుట్రకు తార్కాణం.ఎందుకంటే కుట్రపూరితంగా కుట్ర పూరితంగా వ్యవహరించడం, విద్వేషాలను వ్యాపింప చేయడం తదితర నేరాలకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి. అంతేగానీ ఓ టీవీ చానళ్లో స్వతంత్ర విశ్లేషకుడు వ్యక్తం చేసిన అభిప్రాయానికి ఆ సెక్షన్లు నమోదు చేయడం విడ్డూరం. అసలు చర్చా గోష్ఠిలో ఎక్కడా కుల ప్రస్తావనే లేకపోయినా, బీఎన్ఎస్ 3(1)(యు) సెక్షను చేరుస్తూ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉండన్నది సుస్పష్టం. ‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్ చేసేస్తారా. నవ్వడమే తప్పయితే, మేం ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటాం. లైవ్ షోలో ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదు. ఓ జర్నలిస్టుగా లైవ్ న్యూస్ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉంది. అప్పుడే ఆయన వాక్ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుంది’’ :::కొమ్మినేనికి బెయిల్ సందర్బంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

ఇంద్రావతికి కట్టడి!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న గోదావరి నదికి ప్రాణహిత తర్వాత ప్రధాన ఉప నది అయిన ఇంద్రావతి నీటిని పూర్తిగా కట్టడి చేసేలా ఛత్తీస్గఢ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంద్రావతిలో లభ్యతగా ఉన్న నీటిలో మెజా రిటీ జలాలను వినియోగించుకునేలా బోద్ఘాట్ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతినిచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు. ఇంద్రావతి నీటినే నమ్ముకొని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు చేపడుతుండటం గమనార్హం. కాగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెరపైకి తెచ్చిన ఈ ప్రాజెక్టుతో దిగువ గోదావరిలో జలాల లభ్యత తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ వినియోగించని జలాలనే ఆధారంగా చేసుకుని కేంద్రం గోదావరి–కావేరి అనుసంధానాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎగువ నీళ్లకు ఎగువనే అడ్డుకట్ట.. ఇంద్రావతిలో ప్రతి ఏటా సుమారు 600–800 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇది ఛత్తీస్గఢ్లో 264 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మేడిగడ్డ దిగువన, సమ్మక్క–సారక్క బరాజ్ ఎగువన గోదావరిలో కలుస్తుంది. దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, కాంకేర్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆయా జిల్లాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఇంద్రావతి నీళ్లు కలిశాకే గోదావరి దిగువన ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటాయి. కాగా ఇంద్రావతి నది గోదావరిలో కలిసే ప్రాంతానికి దిగువన, గరిష్ట నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ.. దేవాదుల (38 టీఎంసీలు), సీతారామ (70 టీఎంసీలు), సమ్మక్క–సారక్క (50 టీఎంసీలు మొత్తంగా 158 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టింది. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఇలావుండగా ఇంద్రావతిలో లభ్యత నీటిని ఛత్తీస్గఢ్ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోవడంతో.. ఈ నీటిని మిగులు జలాలుగా గుర్తించిన కేంద్రం.. నదుల అనుసంధాన ప్రతిపాదనలు చేసింది. ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్గఢ్ (అప్పటి మధ్యప్రదేశ్)కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో వాడుకోని 141.4 టీఎంసీలకు మరో 106 టీఎంసీల వరద జలాలను జతచేసి మొత్తం 247 టీఎంసీలను ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్–సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్ట వరకు తరలించేలా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే గోదావరిలో మిగులు, వరద జలాల నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చేవరకు అనుసంధానం పక్కన పెట్టాలని తెలంగాణ, ఏపీలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. దీంతో తొలిదశ కింద ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలనే గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించేలా ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆవిరి, ప్రవాహ నష్టాలు పోను ఏపీకి 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్గఢ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. చెప్పినట్టే చేస్తున్న ఛత్తీస్గఢ్ తమకు హక్కుగా సంక్రమించిన నీటిని తరలించుకు పోతామంటే ఒప్పుకునేది లేదని, భవిష్యత్తులో ఈ నీటిని వినియోగించుకునేలా తాము ప్రాజెక్టులు చేపడతామని ఛత్తీస్గఢ్ తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బోద్ఘాట్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. ఈ ప్రాజెక్టు కింద ఇందావ్రతి నీటిని ఒడిసిపట్టేలా రూ.29 వేల కోట్లతో బోద్ఘాట్ ఆనకట్టని, అదనంగా మరో రూ.20 వేల కోట్లతో మహానది–ఇంద్రావతి లింక్ను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు దంతెవాడ, సుక్మా, బీజాపూర్ జిల్లాల్లోని 359 గ్రామాల పరిధిలోని 3.78 లక్షల హెక్టార్లకు (9.45 లక్షల ఎకరాలకు) సాగునీటిని అందించాలని నిర్ణయించింది. అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని ఇచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. గోదావరి–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమే..! ఇంద్రావతి మెజారిటీ జలాలను ఛత్తీస్గఢ్ వినియోగించుకునే పక్షంలో గోదావరి నుంచి తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గడం ఖాయమని నీటి పారుదల నిపుణులు అంటున్నారు. అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నారు. కాగా దీనిపై తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

ఎయిరిండియా రద్దుల పద్దు!
చూడబోతే ఎయిరిండియాకు కష్టాలన్నీ ఒక్కసారే కట్టగట్టుకుని వచ్చినట్టున్నాయి. ఈ నెల 12న గుజరాత్లో జరిగిన దురదృష్ట ఘటనలో 272 మంది మరణించిన తర్వాత ఎయిరిండియా విమానాలు ఎక్కాలన్నా, ప్రత్యేకించి ప్రమాదం సంభవించిన బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ రకం విమానాల్లో ప్రయాణించాలన్నా చాలామంది భయపడుతున్నారు. అందుకు తగినట్టే ఆ సంస్థ అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో వినియోగించే దాదాపు 90 విమాన సర్వీసుల్ని అంచెలంచెలుగా రద్దుచేస్తూ పోతోంది. శుక్రవారం కూడా ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. నిర్వహణాపరమైన, సాంకేతికమైన సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెబుతోంది. వీటికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇరాన్ గగనతలాన్ని మూసివేయటం వంటివి కూడా విమాన సర్వీసుల రద్దుకు దోహదపడ్డాయి. జూలై రెండో వారం వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు 15 శాతంమేర తగ్గించనున్నామని ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు కూడా ఏమంత భరోసాతో లేరు. అసలు విమానయానమే వద్దనుకున్నవారు కొందరైతే, బోయింగ్ విమానాలు ఎక్కరాదని మరికొందరు నిర్ణయించుకుని ప్రయాణాలు రద్దుచేసుకున్నారు. విమానయాన సంస్థలను నియంత్రించే పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఎయిరిండియా విమానాల్లో భద్రతకు సంబంధించిన ప్రధాన లోపాలేమీ లేవని, కేవలం నిర్వహణాపరమైన సమస్యలే ఉన్నాయని చెబుతోంది. భిన్న విభాగాల మధ్య సమన్వయం అవసరమవుతుందని సలహా ఇచ్చింది. ఎక్కడ ఏ చిన్న లోపాన్ని గమనించినా దాన్ని నమోదు చేయటం, వెనువెంటనే సరిదిద్దటం వంటివి జరగాలని సూచించింది. ఎయిర్లైన్స్ సంస్థలకు రేటింగ్ ఇచ్చే అంతర్జాతీయ స్వతంత్ర ఆన్లైన్ సంస్థ పరిశీలనలో ఇండిగో, ఆకాశ సంస్థలు ఏడు అంశాల్లో ఆరు పాయింట్లు సాధించాయి. స్పైస్ జెట్ ఏడుకు ఏడు పాయింట్లు పొందగా, ఎయిరిండియా కేవలం నాలుగు పాయింట్లే సాధించటం గమనించదగ్గ అంశం. ఇక బోయింగ్ డ్రీమ్లైనర్ భద్రతా లోపాలపై ఫిర్యాదు చేసిన ఇంజినీర్ జార్జి బార్నెట్ అనుమానాస్పద స్థితిలో నిరుడు మార్చిలో మరణించిన ఉదంతం కలవరపరుస్తుంది. ఆ సంస్థ క్వాలిటీ కంట్రోల్లో 32 ఏళ్లు పనిచేసిన బార్నెట్ రెండ్రోజులు విచారణకు హాజరై మూడో రోజు ఎందుకు తుపాకీతో కాల్చుకుంటాడన్నది ప్రశ్నార్థకమైంది.టాటా ఎయిర్లైన్స్గా ఉన్న సంస్థను 1953లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతీయం చేసి, ఎయిరిండియాగా నామకరణం చేశారు. దేశీయ విమాన సర్వీసుల కోసం ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ ఆవిర్భవించింది. ఈ రెండూ పబ్లిక్ రంగ సంస్థలు కావటంతో పౌర విమానయాన రంగంలో అవి దిగ్గజ సంస్థలుగా వెలిగాయి. కానీ దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై విమానయానంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించటం, తక్కువ ధరకే ప్రయాణికులను చేరేవేసే సంప్రదాయాన్ని ప్రారంభించటంతో అంతక్రితమే నష్టాలతో ఉన్న ఆ సంస్థ మరింతగా కుంగిపోవటం మొదలైంది. అసలు విమానయాన రంగంలో ప్రైవేటును అనుమతించినప్పుడే ఎయిరిండియా నిర్వహణను పూర్తిగా నిపుణులకు వదిలేయాల్సింది. కానీ పగ్గాలు ప్రభుత్వం దగ్గరే ఉండటం, దానికి లోబడి సంస్థ పనిచేయాల్సి రావటంతో ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. టాటా సన్స్ 2022లో ఎయిరిండియాను తీసుకున్నప్పుడు విమానయాన రంగాన్నే సంపూర్ణంగా మారుస్తామని ప్రకటించింది. దశాబ్దాల అసమర్థ ఉద్యోగస్వామ్యాన్ని తొలగించి, గర్వించదగిన గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతామని తెలిపింది. మూడేళ్లు గడిచాయి. కానీ చెప్పుకోదగ్గ మార్పుల జాడలేదు. అలాగని ఎయిరిండియా ఏమీ చేయలేదని కాదు. సిబ్బందికి పునఃశిక్షణనిచ్చింది. వారి యూనిఫాంని మార్చింది. యాప్ను సరికొత్తగా తీసుకొచ్చింది. అయితే, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలు జరగలేదన్న మాటేగానీ లోపాల పరంపర గురించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇందులో పారిశుద్ధ్యం మొదలుకొని విరిగిపోయిన సీట్లు, నాసిరకం ఉపకరణాలు వగైరాలున్నాయి. అయినా పెద్దగా ఫలితం లేదు. ఇక అస్వస్థతగా ఉండి సెలవు పెట్టినవారిని సైతం ఒత్తిడి తెచ్చి విధినిర్వహణకు పిలిచిన సందర్భాలున్నాయని పైలెట్ల ఫిర్యాదు. ఇవన్నీ విడివిడి ఘటనలుగా కొట్టిపారేయటం కాక వాటివెనక అల్లుకునివున్న నిర్లక్ష్యాన్నీ, అలసత్వాన్నీ సకాలంలో గమనించుకుంటే పరిస్థితి మెరుగుపడేది. నిరుడు ఢిల్లీ–శాన్ఫ్రాన్సిస్కో సర్వీస్ విమానం ఇంజన్ వైఫల్యం కారణంగా రష్యాలో రోజుల తరబడి నిలిచిపోయింది. మరుగుదొడ్లు పనిచేయక చికాగోకు బయల్దేరిన విమానం కాసేపటికే వెనుదిరిగింది. టాటా బ్రాండ్కు మార్కెట్లో మంచి పేరుంది. వాటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో విశ్వాసం ఉంది. ఎయిరిండియా దాన్ని అందుకోలేకపోయింది. నిరుడు మే నెలలో ముంబై–లండన్ సర్వీసు బోయింగ్ 787 విమానంలో తలుపు సరిగా పనిచేయటం లేదంటూ ఫిర్యాదు చేశాక, దాన్ని వెనక్కు తీసుకోవాలని తమపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని, నిరాకరించినందుకు షోకాజ్ నోటీసులు జారీచేసి, 48 గంటలు దాటకుండా ఉద్యోగం నుంచి తొలగించారని సీనియర్ ఫ్లయిట్ అటెండెంట్లు ఇద్దరు ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేయటం గమనించదగ్గది. ప్రవర్తన సరిగా లేకపోవటం, విధి నిర్వహణ సక్రమంగా చేయక పోవటం వంటి కారణాలతోనే వారిని తొలగించామని సంస్థ సంజాయిషీ ఇస్తోంది. అంతా సవ్యంగా గడిచినంతకాలం నిర్వాహకులు తమను తాము అభినందించుకుంటూ కాలం గడుపుతారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేసే నియంత్రణ వ్యవస్థ ఉంటే ఇలాంటివి చోటుచేసుకోవు. ఈ విషాద ఘటన నుంచి అయినా గుణపాఠం నేర్చుకోవాలి. అత్యంత జాగరూకతతో మెలగాలి.

