Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

AP High Court Hearing on YS Jagan quash petition postponed1
వైఎస్‌ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

సాక్షి, అమరావతి: ఏపీలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌, వైవీ సుబ్బారెడ్డి, కేఎన్ఆర్, విడదల రజిని, పేర్ని నాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు విచారణకు సమయం కోరారు. దీంతో, తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో కుట్రపూరితంగా తన పేరును చేర్చారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నల్లపాడు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ వేశారు. జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి వైఎస్‌ జగన్‌ వెళ్లారు. ఆ పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే దళితుడు మృతిచెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాజకీయ ప్రతీకారంతోనే తనపై ఈ కేసు పెట్టారని జగన్‌ ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. పిటిషన్‌లో ఏముందంటే..మృతుడి భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్‌ఎస్‌ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్‌ 106(1) (నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులు) ప్రకారం మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎందుకనో.. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 105 (హత్య కిందకు రాని కల్పబుల్‌ హోమిసైడ్‌), 49 (నేరానికి ప్రేరేపించడం) సెక్షన్లుగా మార్చారు. మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కిందపడి నలిగినట్లు లేదని.. పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి, పూచీకత్తు తీసుకున్నాక బెయిల్‌పై విడుదల చేశారు.కాన్వాయ్‌లోని గుర్తు తెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. తన పర్యటన(రెంటపాళ్ల) వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసినా.. తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్రప్రభుత్వం ఈ కేసు పెట్టింది. పై అంశాలను పరిగణనలోకి తీసుకొని నాపై నమోదుచేసిన కేసును కొట్టేయాలి అని పేర్కొన్నారు.

Iran People Tension Over Supreme Leader Ayatollah Khamenei2
ఇరాన్‌ ప్రజల ఆందోళన.. ఖమేనీ ఎక్కడ?

టెహ్రాన్‌: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య భీకర దాడులు కొనసాగాయి. ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా సైతం ఆకస్మిక దాడులకు దిగింది. దీంతో, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతోందా? అన్న భయాందోళన నెలకొంది. కానీ, అనూహ్య పరిణామాలతో యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. అయితే, వారం రోజులుగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటి వరకు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అదృశ్యమయ్యారు. వారం రోజులుగా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. యుద్ధం కొనసాగుతున్న సమయంలో కూడా ఖమేనీ వాయిస్‌ కూడా బయటకు వినిపించలేదు. దీంతో ఇరాన్‌ నేతలు, ప్రజలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, యుద్ధం ప్రారంభం తర్వాత సుప్రీం లీడర్‌ ఖమేనీని రహస్య భూగర్భ బంకర్‌కు తరలించారని వార్తలు బయటకు వచ్చాయి. ఆయనను ఎవరూ టార్గెట్‌ చేయకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కు దూరంగా ఉంచినట్టు సన్నిహిత అధికారులు చెబుతున్నారు.Concerns are rising in Iran about the health and whereabouts of Supreme Leader Ayatollah Ali Khamenei. During a state television broadcast, the host asked an official from Khamenei's office about his condition, reflecting public anxiety. Mehdi Fazaeli, the official, did not… pic.twitter.com/ng6DoKwC7P— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) June 26, 2025ఇరాన్ ప్రభుత్వ అగ్రశ్రేణి వ్యక్తులకు కూడా ఆయనతో ప్రత్యక్ష సంబంధం తెగిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మంగళవారం ప్రైమ్-టైమ్ ఇరాన్ స్టేట్ టెలివిజన్ షో హోస్ట్ ఖమేనీ కార్యాలయంలో సీనియర్ అధికారి మెహదీ ఫజేలీని సుప్రీం లీడర్ ఆచూకీ గురించి అడిగారు. ఈ సందర్భంగా ప్రజలు సుప్రీం లీడర్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎలా ఉన్నారో మాకు చెప్పగలరా? అని ప్రశ్నించారు. కానీ ఫజేలీ.. మాత్రం ఆ ప్రశ్నను పక్కనపెట్టి మనమందరం ప్రార్థన చేయాలి. సుప్రీం లీడర్‌ను రక్షించే పనిలో ఉన్నవారు తమ పనిని చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.Concerns are rising in Iran about the health and whereabouts of Supreme Leader Ayatollah Ali Khamenei. During a state television broadcast, the host asked an official from Khamenei's office about his condition, reflecting public anxiety. Mehdi Fazaeli, the official, did not… pic.twitter.com/ng6DoKwC7P— Gabriela Iglesias🇺🇲 (@iglesias_gabby) June 26, 2025ఇదిలా ఉండగా.. దశాబ్దాలుగా ఇరాన్‌ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్‌లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ఖమేనీ ఆధునిక హిట్లర్‌. అతడు బతికి ఉండడానికి వీల్లేదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.చావుకు భయపడే మనిషి కాదు.. ఇరాన్‌లో ఈ నెల 12న ఇజ్రాయెల్‌ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్‌లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్‌ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచ్చితంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలకు ఏమాత్రం దొరకకుండా ఇరాన్‌ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్‌ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు.

Vikarabad: Young Woman Drives Car On Railway Tracks3
వీడియో వైరల్‌: రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. నిలిచిపోయిన రైళ్లు

సాక్షి, వికారాబాద్‌: రీల్స్‌ పిచ్చితో రైల్వే ట్రాక్‌పై కారు నడుపుతూ ఓ యువతి హల్‌చల్‌ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్‌పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడిపి కలకలం సృష్టించింది. దీంతో గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించారు. అయినప్పటికీ ఆగకుండా ఆ యువతి వెళ్లిపోయింది.ఈ క్రమంలో నాగులపల్లిలో స్థానికులు కారును అడ్డుకున్నారు. అయితే, వారిని ఆ యువతి చాకుతో బెదిరించినట్లు తెలిసింది. ఆ యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతి నిర్వాకం కారణంగా గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు.

Rinku Singh To Be Appointed Basic Education Officer By UP Gov: Report4
రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్‌ ఏమిటంటే?!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రింకూ సింగ్‌ (Rinku Singh) కొత్త ప్రయాణం ఆరంభించబోతున్నాడు. ఉత్తరప్రదేశ్‌ విద్యా శాఖ విభాగంలో అతడు ఉద్యోగం చేరనున్నాడు. అలీగఢ్‌కు చెందిన రింకూ సింగ్‌ పేద కుటుంబంలో జన్మించాడు.పేద కుటుంబంతన తండ్రి ఇంటింటికి గ్యాస్‌ సిలిండర్లు వేస్తూ కుటుంబాన్ని పోషించగా.. ఆయన బాధ్యతల్లో భాగం పంచుకునేందుకు రింకూ చిరు ఉద్యోగాలు చేశాడు. ఒకానొక సమయంలో స్వీపర్‌గానూ పనిచేసేందుకు వెనకాడలేదని వార్తలు వచ్చాయి. అయితే, కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయినా.. క్రికెటర్‌గా ఎదగాలన్న రింకూ తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిషలు శ్రమించాడు.పట్టుదలతో టీమిండియా స్టార్‌గాదేశవాళీ క్రికెట్‌లో యూపీ తరఫున సత్తా చాటిన రింకూ సింగ్‌ దశ.. ఐపీఎల్‌తో మారిపోయింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని కొనుగోలు చేసి.. ఆరంభంలో పక్కకుపెట్టినా.. ఆ తర్వాత వరుస అవకాశాలు ఇచ్చింది. ఈ క్రమంలో 2018లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. అద్భుత ఆట తీరుతో అలరించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు రింకూపై నమ్మకం ఉంచి 2023లో ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటిచ్చారు. అలా రింకూ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. రింకూ ఇప్పటికి భారత్‌ తరఫున 33 టీ20 మ్యాచ్‌లు ఆడి 546 పరుగులు, రెండు వన్డేల్లో కలిపి 55 పరుగులు సాధించాడు.రూ. 13 కోట్లకు రిటైన్‌ఇక ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ రింకూను తమ మొదటి ప్రాధాన్య ఆటగాడిగా.. ఏకంగా రూ. 13 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇప్పటికి 58 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రింకూ 1099 పరుగులు చేశాడు.స్కూల్‌డ్రాపౌట్‌? ఇలా క్రికెట్‌ రంగంలో సేవలు అందిస్తూ.. రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న రింకూను ఉద్యోగంతో సత్కరించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్‌ మెడల్‌ విన్నర్స్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌-2022 పథకం ప్రకారం అతడిని జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA) నియమించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా ఇందుకు సంబంధించిన కథనాలు ఇచ్చింది. కాగా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రింకూ తొమ్మిదో తరగతిలో చేరకముందే డ్రాపౌట్‌ అయినట్లు తెలుస్తోంది.ఎంపీతో నిశ్చితార్థంఇక వ్యక్తిగత జీవితంలోనూ రింకూ సింగ్‌ కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు. లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్‌తో మూడేళ్ల ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చాడు. ఈ ఏడాది జూన్‌ 8న ప్రియసఖి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్న రింకూ.. ఈ ఏడాది నవంబరులో లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.చదవండి: తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్పు ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా

Rajnath Singh Says Operation Sindoor India right counter to Pak5
పాక్‌కు రాజ్‌నాథ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. దెబ్బకు చైనా సైలెంట్‌!

బీజింగ్‌: చైనా గడ్డపై దాయాది దేశం పాకిస్తాన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చుక్కలు చూపించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టినట్టు తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ హక్కు అని కుండబద్దలు కొట్టారు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు అని చెప్పుకొచ్చారు.చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(SCO) రక్షణ మంత్రుల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ..‘కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదు. పలు దేశాలు (పరోక్షంగా పాకిస్తాన్‌) ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. ఎస్సీఓ అలాంటి దేశాలను విమర్శించడానికి వెనుకాడకూడదు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు. అలాంటి వారి చేతుల్లో విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉండకూడదు. ఈ సవాళ్లను ఎదుర్కోడానికి నిర్ణయాత్మకమైన చర్య అవసరం. సామూహిక భద్రత కోసం ఈ దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఐక్యం కావాలి’ అని పిలుపునిచ్చారు.#WATCH | Qingdao, China | At the SCO Defence Ministers' meeting, Defence Minister Rajnath Singh says, "It is my pleasure to be here in Qingdao to participate in the SCO Defence Ministers meeting. I would like to thank our hosts for their warm hospitality. I would also like to… pic.twitter.com/c9SyHOaZDp— ANI (@ANI) June 26, 2025ఇదే సమయంలో రాజ్‌నాథ్‌.. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని గురించి కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదులకు దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి కూడా వివరించారు. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించడానికే భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. మా దేశంపై ఉగ్రదాడులు జరిగిన కారణంగా.. ఆపరేషన్‌ చేపట్టాం. ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ హక్కు. ఉగ్రవాదుల విషయంలో మేము సహనంతో ఉండే అవకాశమే లేదు. ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడబోం. మన యువతలో రాడికలైజేషన్ వ్యాప్తిని నిరోధించడానికి కూడా మనం సరైన చర్యలు తీసుకోవాలి’ అని వ్యాఖ్యలు చేశారు.Defence Minister @rajnathsingh attends the SCO Defence Ministers’ Meeting in Qingdao, China.Mr Singh says India’s zero tolerance for terrorism is manifest today through its actions. This includes our right to defend ourselves against terrorism. We have shown that epicentres of… pic.twitter.com/Hy2W98l7uT— All India Radio News (@airnewsalerts) June 26, 2025ఇదిలా ఉండగా.. ఎస్‌ఈవో రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రాజ్‌నాథ్‌ సింగ్ చైనా వెళ్లారు. 2020లో గల్వాన్ లోయ వివాదం తర్వాత నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి చేసిన మొదటిసారిగా చైనా పర్యటనకు వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని రాజ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. ఇక, గురువారం సమావేశం ప్రారంభమయ్యే ముందు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, రష్యా, తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్ వంటి సభ్య దేశాల రక్షణ మంత్రులు గ్రూప్ ఫోటో కోసం సమావేశమయ్యారు.

Sunjay Kapur Planned His Future Of Next 10 Years Months Before His  demise6
మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్‌ : కానీ అంతలోనే!

జీవితం బుద్భుత ప్రాయం. ఎవరి ప్రాణాలు ఏ క్షణంలో గాల్లో కలిసిపోతాయో ఎవరికీ తెలియదు. కానీ అందమైన జీవితం కోసం ఎన్నో కలలు కంటాం. కీర్తి, ఆస్తి, పిల్లలు, వారి భవిష్యత్తు అంటూ.. రాత్రింబవళ్లు తిండి తిప్పలు కూడా మర్చిపోయి కష్ట పడతాం. కానీ కొన్ని విషాదాల గురించి తెలుసుకున్నపుడు మాత్రం ఒకలాంటి నిర్వేదం మన మనసుల్ని ముసురుకుంటుంది.ముఖ్యంగా ఇటీవలి కాలంలో విహార యాత్రలు విషాదంగా మారిపోయిన పహల్గాం ఉదంతం, బెంగళూరు తొక్కిసలాట, ఘోర విషాదాన్ని మిగిల్చిన విమాన ప్రమాదం లాంటి ఘటనలు చూసినపుడు మనసు మరింత భారమవుతుంది. దాదాపు ఇలాంటి గాథే వ్యాపార వేత్త సంజయ్‌ కపూర్‌ ఆకస్మిక మరణం.జూన్ 13న ఇంగ్లాండ్‌లో పోలో ఆటలో ప్రమాదవశాత్తు తేనెటీగను మింగి గుండెపోటుకు గురై 53 ఏళ్ల పారిశ్రామికవేత్త ప్రాణాలు కోల్పోతాడని అసలెవరైనా ఊహిస్తారా? 40వేల కోట్ల ఆస్తిపరుడు సంజయ్ కపూర్, చిన్న ప్రాణి తేనేటీగ మూలంగా కన్నుమూశాడు. ఆయన అకాల మరణం స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల హృదయాల్లో తీవ్ర శూన్యతను మిగిల్చింది. అంతేకాదు రాబోయే పదేళ్ల కాలంలో ఎంతో సంతోషంగా, కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని కలలు కన్న ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోవడం మరింత విషాదం. మూడు నెలల క్రితం, తన జీవితంలో ముఖ్యమైన విషయాలపై మరింత దృష్టి పెట్టాలనే ఆశతో పదేళ్ల తన జీవిత ప్రణాళికను ఒక సందర్భంలో పంచుకున్నాడు."నేను గొప్ప ప్రణాళికదారుడిని. అక్టోబర్‌లో, నేను నా కోసం పదేళ్ల ప్రణాళికను రాసుకున్నాను. ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా స్పష్టంగా ప్లాన్‌ చేసుకున్నా. నా గేమ్‌ నాకు చాలా ముఖ్యం, ఆరోగ్యం , ఫిట్‌నెస్ నాకు చాలా ముఖ్యం. నేను యాక్టివ్‌గా , వీలైనంత ఎక్కువగా పోలో ఆడతాను. అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే నేను నా కుటుంబానికి సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నా..నేను ఉమ్మడికుటుంబం నుంచి వచ్చాను. ఉమ్మడి కుటుంబాల్లో జీవితం అంత ఈజీకాదు. కానీ అదృష్టవశాత్తూ ఒకర్నొకరు ప్రేమించుకుంటూ ఆనందంగా గడిపాం. ఇపుడు కూడా భార్యతో జీవితాంతం అలాగే కొనసాగాలనుకుంటున్నానని తెలిపారు. కానీ అంతలోనూ అనూహ్యంగా ఈ లోకాన్నించి శాశ్వతంగా సెలవు తీసుకోవడం విషాదం.కాగా సంజయ్‌ నలుగురు పిల్లల తండ్రి. సమైరా, సఫీరా, కియాన్, అజారియాస్. మాజీ భార్య బాలీవుడ్‌ నటి కరిష్మాతో కుమార్తె సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు. విడాకుల తరువాత కూడా కరిష్మా పిల్లలతో తన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించారు. మూడో భార్య, ప్రియా సచ్‌దేవ్‌ కుమారిడితో పాటు, మొదటిభర్త ద్వారా పుట్టిన కుమార్తె సఫీరాను కూడా తండ్రిలాగానే చూసుకునేవాడు. సంజయ్‌ కపూర్‌ అంత్యక్రియలకు కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్,కరీనా కపూర్ హాజరైన సంగతి తెలిసిందే. నోట్‌ : జీవితాల్ని చిన్నాభిన్నం చేసే ఇలాంటి విషాదాల గురించి రోజూ వింటూనే ఉంటాం. నిట్టూరుస్తూనే ఉంటాం. ‘చివరికి మిగిలేది’ ఇదే కదా అని కూడా అనుకుంటాం. అలాగని జీవితం ఆగిపోదు. ‘జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని’ అనుకుంటూ ముందుకు సాగాల్సిందే.

Prez Trump Criticize NYC Mayoral Mamdani Says This7
గీత దాటేశారు.. అతనితో అమెరికాకే ప్రమాదం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన నోటికి పని చెప్పారు. న్యూయార్క్‌ మేయర్‌ అభ్యర్థి జోహ్రాన్‌ మమ్దానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డెమొక్రటిక్‌ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మమ్దానీ గెలుపొందిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్‌: న్యూయార్క్‌ నగర మేయర్‌ అభ్యర్థిగా.. డెమొక్రటిక్‌ పార్టీ జోహ్రాన్‌ మమ్దానీ((Zohran Mamdani) విజయాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో డెమొక్రటిక్‌ పార్టీ పైనా.. ఆ పార్టీలోని నేతలపైనా ఆయన సెటైర్లు వేశారు. ‘‘చివరకు అనుకున్నదే జరిగింది. డెమొక్రట్స్‌ గీతను దాటేశారు. జోహ్రాన్‌ మామ్దానీ అనే వ్యక్తి 100 శాతం కమ్యూనిస్ట్‌ పిచ్చోడు. అలాంటి వ్యక్తి ఆ పార్టీ మేయర్‌ అభ్యర్థిత్వానికి జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించే.. రేసులో నిలబడ్డాడు. అతనేం చురుకైన వ్యక్తేం కాదు. చూడటానికే భయకరంగా ఉంటాడు. అతని స్వరమూ కఠోరంగా ఉంటుంది. అతనికి మద్దతు ఇస్తున్నవాళ్లంతా డమ్మీలే. అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్(AOC) తోపాటు చివరకు మా గ్రేట్‌ పాలస్తీనా సెనేటర్‌ చక్ షూమర్‌ సహా. అతను గెలిస్తే దేశానికే ముప్పు’’ అంటూ వ్యంగ్యంగా ట్రంప్‌ ఓ పోస్ట్‌ చేశారు.ఈ విమర్శ ఇక్కడితోనే ఆగిపోలేదు. మరో పోస్టులో డెమొక్రటిక్‌ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ.. ‘‘డెమొక్రాట్లు రాజకీయంగా తిరిగి కీలక పాత్రలోకి రావాలంటే నా దగ్గర ఓ ఆలోచన ఉంది. ఆ పార్టీలో కొందరిని సంవత్సరాలుగా పక్కన పడేశారు. మరీ ముఖ్యంగా 2024 అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక పరాజయం ఎదురైన తర్వాత. డెమొక్రటిక్‌ మహిళా నాయకురాలు జాస్మిన్‌ క్రాకెట్‌ అనే తక్కువ తెలివి గల అభ్యర్థిని అధ్యక్ష పదవికి నామినేట్ చేయాలి. అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్‌తో పాటు మిగిలిన ముగ్గురు వరుసగా ఉపాధ్యక్ష, కేబినెట్‌లో ఉన్నత పదవుల్లో ఉండాలి. వీళ్లతో పాటు న్యూయార్క్‌కు భవిష్యత్తులో కమ్యూనిస్టు మేయర్‌గా Zohran Mamdani గెలిస్తే.. మన దేశం నాశనం అవుతుంది!’’ అంటూ వెటకారంగా మరో పోస్ట్‌ చేశారాయన. జోహ్రాన్‌ మమ్దానీ గురించి..33 ఏళ్ల జోహ్రాన్‌ మమ్దానీ రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య సిరియా మోడల్‌ రమా దువాజీ(rama duwaji). న్యూయార్క్‌ మేయర్‌ రేసు ప్రచారంలో తొలి నుంచి.. ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడీయన. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు. అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్, బెర్నీ సాండర్స్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు. అయితే జోహ్రాన్‌ మమదానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్‌ సాంగ్స్‌, డైలాగులతో షార్ట్‌ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు.

Singer Pravasthi Aradhya on Her View on Elimination Episode8
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్‌ చేశారో చూశారా?: సింగర్‌ ప్రవస్తి

సింగింగ్‌ రియాలిటీ షో పాడుతా తీయగాలో తనను బాడీ షేమింగ్‌ చేశారని, పక్షపాతం చూపిస్తున్నారంటూ అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించింది సింగర్‌ ప్రవస్తి. తన ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌కి సునీత తప్ప ఎవరూ లేరంది. కానీ, రీసెంట్‌గా ఆ ఎలిమినేషన్‌కు సంబంధించిన ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అవగా.. అందులో ముగ్గురు జడ్జిలు (సునీత, చంద్రబోస్‌, కీరవాణి) చప్పట్లు కొడుతూ కనిపించారు.ఇంత అనైతికంగా..దీని గురించి ప్రవస్తి ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఈ వివాదం గురించి ఇక మాట్లాడకూడదనుకున్నాను. కానీ నిన్నటి ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌ చూశాక స్పందించాల్సి వస్తోంది. ఆ ఎపిసోడ్‌ చూసి చాలా షాకయ్యాను. రియాలిటీ షో చరిత్రలోనే ఇంత అనైతికంగా ఎడిటింగ్‌లు చేసి ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ చేస్తారనుకోలేదు. ఎడిట్‌ చేస్తారని తెలుసు. ఎలాగంటే అక్కడక్కడా ముక్కలు అతికిస్తారనుకున్నా.. కానీ, ఇంత అన్‌ప్రొఫెషనల్‌గా చేస్తారని మాత్రం ఊహించలేదు.మోసం చేయొచ్చనిమీరే చాలామంది రియలైజ్‌ అయి నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. మిగిలిన ఎలిమినేషన్స్‌తో పోల్చుకుంటే ఇది అన్యాయంగా ఉందని కామెంట్లు చేశారు. మీరు చెప్పేది నిజమే.. చాలా ఎడిట్‌ చేశారు. జనాలను ఈజీగా మోసం చేయొచ్చని వారి ఉద్దేశం. అదే నాకు ఎంతో బాధనిపించింది. నా ఎలిమినేషన్‌ అప్పుడు సునీత మేడమ్‌ తప్ప మిగతా జడ్జిలు లేరని చెప్పాను. చంద్రబోస్‌ సర్‌ లేనే లేరు. కీరవాణి సార్‌.. నాకు సంబంధం లేదని లేచి వెళ్లిపోయారు. అది ఎడిటింగ్‌లో లేపేశారు.ఎక్కడినుంచి తీసుకొచ్చి అతికించారో..కానీ ఆయన చప్పట్లు కొడుతున్న సీన్‌ పెట్టారు. అది ఎక్కడినుంచి తీసుకొచ్చి అతికించారో నాకు తెలీదు. ఎలిమినేషన్‌లో చప్పట్లు కొట్టే సీన్‌ ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియాలి. చివరి రౌండ్‌లో ఇద్దరం మిగిలాం. నన్ను ఎలిమినేట్‌ చేసినప్పుడు నాకెన్ని మార్కులు వచ్చాయి? ఎందుకు ఎలిమినేట్‌ చేశారు? అనేది చూపించలేదు. నేనైతే ఆ ఎలిమినేషన్‌ ప్రక్రియ మొత్తం నవ్వుతూనే ఉన్నాను. ఎలిమినేట్‌ అవడమే బెటర్‌ఎందుకంటే, ఇంత అన్‌ప్రొఫెషనల్‌ రియాలిటీ షోలో ఉండటం అనవసరం అనిపించింది. ఈ సీజన్‌ ఇంత ఘోరంగా జరుగుతుంటే ఎలిమినేట్‌ అవడమే బెటర్‌ అనుకున్నాను. అలాగే చూసే జనాలకు కూడా నిజాలు తెలియాలనుకున్నాను. వాళ్లు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పాలని ఆరోజే నిర్ణయించుకున్నాను. అక్కడ సేవ్‌ అయిన కంటెస్టెంట్ల కంటే కూడా నా ముఖంలోనే చిరునవ్వు ఉంది. నేను మిస్టేక్స్‌ చేయలేదు. ద్వేషం లేదుసేవ్‌ అయినవాళ్లను చూస్తే తప్పులు చేసినా కూడా సేవ్‌ అయ్యాం అని గిల్ట్‌ వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వారిపై నాకెలాంటి ద్వేషం లేదు. నాకు అన్యాయం జరిగిందని ఇదంతా మాట్లాడుతున్నాను. ప్రేక్షకులను ఫూల్‌ చేస్తున్నారని తెలియాలనే ఇదంతా చేశాను. విన్నర్‌ అయినా కూడా వారికి ఆ సంతృప్తి మిగులుతుందనుకోవడం లేదు. వాళ్లకు నచ్చినవారే గెలుస్తారు అని చెప్పుకొచ్చింది. చదవండి: క్రికెట్‌ వీడియోపై నెటిజన్ వ్యంగ్య కామెంట్‌.. ఇచ్చిపడేసిన తమన్‌!

Anil Ambani hits jackpot Reliance Defence receives Rs 600 crore order9
జాక్‌పాట్‌ కొట్టిన అనిల్‌ అంబానీ.. రూ. 600 కోట్ల ఆర్డర్‌

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ డిఫెన్స్‌ తాజాగా జర్మనీ రక్షణ రంగ సంస్థ రైన్‌మెటల్‌ వాఫే మ్యునిషన్‌ జీఎంబీహెచ్‌ నుంచి రూ. 600 కోట్ల విలువైన ఆర్డర్‌ దక్కించుకుంది. హైటెక్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఇది అతిపెద్ద ఎగుమతి కాంట్రాక్ట్‌గా కంపెనీ పేర్కొంది.తాజా ఆర్డర్‌ గ్లోబల్‌ డిఫెన్స్, యుద్ధసామగ్రి విభాగంలో కంపెనీకి కీలక మైలురాయిగా అభివర్ణించింది. తద్వారా అంతర్జాతీయస్థాయిలో రక్షణ, యుద్ధసామగ్రి సరఫరా చైన్‌లో విశ్వసనీయ భాగస్వామిగా రిలయన్స్‌ డిఫెన్స్‌ మరింత పటిష్టపడినట్లు తెలియజేసింది.రెండు సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దీర్ఘకాలిక సహకారానికి కట్టుబాటుగా పేర్కొంది. అంతేకాకుండా ఆత్మనిర్భర్‌ భారత్, మేకిన్‌ ఇండియా లక్ష్యాలకు మద్దతుగా దేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను పటిష్టపరచనున్నట్లు వివరించింది.👉 ఇది చదివారా? అనిల్‌ అంబానీకి భారీ ఉపశమనందీంతో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు దూసుకెళ్లాయి. జూన్ 25న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇన్‌‍ఫ్రా షేర్లు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. మార్కెట్లు ముగిసే సమయానికి షేరు విలువ రూ. 404.65 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ అనుబంధ సంస్థే రిలయన్స్ డిఫెన్స్‌.

Las Vegas American Airlines flight Incident Viral10
ఆకాశంలో ఉండగా విమానానికి మంటలు!

ఆకాశంలో ఉండగా ఓ విమానానికి మంటలు అంటుకున్నాయి. ఆ టైంలో విమానంలో మొత్తం 159 మంది ఉన్నారు. అయితే పైలట్‌ చాకచక్యంతో వ్యహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే ఇంజిన్‌ నుంచి మంటలు బయటకు వచ్చాయి. ఇది గమనించిన పైలట్‌ అప్రమత్తం అయ్యారు. వెంటనే విమానాన్ని వెనక్కి తెచ్చి సేఫ్‌ ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. అక్కడి కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. లాస్‌వెగాస్‌ హ్యారీ రెయిడ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 1665 విమానం(ఎయిర్‌బస్‌కు చెందిన A321) టేకాఫ్‌ అయ్యింది. 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో అది బయల్దేరింది. నార్త్‌ కరోలీనా షార్లెట్‌లోని డగ్లస్‌ ఎయిర్‌పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది.అయితే.. టేకాఫ్‌ అయ్యాక కాసేపటికి(8.20గం.కి టేకాఫ్‌ అయితే.. 8.30గం.) గాల్లో ఉండగా ఇంజిన్‌ కింది భాగం నుంచి మంటలు, పొగ కనిపించాయి. ఇది గమనించిన పైలట్‌ విమానాన్ని తిరిగి లాస్‌వెగాస్‌ ఎయిర్‌పోర్టులో సేఫ్‌ ల్యాండ్‌ చేశారు. అయితే.. విమానాన్ని పరిశీలించిన సిబ్బందికి ఎలాంటి సాంకేతిక లోపం.. మంటలు అంటుకున్న జాడ కనిపించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ విమానాన్ని రద్దు చేసి.. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానాలకు చేర్చారు. ఆకాశంలో విమానానికి మంటలు అంటుకున్న దృశ్యాన్ని కొందరు తమ ఫోన్లలో బంధించగా.. ఈ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(FAA) దర్యాప్తు జరుపుతోంది. ఇటీవల భారత్‌లో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మంది(సిబ్బందితో కలిపి), జనావాసాలపై విమానం కూలి పేలిపోవడంతో మరో 34 మంది స్థానికులు మరణించారు. తాజాగా బ్రెజిల్‌లో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ గాల్లో ఉండగా పేలి 8 మంది అక్కడికక్కడే మరణించగా.. కిందకు దూకి మరో 13 మంది ప్రాణాలు రక్షించుకోగలిగారు. ఈ ఘోర ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి కూడా.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement