Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Telangana SLBC Tunnel Accident Check Full Details Here1
బ్రేకింగ్‌ న్యూస్‌: ఎస్ఎల్బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం

నల్లగొండ: ఎస్ఎల్బీసీ పనుల్లో శనివారం శ్రుతి చోటు చేసుకుంది. సొరంగ మార్గం వద్ద గోడ కుప్పకూలింది. పలువురు కూలీలకు గాయాలు కాగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఐదేళ్ల సుధీర్ఘ విరామానంతరం తిరిగి ఈ మధ్యే ఈ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ(SLBC) సొరంగం ప్రాజెక్టును రూపొందించారు. 2005లో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు నాటి వైఎస్సార్ ప్రభుత్వం రూ. 2,200 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.1925కోట్లతో సుమారు 60 నెలల్లో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ పనులు పొందింది. శ్రీశైలం జలాశయం నుంచి నల్లగొండ జిల్లాకు 30టీఎంసీల కృష్ణ జలాలను తరలించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ తో సొరంగం త్రవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతు సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురవ్వడం.. నిధుల కేటాయింపులు లేకపోవడంతో సొరంగం ప్రాజెక్టు పనులు 2019 డిసెంబర్ నుంచి మూలపడ్డాయి. మొత్తం ఇన్ లెట్, అవుట్ లెట్ సొరంగాలు కలిపి 44కిలోమీటర్లు త్రవ్వాల్సి ఉండగా..9.559కిలోమీటర్ల త్రవ్వకం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఆరుసార్లు ప్రభుత్వం పనుల గడువు పొడిగించింది. తాజా గడువు కూడా జూన్ 2026వరకు ఉంది. 2017లో ఈ ప్రాజెక్టు అంచనాలను రూ.3,152.72కోట్లకు పెంచారు. తాజాగా మరోసారి 4,637కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటిదాకా రూ.2,646కోట్లు ఖర్చు చేశారు.

APERC gets clean chit on deal with Solar Energy Corporation of India Limited2
‘సెకీ’ ఒప్పందం సక్రమమే

సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ సేకరణకు సంబంధించి అనేక అభ్యంతరాలు వివిధ కారణాలతో వచ్చాయి. సెకీ విద్యుత్‌ సేకరణలో లంచాలకు సంబంధించి మీడియా కథనాలను బట్టి ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కొందరు కోరారు. దీంతో ఈ పీఎస్‌ఏపై ఏపీఈఆర్‌సీ మరోసారి దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది. కేంద్ర విద్యుత్‌ శాఖ ఆదేశాలు, సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్‌ కమిషన్‌ (సీఈఆర్‌సీ) జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెన్‌ (జీఎన్‌ఏ) నిబంధనలు, పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌(పీపీఏ) ప్రకారం..‘సెకీ’ విద్యుత్‌కు అంతర్‌ రాష్ట్ర ప్రసార (ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌–ఐఎస్‌టీఎస్‌) చార్జీలు వర్తించవు. అదేవిధంగా ప్రసార నష్టాల మినహాయింపు ఉంటుంది.సెకీ విద్యుత్‌ కొనుగోలుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు ప్రతిపాదించాయి. అందువల్ల ఈ 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్‌ సేకరణ ప్రణాళిక (పవర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాన్‌)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు. – ఏపీఈఆర్‌సీసాక్షి, అమరావతి: రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో కారుచౌకగా యూనిట్‌ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందంటూ ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్‌ రెవిన్యూ రిక్వైర్‌మెంట్‌–ఏఆర్‌ఆర్‌)లో ఏపీఈఆర్‌సీ స్పష్టం చేసింది. విద్యుత్‌ సేకరణపై తాజాగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్‌) చేసిన ప్రతిపాదనల్లో సెకీ విద్యుత్‌ కూడా ఉంది. 2025–26లో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్‌సీని డిస్కంలు కోరాయి. దీనిపై స్పందించిన కమిషన్‌ ‘సెకీ’ విద్యుత్‌ ఒప్పందంపై తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చింది. ‘‘సెకీ నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్‌ సేకరణ ప్రణాళిక (పవర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాన్‌)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు’’ అని ఏపీఈఆర్‌సీ పేర్కొంది. ఇక సెకీ నుంచి విద్యుత్‌ సేకరణ ప్రణాళికలో ట్రేడింగ్‌ మార్జిన్‌ తగ్గించడంపై జరిగిన చర్చలను కూడా మండలి ప్రస్తావించింది. సీఈఆర్‌సీ రూ.0.7 పైసల ట్రేడింగ్‌ మార్జిన్‌తో టారిఫ్‌ను ఇప్పటికే ఆమోదించిందని, అందువల్ల దానిపై కమిషన్‌ దీనిపై ఇప్పుడు వ్యాఖ్యానించదని తెలిపింది. అంటే గత ప్రభుత్వం కుదుర్చుకున్న ధర యూనిట్‌ రూ.2.49కే సెకీ నుంచి విద్యుత్‌ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపధ్యంలో సెకీ లాంటి పీఎస్‌ఏ ఒప్పందాలను కొందరు డిమాండ్‌ చేస్తున్నట్లుగా సూమోటోగా కమిషన్‌ రద్దు చేయలేదని తేల్చి చెప్పింది. కాబట్టి ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబరులో విద్యుత్‌ సేకరణకు డిస్కంలు కోరిన ప్రణాళికలో సెకీ విద్యుత్‌ను చేర్చడానికి కమిషన్‌ మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించింది. సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్‌ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారని.. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారని.. పేరుకే సెకీ.. ఒప్పందం అదానీతోనే.. ఐఎస్‌టీఎస్‌ చార్జీలు కట్టాల్సిందే.. జుగల్‌ బందీలు.. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం.. ఇలా చిలువలు పలువలుగా.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఎల్లో మీడియా, టీడీపీ కూటమి నేతలు సాగించిన దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని దీన్నిబట్టి తేలిపోయింది. కేవలం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా బరితెగించినట్లు వెల్లడైంది. అంటే తప్పులేదని ఒప్పుకున్నట్లేగాఅంతరాష్ట్ర విద్యుత్‌ సరఫరా చార్జీలను (ఐఎస్‌టీఎస్‌) మినహాయించి యూనిట్‌ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్‌ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో యూనిట్‌ రూ.2.49 చొప్పున ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్‌ 11న ఏపీఈఆర్‌సీ కూడా ఆమోదించింది. 2003 విద్యుత్‌ చట్టం ప్రకారం సెకీ ఒప్పందాలకు ఏపీఈఆర్‌సీ అనుమతినిచ్చింది. నిజానికి సెకీ నుంచి గతేడాది సెప్టెంబర్ నుంచి విద్యుత్‌ కొనుగోలు మొదలవ్వాల్సి ఉంది. తొలి ఏడాది 2024లో 3వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో 1,000 మెగావాట్లు చొప్పున మొత్తం 7వేల మెగావాట్లను రాష్ట్రం తీసుకుంటుందని ఒప్పందంలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం 4వేల మెగా­వాట్లను ఈ ఏడాదే తీసుకుంటామంటూ ప్రతిపాదించింది. అంటే ఇన్నాళ్లూ తాము చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని, కల్పిత కథనాలేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నట్లైంది!సంపద సృష్టించిందెవరు?.. గుదిబండ మోపిందెవరు?సెకీ నుంచి కారుచౌకగా విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ద్వారా గత ప్రభుత్వం ఏడాదికి రూ.4,400 కోట్లు ఆదా చేసింది. ఈ లెక్కన 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా సంపద సృష్టించింది. అదే చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య సౌర విద్యుత్‌ యూనిట్‌ సగటున రూ.5.90 చొప్పున కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) చేసుకున్నారు. సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్‌ రూ.3.41 అధికంగా కొన్నారు. దీనివల్ల ఏడాదికి రూ.3,500 కోట్లు చొప్పున 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై భారం పడింది. మరి 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్‌ జగన్‌ గొప్పా..? లేక రూ.87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్పా? చేసిన మంచిని దాచలేరు.. గాడి తప్పిన విద్యుత్‌ రంగాన్ని చక్కదిద్దేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్‌ సరఫరా అందించింది. అందుకుగానూ డిస్కంలకు 2019–24 మధ్య రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది. రైతులకు ఉచిత విద్యుత్‌ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. దానిని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రెండు లక్షలపైగా వ్యవసాయ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసింది. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చి సాగుకు చేదోడు వాదోడుగా నిలిచింది. రాష్ట్రంలో 9 గంటలు వ్యవసాయానికి పగటిపూట విద్యుత్‌ సరఫరా చేసేలా 6,663 ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించారు. విద్యుత్‌ రంగానికి, రైతన్నలకు ఇంత మంచి చేసిన వైఎస్‌ జగన్‌పై బురద చల్లుతూ సెకీ విద్యుత్‌ ధర ఎక్కువని, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు కట్టాల్సి వస్తుందని కూటమి నేతలు, కరపత్రికలు దు్రష్పచారం చేశాయి. చివరికి అవన్నీ తప్పుడు ఆరోపణలని విద్యుత్‌ నియంత్రణ మండలి తేల్చింది. ఇప్పుడేమంటారు బాబూ..?కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం, విద్యుత్‌ పంపిణీ సంస్థల మధ్య త్రైపాక్షిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. మంత్రి మండలితో పాటు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే జరిగింది. సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. దాన్ని రైతుల వ్యవసాయ అవసరాల కోసం అందించాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంకల్పించింది. ఆ ధర అప్పటికి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ఈ ఒప్పందంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం, టీడీపీ అనుబంధ కరపత్రిక ఈనాడు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేశాయి.అదానీపై అమెరికాలో ఏదో కేసు నమోదైందని, అందులో జగన్‌ పేరు ఉందని, లంచం తీసుకున్నారని నిరాధార కథనాలను వండి వార్చాయి. ఈనాడు, టీడీపీ అనుబంధ మీడియా రాసిన అసత్య కథనాలను పట్టుకుని చంద్రబాబు ప్రోద్బలంతో కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఊగిపోయారు. ఏకంగా జగన్‌పైనే కేసు పెట్టినట్లు నిందలేస్తూ ఆరోపణలు గుప్పించారు. సెకీ ఒప్పందానికి అంతర్‌ రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు రాదని, యూనిట్‌ రూ.2.49 కూడా ఎక్కువేనని, ప్రజలపై పాతికేళ్లలో రూ.లక్ష కోట్ల భారం పడుతుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఏమార్చేందుకు టీడీపీ కరపత్రికలు యత్నించాయి. అవన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయి. ఇదే చంద్రబాబు గతంలో అత్యధిక ధరలకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పడు మార్కెట్‌లో సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.44కే లభిస్తున్నా ఏకంగా యూనిట్‌ రూ.6.99 చొప్పున కొన్నారు. మిగులు విద్యుత్‌ ఉన్నప్పటికీ చంద్రబాబు దానిని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్నారు. తాజాగా ఏపీఈఆర్‌సీ ఇచ్చిన స్పష్టత వాటికి చెంపపెట్టులా పరిణమించింది.ఎల్లో కరపత్రం.. ఎంత విషం చిమ్మిందో.. ఆరోపణ: సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరణనిజం: సెకీ లేఖ – ఒప్పందానికి మధ్య దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ సమయం. కమిటీ లోతైన అధ్యయనం తరువాతే కేబినెట్‌ ఆమోదంఆరోపణ: ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా అబద్ధాలు నిజం: పాతికేళ్ల పాటు అంతరాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన ’సెకీ’ఆరోపణ: సోలార్‌ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగింది.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారు. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్ధిక భారం పడుతుంది.నిజం: ఈ ఒప్పందంలో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. ఒప్పందం జరిగింది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వం.. డిస్కమ్‌ల మధ్య! ఇక లంచాలకు తావెక్కడ?రాష్ట్ర చరిత్రలోనే కారుచౌకరాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్‌ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దూరదృష్టి, సోలార్‌పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్‌ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు ఇక లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? నేరుగా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది?‘సెకీ’ ఒప్పందంతో లాభాలివీ..» కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) యూనిట్‌ రూ.2.49కే సోలార్‌ విద్యుత్తు అందచేస్తామంటూ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం వల్ల 25 ఏళ్ల పాటు ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుందని 2021 సెప్టెంబర్‌ 15న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సెకీ స్పష్టం చేసింది.» ఈ చారిత్రక ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర విద్యుత్తు భారం నుంచి ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది. » ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి మినహాయింపు అనేది మరే ఇతర ప్రాజెక్ట్‌కి దక్కని చాలా కీలకమైన ప్రయోజనం. ఇతర రాష్ట్రంలో ఉన్న సోలార్‌ పవర్‌ ఉత్పాదక కేంద్రం నుంచి విద్యుత్‌ సరఫరా కోసం మరే ఇతర సంస్థతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు అది చాలా భారంగా మారుతుంది. ప్రతి నెలా మెగావాట్‌కు సుమారు రూ.4 లక్షలు దానికే ఖర్చవుతుంది. » రాష్ట్ర డిస్కంలు మునుపెన్నడూ ఇంత తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. » ఇది కేంద్ర సంస్థ సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. అలాంటప్పుడు ఇక లంచాలకు ఆస్కారం ఎక్కడుంటుంది?» టీడీపీ హయాంలో కుదుర్చుకున్న అధిక ధరల పీపీఏలతో పోలిస్తే సెకీతో సగం కంటే తక్కువ ధరకే ఒప్పందం కుదిరింది.అభినందించాల్సింది పోయి నిందలేస్తారా?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందంæ జరిగితే.. యూనిట్‌ రూ.2.49కే రాష్ట్రానికి విద్యుత్‌ దొరుకుతుంటే.. పైగా స్పెషల్‌ ఇన్సెంటివ్‌గా అంతరాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించడం ద్వారా యూనిట్‌కు మరో రూ.1.98 ఆదా అవుతుంటే.. ఇంత మంచి ప్రతిపాదన రాష్ట్రానికి వస్తే ఎవరైనా క్షణం ఆలోచించకుండా ముందుకెళ్తారు. మేం కూడా అదే చేశాం. ఈ ఒప్పందం ద్వారా 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేయడం వలన సంపద సృష్టించాం. నిజంగా ఇదొక రోల్‌ మోడల్‌ కేసు. ఇంత మంచి చేస్తే నాపై రాళ్లేస్తారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆత్మనిర్భర్‌ ప్యాకేజ్‌ కింద తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లకు సెకీ ఎంతకు అమ్మిందో తెలుసా? ఆ మూడు రాష్ట్రాలకు యూనిట్‌ రూ.2.61 చొప్పున సరఫరా చేశారు. అంటే వాళ్లకంటే రూ.0.12 తక్కువకే విద్యుత్‌ తీసుకొచ్చిన నన్ను అభినందించి శాలువా కప్పి ప్రశంసించాల్సింది పోయి బురద జల్లుతారా? మంచి చేసిన వాడిపై రాళ్లు వేయడమే ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవీ 5తో పాటు చంద్రబాబుకు చెందిన ఎల్లో గ్యాంగ్‌ పనిగా పెట్టుకుంది. వీళ్లు తానా అంటే తందానా అనే ఇతర పార్టీల్లో ఉండే టీడీపీ సభ్యులు మిడిమిడి జ్ఞానంతో చంద్రబాబును మోయాలన్న తాపత్రయంతో... జగన్‌పై బురద చల్లాలి అనే యావతో నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు సమంజసం?. – ఎల్లో మీడియా దుష్ప్రచార కథనాలపై గతంలో వైఎస్‌ జగన్‌ వ్యాఖ్య

Kamalhaasan Warning To Centre On Language Row3
మాతో ఆటలొద్దు: కమల్‌హాసన్‌ వార్నింగ్‌

చెన్నై:తమిళులు భాష కోసం ప్రాణాలు వదిలారని, ఈ విషయంలో తమతో ఆటలొద్దని ప్రముఖ నటుడు మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎమ్‌) అధినేత కమల్‌హాసన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్‌ఎన్‌ఎమ్‌ పార్టీ 8వ వ్యవస్థాపక దినం సందర్భంగా కమలహాసన్‌ మాట్లాడారు.‘తమిళులకు భాష చాలా ముఖ్యమైనది. మాతో ఈ విషయంలో ఆలలొద్దు.భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం.మా పిల్లలకు కూడా ఏ భాష కావాలో తెలుసు.ఏ భాష కావాలో ఎంపిక చేసుకునే జ్ఞానం వారికి ఉంది’అని పరోక్షంగా కేంద్రం తీసుకువచ్చిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ(ఎన్‌ఈపీ)ని ఉద్దేశించి కమల్‌ వ్యాఖ్యానించారు.తమిళనాడులో రెండు భాషల విధానం అమలులో ఉండగా ఎన్‌ఈపీ కింద హిందీతో కలిపి మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిని అధికార డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఎన్‌ఈపీ అమలు చేయకపోతే తమిళనాడుకు రావాల్సిన రూ.2152 కోట్ల సమగ్రశిక్షాఅభియాన్‌ నిధులు నిలిపివేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ ఇప్పటికే హెచ్చరించారు. ప్రదాన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం స్టాలిన్‌ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. ఈ లేఖపై ప్రదాన్‌ తిరిగి స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలు వదిలేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు.ఈ విషయమై తాజాగా ప్రధాని మోదీ కూడా పరోక్షంగా స్పందించారు. దేశంలో భాషల పట్ల శత్రుత్వం సృష్టించొద్దని కోరారు.

Donald Trump says Putin and Zelenskyy get together4
పుతిన్‌, జెలెన్‌స్కీ కలిసిపోవాలి: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం ముగియాలంటే జెలెన్‌ స్కీ, పుతిన్‌ కలిసిపోవాలని సూచించారు. ఇదే సమయంలో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు ట్రంప్‌.రష్యా-ఉక్రెయిన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. తాజాగా ట్రంప్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య నేను కాల్పల విరమణను చూడాలనుకుంటున్నాను. ఆ ఒప్పందాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికైనా యుద్ధం ఆపాలని కోరుకుంటున్నాను. కీవ్‌, మాస్కో మధ్య యుద్ధం ఆగిపోవాలంటే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కలవాల్సిన అవసరం ఉంది. రెండు దేశాల్లో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నాం కాబట్టి అది జరిగి తీరాలన్నారు.#WATCH | Washington | On the Russia-Ukraine conflict, US President Donald Trump says, "President Putin and President Zelenskyy have to get together because we want to stop the war and stop killing millions of people... I want to see a ceasefire, and I want to get the deal done...… pic.twitter.com/404opUoyGl— ANI (@ANI) February 21, 2025అలాగే, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అమెరికాను పెద్దగా ప్రభావితం చేయదు. కానీ, యూరప్‌ను ప్రభావితం చేస్తోంది. యుద్ధం కారణంగా అమెరికా భారీగా సాయం($300 బిలియన్ల) అందించింది. యూరప్‌ కూడా పెద్ద మొత్తంలో సాయం($100 బిలియన్ల) చేయాల్సి వచ్చింది. బైడెన్ వారికి డబ్బు ఇచ్చారని అన్నారు. ఇదే సమయంలో, ఖనిజ నిక్షేపాల్లో వాషింగ్టన్‌కు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్‌ త్వరలోనే అంగీకారం తెలిపే అవకాశం ఉందని వెల్లడించారు.మరోవైపు.. ట్రంప్‌ ఇప్పటికే జెలెన్‌స్కీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్‌ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని జెలెన్‌స్కీ యుద్ధం వరకూ తీసుకొచ్చారని నిందించారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలుకావడానికి ముందే సంధి చేసుకొని ఉండాల్సిందని అన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

Young Boy Arnav Lift Accident In Hyderabad Nampally5
HYD: లిఫ్టు ప్రమాదం.. విషమంగా అర్ణవ్‌ ఆరోగ్య పరిస్థితి!

సాక్షి, నాంపల్లి: ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్‌ లిఫ్టులో ఇరుక్కుపోయిన అర్ణవ్‌(6) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బాలుడికి నిలోఫర్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో పొత్తి కడుపు నలిగిపోయినట్టు వైద్యులు తెలిపారు. అలాగే, ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ అయినట్టు వైద్యులు చెప్పారు. నిన్న ఆసుపత్రిలో చేర్చిన వెంటనే లాపోరేటరీ సర్జరీ చేసినట్టు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని ఆగాపుర గోడేకిఖబర్‌ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్‌ ప్రైవేట్‌ హెల్త్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు అర్ణవ్‌(6).. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తన తాతతో కలిసి రెడ్‌హిల్స్‌ శాంతినగర్‌ పార్కు ఎదురుగా ఉన్న మఫర్‌ కంఫర్ట్‌ అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాతా, మనవడు లగేజీతో లిఫ్టు ముందు నిలబడ్డారు. కిందికి వచ్చిన లిఫ్టు లోపలికి మొదట బాలుడు వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టాడు. మిగిలిన లగేజీని తెచ్చేందుకు అతడు మళ్లీ లిఫ్టు బయటికి వెళ్లాడు.అంతలోనే అర్ణవ్‌ బటన్‌ నొక్కాడు. అంతే.. క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్‌ తెరిచే ఉండటంతో బయపడ్డ బాలుడు లిఫ్టు నుంచి దూకాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, స్లాబ్‌ గోడకు మధ్యలోని సందులో ఇరుక్కుపోయాడు. అప్పటికే లిఫ్టు.. మొదటి ఫ్లోర్‌ స్లాబ్‌ వద్దకు చేరుకుని నిలిచిపోయింది. అందులో ఇరుక్కున్న అర్ణవ్‌ గట్టిగా అరిచాడు. అపార్ట్‌మెంట్‌లోని వారంతా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌ అప్పలనాయుడు ఫైర్‌ సిబ్బందికి, హైడ్రా డీఆర్‌ఎఫ్‌ బలగాలను రప్పించారు.రెండు గంటల పోరాటం..మొదట గ్యాస్‌కటర్‌తో లిఫ్టు గ్రిల్స్‌ను తొలగించే ప్రయత్నం చేసినా.. బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి లిఫ్టు గోడలను బద్దలుకొట్టారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అతికష్టమ్మీద బాలుడిని బయటికి తీశారు. నడుము, కడుపు భాగానికి తీవ్ర గాయాలై.. అపస్మారకస్థితికి చేరిన బాలుడికి 108 వైద్య బృందం ఆక్సిజన్‌ అందించి.. అనంతరం నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించింది. బాలుడికి ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి విషమంగానే ఉందని నిలోఫర్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.లిఫ్టు పని తీరుపై అనుమానాలు.. శాంతినగర్‌ కాలనీలోని మఫర్‌ కంఫర్టెక్‌ అపార్ట్‌మెంట్‌ మొత్తం నాలుగు అంతస్తులు ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ను మఫర్‌ అనే సంస్థ నిర్మించి గ్రిల్స్‌తో కూడిన లిఫ్టును ఏర్పాటు చేసింది. ఎక్కడైనా గ్రిల్స్‌ మూస్తేనే లిప్ట్‌ పైకి కదులుతుంది. కానీ ఇక్కడి లిఫ్టు గ్రిల్స్‌ వేయకుండానే, కేవలం బటన్‌ నొక్కగానే పైకి కదిలింది. ఇలా లిఫ్టు పని చేయడంతోనే బాలుడు ఇరుక్కుపోవడానికి కారణమైందని భావిస్తున్నారు.

Shikhar Dhawan Spotted With Mystery Woman At Champions Trophy 20256
మిస్టరీ గర్ల్‌తో శిఖర్‌ ధవన్‌.. సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్న ఫోటోలు

టీమిండియా మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (Shikhar Dhawan) ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి (Champions Trophy 2025) అఫీషియల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఫిబ్రవరి 20న దుబాయ్‌లో జరిగిన భారత్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు హాజరయ్యాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు టీమిండియా క్రికెటర్లతో కలియ తిరిగిన ధవన్‌.. ఆతర్వాత వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించాడు. Who is this lady with Shikhar Dhawan?🥲 #ShikharDhawan #IndvsBan #RohitSharma𓃵 #ChampionsTrophy pic.twitter.com/JqFTeY4kAp— lei 🌼 (@sakshimadik03) February 20, 2025ఆ సమయంలో ధవన్‌ పక్కనే ఓ విదేశీ యువతి తారసపడింది. ధవన్‌.. సదరు విదేశీ యువతి పక్కపక్కనే కూర్చున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ధనవ్‌ కొత్త అమ్మాయితో డేటింగ్‌ చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. Hahahha such a cute video 😆😆😆 #ShikharDhawan pic.twitter.com/P0PSrC9ydc— Prernaa (@theprernaa) February 21, 2025ఇంతకీ ఆ విదేశీ అమ్మాయి ఎవరని ఆరా తీయగా.. ఆమె పేరు సోఫీ షైన్‌ అని తెలిసింది. ఐర్లాండ్‌కు చెందిన ఈ యువతిని ధవన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో​ కూడా చేస్తున్నట్లు బయటపడింది. దీంతో సోఫీ, ధవన్‌ మధ్య ఏదో నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ధవన్‌ కొద్ది రోజుల కిందట ఇదే యువతితో ఎయిర్‌పోర్ట్‌లో కూడా కనిపించాడని అంటున్నారు.కాగా, 39 ఏళ్ల ధవన్‌.. తన మాజీ భార్య, ఆసీస్‌ పౌరురాలైన అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. ధవన్‌, ఆయేషాకు జోరావర్‌ అనే కుమారుడు ఉన్నాడు. అయేషాతో విడిపోయాక ధవన్‌ ఎక్కువగా తన కుమారుడి గురించి సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నాడు. అయేషా.. బిడ్డను తనతో కలువనివ్వట్లేదని ధవన్‌ పలు సందర్భాల్లో వాపోయాడు. ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాక ధవన్‌ ప్రస్తుతం పలు ప్రైవేట్‌ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ధవన్‌ ఇటీవలే నేపాల్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడాడు. ధవన్‌ 2012లో అయేషాను పెళ్లాడాడు. వీరిద్దరికి సోషల్‌మీడియాలో పరిచయం ఏర్పడింది. అయేషా ధవన్‌ కంటే పదేళ్లు పెద్దది. ధవన్‌తో పెళ్లి కాక ముందే అయేషాకు వేరే వ్యక్తితో వివాహమైంది. అయేషా ఆ వ్యక్తితో ఇద్దరు కుమార్తెలను కనింది. అయేషా మాజీ కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. తౌహిద్‌ హృదయ్‌ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్‌ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్‌కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్‌మన్‌ గిల్‌ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్‌ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్‌ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్‌ రాహుల్‌ (41 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ టోర్నీలో భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది.

Sakshi interview with sugali preethi mother7
ఎనిమిదేళ్లు గడిచినా నా బిడ్డకు న్యాయం చేయరా?

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై నిందితులు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హతమార్చి 8 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకూ న్యాయం జరగలేదు. ఈ కూటమి ప్రభు­త్వం ముంబై నటి జత్వానీ కేసుపై పెట్టిన శ్రద్ధను సుగాలి ప్రీతి కేసులో చూపిస్తే మాకు ఎప్పుడో న్యాయం జరిగేది. మమ్మల్ని చంపేయడం మిన­హా.. కేసును నీరుగార్చేందుకు ఎన్ని రకాలుగా ప్రలో­భపెట్టాలో, హింసించారో అన్ని రకాలుగా చేశారు. ‘న్యాయం’ చేయమని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, హోంమంత్రి అనితను అర్థించినా ఫలితం లేదు. ఈ కేసును సీబీఐతో విచారించేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయాలి’ అని బాధితురాలు సుగాలి ప్రీతి తల్లి పార్వ­తీదేవి డిమాండ్‌ చేశారు. సుగాలి ప్రీతి కేసును విచారణకు స్వీకరించేందుకు విముఖత వ్యక్తం చేస్తూ సీబీఐ తరఫు న్యాయవాదులు ఈ నెల 12న హైకోర్టుకు లిఖితపూర్వకంగా నివేదించిన నేపథ్యంలో పార్వతీదేవి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన కుమార్తె హత్యోదంతం, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. వ్యవస్థలు నిర్వీర్యం.. 2017లో చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. నా బిడ్డ 14 ఏళ్ల ప్రీతిపై లైంగిక దాడికి పాల్పడి హాస్టల్‌లో చంపేశారు. ఆర్థికంగా అత్యంత బలవంతులైన నేరస్తులకు రాజకీయ పార్టీల అండదండలున్నాయి. పోక్సో కేసులో 90 రోజులు బెయి­ల్‌ రాకూడదు. కానీ 8 రోజుల్లోనే బెయిల్‌ వచ్చిందంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయ్యాయో, వారు ఎంత బలవంతులో అర్థమవుతోంది. ఈ కేసు­ను నిర్వీర్యం చేయడం వెనుక పోలీసుల నుంచి ఐఏ­ఎస్, ఐపీఎస్‌ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. 2017లో అప్పటి ప్రభుత్వం మాకు న్యా­య­ం చేయలేదు. హక్కుగా రావల్సిన రూ.­8,12,­500 మాత్రమే ఇచ్చారు. మాకు న్యాయం చేయాలని, ఏ గిరిజన బాలికకూ ఇలా అన్యాయం జరగకూడదని అప్పటి నుంచి నుంచి మేం పోరాడుతున్నాం. సీబీఐతో ఎందుకు విచారించలేదు? చంద్రబాబు హయాంలో 2017 నుంచి 2019 వరకూ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అప్పటి విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పాదయాత్రలో కలిసి కేసు గురించి వివరించడంతో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో 2019లో హైకోర్టులో కేసు వేశాం. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక 2020లో కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన్ను కలసి సీబీఐతో విచారణ చేయించాలని కోరడంతో సానుకూలంగా స్పందించారు. జగన్‌ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. 2021లో కర్నూలు సిటీలో ఐదు సెంట్ల స్థలం, 5 ఎకరాల పొలంతో పాటు నా భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత సీబీఐ స్పందించకపోవడంతో ఢిల్లీ వెళ్లి అధికారులను కలిశాం. ఆ తర్వాత జీవోను అమలు చేయాలని హై­కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాం. కేసును ఎందుకు విచా­ర­ణకు తీసుకోలేదని సీబీఐపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. దీంతో ఈ కేసును స్వీకరించేందుకు తగిన వనరులు లేవని, అయినా ఇది సీబీఐ పరిశోధించేంత సున్నితమైనది కాదని, స్థానిక పోలీసులే తేల్చవచ్చు’ అని ఈ నెల 12న హైకోర్టుకు వారి న్యాయవాది చెప్పారు. దీనిపై మేం కౌంటర్‌ దాఖలు చేస్తాం.డిప్యూటీ సీఎం, హోంమంత్రిని కలిసినా..పవన్‌ కళ్యాణ్‌ గతంలో కర్నూలులో ర్యాలీ నిర్వహించినప్పుడు మమ్మల్ని పరామర్శించి న్యాయం చేస్తామన్నారు. డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత 2024 జూలై 27న మరోసారి కలిశాం. ఆయన సూచన మేరకు హోంమంత్రి వద్దకు వెళ్లగా సీబీఐతో కాకుండా సీఐడీతో విచారణ చేయిస్తామన్నారు. అయితే ఈ కేసులో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కూడా ఉన్నందున విచారణ అధికారులుగా సీనియర్లను నియమించాలని కోరాం. అనంతరం కేసును విచారణకు స్వీకరిస్తామంటూ కర్నూలు సీఐడీ ఆఫీసు నుంచి మాకు నోటీసు వచ్చింది. అయితే ఇందులో ‘పెద్దల ప్రమేయాన్ని’ మీరు తేల్చలేరని, ఐపీఎస్‌లను మీరెలా విచారిస్తారని, ఉన్నతాధికారులైతేనే మేం విచారణకు సిద్ధమని చెప్పాం. డీఎస్పీ స్థాయిలో అయితే సీఐడీ విచారణ వద్దు అని లిఖిత పూర్వకంగా తెలియచేశాం.జత్వానీ, ప్రీతి కేసుల్లో ఏది తీవ్రమైంది?ముంబై నటి జత్వానీని వేధించారని ఈ ప్రభుత్వం వచ్చాక కేసు పెట్టారు. ఆవిడ ప్రాణాలతోనే ఉంది. కానీ సుగాలి ప్రీతి 14 ఏళ్ల బాలిక. ఘోరంగా అత్యాచారం చేసి చంపారు. నా బిడ్డ ప్రాణాలతో లేదు. జత్వానీ కేసులో ఈ ప్రభుత్వం ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేసి అత్యంత ప్రాధాన్యత కేసుగా విచారిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన ఓ గిరిజన బాలిక కేసును ఇంతే సీరియస్‌గా ఎందుకు తీసుకోవడం లేదు? ఈ కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని, ‘వై’ క్రోమోజోమ్‌ గుర్తించామని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు కూడా నిర్ధారించాయి. కానీ ఇలాంటి కేసును సీబీఐతో విచారణ చేయించడం లేదు. కూటమి ప్రభుత్వం జత్వానీ కేసుపై పెట్టిన శ్రద్ధను సుగాలి ప్రీతి కేసులో పెట్టి ఉంటే మాకు ఎప్పుడో న్యాయం జరిగేది’ అని పార్వతీ ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వడం, న్యాయం చేయడం రెండు వేర్వేరు అంశాలని, ఈ కేసులో న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

Today Gold And Silver Price On 22nd February 20258
ఒకటి తగ్గింది.. ఇంకొకటి పెరిగింది: ఇదీ బంగారం ధరల పరిస్థితి

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (ఫిబ్రవరి 221) బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. గోల్డ్ రేటు ఎక్కడ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే..➤హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,770 వద్ద ఉన్నాయి. భాగ్యనగరంలో నేడు 22 క్యారెట్ గోల్డ్ పెరిగింది. 24 క్యారెట్ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.➤విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,7770 వద్ద ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ రేటు వరుసగా రూ. 200, రూ. 20 పెరిగింది. ముంబైలో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి.➤చెన్నైలో కూడా పసిడి రేటు కొంత పెరిగింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 8,7770 వద్దకు చేరింది.➤బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 8,7770 వద్ద ఉంది.➤దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేటు ఓ మోస్తరుగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 300 పెరిగి రూ. 80,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 370 పెరిగి రూ. 87,920 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నప్పటికీ.. వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉండి, నేడు (శనివారం) రూ. 900 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 100 పెరిగి.. మళ్ళీ యధాస్థానానికే (రూ.1,00,500) చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Chiranjeevi And Rani Mukerji Will Be Work This Movie9
బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌కు 'మెగా' ఆఫర్‌

'భోళాశంకర్' పరాజయం తర్వాత చిరంజీవి చాలా సినిమాలను లైన్‌లో పెట్టారు. ముఖ్యంగా యంగ్​ డైరెక్టర్స్​ కథలను ఎక్కువగా వింటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశ్వంభరతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే, దసరా మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్‌లో ఒకప్పుడు అందాలభామగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్‌ చిరుతో క్రేజీ కాంబోను హీరో నాని సెట్‌ చేశారని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి సమర్పకుడిగా నాని వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి హీరో నాని ట్విటర్‌(ఎక్స్) వేదికగా గతంలో పంచుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆయన షేర్ చేశారు. చేతులకు రక్తం కారుతున్న పోస్టర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌లో హైప్‌ పెంచారు. అయితే, ఈ మూవీలో చిరు సరసన నటించే హీరోయిన్‌ పాత్ర కథకు చాలా ప్రాముఖ్యతను ఇస్తుందట. ఆ పాత్రకు రాణీ ముఖర్జీ అయితే సెట్‌ అవుతుందని దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల అన్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిరుతో చెప్పగా.. ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. తన వయసుకు తగ్గట్టు సరిజోడీగా రాణీ ముఖర్జీ మంచి సెలక్షన్‌ అని చిరు కూడా అన్నారట. ఇదే వార్త బాలీవుడ్‌ సర్కిల్‌లో ట్రెండ్‌ అవుతుంది.

What is sleep divorce is it healthy; check details inside10
Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!

కాలం మారుతోంది, మారుతోన్న కాలంతో పాటు సాంకేతికతా మారుతోంది. అయితే ఇదే తరుణంలో మనుషుల ఆలోచన ధోరణి మరింతగా మారుతోంది. దైనందిన వ్యవహారాలలో చిత్రవిచిత్రమైన పోకడలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అనేవిధమైన అలవాట్లు, పద్ధతులు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ట్రెండ్‌ వేగంగా విస్తరిస్తోంది. అదే స్లీపింగ్‌ డివోర్స్‌. విడాకుల గురించి అందరికీ తెలుసు. మరి ఈ నిద్ర విడాకులు ఏంటనేగా సందేహం. అయితే ఈ కథనంలోకి వెళ్లవలసిందే! ప్రస్తుతం సమాజంలో నిద్ర విషయంలో ఒక కొత్త ట్రెండు మొదలైంది. మనుషుల ఆలోచన ధోరణి మారడంతో స్లీపింగ్‌ డివోర్స్‌ ఇప్పుడు కుటుంబాలలో ఒక భాగంగా మారింది. అంటే నిద్ర విడాకులు.. అంటే మరేంటో కాదు... రాత్రిపూట నిద్రపోయే సమయంలో భార్యాభర్తలు విడివిడిగా వేరువేరు గదుల్లో పడుకుని ఎవరికి వారు హాయిగా నిద్రపోతారు. తెల్లవారి లేచిన తర్వాత మళ్లీ ఇంట్లో కలిసి ఉంటారు. దీనినే స్లీపింగ్‌ డివోర్స్‌ అంటారు.రాత్రి పడుకున్న తర్వాత ఒకరు స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తూ ఉండడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు గట్టిగా హత్తుకుని పడుకోవడం లాంటి సమస్యలకు పరిష్కారంగా చాలా జంటలు స్లీపింగ్‌ డైవర్స్‌ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ స్లీపింగ్‌ డివోర్స్‌తో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే.. లాభనష్టాలు రెండూ ఉంటాయి!దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే వారు కలిసి పడుకుంటేనే మంచిదని మానసిక వైద్య నిపుణులంటారు. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే విడివిడిగా పడుకోవడమే మంచిదని చెబుతున్నారు. వివాహబంధాన్ని కాపాడుకోవడానికే ఈ ట్రెండు ఫాలో అవుతున్నట్టు చెబుతున్నారు. ఎవరి వెర్షన్‌ వారిదే... నిద్ర అసమానతలతో ఇద్దరు ఒకేచోట పడుకుని రోజూ కీచులాడుకునే కంటే, విడివిడిగా పడుకొని మిగతా సమయాలలో కలిసి ఉండటం ఉత్తమమని కొందరు చెబుతున్నారు. అయితే ఇలా భార్యాభర్తలు విడివిడిగా పడుకోవడం వల్ల వారి మధ్య బంధం బలహీనంగా మారుతుందని, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం తగ్గుతుందని కొందరు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా స్లీపింగ్‌ డివోర్స్‌ విషయంలో ఎవరి వర్షన్‌ వాళ్ళది.. ఎవరైనా సరే హాయిగా నిద్రపోవడమే ముఖ్యమని చెబుతూ ఉండడం గమనార్హం. పైగా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్లు చెబుతుండడం గమనార్హం. ఒకే బెడ్‌పై కలిసి పడుకోవాల్సిన కపుల్స్‌.. వేరువేరు గదుల్లో పడుకోవడం లేదా, వేరు వేరు మంచాలపై పడుకోవడం వల్ల ఎవరూ నష్టపోయే పని ఏం ఉండదని కొందరి వాదన. కలిసి పడుకునే సమయంలో వచ్చే గురక, దుప్పటిని ఇద్దరు పంచుకోవడం, ఇద్దరిలో ఒకరు స్మార్ట్‌ఫోన్‌ వాడడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు హత్తుకోవడం ఇలా ఎన్నో సమస్యలకు చెక్‌ పెట్టేందుకే నిద్ర విడాకులు విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే, ఇలా విడివిడిగా నిద్రించడంతో కంటినిండా నిద్రపట్టి మరుసటి రోజు మరింత యాక్టివ్‌గా టూర్‌లో పాల్గొన్నట్టు అనేక మంది చెప్పుకొచ్చారు. ఈ స్లీప్‌ డివోర్స్‌ కారణంగా లాభనష్టాలు రెండూ ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకేచోట ఇష్టం లేకుండా కలిసి పడుకోవడం వల్ల బంధాలు బీటలు వారేకంటే విడివిడిగా ఉంటూ సంతోషంగా ఉండడమే బెటర్‌ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీర్ఘకాలంగా జంటలు కలిసి నిద్రించకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంధం బలోపేతంగా ఉండాలంటే కచ్చితంగా కపుల్స్‌ కలిసి పడుకోవాలని సూచిస్తున్నారు. భాగస్వాములు ఇద్దరి నిద్రలో ఉండే అసమానతల కారణంగా ఒకరివల్ల మరొకరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఈ స్లీపింగ్‌ డైవర్స్‌ ట్రెండును ఫాలో అవుతున్నారు. ఎవరికి వారు ప్రశాంతంగా సుఖంగా నిద్ర΄ోవడానికి విడివిడి గదులను లేదా విడివిడి పడకలను ఎంచుకుంటున్నారు. అన్నింటికీ మించి భార్యాభర్తల మధ్య గురక సమస్య...భాగస్వాముల నిద్రలో అసమానతలే కారణం. పురుషుల్లో 45 శాతం మంది భాగస్వామికి దూరంగా విడిగా పడుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. అయితే, మహిళల్లో మాత్రం కేవలం 25 శాతం మందే ఇందుకు సుముఖంగా ఉన్నట్టు పరిశోధకుల అంచనా. ఇదీ చదవండి: ఒక్క సోలార్‌ బోట్‌ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!ఇటీవల హిల్టన్‌ ట్రెండ్స్‌ పేరిట విడుదలైన ఓ నివేదికలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ నివేదిక ప్రకారం, రోజుల తరబడి టూర్లకు వెళ్లే జంటల్లో ఏకంగా 63 శాతం మంది ఒంటరిగా నిద్రించేందుకే మొగ్గు చూపుతున్నారట. అంతేకాకుండా ఇలా చేస్తే కంటినిండా నిద్ర పట్టిందని, మరుసటి రోజు టూర్‌ను బాగా ఎంజాయ్‌ చేశామని చెబుతున్నారు. ఇక పిల్లాజల్లాతో వెళ్లేవాళ్లు కూడా తమ బిడ్డల్ని వేరే గదిలో నిద్రపుచ్చేందుకే మొగ్గు చూపుతున్నారట. ఈ ట్రెండ్‌పై అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ స్లీప్‌ మెడిసిన్‌ కూడా దృష్టి సారించింది. కమ్మటి నిద్రకోసమే తాము విడివిడిగా పడుకున్నట్టు అనేక జంటలు చెప్పారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement