breaking news
comments
-
నయా పైసా చెల్లించలేదు.. రెచ్చిపోయిన ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిహారం కింద ఇరాన్కు ఇప్పటి వరకూ తామూ నయాపైసా కూడా చెల్లించలేదని తెలిపారు. అదేవిధంగా హర్ముజ్లో ఎలాంటి టోల్ విధించబోమని ఇరాన్ ఇదివరకే తమకు స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. ఒకవేళ ఇరాన్ ఇచ్చిన ఈ సమాచారం అబద్ధమని తేలితే, ఆ దేశంతో జరుగుతున్న శాంతి చర్చలను తక్షణమే నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు.అయితే, ఇరాన్లో ఆహార కొరత తీవ్రంగా ఉన్నందున, వారి నిధులను పూర్తిగా అమెరికా నియంత్రణలోనే ఉంచి కేవలం అమెరికా రైతులకు సంబంధించిన మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ వంటి ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మాత్రమే వాటిని వాడేలా అనుమతిస్తామని వెల్లడించారు.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా తగ్గుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్ బంకుల్లో ధరలను తగ్గించకుండా వినియోగదారులను దోచుకుంటున్నారనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై వెంటనే దర్యాప్తు చేయాలని అమెరికా న్యాయశాఖను కోరినట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా మరోసారి కలకలం రేపుతున్నాయి.కాగా గత సోమవారం స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య 60 రోజుల మధ్యంతర ఒప్పందం కుదిరింది. ఒప్పందం షరతుల్లో భాగంగా ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటించింది. దీని ప్రకారం ఇరాన్ చమురు ఉత్పత్తి, సరఫరా, విక్రయాలకు ఇకపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. ఈ వెసులుబాటు ఆగస్ట్ 21వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. -
సీఐ నాగరాజు మామూలోడు కాదు.. 200 కోట్ల ఆస్తులు సంపాదించాడు
-
అరెస్ట్ డ్రామా... CI నాగరాజుకి జనసేన MLA సీటు కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
ఈ కేసులో ఆఖరిగా వచ్చే తీర్పు ఇదే.. వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
కాపులపై దాడుల మీద ప్రభుత్వం జవాబివ్వాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాపు సామాజికవర్గంపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు ప్రభుత్వం జవాబివ్వాలని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు డిమాండ్ చేశారు. కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్తో పాటు క్రాంతికుమార్ ఆత్మహత్య, గంగమ్మ, కళావతి, తిరుపతమ్మ ఘటనలపై ప్రభుత్వం వెంటనే సమాధానమివ్వాలన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరుస ఘటనలతో ఇరకాటంలో పడిన చంద్రబాబు ఎప్పటిలాగే పవన్కళ్యాణ్, జనసేన నాయకులను రంగంలోకి దింపి డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్పై పిచ్చి కూతలు కూసిన పంతం నానాజీ సహా జనసేన నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఒక వ్యక్తి పోలీసు కస్టడీలో చనిపోతే దానికి హోం మంత్రి, డీజీపీ, పోలీసు అధికారులే బాధ్యత వహించాలన్నారు. మంత్రి కందుల దుర్గేష్ కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడే ముందు.. రెండేళ్లుగా ఆ సంస్థకు ఎందుకు నిధులు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో కాపు నేస్తం సహా వివిధ పథకాల ద్వారా రూ.36 వేల కోట్ల మేర కాపులకు లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. -
డీల్పై కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ను మళ్లీ రెచ్చగొట్టిన ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్ పాటించకపోతే తాను అవసరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో కాస్త ఘాటు హెచ్చరికలే జారీ చేశారు."ఇరాన్ తమ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. ఒప్పందం పట్ల వాళ్లు సక్రమంగా ప్రవర్తించాల్సిందే. లేకుంటే నేను చేయాల్సింది నేను చేస్తా. ఊరుకుంటానుకుంటే ఆ దేశం పొరపాటే" అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ.. గత వారం ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాత్కాలిక ఒప్పందం(MoU)పై డిజిటల్ సంతకాలు చేశారు. ప్రత్యక్ష చర్చల్లో భాగంగా.. మొన్న ఆదివారం ఇరాన్, అమెరికా, మధ్యవర్తిత్వ ప్రతినిధులు స్విట్జర్లాండ్లో చర్చలు మొదలుపెట్టారు. దీంతో 60 రోజుల్లో ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. అయితే.. స్విస్ చర్చలు జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ను కవ్వించేలా మాట్లాడారు. ఒప్పందం కుదుర్చుకోకపోతే భీకర దాడులు.. అదీ గతంలో కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగానే ఇరాన్ ప్రతినిధులు చర్చల మధ్య నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో ఇరాన్ అధికార ప్రతినిధులు ట్రంప్ వార్నింగ్పై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ తరుణంలో.. ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్కు ఇరాన్ నుంచి కౌంటర్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిధుల వినియోగంపైనా ఓ క్లారిటీఇదిలా ఉంటే.. ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన నిధులను విడుదల చేసే అంశంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. విడుదలయ్యే డబ్బు మొత్తం అమెరికా నుంచే ఆహార పదార్థాల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. "విడుదల చేసే డబ్బంతా తిరిగి అమెరికా రైతులకే చేరుతుంది. ఎందుకంటే ఆ నిధులతో ఇరాన్ అమెరికా నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సుమారు 9.1 కోట్ల జనాభాకు సరిపడా ఆహారాన్ని ఇరాన్ ఉత్పత్తి చేయలేకపోతోంది" అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఇరాన్కు నిధుల విడుదల అనేది నేరుగా నగదు సాయం కాదని, నియంత్రిత వినియోగంతో కూడిన ఆర్థిక వ్యవస్థలో భాగమని అమెరికా సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.యుద్ధ ప్రభావం ఇంకా కొనసాగుతూనే..అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఇరాన్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా ఒప్పందం శాంతికి మార్గం వేస్తుందా? లేదంటే ఇరాన్ ఒప్పంద నిబంధనల అమలుపై కొత్త వివాదాలకు దారితీస్తుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది.ఇదీ చదవండి: ఇదెక్కడి ఫిట్టింగ్?.. పే చేయాల్సింది గల్ఫ్ దేశాలేనా! -
సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారు.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సంక్షోభం తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే సీజన్ నుంచి రాష్ట్రంలో పంటలు కొనే నాథుడే లేడని.. పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ప్రజల కోసం ఒక్క మంచి పని చేసిన దాఖలా లేదన్నారు. -
బరితెగించిన బీటెక్ రవి.. విద్యార్థుల మృతిపై అసత్య ప్రచారం
వైఎస్సార్,సాక్షి: చక్రాయపేట మండలంలో నిన్న జరిగిన ఘోర విషాదంపై టీడీపీ నేత బీటెక్ రవి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు ఇసుక గోతుల్లో పడి చనిపోతే.. కావాలనే ఆ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని అత్యంత హేయంగా మాట్లాడారు. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి.. వారి ఆత్మస్థైర్యం దెబ్బతేనేలా కారుకూతలు కూశారు. దీంతో బీటెక్ రవి వ్యాఖ్యలపై ఆ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే నిన్న ఆదివారం (జూన్21) నాడు చక్రాయిపేటలో బంధువుల ఇంటికి వచ్చిన అన్నదమ్ములైన జయంత్ రెడ్డి (17), రాజవర్ధన్ రెడ్డి (15)లు సరదాగా ఈత కొట్టేందుకు పాపాగ్ని నదికి వెళ్లారు. అయితే అక్కడ ఇసుకకోసం తవ్విన గుంతల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. పిల్లలు కనిపించకుండా పోవడంతో గాలించిన స్థానికులకు, చాలా సేపటి తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.ఈ దారుణానికి చక్రాయపేట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాయే కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి అక్రమ దందాలో కాగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ జేసీబీ యంత్రాలను నదీ గర్భంలోకి దించి ఇష్టారీతిన ఇసుకను తవ్వేస్తున్నారు. దీనివల్ల నది లోపల ప్రమాదకరమైన భారీ గోతులు ఏర్పడ్డాయి. అలా తవ్విన ఇసుకను చక్రాయపేట ప్రాంతం నుండి యథేచ్ఛగా బెంగళూరుకు తరలిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, వారి అనుచరులు ఈ ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు. కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పాపాగ్ని నదిని ఇష్టమొచ్చినట్లు తోడేస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు పలుమార్లు జిల్లా కలెక్టర్కు అధికారికంగా ఫిర్యాదులు కూడా చేశారు. అయినా అధికారుల నుండి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడం, ఇసుక దందా ఆగకపోవడం వల్లే ఈరోజు ఈ ఘోర ప్రమాదం జరిగిందని బాధితులు మండిపడ్డారు. అమాయక విద్యార్థుల మృతికి కారణమైన అక్రమ ఇసుక క్వారీ నిర్వాహకులపై, దానికి సహకరిస్తున్న టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా తాజాగా బాధితుల కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి ముక్కుపచ్చలారని ఇద్దరు విద్యార్థులపై మృతిపై టీడీపీ నేత బీటెక్ రవి ఇష్ఠారీతిన వ్యాఖ్యానించడం వారి కుటుంబసభ్యులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. -
సుగాలి ప్రీతి కేసులో భౌ భౌ అని మొరిగి.. ఇప్పుడు ఆధారాలు లేవంటే.. ప్రజలు నమ్మాలా
-
తాట తీస్తా.. నా కొడకా.. పవన్, పంతం నానాజీ వ్యాఖ్యలు.. అంబటి మాస్ వార్నింగ్
-
పవన్ కామెంట్స్ పై పచ్చి బూతులు తిడుతున్న యువత!
-
కూటమి సీక్రెట్ ప్లాన్..! సాయి కృష్ణ కేసు వెనుక ఎంపీ, పోలీస్ మధ్య భారీ డీల్
-
ఇక మారవా పవన్! ఐటెం సాంగ్ మాటలాపు!
-
ఎవడివి రా నువ్వు.. నువ్వెంత నీ బతుకెంత.. పంతం నానాజీపై రెచ్చిపోయిన కారుమూరి
-
సిగ్గులేదా..? కులం పేరు చెప్పి ఆడుకున్నప్పుడు.. నీ బ్రతుకంతా భజన చేయడమే..!
-
పోలీసులు నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
-
"బీజేపీ ఎన్నికల అధికారులతో కుమ్మక్కయ్యింది"
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి తన కోసం రాజ్యసభ సీటు కేటాయిస్తానంటే తాను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను మధ్యప్రదేశ్కు చెందిన మహిళనని అక్కడి నుండి సీటు కేటాయించాలని తెలిపారు. తన సీటు కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.మధ్య ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అవకాశం లేదని బీజేపీకి అర్థమైందని అందుకే ఎన్నికల అధికారులతో కుమ్మక్కు అయ్యిందని ఆరోపించారు. నత్వానీ కి ఇచ్చిన అవకాశం తనకు ఎందుకు ఇవ్వలేదని? 2023 రూల్ బుక్ అడ్డం పెట్టుకొని నత్వాని కి నామినేషన్ కరెక్షన్ కోసం 24 గంటలు ఇచ్చారని తనకు మాత్రం 2026 రూల్ బుక్ ప్రకారం నామినేషన్ కరెక్షన్ కోసం ఆ అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు.తనకు సంబంధం లేని కేసు వల్ల నా నామినేషన్ తిరస్కరించారు. ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన కేసులో నాకు లీగల్ నోటీస్ వచ్చింది. లీగల్ నోటీస్ క్రిమినల్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నామినేషన్ పత్రంలో లీగల్ నోటీస్ అనే కాలమ్ లేనే లేదన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ స్థానం గెలవాలంటే 58 మంది మాత్రమే అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటని బీజేపీకి తెలుసు అయినప్పటికీ కుట్రలో భాగంగానే నామినేషన్ వేశారన్నారు.తన కేసుల అంశాన్ని కాంగ్రెస్ నాయకులు ఇచ్చారనేది పచ్చి అబద్ధం బీజేపీ కావాలనే అబద్ధాలను సృష్టించింది. తానెప్పుడూ బాధితుల పక్షమేనని, శ్రీలతకు కూడా నేను అండగా ఉన్నానని తెలిపారు.రాజ్యసభ నామినేషన్ కేవలం కేసు ఉన్నంత మాత్రానా తిరస్కరణ కాలేదని, బీజేపీ,ఎన్నికల కమిషన్ పూర్తిగా కాంప్రమైజ్ అయింది కాబట్టే నామినేషన్ తిరస్కరణకు గురైందని తెలిపారు.కేవలం ఇది ఒక్క సీటుకు సంబంధించిన విషయం కాదని ఒకే దేశం ఒకే ఎన్నిక చేయాలని బీజేపీ చేస్తోందన్నారు. -
భారత్పై విషం చిమ్మిన పాక్
ఢిల్లీ: భారతలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. జర్దారీ వ్యాఖ్యలు అత్యంత ద్వేషంతో రాజకీయ దురుద్దేశంతో కూడినవని విదేశాంగ శాఖ కొట్టిపడేసింది. భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడే హక్కు ఇస్లామాబాద్కు ఎంతమాత్రం లేదని మరోసారి స్పష్టం చేసింది.ఇటీవల పాకిస్థాన్ అధ్యక్షుడు భారత్పై విషం చిమ్మారు. ఎక్స్ వేదికగా భారత్ను విమర్శిస్తూ "భారతదేశంలోని వారణాసిలో ఉన్న 1000 ఏళ్ల నాటి 'మసీదు గంజ్ షహీదా'తో సహా చారిత్రక ముస్లిం మతపరమైన కట్టడాల కూల్చివేతలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలి, ఇలాంటి చర్యలు కొనసాగితే, అవి భారతదేశ విచ్ఛిన్నానికి నిరంతర అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది" అని ఎక్స్ వేదికగా విమర్శించారు. తాజాగా దీనికి భారత్ తీవ్రస్థాయిలో బదులిచ్చింది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయమై మాట్లాడుతూ... "పాకిస్థాన్ అధ్యక్షుడు చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను భారతదేశం ఖచ్చితంగా తిరస్కరిస్తోంది. భారతదేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి అతనికి ఎలాంటి హక్కు లేదు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పాకిస్థాన్ స్వంత మానవ హక్కుల రికార్డును గమనిస్తే, ఆ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు మరీ హాస్యాస్పదంగా అనిపిస్తాయి. వివిధ మతాలకు చెందిన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించడంలో పాకిస్థాన్కు ఉన్న సుదీర్ఘమైన, దురదృష్టకరమైన చరిత్ర ప్రపంచమంతటికీ తెలిసిందే" అని స్పష్టం చేశారు.అయితే పాకిస్థాన్లో హిందువులపై జరిగే దాడులు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయమై అక్కడి స్వచ్ఛంద సంస్థలు, ఇతర అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థలు కూడా ఆ దేశంలో మతపరమైన హింసపై నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై అక్కడ నిరంతరం దాడులు జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. రాజకీయ ప్రేరేపిత దాడిజర్దారీ వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, ఆ దేశంలో కొనసాగుతున్న మతోన్మాదం, ద్వేషపూరిత విధానాల నుంచే ఇవి పుట్టుకొచ్చాయని జైస్వాల్ ముగించారు. "ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే, పాకిస్థాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు కేవలం ఆ దేశ జాతీయ విధానాలైన మతోన్మాదం, ద్వేషం ఆధారంగా చేసిన ఒక ఉద్దేశపూర్వక రాజకీయ దాడిగా మాత్రమే పరిగణించవచ్చు" అని ఆయన అన్నారు.వారణాసిలోని చారిత్రాత్మక 'మస్జిద్ గంజ్ షహీదా'తో పాటు భారతదేశంలోని ఇతర ముస్లిం ప్రార్థనా స్థలాల కూల్చివేతకు ముప్పు ఉందంటూ జర్దారీ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) లో చేసిన పోస్ట్కు సమాధానంగా భారత్ ఈ ఘాటు స్పందన ఇచ్చింది. భారతదేశ అంతర్గత విషయాల్లో ఇస్లామాబాద్ జోక్యం చేసుకోకూడదని న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. -
సాయి కృష్ణ కేసు వెనుక ఉన్న బడా బాబులను కాపాడటం కోసం ఈ కేసుకు "మేకప్" వేస్తున్నారు
-
మెలోనిపై మరోసారి మండిపడ్డ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని మెలోని మధ్య వైరం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా మెలోని వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటరిచ్చారు. ఇటలీలో ఆమె పనులు సరిగ్గా లేవని అందుకే ఆమె.. తనను విమర్శిస్తూ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. అయితే దీనికి మెలోనీ సైతం కౌంటరిచ్చింది. తన ప్రజాదారణతో మీకేం పని అని ట్రంప్ను ప్రశ్నించింది. డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఇటలీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి.. ట్రంప్ వ్యాఖ్యలను మెలోని ఇదివరకే ఖండించగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ట్రంప్ రెచ్చిపోయారు.తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందిస్తూ.."ఇటలీలో మెలోని ప్రజాదరణ చాలా బలహీనంగా ఉంది. ఇరాన్ అణుబాంబు తయారీని అడ్డుకునే విషయంలో ఆమె అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడమే దీనికి కారణం కావచ్చు. నిజానికి ఇటలీని అమితంగా ప్రేమించేది, రక్షించేది అమెరికా మాత్రమే ఆ మాటకు వస్తే నాటో కూడా ఇరాన్ విషయంలో అలాగే వ్యవహరించింది" అని రాసుకొచ్చారు.అదేవిధంగా యుద్ధ సమయంలో ఇటలీకి చెందిన రన్వేలను లేదా ల్యాండింగ్ స్ట్రిప్స్ను అమెరికా వాడుకోకుండా మెలోని అడ్డుకున్నారని ఆరోపించారు. ఇటలీతో పాటు ఇతర నాటో కూటమి దేశాల రక్షణ కోసం అమెరికా ప్రతిటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ మెలోని కనీసం మా విమానాలు ల్యాండ్ అవ్వడానికి కూడా అనుమతించలేదు. ఇది మాకు తీవ్రమైన రవాణా ఇబ్బందిని కలిగించిందని.. ఇప్పుడు తన ప్రజాదరణ రేటింగ్లను పెంచుకోవడం కోసమే ఆమె నాతో స్నేహం నటిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.మెలోని స్పందనట్రంప్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అంతే తీవ్రంగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఇలాంటి కారణం లేని, నిరంతర దాడులు అర్థరహితమైనవి. మీతో స్నేహం చేయడం వల్ల నా ప్రజాదరణ పెరిగిందేమీ లేదు, అది మీతో ఉండే సంబంధాలపై ఆధారపడి కూడా లేదు. ఇటలీ జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో నాకున్న సామర్థ్యంపైనే నా ప్రజాదరణ ఆధారపడి ఉంటుంది. నేను ఎప్పుడూ దాన్నే చేస్తూ వచ్చాను" అని మెలోని స్పష్టం చేశారు.ఏది ఏమైనప్పటికీ, నా ప్రజాదరణ గురించి మీకేం అవసరం లేదు. దానికి బదులు మీ పాపులారిటీపై మీరు దృష్టి పెడితే మంచిదని నా సూచన అంటూ మెలోని ట్రంప్పై విరుచుకుపడ్డారు.వివాదం ఎలా మెుదలైందంటే..ట్రంప్ మాట్లాడుతూ " నేను మెలోనితో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆమె నాతో ఫోటో దిగాలని ఎంతగానో తపించింది. నేను అసలు ఫోటో దిగకూడదనే అనుకున్నాను, కానీ ఆమెను చూసి జాలిపడి మాట్లాడాను. నాతో మాట్లాడినందుకు ఆమె ఇప్పుడు సంతోషంగానే ఉండి ఉంటుంది" అని అన్నారు. దీనికి ఘాటుగా బదులిచ్చిన మెలోని "డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితాలు, ఈ ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది. అమెరికా అధ్యక్షుడు తన సొంత మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. అయితే పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ఆయన ఇంత పట్టుదల చూపించకపోవడం విచారకరం. నేను గానీ, నా దేశం ఇటలీ గానీ ఎవరిముందూ ఎన్నటికీ మోకరిల్లం, బతిమాలం" అని మెలోని తేల్చిచెప్పారు. -
"మెలోని నాతో ఫోటో కోసం ప్రాధేయపడింది"
రోమ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడం చాలా కష్టం.. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వివాదాస్పదంగా మారాయి. ఇటలీ ప్రధాని తనతో ఫోటో దిగడం కోసం "ప్రాధేయపడ్డారని ట్రంప్ అనడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య నిప్పు రాజేస్తోంది.. తాజాగా దీనిపై మెలోని స్పందించారు.ఫ్రాన్స్ వేదికగా ఇటీవల జీ7 సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. అయితే దాని అనంతరం ట్రంప్ ఒక టీవీ ఛానెల్కు ఇంటర్వ్యుూ ఇచ్చారు. అందులో తాను మాట్లాడుతూ "ఇటలీ ప్రధాని తనతో ఫోటో దిగడం కోసం ప్రాధేయపడ్డారు మెలోనికి తనతో ఫోటో దిగాలని ఎంతో బలంగా ఉందని ఆమెపై జాలిపడి మాత్రమే తాను ఫోటోకు అంగీకరించాను. ఆమె నాతో మాట్లాడినందుకు సంతోషంగా ఉండి ఉంటుంది. నేనేమీ ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పక్కన నిలబడి ఫోటో దిగాలని ఆమె నన్ను బతిమిలాడారు. నేను ఫోటో దిగేవాడిని కాదు, కానీ ఆమెను చూసి జాలి వేసింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.అయితే ఈ వ్యాఖ్యలపై మెలోని మండిపడింది. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, కల్పితం. ఆయన మాటలు నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. అమెరికా అధ్యక్షుడు తన సొంత మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ఎంత మృదువుగా ఉంటారో, మిత్రదేశాల పట్ల కూడా అలా ఉంటే బాగుంటుంది. అయితే ఆయన ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి: నేను కానీ, ఇటలీ దేశం కానీ ఎవరి ముందూ ఎన్నటికీ ప్రాధేయపడవు" అని మెలోని స్పష్టం చేశారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా పర్యటించాల్సిన ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తన ప్రతిపాదిత అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మెలోనిని ఉద్దేశించి ట్రంప్ అన్న అనుచిత మాటలు మొత్తం ఇటలీ దేశాన్ని అవమానించడమేనని ఆయన ఎక్స్ (X) లో పేర్కొన్నారు. జూన్ 21, 22 తేదీల్లో ఆయన అమెరికాలో పర్యటించాల్సి ఉంది.ఇటలీ మంత్రుల ఆగ్రహంప్రధానమంత్రి కార్యాలయ అండర్ సెక్రటరీ గియోవన్ బాటిస్టా ఫజ్జోలారి స్పందిస్తూ.. "ట్రంప్ కావాలనే చేస్తున్నారో లేదా చేతగాక చేస్తున్నారో తెలియదు కానీ, అమెరికా-యూరప్ మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను నాశనం చేస్తున్నారు. తన అనుచిత వ్యాఖ్యల ద్వారా యూరప్ ఖండంలో అమెరికా ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, అమెరికాకు కూడా తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు" అని విమర్శించారు.ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో కూడా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మెలోని ఎవరినైనా ఫోటో కోసం బతిమిలాడుతుందంటే తాను నమ్మనని, బెదిరించినా ఆమె అలా చేయదు" అని అన్నారుద్వైపాక్షిక సంబంధాలపై ఎఫెక్ట్ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చినప్పుడు మెలోని అమెరికా-ఇటలీ బంధాన్ని మరింత బలోపేతం చేయాలని భావించినప్పటికీ, ఇటీవల పోప్ లియోపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ ఘర్షణలను ఖండిస్తూ పోప్ లియో చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడటాన్ని మెలోని ఈ ఏడాది విమర్శించారు. దానికి బదులుగా అమెరికా అధ్యక్షుడు మెలోనిని ఉద్దేశించి ఆమెకు ధైర్యం లేదు అని ఘాటుగా విమర్శించారు. కాగా ఈ తాజా వివాదం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. -
నేరంలో CI, ACP, DGPకి కూడా భాగం ఉంది..
-
మంత్రి పదవి కాపాడుకోవడానికి ఇంతలా దిగజారాలా
-
అనగానగా ఓ పార్టీ.. దాంట్లో రౌడీలు, కామాంధులు
-
ఓరేయ్ కుక్క.. కిరాక్ RP పై ధ్వజమెత్తిన మహిళలు
-
లాకప్ డెత్ టు మేకప్ కిట్టు.. ఇంత డైవర్షన్ ఎందుకు అనిత గారూ ?
-
మేకప్ కోటింగ్ బానే కొడుతున్నావ్.. నువ్వు హోమ్ మినిస్టర్ కన్నా... శ్యామల పంచులు
-
రాక్షస జాతిలో పుట్టిన కిర్రాక్ RP, సీమరాజా.. డైమండ్ రాణి అని అన్నప్పుడు ఏమైపోయావ్ అనిత
-
కోర్టుకు సాయి కృష్ణ వస్తాడా.. లేక పోలీసులు బూడిదను తెస్తారా...?
-
కులం పేరుతో నీచపు రాజకీయాలు.. చిత్రహింసలు పెట్టి చంపాల్సిన అవసరం ఏం ఉంది..?
-
రీతూ- డీమాన్ పవన్ కి ఎప్పుడు అదే పని..! షూటింగ్ లో ఏం జరిగిందంటే.?
-
సాయిని చిత్రహింసలు పెట్టి చంపేశారు.. సంచలన ఫోటోలు రిలీజ్ చేసిన అంబటి
-
వాడేవాడా..? చెప్పమంటావా ఎవడో..! అనితపై వరుదు కళ్యాణి ఫైర్
-
నాకు ఒక్కతే కూతురు.. కొడుకు పుట్టాలని.. సాయి కృష్ణ ఘటనపై అడ్వకేట్ రజిని ఎమోషనల్
-
సంస్కార హీనంగా మాట్లాడితే ఖండించా.. గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్స్ వేదికగా ఈ రోజు (మంగళవారం) ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఎప్పుడూ మహిళా లోకం గురించి మాట్లాడలేదని ఇతరులు సంస్కార హీనంగా మాట్లాడిన వ్యాఖ్యలనే ఖండించానని తెలిపారు. -
ఇక అణ్వాయుధాల జోలే లేదు.. నెతన్యాహు
టెల్ అవీవ్: ప్రస్తుతం పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీస్తున్నాయి. అమెరికా,ఇరాన్ల మధ్య డీల్ కుదరడంతో ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగే ఉండే అవకాశం లేదన్నారు. అది ఈ రోజైనా..రేపైనా అని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందంపై ప్రస్తుతం ఇజ్రాయెల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఆ దేశ ప్రజలకు వివరణ ఇచ్చారు. ఇరాన్పై యుద్ధం విషయంలో తాను చేసింది సరైందేనని సమర్థిస్తూ మాట్లాడారు. "మనం ఏమి సాధించామని ప్రజలు నన్ను అడుగుతున్నారు? దానికి నేను సమాధానమిస్తాను - మనం ఏమి సాధించాం? మనపై ఉన్న తక్షణ వినాశన ముప్పును మనం తొలగించుకున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా, ఇజ్రాయెల్ రాజ్యాన్ని సంపూర్ణ వినాశనం ముప్పు నుండి కాపాడాం" అని అన్నారు. శత్రుదేశం ఇరాన్కు ఈ రోజే కాదు రేపు.. ఎప్పుడూ అణ్వాయుధాలు ఉండవు. అని నెతన్యాహు పేర్కొన్నారు.తాము ఇజ్రాయెల్ దేశం చుట్టూ పటిష్టమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేశామని. గాజా, లెబనాన్ మరియు సిరియాలలో కూడా మేము ఇదే చేశామని అన్నారు. తాను ఒక నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నానని ఇజ్రాయెల్కు అవసరమైనంత కాలం తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి అవసరమైనంత కాలం మేము ఈ భద్రతా మండలాల్లోనే ఉంటామని నెతన్యాహూ తేల్చి చెప్పారు.ట్రంప్తో విభేదాలుఅమెరికా అధ్యక్షుడు ట్రంప్తో గల విభేదాలపై స్పందించారు. కొన్నిసార్లు అధ్యక్షుడు ట్రంప్కు, నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలను వివేకంతో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అని అన్నారు.నెతన్యాహుపై విమర్శలుఇజ్రాయెల్లో నెతన్యాహు నాయకత్వాన్ని విమర్శిస్తూ విపక్ష నేత నఫ్తాలి బెన్నెట్ మాట్లాడారు. నెతన్యాహూ అధికారం అంతర్యుద్ధంతో ప్రారంభమై, అక్టోబర్ 7 నాటి మారణకాండతో కొనసాగి, ఇప్పుడు ఇరాన్పై చారిత్రాత్మక వైఫల్యంతో ముగుస్తోంది అని విమర్శించారు. ఈ వ్యతిరేకతల నేపథ్యంలో నెతన్యాహూ వివరణ ఇచ్చారు.ఎట్టకేలకు శాంతి ఒప్పందంకాగా గత మూడు నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు ముగింపు లభించింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. -
మెట్రోకు అనుమతి లేకపోవడం సీఎం అసమర్థతకు నిదర్శనం.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే మెట్లో ఫేజ్-2కు అనుమతులు లభించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మెట్రో ఫేజ్-2 అనుమతులు దక్కకపోవడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. మెట్రో విషయంలో సీఎం రేవంత్ చేసిన ఆరోపణలకు (సోమవారం) కేటీఆర్ కౌంటరిచ్చారు. అధికారం పొందిన నాటి నుంచి 71 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్లినా బజెపి రేవంత్ను పట్టించుకోవడం లేదన్నారు.ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని సీఎం రేవంత్ ప్రశ్నించలేక పోతున్నారని, ప్రధానిని ప్రశ్నించే ధైర్యం లేక ప్రతిపక్షంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని... 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును కాంగ్రెస్ చిక్కుల్లో వదిలేస్తే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని గుర్తుచేశారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ… నగర విస్తరణ… ప్రజల రోజు వారి అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీపై బెదిరింపులు - ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టి పారిపోతుందని ఆరోపించారు.అంతకు ముందు మెట్రో ఫేజ్-2 అనుమతుల విషయంలో సీఎం రేవంత్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్లపై మండిపడ్డారు. మెట్రోను ఆపడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా కేటీఆర్ దానికి కౌంటరిచ్చారు. -
ఇందిరా గాంధీ బ్రతికి ఉంటే.. బీజేపీ బ్యాన్ ?
జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గనుక ప్రస్తుతం బ్రతికి ఉంటే బీజేపీని దేశంలో బ్యాన్ చేసేదన్నారు. జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇలా మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటరిచ్చింది.జైపూర్లో ఓ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన అశోక్ గెహ్లాత్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ "ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు గత 50 ఏళ్లుగా నేను చూడలేదు. ఇందిరా గాంధీ లాంటి నాయకురాలు ఈ రోజు జీవించి ఉంటే, ఆమె బీజేపీ లాంటి పార్టీని నిషేధించి ఉండేవారు. నేటి వాతావరణం అత్యంత ప్రమాదకరంగా ఉందని నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నాను. దేశం ఇప్పటికీ మేల్కొనకపోతే, భవిష్యత్తులో ఈ దేశ ప్రజలే ఈ మతవివక్ష మూలంగా ఏర్పడే పర్యవసానాలను అనుభవిస్తారు." అని ఆయన అన్నారు.దేశంలోనే అత్యధిక చట్టసభల స్థానాలు కలిగిఉన్న ఉత్తరప్రదేశ్లో ముస్లింలకు కనీసం సీట్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. మీరు సెక్యులర్ పార్టీ అని దేశ ప్రజలకు చూపించడానికైనా కనీసం ఐదు సీట్లు ఇచ్చి ఉండవచ్చు. కానీ మీది మతతత్వ పార్టీ అని 'మేము పూర్తిగా హిందుత్వ పార్టీ' అని ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే కేవలం హిందుత్వ మద్దతుదారులను రెచ్చగొట్టి పాలించడమే ఆలోచనగా ఉన్నవారికి టికెట్లు ఇచ్చారన్నారు. మీరు కేవలం హిందుత్వ ఎజెండాతోనే పార్టీని నడుపుతారా? కేవలం హిందువుల పేరుతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? అని ఆయన బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు.కాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఇది హిందువుల పట్ల, హిందుత్వ పట్ల కాంగ్రెస్కు ఉన్న ద్వేషాన్ని మాత్రమే చూపిస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు."కాంగ్రెస్ పార్టీ హిందువులను, హిందుత్వను ద్వేషిస్తుంది. దీనికి నిదర్శనం అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలేనని తెలిపింది. హిందుత్వం అంటే మతం కాదు అది ఒక జీవన విధానమని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సైతం చెప్పింది. మరి ఇందిరా గాంధీ దానిని ఎందుకు నిషేధిస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు. -
మీరు చేసే పని.. జగన్ చేస్తే తట్టుకోగలరా..
-
సిగ్గులేదా చంద్రబాబు.. ఇంకెంతకాలం దాచుకుంటావ్...!
-
యుద్దంలో పాక్ ఓడిపోతే అదే చేయాలి
తిరువనంతరపురం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో చర్చలు జరపాలని RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గతంలో చేసిన వ్యాఖ్యలు సమర్ధిస్తున్నానని తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ ఇలా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ "మనం హిట్లర్ లాంటి వాళ్లం కాదు, అది మన స్వభావం కూడా కాదు. ఒకవేళ భవిష్యత్తులో జరిగే యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోతే.. అక్కడ ఉన్న ప్రజలను భారత్లో భాగం చేయడమో లేదా వారు ప్రశాంతంగా జీవించేలా చూడడమో చేయాలి. అందుకోసం వారితో చర్చలు జరిపే మార్గాలను (తలుపులను) ఎప్పుడూ తెరిచే ఉంచాలి" అని భగవత్ పేర్కొన్నారు. అన్యాయాన్ని, నియంతృత్వాన్ని అంతమొందించాలని అదే సమయంలో మంచిని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.పాకిస్తాన్లో మారుతున్న ఆలోచనలుదేశ విభజన జరగడం తప్పని భావించే ప్రజలు పాకిస్తాన్లో చాలా మంది ఉన్నారన్నారు. అక్కడ ఉన్న పలువురు జర్నలిస్టులు కూడా ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారని, 'రెండు దేశాల సిద్ధాంతం తప్పని, కలిసి ఉంటేనే బాగుండేదనే భావన అక్కడ అంతర్గతంగా బలంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏ దేశంతోనైనా విదేశీ సంబంధాల విషయంలో ఆర్ఎస్ఎస్కు విడిగా ఎలాంటి ప్రత్యేక విధానాలు ఉండవని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకే సంఘ్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ, అత్యంత అపార్థానికి గురైన సంస్థ కూడా ఇదేనని వ్యాఖ్యానించారు. యూనిఫామ్ వేసుకుని చేసే రూట్ మార్చ్లను చూసి కొందరు దీనిని పారామిలిటరీ సంస్థ అనుకుంటారని, వ్యాయామాలు చూసి వ్యాయామశాల అనుకుంటారని, కానీ బయట నుండి చూస్తే సంఘ్ అర్థం కాదని, దానిని లోపలికి వచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన కోరారు. -
పురుషుల ప్రైవేట్ పార్ట్స్పై ప్రేలాపనలు : సేజల్ పవార్కు భారీ షాక్
పురుషులు ప్రైవేట్ పార్ట్స్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముంబై కేఈఎమ్ (KEM) హాస్పిటల్ వైద్య విద్యార్థిని సేజల్ పవార్ భారీ షాక్ తగిలింది. స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో ‘పురుషుల శవాల’ (Male Cadavers) పై వివాదాస్పద వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ముంబైలోని సేథ్ జీఎస్ మెడికల్ కాలే, కేఈఎమ్ హాస్పిటల్లో చివరి సంవత్సరం ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్న సేజల్ పవార్ను హాస్పిటల్ యాజమాన్యం 15 రోజుల పాటు నిర్బంధ సెలవుపై పంపింది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన అంతర్గత కమిటీ, సేజల్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని తేల్చింది. ఒక వైద్య విద్యార్థినికి ఉండాల్సిన గౌరవం, వృత్తిపరమైన బాధ్యతలకు భిన్నంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని సంస్థ పేర్కొంది. నిర్బంధ సెలవు అనేది తాత్కాలిక నిర్ణయం మాత్రమే. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకునేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేశారు. శనివారం సేజల్ తల్లిదండ్రులను హాస్పిటల్కు పిలిపించి, ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించేలా చర్యలు తీసుకున్నారు.అసలు వివాదం ఏమిటి?దాదాపు మూడు నెలల క్రితం రికార్డ్ అయిన ప్రణీత్ మోరే కామెడీ షోకు సంబంధించిన వీడియో క్లిప్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ షోలో ప్రేక్షకురాలిగా ఉన్న సేజల్ పవార్, తన అనాటమీ (శరీర నిర్మాణ శాస్త్రం) శిక్షణ సమయంలో ఎదురైన అనుభవాలను వివరిస్తూ, మృతదేహాల పురుషాంగాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం తీవ్రమవ్వడంతో సేజల్ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ సేజల్, ప్రణీత్ మోరే, అదే షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన హిమాన్షు జంగ్రాపై కూడా మహారాష్ట్ర సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదీ చదవండి: విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?ఎన్సీడబ్ల్యూ: మరోవైపు కనీస మర్యాద లేకుండా, లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా మాట్లాడినందుకు గాను జాతీయ మహిళా కమిషన్ (NCW), కమెడియన్ ప్రణీత్ మోరే , హిమాన్షు జంగ్రాలకు సమన్లు జారీ చేసింది.ఇదీ చదవండి: మైనర్పై ఫుట్బాల్ కోచ్ లైంగిక దాడి : వీడియోలతో బ్లాక్మెయిల్రెసిడెంట్ డాక్టర్ల సంఘం స్పందనకేఈఎమ్ హాస్పిటల్కు చెందిన మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ కూడా సేజల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ఇలాంటి మాటలు వైద్య వృత్తికి తగనివని పేర్కొంది. అలాగే సోషల్మీడియాలో ఆమెపై జరుగుతున్న దాడి , వ్యక్తిగత దూషణలను ఆపాలని కోరింది.ఇదీ చదవండి: డేంజరస్ స్టంట్ : యెమెన్ స్పైడర్ మ్యాన్ దుర్మరణం -
మొన్న ప్రణీత్, ఇపుడు మధుర్ విర్లీ : వీడియో వైరల్
స్టాండప్ కామెడీ పేరుతో మహిళలపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో మరో స్టాండప్ కమెడియన్ మధుర్ విర్లీ విచక్షణ మరిచి రెచ్చిపోయిన వైనంపై వివాదం చెలరేగింది. అత్యాచారాలు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తులు ఆ తర్వాత హత్యలకు ఎందుకు పాల్పడతారో తెలుపుతూ గతంలో ఒక షోలో చేసిన అసభ్యకర వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్గా మారింది. కమెడియన్ ప్రణీత్ మోరే వివాదం (Rs 370 Ki Biryani) ముగియక ముందే, మధుర్ విర్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట పడాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రణీత్ తర్వాత ఇప్పుడు మధుర్ విర్లీ బాధితులపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. డ్యాంక్ కామెడీ పేరుతో బాధితులను అత్యంత దారుణంగా అవమానిస్తూ అత్యాచారానికి సంబంధించిన అంశాలపై నోటికొచ్చినట్టు రెచ్చిపోయాడు. అత్యాచార నిందితులు ఆ తర్వాత ఎందుకు హత్యలకు పాల్పడతారనే విషయంపై ఆయన జోకులు పేల్చడం తీవ్ర దుమారం రేపుతోంది.2024 నాటి షో 'లవ్ & లేటెక్స్'కు చెందిన వీడియోలో పది అత్యాచార, హత్యాచార కేసులలో తొమ్మిది కేవలం అత్యాచారానికి సంబంధించినవే అంటూ మరింత అభ్యంతరకర రీతిలో జోకులు వేశాడు. Meet Madhur Virli:Since when did rape jokes become normal? If you can't make people laugh without joking about someone's worst trauma, maybe comedy isn't for you.Find an honest job instead of using pain and suffering for cheap laughs.What is even more disgusting is that the… pic.twitter.com/ZxZ9c3vJwm— Sachya (@sachya2002) June 12, 2026మండిపడుతున్న నెటిజన్లుఈ వ్యాఖ్యలు అత్యంత సున్నిత రహితంగా, అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. మొన్న ప్రణీత్, ఇప్పుడు మధుర్ విర్లీ. బాధితులపై డార్క్ కామెడీ/డ్యాంక్ కామెడీ పేరుతో ఇంత దారుణ వ్యాఖ్యలా? వీళ్లంతా విద్యావంతులమని చెప్పుకునే ఉదారవాదులు. నవ్వుతున్న వారిలో స్త్రీపురుషులిద్దరూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటివే వారి కుటుంబాల్లో జరిగితే? అప్పుడు కూడా ఇలాగే ఎగతాళి చేస్తారా? అని ఒకరు ప్రశ్నించారు. మధుర్ విర్లీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్యం పేరుతో ఏదైనా, ఎంతైనా మాట్లాడటం సరికాదు, విజ్ఞత, విచక్షణ ఉండాలని సూచిస్తున్నారు. బాధితుల కోలుకోలేని గాయాలను, మానసిక క్షోభను, బాధలను హాస్యాస్పదం చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు జాతీయ మహిళా కమిషన్ (@NCWIndia)ను ట్యాగ్ చేస్తూ, ఈ విషయంలో జోక్యం చేసుకుని అతడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టికెట్లు కొనుక్కుని మరీ ఇలాంటి సున్నితమైన అంశాలపై వచ్చే జోకులకు నవ్వుతున్న ప్రేక్షకులను కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు.మరోవైపు తన వీడియోపై సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రమవ్వడంతో మధుర్ విర్లీ తన సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసుకున్నారు. అయితే, ఈ వివాదంపై ఆయన ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన లేదా క్షమాపణలు చెప్పలేదు. కాగా ఇప్పటికే ప్రణీత్ మోరే "370 బిర్యానీ" వివాదంలో చిక్కుకుని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలోనే ఈ రెండో ఘటన వెలుగుచూసింది. ప్రణీత్ మోరేపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం. అయితే తాజాగా ఈ వివాదంపై ప్రణీత్ క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశాడు. -
ఆళ్లగడ్డలో ఉప్పొంగిన జనహోరు.. బాబుపై గంగుల బ్రిజేంద్ర రెడ్డి సెటైర్లు
-
నేను నా కొడుకు దద్దమ్మలం.. మీ సంపద మీరే సృష్టించుకోండి చేతులెత్తేసిన చంద్రబాబు..
-
వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం సక్సెస్ పై జగన్ హర్షం
-
నువ్వు వేసిన మేకప్ తో గోడకు పెయింట్ వేయొచ్చు.. గుడివాడ సెటైర్లు
-
నువ్వు OG కాదు.. పెద్ద క్యాబేజీ
-
వాడొక పనికిమాలిన మంత్రి.. లోకేష్ ని కడిగి పడేసిన రోజా
-
DSC స్కామ్ లో లోకేష్ అడ్డంగా ఇరుక్కుపోయాడు.. బాబులో టెన్షన్..
-
సెకండ్ ర్యాంక్ వచ్చిన నాకు కాకుండా.. 5వ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి ఎలా వచ్చింది?
-
లోకేష్ బాబు.. నీకు దండంరా సామి!
-
మంత్రి మాట్లాడాల్సిన భాష అదా..? జగన్ ను కలిశాక మాతో చెప్పిన మాట
-
నా జీవితంలో అదో ఘోర తప్పిదం : నా ఎఫైర్స్తో బెదిరించాడు : బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, ప్రముఖ దాత బిల్ గేట్స్, దివంగత లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారంలో యూఎస్ కాంగ్రెస్ కమిటీ ముందు హాజరయ్యారు.తన జీవితంలో అతడిని కలవడం ఘోర తప్పిదమనీ, గ్లోబల్గా తన సేవలను ప్రమాదంలో పడేసిందంటూ సాక్ష్యమిచ్చారు. అంతేకాదు తన వివాహేతర సంబంధాల ఆదారంగా ఎప్స్టీన్ తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడంటూ సంచలన విషయాలను వెల్లడించారు.అమెరికా పార్లమెంటరీ కమిటీ విచారణలో ఎప్స్టీన్తో ఉన్న సంబంధాలు, వారి సమావేశాల ఉద్దేశం, ఎప్స్టీన్ నేరపూరిత కార్యకలాపాల గురించి ఏమైనా సమాచారం ఉందా అనే విషయాలపై చట్టసభ సభ్యులు గేట్స్ను ప్రశ్నించారు. చట్టసభ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ రహస్య విచారణలో బిల్గేట్స్ మాట్లాడుతూ ఎప్స్టీన్తో పరిచయం తన ప్రతిష్టకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా తాను చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు దెబ్బతినే ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందన్నారు. అసలు ఆయన్ని కలవడం తాను చేసిన అతి పెద్ద తప్పిదమని బిల్ గేట్స్ అంగీకరించారు. నిజానికి అతని పరిచయం ప్రపంచ ఆరోగ్య, అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న సంపన్న దాతలను అనుసంధానించడంలో సహాయపడు తుందని తాన నమ్మానని గేట్స్ తెలిపారు. ఈ ఉద్దేశంతోనే 2011 నుంచి 2014 మధ్య కొన్నిసార్లు మీట్ అయ్యాననీ, అయితే ఆ చర్చల వల్ల ఎలాంటి ఫలితాలు రాలేదన్నారు. దీంతో 2014 చివరి నాటికే వారి మధ్య చర్చలు, సంబంధాలు ముగిసిపోయాయని తెలిపారు. అంతేకాకుండా, తాను ఎలాంటి నేరపూరిత చర్యలలో పాలుపంచుకోలేదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. అలాగే ప్స్టీన్ ప్రైవేట్ దీవులు ప్రైవేట్ దీవి (ఐలాండ్), రాంచ్ లేదా ఫ్లోరిడాలోని నివాసాన్ని సందర్శించాననే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మెలిందాతో వివాహ జీవితంపై బిల్ గేట్స్ను ఎప్స్టీన్ బ్లాక్మెయిల్ చేశాడా?మరోవైపు బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి. తన వివాహ జీవితం వెలుపల ఉన్న సంబంధాల (Extramarital affairs) గురించి ఎప్స్టీన్కు తెలిసిందని, ఆ సమాచారాన్ని ఉపయోగించి తనతో సంబంధాలు కొనసాగించేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడని గేట్స్ అంగీకరించారు. ఈ విషయాలను ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలని చూశాడన్నారు. ఇవి తన కుటుంబానికి బాధను కలిగించాయని చెప్పారు. తనతో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, తానెప్పుడూ సుముఖత చూపలేదని గేట్స్ పదే పదే నొక్కి చెప్పారు.తమ మధ్య చర్చలు కేవలం స్వచ్ఛంద సేవ, నిధుల సేకరణ అవకాశాలపై మాత్రమే జరిగాయని గేట్స్ స్పష్టం చేశారు. తాను ఆశించిన ఆర్థిక సహాయాన్ని ఎప్స్టీన్ అందించలేడని అర్థమైన తర్వాత, అతనితో సంబంధాలను పూర్తిగా కట్ చేసుకున్నట్లు గేట్స్ తెలిపారు. ఎప్స్టీన్ నెట్వర్క్పై కాంగ్రెస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతానికి, ఈ కేసులో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే డిమాండ్లు పెరుగుతుండటంతో, దర్యాప్తు అధికారులు మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే విచారణ కమిటీ ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, రిటైల్ దిగ్గజం లెస్లీ వెక్స్నర్తో సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులను కూడా విచారించింది. -
1:1 అంటే అర్ధం ఏంటి చంద్రబాబు.. ఇలాంటి మోసాన్ని నా జన్మలో చూడలేదు
-
స్పోర్ట్స్ కోటాలో స్కామ్స్ వింటే వెంట్రుకలు నిక్కబొడుస్తాయి..బాబు, లోకేష్ పై జగన్ మాస్ ర్యాగింగ్
-
పేపర్ లీక్ ఎలా చేశారంటే...? DSC స్కామ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే...
-
మోసానికి, దగాకి.. ప్యాంట్, చొక్కా తొడిగితే అదే చంద్రబాబు..
-
ఢిల్లీ వెళ్లగానే నోరు తిరగబడిందా..? పవన్ పై కారుమూరి పంచ్ లు
-
రెండు వారాల్లో కీలక ప్రకటన: ట్రంప్
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడిు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు.అమెరికా హెలికాప్టర్ అపాచీపై దాడి చేసింది ఇరాన్ అని ఆరోపించారు. ఈ ఘటనపై ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామని ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. అమెరికా స్థావరాలపై మొత్తం 21పైగా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, నిఘా రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా గతంలో జరిపిందని దానికి ప్రతిచర్యగా ఈ అటాక్ చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.అయితే డొనాల్ట్ ట్రంప్ సైతం ఈ దాడులపై గుర్రుగా ఉన్నారు. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసింది. ఇరాన్ అని దానికి ఎట్టిపరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామన్నారు. యుద్ధంలో అమెరికా తన అధిపత్యాన్ని కొనసాగిస్తోందని మరో రెండు వారాల్లో ఇరాన్పై సంపూర్ణ విజయం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆ ప్రకటనతో చమురు ధరలు సైతం దిగొస్తాయని ప్రకటించారు.అయితే ఈ వ్యాఖ్యలపై ఇరాన్ సైతం ఘూటుగానే బదులిచ్చింది. ఎలాంటి దాడి జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రతిదాడి తీవ్రంగా జరుగుతుందని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహు సైతం ఇరాన్పై దాడులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. "అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా.. ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలి" అని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. -
రికార్డుపై స్పందించిన మోదీ.. వారికే ఇది దక్కుతుంది
ఢిల్లీ: ప్రధాని మోదీ ఈ రోజుతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రజాస్వామ్య భారత్లో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించారు.. నేపథ్యంలో ఈ రికార్డుపై ప్రధాని మోదీ తొలిసారిగా పెదవివిప్పారు. వినయంతో అంకితభావంతో, కర్తవ్యభావంతో అవిశ్రాంతంగా వ్యక్తి మాత్రమే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాడు. అని అన్నారు.2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. 2019, 2024 లోక్సభ ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టితో ఆయన ప్రధానమంత్రి పదవిలో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు. ఇదివరకూ ఈ రికార్డు దివంగత నేత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉండేది.ఈ అరుదైన ఘనతపై ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ "ప్రజా సేవయే సుపరిపాలనకు గొప్ప కొలమానం. వినయంతో, అంకితభావంతో, కర్తవ్య భావంతో అవిశ్రాంతంగా పనిచేసే వ్యక్తి మాత్రమే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాడు. స్వభావరీత్యా భక్తిపరుడై, ఎల్లప్పుడూ తన ప్రజల సంక్షేమం గురించే ఆలోచించేవాడే అత్యున్నత కీర్తిని పొందుతాడు. వినయశీలి అయిన రాజు నిజంగానే అత్యున్నత కీర్తిని పొందుతాడు." అని అన్నారు. ఈ మేరకు ఒక వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.జవహార్ లాల్ రికార్డును అధిగమించిజవహార్ లాల్ నెహ్రూ మెుదటగా 1947 నుండి 1952 వరకు ప్రధానిగా ఉన్నారు. అయితే అప్పుడు ప్రజలు నేరుగా ఓటువేసి ఎన్నుకోలేదు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో "సార్వత్రిక వయోజన ఓటుహక్కు" హక్కు కల్పించారు. ఆ తర్వాత జరిగిన సాధారణఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే (1952 మే నుండి 1964 మే లో ఆయన మరణించే వరకు) నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా 4,398 రోజులు పదవిలో ఉన్నారు. జూన్ 2026 నాటికి నరేంద్ర మోదీ ప్రధానిగా నిరంతరాయంగా 4,399 రోజులు పూర్తి చేసుకుని, నెహ్రూ రికార్డును అధిగమించారు. जनसेवा ही सुशासन की सबसे बड़ी कसौटी है। विनम्रता, समर्पण और कर्तव्यनिष्ठा के साथ निरंतर कार्य करने वाला व्यक्ति ही जनविश्वास अर्जित करता है।सदानुरक्तप्रकृतिः प्रजापालनतत्परः। विनीतात्मा हि नृपतिर्भूयसी श्रियमश्नुते॥ pic.twitter.com/mn0Ax0F8hs— Narendra Modi (@narendramodi) June 10, 2026 -
లోకేష్ నోటి దురుసు.. తిరగబడ్డ బాధిత కుటుంబాలు
-
పవన్ కళ్యాణ్ పై చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఫైర్
-
మానవత్వం చూపి బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి..
-
పురుషుల్లో ఈ నలుగురు పురుషులు చాలా వేరు.. రాజ్యసభ సీటు అడగటానికి వర్ల రామయ్య వెళ్తే..
-
లింగమనేని కరకట్ట రుణం బాబు తీర్చుకుంటే.. బాబు ప్యాకేజీ రుణం పవన్ తీర్చుకున్నాడు...!
-
నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ భారతీయ నర్సింగ్ దుస్తులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నర్సుల యూనిఫాం ఇప్పటికీ బలమైన వలసవాద ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడింది.తన రాబోయే చిత్రం 'భారత్ భాగ్య విధాత' (దర్శకుడు మనోజ్ తపాడియా) ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.బ్రిటిష్ నర్సుల డ్రెస్ కోడ్ ఇప్పటికీ వాడుకలో ఉందని, దీని భారతీయ శైలిలోకి మార్చాలని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. నర్సుల యూనిఫాం విషయంలో ఇప్పటికీ వలస పాలన నాటి ఛాయలు (colonial hangover) ఉండటమే వారిని లైంగిక కోణంలో చూడటానికి ఒక కారణమని కంగనా భావిస్తున్నారు. "నర్సుల డ్రెస్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిది. డాక్టర్లు ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చు, వాటి పైన ఒక కోట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ మన నర్సులు మాత్రం ఎండైనా, చలి అయినా ఆ నిర్దిష్టమైన యూనిఫామ్నే ధరించాలి. అవి విదేశీ స్టయిల్లా అనిపిస్తుందని పేర్కొన్నారు.అందుకే ఈ యూనిఫాంలో మార్పులు రావాలని, అది "భారతీయ శైలిలో"(Indianized) ఉండాలని కంగనా అభిప్రాయపడ్డారు. అలాగే, రోజువారీ విధుల్లో ఎలాంటి యూనిఫాం ధరించడానికి ఇష్టపడతారనే విషయంపై నర్సుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని ఆమె సూచించారు.యూనిఫాంపై పిన్ను, టోపీ లేదా బెల్టు పెట్టుకోవడం అమెరికా నేవీలో ఉంటుందని అన్నారు. మొదటి, రెండవ ప్రపంచ యద్దాల్లో వాళ్లు అలానే కనిపిస్తారని వ్యాఖ్యానించారు. తన సినిమా ఆ దిశగా కొంత మార్పును తీసుకువస్తుందని, భవిష్యత్తులో ప్రేక్షకులు నర్సులను చూసే దృక్పథాన్ని మారుస్తుందని ఆమె ఆశిస్తున్నారు. అలాగే ఇది అంత సులభమైనవృత్తి కాదని, వేతన విధానం నుండి యూనిఫాం వరకు అనేక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.కాగా 2008 నాటి 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో లక్ష్యంగా మారిన ప్రదేశాలలో ఒకటైన 'కామా హాస్పిటల్' నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ 'నర్సెస్ ఆఫ్ కామా' (Nurses of Cama) లో కంగనా నర్సు పాత్ర పోషిస్తోంది. ఉగ్రవాద దాడి జరిగినప్పటికీ, ఆసుపత్రిని నడుపుతూ రోగులను సురక్షితంగా ఉంచడంలో నర్సుల కృషి ఎంత కీలకమో ఈ చిత్రం చూపిస్తుంది. -
నారా బ్రాహ్మణి పేరుతో ల్యాండ్.. కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని దందా..
-
పవన్ కు కమెడియన్ చురకలు.. నీ గొప్పలు పక్కకు పెట్టి.. వీటికి సమాధానం చెప్పు
-
నా ఇంటిపై దాడి చేసిన వాడిని ఒక్కడినైనా అరెస్ట్ చేశారా..! ఛీ.. మీరు పోలీసులా..?
-
కాక్రోచ్ జనతా పార్టీపై అడ్వకేట్ రజని ఆసక్తికర వ్యాఖ్యలు!
-
సిగ్గులేని చంద్రబాబు...? 8 నెలలు జయచంద్రారెడ్డిని ఎందుకు దాచావ్...?
-
మునిగిపోతుందని తెలిసినా అమరావతి నిర్మాణం చేపట్టారు..
-
నువ్వు, నీ కొడుకు నన్ను చంపడానికి చూశారు..! వరదరాజు రెడ్డి నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్!
-
వాళ్ళ దగ్గరకు వెళ్లు కసుకుర్చున్నారు.. నీకు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు
-
పాక్ గాలితీసిన భారత మాజీ ఆర్మీచీఫ్
కోల్కతా: భారత రిటైర్డ్ ఆర్మీ చీఫ్ ఎం.ఎం నరవణే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్- అమెరికా మధ్య పాక్ మధ్యవర్తిత్వం ఒట్టిమాటే అన్నారు. పాక్ చేసేది మధ్యవర్తిత్వం కాదని కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమేనన్నారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.భారత మాజీ సైన్యాధిపతి నరవణే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన రాసిన "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ" పుస్తకం విడుదల కాకముందే దేశంలో ప్రకంపనలు సృష్టించింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని పలు అంశాలను ప్రస్థావించడంతో లోక్సభలో పెద్ద దుమారం చేలరేగింది. కాగా తాజాగా నరవణే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు.నరవణే మాట్లాడుతూ" ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చలలో పాక్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు చెబుతోంది. కానీ అది కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమే, జాతీయ భద్రత ఎప్పుడూ ఆర్థిక భద్రతపైనే ముడిపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థే అన్నింటిని నడిపిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి ఒడిదొడుకులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రయత్నాలు ఎల్లప్పుడూ స్వయం సమృద్ధిపైనే ఉండాలి" అని అన్నారు.ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. కాగా ఇవి ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు రవాణాకు ఆటంకం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. -
కాపీ కొట్టిన పథకానికి పాస్ మార్కులు రాలేదు: మాజీ మంత్రి
సాక్షి, కాకినాడ: కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయామంటూ నిరుద్యోగులు, రైతులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. శనివారం కాకినాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలు తీర్చడంతో ప్రభుత్వం విఫలమవడం వల్లే.. అమరావతి రైతులు మొదలుకుని డీఎస్సీ అభ్యర్థుల వరకు ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ ముందే గోడు వెళ్లబోసుకుంటున్నారని తెలిపారు.ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తే తండోపతండాలుగా జగన్ వద్దకు ఎందుకు వస్తారో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం బీజేపీ, జనసేన కూటమిలో భాగస్వామ్యులైతే కాంగ్రెసేమో వారికి రహస్య మిత్రులని ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక మెునగాడు వైఎస్ జగన్ అన్నారు. వామపక్షాలు స్పందిస్తున్నా.. ప్రభుత్వాన్ని ఉధృతంగా నిలదీసే శక్తి కేవలం వైయస్ జగన్కే ఉంది. మూడు ప్రాంతాల్లో మూడు సభలు పెడతామంటున్న కూటమి నేతలు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని గుండెల మీద చేయి వేసుకుని, దేవుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా? ఆడబిడ్డ నిధి కింద 18 నుండి 50 ఏళ్ల మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామన్న హామీ ఏమైంది? నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతిని ఇవాల్టికి ఒక్క నిరుద్యోగికైనా ఇచ్చామని చెప్పగలరా? అని అడిగారు.జగన్ ఇచ్చిన 'అమ్మఒడి'ని కాపీ కొట్టి 'తల్లికి వందనం' అని పేరు మార్చారని అయినప్పటికీ పథకం అమలులో కనీసం పాస్ మార్కులు తెచ్చుకోలేదన్నారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ 'తల్లికి వందనం' ఇస్తామన్న మాటను తుంగలో తొక్కారు. తల్లికి వందనం పథకంలో ఏకంగా 20 లక్షల మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపింది. రూ.13,112 కోట్ల బడ్జెట్ అవసరమైతే.. కూటమి ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.8,456 కోట్లే అన్నారు. ఆక్వా రైతులను ఆదుకోకుండా.. నిన్న ఎక్స్పోలో 'బ్లూ ఎకానమీ' అంటూ బాబు గొప్పలు చెప్తున్నారు.జగన్ హయాంలో ఆక్వా రైతులకు కరెంట్ సబ్సిడీ ఇచ్చి, రొయ్యల మేత ధరలు పెరగకుండా నిలబెట్టాం. కూటమి రాగానే రొయ్యల మేత ధరలు ఎందుకు పెరిగాయి?.. సీజన్ వచ్చేసరికి రొయ్యల ధరలు ఎందుకు పడిపోతున్నాయని మాజీ మంత్రి కన్నబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. -
దురాశ పడినవాడెవ్వడు బాగుపడలేదు.. అమరావతి రైతులకు న్యాయం చేయండి
-
పవన్ పై కే ఏ పాల్ పంచులే పంచులు
-
వాడొక గంజాయి మొక్క.. వైజాగ్ పై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కొండ రాజీవ్
-
భారత్ మా సోదర దేశం.. ఇండియాపై పుతిన్ ప్రశంసల వర్షం
-
ఇంత దారుణంగా మహిళలను పోలీసులు కొడుతుంటే సినిమా చూస్తున్నావా..
-
ఆయతుల్లా ఖమేనీ చివరి క్షణాల్లో ఏం జరిగింది..?
టెహ్రాన్: ఆయతుల్లా ఆలీ ఖమేనీ మృతి ప్రపంచాన్ని ఎంత దిగ్భ్రాంతికి గురిచేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఆయన మృతిచెందడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ దాడికి ముందు ఖమేనీ గడిపిన క్షణాల గురించి ఆ దేశ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తొలిసారిగా బహిరంగంగా పంచుకున్నారు.ఇరాన్- అమెరికా యుద్ధం మెుదలయి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. అయినా ఈ యుద్ధం ముగింపు అంశంలో ఎటువంటి స్పష్టత లేదు. ఇన్ని రోజుల ఈ యుద్ధంలో అత్యంత భయానక అంశం ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి చేసి చంపడం.. ఆయన మృతితో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. అయితే ఆ సందర్భంలో ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ దాడి చేసిన ప్రాంతంలోనే ఉన్నానని తెలిపారు.ఈ రోజు (శుక్రవారం) అబ్బాస్ అరాగ్చీ పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. "ఇరాన్పై దాడులు ప్రారంభం అయ్యాక.. సుప్రీం లీడర్ని సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని కోరాం. దానికి ఆయన నిరాకరించారు. ఇరాన్ ప్రజలందరికీ సురక్షితమైన ప్రదేశానికి ప్రవేశం లభించేంత వరకు తాను ఎటువంటి ఆశ్రయానికి గానీ, సురక్షిత ప్రాంతానికి గానీ వెళ్ళనన్నారు... నా ప్రజలకు ఏది జరిగినా, అది నాకు కూడా జరుగుతుంది ," అని ఖమేనీ అన్నట్లు అరాఘ్చి తెలిపారు.సుప్రీం లీడర్పై దాడి జరిగిన సమయంలో తాను ఆ ప్రాంతంలోనే ఉన్నానని ఆ దాడిలో ఆయనకు ఏమయిందా అని కలవర పడ్డానని తెలిపారు. అయితే దాడులకు ఇరాన్ ఇచ్చిన ప్రతీకారం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఎంతో కలవరపాటుకు గురిచేసిందన్నారు. అదే విధంగా ఇరాన్ పొరుగు దేశాల్లో అమెరికా స్థావరాలు లేకపోయి ఉంటే వాటిపై దాడులు జరిగేవి కావన్నారు. పస్తుతం సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సర్వాధికారాలు కలిగి ఉన్నారని కొత్త సుప్రీం లీడర్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతన్నామన్నారు. అతని ఆదేశాలను యుథాతధంగా అమలు చేస్తున్నామన్నామన్నారు. ఆయుతుల్లా ఖమేనీకి ఏలాంటి గౌరవం దక్కేదో ఇతనికీ అదే విధమైన గౌరవం దక్కుతుందన్నారు. -
భారత్ చివరి కొనను సందర్శించా.. రాహుల్ గాంధీ
శ్రీ విజయపురం: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అండమాన్ నికోబార్ దీవులను సందర్శించారు. అక్కడి ప్రకృతి సోయగాలు తనను కట్టిపడేశాయని ఎక్స్ ఖాతా వేదికగా రాసుకొచ్చారు. అండమాన్ నికోబార్ దీవులు కేవలం రక్షణపరంగా భారత్కు ఎంతో ముఖ్యమైనవని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతోందని కానీ వాస్తవానికి అది సరికాదన్నారు. అండమాన్ నికోబార్ చిత్రాలతో కలిగిన వీడియోని ఎక్స్లో పోస్ట్ చేశారు.రాహుల్ గాంధీ ఎక్స్లో అండమాన్ నికోబార్ దీవులపై పోస్ట్ చేస్తూ " నేను భారతదేశపు దక్షిణపు చివరి కొనను సందర్శించాను. ఇందిరా పాయింట్ వద్ద నిలబడ్డాను. శతాబ్దాలుగా నిలబడి ఉన్న చెట్ల కింద నడిచాను. భూమిపైనే అత్యంత జీవకళతో నిండిన పగడపు దిబ్బలలోకి మునిగాను.అక్కడ నివసించే ప్రజలతో కూర్చున్నాను. అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి భూమిని లాక్కుంటున్న గిరిజన వర్గాలు. భారత ప్రభుత్వం ఈ ద్వీపాలలో స్థిరపరిచిన వలసదారులు, వీరిలో చాలామంది మాజీ సైనికులు, వీరికి సరైన పరిహారం అందడం లేదు." అని అన్నారుబీజేపీ ప్రభుత్వం ప్రజలందరికీ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్.. కేవలం రక్షణ రంగానికి సంబంధించి మాత్రమే అని చెబుతాయి. కాని అది సరికాదు. ఈ పగడపు దీవులలో 1.5 కోట్ల చెట్లను నరికివేయడం. అధికారిక పటాల నుండి పగడపు దిబ్బలను తొలగించడం. సైనికులు, గిరిజనులను స్థానభ్రంశం చేయడం సరైంది కాదు. కేవలం ఒక వ్యాపారవేత్త భారతదేశపు అత్యంత అమూల్యమైన పర్యావరణ భూమిపై హోటళ్లు , క్యాసినోలను నిర్మిస్తున్నారు. అని రాహుల్ విమర్శించారు.తిరిగి పొందలేని దాన్ని నాశనం చేయడం ఎంతటి లాభానికైనా తగదనే విషయం మీకు తెలుసు అని రాహుల్ అన్నారు. తాను పర్యావరణ సమతుల్య అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఈ ద్వీపాలు ప్రపంచం ఇంతవరకు చూడని అత్యంత అసాధారణమైన సుస్థిర గమ్యస్థానంగా మారగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాంటి భారతదేశం కోసమే మనం పోరాడాలని పోరాడాలి.I visited the southernmost tip of India.I stood at Indira Point. I walked under trees that have stood for centuries. I dove into coral reefs among the most vibrant on earth.And I sat with the people who live there. Tribal communities, whose land is being taken away by… pic.twitter.com/RLNtT6L0U4— Rahul Gandhi (@RahulGandhi) June 5, 2026 -
కేబినెట్ మీటింగ్ లో పవన్ కు బాబు వెన్నుపోటు
-
రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అన్నావ్.. KTR ఫ్రెండ్ అన్నావ్ మీ అయ్యా జాగీరా అని ఎవరినన్నావ్
-
నీ అయ్య జాగీరా..? దాని ఫలితం ఇప్పుడు అర్థమైందా రాజా
-
ఇప్పటివరకు YSRCPకి ఓటు వెయ్యనోడు నాకు ఫోన్ చేసి...
-
ప్రభుత్వ ఉద్యోగులను పెట్రోల్ బంక్ ల దగ్గర పని చేపించింది మీరు.. అనిత వెంకట్రామి రెడ్డి కౌంటర్
-
పరిటాల గుండు కొడితే.. గద్దర్ మధ్యవర్తిత్వం కోసం పవన్ చేగువేరా అవతారం..
-
రండి దొర.. వస్తానంటే వద్దంటామా..? పవన్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు
-
పవన్ గాలి తుస్..! డిప్యూటీ సీఎంపై మల్లాది విమర్శలు
-
పాపం పవన్ ను ఉతికి ఆరేసారు
-
ఖర్మ రిటర్న్స్ పవన్ కళ్యాణ్.. ఇంకొక్కటే పెండింగ్
-
రెచ్చగొట్టే ప్రసంగం.. జన గణ మనను పాడొద్దు అన్నది పవన్ కల్యాణే!
-
మనిషివి చూస్తే.. ఒక పనికిమాలిన డిప్యూటీ స్పీకర్ పోస్ట్..
-
ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడితే చూస్తూ ఊరుకోవాలా..!
-
కామెడీలో కొడుకుని మించిపోయిన తండ్రి.. తునిలో బాబు తాటికల్లు డ్రామా!
-
అధికారం కోసం అడ్డమైన హామీలు.. పాలనలో ప్రజలకు వెన్నుపోటు
-
జగన్ దెబ్బకు 5ఏళ్ళు తెలంగాణలో దాక్కున్నావ్.. నువ్వా రాజకీయాలకోసం మాట్లాడేది
-
మా బాబాయ్ దగ్గర రివాల్వర్ ఉంది నన్ను చంపేస్తాడు అని అంటేనే..
-
జగన్ ముందు బాబు చిట్టా విప్పిన రైతు.. బలవంతంగా భూములు లాక్కుంటున్నారు..!
-
అవును మా అయ్య జాగీరే.. పవన్ కు మంత్రి పొన్నం కౌంటర్
-
నేను లేకుంటే నువ్వు జైల్లోనే.. నెతన్యాహుకు.. ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానిపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడంతో ఫోన్లో ఆయనను తీవ్ర పదజాలంతో "అసలు నువ్వు ఏం చేస్తున్నావ్" హెచ్చరించినట్లు ఆక్సియోస్ కథనం ప్రచురించింది. అమెరికా, ఇరాన్ల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరే దశకు వచ్చింది. అయితే, ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు పెంచడంతో.. "ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే అమెరికాతో చర్చలు నిలిపివేస్తాం" అని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ట్రంప్ నెతన్యాహూతో మాట్లాడి కాల్పులు విరమించాలని కోరారు. అయితే దీనికి తొలుత అంగీకరించిన ఇజ్రాయెల్ తిరిగి లెబనాన్పై కాల్పులు జరపింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నెతన్యాహూకు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డట్లు సమాచారం.అమెరికా అధికారుల సమాచారం ప్రకారం.. ట్రంప్ చాలా కోపంగా నెతన్యాహును ఉద్దేశించి ఫోన్లో ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది" అసలు నువ్వు ఏం చేస్తున్నావు. నీకు పిచ్చి పట్టింది నేను గనుక లేకపోతే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతుంటే నువ్వు ఇలా చేస్తున్నావు.ఈ దాడుల వల్ల ప్రపంచంలో నిన్నూ, ఇజ్రాయెల్ను అందరూ అసహ్యించుకుంటున్నారు" అని నెతన్యాహుని తీవ్ర పదజాలంతో మందలించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.అనంతరం ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్లో.. నెతన్యాహుతో మాట్లాడి బీరూట్పై పెద్ద ఎత్తున జరపాలనుకున్న దాడిని విరమించుకునేలా చేశానని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గిందని ప్రకటించారు. ఇందుకు నెతన్యాహుకు ధన్యవాదాలు కూడా తెలిపారు.అయితే, నెతన్యాహు కార్యాలయం మాత్రం తాము పూర్తిగా వెనక్కి తగ్గినట్లు ఒప్పుకోలేదు. "హెజ్బుల్లా గనుక మా నగరాలపై దాడులు ఆపకపోతే.. మేము బీరూట్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి తీరుతాం. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు" అని నెతన్యాహు స్పష్టం చేశారు. -
గ్రూమింగ్ గ్యాంగ్స్.. మైనర్ బాలికపై వందల మంది అత్యాచారం..?
లండన్: బ్రిటన్లో సంచలనం సృష్టించిన గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలను అక్కడి పార్లమెంటులో ఎంపీ రూపెర్ట్ లోవ్ బహిర్గతం చేశారు. యూకే వ్యాప్తంగా కనీసం 85 ప్రాంతాలలో ఈ గ్యాంగులు యాక్టివ్గా ఉన్నాయని వారిలో అధికంగా పాకిస్థానీ సంతతికి చెందిన పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు.గ్రూమింగ్స్ గ్యాంగ్స్ ఆగడాలకు సంబంధించి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు మైనర్ బాలికలపై రాక్షసత్వంతో ముఠా అత్యాచారాలు చేసినట్లు నివేదిక తేల్చింది. ఈ కేసులో పలువురు బాధితురాలను స్వతంత్ర కమిటీ విచారించింది. అందులో మైనర్ బాలికలను అత్యంత క్రూరంగా బోనులో బంధించి అమానవీయంగా అత్యాచారానికి పాల్పడ్డారని ఒక బాధితురాలు చెప్పినట్లు నివేదిక పేర్కొంది.ఒక బాధిత బాలిక మాట్లాడుతూ.. 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచి తనపై దాదాపు 600 నుండి 700 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని ఆ బాధితురాలు తెలిపింది. మరో బాధితురాలు .. 15 నుండి 20 మంది అమ్మాయిలను బోనుల్లో బంధించి ఉంచడం చూశానని, వారిపై అమానవీయంగా, క్రూరంగా లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొంది. ఇవే కాక మరెన్నో మైనర్లపై మరెన్నో ఆగడాలు బ్రిటన్ వ్యాప్తంగా గ్రూమింగ్ గ్యాంగ్స్ చేశాయని ఎంపీ పేర్కొన్నారు. ఈ ముఠాలలో ప్రధానంగా పాకిస్తానీ సంతతికి చెందిన పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఈ దారుణాలపై ఇక మాటలు చాలు, చేతల్లో కఠిన చర్యలు కావాలి. రాబోయే రోజుల్లో విడుదల కాబోయే మా 'రేప్ గ్యాంగ్ ఇంక్వైరీ రిపోర్ట్' బ్రిటన్ భవిష్యత్తును మారుస్తుంది అని ఎంపీ రూపెర్ట్ లోవ్ స్పష్టం చేశారు.ఈ దారుణాలను అణచడంలో స్థానిక పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఘోరంగా విఫలమయ్యారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే..?'గ్రూమింగ్ గ్యాంగ్స్' అంటే... ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు టీనేజ్ అమ్మాయిలను టార్గెట్ చేసి, వారిని మభ్యపెట్టి, నమ్మించి, ఆపై క్రూరంగా లైంగికంగా వాడుకునే వ్యవస్థీకృత నేర ముఠాలు 'గ్రూమింగ్' అంటే ఒకరిని నమ్మించి, లొంగదీసుకోవడం. ఈ ముఠాలు సాధారణంగా పేదరికం, కుటుంబ సమస్యలు లేదా ఒంటరితనంతో బాధపడుతున్న 11 నుండి 16 ఏళ్ల లోపు బాలికలను (ఎక్కువగా తెల్లజాతి బాలికలను) టార్గెట్ చేస్తాయి. -
కాళ్లు, చేతులు తీసేస్తే తప్ప : కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యల దుమారం
అత్యాచార నిందితుడి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రాచ్య దేశాలలో విధించే శిక్షలతో పోలుస్తూ , మనదేశంలోని నేరం, శిక్షలపై కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. నటరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే నేరాలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) దేశాల్లో మాదిరిగా కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే మార్పు వస్తుందని, ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.'బార్ అండ్ బెంచ్' వెబ్సైట్ కథనం ప్రకారం..“మనం నేరస్థులను గట్టిగా శిక్షించకపోవడం వల్లే కోరలు లేని పాముల్లా చట్టాలు తయారయ్యాయి. అందుకే నేరస్తులు రెచ్చిపోతున్నారు. అలా కాకుండా కాళ్లు, చేతులు నరికివేసే శిక్షలు ఉంటేనే, ప్రజలు చట్టాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ప్రతీ ఒక్కరూ చులకనగా తీసుకుంటున్నారు అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) కి చెందిన 23 ఏళ్ల విద్యార్థి గోపి రెడ్డి కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ 5 నుండి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది."ఉప్పు తింటే నీళ్లు కూడా తాగాలి..అతడిని మరో నాలుగు-ఐదు రోజులు జైల్లోనే ఉండనివ్వండి. జైలు జీవితానికి అలవాటు పడతాడు. ఒకవేళ శిక్ష పడితే తిరిగి అక్కడికే వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తుంది" అని కోర్టు పేర్కొంటూ, తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.ఇదీ చదవండి: కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం!నిందితుడి తరఫు న్యాయవాది అయాంతికా మోండల్ వాదిస్తూ.. తన క్లయింట్ చేయని నేరానికి రెండు నెలలుగా జైల్లో మగ్గుతున్నారని అన్నారు. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగిందని చెబుతున్నారని, ఇప్పుడు అతడిని ఇలాగే నిర్బంధిస్తే అతని వృత్తిపరమైన భవిష్యత్తు దెబ్బతింటుందని వాదించారు.అసలు కేసు ఏంటి? ఇది 2003 జూలైలో నిందితుడు కార్తీక్ రెడ్డి ఒక మహిళను(ఫిర్యాదుదారు) ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ ప్రేమను మొదట ఆమె కూడా అంగీకరించింది. అయితే, అతని ప్రవర్తనపై అనుమానంతో దూరం పెట్టింది. దీంతో తమ బంధం గురించి మాట్లాడుకుందామని చెప్పి, నమ్మించిన నిందితుడు ఆమెను తన అపార్ట్మెంట్కు పిలిపించాడు. అక్కడ ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణ. ఈ ఘటన వల్ల ఆమె తీవ్ర మానసిక క్షోభ, నిరాశకు గురై మణిపాల్లోని కేఎంసీ (KMC) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. ఆ తర్వాత ఆమె బెంగళూరులోని జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించి, అనంతరం ఉడుపి మహిళా పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసింది.నెట్టింట దుమారంఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు గురయ్యాయి. ఇటువంటి శిక్షలు రాజ్యాంగ, ఆధునిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని పలువురు వినియోగదారులు వాదించారు. స్వయంగా కోర్టులు, న్యాయమూర్తులు హమ్మురాబి స్మృతిని ఎలా నిర్దేశిస్తారు? మనం ప్రతీకార న్యాయాన్ని ఎప్పుడో దాటిపోయాం. ఇది అంతకంటే దారుణంగా కనిపిస్తోందన్నారు మరొకరు. రాజ్యాంగం, నేర చట్టాలు అటువంటి అనాగరికతను అనుమతించవని మరో నెటిజన్ వ్యతిరేకతను వ్యక్తంచేశాడు. న్యాయవ్యవస్థ దుస్థితిని విమర్శిస్తూ ఒథెరా ఇలా రాశారు, "మన దేశంలో ఉన్న కోర్టులు, న్యాయమూర్తుల స్థాయి ఇది. మన దేశంలో అన్ని నియమాలు, చట్టాలు ఉన్నాయి, కానీ వాటి అమలు చాలా తక్కువగా ఉంది. పై నుండి క్రింది వరకు ప్రతి స్థాయిలో అవినీతి ఉంది." -
CM గా ప్రమోషన్ కోసమే నారా లోకేష్ ఇలా చేశాడు..!
-
కోడి చెరువు భూ కబ్జా.. నాగార్జునకు ఒక రూల్.. పవన్ కు ఒక రూలా..?
-
సుగాలి ప్రీతి తల్లిపై హైపర్ ఆది వ్యాఖ్యలు.. పోతిన మహేష్ వార్నింగ్
-
లోకేష్ DSC స్కాంను ఆధారాలతో బయటపెట్టిన పర్వతరెడ్డి..!
-
ఎన్టీఆర్ పై క్షుద్రపూజలు చేయించాడు.. నా అల్లుడి బాగోతం అంతా వినండి!
-
ఐపీఎల్ ఫైనల్పై రాజకీయం? డీకే శివకుమార్
బెంగళూరు: ప్రస్తుతం "రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు" ఫ్యాన్స్ పుల్ఖుషీతో ఉన్నారు. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలవడంతో సంతోషంతో ఉబ్బితబ్బవుతున్నారు. ఓవైపు ఆర్సీబీ గెలుపుతో ఫ్యాన్స్ జోష్ మీదుంటే కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచాయి. డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడాతూ "నిజానికి ఈ మ్యాచ్ బెంగళూరులోనే జరగాల్సింది. కానీ మాకు అన్యాయం చేశారు. కేవలం రాజకీయం కారణంగానే ఈ మ్యాచ్ను అక్కడికి (అహ్మదాబాద్) తరలించారు. దీనిపై నేను ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను" అని ఆయన పేర్కొన్నారు.ఈ ఫైనల్ బెంగళూరులో ఫైనల్ జరిగి ఉంటే నగరానికి అది ఒక చారిత్రాత్మక సందర్భం అయ్యేదని, కానీ స్థానిక అభిమానులు ఆ అద్భుత క్షణాన్ని కోల్పోయారని అన్నారు. అయినప్పటికీ, ఈ సీజన్ అంతటా జట్టుకు అండగా నిలిచిన కర్ణాటక అభిమానులకు, ప్రభుత్వం అందించిన సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా శివకుమార్ ప్రమాణస్వికారం చేసే అవకాశం ఉంది.కాగా ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్ జరిగింది. GT 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీని గెలిపించారు. కాగా ఆర్సీబీ గతేడాది సైతం ఐపీఎస్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
పవన్ ఫోటోలకు చెప్పుదెబ్బలు.. 2029లో సినిమా చూపిస్తాం
-
మహానాడు అని కాదు జగన్ నాడు అని పెట్టాల్సింది
-
YSR చరిత్ర ఏంటి.. మీ చరిత్ర ఏంటి..? రేవంత్ పాలనపై అరవింద్ కామెంట్స్
-
DSC పేపర్ అప్లోడ్ చేసే కంప్యూటర్ ఆపరేటర్ కు స్టేట్ ఫస్ట్ ఎలా వచ్చింది?
-
రేవంత్ రాజకీయ కుట్రలపై.. బీజేపీ నేత కిశోర్ రెడ్డి కామెంట్స్
-
నిస్సిగ్గుగా మహానాడులో అల మాట్లాడటానికి సిగ్గులేదా
-
డీకే జీవిత రహస్యాలను బయట పెట్టిన జ్యోతిష్యుడు
-
నువ్వు చేసేది నువ్వు చెయ్యి.. దానికి ఫలితం ఖచ్చితంగా మేమిస్తాం
-
లోకేష్ కోసమే జూ.ఎన్టీఆర్ ని తొక్కేశాడు
-
బ్లాకేడ్ ఎత్తేస్తున్నా.. మీ భార్యలకు హాయ్ చెప్పండి.. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై తాను త్వరలోనే ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై తాను వైట్హౌస్లోని ‘సిట్యుయేషన్ రూమ్’లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు.ఇరాన్- అమెరికా చర్చలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తోన్నా అందులో ఎటువంటి పురోగతి ఉండడం లేదు. పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. అనంతరం అమెరికా పలుమార్లు చర్చలకు ప్రయత్నించగా ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు.ఈ విషయమై తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ " ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై నేను ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోబోతున్నాను. ఈ విషయమై ప్రస్తుతం వైట్ హౌస్ 'సిట్యుయేషన్ రూమ్' (టాప్-సెక్యూరిటీ బంకర్) లో సమావేశం కాబోతున్నాను. మా అద్భుతమైన, మునుపెన్నడూ లేని నౌకాదళ దిగ్బంధం కారణంగా జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు ఇక 'ఇంటికి వెళ్లే' ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ అభిమాన అధ్యక్షుడి తరపున మీ భార్యలకు, భర్తలకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు నా తరపున హలో చెప్పండి" అని పోస్ట్ చేశారు.ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకూడదని, హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్లో అమర్చిన ల్యాండ్మైన్లను ఇరాన్ తక్షణమే తొలగిస్తుందని పేర్కొన్నారు. . ఇరాన్ వద్ద భూగర్భంలో దాగి ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలను అమెరికా బయటకు తీస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ లతో కలిసి సమన్వయంతో ఆ నిల్వలను వెలికితీసి, పూర్తిగా ధ్వంసం చేస్తామని వెల్లడించారు. కాగా ప్రస్తుతం జరిగిన చర్చలు కేవలం అంతగా ప్రాధాన్యత లేని కొన్ని చిన్నపాటి అంశాలపైనే జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు. -
మహానాడు అని చెప్పి రికార్డింగ్ డాన్సులు వేశారు
-
జగన్ సవాల్ ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా..?
-
మహానాడులో లోకేష్ వ్యాఖ్యలపై ఇరకాటంలో టీడీపీ
-
పవన్ కల్యాణ్ 15 ఏళ్ల రాగాన్ని.. తెలివిగా వాడుకున్న టీడీపీ మహానాడు తీర్మానం
-
జూమ్ లోకి కొడాలి నాని, వంశీ వస్తే ప్యాంటు తడుపుకున్నావ్.. లోకేష్ వ్యాఖ్యలపై రోజా రెటైర్లు
-
నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ.. మాట్లాడితే గొడ్డలి గొడ్డలి.. కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
లోకేష్ మహానాడు.. రికార్డింగ్ డ్యాన్సులు.. పరువు తీశారు కాదయ్యా..
-
తీవ్ర మనోవేదనలో ఉండగా మోదీ ఫోన్ చేశారు.. మాజీ సీఎం
ఢిల్లీ: 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో ప్రధాని మోదీ తనకు ఫోన్ చేశారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన రాసిన "అప్నాపన్" 'మై ఎక్స్పీరియన్సెస్ విత్ నరేంద్ర మోదీ' అనే పుస్తకాన్ని మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన 35 ఏళ్ల అనుభవంపై ఒక పుస్తకం రాశారు. అందులో ప్రధానితో ఆయనుకున్న అనుభవాల్ని పంచుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసినప్పటికీ, అందులో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు లేదన్నారు. ఆ సమయంలో తన రాజకీయ ప్రస్థానం అప్పటికే ముగిసిపోయిందన్నట్లుగా ప్రచారం చేశారని ప్రతిపక్షాలు "మేము వెళ్ళిపోతే, మిమ్మల్ని చాలా మిస్ అవుతాము" అనే వాక్యాన్ని ప్రతిపక్షాలు ప్రచారం చేయడం ప్రారంభించాయన్నారు.ఆసమయంలో ప్రధాని మోదీ తనకు ఫోన్ చేశారని " నేను ముఖ్యమంత్రితో కాదు, నా శివరాజ్తో మాట్లాడుతున్నాను. "మీరెందుకు ఇంతగా ఆందోళన చెందుతున్నారు? కొన్ని రోజులు ఏకాంతంలోకి వెళ్ళండి, మీ అంతరాత్మను పరిశీలించుకోండి, మరియు మీ మనస్సును ప్రశాంతం చేసుకోండి." అని తనకు సూచన ఇచ్చినట్లు తెలిపారు. ఆసమయంలో మోదీ ఒక నాయకుడిగానే కాకుండా అన్నలా మాట్లాడారని పుస్తకంలో రాశారు. శివరాజ్ మనోస్థైర్యం దెబ్బతింటే, అది లక్షలాది మంది కార్మికులపై ప్రభావం చూపుతుందని ఆయన సూచించారన్నారు.ఆ తర్వాత ఉత్తరాఖండ్కు వెళ్లి అక్కడ ఆయన గంగా నదీ తీరంలో ధ్యానం చేశానని తిరిగి వచ్చిన తర్వాత, పూర్తి ఉత్సాహంతో ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. పుస్తకం ప్రకారం, ఆయన 13-14 రోజుల్లో 165కు పైగా ర్యాలీలు నిర్వహించానని పుస్తకంలో రాసుకొచ్చారు. -
హర్ముజ్ ఒప్పందం ఖరారు..? కొట్టిపడేసిన వైట్హౌస్
టెహ్రాన్: ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం అంశంలో చర్చలు జరుగుతున్నాయి. అణు ఒప్పందంపై ఇరాన్ వెనక్కి తగ్గిందని దాదాపు చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై జరిగిన జరిగిన ఒప్పందంలోని అంశాలను ఇరాన్ మీడియా కథనాలు బహిర్గతం చేశాయి.ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ సమాచారం ప్రకారం... నెలరోజుల్లో హర్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాను యుద్ధానికి ముందున్న సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపింది. అయితే దానికి ఇరాన్పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి, ఆ ప్రాంతం నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి అమెరికా అంగీకరించిందని పేర్కొంది.అయితే ఈ జలసంధిని గుండా వెళ్లే ఓడలను తనిఖీ చేసే హక్కు, షిప్పింగ్ లేన్లను నిర్వహించే హక్కు, సర్వీస్ ఫీజులను వసూలు చేసే హక్కు ఇరాన్ దగ్గరే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ఏ దేశానికి చెందిన సైనిక నౌకలకు ఈ ప్రత్యేక నిబంధనలు వర్తించవని పేర్కొంది. ఈ ప్రాథమిక ఒప్పందం కుదిరిన అనంతరం ఇరు దేశాలు 60 రోజుల పాటు తదుపరి చర్చలు జరుపుతాయని ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తుది తీర్మాణాన్ని ఆమెదింప జేస్తారని పేర్కొంది.అయితే ఇరాన్ మీడియా చేసిన ఈ ప్రకటనలను అమెరికా పూర్తిగా కొట్టిపారేసింది. ఈ మేరకు వైట్హౌస్ తన అధికారిక వైట్హౌస్ ఎక్స్ ఖాతాలో "ఇరాన్ నియంత్రణలోని మీడియా విడుదల చేసిన ఈ నివేదికలో ఎలాంటి నిజం లేదు. ఆ అవగాహనా ఒప్పందం పూర్తిగా కల్పితం. ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్తున్న విషయాలను ఎవరూ నమ్మకండి. వాస్తవాలు ముఖ్యం అని పేర్కొందిదిగొచ్చిన ధరలుహర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందనే వార్తలు రాగానే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 90 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్ పునఃప్రారంభంపై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి. -
ట్రంప్ హెల్త్ చెకప్ .. అధ్యక్షుడు సేఫేనా?
వాషింగ్టన్, డీసీ: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను ఆరోగ్యంగా ఫర్ఫెక్ట్ ఉన్నానని ప్రకటించారు. తనకు వైద్య పరీక్షలు అద్భుతంగా జరిగాయని అందులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. త్వరలో డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై చాలానే పుకార్లు వచ్చాయి. ట్రంప్ ఆరోగ్యంగా లేరని వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నాయని కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చేతులపై కమిలిన గుర్తులు ఉండటం, సమావేశాలలో నిద్రపోతున్నట్లు కనిపించడం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితులపై ట్రంప్ కీలక ప్రకటన చేశారుతన ట్రూత్ సోషల్ పోస్ట్లో " అంతా ఖచ్చితంగా ఉంది నేను 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నాను జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిదేమో" అని సరదాగా అన్నారు. జూన్ 14 నాటికి ట్రంప్ 80వ సంవత్సరంలోకి అడుగుపెడతారు. ట్రంప్ ఆరోగ్య పరీక్షలను వైట్ హౌస్ 'వార్షిక పరీక్ష' అని ప్రకటించినప్పటికీ, ట్రంప్ మాత్రం దీనిని 6 నెలల ఫిజికల్ టెస్ట్' అని పేర్కొనడం కొంత గందరగోళానికి దారితీసింది. ట్రంప్ ఆరోగ్య సమస్యలుట్రంప్ 0 గతేడాది ట్రంప్ కాళ్ల వాపు సమస్యతో బాధపడుతున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. సిరల్లోని కవాటాల లోపం వల్ల రక్తం చేరి ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. చేతులపై గుర్తులు: ఆయన చేతులపై కనిపించే మచ్చలకు, గుండె ఆరోగ్య నియమాలలో భాగంగా ఆయన తీసుకునే 'ఆస్పిరిన్'టాబ్లెట్లే కారణమని వైట్ హౌస్ స్పష్టం చేసింది.రాజకీయ ప్రాధాన్యతఅమెరికా రాజకీయాల్లో అధ్యక్షుల వయస్సు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల సమయంలో 81 ఏళ్ల జో బైడెన్ వైదొలిగిన తర్వాత, ట్రంప్ అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధుడైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన ప్రత్యర్థుల కంటే తాను శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉన్నానని ట్రంప్ తరచుగా అంటుంటారు. -
మీ దేశం వెళ్లిపొండి.. భారతీయ జంటపై జాత్యాహంకారం
అమెరికాలో భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ విషయమై ఆ దేశ మంత్రి మార్కో రూబియో వివరణ ఇచ్చినప్పటికీ పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు. తాజాగా అటువంటి ఘటన మరోకటి జరిగింది. భారతీయ సంతతికి చెందిన ఓ జంటను మీరు తిరిగి భారత్కు వెళ్లాలంటూ అమెరికాలో ఉండకూడదంటూ ఓ అపరిచితుడు హెచ్చరించాడు. తాజాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన మార్కోరూబియోను అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార ఘటనలపై ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ .. "ప్రతి దేశంలో ఆన్లైన్లో లేదా బహిరంగంగా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడే కొంతమంది మూర్ఖులు ఉంటారు, కానీ అది ఒక దేశం యొక్క నిజమైన గుర్తింపును నిర్వచించదు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆతిథ్యమిచ్చే దేశాలలో ఒకటిప్రపంచ నలుమూలల నుండి అమెరికాకు వచ్చి, అమెరికన్ సమాజంలో కలిసిపోయి, దేశ ప్రగతికి దోహదపడిన ప్రజల వల్లే దేశం బలోపేతమైంది" అని రూబియో పేర్కొన్నారు.వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఒక ప్రాంతంలో ఒక భారతీయ జంట నిల్చొని ఉంది. అక్కడే ఉన్న ఓ అమెరికా దేశస్థుడు.. ఆ జంటను.. మీరు భారతీయులా . అమెరికా కంటే భారతదేశం మంచిదా అని ప్రశ్నించారు. ఆ దంపతులు సంయమనంతో సంభాషణను కొనసాగించారు. వారి కుటుంబం భారతదేశంలో ఉందని భర్త వివరిస్తుండగా, భారతదేశం అంత బాగుంటే మీరు అమెరికాలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించాడు.దానికి అక్కడే ఉన్న వ్యక్తి ప్రపంచాన్ని అన్వేషించడానికి అని బదులిచ్చాడు. కాదు నువ్వు ఇక్కడ మాకు వద్దు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి, నా దేశం నుండి వెళ్లిపొండి అని వారిని తిట్టాడు. కానీ ఆ భారతీయ వ్యక్తి పెద్దగా స్పందించలేదు. అయితే ఈ ఘటనను చాలా కలవరపరిచేదిగా అక్కడి ఎన్నారై ఛానల్ ఆ వీడియోను పంచుకుంటూ కథనం రాసింది. **IMPORTANT**Dear Indian Diaspora,These kind of incidents are up in real world in North Texas. If it happens to you or anyone you know or in your vicinity - DO REPORT it to authorities. Have hate incident recorded on your side & give it to cops.Inaction emboldens bullies!! pic.twitter.com/pp2wjHUnJ3— Sravy G (@sravytweets) May 26, 2026 -
ముంబై ఇండియన్స్ పై పంచ్.. నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ
-
ట్రంప్పై.. మార్కో రూబియో సెటైర్.. క్లిప్ డీలీట్
అమెరికా విదేశాంగ శాంగ మంత్రి మార్కో రూబియో అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార చర్యలపై వివరణ ఇచ్చారు. తాజాగా ఆవీడియో క్లిప్ను ఆ దేశ అధికారులు అధికారిక ఖాతా నుంచి తొలిగించారు. ప్రతి దేశంలోనూ మూర్ఖులుంటారు అన్న పదం పరోక్షంగా ట్రంప్కు చురకులంటించే విధంగా ఉండడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న(ఆదివారం) భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, మార్కో రూబియో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికాలో భారతీయులపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు, అలాగే భారతదేశాన్ని "నరకకూపం"గా పేర్కొంటూ చేసిన ట్రంప్ చేసిన ఒక పోస్ట్ అంశమై మీడియా ప్రతినిధులు మార్కో రూబియోను ప్రశ్నించారు.దీనికి మార్కో రూబియో వివరణ ఇస్తూ.. “ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ తెలివితక్కువ మాటలు మాట్లాడే మూర్ఖులు ఉంటారు. వారి మాటలను మెుత్తం దేశానికి ఆపాదించకూడదన్నారు. ట్రంప్ భారతదేశానికి, ప్రధాని మోదీకి పెద్ద అభిమాని అని అన్నారు." అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ను ఆ దేశ అధికారులు వెంటనే తమ అధికారిక ఖాతా నుంచి తొలగించారు.మార్కో రూబియో చేసినా వ్యాఖ్యలు పరోక్షంగా అధ్యక్షుడు ట్రంప్ను "తెలివితక్కువ మాటలు మాట్లాడే" "మూర్ఖులలో" ఒకరిగా అభివర్ణిస్తున్నట్లు రాజకీయ విమర్శకులు ప్రస్థావించిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్కో రూబియో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. -
అబ్బబ్బబ్బా చంద్రబాబు వండిన చేపల పులుసు ఎంత రుచికరం..
-
కాక్రోచ్ దుమారం.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శర్మ చేసిన బొద్దింకల వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం.. ఆ తర్వాత “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. సమర్థనలు, ఖండనలు.. తీవ్ర అభ్యంతరాలతో ఈ క్యాంపెయిన్పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే అటు ఇటు తిరిగి చివరకు.. ఈ రాజకీయ సెటైర్ క్యాంపెయిన్ కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.. సీజేఐ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగుతోందని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని అత్యవసర విచారణలు జరపాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆ పిటిషన్లను పరిశీలించారు. అయితే ఇది అత్యవసర విచారణ జరిపే పిటిషనేం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. మే 15న జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా ‘‘కొందరు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు..’’ అంటూ సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక, వృత్తుల్లో స్థానం దక్కని కొందరు యువకులు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు. కొందరు మీడియాగా, ఇంకొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరినీ టార్గెట్ చేస్తుంటారు అని పేర్కొన్నారాయన. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో.. సీజేఐ తర్వాత వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు యువతపై కాకుండా నకిలీ, బోగస్ డిగ్రీలతో వ్యవస్థల్లోకి చొరబడుతున్న వారినే ఉద్దేశించాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ “కాక్రోచ్ జనతా పార్టీ” (సిజెపి) పేరిట సోషల్ మీడియాలో వ్యంగ్య ప్రచారం కొనసాగింది. ఈ పరిణామాలను ప్రాక్టీసింగ్ లాయర్ రాజా చౌదరి సుప్రీంకోర్టులో పిటిషన్ రూపంలో దాఖలు చేశారు. సీజేఐ వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో వక్రీకరించి.. నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడినట్టుగా ప్రచారం చేశారని.. ఈ దుష్ప్రచారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని అందులో పేర్కొన్నారాయన. ఈ పిటిషన్లపై న్యాయవాది గోస్వామి వాదనలు వినిపించారు. కోర్టు విచారణల్లో జరిగిన మాటల మార్పిడిని.. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే నకిలీ లా డిగ్రీలు, బోగస్ న్యాయవాదుల వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దంటూ సీజేఐ సూర్యకాంత్ పిటిషనర్కు సూచించారు. ఈ అంశంలో ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి అత్యవసర విచారణ జరపాల్సినంత సీన్ లేదు. సమయం వచ్చినప్పుడు కోర్టు ఈ అంశాన్ని తప్పక పరిశీలిస్తుంది అని లాయర్ గోస్వామిని ఉద్దేశిస్తూ సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యల ప్రస్తావన, మళ్లీ వివరణ అంశాల్ని ఆయన ప్రస్తావించలేదు."Don’t take it so sentimentally’, says Chief Justice of India Surya Kant, as a lawyer mentions PIL, saying a distorted and malicious narrative is being continued to malign the judiciary despite clarification by the CJI on the 'cockroach' remark.CJI says there is no such grave… pic.twitter.com/gi0yp91N9h— ANI (@ANI) May 25, 2026మరో పిటిషన్లో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరిట సాగుతున్న ఆన్లైన్ క్యాంపెయిన్ కార్యకలాపాలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని దాఖలైంది. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్గా తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని పిటిషనర్లు ఆరోపించారు. మెర్చండైజ్, బ్రాండింగ్, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం సాగిస్తూ వాణిజ్య లాభాలు పొందే ప్రయత్నం జరుగుతోందని కూడా పేర్కొన్నారు. ఈ పిటిషన్ను కోర్టు పరిశీలించాల్సి ఉంది. అలా మొదలై..మహారాష్ట్రకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అభిజిత్ దిప్కే ప్రారంభించిన “కాక్రోచ్ జనతా పార్టీ” మొదట సరదా సెటైర్లా మొదలైనా.. క్రమంగా ఇది వ్యవస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసే డిజిటల్ ఉద్యమంగా మారింది. సీజేఐ సూర్యకాంత్ చేసిన “కాక్రోచ్” వ్యాఖ్యలను తమపై అవమానంగా భావించిన కొంతమంది నిరుద్యోగ యువత, సోషల్ మీడియా యూజర్లు ఈ పేరును వ్యంగ్య చిహ్నంగా మార్చుకున్నారు. “మమ్మల్ని బొద్దింకలు అంటారా..? అయితే ఇదే మా పార్టీ” అన్నట్లుగా ఈ క్యాంపెయిన్ను నడిపిస్తున్నారు.చదవండి: కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల బరిలోనికి దిగుతుందా?ఈ గ్రూప్ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టర్లు, వ్యంగ్య నినాదాలు, డిజిటల్ పోస్టర్లతో భారీ ప్రచారం చేస్తోంది. “Wherever WiFi Works is our headquarters”, “Party for the unemployed and overqualified” లాంటి ట్యాగ్లైన్లతో యువతలో వైరల్ అవుతోంది. రాజకీయాలపై, న్యాయవ్యవస్థపై, ఉద్యోగ వ్యవస్థపై వ్యంగ్య వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.ట్రోలింగ్ మాత్రమే కాదు..అయితే ఇది కేవలం ట్రోలింగ్కే పరిమితం కాలేదు. మాజీ ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ అవకాశాలు ఇవ్వొద్దని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు-ఎంపీలకు 20 ఏళ్ల అనర్హత విధించాలని, మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, పరీక్షల లీకేజీలపై కఠిన చట్టాలు తీసుకురావాలని వంటి డిమాండ్లను కూడా తమ మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో ఇది పూర్తిగా సరదా క్యాంపెయినా..? లేక వ్యవస్థలపై డిజిటల్ నిరసనా..? అనే చర్చ మొదలైంది.మరోవైపు విమర్శకులు మాత్రం ఈ క్యాంపెయిన్ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతోందని ఆరోపిస్తున్నారు. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్గా కట్ చేసి వైరల్ చేయడం, మెర్చండైజ్, బ్రాండింగ్, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం చేయడం ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. -
వెంకీ పెళ్లి సుబ్బి చావుకు...! పిల్లలకు బూట్లు సాక్సులు ఇవ్వండరా అంటే..
-
ఒకసారి అద్దంలో చూసుకో.. ఏం పీకుతామో ఎన్నికల్లో చూపిస్తాం
-
చంద్రబాబుకు వైఎస్ జగన్ భయం పట్టుకుంది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. వైఎస్ ఫ్యామిలీ ఇప్పటివరకూ ఎన్నడూ పులివెందులలో ఓడిపోలేదన్నారు. గతంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం అంబటి రాంబాబు గుర్తుచేశారు. చంద్రబాబు నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఇప్పటివరకూ మూడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందన్నారు.కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీని తిట్టడం తప్ప ఏమైనా పాలన చేస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలకు కనీసం గిట్టుబాటు ధర అందించడం లేదు. మెుక్కజొన్నకు ధరలు లేవని ప్రశ్నిస్తే గోడౌన్పై దాడులు జరుపుతున్నారు. యుద్ధం పేరు చెప్పి నిత్యావసర ధరలు పెంచితే కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా నిత్యావసరాల ధరలను తగ్గించే యత్నం చేసిందా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారన్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. -
ఈ 8 ఫోటోలు చూస్తే.. సినిమా అర్థమవుతుంది
-
రామ భక్తునివి కాదు.. బ్యాంక్ దొంగవి.. బ్యాంక్ డబ్బుతో బాగా ఒళ్ళు బలిసి.. జడ శ్రవణ్ సెటైర్లు
-
గ్రీన్కార్డు నిబంధన కఠినతరం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినాక ఆ దేశ ఇమ్మిగ్రేషన్ పాలసీని అత్యంత కఠినతరం చేశారు. దీంతో యుఎస్ఎలో స్థిరపడాలనుకునే వారి ఆశలు కలలుగానే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో వీసా విధానంపై ఎన్డీటీవీతో మాట్లాడారు. ప్రస్తుతం గ్రీన్కార్డు విషయంతో అమెరికా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇదివరకూ హెచ్-1 బీ వీసాదారులు గ్రీన్కార్డు విషయంలో అమెరికాలో ఉండి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం హెచ్1బీ వీసాదారులు తప్పనిసరిగా వారి సొంత దేశానికి వెళ్లి అక్కడినుండి గ్రీన్కార్డు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.తాజాగా దీనిపై మార్కో రుబియో వివరణ ఇచ్చారు..." గ్రీన్కార్డు కోసమై అమెరికా తీసుకువచ్చిన విధానం కేవలం భారతదేశానికి మాత్రమే ఉద్దేశించినది కాదు.ఇది అందరికీ వర్తిస్తుంది. వలసల వ్యవస్థను క్రమబద్ధీకరించి, మెరుగుపరచుకోవాలని అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది.20 మిలియన్లకు పైగా ప్రజలు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారు. అనేక సందర్భాల్లో గ్రీన్ కార్డ్ వ్యవస్థ దుర్వినియోగాలను కూడా మేము చూశాము. అందుకే మేము దానిని సంస్కరించాలని నిర్ణయించుకున్నాము. మీరు ఒక వ్యవస్థను సంస్కరించినప్పుడల్లా, కొన్ని అంతరాయాలు ఏర్పడతాయి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొంత అసౌకర్యం ఉంటుంది," అని జాతీయ మీడియాతో తెలిపారు.అయితే తాత్కాలికంగా ఈ విధానం వల్ల ఇబ్బందులున్నా దీర్ఘకాలంలో ఈ విధానం స్థిరంగా మారుతుందని తెలిపారు. ముఖ్యంగా అమెరికాకు రావాలనుకునే భారతీయులు ఈ విధానం వల్ల దీర్ఘకాలంలో మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా మేలు పొందుతారని తాను భావిస్తున్నాని పేర్కొన్నారు.. ఇది వ్యక్తిగతంగా వారికి అమెరికాకు ఎంతో మేలు చేస్తోందన్నారు. ప్రస్తుతం మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నారు. -
విజయ్ ను చూసి నేర్చుకో... ఇంకెంతకాలం డబ్బా మాటలు చెప్తావ్?
-
మీరు నిజాయితీగా.. ట్రంప్కు వ్యతిరేకంగా
టెహ్రాన్: ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చంతా.. అమెరికా DNI డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేయడంపైనే నడుస్తోంది. ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారా..? లేక తనంత తానే తప్పుకుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్.... తులసీ గబ్బార్డ్ రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్కు తొత్తుగా పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వంలో మీలాంటి నిజాయితీ గల వ్యక్తులు పనిచేయడం విచారకరం అని ఎక్స్లో పోస్ట్ చేసింది.అమెరికాకు అత్యత కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (DNI) పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అయితే తలసీ గబ్బార్డ్ రాజీనామా ఇప్పుడు అంతర్జాతీయంగా పలు చర్చలకు దారితీసింది. దీనిపై తాజాగా అర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది.ఇరాన్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో " అబ్రహాం త్వరగా, పూర్తిగా కోలుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మీరు గతంలో కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ కోసం కాకుండా అమెరికా కోసం పనిచేస్తారని నిరూపించుకున్నారు, అదే విధంగా పలుమార్లు అధ్యక్షుడు ట్రంప్ ద్వేషించే ఇరాన్ గురించిన నిజాలను కూడా నిష్పక్షపాతంగా మాట్లాడారు. అమెరికాను పక్కనపెట్టి, ఇజ్రాయెల్కు తొత్తుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంతో మీలాంటి వ్యక్తి పనిచేయడం విచారకరం. మీకు శుభాకాంక్షలు" అని ఎక్స్ఖాతాలో రాసుకొచ్చింది.అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలోని వ్యక్తులు ఆ దేశం కోసం కాకుండా పరోక్షంగా ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నారని ఎంబసీ ఆరోపించింది. అంతే కాకుండా ఆ దేశ ప్రయోజనాల కోసం తులసి గబ్బార్డ్ ట్రంప్కు సైతం కోపం తెప్పించేలా పలుసార్లు మాట్లాడిందని పేర్కొంది.అమెరికా మీడియా కథనాలు అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్ టీమ్లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్హౌస్లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.ప్రత్యేకించి.. ఇరాన్ విషయంలో తులసి గబ్బార్డ్ వైఖరి మొదటి నుంచి ట్రంప్ లైన్కు భిన్నంగా కనిపించింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్సైతం ఆమెకు మద్ధతుగా ఎక్స్లో పోస్ట్ చేసింది. -
చంద్రబాబు వేస్ట్.. అరవ శ్రీధర్ మాట్లాడిన సంచలన వీడియో విడుదల చేసిన హర్షవీణ
-
పాస్టర్ అభినయ్ దొంగ నాటకాలు.. KA పాల్ రియాక్షన్
-
మా అంత శుద్ధపూసలు లేరు అన్నట్టు మాట్లాడుతున్నారు సిగ్గుగా లేదా..
-
నా కుమారుడి పెళ్లికి వెళితే చంపేస్తారు?.. ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చమత్కారం చేశారు. ఇరాన్తో తనకు ప్రాణహాని ఉందని తను బయిటకే వెళితే చంపేసే అవకాశం ఉందన్నారు. అందువలనే తన కుమారుడి వివాహానికి హాజరుకానని తెలిపారు. అయితే ఒకవేళ తను హాజరైనా కాకపోయిన తప్పుడు వార్తలతో తనకు మరణ తథ్యమని మీడియాకు చురకలంటించారు. ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అందుకే ట్రంప్ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో తాను ఏ వేడుకలకు వెళ్లలేనని ఒకవేళ వెళితే తనను చంపేస్తారన్నారు.ఓవల్లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. "నేను వెళ్లాలని అనుకుంటున్నాను. అయితే నేను వెళ్లడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతం నాకు ఇరాన్ అనే ఒక వ్యవహారం ఉంది. ఒక వేళ నేను వెళ్లినా చంపుతారు. వెళ్లకపోయినా చంపుతారు. అయితే అది తప్పుడు వార్తల వల్ల" అని చమత్కరిస్తూ మాట్లాడారు. తాను పెళ్లికి హాజరైనా, కాకపోయినా మీడియా నుంచి ఎదురయ్యే విమర్శల గురించి ప్రస్తావిస్తూ ఆ విషయంలో నేను గెలవలేను అని ఆయన అన్నారు.అయితే ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ వివాహం ఈ వారాంతంలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేట్ వేడుకలో పామ్ బీచ్ సోషలైట్ మోడల్.. బెట్టినా అండర్సన్ను వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వనించారని తెలుస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనల కారణంగా తన హాజరు అనిశ్చితంగా ఉందని ట్రంప్ సూచించారు.


