
తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు నిజ స్వరూపాన్ని, రాజకీయ కుట్రను సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది.

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని చంద్రబాబు సిట్ను కోర్టు రద్దు చేసింది.

చంద్రబాబుకు వ్యక్తిత్వం ఉంటే ముందుగా ప్రజలను క్షమాపణ కోరాలి. తప్పు జరిగిందని తిరుమల స్వామి వారిని వేడుకోవాలి.

తన రాజకీయ ప్రయోజనం కోసం, దేవుడంటే, భయం భక్తి లేకుండా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇంత జరిగినా కనీసం పశ్చాత్తాపం లేదు.

లడ్డూ విషయంలో టీటీడీ ఈవో నిజం చెప్పినా.. చంద్రబాబు వక్రీకరించారు. పదే పదే అబద్దమే ప్రచారం చేశారు.

ధర్మారెడ్డి నాకు బావా?. కరుణాకర్రెడ్డి నాకు మామ అంట. మనిషి అన్నాక కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా?. టీడీపీ సోషల్ మీడియా అత్యంత నీచంగా వ్యవహరిస్తోంది.

ఇవన్నీ విషయాలు వెలుగులోకి వచ్చాయంటే దేవుడి దయతోనే. వెంకటేశ్వరస్వామినే నడిపిస్తున్నాడు. ఆయనే వారికి మొట్టికాయలు వేస్తాడు.

దేవుడి విషయంలో బాబు తప్పుడు కూతలు కూసినా ఎత్తి చూపకపోవడం ఎంత వరకు కరెక్ట్?. అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేయడమేనా పవన్ వైఖరి?.

పవన్కు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా?

తెలిసి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటారా?.

రాబోయే రోజుల్లో దేవుడి కోపం రాష్ట్ర ప్రజలపై పడకూడదని దేవుడిని కోరుకుంటాను. చంద్రబాబు, కూటమి నేతలకే పరిమితం కావాలి.