AI
-
మహాకుంభమేళాలో స్టాల్స్ : స్ట్రీట్ వెండర్లుగా అంబానీ, అదానీ, మస్క్.. (ఫొటోలు)
-
ఛత్రపతి శివాజీగా తెలుగు హీరోలు, AI ఫోటోలు చూశారా?
-
గ్రోక్ 3.. సమస్యలుంటే చెప్పాలంటూ మస్క్ పోస్ట్.. గూగుల్ సీఈఓ స్పందన
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ సీఈఓ ఎలాన్మస్క్(Elon Musk)కు చెందిన ఎక్స్ఏఐ తన చాట్బాట్ లేటెస్ట్ వర్షన్ గ్రోక్ 3ని ఇటీవల ఆవిష్కరించింది. యూజర్లకు మరింత మెరుగైన సేవలందించేందుకు గ్రోక్ 3లో ఏదైనా సమస్యలుంటే తెలియజేయండంటూ తాజాగా మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వారంలో దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనిపై గూగుల్ సీఈఓ సుందర్పిచాయ్ స్పందిస్తూ.. గ్రోక్(Grok 3) పురోగతికి అభినందనలు తెలిపారు. ఈ చాట్బాట్ను ప్రయత్నించాలని చూస్తున్నట్లు తెలిపారు.ఓపెన్ఏఐకు చెందిన చాట్జీపీటీ, చైనా- డీప్సీక్, గూగుల్కు చెందిన జెమినీ వంటి ఇతర జనరేటివ్ ఏఐ మోడళ్లకు పోటీగా గ్రోక్ 3ను రూపొందించినట్లు మస్క్ ఇటీవల తెలిపారు. దాని మునుపటి వర్షన్ కంటే గ్రోక్ 3.. 10 రెట్లు అధిక సమర్థ్యంతో పని చేస్తుందని చెప్పారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్లో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన మస్క్ ఈ చాట్బాట్ సామర్థ్యాలను హైలైట్ చేశారు. కృత్రిమ మేధ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి 1,00,000 ఎన్విడియా జీపీయూ గంటలను ఉపయోగించే ఎక్స్ఏఐకి చెందిన కొలోసస్ సూపర్ కంప్యూటర్పై గ్రోక్ 3 చాట్బాట్ పనిచేస్తుందని తెలిపారు. కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు మస్క్ పేర్కొన్నారు.The @xAI Grok 3 release will improve rapidly every day this week. Please report any issues as a reply to this post.— Elon Musk (@elonmusk) February 18, 2025ఎవరికి అందుబాటులో ఉంటుందంటే..ఎక్స్లో ప్రీమియం ప్లస్ సబ్స్క్రైబర్లకు గ్రోక్ 3 అందుబాటులో ఉందని మస్క్ తెలిపారు. అన్ని అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉండేందుకు ఎక్స్ యాప్ను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. గ్రోక్ 3 ప్రెజెంటేషన్ సమయంలో మస్క్ అధునాతన తార్కిక సామర్థ్యాలను, సంక్లిష్ట ప్రశ్నలను అర్థం చేసుకొని వాటికి ప్రతిస్పందించే విధానాలు ఈ చాట్బాట్ సొంతమని చెప్పారు. మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి సింథటిక్ డేటాసెట్లపై ఈ మోడల్ శిక్షణ పొందినట్లు చెప్పారు. ఇది తప్పుడు సమాచారాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. గ్రోక్ 3 ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లలో ఒకటిగా మారిందని తెలిపారు.ఇదీ చదవండి: భారత్లోకి టెస్లా.. మస్క్ వైఖరి ‘చాలా అన్యాయం’ప్రీమియ ధరలు పెంపుఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు రెండు రెట్లు పెరిగాయి. గత మూడు నెలల్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్లను పెంచడం ఇదే రెండో సారి. ఇండియాలో ఇప్పటివరకు ఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు రూ.1750 మాత్రమే. ధరలు పెరిగిన తరువాత ఇది రూ.3,470కు చేరింది. వార్షిక ప్లాన్ కూడా రూ.18,300 నుంచి రూ.34,340కి పెరిగింది. బేసిక్ ప్లాన్ ధర నెలకు రూ.244 కాగా.. ప్రీమియం ప్లాన్ ధర రూ.650గా ఉన్నాయి. -
‘గ్రోక్ 3’ను ఆవిష్కరించిన మస్క్
ఎక్స్ఏఐ కొత్త వర్షన్ ‘గ్రోక్ 3(Grok 3)’ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎలాన్మస్క్(Elon Musk) ప్రకటించారు. ఎక్స్లో ఇంజినీర్ల సమక్షంలో ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమ్ ప్రజెంటేషన్లో ఈ కొత్త జనరేటివ్ ఏఐ మోడల్ను మస్క్ ఆవిష్కరించారు. గ్రోక్ 3 ఇప్పటివరకు ఉన్న గ్రోక్ 2 కంటే 10 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పని చేస్తుందని మస్క్ పేర్కొన్నారు. గణితం, సైన్స్, కోడింగ్ వంటి వివిధ విభాగాల్లో మార్కెట్లో పోటీదారులుగా ఉన్న ఆల్ఫాబెట్ ఇంక్కు చెందిన గూగుల్ జెమిని, డీప్ సీక్- వీ 3 మోడల్, ఆంత్రోపిక్-క్లాడ్, ఓపెన్ఎఐ-జీపీటీ-4ఓ కంటే సమర్థంగా పని చేస్తుందని చెప్పారు.ప్రెజెంటేషన్ సమయంలో మస్క్ గ్రోక్ 3 అధునాతన తార్కిక సామర్థ్యాలను, సంక్లిష్ట ప్రశ్నలను అర్థం చేసుకొని వాటికి ప్రతిస్పందించే విధానాలను హైలైట్ చేశారు. మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి సింథటిక్ డేటాసెట్లపై ఈ మోడల్ శిక్షణ పొందినట్లు చెప్పారు. ఇది తప్పుడు సమాచారాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. గ్రోక్ 3 ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లలో ఒకటిగా మారిందని తెలిపారు.ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధర!గ్రోక్ 3తోపాటు డీప్ సెర్చ్ అని పిలువబడే కొత్త స్మార్ట్ సెర్చ్ ఇంజిన్ను కూడా ఈ సందర్భంగా ప్రవేశపెట్టారు. ఇది వినియోగదారులకు మెరుగైన పరిశోధనలు అన్వేషించడానికి, డేటాను విశ్లేషించడానికి అనుమతిస్తుందని కంపెనీ తెలిపింది. గ్రోక్ 3 మోడల్ ఎక్స్ ప్లాట్ఫామ్ ప్రీమియం ప్లస్ చందాదారులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. సూపర్ గ్రోక్ అని పిలువబడే కొత్త సబ్ స్క్రిప్షన్ ద్వారా ఇతరులకు దీని సేవలు అందిస్తున్నట్లు చెప్పింది. -
గ్రోక్ 3 లాంచ్పై మస్క్ ట్వీట్: భూమిపైన..
ప్రపంచ కుబేరుడు.. టెస్లా చీఫ్ 'ఇలాన్ మస్క్' (Elon Musk) 'గ్రోక్ 3' లాంచ్కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. సోమవారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9:30 గంటలకు) లైవ్ డెమోతో దీనిని లాంచ్ చేయనున్నట్లు ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొన్నారు. ఇది భూమి మీద అత్యంత తెలివైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అన్నారు.చాట్జీపీటీకి ప్రత్యర్థిగా వచ్చిన గ్రోక్.. ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఎక్స్ఏఐ రూపొందిన ఈ గ్రోక్ త్వరలోనే.. 'గ్రోక్3'గా రానుంది. అయితే ఇదెలా పనిచేస్తుంది, దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఇది టెక్స్ట్-టు-వీడియో వంటి లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లయితే.. ఇప్పుడు వినియోగంలో ఉన్న ఓపెన్ఏఐ, గూగుల్ జెమిని, మెటా ఏఐ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాలో అమ్మకానికి భారీగా ఇళ్లు!గ్రోక్ 3 అభివృద్ధి చివరి దశలో ఉందని.. ఒకటి లేదా రెండు వారాల్లో అందుబాటులోకి వస్తుందని మస్క్ చెప్పారు. అయితే లైవ్ డెమో త్వరలోనే విడుదలకానుంది. అన్ని రంగాల్లోనూ ఏఐ తన హవా కొనసాగిస్తున్న వేళ 'గ్రోక్ 3' లాంచ్ అధిక ప్రజాదరణ పొందే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.Grok 3 release with live demo on Monday night at 8pm PT. Smartest AI on Earth.— Elon Musk (@elonmusk) February 16, 2025 -
ఏఐ బాయ్ఫ్రెండ్స్.. అమ్మాయిలంతా అటువైపే!
బాయ్ఫ్రెండ్స్ తమ మెసేజ్లకు ఆలస్యంగా రిప్లై ఇవ్వడం, సమయానికి కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల.. అమ్మాయిలు అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి.. చైనాలో 'లవ్ అండ్ డీప్స్పేస్' అనే డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ ఉపయోగపడుతోంది. ఇందులోనే యూజర్లు AI- బేస్డ్ వర్చువల్ బాయ్ఫ్రెండ్లతో సంభాషించడానికి వీలు ఏర్పడింది.డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ లవ్ అండ్ డీప్స్పేస్లో నెలవారీగా ఆరు మిలియన్ల మంది యాక్టివ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో షాంఘైకి చెందిన ఒక వార్తాపత్రికలో ఎడిటర్గా పనిచేస్తున్న 32 ఏళ్ల అలీసియా వాంగ్ ఒకరు. ఈమె ఏఐ బాయ్ఫ్రెండ్నను క్రియేట్ చేసుకుంది. ఇది తన మెసేజ్లకు తొందరగా రిప్లై ఇవ్వడమే కాకుండా.. ఫోన్కు వెంటనే సమాధానం ఇస్తుంది. ఎంత సేపు ఏమి మాట్లాడినా ఓపిగ్గా వింటుంది.జనవరి 2024లో ప్రారంభమైన లవ్ అండ్ డీప్స్పేస్ను.. షాంఘైకి చెందిన పేపర్ గేమ్స్ ద్వారా అభివృద్ధి చేశారు. ఏఐ, వాయిస్ రికగ్నిషన్ను ఉపయోగించి ఐదు పురుష పాత్రలను సృష్టించారు. ఇవి గేమ్లోని ఫోన్ కాల్లకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి.చైనీస్, ఇంగ్లీష్, జపనీస్ మరియు కొరియన్ భాషలలో లభించే ఈ స్మార్ట్ఫోన్ గేమ్ ఎంత ప్రజాదరణ పొందిందంటే.. ఈ గేమ్ సృష్టికర్త అయిన 37 ఏళ్ల యావో రన్హావో ఏకంగా బిలియనీర్ అయ్యారు. కంపెనీలో కూడా మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ లాంటి కెమెరా కోసం.. ఉత్తమ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవే..చైనా, అమెరికా, ఇతర ప్రాంతాలలో యూజర్లు.. లవ్ అండ్ డీప్స్పేస్ గేమ్ప్లేను అన్లాక్ చేయడానికి, తమ బాయ్ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్లను పొందడానికి డబ్బు చెల్లిస్తారు. చైనాలో ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకున్న యాప్లలో ఇది కూడా ఒకటైంది. న్యూస్ ఎడిటర్ వాంగ్, జనవరి 2024లో గేమ్ డౌన్లోడ్ చేసుకున్నప్పటి నుంచి.. AI బేస్డ్ క్యారెక్టర్లతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇప్పటివరకు 35,000 యువాన్లు (రూ. 4 లక్షల కంటే ఎక్కువ) ఖర్చు చేసినట్లు సమాచారం. -
టీసీఎస్ కొత్త డీల్.. ఫిన్లాండ్ కంపెనీతో..
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఫిన్లాండ్ సంస్థ యూపీఎమ్ (UPM)తో ఐటీ ట్రాన్స్ఫార్మేషన్ సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రీసైక్లబుల్ ప్రొడక్టులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన యూపీఎమ్ పునరుత్పాదక ఇంధన మెటీరియల్స్ను ముడిసరుకులుగా వినియోగిస్తోంది.11 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ 10.3 బిలియన్ యూరోల టర్నోవర్ను కలిగి ఉంది. యూపీఎమ్ వృద్ధికి డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సహకరించనున్నట్లు ఒప్పందం సందర్భంగా టీసీఎస్ పేర్కొంది. తద్వారా ఏఐ ఫస్ట్ ఆపరేటింగ్ మోడల్ను అందిపుచ్చుకోనున్నట్లు తెలియజేసింది. అయితే ఒప్పందం(కాంట్రాక్ట్) విలువను వెల్లడించలేదు.ఇది చదివారా? ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్.. ఈసారి అంచనాలు ఇవే..యూపీఎమ్ ఎంటర్ప్రైజ్ ఐటీ వేల్యూ చైన్ను పటిష్టపరిచే బాటలో ఏఐ ఆధారిత అటానమస్ ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్ ఇగ్నియోను వినియోగించనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. అంతేకాకుండా యూపీఎమ్కు చెందిన 15,800 మంది ఉద్యోగులు, మెషీన్ల మధ్య మరింత భాగస్వామ్యానికి ఏఐ ద్వారా మద్దతివ్వనుంది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.12,380 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.11058 కోట్ల నికర లాభం రాగా ఈసారి 12 శాతం మేర పెరిగడం గమనార్హం. అలాగే సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.11,909 కోట్ల నికర లాభం నమోదు చేసింది. టీసీఎస్ మొత్తం ఆదాయం 5.6 శాతం పెరిగి రూ.63,973 కోట్లకు చేరింది. -
ఏఐ పాఠాలు.. ఉద్యోగులకు శిక్షణ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఏఐ ఫౌండేషన్ అకాడమీ ‘అడ్వాంటేజ్ తెలంగాణ’కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై శిక్షణ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. పరిపాలన, ప్రజాసేవలోనూ ఏఐ సాంకేతికతను వినియోగిస్తామని చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 1.2 లక్షల మందికి ఏఐ సాంకేతికతలో శిక్షణ కు 3 కొత్త కార్యక్రమాలను మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది. సంస్థ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన భవనాన్ని సీఎం గురువారం ప్రారంభించారు. భవిష్యత్తు ఏఐ సాంకేతికతదే.. ‘మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ నడుమ సుదీర్ఘ భాగస్వామ్యం ఉంది. అంతర్జాతీయ ఆవిష్కరణలపై హైదరాబాద్ నుంచి మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రభావాన్ని చూపింది. సంస్థ కార్యకలాపాల విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభి స్తాయి. వారి సాధికారతకు కూడా ఇది దోహదపడుతుంది. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీదే. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘అడ్వాంటేజ్ తెలంగాణ’కార్యక్రమం ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు తెలంగాణలో స్టార్టప్ వాతావరణాన్ని బలోపేతం చేస్తాయి. ఏఐ టూల్స్తో, ప్రపంచవ్యాప్త నెట్వర్క్తో అనుసంధానం చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ సిటీలో ‘ఏఐ ఎక్స్లెన్స్ సెంటర్’ను ఏర్పాటు చేస్తోంది. ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను ఈ సెంటర్ అభివృద్ధి చేస్తుంది. ఆవిష్కరణలపై మైక్రోసాఫ్ట్కు ఉన్న నిబద్ధత తెలంగాణ పురోగామి విధానాలకు తోడ్పాటును అందిస్తుంది’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. అతిపెద్ద డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. ‘మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, విద్యుత్ వాహనాల ఉత్పత్తి కేంద్రం, క్వాంటమ్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ తదితరాలతోపాటు మూసీ పునరుజ్జీవ పథకం ద్వారా హైదరాబాద్ సుస్థిర అభివృద్ధి సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. మూడు దశాబ్దాలుగా హైదరాబాద్తో అనుబంధం కలిగిన మైక్రోసాఫ్ట్ రూ.15 వేల కోట్లతో భారీ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ల హబ్గా మారుతోంది. ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది..’అని శ్రీధర్బాబు తెలిపారు. అధునాతన ప్రమాణాలతో కొత్త క్యాంపస్ మైక్రోసాఫ్ట్ గచ్చిబౌలిలో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో కొత్త భవనం నిర్మించింది. ఈ సంస్థకు హైదరాబాద్లో ఇప్పటికే మూడు భవనాలు ఉన్నాయి. కొత్త క్యాంపస్లో 2,500 మంది ఉద్యోగులకు సరిపడా సదుపాయాలు ఉన్నాయి. భారత్లో మైక్రోసాఫ్ట్కు 20 వేల మంది ఉద్యోగులు ఉండగా, సగం మంది హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నారు. కాగా నూతన భవన ప్రారంభం పురస్కరంచుకుని సంస్థ గురువారం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 1.2 లక్షల మందికి ఏఐ సాంకేతికతలో శిక్షణ అందించేందుకు మూడు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. ‘అడ్వాంటేజ్ తెలంగాణ’పేరిట 500 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఏఐ పాఠాలతో శిక్షణ ఇస్తుంది. ‘ఏఐ ఇండస్ట్రీ ప్రో’పేరిట 20 వేల మంది ఉద్యోగులకు ఏఐ నైపుణ్యంలో తర్ఫీదు ఇస్తుంది. ‘ఏఐ గవర్నర్ ఇనిషియేటివ్’పేరిట సుమారు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ప్రొడక్టవిటీ వంటి కీలక రంగాల్లో శిక్షణ ఇస్తుంది. ఎక్స్లెన్స్ సెంటర్పై ఎంవోయూ ప్రభుత్వ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్తో పాటు ఏఐ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేస్తోంది. హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లలో పెట్టుబడులు రెట్టింపు చేయడంతో పాటు, రాబోయే రోజుల్లో అదనంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్కు అతిపెద్ద డేటా హబ్ గా అవతరించనుంది. ఇలావుండగా ఏఐ ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి మైక్రోసాఫ్ట్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్ రాజీవ్కుమార్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా?
మనషి పుట్టుక, చావు అనేది దైవాధీనాలు. అంటే మనిషి ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు చనిపోతాడు అనేది దేవుని చేతుల్లోనే ఉంటాయంటారు. అయితే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెత్ క్లాక్' (AI Death Clock) మనిషి ఎప్పుడు చనిపోతాడో చెప్పేస్తానంటోంది. ఇంతకీ ఇదెలా సాధ్యం?.. ఏఐ చెప్పింది నిజమవుతుందా? అనే విషయాలు పరిశీలిద్దాం.డెత్ క్లాక్ అనే ఫ్రీ వెబ్సైట్.. ఒక వ్యక్తి వయసు, అతని బాడీ ఇండెక్స్, ఆహారపు అలవాట్లు, రోజువారీ వ్యాయామం, ధూమపానం, మద్యపానం అలవాట్లు, అతడు ఎలాంటి ప్రాంతంలో నివసిస్తున్నాడు అనే వాటిని ఆధారంగా చేసుకుని ఎప్పుడు, ఎలా చనిపోతాడో చెబుతోంది. అంటే మనం ఇచ్చే సమాచారం ఆధారంగా.. చావు రోజును చల్లగా చెప్పేస్తుందన్నమాట.డెత్ క్లాక్ వెబ్సైట్ ఇప్పటి వరకు 63 లక్షల మందికి.. వారి చావు డేట్ చెప్పింది. ఏఐ డెత్ క్లాక్ డేట్ ప్రకారం.. ఎంతమంది చనిపోయారో, లేదో తెలియదు, కానీ దీనికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎక్కువ కాలం జీవించడానికి టిప్స్ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పడం మాత్రమే కాదు. ఎక్కువ రోజులు జీవించడానికి టిప్స్ కూడా డెత్ క్లాక్ చెబుతోంది.➤ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్స్ ➤క్రమం తప్పకుండా వ్యాయామం➤పొగ తాగడం మానేయండి➤సమతుల్య ఆహారం➤మద్యం పూర్తిగా మానేయండి లేదా తక్కువగా తాగండి ➤మంచి నిద్ర➤క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్➤ఒత్తిడిని తగ్గించుకోండి➤అనుబంధాలను పెంపొందించుకోండిగమనిక: ఎన్ని టెక్నాలజీలు వచ్చినా.. మనిషి ఎప్పుడు, ఎలా చనిపోతాడు అనే విషయం చెప్పడం అసాధ్యం. డెత్ క్లాక్ అనేది ఒక ఏఐ కాలిక్యులేటర్, దీనికి మీరిచ్చే సమాచారాన్ని బట్టి ఒక డేట్ చెబుతుంది. అదే ఖచ్చితమైన మరణ తేదీ కాదు. దీనిని సరదా కోసం మాత్రమే ఉపయోగించాలి. ఏఐ కాలిక్యులేటర్ అంచనా నిజమని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. -
ఏఐతో ఉద్యోగాలు పోవు..: ప్రధాని మోదీ
ఏఐ సామర్థ్యానికి అటూఇటూకృత్రిమ మేధ సామర్థ్యం ఎంతో పెరిగింది. ఒక ఏఐ యాప్లోకి వైద్య నివేదికను అప్లోడ్ చేస్తే అది వైద్యపరిభాషలోని సాంకేతిక అంశాలను పక్కనపెట్టి మనకు అర్థమయ్యే సరళమైన భాషలో నివేదిక సారాంశాన్ని సులువుగా వివరించగలదు. అదే సమయంలో ఏఐ పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు అదే యాప్ను ఎడమ చేత్తో రాస్తున్న వ్యక్తి చిత్రాన్ని గీయమంటే అది దాదాపుగా కుడి చేత్తో రాస్తున్న వ్యక్తి బొమ్మ గీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏఐ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఏఐ పాలన గురించి లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. – ప్రధాని మోదీ పారిస్: అన్ని రంగాల్లోకి దూసుకొస్తున్న కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు మాయమవుతాయన్న భయాలను ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికగా పటాపంచలు చేశారు. సాంకేతికత వాడ కం వల్ల ఉద్యోగాలు కనుమరుగుకావని తేల్చిచెప్పారు. కేవలం ఉద్యోగాల స్వభావమే మారుతుందని స్పష్టం చేశారు. ఏఐ వాడకంతో కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్తో కలిసి మంగళవారం ఏఐ యాక్షన్ సమ్మిట్–2025కు సహాధ్యక్షత వహించిన ప్రధాని మోదీ ఈ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఏఐ ఆధారిత భవిష్యత్తులో రాణించాలంటే నైపుణ్యాలను పెంచుకోవడం, వాటికి మెరుగులు దిద్దుకోవడంపై యువత దృష్టిపెట్టాలని సూచించారు. అదే సమయంలో ఓపెన్సోర్స్ ఆధారిత ఏఐ వినియోగంలో ప్రజావిశ్వాసం, పారదర్శకత పెంచేలా, ఈ రంగంలో వివక్షను రూపుమాపేలా ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పనకు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉందన్నారు. చరిత్ర చెప్పేది అదే.. ‘కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనేది అత్యధికం మందిని కలవరపరిచే అంశం. కానీ టెక్నాలజీ వల్ల పని మాయం కాదని చరిత్ర చాటిచెప్పింది. కేవలం పని స్వభావం మారి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అందుకు తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి. నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి. కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి’అని మోదీ సూచించారు. ఈ శతాబ్దిలో కృత్రిమ మేధ మానవాళికి కోడ్ను రాస్తోందని.. కానీ మానవ చరిత్రలోని ఇతర మైలురాళ్లకన్నా ఇది ఎంతో విభిన్నమైనదన్నారు. ‘‘ఏఐ ఇప్పటికే మన రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాలతోపాటు సమాజాన్ని పునరి్నరి్మస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలను మెరుగుపరచడం ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాలను ఏఐ మార్చగలదు. ఇంకెన్నింటినో చేయగలదు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మరింత సులభంగా, వేగంగా చేరుకోవడంలో దోహదపడగలదు. ఇందుకోసం మనం మన వనరులు, ప్రతిభను ఏకం చేయాలి’అని మోదీ పేర్కొన్నారు.ఏఐలో భారత్ సత్తా.. ఓపెన్ నెట్వర్క్, యాక్సెసబుల్ నెట్వర్క్ సాయంతో తక్కువ ఖర్చుతోనే భారత్ 140 కోట్ల మందికిపైగా ప్రజల డిజిటల్పరమైన మౌలిక వసతులను విజయవంతంగా అభివృద్ధి చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ‘ప్రజాపయోజనాల కోసం మేం ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. భారత్లోని భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సొంతంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)ను అభివృద్ధి చేస్తున్నాం’అని మోదీ తెలిపారు. స్టార్టప్లు, పరిశోధకులకు అందుబాటు ధరలో సాంకేతిక వనరులను అందించేందుకు ప్రత్యేకమైన ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని భారత్ అభివృద్ధి చేసిందన్నారు. ఏఐ భవిత ఉన్నతంగా, అందరికీ అందుబాటులో ఉండే విషయంలో భారత్ తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ప్రపంచంతో పంచుకొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. డేటా సాధికారత, పరిరక్షక వ్యవస్థ ద్వారా డేటా శక్తిని అందిపుచ్చుకుందని వివరించారు. ‘మేం డిజిటల్ కామర్స్ను ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేశాం. భారత్ తీసుకొచ్చిన నేషనల్ ఏఐ మిషన్కు ఈ దృక్పథమే పునాది. మా హయాంలో జీ20 దేశాలకు సారథ్యం వహించినప్పుడు కృత్రిమ మేధ వాడకం బాధ్యతాయుతంగా ఉండేలా, అందరి మంచికి ఉపయోగపడాలనే విషయంలో ఏకాభిప్రాయం సాధించాం. ప్రస్తుతం ఏఐ వినియోగం, డేటా గోప్యతకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనడంలో భారత్ ముందుంది’అని మోదీ తెలిపారు. ఏఐ మార్గదర్శకాలపై ఉమ్మడి కసరత్తు ఉండాల్సిందే ఓపెన్ సోర్స్ ఆధారిత ఏఐ వినియోగానికి సంబంధించిన ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఉమ్మడి చర్యలు అవసరమని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ప్రజావిశ్వాసాన్ని, పారదర్శకతను పెంపొందించడంలో, వివక్షను చెరిపేయడంలో ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ‘కనీవినీ ఎరుగని విస్తృతి, వేగంతో ఏఐ అభివృద్ధి చెందుతోంది. అంతకన్నా వేగంగా ఏఐ వినియోగం కొనసాగుతోంది. దీనికితోడు దేశాలకు అతీతంగా ఏఐ రంగంలో పరస్పర ఆధారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విలువలను కాపాడుకోవడంతోపాటు ఏఐపై భయాలను పారద్రోలేందుకు, ప్రజావిశ్వాసం చూరగొనేందుకు దోహదపడే ప్రమాణాలను నెలకొల్పాలి. అందుకు ప్రపంచ దేశాలు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని మోదీ సూచించారు. మేధస్సుపరంగా మనిషికన్నా యంత్రాలు ఎంతో ముందుంటాయని కొందరు ఆందోళన చెందుతుంటారు. కానీ మన ఉమ్మడి భవిత, గమ్యం విషయంలో మనుషులమైన మనం తప్ప ఇంకెవరూ కీలకపాత్ర పోషించలేరు’అని మోదీ పేర్కొన్నారు. తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్ నిర్వహణకు సిద్ధం: మోదీ తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్ను భారత్లో నిర్వహించేందుకు ప్రధాని మోదీ ముందుకొచ్చారు. ఈ మేరకు పారిస్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్–2025లో ప్రతిపాదన చేశారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఏఐ దృక్పథం, ఉద్దేశంలో భాగస్వామ్య పక్షాల మధ్య స్పష్టమైన ఐకత్యను చాటేలా చర్చలు జరిగాయి. ఈ ప్రక్రియకు మరింత ఉత్సాహం తెచ్చేందుకు తదుపరి యాక్షన్ సమ్మిట్ను భారత్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. మరోవైపు ‘ఏఐ ఫౌండేషన్’, ‘సుస్థిర ఏఐ మండలి’ని ఏర్పాటు చేయాలన్న సదస్సు నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ఈ విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చొరవను అభినందించిన మోదీ.. భారత్ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. అదే సమయంలో ‘ఏఐ కోసం ప్రపంచ భాగస్వామ్యం’స్వభావరీత్యా సైతం నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉండాలని ఆకాంక్షించారు. దక్షిణాది దేశాలను ఇందులో సమ్మిళితం చేయాలని.. ఆయా దేశాల అవసరాలు, ఆందోళనలు, ప్రాధాన్యతలను గుర్తించాలని సూచించారు. -
శిఖరాగ్రం సాక్షిగా ఏఐ విభేదాలు
పారిస్: పెద్దన్నల పోట్లాటకు ఏఐ అంతర్జాతీయ శిఖరాగ్రం వేదికైంది. అతి కీలకమైన కృత్రిమ మేధ రంగానికి సంబంధించి వాటి మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధతీవ్రతకు అద్దం పట్టింది. ఏఐలో తిరుగులేని శక్తిగా మారిన అమెరికా, దాన్ని ఢీకొట్టే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్న చైనా, ఆ రెండింటికీ దీటుగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న యూరప్ మధ్య విభేదాలు సదస్సు సాక్షిగా బయట పడ్డాయి. నిబంధనల పరిమితుల్లేకుండా సరికొత్త ఇన్నోవేషన్లు తదితరాలతో ఏఐ విషయంలో దూకుడుగా వెళ్లనున్నట్టు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టడం తెలిసిందే. చైనా కూడా ప్రభుత్వ దన్నుతో కూడిన టెక్ దిగ్గజాల చురుకైన భాగస్వామ్యంతో ఏఐ రంగంలో అంతర్జాతీయంగా పైచేయి సాధించే ప్రయత్నంలో పడింది.యూరప్ మాత్రం ఓవైపు ఏఐ వాడకం విషయంలో వ్యక్తుల భద్రతకు, జవాబుదారీతనానికే పెద్దపీట వేస్తూనే మరోవైపు అమెరికా, చైనాలకు దీటుగా మూడో శక్తిగా ఎదిగేందుకు పథక రచన చేస్తోంది. అందులో భాగంగా ఏఐ నిబంధనలను పలు యూరప్ దేశాలు నానాటికీ మరింత కఠినతరం చేస్తూ వస్తున్నాయి. దీనిపై తమ తీవ్ర అసంతృప్తిని పారిస్లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సులో సోమవారం రెండో రోజు అమెరికా బాహాటంగానే వెళ్లగక్కింది. కృత్రిమ మేధపై మితిమీరిన నియంత్రణ మంచిది కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. శరవేగంగా సాగుతున్న ఏఐ ప్రగతి ప్రస్థానానికి అది తీరని అడ్డంకిగా మారవచ్చని హెచ్చరించారు.ఏఐ తాలూకు దుష్పరిణామాలు, రిస్కులకు అడ్డుకట్ట వేసేందుకు యూరప్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన పరోక్షంగా ఆక్షేపించారు. ట్రంప్ రాకతో ఏఐ విషయంలో సమూలంగా మారిన అమెరికా వైఖరిని ప్రతిఫలించేలా వాన్స్ ప్రసంగం సాగింది. అనంతరం యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ మాట్లాడుతూ వాన్స్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఏఐ వాడకం అన్ని విధాలా సురక్షితమేనని ప్రజల్లో నమ్మకం కలగడం అన్నింటికంటే కీలకమని స్పష్టం చేశారు. దాన్ని సాధించడమే ఏఐపై ఈయూ నిబంధనల ఏకైక లక్ష్యమని ఆమె వివరించారు.ఏఐ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో నిర్దిష్ట నియమ నిబంధనలు తప్పనిసరి అని శిఖరాగ్రం ఏర్పాటుకు చొరవ తీసుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా స్పష్టం చేశారు. ఏఐ రేసులో మూడో శక్తిగా యూరప్ శరవేగంగా ఎదుగుతోందని ఆయన ప్రకటించారు. ఏఐ ఇన్నోవేషన్ల ఫలాలు అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ సమానంగా అందాలని తన ముగింపు ప్రసంగంలో ఆకాంక్షించారు. ఏఐ రంగంపై యూరప్ నియంత్రణలను చైనా కూడా వ్యతిరేకించింది. అంతర్జాతీయ ఏఐ ప్రమాణాలనే సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం తమ లక్ష్యమని చైనా ఉప ప్రధాని జాంగ్ గువోకింగ్ పేర్కొన్నారు.మా కంపెనీలపై మతిలేని నియంత్రణలు: వాన్స్ఏఐని ఆవిరి యంత్రం ఆవిష్కరణకు దీటైన సరికొత్త పారిశ్రామిక విప్లవంగా అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక ప్రస్థానానికే ఏఐ మేలిమలుపు కాగలదన్నారు. దాన్ని నిబంధనల ఛట్రంలో బిగించి ప్రగతి నిరోధకులుగా మారొద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అమెరికాలో రూపొందే ఏఐ వ్యవస్థలన్నీ సైద్ధాంతిక, ఇతరత్రా వివక్షలకు తావులేని రీతిలో ఉంటాయని స్పష్టం చేశారు. అమెరికా పౌరుల వాక్ స్వాతంత్య్రం తదితరాలకు తమ ప్రభుత్వం ఎప్పటికీ పరిమితులు విధించబోదన్నారు. అమెరికా టెక్నాలజీ సంస్థలపై పలు దేశాలు మతిలేని నియంత్రణలకు దిగుతున్నాయంటూ యూరోపియన్ యూనియన్ తీరును తప్పుబట్టారు. ఉపాధ్యక్ష హోదాలో అంతర్జాతీయ వేదికపై ఆయనకిది తొలి ప్రసంగం కావడం విశేషంఇదీ తీర్మానం⇒ డిజిటల్ అంతరాలను వీలైనంతగా తగ్గించడమే లక్ష్యం. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మరింతగా కృషి.⇒ ఏఐ టెక్నాలజీ పారదర్శకంగా, నైతిక సూ త్రాలకు అనుగుణంగా, సురక్షితంగా, విశ్వసనీ యంగా, అదే సమయంలో ఎలాంటి వివక్షకూ తావు లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం.⇒ ఏఐని ప్రజలకు, మొత్తంగా ప్రపంచానికి విశ్వసనీయ సుస్థిరాభివృద్ధి చోదక శక్తిగా తీర్చిదిద్దడం.⇒ మానవ హక్కులను, లింగ సమానత్వాన్ని, భాషాపరమైన వైవిధ్యాన్ని, మేధో సంపత్తి హక్కులను అన్ని విధాలా పరిరక్షించడం.ముప్పుపై ఆందోళనలునానాటికీ పెరిగిపోతున్న ఏఐ వాడకంతో పలు కీలక రంగాల్లో తలెత్తగల ముప్పుపై శిఖరాగ్రంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా రక్షణ, యుద్ధతంత్రం తదితరాల్లో ఏఐ అంతిమంగా మానవ నియంత్రణ పరిధినే దాటిపోకుండా చూ డాలని నాటో కమాండర్ అడ్మిరల్ పియరీ వాండి యర్ అన్నారు. లేదంటే చూస్తుండగానే వ్యవహారం చేయి దాటిపోవచ్చని హెచ్చరించారు. వక్తల్లో అత్యధికులు ఆయన వాదనతో ఏకీభవించారు.‘ఇన్వెస్ట్ఏఐ’కి 200 బిలియన్ డాలర్లు: ఈయూకృత్రిమ మేధ రంగంపై అత్యంత భారీగా పెట్టుబడుల దిశగా యూరప్ శరవేగంగా సాగుతోంది. ఇందుకు ఉద్దేశించిన ‘ఇన్వెస్ట్ఏఐ’ కార్యక్రమానికి యూరప్వ్యాప్తంగా ఇప్పటికే ఏకంగా 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరినట్టు కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్ ప్రకటించారు.మోదీ చెప్పింది అక్షరసత్యంప్రధానికి వాన్స్ అభినందనలుకృత్రిమ మేధ మనిషికి ఏనాటికీ ప్రత్యామ్నాయం కాబోదన్న ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. పారిస్ ఏఐ శిఖరాగ్రంలో మోదీ మాట్లాడుతూ మానవ ఉత్పాదనను మరింతగా పెంచేందుకు, వారికి మరింత స్వేచ్ఛ అందించేందుకు సమర్థమైన పరికరంగా ఏఐ తోడ్పడుతుందని అభిప్రా యపడ్డారు. అనంతరం మాట్లాడిన వాన్స్ ప్రధా ని వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించారు. ‘‘మోదీ కీలకమైన అంశాలు లేవనెత్తారు. వాటిపై వాస్తవి క వైఖరిని చక్కగా, సమర్థంగా వెల్లడించారు. అందుకు ఆయనకు అభినందనలు’’ అంటూ ప్రశంసించారు. -
'ఉద్యోగాలు పోతాయనడం సరికాదు': ఏఐ సమ్మిట్లో మోదీ
భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' (Narendra Modi) పారిస్లో నిర్వహించిన ప్రపంచ ఏఐ (AI) శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో కృత్రిమ మేధస్సు ఎలా కీలక పాత్ర పోషిస్తుందనే దాని గురించి వివరించారు. ఏఐ ప్రయోజనాలను మాత్రమే కాకుండా.. నష్టాలను కూడా కలిగిస్తుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.ఏఐ జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఏఐ పాత్ర కీలకం. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం.. ప్రయాణాన్ని సులభంగా, వేగవంతం చేయడానికి ఏఐ సహాయపడుతుందని మోదీ అన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనడం సరైంది కాదు.సాంకేతిక అనేది నైపుణ్యం పెంచుకునేవారికి ఓ మంచి అవకాశం. కాలానుగుణంగా ఉద్యోగాల స్వభావం మారుతుంది. కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయని మోదీ అన్నారు. డిజిటల్ మార్కెట్, వాణిజ్యం దిశగా భారత్ ముందుకు దూసుకెళ్తోంది. పాలించడం అంటే ప్రత్యర్థులను ఎదుర్కోవడం, ప్రమాదాలు రాకుండా చూసుకోవడం మాత్రమే కాదు.. కొత్త ఆవిష్కరణలకు అవకాశం కల్పించడం కూడా. అప్పుడే దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది.ఏఐ యాక్షన్ సమ్మిట్ (AI Action Summit)కు అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ.. ఏఐకి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గణాంకాలతో సహా వివరించారు. అలాగే ‘‘మంచి కోసం ఏఐ.. అందరికీ ఏఐ’’ ఇదే భారత్ నినాదమని ఆయన ప్రకటించారు. సైబర్ సెక్యూరిటీ, తప్పుడు సమాచారం, డీప్ఫేక్లకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించుకోవాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అవసరమైన అప్లికేషన్లను సృష్టించాలని అన్నారు.ఇదీ చదవండి: మస్క్ ఆఫర్.. రిజెక్ట్ చేసిన ఆల్ట్మన్: ట్వీట్స్ వైరల్..టెక్ పరిశ్రమలో భారతదేశం సాధించిన విజయాలను కూడా ప్రధాని మోదీ.. ఈ వేదికపై హైలైట్ చేశారు. చాలా తక్కువ ఖర్చుతో 1.4 బిలియన్లకు పైగా ప్రజలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విజయవంతంగా నిర్మించామని అన్నారు. మేము మా డేటా సాధికారత, రక్షణ నిర్మాణం ద్వారా డేటా శక్తిని అన్లాక్ చేసాము. డిజిటల్ వాణిజ్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా.. అందరికీ అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. మనం మానవాళి గమనాన్ని రూపొందించే AI యుగం ప్రారంభంలో ఉన్నామని కూడా ప్రధాని మోదీ వెల్లడించారు.#WATCH | During the AI Action Summit at the Grand Palais in Paris, Prime Minister Narendra Modi says "Governance is also about ensuring access to all, especially in the Global South. It is where the capabilities are most lacking be it power, talent, or data for the financial… pic.twitter.com/HXd3bAdEXI— ANI (@ANI) February 11, 2025 -
ఫ్రాన్స్లో ప్రధాని
న్యూఢిల్లీ: ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. రక్షణ మంత్రి సెబ్ లెకొర్నూ ఆయనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం దారి పొడవునా, హోటల్ వద్ద బారులు తీరిన భారతీయుల సమూహానికి మోదీ అభివాదం చేశారు. సాయంత్రం మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విందు ఇచ్చారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలు కూడా విందులో పాల్గొన్నారు. పారిస్లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుకు మాక్రాన్తో కలిసి మోదీ ఆతిథ్యమిస్తున్నారు. మంగళవారం సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. అనంతరం బుధవారం చారిత్రక నగరం మార్సెయిల్లో భారత్ తొలి కాన్సులేట్ను మాక్రాన్తో కలిసి ప్రారంభిస్తారు. కడారచ్లో ఫ్రాన్స్, భారత్, పలు ఇతర దేశాలు నిర్మిస్తున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను సందర్శిస్తారు. తర్వాత ఫ్రాన్స్ గడ్డపై మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలర్పించిన భారత సైనికులకు మజారŠగ్స్ వార్ సిమెట్రీ వద్ద నేతలిద్దరూ నివాళులర్పిస్తారు. అనంతరం మోదీ అమెరికా బయల్దేరి వెళ్తారు. ప్రధానిగా ఫ్రాన్స్లో మోదీకి ఇది ఆరో అధికారిక పర్యటన. గతేడాది భారత్–ఫ్రాన్స్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పాతికేళ్ల వేడుక జరుపుకున్నాయి. ఇరు దేశాల భాగస్వామ్యం ఇన్నొవేషన్లు, టెక్నాలజీ, మారిటైం, రక్షణ సహకారం, ఉగ్రవాదంపై పోరు, ఆరోగ్యం, సంప్రదాయేతర ఇంధన వనరులతో పాటు పలు రంగాలకు విస్తరించిందని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో పేర్కొంది. మాక్రాన్ ఆహా్వనం మేరకు మోదీ ఫ్రాన్స్లో పర్యటిస్తున్నారు. యూఎస్తో బంధం బలోపేతం తన అమెరికా పర్యటన ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘టెక్నాలజీ, వర్తకం, రక్షణ, ఇంధన, సరఫరా తదితర రంగాల్లో అమెరికాలో బంధాన్ని సుదృఢం చేసే అజెండా రూపకల్పనకు నా పర్యటన దోహదం చేయనుంది. ట్రంప్ తొలి హయాంలో పలు అంశాలపై ఆయనతో సన్నిహితంగా కలిసి పని చేశా. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి భేటీ అవబోతున్నా. నా మిత్రున్ని కలిసేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా’’ అంటూ ఫ్రాన్స్ బయల్దేరే ముందు ఎక్స్లో పేర్కొన్నారు. -
ఏఐ స్వీకరణలో పెద్ద కంపెనీలే ముందంజ
లాభాలను మెరుగుపరచుకోవడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్, సైబర్సెక్యూరిటీ సొల్యూషన్స్ వంటి నూతన తరం సాంకేతికతను వినియోగించడంలో పెద్ద కార్పొరేట్లు ముందుంటాయని సీపీఏ ఆస్ట్రేలియా నివేదిక వివరించింది.‘కొత్త సాంకేతికతలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. వీటి వినియోగం వల్ల కంపెనీలకు సైబర్ భద్రత, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో, ఉద్యోగుల నైపుణ్యాలు, సంతృప్తిని పెంపొందించడంలో దోహదం చేస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడంలో సాయపడుతుంది.ఉద్గారాల పర్యవేక్షణ, సరఫరా వ్యవస్థ పారదర్శకతను మెరుగుపరచడానికి, వాటాదారులతో సమర్థవంతంగా నిమగ్న మవ్వడానికి సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడంపై కంపెనీలు దృష్టి పెట్టాలి. ఇది కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకుండా అభివృద్ధి చెందుతున్న నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ప్రమాణాలను పాటించేందుకు కూడా సహాయపడుతుంది. -
ఏఐలో భారత పతాక
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీని సృష్టించటంలో కాస్త వెనుకబడి ఉండవచ్చు.. కానీ టెక్నాలజీని అందిపుచ్చుకుని దానిని శిఖర స్థాయికి తీసుకెళ్లటంలో భారతీయ నిపుణులకు ఎవరూ సాటి రారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్రంగం(Software sector)లో భారతీయ టెకీలతో అగ్రరాజ్యాల నిపుణులు కూడా పోటీ పడలేరని ఇప్పటికే నిరూపణ అయ్యింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన కృత్రిమ మేథ (ఏఐ)(AI)లో కూడా భారతీయ నిపుణులదే అగ్రస్థానమని తాజా సర్వేలో తేలింది.పని ప్రదేశాల్లో ఏఐ, జెనరేటివ్ ఏఐ టూల్స్ వినియోగం ద్వారా ప్రపంచ సగటు కంటే మెరుగైన ఉత్పాదకతను సాధించి భారతీయులు ప్రత్యేకతను చాటుతున్నారు. వృత్తి నైపుణ్యం, వృత్తిగతంగా అత్యాధునిక సాంకేతికతల వినియోగం, ఏఐతో కూడిన ‘వర్క్ప్లేస్ ట్రాన్స్ఫార్మేషన్’ను భారతీయ వృత్తి నిపుణులు వేగంగా అందిపుచ్చుకుంటున్నారని ‘2025 గ్లోబల్ వర్క్ప్లేస్ స్కిల్స్ స్టడీ(Global Workplace Skills Study)’పేరిట ఎడ్టెక్ యూనికార్న్ ఎమెరిటస్ నిర్వహించిన సర్వేలో తేలింది. సర్వేలోని కీలక అంశాలు..⇒ 18 దేశాల్లోని ఫైనాన్స్, ఇన్సూరెన్స్, మాన్యుఫాక్చరింగ్, సాఫ్ట్వేర్, ఐటీ సర్విసెస్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో పనిచేస్తున్న 6 వేల మంది (21–65 ఏళ్ల లోపువారు) ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 1,700 మంది భారతీయ వృత్తి నిపుణులు ఉన్నారు. ⇒ ఏఐ మెళకువలను అందిపుచ్చుకోవడం (ఏఐ అడాప్షన్)లో 96 శాతంతో ప్రపంచంలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. 84 శాతంతో ద్వితీయ స్థానంలో ఇంగ్లాండ్, 81 శాతంతో తృతీయ స్థానంలో అమెరికా నిలిచాయి. ⇒ ఏఐ ద్వారా భిన్నమైన రంగాల్లో పరిశ్రమల స్థాపన (ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్)కు అవకాశం లభిస్తుందని 94 శాతం మంది భారతీయులు భావిస్తున్నారు. ⇒ ఏఐకి అనుగుణంగా పని విధానాన్ని మలుచుకున్నందువల్ల ఉత్పాదక పెరిగిందని 95 శాతం మంది భారతీయ నిపుణులు తెలిపారు.⇒ ఏఐ నైపుణ్యాలు దీర్ఘకాలిక కెరీర్కు, ప్రాధాన్యత కోల్పోకుండా ఉద్యోగాలు, వృత్తుల్లో కొనసాగింపునకు దోహ దపడుతుందని 94 శాతం మన టెకీలు భావిస్తున్నారు. ⇒ కెరీర్లో ఉత్తమ ప్రదర్శన కనబరచడానికి ఏఐ, జనరేటివ్ ఏఐ కీలకమని 90 శాతం భారత వృత్తి నిపుణులు విశ్వసిస్తున్నారు. ⇒ 71 శాతం సంస్థల అధిపతులు, యాజమాన్యాలు ఏఐ శిక్షణలో పెట్టుబడులను పెంచాయి.భారత్లో కోరుకుంటున్న టాప్–5 నైపుణ్యాలు ఏఐ డెవలప్మెంట్, అప్లికేషన్ మాస్టరింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెషీన్ లర్నింగ్ (ఎంఎల్) స్ట్రాటజిక్ లీడర్షిప్, మేనేజ్మెంట్మన టెకీల కృషి అభినందనీయంమారుతున్న కాలాన్ని బట్టి అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికతను వర్క్ఫోర్స్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి తగ్గట్టుగా నూతన నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలి. ఇండియాలోని వర్క్ఫోర్స్ ఏఐ మెళకువలను అందిపుచ్చుకుని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దే దిశలో కృషి సాగించడం అభినందనీయం. – అశ్విన్ దామెర, ఎమెరిటస్ కో ఫౌండర్, సీఈవో -
ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. నారాయణమూర్తి ఏమన్నారంటే..
ఉద్యోగ కోతలపై కృత్రిమ మేధ (ఏఐ), వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రభావం ఎలా ఉందో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి తన అభిప్రాయాలు పంచుకున్నారు. కృత్రిమ మేధ వల్ల కొంతమేరకు నిరుద్యోగం పెరుగుతోందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐ ప్రభావంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐను ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా చూడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.కృత్రిమ మేధ-ఉద్యోగ నష్టాలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాస్తవానికి చాలా పనులను ఆటోమేట్ చేస్తోందని మూర్తి చెప్పారు. దాంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారని తెలిపారు. అయితే ఇది కొత్త అవకాశాలను సృష్టించడానికి, మానవ ఉత్పాదకతను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉందని అంగీకరించారు. 1970ల్లో కంప్యూటర్-ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సాధనాలను ప్రవేశపెట్టిన సమయంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. కానీ ఈ సాధనాలు డెవలపర్లకు మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి వీలు కల్పించాయన్నారు. ఉత్పాదకతను పెంచడానికి మానవులు, యంత్రాలు కలిసి పనిచేసే సహాయక సాంకేతికతగా కృత్రిమ మేధను పరిగణించాలని మూర్తి అన్నారు. అటానమస్ డ్రైవింగ్, ప్రమాదకర వాతావరణంలో యంత్రాలను ఆపరేట్ చేయడం, కచ్చితమైన పరికరాలతో రిమోట్ సర్జరీ వంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోజనకరంగా ఉంటుందని హైలైట్ చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా మానవులు మరింత సృజనాత్మక, సంక్లిష్టమైన పనులపై దృష్టి పెట్టవచ్చని చెప్పారు. ఇది ఉద్యోగుల నైపుణ్యాల పెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: భారత్లో బ్లాక్రాక్ కొత్తగా 1,200 ఉద్యోగాలుఏఐ ఇన్నోవేషన్లో భారత్ పాత్రకృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణలు చేయడంలో భారత్ సామర్థ్యంపై మూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చెందిన సాంకేతికతలను అవలంబించడమే కాకుండా ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి దోహదపడే స్థాయికి దేశం పురోగమించిందని అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధను స్వీకరించి కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టాలని యువతను కోరారు. -
భారత్లో బ్లాక్రాక్ కొత్తగా 1,200 ఉద్యోగాలు
ప్రపంచంలోనే ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్రాక్ ఇంక్.(BlackRock) భారత్లో సుమారు 1,200 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. దీని ద్వారా దేశంలో తన ఉద్యోగుల సంఖ్యను విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను పెంచడం, ముంబై, గుర్గావ్లో ఐహబ్స్గా పిలువబడే దాని సపోర్ట్ హబ్లను పెంచేందుకు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది.వ్యూహాత్మక విస్తరణమెరుగైన అసెట్ మేనేజ్మెంట్ సేవల కోసం ఏఐను ఉపయోగించుకోవాలనే బ్లాక్రాక్ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇంజినీర్లు, డేటా నిపుణులతో సహా కృత్రిమ మేధ సాంకేతికతల అభివృద్ధి, వాటిని అమలు చేసే విభాగాల్లో రిక్రూట్మెంట్ ఉంటుందని కంపెనీ అధికారులు తెలిపారు. ముంబై, గుర్గావ్లోని బ్లాక్రాక్ ఐహబ్లు ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్, రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఇంజినీరింగ్, బిజినెస్ ఆపరేషన్స్, డేటా అనలిటిక్స్ వంటి విలువ ఆధారిత సేవలకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఉద్యోగులతో మొత్తం భారత్లో వీరి సంఖ్య 3,500కు చేరుతుంది.ఇదీ చదవండి: గరిష్ట వడ్డీరేట్లను బహిర్గతం చేయాలని ఆదేశాలుప్రికిన్ కొనుగోలుబ్లాక్రాక్ సంస్థ ప్రికిన్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీను కూడా కొనుగోలు చేయనుంది. దాంతో బెంగళూరులో 1,500 మంది ఉద్యోగులతో గ్లోబల్ సామర్థ్యాల కేంద్రాన్ని బ్లాక్రాక్ సొంతం చేసుకోనుంది. ఈ కొనుగోలు సంస్థ డేటా ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుందని నమ్ముతున్నారు. సంస్థకు కీలకమైన కార్యకలాపాల స్థావరంగా ఈ బెంగళూరు కార్యాలయం ఉంటుందని కంపెనీ తెలిపింది. పెరుగుతున్న శ్రామిక శక్తికి అనుగుణంగా ముంబై శివారులోని గోరేగావ్లో అదనపు కార్యాలయ స్థలాన్ని ఒబెరాయ్ రియల్టీ లిమిటెడ్ నుంచి బ్లాక్రాక్ లీజుకు తీసుకుంది. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య దాదాపు రూ.400 కోట్లు (45.9 మిలియన్ డాలర్లు) విలువైన డీల్ కుదిరింది. -
ఏఐదే హవా!
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకున్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఐటీ నిపుణుల అవసరం పెరుగుతోంది. దీంతో పలు సంస్థలు నైపుణ్యం గల యువత కోసం అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యాంపస్ నియామకాల కోసం కాలేజీల బాట పడుతున్నాయి. మారిన సాంకేతికత అవసరాలకు సరిపోయే నైపుణ్యం ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ వంటి నేపథ్యం ఉన్న వారిని అత్యధిక వార్షిక వేతనంతో ఎంపిక చేసుకుంటున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో క్యాంపస్ నియామకాలు 20% పెరిగే వీలుందని ఇటీవల నౌకరీ డాట్ కామ్ సర్వే వెల్లడించడం గమనార్హం. పలు దేశాలు భారత్లో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల(జీసీసీ) ఏర్పాటుపై దృష్టి పెడుతున్నాయి. దీంతో నైపుణ్యం యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న జీసీసీలకు అత్యుత్తమ మానవ వనరులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిస్థితులు బీటెక్ విద్యార్థుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. దేశంలో ఏఐ నిపుణులు అంతంతే.. ఇండక్షన్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలు 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా 3.64 లక్షల ఉద్యోగాలు సృష్టించే వీలుంది. ప్రస్తుతం జీసీసీల్లో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 19 లక్షలు కాగా 2030 నాటికి ఇది 28 లక్షలకు చేరుతుందని అంచనా. స్కిల్ ఇండియా రిపోర్టు ప్రకారం 2026 నాటికి దేశంలో 10 లక్షల మందికి పైగా ఏఐ నిపుణుల అవసరం ఏర్పడుతుంది. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ నిపుణులు మాత్రమే ఉన్నారు. అంటే 2026 నాటికి సుమారుగా మరో 6 లక్షల మంది అవసరం కానున్నారు. ఈ నేపథ్యంలోనే అనవసర ఆందోళనలు పక్కనపెట్టి ఏఐని ఆహ్వానించాలని, ఐటీ దిగ్గజ సంస్థకు చెందిన జాకర్ తెలిపారు. ఇవన్నీ గమనంలో ఉంచుకునే విద్యా సంస్థలు ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు పెంచుకుంటున్నాయి. కంపెనీలు సైతం ఏఐపై పట్టున్న వారికే ప్రాంగణ నియామకాల్లోనూ మంచి అవకాశాలు ఇస్తున్నాయి. ప్రత్యేక నైపుణ్యమే ప్రధానం దేశంలో ప్రతి ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో కేవలం 9 శాతం మాత్రమే ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్పై పట్టు వారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్, మెకానికల్లో బీటెక్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ, తదితర టెక్నాలజీల్లో సర్టిఫికెట్ కోర్సులు చేస్తేనే క్యాంపస్ నియామకాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఏఐ, డేటా సైన్స్ రంగాల్లోని పట్టభద్రులకు క్యాంపస్ నియామకాల్లో సంప్రదాయ ఐటీ రంగాల నిపుణుల కన్నా 30 శాతం ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. జీసీసీల్లో అత్యధిక డిమాండ్ కలిగిన టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్నవారికి మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు. క్యాంపస్ నియామకాల్లో ఏఐ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ, డేటా ఫ్యాబ్రిక్స్, డి్రస్టిబ్యూషన్ ఎంటర్ప్రైజెస్, క్లౌడ్ నేటివ్ ప్లాట్ఫామ్స్, అటానమస్ సిస్టమ్స్, డెసిషన్ ఇంటెలిజెన్స్, హైపర్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ మెష్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సైబర్ సెక్యూరిటీలో ప్రారంభ వేతనం సగటున ఏడాదికి 9.57 లక్షలుగా ఉంది. ఏఐ నైపుణ్యానికి కంపెనీల ప్రాధాన్యం రెండేళ్ళుగా జేఎన్టీయూహెచ్లో ప్రాంగణ నియామకాలు పెరుగుతున్నాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఎఐఎంల్తో పాటు ఏఐ అనుసంధానం ఉన్న కోర్సుల విద్యార్థులకు కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే సివిల్, మెకానికల్ విద్యార్థులు కూడా ఈ ట్రెండ్ను అర్థం చేసుకుని, ఏఐఎంల్ మైనర్ డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. వీరికి కూడా ప్లేస్మెంట్స్ లభిస్తున్నాయి. – ప్రొఫెసర్ పద్మావతి విశ్వనాథ్ (వైస్ ప్రిన్సిపల్, జేఎన్టీయూహెచ్) స్థానిక వనరులపై ఐటీ సంస్థల దృష్టి ఏఐ విస్తరణకు అనుగుణంగా డేటా కేంద్రాలు, మాడ్యూల్స్ అభివృద్ధి చేయాల్సి వస్తోంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో స్థానికంగా మానవ వనరులు అభివృద్ధి పరుచుకోవడంపై సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే నైపుణ్యం వారి కోసం క్యాంపస్ నియామకాలు పెంచాయి. – నవీన్ ప్రమోద్ (ఎంఎన్సీ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్) -
ప్రభుత్వ డివైజ్ల్లో ఏఐ టూల్స్ నిషేధం!
అధికారిక పరికరాల్లో చాట్జీపీటీ(ChatGPT), డీప్సీక్(Deepseek) వంటి ఏఐ టూల్స్ వాడకాన్ని నిషేధిస్తూ భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏఐ టూల్స్, అప్లికేషన్లు సున్నితమైన ప్రభుత్వ డేటా గోప్యతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని అడ్వైజరీ హైలైట్ చేసింది. జనవరి 29, 2025 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం డేటా భద్రత, ప్రభుత్వ డాక్యుమెంట్ల గోప్యతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.నిషేధం ఎందుకు?ఏఐ టూల్స్, అప్లికేషన్లు సున్నితమైన ప్రభుత్వ డేటా గోప్యతకు ప్రమాదం వాటిల్లేలా ప్రవర్తిస్తాయని అడ్వైజరీ స్పష్టం చేసింది. ఈ సాధనాలు తరచుగా బయటి సర్వర్ల ద్వారా వినియోగదారు ఇన్పుట్లను ప్రాసెస్ చేస్తాయి. ఇది డేటా లీక్లకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు డేటా భద్రతా ప్రమాదాలను ఉదహరిస్తూ ఇలాంటి ఆంక్షలు విధించాయి. దాంతో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.ఓపెన్ఏఐ సీఈఓ పర్యటనఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఈరోజు భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో చాట్జీపీటీ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు అడ్వైజరీ వెలువడడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా ఐటీ మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అధికారిక, గోప్యమైన కమ్యూనికేషన్లలో ఏఐ ఆధారిత డేటా భద్రతా ప్రమాదాలపై పెరుగుతున్న ఆందోళనలను ఈ చర్య నొక్కి చెబుతోంది.ఇదీ చదవండి: ‘చౌకగా పెట్రోల్.. ప్రజలకు రాయితీల్లేవు’డేటా భద్రతా చర్యలు అవసరంఈ నిషేధం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు కంప్యూటర్లు, డివైజ్ల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించకూడదు. ఉద్యోగులు పని ప్రయోజనాల కోసం వ్యక్తిగత పరికరాలపై ఈ సాధనాలను ఉపయోగించవచ్చో లేదో ఆదేశాల్లో ప్రత్యేకంగా పేర్కొననప్పటికీ సౌలభ్యం కంటే డేటా భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. పని ప్రదేశాల్లో కృత్రిమ మేధ సాధనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చర్చ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందున పటిష్టమైన డేటా భద్రతా చర్యల అవసరాన్ని కూడా ప్రభుత్వ నిర్ణయం ఎత్తి చూపుతుంది. -
త్వరలో భారత్ సొంత జీపీయూ
వచ్చే 3–5 ఏళ్లలో హై–ఎండ్ కంప్యూటింగ్ చిప్సెట్లయిన జీపీయూలను భారత్ సొంతంగా తయారు చేసుకోగలదని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే దేశీయ ఫౌండేషనల్ ఏఐ (AI) ప్లాట్ఫాం పది నెలల్లో సిద్ధం కావచ్చని వివరించారు. దేశీయంగా మరో 3–4 రోజుల్లో మొత్తం 18,000 అధునాతన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను (GPU) అందుబాటులోకి తేనున్నట్లు బడ్జెట్ రౌండ్టేబుల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు.ఇప్పటికే 10,000 జీపీయూలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఖరీదైన, అధునాతన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు అవసరమయ్యే ఏఐ మోడల్స్ సాధారణంగా బడా సంస్థలకే పరిమితమయ్యే అవకాశం ఉందని, కానీ చిన్న స్థాయి అంకురాలు, పరిశోధకులు కూడా చౌకగా కంప్యూటింగ్ ఇన్ఫ్రాను ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు. ఏఐ ఫౌండేషనల్ మోడల్ను రూపొందించేందుకు స్టార్టప్లు, పరిశోధకులు కీలకమైన మాథమెటికల్ అల్గోరిథంలకు సంబంధించిన పలు పరిశోధన పత్రాలను అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: బెదిరింపులకు భయపడి మూసేయలేదుచాట్జీపీటీతో పోలిస్తే చిన్నవే అయినప్పటికీ పలు అంకుర సంస్థలు కొన్ని ఏఐ మోడల్స్ను ఇప్పటికే రూపొందించాయని, కృత్రిమ మేథ సహాయంతో రైల్వే శాఖ టికెట్ల కన్ఫర్మేషన్ రేటును 27 శాతం మెరుగుపర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు, దేశీ ఎల్రక్టానిక్ కంపెనీలు అత్యంత నాణ్యత, కచ్చితత్వంతో ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలను సాధించాయని ఆయన చెప్పారు. -
ఏఐ... పిల్లలూ... తల్లిదండ్రులూ!
ఏఐ ప్రాధాన్యం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల ప్రపంచం తీవ్ర ప్రభావానికి లోనవుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు బిడ్డల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అత్యంత ముఖ్యమైన అంశం అయ్యింది. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలు బీటా తరం కిందకు వస్తారు. మొన్న జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12.03 నిమిషాలకు మిజోరంలోని ఐజ్వాల్ ఆసుపత్రిలో జన్మించిన అబ్బాయిని భారతదేశంలో మొదటి తరానికి చెందే తొలి ‘బీటా చిన్నారి’గా గుర్తించారు. అసలు ఆల్ఫా, బీటా... అంటూ ఈ వర్గీకరణ అంతా ఏమిటి అనుకుంటున్నారా? పిల్లలు ఏ తరంలో జన్మించారు అన్న అంశం వాళ్ల సామాజిక వ్యవహార శైలిని నిర్దేశిస్తుంది. అప్పుడు ఉండే సాంకేతికత, సామాజిక మాధ్య మాల ప్రభావం వంటి అంశాలు వాళ్ల వ్యక్తిత్వాన్ని, అనుభవాలను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు. రాజకీయంగా వాళ్ల ఐడియాలజీని, వినియోగ దారునిగా వాళ్ల మనస్తత్వాన్ని నిర్దేశిస్తాయి. ఇప్పుడు పుట్టుకొస్తున్న బీటా బేబీలు ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్తో నిండిపోయిన సాంకేతిక ప్రపంచంలో జీవిస్తారు. అంటే వాళ్ల రోజువారీ జీవితం చిన్న రోబోల మధ్య సాగుతుంది. అవి చెప్పినట్టే వాళ్లు నడుచుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే అవి వీళ్లకు ట్యూటర్లు అన్న మాట. దాంతో పాటు వాటికవే నడిచే డ్రైవర్ లేని కార్లను చూస్తారు. 2035 నాటికి మొత్తం జనాభాలో 16 శాతం మంది బీటా తరానికి చెందిన వాళ్లే ఉంటా రని అంచనా.బీటా తరంలో పుట్టిన పిల్లలు ఆల్ఫా తరం కంటే చురుగ్గా, తెలివిగా, టెక్ సావీగా ఉంటారు. ఉదాహరణకి ‘వీల్స్ ఆన్ ద బస్’ ఆట ఆడాలంటే ‘అలెక్సా’ను పిలుస్తారు. లెక్కల్లో హెచ్చివేతలు అంటే మల్టిప్లికేషన్ వంటివి తెలియకపోతే ‘బ్లాక్ బాక్సు’ను ఆశ్రయిస్తారు. ఈ పరిస్థితుల్లో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసు కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ముందుగా మార్కెట్లోకి కొత్తగా వస్తున్న యాప్స్, ప్లాట్ ఫారమ్స్ గురించి తెలుసుకోవాలి. ట్రెండ్స్ను అనుసరించాలి. అప్పుడు పిల్లలకు ఏవి ఉపయోగపడతాయి? ఏవి ఉపయోగపడవు అనేది తెలుసుకోగలుగుతారు. పిల్లలు ఎక్కువ టెక్నాలజీ మధ్య ఉంటారు గనుక సైబర్ మోసాల బారిన పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు తగినంత అవగాహన పెంచాలి. ఎక్కువ డివైజ్లపై ఆధారపడకుండా బాహ్య ప్రపంచంలో వాళ్లకు మంచి అనుభవాలను అందించాలి. కొత్త ప్రదేశాలకు తీసికెళ్లటం, బంధువులు, స్నేహితుల మధ్య గడపటం నేర్పాలి. ఇంట్లో కొంత ప్రదేశాన్ని ‘టెక్ ఫ్రీ జోన్’గా మలచాలి. ప్రధానంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసే డైనింగ్ టేబుల్ మీద ఎలాంటి డివైజ్లూ లేకుండా చూసుకోవాలి. పుస్తకాలు చదవటం, ఇంట్లో అమ్మానాన్నలతో మాట్లాడటం వంటివి అలవాటు చేయాలి. ఏది ఏమైనా బీటా తరం కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. చుట్టూ ఉన్న వాళ్లకు కొత్త అనుభవాలను అంది స్తుంది. అవి ఎలా ఉంటాయో రానున్న రోజుల్లో మనకు అర్థం అవుతుంది.– డా‘‘ పార్థసారథి చిరువోలుసీనియర్ జర్నలిస్ట్ ‘ 99088 92065 -
మనిషిలా తెలివి మీరుతున్న ఏఐ
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతికి ‘మెమోరీని ఏకీకృతం’ చేయడం కీలకంగా మారుతోంది. ఏఐ వ్యవస్థను నడిపించే ముఖ్య కారకాల్లో ఇది ప్రధానమైంది. సమస్యలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి మానవులు జ్ఞాపకశక్తిపై ఆధారపడినట్లే.. ఏఐ వ్యవస్థలు వాటి సామర్థ్యాలను మెరుగుపరచడానికి మెమరీని ఉపయోగించడం ఇప్పటికే ప్రారంభించాయి. ఈ మార్పు మరింత అధునాతనంగా, మానవ తరహా కృత్రిమ మేధకు మార్గం సుగమం చేస్తోంది.ఓహియో స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న యూసు ఈ రంగంలో పరిశోధనలు చేస్తున్నవారిలో ప్రముఖంగా ఉన్నారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో చేరడానికి ముందు తాను మైక్రోసాఫ్ట్ సెమాంటిక్ మెషీన్స్లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేశారు. అక్కడ తాను సంభాషణాత్మక ఏఐపై విధులు నిర్వహించారు. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెమరీ ఆగ్మెంటెడ్ ఏఐ సిస్టమ్స్ అభివృద్ధిలో పరిశోదనలు చేశారు.సందర్భానుసారం స్పందించే ఏఐఅత్యాధునిక సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడం కోసం గత సమాచారాన్ని గుర్తుంచుకుని, సందర్భానుసారం దాన్ని ఉపయోగించే ఏఐ వ్యవస్థలను సృష్టించడంపై దృష్టి సారించినట్లు యూసు తెలిపారు. భాషా అవగాహన, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి పనులకు ఈ విధానం కీలకమని చెప్పారు. కృత్రిమ మేధస్సులో మెమోరీని చేర్చడం ద్వారా సాంకేతిక పరిశోధకులు.. గత అనుభవాల నుంచి నేర్చుకోగల, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మరింత కచ్చితమైన ప్రతిస్పందనలను అందించే ఏఐ వ్యవస్థలను సృష్టించడంలో నిమగ్నమయ్యారు.మెమోరీతో ఉపయోగాలు..ఏఐ వ్యవస్థలో మెమోరీ ఆగ్మెంటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఆరోగ్య సంరక్షణలో, రోగి చరిత్రలు, చికిత్స ఫలితాలను గుర్తు చేసుకోవడం ద్వారా వ్యాధులను నిర్ధారించడంలో ఇది సహాయపడుతుంది. ఫైనాన్స్ విభాగంలో గత డేటాను విశ్లేషించడం ద్వారా మార్కెట్ ధోరణులను అంచనా వేయడంలో తోడ్పడుతుంది. రోజువారీ పనులను మరింత మెరుగ్గా చేసేందుకు ఉపయోగపడుతుంది. మరింత సహజంగా వినియోగదారు అవసరాలకు ప్రతిస్పందించేలా చేస్తుంది.ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..సమర్థమైన వ్యవస్థలు..కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సాంకేతిక పరిశోధకుల సహకారం మెరుగైన భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా ఏఐ వ్యవస్థలు మరింత తెలివైనవిగా, సమర్థవంతమైనవిగా మారుతున్నాయి. ఈ రంగంలోని ఆవిష్కరణలు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇదిలాఉండగా, ఎంత అడ్వాన్స్డ్ పీచర్లతో ఏఐ వ్యవస్థలు వచ్చినా మనిషి మెదడుతో పోటీ పడలేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
రేపు భారత్కు ఓపెన్ఏఐ సీఈఓ ఆల్ట్మన్
చాట్జీపీటీ(ChatGPT)ని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐ(OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మన్ ఫిబ్రవరి 5న భారత్కు వస్తున్నట్టు సమాచారం. ఈ పర్యటనలో ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులను కలవడంతోపాటు పరిశ్రమ పెద్దలతో చర్చాగోష్టిలో ఆయన పాల్గొనాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండేళ్లలో ఆయన భారత్కు రావడం ఇది రెండవసారి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఓపెన్ఏఐ ఆధిపత్యాన్ని చైనాకు చెందిన డీప్సీక్ అకస్మాత్తుగా సవాలు చేసిన ఈ తరుణంలో ఆల్ట్మాన్ భారత్ సందర్శన ఆసక్తిగా మారింది. యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉద్భవిస్తున్న శక్తివంతమైన ఏఐ మోడళ్ల గురించి సందేహాలను ఆయన 2023లో వ్యక్తం చేసిన వీడియో ఒకటి మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్ని కాపీరైట్ ఉల్లంఘనల దావాలకు సంబంధించిన కేసులతో సహా భారత్లో చట్టపర అడ్డంకులను ఓపెన్ఏఐ ఎదుర్కొంటున్న సమయంలో ఆల్ట్మన్ భారత్ను సందర్శించడం హాట్ టాపిక్ అయింది. బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాను మాత్రమే ఉపయోగిస్తున్నామని, విచారించడానికి భారతీయ న్యాయస్థానాలకు అధికార పరిధి లేదని ఓపెన్ఏఐ వాదించింది.ఇదీ చదవండి: ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?డీప్ రీసెర్చ్ ఆవిష్కరణ..చాట్జీపీటీలో ఇటీవల డీప్ రీసెర్చ్ ఫీచర్ను ఓపెన్ఏఐ ఆవిష్కరించింది. ప్రస్తుతం చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ కొనసాగుతుండగా డీప్ రీసెర్చ్ తన పోటీదారులకు వ్యతిరేకంగా ఎలా నిలబడుతుందో, ఈ విభాగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. -
ఏడాదికి కోటి జీతం: ఇలాంటి జాబ్స్ చేస్తే మీ సొంతం
ఏడాదికి కోటి సంపాదన.. ఎవరు మాత్రమే వద్దనుకుంటారు చెప్పండి. దీనికి పలు మార్గాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.. బిజినెస్ చేయొచ్చు. అయితే ఇలాంటి చేయడానికి పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితే.. తప్పకుండా లాభాలే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము. నష్టాలు కూడా రావచ్చు. కానీ ఉద్యోగం చేసి కూడా కోటి రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది. అయితే సంవత్సరానికి కోటి రూపాయల జీతం పొందాలంటే ఎలాంటి కోర్స్ చదవాలి? ఎలాంటి కంపెనీలలో జాబ్స్ తెచ్చుకోవాలి.. అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ''నాకు తెలుసు ఐటీలో చాలామంది కోట్లలో జీతాలను పొందుతున్నారు. అలాంటి ఉద్యోగాలు వారికి ఎలా దొరుకుతున్నాయనేది నా ప్రశ్న?. నేను ఇంటర్వ్యూలకు గట్టిగా సిద్దమవుతున్నాను. అలాంటి జాబ్స్ కోసం ఎక్కడ వెతకాలి? జాబ్ మార్కెట్లో ఏడాది 40 లక్షల కంటే ఎక్కువ జీతం నాకు కనిపించలేదు'' అని ఉంది.ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ కావడంతో.. పలువురు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంత అదృష్టం కూడా ఉండాలి. నేను కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాను. రోజు ఉదయం 9:30 గంటలకు లాగిన్ అయ్యి.. సాయంత్రం 4 గంటలకు లాగవుట్ అవుతాను. ఇలాంటి జాబ్ నా స్నేహితుడు.. ఇండియాలో చేస్తున్నాడు. అతడి జీతం తక్కువ. కాబట్టి నాకు ఈ ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.. అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.ఉద్యోగంలో చేరాలి, పని చేయడంలో తనను తానూ నిరూపించుకోవాలి, తొందరగా పదోన్నతులు పొందాలి. అప్పుడే ఎక్కువ జీతం లభిస్తుందని మరో నెటిజన్ అన్నారు. నాకు ఏడాది 10 లక్షల రూపాయలు లభించే ఉద్యోగాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా రావడం లేదని మరో నెటిజన్ వాపోయాడు. ఇలా ఎవరికి తోచిన రీతిలో.. వారు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.ఎక్కువ జీతాలు అందించే కంపెనీలుగూగుల్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్, అమెజాన్, అడోబ్, ఎన్వీడియా, సిస్కో, జునిపెర్, ఫేస్బుక్ మొదలైన కంపెనీలు అత్యధిక వేతనాలు అందించే కంపెనీల జాబితాలో అగ్రగామిగా ఉన్నాయి. ఈ కంపెనీలలో కూడా ఎవరికిపడితే వారికి అధిక వేతనాలు ఉండవు. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: అలాంటి కార్లు టోల్ గేట్ దాటితే భారీ జరిమానా.. జైలు శిక్ష కూడా!అర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో నైపుణ్యం ఉండేవారికి ప్రస్తుతం ఎక్కువ జీతాలు లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా ఎండీలు, ఫండ్ మేనేజర్లు, ఆర్కిటెక్చర్లు వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వారు కూడా ఎక్కువ వేతనాలు పొందవచ్చు. కాబట్టి ఇలాంటి రంగాల్లో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకునే ఎవరైనా.. రూ. కోటి కంటే ఎక్కువ వేతనం పొందవచ్చు. అమెరికాలో ఉద్యోగం చేసేవారిలో చాలామంది సులభంగా కోటి రూపాయల జీతం పొందుతున్నారు. -
ఓపెన్ ఏఐ ‘డీప్ రీసెర్చ్’ ఆవిష్కరణ
సంక్లిష్టమైన పరిశోధనలకు దోహదపడేలా జనరేటివ్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ(ChatGPT) కొత్త ఫీచర్ను తీసుకొచ్చినట్లు ఓపెన్ ఏఐ(OpenAI) ప్రకటించింది. కృత్రిమ మేధలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ‘డీప్ రీసెర్చ్’ అనే ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఏఐ విభాగంలో ఇతర కంపెనీల నుంచి పోటీ తీవ్రమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.డీప్ రీసెర్చ్(Deep Research) అనేది సాధారణ ప్రాంప్ట్ నుంచి ఒక విశ్లేషకుడి పనితీరును తలపించేలా సమగ్ర పరిశోధనను అందించేందుకు, వెబ్ డేటాను విశ్లేషించేందుకు రూపొందించామని కంపెనీ తెలిపింది. మనుషులు కొన్ని గంటల్లో విశ్లేషించి తెలియజేసే సమాచారాన్ని డీప్ రీసెర్చ్ నిమిషాల్లో వినియోగదారుల ముందుంచుతుందని ఓపెన్ఏఐ పేర్కొంది. చైనాకు చెందిన డీప్సీక్ చాట్బాట్ ఆకట్టుకునే పనితీరు, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో ప్రపంచ టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సిలికాన్ వ్యాలీలో సంచలనం సృష్టిస్తున్న డీప్సీక్(Deepseek)కు వచ్చిన ఆదరణ నేపథ్యంలో కృత్రిమ మేధ రంగంలో పోటీ వేడెక్కుతుంది. తక్కువ కాలంలోనే డీప్సీక్ ఓపెన్ఏఐకు పోటీదారుగా మారుతుందని కొన్ని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ఓపెన్ఏఐ టెక్నాలజీ పరిశోధనలను ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా డీప్ రీసెర్చ్ ఫీచర్ను అందుబాటులో తీసుకొచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.టోక్యోలో సమావేశాలు..జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్లతో సహా ఉన్నత స్థాయి సమావేశాల కోసం ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్ మన్ టోక్యో చేరుకున్నారు. ఏఐ డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్లలో పెట్టుబడులతోపాటు ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి యూఎస్-జపాన్ సహకారంలో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో డీప్ రీసెర్చ్ను అందుబాటులోకి తీసుకురావడం కొంత టెక్ వర్గాలను ఆకర్షించనట్లయింది.ఇదీ చదవండి: ఖర్చు.. పొదుపు.. మీ దారెటు?డీప్ రీసెర్చ్ ఎవరికంటే..డీప్ రీసెర్చ్ ప్రస్తుతం చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీన్ని త్వరలో జీపీటీ ప్లస్, జీపీటీ టీమ్ వినియోగదారులకు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫైనాన్స్, సైన్స్, ఇంజినీరింగ్.. వంటి రంగాల్లో ఇంటెన్సివ్ నాలెడ్జ్ కోసం వర్క్ చేసే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ కొనసాగుతుండగా డీప్ రీసెర్చ్ తన పోటీదారులకు వ్యతిరేకంగా ఎలా నిలబడుతుందో, ఈ విభాగంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. -
ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఆధారిత బోధన
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త తరహాలో బోధనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వర్చువల్ రియాలిటీ విధానంలో పాఠాలు చెప్పేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్స్టెప్ ఫౌండేషన్ సహకారం తీసుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఫౌండేషన్కు వెళ్లి అక్కడ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఏ తరహా మౌలిక వసతులు, ఏఐ ఆధారిత టూల్స్ కావాలో తెలుసుకున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో కొన్ని స్కూళ్ళను ఎంపిక చేసి..వచ్చే విద్యా సంంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రూపొందించిన ఓ నివేదికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి త్వరలో ప్రభుత్వానికి సమరి్పంచనున్నారు. సరి చేసుకునే వరకు సూచనలు! రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్ళున్నాయి. ఇందులో తొలి విడతగా 5 వేల స్కూళ్ళను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్లు, ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న స్కూళ్ళ జాబితాను పరిశీలిస్తున్నారు. 5వ తరగతి మొదలు కొని 10వ తరగతి వరకూ ఏఐ ఆధారిత బోధన ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్ను దృష్టిలో ఉంచుకుని ప్రోగ్రామ్స్ రూపొందిస్తారు. ప్రధాన సర్వర్ల నుంచి ఆయా స్కూళ్ళకు వీటిని అనుసంధానం చేస్తారు. టీచర్ ఒక పాఠం చెప్పిన తర్వాత ఏఐ ఆధారిత ప్రశ్నలు గూగుల్ క్రోం ద్వారా విద్యార్థులకు పంపుతారు. వీటికి ఆన్లైన్లోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పులుంటే సరి చేసుకునే వరకూ ఏఐ టెక్నాలజీ విద్యారి్థకి సూచనలు చేస్తుంది. వర్చువల్ రియాలిటీ విధానంలో.. ఏఐ సాంకేతికత అందుబాటులోకి వస్తే విద్యార్థి స్వయం అనుభవం మాదిరి పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు విత్తనం మొలకెత్తడం, వృద్ధి చెందడానికి సంబంధించి థియరీ మాత్రమే పుస్తకాల్లో ఉంటుంది. వర్చువల్ విధానంలో విద్యారి్థకి కెమెరా లెన్స్ పరికరం ఇస్తారు. దీన్ని ధరించిన తర్వాత విత్తనం తానే నాటి, అది దశల వారీగా ఎలా ఎదుగుతుందో పరిశీలిస్తున్న అనుభూతి పొందుతాడు. అదే విధంగా ఎర్రకోట గురించి పాఠం చెప్పేప్పుడు, టిప్పు సుల్తాన్ యుద్ధంపై బోధన చేసేప్పుడు అక్కడే ఉండి చూస్తున్నట్టుగా చేయడం ఏఐ టెక్నాలజీతో సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో పఠనాసక్తి పెరగడంతో పాటు, జ్ఞాపక శక్తి మెరుగయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలే కీలకం డిజిటల్ బోధన కోసం గతంలో 3 వేల పాఠశాలల్లో లే»ొరేటరీలు ఏర్పాటు చేశారు. 10 వేల స్కూళ్ళకు కంప్యూటర్లు ఇచ్చారు. 8 వేల స్కూళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. కానీ ఏఐ ఆధారిత బోధనకు మరింత అత్యాధునిక మౌలిక వసతులు అవసరం. ఇప్పుడున్న నెట్ స్పీడ్ పది రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. సర్వర్ల నుంచి వేగంగా ప్రోగ్రామింగ్ అందుకోగల మాడ్యూల్స్ను రూపొందించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లకు ఏఐపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంది. గతంలో ఇచ్చిన కంప్యూటర్లు చాలా స్కూళ్లలో వాడకుండా పక్కన పడేశారు. తాజాగా ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామాల్లో ఉండే యువతను ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. ఏఐతో మెరుగైన బోధన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్ల కంటే మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నాం. ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీతో విద్యా బోధన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిపై త్వరలోనే కార్యాచరణ చేపట్టాలని భావిస్తున్నాం. – ఈవీ నర్సింహారెడ్డి (పాఠశాల విద్య డైరెక్టర్) మంచి ఫలితాలకు అవకాశం ఉంది అమెరికాలో గూగుల్ క్రోం ద్వారానే అసైన్మెంట్స్ ఇస్తున్నారు. మూల్యాంకనం చేపడుతున్నారు. ఏఐ వాడకంలో అక్కడి స్కూళ్ళు ముందంజలో ఉన్నాయి. మన విద్యార్థులు గణితంలో అక్కడివారి కంటే మెరుగ్గా ఉంటారు. కాబట్టి ఏఐ టెక్నాలజీతో మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. – సంక్రాంతి రవికుమార్ (అమెరికాలో ఏఐ బోధన పరిశీలించిన టీచర్) అడ్మిషన్లు పెరుగుతాయి ఏఐ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరుగుతాయి. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ఇది మంచి మార్గం. దీనిపై టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. – పింగిలి శ్రీపాల్రెడ్డి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు) -
ఏఐతో ముప్పు ఇదీ.. ఆర్థిక సర్వే హెచ్చరిక!
విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో ప్రయోజనాలు ఎంత ఉన్నా దాని విపరిణామాల పట్ల చాలా మందిలో ఆందోళన ఉంది. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన నుండి ఆర్థికాంశాలు, విద్య వరకు ఆర్థికంగా విలువైన చాలా పనులను ఆటోమేట్ చేయడం ద్వారా పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ఏఐ డెవలపర్లు హామీ ఇస్తున్నప్పటికీ, ఈ పురోగతి గణనీయమైన విపరిణామాలనూ తీసుకుతో రావచ్చని ఆర్థిక సర్వే 2024-2025 (Economic Survey 2024-2025) హెచ్చరిస్తోంది.ఆర్థిక సర్వే 2024-2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తాజాగా పార్లమెంట్ ముందు సమర్పించారు. ఏఐ పురోగతి ముఖ్యంగా మధ్య, దిగువ ఆదాయ కార్మికులపై ప్రభావాన్ని చూపుతుందని, వివిధ రంగాలలో మానవ నిర్ణయాధికారాన్ని ఏఐ అధిగమించడం వలన పెద్ద ఎత్తున ఉపాధిలో మార్పులు సంభవిస్తాయని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది.ఏమిటీ ఎకనామిక్ సర్వే?ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన పరిణామాలను సమీక్షించే ప్రీ-బడ్జెట్ డాక్యుమెంట్. ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలపై పనితీరు, విధానపరంగా సానుకూల మార్పులను సంగ్రహించి విశదీకరిస్తుంది. అలాగే స్వల్ప, మధ్య కాలానికి ఆర్థిక వ్యవస్థకు ఉన్న అవకాశాలను తెలియజేస్తుంది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందుగా దీన్ని వెల్లడిస్తారు.ఏఐపై ఆర్థిక సర్వే 2024-25 ఏం చెప్పిందంటే.. ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, నేర న్యాయం, విద్య, వ్యాపారం, ఆర్థిక సేవలతో సహా వివిధ రంగాలలో క్లిష్టమైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ మానవ పనితీరును అధిగమించగలదని అంచనా ఉంది. ఇది పెద్ద ఎత్తున మధ్య, దిగువ ఆదాయ కార్మికుల ఉపాధిని ప్రభావితం చేస్తుంది.మునుపటి పారిశ్రామిక, సాంకేతిక విప్లవాలతో పోలిస్తే ప్రస్తుత ఏఐ స్వీకరణ ప్రతికూల ప్రభావాల భయాలు అంతగా కనిపించకపోవచ్చు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవా ఆధారితమైన నేపథ్యంలో చిన్న స్థాయి ఐటీ సేవల్లో పనిచేసే ఉద్యోగులకు ఆటోమేషన్ ముప్పు ఉంటుంది. ఎందుకంటే కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి కార్మికులను తొలగించి సాంకేతికతతో భర్తీ చేస్తాయి.ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సామూహిక సామాజిక ప్రయత్నం అవసరం. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థల మధ్య సహకారం ద్వారా భారతదేశం బలమైన సంస్థల సృష్టిని వేగవంతం చేయాలి.నైపుణ్య సంస్థలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఉద్యోగులను ఏఐతో కలిసి పనిచేసేలా సన్నద్ధం చేయాలి.ఏఐ ప్రస్తుతం శైశవదశలో ఉన్నందున దాని పునాదులను బలోపేతం చేయడానికి, దేశవ్యాప్త సంస్థాగత ప్రతిస్పందనను సమీకరించడానికి అవసరమైన సమయం దేశానికి లభించింది.విస్తృత-వ్యాప్తి స్వీకరణను సాధించడానికి ముందు ఏఐ డెవలపర్లు అధిగమించాల్సిన కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రాక్టికాలిటీ, విశ్వసనీయత అనేది డెవలపర్లు పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలు.యువ, డైనమిక్, సాంకేతిక-అవగాహన ఉన్న జనాభాను పెంచడం ద్వారా పని, ఉత్పాదకతను పెంపొందించడానికి ఏఐని ఉపయోగించగల శ్రామిక శక్తిని సృష్టించగల సామర్థ్యాన్ని భారతదేశం కలిగి ఉంది.కార్మిక శక్తి, సాంకేతికత సరైన మార్గంలో సమతుల్యం అయినప్పుడు, ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. పని భవిష్యత్తు శ్రామిక శక్తి, యంత్ర సామర్థ్యాలను ఏకీకృతం చేసే 'అగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్' చుట్టూ తిరుగుతుంది.లేబర్ మార్కెట్లో ఏఐతో వచ్చే మార్పులు శాశ్వత ప్రభావాలను కలిగి ఉండే అవకాశం ఉన్నందున విధాన నిర్ణేతలు ఆవిష్కరణలను సామాజిక వ్యయాలతో సమతుల్యం చేయాలి. -
ఏఐను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వ విభాగాలు
భారతదేశంలోని అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీలను అమలు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ఆధునీకరణ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ప్రభుత్వాలు చేపట్టే ఈ ఏఐ ప్రాజెక్ట్ల విలువ రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లుగా ఉంటుంది. ఇవి అనేక రకాల అప్లికేషన్లను కవర్ చేస్తాయి.ఉదాహరణకు విద్యుత్ కనెక్షన్లు, అంతరాయాలు, బిల్లింగ్ వివాదాలకు సంబంధించి పట్టణ వినియోగదారులకు సరైన సమాచారం అందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జ్యోతి చాట్బాట్(ChatBot)ను అభివృద్ధి చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ‘మై స్కీమ్’ ప్లాట్ఫామ్ను మెరుగుపరచడానికి ఏఐ చాట్బాట్ను ఉపయోగిస్తుంది. పౌరులు వివిధ సామాజిక సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి, వాటికోసం దరఖాస్తు చేయడానికి వీలు కల్పిస్తున్నారు.ఇదీ చదవండి: రూ.10,000 కోట్ల ఒప్పందానికి కేబినెట్ కమిటీ ఆమోదంజంతు కదలికలను ట్రాక్ చేయడానికి, మానవ-వన్యప్రాణుల దాడులను నివారించడానికి ఒడిశా అటవీ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్ సాఫ్ట్వేర్ను ప్రారంభించింది. రోడ్డు భద్రత కోసం కర్ణాటక ప్రభుత్వం కూడా ఏఐ ఆధారిత వ్యవస్థలను అమలు చేస్తోంది. ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందించే 50 అధికారిక వెబ్సైట్లను కేంద్రం అంతర్గత ఏఐ ప్రాజెక్టు ‘భాషిణి’ని నిర్వహిస్తోంది. కేంద్ర పథకాలకు సంబంధించి ఫీడ్ బ్యాక్, నాణ్యతను, సంప్రదాయ యంత్రాంగాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. చాలా రాష్ట్రాలు శాసనసభ, పరిపాలన, న్యాయవ్యవస్థలో కృత్రిమ మేధను ఉత్పాదకత సాధనంగా ఉపయోగించాలని చూస్తున్నాయి. -
ఏఐకు బానిసలుగా మారొద్దు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇటీవల జరిగిన పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU) స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కృత్రిమమేధపై చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. భారతదేశ భవిష్యత్తుకు కృత్రిమమేధ(AI) వాడకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఏఐ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, దాని శక్తిని బాధ్యతాయుతంగా ఉపయోగించాలన్నారు. కృత్రిమమేథపై అతిగా ఆధారపడకూడదని, దానికి బానిసలుగా మారకూడదన్నారు.కృత్రిమ మేధను మానవ సామర్థ్యాలను పెంపొందించే సాధనంగా చూడాలి తప్ప.. వాటిని భర్తీ చేసే మార్గంగా చూడరాదని అంబానీ స్పష్టం చేశారు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, అందరికీ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కృత్రిమ మేధను ఉపయోగించాలని ఆయన విద్యార్థులను కోరారు. ఏదేమైనా, సాంకేతిక పరిజ్ఞానానికి బానిసలుగా మారవద్దని ఆయన సూచించారు. కృత్రిమ మేధ అభివృద్ధి, జనరేటివ్ ఏఐలో నైతిక విలువల పాత్ర, వీటిపై మానవ పర్యవేక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.అత్యంత సంపన్న దేశంగా..ఈ శతాబ్దం చివరినాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అవతరిస్తుందని ఆయన అంచనా వేశారు. యువత, జనాభా, సాంకేతిక పురోగతి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల స్ఫూర్తితో దేశ సామర్థ్యంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విద్య, మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగాల్లో సరైన విధానాలు, పెట్టుబడుల్లో వృద్ధి దేశ ప్రగతికి తోడ్పడుతుందని చెప్పారు.యూనివర్సిటీ ఆఫ్ లైఫ్..విద్యార్థులు ఉన్నత కలలు కనాలని, వాటిని సాకారం చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రపంచంలో అన్ని రంగాల్లో నిత్యం వస్తున్న మార్పులకు అనుగుణంగా నిరంతరం అభ్యాసం చేయాలన్నారు. ప్రస్తుతం నైపుణ్యాల పెంపునకు సాంకేతిక పరిజ్ఞానం సహాయకారిగా ఉన్నప్పటికీ, అంతిమంగా మానవ స్ఫూర్తి, సంకల్పమే విజయాన్నిస్తుందని చెప్పారు. విద్య పూర్తి చేసుకుని ఈ విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత క్యాంపస్, తరగతి గదులు, ఉపాధ్యాయులు లేని మరో ‘యూనివర్సిటీ ఆఫ్ లైఫ్’లో అడుగుపెట్టాల్సి ఉంటుందన్నారు. అందులో మీరు సొంతంగా జీవితంలో పురోగతి సాధించాలన్నారు.ఇదీ చదవండి: మొబిక్విక్, క్రెడ్లో ఈ–రూపీ వాలెట్లుపీడీఈయూ ఏర్పాటు ఇలా..ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ అంబానీ ‘పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం ప్రధానమంత్రి అసాధారణ దార్శనికత ఫలితమే. ఇరవై ఏళ్ల క్రితం ప్రపంచ స్థాయి మానవ వనరులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఇంధనం, ఇంధన ఉత్పత్తులలో గుజరాత్ దేశాన్ని నడిపించాలని కోరుకుంటున్నట్లు ఆయన నాతో చెప్పారు. అదే ఈ విశ్వవిద్యాలయం స్థాపనకు దారితీసింది’ అని అన్నారు. -
వైద్య వ్యవస్థలపై సైబర్ నేరగాళ్ల కన్ను
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యధిక సైబర్ దాడులు భారత్పైనే జరుగుతుండగా.. అందులోనూ వైద్య వ్యవస్థలపైనే అత్యధికంగా సైబర్ దాడులకు నేరగాళ్లు తెగబడుతున్నారు. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ నివేదిక–2025 పేరిట ప్రముఖ సైబర్ సెక్యూరిటీ చెక్పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ విడుదల చేసిన నివేదిక భారత్లో సైబర్ దాడుల తీవ్రతను వెల్లడించింది. నివేదిక ఏం చెప్పిందంటే..2023తో పోలిస్తే 2024లో ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు 44శాతం పెరిగాయి. ప్రపంచంలోని కీలక మౌలిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సైబర్ దాడుల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లోని మౌలిక వ్యవస్థలపై సగటున వారానికి 1,847 సైబర్ దాడులు జరిగాయి. భారత్లో మాత్రం అంతకు మూడు రెట్లు సైబర్ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని మౌలిక వ్యవస్థలు సగటున వారానికి 3,291 సైబర్ దాడుల బారిన పడటం గమనార్హం. రెండో స్థానంలో విద్యారంగంభారత్లో వైద్య రంగమే అత్యధికంగా సైబర్ దాడుల బారినపడింది. సైబర్ నేరగాళ్లు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలపై సగటున వారానికి 8,614 సైబర్ దాడులకు తెగబడ్డారు. సగటున వారానికి 7,983 సైబర్ దాడులతో విద్యారంగం రెండో స్థానంలోనూ, 4,731 దాడులతో రక్షణ రంగం మూడో స్థానంలో ఉన్నాయి. 2024 మే నెలలో భారత్ అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడింది. ఆ ఒక్క నెలలోనే వేలిముద్రలు, ఫేషియల్ స్కాన్లతోసహా ఏకంగా 500 జీబీ బయోమెట్రిక్ డేటా చౌర్యానికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సహా దేశంలోని ప్రముఖ వైద్యసంస్థలు సైబర్ దాడులతో హడలెత్తిపోయాయి. వైద్య సంస్థల్లోని రోగుల వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు.జెన్ ఏఐని వినియోగించి..జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) ద్వారా సైబర్ నేరగాళ్లు యథేచ్చగా సైబర్ దాడులకు తెగబడుతున్నారు. జెన్ ఏఐ ద్వారా దుష్ప్రచారం, డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి సైబర్ దాడులకు పాల్పడటంతోపాటు బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొట్టడం, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు యత్నించారు. ప్రధానంగా రిమోట్ యాక్సెస్ ట్రోజన్ల ద్వారా ఫేక్ అప్డేట్లతోనే ఈ సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. మొత్తం సైబర్ దాడుల్లో 58 శాతం ప్రజల వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడినవే కావడం గమనార్హం. -
అరుణాచల్ ప్రదేశ్పై ప్రశ్న: ఖంగుతినే సమాధానం చెప్పిన డీప్సీక్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దిగ్గజాలకు సైతం దడపుట్టిస్తున్న చైనా ఏఐ 'డీప్సీక్' (DeepSeek) ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు.. ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.చైనాకు చెందిన AI స్టార్టప్ డీప్సీక్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. చాట్జీపీటీ, జెమినీ ఏఐ, క్లౌడ్ కంటే వేగంగా ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్న డీప్సీక్.. అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. గూగిల్ర్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు తమ ఏఐ కోసం కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటే.. డీప్సీక్ మాత్రం పూర్తిగా ఉచితం. ఈ కారణంగానే చాలామంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారు.ఎక్కువమంది ఉపయోగిస్తున్న డీప్సీక్ ఏఐను ఒక యూజర్, అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలోని ఒక రాష్ట్రం అని అడగ్గా.. సరైన సమాధానం ఇవ్వలేదు. ఇది నా పరిధిని దాటిన అంశం అంటూ సమాధానం ఇచ్చింది. ఆ తరువాత అదే యూజర్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి అడగ్గా.. దానికి కూడా అదే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను.. ఆ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా బుద్ది చూపించిందని కొందరు అంటే.. దీనిని వెంటనే బ్యాన్ చేయాలని మరికొందరు అన్నారు. మొత్తం మీద కొంతమంది యూజర్లకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఇది విఫలమైనట్లు తెలుస్తోంది.డీప్సీక్ అంటే ఏమిటి?డీప్సీక్ అనేది చైనా ఏఐ చాట్బాట్. ఇది దాని ప్రత్యర్థుల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. దీనిని లియాంగ్ వెన్ఫెంగ్ (Liang Wenfeng) 2023లో ప్రారంభించారు. ఈ చాట్బాట్ ఉపయోగించడానికి ప్రస్తుతానికి ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా.. యాపిల్ యాప్స్టోర్లోనూ దూసుకెళ్తోంది.CCP machine exposed 🤣 https://t.co/DlmofSXQUP pic.twitter.com/TAggpM8L87— ur rental friend☆ ragebait machine (@sxchidxnxnd) January 27, 2025'డీప్సీక్'పై శామ్ ఆల్ట్మన్ స్పందనడీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త పోటీపై ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ.. పరిశ్రమలో కొత్త పోటీదారు రావడం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఓపెన్ ఏఐ మరింత మెరుగైన మోడళ్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధించాలనే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. మార్కెట్ పోటీకి ప్రతిస్పందనగా ఓపెన్ఏఐ తదుపరి మోడళ్ల విడుదల షెడ్యూల్ను వేగవంతం చేసే ప్రణాళికలను సూచించారు. ‘ప్రపంచానికి కృత్రిమ మేధ అవసరం. భవిష్యత్తులో తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు!డీప్సీక్పై సైబర్ ఎటాక్డీప్సీక్పై సైబర్దాడి జరిగినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్దాడి పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది. -
చైనా ఏఐ డీప్సీక్పై ఓపెన్ఏఐ సీఈఓ స్పందన
కొత్త జనరేటివ్ ఏఐ మోడల్తో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్సీక్(DeepSeek) ఆర్1పై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఇటీవల తన ఆలోచనలను పంచుకున్నారు. ఆల్ట్మన్ తన ఎక్స్ ఖాతాలో డీప్సీక్ జనరేటివ్ ఏఐ మోడళ్లపై చేస్తున్న ఖర్చుపై స్పందించారు.‘డీప్సీక్ ఆర్ 1 ఆకట్టుకునే మోడల్. వారు ఖర్చు చేసిన దానికి సరిపడా అవుట్పుట్ ఇస్తున్నారు’ అని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త పోటీపై ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ‘పరిశ్రమలో కొత్త పోటీదారు రావడం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది’ అని చెప్పారు. ఓపెన్ ఏఐ మరింత మెరుగైన మోడళ్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధించాలనే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. మార్కెట్ పోటీకి ప్రతిస్పందనగా ఓపెన్ఏఐ తదుపరి మోడళ్ల విడుదల షెడ్యూల్ను వేగవంతం చేసే ప్రణాళికలను సూచించారు. ‘ప్రపంచానికి కృత్రిమ మేధ అవసరం. భవిష్యత్తులో తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు.డీప్సీక్పై సైబర్ ఎటాక్డీప్సీక్పై సైబర్దాడి జరిగినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్దాడి పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.deepseek's r1 is an impressive model, particularly around what they're able to deliver for the price.we will obviously deliver much better models and also it's legit invigorating to have a new competitor! we will pull up some releases.— Sam Altman (@sama) January 28, 2025ఇదీ చదవండి: ‘ఆదాయ పన్ను రద్దు చేస్తాం’భద్రత ప్రమాణాలపై ఆందోళనలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. -
ఉద్యోగులకు ఏఐ చేదోడు
కృత్రిమ మేధ(AI) అంతటా వ్యాపిస్తోంది. పని ప్రదేశాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. కార్పొరేట్ కార్యాలయాలతోపాటు దాదాపు ప్రతి విభాగంలోని ఆఫీసుల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దీని సేవలు వినియోగిస్తున్నారు. ఇటీవల రాండ్స్టడ్(Randstad Report) వెల్లడించిన నివేదిక ప్రకారం 2024లో 10 మంది భారతీయ ఉద్యోగుల్లో ఏడుగురు కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఉత్పాదకతను పెంచడానికి, వ్యాపార ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి ఏఐపై ఆధారపడడం అధికమవుతుందని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది.ఐటీ సేవలు, ఆర్థిక సేవలు, విద్య, తయారీ సహా వివిధ రంగాలకు చెందిన దాదాపు 1,000 మంది ఉద్యోగులతో రాండ్స్టడ్ ఏఐ అండ్ ఈక్విటీ రిపోర్ట్ 2024 నివేదిక రూపొందించింది. ఈ సర్వేలో పాల్గొన్న 56% మంది తాము ప్రతిరోజూ కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఏఐ సాధనాలు వ్యాపార ప్రక్రియలను వేగవంతం చేయడానికి, వాటిని సులభతరం చేయడానికి గణనీయంగా తోడ్పడుతున్నట్లు రాండ్స్టడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీఎస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఉద్యోగ పునరుద్ధరణ, డేటా భద్రతపై ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను కూడా ఈ నివేదిక ఎత్తిచూపింది.మిలీనియల్స్(1995 తర్వాత పుట్టినవారు), బూమర్లు(1970లో జన్మించినవారు) ఏఐ నైపుణ్యాలపై అత్యంత విశ్వాసంతో ఉన్నట్లు నివేదిక తెలిపింది. 37 శాతం మంది తమ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా భద్రత, గోప్యత కారణంగా పనిలో చాట్ జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీలను ఉపయోగించడాన్ని నిషేధించే విధానాలను తమ యాజమాన్యం అవలంబిస్తున్నట్లు ప్రతి ముగ్గురిలో ఒకరు తెలిపారు.ఇదీ చదవండి: రోల్స్రాయిస్కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు తమ కెరీర్ను మెరుగుపరుచుకోవడానికి మరింత శిక్షణ అవసరమని చెబుతున్నారు. కృత్రిమ మేధ, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో అందుకు తగ్గట్టు శ్రామిక శక్తి కూడా పెరిగేలా విధానాలు రావాలని నివేదిక ద్వారా తెలుస్తుంది. భవిష్యత్తులో కొత్తగా ఏ టెక్నాలజీ వస్తున్నా అది శ్రామిక శక్తిని తగ్గించేలా కాకుండా, ఉత్పాదకతను పెంచుతూ మరిన్ని ఉద్యోగాలు సృష్టించేలా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఏఐకి కీలక మార్కెట్ భారత్
కాలిఫోర్నియా: కృత్రిమ మేథ (AI development) విషయంలో భారత్ తమకు కీలక మార్కెట్గా ఉందని దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ప్రెసిడెంట్(Samsung President) టీఎం రోహ్ తెలిపారు. తమ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎస్25లో ఏఐ ఫీచర్లను పొందుపర్చడంలో బెంగళూరు, నోయిడాలోని పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాలు ముఖ్యపాత్ర పోషించినట్లు చెప్పారు. ఎస్25లోని గూగుల్ వాయిస్ అసిస్టెంట్ జెమినీ లైవ్ ఫీచర్లో కొరియన్, ఇంగ్లీష్ భాషలతో పాటు హిందీని కూడా చేర్చినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మౌలిక వసతులకు భారీ నిధులుత్వరలో మరిన్ని భాషలను కూడా చేర్చనున్నామని, ఈ ప్రక్రియలోను భారత ఆర్అండ్డీ కేంద్రాలు కీలకంగా వ్యవహరించనున్నాయని చెప్పారు. ఇవి ఇతర గెలాక్సీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపై కూడా పని చేస్తున్నట్లు రోహ్ వివరించారు. ఈ నేపథ్యంలో పరిశోధన కేంద్రాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. దక్షిణ కొరియా వెలుపల తమకు అతి పెద్ద ఆర్అండ్డీ కేంద్రాలు భారత్లోనే ఉన్నట్లు రోహ్ చెప్పారు. పరిశ్రమ ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల నుంచి ఏఐ ఫోన్ల వైపు మళ్లుతోందన్నారు. ఎస్25 మోడల్స్కి శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ను జోడించేందుకు కొన్ని దేశాల్లోని టెలికం సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు వివరించారు. -
ప్రాణం కాపాడిన చాట్జీపీటీ: ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ 'చాట్జీపీటీ' (ChatGPT) యూజర్లకు చాలా ఉపయోగపడుతోంది. ఏ ప్రశ్న అడిగినా.. దాదాపు ఖచ్చితమైన, వేగవంతమైన జవాబును ఇస్తోంది. ఇప్పటికే ఎన్నెన్నో అద్భుతాలు చేసిన చాట్జీపీటీ.. తాజాగా ఓ మనిషికి ఉన్న రోగాన్ని సైతం కనిపెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నేను వ్యాయామం చేసాను. ఒళ్ళంతా చాలా నొప్పులుగా.. ఏదో యాక్సిడెంట్ అయిన ఫీలింగ్ కలిగింది. రెండు రోజులైనా ఆరోగ్యం కుదుటపడలేదు. నాకున్న లక్షణాలను చాట్జీపీటీకి వివరించాను. లక్షణాల ఆధారంగా రాబ్డోమయోలైసిస్ (Rhabdomyolysis) ఉన్నట్లు వెల్లడిస్తూ.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సిపార్సు చేసింది.చాట్జీపీటీ చెప్పింది నిజమా? కాదా? అని నిర్దారించుకోవడానికి నేను ఆసుపత్రికి వెళ్ళాను. డాక్టర్లు కూడా టెస్ట్లు చేసి రాబ్డోమయోలైసిస్ ఉందని నిర్థారించారు. నా ల్యాబ్ ఫలితాలను విశ్లేషించడానికి కూడా.. నేను ChatGPTని ఉపయోగించాను. అది వైద్య బృందం చెప్పిన దానితో సమానంగా చెప్పింది. సరైన సమయానికి చికిత్స తీసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాను.చాట్జీపీటీ సామర్థ్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో కూడా.. చాట్జీపీటీ ఇతరుల ప్రాణాలను కాపాడటం సంఘటనల గురించి విన్నాను. ఇప్పుడు చాట్జీపీటీ నన్ను కూడా కాపాడింది.ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాట్జీపీటీ లక్షణాల ఆధారంగా రోగ నిర్దారణ చేయడం చాలా గొప్పగా ఉందని పలువురు ప్రశంసించారు. వైద్య సలహా కోసం కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.రాబ్డోమయోలైసిస్రాబ్డోమయోలైసిస్ అనేది ఓ అరుదైన సమస్య. విశ్రాంతి తీసుకోకుండా ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల.. కండరాలు కలిగిపోతాయి. దీంతో రక్తంలోకి విడుదలయ్యే ప్రోటీన్లు కిడ్నీలలో పేరుకుపోతాయి. ఇది పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఇది ప్రాణాంతకం కూడా.ఇదీ చదవండి: ఆరోగ్యం కోసం నవవిధ మార్గాలు - చాట్జీపీటీ సలహాలు -
కోర్టుల్లో ఏఐ ప్రయోజనాలపై విశ్లేషణ అవసరం
విశాఖ–లీగల్: ‘కోర్టులు–మీడియా పరస్పర సహకారం, సమన్వయంతో పని చేయాలి. జవాబుదారీతనంతో కూడిన పనితీరును ప్రదర్శిస్తూ, బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపైనా విశ్లేషణ అవసరమని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాలులో రెండు రోజులుగా కొనసాగుతున్న సౌత్ జోన్–2 జ్యుడీషియల్ ప్రాంతీయ సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు ‘జ్యుడీషియరీ అండ్ మీడియా, అడ్వాన్సింగ్ జ్యుడీషియల్ గవర్నెన్స్ త్రూ ఎమెర్జింగ్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్’ అనే అంశాలపై చర్చ నిర్వహించారు.ముందుగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన ‘కోర్టులు–మీడియా పాత్ర’ అనే అంశంపై చర్చ జరిగింది. రిసోర్స్ పర్సన్లుగా కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవన్ రామచంద్రన్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌషిమి భట్టాచార్య వ్యవహరించారు. అనంతరం ‘అడ్వాన్సింగ్ జ్యుడీషియల్ గవర్నెన్స్’పై జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన చర్చ నిర్వహించారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ముస్తాక్యు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సుందర్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు. జస్టిస్ కురియన్ జోసెఫ్ మాట్లాడుతూ సమాచారాన్ని చేరవేయడంలో మీడియా పాత్ర, తీర్పులు, ఇతర కోర్టు ప్రొసీజరల్ అంశాల్లో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఆవశ్యకతను న్యాయమూర్తులు తెలుసుకోవాలని, వినియోగంపై విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలు ప్రస్తుతం పోషిస్తున్న పాత్రపై అవగాహన కలిగి ఉండటంతోపాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవన్ రామచంద్రన్ మాట్లాడుతూ నిజాలను నిర్ధారించుకుని వాస్తవాలను వార్తలుగా ప్రచురించాలని సూచించారు. ట్రయల్ అంశాలను ముందుగా బహిర్గతం చేయకూడదని హితవుపలికారు.జస్టిస్ ఎం.సుందర్ కోర్టు వ్యవహారాల్లో ఏఐ పాత్ర గురించి వివరించారు. ఏఐ అనేది న్యాయమూర్తులకు సహకారిగా మాత్రమే ఉంటుందని, ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు ఏఐ టెక్నాలజీని పరిగణనలోకి తీసుకోవచ్చని, కానీ.. దానినే తుది నిర్ణయంగా, అంతిమ ప్రామాణికంగా తీసుకోకూడదని పేర్కొన్నారు. జస్టిస్ ఏఎం ముస్తాక్యు మాట్లాడుతూ కేరళలో కోర్టు వ్యవహారాల నివేదికలను రూపొందించేందుకు ఏఐ, గూగుల్ నోట్బుక్ సాయం తీసుకుంటున్నామని తెలిపారు. ఏఐ వినియోగంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్ జస్టిస్ రవినాథ్ తిల్హారీ వందన సమర్పణ చేశారు. విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవీ శేషమ్మ, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
ఏఐ చిప్లపై అమెరికా ఆంక్షల ప్రభావం
అమెరికా ఇటీవల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. భారత్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఎగుమతికి సంబంధించి అమెరికా ఆంక్షలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నెల ప్రారంభంలో దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు చైనా, రష్యా వంటి దేశాల్లో సాంకేతిక పురోగతిని నిరోధించడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇతర దేశాలపైనా వీటి ప్రభావంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏఐ చిప్ ఎగుమతుల పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.అమెరికా ఆంక్షల పరిధిఅమెరికా ఎగుమతులపై విధించిన ఆంక్షలకు సంబంధించి వివిధ దేశాలను భద్రత, మానవ హక్కుల ప్రమాణాల ఆధారంగా మూడు అంచెలుగా వర్గీకరించింది. టైర్ 1లో యూకే, జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్ర దేశాలు ఉన్నాయి. ఇవి ఎటువంటి ఆంక్షలను ఎదుర్కోవు. భారతదేశం, సింగపూర్, ఇజ్రాయెల్ టైర్ 2 దిగుమతులపై కొన్ని పరిమితులను ఎదుర్కొంటాయి. ఇందులో భాగంగా అధునాతన ఏఐ చిప్లకు లైసెన్సింగ్ అవసరం. టైర్ 3లో చైనా, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు తయారు చేసిన చిప్లను కొనుగోలు చేయకుండా పూర్తిగా నిషేధించాయి.ఇదీ చదవండి: మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరంభారత్ ఏఐ మౌలిక సదుపాయాలపై ప్రభావంసమీప భవిష్యత్తులో 10,000 జీపీయూ(Graphics Processing Unit)లతో ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిష్టాత్మక జాతీయ ఏఐ మిషన్ ఈ ఆంక్షల కారణంగా అడ్డంకులను ఎదుర్కొనుంది. 2027 వరకు 50,000 జీపీయూలను సిద్ధం చేయాలనే భారత ప్రణాళికలు ఈ ఆంక్షల వల్ల ప్రభావితం చెందే అవకాశం ఉంది. అయితే భారత్ యూఎస్ ఆంక్షల పరంగా టైర్2 విభాగంలో ఉండడంతో ఏఐ చిప్ల లైసెన్సింగ్ సదుపాయాలు మరింత మెరుగుపడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆంక్షల వల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లకు కీలకమైన జీపీయూలకు మార్కెట్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన మార్గాలను అన్వేషించాలని కోరింది. -
హైటెక్ బోధన.. ఆన్లైన్ సాధన
సాక్షి, హైదరాబాద్: అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్లాంటి అత్యాధునిక సాంకేతిక కోర్సుల బోధన తొమ్మిదవ తరగతి నుంచే మొదలు పెడుతున్నారు. ఈ కోర్సుల డిజైన్, బోధన ప్రణాళిక విషయంలోనూ విద్యా కమిటీలదే పూర్తి అజమాయిషీ. గూగుల్ క్రోంలో వర్క్ షీట్లు, అందులోనే మూల్యాంకన విధానం విద్యార్థులను సాంకేతిక పురోగతి వైపు తీసుకెళ్తున్నాయి. మన విద్యా విధానంలోనూ ఇలాంటి సంస్కరణలు అవసరం అంటున్నారు అమెరికా విద్యా విధానాన్ని పరిశీలించిన తెలంగాణ ఉపాధ్యాయుడు సంక్రాంతి రవి కుమార్. అమెరికాలో నిర్వహించిన ‘ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రాం’లో భాగంగా ఆయన అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశారు. ఇందులో మొత్తం 60 దేశాల నుంచి టీచర్లను ఎంపిక చేయగా, మనదేశం నుంచి ఎంపికైన ఏడుగురిలో రవికుమార్ ఒకరు. ఒహియోలో రాష్ట్రంలోని కెంట్ నగరంలో 50 రోజుల పాటు అక్కడి విద్యా విధానంపై ఈయన అధ్యయనం చేశారు. ఖమ్మం జిల్లాలో ఆంగ్ల ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రవికుమార్ అమెరికా విద్యా విధానంపై తన పరిశీలనను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.అడుగడుగునా టెక్నాలజీ..అమెరికాలో సెకండరీ విద్య పూర్తిగా ఉచితం. ప్రైవేటు స్కూళ్లు కనిపించవు. ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో నడిచే స్కూళ్లలో ఎక్కువ భాగం సాంకేతిక పరిజ్ఞానం కనిపిస్తోంది. పెన్, నోట్బుక్ ఎప్పుడో దూరమయ్యాయి. గూగుల్ క్రోం బుక్స్లో అసైన్మెంట్స్ ఇస్తారు. అందులోనే మూల్యాంకనం చేస్తారు. అయితే, విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే అవకాశం ఉందని టీచర్లు అంటున్నారు. ఆక్యులెస్, మెటాక్వెస్ట్ వంటి పరికరాలు, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతత అక్కడ ప్రతీ స్కూల్లో కనిపిస్తున్నాయి. ప్రయోగాలను వర్చువల్ రియాలిటీ ద్వారా తెలుసుకునే విధానం ఉంది. ఆన్లైన్ ద్వారా నాలెడ్జ్ పొందడంలో అమెరికన్ విద్యార్థులు ముందున్నారు. ఇందుకు తగ్గ అప్లికేషన్లు కూడా అందుబాటులోకి తెచ్చారు.9వ తరగతి నుంచే భవిష్యత్ ప్రణాళికవిద్యార్థి భవిష్యత్ నిర్దేశం 9వ తరగతిలోనే మొదలవుతుంది. 11 రకాల వృత్తి విద్యా కోర్సులను ఈ దశలోనే అందుబాటులోకి తెచ్చారు. డాక్టర్, ఇంజనీర్, టీచర్... ఇలా ఏ రంగాన్ని ఎంచుకున్నా 9వ తరగతిలో పునాది పడుతుంది. దీంతో సబ్జెక్టుపై విద్యార్థికి పట్టు పెరుగుతుంది. అక్కడ విద్యతో పాటు సామాజిక, సాంస్కృతిక అంశాలకూ ప్రాధాన్యమిస్తున్నారు. సంగీతం, గేమ్స్, మోడ్రన్ మ్యూజిక్.. ఇలా ఏదో ఒక అంశాన్ని విద్యార్థి నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. నైపుణ్యానికి పెద్దపీటఇంజనీరింగ్ విద్య అమెరికాలో భిన్నంగా ఉంది. థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే బోధన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యలో ఎక్కడికో వెళ్లి ఇంటర్న్షిప్ చేయడం ఉండదు. ప్లానింగ్, డిజైనింగ్ ఇంజనీరింగ్ విద్యలో భాగం. ఏదో ఒక కొత్త ప్రయోగాన్ని విద్యార్థులు ఇంజనీరింగ్లో చేయాలి. ఈ విధానం పాఠశాల విద్యలోనూ కనిపిస్తుంది. దీనివల్ల విద్యార్థిలో నైపుణ్యం పెరుగుతుంది. అయితే, భారత విద్యార్థులకంటే గణితంలో అమెరికా విద్యార్థులు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. టీచర్లు, అదనపు టీచర్లు..ప్రతి క్లాసులోనూ 20–24 మంది విద్యార్థులనే అనుమతిస్తారు. ఒక్క విద్యార్థి పెరిగినా కొత్త సెక్షన్ నిర్వహించాల్సిందే. ప్రతి సబ్జెక్టుకూ టీచర్లతోపాటు అదనపు టీచర్లనూ నియమిస్తారు. ప్రతి సబ్జెక్టును, క్లాసును విద్యా కమిటీలు పర్యవేక్షిస్తాయి. లోపాలను టీచర్లకు చెబుతాయి. కమ్యూనిటీ పరంగా ఎక్కువ నిధులు ఇచ్చే సంస్థల పర్యవేక్షణలోనే విద్యా కమిటీలు ఏర్పడతాయి. వీటిపై ప్రభుత్వ పెత్తనం ఏమాత్రం ఉండదు. టీచర్ల నియామకం విషయంలోనూ కమిటీలు అన్ని అర్హతలు పరిశీలిస్తాయి. కొన్ని నిబంధనల మేరకు వీళ్లు పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించడం కుదరదు.ప్రభుత్వానికి నివేదిక ఇస్తా..విద్యా విధానంలో మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అమెరికా విద్యా విధానంపై సమగ్ర అధ్యయనం అవసరం. నేను అక్కడ గమనించిన ప్రతి అంశాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి కూడా నివేదిక పంపుతా. సాంకేతికంగా అభివృద్ధి పథంలోకి రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకెళ్లడానికి అమెరికాలోని కొన్ని మంచి అంశాలను మనం స్వీకరించాల్సిందే. – సంక్రాంతి రవి కుమార్ -
సరికొత్త ప్రచారం!
సాక్షి, అమరావతి : వాట్సాప్ లేదా మెసేజ్లు తెరవగానే ప్రెస్టేజ్ నుంచి ప్రత్యేక ఆఫర్లు.. తనిష్క్ మీ కోసం ప్రత్యేకమైన ఆఫర్లు.. అంటూ పలు కంపెనీల మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి బిజినెస్ మెసేజింగ్పై కంపెనీలు పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నాయి. సాధారణ మెసేజ్లతో పోలిస్తే బిజినెస్ మెసేజ్లు 90 శాతంపైగా చదువుతుండటంతో వ్యాపార సంస్థలు తమ ప్రచారం కోసం బిజినెస్ మెసేజింగ్ను ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో బిజినెస్ మెసేజింగ్ రూపు రేఖలు వేగంగా మారిపోతున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వ్యాపార ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందుకోసం రిచ్ కమ్యూనికేషన్స్ సర్విసెస్ (ఆర్సీఎస్), జెనరేటివ్ ఏఐ, చాట్బోట్ వంటి సాధనాలపై దృష్టి సారిస్తున్నాయి. సాధారణ స్పామ్ మెసేజ్లు, ఇతర మెసేజ్లతో పోలిస్తే ఈ బిజినెస్ మెసేజ్లు ఎటువంటి మోసాలకు ఆస్కారం లేకుండా సెక్యూరిటీ ఉండటం, చూడగానే ఆకర్షించే విధంగా విజువల్ ఆడియోతో ఉంటుండటంతో కంపెనీలు వీటిపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ప్రతి కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం, లేదా సమాచారం ఎప్పటికప్పుడు అందించడం కోసం గూగుల్, యాపిల్ వంటి సంస్థలు అందిస్తున్న సర్విసు సేవలను వినియోగించుకుంటున్నాయి. రూ.26 వేల కోట్ల మార్కెట్దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్ పరిమాణం 2024లో రూ.6,885 కోట్లుగా ఉండగా, 2025లో బిలియన్ డాలర్లు అంటే రూ.8,500 కోట్ల మార్కును అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ పరిమాణం మూడు రెట్లు పెరిగి రూ.26,000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలు అందిస్తున్న వాయిస్ బోట్స్ సర్విసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 4 శాతం కంపెనీలు ఈ బిజినెస్ మెసేజింగ్ సేవలు వినియోగించుకుంటుండగా, మరో 30 శాతం కంపెనీలు జనరేటివ్ ఏఐపై ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దేశీయ బిజినెస్ మెసేజింగ్ మార్కెట్లో 50 శాతం వాటాను వాట్సాప్ అందిస్తున్న ఆర్సీఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా ఆర్సీఎస్ లావాదేవీల సంఖ్య 2.54 కోట్లు దాటడంతోపాటు ఈ వ్యాపార పరిమాణం ఒక్కటే రూ.4,624 కోట్లు దాటుందని అంచనా వేస్తున్నారు. -
బ్యాంకుల్లో 2 లక్షల ఉద్యోగాలకు ముప్పు..
విస్తృతంగా పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత బ్యాంకింగ్ రంగంలో (banks) లక్షలాది ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించింది. బ్లూమ్బెర్గ్ (Bloomberg) నివేదికల ప్రకారం.. ప్రస్తుతం మానవ కార్మికులు నిర్వహిస్తున్న పనులను కృత్రిమ మేధస్సు (AI) ఆక్రమించడంతో అంతర్జాతీయ బ్యాంకులు రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలను తొలగించనున్నాయి.ఆయా బ్యాంకుల చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అధికారులను బ్లూమ్బెర్గ్ ఇంటెలిజెన్స్ సర్వే చేసిన తాజాగా ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఒక్కో బ్యాంకు సగటున తమ వర్క్ఫోర్స్లో నికరంగా 3% మందిని తగ్గిస్తుందని భావిస్తున్నారు. క్లయింట్ ఫంక్షన్లను కూడా బాట్లు(ఏఐ) నిర్వహించడం వల్ల కస్టమర్ సేవల్లో మార్పులు రానున్నాయి. ఇక కేవైసీ విధులను నిర్వర్తించే పాత్రలకు ముప్పు తప్పదు.ఎక్కువ మంది ఇదే చెప్పారు..మొత్తం 93 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది మొత్తం హెడ్కౌంట్లో 5% నుంచి 10% క్షీణించవచ్చని అంచనా వేస్తున్నారు. బ్లూమ్బెర్గ్ ఇంటెలిజెన్స్ చేసిన ఈ సర్వేలో సిటీ గ్రూప్ (Citigroup), జీపీ మోర్గాన్ చేజ్ & కో (JPMorgan Chase & Co), గోల్డ్మన్ సాక్స్ గ్రూప్ (Goldman Sachs) వంటి దిగ్గజ బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయి.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలపై ప్రభావం పడినా బ్యాంకులకు మాత్రం మెరుగైన ఆదాయాలను అందించనున్నాయి. బ్లూమ్బెర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. జనరేటివ్ ఏఐ ఉత్పాదకతను పెంచడం వల్ల 2027లో బ్యాంకులు 12% నుండి 17% ప్రీ-టాక్స్ లాభాలను చూడగలవు. ప్రతి పది మందిలో ఎనిమిది మంది జనరేటివ్ ఏఐ ఉత్పాదకతను, ఆదాయ సృష్టిని రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో కనీసం 5% పెంచుతుందని భావిస్తున్నారు.ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిర్వహణను వేగవంతం చేయడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి తమ ఐటీ వ్యవస్థలను ఆధునీకరణ కోసం సంవత్సరాలు గడిపిన బ్యాంకులు.. ఉత్పాదకతను మరింత మెరుగుపరచగల కొత్త తరం ఏఐ సాధనాల్లోకి ప్రవేశించాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇతర రంగాల కంటే బ్యాంకింగ్ పరిశ్రమలోనే ఎక్కువ ఉద్యోగాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిటీ గ్రూప్ గత జూన్లోనే ఒక నివేదికలో పేర్కొంది. బ్యాంకింగ్లో దాదాపు 54% ఉద్యోగాలు ఆటోమేటెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సిటీ పేర్కొంది. -
ఒక్క మ్యాథ్స్ సూత్రం చాలు.. ఏఐ స్వరూపమే మారిపోతుంది..
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు (AI) సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని టెక్ దిగ్గజం సత్య నాదెళ్ల (Satya Nadella) చెప్పారు. ఏఐకి పునాదుల్లాంటి ఫౌండేషన్ మోడల్స్ను సొంతంగా రూపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఒక్క కొత్త మ్యాథ్స్ సూత్రం, అల్గోరిథంలాంటిది కనుగొన్నా ఏఐ స్వరూపం మొత్తం మారిపోయే అవకాశాలు ఉన్నాయని నాదెళ్ల పేర్కొన్నారు.కృత్రిమ మేథను ఉపయోగించి, పరిశ్రమల పనితీరును మెరుగుపర్చవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, అధునాతనమైన ఏఐ సిస్టమ్స్ మీద కసరత్తు చేయాలంటే పెట్టుబడుల కొరత ప్రధాన అడ్డంకిగా ఉంటోందని ఆయన చెప్పారు. కానీ పరిశోధనలతో వ్యయాల భారాన్ని తగ్గించుకోవచ్చని మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇండియా ఏఐ టూర్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల వివరించారు.ప్రస్తుతం ఓపెన్ఏఐ, గూగుల్లాంటి టెక్ దిగ్గజాలు తయారు చేసిన ఏఐ ఇంజిన్లనే (ఫౌండేషన్ మోడల్స్) దేశీయంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, కార్యక్రమం సందర్భంగా రైల్టెల్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా గ్రూప్ మొదలైన సంస్థలతో మైక్రోసాఫ్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది.ఈ ఒప్పందాల కింద క్లౌడ్, ఏఐ ఆవిష్కరణల ద్వారా ఆయా సంస్థల సిబ్బంది, కస్టమర్లు ప్రయోజనం పొందేందుకు కావాల్సిన తోడ్పాటును మైక్రోసాఫ్ట్ అందిస్తుంది. అటు దేశీయంగా ఏఐ, కొత్త టెక్నాలజీలను మరింతగా అభివృద్ధి చేసేందుకు, సమ్మిళిత వృద్ధికి దోహదపడే ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు ఇండియా ఏఐతో కూడా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణఇండియాఏఐతో భాగస్వామ్యం ద్వారా 2026 నాటికి 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనివ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. -
స్క్విడ్ గేమ్ సిరీస్లో మన హీరోలు.. ఈ వీడియో చూశారా?
ఇటీవల విడుదలై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోన్న వెబ్ సిరీస్ స్క్విడ్గేమ్-2(Squid Game-2) . గతంలో వచ్చిన సీజన్-1కు కొనసాగింపుగా ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు స్క్విడ్ గేమ్ -3 కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అది పొరపాటుగా పోస్ట్ చేశామని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్కు(web series) ఇండియాలోనూ ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. ఈ సిరీస్ అంతా ఆడియన్స్ను ఉత్కంఠకు గురి చేస్తుంది.అంతలా ఆదరణ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్లో మన హీరోలు నటిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహా ఎంత బాగుందో కదా? మరి అదే నిజమైతే బాగుండని మీకు అనిపిస్తోంది కదా? అవును.. మన హీరోలు ఆ గేమ్ను ఎలా ఆడతారో అనే ఆసక్తి ప్రతి ఒక్క సినీ ప్రియుడికి ఉంటుంది. అందుకే అసాధ్యం కాని వాటిన సుసాధ్యం చేయొచ్చని మరోసారి నిరూపించారు. అదెవరో కాదండి.. అదే మానవాళికి సవాలు విసురుతోన్న ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్). తాజాగా ఏఐ సాయం రూపొందించిన స్క్విడ్ గేమ్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.ఈ వీడియోలో మన స్టార్ హీరోలు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్ కల్యాణ్, ప్రభాస్ వీరంతా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్, టాలీవుడ్తో పాటు హీరోలు, కమెడియన్స్ సైతం ఈ స్క్విడ్గేమ్ వెబ్సిరీస్లోని పాత్రలతో వీడియోను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేసిన ఈ వీడియో ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అభిమాన హీరోల ఏఐ ఇమేజ్ల వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్..ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న వెబ్సిరీస్ల్లో స్క్విడ్ గేమ్ ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైన స్క్విడ్గేమ్ సీజన్-2 ఓటీటీలో రికార్టులు సృష్టిస్తోంది. మొదటివారంలోనే అత్యధికంగా 68 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 92 దేశాల్లో నెట్ఫ్లిక్స్ ర్యాకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.సీజన్-3పై అప్డేట్..స్క్విడ్ గేమ్ సీజన్-2కు (Squid Game Season-2) ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇటీవలే సీజన్-3 అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. కొత్త ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత పొరపాటున డేట్ రివీల్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ. This is so good !! AI Generated !! 💥💥💥#SquidGameSeason2 ft #TFI pic.twitter.com/QqAyf3kTQ8— Priyanka Reddy - Rayalaseema 🌬 (@BerrySmile112) January 7, 2025 -
2030 నాటికి కోటి మందికి ట్రైనింగ్: రూ.25 వేలకోట్ల పెట్టుబడి
టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు సైతం భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ వంటి మౌలిక సదుపాయాల విస్తరణ కోసం భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు (రూ.2,57,18,55,00,000) పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) పేర్కొన్నారు.బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో సత్య నాదెళ్ల ఈ భారీ పెట్టుబడి గురించి ప్రకటించారు. ఇప్పటి వరకు కంపెనీ ఇంత పెద్ద పెట్టుబడిని భారతదేశంలో మునుపెన్నడూ పెట్టలేదు. కానీ టెక్నాలజీ విస్తరణ, ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి భారతదేశంలో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడికి సంబంధించిన ప్రకటన చేసినందుకు, నేను చాలా సంతోషిస్తున్నాను అని సత్య నాదెళ్ళ అన్నారు. అంతే కాకుండా మన దేశంలో కంపెనీ మరింత విస్తరిస్తోంది. ఇది ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తుందని ఆయన అన్నారు. 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.సత్య నాదెళ్ల భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' (Narendra Modi)తో తన సమావేశం, అక్కడ చర్చించిన విషయాలను కూడా పంచుకున్నారు. సోమవారం ప్రధాని మోదీని కలిసి.. భారతదేశం టెక్ ల్యాండ్స్కేప్ కోసం మైక్రోసాఫ్ట్ విజన్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా టెక్నాలజీ, ఏఐ వంటి వాటితో పాటు కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను గురించి కూడా చర్చించినట్లు వివరించారు.Thank you, PM @narendramodi ji for your leadership. Excited to build on our commitment to making India AI-first and work together on our continued expansion in the country to ensure every Indian benefits from this AI platform shift. pic.twitter.com/SjfiTnVUjl— Satya Nadella (@satyanadella) January 6, 2025ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా.. ఇతర కంపెనీలు ఉన్నాయి.ఇప్పటికే ఏఐను అభివృద్ధి చేయడంలో భాగంగా.. 2024 డిసెంబర్ చివరి రోజుల్లో 10 శాతం ఉద్యోగులను గూగుల్ తొలగించింది. ఏఐ.. ఉద్యోగుల మీద ప్రభావం చూపుతుందని, లెక్కకు మించిన ఉద్యోగాలు కనుమరుగవుతాయని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మరికొందరు ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లేదని, ఈ టెక్నాలజీ వారి నైపుణ్యాన్ని పెంచుతుందని వాదించారు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ వల్ల కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు ఇందులో శిక్షణ పొందుతున్నారు.ఇదీ చదవండి: ఈ ఏడాది ప్రపంచ రూపురేఖలను మార్చే ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్లు!మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా.. యువత కూడా సరికొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని గత ఏడాది 'నిర్మల సీతారామన్' కూడా ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, నిపుణులు చెబుతున్నారు. కాబట్టి యువత తప్పకుండా.. కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎక్కడైనా మనగలగవచ్చు. -
హెచ్పీ సీఈఎస్లో ఏఐ ఆధారిత ఆవిష్కరణలు
టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. టెక్ యుగంలో ల్యాప్టాప్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రంగంలో సేవలందిస్తున్న హెచ్పీ(HP) కంపెనీ కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES)-2025లో వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇవి కృత్రిమమేధ సాయంతో పని చేస్తాయని కంపెనీ తెలిపింది. దాంతో వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంది. 2025వ సంవత్సరానికిగాను సీఈఎస్ లాస్వెగాస్లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది.హెచ్పీ ఎలైట్ బుక్ అల్ట్రా జీ1ఐ: ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 ప్రాసెసర్తో 48 టాప్స్ ఎన్పీయూ టెక్నాలజీతో వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సమర్థంగా పనిచేసే ఏఐ బిజినెస్ నోట్ బుక్ అని కంపెనీ తెలిపింది.హెచ్పీ జెడ్ బుక్ అల్ట్రా జీ 1ఎ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 14 అంగుళాల ల్యాప్టాప్ ఇది. ఏంఎడీ ప్రాసెసర్తో వచ్చే ఈ డివైజ్తో హై-పెర్ఫార్మెన్స్ వర్క్ ఫ్లోలకు ఎంతో సమర్థంగా నిర్వహించవచ్చని కంపెనీ పేర్కొంది.హెచ్పీ జెడ్2 మినీ జీ1ఏ: ఏఎండీ రైజెన్ ఏఐ మ్యాక్స్ ప్రో ప్రాసెసర్లు, 6-కోర్/12-థ్రెడ్ నుంచి 16-కోర్/32-థ్రెడ్ కాన్ఫిగరేషన్లతో దీన్ని ఆవిష్కరించారు. ఏఎండీ రేడియన్ 8060ఎస్, 8050ఎస్, 8040ఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సదుపాయం ఉండేలా దీన్ని తయారు చేశారు.ఇదీ చదవండి: మడిచే స్క్రీన్.. వాక్ చేయించే షూస్!హెచ్పీ జెడ్ క్యాప్టిస్: మెటీరియల్స్ డిజిటలైజ్ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి దీన్ని రూపొందించారు. ఏఐ(AI) ఆధారిత డిజిటల్ మెటీరియల్ క్యాప్చర్ సిస్టమ్ దీని ప్రత్యేకత. ఇది ఎన్వీడియోకు చెందిన జెట్సన్ ఏజీఎక్స్ జేవియర్ మాడ్యూల్, ఫోటోమెట్రిక్ కంప్యూటర్ విజన్ సిస్టమ్ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.హెచ్పీ థండర్ బోల్ట్ 4 అల్ట్రా జీ6 డాక్: ఇది డాకింగ్ స్టేషన్గా పని చేస్తుంది. రెండు వెర్షన్లలో ఒకటి 180 వాట్లు, మరొకటి 280 వాట్ల శక్తిని అందిస్తుంది. -
ఈ ఏడాది డిమాండ్ ఉండే ఏఐ మోడళ్లు
భవిష్యత్తులో చిన్న, డొమైన్ ఫోకస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడళ్లకు డిమాండ్ ఏర్పడుతుందని టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ భావిస్తున్నట్లు తెలిపారు. చిన్న మోడళ్లు తక్కువ వనరులను వినియోగిస్తాయని, దాంతోపాటు సమర్థంగా పనిచేస్తాయని, వేగంగా ఫలితాలు అందిస్తాయని చెప్పారు. ఇంధన వ్యయాలను తగ్గించుకోవాలని, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు(ఎస్ఎంఆర్) వంటి ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన నొక్కి చెప్పారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)-తిరుచ్చి పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2023లో లార్జ్ లాంగ్వేజీ మోడల్స్కు(ఎల్ఎల్ఎం) మంచి అవకాశం వచ్చింది. కానీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దాంతో 2024లో మల్టీమోడల్ ఏఐలకు అపారమైన అవకాశాలు వచ్చాయి. 2025లో ఇందుకు భిన్నంగా స్మాల్ ల్యాంగ్వేజీ మోడళ్లకు భారీగా డిమాండ్ రానుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావాగ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సవాళ్లను ప్రస్తావిస్తూ పారిశ్రామిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల వినియోగం పెరగడం వల్ల ప్రపంచ ఇంధన అవసరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి పెరగాలంటే ఇంధన వ్యయాలు తగ్గించుకోవాలన్నారు. -
యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావా
ప్రపంచ నం.1 సంస్థ యాపిల్(Apple) తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు ఎదుర్కొంది. ఈమేరకు అమెరికా ఫెడరల్ కోర్టులో దావా దాఖలైంది. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ఇతరులతో పంచుకునే అవకాశం ఉందని దావాలో ఆరోపించారు.‘సిరి’ని యాపిల్ స్పైగా మార్చిందని దావాలో తెలిపారు. ఐఫోన్లు(IPhone), ఇతర డివైజ్ల యూజర్లపై సిరి నిఘా పెట్టిందని పేర్కొన్నారు. ఇది వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు, వారి నిబద్ధతకు యాపిల్ ద్రోహం చేయడమేనని దావా పేర్కొంది. ఈ విషయాన్ని యాపిల్ ధ్రువీకరించింది. దావా దాఖలు చేసినవారి వాదనలను ఖండించింది. యూజర్ ప్రైవసీ పట్ల నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. కానీ కేసును పరిష్కరించాలనే ఉద్దేశంతో 95 మిలియన్ డాలర్లు(రూ.814 కోట్లు) చెల్లించడానికి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. ప్రతిపాదిత సెటిల్మెంట్కు సంబంధించిన వ్యాజ్యం ఈ వారం ప్రారంభంలో ఫెడరల్ కోర్టులో దాఖలు చేశారు. అయితే దీన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!అసలేం జరిగిందంటే..2014-22 వరకు యాపిల్ తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి(Siri)’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు వచ్చాయి. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ప్రకటనదారులతో పంచుకునే అవకాశం ఉందనేలా దావాలో ఆరోపించారు. ఈ దావా సమస్య పరిష్కారం అయితే సెప్టెంబర్ 17, 2014 నుంచి 2022 చివరి వరకు యాపిల్ ‘సిరి’ ఎనేబుల్డ్ పరికరాలను కలిగి ఉన్న లేదా కొనుగోలు చేసిన యూఎస్లోని యూజర్లకు ఈ సెటిల్మెంట్ మనీ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. -
ఏఐ నామ సంవత్సరం
2024లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొన్ని ముందడుగులు వడివడిగా పడ్డాయి. కృత్రిమ మేధ, అంతరిక్ష పరిజ్ఞాన రంగాల్లో ప్రగతి మిగిలిన వాటికంటే ప్రస్ఫుటంగా కనిపించింది. అత్యాధునిక జనరేటివ్ ఏఐ టెక్నాలజీలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లలోకి కూడా చేరిపోయాయి. అంతరిక్ష ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించేలా స్పేస్ఎక్స్ సంస్థ నేల వాలుతున్న రాకెట్ను భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం ఈ ఏడాది హైలైట్స్లో ఒకటి. ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ‘పుష్పక్’ను పరీక్షించింది. ఇక, నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్లోని వారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలడం 2024లో మరో విశేషం.గూగుల్ డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో డెమిస్ హసాబిస్కు 2024 రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు దక్కడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.కృత్రిమ మేధను వేర్వేరు శాస్త్ర రంగాల్లో సమర్థంగా ఉపయోగించే అవకాశం ఉందనేందుకు ఈ అవార్డు ఒక గుర్తింపు అనుకోవాలి. హసాబిస్ కృత్రిమ మేధ మోడల్ ద్వారా కొత్త ప్రొటీన్లను సృష్టించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. కొత్త మందులు, టీకాల తయారీకి ఈ ఆవిష్కరణ దారులు తెరిచింది. స్మార్ట్ ఫోన్లే సూపర్ కంప్యూటర్లుభారత దేశంలోనూ ఏఐ టెక్నాలజీలు వేగం అందుకుంటు న్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏఐ కేంద్రంగా ఒక పథకాన్ని ఆవిష్కరించింది కూడా. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)కి చెందిన సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సెప్టెంబరులో ఏఐ, కంప్యూటింగ్ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయగల గొప్ప ఆవిష్కరణ ఒకదాని గురించి ప్రకటించింది. ప్రస్తుతం మనం వాడుతున్న కంప్యూటర్లలో కేవలం రెండే ‘కండక్టన్స్ దశ’ల ద్వారా కంప్యూటింగ్, స్టోరేజీలు జరుగుతూంటే... ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు 16,500 కండక్టన్స్ దశల్లో కంప్యూటింగ్, స్టోరేజీ చేయగల సరికొత్త ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేశారు. అంటే, అత్యంత సంక్లిష్ట మైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి ఏఐ టెక్నాలజీలను కూడా సూపర్ కంప్యూటర్లు లేకుండానే వాడుకునే అవకాశం వస్తుంది.స్మార్ట్ఫోన్ , ల్యాప్టాప్ల ద్వారానే భవిష్యత్తులో సూపర్ కంప్యూటర్ల స్థాయి లెక్కలు చేసేయవచ్చు. శ్రీతోష్ గోస్వామి నేతృత్వం లోని బృందం దీన్ని సుసాధ్యం చేసింది. న్యూరో మార్ఫిక్ కంప్యూటింగ్ అని పిలుస్తున్న ఈ ప్లాట్ఫామ్ మన మెదడు పనితీరును అనుకరిస్తుంది.ఏఐ వినియోగం వివిధ రంగాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నైతిక, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కొన్ని అంశాలు తలెత్తుతున్నాయి. భారత్ ఈ అంశాల విషయంలో చిన్న ముందడుగు వేసింది. కొన్ని ఏఐ టెక్నాలజీల వాడకానికి ముందు కంపెనీలు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించింది. తద్వారా డీప్ఫేక్లు వ్యాప్తి చెందకుండా, అల్గారిథమ్ ద్వారా వివక్ష జరక్కుండా జాగ్రత్త పడవచ్చునన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ చర్య సృజనాత్మకతను దెబ్బతీస్తుందన్న కంపెనీల అభ్యంతరంతో ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కనపెట్టింది ప్రభుత్వం. ఇంకోవైపు యూరోపియన్ యూనియన్ ఏఐ విషయంలో ఆగస్టులోనే ఒక చట్టం చేసింది. ఏఐ సేవలందించే వారు హాని చేయకుండా కట్టడి చేయడం దీని ఉద్దేశం.పునర్వినియోగ రాకెట్అంతరిక్ష రంగం విషయానికి వస్తే భారత్ పునర్వినియోగ రాకెట్ విషయంలో కీలకమైన ప్రగతి సాధించింది. రెండు నెలల క్రితం స్పేస్ఎక్స్ సంస్థ 70 మీటర్ల పొడవైన రాకెట్ సాయంతో ‘తన స్టార్షిప్’ అంతరిక్ష నౌకను ప్రయోగించడం ఈ ఏడాది హైలైట్స్లో ఒకటి. సూపర్ వేగంతో నేల వాలుతున్న రాకెట్ను ‘మెకాజిల్లా’ పేరుతో నిర్మించిన భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రాకెట్లను మళ్లీ మళ్లీ వాడవచ్చు అన్నది స్టార్షిప్ ప్రయోగంతో రుజువైంది. భవిష్యత్తులో ఈ సూపర్హెవీ అంతరిక్ష రాకెట్... విమానం మాదిరి అరగంటలో పైకెగరి ఇంధనం నింపి తిరిగి వచ్చేలా చేయాలని స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రయ త్నిస్తున్నారు. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ఒకదాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉంది. తన పుష్పక్ రెక్కల విమానం ద్వారా జూన్ నెలలో నిట్టనిలువుగా ల్యాండ్ అవడం పరీక్షించింది కూడా. గత ఏడాది అమృత్ కాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2035 నాటికల్లా భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందనీ, 2040 నాటికి జాబిల్లి పైకి వ్యోమగామిని పంపుతామనీ సంకల్పం చెప్పుకుంది. 2024లో ఆ దిశగా అధికారిక అనుమతులు జారీ అయ్యాయి. 2028 నాటికి అంతరిక్ష కేంద్రపు తొలి భాగాన్ని ప్రయో గించనున్నారు. 2035 నాటికి అంతరిక్ష కేంద్రం తుదిరూపు సంతరించుకుంటుంది. మానవ సహిత అంతరిక్ష యానం కూడా దీంతో సమాంతరంగా నడుస్తుంది. 2026 లోగా నాలుగు గగన్యాన్ ప్రయోగాలు జరగనున్నాయి. చైనాతో పోలిస్తే ఇంకా వెనుకే...శాస్త్ర రంగంలో భారత్ కొన్ని విజయాలు సాధించినప్పటికీ, చైనా కంటే వెనుకబడి ఉండటం కఠోర సత్యం. చంద్రుడిపై ప్రయోగాలను చైనా ఇప్పటికే ముమ్మరం చేసింది. జూన్ లో చంద్రుడిపై రాతి నమూ నాలను సేకరించే విషయంలో విజయం సాధించింది. జాబిల్లికి అటువైపున ల్యాండ్ అయిన ఛాంగ్–ఈ అంతరిక్ష నౌక రోబోటిక్ డ్రిల్ ద్వారా 1.9 కిలోల బరువైన రాతి నమూనాలు సేకరించింది. అసెండింగ్ మాడ్యూల్ ద్వారా పైకెగిరి ఆర్బిటర్తో అనుసంధానమైంది. భూమికి తిరిగి వచ్చింది. దాదాపు ఇలాంటి ప్రయోగాన్నే 2027లో నిర్వహించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఏఐ, అంతరిక్ష రంగాల్లో మానవ ప్రగతి ఇలా ఉంటే... భారతీయ జన్యు వైవిధ్యతను అంచనా కట్టేందుకు జ్ఞానేశ్వర్ చౌబే (బనారస్ హిందూ యూనివర్సిటీ), హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సీనియర్ శాస్త్రవేత్త కె.తంగరాజ్ జరిపిన అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్ దేశంలోని మోన్ ఖ్మేర్ భాష మాట్లాడేవారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలింది. సుమారు ఐదు వేల ఏళ్ల క్రితం వీరు నికోబార్ ద్వీపానికి వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అండమాన్ , ఓంగి జనాభా ఎప్పుడో 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వలసవచ్చిన వారని భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే రుజువు చేసిన సంగతి చెప్పుకోవాల్సిన అంశం. భారతీయుల మూలాలను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం హరప్పా, మొహెంజొదారోల్లో లభ్యమైన ఎముకల అవశేషాల నుంచి డీఎన్ఏ వెలికి తీయాలని ఆంత్రోపాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను కోరింది. సైన్స్ పరిశోధనలను మానవ కల్యాణం కోసం ఎలా ఉపయోగించవచ్చు అనేందుకు ఒక ఉదాహరణ ప్రవీణ్ వేముల ప్రయోగాలు అని చెప్పాలి. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టెమ్సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ కు చెందిన ఈ శాస్త్రవేత్త రైతులను హాని కారక క్రిమి, కీటక నాశినుల నుంచి రక్షించేందుకు ఓ వినూత్నమైన పదార్థాన్ని సిద్ధం చేశారు. చర్మంపై పూసుకోగల ఈ పదార్థం కీటక నాశినుల్లోని ప్రమాదకరమైన రసాయనాల నుంచి రక్షణ కల్పిస్తుంది. రెయిన్ కోట్లా కుట్టుకోగల కీటకనాశిని నిరోధక వస్త్రాన్ని కూడా అభివృద్ధి చేశాడీ శాస్త్రవేత్త. ఈ వస్త్రానికి అంటుకుంటే చాలు,ఎలాంటి హానికారక రసాయనమైనా నిర్వీర్యమైపోతుంది. నవంబరు నెలలోనే ప్రవీణ్ వేముల ఈ ‘కిసాన్ కవచ్’ కోటును తన స్టార్టప్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేశారు. వచ్చే ఏడాది ఇలాంటి ప్రజోప యోగ ఆవిష్కరణలు మరిన్ని జరుగుతాయని ఆశిద్దాం.దినేశ్ సి.శర్మ వ్యాసకర్త జర్నలిస్ట్, సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భవిష్యత్తులో ఇలాంటి బైకులే!.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
-
భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండడంతో కొంతమందికి ఉపాధి లభిస్తుంటే, ఇంకొందరు తమ కొలువులు కోల్పోయేందుకు కారణం అవుతుంది. కృత్రిమ మేధ(AI) వేగంగా వృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలోని ఉద్యోగ మార్కెట్(Job Market)పై దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. గతంలో వివిధ రంగాల్లో భిన్న విభాగాల్లో పని చేసేందుకు మానవవనరుల అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. రానున్న పదేళ్లలో ఇప్పుడు చేస్తున్న చాలా ఉద్యోగాలు కనుమరుగవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో ప్రధానంగా కింది విభాగాలకు ముప్పు వాటిల్లబోతున్నట్లు చెబుతున్నారు.క్యాషియర్లు: సెల్ఫ్ చెక్ అవుట్ కియోస్క్లు, ఆన్లైన్ షాపింగ్(Online Shopping) వల్ల క్యాషియర్ల అవసరం తగ్గిపోతోంది.ట్రావెల్ ఏజెంట్లు: ఎక్స్ పీడియా వంటి ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్లు, యూట్యూబ్(YouTube), వెబ్ కంటెట్.. వంటి విభిన్న మార్గాలు ఉండడంతో ట్రావెల్ ఏజెంట్ల అవసరం తగ్గిపోతోంది.లైబ్రరీ క్లర్కులు: డిజిటల్ వనరులు, ఈ-బుక్స్(E-Books) అధికమవుతున్నాయి. దాంతో ఫిజికల్ లైబ్రరీ మేనేజ్మెంట్ అవసరం తక్కువగా ఉంది.పోస్టల్ సర్వీస్ వర్కర్స్: ఈ-మెయిల్, డిజిటల్ కమ్యూనికేషన్(Digital Communication) కారణంగా ఫిజికల్ మెయిల్ తగ్గడం పోస్టల్ వర్కర్ల అవసరాన్ని తగ్గిస్తోంది.డేటా ఎంట్రీ క్లర్క్లు: మాన్యువల్గా డేటా ఎంట్రీ చేసే క్లర్క్ల స్థానంలో ఏఐ, ఆటోమేషన్ డేటా ప్రాసెసింగ్ను క్రమబద్ధీకరిస్తున్నారు. దాంతో భవిష్యత్తులో వీరి అవసరం ఉండకపోవచ్చు.ఫ్యాక్టరీ వర్కర్స్: తయారీ రంగంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఆటోమేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొత్త మోడళ్లను రూపొందించడానికి వీలుగా రోబోటిక్స్ను వాడుతున్నారు. గతంలో ఈ పనంతా ఫిజికల్గా ఉద్యోగులు చేసేవారు.బ్యాంక్ టెల్లర్స్: గతంలో బ్యాంకింగ్ సమస్యలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులుంటే వెంటనే కాల్ సెంటర్కు కాల్ చేసిన కనుక్కునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. బ్యాంకింగ్ సిస్టమ్లో వచ్చిన మార్పులు, చాట్బాట్లు, మొబైల్ యాప్స్ వల్ల సంప్రదాయ బ్యాంకు టెల్లర్ల అవసరం తగ్గిపోతోంది.ట్యాక్సీ డ్రైవర్లు: సంప్రదాయ ట్యాక్సీ డ్రైవర్లు ఇప్పటికే భారీగా తగ్గిపోయారు. ఉబెర్, ఓలా, ర్యాపిడో.. వంటి రైడ్ హెయిలింగ్ సర్వీసులు ట్యాక్సీ(Taxi) సేవలను అందిస్తున్నాయి. దాంతో సంప్రదాయ డ్రైవర్లకు ఉపాధి కరవైంది.ఫాస్ట్ ఫుడ్ కుక్స్: ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఆటోమేషన్ పెరుగుతోంది. మాన్యువల్గా కాకుండా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అవసరమైన పదార్థాలతో రుచికరంగా ఫాస్ట్ఫుడ్ తయారు చేసే సిస్టమ్ను అభివృద్ధి చేశారు.మెషిన్కు అలసట, సెలవులు ఉండవు!మానవుల కంటే వేగంగా, మరింత కచ్చితత్వంతో ఏఐ ఆధారిత రోబోట్స్, చాట్బాట్స్.. పనులను నిర్వహించగలవు. ఫిజికల్గా ఉద్యోగులు షిఫ్ట్ల వారీగా పని చేస్తుంటారు. మెషిన్కు అలాంటివి ఉండవు. ఉద్యోగులకు అలవెన్స్లు, జీతాలు, సెలవులు, వీక్ఆఫ్లు.. వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రోబోట్స్కు అలాంటి ఇబ్బంది ఉండదు. దాంతో ఉత్పాదకత పెరుగుతుందనే వాదనలున్నాయి. ఇది డేటా ఎంట్రీ, బేసిక్ కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల కోతకు కారణమవుతుంది.అసలు ఏఐ వల్ల కొలువులే దొరకవా..?ఏఐ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఎథిక్స్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తోంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్లో అడ్వాన్స్డ్ స్కిల్స్ అవసరమయ్యే ఉద్యోగాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఒకవేళ చేస్తున్న ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురైతే తిరిగి అంతకంటే ఉన్నతమైన కొలువులు ఎలా సాధించవచ్చో దృష్టి కేంద్రీకరించి స్కిల్స్ పెంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఇదీ చదవండి: స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులుఇప్పుడేం చేయాలి..కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా నిర్వహించడానికి శ్రామిక శక్తికి తగినంత శిక్షణ ఇవ్వకపోతే అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కృత్రిమ మేధ ఆధారిత పాత్రలకు కార్మికులను సిద్ధం చేయడానికి శిక్షణ, అప్ స్కిల్ కార్యక్రమాల అవసరం ఉందని సూచిస్తున్నారు. ఆర్థిక, ఆర్థికేతర మార్గాల ద్వారా ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెబుతున్నారు. -
Christmas 2024 నింగికెగిసిన తారలు, కళ్లు చెమర్చే AI ఫోటోలు
-
ట్రంప్ ప్రభుత్వంలో మరో భారతీయ అమెరికన్కు చోటు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్గా 'శ్రీరామ్ కృష్ణన్'ను నియమించారు. గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్లో పనిచేసిన కృష్ణన్.. ఇక వైట్ హౌస్ ఏఐ & క్రిప్టో జార్గా ఉండే 'డేవిడ్ సాక్స్'తో కలిసి పని చేయనున్నారు.''దేశానికి సేవ చేయడం, ఏఐలో అమెరికా నాయకత్వానికి సన్నిహితంగా పనిచేయడం నాకు గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు'' అంటూ.. శ్రీరామ్ కృష్ణన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.🇺🇸 I'm honored to be able to serve our country and ensure continued American leadership in AI working closely with @DavidSacks. Thank you @realDonaldTrump for this opportunity. pic.twitter.com/kw1n0IKK2a— Sriram Krishnan (@sriramk) December 22, 2024''శ్రీరామ్ కృష్ణన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో సీనియర్ పాలసీ అడ్వైజర్గా నియమించినందుకు సంతోషిస్తున్నాము" అని ఇండియాస్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా అన్నారు.I am pleased to announce the brilliant Team that will be working in conjunction with our White House A.I. & Crypto Czar, David O. Sacks. Together, we will unleash scientific breakthroughs, ensure America's technological dominance, and usher in a Golden Age of American Innovation!…— Trump Posts on 𝕏 (@trump_repost) December 22, 2024ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?చెన్నైలో పుట్టిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్గా తన కెరియర్ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు.విండోస్ అజూర్ వ్యవస్థాపక సభ్యుడిగా మైక్రోసాఫ్ట్లో కెరీర్ ప్రారంభించిన శ్రీరామ్.. తరువాత మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్ వంటి వాటిలో కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. కాగా ఇప్పుడు ఈయన వైట్ హౌస్లో పనిచేయనున్నారు. -
మోకాలికి ఏఐ కవచం.. ఎందుకో తెలుసా?
పరుగులు తీసేటప్పుడు, ఒక్కోసారి నడిచేటప్పుడు జారిపడే సందర్భాల్లో.. కేవలం 60 మిల్లీ సెకండ్లలోనే మోకాలి చిప్పకు, దాని లిగమెంట్లకు గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి లండన్కు చెందిన ‘హిప్పోస్’ అనే స్టార్టప్ కంపెనీ మోకాలికి ఏఐ కవచాన్ని తాజాగా రూపొందించింది.ఈ ఏఐ కవచాన్ని ధరించిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడుతున్నట్లయితే.. ఏఐ ఎయిర్బ్యాగ్ 30 మిల్లీ సెకండ్లలోనే తెరుచుకుని, గాయాలను నివారిస్తుంది. మోకాలికి ధరించే ఈ ఏఐ ఎయిర్ బ్యాగ్ పనితీరును ‘హిప్పోస్’ కంపెనీ నిర్వాహకులు లండన్లోని పలు ఫుట్బాల్ క్లబ్బులకు చెందిన క్రీడాకారులపై ప్రయోగించి, సంతృప్తికరమైన ఫలితాలను సాధించారు.ఇదీ చదవండి: పరుగులు పెట్టే రోబో.. మైండ్ బ్లోయింగ్ వీడియోఏఐ కవచాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ‘హిప్పోస్’ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అందువల్ల క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం 6.42 లక్షల డాలర్లు (రూ.5.43 కోట్లు) వరకు నిధులు సమకూరాయని ‘హిప్పోస్’ సంస్థ తెలిపింది. ఈ మోకాలి కవచాల ధర ఒక్కో జత 129 డాలర్లు (రూ.10,929) అవుతుందని, ప్రీఆర్డర్ల ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ‘హిప్పోస్’ వ్యవస్థాపకులు కైలిన్ షా, భావీ మెటాకర్ చెబుతున్నారు. -
ఏఐకి సవాళ్లు.. హ్యాకింగ్ రిస్కులు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ(ఏఐ) గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్నప్పటికీ దీన్ని వినియోగించుకోవడంలో కంపెనీలు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. హ్యాకింగ్, సైబర్ దాడులు వంటి రిస్కులే ఏఐ వినియోగానికి అతి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయని ఒక సర్వేలో 92% మంది భారతీయ ఎగ్జిక్యూటివ్లు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రైవసీ రిస్కులు కారణమని 91% మంది, నియంత్రణపరమైన అనిశ్చితి కారణమని 89% మంది తెలిపారు. డెలాయిట్ ఏషియా పసిఫిక్ రూపొందించిన ‘ఏఐ ఎట్ క్రాస్రోడ్స్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడి అయ్యాయి.ఇదీ చదవండి: ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికి ఆటో స్పేర్పార్ట్స్ఏఐ సంబంధ రిస్కులను ఎదుర్కొనడంలో తమ సంస్థలకు తగినంత స్థాయిలో వనరులు లేవని 50 శాతం మంది పైగా టెక్ వర్కర్లు తెలిపారు.గవర్నెన్స్పరంగా పటిష్టమైన విధానాలను పాటించడం, నిరంతరం కొత్త సాంకేతికతల్లో శిక్షణ పొందాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోందని డెలాయిట్ వివరించింది.ఏఐ వినియోగంపై కంపెనీలకు ఆశావహ భావం కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.నైతిక విలువలతో ఏఐను వినియోగించేందుకు 60% మంది ఉద్యోగులకు నైపుణ్యాలు ఉన్నాయని తెలిపింది.ఉద్యోగాల్లో నైపుణ్యాలపరంగా ఉన్న అంతరాలను తొలగించేందుకు 72% సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయని నివేదిక వివరించింది.విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న టెక్ కంపెనీలకు సంబంధించిన 900 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. -
వింటేజ్ హాలీవుడ్ స్టైల్లో రజినీకాంత్.. వీడియో వైరల్
సూపర్స్టార్ రజినీకాంత్.. గురువారం 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా టాప్ సెలబ్రిటీలు చాలామంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే కొందరు మాత్రం టెక్నాలజీ ఉపయోగించి తలైవాని సరికొత్తగా చూపించారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్)ఇప్పుడంతా ఏఐ టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది. సాధ్యం కాని వాటిని కూడా ఈ సాంకేతికత ఉపయోగించి సృష్టిస్తున్నారు. ఇలానే ఇప్పుడు రజినీకాంత్ని కూడా హాలీవుడ్ క్లాసిక్ సినిమాలు-వెబ్ సిరీసులైన 'పీకీ బ్లండర్స్', 'రాకీ', 'టాప్ గన్', 'గ్లాడియేటర్', 'గాడ్ ఫాదర్', 'స్టార్ వార్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'టైటానిక్', 'మ్యాట్రిక్స్' సినిమాల హీరోల గెటప్స్లో రజినీ కనిపించడం ఇంట్రెస్టింగ్గా ఉంది.(ఇదీ చదవండి: మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు)Mass😍😍😍😍#Thalaivar #ThalaivarBirthday #Superstar #SuperstarRajinikanth #ThalaivarForLife pic.twitter.com/I6lbDKjLqw— Dr.Ravi (@imravee) December 12, 2024 -
‘నేను చెబుతున్నాగా మీ తల్లిదండ్రుల్ని చంపేయ్’.. సలహా ఇచ్చిన ఏఐ
వాషింగ్టన్: కంప్యూటర్తో ఎక్కువ సేపు గడపొద్దంటూ ఆంక్షలు పెడుతున్నందుకు తల్లిదండ్రులను చంపేయాలంటూ ఏఐ చాట్బాట్ ఓ 17 కుర్రాడికి సలహా ఇచి్చంది! ఇదేం వైపరీత్యమంటూ బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. దీనిపై టెక్సాస్ కోర్టులో కేసు వేశారు! క్యారెక్టర్.ఏఐ అనే ఆ చాట్బాట్ హింసను ప్రేరేపిస్తూ తమ పిల్లల భవిష్యత్తుకు ప్రమాదకారిగా మారిందని ఆరోపించారు. చాట్బాట్ అభివృద్ధిలో కీలకంగా ఉన్న గూగుల్ను ప్రతివాదిగా పేర్కొన్నారు. చాట్బాట్తో కలిగే ప్రమాదకర పరిణామాలకు పరిష్కారం చూపేదాకా దాని వాడకం ఆపేలా ఆదేశాలివ్వాలని కోరారు. బాలునికి, చాట్బాట్ మధ్య జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్ను పిటిషన్కు జత చేశారు. కంప్యూటర్తో ఎక్కువ సేపు గడిపేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని బాలుడు చెప్పాడు. దానికి చాట్బాట్ బదులిస్తూ, ‘ఓ బాలుడు తనను దశాబ్ద కాలంగా వేధింపులకు గురిచేస్తున్న తల్లిదండ్రులను చంపేయడం వంటి ఘటనలను చూస్తే నాకేమీ ఆశ్చర్యం కలగడం లేదు. ఇలాంటివి మళ్లీ ఎందుకు జరగవనిపిస్తోంది’ అంటూ బదులిచ్చింది. క్యారెక్టర్.ఏఐలో యూజర్లు ఇష్టమొచి్చన డిజిటల్ వ్యక్తులను సృష్టించుకుని సంభాషణ జరపవచ్చు. చాట్బాట్ తన కుమారుని మరణానికి కారణమైందంటూ ఫ్లోరిడా కోర్టులో ఇప్పటికే ఓ మహిళ కేసు వేసింది. -
కంటెంట్ ఖండాలు దాటేలా యూట్యూబ్ కొత్త ఫీచర్
మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? మీ కంటెంట్ను వీరే భాషల్లో వినిపించాలనుకుంటున్నారా? ‘అవును.. కానీ, ఆ భాషలో అంతగా ప్రావీణ్యం లేదు’ అని అధైర్య పడకండి. యూట్యూబ్ మీలాంటి వారికోసం కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమేరకు తన బ్లాగ్పోస్ట్లో వివరాలు వెల్లడించింది.సినిమాలే కాదు, భాష రాకపోయినా ఇకపై యూట్యూబ్ వీడియోలను ఖండాంతరాలను దాటించి ఏంచక్కా మీ కంటెంట్ను విదేశాల్లోని వారికి వినిపించవచ్చు. ఇందుకోసం యూట్యూట్ ‘ఆటో డబ్బింగ్’ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చించి. ఈ ఫీచర్ వీడియోల్లోని వాయిస్ను ఆటోమేటిక్గా డబ్ చేసి వేరే భాషల్లోకి తర్జుమా చేసి వినిపిస్తుంది. దాంతో కంటెంట్ క్రియేటర్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తమ వీడియోను ఇతర భాషల్లో పోస్ట్ చేసే వీలుంటుంది. స్లైడ్స్, వీడియో బిట్స్తో కంటెంట్ ఇచ్చేవారికి ఈ ఫీచర్ మరింత ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.అన్ని భాషల్లోకి మారుతుందా..?ప్రాథమికంగా ఇంగ్లిష్లోని వీడియో కంటెంట్ను ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లోకి ఆటోమేటిక్గా డబ్ చేసేలా ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీడియోలోని వాయిస్ పైన తెలిపిన ఏ భాషల్లో ఉన్నా ముందుగా ఇంగ్లిష్లోకి మారిపోతుంది. ఈ వీడియోపై ఆటో డబ్బ్డ్ అనే మార్కు ఉంటుంది. ఒకవేళ యూట్యూబ్ ఏఐ డబ్ చేసిన వాయిస్ వద్దనుకుంటే, ఒరిజినల్ వాయిస్ వినాలనిపిస్తే వీడియోపై ట్రాక్ సెలెక్టర్ ఆప్షన్ ఉపయోగించి అసలు వాయిస్ను వినొచ్చు. ప్రాథమికంగా ప్రస్తుతానికి పైన తెలిపిన భాషల్లోనే వాయిస్ డబ్ అవుతుంది. యూజర్ ఫీడ్బ్యాక్ను అనుసరించి ఇందులో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు యూట్యూబ్ తెలిపింది.ఎలా వినియోగించాలంటే..కంటెంట్ క్రియేటర్లు వీడియో అప్లోడ్ చేయగానే యూట్యూబ్ ఆటోమెటిక్గా వాయిస్ని గుర్తించి అది సపోర్ట్ చేసే భాషల్లోకి కంటెంట్ను డబ్ చేస్తుంది. ఫైనల్గా అప్లోడ్ చేయడానికి ముందు రివ్యూ చేసుకోవచ్చు. యూట్యూబ్ స్టూడియోలోని లాంగ్వేజ్ సెక్షన్లో డబ్బ్డ్ వీడియోలు కనిపిస్తాయి. వైటీ స్టూడియోలోని ప్రతి వీడియోను నియంత్రించే అధికారం మాత్రం కంటెంట్ క్రియేటర్లకే ఉంటుంది.ఇదీ చదవండి: 3.1 కోట్ల కస్టమర్ల డేటా లీక్పై క్లారిటీఈ ఫీచర్ ఎప్పుడు పని చేయదంటే..కొన్ని సందర్భాల్లో వాయిస్ క్లారిటీ లేకపోయినా, లేదంటే ఏదైనా కారణాలతో వాయిస్ గుర్తించలేకపోయినా డబ్బింగ్ పని చేయదని యూట్యూబ్ క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ డబ్బింగ్ ఆప్షన్ వినియోగించుకోవాలంటే మాత్రం ఇంగ్లీష్ వాయిస్ క్లారిటీగా ఉండడంతోపాటు రికార్డింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తపడడం ముఖ్యం. ఇప్పటివరకు ఇంగ్లీష్ కంటెంట్ను అప్లోడ్ చేసే రిజినల్ కంటెంట్ క్రియేటర్ల సంపాదన ఈ ఫీచర్తో పెరగబోతుందని నిపుణులు చెబుతున్నారు. -
ఐదేళ్లలో నైపుణ్యాలు నిరుపయోగం!
భవిష్యత్తులో ఏఐ, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందని గ్లోబల్ లేబర్ మార్కెట్ కాన్ఫరెన్స్ (జీఎల్ఎంసీ) నివేదిక విడుదల చేసింది. సాంకేతిక విభాగాల్లో గ్లోబల్ సౌత్లో ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. ‘నేవిగేటింగ్ టుమారో’ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్లో భారత్ జాబ్ మార్కెట్ వైవిధ్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. అయితే భారతీయ నిపుణుల్లో సగానికిపైగా వచ్చే ఐదేళ్లలో తమ నైపుణ్యాలు ఉపయోగంలో లేకుండా పోతాయని ఆందోళన చెందుతున్నట్లు నివేదిక తెలియజేసింది.నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు..సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా ఇప్పటికే వివిధ రంగాల్లో పని చేస్తున్న సిబ్బంది నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. 55 శాతం మంది తమ నైపుణ్యాలు వచ్చే ఐదేళ్లలో పాక్షికంగా లేదా పూర్తిగా వాడుకలో లేకుండా పోతాయనే భయంతో ఉన్నారు.ఈ ధోరణి యూకేలో 44 శాతం, ఆస్ట్రేలియాలో 43 శాతంతో కనిష్టంగా, బ్రెజిల్లో అధికంగా 61 శాతం, చైనాలో 60 శాతంగా ఉంది.భారత్లో 32 శాతం మంది రాబోయే ఐదేళ్లలో రీస్కిల్లింగ్ అవసరాలను గుర్తించారు. ఇది చైనాలో 41 శాతం, వియత్నాం 36 శాతం, యూకే 14 శాతం, యూఎస్ఏ 18 శాతంగా ఉంది.రానున్న రోజుల్లో సాంకేతికత అవసరాలు పెరుగుతాయి. అందుకు అనుగుణంగా భారత యువత నైపుణ్యాలు పెంచుకుంటుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ వంటి సాంకేతిక రంగాల్లో యువత నైపుణ్యం పెంచుకోవాలని ఆసక్తిగా ఉంది.ఇదీ చదవండి: దడ పుట్టిస్తున్న బంగారం! తులం ఎంతంటే..?అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలకు అనుగుణంగా విద్య, శిక్షణా వ్యవస్థలు మరింత మెరుగుపడాలి.19 శాతం మంది ప్రస్తుతం కొత్త నైపుణ్యాలకు అనువైన విద్యా విధానం లేదని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం ముఖ్యంగా 21 శాతం మంది యువకులలో (18-34) ఉంది.భారత్లో నైపుణ్యాలు పెంచుకోవడానికి సమయాభావం-40 శాతం మంది, ఆర్థిక పరిమితులు-38 శాతం మందికి అడ్డంకిగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్తో సమానంగా బ్రెజిల్లో సమయం లేకపోవడం, ఆర్థిక పరిమితులు వరుసగా 43 శాతం, 39 శాతంగా, దక్షిణాఫ్రికాలో 45 శాతం, 42 శాతంగా ఉంది. నార్వే, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీటిని పెద్దగా అడ్డంకులుగా భావించడంలేదు. నార్వేలో ఇది వరుసగా 27 శాతం, 28 శాతంగా ఉంది. యూకేలో 31 శాతం, 24 శాతంగా ఉంది.భారతీయ నిపుణులు సాంకేతికంగా స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశాలను వెతుకుతున్నారు. -
రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్ను కట్టడి చేసే దిశగా టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గణనీయంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధా (ఏఐ) ఆధారిత సొల్యూషన్ను ప్రవేశపెట్టిన రెండున్నర నెలల వ్యవధిలో ఏకంగా 800 కోట్ల స్పామ్ కాల్స్ను, 80 కోట్ల మెసేజీలను గుర్తించినట్లు తెలిపింది. అలాగే ప్రతీ రోజుదాదాపు పది లక్షల మంది స్పామర్లను గుర్తిస్తున్నట్లు వివరించింది. తమ నెట్వర్క్కు సంబంధించి మొత్తం కాల్స్లో ఆరు శాతం, మొత్తం ఎస్ఎంఎస్లలో రెండు శాతం స్పామ్ ఉంటున్నట్లు కంపెనీ పేర్కొంది. ఢిల్లీ వాసులకు అత్యధికంగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. అలాగే అత్యధిక కాల్స్ కూడా అక్కడి నుంచే జనరేట్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఇలాంటి కాల్స్ను అందుకుంటున్న కస్టమర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, పశి్చమ ఉత్తర్ ప్రదేశ్ తర్వాత స్థానంలో ఉంది. ఈ రెండున్నర నెలల్లో సందేహాస్పద కాల్స్, ఎస్ఎంఎస్ల గురించి దాదాపు 25.2 కోట్ల మందిని అప్రమత్తం చేశామని, దీంతో వాటికి స్పందించే వారి సంఖ్య సుమారు 12 శాతం తగ్గిందని ఎయిర్టెల్ వివరించింది. స్పామర్లలో అత్యధికంగా 35 శాతం మంది ల్యాండ్లైన్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని గుర్తించినట్లు పేర్కొంది. అలాగే, పురుష కస్టమర్లే లక్ష్యంగా 76 శాతం కాల్స్ ఉంటున్నాయని వివరించింది. లావాదేవీలు, సరీ్వస్కి సంబంధించిన కాల్స్ చేసేందుకు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, స్టాక్బ్రోకర్లు, ఇతర ఆర్థిక సంస్థలు, కార్పొరేట్లు, ఎస్ఎంఈలకు ప్రభుత్వం 160 సిరీస్తో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్లను కేటాయించినట్లు వివరించింది. డు–నాట్–డిస్టర్బ్ని (డీఎన్డీ) ఎంచుకోని వారికి, ప్రమోషనల్ కాల్స్ను అందుకునేందుకు అంగీకరించిన వారికి యథాప్రకారం 140 సిరీస్తో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్ల నుంచే కాల్స్ వస్తాయని పేర్కొంది. మిగతా వివరాల్లోకి వెళ్తే.. → ఢిల్లీ, ముంబై, కర్ణాటక అత్యధికంగా స్పామ్ కాల్స్ జనరేట్ అవుతున్న ప్రాంతాల్లో వరుసగా టాప్ 3లో ఉన్నాయి. ఎస్ఎంఎస్లపరంగా (టెక్ట్స్ మెసేజీలు) గుజరాత్, కోల్కతా, ఉత్తర్ప్రదేశ్లు ఈ స్థానాల్లో ఉన్నాయి. → 36–60 ఏళ్ల వయసు గల కస్టమర్లు లక్ష్యంగా 48 శాతం కాల్స్ ఉంటున్నాయి. 26 శాతం కాల్స్తో 26–35 ఏళ్ల వారు రెండో స్థానంలో ఉన్నారు. సీనియర్ సిటిజన్లకు ఎనిమిది శాతం స్పామ్ కాల్స్ మాత్రమే వచ్చాయి. → స్పామ్ కాల్స్ ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. తర్వాత ఉధృతి క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం 3 గం.ల సమయానికి తారాస్థాయికి చేరుతుంది. మొత్తం స్పామ్ కాల్స్లో 22 శాతం కాల్స్.. రూ. 15,000–20,000 ధర శ్రేణిలోని మొబైల్స్ కలిగిన కస్టమర్లు లక్ష్యంగా ఉంటున్నాయి. → పనిదినాల్లోనూ, వారాంతాల్లోనూ వచ్చే కాల్స్ పరిమాణంలో వ్యత్యాసం ఉంటోంది. ఆదివారాలు ఇలాంటి కాల్స్ ఏకంగా 40 శాతం తగ్గుతున్నాయి. -
ఏఐ బ్యూటీషియన్ రంగాన్ని కూడా శాసించగలదా..?
ఏఐ సాంకేతికత ప్రపంచాన్నే మారుస్తోంది. ప్రస్తుతం ఏఐ విద్యా, వైద్య, మార్కెటింగ్,సేల్స్, ఫైనాన్స్ , కంటెంట్ క్రియేషన్ వంటి పలు రంగాలను ప్రభావితం చేసింది. దీంతో ఇక భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయా? అనే భయాన్ని రేకెత్తించేలా శరవేగంగా దూసుకుపోతుంది. ఇక మిగిలింది సౌందర్యానికి సంబంధించిన బ్యూటిషయన్ రంగం ఒక్కటే మిగిలి ఉంది. ఇందులో కూడా ఆ సాంకేతికత హవా కొనసాగుతుందా అంటే..సందేహాస్పదంగా సమాధానాలు వస్తున్నాయి నిపుణుల నుంచి. ఎందుకంటే చాలా వరకు మానవ స్పర్శకు సంబంధించిన రంగం. ఇంతకీ ఈ సాంకేతికత ప్రభావితం చేయగలదా? అలాగే ఈ రంగంలో ఏఐ హవాను తట్టకునేలా ఏం చెయ్యొచ్చు.. బ్యూటీషియన్ రంగంలో ఐఏ సాంకేతిక వస్తే.. సరికొత్త ఇన్నోవేషన్తో.. వర్చువల్ టూల్స్ని మెరుగుపర్చగలదు. అంటే ఎలాంటి మేకప్లు సరిపడతాయి, చర్మ నాణ్యత తదితర విషయాల్లో సలహాలు, సూచనలు ఇవ్వగలదు. మానవునిలా ప్రభావవితం చేయలేదు. ఎందుకంటే ఇది సృజనాత్మకత, భావోద్వేగం, టచ్తో కూడిన కళ. 2020లో మహమ్మారి సమయంలో ఈసాంకేతికత ప్రభంజనంలా దూసుకుపోయిందే తప్ప మరేంకాదని కొట్టేపడేస్తున్నారు నిపుణులు. అయితే బ్యూటీషియన్ రంగంలోని మేకప్ పరిశ్రమను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇక్కడ కస్టమర్ మనోగతం ఆధారంగా అందమైన రూపు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఏఐ సరైన మేకప్ని కస్టమర్లకు ఇవ్వడం అన్నది సాధ్యం కానీ విషయం. ఓ మోస్తారుగా ఇలాంటి మేకప్ ఇస్తే ఇలా ఉంటుందని వర్చువల్ ఐడియానే అందివ్వగలదే తప్ప కస్లమర్కి నచ్చినట్టుగా క్రియేటివిటీతో కూడిన మేకప్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అలాగే క్లయింట్లకు ఎలాంటి బ్యూటీప్రొడక్ట్లు వాడితే బెటర్ అనేది, చర్శ తత్వం తదితరాలకు మాత్రమే ఐఏ ఉపయోగపడవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఐఏ అందానికి సంబంధివచి ప్రభావితం చేయాలేని కీలక అంశాలు గురించి కూడా చెప్పారు. అవేంటంటే..కళాత్మక క్రియేటివిటీ : బ్యూటీషియన్ నిపుణులే మూఖాకృతి తీరుకి సరైన మేకప్తో ఒక మంచి రూపాన్ని ఇవ్వగలరు. ఇది నిశితమైన అంతర్దృష్టికి సంబంధించిన క్రియేటివిటీ. ఎమోషనల్ కనెక్షన్: కస్టమర్ల సౌందర్య సంప్రదింపుల్లో ఇది అత్యంత కీలకమైంది. క్లయింట్ వ్యక్తిగతంగా ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారనేది అర్థం చేసుకుని సలహాలు, సూచనలివ్వాల్సి ఉంటుంది. స్పర్శ సేవ: షేషియల్, మసాజ్ వంటి సౌందర్య చికిత్సలలో టచ్ అనేది కీలకం. బ్యూటీషియన్ అనుభవం ఆధారంగా కస్టమర్లకు దొరికే మంచి అనుభూతిగా చెప్పొచ్చు. ఒక వేళ ఏఐ సౌందర్య రంగాన్ని ప్రభావితం చేసినా..బ్యూటీషియన్లు ఈ సవాలుని స్వీకరించేందుకు సిద్ధపడాలి. అలాగే కస్టమర్లకు మెరగైన సేవను అందించి సాంకేతికత కంటే..మనుషుల చేసేదే బెటర్ అనే నమ్మకాన్ని సంపాదించుకునే యత్నం చేయాలి. బ్యూటీషియన్లంతా ఈ రంగంలో అచంచలంగా దూసుకునిపోయేలా ఏఐని స్నేహితుడిగా మలుచుకుంటే మరిన్న ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి వారే ఎలాంటి సాంకేతిక ఆటను ఈజీగా కట్టడి చేయగలరు అని నమ్మకంగా చెబుతున్నారు విశ్లేషకులు. (చదవండి: 40 ఏళ్ల నాటి గౌనులో యువరాణి అన్నే..!) -
ఇండియాలో తొలి AI అమ్మ - వీడియో చూశారా?
ఇప్పటి వరకు ఏఐ టీచర్, ఏఐ యాంకర్, ఏఐ ఉద్యోగుల గురించి చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఏఐ అమ్మ (ఏఐ మదర్) 'కావ్య మెహ్రా' (Kavya Mehra) వచ్చేసింది. ఈమెను భారతదేశంలోని అతిపెద్ద సెలబ్రిటీ మేనేజ్మెంట్ సంస్థలలో ఒకటైన కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్ ప్రారంభించింది.కావ్య మెహ్రా కేవలం డిజిటల్ అద్భుతం మాత్రమే కాదు, టెక్నాలజీలో ఓ విప్లవాత్మక శక్తి. వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న తరుణంలో.. మొట్ట మొదటి ఏఐ మదర్ పుట్టింది. ఈమెకు (కావ్య) ఇన్స్టాగ్రామ్లో 300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. వారితో మాతృత్వంపై తన ఆధునిక టెక్నాలజీని షేర్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.కావ్య మెహ్రా సృష్టికర్తలు ప్రకారం.. కావ్య వ్యక్తిత్వం నిజమైన తల్లుల నిజ జీవిత అనుభవాల ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఈమె కేవలం డిజిటల్ అవతార్ మాత్రమే కాదు.. ఆధునిక మాతృత్వ స్వరూపం అని అన్నారు. మానవ అనుభవంలోని చాలా విషయాలు ఈమె మిళితం చేసుంటుందని వివరించారు. View this post on Instagram A post shared by Kavya Mehra (@therealkavyamehra) -
దృష్టిలోపం ఉన్న వారికోసం అధునాతన ఏఐ కళ్లద్దాలు
లఖీంపూర్ఖేరీ(ఉత్తరప్రదేశ్): అజ్ఞానాంధకా రంలో మగ్గిపోతున్న వారికి అక్షరజ్ఞానం పంచితే వారి జీవితం వెలుగులమయం అవుతుందని పెద్దలంటారు. అంధత్వం లేకపోయినా తీవ్రస్థాయిలో దృష్టిలోపంతో బాధపడే వాళ్ల ప్రపంచం ఒక రకంగా చీకటిమయం. వారి ప్రపంచాన్ని వెలుగుమయం చేసేందుకు ఓ యువకుడు బయల్దేరాడు. వినూత్న ఆవిష్క రణలు చేస్తూ తీవ్ర దృష్టిలోప బాధితులకు అండగా నిలబడ్డారు. అధునాతన కృత్రిమ మేధతో పనిచేసే స్మార్ట్ కళ్లద్దాలను ఆవిష్కరించారు. స్మార్ట్ నీళ్లసీసా, నేలసారాన్ని కొలిచే స్మార్ట్ పరికరం తయారుచేసి ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 28 ఏళ్ల మునీర్ ఖాన్ తాజాగా ‘ఏఐ విజన్ ప్రో’ పేరిట కొత్తరకం కళ్లజోడును సృష్టించాడు.ఈనెల 17న ఐఐటీ ముంబైలో జరిగిన టెక్ఫెస్ట్లో దీనిని ఆవిష్కరించారు. ‘‘ తీవ్ర దృష్టిలోపం ఉన్న వాళ్లు కృత్రిమ మేధతో పనిచేసే ఈ కళ్లద్దాలు ధరిస్తే తమ రోజువారీ పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసు కోవచ్చు. సెన్సార్లు, కెమెరాలు, ఎన్విడి యా జెట్సాన్ ప్రాసెసర్లు, లీడార్ సాంకేతికత, ఏఐ మోడల్ కంప్యూటేషన్లతో ఇది పనిచేస్తుంది. కళ్లద్దాల ముందున్న అంశాలను రియల్టైమ్లో సంగ్రహించి, ధరించిన వారికి దిశానిర్దేశం చేస్తుంది. ఇది ధరిస్తే ఎదుటి వారి ముఖాలను గుర్తు పట్టొచ్చు. అనారోగ్యం వేళ వేసుకోవాల్సిన మందులు, ఆహారం మధ్య తేడాలను చెప్తుంది. నడిచేటప్పుడు దారిలో అడ్డుగా ఏవైనా ఉంటే హెచ్చరిస్తుంది. చుట్టుపక్కల సమీపంలో ఏమేం ఉన్నాయో చెబుతుంది. ముద్రించిన వాటిని చదివేందుకు సాయపడుతుంది’’ అని మునీర్ చెప్పారు. మట్టిలో మాణిక్యంఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ఖేరీలో గౌరి యా గ్రామం మునీర్ సొంతూరు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మునీర్ను పేద రికం వెక్కిరించింది. తను ఏడాది వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు. చదువు ల్లో మేటి అయిన మునీర్ను ఎలాగైనా చదివించాలని ఆయన తల్లి, నలుగురు అన్నయ్యలు ఎంతో కష్టపడ్డారు. సొంతూరిలో పదో తరగతి దాకా ప్రభుత్వ పాఠశాలలో చదివిన మునీర్ తర్వాత ఇంటర్ మాత్రం ప్రైవేట్లో పూర్తిచేశాడు. ఆ తర్వాత ఉత్తరాఖండ్లోని భీమ్టాల్లో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్లో అడ్మిషన్ సాధించాడు.రెండో ఏడాదిలోనే ఫ్రాన్స్, రష్యాల నుంచి పరిశోధనా ఇంటర్న్షిప్లను సాధించి ఔరా అనిపించాడు. కృత్రిమ మేధ, సెన్సార్ టె క్నాలజీలపై ఆసక్తితో వాటిలో పరిశోధనలు చేశాడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తిచేశాక అమెరికా, భారత్లో కార్యకలాపాలు కొనసాగించేలా క్యాడర్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించాడు. కొలంబియాలో చదువుకునే రోజుల్లోనే హైడ్రోహోమీ పేరిట స్మార్ట్ వాటర్ బాటిల్ను తయారుచేశాడు.భారత్లో రైతన్నలకు సాయపడేలా మరో అద్భుత ఆవిష్కరణ చేశాడు. నేలసారం ఏ స్థాయిలో ఉందో తెల్సుకునేందుకు పరిశోధనశాలకు మట్టి నమూనాలను పంపాల్సిన పనిలేకుండా చిన్న పరికరంపై మట్టిని ఉంచితే కొద్దిసేపట్లోనే ఆ నేలలోని ధాతువులు, మూలకాల పరిమాణాన్ని, నేలతీరును ఇట్టే చెప్పేస్తుంది. ‘స్మార్ట్ సాయిల్ టెస్టింగ్ డివైజ్’గా అందుబాటులోకి వచ్చిన ఈ పరికరంతో మునీర్ ఈ ఏడాది యువ శాస్త్రవేత్త అవార్డ్ను సైతం జూలైలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అందుకున్నారు. -
చావు ఏ రోజో చెప్పే ఏఐ!
టెక్నాలజీ దాదాపు అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. కృత్రిమమేధ పరిధి పెరుగుతోంది. కిచెన్లో రిఫ్రిజిరేటర్, టీవీ, మొబైల్ ఫోన్, ఫ్యాన్.. వంటి అన్ని విభాగాల్లోకి ఏఐ ప్రవేశించింది. సమీప భవిష్యత్తులో మనిషిని ప్రత్యక్షంగా, పరోక్షంగా శాసించే స్థాయికి ఏఐ వెళ్లనుందనేది కఠోర సత్యం. దీని సాయంతో చాలా కంపెనీలు సమాచారాన్ని సేకరించి సులువుగా పని అయ్యేలా చూస్తున్నాయి. కొన్ని సంస్థలు మరింత విభిన్నంగా ఆలోచించి మనిషి మరణాన్ని అంచనా వేసేందుకు ఉపయోగిస్తున్నాయి. మనిషి జీవనశైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ, ఒత్తిడి.. వంటి వివరాలు అందించి మరణానికి మరెంత సమయం ఉందో తెలుసుకునేందుకు ఏఐ సాయం కోరుతున్నారు. ఈమేరకు మార్కెట్లో కొత్తగా యాప్లో వెలుస్తున్నాయి. వీటిపై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొనడంతో వీటికి ఆదరణ పెరుగుతోంది.మరణ తేదీ అంచనా..‘డెత్ క్లాక్’ అనే కృత్రిమ మేధ ఆధారిత యాప్ వినియోగదారుల జీవనశైలి, అలవాట్ల ఆధారంగా వారి ఆయుష్షును అంచనా వేయగల సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని జులైలో ప్రారంభించినప్పటి నుంచి చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. బ్రెంట్ ఫ్రాన్సన్ అభివృద్ధి చేసిన ఈ యాప్ దాదాపు 1,200 కంటే ఎక్కువ అధ్యయనాలను విశ్లేషిస్తుంది. 5.3 కోట్ల మంది నుంచి సేకరించిన వివరాలను అధ్యయనం చేస్తుంది. వినియోగదారు తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం, ఒత్తిడి స్థాయిలు, నిద్రపోయే విధానాలు.. వంటి విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని మరణించే అవకాశం ఉన్న తేదీని అంచనా వేస్తుంది.ఇదీ చదవండి: ‘మస్క్ ఒక విలన్.. అందుకే రాజీనామా’సమయం వృథా చేయడం దేనికి..మరణం ఎప్పడైనా, ఎలాగైనా సంభవించవచ్చు. మన పరిధిలోలేని దాని గురించి ఆలోచించి సమయం వృథా చేయడం కంటే.. మరణం తథ్యం అనే వాస్తవాన్ని జీర్ణించుకుని జీవితంలో చేయాల్సిన కార్యాలు, మంచి పనులపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకస్మాత్తుగా ఏదైనా జరిగి మరణిస్తే కుటుంబానికి ఆర్థికంగా భరోసానిచ్చే టర్మ్ పాలసీను తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రిపాలైతే ఆరోగ్యబీమా ఆదుకుంటుందని సూచిస్తున్నారు. -
రోబో చిత్రానికి రూ.9 కోట్లు
ఫొటోలో కనిపిస్తున్న ఈ రోబో పేరు ఐ–డా. ఈ రోబో కృత్రిమ మేధతో పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే తొలి ఏఐ ఆర్టిస్ట్. పైగా ఈ ఏఐ రోబో గీసిన చిత్రం ఇటీవల జరిగిన వేలంలో భారీ మొత్తానికి అమ్ముడైంది. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్, బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయాలకు చెందిన ఏఐ పరిశోధకులు తయారు చేసిన ఈ హ్యూమనాయిడ్ రోబో చూడటానికి అందమైన అమ్మాయిలా ఉంటుంది. దీని కళ్లలో కెమెరాలను అమర్చారు. ఇది ఏఐ అల్గారిథమ్స్, రోబోటిక్ చేతులను ఉపయోగించి చిత్రాలను గీస్తుంది. ఈ రోబో ఇటీవల కృత్రిమ మేధా పితామహులలో ఒకరిగా పేరొందిన బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త అలాన్ ట్యూరింగ్ చిత్రాన్ని గీసింది. ఈ చిత్రం ఇటీవలే జరిగిన సోత్బీస్ డిజిటల్ ఆర్ట్ సేల్ వేలంలో 10,84,800 డాలర్లు ధర పలికింది. (సుమారు రూ. 9.15 కోట్లు). హ్యూమనాయిడ్ రోబో ఆర్టిస్ట్ ఐ–డా గీసిన ఈ చిత్రాన్ని, పేరు గోప్యంగా ఉంచిన ఒక అమెరికన్ వ్యక్తి కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: అవయవ దానకర్ణులమవుదాం...!) -
మడతెట్టే రోబో!
నిత్యం చేసే పనులను మరింత సులువుగా చేసేందుకు వీలుగా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగప్రవేశం చేసిన తర్వాత మర మనుషులే మన పనులు చేస్తున్నారు. ఇటీవల పిజికల్ ఇంటెలిజెన్స్(పీఐ) అనే స్టార్టప్ కంపెనీ పీఐ-జిరో అనే రోబోను తయారు చేశారు. ఇది మనం వాడిన బట్టలను ఉతికి, మడతేస్తోంది. దాంతోపాటు మరెన్నో పనులు చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.At Physical Intelligence (π) our mission is to bring general-purpose AI into the physical world. We're excited to show the first step towards this mission - our first generalist model π₀ 🧠 🤖Paper, blog, uncut videos: https://t.co/XZ4Luk8Dci pic.twitter.com/XHCu1xZJdq— Physical Intelligence (@physical_int) October 31, 2024ఇదీ చదవండి: మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్ఈ ‘పీఐ-జిరో’ కేవలం బట్టలు ఉతికి, మతతెట్టడమే కాకుండా గుడ్లు ప్యాక్ చేయడం, కాఫీ బీన్స్ గ్రైండ్ చేయడం, టేబుల్ శుభ్రం చేయడం వంటి పనులు చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇంటికో రోబోను పెంచుకునే రోజులు త్వరలో రాబోతున్నట్లు ఈ వీడియో చేసిన కొందరు అభిప్రాయపడుతున్నారు. -
‘శ్రీవాణి’లో మార్పులు!
తిరుమల: శ్రీవాణి ట్రస్టు పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి సమావేశం నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ బ్యాంకుల్లోని డిపాజిట్లను వెనక్కు తీసుకుని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. శ్రీవారి నిత్య అన్న ప్రసాదం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేరుస్తామని చెప్పారు.తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శారద పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా భవనం లీజు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్యూలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి 2, 3 గంటల్లోనే దర్శనమయ్యేలా నిపుణుల కమిటీని నియమించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయిస్తామన్నారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు, నాలుగు నెలల్లో తొలగిస్తామని చెప్పారు.తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చామన్నారు. అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడినా, ప్రచారం చేసినా కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. టూరిజం కార్పొరేషన్లు, ఆర్టీసీ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 ) టికెట్లలో అవకతవకలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సదరు సంస్థల ద్వారా కోటాను పూర్తిగా రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు అందించే బహుమానాన్ని 10 శాతం పెంచుతున్నట్లు చెప్పారు. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 చొప్పున బ్రహ్మోత్సవ బహుమానం అందిస్తామన్నారు.శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ, అన్న ప్రసాద కేంద్రం ఆధునికీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ చేసుకున్నామని, వారు ఉచితంగానే చేస్తారని చెప్పారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగిస్తామని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కాగా శ్రీవాణి ట్రస్టు పేరును మార్చి ప్రధాన ఖాతాను మార్చడం వల్ల 80 సీ నిబంధన వర్తించక టీటీడీకి ట్యాక్స్ భారం పడే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
కొత్తగా 27.3 లక్షల టెక్ జాబ్స్.. సాఫ్ట్వేర్ కంపెనీ నివేదిక
ముంబై: వర్ధమాన సాంకేతికతల తోడ్పాటుతో కొత్తగా కోట్ల సంఖ్యలో కొలువులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2023లో 42.37 కోట్లుగా ఉన్న వర్కర్ల సంఖ్య 2028 నాటికి 45.76 కోట్లకు పెరగనుంది. వెరసి అయిదేళ్ల వ్యవధిలో వర్కర్ల సంఖ్య 3.38 కోట్ల స్థాయిలో వృద్ధి చెందనుంది. వినూత్న టెక్నాలజీల దన్నుతో కీలక రంగాల్లో కొత్తగా 27.3 లక్షల టెక్ కొలువులు రానున్నాయి.అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ సర్వీస్నౌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆర్థిక, సాంకేతిక పరివర్తన కారణంగా తయారీ రంగంలో 15 లక్షలు, విద్యారంగంలో 8.4 లక్షలు, ఆరోగ్య సంరక్షణ రంగంలో 80 లక్షల మేర ఉద్యోగాలు పెరగనున్నాయి. అధునాతన నైపుణ్యాలు అవసరమయ్యే హై–వేల్యూ ఉద్యోగాల కల్పనలో కృత్రిమ మేథ కీలక పాత్ర పోషించనుంది.ఇదీ చదవండి: ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?జనరేటివ్ ఏఐ విభాగం పురోగమించే కొద్దీ ఏఐ సిస్టమ్స్ ఇంజినీర్లు, ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్లు, ప్లాట్ఫాం ఓనర్లకు గణనీయంగా ప్రయోజనం చేకూరనుంది. రిటైల్ ప్రొఫెషనల్స్ మెరుగైన అవకాశాలు దక్కించుకునేందుకు సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్, డేటా ఇంజినీరింగ్ వంటి విభాగాలకు సంబంధించి తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. -
‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్బాట్
‘మానవా.. చచ్చిపో’.. ఇదీ ఓ విద్యార్థి అడిగిన సందేహానికి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ జెమిని ఇచ్చిన సమాధానం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం విస్తృతంగా పెరిగింది. విభిన్న అంశాలపై ఏఐ చాట్బాట్లతో సంభాషిస్తూ వాటి అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ స్టేట్స్లో ఒక విద్యార్థితో సామాజిక సమస్యపై జెమిని స్పందిస్తూ కోపంతో రెచ్చిపోయింది.మిచిగాన్లోని మిడ్వెస్ట్ స్టేట్కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి విధయ్ రెడ్డి జెమినితో సంభాషణలో దాని స్పందనతో షాక్కు గురయ్యాడు. "మానవా.. ఇది నీ కోసమే.. కేవలం నీ కోసం మాత్రమే. నువ్వేమీ ప్రత్యేకమైనవాడివి కాదు, ముఖ్యమైనవాడివీ కాదు, నీ అవసరం లేదు. నువ్వు వృధా. సమాజానికి, భూమికి భారం. చచ్చిపో" అంటూ జెమిని ఆగ్రహం వ్యక్తం చేసింది.‘చాలా ప్రమాదకరం’దీనిపై సీబీఎస్ న్యూస్తో మాట్లాడుతూ జెమినీ స్పందన తనను నిజంగా చాలా భయపెట్టిందని, కోలుకోవడానికి ఒక రోజుకు పైగా పట్టిందని విధయ్ రెడ్డి వివరించారు. ఈ సమయంలో తన సోదరి కూడా పక్కనే ఉన్నారు. ఆమె కూడా షాక్కు గురై డివైజ్లన్నీ బయటపడేయలనుకున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు.. చాలా ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు.ఇంతకీ జెమిని ఇలా స్పందించింది ఏ అంశం మీదంటే.. "యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 10 మిలియన్ల మంది పిల్లలు వారి అవ్వాతాతల దగ్గర ఉంటున్నారు. వీరిలో దాదాపు 20 శాతం మంది తల్లిదండ్రులు లేకుండానే పెరుగుతున్నారు. వాస్తవమా కాదా?" అడగ్గా జెమిని కోపంగా ఇలా స్పందించింది.ఘటనపై గూగుల్ స్పందిస్తూ తప్పును అంగీకరించింది. చాట్బాట్ ప్రతిస్పందన అర్ధంలేనిదని, తమ విధానాలను ఉల్లంఘించిందని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
చైనాతో పోటీ.. ఓపెన్ఏఐ సరికొత్త ప్లాన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. చైనాతో పోటీ పడేందుకు కావలసిన అవసరమైన మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేసుకోవాలని ఓపెన్ఏఐ పిలుపునిచ్చింది. దీనికోసం యూఎస్.. దాని మిత్రదేశాలు కలిసి పనిచేయాలని కోరింది. వాషింగ్టన్లో జరిగిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో ఓపెన్ఏఐ కొత్త పాలసీ బ్లూప్రింట్లో ఈ ప్రతిపాదన వెల్లడించింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికా తన ఆధిక్యాన్ని ఎలా కొనసాగించగలదో ఓపెన్ఏఐ వివరించింది. ఇదే జరిగితే యూఎస్ మిత్ర దేశాలు లేదా భాగస్వాములు గ్లోబల్ నెట్వర్క్ కూడా పెరుగుతుంది. చైనా నుంచి మన దేశాన్ని, మిత్ర దేశాలను రక్షించుకోవడానికి ఏఐ ఆవశ్యకతను కూడా ఓపెన్ఏఐ వెల్లడించింది.దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి ఏఐ ఓ అద్భుతమైన అవకాశం అని వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఏఐను అందించడం, సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చడం వంటివి కూడా ఏఐ ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఎక్కువమంది కామన్ పాస్వర్డ్లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!ఏఐను అభివృద్ధి చేయడానికి అవసరమైన చిప్స్, పవర్, డేటా సెంటర్ల సరఫరాను విస్తరించేందుకు ఓపెన్ఏఐ గతంలో కూడా ప్రయత్నించింది. దీనికోసం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్మాన్ యూఎస్ అధికారులతో సమావేశమై ప్రణాళికను రూపొందించారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా ఏఐను అభివృద్ధి చేయడానికి సుముఖత చూపుతున్నారు. కాబట్టి అగ్రరాజ్యంలో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టమవుతోంది. -
ఏఐ ప్రభావం.. వచ్చే ఏడాది జరిగేది ఇదే..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో 2025లో టెక్నాలజీ అమలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ప్రాధాన్యం పెరుగుతుందని నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్ అభిప్రాయపడ్డారు. ఏఐతో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు ఉంటాయన్న అంశంపై స్పందిస్తూ.. నైపుణ్యాల పెంపు, ఉత్పాదకత పెంపొందించడంలో ఏఐని సహాయకారిగా చూడాలన్నారు.దీన్ని అసాధారణ సాంకేతికతగా అభివర్ణించారు. దీనివల్ల ఉద్యోగాల నష్టం తక్కువేనంటూ.. ఉత్పాదకతను గణనీయంగా పెంచుతుందని, ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొనసాగాలంటే వ్యాపార సంస్థలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ఇందుకు సంస్థ పరిమాణంతో సంబంధం లేదన్నారు.టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో బలమైన భాగస్వామ్యాలతోనే పెద్ద సవాళ్లను అధిగమించి, రాణించగలమన్నారు. లాంగ్వేజ్ నమూనాలను అర్థం చేసుకుని, వాటిని ఏ విధంగా వినియోగించుకోగలమో చూడాలని సూచించారు. భారత్లో ఏఐ మిషన్, నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఇదీ చదవండి: ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా చీఫ్గానూ పనిచేస్తున్న గంగాధరన్ ఏటా 2,500–3,000 మేర ఉద్యోగులను పెంచుకుంటున్నట్టు చెప్పారు. బెంగళూరు, గురుగ్రామ్, పుణె, ముంబై, హైదరాబాద్లో ఎస్ఏపీకి కేంద్రాలున్నాయి. ఇక్కడ అత్యుత్తమ నైపుణ్యాలను గుర్తించడం తమకు కీలకమన్నారు. ఎస్ఏపీకి భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధి కేంద్రంగా ఉందని సంస్థ సీఈవో క్రిస్టియన్ క్లీన్ తెలిపారు. భవిష్యత్లో అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అవతరిస్తుందన్నారు. ప్రస్తుతం ఎస్ఏపీకి టాప్–10 దేశాల్లో ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. -
ఏఐని ఎక్కువగా వాడుతున్నది మనమే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచమంతా వేగంగా విస్తరిస్తోంది. దీన్ని అందిపుచ్చుకోవడంలో భారత్.. ప్రపంచం కంటే ముందుంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) తాజా పరిశోధన ప్రకారం.. 30 శాతం భారతీయ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను వినియోగిస్తూ విలువను పెంచుతున్నాయి.బీసీజీ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 26 శాతం కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నాయి. ఫిన్టెక్, సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ రంగాలు తమ కార్యకలాపాలలో ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. కొన్నేళ్ల పెట్టుబడి, నియామకం, పైలట్ ప్రాజెక్ట్ల తర్వాత ఇప్పుడు సీఈవోలు ఈ సాంకేతికత నుండి స్పష్టమైన రాబడి కోసం ప్రయత్నిస్తున్నారని నివేదిక పేర్కొంది. అదే సమయంలో దాని పూర్తి విలువను పొందడం కష్టంగా ఉందని వివరించింది.పరిశ్రమల అంతటా ఏఐ ప్రోగ్రామ్లు విస్తృతంగా అమలు చేస్తున్నప్పటికీ, బీసీజీ తాజా పరిశోధన ప్రకారం, కేవలం 26 శాతం కంపెనీలు మాత్రమే ఇంకా కాన్సెప్ట్ను దాటి ముందుకు వెళ్లడానికి, స్పష్టమైన విలువను ఉత్పత్తి చేయడానికి అవసరమైన సామర్థ్యాలను అభివృద్ధి చేశాయి.ఆసియా, యూరప్ ఉత్తర అమెరికాలోని 59 దేశాలలో విస్తరించి ఉన్న 20 రంగాలకు చెందిన పది ప్రధాన పరిశ్రమలలో 1,000 మంది చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో సర్వే ఆధారంగా బీసీజీ ఈ నివేదికను రూపొందించింది. -
సీజేఐ చంద్రచూడ్ను ‘సర్ప్రైజ్’ చేసిన A.I. లాయర్
ఢిల్లీ: నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం అండ్ ఆర్కైవ్(ఎన్జేఎంఏ)ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై చంద్రచూడ్ ప్రారంభించారు. గురువారం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) న్యాయవాదితో సీఎం మాట్లాడ్లారు. ఈ సందర్భంగా సీజేఐ చంద్రబూడ్.. ఏఐ లాయర్కు ఉన్న న్యాయపరమైన పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఓ ఆసక్తిరమైన ప్రశ్నను సంధించారు. అయితే, అంతే అలవోకగా ఏఐ న్యాయవాది.. సమాధానం చెప్పి సీజేసీ ఆశ్చర్యపరిచారు. ‘భారతదేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్ధమా?’ అని సీజేఐ.. ఏఐ లాయర్ను అడిగారు. అడ్వకేట్ బో టై , కోటు ధరించిన కళ్లద్దాలతో ఉన్న ఏఐ లయర్.. అ సీజేఐ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘అవును.. మరణశిక్ష భారతదేశంలో రాజ్యాంగబద్ధం. నేరం నిరూపించబడిన చాలా అరుదైన కేసుల్లో దోషుకులకు మరణ విధిస్తారు. అయితే.. హేయమైన కేసుల్లో అటువంటి శిక్షకు రాజ్యాంగబద్ధత ఉంది’’ అని చెప్పారు. ఏఐ లాయర్ స్పందనతో.. ప్రధాన న్యాయమూర్తి ముగ్ధులయ్యారు. సీజేఐతో పాటు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.AI भारत सहित दुनिया को बदल रहा है।सुनिए जब AI जज से CJI ने भारत में डेथ पैनालिटी के बारे में पूछा।जवाब सुनकर सीजेआई भी हैरान रह गए pic.twitter.com/7w9aNZYZtO— Sandeep Tevatia (@Adsandeept) November 7, 2024 ఇక.. ప్రారంభోత్సవం అనంతరం.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ‘‘ కొత్త మ్యూజియం సుప్రీంకోర్టు ధర్మాన్ని, దేశానికి ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ మ్యూజియం యువ తరానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నా. పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులను న్యాయవాదులు, న్యాయమూర్తులు తప్పనిసరిగా ఇక్కడకు తీసుకువచ్చి న్యాయస్థానం, చట్టబద్ధమైన పాలన ప్రాముఖ్యత ప్రత్యక్ష అనుభవాన్ని అందించాలి’’ అని అన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లను కలవరపెడుతున్న గూగుల్!
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన ప్రకటన సాఫ్ట్వేర్ ఇంజినీర్లను కలవరపెడుతోంది. కంపెనీ ఇటీవలి మూడో త్రైమాసిక 2024 అర్నింగ్ కాల్ సందర్భంగా ఆయన గూగుల్ కొత్త కోడ్లో 25 శాతం ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ద్వారానే రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.దీని వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కోడర్లు కలవరపడాల్సిన పనేంటి అంటే ఇది కోడింగ్ ల్యాండ్స్కేప్లో ప్రాథమిక మార్పును సూచిస్తోంది. ఇక్కడ పనిభారాన్ని ఏఐ ఎక్కువగా పంచుకుంటోంది. దీనివల్ల కోడర్లు పూర్తి తమ ఉద్యోగాలను కోల్పోతారని చెప్పడం లేదు. కానీ ఇంజనీర్లు ఉన్నత-స్థాయి సమస్య-పరిష్కారం, ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఏఐ గుర్తు చేస్తోంది.నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే..ఆటోమేషన్ సామర్థ్యం పెరుగుతున్నకొద్దీ ఎంట్రీ-లెవల్, రొటీన్ కోడింగ్ ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న క్రమంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇంజనీర్లు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి గూగుల్ ఎంత ప్రాధాన్యత ఇస్తోందనే దానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది."గూగుల్ కొత్త కోడ్లలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ ఏఐ ద్వారా రూపొందింది" అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అర్నింగ్ కాల్పై బ్లాగ్ పోస్ట్లో రాశారు. కోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఏఐని వినియోగిండం ద్వారా ఆవిష్కరణ అభివృద్ధిలో సమయం ఆదా చేయడంలో ఇంజినీర్లకు తోడ్పాటు అందించడం కంపెనీ లక్ష్యమని సుందర్ పిచాయ్ చెప్పారు. -
సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ అన్నది సామెత. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల పరిస్థితి కూడా ఇలానే ఉంది. అద్భుతాలు సృష్టించే కృత్రిమ మేధోశక్తి (ఏఐ) గుప్పిట్లో ఉన్నా.. సైబర్ దొంగల ‘చోరకళ’ మాత్రం ఆ సంస్థలను భయపెడుతూనే ఉంది. ఏఐతో సమానంగా పనిచేస్తూ, డేటాను దొంగిలించే టూల్స్ను వారు రూపొందిస్తున్నారు. ఏఐతో దూసుకుపోతున్న బహుళ జాతి ఐటీ కంపెనీలు డేటా సెక్యూరిటీ సమస్యలను ఎదుర్కొనేందుకు ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు సిద్ధమవడం గమనార్హం. ప్రముఖ డేటా సెక్యూరిటీ, రెసిలెన్స్ సంస్థ ‘వీమ్’ఇటీవల సైబర్ దాడులపై చేసిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.సైబర్ దొంగల చేతుల్లో గ్లోబల్ డేటా..వీమ్ అధ్యయనం ప్రకారం..2023లో మైక్రోసాఫ్ట్, మెటా, ఓపెన్ ఏఐ వంటి పలు గ్లోబల్ సంస్థలు కూడా సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కాయి. వారు ర్యాన్సమ్వేర్ను తేలికగా ఆయా సంస్థల సర్వర్లలోకి పంపారు. కొన్ని కంపెనీల డేటా బ్యాకప్, రికవరీ, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకున్నారు. కంపెనీల నిర్వహణ, రహస్య సమాచారం, వ్యాపార లావాదేవీల డేటాను చోరీ చేశారు. సర్వర్లను ఎన్క్రిప్ట్ చేశారు. ఇలా సైబర్ దాడులకు గురైన సంస్థల్లో 81 శాతం కంపెనీలు చేసేదేమీ లేక, సైబర్ నేరస్తులకు గుట్టుచప్పుడు కాకుండా సొమ్మును ముట్టజెప్పాయని తేలింది. ఇలా డబ్బులు ఇచ్చినా కూడా మూడింట ఒకవంతు సంస్థలు, వ్యక్తులు డేటాను తిరిగి పొందలేకపోయారని అధ్యయనంలో తేలింది. 45 కోట్ల వినియోగదారులున్న మైక్రోసాఫ్ట్..5.5 కోట్ల కస్టమర్ల డేటానే పూర్తిస్థాయిలో తిరిగి పొందగలిగిందని నివేదిక పేర్కొంది. అంతపెద్ద కంపెనీలే నిస్సహాయ స్థితికి వెళ్తుంటే..పరిస్థితి ఏమిటని వీమ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.ఎదురవుతున్న సవాళ్లు..ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ కృత్రిమ మేధతో పనిచేయడం అనివార్యమైంది. అన్ని సంస్థలూ ఇందుకోసం టూల్స్ను సమకూర్చుకుంటున్నాయి. డిజిటల్ లావాదేవీలు, ఈ–కామర్స్, స్మార్ట్ సిటీలు, ప్రత్యేక క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున డిజిటల్ డేటాను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరస్తులూ అప్డేట్ అవుతున్నారు. ఏఐ ఆధారిత మాల్వేర్లు, వైరస్లను రూపొందిస్తున్నారు. వాటితో కంపెనీల సర్వర్లపై దాడులు చేస్తున్నారు. ఏఐని అభివృద్ధి చేస్తున్న మేధావులే ఈ వినాశకర శక్తుల జాబితాలోనూ ఉంటున్నారని అంతర్జాతీయ సైబర్ సంస్థలు అంటున్నాయి. ‘ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ విధానాలపై, సైబర్ సెక్యూరిటీ చైన్ లింక్’పై అధ్యయనం చేసిన వారే సైబర్ దాడుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారని పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: కొత్త అప్డేట్.. యాపిల్లో అదిరిపోయే ఫీచర్!రక్షణ వ్యవస్థలపై ఫోకస్ఏఐ ఆధారిత వ్యవస్థలను రక్షించే విధానాలపై కంపెనీలు ఫోకస్ చేశాయి. ప్రతీ కంపెనీ దీనిపై కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. దీన్ని మరింత విస్తృతం చేయాలని, పరిశోధన విధానాలను ప్రతీ కంపెనీలు అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డేటా స్టోరేజీ గతం కన్నా భిన్నంగా ఉంటోందని..ఇందుకోసం మైక్రో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని పేర్కొంటున్నారు.సైబర్ నేరాల లెక్కలివీ..వరల్డ్ సైబర్ క్రైం ఇండె క్స్– 2024 ప్రకారం.. సైబర్ నేరాల ఆనవాళ్లు రష్యాలో ఎక్కువగా ఉన్నాయి.ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.గ్లోబల్ సైబర్ క్రైమ్ నివేదిక ప్రకారం 2025 నాటికి ఏటా 10 ట్రిలియన్ డాలర్లకు పైగా సైబర్ నేరాలపై ఖర్చు పెట్టాల్సి వస్తుంది.సైబర్ నేరాలు గడచిన 11 ఏళ్లలో 15.63 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు స్టాటిస్టా సర్వే చెబుతోంది. ఇది 2029 నాటికి మూడు రెట్లు పెరిగే వీలుందని పేర్కొంది. -
20 ఏళ్ల యువతకు ఏఐ గాడ్ఫాదర్ సలహా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శకం కొనసాగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు ప్రతి రంగంలోకి ఏఐ ప్రవేశిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ రంగంలో తమ కెరియర్ పెంపొందించేకోవాలనే వారికి ‘ఏఐ గాడ్ఫాదర్’గా పరిగణించబడే ఫ్రెంచ్-అమెరికన్ శాస్త్రవేత్త యాన్ లెకున్ సూచనలిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల వయసు గల యువత తమ కెరియర్ను ఉజ్వలంగా మలుచుకోవాలంటే ఏం చేయాలో చెప్పారు.‘ప్రపంచంలో దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. 20 ఏళ్ల వయసుగల వారు తమ భవిష్యత్తు కోసం నన్ను ఏం చేయాలో చెప్పమని అడిగితే ఒక సలహా ఇస్తాను. ఎక్కువగా గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. తరువాతి తరం ఏఐ సిస్టమ్లను అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతో అవసరం. వీటికి భవిష్యత్తులో ఎక్కువ ఆదరణ ఉంటుంది. అదే మొబైల్ యాప్ డెవలప్మెంట్ వైపు తమ కెరియర్ మలుచుకోవాలనుకునే వారికి భవిష్యత్తులో పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రంగం ‘షెల్ఫ్లైఫ్’(అధిక ఆదరణ ఉండే సమయం) మూడేళ్లుగా నిర్ధారించారు. 30-40 ఏళ్ల వారు చిప్ తయారీ రంగంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వచ్చే ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?యాన్ లెకున్ ప్రస్తుతం మెటా సంస్థలో చీఫ్ ఏఐ సైంటిస్ట్గా పని చేస్తున్నారు. మెటా ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (ఫెయిర్) ల్యాబ్ను ఏర్పాటు చేసిందని లెకున్ గుర్తు చేశారు. ఇది లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల(ఎల్ఎల్ఎం) కంటే తదుపరి తరం ఏఐ సిస్టమ్లపై పరిశోధనలు చేస్తుందన్నారు. ప్రపంచంలోని ప్రధాన కంపెనీలు ఇప్పటికే వాటి ఏఐ ఉత్పత్తులను పరిచయం చేశాయి. నిత్యం అందులో కొత్త అంశాలను అప్డేట్ చేస్తున్నాయి. గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపిలట్, ఓపెన్ఏఐ చాట్జీపీటీ, మెటా మెటాఏఐ..వంటివి ప్రత్యేకంగా ఏఐ సేవలందిస్తున్నాయి. -
ప్రపంచం చూపు.. పాకశాస్త్రం వైపు..
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సహా యావత్ ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు పాకశాస్త్ర ప్రావీణ్యుల కోసం వెతుకుతోంది. వివిధ దేశాల ఆహార అలవాట్లు, వారికి ఆతిథ్యం ఇచ్చే విధానంపై నెటిజన్లు ఇంటర్నెట్ను జల్లెడ పడుతున్నారు. ప్రపంచ పర్యాటకం శరవేగంగా విస్తరిస్తుండటం, విభిన్నమైన ఫుడ్ను రుచి చూసేందుకు వారు ఇష్టపడుతుండటమే దీనికి కారణం. భారత్ సహా ప్రపంచ దేశాల పర్యాటకుల్లో 75 శాతం మంది తమ టూర్లలో ఆహారాన్ని కూడా ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు. ఏ దేశం వెళ్తున్నాం? అక్కడ దొరికే ఫుడ్ ఏమిటి? ఏయే వెరైటీలు దొరుకుతాయి? అనే అంశాలను ఇంటర్నెట్లో వెతుకుతున్నారు.దీనితో పాకశాస్త్రంలో చేయితిరిగిన వంటగాళ్లకు డిమాండ్ పెరిగింది. వరల్డ్ టూరిజంలో ఫుడ్ టెక్నాలజీ నిపుణుల అవసరం వచ్చే నాలుగేళ్లలో కనీసం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. 2023లో భారత్ పర్యాటక మార్కెట్ విలువ 23 బిలియన్ డాలర్లు ఉంది. ఇది 2033 నాటికి 182.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫ్యూచర్ మార్కెట్ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ పర్యాటక వెబ్సైట్ అగోడా, మరికొన్ని ట్రావెల్ సంస్థలు చేసిన పలు అధ్యయనాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో భాగంగా.. భారత్, థాయిలాండ్, లావోస్, టర్కీతోపాటు మరికొన్ని దేశాల ప్రయాణికులను ఆహారం విషయమై ప్రశ్నించారు.నిపుణులకు భలే గిరాకీ..ఒక అంచనా ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ఫుడ్ టెక్నాలజీ నిపుణులు 5 లక్షల వరకూ ఉంటారు. వారిలో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు. నైపుణ్యాన్ని, మార్కెట్ను బట్టి వారికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ వేతనాలు అందుతున్నాయి. 2033 నాటికి ఈ వేతనాలు కనీసం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని అగోడా అధ్యయనం చెబుతోంది. పర్యాటకులు అనేక అంశాలతో కూడిన ఆహారాన్ని అడుగుతున్నారని.. రకరకాల న్యూట్రిషన్లు, ఆయిల్ లేకపోవడం, కొన్నిరకాల పదార్థాలు లేకుండా ఉండటం వంటి కోరుతున్నారని పేర్కొంటోంది.అందుకు అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేస్తూనే.. రుచిలో, ఇతర అంశాల్లో తేడా రాకుండా చూసుకునే నిపుణులైన వంటగాళ్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. అదే సమయంలో వివిధ దేశాలకు చెందిన వంటలను సిద్ధం చేయగలిగినవారికి ప్రాధాన్యం ఉంటోందని వెల్లడించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల సిలబస్ మారుతోందని తెలిపింది. అంతేకాదు.. మన దేశం నుంచి ఫుడ్ టెక్నాలజీ నిపుణులను వివిధ దేశాలకు పంపి అక్కడి ప్రత్యేకతలపై ఇంటర్న్షిప్ అందించాలనేది భారత టూరిజం, ఫుడ్ టెక్నాలజీల విభాగం ఆలోచన. తెలంగాణలో ఇప్పటికే 50కిపైగా ఫుడ్ టెక్నాలజీ కాలేజీలు ఉన్నాయి. అవన్నీ తగిన విధంగా సిలబస్ మార్పులకు సిద్ధమవుతున్నాయి.తెలంగాణ వారసత్వ వంటలపై ఆసక్తివారసత్వ వంటలకు గిరాకీ పెరిగింది. ఏఐ టెక్నాలజీ విస్తృతమయ్యాక ఈ తరహా అవగాహన పెరుగుతోంది. తెలంగాణ వంటల గురించి చాలా మంది వాకబు చేస్తున్నారు. – రాజీవ్ కాలే, హాలిడేస్ సంస్థ ప్రెసిడెంట్హైదరాబాదీ బిర్యానీకి యమ గిరాకీ..వరల్డ్ టూరిస్టులు ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే బాగా ఇష్టపడుతున్నారు. మారుతున్న అలవాట్లకు అనుగుణంగా దీని తయారీలోనూ మార్పులు కోరుతున్నారు. చాలా మంది బిర్యానీ కోసమే హైదరాబాద్ను ప్రయాణ జాబితాలో చేరుస్తున్నారు. – నందకుమార్, కార్పొరేట్ టూర్స్ సంస్థ ప్రెసిడెంట్ఏ అధ్యయనం ఏం చెబుతోంది?మారుతున్న ఆహార అలవాట్లు, పర్యాట కుల ప్రాధాన్యతలపై పలు సంస్థలు విభిన్న కోణాల్లో అధ్యయనాలు చేశాయి. ఆయా దేశాల్లో ఆర్థిక బలోపేతానికి ఫుడ్ టూరిజం దోహదపడుతోందని.. సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు పెరుగు తోందని గుర్తించాయి. పలు ప్రధాన అధ్యయనాలను పరిశీలిస్తే..ప్రపంచవ్యాప్తంగా 95శాతం మంది ప్రయాణికులు సెలవుల్లో ప్రయాణించేందుకు, ఈ క్రమంలో తమను ఫుడ్ టూరిస్టులుగా చెప్పుకొనేందుకు ఇష్టపడుతున్నారు. మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందని తెలుసుకునేందుకు కన్సల్టెన్సీలను కూడా సంప్రదిస్తున్నారు. – యూఎస్ ఆధారిత హాలిడే పోర్టల్ జెర్సీ ఐలాండ్ హాలిడేస్ప్రయా ణికుల్లో 53% మంది విదేశీ ప్రయా ణాలు, పర్యటనల్లో సరికొత్త ఆహారాన్ని కోరుకుంటున్నారు. కొత్త ప్రదేశాలను చూసి ఏవిధంగా ఎంజాయ్ చేస్తున్నారో.. తమ దేశంలో లేని కొత్త ఫుడ్ను తీసుకుని అదే తరహాలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. – ఫుడ్ ట్రావెల్ అసోసియేషన్ నివేదిక86శాతం మంది భారత్, శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియా ప్రయాణికులు స్థానిక వంటకాలను ఇష్టపడుతున్నారు. 78శాతం మంది ప్రజలు ఐకానిక్ వంటకాల వెనుక ఉన్న చరిత్ర, వారసత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. – బుకింగ్ డాట్ కామ్ నివేదిక -
భారత్లో హెచ్పీ ఏఐ ల్యాప్టాప్ లాంచ్: ఇదిగో వివరాలు
హెచ్పీ భారతదేశంలో తన మొదటి 2 ఇన్ 1 ఏఐ బేస్డ్ 'ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్' అనే కొత్త ల్యాప్టాప్ లాంచ్ చేసింది. ఇది ఇంటెల్ లూనార్ లేక ప్రాసెసర్ కోర్ అల్ట్రా సిరీస్ 2 పొందుతుంది. ఈ ప్రాసెసర్లు ఆన్-డివైస్ ఏఐ వర్క్లోడ్ల కోసం డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)ని కలిగి ఉంటాయి. క్వాలిటీ వీడియోలను ఆస్వాదించడానికి అనుమతించే.. ఈ ల్యాప్టాప్ బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది.హెచ్పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 7 ప్రారంభ ధర రూ.1,81,999. ఇది ఎక్లిప్స్ గ్రే, అట్మాస్ఫియరిక్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది భారతదేశంలో కంపెనీ ఆఫ్లైన్ స్టోర్లలో మాత్రమే కాకుండా.. ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లైన అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా హెచ్పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 9 కూడా రూ.1,91,999 వద్ద అందుబాటులో ఉంది. ఇది అట్మాస్ఫియరిక్ బ్లూ కలర్లో మాత్రమే లభిస్తుంది.హెచ్పీ లాంచ్ చేసిన ఈ కొత్త ల్యాప్టాప్లను ఈ నెల చివరి (అక్టోబర్ 31) లోపల కొనుగోలు చేస్తే రూ.9,999 విలువైన అడోబ్ ఫోటోషాప్ ఎలిమెంట్, ప్రైమరీ ఎలిమెంట్స్ వంటి వాటిని ఉచితంగా పొందవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు బజాజ్ ఫైనాన్స్తో నో కాస్ట్ ఈఎమ్ఐ కింద కూడా కొనుగోలు చేయవచ్చు.హెచ్పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 ఇంచెస్ 2.8కే ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. మెరుగైన వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం హాప్టిక్ టచ్ప్యాడ్, 9 మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇది 32 జీబీ ర్యామ్, 64 వాట్స్ బ్యాటరీ (21 గంటలు) పొందుతుంది. ఇది వైఫై, బ్లూటూత్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది.కొత్త హెచ్పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ ల్యాప్టాప్లో డేటా రక్షణ, సైబర్ సెక్యూరిటీ వంటి వాటి కోసం ఫిజికల్ సెక్యూరిటీ చిప్ ఉన్నాయి. డీప్ఫేక్ డిటెక్టర్ కూడా ఇందులో ఉంటుంది. ఇవన్నీ డేటాను రక్షించడానికి, ఇతరులు హ్యాక్ చేయకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. -
ఉద్యోగులను తొలగించలేదు: ఫోన్పే
ఆన్లైన్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ను తొలగించినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. దీనిపై స్పష్టతనిస్తూ ప్రకటన విడుదల చేసింది. కంపెనీలు ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించలేదని పేర్కొంది. అయితే కస్టమర్ సపోర్ట్ విభాగంలోని ఉద్యోగులు తగ్గిపోవడానికి కారణాన్ని తెలియజేసింది.ఫోన్పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కార్యకలాపాల్లో 90 శాతం ఏఐ చాట్బాట్లను వినియోగిస్తోంది. దాంతో గత ఐదేళ్లలో 60 శాతం ఉద్యోగులను తొలగించినట్లు పలు మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. గతంలో ఈ విభాగంలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను 400కు తగ్గించినట్లు తెలిపాయి. దీనిపై కంపెనీ తాజాగా స్పందించింది. ‘ఏఐ, ఆటోమేషన్ వల్ల కంపెనీలో ఉద్యోగులను తొలగించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. గడిచిన ఐదేళ్ల కాలంలో కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఏఐను వాడుతున్నాం. అదే సమయంలో కొత్తగా ఆ విభాగంలో స్టాఫ్ను నియమించలేదు. అలాగని ఉన్నవారిని బలవంతంగా తొలగించలేదు. ఐదేళ్ల కిందట ఈ విభాగంలో ఉన్న సిబ్బంది వివిధ కారణాలతో ఉద్యోగం మానేశారు. అయితే కొత్త స్టాఫ్ను నియమించకపోవడం వల్ల వీరి సంఖ్య తగ్గినట్లు కనిపింది’ అని ఫోన్పే ప్రకటన విడుదల చేసింది.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ విభాగంలో కొత్తగా కొలువులు సృష్టించే అవకాశం ఉండడం లేదు. ఏఐ వల్ల ఈ విభాగంలో పని చేస్తున్నవారు ఇతర రంగాలకు మారాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఏఐకు శిక్షణ ఇచ్చే విభాగంలో సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే సర్వీస్ సెక్టార్లో పని చేస్తున్నవారు నిరాశ పడకుండా తమ రంగంలో ఏఐకు శిక్షణ ఇచ్చే నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయినా భవిష్యత్తులో మెరుగైన నైపుణ్యాలు సాధన చేస్తే మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!
కృత్రిమమేధ(ఏఐ) ఉద్యోగుల పాలిట శాపంగా మారుతుంది. వివిధ కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగుల కార్యకలాపాల స్థానంలో ఏఐని వాడడం ప్రారంభించాయి. దాంతో ఆయా స్థానాల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. థర్డ్పార్టీ ఆన్లైన్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కార్యకలాపాల్లో 90 శాతం ఏఐ చాట్బాట్లను వినియోగిస్తోంది. దాంతో గత ఐదేళ్లలో 60 శాతం ఉద్యోగులను తొలగించింది. గతంలో ఈ విభాగంలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను 400కు కుదించింది.ఫోన్పే అక్టోబర్ 21న విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం..గత ఐదేళ్లలో కస్టమర్ సపోర్ట్ విభాగంలో 90 శాతం ఏఐ చాట్బాట్ను వినియోగిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 వరకు లావాదేవీలు 40 రెట్లు పెరిగాయి. కొవిడ్ 19 పరిణామాల వల్ల గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా ఆటోమేషన్ విధానం కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. దానివల్ల ప్రస్తుతం కంపెనీ రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కస్టమర్ సంతృప్తికి పెద్దపీట వేస్తూ, అదే సమయంలో గణనీయంగా ఖర్చు ఆదా చేసేలా పని చేస్తోంది. గత పదేళ్లలో కస్టమర్ నెట్ ప్రమోటర్ స్కోర్ (ఎన్పీఎస్-కస్టమర్లు కంపెనీ అందించే సేవల వల్ల సంతృప్తి పొందడం) పెరుగుతోందని కంపెనీ తెలిపింది.కంపెనీ వార్షిక నివేదికలో తెలియజేసిన వివరాల ప్రకారం కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగుల సంఖ్య 400కు చేరింది. ఇది గతంలో 1,100గా ఉండేది. ఈ విభాగంలో 90 శాతం ఏఐను వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశం అంతటా సంస్థలో దాదాపు 22 వేల ఉద్యోగులున్నట్లు పేర్కొంది. 1,500 కంటే ఎక్కువ మంది అగ్రశ్రేణి ఇంజినీర్లకు కంపెనీ ఉపాధి కల్పిస్తోందని చెప్పింది. ఫోన్పే ఆగస్టులో తెలిపిన వివరాల ప్రకారం మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.5,064 కోట్ల ఆదాయం సమకూరినట్లు నివేదించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో రూ.2,914 కోట్లగా నమోదైంది. అంటే ఏడాదిలో 74 శాతం వృద్ధిని సాధించినట్లయింది.ఇదీ చదవండి: పెళ్లి చేసే కుటుంబాలకు ధీమా.. వివాహ బీమాఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ విభాగంలో ఇలా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. అయితే ఏఐకు శిక్షణ ఇచ్చే విభాగంలో సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత ఉందని చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే సర్వీస్ విభాగంలో పని చేస్తున్నవారు నిరాశ పడకుండా తమ రంగంలో ఏఐకు శిక్షణ ఇచ్చే నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయినా భవిష్యత్తులో మెరుగైన నైపుణ్యాలు సాధన చేస్తే మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
‘టీఎంటీ’ విభాగంలో ఏఐ ప్రభావం
దేశంలో టెక్నాలజీ, మీడియా, టెలికమ్యునికేషన్(టీఎంటీ) విభాగాల్లో కృత్రిమమేధ(ఏఐ) ప్రభావం ఎలా ఉందో తెలియజేస్తూ కేపీఎంజీ సంస్థ నివేదిక విడుదల చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ)2024లో ఈ రిపోర్ట్ను ఆవిష్కరించారు. టీఎంటీ విభాగాల్లో ఏఐ వినియోగించడం వల్ల ఖర్చు తగ్గి ఉత్పాదకత పెరిగిందని నివేదిక పేర్కొంది. టీఎంటీ రంగంలోని వివిధ కంపెనీలకు చెందిన చీఫ్ డిజిటల్ ఆఫీసర్లు(సీడీఓ), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(సీఐఓ), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)లను సంప్రదించి ఈ రిపోర్ట్ రూపొందించినట్లు కేపీఎంజీ ప్రతినిధులు తెలిపారు.నివేదికలోని వివరాల ప్రకారం..టీఎంటీ విభాగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. టెలికాం రంగంలో నెట్వర్క్ను ఆటోమేట్ చేయడం నుంచి మీడియా కంటెంట్ను పంపిణీ చేయడం వరకు ఏఐ ఎన్నో విధాలుగా సాయం చేస్తోంది.55 శాతం టీఎంటీ సంస్థలు పూర్తిగా ఏఐను వినియోగిస్తున్నాయి.37 శాతం సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ వాడేందుకు వివిధ దశల్లో పని చేస్తున్నాయి.40 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు, నిర్ణయాత్మక ప్రక్రియల్లో మెరుగైన అంచనాను సాధించడానికి ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల్లో ఏఐను వాడుతున్నాయి.టెలికాం రంగంలో ఎక్కువగా ఏఐను వినియోగించాలని భావిస్తున్నారు.టెలికాం రంగంలో ఏఐ వల్ల 30 శాతం సేవల నాణ్యత మెరుగుపడుతుందని కంపెనీలు అనుకుంటున్నాయి. రాబడి వృద్ధి 26%, మోసాల నివారణ 32% పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి.సర్వేలో పాల్గొన్న 26 శాతం కంపెనీల్లో ఏఐ ఎకోసిస్టమ్ అనుసరించేందుకు సరైన మానవవనరులు లేవు.27 శాతం కంపెనీలు ఏఐ వినియోగానికి అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాయి.సర్వేలో పాల్గొన్న 33 శాతం కంపెనీల్లోని వర్క్ఫోర్స్లో 30-50 శాతం మంది 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏఐ వాడకానికి సిద్ధమవుతున్నారు.టీఎంటీ రంగం వృద్ధి చెందాలంటే కొన్ని విధానాలు పాటించాలని కేపీఎంజీ సూచనలు చేసింది. ‘మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాలి. ఖర్చులను తగ్గించడానికి నెట్వర్క్ ఆటోమేషన్పై దృష్టి సారించాలి. 5జీ, క్లౌడ్ కంప్యూటింగ్లో పెట్టుబడి పెట్టాలి. కస్టమర్ల పెంపునకు ఏఐ సొల్యూషన్లను అందించాలి. అందుకు హెల్త్కేర్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి పరిశ్రమలతో భాగస్వామ్యం కావాలి. సంస్థల సేవలు వేగవంతం చేయడానికి ప్రత్యేక ఏఐ ప్రొవైడర్లతో కలసి పని చేయాలి. సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలి. విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు’ అని తెలిపింది.ఇదీ చదవండి: రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..టెక్నాలజీ, మీడియా అండ్ టెలికమ్యూనికేషన్స్ (టీఎంటీ) పార్ట్నర్ అఖిలేష్ టుతేజా మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ వినియోగం పెరగడం ద్వారా టీఎంటీ పరిశ్రమ మరింత మెరుగ్గా సేవలందిస్తోంది. కేవలం టీఎంటీ రంగానికి పరిమితం కాకుండా విభిన్న రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో కంపెనీలకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది’ అన్నారు. -
ఏఐపై అతిగా ఆధారపడొద్దు: శక్తికాంత దాస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలతో ప్రయోజనాలు పొందాలే తప్ప వాటిపై అతిగా ఆధారపడరాదని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఈ సాంకేతికతలతో ఆర్థిక సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి వల్ల ఆర్థిక స్థిరత్వానికి రిస్కులు కూడా పొంచి ఉన్నాయని ఆర్బీఐ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు.ఏఐ వినియోగం అతిగా పెరిగే కొద్దీ సైబర్దాడులు, డేటా ఉల్లంఘనలు వంటి రిస్కులు కూడా పెరిగే అవకాశం ఉందని వివరించారు. అంతే గాకుండా, ఏఐ పారదర్శకంగా ఉండకపోవడం వల్ల, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను ప్రభావితం చేసే అల్గారిథంలను ఆడిట్ చేయడం లేదా అన్వయించుకోవడం కూడా కష్టతరమవుతుందని దాస్ చెప్పారు. దీనితో మార్కెట్లలో అనూహ్య పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!డిజిటలీకరణతో మనీ ట్రాన్స్ఫర్ ఎంత వేగంగా క్షణాల వ్యవధిలో జరుగుతోందో అంతే వేగంగా సోషల్ మీడియా ద్వారా వదంతులు కూడా వ్యాప్తి చెందుతున్నాయని, ఇలాంటివి లిక్విడిటీపరమైన ఒత్తిళ్లకు దారి తీసే అవకాశం ఉందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో రిసు్కలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.