Adilabad District News
-
రంజాన్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
కై లాస్నగర్: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించా రు. మార్చి 2నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈమేరకు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మసీదులు, ఈద్గాల వద్ద నీటి వసతి, వీధి దీపాలు, నిరంతర విద్యుత్ సౌకర్యం వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. రంజాన్ మాసంలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు దృష్టిలో ఉంచుకుని వారికి ఉద్యోగ సమయాల్లో ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు మార్చి 2 నుంచి 31వరకు సాయంత్రం 4గంటలకే విధులు ముగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎస్పీ జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ఇచ్చోడ: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. గుడిహత్నూర్, ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుక్రవా రం ఆయన తనిఖీ చేశారు. గుడిహత్నూర్ పీ హెచ్సీలో ఫార్మాసిస్టు సకాలంలో విధులకు హాజరు కానందున మెమో జారీ చేశారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించాలన్నారు. ఇచ్చోడ పీహెచ్సీలో స్టాక్ రిజిస్టర్ నమోదు సరి గా లేనందున ఫార్మాసిస్టుపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్సీడీ, సికిల్సెల్ స్క్రీనింగ్ మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట ఎన్సీడీ అధికారి శ్రీధర్ ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్నగర్: నిజామాబాద్–కరీంనగర్–ఆదిలా బాద్–మెదక్ జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్కు జిల్లాలో ప కడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈసీ మార్గదర్శకాల ప్రకారం చ ర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అవసరమైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. షామియానాలు, తాగునీరు, వీల్చైర్ వంటి వసతులతో పాటు, ప్రతి కేంద్రంలో వైద్య సి బ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో సాగేలా చర్యలు చేపట్టామన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా బ్యాలెట్ బాక్సులను కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు చేర్చేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎస్పీ జీవన్రెడ్డి, ఆర్డీవో వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారులకు సన్మానం
ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటడం అభినందనీయమని డీసీసీబీ చైర్మన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి అన్నా రు. ఇటీవల ఓయూలో నిర్వహించిన 11వ రా ష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ అండ్ త్రో స్ అండ్ జంప్స్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కా ర్యాలయంలో శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రస్థా యి పోటీల్లో జిల్లా అథ్లెట్లు 16 పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణం అని అన్నారు. ప్రతి భ గల క్రీడాకారులను అసోసియేషన్ తరఫున అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో కోచ్ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ఇచ్చోడ: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. గుడిహత్నూర్, ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుక్రవా రం ఆయన తనిఖీ చేశారు. గుడిహత్నూర్ పీ హెచ్సీలో ఫార్మాసిస్టు సకాలంలో విధులకు హాజరు కానందున మెమో జారీ చేశారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించాలన్నారు. ఇచ్చోడ పీహెచ్సీలో స్టాక్ రిజిస్టర్ నమోదు సరి గా లేనందున ఫార్మాసిస్టుపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్సీడీ, సికిల్సెల్ స్క్రీనింగ్ మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట ఎన్సీడీ అధికారి శ్రీధర్ ఉన్నారు. -
No Headline
పత్రాలు సరిగా లేక తిరస్కరణకు గురైనవి 3,145అందిన దరఖాస్తులు 22,369 ఫీజు చెల్లించాలని సమాచారం ఇచ్చినవి 3,197పట్టణంలోని మొత్తం ఎల్ఆర్ఎస్ బ్లాక్లు 08ఆమోదం తెలిపినవి 3,208 పత్రాలు అవసరమని నిర్ధారించినవి 3,180 ఫీజు చెల్లించినవి 118 ఇంకా పరిశీలించాల్సినవి 12,821 -
రంజాన్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
కై లాస్నగర్: ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించా రు. మార్చి 2నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈమేరకు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మసీదులు, ఈద్గాల వద్ద నీటి వసతి, వీధి దీపాలు, నిరంతర విద్యుత్ సౌకర్యం వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. రంజాన్ మాసంలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు దృష్టిలో ఉంచుకుని వారికి ఉద్యోగ సమయాల్లో ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు మార్చి 2 నుంచి 31వరకు సాయంత్రం 4గంటలకే విధులు ముగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎస్పీ జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో రైతు మృతి
తానూరు: అడవి జంతుల బారి నుంచి పంట రక్షించేందుకు ఏర్పాటు చేసిన రక్షణ కవచమే యమపాశమైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉమ్రి(కే) గ్రామానికి చెందిన కధం దత్తురాం (51), అంజనాబాయి దంపతులు. శుక్రవారం వారు కొందరు కూలీలతో కలిసి పంట చేను వద్దకు వెళ్లారు. దత్తురాం తాగునీరు తెచ్చేందుకు సమీపంలో ఉన్న పురుషోతం బోరుమోటారు వద్దకు వెళ్లాడు. నీరు పట్టుకునే క్రమంలో అడవి జంతుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగలి అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికులు గమనించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మల్లేశ్, ఎస్సై శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. నాగాపూర్లో కౌలు రైతు..పెంబి: విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతిచెందిన ఘటన మండలంలోని నాగాపూర్లో చోటుచేసుకుంది. ఎస్సై హన్మాండ్లు కథనం ప్రకారం.. నా గాపూర్కు చెందిన రాపెని మైసయ్య (47) గ్రామశివారులో మొక్కజొన్నను కౌలుకు తీసుకున్నాడు. శుక్రవారం పెద్ద కుమారుడు మహేశ్తో కలిసి మొక్కజొన్న చేను వద్దకు వెళ్లారు. అక్కడ విద్యుత్ బల్బు కోసం అమర్చిన జీ వైరుకు మైసయ్య చేతిలో ఉన్న కొడవలి తగిలి షాక్కు గురయ్యాడు. గమనించిన కుమారుడు తప్పించే ప్రయత్నం చేయగా తీవ్ర గాయాలయ్యాయి. మైసయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలైన మహేశ్ను స్థానికులు ఖానాపూర్కు తరలించారు. భార్య భీమక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. -
జిల్లా విద్యార్థినికి సాహిత్య పురస్కారం
ఆదిలాబాద్: జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన గీస శ్రీజ అక్షరయాన్ సాహిత్య పురస్కారానికి ఎంపికై ంది. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అక్షరయాన్, సీతాస్, అభిజ్ఞ భార త్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అందజేస్తు న్న ఈ పురస్కారానికి శ్రీజ ఎంపికై నట్లు నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మార్చి 2న మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ చేతుల మీదుగా పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీజ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. పురస్కారానికి ఎంపిక కావడంపై ఆమెకు పలు వురు అభినందనలు తెలిపారు. -
పూర్తిస్థాయిలో కందుల కొనుగోలుకు చర్యలు
● కలెక్టర్ రాజర్షి షాతాంసి: రైతులు పండించిన పంట దిగుబడులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కందుల కొనుగోళ్ల విషయంలో నిర్దేశిత నిబంధన సడలించాలని రైతుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులతో మాట్లాడి వివరా లు అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో ఉన్న కంది దిగుబడులను సైతం పరిశీలించారు. ముందుగా హస్నాపూర్ రైతు వేదికలో హస్నాపూర్, ఖోడద్ రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, ఈ ప్రాంతంలో నల్లరేగడి భూమి ఉండటం వలన కంది దిగుబడి ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు వస్తున్నట్లు రైతులు తెలిపారని అన్నా రు. రైతుల నుంచి సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఇందులో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి, మార్క్ఫెడ్ డీఎం ప్రవీణ్రెడ్డి, డీసీవో మోహన్, ఏవో రవీందర్, ఎంపీడీవో మోహన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి లావణ్య వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. పొచ్చరలో.. ఆదిలాబాద్రూరల్: మండలంలోని పొచ్చర గ్రా మంలోని కంది రైతులతో కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందో అడిగి తెలుసుకున్నారు. పంట కొనుగోలు పరిమితి పెంచే విషయంపై మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట వ్యవసాయ అధికారులు రైతులు, ఉన్నారు. -
‘ఇంటిగ్రేటెడ్’కు శ్రీకారం
● ఇక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ● అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున.. ● ఉమ్మడి జిల్లాలో 10 చోట్ల స్థలాల గుర్తింపు ● 2,500 మందికి విద్యనందించేలా సకల వసతులుకైలాస్నగర్:నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్స్థా యి విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కు శ్రీకారం చుట్టింది. ఒక్కోపాఠశాలలో2500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించాలని సంకల్పించింది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గానికో పాఠశాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈమేరకు అవసరమైన స్థలాలను గుర్తించాల్సింది గా కలెక్టర్లను ఆదేశించింది. ఇందులోభాగంగా రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్, ఉమ్మడి జిల్లా ప్ర త్యేకాధికారి కృష్ణ ఆదిత్య బుధవారం ఆదిలాబాద్కు చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో స్థలాల ఎంపికపై సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. వారి ఆదేశాలకు అనుగుణంగా పది నియోజకవర్గాల్లో ఆయా జల్లాల అధికారులు అవసరమైన స్థలాలను గుర్తించారు. వివరాలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర సర్కారు తదుపరి ఆదేశాలకు అనుగుణంగా పరిపాలన మంజూరు అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రూ.200 కోట్లతో భవనాల నిర్మాణం పేద విద్యార్థులకు ఈ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, నైపుణ్యశిక్షణ అందించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. తరగతి గదులు, వసతిగృహాలు, ఆట స్థలం వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఒక్కో పాఠశాలను 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అత్యాధునిక హంగులతో భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణాలను వచ్చే రెండేళ్లలో పూ ర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చే స్తున్నారు. అవసరమైన స్థలాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఇప్పటికే ఎంపిక చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుర్తించిన స్థలాల వివరాలు నియోజకవర్గం గుర్తించిన ప్రాంతం మండలంఆదిలాబాద్ నిషాన్ఘాట్ ఆదిలాబాద్రూరల్ బోథ్ అడెగామ ఇచ్చోడ ఖానాపూర్ పులిమడుగు ఉట్నూర్ నిర్మల్ సిర్గాపూర్ దిలావర్పూర్ ముథోల్ భైంసా భైంసా మంచిర్యాల రెబ్బెనపల్లి దండేపల్లి బెల్లంపల్లి గురుజాల బెల్లంపల్లి చెన్నూర్ సోమన్పల్లి చెన్నూర్ ఆసిఫాబాద్ ఇందాని వాంకిడి సిర్పూర్ చెడ్వాయి పెంచికల్పేట్ -
కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలి
ఆదిలాబాద్: కేంద్రంలోని ఎన్డీయే పాలనలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ అన్నారు. పట్టణంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులు అనేక పోరాటాలు, ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్లుగా తీసుకురావడం కార్మిక వర్గాన్ని మోసం చేయడమే అన్నారు. కేంద్రం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, ఈమేరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి దేవేందర్, కార్యవర్గ సభ్యులు కాంతారావు, ఉస్మాన్, గంగయ్య, రమణ, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. -
మిగిలింది.. ముగ్గురే!
సర్కారు బడి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఇక్కడ కనిపిస్తున్నది నేరడిగొండ మండలంలోని మారుమూల గ్రామమైన గోవింద్పూర్ ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల. ఒకప్పుడు ఈ బడి సుమారు 50 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులతో ఉండేది. ప్రైవేట్ పాఠశాలల ప్రభావంతో క్రమేణ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ మేరకు ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గింది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య మూడుకు చేరగా.. ఉపాధ్యాయుడు ఒక్కరే మిగిలారు. ఒకటో తరగతి చదివే ఈ ముగ్గురు చిన్నారులకు ఉపాధ్యాయుడు రవీందర్ నిత్యం ఇలా బోధిస్తున్నాడు. – నేరడిగొండ -
ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్నగర్: నిజామాబాద్–కరీంనగర్–ఆదిలా బాద్–మెదక్ జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్కు జిల్లాలో ప కడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈసీ మార్గదర్శకాల ప్రకారం చ ర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అవసరమైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. షామియానాలు, తాగునీరు, వీల్చైర్ వంటి వసతులతో పాటు, ప్రతి కేంద్రంలో వైద్య సి బ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో సాగేలా చర్యలు చేపట్టామన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా బ్యాలెట్ బాక్సులను కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు చేర్చేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎస్పీ జీవన్రెడ్డి, ఆర్డీవో వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
● కొత్త వాటికి కూడా అవకాశం ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● మార్చి 31వరకు 25శాతం రాయితీ ● వేలాది ప్లాట్లు సక్రమమయ్యే అవకాశం
కై లాస్నగర్: ప్లాట్ల క్రయ విక్రయాలు మందగించడం, నాలుగేళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన పెండింగ్లో ఉండటాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వేగవంతం చేసే దిశగా దృష్టి సారించింది. అలాగే అక్రమ లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లన్నింటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని వాటికి సైతం అవకాశం కల్పించడంతో పాటు ఈ మార్చి 31లోగా రెగ్యులరైజ్ చేసుకుంటే నిర్దేశిత ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వానికి సైతం భారీగా ఆదాయం సమకూరనుంది. అక్రమ ప్లాట్లన్నింటికీ అవకాశం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. 2020 ఆగస్టు 26వరకు రూ.1,000 చెల్లించి మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఇందులో అవకాశం కల్పించింది. వేలల్లో దరఖాస్తులు రావడం మున్సిపల్ టౌన్ప్లానింగ్లో వాటి పరిశీలనకు తగినంత సిబ్బంది లేకపోవడంతో ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది. దీన్ని గుర్తించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఎల్ఆర్ఎస్లో నిబంధనలను సడలించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, అక్రమ లేఅవుట్లలో పది శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయి మిగతా విక్రయించకుండా ఉన్న వాటికి సైతం ప్రస్తుతం అవకాశం కల్పించింది. పెండింగ్ రెగ్యులరైజేషన్ చార్జీలతో పాటు లేఅవుట్లో ఖాళీగా ఉన్న ప్లాట్ల విస్తీర్ణం ప్రకారం చార్జీలు ఉంటాయని పేర్కొంది. వాటి వివరాలను ప్రత్యేక ప్రొఫార్మాలో నమోదు చేసి పోర్టల్లో నమోదు చేయాలని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 25శాతం రాయితీతో వేగవంతం అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట వేయాలని భావించిన గత ప్రభుత్వం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటేనే ఆ లేవుట్లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించింది. దీంతో వందలాదిగా ఉన్న అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రయవిక్రయాలన్నీ నిలిచిపోయాయి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు 2020లో ఎల్ఆర్ఎస్ కోసం అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇటు ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు అటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నత్తనడకన సాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం తగినంత సిబ్బంది లేకపోవడమే. దీనిని గమనించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియ వేగవంతంతో పాటు అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణకు మరోసారి అవకాశం కల్పించింది. అలాగే మార్చి 31లోపు రెగ్యులరైజ్ చేసుకుంటే ఎల్ఆర్ఎస్ ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే వేలాదిగా ఉన్న అనధికార, అక్రమ ప్లాట్లు సక్రమం కానున్నాయి. అలాగే ప్రభుత్వ ఖజానాకు సైతం భారీగా ఆదాయం సమకూరనుంది. ఉత్తర్వులు అందాయిఎల్ఆర్ఎస్ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. అక్రమ లేఅవుట్లలోని రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లన్నింటినీ క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అలాగే మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే ఫీజులోనూ 25శాతం రాయితీ వర్తిస్తుంది. పట్టణవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సీవీఎన్.రాజు, మున్సిపల్ కమిషనర్ -
ఉద్యోగంతో ఊరట..
12ఏళ్లపాటు ప్రైవేట్ లెక్చరర్గా పనిచేశా. డీఎస్సీ 2008 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం వచ్చింది. కోర్టు కేసులో పడింది. అప్పటి నుంచి కోర్టు కేసులు, కలవని రాజకీయ నాయకులు లేరు. ఏదేమైనప్పటికీ ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం జరిగింది. ఉద్యోగం వచ్చిందనే సంతోషం ఉన్నా.. కాంట్రాక్టు బేసిక్లో టీచర్గా నియమించడం కొంత మేర నిరుత్సాహ పరిచింది. జీతం తక్కువ కావడం, మారుమూల ప్రాంత మండలాల్లో పోస్టింగ్లు ఇవ్వడంతో ట్రాన్స్పోర్టు ఇబ్బందిగా మారింది. – కమలాకర్, ఎంపీపీఎస్ ఎస్టీ కాలనీ ముల్కలపేట్, మం: వేమనపల్లి -
ఆటోలో నుంచి పడి వ్యక్తి మృతి
తానూరు: ఆటోలో నుంచి పడి వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని సింగన్గాం గ్రామానికి చెందిన ఎల్మె దిలీప్ (37) మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు. గురువారం పని నిమిత్తం తానూరుకు వచ్చాడు. పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్లేందుకు మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద ఆటోస్టాండ్కు వెళ్లాడు. అక్కడ ఆగి ఉన్న ఆటోలో పడుకున్నాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య మంగళబాయి ఫిర్యాదుతో శుక్రవారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. చికిత్సపొందుతూ ఒకరు.. ఆదిలాబాద్రూరల్: హెయిర్ కలర్ తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై విష్ణువర్ధన్ కథనం ప్రకారం.. మావల పోలీసుస్టేషన్ పరిధిలోని దస్నాపూర్ కాలనీకి చెందిన దామన్ విజయ్ (35) మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత మూడు నెలల నుంచి కూలీ పని రావడం లేదు. దీంతో ఇతరుల వద్ద రూ.2 లక్షల అప్పు చేశాడు. తీర్చే మార్గం లేక మనస్తాపం చెందాడు. ఈనెల 18న శంకర్గుట్టలో హెయిర్ కలర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి సోదరుడు చంద్రకాంత్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
మంచుకొండల్లో మనోడు
● హిమాలయాలను అధిరోహించిన నిర్మల్ యువకుడు ● 12,500 అడుగుల ట్రెకింగ్ చేసిన ఆదిత్య నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు హిమాలయ పర్వతాల్లోని కేదరికంఠ్్, సమ్మిట్ క్యాంప్ తదితర శిఖరాలను అధిరోహించాడు. జిల్లా కేంద్రంలోని బేస్తవార్పేట కాలనీకి చెందిన న్యాయవాది లక్కాకుల తుకారం కుమారుడు ఆదిత్య ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని ఎల్పీయూ కళాశాలలో ఎంసీఏ అభ్యసిస్తున్నాడు. ఈనెల 8న ఇతను వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 300 మందితో కలిసి మంచు కొండల్లోని హిమాలయ పర్వత శిఖరాలను అధిరోహించే ప్రయత్నం మొదలుపెట్టాడు. 12న దాదాపు 12,500 అడుగుల ఎత్తున ఉన్న సమ్మిట్ క్యాంప్నకు చేరుకున్నాడు. విపరీతమైన మంచు, ఎముకలు కొరికే చలి మధ్యన ఐదు రాత్రులపాటు శ్రమించి లక్ష్యాన్ని చేరుకున్న ట్లు తెలిపాడు. తెలంగాణ నుంచి 8 మంది వరకు లక్ష్యాన్ని చేరుకోగా ఇందులో నిర్మల్ జిల్లా వాసి ఉండడం విశేషం. ఆదిత్య గతంలోనూ బద్రీనాథ్, కేదరీనాథ్, వైష్ణోదేవి ఆలయాలను కాలినడకన సందర్శించారు. పర్వతారోహణ పూర్తయిన అనంతరం యూనివర్సల్ అడ్వెంచర్స్ వారితో ప్రత్యేక ధ్రువీకరణపత్రాన్ని స్వీకరించారు. రాబోయే రోజుల్లో ఎవరెస్టు శిఖరం ఎక్కడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. -
టవరెక్కి భర్త హల్చల్
● భార్య కాపురానికి రావడం లేదని.. ● ఉట్నూర్లో ఘటన ఉట్నూర్రూరల్: భార్య కాపురానికి రా వడం లేదని భర్త టవరెక్కి హల్చల్ చేశా డు. సీఐ మోగిలి కథ నం ప్రకారం..మండ ల కేంద్రానికి చెందిన షకీల్ ఆయన భార్య కు గతకొన్నినెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో కుమురం భీం జిల్లా కెరమెరి మండల కేంద్రంలోని పుట్టింటికి వెళ్లి తిరిగిరాలేదు. భార్య కాపురానికి రావడం లేదని ఆవేదన చెందిన షకీల్ మండల కేంద్రంలోని అంగడిబజార్లోని టవరెక్కి ఆందోళన చేశాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు అక్కడికి చేరుకుని అతనికి సర్ది చెప్పినా వినలేదు. భార్యను పిలిపించడంతో టవర్ నుంచి దిగివచ్చాడు. -
చాలా సంతోషంగా ఉంది
చిన్నప్పటి నుంచి టీచర్ ఉద్యోగం ఓ కల. డీఎస్సీ–2008లో టీచర్ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోవడంతో అప్పటి నుంచి ప్రైవేట్ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ప్రభుత్వ టీచర్ కంటే ప్రైవేట్లో పని ఒత్తిడి ఎక్కువ. ఆదివారం, సెలవుదినం పాటించడం అక్కడ తక్కువే. సరిపోని జీతాలతో ఇన్నాళ్లు ఎన్నో ఇక్కట్లు పడ్డాం. ఇన్నేళ్ల తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్(కాంట్రాక్టు పద్ధతిన) బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉంది. వేమనపల్లి మండలం ఎంపీపీఎస్ గోర్లపల్లి పాఠశాలలో నాకు పోస్టింగ్ ఇచ్చారు. – యుగంధర్, ఎంపీపీఎస్ గోర్లపల్లి, మం: వేమనపల్లి -
క్లుప్తంగా
బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు కుభీర్: మండలంలోని జుమ్డ గ్రామంలో బాల్యవివాహాన్ని పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నా యి.. భైంసా మండలం మహగాం గ్రామానికి చెందిన మైనర్ బాలిక(15)కు కుభీర్ మండలం జుమ్డ గ్రామానికి చెందిన యువకుడితో శుక్రవారం పెళ్లి చేయాలని నిశ్చయించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు, పోలీసులతో కలిసి వెళ్లి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత, ఏఎస్సై యశ్వంత్, తదితరులు ఉన్నారు. చిట్ఫండ్లో మోసం ● బాధితురాలి ఫిర్యాదుతో నలుగురిపై కేసు మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని భవిత చిట్ఫండ్ యాజమాన్యం డిపాజిటర్లకు డబ్బులు తిరిగి చెల్లించడంలో మోసం చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో నలుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..జిల్లా కేంద్రంలోని హైటెక్సిటీలో ఉంటున్న హానోగు హారిక.. భవిత చిట్ఫండ్లో రూ.5 లక్షల చిట్టీ వేసింది. నెలకు రూ.10 వేల చొప్పున 50 నెలలు కట్టాల్సి ఉండగా 41 నెలలు రూ.4.10 లక్షలు చెల్లించింది. చిట్టీ ఎత్తుకునేందుకు 2022 అక్టోబర్లో కార్యాలయానికి వెళ్లగా అప్పటికే మూసివేశారు. యజమానుల సెల్ నంబర్లు తెలుసుకుని సంప్రదిస్తే కట్టిన డబ్బులు చెల్లిస్తామని కాలాయాపన చేశారు. తర్వాత చెక్కులు ఇవ్వగా చెక్బౌన్స్ అయ్యాయి. వారికి ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ రావడంతో బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యజమానులు మంచిర్యాలకు చెందిన గుండ ప్రకాశ్రావ్, తాడిపల్లి శ్రీనివాస్రావు, మేనేజర్లు సుషాంత్, సతీశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చోరీకి యత్నించిన నిందితుడి రిమాండ్ కై లాస్నగర్: మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు చోరీకి యత్నించిన నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని తిలక్నగర్కు చెందిన చిట్యాల విజయ ఈనెల 17న కాలనీలోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తన మనుమడికి మధ్యాహ్న భోజనం చేయించి తిరిగివస్తుంది. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన బేర వంశీ బైక్పై వచ్చి ఆమె మెడలో పుస్తెలతాడును లాక్కెళ్లేందుకు యత్నించాడు. మహిళ కేకలు వేయడంతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం స్థానిక నెహ్రుచౌక్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ ఎస్సై తెలిపారు. -
తండావాసి..శాస్త్రవేత్తగా
● మహాతండాకు చెందిన ఆకాశ్ ● అభినందించిన గ్రామస్తులు నార్నూర్: అతనికి కాన్వెంట్ చదువులంటే తెలియదు. కార్పొరేట్ కళాశాలలో చేరలేదు. లక్షల రూపాయలు వెచ్చించి శిక్షణ పొందలే దు. పట్టుదలతో చదివి తన కల సాకారం చేసుకుని శాస్త్రవేత్త అయ్యి యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఆయనే నార్నూర్ మండలంలోని మహాగావ్ తండాకు చెందిన చౌహాన్ ఆకాశ్. ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ అసోసియేట్ సైంటిస్ట్ సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ (సీ–మెట్), హైదరాబాద్కు ఎంపికయ్యాడు. 15 రోజుల క్రితం శాస్త్రవేత్తగా విధులు చేరాడు. ఈయన తల్లిదండ్రులు జీజాబా యి, ప్రహ్లాద్. వీరికి ఇద్దరు సంతానం. వ్యవసా యం చేస్తూ వారిని కష్టపడి చదివించారు. చిన్న కుమారుడైన ఆకాశ్ 1 నుంచి పదో తరగతి వర కు నార్నూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఐటీడీఏ సహకారంతో హైదరాబాద్లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. ఏఐఈఈఈ పరీక్ష రాసి ఆలిండియా స్థాయిలో 178వ ర్యాంకు సాధించి వరంగల్ నిట్లో బీటెక్ పూర్తిచేశాడు. అనంతరం హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో చేరి మెటీరియల్ ఇంజినీరింగ్లో ఐదేళ్లపాటు పరిశోధన చేశాడు. ప్రస్తుతం సీ–మెట్లో రీసెర్చ్ అసోసియేట్, సైంటిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు. తండా నుంచి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆకాశ్ను గ్రామస్తులు అభినందించారు. -
ఏళ్ల నిరీక్షణ.. టీచరైన వేళ..
● 17ఏళ్లకు ఫలించిన న్యాయ పోరాటం ● 2008 డీఎస్సీ అభ్యర్థులకు కొలువులుమంచిర్యాలఅర్బన్: ఉద్యోగమనేది నిరుద్యోగుల కల. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కావడంతో కల నెరవేరిందని అనుకున్నారు. తెల్లవారితే చాలు పోస్టింగ్ వచ్చేది. కోర్టులో కేసు పడడం.. దక్కినట్లే దక్కిన ఉద్యోగం చేజారడంతో కల చెదిరింది. ఒకటి రెండేళ్లు కాదు.. ఏకంగా 17ఏళ్లు వేచి చూశారు. ఎప్పటికై నా టీచర్ కల నెరవేరుతుందని ఆశించారు. న్యాయపోరాటం ఫలించడంతో కొలువులు దక్కించుకున్నారు. ఎట్టకేలకు హైకోర్టు ఉత్తర్వులతో డీఎస్సీ–2008 అభ్యర్థులు ఒప్పంద పద్ధతిన నియామక పత్రాలు అందుకున్నారు. ఇటీవల జిల్లాలో 12మందిని ఆయా పాఠశాలలకు కేటాయించారు. కాంట్రాక్టు పద్ధతిన నియామకంతోపాటు వేతనం అంతంతే కావడం వల్ల ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. జిల్లాలో ఆయా పాఠశాలల్లో డిప్యూటేషన్లపై టీచర్లను సర్దుబాటు చేసిన చోట కేటాయించాలని కోరుతున్నారు. ఒప్పంద నియామక పత్రాలు అందుకున్న కొందరిని ‘సాక్షి’ పలుకరించింది. వారి మాటల్లోనే.. -
No Headline
తల్లిదండ్రులు మందలించారని.. ఉట్నూర్రూరల్: తల్లిదండ్రులు మందలించారని కుమారుడు మద్యం మత్తులో పు రుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉట్నూర్ సీఐ మోగిలి కథనం ప్రకారం.. మండలంలోని హస్నాపూర్కు చెందిన జాదవ్ బాలుసింగ్, రాధాబాయి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు జాదవ్ వెంకటేశ్ (26) పారామెడికల్ పూర్తి చేశాడు. ఉద్యోగం రాక ఎలాంటి పనులు చేయకుండా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి తల్లిదండ్రులు ఏం పనిచేయకుండా మద్యం తాగితే ఎలా అని మందలించారు. మద్యం మత్తులో వెంకటేశ్ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి పడుకున్నాడు. శుక్రవారం ఉదయం తల్లి కుమారుడిని లేపగా ఎంతకీ లేవలేదు. కొడుకు మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఉరేసుకుని వివాహిత ఆత్మహత్యతానూరు: వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని బోల్సా గ్రామానికి చెందిన బెల్లెడ్ నవనీత (22)కు అదే గ్రామానికి చెందిన రాకేశ్తో గతేడాది వివాహమైంది. మూడు నెలల గర్భిణి అయిన నవనీతను ఇంటివద్ద ఉంచి ఈనెల 20న భర్త రాకేశ్తోపాటు కుటుంబ సభ్యులు సారంగపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో సీమంతం కార్యక్రమానికి వెళ్లారు. తనను తీసుకెళ్లలేదని మనస్తాపంతో నవనీత గురువారం ఇంట్లో దూలానికి చీరతో ఉరేసుకుంది. సాయంత్రం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భర్త ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి..సిర్పూర్(టి): సిర్పూర్(టి)–వేంపల్లి రైల్వేస్టేషన్ల మధ్యలో మండలంలోని ఆరెగూడ సమీపంలో శుక్రవారం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ సురేశ్ కథనం ప్రకారం.. మంచిర్యాల వైపు నుంచి బల్లార్షా వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుందని, బ్లాక్ కలర్ఫుల్ టీషర్ట్, బ్లూ కలర్ లోయర్ ధరించాడు. నడుముకు టవల్ చుట్టుకుని ఉన్నాడు. మృతదేహాన్ని కాగజ్నగర్ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి భద్రపర్చినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే కాగజ్నగర్ రైల్వేపోలీసుస్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. -
డబ్బుల కోసం వేధించిన వ్యక్తికి ఏడాది జైలు
నిర్మల్టౌన్: డబ్బుల కోసం వేధించిన వ్యక్తికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. కోర్టు సమన్వయల అధికారి డల్లుసింగ్ కథనం ప్రకారం..జిల్లాకేంద్రంలోని శాస్త్రినగర్ కాలనీకి చెందిన నర్సయ్య టైలర్గా పనిచేస్తున్నాడు. అవసరం నిమిత్తం లక్ష్మణచాంద మండలం కనకాపూర్కు చెందిన సతీశ్ వద్ద రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి రూ.39 వేలు చెల్లించాడు. మిగతా డబ్బుల కోసం సతీశ్ తరచూ టైలర్ షాపు వద్దకు వెళ్లి వేధించేవాడు. 2015 జూన్ 22న నర్సయ్య భార్య షాపులో ఉన్న సమయంలో అక్కడికి వచ్చి గొడవపడ్డాడు. ఆమెను గాయపర్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పీపీ వినోద్రావు సాక్షులను విచారించి నేరం రుజువు చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. -
ఏజెన్సీలో దొంగల హల్చల్
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రి సమయంలో దొంగలు షాపుల షటర్ తాళాలు పగులగొట్టి నగదును ఎత్తుకెళ్తున్నారు. నార్నూర్ మండల కేంద్రంలో పది రోజుల వ్యవధిలో మూడు దొంగతనాలు జరిగాయి. వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న పోలీసులు పెట్రోలింగ్ చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉట్నూర్ మండలం ఎక్స్రోడ్ వద్ద రెండు వైన్స్షాపులు, గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామంలో ఫర్టిలైజర్, రెండు కిరాణషాపుల్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు షాపుల షటర్ తాళాలు పగులగొట్టారు. ఫర్టిలైజర్ షాపులో రూ.60 వేలు, కిరాణషాపుల్లో రూ.60 వేల నగదును ఎత్తుకెళ్లారని బాధితులు సంజీవ్గౌడ్, ప్రహ్లాద్ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు గాదిగూడ్ ఎస్సై నాగ్నాథ్ తెలిపారు. ఇంద్రవెల్లి: మండలంలోని ఈశ్వర్నగర్ సమీపంలో జై దుర్గ వైన్స్షాపులో గురువారం రాత్రి చోరీ జరిగింది. నిర్వాహకుడు ముండే బాబు..షాపు బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. దొంగలు గడ్డపారతో షెటర్ తాళం పగులగొట్టి సీసీ కెమెరాలు, మానిటర్ను ధ్వంసం చేశారు. మందు బాటిళ్లతోపాటు కౌంటర్లో నగదును ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎస్సై సునీల్ శుక్రవారం ఉదయం వైన్స్ షాపును పరిశీలించారు. సీసీ ఫుటేజీని నిర్వాహకులు పరిశీలించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మాలలను అణచివేస్తున్న సీఎం
● మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్నిర్మల్టౌన్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ చేతిలో సీఎం రేవంత్ రెడ్డి పావుగా మారి మాలలను అణచివేస్తున్నాడని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తిగా మాదిగల పక్షంగా జరుగుతుందన్నారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించకుండా ఆశాసీ్త్రయమైన 2011 జనాభా లెక్కలతో వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదం చేశారని మండిపడ్డారు. వాస్తవానికి ఎస్సీల జనాభా 20% ఉందని, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు 20% పెంచి వర్గీకరణ ప్రయత్నాలు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరిని ఎండగట్టి, పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశలంలో జైభీమ్ సైనిక్ దళ్ రాష్ట్ర కన్వీనర్ కనకరాజు, రాజన్న, గజెల్లి లక్ష్మణ్, బొడ్డు లక్ష్మణ్, వెంకటస్వామి, పురుషోత్తం, మురళీధర్, రవి, ప్రేమ్సాగర్, సదానందం, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గుడిపేట శివారులో మంచిర్యాల వైపు వెళ్తున్న కారు లక్సెట్టిపేట వైపు వెళ్తున్న రెండు బైక్లను అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న మంచిర్యాలలోని హైటెక్సిటీ కాలనీకి చెందిన ఇందారపు శివప్రియ(49) అక్కడికక్కడే మృతి చెందింది. మరో బైక్ నడుపుతున్న చెన్నూర్ మండలం లింగంపల్లి పంచాయతీ కార్యదర్శి ఎండీ నయీమోద్దీన్కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కాగా, శివప్రియ లక్సెట్టిపేట బాలికల గురుకుల పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. రాత్రి విద్యార్థుల స్టడీ అవర్స్ కోసం పాఠశాలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. భర్త శివప్రసాద్ రెండేళ్ల క్రితం మృతి చెందగా శివప్రియకు 9వ తరగతి చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. రోడ్డు ప్రమాదం ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఏర్పడగా, ఎస్సై సురేశ్ బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రమాద వివరాలపై ఆరా తీశారు. ఘటనకు కారణమైన కారుడ్రైవర్ సత్తయ్య పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: మాతా శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో సమావేశ మందిరంలో అర్మాన్ సంస్థ ఆధ్వర్యంలో గర్భధారణ సమయలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్త సమయంలో గర్భిణులు బీపీ, షుగర్, ఎనీమియాతో పాటు 20 రకాల వ్యాధులతో బాధపడే అవకాశం ఉందన్నారు. వైద్యసిబ్బంది గర్భిణులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సుఖప్రసవానికి కృషి చేయాలన్నారు. గర్భస్త సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రొజెక్టర్పై వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, వైద్యులు చరణ్, శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
కైలాస్నగర్: మున్సిపల్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని స్పష్టం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆశన్న, నగేష్, ఆత్మారాం, అజీమ్, భాస్కర్, జనార్దన్, రాకేష్రెడ్డి, స్వామి, గగన్, వెంకటి, సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయికి వెళ్లరు.. స్పందించరు
● ఓ మైనింగ్ అధికారి తీరే వేరు ● కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు బేఖాతరు ● ఇసుకాసురులపై పోలీసుల కొరడా ● అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్ ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఇసుక, మొరం అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ మైనింగ్ శాఖ అధికారి తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అక్రమార్కులపై కొరడా ఝులిపించాల్సిన సదరు అధికారి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండడంతో ఇసుక అక్రమ దందాపై కొరడా ఝులిపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ సైతం ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ జిల్లాలో ఆ అధికారి వాటిని లెక్క చేయడం లేదు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అందుబాటులో ఉండకపోగా తనిఖీలకు సైతం వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. అందుకు పెన్గంగా పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ దందానే నిదర్శనంగా నిలుస్తోంది. ఓవైపు పోలీసు, రెవెన్యూ అధికారులు ఇసుకాసురులపై కఠినంగా వ్యవహరిస్తుండగా అదే పని నిర్వహించాల్సిన మైనింగ్ శాఖ మౌనం పాటించడం వెనుక ఆంతర్యమేమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు బాధ్యతల కంటే కొసరు బాధ్యతలకే ప్రాధాన్యతనిస్తూ రెండు చోట్ల అక్రమాలపై పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది. ఆ శాఖలో ఇద్దరు అధికారులే ఉండగా ఒకరిని డిప్యూటేషన్పై ఇతర జిల్లాకు పంపించగా మరో అధికారికి నిర్మల్ జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో సదరు అధికారి చుట్టపుచూపుగా విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. జిల్లా ఉన్నతాధికారులు ఏదైన పనిపై సంప్రదిస్తే తాను మరో జిల్లాలో ఉన్నానంటూ వారిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే అక్రమార్కుల గురించి ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేసినా అసలే స్పందించరనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయానికి వెళ్లి సమాచారం అందించాలని పలువురు ప్రయత్నించినా అక్కడ సైతం అందుబాటులో ఉండడం లేదు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు జైనథ్, బేల, భీంపూర్ మండలాల పోలీసు శాఖ అధికారులు ఇసుక అక్రమార్కులపై కొరడా ఝులిపిస్తున్నప్పటికీ మైనింగ్ శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక ట్రాక్టర్లు సీజ్.. ఇసుకాసురులపై పోలీసు శాఖ కొరడా ఝులిపిస్తోంది. ఇటీవల కాలంలో తలమడుగు మండలంలో రెవెన్యూ శాఖ అధికారులు మూడు టిప్పర్లు, బేల పోలీసులు ఏడు ట్రాక్టర్లు సీజ్చేసి మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించారు. జైనథ్ మండలంలో ఐదు ట్రాక్టర్లు, ఆదిలాబాద్రూరల్ మండలంలో నాలుగు ట్రాక్టర్లు, మావల మండలంలో మూడు ట్రాక్టర్లను పట్టుకుని మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించారు. అయినప్పటికీ కొంతమంది అక్రమంగా ఇసుక రవాణాను కొనసాగిస్తూనే ఉన్నారు.కఠిన చర్యలు తీసుకుంటున్నాం ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే వాహనాలు సీజ్ చేస్తున్నాం. ఆదిలాబాద్రూరల్, జైనథ్ మండలాల్లో కలిపి గురువారం ఏడు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి మైనింగ్ అధికారులకు అప్పగించాం. మరోసారి ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తాం. – ఎల్.జీవన్రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్ -
‘రాష్ట్రం రాక్షస పాలనలో చిక్కుకుంది’
ఆదిలాబాద్టౌన్: తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ రాక్షస పాలనలో చిక్కుకుందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ అన్నా రు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రో జును పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సంబరా లు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. సాజిదొద్దీన్, శివ, రమేశ్, సురేందర్, ప్రశాంత్, విఠల్, వినోద్ పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రిని కలిసిన ‘సమగ్ర’ ఉద్యోగులు
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను ఢిల్లీలో కలిశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా ఇచ్చే పేస్కేల్లో 60 శాతం రేషియో ఇవ్వాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్చారి, రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, రమేశ్, సంధ్యారాణి, రాజిరెడ్డి, సత్యనారాయణ, బిందుశ్రీ, ప్రియాంక, దీప్తి, తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతులు వచ్చేనా..?
ఆదిలాబాద్ డీపీఈవో కార్యాలయం సాక్షి, ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఆబ్కారీ శాఖలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జ రగాల్సి ఉండగా వివిధ కారణాలతో అప్పట్లో నిలి చిపోయింది. దీంతో పలువురు ఈ పదోన్నతుల కో సం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తు తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎకై ్సజ్ అధికారి పోస్టు డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఖాళీగా ఉంది. కరీ ంనగర్ డీసీ రవికాంత్ ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పలువురు అసిస్టెంట్ కమిషనర్లకు పదోన్నతి ఆస్కారం ఉండడంతో ఒకవేళ ప్ర క్రియ జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి డీసీ పోస్టు భర్తీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ పోస్టు కూడా ఖాళీగా ఉండగా ఆదిలాబాద్ డీపీఈవో హిమశ్రీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ ఎకై ్సజ్ పరిధిలో ఎ న్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్ఫోర్స్ విభాగాలకు సంబంధించి రెండు అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతే కాకుండా ఉమ్మడి జిల్లాలో 2 సీఐ, 9 హెడ్ కానిస్టేబుల్, 17 ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు మినిస్టీరియల్ ఉద్యోగులు కూడా పదోన్నతులు, బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. పలు ఎస్సై పోస్టులు ఖాళీ.. ఉమ్మడి జిల్లాలో పలు ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాకు మూడువైపులా మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. దీంతో దేశీదారు అ క్రమ రవాణా జోరుగా జరుగుతోంది. దీన్ని అరికట్ట డంలో కీలకంగా వ్యవహరించాల్సిన ఎస్సైతో పా టు పలు కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న అభిప్రాయం ఆ శాఖలో ఉంది. ఒకవైపు ప్ర భుత్వం దేశీదారు, గుడుంబా నియంత్రణకు చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆఫీసర్ల పో స్టులు ఖాళీగా ఉండడం ప్రతిబంధకంగా మారుతో ంది. ఈ నేపథ్యంలో పదోన్నతుల ద్వారా పోస్టులు భర్తీ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆబ్కారీ శాఖలో ఎదురుచూపులు అన్ని క్యాడర్లలో ఉన్నతి కోసం నిరీక్షణ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియ అనే ప్రచారం ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న పలు ఎస్సై పోస్టులు ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సై పోస్టుల వివరాలు జిల్లా మంజూరు ఖాళీలు ఆదిలాబాద్ 10 07 నిర్మల్ 07 02 మంచిర్యాల 10 02 కుమురంభీం 06 01 ఆబ్కారీ శాఖలో బదిలీలు, పదోన్నతుల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు.. అప్పుడు అంటూ ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో పలువురిలో నిరాశ వ్యక్తమవుతోంది. అన్ని క్యాడర్లలో ఉన్నతి కోసం నిరీక్షిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఈ సమస్య ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియ చేపడతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రక్రియ జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న పలు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. -
‘పది’లో మంచి ఫలితాలు సాధించాలి
● ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఆదిలాబాద్టౌన్: పదోతరగతిలో మంచి ఫలితాలు సాధించాలని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను సందర్శించారు. రాంనగర్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్రతీ విద్యార్థి వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం దుబ్బగూడ పాఠశాలను సందర్శించారు. ఆయన వెంట జిల్లా విద్య శాఖాధికారి ప్రణిత, సెక్టోరియల్ అధికారి నారాయణ, మావల ఎంఈఓ సరోజ తదితరులు ఉన్నారు. డీఈవోపై ఫిర్యాదు జిల్లా కేంద్రానికి వచ్చిన ఆర్జేడీ సత్యనారాయణరెడ్డికి జిల్లా విద్యా శాఖాధికారి ప్రణీతపై టీయూటీఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారు. స్పౌజ్ నిబంధనలకు విరుద్ధంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చి బదిలీ పొందిన ఎస్జీటీ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిపుణుల కమిటీ వేసి విచారణ చేపట్టినా వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని, ఇటీవల 317 కింద స్పౌజ్ బదిలీల్లో జిల్లాకు వచ్చిన పలువురు ఉపాధ్యాయులకు ఇష్టారీతిన పోస్టింగ్లు ఇచ్చారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరాం, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ ఉన్నారు. -
‘భగీరథ’ పైపులైన్కు మరమ్మతులు చేస్తాం
ఇచ్చోడ: ‘అప్పుడే నీళ్లగోస’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మిషన్ భగీరథ అధి కారులు స్పందించారు. అధికారులు రమాకాంత్ రాకేశ్ మాన్కపూర్ను సందర్శించారు. ట్యాంక్ వద్ద లీకేజీ అవుతున్న పైపులైన్కు మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. నేటి నుంచి రోజుకు రెండుసార్లు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామన్నారు. నీటిఎద్దడి తలెత్తకుండా చర్యలు సిరికొండ: మిషన్ భగీరథ ఏఈ జైపాల్ గురువారం మండలంలోని కోసుపటేల్గూడను సందర్శించి గ్రామ సమీపంలోని బావిని పరిశీలించారు. వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా బావినుంచి పైపులైన్ వేసి నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ● మాన్కపూర్, కోసుపటేల్గూడను సందర్శించిన అధికారులు -
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభమవుతాయని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి గజానంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాలతో ఇటీవల ప్రక్రియ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆధార్ సర్వర్ పునరుద్ధరణ చేయడం జరిగిందని, ఈ విషయాన్ని రైతులు గమనించి సీసీఐకి నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి విక్రయించాలని కోరారు. రేపు థింకింగ్ డేఆదిలాబాద్టౌన్: స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బెడెన్ పావెల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనెల 22న జిల్లా కేంద్రంలోని స్కౌట్స్ కార్యాలయంలో థింకింగ్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ప్రణీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్కౌట్స్ మాస్టర్లు, గైడ్ కేప్టెన్లు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సర్వమత ప్రార్థనలతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ జెండా ఆవిష్కరణ, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు విద్యార్థులతో హాజరు కావాలని సూచించారు. -
‘చేయి’ కలపని నేతలు
● కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వర్గభేదాలు ● ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఒక్కటిగా ఉండేలా కార్యాచరణ ● పార్టీ అభ్యర్థిని గట్టెక్కించేందుకు ప్రయత్నాలు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య గత కొంతకాలంగా సఖ్యత కొరవడింది. పాత, కొత్త నాయకుల మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఇదే తీరు కొనసాగితే ఎంపీ ఎన్నికల తరహాలో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండడంతో అందరూ కలిసి పని చేసేలా జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కృషి చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత లొల్లిలు ఎన్ని ఉన్నా ఎమ్మెల్సీ అభ్యర్థిని గట్టెక్కించేందుకు ఒకే వేదికపై నిలబడాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో మంత్రి సీతక్కకు ప్రతిష్టాత్మకంగా మారింది. వర్గభేదాలతో సతమతం ఆసిఫాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఆజ్మీరా శ్యామ్నాయక్ మధ్య విభేదాలు బహిరంగంగానే బయటపడ్డాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చేరికతో మరింత ముదిరాయి. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండే విఠల్, రావి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీలో ఉన్నారు. ఇటీవల కోనప్ప తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన నిధులను రద్దు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. గురువారం కాగజ్నగర్ పట్టణంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డి తదితరులు హాజరైన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్ దూరంగా ఉండడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాలలో భిన్న పరిస్థితి మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది. డీసీసీ అధ్యక్షురాలుగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సతీమణి సురేఖ ఉన్నారు. బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం సోదరులైన వినోద్, వివేక్, పెద్దపల్లి ఎంపీగా వివేక్ తనయుడు వంశీక్రిష్ణ ఉన్నారు. జిల్లాలో పార్టీ రెండు వర్గాలుగా కొనసాగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఒక్క కార్యక్రమం చేసిన దాఖలాలు లేవు. ఎవరైనా రాష్ట్ర మంత్రులు వచ్చినా ఆయా నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. మరోవైపు ముగ్గురు ఎమ్మెల్యేలూ మంత్రి పదవి కోసం పోటీలో ఉన్నారు. దీంతో పార్టీ కేడర్ కూడా ఆయా నాయకుల అనుచర వర్గాలుగానే ఉంది. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో.. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పాత, కొత్త నేతలు ఇంకా చేతులు కలపడం లేదు. బీఆర్ఎస్ నుంచి చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ముధోల్ నుంచి మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, బోథ్ నుంచి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీలో ఇన్నాళ్లు అంటీముట్టనట్లుగానే ఉన్నారు. ఖానాపూర్లో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ప్రస్తుత ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మధ్య సఖ్యత లేదు. ఇక బీజేపీని వీడి మాజీ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్లో చేరారు. ఆదిలాబాద్ డీసీసీ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ కంది శ్రీనివాస్, శ్రీకాంత్రెడ్డి, గణేశ్రెడ్డి పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఆత్రం సుగుణ ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పని చేయాలంటూ ఆదేశాలు రావడంతో విభేదాలు పక్కనబెట్టి పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. -
నీటి సమస్య తలెత్తకుండా చూడాలి
● కలెక్టర్ రాజర్షి షాకై లాస్నగర్: వేసవిలో తాగునీరు, విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో తాగునీరు, రైతుభరోసా, రేషన్ కార్డులు, పైలట్ ప్రజావాణి, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ట్యాంకర్లతో నీటిని అందించాలన్నారు. సమస్యాత్మక హ్యబిటేషన్ల వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 24లోగా అందజేయాలన్నారు. విద్యుత్ సరఫ రాకు అంతరాయం కలుగకుండా ఉండేలా డీఈలు, ఏఈలకు సూచించాలని ఎస్ఈని ఆదేశించారు. మొదటి విడతలో ఎంపికై న ఇందిరమ్మ మోడల్ ఇళ్లను మార్చి 10లోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్, ఆర్డీవో వినోద్ కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం కైలాస్నగర్: జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో టీఎన్జీవో యూనియన్ డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సమష్టిగా పనిచేస్తూ జిల్లాను ప్రగతి పథంలో ముందుంచాలన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్, నాయకులు తిరుమల్రెడ్డి, తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్, అరుణ్, వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షులు నర్సిములు, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జాదవ్ నూర్సింగ్, మున్సిపల్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోవింద్, తదితరులు పాల్గొన్నారు. ఎల్పీజీ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయించాలి ఎల్పీజీ వినియోగదారులు ఈకేవైసీనీ పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో సమావేశం నిర్వహించారు. నెట్వర్క్ లేని గ్రామాల్లోని వారి కోసం నెట్వర్క్ ఉ ండే పక్క గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి ఈకేవైసీ చేయించాలన్నారు. సీఎం పైలట్ ప్రజావాణి పబ్లిక్ హియరింగ్లో ఏజెన్సీ డీలర్లు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. గ్యాస్ రాయితీ రానివారు సంబంధిత ఏజెన్సీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్వో వాజీద్ అలీ, తదితరులు పాల్గొన్నారు. -
వుషూ క్రీడాభివృద్ధికి కృషి
ఆదిలాబాద్: రాష్ట్రంలో వుషూ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్సాగర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి వుషూ మహిళల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వుషూ క్రీడకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రతీ జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వాలు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను కేటాయించాయన్నారు. క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం వుషూ విభాగంలో స్పోర్ట్స్కోటా కింద పోస్టల్ శాఖలో ఉద్యోగం రాగా, ప్రస్తుతం ఎస్ఎస్బీలో ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న జిల్లాకు చెందిన రాథోడ్ స్వాతిని సత్కరించారు. కార్యక్రమంలో ఉషూ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఉమర్, పెటా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పార్థసారథి, సాయి, వుషూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గణేశ్, వేముల సతీశ్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అన్నారపు వీరేశ్, జిల్లాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్సాగర్ ఉత్సాహంగా రాష్ట్రస్థాయి వుషూ క్రీడాపోటీలు -
‘గురువుల’ప్రాధాన్యత ఎవరో!
● బరిలో మొత్తం 15మంది అభ్యర్థులు ● ఉపాధ్యాయ సమస్యలే ప్రచార అస్త్రాలు ● ఆసక్తికరంగా టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా సాగుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ స్థానానికి 15మంది బరిలో ఉన్నారు. 27,088మంది ఓటర్లు ఉన్నారు. ముగ్గురు రాజకీయ పార్టీల నుంచి పోటీలో ఉండగా, మరో 12మంది ఆయా సంఘాల మద్దతుతో బరిలోకి దిగారు. ఎగువ సభకు ఎన్నికల్లో మేధావి వర్గంగా చెప్పుకునే విద్యావంతులైన టీచర్ల ఆలోచన సరళి చాలా భిన్నంగా ఉంటుందంటారు. అభ్యర్థి, పార్టీ, సంఘం ఏదైనా తమ విచక్షణతోనే ఓటు వేస్తూ వైవిధ్యతను చూపిస్తుంటారు. గతంలో పలుమార్లు అంచనాలకు అందకుండా తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో టీచర్లు వేసే మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల క్రమంలో ఎటువైపు మొగ్గు ఉన్నా ఫలితాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎవరి గెలుపు ఉంటుందనేది సర్వత్రా చర్చ సాగుతోంది. సమస్యలే ప్రచారాస్త్రాలు ఉపాధ్యాయులను ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సమస్యలు అనేకంగా ఉన్నాయి. ప్రతీసారి ఆయా సమస్యలే ఎన్నికల్లో ఎజెండాగా మారుతున్నాయి. తాజా ఎన్నికల్లోనూ అవే ప్రచారాస్త్రాలుగా మారాయి. ప్రధానంగా సీపీఎస్(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం), ఏకీకృత సర్వీస్ రూల్, 317జీవో, 2002 ఉపాధ్యాయుల సమస్యలు, డీఏల పెండింగ్, టీచర్ల పదోన్నతులు తదితరవన్నీ పేరుకుపోయాయి. ఎమ్మెల్సీగా గెలిచాక సమస్యలు మర్చిపోతున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నుంచి పరిశీలిస్తే ఈసారి బీజేపీ నుంచి వ్యాపారవేత్త మల్క కొమురయ్య పోటీలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ బాధ్యతను తమ భుజాలకెత్తుకున్నారు. బీజేపీ ప్రభుత్వం టీచర్లను ఇబ్బంది పెడుతున్న సీపీఎస్ను తీసుకొచ్చిందనే కారణంతో పార్టీ అభ్యర్థికి ఏ మేరకు ఓట్లు పడుతాయనేది తేలాల్సి ఉంది. ఆయన యజమానిగా ఉన్న మంచిర్యాలలోని శాలివాహన ప్లాంటు మూసివేత, కార్మికుల సమ్మె ప్రభావం ఉండనుంది. టీఎస్సీపీఎస్ఈయూ నుంచి ఇన్నారెడ్డి సీపీఎస్ రద్దు ఏకై క లక్ష్యంగా సాగుతున్న టీఎస్సీపీఎస్ఈ యూనియన్ బలపర్చిన అభ్యర్థిగా తిరుమల్రెడ్డి ఇన్నారెడ్డి బరిలో ఉన్నారు. గతంలో పీఆర్టీయూ రాష్ట్ర స్థాయి నాయకుడిగా, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన తిరుమల్రెడ్డి ఇన్నారెడ్డికి ఉపాధ్యాయ సమస్యలపై పోరాటమే తన బలంగా చెబుతుంటారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీచర్ల స్థానానికి అధికారికంగా ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు. తెరవెనక మాత్రం ఓ అభ్యర్థికి మద్దతు ఉందని ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇక తాజా మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మరోసారి పోటీలో నిలిచారు. పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్రెడ్డి, బీఎస్పీ నుంచి యాటకారి సాయన్న, దళిత బహుజన పార్టీ నుంచి గవ్వల లక్ష్మీతోపాటు అశోక్కుమార్, వై.కంటె సాయన్న, చలిక చంద్రశేఖర్, జగ్గు మల్లారెడ్డి, మామిడి సుధాకర్రెడ్డి, ముత్తరాం నర్సింహాస్వామి, విక్రమ్రెడ్డి, శ్రీకాంత్, సుహాసిని మొత్తం 15మంది ఉన్నారు. ఇంటింటికి అభ్యర్థి ప్రచారం ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో ప్రచారం చేసే అవకాశం లేకపోవడంతో నేరుగా టీచర్ల ఇంటికే వెళ్తున్నారు. మార్నింగ్ వాకింగ్, సంఘ కార్యాలయాలు, సెలవు దినాలు, నిర్ణీత వేళల్లోనే టీచర్లను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సోషల్మీడియా, ఫోన్ కాల్స్తోనూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
పేకాటరాయుళ్లపై కేసు
వాంకిడి: మండలంలోని ఖమానలోని నర్సరీ సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పక్కాసమాచారంతో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి, వారి వద్ద నుంచి మూడు బైక్లు, ఆరు సెల్ఫోన్లు, రూ.8280 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హెడ్కానిస్టేబుల్కు గుండెపోటు ● సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులుకడెం: మండలంలోని పాండ్వపూర్ వద్ద అటవీశాఖ చెక్పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న దస్తురాబాద్ పోలీసుస్టేషన్ హెడ్కానిస్టేబుల్ గోకుల్దాస్ బుధవారం గుండెపోటుతో కుప్పకూలాడు. సిబ్బంది అందించిన సమాచారంతో ఎస్సై కృష్ణసాగర్రెడ్డితోపాటు ధన్రాజ్, భీంరావు, దేవన్నలు అక్కడికి చేరుకున్నారు. గోకుల్దాసును అంబులెన్స్లో ఎక్కించి సీపీఆర్ చేస్తూ ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి నిర్మల్కు తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. పట్టపగలే చోరీఉట్నూర్రూరల్: మండలంలోని లింగోజీతండాకు చెందిన ఆర్టీసీ కండక్టర్ రాథోడ్ దశరథ్ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఎస్సై మనోహర్ కథనం ప్రకారం.. దశరథ్ బుధవారం ఇంటికి తాళం వేసి ఉదయం 9గంటలకు డ్యూటీకి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లో తులంన్నర బంగారం, 10 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దశరథ్ సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అక్కడికి చేరుకుని..క్లూస్టీం ద్వారా పరిశీలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘ఇంటిగ్రేటెడ్’ స్కూళ్లకు స్థలాలు గుర్తించండి
● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి కృష్ణ ఆదిత్య ● నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమావేశంకైలాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు గురువారంలోపు స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకాధికారి, ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో నాలుగు జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యావ్యవస్థలో ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రానున్న రెండేళ్లలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించి నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించిందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో వాటి ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలన్నారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణ శివారు నిషాన్ఘాట్లో గల సర్వేనంబర్ 38లో 20 ఎకరాల స్థలాన్ని కలెక్టర్తో కలిసి పరిశీలించారు. అన్ని హంగులతో పాఠశాల, వసతి గృహ సముదాయం నిర్మించనున్నట్లు తెలిపారు. గడువులోపు పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంతకు ముందు కలెక్టరేట్కు చేరుకున్న ఆయనకు ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, కు మురంభీం అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్కుమార్, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలపై సమీక్ష ముందుగా ఇంటర్మీడియెట్ విద్యాశాఖపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చాంబర్లో కృష్ణ ఆదిత్య సమీక్ష నిర్వహించారు. ప్రాక్టికల్, వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో రవీందర్కుమార్ను ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కళాశాలలో హాజరు శాతం, స్లిప్ టెస్టులు, విద్యార్థుల ప్రవేశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలి వేసవిలో మారుమూల ప్రాంతాలు, మున్సిపాలిటీలో తాగునీరు, విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని కృష్ణఆదిత్య అన్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇందుకోసం అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. బోరుబావుల ఫ్లషింగ్, నీటి వనరుల మరమ్మతు ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. -
సరిహద్దుల్లో నిఘా
● ప్రత్యేక చెక్పోస్టులు..తనిఖీలు ● అమల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ● రూ.50 వేలకు మించితే ఆధారాలు తప్పనిసరి నిర్మల్ఖిల్లా: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్–నిజామాబాద్–కరీంనగర్–మెదక్ జిల్లాల పరిధిలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈనెల 27న జరిగే పోలింగ్కు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నగదు వ్యవహారాలు, తాయిలాలపై ఎన్నికల అధికారులు దృష్టిసారించారు. నిర్మల్ జిల్లాకు ఆనుకుని మహారాష్ట్ర సరిహద్దు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో నిఘాతోపాటు చెక్పోస్టుల వద్ద తనిఖీలు కొనసాగిస్తున్నారు. వివిధ అవసరాల నిమిత్తం రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే తగిన ఆధారాలు, రశీదులు చూపాలని లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగదుతోపాటు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే రశీదులు వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివాహ వేడుకల సీజన్లో వధూవరుల కుటుంబీకులు వస్త్రాలు, బంగారం, తదితర వస్తువులు కొనేందుకు నగదుతో వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక చెక్పోస్టులు నిర్మల్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు సారంగాపూర్, తానూరు, కుభీర్ తది తర మండలాలతో అనుసంధానంగా ఉన్నా యి. ఆయా ప్రాంతాల్లోని సరిహద్దుల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ము మ్మరం చేశారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాలు, బైక్లు వివిధ అవసరాల రీత్యా రాకపోకలు సాగిస్తుంటాయి. బాసర మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో బాసర–ధర్మాబాద్ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో వారం క్రితం వాహనాల తనిఖీ చేపట్టారు. ధర్మాబాద్ నుంచి బిద్రెల్లి వైపు వస్తున్న కుంటాల మండలానికి చెందిన వ్యక్తి కారులో రూ. 2.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి రశీదులు, ఆధారాలు చూపకపోవడంతో కేసు నమోదు చేశారు. పది రోజుల క్రితం మహారాష్ట్రలోని బోకర్ నుంచి నిర్మల్కు వస్తున్న ఓ వాహనాన్ని తానూరు మండలం బెల్తరోడా చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. అందులో రూ.3 లక్షలకు పైగా నగదును గుర్తించారు. సరైన పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. -
అదృశ్యమైన మహిళ హత్య
మోర్తాడ్: నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి భీమ్గల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై రాము బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్కు చెందిన కొండ లక్ష్మి(45) గ్రామంలో ఆశావర్కర్గా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరి 21న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుమార్తె అనూష ఏర్గట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్కు చెందిన కొంచపు వెంకటేశ్ లక్ష్మిని నమ్మించి తనవద్దకు పిలిపించుకొని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నెల రోజుల క్రితమే ఆమెను పొన్కల్ అటవీ ప్రాంతంలో హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు. పోలీసుల అదుపులో గంజాయి నిందితులు ? మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని తిలక్నగర్లో మూడురోజుల క్రితం 25 కిలోల గంజాయితోపాటు సుమారు 9 మంది నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో కొందరిని తప్పించేందుకు రాజకీయ నాయకుల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నిందితులను కేసు నుంచి తప్పించేందుకు తల్లిదండ్రులు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఓ నాయకుడితో బేరసారాలు ఆడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై సీఐ ప్రమోద్రావును వివరణ కోరగా గంజాయి నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు పటుకున్నది వాస్తవమేనని, విచారణ చేస్తున్నామని తెలిపారు. -
గల్ఫ్లో జిల్లావాసి బలవన్మరణం
● మృతదేహం తెప్పించాలని కుటుంబీకుల వినతి ● ప్రవాసీమిత్ర సంఘం అధ్యక్షుడిని కలిసి వేడుకోలునిర్మల్ఖిల్లా: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన కార్మికుడు అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన షేక్ ఆన్సర్ (34) ఉపాధి నిమిత్తం ఆరేళ్ల క్రితం సౌదీ ఆ తర్వాత దుబాయ్ వెళ్లాడు. ప్రస్తుతం దుబాయ్లోని పూజైరాదిబ్బ మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేసేవాడు. గతేడాది సెలవుపై స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. ఈనెల 16న దుబాయ్లో నివాసముంటున్న ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడి కంపెనీ ఈ విషయాన్ని తాజాగా కుటుంబీకులకు సమాచారం అందించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బుధవారం మృతుడి కుటుంబ సభ్యులతోపాటు కాంగ్రెస్ నాయకులు ఏనుగు ముత్యంరెడ్డి, కొర్వ నవీన్, సతీశ్ తదితరులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రవా సీమిత్ర కార్మిక సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్లను కలిశారు. మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించాలని విన్నవించారు. గల్ఫ్కార్మిక సంఘానికి చెందిన అక్కడి ప్రతినిధులతో మాట్లాడి దుబాయ్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి ఈ–మెయిల్ ద్వారా ఆన్సర్ వివరాలను పంపించారు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడుతోపాటు తల్లిదండ్రులు ఉన్నారు. -
అప్పుడే.. నీళ్ల గోస
బిందెడు నీళ్ల కోసం.. బిందెడు నీళ్ల కోసం బోరింగ్ వద్ద గంటల కొద్ది పడిగాపులు తప్పడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు పదినిమిషాల కన్న ఎక్కువ వస్తలేవు. బోరింగ్లో నుంచి కూడా గంటకు పది బిందెల నీళ్లు రావట్లేదు. దీంతో పనులు విడిచి పెట్టుకొని నీళ్ల కోసం ఇంటికాడనే ఉండాల్సి వస్తుంది. – కొడప రుక్మాబాయి, మాన్కపూర్ ఎలాంటి సమస్య లేదు జిల్లాకు నిత్యం 84 ఎంఎల్డీ నీరు అవసరం ఉండగా ప్రస్తతం పూర్తిస్థాయిలో సరఫరా అవుతోంది. ఇప్పటికై తే ఎక్కడ కూడా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోలేదు. పైపులైన్లు పగిలిపోవడం, లీకేజీల కారణంగా ఎక్కడైనా సమస్య తలెత్తితే చక్కదిద్దాల్సిన బాధ్యత పంచాయతీలకు అప్పగించాం. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. – గోపిచంద్, వాటర్గ్రిడ్ , ఈఈ ఊరు చివరన ఉన్న బోరుబావి నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్తులు జిల్లాలో వేసవి ఆరంభానికి ముందే ప్రజలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇంకా అనేక గ్రామాలకు పైపులైన్లు లేకపోవడం, చా లా చోట్ల లికేజీలు, విద్యుత్ మోటార్లు కాలిపోవడంతో పాటు భూగర్భజల మట్టం పడిపోవడం వంటి కారణాలతో భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పలు మండలాల్లోని శివారు గ్రామాల్లోనూ నీటి ఇక్కట్లు షురూ అయ్యాయి. వారికి ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ బోరుబావులు, చేదబావులే దిక్కవుతున్నాయి. చాలాచోట్ల ఎడ్లబండ్లపై డ్రమ్ములతో నీటిని తెచ్చుకుంటున్నారు. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే మాసాల్లో ఎలా ఉంటుందో అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లా కేంద్రంలోని కాలనీలకు ప్రస్తుతం రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నా, ఎండల తీవ్రత పెరిగితే సమస్య తలెత్తే అవకాశముందని తెలుస్తోంది. -
ఆకాశవాణి కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రాన్ని ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఇంజనీరింగ్) బానోత్ హరిసింగ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రోతలకు నాణ్యమైన ప్రసారాలను అందించేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ విషయంలో ఆదిలాబాద్ ఆకాశవాణి ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం పేరును గొప్పగా నిలపాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ కేంద్రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపును కొనసాగించాలని సూచించారు. ఈ కేంద్రం అభివృద్ధికి తనవంతుగా తోడ్పాటును అందిస్తానన్నారు. అనంతరం జైనథ్ మండల కేంద్రంలోని పురాతన శ్రీ లక్ష్మీనారాయణస్వామిని దర్శించుకున్నారు. ఆయ న వెంట ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ శ్రీనివాస్, కేంద్రం ముఖ్య కార్యక్రమ అధికారి రామేశ్వర్ కేంద్రే, వెంకటేశులు, పోతురాజు, శశికాంత్, గిరీశ్కుమార్, వెంకటయ్య, విజయ కుమారి తదితరులు ఉన్నారు. -
అనుమానాస్పదంగా ఒకరు..
భైంసాటౌన్: పట్టణంలోని కిసాన్గల్లీకి చెందిన జంగమోల్ల రాజేశ్వర్(46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సీఐ జి.గోపినాథ్ తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం..మృతుడు రాజేశ్వర్ రాహుల్నగర్లోని ఓ గురుకుల పాఠశాలలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వాచ్మెన్గా పనిచేసేవాడు. కొన్నిరోజులుగా ఖాళీగా ఉంటుండగా, ఈ క్రమంలో బుధవారం ఇంట్లో అనుమానాస్పద స్థితి లో మృతి చెంది కనిపించాడు. గమనించిన కుటుంబీకులు ఏరియాస్పత్రికి తరలించారు. సీఐ ఆస్పత్రికి చేరుకుని మృతదేహం పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తామన్నారు. -
8న జాతీయ లోక్అదాలత్
కై లాస్నగర్: పెండింగ్ కేసుల పరిష్కారం కోసం మార్చి 8న జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లా కోర్టులోని తన చాంబర్లో బుధవారం ని ర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయ న వివరాలు వెల్లడించారు. సివిల్, బ్యాంకు, ఇన్సూరెన్స్ కేసులతో పాటు రాజీపడదగిన ఇతరత్రా అన్ని కేసులను ఇందులో పరి ష్కరించుకోవచ్చని తెలిపారు. తద్వారా కో ర్టుల చుట్టూ తిరిగే అవకాశముండదని, అ లాగే సమయం వృథా కాదన్నారు. ఉద యం 10 నుంచి సాయంత్రం 5గంటల వర కు ఆయా కోర్టుల్లో నిర్వహించే లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకో వా లని సూచించారు. వీలైనన్ని ఎక్కువ కేసు లు పరిష్కారం అయ్యేలా పోలీసు అధికారులు,న్యాయవాదులు శ్రద్ధవహించాలన్నారు. ఇందులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య తదితరులున్నారు. -
‘రియల్’ స్కెచ్!
● అనధికార లేఅవుట్ల క్లియరెన్స్కు ప్లాన్ ● ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్లకు రంగం సిద్ధం ● పెద్ద ఆఫీసర్తో రియల్టర్ల ఒప్పందం? ● త్వరలో ప్రణాళిక అమలులోకి.. సాక్షి,ఆదిలాబాద్: మావలలోని సర్వే నం.181లో గల ఓ లేఅవుట్కు డీటీసీపీ అనుమతి లేదు. దీంతో ఇందులోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కొంత కాలంగా నిలి చిపోయాయి. దళారులు మాత్రం ప్లాట్లను ఒకరి నుంచి మరొకరికి విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్ర క్రియ ముందుకు సాగని పరిస్థితి. ఈ క్రమంలో క్ర య విక్రయదారుల నుంచి ఒత్తిడి మొదలైంది. మ రోవైపు మార్కెట్లో రియల్ వ్యాపారం మందగించింది. ఈ పరిస్థితుల్లో సదరు రియల్టర్ ఓఎత్తుగడ వేశా డు. సంబంధిత అధికారులతో మంతనాలు జరి పాడు. ఆ ప్లాట్లను క్లియర్ చేసేందుకు వారికి పెద్ద ఆఫర్ ఎర వేశాడు. అది ఫలించింది. బేరసారాలు కొలిక్కి వచ్చాయి. ఇక అమలుపర్చడమే తరువా యి. ఇది కేవలం మావలలోని ఈ ఒక్క సర్వే నంబ ర్కే పరిమితం కాదు. ఆదిలాబాద్ చుట్టుపక్కల మా వల, బట్టిసావర్గాం, ఖానాపూర్, చాందలోని వందలాది అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేలా ఒప్పందం కుదిరిందని తెలిసింది. త్వరలో ఈ ప్లాన్ను అమలు చేసేందుకు రియల్టర్లు, పెద్దసారు కలిసి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. ప్రణాళిక ఇలా.. ప్రస్తుతం రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్గా కొనసాగుతు న్న వారు కొద్దిరోజుల పాటు సెలవులో వెళ్తారు. ఇప్పటికే ఒక సబ్రిజిస్ట్రార్ సెలవులో ఉండగా.. మరో సబ్ రిజిస్ట్రార్ కూడా లీవ్లో వెళ్తాడు. ఆ తర్వాత ఒక దిగువశ్రేణి ఉద్యోగిని తీసుకొచ్చి కొద్దిరోజుల పాటు ఇన్చార్జిగా కూర్చోబెడుతారు. ఆయన ఆధ్వర్యంలో అనధికారిక లేఅవుట్లలోనిప్లాట్ల రిజిస్ట్రేషన్లు చకచకా సాగేలా ప్లాన్ వేశారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో.. ప్రభుత్వం గతంలో జీవో నం.257 జారీ చేసింది. ఆ ప్రకారం అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయరాదు. డీటీసీపీ, ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్ల కు మాత్రమే ఏడాదిగా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని ఎస్ఆర్వో కార్యాలయానికి వెళ్లినప్పుడు సబ్రిజి స్ట్రార్లు పేర్కొంటున్నారు. లేనిపక్షంలో ఆ ప్లాట్ రిజి స్ట్రేషన్ అయి ఉండి లింక్ డాక్యుమెంట్ కలిగి ఉంటే దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే లింక్ డాక్యుమెంట్ లేకపోవడం, ఇటు లేఅవుట్లకు డీటీసీపీ అనుమతి రాకపోవడం, ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ లేకపోవడంతో ఆదిలాబాద్ చుట్టుపక్కల్లోని అనేక వెంచర్లలో ఇలాంటి వందలాది ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా నిలిచిపోయాయి. దీంతో సహజంగానే రియల్ వ్యాపారం ఆదిలా బాద్లో స్తబ్ధుగా మారింది. కోట్ల రూపాయల డీల్..? ఈ పరిస్థితిలో రియల్టర్లు ఆ పెండింగ్ ప్లాట్లను క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తుగడ వేశారు. అందులో భాగంగా రిజిస్ట్రేషన్శాఖ అధికారుల్లో ఓ పెద్ద సారుతో బేరసారాలు నడిపారని ఆదిలాబాద్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ ప్లాట్లన్నింటినీ రిజిస్ట్రేషన్ చేసిన పక్షంలో ఆయనకు రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్ల వరకు ఇచ్చేలా డీల్ కుదిరిందని చెప్పుకుంటున్నారు. దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటా.. ఆదిలాబాద్ ఎస్ఆర్వో పరిధిలో అనధికారిక లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు ఒక్కటి జరిగినా నా దృష్టికి తీసుకురండి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటా. ప్రస్తుతం ఆదిలాబాద్లో జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ విజయ్కాంత్ రావు సెలవులో వెళ్లారు. దీంతో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్రెడ్డి ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా ఉన్నారు. రియల్టర్లతో ప్లాన్ విషయం నా నోటీసుకు రాలేదు. – రవీందర్రావు, జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్ -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది. డ్రాపౌట్స్ ఎక్కువే.. విద్యారంగంలో ఇప్పటికీ చాలామందికి విద్య అందని ద్రాక్షగానే మారుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో సరైన సౌకర్యాలు లేక నమోదు క్రమంగా పడిపోతోంది. అంతేగాక డ్రాపౌట్స్ ఇంకా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆసిఫాబాద్ జిల్లాలో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉండగా, మంచిర్యాలలో తక్కువగా ఉంది. విద్యార్థులకు టీచర్ల నిష్పత్తి తక్కువగా ఉంది. నిబంధనల ప్రకారం 1నుంచి 5వరకు ప్రతీ 30మంది విద్యార్థులకు ఒక టీచరు, 6నుంచి 8వరకు 35మందికి ఒక టీచరు ఉండాలి. కానీ అంతకంటే తక్కువగా ఉన్న విద్యార్థుల కంటే టీచర్ల సంఖ్య అధికంగా ఉంది. ● ఉమ్మడి జిల్లాలో స్వయం సహాయ సంఘాలు, సభ్యుల సంఖ్య పెరుగుతోంది. రుణ పరిమితి పెరుగుతూ క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. ● వాహన రిజిస్ట్రేషన్లు పెరగడంతోపాటు ఇటీవల విద్యుత్ వాహనాలకొనుగోళ్లు పెరుగుతున్నాయి. ● మాతాశిశు సంరక్షణలో ఇంకా పోషకాహార లోపంతో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇప్పటికీ ఆయా కేంద్రాల్లో నమోదైన వారికి పూర్తి స్థాయిలో పోషకాహరం అందడం లేదు. అంగన్వాడీ కేంద్రాలు, ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా ఇంకా వంద శాతం పోషకాహార రహితంగా మార్చేందుకు ఇంకెంత కా లం పడుతుందనే ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. ● ఉమ్మడి జిల్లాలో క్రమంగా జాతీయ రహదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ఎన్హెచ్–44, 64, 363తోపాటు కొత్తగా పలు రోడ్లు అప్గ్రేడ్ కావడంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతోంది. డ్రాపౌట్ రేట్(శాతం) జిల్లా ప్రైమరీ అప్పర్ హైస్కూల్ ప్రైమరీఆదిలాబాద్ 1.29 4.97 16.54 ఆసిఫాబాద్ 1.80 7.39 16.39 మంచిర్యాల –0.14 2.60 20.39 నిర్మల్ 2.69 2.59 17.72విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిజిల్లా ప్రైమరీ అప్పర్ హైస్కూల్ హయ్యర్ ప్రైమరీ సెకండరీ స్కూల్ఆదిలాబాద్ 18 16 21 17 ఆసిఫాబాద్ 17 17 22 17 మంచిర్యాల 16 13 18 17 నిర్మల్ 18 15 18 17 -
చికిత్స పొందుతూ ముగ్గురి మృతి
సోన్: విద్యుత్షాక్ గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై కె.గోపి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన మోరే చంద్రకాంత్ లారీడ్రైవర్గా పని చేస్తున్నాడు. మండలంలోని మాదాపూర్ గ్రామానికి పసుపు కోసం మంగళవారం వచ్చాడు. గ్రామంలో 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి నాగోరావు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. రిమ్స్లో యువకుడు.. కైలాస్నగర్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మాహూర్ తాలుకాలోని కోడ్కుప్టి గ్రామానికి చెందిన యువకుడు సెలార్ అంకుష్ (20) రిమ్స్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. టూటౌన్ ఎస్సై ముకుంద్రావు కథనం ప్రకారం.. అంకుష్ ఈనెల 3న శుభకార్యానికి బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు మహారాష్ట్రలోని కోర్టలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై తెలిపారు. లక్ష్మణచాందలో ఒకరు.. లక్ష్మణచాంద: పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మండల కేంద్రానికి చెందిన పవర్ రమేశ్ (35) గత మూడురోజుల క్రితం గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
గొర్రెలు ఎత్తుకెళ్లిన నలుగురి అరెస్టు
భీమిని: కన్నెపల్లి మండలం జన్కాపూర్ శివా రులో గొర్రెలను ఎత్తుకెళ్లిన నలుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై గంగారాం తెలిపారు. పోలీసుస్టేషన్లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా దన్వాడ మండలం గొటూరుకు చెందిన పొర్ల నరేశ్..160 గొర్రెలను మేపడానికి ఇటీవల జన్కాపూర్కు వచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తులు 33 గొర్రెలను ఎత్తుకెళ్లారని ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం కన్నెపల్లి సబ్స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా బొలెరోలో గొర్రెలను తరలిస్తుండగా డ్రైవర్ను అదుపులో తీసుకుని విచారించారు. జన్కాపూర్కు చెందిన ప్రశాంత్, సంతోష్, అభిలాష్, సత్తన్న కలిసి గొర్రెలు విక్రయించారని తెలిపాడు. వాహనాన్ని సీజ్ చేసి, నలుగురిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీసులో పోస్టల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న సాయిపోతిరెడ్డి శివారెడ్డి ఖోఖో ప్ర పంచకప్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి విజయం సాధించడం గర్వకారణ మని పలువురు పేర్కొన్నారు. వరల్డ్ కప్లో గెలుపొందిన అనంతరం ఆయన బుధవా రం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ మేర కు పట్టణంలోని వినాయక చౌక్లో పోస్టల్ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. అక్క డి నుంచి జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ కా ర్యాలయం వరకు స్వాగతించారు. అనంత రం ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ సిద్ధార్థ ఆయనను సత్కరించి మెడల్ అందించారు. ఈసందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ తాను వరల్డ్ కప్లో రాణించేందుకు శాఖ అధికారుల సహకారం ఎంతో ఉందన్నారు. ఇందులో పోస్ట్మాస్టర్ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
24న సేవాలాల్ జయంతి వేడుకలు
కై లాస్నగర్: బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఈ నెల 24న పట్టణంలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికా రులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ నిబంధనలు అనుసరించి వేడుకలు నిర్వహించాలన్నారు. హాజరయ్యే వారికి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ శాఖ ద్వారా నిరంతర కరెంట్ సరఫరా చేయాలన్నారు. అలాగే మున్సిపల్ ద్వారా రెండు రోజుల ముందు నుంచే శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. పంచాయతీ శాఖ ద్వారా ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం, వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంప్, పోలీస్ శాఖ ద్వారా బారికేడ్లు, బందో బస్తు, పార్కింగ్ ప్రాంతాలు వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి, ఆర్డీవో వినోద్కుమార్, బంజారా ఉత్సవ కమిటీ చైర్మన్ భీమ్రావ్, ఐటీడీఏ డీడీ వసంత్రావు, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు క్షయ రోగులకు పోషకాహార కిట్లు అందించేందుకు గ్లాండ్ పార్మా అనే కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో కలిసి డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డా.స్నేహ శుక్లా మంగళవారం కలెక్టర్ రాజర్షి షాను తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల చేపట్టిన వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,332 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. వారందరికీ ఆరు నెలల పాటు పోషకాహార కిట్లను ఆ కంపెనీ ద్వారా అందించనున్నట్లుగా కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ను కలిసిన వారిలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, జిల్లా క్షయ నియంత్రణాధికారి సుమలత తదితరులున్నారు. ● కలెక్టర్ రాజర్షి షా -
ముందస్తు చర్యలు చేపట్టాలి
కైలాస్నగర్: రానున్న వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. 97 హ్యాబిటేషన్లలో తాగునీటి ఇక్కట్లు గుర్తించి బోరు బావులు, బావులు, పైపులైన్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనే దానిపై నివేదిక అందజేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారిని ఆదేశించారు. ముఖ్యంగా ఇంద్రవెల్లి, గాదిగూడ, ఉట్నూర్, అదిలాబాద్ రూరల్ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ చేయాలని సూచించారు. నీటి సమస్య ఎక్కువగా ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఐటీడీఏ ిపీవో ఖుష్బూ గుప్తా, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్డీవో వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హీరాసుక జయంతి విజయవంతం చేయండి
ఆదిలాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఈ నెల 23న నిర్వహించనున్న హీరా సుక జయంతిని ఉమ్మడి జిల్లా ఆదివాసీ పర్ధాన్ సమాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజ యవంతం చేయాలని ఆదివాసీ పర్ధాన్ సమాజ్ జాతీయ నాయకుడు సిడాం రాంకిషన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మెస్రం శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరాసుక దేవస్థాన మందిరం ఆవరణ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పూసం ఆనంద్రావ్, సెడ్మకి సుభాష్, గేడం మా ధవ్, ప్రకాశ్, రామాకాంత్ తదితరులున్నారు. ఇంద్రవెల్లి: జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించే హీరాసుక జయంతికి భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పర్ధాన్గూడ పటేల్ గేడం జ్ఞానేశ్వర్, పర్ధాన్ సమాజ్ మండల అధ్యక్షుడు గేడం భరత్ కోరారు. మండలకేంద్రంలోని పర్ధాన్గూడలో ఆయా గ్రామాల సమాజ్ పెద్దలతో మంగళవారం సమావేశమయ్యారు. ఇందులో నాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఇంద్రవెల్లి: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహా ల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యంపై వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంద ని ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడ్మెత మనోహర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. మొత్తం 100 మంది విద్యార్థినుల రక్తనమానాలు సేకరించారు. విద్యార్థినులకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యులు పూజిత, సీహెచ్వో సందీప్, పీహెచ్ఎన్ జ్యోతి, హెల్త్ సూపర్వైజర్ నరేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన డీసీసీబీ చైర్మన్
కైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మంగళవా రం సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టెస్కాబ్ చైర్మన్తో పాటు రా ష్ట్రంలోని ఆయా సహకార బ్యాంకుల చైర్మన్లతో కలిసి హైదరాబాద్లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాయంలో సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. తమ పదవీ కాలం మరో ఆరునెలల పాటు పొడిగింపుపై హ ర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలి పారు. జిల్లాలో సాంకేతిక కారణాలతో రుణ మాఫీ కాని రైతుల రుణాలు మాఫీ చేసేలా చూడాలని విన్నవించగా, సీఎం సానుకూల త వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
పంటల లెక్క.. ఇక పక్కా
● పకడ్బందీగా డిజిటల్ క్రాప్ సర్వే ● క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేస్తున్న ఏఈవోలు ● నివేదిక ఆధారంగా పంట దిగుబడి కొనుగోళ్లు బోథ్: పంటల లెక్క పక్కాగా తేల్చేందుకే ప్రభుత్వం ఈ నెల 3న డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జిల్లాలోని 101 క్లస్టర్లలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల చేలల్లోకి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆయా పంటల సాగు వివరాలు పక్కాగా తేలనున్నాయి. వీటి ఆధారంగానే రైతుల పంట దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశశం ఉంటుంది. ఏఈవోలు తమ క్లస్టర్ పరిధి లో 18వందల నుంచి 2వేల ఎకరాల వరకు సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సర్వే ఇలా.. ఈ సర్వే నిర్వహణకు గాను ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించింది. ఇందులో భా గంగా ఏఈవోలు రైతుల చేల వద్దకు వెళ్తున్నారు. పంటల సాగు విస్తీర్ణం వివరాలను అందులో నమోదు చేస్తున్నారు. సర్వేనంబర్ ఎంట్రీ చేయగానే ఆ పరిధిలో ఉన్న రైతుల వివరాలు కనిపిస్తాయి. కావాల్సిన రైతు పేరు ఎంచుకోగానే వారి పేరిట ఉన్న భూమి వివరాలు దర్శనమిస్తాయి. అందులో రైతు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడో నమోదు చేయాలి. అలాగే సాగు ఫొటోను యాప్లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ సాగులో లేని భూమి ఉంటే వాటిని నాన్క్రాప్ కింద నమోదు చేస్తున్నారు. పంటల నమోదు ఆధారంగానే కొనుగోళ్లు.. ఈ సర్వేతో రైతులు సాగు చేసే పంటల వివరాలు పక్కాగా తేలనున్నాయి. తదనుగుణంగా వచ్చే దిగుబడిని మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థకు మద్దతు ధరతో విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. పలు చోట్ల ఇబ్బందులు.. సర్వేలో భాగంగా ఏఈవోలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవటంతో యాప్ ఓపెన్ కావడం లేదు. అలాగే పలు చోట్ల సర్వర్ నెమ్మదించటం, మరికొన్ని చోట్ల రైతుల చేలల్లో లొకేషన్ తప్పుగా చూపించడం, సర్వే నంబర్లు కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఏఈవోలు చెబుతున్నారు. సర్వేతో పక్కాగా సాగు లెక్క జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏఈవోలు రైతుల చేలల్లోకి వెళ్లి పంటల సాగు వివరాలు అక్కడే నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లా వ్యాప్తంగా రైతులు ఏయే పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో లెక్కలు పక్కాగా రానున్నాయి. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాఽయాధికారి -
● ఎస్హెచ్జీలకు విరివిగా సీ్త్రనిధి రుణాలు ● ‘బ్యాంకు లింకేజీ’ కూడా 98 శాతం పూర్తి ● అతివలకు అండగా నిలుస్తున్న మెప్మా ● మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత
స్వయం సహాయక సంఘ సభ్యులతో సమావేశం (ఫైల్) పట్టణంలోని సంఘాలు, రుణాల ప్రగతి వివరాలు మొత్తం వార్డులు: 49 జనాభా : 155747 స్వయం సహాయక సంఘాలు: 2,536 అందులోని సభ్యులు: 25,722 మొత్తం రుణలక్ష్యం : రూ.26.36 కోట్లు ఇప్పటి వరకు అందించిన రుణాలు 26.37కోట్లు పకడ్బందీ ప్రణాళికతోనే లక్ష్యసాధన ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే రుణ లక్ష్యాలను సాధించే దిశగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. పట్టణంలోని ప్రతీ వార్డులో ఎస్ఎల్ఎఫ్లతో సమావేశాలు నిర్వహించి బ్యాంకు లింకేజీకి అర్హులైన ఎస్హెచ్జీల సమాచారం సేకరించాం. ఏదైనా యూనిట్ ఏర్పాటు చేయాలనుకునే వారికి అత్యవసరమైన రుణాలను సీసీఎల్ కింద అందజేశాం. టీజీబీ, యూబీఐ బ్యాంకుల ఆధ్వర్యంలో ప్రతి నెలలో లాగిన్ డే నిర్వహించి బ్యాంకులిచ్చిన సమాచారం ప్రకారం ఎన్ని ఎస్హెచ్జీలు రికవరీకి ఉన్నాయి.. రుణాల చెల్లింపు ఎంత పూర్తయిందనే వివరాలు తెలుసుకుని లింకేజీ రుణాలు ఇప్పించాం. వారం రోజుల్లోనే వారి ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపట్టాం. ఫలింగానే వందశాతం రుణా లక్ష్యాలను సాధించాం. – శ్రీనివాస్, డీఎంసీ, మెప్మా కై లాస్నగర్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ప్రధానంగా బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలతో పాటు సీ్త్ర నిధి ద్వారా ఆర్థికసాయం అందజేస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన రుణ లక్ష్యాలను వందశాతం సాధించే దిశగా మెప్మా ముందుకు సాగుతోంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను చైతన్యపరుస్తూ ఇప్పటికే సీ్త్ర నిధి రుణాలను లక్ష్యానికి మించి అందజేశారు. అలాగే బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని 98శాతం సాధించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 40 రోజుల గడువు ఉండటంతో దానిని కూడా త్వరలోనే అధిగమించేలా కృషి చేస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలిలా.. బ్యాంకు లింకేజీ ద్వారా పట్టణంలోని 330 సంఘాలకు రూ.19కోట్ల 91లక్షల 15వేల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 177 సంఘాలకు గాను రూ.19కోట్ల 67లక్షల 14వేల రుణాలు అందజేశారు.98.79శాతం లక్ష్యాన్ని సాధించగా ఇంకా సమయం ఉన్నందున వీటి ప్రగతి కూడా వందశాతానికి మించి నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే స్వయం ఉపాధి కార్యక్రమం (సెప్–1) కింద రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు సభ్యులకు ఆర్థిక చేయూతనందించాలని నిర్ణయించారు. దీని కింద 24 యూనిట్లను లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 25 యూనిట్లకు రుణాలు అందజేసి అందులోని వందశాతం మించి ప్రగతిని సాధించారు. మహిళాశక్తిలో తడబాటు... బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధికి సంబంధించి వందశా తం రుణాలు అందజేస్తూ ఆదర్శంగా నిలిచిన మెప్మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మాత్రం తడబాటుకు గురవుతోంది. ఈ పథకం కింద వ్యక్తిగత రుణాలు 144మందికి అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 96 మందికి మాత్రమే అందజేశారు. మరో 48 యూనిట్లను సాధించాల్సి ఉంది. అలాగే గ్రూపులకు 25 యూనిట్లకు రుణాలు అందించాల్సి ఉండగా 18 యూనిట్లకు అందజేసి వివిధ వ్యాపారాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. మరో ఏడు యూనిట్లను సాధించాల్సి ఉంది. అయితే ఇంకా సమయం ఉన్నందున వీటిని కూడా వందశాతం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆసక్తిగల మహిళలను ఎంపిక చేసి వారికి రుణాలందించేలా శ్రద్ధ వహిస్తున్నారు. తద్వారా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ తో పాటు టైలరింగ్, సెంట్రింగ్ వంటి తదితర వ్యా పారాలు ప్రారంభించేలా చొరవ చూపుతున్నారు. సీ్త్రనిధి రుణాలు.. 103 శాతం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అండగా నిలుస్తోంది. బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందజేస్తూ వారు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను సీ్త్ర నిధి రుణ లక్ష్యం రూ.6 కోట్ల 28 లక్షల 64వేలు ఉండగా ఇప్పటి వరకు రూ. 6 కోట్ల 52లక్షల 23వేలను అందించారు. లక్ష్యానికి మించి 103 శాతం రుణాలు అందజేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు 150 శాతం వరకు చేరుకుంటామని మెప్మా అధికారులు చెబుతున్నారు. -
‘ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం’
ఎదులాపురం: ఎన్నికల కోడ్ అనంతరం ప్ర జా సమస్యలపై ఉద్యమిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిల్లాకు తీరని అన్యాయం చేసిందన్నా రు. ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వేలైన్, విమానాశ్రయం ఏర్పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ తెరి పించడం వంటి ప్రధాన హామీలతో జిల్లావాసులను ఏళ్లుగా మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అనంతరం ఆయా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామన్నా రు. కార్యక్రమంలో నాయకులు రా ములు, అరుణ్కుమార్, నర్సింగ్రావు, మహబూబ్ఖాన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి
తాంసి: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని అదనపు ఎస్పీ సురేందర్రావు అన్నారు. జాతీయ సైన్స్డే పురస్కరించుకుని మండలంలోని కప్పర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం సైన్స్ఫేర్ ఏర్పా టు చేశారు. ఈసందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎగ్జిబిట్లను సందర్శించి విద్యార్థుల ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రాధిక, ప్రధానోపాధ్యాయుడు ఆనంద్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ముస్లింలను బీసీల్లో చేరిస్తే స్పందించరా?
● కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? ● కేంద్ర మంత్రి బండి సంజయ్ ● మంచిర్యాలలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం సాక్షిప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: ‘బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు అని చెప్పి.. 10 శాతం ముస్లింలను కలిపితే బీసీలకు అన్యాయం జరిగిన ట్లు కాదా.. కాంగ్రెస్ నేతలు స్పందించరా..? బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు. ..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘రంజాన్కు ముస్లిం ఉద్యోగులందరికీ సాయంత్రం 4గంటలలోపే విధులు ముగించుకుని వెళ్లిపోవచ్చని మినహాయింపు ఇచ్చారు. అయ్యప్ప, హనుమాన్, భవానీ భక్తులు ఏం పాపం చేశారని.. కాంగ్రెస్లోని హిందువులారా.. మీలో నిజంగా హిందూ రక్తమే ప్రవహిస్తే సమాధానం చెప్పాలి..’అంటూ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. అంతకు ముందు పట్టణంలో కార్యకర్తలు, నాయకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు కే.వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజ య్ మాట్లాడుతూ.. మూడుస్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఏ సర్వే చూసినా స్పష్టం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం రూ.12.75లక్షల ట్యాక్స్ మినహా యింపు, పదేళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులను తెలంగాణకు ఇచ్చిందన్నారు. కేంద్రం నిధులివ్వడం లేదని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ బహిరంగ చర్చకు సిద్ధమా..? ఈ అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి రావాలని కాంగ్రెస్కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. సొంత కాలేజీ స్టాఫ్ను పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. మంచిర్యాలలో దాదాగిరి మంచిర్యాలలో కొందరు దాదాగిరి చేస్తున్నారని, ఆరు నెలల కంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదని కేంద్రమంత్రి సంజయ్ అన్నారు. ప్రభుత్వంలో టాప్ 5లో ఉన్న వాళ్ల దోపిడీ, అవి నీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని, కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని విమర్శించారు. అవినీ తి జరుగుతుందడానికి సీఎం వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 15శాతం కమీషన్లు ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు అప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ బీసీ కాదని ఆయన కులం గురించి అవాకులు పేలుతున్నారని, రాహు ల్ ఖాన్ గాంధీ తండ్రి పేరు ఏమిటి? ఫిరోజ్ఖాన్ గాంధీ...అసలు గాంధీ అని పేరు యాడ్ చేసుకుని గాంధీ పరువు తీస్తున్నారని విమర్శించారు. మహా త్మాగాంధీ ఆత్మ బాధపడుతోందని, ఫిరోజ్ఖాన్ గాంధీ కొడుకు, మనవడు ఏమైతరు? హిందువులై తే కానే కాదన్నారు. మీరు హిందువులేనా? మీలో హిందువు రక్తం ప్రవహిస్తుందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాడింది తామే అని, నిరుద్యోగులకు మోచేతికి బెల్లం రాసి నాకిచ్చి నంత పనిచేశారని అన్నారు. 2లక్షలకుపైగా ఖాళీలు ఉన్నాయని, ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలని అన్నారు. కోడ్ లేని జిల్లాల్లో వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఓట్లు దండుకోవడంలో కాంగ్రెసోళ్లు కేసీఆర్ను మించి పో యిర్రని తెలిపారు. ఇవన్నీ ప్రశ్నిస్తే హిందూ ముద్రవేస్తున్నారన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేస్ స్కాం కేసులో ఇదిగో అరెస్ట్...అదిగో అరెస్ట్ అంటూ మీడియాలో వార్తలు రాయించుకుంటూ కాలయాపన చేయడం తప్ప కాంగ్రెస్ సాధించిందేమిటి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కాంలు ఢిల్లీలో ని కాంగ్రెస్ నేతలకు ఏటీఎంలాగా మారాయని, ఒక్కో స్కాం ఢిల్లీ పెద్దలకు రూ.వెయ్యి కోట్లకుపైగా పైసలు దండుకుంటున్నారని అన్నారు. -
వేడుకలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి
ఆదిలాబాద్టౌన్: ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఏఎస్పీ సురేందర్ రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని వన్టౌన్లో సీఐలు, ఎస్సైలతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19న శివాజీ జయంతి సందర్భంగా ర్యాలీ కోసం మూడు సంఘాలు వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నాయన్నారు. షరతులతో కూడిన ర్యాలీకి అనుమతి ఇచ్చేందుకు ఆర్డీవోకు పంపినట్లు తెలిపారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బాధ్యత వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ పాటించాలని పేర్కొన్నారు. ఇందులో డీఎస్పీ జీవన్రెడ్డి, టూటౌన్, రూరల్, జైనథ్ సీఐలు కరుణాకర్రావు, ఫణిందర్, సాయినాథ్, ఎస్సైలు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అర్జీలిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి
● ప్రజావాణికి 69 దరఖాస్తులు ● స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా కై లాస్నగర్: భూ సమస్య పరిష్కరించాలని ఒకరు.. పింఛన్ అందడం లేదని ఇంకొకరు.. రైతుభరోసా సాయం కోసం మరొకరు.. ఇలా తమ సమస్యల గోడును బాధితులు కలెక్టర్ రాజర్షి షాకు వినిపించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో బాధితుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. వాటిని అధికారులకు అందజేస్తూ పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ వారం మొత్తం 69 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. బాధితుల్లో కొందరి నివేదన.. అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి నా పేరు సిర్రా దేవేందర్. ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శిని. రిమ్స్లోని మలేరియా విభాగంలో రెండు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉండగా పీహెచ్సీల్లో పనిచేసే ముగ్గురిని డీఎంహెచ్వో అక్కడికి డిప్యూటేషన్పై నియమించారు. దీంతో వారు వంతుల వారీగా విధులకు హాజరవుతున్నారు. ముగ్గురు పనిచేయాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. అది కూడా సమయపాలన పాటించడం లేదు. అక్రమ డిప్యూటేషన్లతో అటు మండల ప్రజలకు ఇటు రిమ్స్కు వచ్చే రోగులకు సరైన సేవలు అందడం లేదు. అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలని కలెక్టర్కు విన్నవించాను. -
కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
కైలాస్నగర్: ఆదిలాబాద్ రూరల్ మండలం నిఘా న్ఘాట్లోని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు మౌలిక వసతులు కల్పించాల ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరుకు సోమవారం కాలనీవాసులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదేళ్లుగా పేదలు అక్కడ గుడిసెల్లో నివసిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయమన్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి తాగునీరు, విద్యుత్ సౌకర్యం వంటివి కల్పించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. -
ప్రత్యేక తరగతులను పర్యవేక్షించాలి
కై లాస్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పదో తరగతి విద్యార్థుల కు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను నిత్యం పర్యవేక్షించాలని మండల ప్రత్యేకాధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ స మావేశ మందిరంలో సోమవారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, స్నాక్స్ అందేలా దృషి సారించాలన్నారు. అలాగే వారు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు ప్రత్యేక తరగతులకు హాజరై విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేయాలన్నారు. అనంతరం జన్మన్ యోజన కింద చేపడుతున్న అంగన్వాడీ భవనాలకు మంజూరైన వాటి నివేదికలు త్వరగా పంపాలని డీడబ్ల్యూవోను ఆదేశించా రు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్కుమార్, డీఈవో ప్రణీత, డీడబ్ల్యూవో సబిత, డీఆర్డీవో రవీందర్ రాథోడ్ పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణనేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 24న నిర్వహించనున్న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి పోస్టర్ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని ఆయన నివాసంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. -
ప్రజలు ‘కేసీఆర్ ప్రభుత్వాన్ని’ కోరుకుంటున్నారు
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ‘జోగు’ ● ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆదిలాబాద్టౌన్: తెలంగాణ ప్రజలు మరో సారి కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామ న్న అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. అనంతరం గంగపుత్ర శివాలయంలో పూజలు చేసి అన్నదానం ప్రారంభించారు. ఈద్గా మై దానంతో పాటు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కలు నాటారు. పార్టీ కార్యాలయంలో ఒక్కో కార్యకర్తకు మూడు మొక్కలు అందించి నాటాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పదేళ్లలో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అజ య్, నారాయణ, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అక్బాని, సాజి తోద్దీన్, స్వరూప రాణి, మమత, కరుణ, తదితరులు పాల్గొన్నారు. అలాగే జైనథ్లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట నాయకులు నారా యణ, లింగారెడ్డి, వెంకటరెడ్డి, గణేశ్యాదవ్ తదితరులున్నారు. చిత్రం గీసి.. శుభాకాంక్షలు తెలిపి తాంసి: కేసీఆర్ జన్మదినం సందర్భంగా మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన చిత్రకారుడు గట్టు రాజు స్వయంగా మాజీ సీఎం చిత్రపటాన్ని పెన్సిల్తో గీశాడు. ఇలా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నాడు. -
అంగట్లో ఓటర్ల ఫోన్ నంబర్లు!
