Acer Swift 7
-
ప్రపంచంలోనే అతి సన్నని ల్యాప్టాప్ లాంచ్
ఏసెర్ ప్రపంచంలోనే పలుచనైన ల్యాప్టాప్ను సీఈఎస్ 2018లో లాంచ్ చేసింది. కేవలం 9.98 మి.మి మందంతో అల్ట్రాపోర్టబుల్ ల్యాప్ట్యాప్ను స్విఫ్ట్ 7 పేరుతో ప్రవేశపెట్టింది. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ తో దీన్ని విడుదల చేసింది. వినియోగదారులు సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లే సౌలభ్యంతో దీన్నిరూపొందించింది. ముఖ్యంగా దీర్ఘ-దూర అంతర్జాతీయ విమానాలు లేదా రైలు ప్రయాణాల సందర్భంగా అతి తక్కువ-కాంతి పరిస్థితులలో కూడా బ్యాక్ లిట్ కీబోర్డుతో పనిచేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. సుమారు రూ. 1,07,470 (1699 డాలర్లు)ధరలో మార్చి ఆరంభంనుంచి నార్త్ అమెరికాలో అందుబాటులోకి రానుంది. అనంతరం ఏప్రిల్నుంచి సుమారు రూ .1,29,329ధరలో మిగతా దేశాల్లో లభ్యమవుతుంది. ప్రపంచంలోనే అతి సన్నని ల్యాప్ట్యాప్ను తయారుచేసినందుకు తాము గర్వపడుతున్నామని యాసెర్ ఇంక్ ఐటీ ప్రోడక్ట్స్ ప్రెసిడెంట్ జెర్రీ కాయో చెప్పారు. శక్తివంతమైన ప్రదర్శనతో నిపుణుల కోసం రూపొందించినట్టు తెలిపారు. విండోస్ 10, 7వ జనరేషన్ ఇంటెల్కోర్ ప్రాసెసర్తో రూపొందించిన ఈ ల్యాప్ట్యాప్ సింగిల్ చార్జ్తో 10గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. అల్యూమినియం బాడీ డిజైన్, గొరిల్లా గ్లాస్, ఎన్బీటీ టచ్ స్క్రీన్ అండ్ టచ్ ప్యాడ్, 256 స్టోరేజ్ కెపాసిటీ, 8 జీబీ ర్యామ్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటివి ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. దీంతోపాటు స్పిన్ 3 డివైస్ను లాంచ్ చేయనున్నట్టు కూడా ప్రకటించింది. కొత్త స్పిన్ 3 ను 8 వ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్, ఐసీఎస్ టెక్నాలజీ, తో 14 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే , రెండు ఫ్రంట్-ఫేసింగ్ స్పీకర్లు, ఏసెర్ ట్రూ హార్మోనీ టెక్నాలజీ లాంటి ఫీచర్లతో మరింత శక్తివంతంగా రూపొందిస్తోందట. టాబ్లెట్ స్పేస్-డెవలప్మెంట్ టెంట్ మోడ్తో అందివ్వనుంది. -
ప్రపంచంలో అతి పలుచని ల్యాప్టాప్
♦ ఏసర్ స్విఫ్ట్-7 అక్టోబరులో భారత్కు ♦ భారత్ కోసం ప్రత్యేక స్మార్ట్ఫోన్లు ♦ సాక్షితో ఏసర్ సీనియర్ డెరైక్టర్ చంద్రహాస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : టెక్నాలజీ కంపెనీ ఏసర్ అక్టోబరు తొలి వారంలో స్విఫ్ట్-7 ల్యాప్టాప్ను భారత్లో విడుదల చేస్తోంది. 9.98 మిల్లీ మీటర్ల మందంతో తయారైన ఈ ల్యాప్టాప్ ప్రపంచంలో అతి పలుచనిది. ఈ నెల తొలి వారంలో బెర్లిన్లో జరిగిన ఐఎఫ్ఏ-2016 టెక్నాలజీ షోలో కంపెనీ దీనిని ఆవిష్కరించింది. భారత్లో ధర రూ.85,000 నుంచి రూ.1 లక్ష మధ్య ఉండే అవకాశం ఉంది. 13.3 అంగుళాల స్క్రీన్, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ, 9 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లున్నాయి. యూఎస్బీ టైప్-సి పోర్టులు రెండు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో తొలిసారిగా కర్వ్డ్ డిస్ప్లేతో ప్రిడేటర్ 21 ఎక్స్ గేమింగ్ ల్యాప్టాప్ను సైతం కంపెనీ ఐఎఫ్ఏ-2016 టెక్నాలజీ షోలో ఆవిష్కరించింది. ఈ ఏడాదే ఇది ఇక్కడి మార్కెట్లో అడుగు పెట్టనుంది. స్మార్ట్ఫోన్లపై ఫోకస్.. ప్రస్తుతం ఏసర్ భారత్లో రెండు స్మార్ట్ఫోన్ మోడళ్లను విక్రయిస్తోంది. విభిన్న ఫీచర్లతో ఈ ఏడాదే మరిన్ని మోడళ్లు రానున్నాయని ఏసర్ ఇండియా కంజ్యూమర్ బిజినెస్ సీనియర్ డెరైక్టర్ చంద్రహాస్ పాణిగ్రాహి తెలిపారు. కంప్యూటర్ మాల్ ఏర్పాటు చేసిన ఏసర్ ఎక్స్క్లూజివ్ స్టోర్ను ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. స్మార్ట్ఫోన్లపైనా పెద్ద ఎత్తున దృష్టిసారించనున్నట్టు చెప్పారు. భారత మార్కెట్ కోసం ప్రత్యేక మోడళ్లు తీసుకు వచ్చే విషయమై బోర్డు స్థాయిలో చర్చిస్తున్నట్టు వివరించారు. ఇక ఏసర్ ఎక్స్క్లూజివ్ స్టోర్లు దేశవ్యాప్తంగా 90 ఉన్నాయి. వీటిని 2017 డిసెంబరుకల్లా 200లకు చేర్చనుంది. ప్రస్తుతం హైదరాబాద్లో 3, తెలంగాణలో 10 ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లను కంపెనీ నిర్వహిస్తోంది. ల్యాప్టాప్ల తయారీ.. పాండిచ్చేరిలో ఉన్న ప్లాంట్లో డెస్క్టాప్లు, స్మార్ట్ఫోన్లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి విదేశాల్లో ఉన్న ప్లాంటు నుంచి భారత్కు ల్యాప్టాప్లను దిగుమతి చేస్తున్నారు. ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలు అందిస్తే ల్యాప్టాప్ల తయారీని దేశీయంగా చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్టు చంద్రహాస్ వెల్లడించారు. పర్సనల్ కంప్యూటర్ మార్కెట్లో దేశంలో ఏటా 90 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఈ రంగంలో ఏసర్కు 15% మార్కెట్ వాటా ఉంది. కంపెనీ ఏటా 20% వృద్ధి చెందుతోంది. డిటాచేబుల్, కన్వర్టబుల్, గేమింగ్ విభాగంలో పీసీలకు డిమాండ్ పెరుగుతోందని కంపెనీ తెలిపింది. 2016-17లో పీసీ మార్కెట్ నిలకడైన వృద్ధిని నమోదు చేస్తుందని ఏసర్ అంచనా వేస్తోంది. పీసీల అమ్మకాల్లో ఆఫ్లైన్ వాటా 84 శాతంగా ఉంది. సర్వీసింగ్, గెడైన్స్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆఫ్లైన్ వైపే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని కంపెనీ అంటోంది.