అణు ఉపద్రవం
‘‘ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా (అమెరికా) పరిస్థితిని నిరంతరం మదింపు చేస్తోంది. (ఇరాన్) 2003 లో పక్కనపెట్టిన అణ్వాయుధాల నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు సర్వోన్నత నాయకుడు ఖొమేనీ ఆదేశించలేదు’’ అని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ ఈ ఏడాది మార్చి 26న చెప్పారు. అయినా, ఇరాన్ అణ్వాయుధాల నిర్మాణ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ‘ముందస్తు’ చర్యగా పేర్కొంటూ ఇజ్రాయెల్ ఈ జూన్ 13న దాడులు ప్రారంభించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ చర్యను నిర్లక్ష్యపూరిత దుందుడుకు చర్య. ఇరాన్లో ఉన్న ప్రభుత్వం అక్కడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైందని చెప్పలేం. ఇజ్రాయెల్లో ఉన్న ప్రభుత్వం కూడా అలాంటిదే. అయినా ఇరాన్పై దాడికి దిగే హక్కు దానికి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. అణ్వాయుధాన్ని నిర్మించగలిగిన స్థితికి ఇరాన్ చాలా దగ్గరలో ఉందనే ఇజ్రాయెల్ అభిప్రాయం ట్రంప్ మనసులో నాటుకుంది. దాంతో ఆయన ఇంటెలిజెన్స్ అంచనాను పక్కనపెట్టేశారు. చేయాలనుకుంటే ఆపగలరా?ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం, అక్కడ అధికారం చేతులు మారేటట్లు చూడటం ఇజ్రాయెల్ ఆశయాలు. ఆ రెంటిలో ఏదీ తేలికైనది కాదు. ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించకుండా జాప్యం చేయగలిగిన సత్తా ఇజ్రాయెల్ సొంతం ఏమీ కాదని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ ఈమధ్య అన్నారు. ‘‘బహుశా కొన్ని వారాలు ఆపగలం... ఓ నెల ఆపగలం... అమెరికా కూడా దాన్ని కొద్ది నెలలపాటే అడ్డుకోగలదేమో’’ అన్నారాయన. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థతోపాటు నటాంజ్లో ఉన్న ముఖ్యమైన యురేనియం శుద్ధి సదుపాయాన్ని, ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను ఇజ్రాయెల్ తీవ్రంగా ధ్వంసం చేయగలిగిందని ప్రస్తుత మదింపులు సూచిస్తున్నాయి. కానీ అరాక్ న్యూక్లియర్ కాంప్లెక్స్ చాలా వరకు చెక్కుచెదరకుండానే ఉందని చెబుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఫర్దోలో ఉన్న ఇంధన శుద్ధి భూగర్భ కేంద్రానికి కూడా ఇంతవరకు వాటిల్లిన నష్టం ఏమీ లేదు. ఈ సదుపాయం చాలా కీలకమైంది. ఎందుకంటే, ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి అయిన యురేనియం ఉంది. అణ్వాయుధాన్ని నిర్మించడానికి 90 శాతం శుద్ధి అయిన యురేనియం అవసరం. ఆ పనిని ఫర్దో సదుపాయం వారం రోజుల్లో చేసిపెట్టగలదు. ఇరాన్ వద్ద 2025 మే నాటికి 408.6 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉందని అంచనా. దానిని మరింత శుద్ధి చేస్తే, రానున్న వారాల్లో తొమ్మిది అణ్వాయుధాల తయారీకి సరిపోతుంది. అమెరికా భాగస్వామ్యం ఎంత?భారీ మందుగుండు సామగ్రితో కూడిన ఎయిర్ బ్లాస్ట్ బాంబు (ఎంఓఏబి) మాత్రమే ఫర్దోను ధ్వంసం చేయగలదు. అది ఇజ్రాయెల్ వద్ద లేదు. అమెరికా రంగంలోకి దిగితేనే దాన్ని ధ్వంసం చేయడం సాధ్యం. అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు ఇరాన్ ఇరవై ఏళ్ళ పైనుంచి కృషి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని భూగర్భ సదుపాయాలను కూడా అది నిర్మించుకుంది. గగనతల దాడులొక్కటే ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించలేవు. పదాతి దళాలతో భూతల ఆక్రమణ కూడా అవసరమవుతుంది. అమెరికా పాత్ర ఇక్కడే అవసరం పడుతుంది. ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవడం’ ట్రంప్ డిమాండ్లలో ముఖ్యమైంది. వెనుతిరిగి చూస్తే, ఇరాన్పై యుద్ధం అమెరికా–ఇజ్రాయెల్ కలసి చేసిన పనేనేమో అనిపిస్తుంది. బేషరతుగా లొంగిపొమ్మనడం, ప్రభుత్వాన్ని మార్చుకొమ్మని చెప్పడం వల్ల, ఇరాన్ నిజంగానే అణ్వాయుధ నిర్మాణ దిశగా అడుగు వేయవచ్చు. ఇరాన్ అలాంటి ఆయుధాలను నియోగించకుండా నివారించేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు అణ్వాయుధాలను అమ్ములపొదుల నుంచి బయటకు తీయవలసి రావచ్చు. అణ్వాయుధాల ప్రయోగమే జరిగితే అది ప్రపంచాని కంతటికీ వినాశకరం. నిజానికి, ఇజ్రాయెల్ను దృష్టిలో పెట్టుకుని ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఇరాక్ కారణంగా ఆ పని చేసింది. ఇరాన్–ఇరాక్ల మధ్య 1980–88 వరకు సాగిన యుద్ధం అందుకు ప్రేరణగా నిలిచింది. అమెరికా సాయంతోనే ఇరాన్పై దాడికి ఇరాక్ ఉపక్రమించింది. ఇరాన్లోని నగరాలపై ఇరాక్ రసాయనిక ఆయుధాలు, క్షిపణులతో దాడులకు దిగినా ప్రపంచ దేశాలు చాలావరకు మిన్నకుండిపోయాయి. దాంతో 1980ల మధ్య నుంచి ఇరాన్ సైనిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే, ఇరాక్పై 2003లో అమెరికా దాడి చేసిన తర్వాతనే, అణ్వాయుధాలు లేనిదే తన భద్రతకు పూచీ ఉండదని ఇరాన్ భావించడం మొదలుపెట్టింది. ఇరానియన్లకు చరిత్ర పట్ల చక్కని అవగాహనతోపాటు జాతీయతా భావాలు మెండు. ఇరాక్లో మాదిరిగానే ఇరాన్లో కూడా అపార విధ్వంసానికి పాల్పడటంలో, ఆ దేశాన్ని బలహీనపరచడంలో అమెరికా–ఇజ్రాయెల్ విజయం సాధించవచ్చు. ప్రభుత్వాన్ని మార్చడంలోనూ సఫలం కావచ్చు. కానీ, కథ అంతటితో కంచికి పోదు.మనోజ్ జోషీవ్యాసకర్త ఢిల్లీలోని అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్లో విశిష్ఠ సభ్యుడు

పోటాపోటీగా దాడులు
టెల్ అవీవ్/టెహ్రాన్/జెనీవా: ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో రావణకాష్టాన్ని మరింత రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్లు శుక్రవారం సైతం పోరుపంథాలోనే పయనించాయి. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో ఉద్రిక్తతల్ని అమాంతం పెంచేశాయి. ఇజ్రాయెల్ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్ తన వద్ద పోగుబడిన క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇరాన్ క్లస్టర్ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్లోని టెల్అవీవ్, హైఫా, బీర్షెబా, రెహోవోట్ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రక్తమోడుతూ జనం వీధుల్లో పరుగులు పెడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించారు. కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నగర మేయర్ యొనా యాహవ్ చెప్పారు. రెహోవోట్లో దెబ్బతిన్న భవనాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్వయంగా వచ్చి పరిశీలించారు. కర్మేయిన్ పట్టణంలో షెల్టర్లో దాక్కున్న 51 ఏళ్ల మహిళ భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్ టెహ్రాన్లోని పలు క్షిపణి తయారీ కార్మాగారాలపై దాడులు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా సగం వరకు ఇరాన్ మిస్సైల్ లాంచర్లను నాశనంచేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఇయాల్ జమీర్ చెప్పారు. ఇరాన్ అణుపరిశోధనా ఏజెన్సీసహా పలు నగరాలపై తమ 60 యుద్దవిమానాలు బాంబుల వర్షం కురిపించాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. శుక్రవారం నాటికి ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 657 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్లో బుషెహర్ అణుకేంద్రంపై దాడితో అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తనుందని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్లాంట్లో వేల కేజీల అణుపదార్థం ఉందని, అది బయటకొస్తే వినాశకర స్థాయిలో రేడియోధార్మికత వందలకిలోమీటర్ల పరిధికి విస్తరిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు అవసరమైన సమయంలో పోరులో భాగస్వాములమవుతామని హెజ్బొల్లా ఉగ్రసంస్థ ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసిమ్ అన్నారు. ఇన్నాళ్లూ ఇరాన్ రహస్యంగా గాజాలో హమాస్, లెబనాన్లో హెబ్బొల్లా, యెమెన్లో హూతీ తిరుగుబాటుదారులను పెంచి పోషించినప్పటికీ ఎవరూ ఇంతవరకు సాయపడేందుకు ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా స్పందించడం గమనార్హం. అయితే హెజ్బొల్లా స్పందించిన వెంటనే లెబనాన్లోని దాని స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది.ఇజ్రాయెల్ వ్యతిరేక ర్యాలీలుతమపై దండెత్తిన ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్, ఇరాక్లో ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత వేలాదిగా రోడ్లమీదకొచ్చి భారీ నిరసనర్యాలీ చేపట్టారు. టెహ్రాన్, బాగ్దాద్, సదర్ సిటీల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు ఇప్పటికే హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్ కొత్తగా ఇరాన్తోనూ కయ్యం పెట్టుకోవడాన్ని ఇజ్రాయెలీలు తీవ్రంగా తప్పుబట్టారు. టెల్ అవీవ్లో వేలాది మంది ఆందోళనకారులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఇరాన్లో మౌలికసదుపాయాలు దెబ్బతిని గత 48 గంటలుగా ఇంటర్నెట్ స్తంభించింది. కేవలం 3 శాతం ప్రాంతాల్లో ఇంటర్నెట్ను పునరుద్ధరించారు. ఇరాన్లోని బ్యాంక్ సెఫాపై ఇజ్రాయెలీ హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. దీంతో ఏటీఎంలు పనిచేయక జనం ఇబ్బందులు పడ్డారు.ఇరాన్కు విదేశీ ఆయుధసాయంపై అమెరికా ఆంక్షలుఇరాన్ సైనికరంగంపై అమెరికా శుక్రవారం మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్ సైన్యం ఉపయోగించే పలు రకాల ఆయుధాల్లో విడిభాగాలు, సాఫ్ట్వేర్లను సరఫరాచేసే విదేశీ సంస్థలు, వ్యక్తులపై అమెరికా నిషేధం విధించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో చైనా కంపెనీ, ఒక సరుకు రవాణా నౌక సంస్థ సైతం ఉన్నాయి. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, బాంబులను విక్రయించే సంస్థలనూ అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.మరోదఫా చర్చలకు సిద్ధమన్న యూరప్ నేతలుస్విట్జర్లాండ్లోని జెనీవాలో శుక్రవారం బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతోపాటు యూరోపియన్ యూనియన్ విదేశీవిధానాల చీఫ్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చలు జరిపారు. చర్చల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించలేదు. మరోదఫా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, చర్చలు ముగిశాక యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు చెప్పారు. మరోవైపు తమ సేనలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను మీడియా అత్యుత్సాహంతో ప్రసారం చేయొద్దని స్థానిక మీడియాకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

అందుకే డొనాల్డ్ ట్రంప్ డిన్నర్ ఆహ్వానాన్ని తిరస్కరించా: ప్రధాని మోదీ
భువనేశ్వర్: తనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిన్నర్కు ఆహ్వానించినా అందుకు వెళ్లలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించి, ధన్యవాదాలు తెలిపానన్నారు. తనకు ఒడిశాలో ప్యూరీ జగన్నాథ్ పుణ్యభూమికి వెళ్లడం ముఖ్యమని ట్రంప్కు చెప్పినట్లు మోదీ తెలిపారు. ఈ రోజు(శుక్రవారం, జూన్ 20) ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. సుమారు 18 వేల కోట్ల విలువైన 100కు పైగా ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. దీనిలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘నాకు ట్రంప్ నుంచి డిన్నర్ ఆహ్వానం అందింది. నేను జీ-7 సదస్సులో భాగంగా కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు నన్ను వాషింగ్టన్కు రమ్మని ట్రంప్ ఆహ్వానించారు. అయితే మహాప్రభు జగన్నాథుని పుణ్యభూమికి వెళ్లే అవసరం ఉండటంతో నేను ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను. రెండు రోజుల క్రితం కెనడా పర్యటనలో ఉన్నపపుడు వాషింగ్టన్ మీదుగా రమ్మని ట్రంప్ అన్నారు. కలిసి డిన్నర్ చేసి మాట్లాడుకుందాం అన్నారు. కానీ అంతకంటే ఎక్కువగా ఒడిశా జగన్నాథుని పుణ్యభూమికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పా’ అని మోదీ తెలిపారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంలో తొలి వార్షికోత్సవ కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారాయన.#WATCH | Bhubaneswar, Odisha: "Just two days ago, I was in Canada for the G7 summit and the US President Trump called me. He said, since you have come to Canada, go via Washington, we will have dinner together and talk. He extended the invitation with great insistence. I told the… pic.twitter.com/MdLsiYnNCQ— ANI (@ANI) June 20, 2025 ఏడాది విజయవంతంగా పూర్తయ్యిందిఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుందని కొనియాడారు. ఇది తమకు చాలా ప్రత్యేకమైన రోజన్నారు. కేవలం ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడం ఒక్కటే కాదు.. మంచి పరిపాలన అందించినందుకు కూడా తొలి వార్షికోత్సవమన్నారు. ఏడాది కాలంలోనే బీజేపీ ప్రజల నమ్మకాన్ని చూరగొందని మోదీ పేర్కొన్నారు.

వారెవ్వా గిల్.. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే అద్బుత సెంచరీ
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన కెరీర్ను ఘనంగా ఆరంభించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభమైన తొలి టెస్టులో గిల్ సెంచరీతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన గిల్.. విరాట్ కోహ్లిని తలపించాడు. తొలుత దూకుడుగా ఆడిన శుబ్మన్, జైశ్వాల్ ఔటయ్యాక ఆచిచూచి తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 140 బంతుల్లో గిల్ తన ఆరో టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 14 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. అతడి కంటే ముందు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్తో 101 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ డెబ్యూలో సెంచరీతో చెలరేగిన గిల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లఖించుకున్నాడు.భారత టెస్టు కెప్టెన్గా అరంగేట్ర ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్గా గిల్ నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం విజయ్ హజారే అగ్రస్ధానంలో ఉన్నారు. 1951లో కెప్టెన్గా తన అరంగేట్ర ఇన్నింగ్స్లో ఇంగ్లండ్పైనే సెంచరీ చేశారు.భారత టెస్ట్ కెప్టెన్గా తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ప్లేయర్లు వీరే..164* విజయ్ హజారే వర్సెస్ ఇంగ్లండ్, ఢిల్లీ 1951116 సునీల్ గవాస్కర్ vs న్యూజిలాండ్ ఆక్లాండ్ 1976115 విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియన్ అడిలైడ్ 2014102*శుబ్మన్ గిల్ vs ఇంగ్లాండ్ హెడింగ్లీ 2025భారీ స్కోర్ దిశగా భారత్..తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 78 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 మూడు వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(46), గిల్(112) ఉన్నారు.

సోనమ్ మేఘాలయా హనీమూన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..
షిల్లాంగ్: సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్యకేసు మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ ప్రతి సంఘటన ఒక్కో క్లైమాక్స్ను తలపిస్తోంది.తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. పెళ్లైన పదకొండు రోజులకే సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీకి ఇష్టం లేకపోయినా హనీమూన్ పేరిట మేఘాలయాకు తీసుకెళ్లి, ముందస్తు ప్లాన్ ప్రకారం.. సుపారీ కిల్లర్ల సాయంతో హత్య చేయించిన విషయం తెలిసిందే. హత్య అనంతరం, మేఘాలయా నుంచి తన పుట్టినిల్లు ఉత్తరప్రదేశ్ వచ్చేందుకు సోనమ్ రఘువంశీ బురఖా ధరించి సుమారు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ప్రయాణం సమయంలో కనీసం ఎక్కడా తినకుండా నిర్విరామంగా ప్రయాణించినట్లు పోలీసుల విచారణలో ఆమెను బోర్డర్ దాటించిన వెహికల్ డ్రైవర్ చెప్పాడు.రాజా రఘువంశీ కేసును మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఇండోర్లో సోనమ్ రఘువంశీని ఉత్తర్ప్రదేశ్కు తీసుకొచ్చిన కారు డ్రైవర్లు మోహిత్,పియూష్లను అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసిన మోహిత్ను పోలీసులు విచారించారు.సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా ‘జూన్ 8 మేఘాలయా నుంచి ఉత్తర ప్రదేశ్కు చేర్చేందుకు తీసుకెళ్లేందుకు ఎర్టిగో మాట్లాడుకున్నారు. రాజ్ సూచన మేరకు మోహిత్, పియూష్ ఆమెను తీసుకెళ్లారు. ప్రయాణం నిమిత్తం నన్ను(మోహిత్),పియూష్ని పనిలోకి తీసుకున్నారు. అప్పటికే మేఘాలయ సోహ్రాలోని ఓ లోయలో కుళ్ళిన రాజా రఘువంశీ రాజ్ మృతదేహాం లభ్యమై ఏడు రోజులవుతుంది.ఇక ఎర్టిగోలో మా ప్రయాణం ప్రారంభమైంది. సోనం బుర్ఖాలో మారువేషంలో ఉంది. మేం ఏదైనా తినాలని రోడ్డు పక్కన కారు ఆపినా అందుకు ఒప్పుకోలేదు. ఇలా మేఘాలయ నుండి వారణాసికి వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం జరిగింది. ఇప్పుడు ఇదే విషయంపై పోలీసులు సోనంను ప్రశ్నిస్తున్నారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే ఇన్ని వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించిందా? తాజా పరిణామంతో రాజా రఘువంశీ హత్యలో కూడా ఆమె ప్రమేయం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Kuppam: మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి,గుంటూరు: చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్.హెచ్.ఆర్.సీ. సీరియస్ అయ్యింది. సుమోటోగా కేసు విచారణకు తీసుకుంది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఏపీ సీఎస్,డీజీపీని ఆదేశించించింది.తన భర్త చేసిన అప్పులు తీర్చలేదని నారాయణపురంలో మహిళను టీడీపీ కార్యకర్త, కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేశారు. ఈ అమానవీయ ఘటనను సాక్షిటీవీ వెలుగులోకి తెచ్చింది. నేషనల్ మీడియా సైతం వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. A video from #Kuppam surfaced where a woman was tied to tree after her husband failed to repay loan of 80,000. Police had registered a case & accused taken in custody.#AndhraPradesh CM @ncbn orders strict action against those who attacked the woman. pic.twitter.com/D3nID4char— Aneri Shah Yakkati (@tweet_aneri) June 17, 2025‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను’‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను. చివరకు వికలాంగురాలైన నా కుమార్తెకు వచ్చే రూ.6 వేల పింఛన్ సైతం వాళ్లే లాక్కుంటున్నారు. అయినా వాళ్ల ధనదాహం తీరలేదు. చివరకు నన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి బాకీ తీర్చాలంటూ దాడి చేశారు’ అని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు... శిరీష అనే మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన ఘటన విదితమే. మేం బాగా బతికినోళ్లమే‘నా భర్త పేరు తిమ్మరాయప్ప. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేం బాగా బతికినోళ్లమే. మాకు జేసీబీ కూడా ఉండేది. తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు నా భర్త రూ.16 లక్షలు అప్పులు చేశాడు. జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాం. మిగిలిన అప్పులు తీర్చేందుకు నారాయణపురానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాం. వారికి ప్రతినెలా నూటికి రూ.5 నుంచి రూ.30 వరకు వడ్డీలు చెల్లించాం. వడ్డీలు అయితే కట్టాం కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది.’ అని తెలియజేసింది.నా భర్తను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడంతోనే వెళ్లిపోయాడు‘అసలు మొత్తం చెల్లించాలని 6 నెలల క్రితం నా భర్త తిమ్మరాయప్పను చెట్టుకు కట్టేసి గ్రామస్తుల మధ్య తీవ్రంగా అవమానించారు. దీన్ని తట్టుకోలేక నా భర్త గ్రామం నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వికలాంగురాలైన నా పెద్ద కుమార్తె, కుమారుడు, మరో కుమార్తెను మా అమ్మ వద్ద వదిలి నేను బెంగళూరు వెళ్లాను. అక్కడ కూలీ పనులు చేసి కొద్దికొద్దిగా అప్పు తీరుస్తున్నాను. వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో నా తాళిబొట్టును కూడా అమ్మి అప్పు కట్టాను. అయినా వారి ధనదాహం తీరలేదు.వికలాంగ పెన్షన్ను కాజేశారుమా పెద్ద కుమార్తెకు నెలనెలా వచ్చే వికలాంగ పెన్షన్ రూ.6 వేలను కూడా మూడు నెలల నుంచి మునికన్నప్ప కుటుంబమే తీసుకుంటోంది. దీంతో నా పిల్లలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి తిరిగొచ్చాను. స్కూలు నుంచి టీసీలు తీసుకుని పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తుంటే మునికన్నప్ప కుటుంబ సభ్యులు నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కొడుకు పక్కనే ఏడుస్తున్నా వాళ్లు కనికరించలేదు. పోలీసులు రాకపోతే నా గతి ఏమయ్యేదో’ అంటూ శిరీష బోరున విలపించారు.

ఫైనాన్షియల్ సెక్టార్పై మస్క్ కన్ను
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్పై కన్నేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఎక్స్ యూజర్లు ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్మెంట్.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!‘వీసా’తో ఒప్పందంవీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్ ప్లాట్ఫామ్ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీగా పిలిచే ఈ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు.
ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేను
ఇంద్రావతికి కట్టడి!
మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ పేటెంట్ హక్కు మీది కదా సార్!!
పోటాపోటీగా దాడులు
అణు ఉపద్రవం
ఎయిరిండియా రద్దుల పద్దు!
గిల్, జైశ్వాల్ సెంచరీలు.. తొలి రోజు భారత్దే
వారెవ్వా గిల్.. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే అద్బుత సెంచరీ
చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. ఒకే ఒక్కడిగా రికార్డు
సోనమ్ మేఘాలయా హనీమూన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
సాక్షి కార్టూన్ 20-06-2025
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’
మేఘాలయ హనీమూన్ కేసులో విస్తుపోయే నిజాలు
అప్పు తీర్చనందుకు చెట్టుకు కట్టేస్తారా?.. ఇదేనా ప్రజాస్వామ్యం!
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేను
ఇంద్రావతికి కట్టడి!
మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ పేటెంట్ హక్కు మీది కదా సార్!!
పోటాపోటీగా దాడులు
అణు ఉపద్రవం
ఎయిరిండియా రద్దుల పద్దు!
గిల్, జైశ్వాల్ సెంచరీలు.. తొలి రోజు భారత్దే
వారెవ్వా గిల్.. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే అద్బుత సెంచరీ
చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. ఒకే ఒక్కడిగా రికార్డు
సోనమ్ మేఘాలయా హనీమూన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్..
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
సాక్షి కార్టూన్ 20-06-2025
అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
కొత్త నివాసం అనే సరికి మన వాళ్లు ఏదేదో ఊహించుకుంటున్నారు! పెళ్లి శుభవార్త అనుకుని..!
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
ప్రధాని నెతన్యాహుకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ ప్రజల కౌంటర్
’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’
అప్పు తీర్చనందుకు చెట్టుకు కట్టేస్తారా?.. ఇదేనా ప్రజాస్వామ్యం!
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
సినిమా

'చాహల్ వల్లే నీకు కెరీర్'.. ఆర్జే మహ్వశ్ రిప్లై చూశారా?
బాలీవుడ్లో ప్రముఖ ఆర్జే మహ్వశ్ (RJ Mahvash) గత కొంతకాలంగా తెగ వైరలైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరు మార్మోగిపోయింది. దానికి కారణం దుబాయ్లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ తర్వాత అప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని ఆమెపేరు ఒక్కసారిగా నెట్టింట హల్చల్ చేసింది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కలిసి స్టేడియంలో కనిపించడంతో ఆర్జే పేరు వైరలైపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టీమ్కు మద్దతుగా మహ్వశ్ మ్యాచుల్లో సందడి చేసింది. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కోడై కూసింది. తనపై వస్తున్న రూమర్స్పై కూడా ఆమె స్పందించింది.తాజాగా ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అందులో నెటిజన్స్ చేసిన కామెంట్స్ను ప్రస్తావించింది. వాటికి వివరణ ఇస్తూ ఓ వీడియోను పంచుకుంది. 'యూజీ భాయ్నే ఇస్కా కెరీర్ బనా దియా'(యుజ్వేంద్ర చాహల్ ఆమె కెరీర్ను నిలబెట్టాడు) అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్స్కు తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది.నేను 2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. 2023లో సొంతగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించానని ఆర్జే మహ్వశ్ తెలిపింది. నవాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా సెక్షన్-108 మూవీని నిర్మించినట్లు పేర్కొంది. అంతేకాకుండా మరో సినిమాను నిర్మించేందుకు రెడీ అయినట్లు కూడా వెల్లడించింది. ఆ తర్వాత మీకు క్రికెట్ గురించి ఏమైనా తెలుసా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మీరు పుట్టకుముందు నుంచే తాను క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నానని కుల్దీప్ యాదవ్, ధోని, బ్రెట్ లీ, సురేశ్ రైనా, క్రిస్గేల్, అక్తర్, జాక్వస్ కలిస్తో దిగిన ఫోటోలను కూడా వీడియో చూపించింది. మీరు ఏదైనా మాట్లాడేముందు తన గురించి తెలుసుకోవాలని హితవు పలికింది. అంతేకానీ ఎవరో పంపిన వాటిని ఫార్వార్డ్ చేయకండి అంటూ మహ్వశ్ అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఈ లెక్కన ఆర్జే మహ్వశ్.. యుజ్వేంద్ర చాహల్ పరిచయానికి ముందే క్రికెట్తో అనుబంధం ఉందన్నమాట. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash)

రెండో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి సమీరా
యాంకర్, బుల్లితెర నటి సమీరా షెరిఫ్ (Sameera Sherief) గుడ్న్యూస్ చెప్పింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు సమీరా- సయ్యద్ అన్వర్ దంపతులు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బుడ్డోడు మా జీవితాల్లోకి ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలు ఎప్పటికీ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా జీవితాల్లో కొత్త చాప్టర్ ప్రారంభిస్తున్నాం అని రాసుకొచ్చారు. అలాగే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు.. సమీరాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సమీరా ప్రెగ్నెన్సీ జర్నీ..సమీరా 2019లో అన్వర్ జాన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ మరుసటి ఏడాదే నటి తొలిసారి గర్భం దాల్చింది. అప్పుడు ఆమె తమిళంలో మిస్టర్ అండ్ మిసెస్ చిన్నతిరై అనే రియాలిటీ షో చేస్తోంది. షూటింగ్ అవగానే హాస్పిటల్కు వెళ్దామనుకుంది. అంతలోనే తీవ్ర రక్తస్రావమై కడుపులో బిడ్డను పోగొట్టుకుంది. తర్వాత 2021లో మరోసారి ప్రెగ్నెంట్ అయింది. అలా ఆమెకు అర్హాన్ జన్మించాడు. 2023లో మరోసారి ప్రెగ్నెంట్ కావడంతో ఇంటిల్లిపాది ఎంతో సంతోషించారు. కానీ బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో గర్భం నుంచి శిశువును తీసేశారు. 2024 చివర్లో మరోసారి ప్రెగ్నెంట్ అని తేలగా.. ఇప్పుడు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది.సమీరా ఎందుకింత పాపులర్?ఆడపిల్ల సీరియల్తో సమీరా ఒక్కసారిగా పాపులర్ అయింది. అభిషేకం, భార్యామణి, ముద్దుబిడ్డ.. ఇలా ఎన్నో ధారావాహికలు చేసింది. అదిరింది షోకి కొన్నిరోజులపాటు యాంకర్గానూ వ్యవహరించింది. View this post on Instagram A post shared by Syed Anwar (@syedd_annwar) చదవండి: జెన్ Z అంటే ఇదేనా? ఆశిష్ను అగౌరవపరుస్తావా? నటుడి ఆగ్రహం

'8 వసంతాలు' సినిమా రివ్యూ
తెలుగు సినిమాల్లో ప్రేమకథలకు కొదవలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలా వచ్చిన చిత్రం '8 వసంతాలు'. గతంలో 'మధురం' అనే షార్ట్ ఫిల్మ్తో ఆకట్టుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనంతిక సనీల్ కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా ఇది థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రేమకథా సినిమా అనగానే.. హా ఏముంది అబ్బాయి-అమ్మాయి ప్రేమించుకుంటారు. కుదిరితే ఒక్కటవుతారు లేదంటే విడిపోతారు. ఇందులో పెద్ద చెప్పుకోవడానికి ఏముందిలే అనుకుంటాం. కానీ ప్రేమకథని ఎంత అందంగా, ఎంత హృద్యంగా చెప్పొచ్చో కొందరు దర్శకులు నిరూపించారు. అలా 'అందాల రాక్షసి', 'సీతారామం' లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వాటితో సరిసమానంగా నిలిచే చిత్రం ఈ '8 వసంతాలు'.సినిమా టైటిల్స్ పడుతున్న టైంలోనే మొత్తం కథని రివర్స్లో చూపించేస్తారు. అలా ఊటీలో ఓ కరాటే ఇన్స్టిట్యూట్లో కథ మొదలవుతుంది. తనని ఓడిస్తే ఐపాడ్ గిఫ్ట్గా ఇస్తానని హీరో వరుణ్ ఛాలెంజ్ చేస్తాడు. అక్కడున్న వాళ్లందరూ అతడి చేతిలో ఓడిపోతారు. కానీ శుద్ధి అతడిని ఓడిస్తుంది. అహాన్ని నేలకు దించుతుంది. ఆ క్షణం వరుణ్.. శుద్ధితో ప్రేమలో పడిపోతాడు. తర్వాత ఆమె వెంటపడటం, ప్రేమలో పడేసేందుకు చేసే ప్రయత్నాలు ఆహ్లాదంగా ఉంటాయి. అంతా సవ్యంగానే ఉంది కదా అనుకునే టైంలో వరుణ్ తన స్వార్థం చూసుకుంటాడు. శుద్ధిని దూరం పెడతాడు. దీంతో ఆమె వచ్చి వరుణ్ ముందు నిలబడుతుంది. వీళ్లిద్దరి మధ్య సాగే సంభాషణ విజిల్స్ వేయిస్తుంది. అలా అదిరిపోయే సీన్తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్కి వచ్చేసరికి శుద్ధికి కరాటే నేర్పిన గురువు చనిపోవడం, ఆయన అస్థికల్ని గంగలో కలపడం ఇలా సాగుతుంది. కొన్నాళ్ల తర్వాత శుద్ధి జీవితంలోకి సంజయ్ వస్తాడు. ఈమెలానే అతడు కూడా ఓ రచయిత. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారా? ఇంతకీ సంజయ్ గతమేంటి? చివరలో శుద్ధితో సంజయ్ ఒక్కటయ్యాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.'8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. మధ్యమధ్యలో బలమైన సన్నివేశాలు, మనసుని తాకే డైలాగ్స్ వస్తుంటాయి. తొలి భాగంలో మహిళల గుణం గురించి హీరోయిన్ చెప్పే ఓ సీన్ భలే ఉంటుంది. ఇంటర్వెల్కి ముందు శుద్ధి-వరుణ్ మధ్య సంభాషణ వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి సంజయ్ పాత్ర ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఎందుకంటే క్లైమాక్స్కి కాసేపు ముందు వచ్చే ఈ పాత్రకు పెద్దగా సీన్స్ ఉండవు. కానీ క్లైమాక్స్లో ఇతడి పాత్రని తొలి సీన్ నుంచి లింక్ చేసిన విధానం.. థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అలానే '8 వసంతాలు' అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా చివర్లో రివీల్ చేసిన విధానం బాగుంది. సినిమాలో ఎన్ని పాత్రలున్నా సరే హీరోయిన్ పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది. డైలాగ్స్ అయితే భావుకత, కవితలు అంటే ఇష్టపడేవారితో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా నచ్చేస్తాయి.ఎవరెలా చేశారు?శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక జీవించేసింది. 17 ఏళ్ల అమ్మాయిగా, 25 ఏళ్ల మహిళగా వేరియేషన్స్ చూపించింది. వరుణ్గా చేసిన హనురెడ్డి.. ఎన్నారై కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. సెకండాఫ్లో వచ్చే సంజయ్ పాత్రధారి రవి దుగ్గిరాల ఇదివరకే 'మధురం'లో నటించాడు. ఇందులో అతడి పాత్ర ఉన్నది కాసేపు అయినా డిజైన్ చేసిన విధానం బాగుంది. మిగిలిన పాత్రధారులు కూడా ఎవరికి వాళ్లు పూర్తిగా న్యాయం చేశారు.టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో డైలాగ్స్ మెయిన్ హైలైట్. ప్రతి 10-15 నిమిషాలకు ఒకటి వస్తుంటుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఊటీ, కశ్మీర్, కాశీ అందాల్ని బాగా చూపించారు. ఇక డైరెక్షన్ విషయానికొస్తే.. ఇదివరకే మధురం షార్ట్ ఫిల్మ్, మను సినిమాతో తానెంటో నిరూపించుకున్న ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు '8 వసంతాలు' సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.స్వచ్ఛమైన ప్రేమకథని వినసొంపైన సంగీతంతో మనసుని తాకే సంభాషణలతో తీసిన ఓ మంచి సినిమా చూడాలనుకుంటే '8 వసంతాలు' అస్సలు మిస్ కావొద్దు. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.- చందు డొంకాన

అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి
సెలబ్రిటీలు ఏం మాట్లాడాలన్నా, ఎలాంటి పోస్టులు వేయాలన్నా కాస్త ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే చిక్కుల్లో పడటం ఖాయం. గాయని, నటి సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi) ఇప్పుడలాంటి పరిస్థితిలో ఇరుక్కుంది. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా ఫ్లైట్లో ఉన్న అందరూ చనిపోయిన సంగతి తెలిసిందే! మృత్యుంజయుడిగా బయటకు వచ్చిన అతడి పేరు విశ్వాస్ కుమార్ రమేశ్. చిన్నపాటి గాయాలతో సంఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు.అతడు చెప్పేది అబద్ధంఅతడి గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. విశ్వాస్ అబద్ధం చెప్తున్నాడని కొందరు పుకార్లు సృష్టించారు. అది నిజమని నమ్మిన సుచిత్రా కృష్ణమూర్తి ఆ రూమర్స్ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రమేశ్ అన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. అదేగనక నిజమైతే అతడికి కఠిన శిక్ష విధించాలి. లేదంటే పిచ్చి ఆస్పత్రిలో వేయాలి అని ట్వీట్ చేసింది.ట్వీట్ డిలీట్ఇది చూసిన నెటిజన్లు అసత్యాలను ఎందుకు ప్రచారం చేస్తున్నావని విమర్శించారు. ఆయన విమాన ప్రమాదంలోని బాధితుడే అని అహ్మదాబాద్లోని ఆస్పత్రి అధికారులే ధృవీకరించాక ఇంకేంటి సమస్య? అని ప్రశ్నించారు. దీంతో తప్పు తెలుసుకున్న సుచిత్ర.. వెంటనే సదరు ట్వీట్ను డిలీట్ చేసింది. తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో ఆ దేవుడికే తెలియాలి. ఏదేమైనా దాన్ని పోస్ట్ చేసినందుకు సారీ అని ట్వీట్ చేసింది.నటిగా..గాయని, నటి, రచయిత, చిత్రకారిణి.. ఇలా అన్నిరంగాల్లో అందెవేసిన చేయి సుచిత్రా కృష్ణమూర్తిది. 1991లో వచ్చిన మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్బాత్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 'గిల్టీ మైండ్స్' వెబ్ సిరీస్లోనూ నటించింది. 1999లో తనకంటే 30 ఏళ్లు పెద్దవాడైన దర్శకుడు శేఖర్కపూర్ను వివాహమాడింది. వీరికి కావేరీ అనే కూతురు జన్మించింది. 2007లో సుచిత్రా- శేఖర్ విడాకులు తీసుకున్నారు. Took out my last tweet on the air india crash survivor. Seems to be false news circulated for God knows what reason. My apologies— Suchitra Krishnamoorthi (@suchitrak) June 19, 2025 చదవండి: ధనుష్తో కుబేర చూసిన శేఖర్.. రెస్పాన్స్ అదిరిపోలా!
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఇంగ్లండ్తో తొలి టెస్టు.. యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఘనంగా ఆరంభించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్లో 144 బంతుల్లో తన సెంచరీ మార్క్ను జైశ్వాల్ అందుకున్నాడు. ఓవరాల్గా 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్తో 101 పరుగులు చేశాడు.కేఎల్ రాహుల్తో కలిసి మొదటి వికెట్కు 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన యశస్వి.. ఆ తర్వాత కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి మూడో వికెట్కు 131 పరుగుల పార్టనర్షిప్ నమోదు చేశాడు . జైశ్వాల్కు ఇది ఐదో టెస్టు సెంచరీ. తన సెంచరీ మార్క్ను అందుకోగానే గాల్లోకి జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.ఐదో ఆటగాడిగా.కాగా జైశ్వాల్ తన కెరీర్లో ఇంగ్లండ్పై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లోనే సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత మాజీ ప్లేయర్ విజయ్ మంజ్రేకర్ ఉన్నారు. విజయ్ మంజ్రేకర్ 1952లో ఇంగ్లండ్లో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్లో తమ తొలి టెస్టు ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే133 విజయ్ మంజ్రేకర్- హెడింగ్లీ 1952131 సౌరవ్ గంగూలీ -లార్డ్స్ 1996129*సందీప్ పాటిల్ -ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982146 మురళీ విజయ్ -ట్రెంట్ బ్రిడ్జ్ 2014100*యశస్వి జైస్వాల్ హెడింగ్లీ 2025టీబ్రేక్కు భారత స్కోరంతంటే?ఇక తొలి రోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(100), గిల్(58) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఇప్పటివరకు బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్ తలా వికెట్ సాధించారు.చదవండి: దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?𝙔𝙚𝙝 𝙨𝙞𝙠𝙝𝙖𝙖𝙣𝙚 𝙖𝙖𝙮𝙚 𝙝𝙖𝙞𝙣! 🔥A young star rises in England with a knock full of class. @ybj_19's first century on English soil shines bright. 🤩Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/SizxLx76AB— Star Sports (@StarSportsIndia) June 20, 2025

యువీతో గిల్ గురించి మాట్లాడాను.. కపిల్ దేవ్ మాదిరే అతడు కూడా..
టీమిండియా టెస్టు కెప్టెన్గా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ప్రయాణం మొదలైంది. ఇంగ్లండ్ (Ind vs Eng)తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం నాటి తొలి టెస్టుతో గిల్ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తండ్రి, కోచ్ యోగ్రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.శుబ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ గడ్డ మీద గెలిచి.. ట్రోఫీతో తిరిగి వస్తుందని యోగ్రాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, బ్యాటర్గానూ కెప్టెన్ గిల్ ముందుండి జట్టును నడిపిస్తేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.యువీతో మాట్లాడినపుడు ఇదే అన్నాడు‘‘కొన్ని రోజుల క్రితం.. అభిషేక్ శర్మ (Abhishek Sharma), శుబ్మన్ గిల్ల గురించి నేను యువరాజ్ సింగ్తో మాట్లాడాను. ఆ సమయంలో.. ‘గిల్ నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తాడు’ అని యువరాజ్ అన్నాడు. అవును.. శుబ్మన్ గిల్ బ్యాటింగ్కు వెళ్లినపుడు వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాలి.కపిల్ దేవ్ మాదిరికెప్టెన్ మెరుగైన ప్రదర్శన చేస్తే జట్టులోనూ జోష్ నిండుతుంది. శుబ్మన్ సహచరులకు 100, 200 లేదంటే 300 స్కోరును టార్గెట్గా పెట్టాలి. తనే బాధ్యత తీసుకోవాలి. 1983 వన్డే వరల్డ్కప్లో కపిల్ దేవ్ మాదిరి ఆటగాడిగానూ జట్టును ముందుండి నడిపించాలి’’ అని యోగ్రాజ్ సింగ్ ANIతో పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్లో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు.జైసూ అర్ధ శతకం పూర్తికాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా టీమిండియా తొలుత ఇంగ్లండ్తో తలపడుతోంది. స్టోక్స్ బృందంతో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు శుక్రవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది.ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42)- యశస్వి జైస్వాల్ కలిసి తొలి వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, భారీ అంచనాలతో బరిలోకి దిగిన అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్ మాత్రం నిరాశపరిచాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన అతడు డకౌట్ అయ్యాడు.ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్- కెప్టెన్ శుబ్మన్ గిల్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నారు. 42 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి జైసూ 78 పరుగులతో ఉండగా.. గిల్ 42 పరుగులు సాధించాడు. టీమిండియా స్కోరు: 172-2 (42). చదవండి: వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్!

దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
జింబాబ్వేతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు సౌతాఫ్రికాకు భారీ ఎదురు దెబ్బతగిలింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా తొడ కండరాల గాయం కారణంగా జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు శుక్రవారం ధ్రువీకరించింది. అతడి స్ధానంలో వైస్ కెప్టెన్గా ఉన్న కేశవ్ మహారాజ్కు జట్టు పగ్గాలను సౌతాఫ్రికా క్రికెట్ అప్పగించింది.కాగా బావుమా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా గాయపడ్డాడు. తొడ కండరాల నొప్పితో బాధపడతూనే తన బ్యాటింగ్ను టెంబా కొనసాగించాడు. తన విరోచిత పోరాటంతో సౌతాఫ్రికాకు 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను అందించాడు. అయితే అతడు గాయం కాస్త తీవ్రమైనది కావడంతో బావుమా నుంచి జట్టు నుంచి సెలక్టర్లు తప్పించారు. అదేవిధంగా ఈ సిరీస్కు ఐడైన్ మార్క్రమ్, కగిసో రబాడ కూడా దూరంగా ఉండనున్నారు. బావుమా ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు తిరిగి జట్టులో చేరే అవకాశముంది. ఆ తర్వాత అక్టోబర్లో పాకిస్తాన్తో ప్రోటీస్ జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు అదే తొలి సిరీస్ కానుంది. జూన్ 28 నుంచి జింబాబ్వే-సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.జింబాబ్వేతో టెస్టు సిరీస్కు సౌతాఫ్రికా జట్టుడేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రీవిస్, కార్బిన్ బాష్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), క్వేనా మఫాకా, వియాన్ ముల్డర్, లుంగీ ఎంగిడీ (రెండో టెస్టు మాత్రమే), లువాన్-డ్రే ప్రిటోరియస్, లెసెగో సెనోక్వానే, ప్రెనెల్ సెనోక్వానే

మరీ ఇంత చీప్గా ఔట్ అవుతావా..? గంభీర్ రియాక్షన్ వైరల్
టీమిండియా యువ ఆటగాడు సాయిసుదర్శన్ తన టెస్టు కెరీర్ను పేలవంగా ఆరభించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం చేసిన సుదర్శన్ తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో 4 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో అనవసర షాట్కు ప్రయత్నించి వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అయితే సుదర్శన్ క్రీజులో వచ్చినప్పటినుంచే ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. సుదర్శన్ తను ఎదుర్కొన్న తొలి బంతికే బ్రైడన్ కార్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత తొలి రోజు లంచ్కు ముందు ఓవర్ వేసిన స్టోక్స్ బౌలింగ్లో జైశ్వాల్ సింగిల్ తీసి సుదర్శన్కు స్ట్రైక్ ఇచ్చాడు. స్టోక్స్ రెండో బంతిని సుదర్శన్కు లెగ్ సైడ్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని సుదర్శన్ ఆడకుండా వదిలేశాడు. అనంతరం మూడో బంతిని కూడా అదేవిధంగా స్టోక్స్ సంధించాడు. అయితే ఈసారి మాత్రం సుదర్శన్ ట్రాప్లో చిక్కుకున్నాడు. ఆ బంతిని సుదర్శన్ డౌన్ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. బ్యాట్కు తాకి డౌన్ది లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని వికెట్ కీపర్ స్మిత్ డైవ్ చేసి క్యాచ్ను పూర్తి చేశాడు.దీంతో నిరాశతో సుదర్శన్ పెవిలియన్కు చేరాడు. సుదర్శన్ డకౌట్ కావడంతో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే ఐపీఎల్లో అదరగొట్టిన సుదర్శన్.. తన టెస్టు అరంగేట్రంలో ఈ తరహా ప్రదర్శన చేయడం అభిమానులు జీర్ణించుకులేకపోతున్నారు. మరి ఇంత చీప్గా ఔట్ అవుతావా అంటూ పోస్ట్లు పెడుతున్నారు. 34 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.క్రీజులో జైశ్వాల్(49), శుబ్మన్ గిల్(31) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో డకౌటైన సుదర్శన్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2000 సంవత్సరం తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో టాప్-7లో వచ్చి అరంగేట్రంలోనే డకౌట్ అయిన నాలుగో భారత ప్లేయర్గా సుదర్శన్ నిలిచాడు.అరంగేట్ర టెస్టులో డకౌటైన భారత ఆటగాళ్లు వీరే (2000 సంవత్సరం నుంచి)అజయ్ రాత్ర- 2002వృద్ధిమాన్ సాహా- 2010హనుమ విహారి- 2018సాయి సుదర్శన్- 2025*Highly irresponsible, pathetic shot by Sai Sudarshan, especially in a debut match. Does he deserve a place in the Test team?#INDvsENGTest #HeadingleyTest #SaiSudharsan pic.twitter.com/mGaUCLj3QL— Raj Singh (@Rajkumaarsingh) June 20, 2025
బిజినెస్

గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. పాస్వర్డ్లు లీక్
గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, గిట్హబ్లోని డెవలపర్ ఖాతాలు, కొన్ని ప్రభుత్వ పోర్టల్స్లోని దాదాపు 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లు లీక్ అయినట్లు సైబర్న్యూస్, ఫోర్బ్స్ నివేదికలు తెలిపాయి. ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్ల్లో ఇది ఒకటిగా నిలిచిందని పేర్కొన్నాయి. ఈ లీక్ వల్ల మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉందని చెప్పాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఫిషింగ్ స్కామ్లు, ఐడెంటిటీ థెఫ్ట్, అకౌంట్ హ్యాకింగ్కు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తి చేశాయి.లీక్ అయిన డేటా ఏళ్ల తరబడి ఉన్న పాత సమాచారం మాత్రమే కాదని భద్రతా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం కొత్త డేటా, బాగా వ్యవస్థీకృతమైన సమాచారం ఉందన్నారు. ఈ లీక్ల కోసం సైబర్ నేరగాళ్లు ఇన్ఫోస్టీలర్స్ అని పిలువబడే ఒక రకమైన మాల్వేర్ను ఉపయోగించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మాల్వేర్ ప్రోగ్రామ్లు యూజర్లకు తెలియకుండానే తమ పరికరాల నుంచి లాగిన్ పాస్వర్డ్లను దొంగిలించి హ్యాకర్లకు పంపుతాయన్నారు. ఈ సమాచారాన్ని డార్క్ వెబ్ ఫోరమ్ల్లో అమ్మకానికి ఉంచుతారని తెలిపారు.లీకేజీలో ఏముంది?లీకైన డేటాలో గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి గిట్హబ్ల్లోని డెవలపర్ ఖాతాల్లోని సమాచారం ఉందనే అంచానాలున్నాయి. కొన్ని ప్రభుత్వ పోర్టల్స్ లాగిన్ సమాచారం కూడా లీకైందని చెబుతున్నారు. ఈ డేటా అంతా నిర్మాణాత్మకంగా, ఉపయోగించదగినదిగా ఉన్నందున నిపుణులు ఈ లీక్ను ‘గ్లోబల్ సైబర్ క్రైమ్ కోసం బ్లూప్రింట్’ అని పిలుస్తున్నారు. దాదాపు 30 బిగ్ డేటా సెట్లు, ఒక్కొక్కటి మిలియన్ల నుంచి బిలియన్ల లాగిన్ వివరాలు వివరాలను సేకరించాయని, మొత్తం 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లను దొంగిలించారని భావిస్తున్నారు.ఎందుకంత తీవ్రతదొంగిలించబడిన ఈ డేటాను ఎంత సులభంగా కొనుగోలు చేయవచ్చనే దానిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ మొత్తంలో డబ్బు ఉన్నవారు కూడా డార్క్ వెబ్లో ఈ పాస్వర్ట్లను యాక్సెస్ చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది రోజువారీ వినియోగదారుల నుంచి పెద్ద కంపెనీల వరకు దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది.ఇదీ చదవండి: వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటాఇప్పుడు ఏం చేయాలి?సంప్రదాయ పాస్వర్ట్ల నుంచి పాస్ కీ వంటి మరింత సురక్షితమైన ఆప్షన్లకు మారాలని గూగుల్ ఇప్పటికే వినియోగదారులకు సూచించింది. ముఖ్యంగా లాగిన్ వివరాలు అడిగితే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్స్ ద్వారా పంపే లింక్లను క్లిక్ చేయవద్దని ఎఫ్బీఐ ప్రజలను హెచ్చరించింది. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అన్ని ప్రధాన ఖాతాల్లో పాస్వర్డ్లను మార్చడం, బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్లను ఉపయోగించడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఎ)ను ఆన్ చేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే మోసాలను కట్టడి చేయవచ్చు.

వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటా
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తన మొత్తం సంపద దాదాపు 17 బిలియన్ డాలర్లను తన 100 మందికి పైగా పిల్లలకు పంచాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదు.. ఈ పిల్లలందరూ తన వీర్యదానం వల్ల పుట్టిన సంతానం కావడం విశేషం. ఫ్రెంచ్ మ్యాగజైన్ లీ పాయింట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 40 ఏళ్ల దురోవ్ తాను కనీసం 106 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అని చెప్పారు. వీరిలో ఆరుగురు వేర్వేరు తన భాగస్వాములతో సహజంగా గర్భం దాల్చగా, మిగిలిన 100 మందికి పైగా పిల్లలు 12 దేశాల్లో జన్మించారని చెప్పారు.‘నా పిల్లల్లో కొందరు సహజంగా గర్భం దాల్చి పుట్టినవారున్నారు. చాలామంది నా స్పెర్మ్ దానం వల్ల పుట్టినవారున్నారు. వారంతా నా బిడ్డలే. అందరికీ నా ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయి’ అని చెప్పారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం దురోవ్ నికర విలువ 13.9 బిలియన్ డాలర్ల నుంచి 17.1 బిలియన్ డాలర్ల మధ్య ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఒక్కో బిడ్డకు సుమారు 131 మిలియన్ డాలర్ల నుంచి 161 మిలియన్ డాలర్ల వరకు వారసత్వంగా లభిస్తుంది. అయితే తన పిల్లలకు సమాన హక్కులు ప్రకటించినట్లు ఉన్న ఇంటర్వ్యూ తేదీ(జూన్ 19, 2025) నుంచి 30 సంవత్సరాల వరకు తన ఆస్తిపై హక్కు ఉండదని చెప్పారు. ముప్పై ఏళ్ల తర్వాతే తమకు హక్కులుంటాయన్నారు. వారు స్వతంత్రంగా ఎదగడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దురోవ్ వివరించారు. వారు సాధారణ ప్రజల మాదిరిగా జీవించాలని, ఒంటరిగా తమను తాము నిర్మించుకోవాలని తెలిపారు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..దురోవ్ను ఇటీవల ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై వచ్చిన అనేక ఆరోపణల్లో ప్రధానంగా టెలిగ్రామ్ను మనీలాండరింగ్, పిల్లలపై లైంగిక వేధింపులు.. వంటి వాటికి వినియోగిస్తున్నారనే వాదనలున్నాయి. రష్యాలో జన్మించిన పారిశ్రామికవేత్త దురోవ్కు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటిలోనూ పౌరసత్వం ఉంది. నిర్దిష్ట అనుమతులు లేకుండా ఫ్రాన్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని నిషేధం విధించారు.

బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర(Today Gold Rate) శుక్రవారం వినియోగదారులకు కొంత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్?(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్?
అహ్మదాబాద్లో 270 మందిని బలిగొన్న ఎయిరిండియా ఏఐ-171 డ్రీమ్లైనర్ ప్రమాదానికి టర్కిష్ ఎయిర్లైన్స్ మెయింటెనెన్స్ సెంటర్తో సంబంధం ఉందన్న ఊహాగానాలను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఖండించారు. టైమ్స్ నెట్ వర్క్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఎయిరిండియా ఫ్లీట్లోని 33 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల్లో ఏదీ టర్కీ సంస్థ నిర్వహణలో లేదని స్పష్టం చేశారు.‘ఎయిరిండియా ఆధ్వర్యంలోని 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఏ ఒక్కటీ టర్కిష్ సంస్థ నిర్వహణలో లేదు. వాటిలో చాలా వరకు ఏఈఎస్ఎల్, సింగపూర్లోని ఎస్ఐఏ ఇంజినీరింగ్ నిర్వహణలో ఉన్నాయి. బోయింగ్ 777 విమానాల్లో కొన్నింటిని మాత్రమే టర్కిష్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం ఆయా కాంట్రాక్టులు కూడా సమీక్షలో ఉన్నాయి’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రమాద సంఘటనపై జరుగుతున్న దర్యాప్తునకు సంబంధించి కొందరు విజిల్ బ్లోయర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖరన్ ఈ వాదనలను ‘ఊహాజనితమైనవి’గా అభివర్ణించారు. ఘటనపై మరింత స్పష్టత వచ్చేందుకు విమాన డేటా, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లు, బ్లాక్ బాక్స్ నివేదికల కోసం వేచి ఉండాలని తెలిపారు.‘యూట్యూబ్, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఇలా చాలా మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. బ్లాక్ బాక్స్ డేటాతో నిజం తేలుతుంది. దాని కోసం వేచిచూడాలి తప్పా ఓ నిర్ణయానికి రాకూడదు’ అని అన్నారు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. వారిలో ఎవరినీ ఓదార్చడానికి నాకు మాటలు లేవు. టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థలో జరిగిన ఈ ప్రమాదం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో మేము వారికి తోడుగా ఉండడం తప్పా వారి లోటును తీర్చలేం. వారికి అన్ని విధాలుగా తోడుంటాం. తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, కొడుకును కోల్పోయిన వారిని ఓదార్చడం చాలా కష్టం’ అని అన్నారు.ఇదీ చదవండి: వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధంఈ ఘోర ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది. గుజరాత్ ప్రతినిధి, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ (ఎంవోసీఏ) కార్యదర్శి, ఎంహెచ్ఏ అదనపు కార్యదర్శితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని దర్యాప్తులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసింది.
ఫ్యామిలీ

International yoga day 2025 : ఆరోగ్య ‘యోగం’ ఇంతింత కాదయా
వేగంగా మారుతున్న యుగంలో యువత ఎంతో ఒత్తిడి, అపరిమిత ఆందోళనల మధ్య జీవించాల్సి వస్తోంది. విద్య, ఉద్యోగపోటీలు, డిజిటల్ లైఫ్, సామాజిక ఒత్తిళ్ల మధ్య మానసిక, శారీరక ప్రశాంతత కోల్పోతుంటారు. ‘యువత జీవనవిధానంలో ఏర్పడిన భావోద్వేగ బ్లాకేజ్లను ఎలా తొలగించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగ ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది’ అని వివరిస్తారు యోగా ట్రైనర్ స్వప్న యోగాన్వేష్.‘లండన్లో ఎంబీయే చేసి, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, యోగాతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను’ అని తెలిపిన స్వప్న హైదరాబాద్లో ఐదేళ్లుగా యోగా ట్రైన ర్గా రాణిస్తున్నారు. ‘‘ఇండియాకు వచ్చి, రిషీకేష్ వంటి యోగిక్ ప్లేస్లన్నీ సందర్శించాను. వారాంతంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు ఉచితంగా యోగా శిక్షణా తరగతులు తీసుకుంటుంటాను. సాధారణంగా యువతలో చాలా మంది జిమ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. అది శారీరక ఫిట్నెస్ కోసం ఉపయోగపడుతుంది. యోగా వ్యాయామం మాత్రమే కాదు. శరీరం, మనస్సు, ఆత్మ మూడింటినీ సమతుల్యంగా ఉంచే జీవన విధానం. ఈ కాలంలో యువత ఎక్కువ శాతం డిజటల్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. అన్ని విషయాల మీద చాలా నాలెడ్జ్ వచ్చింది. కానీ, చిన్ననాటి నుంచి రకరకాల ఎమోషనల్ బ్లాకేజీలు అంతర్గతంగా ఏర్పడి, వారితో పాటు ఎదుగుతుంటాయి. వీటి నుంచి రిలాక్స్ అవడానికి యోగా ఒక సాధనంలా ఉపయోగపడుతుంది. యోగా ప్రాచీన భారత సంప్రదాయంలో భాగంగా వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెంది ఉంది. పతంజలి వంటి ఎంతో మంది రుషులు, యోగులు యోగాను సాధన చేసినట్టుగా ్ర΄ాచీన భారతం మనకు చూపుతుంది. యోగా వల్ల లాభాలేంటి అని ప్రశ్నించే ఈ తరానికి చెప్పలేనన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.. చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా?తరగని గని యోగా! మనందరిలో ఫిజికల్, సైకలాజికల్ ట్రామా రెండూ ఉంటాయి. దైనందిన జీవనంలో శ్వాస తీసుకోవడం, వదలడం కూడా సరిగ్గా చేయడం లేదు. దీర్ఘ శ్వాస తీసుకోవడం, అంతే దీర్ఘంగా వదలడం వంటివి యోగా చేయడం వల్లే లభిస్తుంది. యోగాలో ప్రతి ఆసనం శ్వాసతో అనుసంధానించి ఉంటుంది. కొన్ని రోజులు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉంటే తినే ఆహారం, నిద్రా సమయం కూడా క్రమ బద్ధం అవుతుంది. మొదలు పెట్టేప్పుడు ముందుగా శ్వాస యోగా నుంచి ప్రారంభించాలి. అందుకు కపాభాతి వంటి శ్వాస యోగాసనాలు ఉన్నాయి. వారంలో రెండు రోజులు, మూడు రోజులు యోగా చేస్తే సరిపోదు. క్రమం తప్పకుండా చేయాలి. దీని వల్ల తలనొప్పి వచ్చినా.. ఎందుకొచ్చింది? ఫిజికల్గా, మెంటల్గా, ఫుడ్ పరంగా ఎక్కడ మిస్టేక్ అయ్యింది? ఈ సందేహాలకు సమాధానాలు వెంటనే తెలిసిపోతాయి. కోపం, అసహనం, చిరాకు వల్ల బంధాలలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. యోగా సాధన వల్ల వ్యక్తిగత జీవితం, బంధాలు కూడా సెట్ అవుతాయి. అంతర్గత ఆనందం కలిగితే చెడు వ్యసనాల జోలికి ఎంత మాత్రం వెళ్లరు. కపాలబాతి, ప్రాణాయామం.. వంటి శ్వాస వ్యాయామాలు చేయడానికి 8 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. అందుకే, యోగాను సూర్యోదయం సమయంలో ఖాళీ కడుపుతో చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మిగతా ఆసనాలకు కనీసం ఆహారం తీసుకోవడానికి మూడున్నర గంటల ముందు తీసుకోవాలి. లంగ్స్, లివర్, స్టమక్, కిడ్నీ, హార్ట్... మనం చేసే పనులలో ఈ ఐదు ఆర్గాన్స్ పనితీరు బాగుండేలా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉంటాయి. బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇంటర్నల్ హీలింగ్ ద్వారా వీటిని సాధన చేయచ్చు. – స్వప్న యోగాన్వేషి, యోగా ట్రైనర్, హైదరాబాద్ యోగాసనాలు శరీరాన్ని బలపరుస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. మన శరీరంలో ఉన్న ఏడు చక్రాల కుండలిని యాక్టివేట్ చేసి, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ధ్యాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో, ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలుఇస్తుంది.దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది∙మైండ్ఫుల్నెస్ (సంపూర్ణ శ్రద్ధతో జీవించడం) అభివృద్ధి చెందుతుంది.డిప్రెషన్, ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.శ్వాసక్రియ( ప్రాణాయామం) వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.పొట్ట, తల, వెన్నెముక ఆరోగ్యంగా ఉంటాయి.కేటాయించాల్సిన సమయం...యోగాసనాల సాధనకు 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతుంది. ప్రతి రోజు కనీసం 20–30 నిమిషాలు యోగాకు కేటాయించాలి యోగా అంటే కష్టమైన ఆసనాలు కాదు అది అందరూ చేయగలిగేది ∙సరైన గురువు లేదా యాప్ సహాయంతో శాస్త్రీయంగా ప్రారంభించాలి యోగా అనేది యువతకు శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం, సామాజిక నైతికత అన్నింటినీ అందించే ఓ సంపూర్ణ మార్గం. యోగాకు వయస్సు అడ్డంకి కాదు, ముందు అడుగు వేయడమే ముఖ్యంసోషల్ మీడియా డీటాక్స్: రోజంతా మొబైల్, స్క్రీన్ ముందు గడిపే యువతకు యోగా ద్వారా స్వీయ ఆత్మ పరిశీలన జరుగుతుంది. ఇది డిజిటల్ డీటాక్స్కు సహాయపడుతుంది. యువతలో స్థిరత్వం, ఓర్పు, విలువల పట్ల గౌరవం పెరుగుతుంది.ఇదీ చదవండి: ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో -నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

సాహిత్యమే పిల్లలకు మంచి చెప్పాలి
‘మేము చదువుకునే సమయంలో రోజూ మోరల్ ఇన్స్ట్రక్షన్ (ఎం.ఐ.) అనే క్లాస్ ఉండేది. పిల్లల్ని కూచోబెట్టి సార్లు ఒక కథ వినిపించి అందులోని నీతి వివరించేవారు. అసలు నేడు పిల్లలకు ఇంటా బయటా మౌలిక భావాలు ఎవరు చెబుతున్నారు? పెద్దవాళ్లకా టైమ్ లేదు. మరి పిల్లలకు పరోపకారం చేయాలని, దేశభక్తి కలిగి ఉండాలని, మూఢ భావాలు ఉండకూడదని, అందరి పట్లా సమ భావన కలిగి ఉండాలని, ఆధునిక భావాలు కలిగి ఉండాలని... ఎవరు చె ప్పాలి? బాల సాహిత్యమే చె ప్పాలి. పిల్లల చేత పుస్తకాలు చదివిస్తే తప్ప ఇవాళ వారిలో కనిపిస్తున్న దుర్లక్షణాలు పోవు’ అన్నారు గంగిశెట్టి శివ. 71 ఏళ్ల శివకుమార్ దాదాపు యాభై ఏళ్లకు పైగానే బాల సాహిత్యం రాస్తున్నారు. 2025 సంవత్సరానికి గాను ఆయన పుస్తకం ‘కబుర్ల దేవత’కు బాల సాహిత్యం కేటగిరిలో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా ‘సాక్షి ఫీచర్స్ ప్రతినిధి’తో శివకుమార్ సంభాషణ...→ బాల సాహిత్యంలోకి ఎలా వచ్చారు?శివకుమార్: మాది నెల్లూరు జిల్లా రాపూరు. మా నాన్న పోస్టాఫీసులో పని చేసేవారు. తరుచూ బాలమిత్ర, చందమామ ఇంటికి తీసుకొచ్చేవారు. ఆ రోజుల్లో వాటిని చేత్తో తాకడమే పెద్ద సంబరం. 13 ఏళ్ల వయసులో అవి చదివి అలా నేను కూడా కథలు రాయాలనుకునేవాణ్ణి. 14వ ఏట మొదటి కథ పోస్ట్ చేశాను. అప్పటి నుంచి పిల్లల కథలు రాసి పత్రికలకు పంపించడం మొదలుపెట్టాను.→ కథల్లో పిల్లలకు ఏం చెబుతుంటారు?జ: నేను కొడవటిగంటి కుటుంబరావు గారి ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయనలాగే పిల్లల్లో ఆలోచన, విచక్షణ పెరిగే సాహిత్యం ఉండాలని కోరుకుంటాను. మంత్రాలు, తంత్రాలు కాకుండా హేతువుకు ప్రాధాన్యం పెరిగేలా రాశాను. బాలసాహిత్యం చదివిన పిల్లలు తమకు తాము మేలు చేసుకోవాలి, సమాజానికి మేలు చేయాలి. ఇవి చేయడానికి వీలు కల్పించని సాహిత్యం మంచి బాల సాహిత్యం కాదు. ఇవాళ్టి పిల్లలు రేపటి ΄ పౌరులు మాత్రమే కాదు మహా పురుషులు కావాలి. కాని ఏ మహాపురుషుడి గురించి వీరు తెలుసుకుంటున్నారు... చదువుతున్నారు? మనందరం గాంధీ, నెహ్రూ గాథల నుంచి కదా ఇన్స్పయిర్ అయ్యింది?→ ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు రాశారు?జ: పది పుస్తకాలు రాశాను. కథలు వందల కొద్దీ రాశాను. నేను బి.ఎస్సీ చదివి తెలుగు ఎం.ఏలోకి వచ్చాను భాష మీద ప్రేమతో. ఇవాళ ఎంతమంది అలా వస్తున్నారు? భాష, సాహిత్యాలకు బడులలో ప్రాధాన్యం లేదు. మార్కులు, ర్యాంకులు ప్రధానమయ్యాయి తల్లిదండ్రులకు. వ్యక్తిత్వం మార్కులతో, ర్యాంకులతో రాగలదా? వ్యక్తిత్వ నిర్మాణమే దేశ నిర్మాణం అని తెలుసుకోవాలి. ఇవాళ టీచర్ల మీద దాడి చేస్తున్న పిల్లలు, తల్లిదండ్రులను ఆదరించని పిల్లలు ఏ సంస్కృతికి ప్రతిఫలం? ఇలాంటి పిల్లలు గొప్ప సాహిత్యం, నైతిక విలువలు పాదుకొలిపే పుస్తకం ఒక్కటి కూడా చదివి ఉండరు. వీరి చేత చదివించని పెద్దలు వీరి నుంచి మంచి నడవడికను మాత్రం ఆశిస్తారు. అదే విచిత్రం.→ ‘కబుర్ల దేవత’ పుస్తకానికి మీకు పురస్కారం వచ్చింది. ‘కబుర్ల దేవత’ కథ పేరు. అందులో ఏముంది?జ: కొంతమంది మాటలు చెప్పి బతగ్గలరు. అదొక స్కిల్. అది అందరికీ రావాలని లేదు. అంతమాత్రాన పనిమంతుడికి విలువ తగ్గదు. పని తెలిసినవాడు తన పని తాను చేసుకెళ్లాలి. దానికీ ఫలితం ఉంటుంది. మాట్లాడేవాళ్లను చూసి బెదరిపోవద్దు అనే వ్యక్తిత్వ వికాస కోణంలో ఆ కథ పిల్లలకు చె ప్పాను.→ మీకు నచ్చిన బాల సాహిత్యకారులు?జ: కలువకొలను సదానంద గారు మంచి సాహిత్యం రాశారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యే శైలి వారిది. కె.సభా కూడా మంచి బాల సాహిత్యం రాశారు. → మీ ఇతర వివరాలుజ: నేను నెల్లూరు జిల్లాలోనే వివిధ చోట్ల ఉ పాధ్యాయునిగా పని చేసి రిటైర్ అయ్యాను. మ అబ్బాయి చెన్నైలో, అమ్మాయి నెల్లూరులో స్థిరపడ్డారు. రిటైరయ్యాక కూడా ఒక స్కూల్ బాధ్యతలు చూస్తున్నాను. పిల్లలను కంట్రోల్ చేయడం ఎంత కష్టంగా ఉందో చెప్పలేను. పిల్లలు ఇలా ఎందుకు ఉన్నారో అందరూ కలిసి ఆలోచించాలి. పిల్లల బాధ్యత సమాజం బాధ్యత అనుకోనంత వరకూ బాలల వికాసం పరిపూర్ణంగా జరగదు.

మిసెస్ బిహార్ 2025గా బీజేపీ ఎమ్మెల్యే భార్య..!
ఇటీవల మహిళలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు నిదర్శనం వారు సాధిస్తున్న విజయాలే. పెళ్లిచేసుకుని, పిల్లలను కని..అక్కడితో తమ జీవితాన్ని పరిమితం చేయడం లేదు. కొన్నేళ్లు విరామం ఇచ్చి మళ్లీ తమ కెరీర్లో పుంజుకోవడమో లేదా తమకు నచ్చిన వ్యాపకంతోనో ముందుకు సాగుతున్నారు. పైగా అందులో అనూహ్యమైన విజయాలు అందుకుని స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆ కోవకు చెందినవారే ఐశ్వర్య రాజ్ఇటీవల బిహార్లో మిసెస్ బిహార్ 2025 పోటీలు ముగిశాయి. ఆ పోటీల్లో భోజ్పూర్ జిల్లా, తరారి బిజెపి ఎమ్మెల్యే విశాల్ ప్రశాంత్ భార్య ఐశ్వర్య రాజ్ మిసెస్ బిహార్గా కిరీటాన్ని దక్కించుకోవం విశేషం. ఆమె ఆధునిక ఆశయాలు, సంప్రదాయ విలువలు కలిగిన శక్తిమంతమైన మహిళ. బిహార్లోని ప్రముఖ రాజకీయ కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని కలిగి ఉన్న మహిళ ఐశ్శర్య రాజ్. ఈ పోటీలో 14 మంది మహిళలు కిరీటం కోసం పోటీపడగా..ఐశ్వర్య తన ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో విజయం సొంతం చేసుకుని కిరీటాన్ని కైవసం చేసుకుంది. అంతేగాదు తన గెలుపుతో మహిళలు కుటుంబ జీవితానికే పరిమితం కాకుండా తమదైన రంగంలో ఎలా గెలవాలో ప్రేరణగా నిలిచారామె. ఇక పాట్నాలో పెరిగిన ఐశ్వర్య చదువంతా ఢిల్లీలోనే సాగింది. అక్కడే ఫైనాన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు. అలాగే కార్పొరేట్ ప్రపంచంలో కూడా తనదైన ముద్రవేసింది. కాగా, పలువురు నెటిజన్లు ఆమె గెలుపుని బిహార్కే గర్వకారణం. పైగా ప్రతిభ, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలనుకునే మహిళలకు ఆమె స్ఫూర్తి అంటూ ఐశ్వర్యపై ప్రశంసల జల్లు కురిపిస్తు పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by 👑 AISHWARYA RAJ 👑 (@aishwarya.raj95) (చదవండి: ఐదు పదుల వయసులోనూ యువకుడిలా రాహుల్ గాంధీ..! రీజన్ అదే..)

Today Tip : బాల్కనీ మొక్కలు.. అదిరిపోయే చిట్కా!
మిద్దె తోటలు, చిన్న చిన్న బాల్కనీలోనే మొక్కల్ని పెంచడం ఇపుడు సర్వ సాధారణం. కానీ నర్సరీనుంచి తెచ్చినపుడు పచ్చని ఆకులు, పువ్వులతో కళ కళలాడుతూ ఉండే మొక్కలు, మనం కుండీలలోకి మార్చగానే , ఎదుగుదల లేకుండా, ఉండిపోతాయి. ఇలా ఎందుకు ఉంటాయో తెలుసా? వాటికి సరైన పోషణ లేక పోవడమే ముఖ్య కారణం. మరి పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా, మన ఇంట్లోనే సులభంగా దొరికే వాటితో చక్కటి ఎరువును తయారు చేసుకోవచ్చు. టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అదెలాగో చూద్దాం.ఎలాంటి మొక్క అయినా దాని సహజ లక్షణం ప్రకారం పువ్వులు పూయాలన్నా,కాయలు కాయాలన్నా తగిన ఎండ, నీటితోపాటు పోషకాలు కూడా కావాలి. పొటాషియం,ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం పోషకాలు మొక్కల పునరుత్పత్తి సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా అరటి తొక్కల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇదీ చదవండి: Tip of the day కాన్సంట్రేషన్ కుదరడం లేదా? ఇవిగో చిట్కాలు!అరటి తొక్కల్లో ఇవన్నీ లభిస్తాయి. బనానా పీల్ ఫెర్టిలైజర్ ద్వారా మొక్కల్లో పూలు, పండ్లు ఎక్కువగా రావడమే కాదు, పండ్ల మొక్కలకు దీన్ని ఎరువుగా వేస్తే పండ్లు రుచిగా తయారవుతాయి. తొక్కల్లోని పొటాషియం మొక్కలు వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది.ఎలా వాడాలి? అరటి పండు తొక్కలను నేరుగా మొక్కల మధ్య మట్టిలో పాతిపెట్టవచ్చు. ఇది కొన్ని రోజులకు కుళ్లి, ఎరువుగా మారి మొక్కకు చక్కటి పోషకాన్ని అందిస్తుంది.అరటి పండు తొక్కలను వేడి నీటిలో బాగా మరిగించి,చల్లారిన తరువాత ఈ టీని కుండీకి ఒక గ్లాసు చొప్పున అందించాలి. ఇలా చేస్తు గులాబీ మొక్కలు నాలుగు రోజులకే మొగ్గలు తొడుగుతాయి.అరటి పళ్ల తొక్కలను ఒక బాటిల్వేసి, నీళ్లు పోసి, 24 గంటలు పులిసిన తరువాత, దీనికి కొద్దిగా నీళ్లు కలుపుకొని నేరుగా ఆ వాటర్ను మొక్కలకు పోయవచ్చు.లేదంటే బనానా తొక్కల్ని బాగా ఎండబెట్టి, పొడిగా చేసుకుని నిల్వ చేసుకుని కూడా వాడుకోవచ్చు.అరటి తొక్కలతో తయారు చేసిన ద్రావణం, టీ లేదా ఫెర్టిలైజర్ను ప్రతీ 4-6 వారాలకు మొక్కలకు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని అరటిపండు తొక్కలను చిన్న చిన్నముక్కలుగా కట్ చేసి, నీళ్లలో వేసి మరిగించి, చల్లారిన తరవాత మొక్కల మొదట్లో మొక్కకు ఒక చిన్న కప్పు చొప్పున పోసుకోవాలి. ప్రపంచంలోనే అరటి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మనదేశంలో అరటిపండు వ్యర్థాలను వినియోగించుకుంటే రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. సహజమైన సూక్ష్మజీవుల చర్యలు జరిగి నేలకూడా సారవంతమవుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన మొక్కలు ,దీర్ఘకాలిక స్థిరమైన పర్యావరణ వ్యవస్థ మన సొంతమవుతుంది.
ఫొటోలు
అంతర్జాతీయం

మధ్యవర్తిత్వానికి సిద్ధం: పుతిన్
మాస్కో: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణకు తెరదించడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత పుతిన్ చెప్పారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ శాంతియుత ప్రయోజనాల కోసం ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించేలా ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడానికి అవసరమైన చర్చలకు సహకరిస్తానని తెలిపారు. ఆయన గురువారం అంతర్జాతీయ వార్తా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణ నిజంగా చాలా సంక్లిష్టమైన అంశమని పేర్కొన్నారు. అయినప్పటికీ దీనికి పరిష్కార మార్గం కనిపెట్టవచ్చని స్పష్టంచేశారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ హత్య చేస్తే రష్యా ఎలా స్పందిస్తుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, దానిపై మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. ఖమేనీ హత్య జరుగుతుందని అనుకోవడం లేదని పుతిన్ ఉద్ఘాటించారు. మరోవైపు పుతిన్ ప్రతిపాదన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ‘‘ముందు మీ సంగతి చూసుకోండి. ఉక్రెయిన్తో యుద్ధం ఎలా ఆపాలో ఆలోచించుకోండి. మీకు మీరే మధ్యవర్తిత్వం వహించుకోండి. నా కోసం ఈ సాయం చేయండి. మీ సొంత సమస్య గురించి ఆలోచించుకున్న తర్వాత ఇజ్రాయెల్–ఇరాన్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది’’ అని పుతిన్కు చురక అంటించారు.ఆధునిక హిట్లర్ అంతం కావాల్సిందే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ వ్యాఖ్య ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీని ఆధునిక హిట్లర్గా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ అభివర్ణించారు. ఇరాన్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైన ఇజ్రాయెల్లోని హోలోన్ సిటీలో మీడియాతో మంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’మాట్లాడారు. ‘‘మాకు పైనుంచి ఆదేశాలు అందాయి. పూర్తి లక్ష్యాలను సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం. అసలు ఈపాటికే మేం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్)ను పంపి ఆయనను అంతంచేయా ల్సింది. ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులను చూస్తుంటే ఖమేనీ ఒక ఆధునిక హిట్లర్లా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులు, జనావాసాలపై క్షిపణులు వేయాలని ఆదేశిస్తున్నారు. అణుబాంబు ఉపద్రవాన్ని అడ్డుకోవడమే మా లక్ష్యం’ అని కట్జ్ అన్నారు.

ఆస్పత్రిపై క్షిపణుల దాడి
బీర్షెబా/టెహ్రాన్/టెల్ అవీవ్/దుబాయ్/వాషింగ్టన్: అంతూదరీ లేకుండా భీకరంగా కొనసాగుతూ పశ్చిమాసియా శాంతిదీపం కొండెక్కేలా చేస్తున్న ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం మరింతగా విస్తరిస్తోంది. కయ్యానికి కాలు దువ్వుతూ యుద్ధజ్వాలను మరింత రాజేసిన ఇజ్రాయెల్పై ఇరాన్ గురువారం బదులు తీర్చుకుంది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. వాటిల్లో కొన్ని బాలిస్టిక్ క్షిపణులు దక్షిణ ఇజ్రాయెల్లోనే అత్యంత పెద్ద ఆస్పత్రి అయిన బీర్షెబా నగరంలోని వేయి పడకల సొరొక ఆస్పత్రిపై పడ్డాయి. క్షిపణుల ధాటికి ఆస్పత్రి ధ్వంసమైంది. ఈ దాడి ఘటనలో 80 మందికిపైగా గాయాలపాలయ్యారు. మంటలు అంటుకుని, అగి్నకీలలు ఎగసిపడుతున్న భవనం నుంచి రోగులను సహాయక బృందాలు స్ట్రెచర్లపై బయటకు తీసుకొస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ఆస్పత్రిపై దాడి జరగబోతోందని సైరన్లు వినిపించడంతో చాలా మంది ముందుగానే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆస్పత్రిలో కొంతభాగాన్ని ఒకరోజు ముందే ఖాళీచేయించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆస్పత్రిలో 700 మంది రోగులున్నారు. గురువారం దేశవ్యాప్తంగా ఇరాన్ జరిపిన దాడుల్లో 270కిపైగా ఇజ్రాయెలీలు రక్తమోడారు. టెల్ అవీవ్, రమాత్ గాన్, రెహోవోత్ సిటీ సహా పలు నగరాలపైనా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. పలు భవనాలు పాక్షికంగా ధ్వంసమైన దృశ్యాలను ఇజ్రాయెల్ టీవీచానళ్లు ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. సిటీలోని గవ్యమ్ నెగెవ్ ఇజ్రాయెల్ సైనిక నిఘా కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోగా పొరపాటున ఆస్పత్రిపై క్షిపణులు పడ్డాయని తెలుస్తోంది. అయితే ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే పౌరుల రక్తం కళ్లజూస్తోందని, ఇందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ‘‘మాకు అమెరికా సాయం చేస్తుందన్న నమ్మకం నాకుంది. అమెరికాకు ఏది అత్యుత్తమమో అదే ట్రంప్ చేస్తారు’’ అని నెతన్యాహూ అన్నారు. అయితే యుద్ధంలో పాల్గొనాలా వద్దా అనేదానిపై మరో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని శ్వేతసౌధం ప్రకటించింది. చర్చలకు ఇంకా అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారని వైట్హౌస్ ప్రెస్సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. ప్లుటోనియం చిక్కకుండా దాడులు ప్రస్తుతం క్రియాశీలంగా లేని ఇరాన్లోని ఖోŠన్దాబ్ పట్టణ సమీపంలోని అరాక్ భారజల రియాక్టర్పై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దాడులుచేశాయి. దాడుల తర్వాత ఈ రియాక్టర్ నుంచి ఎలాంటి రేడియోధారి్మకత వెలువడలేదని ఇరాన్ తెలిపింది. అణురియాక్టర్లను చల్లబరిచేందుకు భారజలాన్ని ఉపయోగిస్తారు. ఇలా అణురియాక్టర్లను చల్లబరిచినప్పుడు ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా ప్లుటోనియం అనే అత్యంత శక్తివంతమైన పేలుడుపదార్థం ఏర్పడుతుంది. దీనిని సైతం అణుబాంబు తయారీలో ఉపయోగించుకోవచ్చు. యురేనియంను 90 శాతం శుద్ధ్దత స్థాయికి తీసుకొచ్చాకే అణుబాంబు తయారీకి పనికొస్తుంది. యురేనియం శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ క్షిపణిదాడుల నేపథ్యంలో ఇరాన్కు అణుబాంబు తయారీలో ఈ ప్లుటోనియం అక్కరకొస్తుంది. ఇలా ఉపయోగపడకూడదనే ఉద్దేశంలోనే అరాక్ హెవీవాటర్ రియాక్టర్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులుచేసింది. గురువారం నాటికి యుద్ధంలో ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 639 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,300 మందికిపైగా గాయాలపాలయ్యారు. దీనికి ప్రతిగా ఇరాన్ ప్రయోగించిన 400కుపైగా క్షిపణుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. అప్రమత్తంగా ఉన్న అమెరికా యుద్ధవిమానాలు అత్యవసర పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు సాయం చేయాల్సి వస్తే ఇరాన్ ప్రతిదాడులు చేస్తుందన్న అంచనాతో అమెరికా యుద్ధవిమానాలను ఆయా వైమానిక స్థావరాల నుంచి వేరే చోటుకు తరలించారు. ముఖ్యంగా ఖతార్లోని దోహాలో ఉన్న అల్ ఉదేయిద్ అమెరికా వైమానిక స్థావరంలోని సైనిక, ఆయుధ రవాణా విమానాలు, యుద్ధవిమానాలు, డ్రోన్లను వేరే చోటుకు తరలించినట్లు తెలుస్తోంది. తొలుత దాక్కుని తర్వాత దాడి చేయడం అమెరికా వ్యూహమని కొందరు యుద్ధనిపుణులు చెప్పారు. మరోవైపు భారత్, జపాన్, చైనా, ఇండోనేసియా, ఒమన్ తదతర దేశాలు తమ పౌరులను ఇరాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తరలిస్తున్నాయి.

ఆ దుస్సాహసం వద్దు.. అమెరికాకు రష్యా వార్నింగ్
మాస్కో: ‘ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో తాము భాగస్వాములం కావొచ్చు. కాకపోవచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా ఒకడుగు ముందకేసి మరీ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇజ్రాయిల్-ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. కాగా, ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య యుద్ధం భీకర రూపాన్ని దాల్చింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసమైంది. ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపిస్తోంది. చాలా నగరాలు నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. వలసదారులు తప్పితే ఇరాన్ నగరాల రోడ్లపై ఎవరూ కనిపించడం లేదు.

నో బ్రా.. నో ఎగ్జామ్!!
ఆ అమ్మాయిలంతా పరీక్ష రాసేందుకు క్యూ లైన్లో నిలబడ్డారు. ఒక్కొక్కరిగా ముందుకు వెళ్తున్న క్రమంలో.. వాళ్ల ముఖంలో హవభావాలు మారిపోతున్నాయి. తనిఖీల పేరుతో అక్కడి సిబ్బంది ఇబ్బందికరంగా తాకుతుండడమే అందుకు కారణం. అదీ అధికారిక పద్ధతిలోనే కావడం ఇంకా దారుణం. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెతుతున్నాయి. పరీక్షా హాల్లోకి ప్రవేశించే ముందు మహిళా విద్యార్థులను బ్రా ధరించారా? లేదా? అని ఛాతీ భాగాన్ని తాకుతూ కనిపించారు. ఈ ఘటన విద్యా సంస్థల్లో వ్యక్తిగత గౌరవం, మానవ హక్కులు, మరియు లైంగిక సమానత్వం వంటి అంశాలపై తీవ్ర చర్చకు దారితీసింది. నైజీరియాలోని ఒలాబిసీ ఒనాబంజో యూనివర్సిటీలో (Olabisi Onabanjo University - OOU) చోటు చేసుకుంది. పరీక్షకు హాజరయ్యే బాలికలు, విద్యార్థినుల కోసం డ్రెస్ కోడ్ రూల్స్ పెట్టింది. కురచ దుస్తులు వేసుకున్నా.. శరీర భాగాలు కొంచెం కనిపించినా అది వర్సిటీ నైతికతను దెబ్బ తీసే అంశమని పేర్కొంది. పైగా ఎదుటివాళ్లను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని తెలిపింది. ఈ క్రమంలో నో బ్రా.. నో ఎంట్రీ ఫర్ ఎగ్జామ్ రూల్ను కఠినంగా అమలు చేయించింది. 📌 ఘటనపై యూనివర్సిటీ పెద్దలు మాత్రం అధికారికంగా స్పందించలేదు. No bra, no exam అనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు.. విద్యార్థి సంఘం అధ్యక్షుడు ముయిజ్ ఒలాటుంజీ ఈ విధానంపై మిశ్రమ స్పందన తెలియజేశారు. అయితే.. ⚖️ మానవ హక్కుల సంఘాల ప్రతినిధి హరునా అయాగీ మాత్రం ఇది విద్యార్థుల హక్కులను ఉల్లంఘించే చర్యగా పేర్కొంటూ, చట్టపరమైన చర్యలకు వెళ్తామని హెచ్చరించారు.🎓 చేదు అనుభవం ఎదురైన ఆ విద్యార్థినులు మాత్రం.. ఈ విధానాన్ని లైంగిక వేధింపుగా అభివర్ణించారు. “No bra. No entry” is not a new policy in Olabisi Onabanjo University.OOU promotes a dress code policy aimed at maintaining a respectful and distraction-free environment, encouraging students to dress modestly and in line with the institution's values. https://t.co/xO70cBiabG pic.twitter.com/pTWjpABFmT— ART&SCIENCE (@MAO_of_Africa) June 17, 2025👉గమనిక: పై వీడియో కేవలం వార్తకు అనుగుణంగా సమాచారం అందించడానికి మాత్రమే. అశ్లీలతను పెంపొందించడం కోసమో లేదంటే ఎవరినీ అగౌరవపర్చడం కోసమో కాదు
జాతీయం

భారీ సంఖ్యలో ఎయిరిండియా విమానాలు రద్దు
ఢిల్లీ: భారీ సంఖ్యలో విమాన సర్వీసులను ఎయిరిండియా రద్దు అయ్యాయి. నిర్వహణ సమస్యల వల్ల 8 విమానాలను రద్దు చేసింది. 4 అంతర్జాతీయ, 4 దేశీయ విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులకు పూర్తి రీఫండ్, ఉచిత రీషెడ్యూలింగ్ అవకాశం కల్పిస్తునట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.రద్దయిన విమానాలు:AI906 (దుబాయ్–చెన్నై)AI308 (ఢిల్లీ–మెల్బోర్న్)AI309 (మెల్బోర్న్–ఢిల్లీ)AI2204 (దుబాయ్–హైదరాబాద్)రద్దయిన డొమెస్టిక్ విమానాలుAI874 (పుణె–ఢిల్లీ)AI456 (అహ్మదాబాద్–ఢిల్లీ)AI2872 (హైదరాబాద్–ముంబై)AI571 (చెన్నై–ముంబై)కాగా, జూన్ 21 నుంచి జూలై 15 వరకు మూడు విదేశీ మార్గాల్లో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. మరో 16 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను తగ్గించనున్నట్లు వెల్లడించింది. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత అంతరాయాలతో సతమతమవుతున్న ఎయిరిండియా.. షెడ్యూళ్లలో స్థిరత్వం తీసుకురావడం, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యమని పేర్కొంది. ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాలకు అదనపు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలోనే తమ వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను సుమారు 15 శాతం మేర తాత్కాలికంగా తగ్గించాలని ఇప్పటికే ఆ సంస్థ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సర్దుబాట్లు జూన్ 21 నుంచి జూలై 15 వరకు అమల్లో ఉంటాయని ఎయిరిండియా వెల్లడించింది.ఢిల్లీ-నైరోబి, అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో జూలై 15 వరకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఢిల్లీ-నైరోబి రూట్లో వారానికి నాలుగు విమానాలు నడుస్తుండగా, అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో వారానికి మూడు చొప్పున విమానాలు నడుపుతున్నట్లు ఎయిరిండియా పేర్కొంది.అలాగే.. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, తూర్పు ఆసియాలోని నగరాలకు కలిపే 16 అంతర్జాతీయ రూట్లలో కూడా విమానా సర్వీసులను తగ్గించారు. ఉత్తర అమెరికాలో ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్లలో సర్వీసులను తగ్గించారు.యూరప్లో ఢిల్లీ-లండన్ హీత్రో, బెంగళూరు-లండన్ హీత్రో, అమృత్సర్-బర్మింగ్హామ్, ఢిల్లీ-బర్మింగ్హామ్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-మిలన్, ఢిల్లీ-కోపెన్హాగన్, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-ఆమ్స్టర్డామ్ మార్గాల్లో కూడా విమానాల సర్వీసులను కుదించారు. అలాగే, ఢిల్లీ-మెల్బోర్న్, ఢిల్లీ-సిడ్నీ, ఢిల్లీ-టోక్యో హనేడా, ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్) మార్గాల్లో కూడా సర్వీసులను తగ్గించారు.ఇదిలా ఉండగా, విమాన సర్వీసుల కుదింపుపై ఎయిరిండియా సీఈవో ప్రయాణికులకు వివరణ ఇచ్చారు. "విమాన ప్రయాణానికి ముందు భద్రతా తనిఖీలను కఠినతరం చేయడం, మధ్యప్రాచ్యంలో గగనతల మార్గాల మూసివేత వల్ల ప్రయాణ సమయం పెరగడం వంటి కారణాలతో ఈ కుదింపులు చేశాం" అని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఆయన ఎయిరిండియా తరఫున ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై సస్పెన్స్.. ఆరోసారి వాయిదా
ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పడింది. ఈ నెల 22న శుభాంశు రోదసి యాత్ర చేయాల్సి ఉండగా.. యాక్సియం-4 ప్రయోగం వాయిదా పడిందని నాసా తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, అంతరిక్ష ప్రయోగంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇక, ఈ ప్రయోగానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నాసా వెల్లడించింది.ఇదిలా ఉండగా.. శుభాంశు శుక్లా అమెరికాకు చెందిన యాక్సియం-4 మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో ఈ మిషన్ చేపట్టాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడింది.ఇక, భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.NASA's Axiom-4 mission with Indian astronaut Shubhanshu Shukla delayed for sixth time pic.twitter.com/TAaXUZpCnv— UPSC Post 📫 (@upscpost) June 20, 2025

వెండి, ఇత్తడి కళాకృతులు.. పెయింటింగ్లు
న్యూఢిల్లీ: ఇతర దేశాల నేతలను కలిసినప్పు డు కానుకలు అందజేయడమనే ఆనవాయితీని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగి స్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కెనడాలోని జరిగిన జీ7 శిఖరాగ్ర భేటీలో ఆయన పాల్గొనడం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన ఆతిథ్య దేశ ప్రధాని మార్క్ కార్నీతోపాటు ఆయా దేశాల నేతలకు కలకాలం గుర్తుండిపోయే, మన ఘన వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుత మైన కానుకల్ని అందజేశారు. వీటిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇత్తడి, వెండి కళాకృతులతోపాటు ఆకర్షణీయమైన పెయింటింగ్లున్నాయి. కెనడాలోని కననాస్కిస్లో జీ7 భేటీ సమయంలో ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీకి ప్రధాని మోదీ ఇత్తడితో రూపొందించిన బోధి చెట్టు కళా ఖండాన్ని కానుకగా అందజేశారు. గౌతమబుద్ధునికి బోధి వృక్షం కిందనే జ్ఞానోదయమైన విషయం తెల్సిందే. జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక మేల్కొలుపును ప్రతిబింబించేలా బిహార్ కళాకారులు రూ పొందించిన కళారూపమిది. అదేవిధంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ కు తమిళనాడుకు చెందిన డోక్రా నిపుణులు రూపొందించిన నంది విగ్రహాన్ని బహూక రించారు. పరమ శివుని వాహనం నందీశ్వరుడు. సంప్రదాయ భారతీయ లోహ కళను చాటి చెప్పేలా ఈ విగ్రహం కనిపిస్తుంది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ పర్డోకు సంప్రదాయ వర్లి కళాఖండాన్ని కానుకగా ఇచ్చారు. మహారాష్ట్రలోని వర్లి గిరిజనుల జానపద కళ ఇది. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్కు సంప్రదాయ మధుబని పెయింటింగ్ను అందజేశారు. ఛత్తీస్గఢ్కు చెందిన డోక్రా కళాకృతిలో రూపుదిద్దుకున్న ఇత్తడి గుర్రం బొమ్మను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు ప్రధాని మోదీ బహూకరించా రు. పురాతన సంప్రదాయ నైపుణ్యంతో గిరి జన చేతిపనివారు రూపొందించిన బొమ్మ ఇది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డ సిల్వాకు వెదురుతో తయారు చేసిన హంస ఆకారంలోని పడవ బొమ్మను అందజేశారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్కు కల్హాపురి వెండి పాత్రను బహుమతిగా ఇచ్చారు. స్వచ్ఛమైన వెండితో తయారైన ఈ పాత్రపై చేతిలో రూపొందించిన పూల నగిషీలున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఈ కళాకృతి అందంతోపాటు ఘన వారసత్వాన్ని చాటుతోంది. జర్మనీ చాన్సెలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్కు పాలరాతి తో రూపొందించిన సూర్య దేవాలయాన్ని గుర్తుకు తెచ్చే కోణార్క్ చక్రం బొమ్మను బహుమతిగా ఇచ్చారు ప్రధాని మోదీ.

కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. సినిమాను, స్టాండప్ కామెడీని ఆపలేం
న్యూఢిల్లీ: కమల్ హాసన్ స్టారర్ ‘థగ్ లైఫ్’సినిమా విడుదలను అడ్డుకునే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయనే కారణంతో సినిమా, స్టాండప్ కామెడీ లేదా కవితా గోష్టి వంటి వాటిని ఆపలేమని స్పష్టం చేసింది. ‘మన దేశంలో మనోభావాలను దెబ్బతీసే ఘటనలకు ముగింపు కనిపించడం లేదు. స్టాండప్ కమెడియన్ ఏదో అంటే మనోభావాలు దెబ్బతిన్నాయని, విధ్వంసం, నిరసనలకు దిగుతున్నారు. ఎటు వెళ్తున్నాం మనం? ఏంటి దీనర్థం? నిరసనలు చేపట్టారనే కారణంతో సినిమా, స్టాండప్ కామెడీ షో, కవితా గోష్టి వంటి వాటిని ఆపేయాలా?’అంటూ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. కమల్ హాసన్ వ్యాఖ్యల నేపథ్యంలో విడుదల ఆగిన ‘థగ్ లైఫ్’ను కర్ణాటకలో ప్రదర్శించేందుకు ఆదేశాలివ్వాలంటూ మహేశ్ రెడ్డి వేసిన పిల్పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన సమయంలో తగు భద్రత కల్పిస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన హామీకి ధర్మాసనం అంగీకరించింది. ఏ వ్యక్తి గానీ, సమూహం గానీ సినిమా ప్రదర్శనకు అవరోధం కల్పించినా, నష్టపరిచినా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నామంది. తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలంటూ కమల్ హాసన్ను కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్(కేఎఫ్సీసీ) కోరడంపై ధర్మాసనం..‘దీనికి మేం అస్సలు అంగీకరించం. ఒక అభిప్రాయం కారణంగా సినిమాను అడ్డుకుంటారా? స్టాండప్ కామెడీని, కవితా పఠాన్ని ఆపేస్తారా?’అని ప్రశ్నించింది. అయితే, తమకు కొన్ని సమూహాల నుంచి బెదిరింపులు వచ్చినందునే కమల్ను క్షమాపణ చెప్పాలని ఒక లేఖ ద్వారానే కోరామని, అంతే తప్ప కమల్ను బెదిరించలేదని కేఎఫ్సీసీ వివరించింది. బెదిరింపుల విషయాన్ని పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని కేఎఫ్సీసీని ధర్మాసనం ప్రశ్నించింది. సినిమా విడుదల చేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ వచ్చిన బెదిరింపుల విషయం తెలపగా కేఎఫ్సీసీ స్పందించలేదని మహేశ్ రెడ్డి తర ఫు లాయర్ తెలిపారు. బెదిరించిన వారిపై చర్యలు తప్పక తీసుకుంటామని రాష్ట్ర ప్రభు త్వ లాయర్ హామీ ఇచ్చారు. కన్నడ సాహిత్య పరిషత్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ నూలి వాదనలు వినిపించారు. కమల్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కమల్ క్షమాపణ చెబితేనే రాష్ట్రంలో ఆ సినిమా ప్రదర్శన వీలవుతుందని, లేకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘అంటే..థగ్ లైఫ్ అనధికార బ్యాన్ను, థియేటర్లను బుగ్గిపాలు చేసేందుకు మీరు మద్దతిస్తున్నారా?’అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘క్షమాపణ చెప్పడం ఏమిటి? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు. మనోభావాలు గాయపడితే పరువునష్టం కేసు వేయండి..!’అని ధర్మాసనం పేర్కొంది. హింసకు పాల్పడే వారిని తాము ప్రోత్సహించమంటూ కన్నడ సంస్థ తరఫు లాయర్ పేర్కొనగా ‘సినిమా విడుదలను కూడా మీరు అడ్డుకోరాదు’అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్రావు వ్యవహారంలో సిట్ బృందం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో సుప్రీంకోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. ప్రభాకర్రావు విచారణకు సహకరించడం లేదంటున్న సిట్.. ఈ నేపథ్యంలో ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని కోరనున్నట్లు సమాచారం. మరో వైపు ప్రభాకర్రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్రావుని విచారించిన పోలీసులు.. నాలుగోసారి కూడా విచారిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారుల పేర్లు చెప్పడంతో రివ్యూ కమిటీ సభ్యులను పోలీసులు విచారించారు. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం పోలీసులు సైతం రికార్డ్ చేయనున్నారు. నిందితుల విచారణతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా సిట్ అధికారులు సేకరిస్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసెస్కు పంపిన నంబర్లపై సిట్ ఆరా తీస్తోంది. సిట్ అధికారులు స్వయంగా వెళ్లి జితేందర్, అనిల్ నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభాకర్రావు టీం మావోయిస్టు సానుభూతిపరులు అంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్కు అనుమతి ఇవ్వడంపై స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.ఫోన్ ట్యాపింగ్కు ఐజీ లేదా ఆ పై స్థాయి ఆఫీసర్కే అధికారం ఉంది. పదవి విరమణ పొంది.. ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్రావును ఫోన్ లీగల్ ఇంటర్ సెప్సన్కు డిసిగ్నటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ ఆరా తీస్తోంది. డిసిగ్నేటెడ్ అథారిటీకి 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టే అవకాశం.. గడువు ముగిసిన తర్వాత నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.. కానీ ప్రభాకర్రావు ఇష్టం వచ్చినట్లు ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు, ప్రణీత్రావు స్టేట్మెంట్లు కీలకంగా మారాయి. డీజీపీ జితేందర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇవాళ ప్రభాకర్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు.

మంట కలిసిన మానవ సంబంధం
వరంగల్: ధన దాహం.. ఆస్తి పంపకాల్లో తేడాలతో రక్త సంబంధాలు మంట కలిసిపోతున్నాయి.. భూ వివాదంలో అన్నాదమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారితీసింది. సొంత త మ్ముళ్లు (పినతల్లి కుమారులు).. అన్నయ్య వల్లపు కృష్ణ(43)ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య మాణిక్యమ్మకు ఒక కొడుకు కృష్ణ, ముగ్గురు కుమార్తెలు ప్రమీల, రమణ, వినోద ఉన్నారు. రెండవ భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్, మహేశ్ ఉన్నారు.లింగయ్యకు గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం లింగయ్య తన ముగ్గురు కొడుకులకు, కూతురు రమణకు భూమి పట్టా చేయించాడు. కొన్నేళ్ల తర్వాత భూమి పంపకాలు చేశాడు. బిడ్డకు ఎందుకు పట్టా చేశావని రెండో భార్య కొడుకులు తండ్రితో గొడవ పడుతున్నారు. పలుమార్లు పంచాయితీలు, పోలీస్ స్టేషన్లో కేసుల దాకా వెళ్లింది. అయినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ క్రమంలో భూమి పంపకాల్లో రిజిస్ట్రేషన్ సర్వేనంబర్ ప్రకారం రెండో భార్య కొడుకుల్లో ఒకరు నరేశ్కు రోడ్డు వైపు వచ్చింది. కాగా, తండ్రి.. ముగ్గురు కుమారులకు రోడ్డువైపు సమానంగా ఉండేలా పంపకాలు చేశాడు. కానీ, నరేశ్ రిజిస్ట్రేషన్ ప్రకారం తనకు భాగం వచ్చిందంటూ తండ్రి చేసిన పంపకాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ పంచాయితీ ముదిరిపాకాన పడింది. కృష్ణ తన భార్య సత్యవతి, కుమారుడు మిన్ను, కుమార్తెతో కలిసి హైదరాబాద్లో బతుకుతున్నాడు. ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్ నుంచి సీరోలుకు వచ్చాడు. బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తమ్ముళ్లు నరేశ్, మహేశ్, వారి భార్యలు, కాంపలి్లకి చెందిన నున్న వీరన్న(నరేశ్ బావమరిది) కలిసి వ్యవసాయ భూమి వద్ద కృష్ణతో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడికి చేరుకున్నాడు. గొడవ ముదరడం, తండ్రి గొడవను ఆపే యత్నం చేశారు. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో నరేశ్ తన అన్న కృష్ణ కుడి మెడపై నరికాడు. ఆపే యత్నం చేస్తున్న తండ్రికి సైతం గాయాలయ్యాయి. కృష్ణ రక్తమడుగులో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో సీరోలు ఎస్సై నగేశ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, తండ్రి లింగయ్యను చికిత్స నిమిత్తం వెంటనే మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మరిపెడ సీఐ రాజ్కుమార్ సీరోలుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిందితుడు నరేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొడుకు పుట్టిన రోజే తండ్రి మరణం..మృతుడు వల్లపు కృష్ణ కొడుకు మిన్ను పుట్టిన రోజు బుధవారం. సాయంత్రం వేడుకలు చేద్దామని అనుకున్న తరుణంలో ఈ హత్య జరగడంతో ఆ కుటుంబాన్ని కుంగదీసింది.

ప్రియుడే కాలయముడు?
విశాఖపట్నం: భీమిలి కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవిత మృతి కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. భీమిలి బీచ్రోడ్డు సమీపంలోని జీడి తోటలో బంగారు కవిత మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడే కవితను కిరాతకంగా హత్య చేసి.. నెల రోజులుగా ఏమీ ఎరుగనట్టు నాటకమాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. క్రైమ్ సినిమా కథను తలపించేలా సాగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివి.. కృష్ణా కాలనీకి చెందిన బంగారు కవితకు, భీమిలికి చెందిన పారిశుధ్య కార్మికుడు బొడ్డు రాజుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత కొంతకాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి, తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కవితను అడ్డు తొలగించుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మాట్లాడదామనే నెపంతో గత నెలలో ఆమెను బీచ్రోడ్డు సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల వద్దకు పిలిపించాడు. అక్కడికి వచ్చిన ఆమెపై రాయితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పక్కనే ఉన్న జీడి తోటలోకి తీసుకెళ్లి, ఒక చెట్టు కొమ్మకు వేలాడదీసి వచ్చేశాడు. ఆ తర్వాత రాజు ఏమీ తెలియనట్టు అందరితో కలిసి తిరుగుతూ, పోలీసులను సైతం తప్పుదోవ పట్టించాడు. కవిత కనబడటం లేదని ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానంతో రాజును పలుమార్లు విచారించారు. అయినప్పటికీ తనకు ఏమీ తెలియదని నమ్మబలుకుతూ దర్యాప్తును పక్కదారి పట్టించాడు. అయితే కవిత మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా ఆధారాలతో బొడ్డు రాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అతడు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఒక వైపు దారుణ హత్యకు పాల్పడి, మరో వైపు నెలరోజుల పాటు అందరినీ నమ్మించిన రాజు తీరుపై పోలీసులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగితే, దాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెట్టి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. బుధవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ప్లంబర్ చీలి సింగయ్య (53)ను టాటా సఫారీ (ఏపీ 26 సిఈ 0001) వాహనం ఢీకొంది. దీని వెనుక చాలా దూరంలో జగన్ కాన్వాయ్ వస్తోంది. ఇదే అదునుగా పచ్చ మీడియా రెచ్చిపోయింది.ఈ ప్రమాదాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. అంతటితో ఆగక టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్పష్టత ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మధ్యాహ్నం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, దానికంటే 50 మీటర్ల ముందు టాటా సఫారీ వాహనం తగిలి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) గాయపడ్డాడు. అతన్ని 108 అంబులెన్స్లో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.కాగా, సింగయ్య ప్రమాదం బారిన పడటాన్ని గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సింగయ్యకు భార్య లూర్థు మేరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాస్తవం ఏమిటో తెలిశాక కూడా టీడీపీ ట్విటర్ ఖాతా నుంచి ఆ తప్పుడు పోస్టును తొలగించకపోవడం గమనార్హం.