సాక్షి ప్రతినిధి,మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ కే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలంటూ పట్టభద్రులు, టీచర్ల ఓటర్లకు నిత్యం పదుల సంఖ్యలో కాల్స్, మెసేజ్లు వస్తున్నాయి. కాల్ లిఫ్ట్ చేసే వర కూ ఫోన్లు మోగుతూనే ఉంటున్నాయి. ఒకరిద్ద రు కాదు లక్షలాది మంది ఓటర్ల ఫోన్ నంబర్లకు ఇలా ఫోన్లు వస్తున్నాయి. కొందరు చాటుగా ఫోన్ నంబ ర్లు తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో నిత్యం ఓటర్లకు కాల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లంతా విద్యావంతులే. కానీ, వారికి తెలియకుండానే ఫోన్ నంబర్లు సేకరించి నేరుగా అభ్యర్థుల ఫోన్లు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఫోన్ నంబర్లను సైతం పైసలకు అమ్ముకోవడం గమనార్హం. ప్రైవేటు వ్యక్తుల చేతిలో.. ఓటరు నమోదు సమయంలో ఎన్నికల సంఘం అధికార వెబ్సైట్, మాన్యువల్గా దరఖాస్తు చేసిన సమయంలో ఫోన్ నంబర్లను కూడా పేర్కొన్నారు. అలా అనేక మంది ఓటర్ల ఫోన్ నంబర్లు నిక్షిప్తమయ్యాయి. అయితే అధికార వెబ్సైట్లో నమోదు చేసిన వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాలి. కానీ జిల్లాల్లో ఎన్నికల విభాగంలో పని చేస్తున్న కొందరు అధికారులు బయటకు ఇస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు వివరాలు వాటిని కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. ప్రచారం నుంచి సర్వేలదాకా పలు సంస్థలు, సోషల్మీడియా వేదికగా వాడుకుంటున్నాయి. చాలా మందికి ఒకటికి రెండుసార్లు ఫోన్లు చేస్తూ ఓటర్లకు చిరాకు తెప్పిస్తున్నారు. తక్కువ స మయంలో ఎక్కువ మందిని పలకరించేలా, నేరుగా ఫోన్ నంబర్లపైనే అభ్యర్థులు ఆధాపడుతున్నారు. లక్షలాది ఫోన్ నంబర్ల సేకరణ ఓట్ల కోసం లక్షలాది మంది ఓటర్ల వివరాలు సేకరించారు. ఎన్నికలు ముగిసినప్పటికీ వివిధ వ్యాపా ర ప్రకటనలు, ఇతరత్రా అవసరాల కోసం కూడా ఈ ఓటర్ల ఫోన్ నంబర్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. మహిళల ఫోన్ నంబర్లతోపాటు వారి సోషల్ మీడియా అకౌంట్లు లింకు ఉన్న వాటికి కూడా ప్రకటనలు పంపుతున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్తో సైబర్ నేరాలకు ఆస్కారం ఉంటుంది. అయితే కొందరు ఆ నంబర్ల నుంచి కాల్ రాగానే బ్లాక్ లేదా, స్పామ్గా రిపోర్టు చేస్తున్నారు. ఓటరు నమోదు సందర్భంగా లక్షలాది మందివి సేకరణ ఒక్కో పీడీఎఫ్ కాపీకి రూ.20 వేల నుంచి రూ.50 వేలు కొనుగోలు చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓటర్లకు నిత్యం కాల్స్, మెసేజ్లు ‘నేను మీ ఎమ్మెల్సీ అభ్యర్థిని.. బ్యాలెట్ పేపర్లో నాది ఫలానా నంబర్. మీ పోలింగ్ బూత్ నంబర్ ఇదీ.. మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకే వేసి గెలిపించగలరు’ ఇదీ మంచిర్యాలకు చెందిన ఓ పట్టభద్రుడికి వచ్చిన ఫోన్. ఇలా అతడికి రోజూ పదుల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. కానీ సదరు ఓటరు ఏ అభ్యర్థికీ తన ఫోన్ నంబర్ ఇవ్వలేదు. అయినా కాల్స్ ఎలా వస్తున్నాయో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సైతం ఇదే తరహాలో ఫోన్లు, మెస్సేజ్లు చేస్తున్నారు. ‘మా వద్ద పట్టభద్రులు, టీచర్ ఓటర్ల పేర్లు, అడ్రస్, ఫోన్ నంబర్ సహా వివరాలు ఉన్నా యి. మీకు కావాలంటే చెప్పండి. రూ.30 వేలు ఇస్తే మీకు పీడీఎఫ్ కాపీ పంపుతాం’ అని ఓ స్వతంత్ర అభ్యర్థికి ఓ వ్యక్తి ఆఫర్ చేశాడు. ‘నేను అంత ఇవ్వలేను’ అని ఆ అభ్యర్థి చెబితే.. ‘రాజకీయ పార్టీల వాళ్లు మాకు ఒక్కో పీడీఎఫ్కు రూ.50 వేలు ఇచ్చారు. ఇప్పటికే వారందరూ ఓటర్లకు ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్లో సందేశాలు పంపుతున్నారు. మీరు కూడా అలాగే ప్రచారం చేసుకోవచ్చు’ అని సూచించాడు. -
● పదవుల విషయంలో పలువురిలో అసంతృప్తి ● ప్రాధాన్యత ఇవ్వలేదంటున్న సీనియర్లు ● ఎంపీ గోడం, ఎమ్మెల్యే ‘పాయల్’పైనే సమన్వయ భారం ● ‘స్థానిక’ ఎన్నికల ముందు పార్టీలో అంతర్గత లొల్లి
● పార్టీ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షులుగా తొలిసారి ఇద్దరిని నియమిస్తూ నిర్ణయం తీసుకోవడంపై కార్యకర్తల్లో విస్మయం వ్యక్తమవుతుంది. మొదట ముగ్గురిని నియమించాలని భావించినప్పటికీ ఈ విషయంలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇద్దరితో సరిపెట్టినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ప్రస్తుతం పట్టణ అధ్యక్షులుగా వేదవ్యాస్, గండ్రత్ మహేందర్ ఉన్నారు. ● నేరడిగొండ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న సాబ్లే సంతోష్ సింగ్ రెండు రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మండల అధ్యక్షులకు కనీస మర్యాద, సమాచారం ఇవ్వకుండా అవమానించడం బాధకు గురి చేసిందని, విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదని సంతోష్ సింగ్ తన రాజీనామా పత్రంలో పేర్కొన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నారని అందులో పేర్కొనడం గమనార్హం. ● నెల క్రితం కొన్ని మండలాలకు అధ్యక్షులను నియమిస్తూ పార్టీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అయితే ఈ నియామకాలు ఏకపక్షంగా సాగాయని పలు మండలాల్లో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా పార్టీలో పాత నాయకులను విస్మరించి కొత్తవారికి అవకాశం కల్పించారని పలువురు ఆరోపించారు. భీంపూర్ మండల బీజేపీ నూతన అధ్యక్షుడు అంకం అశోక్ను మార్చాలంటూ పార్టీ క్యాడర్ మండలానికి వచ్చిన ఎంపీ గోడం నగేశ్కు వినతి పత్రం అందజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బేల మండలంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆ నాయకుడిని మండల అధ్యక్షుడిగా నియమించడం అభ్యంతరాలకు దారి తీసింది. ● బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గుడిహత్నూర్కు చెందిన బ్రహ్మానంద్ను మరోసారి కొనసాగిస్తూ ఇటీవల పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పార్టీలో సీనియర్ నాయకులు ఈ ని యామకంపై నారాజ్గా ఉన్నారని ప్ర చారం సాగుతోంది. ప్రధానంగా జిల్లా అధ్యక్ష నియామకానికి సంబంధించి కనీసం పార్టీలో అభిప్రా య సేకరణ చేయలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని సీనియర్లు వాపోతున్నారు. సాక్షి,ఆదిలాబాద్: బీజేపీలో లుకలుకలు బయట ప డుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కలిగి ఉండటం, ప్రస్తుతం పదవీకాలం ముగిసినప్పటికీ గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు జెడ్పీటీసీ, అటు ఎంపీటీసీ, బల్దియాలో కౌన్సిలర్లుగా పలు వు రు కాషాయ పార్టీ నుంచి గెలుపొందారు. ప్రసు తం స్థానిక సంస్థల ఎన్నికల ముందు పటిష్టంగా ఉండాల్సిన పార్టీలో అంతర్గతంగా విభేదాలు బయటపడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఎంపీ గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ ఈ పరిస్థితులను చక్కదిద్ది పార్టీ లో సమన్వయం తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. విభేదాలు ఇలా.. ఇదివరకు పార్టీ అధ్యక్ష పదవిని సీనియర్ నేతలు చిట్యాల సుహాసినిరెడ్డి, ఆదినాథ్, వేణుగోపాల్, జ్యోతిరెడ్డి ఆశించారు. అయితే అనూహ్యంగా ఎమ్మె ల్యే పాయల్ శంకర్ అనుచరుడు బ్రహ్మానంద్ను పార్టీ నియమించడంపై అప్పట్లోనే ఈ సీనియర్ నే తలు నిరుత్సాహానికి గురయ్యారు. తాజాగా జిల్లా అధ్యక్షుడిగా తిరిగి ఆయననే కొనసాగించడం, ఈ నిర్ణయంపై తమకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం, పోటీ ఆసక్తిపై అడగకపోవడంపై వారు పెద వి విరుస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను విస్మరించి ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదన్న విమర్శలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ నేతలు ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో సైలెంట్ కావడం, పలు కార్యక్రమాల్లో అంటిముట్టనట్లు వ్యవహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల వరకు పట్టణ అధ్యక్షుడిగా కొనసాగిన లాలామున్నా కొంతకాలంగా ము ఖ్య నేతకు దూరంగా ఉంటూ వచ్చారనే ప్రచారం పార్టీలో ఉంది. తాజాగా మున్నాను మరోసారి పట్ట ణ అధ్యక్షుడిగా కొనసాగించకుండా పార్టీలో వేరే వారికి అవకాశం కల్పించారు. మొత్తంగా పార్టీలో సీనియర్ నేతలకు, ముఖ్య నేత మధ్య సఖ్యత లే దన్న ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే కార్యకర్తలు ప్రస్తుతం ఇటు పార్లమెంట్ పరిధిలో, అటు నియోజకవర్గ స్థా యిలో ఏమైనా పనుల కేటాయింపులోనూ నేతలు తమను విస్మరిస్తున్నారనే అసంతృప్తి వారిలో ఉంది. అంతేకాకుండా పార్టీలో ఒక నాయకుడికి ఎలాంటి పదవులు లేకున్నప్పటికీ ముఖ్య సమావేశాల్లో ఆయనను వేదికలపై కూర్చోబెట్టడం, రాష్ట్రనేతలను కలిసినప్పుడు కూడా అత ను వెంట ఉండటంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆ నాయకుడిని తూర్పారా బడుతూ పార్టీ నాయకులే పోస్టులు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ప్రస్తుతం బీజేపీలో అంతర్గతంగా సాగుతున్న ఈ కలహాలు ఎప్పుడో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
వాతావరణం
కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు తలమడుగు మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం సుదర్శన మహాయజ్ఞం నిర్వహించారు. వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది. మళ్లీ కంప్యూటర్ విద్య పాఠశాలల్లో మళ్లీ కంప్యూటర్ విద్య అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలలకు కంప్యూటర్లు సరఫరా చేసింది. 9లోu మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20258లోu వలలు తొలగించారు.. పక్షులను రక్షించారుఇంద్రవెల్లి: పంటల రక్షణ కోసం రైతులు ఏర్పాటు చేసిన వలలకు చిక్కుకుని చనిపోతున్న పక్షులపై ‘సాక్షి’లో సోమవారం ‘పంటలకు రక్షణ.. పక్షులకు ప్రా ణాంతకం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు. మండల కేంద్ర శివారుతో పాటు అంజీ, మామిడిగూడ గ్రామాలను సందర్శించారు. రైతులు పంటల రక్షణ కోసం ఏర్పాటు చేసిన వలలను తొలగించారు. ఈ సమయంలో పలు పక్షులు అందులో చిక్కుకొని ఉండగా వాటిని రక్షించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఎఫ్ఎస్వో చంద్రారెడ్డి మాట్లాడుతూ, అటవీ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆయన వెంట ఎఫ్బీవోలు నిషంత్, పద్మజ, నికిత, అఖిల్ తదితరులున్నారు. ఆ నిర్మాణ పనులకు.. బ్రేక్ కైలాస్నగర్: మున్సిపల్ నుంచి అనుమతులు లేకుండా పట్టణంలోని ఓంకార్మాల్ జిన్నింగ్మిల్లులో అక్రమంగా కమర్షియల్ కాంప్లెక్స్ భవన నిర్మాణం చేపడుతుండడాన్ని వివరిస్తూ ‘దర్జాగా.. అక్రమం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి బల్దియా అధికారులు స్పందించారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది రాజన్న, క్రాంతి సోమవారం జిన్నింగ్మిల్లులోని అక్రమ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పనులు నిలిపివేయాలని పేర్కొంటూ భవన యజమానికి నోటీసు అందజేశారు. కాగా, అనుమతుల్లేకుండా ఎలాంటి కట్టడాలు చేపట్టవద్దని కమిషనర్ పేర్కొన్నారు. ఇసుకాసురులపై పోలీసుల కొరడా ఆదిలాబాద్టౌన్: ఇసుక అక్రమార్కులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. పెన్గంగ నుంచి ఇసుక అక్ర మ రవాణాకు సంబంధించి ‘తోడేస్తున్నారు..’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు పోలీసు అధికారులు స్పందించారు. పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. బేలలోని కాంగర్పూర్ సమీపంలోని ఘాట్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్ను సీజ్ చేశారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించినట్లు డీఎస్పీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. అలాగే మైనింగ్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పెన్గంగ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మొదటిసారి జరిమానా విధిస్తామని, రెండోసారి పట్టుబడితే ఇసుక దొంగతనం కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఎక్కడైనా ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో జైనథ్ సీఐ సాయినాథ్, బేల ఏఎస్సై లింగన్న, కానిస్టేబుళ్లు దత్తు, వెంకటేశ్ పాల్గొన్నారు. సాలెగూడకు.. ట్యాంకరొచ్చిందిఇంద్రవెల్లి: మండలంలోని తేజాపూర్ గ్రామపంచాయతీ పరిధి సాలెగూడలో తాగునీటి ఇక్కట్లపై ‘సాక్షి’లో సోమవారం ‘గొంతెండుడేనా.., సాలెగూడలో నీటిగోస’ శీర్షి కన ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించా రు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భానుకుమార్, ఎంపీవో జీవన్రెడ్డి ఉదయాన్నే గ్రామాన్ని సందర్శించారు. తాగునీటి కోసం గ్రామస్తుల ఇక్కట్లను పరిశీలించారు. వెంటనే ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ప్రారంభించారు. అధికారులు మాట్లాడుతూ, వేసవి ముగిసేంత వరకు నిరంతరం ట్యాంకర్ల ద్వా రా నీటిని సరఫరా చేస్తామన్నారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శి పూర్ణ, మాజీ సర్పంచ్ కామేశ్వరి ఉన్నారు. పత్తి కొను‘గోల్మాల్’పై తనిఖీలు ఆదిలాబాద్టౌన్: పత్తి కొనుగోళ్ల గోల్మాల్ వ్యవహారంలో ‘తిలా పాపం.. తలాపిడికెడు’ శీర్షికన ఈనెల 14న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజర్షిషా స్పందించారు. విచారణ అధికారులుగా నియమితులైన జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్స్వామి, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్లు ఇచ్చోడ వ్యవసాయ కార్యాలయంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. టీఆర్లను స్వా ధీనం చేసుకున్నారు. ఇచ్చోడ ఏవో కై లాస్, పలువురు ఏఈవోలను విచారించారు. వారి నుంచి వివరాలు సేకరించారు. ఇచ్చోడతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో టీఆర్ బుక్లను పరిశీలించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పేర్కొన్నారు. ఎఫెక్ట్.. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం●
● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కై లాస్నగర్: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ పట్టభద్రు ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూ రి నరేందర్రెడ్డి ప్రచార సభలో పాల్గొన్నా రు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవుడు వేరు, రాజకీయం వేరని అన్నారు. బీజేపీ.. దేవుడిపై, కులమతాలపై రాజకీ యం చేస్తుందన్నారు. మోదీ బీసీ కాదన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు కొందరు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కులమేంటని అడుగుతున్నారన్నారు. దేశ కోసం సర్వం త్యాగం చేసిన మోతీలాల్ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు రా హుల్గాంధీ అని గుర్తు చేశారు. పట్టభద్రులంతా నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్సీఅభ్యర్థి నరేందర్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ మల్లేశ్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీధర్, ఆత్రం సుగుణ, పార్లమెంట్ కోఆర్డినేటర్ నరేశ్జా దవ్, మాజీ ఎమ్మెల్యే సక్కు, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గోవర్ధన్రెడ్డి, ఆనంద్రావు, తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలిఆదిలాబాద్టౌన్: నకిలీ బాబాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి అన్నారు. టూటౌన్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నకిలీ బాబాల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని సూచించారు. -
పంటలకు రక్షణ.. పక్షులకు ప్రాణాంతకం
పంట రక్షణ చర్యలు పక్షుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈ సీజన్లో రైతులు జొన్న, మొక్కజొన్న, గోదుమ పంటలు సాగు చేశారు. పంట రక్షణ కోసం ఇలా వలలు అమర్చడంతో నిత్యం వందలాది పక్షలు వాటిలో చిక్కుకుని చనిపోతున్నాయి. రామచిలుకలు, గద్దలు, గుడ్లగూబలతో పాటు అరుదైన పక్షులు సైతం తనువు చాలిస్తున్నాయి. దృష్టి సారించాల్సిన అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి -
దర్జాగా.. ‘అక్రమ’ం
● అనుమతి లేకుండా భవన నిర్మాణం ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు కై లాస్నగర్: ‘ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఆక్రమణలతో పాటు అక్రమాలు సైతం సహించం.. టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..’ ఇది మూడు రోజుల క్రితం కలెక్టర్ రాజర్షి షా అధికారికంగా చేసిన ప్రకటన. ఆక్రమణ లతో పాటు అక్రమాలకు కళ్లెం వేయాల్సిన బల్దియా అధికారులు సాక్షాత్తు మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకునే అనుమతి లేకుండా భవన ని ర్మాణం చేపడుతున్నా చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో ఏకంగా రూ.50లక్ష ల డీల్ కుదిరినట్లుగా సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ ఇందులో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండానే పనులు ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఓంకార్మాల్ జిన్నింగ్ ఏరియాలో సదరు వ్యాపారి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టా రు. మున్సిపల్ అనుమతుల్లేకుండానే దర్జాగా పనులు చేపడుతున్నారు. మొదటి అంతస్తు పనులు ఇప్పటికే పూర్తికాగా రెండో అంతస్తుకు సంబంధించి సెంట్రింగ్ పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఎలాంటి ప్రాంతంలోనైనా భవన నిర్మాణం చేపట్టాలంటే మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. భారీ డీల్.. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతానికి భారీ డి మాండ్ ఉంది. ఇక్కడ నిర్మించే మడిగెలు పూర్తికాక ముందే అద్దెకు పోనున్నాయి. ప్రతి నెలా రూ.లక్షల్లో ఆదాయం సమకూరనుంది. దీనిని గుర్తించిన సద రు వ్యాపారి బల్దియా అధికారులు సహకరించేలా చూడాలని సదరు వార్డు మాజీ కౌన్సిలర్ను వేడుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు వ్యాపారికి అభయమిచ్చిన ఆ మాజీ ప్రజాప్రతినిధితో పా టు బల్దియాలో అనుమతులు ఇచ్చే అధికారులందరికీ కలిపి సుమారు రూ.50లక్షల వరకు ముట్టజెప్పినట్లు సమాచారం. ఫలితంగానే అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నోటీసులు జారీ చేశాం.. పట్టణంలోని భుక్తాపూర్ శివారు రాణీసతీజీ కాలనీలో చేపట్టిన వాణిజ్యపరమైన భవన నిర్మాణానికి మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతుల్లేవు. అక్రమంగా సాగుతున్న నిర్మాణాన్ని నిలిపివేయాలని యజమానికి నోటీసులు జారీ చేశాం. నిర్మాణ పనులు సైతం నిలిపివేశాం. అక్రమంగా పనులు చేపట్టినట్లైతే చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటాం. – సీవీఎన్.రాజు, మున్సిపల్ కమిషనర్ -
రాష్ట్రస్థాయి పోటీలు విజయవంతం చేయాలి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న ఖేలో ఇండియా ఉషూ రాష్ట్ర స్థాయి పోటీల ను విజయవంతం చేయాలని జిల్లా గిరిజన క్రీడ ల అధికారి కోరెడ్డి పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఈ పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అమెచ్యూర్ ఉషూ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఉమర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అజ్మీరా గణేశ్, వేముల సతీశ్, సంఘం ఆర్గనైజింగ్ చైర్మన్ అన్నారపు వీరేశ్, శృతి, సాయికుమార్, హ్యాండ్ బాల్ సెక్రెటరీ హరిచరణ్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పాల్, శివప్రసాద్, శివకుమార్, ప్రణయ్ కుమార్, మాధవి, వనిత, దివ్య తదితరులు పాల్గొన్నారు. -
తోడేస్తున్నారు..
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాంఅక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక, మొరం తవ్వకాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. బేల, జైనథ్, భీంపూర్ మండలాల్లోని నది పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టకుండా చర్యలు చేపడుతున్నాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. మొదటిసారి జరిమానా విధించి వదిలిపెడుతున్నాం. పునరావృతమైతే కేసులు నమోదు చేస్తాం. సీజ్ చేసిన ట్రాక్టర్లను మైనింగ్ అధి కారులకు అప్పగిస్తున్నాం. – ఎల్.జీవన్రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీబేల మండలంలోని కంగార్పూర్ శివారులో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టగా జైనథ్, బేల ఎస్సైలు శనివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. మైనింగ్ అధికారులకు సమాచారం అందించారు. మరోసారి ఇసుక అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జైనథ్ మండలంలోని ఆనంద్పూర్లో అక్రమార్కులు బోట్లో ఆయిల్ ఇంజిన్ ఏర్పా టు చేసి నదిలో ఉన్న ఇసుకను ఒడ్డుకు చేర్చుతున్నారు. పైపులైన్ ద్వారా ఇసుకతో పాటు నీరు ఒడ్డున పడుతుంది. జల్లెడ ద్వారా వేరయిన ఇసుకను ట్రాక్టర్ యజమానులకు విక్రయిస్తారు. అయితే ఏడు నెలల క్రితం పోలీసులు దాడులు నిర్వహించి బోట్తో పాటు ఆయిల్ ఇంజిన్ను సీజ్ చేశారు. అయినా అక్రమార్కుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. తాజాగా మళ్లీ ఇసుక అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. రాత్రి వేళల్లో ఈ దందా సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తనిఖీలు చేసినప్పుడు స్తబ్ధుగా ఉండి ఆ తర్వాత వారి పని కానిచ్చేస్తున్నారు.ఆదిలాబాద్టౌన్: జిల్లాలో మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న పెన్గంగ నదిలో కొందరు అక్రమ తవ్వకాలు చేపట్టి ఇసుకను తోడేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. మైనింగ్ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తుండడంతో వీరి దందా ‘మూడు టిప్పర్లు.. ఆరు ట్రాక్టర్లు’ అన్న చందంగా మారిందనే విమర్శలున్నాయి. ఇక పోలీసు, రెవెన్యూ అధికారులు తని ఖీలకు వెళ్తున్నారంటే వారికి ముందుగానే సమాచా రం అందుతుంది. అధికారులు అక్కడికి చేరుకున్నా క అసలు అక్కడ తవ్వకాలే జరగనట్టుగా ఉంటుంది. ఈ దందా రాత్రి వేళల్లో జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపించేందుకు సమాయత్తమయ్యారు. ఇటీవల జైనథ్, బేల, భీంపూర్, తాంసి మండలాల పరిధిలో ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాలను పరి శీలించారు. ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. నది పరీవాహక ప్రాంతాల్లో.. పెన్గంగ నది పరీవాహక ప్రాంతాలైన జైనథ్, భీంపూర్, బేల మండలాల్లోని తాంసి(కె), వడూర్, అంతర్గావ్, ఆనంద్పూర్, పెండల్వాడ, డొల్లార, సాంగ్వి, కౌట, పూసాయి, పిప్పర్వాడ, కామాయి, కంగార్పూర్, సాంగిడి, బెదోడతో పాటు తదితర గ్రా మాల్లో ఇసుక అక్రమ దందా సాగుతోంది. వానా కాలం ముందు వరకు పెన్గంగ నుంచి తోడిన ఇసుకను అనుకూలంగా ఉన్న చోట్ల కుప్పలుగా నిల్వ ఉంచుతున్నారు. వర్షాలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ నుంచి తిరిగి నది పరీవాహక ప్రాంతాల్లోని ఇసుకను భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని వీడీసీలు, గ్రామ పెద్దల ద్వారా వేలం నిర్వహించి ఎవరో ఒకరు టెండర్ దక్కించుకుంటా రు. ఆ తర్వాత టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక మైనింగ్ అధికారులు నామమాత్ర తనిఖీలకే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, పోలీ సులు పట్టుకున్న వాహనాలకు జరిమానా విధించ డం తప్పా అక్రమ దందాకు అడ్డుకట్ట వేయలేకపోవడం గమనార్హం. జిల్లాలో మైనింగ్ అధికారితో పాటు ఓ టెక్నికల్ అధికారి ఉన్నారు. మైనింగ్ అధి కారికి నిర్మల్ జిల్లా అదనపు బాధ్యతలు ఉండడంతో ఆయన ఇటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరో పణలు ఉన్నాయి. ఇక టెక్నికల్ అధికారి ని మరో జిల్లాకు డిప్యూటేషన్ ఇవ్వడంతో పది రో జులుగా అందుబాటులో లేకుండా పోయారు. ఉన్న అధికారి సైతం కార్యాలయంలో ఉండకపోవడం, ఎవరైన సమాచారం అందించేందుకు ఫోన్ చేసినా స్పందించపోవడం ఈ అక్రమార్కులకు కలిసి వస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి.. జిల్లా సరిహద్దున ఉన్న పెన్గంగ నది సుమారు 70 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. బేల, భీంపూర్, జైనథ్ మండలాల పరిధిలోని పరీవాహక ప్రాంతాల్లో అక్రమార్కులు పొక్లెయిన్లు, ఇతర యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. ఈ తవ్వకాలతో ఎక్కడబడితే అక్కడ లోతైన గుంతలు దర్శనమిస్తున్నా యి. దీంతో భూగర్భజలాలు అడుగంటిపోయే పరి స్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు అక్రమార్కులు వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండల కేంద్రాలు, మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కులపై నిఘా.. జిల్లాలోని బేల,భీంపూర్, తాంసి, తలమడుగు, జై నథ్ మండలాల్లో అక్రమంగా ఇసుక, మొరం తవ్వకాలు జరుపుతున్న వారిపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్తో పాటు చెక్పోస్టులను ఏర్పా టు చేశారు. ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. పెన్గంగలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు రాత్రి వేళల్లో జోరుగా అక్రమ రవాణా పట్టించుకోని మైనింగ్ అధికారులు రంగంలోకి దిగిన పోలీసు శాఖ దొడ్డిదారిన వేలం..జిల్లాలో ఇసుక పాలసీ లేకపోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం సమకూరే పరి స్థితి లేకుండా పోయింది. గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)లు దొడ్డి దారిన వేలం నిర్వహిస్తున్నాయి. స్థానిక అవసరాల కోసం ఇసుకను ఉపయోగిస్తామని తెలుపుతూ ఈ వేలం ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏడాదికి రూ.అరకోటి పైగా ఆదాయం సమకూరుతుంది. గతేడాది బేల మండలం కాంగార్పూర్లో ఇసుక తవ్వకాల కోసం ఓ కాంట్రాక్టర్ రూ.62 లక్షలు, సాంగిడిలో రూ.30లక్షలు, ఆనంద్పూర్లో రూ.22 లక్షలు అందించినట్లు సమాచారం. జల్లెడ పట్టిన ఇసుక ట్రాక్టర్కు రూ.1500 వరకు, అలాగే కొన్ని వీడీసీలు రూ.300 నుంచి రూ.500 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు ఆ ఇసుకను ఆదిలాబాద్ పట్టణంలో రూ.4వేల వరకు విక్రయిస్తున్నారు. -
● పంచాయతీలకే తాగునీటి పథకాల పర్యవేక్షణ ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాత్రం విడుదల కాని నిధులు ● ఇప్పటికే ఏజెన్సీల్లో మొదలైన నీటి ఎద్దడి ● ఎండలు పెరిగే కొద్ది తీవ్రమయ్యే అవకాశం ● సమ్మర్ యాక్షన్ ప్లాన్పై దృష్టి సారించని యంత్రాంగం
కైలాస్నగర్/ఇంద్రవెల్లి: మార్చి ఇంకా రానే లేదు.. అప్పుడే భానుడి ప్రతాపం మొదలైంది. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మ రోవైపు భూగర్భజలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఎండలు ముదిరే కొద్ది జిల్లాలో నీటి సమ స్య తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. ప్రజల దాహార్తి తీర్చేలా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం ఇప్ప టి వరకు ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించనట్లు తెలు స్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 12వరకు అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. నీటి ఎద్దడి తలెత్తే ఆవాసాలు, మరమ్మతులకు గురైన నీటి వనరులను గుర్తించారు. అయితే వాటిని బాగు చేసేందుకు పంచాయతీల్లో నిధులు లేకపోవడం గమనా ర్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు విడుదల చేస్తే తప్ప నీటి సమస్య తీరదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీపీల్లో నిధుల కటకట.. ప్రజలకు అవసరమైన తాగునీటిని ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం ద్వారా అందజేస్తున్నారు. అయితే సరఫరాలో అంతరాయంఏర్పడితే స్థానికంగా ఉన్న నీటి వనరుల ద్వారా అందించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలదే. చెడిపోయి న పైపులైన్లు, చేతి పంపులు, వాటర్ ట్యాంక్లు, విద్యుత్ మోటార్ల మరమ్మతులను వేసవి రాకముందే చేపట్టా ల్సి ఉంటుంది. అయితే ఏడాదిగా జీపీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కా వడం కాలేదు. దీంతో ఆయా పనులు చేపట్టడం పంచాయతీలకు భారంగా మారుతోంది. అత్యవసర పరిస్థితుల్లో కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ప డాల్సి వస్తోంది. విధి లేని పరిస్థితుల్లో తమ జే బుల్లోంచి చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. గతేడాది నిధులే విడుదల కాలే... గతేడాది వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేలా ప్ర భుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించి ఎస్డీఎఫ్ కేటాయిస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి నివేదిక అందజేశారు. వాటికనుగుణంగా ఆయా గ్రామాల కు నిధులను మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలి పింది. ఈక్రమంలో జిల్లాలోని పలు గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి వనరుల మరమ్మతులు చేపట్టారు. చేదబావులు, బోరుబావులు ఎండిపోయినట్లయితే ప్రత్యేకంగా ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేశారు. స్థానిక వనరులకు ప్రత్యేక పైపులైన్లు కూడా వేశారు. కొత్తగా బోర్లు సైతం వేయించారు. విద్యుత్ మోటార్లకు మరమ్మతులు చేయించారు. జిల్లా వ్యాప్తంగా రూ.3.65 కోట్ల వ్యయంతో 614 పనులు చేశారు. ఇందులో రూ.1.50 కోట్లతో కూడిన బిల్లులను ప్రభుత్వానికి నివేదించారు. అయితే ఏడాది గడిచినా ఇంకా విడుదల కాలేదు. దీంతో ప్రస్తుతం పనులు చేయాలంటే అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.జిల్లాలో ఇదీ పరిస్థితి..పంచాయతీలదే బాధ్యత.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీలదే. చేతి పంపులు, విద్యుత్ మోటార్లు, బోరుబావుల మరమ్మతులు చేపట్టి ప్రజలకు నీటి సమస్య రాకుండా వారే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆర్డబ్ల్యూఎస్ పరంగా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. గతేడాది చేసిన పనులకే ఇంకా బిల్లులు విడుదల చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల 10 రోజుల పాటు స్పెషల్డ్రైవ్ నిర్వహించి నీటి ఎద్దడి తలెత్తే గ్రామాలను గుర్తించాం. – చంద్రమోహన్, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్ గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. దీంతో ఈ నెల 3నుంచి 12వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. నీటి ఎద్దడి తలెత్తే ఆవాసాలు, వేసవిలో సమస్యాత్మకంగా మారే నీటి వనరులను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 208 చేతిపంపులు ఉపయోగంలో లేనట్లు నిర్ధారించారు. ఎండలు ముదిరేకొద్ది మరో 327 చేతిపంపుల్లో నీరు రాని పరిస్థితి తలెత్తే అవకాశమున్నట్లుగా తేల్చారు. అలాగే సింగిల్ ఫేజ్ విద్యుత్ మోటార్లు 45 పనికిరాకుండా పోగా, సీజనల్గా 113 మోటార్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నట్లుగా గుర్తించారు. ఇక త్రీఫేజ్ విద్యుత్ మోటార్ల పరంగా ఏడు పనిచేయని పరిస్థితిలో ఉండగా ఐదు సమస్యాత్మకంగా మారే అవకాశమున్నట్లుగా గుర్తించి అధికా రులకు నివేదించారు. వీటితో పాటు జిల్లాలోని 88 చేదబావులు ఎండల తీవ్రతతో అడుగుంటిపోయే పరిస్థితి ఉందని గుర్తించారు. -
17ఏళ్ల కల.. నెరవేరిన వేళ
● డీఎస్సీ–2008 అభ్యర్థులకు పోస్టింగ్ ● హైకోర్టు ఉత్తర్వులతో కాంట్రాక్ట్ టీచర్ కొలువు ● అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలు ● జిల్లాలో 10 మందికి ప్రయోజనం ఆదిలాబాద్టౌన్: 2008–డీఎస్సీ బీఎడ్ అభ్యర్థుల న్యాయ పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కాంట్రాక్ట్ కొలువు దక్కింది. రెండు, మూడు నెలల క్రితం అభ్యర్థుల సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే ప్రక్రియ పూర్తయినప్పటికీ ప్రభుత్వం నుంచి వీరికి పోస్టింగ్ విషయంలో గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో జాప్యం అయింది. దీంతో సదరు అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ఈ నెల 17వ తేదీలోగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది. దీంతో విద్యాశాఖ అధికారులు ఆగమేఘాల మీద నియామక ప్రక్రియ చేపట్టారు. అభ్యర్థులకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 74 మందికి ప్రయోజనం చేకూరగా ఆదిలా బాద్ జిల్లాలో 10 మంది ఉన్నారు. వీరిలో తొమ్మిది మంది కౌన్సెలింగ్కు హాజరుకాగా వారికి వివిధ పాఠశాలల్లో పోస్టింగ్ కల్పించారు. ఏళ్లుగా నిరీక్షిస్తున్న వారిలో హర్షం వ్యక్తమవుతుంది. కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా ప్రభుత్వ కొలువు దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా వీరికి డీఈవో ప్రణీత నియామక ఉత్తర్వులు అందజేశారు. కార్యాలయ ఉద్యోగులు తుషార్, సతీష్, సాయితేజ, గోవర్దన్ ఇందులో పాల్గొన్నారు. ఫలించిన నిరీక్షణ ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2008లో డీఎస్సీ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ సమయంలో కామన్ నియమాకాలు చే పట్టారు. దీంతో ఎస్జీటీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో 70:30 నిష్పత్తిలో డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 135 మంది అభ్యర్థులు ఎంపికై నప్పటికీ 70: 30 కారణంగా ఉద్యోగా లకు దూరమయ్యారు. అప్పటి నుంచి వీరు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు వీరికి కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. అభ్యర్థుల వివరాలను సేకరించింది. చాలా మంది ఇతర శాఖల్లో కొలువులు పొందారు. అర్హులుగా గుర్తించిన వారిలో ప్రస్తుతం ఉ మ్మడి జిల్లా పరిధిలో 74 మంది మాత్రమే మిగిలిపో యారు. ఆదిలాబాద్ జిల్లాకు 10 మంది, మంచిర్యాలకు 14 మంది, నిర్మల్కు 20 మంది, కుమురంభీం ఆసిఫాబాద్కు 30మందిని ఎంపిక చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయినప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో వారు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు అధికారులు నియామక ప్రక్రియ పూర్తి చేశారు.కాంట్రాక్ట్ పద్ధతిన.. 2008 డీఎస్సీ బీఎడ్ అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిన పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, ఉపాధ్యాయులు లేని పాఠశాలలను ఎంపిక చేసి పోస్టింగ్ కల్పించారు. బోథ్, గాదిగూడ మండలానికి ఇద్దరు చొప్పున, భీంపూర్, జైనథ్, బేల, నేరడిగొండ, బజార్హత్నూర్, సిరికొండ మండలాలకు ఒకరు చొప్పున కేటాయించారు. వీరికి నెలకు రూ.31,040 వేతనం చెల్లించనున్నారు. 2024–25 విద్యా సంవత్సరం ముగిసే వరకు ఈ వేతనంపై వీరు సేవలందించాల్సి ఉంటుంది. నూతన సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో మళ్లీ వీరంతా తిరిగి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నియామకం పొందిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈవో కార్యాలయాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ బాండ్లను సైతం అందించాల్సి ఉంటుందని అధికారులు తెలి పారు. కాగా 17 ఏళ్ల తర్వాత పాఠాలు బోధించేందుకు బడిబాట పట్టడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతుంది.