comments
-
ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.. బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయంపై బీజేపీ నేతల దాడి నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేల కార్యాలయంపై దాడి చేయడాన్ని సమర్థించడం లేదని అయితే దాడుల కల్చర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. మితీమిరిన అహంకారంతో వ్యవహరించొద్దనే ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.అయితే కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా ఎల్లుండి కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ బంద్ నిర్వహించనుంది. దీనికి బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరుకానున్నట్లు తెలిపారు. కాగా అంతకు ముందు హుజురాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంపు ఆఫీసుపై దాడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. దానితో పాటు హైదరాబాద్లోని కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన సురక్షితంగా బయటపడగా వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. మరోవైపు.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు.దాడి ఎందుకు జరిగింది?కరీంనగర్లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్ రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై దాడికి యత్నించాయి. -
ఎర్రచందనం దొంగలతో చంద్రబాబు, లోకేశ్ ఫోటోలు.. Liveలో ఆధారాలు
-
సీఎం కోడలు కొనుగోలు చేసిన భూములపై CBI ఎంక్వైరీ జరగాల్సిందే!
-
టీవీకేకు కాంగ్రెస్ మద్దతు.. స్టాలిన్ సంచలన నిర్ణయం
చైన్నై: తమిళనాడులో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. టీవీకేకు సరైన సంఖ్యాబలం లేదంటూ ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రకటించారు. కాగా ఇప్పుడు డీఎంకే సైతం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పింది. ఈ మేరకు డీఎంకే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.డీఎంకే అధికారిక ప్రకటనలో... కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిస్తే దానికి తాము భారీ మూల్యాన్ని చెల్లించామని పేర్కొంది. సోనియా, మన్మోహన్ సింగ్లతో స్నేహంగా ఉన్నాం రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం ఐతే ఇప్పుడు DMKతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని తెలిపింది. కాంగ్రెస్ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది ఇది ప్రజలను మోసం చేయడమేనని పేర్కొంది. బీజేపీకి, కాంగ్రెస్కు పెద్ద తేడా లేదని రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికికాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా డీఎంకే అధినేత స్టాలిన్ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండియా కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్ లోపల, బయట కాంగ్రెస్కు భుజం భుజం కలిసి నడిచాం, ఓటమి మాకు కొత్తేమి కాదు..వెన్నుపోటు కొత్త కాదు సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతామంది. భవిష్యత్తులో కాంగ్రెస్తో పొత్తుఉండదు. ఆపద వేళ కాంగ్రెస్ను ఆదుకుంటే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. అధికార దాహంతోనే టీవీకేతో కాంగ్రెస్ జతకట్టింది". అని డీఎంకే ప్రకటన విడుదల చేసింది.టీవీకే మెజార్టీ మార్కుకు 10 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో కాంగ్రెస్తో పాటు ఇతర చిన్నపార్టీల మద్దతు కోరింది. దీంతో టీవీకేకు సపోర్టు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీఎంకే సంచలన ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా డీఎంకే పార్టీ ఉంది. ఇండియా కూటమికి ఛైర్మన్గా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వ్యవహరిస్తున్నారు. కాగా డీఎంకే ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి సైతం దాదాపుగా వైదోలిగినట్లేనని విశ్లేషకులు అంచనా.. -
‘వేరే దిక్కులేక ఓటేశారు’: ఎన్ఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళ శాసనసభ ఎన్నికల ఫలితాలు పదేళ్ల వామపక్ష (ఎల్డీఎఫ్) పాలనకు తెరదించుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (యూడీఎఫ్) కూటమికి అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే ఈ చారిత్రక విజయం కాంగ్రెస్ నేతల గొప్పదం వల్ల కానే కాదని, కేవలం మార్పు కోరుకున్న ప్రజలు విధిలేక కాంగ్రెస్కు ఓటేశారని నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్ఎస్ఎస్) జనరల్ సెక్రటరీ జి. సుకుమారన్ నాయర్ వ్యాఖ్యానించారు.పెరున్నలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజా ఫలితాలను ‘ప్రజాస్వామ్య విజయం’గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేరళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ 63, దాని మిత్రపక్షం ఐయూఎంఎల్ 22 సీట్లు గెలుచుకుని పదేళ్ల ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించాయి. అయితే, ఈ విజయం తమ సొంత ప్రతిభేనని కొందరు కాంగ్రెస్ నేతలు భ్రమ పడుతున్నారని, కానీ అందులో ఏమాత్రం నిజం లేదని సుకుమారన్ నాయర్ తేల్చి చెప్పారు.పదేళ్ల పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు, మార్పు కోరుకుంటూ ఓటు వేశారన్నారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ఆ ఓట్లు కాంగ్రెస్, యూడీఎఫ్ పక్షాన పడ్డాయని ఆయన అన్నారు. మంత్రుల ఓటములకు కూడా ఈ ప్రజా వ్యతిరేకతే కారణమని ఆయన విశ్లేషించారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, సమర్థులైన, అనుభవజ్ఞులైన వారిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే ఎంచుకుంటుందని సుకుమారన్ నాయర్ పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ గురించి ప్రస్తావించగా.. అది కాంగ్రెస్ నిర్ణయమని, దాన్ని అంగీకరించాల్సిందేనని బదులిచ్చారు. ఎన్నికల్లో ఎన్ఎస్ఎస్ సమాన దూరమనే విధానాన్ని పాటించిందని చెప్పిన ఆయన, గతంలో సతీశన్తో వచ్చిన విబేధాలు ఇంకా అలాగే ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని తాను అడగబోనన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన హక్కులను ప్రభుత్వాన్ని అడుగుతామని, అనవసరమైన పదవులు, చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం తాము ఆశపడబోమని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఒహియోలో వివేక్ రామస్వామి సంచలనం -
డీఏంకేను వీడేది లేదు.. వీసీకే చీఫ్
సినీ స్టార్ విజయ్కు ఊహించని షాక్ తగిలింది. వీసీకే చీఫ్ తిరుమావళన్ డీఎంకేను వీడేది లేదని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో విజయ్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కావడంతో టీవీకే ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులతో పాటు అక్కడి చిన్న పార్టీల అభ్యర్థుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము టీవీకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం గురించి ఆలోచించడం లేదు. మేము ఇప్పటికీ డీఎంకేతోనే ఉన్నాము. మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం మేము ఈ పొత్తుతో ముందుకెళ్లాము. టీవీకే నుండి ఎలాంటి ఆహ్వానాన్ని ఆశించడం లేదు. తమిళనాడులో సంఘ్ పరివార్ నేతృత్వంలోని మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పుకు మేము చాలా కృతజ్ఞులం." అని అన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ రెండు స్థానాలు గెలిచింది. ఇది వరకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తమకు తగినంత సంఖ్యాబలం ఉందని రెండు వారాల గడువు ఇవ్వాలని తమిళనాడు గవర్నర్ని విజయ్ కోరారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏం జరగనుందా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.#WATCH | Chennai | Viduthalai Chiruthaigal Katchi (VCK) Chief, Thol. Thirumavalavan, "We are not thinking about a coalition govt along with TVK. We are still with DMK. We are for secularism. We will proceed with this alliance for the welfare of the people of Tamil Nadu. We are… pic.twitter.com/WXpUBTWYPH— ANI (@ANI) May 5, 2026 -
రాజధాని అనేది ఫొటోలోనే.. నిజం అది మునిసిపాలిటీకి కూడా పనికిరాదు
-
అమరావతి టూ హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. లోకేష్ సమాధానం.. ఇది మాములు ర్యాగింగ్ కాదు
-
12 వేల కోట్లతో బుర్జు ఖలీఫా.. అమరావతిలో 3 బిల్డింగ్ కోసం 14 వేల కోట్లా?
-
ఇరాన్ నన్ను ఇరిటేట్ చేస్తోంది.. ట్రంప్
ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదనలతో తాను సంతృప్తిగా లేనని ప్రస్తుతానికి యుద్దం ముగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అయితే ఇరాన్ మాత్రం తమతో యుద్దం ముగింపుకై సంప్రదింపులు జరుపుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 60 రోజులు గడుస్తోంది అయినప్పటీకీ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఇరు దేశాలు చర్చల విషయంలో తగ్గడం లేదు. అమెరికా ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం కుదరదు అనడం ఇరాన్ దానికి ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పడంతో చర్చలు సాగడం లేదు. అయితే తాజాగా ట్రంప్ ఈ విషయంలో మరోసారి స్పందించారు.ట్రంప్ మాట్లాడుతూ "వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ నేను దానికి సిద్ధంగా లేను; నాకు దానితో తృప్తి లేదు, కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. వారు పురోగతి సాధించారు, కానీ వారు ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకుంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇరాన్లో వారు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు," అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.కాగా ఇరాన్తో యుద్ధం ప్రారంభమైననాటి నుంచి చట్టపరమైన అనుమతి కోరడానికి ట్రంప్ ప్రభుత్వానికి ఈ రోజు ( శనివారం)చివరి గడువు అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ సమయంలో యుద్ధం ముగిసిపోయినందున దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ కాంగ్రెస్కు తెలిపినట్లు సమాచారం. -
చంద్రబాబు ఆరు లక్షల పెన్షన్లు కట్ చేశారు: విడదల రజిని
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబుకు అమరావతి అద్దాల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని వైఎస్సార్సీపీ నేత విడదల రజిని మండిపడ్డారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో శనివారం రజిని మీడియా సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ హామీని కూడా గాలికి వదిలేశారన్నారు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 66లక్షల 35 వేల పెన్షన్లు అర్హులకు అందజేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు లక్షల పెన్షన్లు కట్ చేశారని తెలిపారు.కూటమి ప్రభుత్వం రికార్డుస్థాయిలో అప్పులు చేస్తుందని ఆ నిధులను ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. తెచ్చిన అప్పులతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విలాసాలు చేస్తూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ సరదాలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీని గాలికి వదిలేసి డబ్బులన్నీ వృథా చేస్తున్నారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ జరుగుతోందని దేశంలో ఎక్కడా లేనట్లుగా ఏకంగా అడుగుకు రూ.18,500 పైనే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దీన్ని ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటూ విష ప్రచారం చేస్తున్నారన్నారు.అమరావతిలో అద్దాలకే రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తారా? ఆ వృథా డబ్బు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తయ్యేవన్నారు. ఆరోగ్యశ్రీ వైద్యం అందేది స్కూళ్లు బాగుపడేవి కానీ చంద్రబాబుకు అమరావతి, అవినీతి తప్ప ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఆరోగ్య శ్రీకి రూ.4 వేల కోట్ల బకాయి పెట్టారని.జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకి మేలు జరిగిందని వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడేనని విడదల రజిని మండిపడ్డారు. -
ఏపీలో లేబర్ అడ్డాలట.. చంద్రబాబు చెప్తున్న కొత్త మాట
-
ఒక అచ్చోసిన ఆంబోతు మాటలకు మీ పదవులను ఊడగొట్టకపోతే.. జడ శ్రవణ్ ఛాలెంజ్
-
బిల్డింగ్ అద్దాల కోసం 2 వేల కోట్లు.. మనిషివేనా..! చంద్రబాబును ఏకిపారేసిన కారుమూరి
-
అనిత, సంధ్యారాణిని చూస్తే.. మహానటి సావిత్రి మళ్లీ పుట్టారా అనిపిస్తుంది..
-
చంద్రబాబు 'మెంటల్' అనగానే బాలయ్య వైపు తిరిగిన కెమెరా..!
-
ఈ ఎన్నికలతో బీజేపీ పతనం మొదలైంది
-
మాకు OCD, CCD వ్యాధుల.. మీకున్న వ్యాధి గురించి చెప్పమంటారా
-
నీరజ్ మిట్టల్ ని కలిసినప్పుడు చెప్పిన మాటలు.. సంచలన నిజాలు బయటపెట్టిన అవినాష్ రెడ్డి
-
అమరావతి కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం కోసం.. ఇంధన సంక్షోభం సృష్టి
-
BRS ఆవిర్భావ దినోత్సవం.. కవిత కొత్తపార్టీ పై కేసీఆర్..!?
-
లెవిట్ చెప్పినట్టే పేలిన ‘తూటాలు’!
వాషింగ్టన్: హిల్టన్ హోటల్లో కాల్పుల నేపథ్యంలో ఆ ఉదంతానికి కొద్దిసేపటి ముందు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లెవిట్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘ఈరాత్రి జరగబోయే కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ అద్భుతంగా ప్రసంగించనున్నారు. ఆ సందర్భంగా మాటల తూటాలు పేలనున్నాయి. ఆ తూటా శబ్దాలను అందరూ విని తీరాల్సిందే’’ అని లెవిట్ చెప్పుకొచ్చారు. ట్రంప్ పదునైన పదజాలంతో, వాగ్ధాటితో ప్రసంగిస్తారనే ఉద్దేశంలో ఆమె మాట్లాడినా, కొద్దిసేపటికే కార్యక్రమంలో నిజంగా తూటాలు పేలడం సరదా వ్యాఖ్యలకు తావిచ్చింది. ‘‘తూటా పేలుళ్లను లీవిట్ ముందే పసిగట్టారు. ఇలా జరగబోతోందని ఆమెకు ముందే తెలుసేమో’’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘ఇదంతా రాజకీయ ఎత్తుగడ కాదు కదా!!’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.బాటిళ్లు తీసుకెళ్లారు!ఓవైపు కాల్పుల మోత మోగుతుంటే కొందరు జర్నలిస్టులు మాత్రం మద్యం బాటిళ్లపై దృష్టిపెట్టారు! ఖరీదైన వైన్, షాంపేన్ బాటిళ్లతో సెలీ్ఫలు దిగారు. మరికొందరు వాటిని చెరోటి చంకలో పెట్టుకుని మరీ వెంట తీసుకెళ్లారు. మహిళా జర్నలిస్టులు వైన్ బాటిళ్లను వెంట తీసుకెళ్తున్న వీడియో వైరలైంది. అయితే ఈ సందర్భంగా పలువురు అగ్రనేతలు ప్రాణభయంతో పరుగెత్తుతుంటే, అది చూసి అక్కడే ఉన్న కొందరు మీడియా ప్రతినిధులు బిగ్గరగా నవ్వడం వివాదాస్పదమైంది. మరోవైపు, అంతటి గందరగోళంలోనూ ఒక పెద్దాయన నింపాదిగా కూర్చుని హాయిగా మద్యం సేవిస్తూ స్టఫ్ తింటూ కన్పించారు! -
బాబు ఏం చెప్పినా తల ఊపుతావా? నీ బుర్ర వాడవా...
-
సింగపూర్ లో అచ్చెన్నాయుడు జల్సా! ఒక రేంజ్ లో ఆడుకున్న నాగార్జున
-
'నాకేలాంటి దురుద్దేశం లేదు.. తమన్నా కాళ్లు పట్టుకుంటా'
ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తమన్నాపై డ్యాన్స్పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తమన్నా చాలా తెల్లగా ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాగా.. స్త్రీ 2 చిత్రంలోని ఆజ్ కీ రాత్ ఐటమ్ సాంగ్ను ఉద్దేశించి మాట్లాడారు. అదే సమయంలో తమన్నా డ్యాన్స్ గురించి మాట్లాడారు. అదే సమయంలో ఆమె శరీర రంగుపై కామెంట్స్ చేయడంతో వివాదానికి దారితీసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అన్ను కపూర్ ఈ వివాదంపై స్పందించారు. తన కామెంట్స్ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అదే మాటను తాను మిల్కీ బాడీ అని చెబితే సమస్య వచ్చేది కాదేమోనని అన్నారు. కేవలం లాంగ్వేజ్ మారినంత మాత్రాన అర్థం మారదన్నారు. తమన్నాను ప్రశంసించడానికే అలా అన్నానని.. అంతే తప్ప తనకు మరో ఉద్దేశం లేదని తెలిపారు. నా కామెంట్స్తో తమన్నా బాధపడి ఉంటే ఆమె కాళ్లు పట్టుకోవడానికైనా రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు.. ఆమె కాళ్లు పట్టుకోవడం పెద్ద విషయం కాదన్నారు. -
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య కాదు.. రాష్ట్ర ప్రభుత్వ హత్య
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా నాన్న మృతి.. శంకర్ గౌడ్ పిల్లల ఆవేదన
-
భారత్ నరకం ట్రంప్ వ్యాఖ్యలు.. భారత్ ఘాటు రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్పై విషం చిమ్మారు. దేశాన్ని నరకంతో పోలుస్తూ జాత్యాహాంకార వ్యాఖ్యలు చేశారు. కాగా దీనిపై తాజాగా భారత్ ఘాటుగా స్పందించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబించవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.ట్రంప్ వ్యవహార శైలి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎప్పుడు ఏవిధంగా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అమెరికా గ్రేట్ ఎగేన్ అంటూ తరచుగా వేరే దేశాలపై విషం చిమ్ముతుంటారు. ఆ దేశ సంపదను అవతలి వారి కొల్లగొడుతున్నారంటూ అవతలి దేశాలపై ఏడుస్తూ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత్ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన వివాదాస్పద లేఖను తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.కాగా దీనిపై తాజాగా భారత్ స్పందించింది " మేము ట్రంప్ వ్యాఖ్యలను, అలాగే వాటికి ప్రతిస్పందనగా యూఎస్ రాయబార కార్యాలయం జారీ చేసిన ప్రకటనను కూడా చూశాము. ఆ వ్యాఖ్యలు స్పష్టంగా అవగాహన లేనివి, అనుచితమైనవి మరియు అసభ్యకరమైనవి. అవి ఖచ్చితంగా భారత్-యూఎస్ ప్రస్తుతమున్న సంబంధాల వాస్తవికతను ప్రతిబింబించవు. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు చాలా కాలంగా పరస్పర గౌరవం మరియు ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.మళ్లీ భారత్ను పొగిడిన ట్రంప్కాగా భారత్లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ దీనిపై మరో విధంగా స్పందించారు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ తనతో అన్నారని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ రెండు సంఘటనలను ఊటంకిస్తూ స్పందించింది.అసలేం జరిగింది ?ఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు. ఒక దేశానికి అధ్యక్షుని హోదాలో ఉండి మరో పెద్ద దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. -
ఊసరవెల్లి సిగ్గుపడుతుందేమే.. భారత్పై మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊసరవెల్లి కంటే వేగంగా ట్రంప్ తన మాటలను మార్వగలరు. ఈ రోజు ఉదయమే భారత్పై విషం వెల్లగక్కుతూ అవమానించేలా మాట్లాడిన ట్రంప్.. అంతలోనే ఇండియాను ప్రశంసిస్తూ మాట్లాడారని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ వలసల విషయంలో భారత్పై మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.ఇండియా, చైనా దేశాలను నరకకూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. కొన్ని గంటల్లోనే ట్రంప్ తన బుద్ధిని బయటపెట్టాడు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ అన్నారని భారత్లోని అమెరికా కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మైఖేల్ సావేజ్ వివాదాస్పద వ్యాఖ్యలుఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు.భారత్ స్పందనఅటు ట్రంప్ ఇటు సావేజ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ..‘మేము కొన్ని నివేదికలను చూశాము. వాటిని అక్కడే వదిలేశాం’ అని అన్నారు. -
నందిగ్రామ్ సెగలు: పోలీసులపై సువేందు ఫైర్
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. రాజకీయంగా కీలకమైన నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నికల ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పోలీసులు.. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేసిన సంచలన ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.పోలీసుల పక్షపాత వైఖరిపై ఫైర్తమ పోలింగ్ ఏజెంట్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని నందిగ్రామ్, భవానీపూర్ స్థానాల నుంచి బరిలో ఉన్న సువేందు అధికారి ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసుల తటస్థతపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా పింగ్లా పోలీస్ స్టేషన్ ఓసీ చిన్మోయ్ ప్రమాణిక్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఆయనను సస్పెండ్ చేసి, విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) మనోజ్ అగర్వాల్, పోలీసు పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. VIDEO | West Bengal election: BJP candidate from Bhabanipur and Nandigram, Suvendu Adhikari, said,"Murder accused Sheikh Shahuddin is threatening voters. I am not afraid of anything. My fight is not against any religion. My fight is against the goons of TMC."… pic.twitter.com/z2EYl7Tmjs— Press Trust of India (@PTI_News) April 23, 2026‘ఆ గూండాలతోనే నా పోరాటం’ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని సువేందు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘హత్య కేసులో నిందితుడైన షేక్ షాహుద్దీన్ ఓటర్లను బెదిరిస్తున్నాడు. నేను దేనికీ భయపడను. నా పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదు, కేవలం టీఎంసీ గూండాలపైనే నా యుద్ధం’ అని ఆయన పేర్కొన్నారు. బిన్పూర్, ఖరగ్పూర్ లాంటి ఇతర ప్రాంతాల్లోనూ బీజేపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఏజెంట్లను బలవంతంగా తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్కు ముందు రోజు రాత్రి కూడా నందిగ్రామ్లో టీఎంసీ, బీజేపీ వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. -
అంతా అమరావతిలో ఖర్చు చేస్తే.. మా పరిస్థితి ఏంటి.. బాబుపై తిరగబడ్డ రాయలసీమ ప్రజలు
-
ఏఐసీసీ చీఫ్పై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నిన్న ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ చర్చలకు ఉపక్రమించింది. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోదీ హరిస్తున్నారని అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఏలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.తమిళనాడులో ఈ నెల 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు సాగుతుండగా మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సినీస్టార్ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
సమస్యలపై నిరసన చేస్తే డిస్మిస్ చేస్తారా?
-
చంద్రబాబు నిన్ను ఓడిస్తాం.. రైతుల భూములు చీమలు.. దోమల్లా కనిపిస్తున్నాయా?
-
ప్రధాని మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోదీ హరిస్తున్నారని అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఏలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాటలు ఇప్పుడు తీవ్రదుమారం రేపుతున్నాయి.తమిళనాడులో ఈ నెల 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు సాగుతుండగా మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సినీస్టార్ విజయ్ టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఆ వ్యాఖ్యలు చేసింది వారు కాదు.. యోగీపై ట్రోల్
కోల్కతా ఎన్నికల ప్రచారం సందర్భంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్కు గురవుతున్నాయి. తృణముల్ ఎంపీ సాగరిక ఘోష్తో పాటు సమాజ్ వాద్ పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.అసలేం జరిగింది?యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పశ్చిమబెంగాల్ ఎన్నికల సందర్భంగా బంకురాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగీ మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానిస్తూ "మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను" అన్నారు.అయితే దీనిపై తృణముల్ ఎంపీ యోగీ ఆదిత్యానాథ్కు కౌంటరిచ్చారు. "యోగీ ఆదిత్యానాథ్ గారు ఆ వ్యాఖ్యలు చేసింది స్వామి వివేకానంద కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్" అన్నారు. యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు "బెంగాల్ చరిత్ర పట్ల బీజేపీకి ఉన్న అజ్ఞానాన్ని, ధిక్కారాన్ని" బట్టబయలు చేసిందని పేర్కొన్నారు.అయితే దీనిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం స్పందించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీస్తున్నాయన్నారు.కాగా ఈ వ్యాఖ్యలు 1944 జూలైలో బర్మాలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడమని ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) సైనికులను ఉద్దేశించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు ఆసమయంలో సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ సైనికులనుద్దేశించి "నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను" అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ప్రచారం నడుస్తోంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 23న తొలిదశ ఎన్నికలు జరగునుండగా, ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
అటువంటి న్యాయవాదులను తొలగించాలి: జస్టిస్ బీ.వీ నాగరత్న
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ.వీ నాగరత్న న్యాయమూర్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వేతనాలకు అనుగుణంగా జీవించలేక ప్రలోభాలకు గురయ్యే న్యాయమూర్తులను తమ పదవులను తొలిగించాల్సిన అవసరం ఉందన్నారు. బెంగళూరులో జరిగిన 22వ వార్షిక రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల సదస్సులో ప్రసంగిస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ నైతికత, స్వతంత్రత, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. ఇటీవల వచ్చిన 2వ పేకమిషన్ సిపారసులను అమలు చేయడం ద్వారా న్యాయమూర్తుల భద్రత మరింతగా మెరుగుపడిందన్నారు. అయితే చట్టబద్దంగా తమకు వచ్చిన ఆదాయానికి అనుగుణంగా జీవించలేక దురాశకు లోనయ్యే న్యాయమూర్తులను న్యాయ వ్యవస్థ నుండి తీసివేయాల్సిన అవసరం ఉందన్నారు.ఒక న్యాయమూర్తి చేసే తప్పు కేవలం అతనికి మాత్రమే కాదని పూర్తి న్యాయవ్యవస్థపైనా ప్రభావం చూపుతుందన్నారు. అదే విధంగా న్యాయమూర్తులు కేవలం బయటి వ్యక్తుల నుండే కాకుండా, సహచర న్యాయమూర్తుల నుండి వచ్చే ఒత్తిళ్లకు కూడా లొంగకూడదన్నారు.తీర్పులు ఇచ్చే విషయంలో ఎటువంటి కో ఆర్డినేషన్ ఉండకూడదని ప్రభావితమై న్యాయమూర్తి ఇచ్చే తీర్పు అతని వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యవస్థకు మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక సాధనంలా ఉండాలి కాని అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాకూడదన్నారు. అదే విధంగా న్యాయవాదులు తాము సమర్పించే తీర్పుల యథార్థతను ధృవీకరించాలని అల్గారిథమ్ల ప్రభావం నుండి న్యాయవ్యవస్థకు విముక్తి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.కోర్టులలో మహిళా న్యాయమూర్తులకు భద్రత, గౌరవం మరియు అనుకూలమైన వాతావరణం కల్పించడం న్యాయవ్యవస్థకు అత్యంత అవసరమన్నారు. హైకోర్టులు మరియు జిల్లా న్యాయవ్యవస్థ మధ్య సంబంధాలు పారదర్శకంగా ఉండాలి. జిల్లా న్యాయమూర్తుల పదోన్నతులు, బదిలీలు మరియు సెలవుల విషయంలో హైకోర్టు రిజిస్ట్రీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.మెుత్తంగా న్యాయం అనేది కేవలం యాంత్రికంగా కాకుండా, మానవత్వంతో కూడిన విచక్షణతో జరగాలని ఆమె తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. కాగా జస్టిస్ నాగరత్న ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 2027 సెప్టెంబరులో భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడానికి అవకాశాలున్నాయి. ఇదే జరిగితే స్వాతంత్ర్య భారత చరిత్రలో మెుట్ట మెదటి సారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన మహిళగా ఆమె రికార్డు సాధిస్తారు. -
తుది చర్చలు చాలా దూరం.. ఇరాన్ స్పీకర్
ఇరాన్- అమెరికా మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం మరో రెండు రోజుల్లో ఏప్రిల్ 21తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిభాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలలో ప్రాథమిక అంశాలలో చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. తుదిదశ చర్చలకు రెండు దేశాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయన్నారు.ఇటీవల అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సరైన సయోధ్య కుదరకపోవడంతో చర్చలు ఎటువంటి సానూకూల ఫలితాలు లేకుండానే ముగిశాయి. అయితే ఇరు దేశాల మధ్య కుదిరిన సీజ్ఫైర్ ఒప్పందం ఈ నెల 21తో ముగుస్తోంది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య మరో దపా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ తన అభిప్రాయాల్ని మీడియాతో పంచుకున్నారు.మహ్మద్ గాలిఫ్ మాట్లాడుతూ " ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొన్ని విషయాల్లో తీవ్ర అభ్యంతరాలున్నాయి. తుదిదశ చర్చలకు ఇంకా చాలా దూరంలో ఉన్నాం. ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించింది. అందుకే కాల్పుల విరమణకు అంగీకరించాం". అన్నారు. శత్రుదేశం తమ స్వలాభం కోసం ఎన్నో డిమాండ్లను ఇరాన్పై రుద్దే ప్రయత్నం చేసింది. కానీ మేము వాటిని ఎదుర్కొన్నాం. పోరాటంలో చర్చలు కూడా ఓ భాగమే అని మహ్మద్ గాలిఫ్ అన్నారు.తదుపరి చర్చల మాట్లాడే అంశాలపై చివరి దశ ఫ్రేమ్ వర్క్ రూపొందిస్తున్నామని ఇరాన్ ప్రతినిధులు ఈ అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారని తెలిపారు. మరోవైపు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందిస్తూ ప్రస్తుతం రెండు దేశాల మధ్య చాలా మంచి సంభాషణలు జరుగుతున్నాయి.ట్రంప్ వ్యాఖ్యలుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ అంశంపై మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగానే ఉన్నాయని, అయితే ఇరాన్ తమను "బ్లాక్మెయిల్" చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మళ్ళీ బాంబుల దాడి మొదలుపెడతామని అంతకుముందు ఆయన హెచ్చరించారు.ఇస్లామాబాద్ భేటీఏప్రిల్ 11న ఇస్లామాబాద్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ , గాలిబాఫ్ నేతృత్వంలోని బృందం మధ్య చర్చలు జరిగాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి. అనంతరం మరోదఫా చర్చలు పాకిస్థాన్ వేదికగా రేపు ( సోమవారం) జరగనున్నట్లు సీఎన్ఎన్ నివేదిక వెల్లడించింది.మరోసారి టెన్షన్అయితే ఇరు దేశాల మధ్య సానూకూల వాతావరణం వచ్చినట్లే వచ్చి మరోసారి ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ తొలుత హర్ముజ్పై విధిస్తున్న దిగ్భందం తీసివేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఇరాన్ మరోసారి జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మరో దఫా చర్చలలో ఏం జరగనుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్
-
నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు
-
అమరావతి అని లొకేషన్ పెడితే ఎక్కడికి తీసుకెళ్ళిందంటే..
-
అమరావతిలో బాలయ్య 100 ఎకరాలు..
-
కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు గరళం తాగిన శివుడు జగన్
-
ట్రంప్నకు... పోప్ చురకలు
కేప్టౌన్ : పొప్ లియో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు చేయడానికి బిలియన్లు ఖర్చు చేసి కొద్ది మంది నియంతల వల్ల ప్రపంచ తీవ్ర వినాశనానికి గురవుతుందన్నారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పరోక్షంగా ట్రంప్ను ఉద్దేశిస్తూ మాట్లాడారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తిక్కరేస్తే అంతే సంగతులు. ఏవరికైనా వార్నింగ్ ఇస్తారు. ఈ దేశంపైనైనా దాడికి తెగబడతారు. ఇటీవల ఆ జాబితాలో పోప్ లియో-14 చేరారు. ఆయన బలహీన పోప్ అని అతనికి ఆ పదవి తన వల్లే వచ్చిందన్నారు. ఆయన విదేశాంగ విధానం చాలా దారుణమని మితిమీరిన ఉదారవాదం కనబరుస్తున్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షున్నే విమర్శించే పోప్ తమ దేశానికి వద్దని విరుచుకపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలకు పోప్ సైతం ఎక్కడా తగ్గకుండా సమాధానం ఇచ్చారు.ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న పోప్ మీడియాలో ఇలా మాట్లాడారు " యుద్ధాలు చేయడానికి బిలియనల్ కొద్ది డబ్బు ఖర్చు చేసే వారి వల్ల ప్రపంచం నాశనమవుతోంది.అంతేకాకుండా తమ స్వార్థపు లక్షాలను సాధించడానికి వీరు భగవంతుని పేరు వాడుకోవడం చాలా బాధకరమన్నారు. విధ్వంసం కోసం బిలియన్లు ఖర్చు చేసే వారు విద్య, పునరావాసంపై దృష్టిసారించరు. దేనినైనా నాశనం చేయడానికి ఒక్క క్షణం చాలు. కానీ సరిచేయడానికి ఒక జీవితకాలం కావాలి" అన్నారు. అయితే పోప్ పర్యటనకు అక్కడ విశేష స్పందన లభించింది. బబెండా నగరంలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ఇస్లామిక్, క్రైస్తవ మత నాయకులతో పోప్ లియో ఒక శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. -
చరిత్ర సృష్టిద్దాం.. మద్దతివ్వండి: మోదీ
ఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పార్లమెంటులో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ నడుస్తోన్న వేళ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. పార్లమెంటు తీసుకునే ఈ నిర్ణయం కోసం యావత్ మహిళా లోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోందన్నారు. మహిళల మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయకూడదని అందరం కలిసి చరిత్ర సృష్టిద్దామని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం బీజేపీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఓటింగ్కు ముందు కీలక నేతలతో భేటీ అయ్యారు. బిల్లు ఆమోదం పొందేలా సీనియర్ మంత్రులతో మంతనాలు జరుపుతున్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాజకీయ లబ్ధికోసమే ఈ బిల్లు తీసుకవచ్చారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. డీలిమిటేషన్ అనేది నిరంతరం ప్రక్రియని మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్తో లింకు పెట్టారని ఆరోపించారు. ఇక తమిళనాడు డీఎంకే సైతం ఇదివరకే డీలిమిటేషన్కు తమ పార్టీ వ్యతిరేకమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశాలకు వారు నల్లదుస్తులు ధరించి హాజరయ్యారు. రాజ్యాంగ సవరణ బిల్లులకు పార్లమెంటులో మూడింట, రెండో వంతు మెజార్టీ అవసరముంటుంది. అనగా 360 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఎన్డీఏ బలం 294 దీంతో ఇంకా 64 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగతుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. -
శ్రీరాముడు వలస కూలి.. నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఈ రోజు దేశ చరిత్రలోనే గొప్ప రోజుగా మిగిలిపోతుంది
-
జగన్ టూర్ సక్సెస్.. బాబులో ఫస్ట్రేషన్
-
33 గంటలు ఏం ప్రశించారంటే..?
-
ఇది నా పదో విజయం.. ట్రంప్ సంచలన పోస్ట్
-
అద్భుతం జరగబోతుంది.. ఇక అంతా మంచి రోజులే..
-
వైలెంట్ బుక్ రెడీ చేస్తున్నాం.. ఎక్కడ దాక్కున్నా వెతికి వెతికి మరి....
-
యుద్ధం ముగిసినట్లే..! ట్రంప్ కీలక ప్రకటన
-
హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా.. అనవసర అరెస్టులు, రిమాండ్లు..
-
మీకంత దైర్యం ఉంటే.. మీడియా ముందుకు వచ్చి చెప్పండి..
-
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
-
ముగింపు దశకు యుద్ధం ? ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
అత్తసొమ్ము అల్లుడుదానమా.. ఎవరి సొమ్ము ఎవడికి దానం చేస్తున్నావ్
-
మంగ్లీ బండారం బయటపెడతా.. పంజాగుట్ట PSలో హైడ్రామా.. బాధితులతో సుబ్బారావు
-
పొప్ పై విరుచుకుపడ్డ డోనాల్డ్ ట్రంప్
-
అతనికి శ్రీముఖి అంటే క్రష్.. ఫేమ్ కోసమే ఇందంతా ..!
-
రాధాకృష్ణకు వెంకయ్య సపోర్ట్.. Wait And See.. జగన్ అంటే ఏంటో చూస్తావ్
-
మరోసారి ఇరాన్తో చర్చలు? ట్రంప్ ఏమన్నారంటే..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి చర్చలకు వచ్చినా.. రాకపోయినా తనకు సంబంధం లేదని అసలు ఆవిషయం తాను పట్టించుకోనని తెలిపారు. ఇటీవల జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ మాటలు మరోసారి హీట్ పెంచాయి.ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది. ఇటీవల జరిగిన చర్చలు విఫలమవడంతో ట్రంప్ మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదివరకే హార్ముాజ్ను దిగ్భందిస్తామని వ్యాఖ్యానించారు. అయితే దానికి ఇరాన్ సైతం ఘాటుగానే బదులిచ్చింది. తాజాగా మరోసారి ట్రంప్ చర్చల విషయమై మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "అసలు ఇరాన్ మరోసారి చర్చలకు తిరిగి వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వారు చర్చలకు వచ్చినా రాకపోయినా ఆ విషయం నేనసలు పట్టించుకోను. ఇరాన్ దేశం దాదాపు నాశనమైంది. ప్రస్తుతం ఆదేశం చాలా దీన పరిస్థితుల్లో ఉంది. చర్చలు విఫలమైనప్పటికీ వారి వద్ద అణ్వాయుధం ఉండదు. ఉండే అవకాశం లేదు". అని అన్నారు.అయితే ఇరాన్ మౌళిక సదుపాయాలపై అమెరికా పెద్దగా దాడి చేయలేదని ఆ దేశంలోని ఒకే వంతెనను కూల్చివేసిందని, అది కూడా వారి తప్పేనన్నారు. హర్ముజ్ను తెరుస్తామని అమెరికా మాటిచ్చి ఇప్పుడు దానిని తప్పారని ఇరాన్ పెద్ద అబద్ధాల కోరు దేశమన్నారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నడుస్తున్న సీజ్ఫైర్ ఏప్రిల్ 22 వరకూ కొనసాగుతుందన్నారు. ఇరాన్ ఓడరేవుల దిగ్భందనం మెుదలవుతుందన్నారు. పశ్చిమాసియా యుద్ధం శాంతిస్తుందనుకున్న తరుణంలో ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగేలా ఉన్నాయి. హర్ముజ్ను దిగ్భందించాలని అమెరికా నావికాదళానికి ట్రంప్ ఆదేశాలివ్వడం.. అలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించడంతో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్
-
పుట్టిన ఊరు గురించి అలా మాట్లాడటానికి సిగ్గులేదా.. షర్మిలకు పూజిత కౌంటర్
-
నీకు కొంచమైనా తెలివుందా..? నిన్ను ఒక పావుగా వాడుకుంటున్నారు
-
MAVIGUN అనే పదం డిక్షనరీలో అర్ధమే లేదన్నారు.. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో ఉంది
-
అచ్చెన్నాయుడు దిగజారిపోయి మాట్లాడాడు.. చర్చించడం అనవసరం
-
ఏ జైలు కావాలో ఇప్పుడే చూసుకో.. నీకు 2026లో రాఫ్ఫా.. రాఫ్పానే..
-
MAVIGUNపై షర్మిళ వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి
-
హర్మూజ్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
ఫెయిల్యూర్ అంటే.. దాడి కోరుకుంటున్నారా? రాధాకృష్ణపై ఇంద్రనీల్ ఘాటు వ్యాఖ్యలు
-
నీ తొలిపలుకులు మడిచి.. ABN రాధాకృష్ణపై జడ శ్రవణ్ ఫైర్
-
నీ తల్లి గురించి ABN లో వచ్చిన వార్త మర్చిపోయావా పవన్
-
దమ్ము లేని దద్దమ్మ.. ఏబీఎన్ రాధాకృష్ణపై అంబటి ఫైర్
-
ఎక్కడ దాక్కున్నావ్.. బయటకు రా! రాధాకృష్ణకు పోతిన మహేష్ వార్నింగ్
-
భార్యకు, చెల్లికి తేడా తెలియని ABN.. RKకు వత్తాసు..
-
కాశీ వెళ్ళీ సిగ్గు వదిలేసి.. నీతి జాతి లేకుండా బ్రతికేస్తున్నాడు
-
ABN రాధాకృష్ణ వ్యాఖ్యలపై YSRCP నిరసన
-
బూతు కిట్టు.. శోభనం లైవ్..! చివరలో
-
ఇక్కడితో అయిపోయిందిలే అనుకుంటున్నావేమో.. ABN రాధాకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్
-
బూట్లు నాకే వెదవ బతుకు.. నోట్లో ఏం పెటుకున్నావ్ బ్రోకర్..
-
మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘మావిగన్’ ప్రతిపాదనపై ప్రజల్లో జరుగుతున్న చర్చను దారిమళ్లించేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళలను ఉద్దేశించి అసహ్యకర, దిగజారిన భాషతో వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదని, రాధాకృష్ణ వ్యాఖ్యలు మహిళలను అవమానించడమే కాకుండా కించపరిచేలా చేసిన దాడిగా భావించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రాధాకృష్ణ వివక్ష పూరిత జర్నలిజంతో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘రేపు వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముక లేని నాయకులు వైఎస్సార్సీపీలో ఉన్నారంటూ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. ఇది మహిళలను అవమానించడానికే కాదు.. ప్రజల్లో ‘మావిగన్’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నం. మావిగన్ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కుట్రలో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు దిగారు. మా పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసనలతో రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు. కానీ, ఇటువంటి జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకపోగా చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్లు మద్దతు ఇవ్వడం మహిళలపై వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలి. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము ఖండిస్తున్నాం’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో పేర్కొన్నారు. -
అమరావతి కాదు కమ్మరావతి.. రేణుకా చౌదరికి అంబటి అదిరిపోయే కౌంటర్
-
ధర్మ పరిరక్షకుడా ఎక్కడ ఉన్నావ్.. BR నాయుడి రాసలీలల వీడియో చూడలేదా?
-
బాబు మన కోసం మళ్లీ పుట్టి.. రాజధానిని పూర్తి చేస్తాడు
-
మా అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వండి జైపాల్ గారు.. పేర్ని నాని నాన్ స్టాప్ పంచులు
-
"పిలవరా కమ్మరావతి.." రేణుక చౌదరికి అంబటి కౌంటర్
-
థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
-
నన్ను ఓడించలేరు.. AAPకు రాఘవ్ చడ్డా కౌంటర్
-
జగన్ వస్తాడని బాబుకు అర్థమైంది.. అందుకే చట్టబద్ధత బిల్లు
-
నీ ఇల్లు, మంత్రి నారాయణ ఇల్లు ఉంటే రాజధాని చేసేస్తావా..
-
డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని రిపోర్టులు చూపండి
జడ్చర్ల: డ్రగ్స్ పరీక్షలకు మేము సిద్ధమే..కానీ అవే పరీక్షలకు రాజకీయ నాయకులు సిద్ధమా? అంటూ సినీ నటుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ తాను ఓ ఎమ్మెల్యేగా డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని రిపోర్టులు చూపిస్తున్నానని, తన మాదిరిగానే సినీ నటులు కూడా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. మంచు విష్ణు తండ్రి మోహన్బాబు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని ఆయన అప్పుడు ఏం పరీక్షలు చేయించుకున్నారని ప్రశ్నించారు. మీ సోదరుడు మనోజ్ టెస్టే మీరు చేయించలేరని తమపై ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. ‘మేము ఏం టెస్టులు చేయించుకోవాలో రాసివ్వు ...ఆయా టెస్టులన్నీ చేయించుకుని రిపోర్టులు ముందుంచుతాము.. ఇందుకు మీరు కూడా సిద్ధమా?’అంటూ సవాల్ విసిరారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. -
బిగ్ బాస్ నైనికాకు టీడీపీ ఎమ్మెల్యే బావమర్ది అసభ్యకర మెసేజ్ లు
-
కేవలం రాజధాని గుర్తింపు కోసం బిల్లు.. బాబు అసలు కుట్ర ఇదే
-
ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..
-
వచ్చేది జగనే.. నువ్వు ఏ మాత్రం భయపడకు.. పవన్ వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్
-
అమరావతిపై పెట్టింది తీర్మానం మాత్రమే.. బిల్లు కాదు.. ముందుది ముసళ్ల పండగ
-
ఒక్క మాటతో చంపేస్తావా..? పెమ్మసానికి గుబాపగిలేలా అంబటి కౌంటర్
-
నీకు పగ జగన్ మీదనా.. జనం మీదనా.. నీ పనికిమాలిన సీనియారిటీ ఎవడికి కావాలి?
-
బస్సు ప్రమాదం ఎలా జరిగిందంటే! అధికారి కీలక విషయాలు
-
పెట్రోల్కు ప్రత్యామ్నాయం.. జనం షాకింగ్ నిర్ణయం!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయాందోళనలు అందరిలో నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో పలువురు వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద ఇంధనం కోసం కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. అయితే గంటల తరబడి వేచి చూసినా చుక్క పెట్రోల్ దొరకని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో సామాన్యులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు.పెట్రోల్ కష్టాలు.. ఈవీ వైపు అడుగులుయుద్ధం ఎఫెక్ట్తో చమురు కొరత ఏర్పడవచ్చన్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల వద్ద తీవ్ర రద్దీ కనిపిస్తోంది. అయితే ఈ ఇబ్బందులను భరించలేక చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మళ్లుతున్నారు. తాజాగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ వద్ద వినియోగదారులు తమ గోడును వెళ్లగక్కారు.వినియోగదారుల ఆవేదనఒక కస్టమర్ మాట్లాడుతూ ‘పెట్రోల్ కోసం మూడు నాలుగు గంటల పాటు లైన్లో నిలబడినా ఫలితం ఉండటం లేదు. జేబులో డబ్బులు ఉన్నా.. ఇంధనం దొరకడం లేదు. ఈ టెన్షన్ కంటే ఒక ఎలక్ట్రిక్ బండి కొనుక్కోవడం ఎంతో ఉత్తమం అనిపించింది. అందుకే ఆలోచించకుండా ఈరోజే కొత్త ఈవీ స్కూటర్ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నాను’ అని పేర్కొన్నారు.పెట్రోల్ ధరల పెరుగుదల, పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని నిర్ణయించుకున్నానని ఒక వినియోగదారుడు అనగా, మరొకరు..పెట్రోల్ కోసం దాదాపు 30 నుండి 40 నిమిషాలు లైన్లో నిలబడాల్సి వచ్చిందని, భవిష్యత్తులో పెట్రోల్ కొరత ఏర్పడితే రోజువారీ అవసరాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా ఈవీని ఎంచుకున్నట్లు తెలిపారు. ఇంకొక వినియోగదారుడు మాట్లాడుతూ తన కుమార్తె కోసం గత 6 నెలల నుండి ప్లాన్ చేస్తున్నామని, ఆమెకు సరైన వయసు రావడంతో ఇప్పుడు ఈవీ కొనిచ్చామని చెప్పారు.. నాన్న స్కూటర్ కొనిచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, తాను, తన తమ్ముడు కలిసి ఈ కలర్ను ఎంచుకున్నామని కుమార్తె తెలిపింది.‘నిన్న రాత్రి పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీని చూసి, భవిష్యత్తులో పెట్రోల్ దొరకదేమో అనే భయంతో ఈ రోజే ఈవీ బండిని డెలివరీ తీసుకున్నట్లు ఒక వినియోగదారుడు చెప్పారు. బండి ముందు భాగంలో సరుకులు పెట్టుకోవడానికి చాలా ఖాళీ స్థలం ఉందని, వ్యాపార అవసరాలకు ఇది చాలా సౌకర్యంగా ఉందని అన్నారు. దీనికి జీరో మెయింటెనెన్స్ అని తెలిపారు. తన దగ్గర పాత యాక్టివా ఉన్నప్పటికీ, పెట్రోల్ కష్టాల వల్ల దీనికి మారానని పేర్కొన్నారు. ఈవీ షోరూమ్ల వద్ద సందడిగత రెండు రోజులుగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు అమాంతం పెరిగాయని షోరూమ్ యజమానులు చెబుతున్నారు. కేవలం పెట్రోల్ భయం మాత్రమే కాకుండా, ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేకపోవడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం (100-120 కి.మీ) ప్రయాణించే వీలుండటంతో సామాన్యులు వీటిని కొనేందుకు క్యూ కడుతున్నారు. పెట్రోల్ కష్టాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రోడ్లపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ప్రవచనాలు పేరుతో గుడ్డు గాడిద గుడ్డూ అంటూ సొల్లు పురాణం.. గరికపాటిపై వెంకట్ రెడ్డి ఫైర్
-
ద్వీపాన్ని ఆక్రమించే ప్లాన్? ఇరాన్ స్పీకర్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధం కొలిక్కివస్తుందనే తరుణంలో మరోసారి సమస్యలు తీవ్రతరమైతున్నట్లు కనిపిస్తున్నాయి. నిన్న(బుధవారం) అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. కాగా ప్రస్తుతం టెహ్రాన్కు చెందిన ఓ ద్వీపాన్ని శత్రుదేశం ఆక్రమించే యత్నం చేస్తుందని ఆ దేశ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ హెచ్చరించారు.ఎక్స్ వేదికగా ఆయన మాట్లాడుతూ "ఇంటిలిజెన్స్ నివేదికల ప్రకారం ఇరాన్ శత్రువులు ఒక ప్రాంతీయ దేశం మద్దతుతో ఇరాన్ దీవులలో ఒకదానిని ఆక్రమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మా బలగాలు శత్రువుల కదలికలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నాయి. వారు ఏ మాత్రం ముందడుగు వేసినా శత్రువుకు సహాయం చేసిన ప్రాంతీయ దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలన్నింటినీ ఏ మాత్రం కనీకరం లేకుండా ధ్వసం చేస్తాం. నిరంతరం దాడులు చేస్తాం" అని హెచ్చరించారు.కాగా ప్రస్తుతం ట్రంప్ వేలాది మంది వైమానిక దళాలను మరియు అదనపు మెరైన్లను గల్ఫ్కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంబాట్ వార్కు తెరదించనున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే ఇదివరకే ట్రంప్ ఇరాన్ ముడిచమురు ఎగుమతుల్లో ప్రధానమైన ఖర్గ్ ద్వీపాన్ని "పూర్తిగా రక్షణ లేకుండా అక్కడ ఉన్న ఒక చిన్న చమురు ద్వీపం" అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
మతం మారితే.. రిజర్వేషన్లు రద్దు!
-
ప్రవచనాల పేరుతో.. గరికపాటిని వెంటనే అరెస్ట్ చేయాలి.. RS ప్రవీణ్ సీరియస్
-
లోకేష్ చేతుల కింద పవన్.. ఉస్తాద్ ఫ్యాన్స్ కు చెమటలు పట్టే వీడియో..
-
ఇరాన్ ఆ విషయంలో హామీ ఇచ్చింది : ట్రంప్
పశ్చిమాసియా యుద్దంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ భవిష్యత్తులో ఎప్పుడూ అణ్వాయుధాలు తయారు చేయమని హామీ ఇచ్చిందన్నారు. ఇది చర్చలలో కీలక ముందడుగుగా ఆయన పేర్కొన్నారు. వైట్హౌస్లో మాట్లాడుతూ ట్రంప్ ఈ వివరాలు వెల్లడించారు.పశ్చిమాసియా యుద్ధం తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే ఈ విషయంలో ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని అమెరికా తరచుగా చెబుతున్నప్పటికీ టెహ్రాన్ మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు ఈ నేపథ్యంలోనే ట్రంప్ వైట్హౌస్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "ప్రస్తుతం ఇరాన్లో సరైన వ్యక్తులతో మాట్లాడుతున్నాం వారు ఒప్పందం చేసుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నారు ఈ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco పాల్గొంటున్నారు అని ఆయన తెలిపారు. అదేవిధంగా ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు ఎప్పటికీ అణు ఆయుధాలను తయారు చేయబోమని అంగీకరించిందని తెలిపారు.అదేవిధంగా ఇరాన్పై అమెరికా చేసిన దాడుల వల్ల అక్కడి పాలనలో మార్పు జరగబోతుందని తెలిపారు. కాగా ఈ యుద్ధం ముగిసినట్టేనా?: ఇరాన్తో శాంతి ఒప్పందం ఎంతవరకు సఫలమవుతుందని ట్రంప్ను ప్రశ్నించగా.. "ఈ యుద్ధంలో విజయం సాధించాం" అని సమాధానమిచ్చారు. అయితే చర్చల విషయంలో ఇరాన్ ఇదివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
పొరపాటున ఊర్లోకెళితే.. కోడిగుడ్లు, రాళ్లతో ఉరికించి కొడతారు..
-
మొత్తం బరితెగించి పోయారు.. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారు..
-
కాకినాడ కలెక్టర్ గుడుంబా శంకర్, ఖుషి సినిమా చూసి.. కలెక్టర్ అయ్యాడు
-
అమెరికా మాపై దాడి చేస్తే మేము భారత్ పై దాడి చేస్తాం: పాక్ మాజీ హై కమీషనర్
-
యుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఉద్రిక్తమవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు తమ దేశం అందిస్తున్న నిఘా సమాచారాన్ని ఆపేస్తామన్నారు. అయితే దానికి ప్రతిగా ఉక్రెయెన్కు అమెరికా అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని షరతు పెట్టారు. ఒక వేళ కీవ్కు మద్దతు ఉపసంహరించుకోకుంటే టెహ్రాన్కు రష్యా సహాయం కొనసాగుతుందన్నారు. అయితే ఇరాన్కు రష్యా మద్దతు ఇస్తుందని ఊహగానాల నేపథ్యంలో ఇదివరకే పుతిన్ వివరణ ఇచ్చారు. తమ మిత్ర దేశమైన ఇరాన్కు సంపూర్ణ మద్ధతు ఇస్తామని ప్రకటించారు. టెహ్రాన్కు మాస్కో అండగా ఉంటుందని ప్రకటించారు. ఇరాన్ నూతన సుప్రీంగా ఎన్నికైన ముజ్తాబా ఖమేనీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా యుద్ధంలో రష్యా ఇరాన్కు సహకరిస్తుందని అమెరికా గతంలో ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రకటనపై అమెరికా ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి. -
సిగ్గుచేటు.. గరికపాటి గుడ్డు వివాదం
-
షర్మిల నీ కొడుకును అలా అన్నందుకు కొంచెం కూడా భాద అనిపించలేదా తల్లి..?
-
షర్మిల భర్త అనిల్ ఆయన చెల్లెళ్ళకు సగం ఆస్తి పంచాడా...?
-
అవినాష్ రెడ్డికి పాదాభివందనం చేసినా తక్కువే
-
రాహుల్పై కంగనా ‘పోకిరి’ వ్యాఖ్యల దుమారం
సాక్షి,న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రవర్తన మహిళలకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని, ఆయన వ్యవహరించే తీరుతో మహిళలందరమూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామన్నారు. అంతేకాదు రాహుల్ ఒక "టపోరీ"(ఆకతాయి)లా వచ్చి వెడతారన్న వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి.పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 200కుపైగా మాజీ అధికారులు రాసిన బహిరంగ లేఖ రాజకీయ చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రవర్తనపై వచ్చిన విమర్శలపై రనౌత్ స్పందిస్తూ, రాహుల్ని చూస్తే మహిళలంతా అసౌకర్యానికి గురవుతారని, ఎందుకంటే ఒక పోకిరిలాగా దూకుడుగా మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇచ్చే వారిని ఎగతాళి చేస్తూ ఇబ్బంది పెడతారని ఆమె మండిపడ్డారు.Delhi: On Leader of Opposition Rahul Gandhi, BJP MP Kangana Ranaut says, "Hum mahilaon ko bahut zyada unko dekhkar uncomfortable feel hota hai, Kyunki ekdum jaise tapori ki tarah wo aate hain aur kisi ko bhi 'aae tu aise karke, tu tadak kar' kehte hain...'' pic.twitter.com/XzZ62MmLbg— IANS (@ians_india) March 18, 2026ప్రియాంకతో పోలికఅయితే రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా హుందాగా ప్రవర్తిస్తారని కంగనా పేర్కొన్నారు. రాహుల్ తన సోదరి ప్రియాంకగాంధీని చూసి నేర్చుకోవాలని హితవు పలకం విశేషం. ప్రియాంక ప్రవర్తన చాలా బాగుంటుందని, కానీ రాహుల్ ప్రవర్తన మాత్రం "సిగ్గుచేటు" అంటూ కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేసారు. ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ రాహుల్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. మహిళల గౌరవం, వారి అభ్యున్నతి పట్ల ఆయన చాలా నిబద్ధతతగా ఉంటారనీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు. ఇందిరా గాంధీ, సోనియా లాంటి మహిళా నాయకత్వ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.#WATCH | Delhi | Over Kangana Ranaut's comments on Rahul Gandhi, Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "There could be personal or political disagreements, but saying something like this for Rahul ji is wrong. I have seen Rahul ji's commitment towards the upliftment of… pic.twitter.com/w5tzBvsjax— ANI (@ANI) March 18, 2026 -
వివేకా బాడీని చూడలేక పాపం అవినాష్ రెడ్డి ఏం చేసాడంటే..
-
రోశయ్య తాత గుర్తొస్తున్నాడట.. లోకేష్ పై తాడిపత్రి చంద్రశేఖర్ పంచులు
-
తప్పు జరిగింది..! టీడీపీ ఎంపీ పుట్టా వీడియో
-
చంద్రబాబు అరెస్ట్ పై.. మాజీ CJI NV రమణ వ్యాఖ్యలు.. హైకోర్టు అడ్వకెట్ రియాక్షన్
-
మెగా ఫైట్ @2026: పేలుతున్న ‘సీనియర్ల’ మాటల తూటాలు
దేశవ్యాప్త ఉత్కంఠకు తెరదించుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 9 నుంచి మే 4 వరకు సాగే ఈ ‘ప్రజాస్వామ్య పండగ’లో విజయం ఎవరిదనే చర్చ అప్పుడే మొదలైంది. ఎన్నికల తేదీల ప్రకటన రాగానే ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి మంత్రం, మరోవైపు ప్రజాస్వామ్య రక్షణ నినాదాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.తమిళనాడు: ‘వారసత్వ రాజకీయాలకు చరమగీతం’ తమిళనాడులో ఈసారి చారిత్రాత్మక మార్పు రాబోతోందని ఏఐఏడీఎంకే (AIADMK) ప్రతినిధి కోవై సత్యన్ ధీమా వ్యక్తం చేశారు. ‘మే 4న తమిళనాడులో వారసత్వ పాలన అంతం కాబోతోంది’ అంటూ ఆయన అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ ఇస్తూ, డీఎంకే ఎంపీ ఎంఎం అబ్దుల్లా.. ‘డీఎంకే ఎప్పుడూ ఎన్నికల మూడ్లోనే ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటుంది, గెలుపు మాదే’ అని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ నేత పీటర్ అల్ఫోన్స్ దీన్ని ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.పశ్చిమ బెంగాల్: 'హింస లేని ఎన్నికలే మా లక్ష్యం'బెంగాల్ రాజకీయం ఎప్పుడూ రణరంగాన్ని తలపిస్తుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, అయితే బెంగాల్లో మా కార్యకర్తల హత్యలు మళ్లీ జరగకూడదు.. భయం లేని వాతావరణంలో ఎన్నికలు జరగాలి’ అని కోరారు. కాగా, ఒపీనియన్ పోల్స్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC) 150కి పైగా సీట్లతో ముందంజలో ఉండటం తృణమూల్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది.కేరళ: ‘వేసవి ఎండలో ప్రచార యుద్ధం’కేరళలో ఎల్డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు సిద్ధం కానీ, వేసవి ఎండల్లో ప్రచారం చేయడం అభ్యర్థులకు సవాలే. మా దగ్గర భారీగా ఖర్చు చేసేందుకు ఆర్థిక వనరులు లేవు. కానీ ప్రజల మద్దతు ఉంది’ అని అన్నారు. కాగా, కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ తాము ఏడాది క్రితమే గ్రౌండ్ లెవల్లో ప్రిపరేషన్స్ మొదలుపెట్టామని, ఈసారి మార్పు ఖాయమని అన్నారు.అస్సాం: ‘అభివృద్ధి వర్సెస్ ప్రజా మద్దతు’అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారం చేపడుతుందని బీజేపీ నేతలు అశోక్ భట్టారాయ్ లాంటి వారు నమ్మకంతో ఉన్నారు. ‘పంచాయతీ స్థాయి నుంచి మా కమిటీలు సిద్ధంగా ఉన్నాయి’ అని వారు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాత్రం ‘అస్సాం ప్రజలు ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇస్తారు’ అని సవాల్ విసిరారు. ఇక్కడ కూడా ఒపీనియన్ పోల్స్ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని సూచిస్తున్నాయి.బీజేపీ గెలుపు ధీమా: ‘ఐదు రాష్ట్రాల్లోనూ మాదే విజయం’కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. "ఐదు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్డీఏ (NDA) భారీ మెజారిటీతో విజయం సాధిస్తుంది’ అని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని బీజేపీ నేతలు రాజీవ్ ప్రతాప్ రూడీ, వీరేంద్ర సచ్దేవా తదితరలు నొక్కి చెప్పారు. సామాన్యుల కష్టసుఖాల్లో తోడుగా ఉండే పార్టీగా బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఇది కూడా చదవండి: సిలిండర్లకు సంకెళ్లు.. బడిలో పానీపూరీ భోజనం -
జగన్ అధికారంలోకి రాగానే జరిగేది ఇదే.. చుక్కలే
-
మోజ్తాబా ప్రాణాలతో లేడు.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో లేడన్నారు. ఆయన మరణించినట్లు తాను వార్తలు విన్నానని పేర్కొన్నారు. అయితే ఇదివరకే ఇరాన్ మోజ్తాబా ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసింది ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఎటువంటి ప్రమాదం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ అధినేతల ఉనికిపై చర్చ జోరుగా నడుస్తోంది. మార్చి 2న ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై ఇరాన్ దాడి జరిపింది. ఈ వివరాలను ప్రకటిస్తూ నెతన్యాహు అదృష్టం ఏలా ఉందో తెలియలేదు. అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ రోజు నుంచి నెతన్యాహు ఆరోగ్యంపై పుకార్లు ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ నెతన్యాహుకు సంబంధించిన వీడియో విడుదల చేసింది. అందులో నెతన్యాహు కుడిచేతికి ఆరువేళ్లు ఉన్నాయని అది ఏఐ జనరేటడ్ వీడియో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ ఎటువంటి స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు.మరో వైపు ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇదే విధమైన ఆరోపణలు ప్రచారమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించినా వారిని లేపేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే సుప్రీం లీడర్గా మోజ్తాబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు. కొద్దిరోజులకే ఇరాన్పై జరిపిన దాడుల్లో ఆయనకు తీవ్రగాయాలయ్యాయని కోమాలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై స్పందించారు. శనివారం ఆ దేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ " మోజ్తాబా ఖమేనీ బ్రతికే ఉన్నాడో లేదో తెలియదు. ఆయన గురించి స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఆయన ప్రాణాలతో లేడని నేను విన్నాను. ఒక వేళ ప్రాణాలతో ఉంటే వారి దేశం కోసం తెలివిగా ఆలోచిస్తారు. అది ఆయన లొంగిపోవడమే" అని ట్రంప్ అన్నారు.కాగా మోజ్తాబా ఖమేనీ సుప్రీంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. సుప్రీం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేవలం రాతపూర్వక ఆదేశాలు మాత్రమే ఇస్తున్నారు. ఇటీవల ఇరాన్పై జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కాలు పోయిందని ప్రచారం జరిగింది. అయితే వాటిని ఇరాన్ ఖండించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఆయనపై మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. -
భరితెగించి నోడిని టీటీడీ చైర్మన్ చేయడం కరెక్టేనా..?
-
అయ్యా చంద్రబాబు.. ప్రధాని పదవి ఖాళీగా ఇరాన్ లో మాత్రమే ఉంది
-
మీ సార్ కు ఏడు కొండలు గుర్తు రావడం లేదా? BR నాయుడు మిస్సింగ్ పై జడ శ్రవణ్ సెటైర్లు
-
రాసలీలలతో అడ్డంగా దొరికిపోయి కన్పించకుండా పోయిన బిఆర్ నాయుడు
-
చంద్రబాబు ఉప ప్రధానా..! ఓ రేంజ్ లో ఇచ్చి పడేసిన జగన్
-
మా 11 మంది దమ్ము ఏంటో అర్థమైందా.. వెళ్తూ వెళ్తూ పవన్ కి ఇచ్చిపడేసిన జగన్
-
అన్నదాత సుఖీభవ 20 వేలు ఇస్తా.. లైవ్ లో చంద్రబాబు వీడియో చూపిస్తూ ఏకిపారేసిన వైఎస్ జగన్..
-
15 వేల మాట దేవుడెరుగు.. తల్లికి వందనం డబ్బులు ఎక్కడ అని అడిగితే..
-
చంద్రబాబు, పవన్ కలిసి లోకేష్ ను జాకీలు పెట్టి మరీ లేపుతారు.. కానీ ఏం లాభం..
-
టీడీపీ ఏడాదిలో చేసిన అప్పులు.. ఆధారాలతో బయట పెట్టిన వైఎస్ జగన్
-
పెంచలయ్య దొంగతనం చేసిన దేవుడి సొమ్ము ఎంత తెలుసా?
-
టీటీడీ గుడి కోసం భూమి కొనుగోలు.. చంద్రబాబుపై భూమన విమర్శలు
-
ఆడియో నాయుడు.. వీడియో నాయుడు.. బాబు, BR నాయుడు పై రోజా సెటైర్లు
-
ఆటలు, పాటలు, డాన్సులు.. హోమ్ మంత్రి పదవి తప్ప అన్ని చేస్తున్నావ్
-
మీకు ఓటేసిన పాపానికి మహిళలు ఏడుస్తున్నారు
-
సాయి మాధవ్ బుర్రా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు
-
అమెరికాకు భారీ నష్టం.. కొండను తవ్వి ఎలుకను పట్టారా
-
మంచి సినిమా చూపించారు.. BR నాయుడు రాసలీలలు పై సీపీఐ నారాయణ సెటైర్లు
-
మైకులు పనిచేయక అసెంబ్లీ వాయిదా..! ఇంతకన్నా దరిద్రపు ప్రభుత్వం ఏమైనా ఉంటుందా..?
-
‘కేరళ స్టోరీ’పై రాహుల్ విమర్శలు.. తిప్పికొట్టిన తివారీ భార్య
న్యూఢిల్లీ: ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎవరూ ఆసక్తి చూపడం లేదని, ఇది కేవలం విద్వేషాన్ని పెంచే సాధనంగా మారిందని ఆయన విమర్శించారు. అయితే ఈ చిత్రానికి బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ మద్దతుగా నిలిచారు.‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ ఈ సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘కేరళ సంస్కృతి, అక్కడి సంప్రదాయాలపై దేశ ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. అందుకే ‘ది కేరళ స్టోరీ 2’ వంటి చిత్రాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక వర్గాన్ని కించపరచడానికి, సమాజంలో చీలికలు తీసుకురావడానికి సినిమాలను వాడుకుంటున్నారు. దీనివల్ల కొన్ని శక్తులు రాజకీయ లబ్ధి పొందుతుంటే, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు’ అని రాహుల్పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛపై కూడా రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.‘ఎవరైనా తమ గొంతు వినిపించాలని చూస్తే వారిపై దాడులు జరుగుతున్నాయి. అయితే కొన్ని వర్గాలకు అనుకూలమైన కథనాలను యధేచ్ఛగా ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు’ అని రాహుల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాహుల్ విమర్శలకు భిన్నంగా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ ఈ చిత్రానికి మద్దతుగా నిలిచారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ‘లోకం అన్న తర్వాత రకరకాల మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇంటి వద్ద కూర్చుని విమర్శలు చేసే కంటే, థియేటర్లకు వెళ్లి సినిమా చూడమని నేను కోరుతున్నాను. ఆ తర్వాతే ఇది ప్రచార చిత్రమా లేక సమాజానికి అద్దం పట్టే వాస్తవమా అనేది అర్థమవుతుంది. హిందూ అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేధింపులకు ఇది నిదర్శనం. ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఆమె పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: డేరా బాబా కేసు.. పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు -
అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు.. మంత్రి సవితకు అంగన్వాడీ వర్కర్స్ కౌంటర్
-
కుల, మతాలు అంటూ.. పవన్ కొత్త రాజకీయం
-
పాము కరిచిన కానిస్టేబుల్ ను కాపాడటానికి అమరావతిలో హాస్పిటల్ లేక...
-
లడ్డూపై కొవ్వు ఆరోపణలు.. భయంతో తిరుమలకు పరుగు
-
మరి నువ్వు, నీ కొడుకు ముగ్గురిని కనలేదు ఎందుకు? బాబుపై పేర్ని నాని సెటైర్లు


