comments
-
తీవ్ర మనోవేదనలో ఉండగా మోదీ ఫోన్ చేశారు.. మాజీ సీఎం
ఢిల్లీ: 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో ప్రధాని మోదీ తనకు ఫోన్ చేశారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన రాసిన "అప్నాపన్" 'మై ఎక్స్పీరియన్సెస్ విత్ నరేంద్ర మోదీ' అనే పుస్తకాన్ని మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన 35 ఏళ్ల అనుభవంపై ఒక పుస్తకం రాశారు. అందులో ప్రధానితో ఆయనుకున్న అనుభవాల్ని పంచుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసినప్పటికీ, అందులో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు లేదన్నారు. ఆ సమయంలో తన రాజకీయ ప్రస్థానం అప్పటికే ముగిసిపోయిందన్నట్లుగా ప్రచారం చేశారని ప్రతిపక్షాలు "మేము వెళ్ళిపోతే, మిమ్మల్ని చాలా మిస్ అవుతాము" అనే వాక్యాన్ని ప్రతిపక్షాలు ప్రచారం చేయడం ప్రారంభించాయన్నారు.ఆసమయంలో ప్రధాని మోదీ తనకు ఫోన్ చేశారని " నేను ముఖ్యమంత్రితో కాదు, నా శివరాజ్తో మాట్లాడుతున్నాను. "మీరెందుకు ఇంతగా ఆందోళన చెందుతున్నారు? కొన్ని రోజులు ఏకాంతంలోకి వెళ్ళండి, మీ అంతరాత్మను పరిశీలించుకోండి, మరియు మీ మనస్సును ప్రశాంతం చేసుకోండి." అని తనకు సూచన ఇచ్చినట్లు తెలిపారు. ఆసమయంలో మోదీ ఒక నాయకుడిగానే కాకుండా అన్నలా మాట్లాడారని పుస్తకంలో రాశారు. శివరాజ్ మనోస్థైర్యం దెబ్బతింటే, అది లక్షలాది మంది కార్మికులపై ప్రభావం చూపుతుందని ఆయన సూచించారన్నారు.ఆ తర్వాత ఉత్తరాఖండ్కు వెళ్లి అక్కడ ఆయన గంగా నదీ తీరంలో ధ్యానం చేశానని తిరిగి వచ్చిన తర్వాత, పూర్తి ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. పుస్తకం ప్రకారం, ఆయన 13-14 రోజుల్లో 165కు పైగా ర్యాలీలు నిర్వహించానని పుస్తకంలో రాసుకొచ్చారు. -
హర్ముజ్ ఒప్పందం ఖరారు..? కొట్టిపడేసిన వైట్హౌస్
టెహ్రాన్: ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం అంశంలో చర్చలు జరుగుతున్నాయి. అణు ఒప్పందంపై ఇరాన్ వెనక్కి తగ్గిందని దాదాపు చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై జరిగిన జరిగిన ఒప్పందంలోని అంశాలను ఇరాన్ మీడియా కథనాలు బహిర్గతం చేశాయి.ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ సమాచారం ప్రకారం... నెలరోజుల్లో హర్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాను యుద్ధానికి ముందున్న సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపింది. అయితే దానికి ఇరాన్పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి, ఆ ప్రాంతం నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి అమెరికా అంగీకరించిందని పేర్కొంది.అయితే ఈ జలసంధిని గుండా వెళ్లే ఓడలను తనిఖీ చేసే హక్కు, షిప్పింగ్ లేన్లను నిర్వహించే హక్కు, సర్వీస్ ఫీజులను వసూలు చేసే హక్కు ఇరాన్ దగ్గరే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ఏ దేశానికి చెందిన సైనిక నౌకలకు ఈ ప్రత్యేక నిబంధనలు వర్తించవని పేర్కొంది. ఈ ప్రాథమిక ఒప్పందం కుదిరిన అనంతరం ఇరు దేశాలు 60 రోజుల పాటు తదుపరి చర్చలు జరుపుతాయని ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తుది తీర్మాణాన్ని ఆమెదింప జేస్తారని పేర్కొంది.అయితే ఇరాన్ మీడియా చేసిన ఈ ప్రకటనలను అమెరికా పూర్తిగా కొట్టిపారేసింది. ఈ మేరకు వైట్హౌస్ తన అధికారిక వైట్హౌస్ ఎక్స్ ఖాతాలో "ఇరాన్ నియంత్రణలోని మీడియా విడుదల చేసిన ఈ నివేదికలో ఎలాంటి నిజం లేదు. ఆ అవగాహనా ఒప్పందం పూర్తిగా కల్పితం. ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్తున్న విషయాలను ఎవరూ నమ్మకండి. వాస్తవాలు ముఖ్యం అని పేర్కొందిదిగొచ్చిన ధరలుహర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందనే వార్తలు రాగానే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 90 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్ పునఃప్రారంభంపై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి. -
ట్రంప్ హెల్త్ చెకప్ .. అధ్యక్షుడు సేఫేనా?
వాషింగ్టన్, డీసీ: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను ఆరోగ్యంగా ఫర్ఫెక్ట్ ఉన్నానని ప్రకటించారు. తనకు వైద్య పరీక్షలు అద్భుతంగా జరిగాయని అందులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. త్వరలో డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై చాలానే పుకార్లు వచ్చాయి. ట్రంప్ ఆరోగ్యంగా లేరని వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నాయని కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చేతులపై కమిలిన గుర్తులు ఉండటం, సమావేశాలలో నిద్రపోతున్నట్లు కనిపించడం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితులపై ట్రంప్ కీలక ప్రకటన చేశారుతన ట్రూత్ సోషల్ పోస్ట్లో " అంతా ఖచ్చితంగా ఉంది నేను 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నాను జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిదేమో" అని సరదాగా అన్నారు. జూన్ 14 నాటికి ట్రంప్ 80వ సంవత్సరంలోకి అడుగుపెడతారు. ట్రంప్ ఆరోగ్య పరీక్షలను వైట్ హౌస్ 'వార్షిక పరీక్ష' అని ప్రకటించినప్పటికీ, ట్రంప్ మాత్రం దీనిని 6 నెలల ఫిజికల్ టెస్ట్' అని పేర్కొనడం కొంత గందరగోళానికి దారితీసింది. ట్రంప్ ఆరోగ్య సమస్యలుట్రంప్ 0 గతేడాది ట్రంప్ కాళ్ల వాపు సమస్యతో బాధపడుతున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. సిరల్లోని కవాటాల లోపం వల్ల రక్తం చేరి ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. చేతులపై గుర్తులు: ఆయన చేతులపై కనిపించే మచ్చలకు, గుండె ఆరోగ్య నియమాలలో భాగంగా ఆయన తీసుకునే 'ఆస్పిరిన్'టాబ్లెట్లే కారణమని వైట్ హౌస్ స్పష్టం చేసింది.రాజకీయ ప్రాధాన్యతఅమెరికా రాజకీయాల్లో అధ్యక్షుల వయస్సు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల సమయంలో 81 ఏళ్ల జో బైడెన్ వైదొలిగిన తర్వాత, ట్రంప్ అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధుడైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన ప్రత్యర్థుల కంటే తాను శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉన్నానని ట్రంప్ తరచుగా అంటుంటారు. -
మీ దేశం వెళ్లిపొండి.. భారతీయ జంటపై జాత్యాహంకారం
అమెరికాలో భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ విషయమై ఆ దేశ మంత్రి మార్కో రూబియో వివరణ ఇచ్చినప్పటికీ పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు. తాజాగా అటువంటి ఘటన మరోకటి జరిగింది. భారతీయ సంతతికి చెందిన ఓ జంటను మీరు తిరిగి భారత్కు వెళ్లాలంటూ అమెరికాలో ఉండకూడదంటూ ఓ అపరిచితుడు హెచ్చరించాడు. తాజాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన మార్కోరూబియోను అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార ఘటనలపై ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ .. "ప్రతి దేశంలో ఆన్లైన్లో లేదా బహిరంగంగా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడే కొంతమంది మూర్ఖులు ఉంటారు, కానీ అది ఒక దేశం యొక్క నిజమైన గుర్తింపును నిర్వచించదు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆతిథ్యమిచ్చే దేశాలలో ఒకటిప్రపంచ నలుమూలల నుండి అమెరికాకు వచ్చి, అమెరికన్ సమాజంలో కలిసిపోయి, దేశ ప్రగతికి దోహదపడిన ప్రజల వల్లే దేశం బలోపేతమైంది" అని రూబియో పేర్కొన్నారు.వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఒక ప్రాంతంలో ఒక భారతీయ జంట నిల్చొని ఉంది. అక్కడే ఉన్న ఓ అమెరికా దేశస్థుడు.. ఆ జంటను.. మీరు భారతీయులా . అమెరికా కంటే భారతదేశం మంచిదా అని ప్రశ్నించారు. ఆ దంపతులు సంయమనంతో సంభాషణను కొనసాగించారు. వారి కుటుంబం భారతదేశంలో ఉందని భర్త వివరిస్తుండగా, భారతదేశం అంత బాగుంటే మీరు అమెరికాలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించాడు.దానికి అక్కడే ఉన్న వ్యక్తి ప్రపంచాన్ని అన్వేషించడానికి అని బదులిచ్చాడు. కాదు నువ్వు ఇక్కడ మాకు వద్దు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి, నా దేశం నుండి వెళ్లిపొండి అని వారిని తిట్టాడు. కానీ ఆ భారతీయ వ్యక్తి పెద్దగా స్పందించలేదు. అయితే ఈ ఘటనను చాలా కలవరపరిచేదిగా అక్కడి ఎన్నారై ఛానల్ ఆ వీడియోను పంచుకుంటూ కథనం రాసింది. **IMPORTANT**Dear Indian Diaspora,These kind of incidents are up in real world in North Texas. If it happens to you or anyone you know or in your vicinity - DO REPORT it to authorities. Have hate incident recorded on your side & give it to cops.Inaction emboldens bullies!! pic.twitter.com/pp2wjHUnJ3— Sravy G (@sravytweets) May 26, 2026 -
ముంబై ఇండియన్స్ పై పంచ్.. నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ
-
ట్రంప్పై.. మార్కో రూబియో సెటైర్.. క్లిప్ డీలీట్
అమెరికా విదేశాంగ శాంగ మంత్రి మార్కో రూబియో అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార చర్యలపై వివరణ ఇచ్చారు. తాజాగా ఆవీడియో క్లిప్ను ఆ దేశ అధికారులు అధికారిక ఖాతా నుంచి తొలిగించారు. ప్రతి దేశంలోనూ మూర్ఖులుంటారు అన్న పదం పరోక్షంగా ట్రంప్కు చురకులంటించే విధంగా ఉండడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న(ఆదివారం) భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, మార్కో రూబియో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికాలో భారతీయులపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు, అలాగే భారతదేశాన్ని "నరకకూపం"గా పేర్కొంటూ చేసిన ట్రంప్ చేసిన ఒక పోస్ట్ అంశమై మీడియా ప్రతినిధులు మార్కో రూబియోను ప్రశ్నించారు.దీనికి మార్కో రూబియో వివరణ ఇస్తూ.. “ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ తెలివితక్కువ మాటలు మాట్లాడే మూర్ఖులు ఉంటారు. వారి మాటలను మెుత్తం దేశానికి ఆపాదించకూడదన్నారు. ట్రంప్ భారతదేశానికి, ప్రధాని మోదీకి పెద్ద అభిమాని అని అన్నారు." అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ను ఆ దేశ అధికారులు వెంటనే తమ అధికారిక ఖాతా నుంచి తొలగించారు.మార్కో రూబియో చేసినా వ్యాఖ్యలు పరోక్షంగా అధ్యక్షుడు ట్రంప్ను "తెలివితక్కువ మాటలు మాట్లాడే" "మూర్ఖులలో" ఒకరిగా అభివర్ణిస్తున్నట్లు రాజకీయ విమర్శకులు ప్రస్థావించిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్కో రూబియో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. -
అబ్బబ్బబ్బా చంద్రబాబు వండిన చేపల పులుసు ఎంత రుచికరం..
-
కాక్రోచ్ దుమారం.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శర్మ చేసిన బొద్దింకల వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం.. ఆ తర్వాత “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. సమర్థనలు, ఖండనలు.. తీవ్ర అభ్యంతరాలతో ఈ క్యాంపెయిన్పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే అటు ఇటు తిరిగి చివరకు.. ఈ రాజకీయ సెటైర్ క్యాంపెయిన్ కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.. సీజేఐ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగుతోందని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని అత్యవసర విచారణలు జరపాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్లను పరిశీలించారు. అయితే ఇది అత్యవసర విచారణ జరిపే పిటిషనేం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. మే 15న జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా ‘‘కొందరు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు..’’ అంటూ సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక, వృత్తుల్లో స్థానం దక్కని కొందరు యువకులు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు. కొందరు మీడియాగా, ఇంకొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరినీ టార్గెట్ చేస్తుంటారు అని పేర్కొన్నారాయన. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో.. సీజేఐ తర్వాత వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు యువతపై కాకుండా నకిలీ, బోగస్ డిగ్రీలతో వ్యవస్థల్లోకి చొరబడుతున్న వారినే ఉద్దేశించాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ “కాక్రోచ్ జనతా పార్టీ” (సిజెపి) పేరిట సోషల్ మీడియాలో వ్యంగ్య ప్రచారం కొనసాగింది. ఈ పరిణామాలను ప్రాక్టీసింగ్ లాయర్ రాజా చౌదరి సుప్రీంకోర్టులో పిటిషన్ రూపంలో దాఖలు చేశారు. సీజేఐ వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో వక్రీకరించి.. నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడినట్టుగా ప్రచారం చేశారని.. ఈ దుష్ప్రచారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని అందులో పేర్కొన్నారాయన. ఈ పిటిషన్లపై న్యాయవాది గోస్వామి వాదనలు వినిపించారు. కోర్టు విచారణల్లో జరిగిన మాటల మార్పిడిని.. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే నకిలీ లా డిగ్రీలు, బోగస్ న్యాయవాదుల వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దంటూ సీజేఐ సూర్యకాంత్ పిటిషనర్కు సూచించారు. ఈ అంశంలో ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి అత్యవసర విచారణ జరపాల్సినంత సీన్ లేదు. సమయం వచ్చినప్పుడు కోర్టు ఈ అంశాన్ని తప్పక పరిశీలిస్తుంది అని లాయర్ గోస్వామిని ఉద్దేశిస్తూ సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యల ప్రస్తావన, మళ్లీ వివరణ అంశాల్ని ఆయన ప్రస్తావించలేదు."Don’t take it so sentimentally’, says Chief Justice of India Surya Kant, as a lawyer mentions PIL, saying a distorted and malicious narrative is being continued to malign the judiciary despite clarification by the CJI on the 'cockroach' remark.CJI says there is no such grave… pic.twitter.com/gi0yp91N9h— ANI (@ANI) May 25, 2026మరో పిటిషన్లో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరిట సాగుతున్న ఆన్లైన్ క్యాంపెయిన్ కార్యకలాపాలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని దాఖలైంది. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్గా తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని పిటిషనర్లు ఆరోపించారు. మెర్చండైజ్, బ్రాండింగ్, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం సాగిస్తూ వాణిజ్య లాభాలు పొందే ప్రయత్నం జరుగుతోందని కూడా పేర్కొన్నారు. ఈ పిటిషన్ను కోర్టు పరిశీలించాల్సి ఉంది. అలా మొదలై..మహారాష్ట్రకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అభిజిత్ దిప్కే ప్రారంభించిన “కాక్రోచ్ జనతా పార్టీ” మొదట సరదా సెటైర్లా మొదలైనా.. క్రమంగా ఇది వ్యవస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసే డిజిటల్ ఉద్యమంగా మారింది. సీజేఐ సూర్యకాంత్ చేసిన “కాక్రోచ్” వ్యాఖ్యలను తమపై అవమానంగా భావించిన కొంతమంది నిరుద్యోగ యువత, సోషల్ మీడియా యూజర్లు ఈ పేరును వ్యంగ్య చిహ్నంగా మార్చుకున్నారు. “మమ్మల్ని బొద్దింకలు అంటారా..? అయితే ఇదే మా పార్టీ” అన్నట్లుగా ఈ క్యాంపెయిన్ను నడిపిస్తున్నారు.చదవండి: కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల బరిలోనికి దిగుతుందా?ఈ గ్రూప్ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టర్లు, వ్యంగ్య నినాదాలు, డిజిటల్ పోస్టర్లతో భారీ ప్రచారం చేస్తోంది. “Wherever WiFi Works is our headquarters”, “Party for the unemployed and overqualified” లాంటి ట్యాగ్లైన్లతో యువతలో వైరల్ అవుతోంది. రాజకీయాలపై, న్యాయవ్యవస్థపై, ఉద్యోగ వ్యవస్థపై వ్యంగ్య వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.ట్రోలింగ్ మాత్రమే కాదు..అయితే ఇది కేవలం ట్రోలింగ్కే పరిమితం కాలేదు. మాజీ ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ అవకాశాలు ఇవ్వొద్దని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు-ఎంపీలకు 20 ఏళ్ల అనర్హత విధించాలని, మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, పరీక్షల లీకేజీలపై కఠిన చట్టాలు తీసుకురావాలని వంటి డిమాండ్లను కూడా తమ మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో ఇది పూర్తిగా సరదా క్యాంపెయినా..? లేక వ్యవస్థలపై డిజిటల్ నిరసనా..? అనే చర్చ మొదలైంది.మరోవైపు విమర్శకులు మాత్రం ఈ క్యాంపెయిన్ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతోందని ఆరోపిస్తున్నారు. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్గా కట్ చేసి వైరల్ చేయడం, మెర్చండైజ్, బ్రాండింగ్, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం చేయడం ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. -
వెంకీ పెళ్లి సుబ్బి చావుకు...! పిల్లలకు బూట్లు సాక్సులు ఇవ్వండరా అంటే..
-
ఒకసారి అద్దంలో చూసుకో.. ఏం పీకుతామో ఎన్నికల్లో చూపిస్తాం
-
చంద్రబాబుకు వైఎస్ జగన్ భయం పట్టుకుంది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. వైఎస్ ఫ్యామిలీ ఇప్పటివరకూ ఎన్నడూ పులివెందులలో ఓడిపోలేదన్నారు. గతంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం అంబటి రాంబాబు గుర్తుచేశారు. చంద్రబాబు నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఇప్పటివరకూ మూడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందన్నారు.కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీని తిట్టడం తప్ప ఏమైనా పాలన చేస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలకు కనీసం గిట్టుబాటు ధర అందించడం లేదు. మెుక్కజొన్నకు ధరలు లేవని ప్రశ్నిస్తే గోడౌన్పై దాడులు జరుపుతున్నారు. యుద్ధం పేరు చెప్పి నిత్యావసర ధరలు పెంచితే కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా నిత్యావసరాల ధరలను తగ్గించే యత్నం చేసిందా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారన్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. -
ఈ 8 ఫోటోలు చూస్తే.. సినిమా అర్థమవుతుంది
-
రామ భక్తునివి కాదు.. బ్యాంక్ దొంగవి.. బ్యాంక్ డబ్బుతో బాగా ఒళ్ళు బలిసి.. జడ శ్రవణ్ సెటైర్లు
-
"గ్రీన్కార్డు నిబంధన కఠినతరం"
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినాక ఆ దేశ ఇమ్మిగ్రేషన్ పాలసీని అత్యంత కఠినతరం చేశారు. దీంతో యుఎస్ఎలో స్థిరపడాలనుకునే వారి ఆశలు కలలుగానే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో వీసా విధానంపై ఎన్డీటీవీతో మాట్లాడారు. ప్రస్తుతం గ్రీన్కార్డు విషయంతో అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇదివరకూ హెచ్-1 బీ వీసాదారులు గ్రీన్కార్డు విషయంలో అమెరికాలో ఉండి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం హెచ్1బీ వీసాదారులు తప్పనిసరిగా వారి సొంత దేశానికి వెళ్లి అక్కడినుండి గ్రీన్కార్డు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.తాజాగా దీనిపై మార్కో రుబియో వివరణ ఇచ్చారు..." గ్రీన్కార్డు కోసమై అమెరికా తీసుకువచ్చిన విధానం కేవలం భారతదేశానికి మాత్రమే ఉద్దేశించినది కాదు.ఇది అందరికీ వర్తిస్తుంది. వలసల వ్యవస్థను క్రమబద్ధీకరించి, మెరుగుపరచుకోవాలని అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది.20 మిలియన్లకు పైగా ప్రజలు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారు. అనేక సందర్భాల్లో గ్రీన్ కార్డ్ వ్యవస్థ దుర్వినియోగాలను కూడా మేము చూశాము. అందుకే మేము దానిని సంస్కరించాలని నిర్ణయించుకున్నాము. మీరు ఒక వ్యవస్థను సంస్కరించినప్పుడల్లా, కొన్ని అంతరాయాలు ఏర్పడతాయి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొంత అసౌకర్యం ఉంటుంది," అని జాతీయ మీడియాతో తెలిపారు.అయితే తాత్కాలికంగా ఈ విధానం వల్ల ఇబ్బందులున్నా దీర్ఘకాలంలో ఈ విధానం స్థిరంగా మారుతుందని తెలిపారు. ముఖ్యంగా అమెరికాకు రావాలనుకునే భారతీయులు ఈ విధానం వల్ల దీర్ఘకాలంలో మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా మేలు పొందుతారని తాను భావిస్తున్నాని పేర్కొన్నారు.. ఇది వ్యక్తిగతంగా వారికి అమెరికాకు ఎంతో మేలు చేస్తోందన్నారు. ప్రస్తుతం మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నారు. -
విజయ్ ను చూసి నేర్చుకో... ఇంకెంతకాలం డబ్బా మాటలు చెప్తావ్?
-
"మీరు నిజాయితీగా.. ట్రంప్కు వ్యతిరేకంగా"
టెహ్రాన్: ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చంతా.. అమెరికా DNI డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేయడంపైనే నడుస్తోంది. ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారా..? లేక తనంత తానే తప్పుకుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్.... తులసీ గబ్బార్డ్ రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్కు తొత్తుగా పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వంలో మీలాంటి నిజాయితీ గల వ్యక్తులు పనిచేయడం విచారకరం అని ఎక్స్లో పోస్ట్ చేసింది.అమెరికాకు అత్యత కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (DNI) పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అయితే తలసీ గబ్బార్డ్ రాజీనామా ఇప్పుడు అంతర్జాతీయంగా పలు చర్చలకు దారితీసింది. దీనిపై తాజాగా అర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది.ఇరాన్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో " అబ్రహాం త్వరగా, పూర్తిగా కోలుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మీరు గతంలో కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ కోసం కాకుండా అమెరికా కోసం పనిచేస్తారని నిరూపించుకున్నారు, అదే విధంగా పలుమార్లు అధ్యక్షుడు ట్రంప్ ద్వేషించే ఇరాన్ గురించిన నిజాలను కూడా నిష్పక్షపాతంగా మాట్లాడారు. అమెరికాను పక్కనపెట్టి, ఇజ్రాయెల్కు తొత్తుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంతో మీలాంటి వ్యక్తి పనిచేయడం విచారకరం. మీకు శుభాకాంక్షలు" అని ఎక్స్ఖాతాలో రాసుకొచ్చింది.అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలోని వ్యక్తులు ఆ దేశం కోసం కాకుండా పరోక్షంగా ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నారని ఎంబసీ ఆరోపించింది. అంతే కాకుండా ఆ దేశ ప్రయోజనాల కోసం తులసి గబ్బార్డ్ ట్రంప్కు సైతం కోపం తెప్పించేలా పలుసార్లు మాట్లాడిందని పేర్కొంది.అమెరికా మీడియా కథనాలు అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్ టీమ్లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్హౌస్లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.ప్రత్యేకించి.. ఇరాన్ విషయంలో తులసి గబ్బార్డ్ వైఖరి మొదటి నుంచి ట్రంప్ లైన్కు భిన్నంగా కనిపించింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్సైతం ఆమెకు మద్ధతుగా ఎక్స్లో పోస్ట్ చేసింది. -
చంద్రబాబు వేస్ట్.. అరవ శ్రీధర్ మాట్లాడిన సంచలన వీడియో విడుదల చేసిన హర్షవీణ
-
పాస్టర్ అభినయ్ దొంగ నాటకాలు.. KA పాల్ రియాక్షన్
-
మా అంత శుద్ధపూసలు లేరు అన్నట్టు మాట్లాడుతున్నారు సిగ్గుగా లేదా..
-
నా కుమారుడి పెళ్లికి వెళితే చంపేస్తారు?.. ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చమత్కారం చేశారు. ఇరాన్తో తనకు ప్రాణహాని ఉందని తను బయిటకే వెళితే చంపేసే అవకాశం ఉందన్నారు. అందువలనే తన కుమారుడి వివాహానికి హాజరుకానని తెలిపారు. అయితే ఒకవేళ తను హాజరైనా కాకపోయిన తప్పుడు వార్తలతో తనకు మరణ తథ్యమని మీడియాకు చురకలంటించారు. ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అందుకే ట్రంప్ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో తాను ఏ వేడుకలకు వెళ్లలేనని ఒకవేళ వెళితే తనను చంపేస్తారన్నారు.ఓవల్లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. "నేను వెళ్లాలని అనుకుంటున్నాను. అయితే నేను వెళ్లడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతం నాకు ఇరాన్ అనే ఒక వ్యవహారం ఉంది. ఒక వేళ నేను వెళ్లినా చంపుతారు. వెళ్లకపోయినా చంపుతారు. అయితే అది తప్పుడు వార్తల వల్ల" అని చమత్కరిస్తూ మాట్లాడారు. తాను పెళ్లికి హాజరైనా, కాకపోయినా మీడియా నుంచి ఎదురయ్యే విమర్శల గురించి ప్రస్తావిస్తూ ఆ విషయంలో నేను గెలవలేను అని ఆయన అన్నారు.అయితే ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ వివాహం ఈ వారాంతంలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేట్ వేడుకలో పామ్ బీచ్ సోషలైట్ మోడల్.. బెట్టినా అండర్సన్ను వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వనించారని తెలుస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనల కారణంగా తన హాజరు అనిశ్చితంగా ఉందని ట్రంప్ సూచించారు. -
బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి
-
పెట్రోల్ ఇక దొరకదు! సంక్షోభం రాకముందే జాగ్రత్త..
-
ప్రెస్ మీట్ మధ్యలో జగన్ కామెడీ.. పుష్ప శ్రీవాణితో బాబు మేనిఫెస్టో చదివించి..
-
బాలకృష్ణ గన్ తో ఇద్దరిని టపా..టపా అంటూ కాల్చితే.. బాబు శవ రాజకీయాలుపై జగన్ కౌంటర్
-
ఆ పేరు వింటే బాబు గుండె ఆగిపోతుంది..
-
అభిషేక్ బెనర్జీ ఆస్తులతో నాకు సంబంధం లేదు.. ఎంపీ వివరణ
కోల్కతా: అభిషేక్ బెనర్జీకి తనకు ఉమ్మడి ఆస్తులు కలిగి ఉన్నాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీఎంసీ ఎంపీ సాయాని ఘోష్ స్పష్టం చేశారు. ఈ రోజు (బుధవారం) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడిగా ఒక ఆస్తిని కలిగి ఉన్నామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. తన ఆస్తుల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్లో పూర్తిగా వెల్లడించానన్నారు. ఈ రకమైన "ఫేక్ న్యూస్" (అసత్య ప్రచారాలు) వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.ఆమె మాట్లాడుతూ " అభిషేక్ బెనర్జీ & సాయాని ఘోష్ కలిసి కోల్కతా 700030 లోని '19 D సెవెన్ ట్యాంక్స్ రోడ్' అనే ఆస్తిని ఉమ్మడిగా కలిగి ఉన్నారు దానికి ఎలాంటి మొబైల్ నంబర్ సంప్రదింపుల కోసం లేదని కొన్ని ఫార్వార్డ్ మెసేజ్లను ఇప్పుడే చూశాను. వారు ఎవరో నాకు తెలియదు. కానీ, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు స్వలాభం కోసం పనిచేయకుండా నిజాయితీగా ఉంటూ ఒక సాధారణ నేపథ్యం నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన ఎంపీ సాయాని ఘోష్ మాత్రం అది కాదు" అన్నారు. ప్రజలు నన్ను ఆశీర్వదించారు, అందుకు నేను కృతజ్ఞతురాలిని అని ఎక్స్లో పేర్కొన్నారు.తాను ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా తన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇది వరకే బహిరంగంగా అందుబాటులో ఉంచానని తెలిపారు. తన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించబడ్డాయి. రికార్డులను తనిఖీ చేయండి. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి ఆరోపణలు మోపుతున్నవారు ఇకనైనా ఈ ప్రయత్నాలను ఆపాలన్నారు. తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో క్షమించేది లేదను ఈ అంశంలో తాను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానిని సాయాని ఘోష్ హెచ్చరించారు. వివాదం ఏంటికాగా ప్రస్తుతం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు ఆస్తులను కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలిస్తోంది. అతని బంధువులు వారితో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన 17నుండి 21 ఆస్తులకు సంబంధించి ఆమోదించబడిన బిల్డింగ్ ప్లాన్లు, ఇతర పత్రాలను సమర్పించాలని ఇదివరకే KMC నోటీసులు జారీ చేసింది.నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా నిర్మాణాలు జరిగాయా అనేది పత్రాలను పరిశీలించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ సాయాని ఘోష్ వివరణ ఇచ్చింది. -
పరిపాలన చేతకాకపోతే ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటుకు అప్పగించండి
-
జగన్ తో మావల్ల కాదు.. ఢిల్లీకి పరుగెత్తిన పవన్
-
పనికిమాలిన సన్నాసులు.. కూటమి ప్రభుత్వం పై జోగి రమేష్ ఫైర్
-
భార్య, భర్తల్లారా జాగ్రత్త.. బాబు మాటలు విని నలుగురిని కన్నారా.. రాచమల్లు సెటైర్లు
-
ఉప్పు, కారం తిన్నోడు ఎవడైనా.. ఒళ్ళంతా ఆముదం పూసుకుని...
-
100% స్ట్రైక్ రేట్ తో గెలిచింది జనసేనలో ఉన్న టీడీపీ నేతలే..
-
విజయ్ కి సత్తా ఉంది..! గెలిచి చూపించాడు.. పవన్ వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్!
-
బండి భగీరథ్తో పార్టీకి సంబంధం లేదు:కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బండి భగీరథ్ అంశమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బండి భగీరథ్ ఇదివరకే సరెండర్ అయ్యారని ఆ విషయంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు అంశంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం ఉండదని తెలిపారు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుందని తెలిపారు. పెట్రోల్ పై ట్సాక్స్ తగ్గించాలని కేంద్ర కోరినా రాష్ట్రం ఏమాత్రం తగ్గించడం లేదన్నారు.అయితే కేంద్రమంత్రి బండిసంజయ్ కుమారుడు బండి భగీరథ్ నిన్న (శనివారం) పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.కాగా ఈ విషయంపై స్పందించిన బండి సంజయ్.. తన కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదని చెబుతున్నాడని అందుకే పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని తెలిపారు -
కారులో వస్తున్నప్పుడు ఆ వీడియో చూశా.. బాబు, ధూళిపాళ్ల నరేంద్ర పై బైరెడ్డి సెటైర్లు
-
రెండు పెద్ద పార్టీల మధ్య గెలవడం గ్రేట్.. విజయ్ ని ఆకాశానికెత్తిన రజినీ
-
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
-
ప్రభుత్వం నుండి నాకు ఎలాంటి సెక్యూరిటీ వద్దు.. ప్రజలే నా సెక్యూరిటీ
-
‘నా విలువను నిరూపించుకునే స్థితిలో లేను’
న్యూఢిల్లీ: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ఒక్క వన్డే ఫార్మాట్లోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల పదేపదే 2027 వన్డే వరల్డ్ కప్లో అతని స్థానంపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కోహ్లి తన ఆలోచనలేమిటో స్పష్టంగా చెప్పాడు. తన స్థాయి, విలువకు తగిన గౌరవం ఇస్తేనే ఆటలో కొనసాగుతానని, లేదంటే తప్పుకుంటానని అతను వ్యాఖ్యానించాడు. తాను ఇంకా ఏదో నిరూపించుకోవాల్సిన స్థితిలో లేనని కోహ్లి స్పష్టం చేశాడు.‘నన్ను ఇప్పటికి 2027 వరల్డ్ కప్లో ఆడటం గురించి చాలాసార్లు అడిగారు. నేను ఎప్పుడైనా ఆడేందుకు సిద్ధం. ఎందుకంటే అది నాకు నిత్యకృత్యం. నాకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఇల్లు వదిలి నా కిట్తో బయటకు వెళ్లడం, ఎంతో కష్టపడటం కూడా దాని కోసమే కదా. భారత్ తరఫున మరో ప్రపంచకప్ ఆడటం గొప్ప గౌరవం. కానీ నాకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. జట్టుకు నా అవసరం ఉందని భావిస్తేనే ఆడతాను. అంతే కానీ నా విలువను, స్థాయిని నిరూపించుకుంటే ఆడాల్సిన పరిస్థితి వస్తే అందుకు సిద్ధంగా లేను. నన్ను నేను నిరూపించుకోవాల్సిన స్థితిలో ఇప్పుడు లేను’ అని కోహ్లి వెల్లడించాడు.గత ఏడాది ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. సిరీస్కు పూర్తిగా సన్నద్ధమై, ప్రత్యేకంగా సొంత ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొని బోర్డు నిబంధనల ప్రకారం రంజీ ట్రోఫీలో ఆడిన తర్వాత కూడా అతను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. కోహ్లిని తొలి రెండు టెస్టులకే ఎంపిక చేస్తామని, ఆ తర్వాత ప్రదర్శనను బట్టి కొనసాగిస్తామని సెలక్టర్లు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...‘మనం పని చేసే చోట మన ప్రతిభ, సామర్థ్యంపై నమ్మకం ఉందని చెప్పి బాధ్యతలు అప్పగించిన తర్వాత వారం రోజులకే మన పనితీరును ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. నేను నిజాయితీగా పని చేస్తాను. ఆట కోసం ఎంతైనా కష్టపడతాను. వన్డేలో 40 ఓవర్ల పాటు బౌండరీ లైన్ల మధ్య ఆ మూల నుంచి ఈ మూలకు పరుగెత్తమని చెబితే కచ్చితంగా చేస్తా. ప్రతీ బంతిని నా కెరీర్ చివరి బంతిలా భావించి మైదానంలో పోరాడతా. దీనిపై ఫిర్యాదు చేయను. ఎందుకంటే దానికి అనుగుణంగానే నేను సాధన చేస్తా, సిద్ధమవుతా. కేవలం ఫలితాలు చూసి నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే వాటి గురించి ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ముందే చెప్పేయండి. లేదా ఒకసారి అవకాశం ఇచ్చాక నన్ను పని చేసుకోనివ్వండి’ అని విరాట్ తన ఉద్దేశాన్ని చెప్పాడు. -
చిలుకూరు ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద పోస్టులు
-
అసలు అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి.. వైరల్ అవుతున్న బీహార్ మంత్రి మాటలు
-
చిలుకూరు ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా హెచ్-1బీ వీసా కార్యక్రమంపై విమర్శలు గుప్పించిన అమెరికా రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిత్ చిలుకూరు బాలాజీ టెంపుల్ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.మిస్సౌరీకి చెందిన సెనేటర్ ఎరిక్ ష్మిత్, ఎక్స్ (X) వేదికగా వరుస పోస్టులు చేస్తూ అమెరికా ఉపాధి ఆధారిత వీసా విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. హెచ్-1బీ, ఎల్-1, ఎఫ్-1, అలాగే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) వంటి వీసా కార్యక్రమాలు అమెరికన్ మధ్యతరగతి ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవస్థ స్థానిక వేతనాలను తగ్గిస్తూ, అమెరికన్ ఉద్యోగులను పక్కన పెట్టే “గ్లోబల్ వీసా కార్టెల్”గా మారిందని పేర్కొన్నారు.“అమెరికన్ పన్ను చెల్లింపుదారుల సబ్సిడీలతో బిలియన్ల డాలర్లు ఇప్పుడు భారతదేశానికి ప్రవహిస్తున్నాయి. అవి అమెరికన్లకు కాకుండా విదేశీ కార్మికుల శిక్షణకు ఉపయోగపడుతున్నాయి” అని ఆయన తన పోస్టులో వ్యాఖ్యానించారు. తన వాదనకు ఉదాహరణగా చిలుకూర్ బాలాజీ ఆలయ చిత్రాన్ని షేర్ చేసిన ష్మిత్, దీనిని “వీసా టెంపుల్”గా అభివర్ణించారు. అమెరికా వర్క్ వీసాల కోసం వేలాది మంది భారతీయులు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ, పాస్పోర్ట్లకు ఆశీర్వాదాలు పొందుతారని ఆయన పేర్కొన్నారు.“హైదరాబాద్లో ‘వీసా కార్టెల్’కు సొంతంగా ఒక వీసా దేవాలయం కూడా ఉంది. అక్కడ యూఎస్ వర్క్ వీసాల కోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. అమెరికన్ కార్మికులు ఇలాంటి వ్యవస్థతో పోటీ పడాల్సిన అవసరం లేదు” అని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు.ఇక విదేశీ విద్యార్థుల్లో దాదాపు సగం మంది భారతీయులేనని, వారికి పన్ను చెల్లింపుదారుల సబ్సిడీతో వర్క్ పర్మిట్లు లభిస్తున్నాయని ష్మిత్ ఆరోపించారు. “వారు తర్వాత హెచ్-1బీ, గ్రీన్ కార్డుల వైపు వెళ్తుంటే, భారీ విద్యారుణాలతో ఉన్న అమెరికన్ గ్రాడ్యుయేట్లు చౌకైన కార్మికులతో పోటీ పడాల్సి వస్తోంది” అని వ్యాఖ్యానించారు.అంతేకాకుండా, భారతీయ వీసా హోల్డర్లు వీసా ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలను పరస్పరం పంచుకుంటారని, పెద్ద టెక్ కంపెనీలు ఈ వీసా వ్యవస్థల ద్వారా అమెరికన్ ఉద్యోగాలను మళ్లిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. “మెరిట్ స్థానంలో ఇప్పుడు జాతి ఆధారిత ప్రాధాన్యత చోటు చేసుకుంది” అని ఆయన అన్నారు.ఇదిలా ఉండగా, హైదరాబాద్లోని చిలుకూర్ బాలాజీ ఆలయం ఎన్నో ఏళ్లుగా “వీసా దేవాలయం”గా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు వీసా ఇంటర్వ్యూలకు ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.కాగా, అమెరికా హెచ్-1బీ వీసా ఆమోదాల్లో భారతీయుల ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం హెచ్-1బీ వీసాల్లో 70 నుంచి 80 శాతం వరకు భారతీయులకే లభిస్తుండగా, చైనా వాటా సుమారు 12 శాతంగా ఉంది.The "Visa Cartel" has its own “Visa Temple” in Hyderabad, which sees thousands of Indians circling altars and getting passports blessed for U.S. work visas.American workers shouldn’t have to compete against a system this gamed. pic.twitter.com/k7wSlECTJ6— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026 -
చాలా బాధగా ఉంది... పెద్ది అప్పుడే ఎందుకు ఇలా..!
-
మొదటిసారి మంత్రి అయిన ఆతృతలో ఉన్నావ్.. కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటావ్
-
విజయ్ ని చూసి నేర్చుకో... నీ జన్మలో సీఎం కాలేవు!
-
CC కెమెరాలు పెట్టి బ్లాక్ మెయిల్.. కారుమూరి షాకింగ్ నిజాలు
-
ధూళిపాళ్ల నరేంద్ర ఒక బ్రోకర్.. అంబటి మురళి సంచలన వ్యాఖ్యలు
-
మోదీ బంగారం కొనొద్దు అనటానికి ముఖ్య కారణాలు ఇవే..!
-
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
-
లిక్కర్ షాపులపై విజయ్ సంచలనం..
-
అసెంబ్లీ నీ జాగీరా.. మెడ పట్టుకొని గెంటేస్తావా..?
-
స్టాలిన్ ముందు రజినీకాంత్ ద్వారా బిజేపీ పెట్టిన ప్రపోజల్ ఇదే
-
రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం, సుప్రీంకోర్టు అసహనం
గత ఏడాది జూన్లో ఇంగ్లాండ్లో పోలో ఆడుతూ మరణించిన వ్యాపారవేత్త సంజయ్ కాపూర్రూ. 30,000 కోట్ల వారసత్వ సంపద కోసం కపూర్ కుటుంబం మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా ఘాటుగా స్పందించారు. ఈ వివాదంలో దాఖలవుతున్న పిటిషన్ల వెల్లువను చూసి, "చూస్తుంటే మహాభారతం కూడా చిన్నదిగా కనిపిస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.మే 18న జరగాల్సిన 'రఘువంశీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్' (RIPL) బోర్డు సమావేశాన్ని నిలిపివేయాలని సంజయ్ కపూర్ తల్లి 80 ఏళ్ల రాణి కపూర్ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశించిన మధ్యవర్తిత్వ ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు జరుగుతున్న 'మోసపూరిత ప్రయత్నం'గా ఈ సమావేశాన్ని ఆమె అభివర్ణించారు. ఈ పిటిషన్ను విన్న జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని బెంచ్, దేశంలోని అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటైన కపూర్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వివాదం మహాభారతం కంటే పెద్దదిగా మారుతోందని వ్యాఖ్యానిస్తూ, ఈ కేసును మే 14న (గురువారం) విచారణకు స్వీకరిస్తామని తెలిపారు.వివాదాస్పద కుటుంబ ఆస్తిలో అధిక భాగం RIPL ఆధీనంలో ఉంది.కాగా గత వారం, ఢిల్లీ హైకోర్టు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) డి.వై. చంద్రచూడ్ను మధ్యవర్తిగా నియమించింది. రాణి కపూర్ తన కుటుంబ ట్రస్ట్ను మోసపూరితమైందిగా ప్రకటించాలని సివిల్ సూట్ దాఖలు చేశారు. మధ్యవర్తిత్వం పూర్తయ్యే వరకు సంజయ్ కపూర్ మూడో భార్య ప్రియా కపూర్ కుటుంబ ట్రస్ట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని రాణి కపూర్ కోరారు.మరోవైపు సంజయ్ కపూర్ రెండో భార్య, నటి కరిష్మా కపూర్ పిల్లలైన కియాన్, సమీరా కపూర్, ప్రియా కపూర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రియా కపూర్ తన తండ్రి వీలునామాను ఫోర్జరీ చేశారని వారు ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. కాగా ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియ సంజయ్ కపూర్ రాసిన వీలునామాకు (Will) వర్తించదు. దానిపై విడిగా న్యాయ పోరాటం జరుగుతోంది. ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?గత ఫిబ్రవరిలో ఈ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న బహిరంగ విమర్శలపై ఢిల్లీ హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని, "గౌరవంగా ప్రవర్తించాలని" కోర్టు హెచ్చరించింది.దీంతో ఈ వివాదం, రోజుకో కొత్త మలుపు తిరుగుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.ఇదీ చదవండి: విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం -
నిమ్మల రామానాయుడు డ్రామాలొద్దు.. పని చెయ్!
-
ఏడాదిపాటు బంగారం కొనొద్దు.. నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు
-
కాంగ్రెస్ది నమ్మక ద్రోహం
సాక్షి బెంగళూరు: కాంగ్రెస్ ఒక విశ్వాస ఘాతుక పార్టీ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ను అధికారం నుంచి దూరం చేయాలని పేర్కొన్నారు. వెన్నుపోటు పొడిచే బుద్ధి ఆ పార్టీకి పుట్టుకతోనే వచ్చిందని, అధికారం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడుతోందని నిప్పులు చెరిగారు. 2014 కంటే ముందు కేంద్రంలో పదేళ్లు డీఎంకే మద్దతుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారం కోల్పోవడంతో వెంటనే వెన్నుపోటు పొడిచి కొత్త పార్టీని ఆశ్రయించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కేవలం మిత్రపక్షాలను మాత్రమే వెన్నుపోటు పొడవలేదని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించడం ద్వారా దేశ మహిళలకు ద్రోహం చేసిందని విమర్శించారు. నమ్మక ద్రోహి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం తర్వాత తొలిసారిగా ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరుకు వచ్చిన మోదీని బీజేపీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖజానాను లూటీ చేసే పనిలో పడ్డారని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్లో సఫాయి కారి్మకులకు వేతనాలు ఇవ్వడం లేదని, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కేరళ ఎన్నికల్లో మెజారిటీ సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక చేయడం సాధ్యపడడం లేదని వ్యాఖ్యానించారు. కేరళలో అధికారం తథ్యం బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వస్తే రెండు, మూడుసార్లు ప్రజలు అధికారం అప్పగించేలా తమ పార్టీ పాలన ఉంటుందని ప్రధానమంత్రి తెలిపారు. అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో పదేళ్ల క్రితం కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 203 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని వెల్లడించారు. కేరళలో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అక్కడ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తంచేశారు. సమాజం క్రియాశీలం అయినప్పుడే.. దేశ నిర్మాణంలో సమాజం క్రియాశీలకంగా పాలుపంచుకుంటే అప్పుడే ప్రభుత్వం విజయం సాధించినట్లు అని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. దేశ ప్రజలు, సమాజం క్రియాశీలం అయినప్పుడే అతిపెద్ద సవాళ్లకు సామూహికంగా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవంతోపాటు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ 70వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవ్య ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించారు. బెంగళూరు కేవలం సాంకేతిక నగరం కాదని, ఇదొక అధ్యాత్మిక నగరమని పేర్కొన్నారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం దేశ సంస్కృతిలో అంతర్భాగాలని చెప్పారు. వీటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. #WATCH | Bengaluru | Prime Minister Narendra Modi says, "I have arrived in Bengaluru today at a time when discussions regarding election results are underway across the country. The formation of an NDA government in Puducherry for the second consecutive time, the formation of an… pic.twitter.com/lFNbQ429aS— ANI (@ANI) May 10, 2026 -
స్టాలిన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి..
-
108 నుంచి 121కి వచ్చాం.. ఇకపై మా ఆట చూపిస్తాం..!
-
తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవించింది
-
వందేమాతరానికి ఆ హక్కు ఎలా ఇస్తారు.. అసదుద్దీన్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ గీతం జనగణమనతో సమానంగా జాతీయ గేయం వందేమాతరంకు చట్టపరమైన హక్కులను ఇవ్వడాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు.వందేమాతరాన్ని జాతీయ గీతంతో సమానంగా పరిగణించలేమని ఒవైసీ స్పష్టం చేశారు.అసదుద్దీన్ మాట్లాడుతూ.."వందేమాతరం ఒక దేవతను స్తుతించే గేయం, భారతదేశం ఏ ఒక్క దేవుడి పేరు మీదో లేదా దేవత పేరు మీదో నడవదు ఈ గేయాన్ని రాసిన వ్యక్తి బ్రిటీష్ రాజ్కు సానుభూతిపరుడు, ముస్లింలను ద్వేషించేవారు. గాంధీ, నెహ్రూ, ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు కూడా దీనిని తిరస్కరించారు." అని ఆయన అన్నారు.భారత రాజ్యాంగ పీఠిక భారత ప్రజలమైన మేము అని మొదలవుతుంది తప్ప "భారతమాత" అని కాదని ఆయన వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశం అంటే రాష్ట్రాల కలయిక అని, ఇది ప్రజల దేశమని ఆయన పేర్కొన్నారు. గతంలో రాజ్యాంగ పరిషత్తులో కొందరు సభ్యులు పీఠికను దేవత పేరుతో లేదా దేవుడి పేరుతో ప్రారంభించాలని కోరారని, కానీ ఆ ప్రతిపాదనలన్నీ అప్పట్లోనే వీగిపోయాయని ఆయన గుర్తు చేశారు.కాగా దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఒవైసీ నాయకత్వం.. దేశ సాంస్కృతిక సమైక్యతను ముప్పుగా భావిస్తోందని, ఆయన వైఖరి గతంలో జిన్నా అనుసరించిన ధోరణిని పోలి ఉందని విమర్శించారు. జిన్నా కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు వందేమాతరాన్ని వ్యతిరేకించలేదని, పార్టీ విడిపోయాకే వ్యతిరేకత మొదలుపెట్టారని గుర్తు చేశారు... రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అభ్యంతరాలు చెబుతున్నారని ఆరోపించారు.ఒవైసీ గతంలోనూ యూనిఫాం సివిల్ కోడ్ (UCC), త్రిపుల్ తలాక్ రద్దు వంటి జాతీయ సమగ్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఒవైసీ వ్యతిరేకిస్తున్నారని బీజేపీ మండిపడింది.వందేమాతరంపై కేంద్రం నిర్ణయం వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. 'జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం, 1971' కు సవరణలను ఆమోదించింది. ఇకపై వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అగౌరవపరచినా లేదా దాని ఆలాపనకు ఆటంకం కలిగించినా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. అంతకుముందు ఈ రక్షణ కేవలం జా తీయ గీతం జాతీయ జెండా మరియు రాజ్యాంగానికి మాత్రమే ఉండేది. ఇప్పుడు వందేమాతరం కూడా అదే జాబితాలోకి చేరింది. -
మాణిక్కం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఎంపీ మాణిక్కం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత కాలం భద్ర శత్రువులుగా ఉన్న రెండు పార్టీలు కేవలం ఒక్క వ్యక్తిని ఆపడానికి ఏమమవుతున్నాయన్నారు. దీనిని స్పష్టంగా గమనించే కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిందని తెలిపారు.తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సరైనా సంఖ్యాబలం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ఆరాష్ట్ర గవర్నర్ తేల్చి చెప్పడం.. ఆ తరువాత డీఎంకే- ఏఐడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం.. ఒకవేళ అలా చేస్తే టీవీకే ఎమ్మెల్యేలు అంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని విజయ్ హెచ్చరించడం ఇలా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాణిక్కం ఠాగూర్ తన ట్విట్టర్లో... "జీవితకాలం బద్ధ శత్రువులుగా ఉన్న రెండు పార్టీలు అధికారం కోసం కలుస్తున్నాయి. ఒక్క వ్యక్తిని ఆపడం కోసం రెండు పార్టీలు కలుస్తున్నాయి. ఆర్ఎస్ఎస్/బీజేపీల బి-టీమ్తో చేతులు కలిపి మిమ్మల్ని మీరు లౌకికవాదులని పిలుచుకోలేరు. స్థిరమైన ప్రభుత్వం పేరుతో రెండు పార్టీలు అధికారం కోసం తహతహలాడుతున్నాయి. డీఎంకే ఈ రోజు తన ముసుగు తీస్తుందా?" అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.ఆర్ఎస్ఎస్, బీజేపీల బీ-టీమ్తో చేతులు కలిపి మిమ్మల్ని మీరు లౌకికవాదులుగా పిలుచుకోలేరు అని అన్నారు. కాగా ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటునకు మాత్రం గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ అంగీకరించడం లేదు. మ్యాజిక్ ఫిగర్ అయిన 118 ఎమ్మెల్యేల సంతకాలతోనే రావాలంటూ స్పష్టం చేశారు. తనకు నెంబర్ ముఖ్యమని.. మెజారిటీ బలంతో ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటునకు అనుమతిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సస్పెన్స్ కొనసాగుతోంది. -
హంటా వైరస్ కలకలం
వాషింగ్టన్ డీసీ: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హంటావైరస్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్పై తనకు సమాచారం అందిందని ప్రస్తుతానికి పరిస్థితి అంతా బాగానే ఉందన్నారు. ఇటీవల ఓ క్రూయిజ్షిప్లో హంటా వైరస్తో ముగ్గురు మృతిచెందిన సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ డీసీలోని లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ పునరుద్ధరణ పనులను పరిశీలించడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి మీడియా హంటా వైరస్ గురించి ట్రంప్ను ప్రశ్నించగా "అంతా అదుపులోనే ఉందని మేము ఆశిస్తున్నాం. ఆ నౌక గురించి రేపు పూర్తి నివేదిక ఇవ్వబోతున్నాం. గొప్ప నిపుణులు దీనిపై అధ్యయనం చేస్తున్నారు, అంతా బాగుంటుంది," అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అంతా అదుపులోనే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. హంటా కలకలంకాగా ఈ నౌకలో ప్రయాణించి అమెరికా చేరుకున్న ఐదుగురు పౌరులకు అమెరికా క్వారంటైన్ విధించింది. ఇటీవల అట్లాంటిక్ మహాసముద్రంలో ఎంబీ హోండియన్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్తో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురిని వ్యాది అనుమానిత రోగులుగా గుర్తించారు. అనంతరం వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాత వాళ్లకు వైరస్ సోకలేదని నిర్ధారించుకున్నాక 12 దేశాలకు చెందిన డజను మందికిపైగా ప్రయాణికులను నౌక నుంచి సురక్షితంగా బయటకు పంపేశామని నౌక యాజమాన్యం, నెదర్లాండ్స్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.అయితే లక్షణాలు కనిపించనంత మాత్రాన నౌకలోని ప్రయాణికులను స్వేచ్ఛగా వదిలేస్తారా? వాళ్లు స్వదేశాలకు వచ్చాక వాళ్లలో వైరస్ లక్షణాలు బయటపడి ఇతరులకు వ్యాపిస్తే పరిస్థితి అదుపుతప్పుతుందన్న అనుమానాలు, భయాందోళనలు ఎక్కువయ్యాయి. నౌకలోకి ఎక్కకముందు విమానంలో ప్రయాణించిన ఒక మహిళలో హంటావైరస్ లక్షణాలు వెలుగుచూశాయి.దీంతో ప్రయాణం మొదలెట్టిన రోజు నుంచి వైరస్ వెలుగుచూసిన రోజుదాకా ఎంత మంది ఎక్కడెక్కడ దిగిపోరనే వివరాలతో వాళ్ల జాడను కనిపెట్టి వైద్యపరీక్షలు చేయడంలో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈలోపు ఈ విషయం తెలియక వాళ్లు స్థానికంగా ఇంకెంత మందికి వైరస్ను వ్యాపింపజేస్తారో అనే ఊహాగానాలూ ఎక్కువయ్యాయి.హంటావైరస్ అంటే ఏమిటి ?హంటావైరస్ అనేది ఎలుకల ద్వారా వ్యాపించే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించడం చాలా అరుదు. ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి సులభంగా వ్యాపించదు కాబట్టి, సాధారణ ప్రజలకు దీనివల్ల కలిగే ప్రమాదం తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. -
దళారుల జేబులు నింపడానికి మా పొట్టకొడుతున్నారు..
-
10 సీట్లు కొనడం పెద్ద లెక్క కాదు.. మా లీడర్ విజయ్ సిద్దాంతం ఒక్కటే...
-
అలా చేస్తే బేరసారాలకు అవకాశం.. తమిళనాడు గవర్నర్
చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా చూపించాల్సిందేనని ఆ రాష్ట్ర గవర్నర్ తేల్చిచెప్పడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎమ్మెల్యేల బేరసారలకు పరోక్షంగా అనుమతి ఇవ్వలేమన్నారు.తమిళనాడు గవర్నర్ తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆయన తీరును కాంగ్రెస్తో పాటు అక్కడి పలువురు నేతలు ఖండించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో E ఆ రాష్ట్రంలోని ఓ పత్రికకు గవర్నర్ ఇంటర్వూ ఇచ్చారు.విశ్వనాథ్ అర్లేకర్ మాట్లాడుతూ.."మెజారిటీ లేకపోవడం అన్నది ఒక్క విజయ్ సమస్య మాత్రమే కాదు. తమిళనాడు సమస్య మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బేరసారాలకు అనుమతించలేం. విజయ్ని మోజారిటీ నిరూపించమని మేము అనలేదు. మోజార్టీతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తాం అని తెలిపాం. కాని వారు అలా చేయలేదు. దీనికి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఎలా అడ్డుకుంటున్నట్లు. ఏఐడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎస్.ఆర్ బొమ్మై కేసులోని ఉత్తర్వు దీనికి వర్తించదు" అని అన్నారు. కాగా విజయ్కు జెడ్ప్లస్ సెక్యూరిటీ కల్పించడంపైనా ఆ రాష్ట్ర గవర్నర్ డీజీపీపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్కు డీజీపీ శాంతిభద్రతలపై నివేదిక అందించారు. మరోవైపు రేపు గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ రేవు రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. -
ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.. బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయంపై బీజేపీ నేతల దాడి నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేల కార్యాలయంపై దాడి చేయడాన్ని సమర్థించడం లేదని అయితే దాడుల కల్చర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. మితీమిరిన అహంకారంతో వ్యవహరించొద్దనే ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.అయితే కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా ఎల్లుండి కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ బంద్ నిర్వహించనుంది. దీనికి బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరుకానున్నట్లు తెలిపారు. కాగా అంతకు ముందు హుజురాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంపు ఆఫీసుపై దాడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. దానితో పాటు హైదరాబాద్లోని కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన సురక్షితంగా బయటపడగా వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. మరోవైపు.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు.దాడి ఎందుకు జరిగింది?కరీంనగర్లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్ రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై దాడికి యత్నించాయి. -
ఎర్రచందనం దొంగలతో చంద్రబాబు, లోకేశ్ ఫోటోలు.. Liveలో ఆధారాలు
-
సీఎం కోడలు కొనుగోలు చేసిన భూములపై CBI ఎంక్వైరీ జరగాల్సిందే!
-
టీవీకేకు కాంగ్రెస్ మద్దతు.. స్టాలిన్ సంచలన నిర్ణయం
చైన్నై: తమిళనాడులో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. టీవీకేకు సరైన సంఖ్యాబలం లేదంటూ ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రకటించారు. కాగా ఇప్పుడు డీఎంకే సైతం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పింది. ఈ మేరకు డీఎంకే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.డీఎంకే అధికారిక ప్రకటనలో... కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిస్తే దానికి తాము భారీ మూల్యాన్ని చెల్లించామని పేర్కొంది. సోనియా, మన్మోహన్ సింగ్లతో స్నేహంగా ఉన్నాం రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం ఐతే ఇప్పుడు DMKతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని తెలిపింది. కాంగ్రెస్ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది ఇది ప్రజలను మోసం చేయడమేనని పేర్కొంది. బీజేపీకి, కాంగ్రెస్కు పెద్ద తేడా లేదని రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికికాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా డీఎంకే అధినేత స్టాలిన్ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండియా కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్కు భుజం భుజం కలిసి నడిచాం, ఓటమి మాకు కొత్తేమి కాదు..వెన్నుపోటు కొత్త కాదు సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతామంది. భవిష్యత్తులో కాంగ్రెస్తో పొత్తుఉండదు. ఆపద వేళ కాంగ్రెస్ను ఆదుకుంటే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. అధికార దాహంతోనే టీవీకేతో కాంగ్రెస్ జతకట్టింది". అని డీఎంకే ప్రకటన విడుదల చేసింది.టీవీకే మెజార్టీ మార్కుకు 10 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో కాంగ్రెస్తో పాటు ఇతర చిన్నపార్టీల మద్దతు కోరింది. దీంతో టీవీకేకు సపోర్టు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీఎంకే సంచలన ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా డీఎంకే పార్టీ ఉంది. ఇండియా కూటమికి ఛైర్మన్గా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యవహరిస్తున్నారు. కాగా డీఎంకే ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి సైతం దాదాపుగా వైదోలిగినట్లేనని విశ్లేషకులు అంచనా.. -
‘వేరే దిక్కులేక ఓటేశారు’: ఎన్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళ శాసనసభ ఎన్నికల ఫలితాలు పదేళ్ల వామపక్ష (ఎల్డీఎఫ్) పాలనకు తెరదించుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (యూడీఎఫ్) కూటమికి అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే ఈ చారిత్రక విజయం కాంగ్రెస్ నేతల గొప్పదం వల్ల కానే కాదని, కేవలం మార్పు కోరుకున్న ప్రజలు విధిలేక కాంగ్రెస్కు ఓటేశారని నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్ఎస్ఎస్) జనరల్ సెక్రటరీ జి. సుకుమారన్ నాయర్ వ్యాఖ్యానించారు.పెరున్నలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజా ఫలితాలను ‘ప్రజాస్వామ్య విజయం’గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేరళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ 63, దాని మిత్రపక్షం ఐయూఎంఎల్ 22 సీట్లు గెలుచుకుని పదేళ్ల ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించాయి. అయితే, ఈ విజయం తమ సొంత ప్రతిభేనని కొందరు కాంగ్రెస్ నేతలు భ్రమ పడుతున్నారని, కానీ అందులో ఏమాత్రం నిజం లేదని సుకుమారన్ నాయర్ తేల్చి చెప్పారు.పదేళ్ల పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు, మార్పు కోరుకుంటూ ఓటు వేశారన్నారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ఆ ఓట్లు కాంగ్రెస్, యూడీఎఫ్ పక్షాన పడ్డాయని ఆయన అన్నారు. మంత్రుల ఓటములకు కూడా ఈ ప్రజా వ్యతిరేకతే కారణమని ఆయన విశ్లేషించారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, సమర్థులైన, అనుభవజ్ఞులైన వారిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే ఎంచుకుంటుందని సుకుమారన్ నాయర్ పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ గురించి ప్రస్తావించగా.. అది కాంగ్రెస్ నిర్ణయమని, దాన్ని అంగీకరించాల్సిందేనని బదులిచ్చారు. ఎన్నికల్లో ఎన్ఎస్ఎస్ సమాన దూరమనే విధానాన్ని పాటించిందని చెప్పిన ఆయన, గతంలో సతీశన్తో వచ్చిన విబేధాలు ఇంకా అలాగే ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని తాను అడగబోనన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన హక్కులను ప్రభుత్వాన్ని అడుగుతామని, అనవసరమైన పదవులు, చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం తాము ఆశపడబోమని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఒహియోలో వివేక్ రామస్వామి సంచలనం -
డీఏంకేను వీడేది లేదు.. వీసీకే చీఫ్
సినీ స్టార్ విజయ్కు ఊహించని షాక్ తగిలింది. వీసీకే చీఫ్ తిరుమావళన్ డీఎంకేను వీడేది లేదని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో విజయ్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కావడంతో టీవీకే ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులతో పాటు అక్కడి చిన్న పార్టీల అభ్యర్థుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము టీవీకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం గురించి ఆలోచించడం లేదు. మేము ఇప్పటికీ డీఎంకేతోనే ఉన్నాము. మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం మేము ఈ పొత్తుతో ముందుకెళ్లాము. టీవీకే నుండి ఎలాంటి ఆహ్వానాన్ని ఆశించడం లేదు. తమిళనాడులో సంఘ్ పరివార్ నేతృత్వంలోని మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పుకు మేము చాలా కృతజ్ఞులం." అని అన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ రెండు స్థానాలు గెలిచింది. ఇది వరకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తమకు తగినంత సంఖ్యాబలం ఉందని రెండు వారాల గడువు ఇవ్వాలని తమిళనాడు గవర్నర్ని విజయ్ కోరారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏం జరగనుందా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.#WATCH | Chennai | Viduthalai Chiruthaigal Katchi (VCK) Chief, Thol. Thirumavalavan, "We are not thinking about a coalition govt along with TVK. We are still with DMK. We are for secularism. We will proceed with this alliance for the welfare of the people of Tamil Nadu. We are… pic.twitter.com/WXpUBTWYPH— ANI (@ANI) May 5, 2026 -
రాజధాని అనేది ఫొటోలోనే.. నిజం అది మునిసిపాలిటీకి కూడా పనికిరాదు
-
అమరావతి టూ హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. లోకేష్ సమాధానం.. ఇది మాములు ర్యాగింగ్ కాదు
-
12 వేల కోట్లతో బుర్జు ఖలీఫా.. అమరావతిలో 3 బిల్డింగ్ కోసం 14 వేల కోట్లా?
-
ఇరాన్ నన్ను ఇరిటేట్ చేస్తోంది.. ట్రంప్
ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదనలతో తాను సంతృప్తిగా లేనని ప్రస్తుతానికి యుద్దం ముగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అయితే ఇరాన్ మాత్రం తమతో యుద్దం ముగింపుకై సంప్రదింపులు జరుపుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 60 రోజులు గడుస్తోంది అయినప్పటీకీ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఇరు దేశాలు చర్చల విషయంలో తగ్గడం లేదు. అమెరికా ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం కుదరదు అనడం ఇరాన్ దానికి ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పడంతో చర్చలు సాగడం లేదు. అయితే తాజాగా ట్రంప్ ఈ విషయంలో మరోసారి స్పందించారు.ట్రంప్ మాట్లాడుతూ "వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ నేను దానికి సిద్ధంగా లేను; నాకు దానితో తృప్తి లేదు, కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. వారు పురోగతి సాధించారు, కానీ వారు ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకుంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇరాన్లో వారు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు," అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.కాగా ఇరాన్తో యుద్ధం ప్రారంభమైననాటి నుంచి చట్టపరమైన అనుమతి కోరడానికి ట్రంప్ ప్రభుత్వానికి ఈ రోజు ( శనివారం)చివరి గడువు అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ సమయంలో యుద్ధం ముగిసిపోయినందున దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ కాంగ్రెస్కు తెలిపినట్లు సమాచారం. -
చంద్రబాబు ఆరు లక్షల పెన్షన్లు కట్ చేశారు: విడదల రజిని
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబుకు అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని వైఎస్సార్సీపీ నేత విడదల రజిని మండిపడ్డారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో శనివారం రజిని మీడియా సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ హామీని కూడా గాలికి వదిలేశారన్నారు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 66లక్షల 35 వేల పెన్షన్లు అర్హులకు అందజేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు లక్షల పెన్షన్లు కట్ చేశారని తెలిపారు.కూటమి ప్రభుత్వం రికార్డుస్థాయిలో అప్పులు చేస్తుందని ఆ నిధులను ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. తెచ్చిన అప్పులతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విలాసాలు చేస్తూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ సరదాలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీని గాలికి వదిలేసి డబ్బులన్నీ వృథా చేస్తున్నారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ జరుగుతోందని దేశంలో ఎక్కడా లేనట్లుగా ఏకంగా అడుగుకు రూ.18,500 పైనే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దీన్ని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు.అమరావతిలో అద్దాలకే రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తారా? ఆ వృథా డబ్బు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవన్నారు. ఆరోగ్యశ్రీ వైద్యం అందేది స్కూళ్లు బాగుపడేవి కానీ చంద్రబాబుకు అమరావతి, అవినీతి తప్ప ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఆరోగ్య శ్రీకి రూ.4 వేల కోట్ల బకాయి పెట్టారని.జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకి మేలు జరిగిందని వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడేనని విడదల రజిని మండిపడ్డారు. -
ఏపీలో లేబర్ అడ్డాలట.. చంద్రబాబు చెప్తున్న కొత్త మాట
-
ఒక అచ్చోసిన ఆంబోతు మాటలకు మీ పదవులను ఊడగొట్టకపోతే.. జడ శ్రవణ్ ఛాలెంజ్
-
బిల్డింగ్ అద్దాల కోసం 2 వేల కోట్లు.. మనిషివేనా..! చంద్రబాబును ఏకిపారేసిన కారుమూరి
-
అనిత, సంధ్యారాణిని చూస్తే.. మహానటి సావిత్రి మళ్లీ పుట్టారా అనిపిస్తుంది..
-
చంద్రబాబు 'మెంటల్' అనగానే బాలయ్య వైపు తిరిగిన కెమెరా..!
-
ఈ ఎన్నికలతో బీజేపీ పతనం మొదలైంది
-
మాకు OCD, CCD వ్యాధుల.. మీకున్న వ్యాధి గురించి చెప్పమంటారా
-
నీరజ్ మిట్టల్ ని కలిసినప్పుడు చెప్పిన మాటలు.. సంచలన నిజాలు బయటపెట్టిన అవినాష్ రెడ్డి
-
అమరావతి కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం కోసం.. ఇంధన సంక్షోభం సృష్టి
-
BRS ఆవిర్భావ దినోత్సవం.. కవిత కొత్తపార్టీ పై కేసీఆర్..!?
-
లెవిట్ చెప్పినట్టే పేలిన ‘తూటాలు’!
వాషింగ్టన్: హిల్టన్ హోటల్లో కాల్పుల నేపథ్యంలో ఆ ఉదంతానికి కొద్దిసేపటి ముందు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లెవిట్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘ఈరాత్రి జరగబోయే కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ అద్భుతంగా ప్రసంగించనున్నారు. ఆ సందర్భంగా మాటల తూటాలు పేలనున్నాయి. ఆ తూటా శబ్దాలను అందరూ విని తీరాల్సిందే’’ అని లెవిట్ చెప్పుకొచ్చారు. ట్రంప్ పదునైన పదజాలంతో, వాగ్ధాటితో ప్రసంగిస్తారనే ఉద్దేశంలో ఆమె మాట్లాడినా, కొద్దిసేపటికే కార్యక్రమంలో నిజంగా తూటాలు పేలడం సరదా వ్యాఖ్యలకు తావిచ్చింది. ‘‘తూటా పేలుళ్లను లీవిట్ ముందే పసిగట్టారు. ఇలా జరగబోతోందని ఆమెకు ముందే తెలుసేమో’’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘ఇదంతా రాజకీయ ఎత్తుగడ కాదు కదా!!’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.బాటిళ్లు తీసుకెళ్లారు!ఓవైపు కాల్పుల మోత మోగుతుంటే కొందరు జర్నలిస్టులు మాత్రం మద్యం బాటిళ్లపై దృష్టిపెట్టారు! ఖరీదైన వైన్, షాంపేన్ బాటిళ్లతో సెలీ్ఫలు దిగారు. మరికొందరు వాటిని చెరోటి చంకలో పెట్టుకుని మరీ వెంట తీసుకెళ్లారు. మహిళా జర్నలిస్టులు వైన్ బాటిళ్లను వెంట తీసుకెళ్తున్న వీడియో వైరలైంది. అయితే ఈ సందర్భంగా పలువురు అగ్రనేతలు ప్రాణభయంతో పరుగెత్తుతుంటే, అది చూసి అక్కడే ఉన్న కొందరు మీడియా ప్రతినిధులు బిగ్గరగా నవ్వడం వివాదాస్పదమైంది. మరోవైపు, అంతటి గందరగోళంలోనూ ఒక పెద్దాయన నింపాదిగా కూర్చుని హాయిగా మద్యం సేవిస్తూ స్టఫ్ తింటూ కన్పించారు! -
బాబు ఏం చెప్పినా తల ఊపుతావా? నీ బుర్ర వాడవా...
-
సింగపూర్ లో అచ్చెన్నాయుడు జల్సా! ఒక రేంజ్ లో ఆడుకున్న నాగార్జున
-
'నాకేలాంటి దురుద్దేశం లేదు.. తమన్నా కాళ్లు పట్టుకుంటా'
ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తమన్నాపై డ్యాన్స్పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తమన్నా చాలా తెల్లగా ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాగా.. స్త్రీ 2 చిత్రంలోని ఆజ్ కీ రాత్ ఐటమ్ సాంగ్ను ఉద్దేశించి మాట్లాడారు. అదే సమయంలో తమన్నా డ్యాన్స్ గురించి మాట్లాడారు. అదే సమయంలో ఆమె శరీర రంగుపై కామెంట్స్ చేయడంతో వివాదానికి దారితీసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అన్ను కపూర్ ఈ వివాదంపై స్పందించారు. తన కామెంట్స్ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అదే మాటను తాను మిల్కీ బాడీ అని చెబితే సమస్య వచ్చేది కాదేమోనని అన్నారు. కేవలం లాంగ్వేజ్ మారినంత మాత్రాన అర్థం మారదన్నారు. తమన్నాను ప్రశంసించడానికే అలా అన్నానని.. అంతే తప్ప తనకు మరో ఉద్దేశం లేదని తెలిపారు. నా కామెంట్స్తో తమన్నా బాధపడి ఉంటే ఆమె కాళ్లు పట్టుకోవడానికైనా రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు.. ఆమె కాళ్లు పట్టుకోవడం పెద్ద విషయం కాదన్నారు. -
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య కాదు.. రాష్ట్ర ప్రభుత్వ హత్య
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా నాన్న మృతి.. శంకర్ గౌడ్ పిల్లల ఆవేదన
-
భారత్ నరకం ట్రంప్ వ్యాఖ్యలు.. భారత్ ఘాటు రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్పై విషం చిమ్మారు. దేశాన్ని నరకంతో పోలుస్తూ జాత్యాహాంకార వ్యాఖ్యలు చేశారు. కాగా దీనిపై తాజాగా భారత్ ఘాటుగా స్పందించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబించవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.ట్రంప్ వ్యవహార శైలి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎప్పుడు ఏవిధంగా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అమెరికా గ్రేట్ ఎగేన్ అంటూ తరచుగా వేరే దేశాలపై విషం చిమ్ముతుంటారు. ఆ దేశ సంపదను అవతలి వారి కొల్లగొడుతున్నారంటూ అవతలి దేశాలపై ఏడుస్తూ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత్ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన వివాదాస్పద లేఖను తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.కాగా దీనిపై తాజాగా భారత్ స్పందించింది " మేము ట్రంప్ వ్యాఖ్యలను, అలాగే వాటికి ప్రతిస్పందనగా యూఎస్ రాయబార కార్యాలయం జారీ చేసిన ప్రకటనను కూడా చూశాము. ఆ వ్యాఖ్యలు స్పష్టంగా అవగాహన లేనివి, అనుచితమైనవి మరియు అసభ్యకరమైనవి. అవి ఖచ్చితంగా భారత్-యూఎస్ ప్రస్తుతమున్న సంబంధాల వాస్తవికతను ప్రతిబింబించవు. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు చాలా కాలంగా పరస్పర గౌరవం మరియు ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.మళ్లీ భారత్ను పొగిడిన ట్రంప్కాగా భారత్లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ దీనిపై మరో విధంగా స్పందించారు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ తనతో అన్నారని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ రెండు సంఘటనలను ఊటంకిస్తూ స్పందించింది.అసలేం జరిగింది ?ఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు. ఒక దేశానికి అధ్యక్షుని హోదాలో ఉండి మరో పెద్ద దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. -
ఊసరవెల్లి సిగ్గుపడుతుందేమే.. భారత్పై మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊసరవెల్లి కంటే వేగంగా ట్రంప్ తన మాటలను మార్వగలరు. ఈ రోజు ఉదయమే భారత్పై విషం వెల్లగక్కుతూ అవమానించేలా మాట్లాడిన ట్రంప్.. అంతలోనే ఇండియాను ప్రశంసిస్తూ మాట్లాడారని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ వలసల విషయంలో భారత్పై మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.ఇండియా, చైనా దేశాలను నరకకూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. కొన్ని గంటల్లోనే ట్రంప్ తన బుద్ధిని బయటపెట్టాడు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ అన్నారని భారత్లోని అమెరికా కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మైఖేల్ సావేజ్ వివాదాస్పద వ్యాఖ్యలుఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు.భారత్ స్పందనఅటు ట్రంప్ ఇటు సావేజ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ..‘మేము కొన్ని నివేదికలను చూశాము. వాటిని అక్కడే వదిలేశాం’ అని అన్నారు. -
నందిగ్రామ్ సెగలు: పోలీసులపై సువేందు ఫైర్
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. రాజకీయంగా కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పోలీసులు.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేసిన సంచలన ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.పోలీసుల పక్షపాత వైఖరిపై ఫైర్తమ పోలింగ్ ఏజెంట్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని నందిగ్రామ్, భవానీపూర్ స్థానాల నుంచి బరిలో ఉన్న సువేందు అధికారి ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసుల తటస్థతపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా పింగ్లా పోలీస్ స్టేషన్ ఓసీ చిన్మోయ్ ప్రమాణిక్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఆయనను సస్పెండ్ చేసి, విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) మనోజ్ అగర్వాల్, పోలీసు పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. VIDEO | West Bengal election: BJP candidate from Bhabanipur and Nandigram, Suvendu Adhikari, said,"Murder accused Sheikh Shahuddin is threatening voters. I am not afraid of anything. My fight is not against any religion. My fight is against the goons of TMC."… pic.twitter.com/z2EYl7Tmjs— Press Trust of India (@PTI_News) April 23, 2026‘ఆ గూండాలతోనే నా పోరాటం’ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని సువేందు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘హత్య కేసులో నిందితుడైన షేక్ షాహుద్దీన్ ఓటర్లను బెదిరిస్తున్నాడు. నేను దేనికీ భయపడను. నా పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదు, కేవలం టీఎంసీ గూండాలపైనే నా యుద్ధం’ అని ఆయన పేర్కొన్నారు. బిన్పూర్, ఖరగ్పూర్ లాంటి ఇతర ప్రాంతాల్లోనూ బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఏజెంట్లను బలవంతంగా తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్కు ముందు రోజు రాత్రి కూడా నందిగ్రామ్లో టీఎంసీ, బీజేపీ వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. -
అంతా అమరావతిలో ఖర్చు చేస్తే.. మా పరిస్థితి ఏంటి.. బాబుపై తిరగబడ్డ రాయలసీమ ప్రజలు
-
ఏఐసీసీ చీఫ్పై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నిన్న ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ చర్చలకు ఉపక్రమించింది. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోదీ హరిస్తున్నారని అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఏలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.తమిళనాడులో ఈ నెల 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు సాగుతుండగా మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సినీస్టార్ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
సమస్యలపై నిరసన చేస్తే డిస్మిస్ చేస్తారా?
-
చంద్రబాబు నిన్ను ఓడిస్తాం.. రైతుల భూములు చీమలు.. దోమల్లా కనిపిస్తున్నాయా?
-
ప్రధాని మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోదీ హరిస్తున్నారని అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఏలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాటలు ఇప్పుడు తీవ్రదుమారం రేపుతున్నాయి.తమిళనాడులో ఈ నెల 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు సాగుతుండగా మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సినీస్టార్ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఆ వ్యాఖ్యలు చేసింది వారు కాదు.. యోగీపై ట్రోల్
కోల్కతా ఎన్నికల ప్రచారం సందర్భంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్కు గురవుతున్నాయి. తృణముల్ ఎంపీ సాగరిక ఘోష్తో పాటు సమాజ్ వాద్ పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.అసలేం జరిగింది?యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పశ్చిమబెంగాల్ ఎన్నికల సందర్భంగా బంకురాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగీ మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానిస్తూ "మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను" అన్నారు.అయితే దీనిపై తృణముల్ ఎంపీ యోగీ ఆదిత్యానాథ్కు కౌంటరిచ్చారు. "యోగీ ఆదిత్యానాథ్ గారు ఆ వ్యాఖ్యలు చేసింది స్వామి వివేకానంద కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్" అన్నారు. యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు "బెంగాల్ చరిత్ర పట్ల బీజేపీకి ఉన్న అజ్ఞానాన్ని, ధిక్కారాన్ని" బట్టబయలు చేసిందని పేర్కొన్నారు.అయితే దీనిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం స్పందించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీస్తున్నాయన్నారు.కాగా ఈ వ్యాఖ్యలు 1944 జూలైలో బర్మాలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడమని ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) సైనికులను ఉద్దేశించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు ఆసమయంలో సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ సైనికులనుద్దేశించి "నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ప్రచారం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 23న తొలిదశ ఎన్నికలు జరగునుండగా, ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
అటువంటి న్యాయవాదులను తొలగించాలి: జస్టిస్ బీ.వీ నాగరత్న
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ.వీ నాగరత్న న్యాయమూర్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వేతనాలకు అనుగుణంగా జీవించలేక ప్రలోభాలకు గురయ్యే న్యాయమూర్తులను తమ పదవులను తొలిగించాల్సిన అవసరం ఉందన్నారు. బెంగళూరులో జరిగిన 22వ వార్షిక రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల సదస్సులో ప్రసంగిస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ నైతికత, స్వతంత్రత, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. ఇటీవల వచ్చిన 2వ పేకమిషన్ సిపారసులను అమలు చేయడం ద్వారా న్యాయమూర్తుల భద్రత మరింతగా మెరుగుపడిందన్నారు. అయితే చట్టబద్దంగా తమకు వచ్చిన ఆదాయానికి అనుగుణంగా జీవించలేక దురాశకు లోనయ్యే న్యాయమూర్తులను న్యాయ వ్యవస్థ నుండి తీసివేయాల్సిన అవసరం ఉందన్నారు.ఒక న్యాయమూర్తి చేసే తప్పు కేవలం అతనికి మాత్రమే కాదని పూర్తి న్యాయవ్యవస్థపైనా ప్రభావం చూపుతుందన్నారు. అదే విధంగా న్యాయమూర్తులు కేవలం బయటి వ్యక్తుల నుండే కాకుండా, సహచర న్యాయమూర్తుల నుండి వచ్చే ఒత్తిళ్లకు కూడా లొంగకూడదన్నారు.తీర్పులు ఇచ్చే విషయంలో ఎటువంటి కో ఆర్డినేషన్ ఉండకూడదని ప్రభావితమై న్యాయమూర్తి ఇచ్చే తీర్పు అతని వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యవస్థకు మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక సాధనంలా ఉండాలి కాని అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాకూడదన్నారు. అదే విధంగా న్యాయవాదులు తాము సమర్పించే తీర్పుల యథార్థతను ధృవీకరించాలని అల్గారిథమ్ల ప్రభావం నుండి న్యాయవ్యవస్థకు విముక్తి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.కోర్టులలో మహిళా న్యాయమూర్తులకు భద్రత, గౌరవం మరియు అనుకూలమైన వాతావరణం కల్పించడం న్యాయవ్యవస్థకు అత్యంత అవసరమన్నారు. హైకోర్టులు మరియు జిల్లా న్యాయవ్యవస్థ మధ్య సంబంధాలు పారదర్శకంగా ఉండాలి. జిల్లా న్యాయమూర్తుల పదోన్నతులు, బదిలీలు మరియు సెలవుల విషయంలో హైకోర్టు రిజిస్ట్రీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.మెుత్తంగా న్యాయం అనేది కేవలం యాంత్రికంగా కాకుండా, మానవత్వంతో కూడిన విచక్షణతో జరగాలని ఆమె తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. కాగా జస్టిస్ నాగరత్న ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 2027 సెప్టెంబరులో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడానికి అవకాశాలున్నాయి. ఇదే జరిగితే స్వాతంత్ర్య భారత చరిత్రలో మెుట్ట మెదటి సారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన మహిళగా ఆమె రికార్డు సాధిస్తారు. -
తుది చర్చలు చాలా దూరం.. ఇరాన్ స్పీకర్
ఇరాన్- అమెరికా మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం మరో రెండు రోజుల్లో ఏప్రిల్ 21తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిభాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలలో ప్రాథమిక అంశాలలో చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. తుదిదశ చర్చలకు రెండు దేశాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయన్నారు.ఇటీవల అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సరైన సయోధ్య కుదరకపోవడంతో చర్చలు ఎటువంటి సానూకూల ఫలితాలు లేకుండానే ముగిశాయి. అయితే ఇరు దేశాల మధ్య కుదిరిన సీజ్ఫైర్ ఒప్పందం ఈ నెల 21తో ముగుస్తోంది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య మరో దపా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ తన అభిప్రాయాల్ని మీడియాతో పంచుకున్నారు.మహ్మద్ గాలిఫ్ మాట్లాడుతూ " ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొన్ని విషయాల్లో తీవ్ర అభ్యంతరాలున్నాయి. తుదిదశ చర్చలకు ఇంకా చాలా దూరంలో ఉన్నాం. ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించింది. అందుకే కాల్పుల విరమణకు అంగీకరించాం". అన్నారు. శత్రుదేశం తమ స్వలాభం కోసం ఎన్నో డిమాండ్లను ఇరాన్పై రుద్దే ప్రయత్నం చేసింది. కానీ మేము వాటిని ఎదుర్కొన్నాం. పోరాటంలో చర్చలు కూడా ఓ భాగమే అని మహ్మద్ గాలిఫ్ అన్నారు.తదుపరి చర్చల మాట్లాడే అంశాలపై చివరి దశ ఫ్రేమ్ వర్క్ రూపొందిస్తున్నామని ఇరాన్ ప్రతినిధులు ఈ అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారని తెలిపారు. మరోవైపు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందిస్తూ ప్రస్తుతం రెండు దేశాల మధ్య చాలా మంచి సంభాషణలు జరుగుతున్నాయి.ట్రంప్ వ్యాఖ్యలుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ అంశంపై మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగానే ఉన్నాయని, అయితే ఇరాన్ తమను "బ్లాక్మెయిల్" చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మళ్ళీ బాంబుల దాడి మొదలుపెడతామని అంతకుముందు ఆయన హెచ్చరించారు.ఇస్లామాబాద్ భేటీఏప్రిల్ 11న ఇస్లామాబాద్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ , గాలిబాఫ్ నేతృత్వంలోని బృందం మధ్య చర్చలు జరిగాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి. అనంతరం మరోదఫా చర్చలు పాకిస్థాన్ వేదికగా రేపు ( సోమవారం) జరగనున్నట్లు సీఎన్ఎన్ నివేదిక వెల్లడించింది.మరోసారి టెన్షన్అయితే ఇరు దేశాల మధ్య సానూకూల వాతావరణం వచ్చినట్లే వచ్చి మరోసారి ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ తొలుత హర్ముజ్పై విధిస్తున్న దిగ్భందం తీసివేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఇరాన్ మరోసారి జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మరో దఫా చర్చలలో ఏం జరగనుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్
-
నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు
-
అమరావతి అని లొకేషన్ పెడితే ఎక్కడికి తీసుకెళ్ళిందంటే..
-
అమరావతిలో బాలయ్య 100 ఎకరాలు..
-
కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు గరళం తాగిన శివుడు జగన్
-
ట్రంప్నకు... పోప్ చురకలు
కేప్టౌన్ : పొప్ లియో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు చేయడానికి బిలియన్లు ఖర్చు చేసి కొద్ది మంది నియంతల వల్ల ప్రపంచ తీవ్ర వినాశనానికి గురవుతుందన్నారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పరోక్షంగా ట్రంప్ను ఉద్దేశిస్తూ మాట్లాడారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తిక్కరేస్తే అంతే సంగతులు. ఏవరికైనా వార్నింగ్ ఇస్తారు. ఈ దేశంపైనైనా దాడికి తెగబడతారు. ఇటీవల ఆ జాబితాలో పోప్ లియో-14 చేరారు. ఆయన బలహీన పోప్ అని అతనికి ఆ పదవి తన వల్లే వచ్చిందన్నారు. ఆయన విదేశాంగ విధానం చాలా దారుణమని మితిమీరిన ఉదారవాదం కనబరుస్తున్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షున్నే విమర్శించే పోప్ తమ దేశానికి వద్దని విరుచుకపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలకు పోప్ సైతం ఎక్కడా తగ్గకుండా సమాధానం ఇచ్చారు.ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న పోప్ మీడియాలో ఇలా మాట్లాడారు " యుద్ధాలు చేయడానికి బిలియనల్ కొద్ది డబ్బు ఖర్చు చేసే వారి వల్ల ప్రపంచం నాశనమవుతోంది.అంతేకాకుండా తమ స్వార్థపు లక్షాలను సాధించడానికి వీరు భగవంతుని పేరు వాడుకోవడం చాలా బాధకరమన్నారు. విధ్వంసం కోసం బిలియన్లు ఖర్చు చేసే వారు విద్య, పునరావాసంపై దృష్టిసారించరు. దేనినైనా నాశనం చేయడానికి ఒక్క క్షణం చాలు. కానీ సరిచేయడానికి ఒక జీవితకాలం కావాలి" అన్నారు. అయితే పోప్ పర్యటనకు అక్కడ విశేష స్పందన లభించింది. బబెండా నగరంలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ఇస్లామిక్, క్రైస్తవ మత నాయకులతో పోప్ లియో ఒక శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. -
చరిత్ర సృష్టిద్దాం.. మద్దతివ్వండి: మోదీ
ఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పార్లమెంటులో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ నడుస్తోన్న వేళ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. పార్లమెంటు తీసుకునే ఈ నిర్ణయం కోసం యావత్ మహిళా లోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోందన్నారు. మహిళల మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయకూడదని అందరం కలిసి చరిత్ర సృష్టిద్దామని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం బీజేపీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఓటింగ్కు ముందు కీలక నేతలతో భేటీ అయ్యారు. బిల్లు ఆమోదం పొందేలా సీనియర్ మంత్రులతో మంతనాలు జరుపుతున్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజకీయ లబ్ధికోసమే ఈ బిల్లు తీసుకవచ్చారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. డీలిమిటేషన్ అనేది నిరంతరం ప్రక్రియని మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్తో లింకు పెట్టారని ఆరోపించారు. ఇక తమిళనాడు డీఎంకే సైతం ఇదివరకే డీలిమిటేషన్కు తమ పార్టీ వ్యతిరేకమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశాలకు వారు నల్లదుస్తులు ధరించి హాజరయ్యారు. రాజ్యాంగ సవరణ బిల్లులకు పార్లమెంటులో మూడింట, రెండో వంతు మెజార్టీ అవసరముంటుంది. అనగా 360 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఎన్డీఏ బలం 294 దీంతో ఇంకా 64 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగతుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
శ్రీరాముడు వలస కూలి.. నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఈ రోజు దేశ చరిత్రలోనే గొప్ప రోజుగా మిగిలిపోతుంది
-
జగన్ టూర్ సక్సెస్.. బాబులో ఫస్ట్రేషన్
-
33 గంటలు ఏం ప్రశించారంటే..?
-
ఇది నా పదో విజయం.. ట్రంప్ సంచలన పోస్ట్
-
అద్భుతం జరగబోతుంది.. ఇక అంతా మంచి రోజులే..
-
వైలెంట్ బుక్ రెడీ చేస్తున్నాం.. ఎక్కడ దాక్కున్నా వెతికి వెతికి మరి....
-
యుద్ధం ముగిసినట్లే..! ట్రంప్ కీలక ప్రకటన
-
హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా.. అనవసర అరెస్టులు, రిమాండ్లు..
-
మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..
-
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
-
ముగింపు దశకు యుద్ధం ? ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
అత్తసొమ్ము అల్లుడుదానమా.. ఎవరి సొమ్ము ఎవడికి దానం చేస్తున్నావ్
-
మంగ్లీ బండారం బయటపెడతా.. పంజాగుట్ట PSలో హైడ్రామా.. బాధితులతో సుబ్బారావు
-
పొప్ పై విరుచుకుపడ్డ డోనాల్డ్ ట్రంప్
-
అతనికి శ్రీముఖి అంటే క్రష్.. ఫేమ్ కోసమే ఇందంతా ..!
-
రాధాకృష్ణకు వెంకయ్య సపోర్ట్.. Wait And See.. జగన్ అంటే ఏంటో చూస్తావ్
-
మరోసారి ఇరాన్తో చర్చలు? ట్రంప్ ఏమన్నారంటే..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి చర్చలకు వచ్చినా.. రాకపోయినా తనకు సంబంధం లేదని అసలు ఆవిషయం తాను పట్టించుకోనని తెలిపారు. ఇటీవల జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ మాటలు మరోసారి హీట్ పెంచాయి.ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది. ఇటీవల జరిగిన చర్చలు విఫలమవడంతో ట్రంప్ మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదివరకే హార్ముాజ్ను దిగ్భందిస్తామని వ్యాఖ్యానించారు. అయితే దానికి ఇరాన్ సైతం ఘాటుగానే బదులిచ్చింది. తాజాగా మరోసారి ట్రంప్ చర్చల విషయమై మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "అసలు ఇరాన్ మరోసారి చర్చలకు తిరిగి వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వారు చర్చలకు వచ్చినా రాకపోయినా ఆ విషయం నేనసలు పట్టించుకోను. ఇరాన్ దేశం దాదాపు నాశనమైంది. ప్రస్తుతం ఆదేశం చాలా దీన పరిస్థితుల్లో ఉంది. చర్చలు విఫలమైనప్పటికీ వారి వద్ద అణ్వాయుధం ఉండదు. ఉండే అవకాశం లేదు". అని అన్నారు.అయితే ఇరాన్ మౌళిక సదుపాయాలపై అమెరికా పెద్దగా దాడి చేయలేదని ఆ దేశంలోని ఒకే వంతెనను కూల్చివేసిందని, అది కూడా వారి తప్పేనన్నారు. హర్ముజ్ను తెరుస్తామని అమెరికా మాటిచ్చి ఇప్పుడు దానిని తప్పారని ఇరాన్ పెద్ద అబద్ధాల కోరు దేశమన్నారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నడుస్తున్న సీజ్ఫైర్ ఏప్రిల్ 22 వరకూ కొనసాగుతుందన్నారు. ఇరాన్ ఓడరేవుల దిగ్భందనం మెుదలవుతుందన్నారు. పశ్చిమాసియా యుద్ధం శాంతిస్తుందనుకున్న తరుణంలో ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగేలా ఉన్నాయి. హర్ముజ్ను దిగ్భందించాలని అమెరికా నావికాదళానికి ట్రంప్ ఆదేశాలివ్వడం.. అలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించడంతో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్
-
పుట్టిన ఊరు గురించి అలా మాట్లాడటానికి సిగ్గులేదా.. షర్మిలకు పూజిత కౌంటర్
-
నీకు కొంచమైనా తెలివుందా..? నిన్ను ఒక పావుగా వాడుకుంటున్నారు
-
MAVIGUN అనే పదం డిక్షనరీలో అర్ధమే లేదన్నారు.. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో ఉంది
-
అచ్చెన్నాయుడు దిగజారిపోయి మాట్లాడాడు.. చర్చించడం అనవసరం
-
ఏ జైలు కావాలో ఇప్పుడే చూసుకో.. నీకు 2026లో రాఫ్ఫా.. రాఫ్పానే..
-
MAVIGUNపై షర్మిళ వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి
-
హర్మూజ్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
ఫెయిల్యూర్ అంటే.. దాడి కోరుకుంటున్నారా? రాధాకృష్ణపై ఇంద్రనీల్ ఘాటు వ్యాఖ్యలు
-
నీ తొలిపలుకులు మడిచి.. ABN రాధాకృష్ణపై జడ శ్రవణ్ ఫైర్
-
నీ తల్లి గురించి ABN లో వచ్చిన వార్త మర్చిపోయావా పవన్
-
దమ్ము లేని దద్దమ్మ.. ఏబీఎన్ రాధాకృష్ణపై అంబటి ఫైర్
-
ఎక్కడ దాక్కున్నావ్.. బయటకు రా! రాధాకృష్ణకు పోతిన మహేష్ వార్నింగ్
-
భార్యకు, చెల్లికి తేడా తెలియని ABN.. RKకు వత్తాసు..
-
కాశీ వెళ్ళీ సిగ్గు వదిలేసి.. నీతి జాతి లేకుండా బ్రతికేస్తున్నాడు
-
ABN రాధాకృష్ణ వ్యాఖ్యలపై YSRCP నిరసన
-
బూతు కిట్టు.. శోభనం లైవ్..! చివరలో
-
ఇక్కడితో అయిపోయిందిలే అనుకుంటున్నావేమో.. ABN రాధాకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్
-
బూట్లు నాకే వెదవ బతుకు.. నోట్లో ఏం పెటుకున్నావ్ బ్రోకర్..
-
మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘మావిగన్’ ప్రతిపాదనపై ప్రజల్లో జరుగుతున్న చర్చను దారిమళ్లించేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళలను ఉద్దేశించి అసహ్యకర, దిగజారిన భాషతో వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదని, రాధాకృష్ణ వ్యాఖ్యలు మహిళలను అవమానించడమే కాకుండా కించపరిచేలా చేసిన దాడిగా భావించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రాధాకృష్ణ వివక్ష పూరిత జర్నలిజంతో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘రేపు వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముక లేని నాయకులు వైఎస్సార్సీపీలో ఉన్నారంటూ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. ఇది మహిళలను అవమానించడానికే కాదు.. ప్రజల్లో ‘మావిగన్’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నం. మావిగన్ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కుట్రలో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు దిగారు. మా పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసనలతో రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు. కానీ, ఇటువంటి జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకపోగా చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్లు మద్దతు ఇవ్వడం మహిళలపై వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలి. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము ఖండిస్తున్నాం’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో పేర్కొన్నారు. -
అమరావతి కాదు కమ్మరావతి.. రేణుకా చౌదరికి అంబటి అదిరిపోయే కౌంటర్
-
ధర్మ పరిరక్షకుడా ఎక్కడ ఉన్నావ్.. BR నాయుడి రాసలీలల వీడియో చూడలేదా?


