breaking news
AI
-
చావును వెతుక్కుంటూ 70 కి.మి ప్రయాణించి.. చివరకు..The Nihilist Penguin సోర్టీ ఇదే
ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది.. డెడ్లైన్లు, బాధ్యతలు, బిల్లులు, stress… ఈ గందరగోళం మధ్య “ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోవాలి?” అనే భావన చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు కనిపించబోయే ఈ సీన్… మీ మనసు లోతుల్లో ఉన్న భావనకి మౌనంగా సమాధానం.ఇంటర్నెట్లో ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే ఒక చిన్న పెంగ్విన్. దాన్ని నెటిజన్లు ప్రేమగా “ది నిహిలిస్ట్ పెంగ్విన్” అని పిలుస్తున్నారు, అంటే ఇక ఏదీ పట్టించుకోని పెంగ్విన్. ఎందుకంటే అది వెళ్లే దారిలో ఎవరూ లేరు, ఏ శబ్దం లేదు, ఏ గమ్యం కూడా లేదు.ఈ వీడియో కొత్తది కాదు. ఇది 2007లో వచ్చిన ప్రఖ్యాత జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన Encounters at the End of the World అనే డాక్యుమెంటరీ నుంచి తీసుకున్న క్లిప్.డాక్యుమెంటరీ వీడియోలో డాక్టర్ డేవిడ్ ఎయిన్లే మాట్లాడుతూ.. ‘ఒక వేళ ఆ పెంగ్విన్ అక్కడి నుంచి తిరిగి కాలనీకి వచ్చేద్దామని అనుకున్నా కూడా సాధ్యపడదు. తిరిగి రావటం కూడా ‘డెత్ మార్చ్’ అవుతుంది. మార్గం మధ్యలోనే అది చనిపోయే అవకాశం ఉంది’ అని అన్నారు. ఆ డాక్యుమెంటరీ వీడియో తీసిన ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జోగ్ మాట్లాడుతూ...వీడియో తీసిన కొంత సేపటికే ఆ పెంగ్విన్ చనిపోయి ఉంటుంది. అది చనిపోవడానికి ముందు అంటార్కిటికా మంచు పర్వతాల్లో దాదాపు 70 కిలోమీటర్లు ఒంటరిగా నడిచింది’ అని చెప్పారు. అయితే, ఆ పెంగ్విన్ అలా అన్నిటినీ వదలి చావును వెతుక్కుంటూ వెళ్లిపోవటం వెనుక ఉన్న సరైన కారణం ఇంత వరకు తెలియరాలేదు. తన భాగస్వామి చనిపోవటం వల్ల ఆ పెంగ్విన్ డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని, ఆ బాధలో డెత్ మార్చ్ చేసి ప్రాణాలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది. ముఖ్యంగా దీనికి ఒక పాటను జోడించిన తర్వాత ఇది మరింత ఎమోషనల్ గా మారింది. కానీ అసలు ప్రశ్న ఇదే… ఈ పెంగ్విన్ వీడియోకి ఇంత క్రేజ్ ఎందుకు? ఎందుకంటే ఇది మనల్నే చూపిస్తోంది. ఆఫీసు కుర్చీలో కూర్చొని, ల్యాప్టాప్ ముందు కళ్ళు ముడుచుకుని “ఇక చాల్రా… అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలి” అనిపించిన క్షణాల్ని ఇది గుర్తుచేస్తోంది. పెంగ్విన్ మాటలు మాట్లాడదు, కానీ దాని నడక చెబుతోంది – “నాకు శాంతి కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు కొంచెం ఒంటరితనం కావాలి.అని.ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..ఇది ఒక పెంగ్విన్ కథ కాదు, ఇది మన ఆత్మ కథ. అని కామెంట్లు పెడుతున్నారు. పెంగ్విన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆ పెంగ్విన్తో తాను కూడా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఓ ఏఐ ఫొటో క్రియేట్ చేశారు. -
రిలయన్స్ జియో చొరవ.. ఏఐ ఎడ్యుకేషన్
విద్యా రంగానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలను అందించడం ద్వారా డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి రిలయన్స్ జియో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతమైన విద్యా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆధునిక యుగంలో అభ్యాస & బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి 'గూగుల్ జెమిని ప్రో' యొక్క ఆచరణాత్మక అప్లికేషన్పై ఈ చొరవ దృష్టి పెడుతుంది. అత్యాధునిక ఏఐ సాధనాలను తరగతి గదుల్లోకి తీసుకురావడం ద్వారా, సాంకేతికతతో కూడిన వృత్తిపరమైన రంగంలో రాణించగల డిజిటల్ నైపుణ్యం కలిగిన విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను తయారు చేయడమే జియో లక్ష్యం.ఈ ప్రచారం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించి.. రెండు రాష్ట్రాల్లో 2200 కంటే ఎక్కువ పాఠశాలలకు విజయవంతంగా చేరుకుంది. జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్ల నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలలో 27,000 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు & విద్యార్థులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో1500 కంటే ఎక్కువ పాఠశాలల్లో 20వేల మంది, తెలంగాణలో 700 పాఠశాలల్లో 7000 వేల మందికిపైగా ఈ శిక్షణ పొందుతున్నారు.ఈ ఇంటరాక్టివ్ వర్క్షాప్లు గూగుల్ జెమిని వ్యవస్థను పరిచయం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. పాఠ్యాంశాల నోట్స్ తయారు చేయడం, అసైన్మెంట్లు రాయడం & సంక్లిష్టమైన కోడింగ్ ప్రాజెక్ట్లలో సహాయం పొందడం వంటి పనులను ఈ సాంకేతికతతో ఎలా సులభతరం చేయవచ్చో ఇందులో వివరించారు. దీర్ఘకాలిక వృత్తిపరమైన వృద్ధి కోసం ప్రాజెక్ట్ ఐడియేషన్, గ్రాఫిక్ డిజైన్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం AIని ఉపయోగించడంపై కూడా ఈ శిక్షణ ప్రాధాన్యతనిస్తుంది.ఈ డిజిటల్ సాధికారత ప్రచారంలో ప్రధాన అంశం ఏమిటంటే, వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రీమియం సాంకేతికతను అందించడం. జియో తన అన్లిమిటెడ్ 5జీ సబ్స్క్రైబర్లకు రూ.35,100 విలువైన 'గూగుల్ జెమిని ప్రో ప్లాన్'ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. వినియోగదారులు నేరుగా మైజియో (MyJio) యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకునే ఈ సబ్స్క్రిప్షన్, అత్యాధునిక 'జెమిని 3 ప్రో' మోడల్తో పాటు హై-ఎండ్ క్రియేటివ్ టూల్స్కు ప్రాప్యతను కల్పిస్తుంది.ఇందులో AI సహాయంతో చిత్రాలను రూపొందించే 'నానో బనానా ప్రో' (Nano Banana Pro), వీడియో జనరేషన్ కోసం 'వీయో 3.1' (Veo 3.1) వంటి సాధనాలు ఉన్నాయి. అకడమిక్ రీసెర్చ్ కోసం 'నోట్బుక్ ఎల్ఎమ్' (NotebookLM) మరియు డిజిటల్ డేటాను భద్రపరుచుకోవడానికి 2 TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్లో భాగంగా ఉన్నాయి.యువత నైపుణ్యాభివృద్ధికి ఉన్న నిబద్ధతను మరింత ముందుకు తీసుకెళ్తూ, కంపెనీ 'జియో ఏఐ క్లాస్రూమ్' అనే ఉచిత నాలుగు వారాల ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను కూడా ప్రవేశపెట్టింది. విద్యార్థులు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ద్వారా వారి స్వంత వేగంతో ఏఐ సాంకేతికతలపై ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పొందేలా ఈ కోర్సు రూపొందించబడింది. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు Jio.com/ai-classroom పోర్టల్ను సందర్శించడం ద్వారా ఈ శిక్షణను పొందవచ్చు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడటానికి అవసరమైన పునాది జ్ఞానాన్ని ఇది అందిస్తుంది, తద్వారా ప్రాంతీయ శ్రామిక శక్తి సాంకేతిక ఆవిష్కరణలలో ముందంజలో ఉండేలా జియో నిర్ధారిస్తుంది. -
ఆ ఘటన యావత్ సమాజానికి ఒక హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ టెక్నా లజీ దుర్వి నియోగం ప్రపంచవ్యాప్తంగా పెనుముప్పుగా మారుతోంది. కేవలం సాంకేతిక ఆవిష్కరణగా భావించిన AI... మోసగాళ్ల చేతిలో ఓ ఆయుధంగా మారగా... బాధితులు... సామాన్యులకు మాత్రం ప్రాణం సంకటంగా మారుతోంది. వ్యక్తిగత రహస్యాలు... వారి గోప్య త... ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే ప్రమాదకర సాధనం గా రూపాంతరం చెందిం ది. ఈ కొత్త రకం సైబర్ నేరాలు మన దేశంలోనూ కలకలం సృ ష్టిస్తున్నా యి.ఇటీవల చోటు చేసుకుంటున్న విభిన్నమైన కేసులు AI ఆధారిత మోసాల గురించి జాగ్రత్తలు పాటించడం.. వాటి గురించి అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి.కేరళలో ఓ ప్రొఫెసర్కు వీడియో కాల్ వచ్చింది. సాధారణ కాల్ అని వీడియో ఆన్ చేశారు... అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది.. వీడియో ద్వారా సంభాషణ సాగిస్తూ... ఆయనను ట్రాన్స్లోకి తీసుకెళ్లింది. ఆయన వాస్తవాన్ని మరిచి ఊహాలోకాల్లోకి వెళ్లిపోయారు... సీన్ కట్ చేస్తే... ఆయన నగ్న వీడియోలు.. అమ్మాయితో మాట్లాడుతున్న సంభాషణ ఆయన ఫోన్కే వచ్చాయి. అసలు అది అమ్మాయి కాదు AI సృష్టించిన బొమ్మ అని తెలిసి... ప్రొఫెసర్ మాత్రం ఘోరంగా మోసపోయాడు. మోసగాళ్లకు రూ. 2 లక్షలు ఇచ్చిన తర్వాత వేధింపులు ఆగక పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.గతేడాది ఢిల్లీలో విద్యార్థినుల ఫొటోలను న్యూ డ్గా మార్ఫ్ చేయడం.... ఛత్తీస్గఢ్ ఐఐఐటీ విద్యార్థి.... 36 మం ది అమ్మాయిల ఫొటోలను మార్చి వాటిని వైరల్ చేసిన కేసు..అస్సాం లో ఇంజినీర్ ఆన్లైన్లో నకిలీ న్యూ డ్ కంటెం ట్ సృ ష్టిం చి డబ్బు సం పాదిం చిన విధానాలు చూస్తుంటే సాంకేతికతను అడ్డం పెట్టుకుని ఎలా మోసం చేస్తున్నారో గమనించవచ్చు.AI దుర్వి నియోగం ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుందో హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. 19 ఏళ్ల డిగ్రీవిద్యార్థి... తన ముగ్గురు సోదరీమణులకు సంబంధించిన ఏఐ సృష్టించిన అశ్లీల ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇలా ఒకటి రెండు ఘటనలు మాత్రమే కాదు... నిత్యం కొన్ని వందల సంఖ్యలో బాధితులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోసాల బారిన పడుతున్నారు. ఇలాంటి మోసాల నుంచి బయట పడాలంటే ప్రజలు... సమాజం సమష్టిగా కృ షి చేయాల్సిన అవసరం ఉంది. ఏఐ దుర్వినియోగం చేసిన వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించాలి. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. యువతలో డిజిటల్ భద్రత, ప్రైవసీ, సైబర్ నేరాలపై తప్ప నిసరిగా అవగాహన పెంచాలి.సోషల్ మీడియాలో కంటెంట్ తొలగిం పు వ్య వస్థ ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లు తమ వేదికలపై AI-జనరేటెడ్ అభ్యంతరకర కంటెంట్ను గుర్తిం చి, వెం టనే తొలగించేం దుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.బాధితులకు మద్దతుగా సహాయ కేంద్రాలు ఏర్పా టు చేయాలి. బాధితులకు మానసిక, చట్టపరమైన సహాయంఅం దిం చే కేం ద్రాలను ఏర్పా టు చేయాలి. మహిళలు ఎటువం టి భయం లేకుండాఫిర్యా దు చేసే వాతావరణాన్ని కల్పించాలి.ఫరీదాబాద్ ఘటప యావత్ సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది... టెక్నా లజీ మనిషి జీవితాన్ని మెరుగుపరచాలి.... -
ఏఐ మైక్రోఫిల్మ్ హ్యాకథాన్లో యువ చిత్రకారుల ఉత్సాహం
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత కథనానికి దారి చూపిస్తూ సినిక్ సంస్థ ఏర్పాటు చేసిన జెన్ ఏఐ మైక్రోఫిలిం హ్యాకథాన్లో యువ చిత్రకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో నిర్వహించిన ఫిలిం హ్యాకథాన్లో 60 మందికి పైగా ప్రతిభావంతులైన ఫిలిం చిత్రాకారులు పాల్గొని సత్తా చాటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు జరిగిన ఈ హ్యాకథాన్లో వారు ఏఐని వినియోగించి 90 సెకన్ల మైక్రో సినిమాలను రూపొందించారు. మొత్తంగా వచ్చిన మైక్రో ఫిలింలలో మూడింటిని ఉత్తమ చిత్రాలుగా గుర్తించి వారికి సినిక్ వ్యవస్థాపకుడు భరత్ గుప్తా, సహ వ్యవస్థాపకులు పద్వీ రెడ్డి దేవిరెడ్డి, ఆకాశ్ చోడే బహుమతులు అందజేశారు. -
అంధులకు చదివే అదృష్టిం!
సాక్షి, హైదరాబాద్: సాధారణ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు చదవడం మామూలు విషయమే. కానీ చూపులేని విద్యార్థులకు మాత్రం అదో పెద్ద ప్రహసనం. బ్రెయిలీ లిపిలో అందుబాటులో ఉన్న పుస్తకాలను చదవడమే వారికి వీలవుతుంది. ఒకవేళ బ్రెయిలీలో నూతన ఎడిషన్లు అందుబాటులో లేకపోయినా, పేలవమైన ఆడియో రికార్డింగ్లు ఉన్నా లేక ఖరీదైన సాఫ్ట్వేర్లు అవసరమైనా వారు సర్దుకుపోవాల్సి ఉంటుంది.అయితే ఈ సమస్యకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్–ఐటీ) పరిష్కారం చూపించింది. కృత్రిమ మేధ (ఏఐ), భాషా సాంకేతికతల ఆధారంగా ‘దృష్టి’పేరుతో డిజిటల్ ల్రైబరీని అభివృద్ధి చేసింది. పూర్తిగా ఉన్నత విద్యా సంబంధ పాఠ్యపుస్తకాలను బ్రెయిలీ, ఆడియోబుక్ ఫార్మాట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలా పనిచేస్తుందంటే..: దృష్టి లైబ్రరీలో ఉపయోగించేఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ (ఓసీఆర్) వ్యవస్థ.. బొమ్మలు, డాక్యుమెంట్లు, పీడీఎఫ్ రూపంలో ఉన్న పాఠ్యాంశాలను స్కాన్ చేసి చూపులేని విద్యార్థులకు అను కూలమైన ఫార్మాట్లలో వాటిని అందిస్తుంది. అంటే వాటిని బ్రెయిలీ లిపితో కూడిన అక్షరాలుగా మారుస్తుంది. అలాగే టెక్స్ట్టు స్పీచ్ టూల్స్ను ఉపయోగించి ఆయా పాఠ్యాంశాలను ఆడియోబుక్స్లాగా మార్పిడి చేస్తుంది. ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేసిన రీడర్ అప్లికేషన్ ద్వారా ఆడియోబుక్స్ను దృష్టి లైబ్రరీ అందిస్తుంది. 12 భాషల్లో..: ప్రస్తుతం దృష్టి లైబ్రరీలో తెలుగుతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, పంజాబీ, తమిళం, ఒడియా భాషల్లో పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాఠ్యపుస్తకాలన్నింటినీ చూపులేని వారు సౌకర్యవంతంగా యాక్సెస్ చేసేందుకు వీలు కలగనుంది. అలాగే శ్రవణ అనుభవాన్ని సైతం పొందేందుకు వీలవనుంది. అంతేకాకుండా ఆడియో వేగాన్ని నచ్చినట్లుగా నియంత్రించడంతోపాటు బుక్మార్క్లు, పర్సనలైజ్ సెట్టింగ్స్, వాయిస్ ఆదేశాలతో నావిగేట్ చేసుకోవడం వీలవుతుంది.చూపులేని విద్యార్థులు, ఆయా విద్యాసంస్థలకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగానే పరిశోధకుడు కృష్ణ తులసియన్ ట్రిపుల్–ఐటీ హైదరాబాద్లో ‘దృష్టి లైబ్రరీ’ని అభివృద్ధి చేశారు. ప్రొఫెసర్ సీవీ జవహర్, ప్రొఫెసర్ గురుప్రీత్ సింగ్ లెహల్ మార్గదర్శకత్వంలో ఈ ప్రక్రియ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఏఐ ఆధారిత భాషా వేదిక ‘భాషిణి’సాయంతో దీన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ‘దృష్టి’ప్ర«దానంగా యూజీ, పీజీ పాఠ్య పుస్తకాలనే అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠ్యాంశాలు, పుస్తకాలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.వినియోగం ఉచితమే.. అంధుల పాఠశాలలు, అభ్యాసకులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఎక్కడున్నా కంటెంట్ను పొందేందుకు వీలుగా ‘దృష్టి’ని అభివృద్ధి చేశాం. ఖరీదైన సాఫ్ట్వేర్లను కొనాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వాటిని అంధ పాఠశాలలకు అందిస్తాం. – ప్రొఫెసర్ గురుప్రీత్ సింగ్ లెహల్ కంటెంట్ను అందించొచ్చు.. దృష్టి డిజిటల్ లైబ్రరీని ఓపెన్ ప్లాట్ఫాంపై రూపొందించడం వల్ల చూపులేని విద్యార్థులకు అవసరమైన కంటెంట్ను ఎన్జీవోలు, వలంటీర్లు, విద్యాసంస్థలు అందించేందుకు వీలవుతుంది. ఈ లైబ్రరీని విస్తరించాలంటే అందుకు అందరి తోడ్పాటు అవసరం. – ప్రొఫెసర్ జవహర్ -
హైదరాబాద్లో ఇప్పుడు హాట్ జాబ్స్ ఇవే..
హైదరాబాద్: దేశంలోని వృత్తి నిపుణులు నూతన ఏడాదిలో కొత్త అవకాశాల కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. లింక్డ్ఇన్ (LinkedIn) విడుదల చేసిన తాజా పరిశోధన ప్రకారం.. 2026 నాటికి 72 శాతం మంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో అవసరమైన నైపుణ్యాలు (38%), పెరుగుతున్న పోటీ మధ్య తాము ఎలా నిలదొక్కుకోవాలో (37%) తెలియక మూడింట ఒక వంతుకు పైగా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ఈ అనిశ్చితిని అధిగమించేందుకు వృత్తి నిపుణులకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో, లింక్డ్ఇన్ తన ‘జాబ్స్ ఆన్ ది రైజ్ 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ పాత్రగా ‘ఏఐ ఇంజనీర్’ (AI Engineer) నిలిచింది. ఇది నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో బలమైన హబ్గా ఎదుగుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఏఐ ఇంజనీర్ తరువాతి స్థానాల్లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ , సొల్యూషన్స్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ వంటి ఉద్యోగ పాత్రలు చోటు దక్కించుకున్నాయి. ఇది హైదరాబాద్ జాబ్ మార్కెట్లో మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, పీపుల్ ఫంక్షన్స్తో పాటు ప్రత్యేక ప్రొఫెషనల్ రోల్స్లో కూడా వేగంగా వృద్ధి జరుగుతోందని సూచిస్తోంది.ఏఐపై ఆసక్తి ఉన్నా..లింక్డ్ఇన్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని 94 శాతం మంది నిపుణులు ఉద్యోగ వేటలో ఏఐని ఉపయోగించడానికి సౌకర్యంగా ఉన్నారు. అయితే, నియామక ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తమను తాము ఎలా ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలో 48 శాతం మందికి స్పష్టత లేకుండాపోతోంది. అంతేకాదు, రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడంలో ఏఐ ఒక అడ్డంకిగా మారవచ్చని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు.అయితే, ఈ ఆందోళనల మధ్య కూడా రిక్రూటర్–అభ్యర్థి మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరచడంలో, సమాచారం లోపాలను తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని 65 శాతం మంది నమ్ముతున్నారు.జాబ్ సెర్చ్ను ఈజీ చేస్తున్న లింక్డ్ఇన్ ఏఐ టూల్స్ఉద్యోగార్థుల అవసరాలకు అనుగుణంగా లింక్డ్ఇన్ పలు ఏఐ ఆధారిత టూల్స్ను అందిస్తోంది. అందులో ముఖ్యమైనది ‘ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మాటల్లోనే ఉద్యోగాలను వెతకగలుగుతున్నారు. అంతేకాదు, వారు ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా ఇది పరిచయం చేస్తోంది.ప్రస్తుతం ఈ టూల్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇప్పటికే రోజూ 13 లక్షల మందికి పైగా దీనిని ఉపయోగిస్తుండగా, వారానికి 2.5 కోట్లకుపైగా జాబ్ సెర్చ్లు ఈ ఫీచర్ ద్వారా జరుగుతున్నట్లు లింక్డ్ఇన్ వెల్లడించింది.అదేవిధంగా ‘జాబ్ మ్యాచ్’ ఫీచర్ ద్వారా తమ నైపుణ్యాలు, అర్హతలకు ఏ ఉద్యోగాలు సరిపోతాయో తెలుసుకొని, ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న పాత్రలకే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతోంది.హైదరాబాద్లో టాప్ 10 ఉద్యోగాలు1. ఏఐ ఇంజనీర్ 2. మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ 3. సొల్యూషన్స్ అనలిస్ట్ 4. వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ 5. హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ 6. మర్చండైజర్7. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ 8. ఫైనాన్స్ స్పెషలిస్ట్9. ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్10. సర్వీస్ డెలివరీ మేనేజర్ -
డేంజర్లో వైట్ కాలర్ జాబ్స్.. బిల్గేట్స్ హెచ్చరిక
ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ కృత్రిమ మేధ (AI) నేడు ప్రతి రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తోంది. అయితే ఈ ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడనున్నాయని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ హెచ్చరించారు. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."రాబోయే నాలుగైదు ఏళ్లలో అటు వైట్ కాలర్, ఇటు బ్లూ కాలర్ ఉద్యోగ రంగాల్లో ఏఐ ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ అసమానతల సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. న్యూ స్కిల్స్ను నేర్పించడం లేదా పన్ను వ్యవస్థలో మార్పులు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటివరకు ఏఐ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికి.. భవిష్యత్తులో ఎక్కువగా మార్పులు కనిపిస్తాయి. ఇప్పటికే ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, లాజిస్టిక్స్, కాల్ సెంటర్లలో లోయర్ స్కిల్ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ సమస్యలను పరిష్కరించకోకపోతే సంపద, అవకాశాలు కొద్దిమంది చేతుల్లోకి మాత్రమే వెళ్లిపోతాయి. దీంతో సమాజంలో అసమానతలు పెరిగే అవకాశముంది" అని బిల్గేట్స్ పేర్కొన్నారు. -
ఐటీకి కొత్త బూమ్ ఖాయం: విప్రో సీఈవో
ఐటీ సేవల పరిశ్రమ భవిష్యత్తుపై విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీని పల్లియా గట్టి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశంలో మాట్లాడిన ఆయన, రాబోయే సంవత్సరాల్లో ఐటీ రంగం గణనీయమైన మార్పును ఎదుర్కోనుందని చెప్పారు.పల్లియా ప్రకారం.. 2025 సంవత్సరం ప్రయోగాలు, చిన్న స్థాయి ట్రయల్స్కు పరిమితమైతే, 2026 పూర్తి స్థాయి అమలు, జవాబుదారీతనానికి కేంద్రబిందువుగా మారనుంది. ఇప్పటికే సంస్థలు ఏఐ (AI) టెక్నాలజీని కేవలం పరీక్షించే దశను దాటేశాయని, చిన్న ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ (PoC) ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎంటర్ప్రైజ్-వైడ్ అమలు వైపు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు.ఈ మార్పు భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతిదారులకు బలమైన కొత్త అవకాశాలను తెస్తోందని పల్లియా చెప్పారు. మెగా డీల్స్తో పాటు ప్రత్యేకమైన, చిన్న ఏఐ ప్రాజెక్టుల కోసం కూడా పోటీ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.ఏఐ ఐటీ రంగ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తోందని ఆయన అంగీకరించారు. ఏఐ-సహాయక సాఫ్ట్వేర్ అభివృద్ధి వల్ల కోడింగ్, టెస్టింగ్ ఖర్చులు సుమారు 25 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేశారు. దీని వల్ల ధరలపై ఒత్తిడి ఏర్పడినప్పటికీ, ఆ పొదుపును మరిన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులకు వినియోగిస్తారని ఆయన తెలిపారు.గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా టెక్నాలజీ వ్యయాలు తగ్గినప్పటికీ, ప్రస్తుత ఏఐ ధోరణి ఐటీ పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకువస్తుందని విప్రో భావిస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు -
ఏఎం గ్రూప్ కొత్త ప్రాజెక్ట్.. వేలాదిమందికి ఉద్యోగాలు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచమంతా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి తరుణంలో AI కంప్యూట్ హబ్ను ఏర్పాటు చేయడానికి AM గ్రూప్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ఏఐ హబ్ సామర్థ్యం 1 గిగావాట్ ఉంటుంది. దీని కోసం సుమారు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఏఐ పెట్టుబడుల్లో ఒకటి.ఈ ప్రాజెక్ట్ను దశలవారీగా అభివృద్ధి చేస్తారు. మొదటి దశ 2028 నాటికి ప్రారంభమవుతుంది. 2030 నాటికి ఇది పూర్తవుతుందని చెబుతున్నారు. ఇందులో సుమారు 5 లక్షల అత్యాధునిక కంప్యూటర్ చిప్లు ఉంటాయి. ఇవి భారీ ఏఐ పనులను వేగంగా చేయడానికి ఉపయోగపడతాయి.ఈ ఏఐ హబ్లు పెద్ద కంపెనీలకు, పరిశోధనా సంస్థలకు, స్టార్టప్లు & ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని వల్ల ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు ఏఐను దగ్గర చేయడానికి ఏఎం సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. చిన్న డెవలపర్లు కూడా పెద్ద ఏఐ టూల్స్ను ఇందులో ఉపయోగించుకోవచ్చు.ఈ ప్రాజెక్ట్ వల్ల ఉత్తరప్రదేశ్లో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. టెక్నాలజీ రంగం మరింత బలపడుతుంది. మొత్తం మీద.. ఈ ఏఐ కంప్యూట్ హబ్ భారతదేశాన్ని ప్రపంచ ఏఐ రంగంలో ముందుకు తీసుకెళ్లే కీలక ప్రాజెక్ట్గా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు. -
భారతీయ భోజనాన్ని డీకోడ్ చేసే కృత్రిమమేధ
భారతీయ ఆహారం అంటే కేవలం రుచి మాత్రమే కాదు.. సంస్కృతి, సంప్రదాయం, ప్రాంతీయ వైవిధ్యాల సమాహారం. దేశంలోని క్లిష్టమైన ఆహార పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది. ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ పరిశోధకులు కంప్యూటర్ విజన్ సాంకేతికతను ఉపయోగించి భారతీయ థాలీ భోజనంలోని కేలరీలను ట్రాక్ చేయడం, బిర్యానీ వంటి ఐకానిక్ వంటకాలను విశ్లేషించేలా పరిశోధనలు చేస్తున్నారు.థాలీని అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం?ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్స్ను బర్గర్, శాండ్విచ్.. వంటి పాశ్చాత్య వంటకాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కానీ భారతీయ థాలీ అందుకు భిన్నమైంది. ఒకే ప్లేట్లో అన్నం, పప్పు, కూర, పెరుగు, చట్నీ, అప్పడం.. వంటి చాలా పదార్థాలు కలిసి ఉంటాయి. దాంతో అందులో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ట్రిపుల్ఐటీలోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CVIT) పరిశోధకులు దీనిపైనే దృష్టి పెట్టారు.ఈ ప్రాజెక్ట్కు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సి.వి. జవహర్ ప్రొఫెసర్ జవహర్ మార్గదర్శకత్వంలో యశ్ అరోరా, ఆదిత్య అరుణ్ రూపొందించిన ‘What is there in an Indian Thali’ అనే పరిశోధన పత్రం ఇటీవలే 16వ ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ విజన్, గ్రాఫిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ (ICVGIP 2025)లో సమర్పించారు. భారతీయ భోజనంలోని వివిధ రకాల పదార్థాలను ఏఐ ఎలా గుర్తించగలదనే అంశంపై ఈ పరిశోధన సాగింది.పరిశోధనలోని ముఖ్యాంశాలుసాధారణంగా ఏఐ మోడళ్లకు ప్రతి కొత్త వంటకం కోసం మళ్లీ శిక్షణ ఇవ్వాలి. కానీ, భారతీయ వంటల్లో విభిన్న రకాల పప్పులు వివిధ రంగులు ఉంటాయి (ఉదాహరణకు పాలక్ పప్పు ఆకుపచ్చగా ఉంటుంది). దీనికోసం ట్రిపుల్ఐటీ హైదరాబాద్ బృందం ‘జీరో-షాట్ లెర్నింగ్’ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇది కఠినమైన వర్గీకరణకు బదులుగా ‘ప్రోటోటైప్ మ్యాచింగ్’ ద్వారా పదార్థాలను గుర్తిస్తుంది. అలా థాలీ భోజనంలోని అన్ని పధార్థాలను గుర్తించి దానివల్ల ఎన్ని కేలరీలు సమకూరుతాయో తెలియజేస్తుంది.గర్భిణీ స్త్రీల పోషకాహారాన్ని పర్యవేక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ పరిశోధన సాగినట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం ఇది ఓవర్హెడ్ కెమెరాతో కూడిన కియోస్క్ సెటప్లో పనిచేస్తోంది. భవిష్యత్తులో దీన్ని మొబైల్ యాప్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మసాలాల వినియోగం, వంట శైలిలోని తేడాలను విశ్లేషిస్తూ ‘ఇండియన్ ఫుడ్ మ్యాప్’ను పరిశోధకులు సిద్ధం చేస్తున్నారు.బిర్యానీపై ప్రత్యేక దృష్టిభారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిర్యానీని టెస్ట్ కేస్గా తీసుకుని దేశంలో బిర్యానీ ఎలా తయారు చేస్తారనే అంశంపై పరిశోధన చేశారు. ఇందుకోసం వేలకొద్దీ యూట్యూబ్ వీడియోలను ఏఐ ద్వారా విశ్లేషించారు. హైదరాబాదీ బిర్యానీ, ఇతర బిర్యానీల మధ్య నూనె, మసాలాల వాడకంలో ఉన్న తేడాలను ఈ వ్యవస్థ గుర్తించగలదు. ‘ఉల్లిపాయల కంటే ముందు ఏ పదార్థం వేశారు?’ వంటి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా ఇది సమాధానం ఇస్తుంది.వంట గదిలో ఏఐ అసిస్టెంట్ఈ సాంకేతికత భవిష్యత్తులో వంట చేసేటప్పుడు మన పక్కనే ఉండి మార్గనిర్దేశం చేసే ఏఐ అసిస్టెంట్గా మారనుంది. ‘మీ అమ్మమ్మ పక్కన ఉండి వంట నేర్పించినట్టే, అవసరమైనప్పుడు మాత్రమే సూచనలిచ్చే ఏఐని తయారు చేస్తున్నాం’ అని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. ఇది కేవలం వంటకే కాకుండా నృత్యం, హస్తకళలు వంటి నైపుణ్య ఆధారిత విద్యను బోధించడానికి కూడా ఉపయోగపడనుంది. భారతీయ సంస్కృతిని, ఆధునిక సాంకేతికతను జోడించి ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ చేస్తున్న ఈ పరిశోధన ఆహార విశ్లేషణ రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా! -
‘బిడ్డా.. మీ అయ్య చూస్తే ఊకోడు’
కృత్రిమ మేధస్సు (AI)తో సృష్టించే కంటెంట్ను ఈ మధ్యకాలంలో ఎందుకూ పనికి రాని విషయంగా(AI slop) చాలామంది తిడుతున్నారు. అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా.. అందునా అశ్లీలమైన కంటెంట్ వైరల్ అవుతుండడమే అందుకు కారణం. పైగా ఒరిజినాలిటీని దెబ్బ తిస్తోందని విమర్శిస్తున్నారు. కానీ అదే సాంకేతికతను వినోదం కోసం ఉపయోగిస్తే ఆ కిక్కే వేరప్పా. ఏఐ కంటెంట్ను ఇప్పుడున్న యూత్ ఎలా ఉపయోగించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలూ వాళ్ల పనితీరు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అయితే.. ఇక్కడ మాత్రం ఓ కూతురు తన తల్లిని ఆటపట్టించింది. లేని బాయ్ఫ్రెండ్ను సృష్టించి.. తల్లికి పిచ్చి కోపం తెప్పించింది. అలా నెట్టింట నవ్వులు పూయించింది. అసలు విషయంలోకి వెళ్తే.. యూపీ లక్నోకు చెందిన పావని అవస్థి తన తల్లిని సరదాగా మోసం చేసింది. చాట్జీపీటీ ద్వారా ఎడిట్ చేసిన ఫొటోను తల్లికి చూపించి బిత్తర పోయేలా చేసింది. ఆపై వాళ్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరు అని తల్లి ప్రశ్నించగా.. తన బాయ్ఫ్రెండ్ అని ఆమె బదులిచ్చింది. అవునా.. అతను నీ స్నేహితుడా?.. ఎప్పటి నుంచి మీరు స్నేహితులు? అంటూ ఆందోళనలతో ప్రశ్నలు గుప్పించి.. చాలాకాలంగా తెలుసని, మంచోడు అని, ఇంకా కొన్నిరోజుల్లో ఇంటికి వస్తాడు కదా అంటూ పావని సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయం నీ తండ్రికి తెలిస్తే బాగోదని.. ఆయన ఏమాత్రం సంతోషించరని కోపంగా మాట్లాడి లాగిపెట్టి కొట్టింది. ఫోన్ విసిరేయబోతుండగా.. సీన్ కట్ అయ్యింది. View this post on Instagram A post shared by Pawani (@pawani_awasthi_)తన తల్లిని ఏఐతో ఎలా బురిడీ కొట్టించిందో తెలియజేస్తూ పావని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ వీడియోకు ఇన్స్టాగ్రామ్లో దగ్గర దగ్గర 4 మిలియన్ల(4M) వ్యూస్ వచ్చాయి. ఈ ప్రాంక్ను ఆస్వాదించిన వాళ్లంతా.. సరాదాగా కామెంట్లు పెడుతున్నారు. నేను AIని అసహ్యించుకునే వాడిని. కానీ ఇది అద్భుతమైన వినియోగం అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. మరో ఘటనలో ఒక మనవడు తన తాతయ్య 90వ పుట్టినరోజు సందర్భంగా AI సాంకేతికతను వినియోగించి ప్రత్యేకమైన వీడియోను రూపొందించాడు. పాత కుటుంబ ఫోటోలను ఉపయోగించి, వాటిని కదిలే జ్ఞాపకాలుగా మార్చి తాతయ్య జీవితకథను చూపించాడు. ఆ వీడియో చూసిన తాతయ్య మాటలు రానంతగా భావోద్వేగానికి లోనయ్యాడు. కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. AIని కేవలం నిరుపయోగమైన కంటెంట్ సృష్టించే సాధనంగా కాకుండా, సరదా, భావోద్వేగం, కుటుంబ బంధాలను మరింత బలపరచే సాధనంగా కూడా ఉపయోగించవచ్చని ఈ వీడియో చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Generative AI | Discover, Learn & Grow (@generativeai_official) -
ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణ వేగాన్ని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తీవ్రంగా తప్పుబట్టారు. 2026 న్యూయార్క్ టైమ్స్ డీల్ బుక్ సమ్మిట్ వేదికగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ కంపెనీలు తమ సొంత డేటా సెంటర్లను నిర్మించుకోవడాన్ని 110 ఏళ్ల క్రితం నాటి విద్యుత్ రంగ పరిస్థితులతో పోల్చారు.చారిత్రక తప్పిదమే పునరావృతం?మెటా, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు తమ సొంత కంప్యూటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడాన్ని బెజోస్ తప్పుబట్టారు. 20వ శతాబ్దం ప్రారంభంలో పవర్ గ్రిడ్లు అందుబాటులోకి రాకముందు కర్మాగారాల్లో తమకు అవసరమైన విద్యుత్తును తామే ఉత్పత్తి చేసుకునేవారని, ఇప్పుడు ఏఐ రంగంలోనూ అదే జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. ‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ సొంత డేటా సెంటర్లు నిర్మించుకుంటున్నారు. కానీ ఇది శాశ్వతం కాదు. దీనికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీగా విద్యుత్తు వనరుల అవసరం పెరగనుంది. భవిష్యత్తులో టెక్ ఇండస్ట్రీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి కేంద్రీకృత క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వైపు మళ్లడం అనివార్యం. అప్పుడే వనరుల దుర్వినియోగం తగ్గుతుంది’ అని ఆయన అంచనా వేశారు. గతంలో విద్యుత్ రంగం ఎలాగైతే కేంద్రీకృతమై సమర్థవంతంగా మారిందో, ఏఐ మౌలిక సదుపాయాల్లో కూడా అదే రకమైన విప్లవం రావాలని హెచ్చరించారు.పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ఏఐ వినియోగం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా మారుతోంది. 2024లో డేటా సెంటర్లు 415 టెరావాట్ల విద్యుత్తును వాడగా, 2030 నాటికి ఇది 945 టెరావాట్లకు చేరుతుందని అంచనా. అమెరికా జాతీయ విద్యుత్ డిమాండ్లో డేటా సెంటర్ల వాటా 4 శాతం నుంచి 12 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఒక సాధారణ గూగుల్ సెర్చ్తో పోలిస్తే, ఒక్క చాట్ జీపీటీ ప్రాంప్ట్ 10 రెట్లు ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. అలాగే ఒక లార్జ్ ఏఐ మోడల్ శిక్షణకు ఏడాదికి సుమారు 200 గృహాలకు సరిపడా విద్యుత్ అవసరమవుతుందని అంచనా.శక్తి వనరులే అసలైన అడ్డంకికేవలం బెజోస్ మాత్రమే కాకుండా, ఇతర టెక్ దిగ్గజాలు కూడా విద్యుత్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒక సందర్భంలో ‘తగినంత విద్యుత్ లేక జీపీయూ చిప్స్ ఖాళీగా ఉంటున్నాయి’ అని అంగీకరించారు. సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ) గతంలో మాట్లాడుతూ విద్యుత్ లభ్యత అనేది ఏఐ వృద్ధికి దీర్ఘకాలిక అడ్డంకి అని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి మెటా సంస్థ ఒహియోలో ఏర్పాటు చేస్తున్న తన సూపర్ క్లస్టర్ కోసం ఏకంగా అణు విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకోగా, ఆల్ఫాబెట్ సంస్థ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 4.75 బిలియన్ డాలర్లను వెచ్చించింది.ఇదీ చదవండి: లక్షకు పైగా యూఎస్ వీసాల రద్దు.. -
ఆశ్చర్యపోయాను!.. శ్రీధర్ వెంబు ట్వీట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తున్న తరుణంలో.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఒక ట్వీట్ చేశారు. కృత్రిమ మేధస్సు (AI).. సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోందని ఇందులో ఒక ఉదాహరణతో వివరించారు.సంస్థలోని R&D బృందంలో పనిచేసే ఇంజనీర్.. నెల రోజుల తన ఖాళీ సమయంలో తయారు చేసిన ఒక పరికరాన్ని నాకు చూపించారు. అతను దానిని తయారు చేస్తున్నట్లు నాకు తెలియదు. కానీ దానిని చూడగానే నేను ఆశ్చర్యపోయాను.మూడు లేదా నలుగురు వ్యక్తులు.. ఆ పరికరాన్ని తయారు చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది. కానీ అతను కేవలం నెల రోజుల్లోనే దాన్ని అభివృద్ధి చేశారు. ఇంత వేగంగా దీనిని రూపొందించడానికి ప్రధాన కారణం Opus 4.5 అనే AI మోడల్ అని ఆ ఇంజనీర్ చెప్పారు.ఒకప్పుడు ఏఐ ద్వారా రాసే కోడ్పై అతనికి (ఇంజినీర్) అంతగా నమ్మకం లేదు. కానీ Opus 4.5 వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెంబు వివరించారు. అంతే కాకుండా జోహో కంపెనీలో ప్రయోగాత్మక సంస్కృతిని ప్రస్తావించారు. మేము సంస్థలో తెలివైన వాళ్లకు స్వేచ్ఛ ఇస్తాం, వాళ్లే కొత్త మార్గాలు కనుగొంటారని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.ఇంతవరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చేతితో నేసే చేనేత (Handloom) లాంటిదైతే, ఇప్పుడు AI రూపంలో శక్తివంతమైన యంత్ర మగ్గాలు (Machine Looms) వచ్చేశాయని అన్నారు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీల మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది. జోహో కూడా దీనికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను చీఫ్ సైంటిస్ట్గా ఉన్నందున ఈ మార్పులను ఎదుర్కోవాల్సిన బాధ్యత తనపై ఉందని వెంబు వెల్లడించారు.Yesterday one of our experienced engineers who works in my R&D team, showed me an assembly and machine code security tool he built in his spare time over the past month. I did not know he was building it. I was blown away by the depth and breadth of the tool. He has developed…— Sridhar Vembu (@svembu) January 8, 2026 -
CES 2026: లాలిపాప్తో మ్యూజిక్.. అదిరిపోయే గాడ్జెట్స్ మీకోసం
వాషింగ్టన్ డీసీ: హలో టెక్ లవర్స్. అమెరికాలో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026)లో జరుగుతుంది కదా. మరి ఈ టెక్ షోలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే గాడ్జెట్స్పాటు ఇతర ప్రొడక్ట్ల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, తెలుసుకుందాం పదండి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో తమ తాజా ఆవిష్కరణలను ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలో సాధారణ గాడ్జెట్లు మాత్రమే కాకుండా, వినియోగదారులను ఆశ్చర్యపరిచే విచిత్రమైన ఉత్పత్తులు చూపరులను కట్టిపడేశాయి.వాటిల్లో ఐపాలిష్ డిజిటల్ మేనిక్యూర్మగువుల కోసం ప్రత్యేకంగా ఐపాలిష్ డిజిటల్ మేనిక్యూర్ను డిజైన్ చేశారు. ఇదే ప్రపంచంలోనే మొదటి డిజిటల్ మేనిక్యూర్ సిస్టమ్.ఇందులో ప్రెస్-ఆన్ నెయిల్స్లో మైక్రో డిస్ప్లే ఉంది. స్మార్ట్ఫోన్లోని యాప్ సాయంతో 400 షేడ్స్ను వెంటనే మార్చుకోవచ్చు. యాప్లో 400 వేర్వేరు షేడ్స్/రంగులు అందుబాటులో ఉంటాయి. యూజర్ యాప్లో తనకు నచ్చిన రంగును ఎంచుకుంటే, ఆ రంగు వెంటనే నెయిల్పై డిస్ప్లేలో కనిపిస్తుంది.అంటే,నెయిల్ పాలిష్ మార్చుకోవడానికి మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. కేవలం యాప్లో టచ్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే, స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా గోళ్ల రంగు డిజిటల్గా మారుతుంది. ఇది ఫ్యాషన్కి టెక్నాలజీని జోడించిన వినూత్న ఆవిష్కరణ.వైబ్రేటింగ్ కిచెన్ బ్లేడ్లు C-200 అల్ట్రాసోనిక్ చెఫ్స్ నైఫ్వైబ్రేటింగ్ కిచెన్ బ్లేడ్. దీని స్పెషాలిటీ ఎంతో తెలుసా?.ఈ కత్తి సాధారణ కత్తి కాదు. ఇందులో అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ టెక్నాలజీ అమర్చబడి ఉంది.సెకనుకు 30వేల సార్లు వైబ్రేట్ అవుతుంది. కఠినమైన కూరగాయలు, పండ్లు కూడా రెప్పపాటు కాలంలో కోయగలదు. ఆహారం బ్లేడ్కు అంటకుండా సాఫీగా కట్ అవుతుంది.ఈ కత్తి వంటగదిలో సులభంగా, వేగంగా, శుభ్రంగా కట్ చేయడానికి సహాయపడుతుంది. టమోటాలు, స్క్వాష్, దోసకాయ వంటి కూరగాయలు మాంసం, చేపలు,బ్రెడ్, పండ్లు ఇవన్నీ రెప్పపాటు కాలంలో కోయగలదు.సీ-200 అల్ట్రాసోనిక్ చెఫ్ వంటగదిలో టెక్నాలజీని జోడించిన వినూత్న ఆవిష్కరణ. ఇది కేవలం కత్తి మాత్రమే కాదు, వంటను మరింత సులభం, వేగం, శుభ్రంగా చేసే స్మార్ట్ కిచెన్ టూల్. ఇందులో 1100 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ, యూఎస్బీ-సీ టైప్ ఛార్జింగ్ సౌకర్యం, అలాగే ఐపీ65 వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. వంటగదిలో వినియోగించడానికి ఇది చాలా సులభంగా, సురక్షితంగా ఉంటుంది.లాలిపప్ స్టార్లాలిపాప్. స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇచ్చే ఓ తియ్యటి పదార్ధం. పిల్లలు, పెద్దలకు ఫన్ ట్రీట్ ఇచ్చే లాలిపప్కు ఓ టెక్ కంపెనీ బోన్ కండీషన్ టెక్నాలజీని జోడించింది. అంతే ఈ తరహా టెక్నాలజీ ఉన్న లాలిపాప్ను తిన్నప్పుడల్లా పాటలు వినొచ్చు. అదెలా అంటే లాలిపాప్ను కొరుక్కునప్పుడు, దాని హ్యాండిల్లోని చిన్న ఎలక్ట్రానిక్ మాడ్యూల్ వైబ్రేషన్లు సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్లు మీ దవడ ఎముకల ద్వారా నేరుగా లోపలి చెవి భాగాలకు చేరుతుంది.పాటలు వినగలుగుతారు.ఎలక్ట్రానిక్ భాగం ఉన్నందున, పూర్తిగా తినకూడదు. కేవలం లాలిపాప్ భాగం మాత్రమే తినదగినది. సాధారణ హెడ్ఫోన్లతో పోలిస్తే శబ్దం తక్కువ స్పష్టంగా ఉండవచ్చు.వీరల్ సోలార్ ఛార్జింగ్ కోప్లౌ పవర్ హాట్ఈకోఫ్లో పవర్ హ్యాట్ (EcoFlow Power Hat) అనేది సోలార్ సెల్స్తో కూడిన వైడ్ బ్రిమ్ హ్యాట్. ఇది కేవలం సూర్యరశ్మి నుండి రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, బయట నడుస్తూ లేదా అవుట్డోర్ యాక్టివిటీల్లో ఉన్నప్పుడు స్మార్ట్ఫోన్ వంటి చిన్న గాడ్జెట్లను ఛార్జ్ చేసే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. హ్యాట్ చుట్టూ అమర్చిన సోలార్ ప్యానెల్స్ సూర్యరశ్మిని గ్రహించి, గరిష్టంగా 12 వాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తాయి. ఈ పవర్ను యూఎస్బీఏ,యూఎస్బీ సీ పోర్టుల ద్వారా ఒకేసారి రెండు డివైస్లకు అందించవచ్చు. ఈటోపీ తేలికైన మెటీరియల్తో తయారు చేసింది. బరువు అనిపించదు. ఐపీ65 వాటర్ప్రూఫ్, డస్ట్ప్రూఫ్ రేటింగ్తో హైకింగ్, బీచ్ ట్రిప్స్, ఫిషింగ్ వంటి అవుట్డోర్ యాక్టివిటీలకు అనుకూలంగా ఉంటుంది. ఔట్డోర్లో ఉన్నప్పుడు పవర్ బ్యాంక్ లేకపోయినా, ఈ హ్యాట్ ద్వారా ఫోన్ లేదా చిన్న గాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు.ఈ హ్యాట్ కేవలం సూర్యరశ్మిలో ఉన్నప్పుడు మాత్రమే పవర్ ఉత్పత్తి చేస్తుంది. 12డబ్ల్యూ పవర్ పరిమితి కారణంగా ల్యాప్టాప్లు లేదా పెద్ద గాడ్జెట్లను ఛార్జ్ చేయడం సాధ్యం కాదు.ఏఐ స్మార్ట్ క్లిప్పర్Glyde Smart Hair Clipper అనేది ఏఐ ఆధారిత పనిచేసే హెయిర్కట్ పరికరం. ఇది తల ఆకారాన్ని గుర్తించి బ్లేడ్ యాంగిల్, స్పీడ్ను ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తుంది. మొబైల్ యాప్ ద్వారా విజువల్ గైడెన్స్ అందిస్తూ, ఇంట్లోనే సలూన్-క్వాలిటీ హెయిర్కట్ చేస్తుంది. ఈ ఎయిర్ క్లిప్పర్ను తాజా ఈవెంట్లో పరిచయం చేశారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఏఐ ఆధారిత హెయిర్ క్లిప్పర్గా గుర్తింపు పొందింది. దీని లక్ష్యం ఒకటే ఎవరైనా, ఎలాంటి అనుభవం లేకపోయినా, 10 నిమిషాల్లో ఇంట్లోనే సెలూన్ క్వాలిటీ హెయిర్కట్ చేసేందుకు ఉపయోగపడటం. ఈ క్లిప్పర్లో ఎఐ స్టైలిస్ట్ అనే సిస్టమ్ ఉంటుంది. ఇది తల ఆకారాన్ని స్కాన్ చేసి, బ్లేడ్ యాంగిల్, స్పీడ్ను ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తుంది. కాబట్టి కత్తిరింపు సమయంలో పొరపాట్లు జరగకుండా, సాఫ్ట్గా, సమానంగా హెయిర్కట్ అవుతుంది.సాధారణ క్లిప్పర్ కంటే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. యాప్ లేకుండా పూర్తి ఫీచర్లు ఉపయోగించలేరు. మొదటిసారి ఉపయోగించే వారికి కొంత సమయం పట్టవచ్చు. -
హెల్మెట్తో.. టెక్కీ బ్రిలియంట్ ఐడియా
సాక్షి,బెంగళూరు: ఐటీ ఉద్యోగి వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. పంకజ్ తన్వర్ తన హెల్మెట్ను వినూత్నంగా మార్చారు. సాధారణ హెల్మెట్ను కృత్రిమ మేధస్సు ఆధారిత రోడ్ సేఫ్టీ టూల్గా మార్చేశారు.పంకజ్ తన్వర్ ఆవిష్కరణ ఒక సాధారణ ఆలోచనతో మొదలైంది. ‘టెక్నాలజీని కేవలం సౌకర్యం కోసం కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలి’ అనే సదుద్దేశ్యంతో ఆయన ఈ హెల్మెట్ను రూపొందించారు.ఈ స్మార్ట్ హెల్మెట్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు నిర్ధారిత ఆధారాలు చేరుతాయి. ఫలితంగా, రోడ్లపై క్రమశిక్షణ పెరుగుతుంది. చిన్న ఆవిష్కరణ కూడా ప్రతిరోజు జీవనాన్ని మరింత సురక్షితంగా మార్చగలదని నమ్ముతున్నారు.బెంగళూరులో పుట్టిన ఈ ఆవిష్కరణతో ఇన్నోవేషన్, టెక్నాలజీ కలిస్తే సమాజానికి ఎంతటి మేలు జరుగుతుందో స్పష్టంగా తెలుస్తోంది. ఒక సాధారణ హెల్మెట్ను ఏఐ ఆధారిత రోడ్ సేఫ్టీ సాధనంగా మార్చిన పంకజ్ తన్వర్ ఆవిష్కరణ, రోడ్లపై క్రమశిక్షణను పెంచుతూ, ప్రజల జీవనాన్ని మరింత సురక్షితంగా మార్చే దిశగా అడుగులు పడినట్లేనని పలువురు వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హెల్మెట్ ప్రత్యేకతలు ఈ స్మార్ట్ హెల్మెట్ రియల్ టైమ్లోనే ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించగలదువిజువల్స్ను క్యాప్చర్ చేయడంలొకేషన్ వివరాలు నమోదు చేయడం వాహన నంబర్ ప్లేట్ను గుర్తించడం సమాచారాన్ని ధృవీకరించి ట్రాఫిక్ పోలీసులకు పంపించడం విధంగా, రోడ్లపై జరుగుతున్న ఉల్లంఘనలకు తక్షణ సాక్ష్యాలు అందుబాటులోకి వస్తాయి -
ఆస్క్ మీ... ఏనుగంత టాస్క్
ఓపెన్ ఏఐ రంగంలో విజేతగా నిలవాలంటే చిన్న చిన్న సమస్యల్ని కాకుండా, పరిష్కారానికి అత్యంత కష్టంగా ఉండేవాటిని ఎంచుకోవాలని వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘టుగెదర్ ఫండ్’ కో–ఫౌండర్ మానవ్ గార్గ్ అంటు న్నారు. ఏఐ రంగంలో స్టార్టప్ పెట్టుబడుల వేటలో ఉన్నవారు తమ విజన్ ప్రపంచాన్ని ఎలా మెరుగుపరచ గలదో స్పష్టంగా చెప్పలేకపోతే వెంచర్ క్యాపిటలిస్టు లను ఒప్పించటం చాలా కష్టం అని గార్గ్ సూచిస్తు న్నారు. ఆయన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:వస్తున్నది 100... పోతున్నది 110‘‘ప్రస్తుతం దాదాపు అన్ని ఏఐ స్టార్టప్ కంపెనీలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. దీనర్థం ఏమిటంటే, మాకు వంద రూపాయల ఆదాయం వస్తే... కేవలం టెక్నాలజీ, కంప్యూటర్ సర్వర్ల కోసమే 110 రూపాయలు ఖర్చు అవుతోంది. ఇక మార్కెటింగ్, ఉద్యోగుల జీతాల ఖర్చులు దీనికి అదనం. అలాగని ఇది తెలివి తక్కువ తనం కాదు, ఇదొక వ్యూహం. టెక్నాలజీ ఖర్చులు రాను రానూ వేగంగా తగ్గిపోతాయి కాబట్టి, ఇప్పుడు నష్ట మైనా సరే ఎక్కువ మంది వినియోగదారులను, డేటాను సంపాదించుకునే కంపెనీలే భవిష్యత్తులో లాభాలు వచ్చినప్పుడు మార్కెట్ను ఏలుతాయి.ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీ ఖర్చు‘‘ఓపెన్–ఏఐ’ సంస్థ వేల కోట్లు నష్టపోతోందని వినిపి స్తోంది. వారు సుమారు 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూడబోతున్నారని అంచనా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ నష్టంలో కేవలం 20 శాతం మాత్రమే కొత్త ఏఐ మోడల్స్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు వల్ల వస్తుంది. అసలైన భారీ ఖర్చంతా– దాదాపు 70 శాతం – ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. పెద్ద ఎత్తున డేటాసెంటర్ల నిర్మాణం, ఎంత వ్యయమైనా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను కొనడం, కరెంట్ బిల్లుల చెల్లింపు వంటివి. గూగుల్ సంస్థలా సొంతంగా చిప్స్ తయారీ, సొంత డేటా సెంటర్లు ఏర్పాటు, ప్రత్యేక విద్యుత్ఒప్పందాలు ఉన్నప్పుడు మాత్రమే ఇంత పెద్ద స్థాయిలో ఏఐ వ్యాపారాన్ని లాభదాయకంగా నడపడం సాధ్య మవుతుంది.యాప్స్ స్థానంలో ఏఐ ఏజెంట్లు!‘‘మనం ఇప్పుడు వాడుతున్న సాధారణ యాప్స్ భవి ష్యత్తులో మెల్లగా మరుగునపడిపోతాయి. రాబోయే కాల మంతా ‘ఏఐ ఏజెంట్’ (ఒక పర్సనల్ అసిస్టెంట్ లాంటి సాఫ్ట్వేర్)లదే. మనం గంటల కొద్దీ బ్రౌజింగ్ చేయటం ఉండదు. ఈ ఏఐ ఏజెంట్లకు మీ ఇష్టానిష్టాలు తెలు స్తాయి. మీ తరఫున అవి పనులు చేస్తాయి. మీ క్యాలెండర్ లేదా మీరు ధరించే వాచీలు వగైరాల నుంచి సమా చారాన్ని తీసుకుని ఎప్పటికప్పుడు మీకు సాయపడ తాయి. ఒక్కసారి ఊహించండి:నా పర్సనల్ ఏఐఏజెంట్ నేరుగా అమ్మకాలు జరిపేవారి ఏఐ ఏజెంట్తో మాట్లాడుతుంది. నా బడ్జెట్ ప్రకారం బేరమాడుతుంది, నా ఆరోగ్యానికి తగిన, నా సమయానికి అనుకూలమైన వస్తువును ఎంచుకుంటుంది. ఆపై నేరుగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఇదంతా నేను ఒక్క వెబ్సైట్ కూడా ఓపెన్ చేయకుండానే జరిగి పోతుంది.కొత్తవాటిపై కసరత్తు చేయాలి!‘‘మీరు ఏఐ రంగంలో విజేతగా నిలవాలంటే, అందరికీ తెలిసిన చిన్న చిన్న సమస్యలు కాకుండా, పరిష్కరించ డానికి కష్టంగా ఉండే కొత్త సమస్యలను ఎంచుకోవాలి. అప్పుడే మీ పోటీదారులు మిమ్మల్ని త్వరగా కాపీ కొట్ట లేరు. మీ దగ్గర ఉన్న ప్రత్యేకమైన డేటా ఆధారంగా ఇతరులు సులభంగా తయారు చేయలేని విధంగా మీ వ్యాపారాన్ని నిర్మించుకోవాలి. ఏఐ రేసులో భారతదేశం శక్తిని చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఓపెన్–ఏఐ’ని ఎక్కువగా వాడు తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దగ్గర అద్భుతమైన ఇంజనీర్లు ఉన్నారు. అంతేకాకుండా, ఇక్కడ చాలా రకాల వ్యాపారాలు ఇంగ్లిష్లోనే జరుగు తాయి కాబట్టి, భారతీయ కంపెనీలు మొదటి రోజు నుండే ప్రపంచ స్థాయిలో కొత్త ఏఐ ఉత్పత్తులను తయారు చేసే గొప్ప అవకాశం ఉంది.-ఎడిటోరియల్ టీమ్ -
ఏఐలో మనమేం చేయాలి?
‘డీప్సీక్’ గుర్తుందా? గడచిన 2025 మొదట్లో ఈ చైనీస్ కంపెనీ కృత్రిమ మేధ రంగాన్ని కుదిపేసింది. తక్కువ ఖర్చుతో అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన ‘ఛాట్ జీపీటీ’ని తలదన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను విడుదల చేసింది. కృత్రిమ మేధలో చైనా ఎంత ముందుందో ప్రపంచానికి చాటిన సందర్భం ఇది. తాజాగా అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్ సైతం ‘డీప్సీక్’ ప్రాముఖ్యన్ని గుర్తించింది. కంపెనీ వ్యవస్థాపకుడు లియంగ్ వెన్ఫెంగ్ను గతేడాది టాప్ వ్యక్తుల్లో ఒకరిగా నిలిపింది. ఒకే ఏడాదిలో డీప్సీక్ తాలూకూ జనరల్ పర్పస్ వీ–3 మోడల్ విప్లవాత్మకమైన మార్పునకు కారణమైంది. దీంట్లోని అడ్వాన్స్డ్ మోడల్ ఆర్–1 తర్కానికి సంబంధించినది. ఫలితంగా ఇది గణిత, సాఫ్ట్వేర్ కోడింగులకు సంబంధించిన సంక్లిష్టమైన విషయాలను కూడా మెరుగ్గా చేపట్టగలదు. పైగా ఇది ఓపెన్ మోడల్. అంటే ఎవరైనా స్వేచ్ఛగా దీన్ని వేర్వేరు రంగాల్లో ఉపయోగించుకోవచ్చు. లాంగ్వేజ్ మోడళ్లకు శిక్షణ ఇవ్వాలంటే అపారమైన సమాచారం అవసరం. ఎంత సమాచారంతో శిక్షణ ఇస్తే అంత మెరుగైన ఫలి తాలు రాబట్టుకోవచ్చు. గతేడాది చైనీస్ ఏఐ మోడళ్లు మార్కెట్లో అన్నింటి కంటే ముందున్నట్లు ఒక సర్వే ద్వారా తెలిసింది. అంత ర్జాతీయంగా 33 శాతం మంది వీటిని వాడుతున్నట్లు అంచనా.ఇంగ్లీషు తరువాత అత్యధిక సంఖ్యలో టోకెన్లు అడిగింది కూడా చైనీస్ భాషలోనే కావడం గమనార్హం. చైనాతోపాటు అంతర్జాతీయంగానూ చైనా మోడళ్లు బాగా పనిచేస్తున్నాయనేందుకు ఇవి నిదర్శ నాలు. శిక్షణ సమయంలో ఏఐ మోడళ్లు ప్రాసెస్ చేసి అర్థం చేసు కోవడం ద్వారా అంచనా కట్టే, తర్కాన్ని అభివృద్ధి చేసుకునే యూనిట్లనే ‘టోకెన్లు’ అని పిలుస్తారు. ఏఐలో స్వావలంబన కోసం...డీప్సీక్ ప్రకటన వెలువడిన వెంటనే భారత్ కూడా ఎల్ఎల్ఎంలతో పాటు స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్, ప్రాథమిక ఏఐ మోడళ్ల అభి వృద్ధి గురించి వివరాలు వెల్లడించింది. భారతీయ అవసరాలకు తగ్గట్టుగా ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ‘డిజిటల్ ఇండియా భాషిణి’ (భారతీయ భాషలను అను వదించేది), ‘భారత్ జెన్’ (ప్రభుత్వ సేవలను అందించే మల్టీ మోడల్ ఎల్ఎల్ఎం), పదివరకూ భారతీయ భాషల ఏఐ ఎల్ఎల్ఎం మోడల్గా ‘సర్వం–1’, వీడియోలను సృష్టించే ‘చిత్ర లేఖ’, 35 వరకూ భారతీయ భాషలకు ‘హనూమాన్ ఎవరెస్ట్ 1.0’ పేరుతో ఓ ఏఐ వ్యవస్థ వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి. ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో ‘భారత్ జెన్’ అభివృద్ధికి పలు టెక్నాలజీ విద్యా సంస్థలు చేతులు కలిపాయి.కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కొన్ని నిధులు సమకూర్చాయి. జాతీయ ఏఐ మిషన్ కింద మరో రూ. 980 కోట్లు కూడా కేటాయించారు. ఈ రకమైన మద్దతు లభించిన, ఒక దేశ లక్ష్యం కోసం ఏర్పాటైన మొట్టమొదటి ప్రాజెక్టు భారత్ జెన్ మాత్రమే అయివుంటుంది.భారత్ జెన్ను చాలామంది డీప్సీక్కు పోటీ అనుకుంటారు. కానీ రెండింటి మధ్య చెప్పుకోదగ్గ తేడాలున్నాయి. డీప్సీక్ పూర్తిగా వాణిజ్యపరమైంది. స్టార్టప్ మాదిరిగా మొదలైంది.భారత్ జెన్... వ్యూహాత్మకమైన జాతీయ మిషన్. సాంకేతిక రంగం విషయంలో స్వావలంబన కోసం ప్రభుత్వ మద్దతుతో మొదలైన ప్రాజెక్టు. డీప్ సీక్, ఛాట్జీపీటీల ముందున్న అతి పెద్ద సవాలు... సంక్లిష్టమైన భారతీయ భాషలను, సంస్కృతులను అర్థం చేసుకోవడం. ఈ అంత రాన్ని ‘భారత్ జెన్’ పూడ్చగలదని అంచనా. 1970, 80లలో కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సీఎంసీ, సీ–డాట్ కంపెనీల మాదిరిదే ఈ భారత్ జెన్. సీఎంసీ, సీ–డాట్లను దేశీ స్వావలంబన, ఆత్మనిర్భరత లక్ష్యాలతోనే ఏర్పాటు చేశారు. ఇవి విజయవంతం కావడం వెనుక ఐఐటీలు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ వంటిసంస్థలు కూడా ఉన్నాయి. అవసరమైన మార్గదర్శకాలుఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, భారతీయ టెక్ కంపె నీలేవీ ఏఐ ఫౌండేషనల్ మోడళ్లను అభివృద్ధి చేయకపోవడం. అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఏఐ వ్యవస్థలకు అవసరమైన డేటా సెంటర్ల వంటి మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. భార తీయ టెక్ పరిశ్రమ మొత్తం సేవా రంగం ప్రధానంగానే నడుస్తోంది. సుమారు 200 బిలియన్ డాలర్ల ఆదాయమున్న ఈ రంగం ఏఐ విషయంలో ప్రేక్షక పాత్ర వహించడం అభిలషణీయం కాదు. నైపుణ్యం, అనుభవం, ఆర్థిక శక్తి కూడా కలిగిన భారతీయ టెక్ రంగం భారత్ జెన్ వంటి వాటి అభివృద్ధికి భాగస్వాములు కావాల్సిన అవసరముంది.ప్రభుత్వ సహకారం లేదు కానీ డీప్సీక్ అభివృద్ధి చేసిన మోడళ్లు చైనా ప్రభుత్వ పర్యవేక్షణకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నాయి. ప్రస్తుత చైనా నియంత్రణల ప్రకారం... అన్ని ఏఐ సేవలు కూడా సోషలిస్ట్ విలువలను పాటించాలి. జాతీయ ఏకతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. అందుకే తియనాన్మెన్ స్క్వేర్ నిరస నలు, తైవాన్ పరిస్థితి, చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంపై వస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదుల వంటి అంశాలపై ఈ మోడళ్లు కిమ్మనవు.బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి అన్న నినాదంతో మార్గదర్శ కాలను ప్రభుత్వం విడుదల చేసింది. పారదర్శకత, జవాబుదారీ తనం, భద్రత, మానవ పర్యవేక్షణల ప్రాముఖ>్యన్ని, అవసరాన్ని ఈ మార్గదర్శకాలు నొక్కి చెప్పాయి.ప్రభుత్వ సహకారంతో నడుస్తోంది కాబట్టి, అటు ఈ మద్దతును కొనసాగించడం... ఇటు ప్రజా సంక్షే మాన్ని దృష్టిలో ఉంచుకోవడం భారత్ జెన్కు కీలకం. పాశ్చాత్య దేశాల ఏఐ మోడళ్లలో మాదిరి అల్గరిథవ్ుల పరమైన వివక్ష భారత్ జెన్లో ఉండకూడదు. రాజకీయ ప్రభావానికి గురిచేసేలా, తప్పుడు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మొత్తం సామాన్యుల పన్నుల డబ్బుతోనే నడుస్తోంది. వేర్వేరు భాషలకు సంబంధించిన ఎల్ఎల్ఎంలను అభివృద్ధి చేసే సందర్భంలోనూ పారదర్శకతకు, జవాబుదారీతనానికి పెద్ద పీట వేయాలి. భాషా శాస్త్రవేత్తలు, సోషల్ సైంటిస్టులు, వేర్వేరురంగాల నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరిపి అభివృద్ధి చేస్తేనే ఈ లక్ష్యం నెరవేరుతుందన్నది గుర్తుంచుకోవాలి.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
గ్రోక్ను చుట్టుముట్టిన న్యూడ్ ఫోటోల వివాదం
న్యూఢిల్లీ: xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్ గ్రోక్ ను న్యూడ్ ఫోటోల వివాదం చుట్టుముట్టింది. గ్రోక్ను ఆసరాగా చేసుకుని ఆకతాయిలు న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రముఖుల ఫోటోలను న్యూడ్గా మారుస్తూ ప్రస్తుత సమాజానికి సవాల్ విసురుతున్నారు. ప్రైవేటు వ్యక్లుల ఫోటోలు ఇచ్చి న్యూడ్ పిక్స్గా ఇమ్మంట ప్రామ్టింగ్ చేస్తున్నారు వీటిని సోషల్ మీడియలో వైరల్ చేస్తున్నారు. దాంతో అమాయిక మహిళలు, చిన్న పిల్లలు ఈ చర్యలకు బలైపోతున్నారు. దీనిపై కేంద్రానికి ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫిర్యాదు చేశారు. Grok అనేది ఎలన్ మస్క్ స్థాపించిన xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్. ఇది “truth-seeking AI”గా పిలవబడుతూ, రియల్టైమ్ సెర్చ్, రీజనింగ్, కోడింగ్, విజువల్ ప్రాసిసింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. దీన్ని తప్పుదోవలో ఉపయోగిస్తూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. దీని ఫలితంగా AI వినియోగంలో నైతికత, భద్రత అంశాలపై చర్చకు కారణమైంది. -
ఆనంద్ మహీంద్రా న్యూ ఇయర్ సందేశం
కృత్రిమ మేథ (ఏఐ)తో ఫ్యాక్టరీ టెక్నీషియన్లు, మెషినిస్టుల్లాంటి బ్లూకాలర్ ఉద్యోగులకు ముప్పేమీ ఉండదని, ప్రాక్టికల్ నైపుణ్యాలను వినియోగించి వారు మరింత ఆదాయం ఆర్జించేందుకు తోడ్పడే యాక్సిలరేటరుగా ఇది ఉపయోగపడుతుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.ఇంటెలిజెంట్ సిస్టమ్లు రొటీన్ పనులను నిర్వహించడం వల్ల ప్రాక్టికల్ నైపుణ్యాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని, ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో ఆయన పేర్కొన్నారు. ఏఐ గురించి ఆందోళన చెందకుండా టెక్నీషియన్లు దానితో ధీమాగా కలిసి పని చేసే విధంగా మార్పులు వస్తాయని వివరించారు. దీన్ని తాము ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ పరమైన పరిణామాలతో బ్లూకాలర్ ఉద్యోగాలు కాస్తా ఆకర్షణీయమైన గోల్డ్ కాలర్ ఉద్యోగాలుగా మారతాయని తెలిపారు.ఇదీ చదవండి: 10 నిమిషాల్లో డెలివరీ: స్పందించిన జొమాటో సీఈఓమారుతున్న టెక్నాలజీ, భౌగోళిక - రాజకీయపరమైన పరిణామాలతో నూతన సంవత్సరంలో సర్వత్రా అనిశ్చితి నెలకొనవచ్చని మహీంద్రా చెప్పారు. అయితే అనిశ్చితిని శత్రువుగా పరిగణించకుండా, మన సత్తా నిరూపించుకునే అవకాశంగా భావించాలని సూచించారు. 2025లో ఎస్యూవీలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, మహీంద్రా ఫైనాన్స్ తదితర వ్యాపార విభాగాల్లో గ్రూప్ గణనీయ విజయాలు సాధించిందని ఆనంద్ మహీంద్రా చెప్పారు. -
పనికిరాని వీడియోలకు వ్యూస్
ప్రపంచంలో అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లో విలువ లేని, పనికి రాని వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా బిలియన్ల కొద్దీ మొబైల్ స్క్రీన్పై దర్శనమిస్తున్నాయి. నూతన యూజర్ల స్క్రీన్పై వచ్చే షార్ట్స్లో ఏఐతో తయారైన బ్రెయిన్ రాట్ వీడియోలు అయిదింట ఒక వంతు కైవసం చేసుకున్నాయి. వీటితో వీక్షకులకు సమయం వృథా తప్ప ఎటువంటి ప్రయోజనంచేకూర్చకపోవడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్క్యాప్వింగ్ నివేదిక ప్రకారం... క్లౌడ్ ఆధారిత ఆన్లైన్ వీడియో ఎడిటర్ క్యాప్వింగ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన 15,000 యూట్యూబ్ చానెళ్లను కంపెనీ అధ్యయనం చేసింది. ప్రతి దేశం నుంచి టాప్–100 చానెళ్లు వీటిలో ఉన్నాయి. 278 చానెళ్లు పూర్తిగా ఏఐ స్లాప్ కంటెంట్ను మాత్రమే ప్రసారం చేస్తున్నాయి. ఏఐ స్లాప్ చానెళ్లు 2025 అక్టోబర్ నాటికి 6,300 కోట్లకుపైగా వ్యూస్, 22.1 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ను సంపాదించాయి. ఏటా ఇవి సుమారు రూ.1,050 కోట్లు ఆర్జిస్తున్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఏఐ స్లాప్ యూట్యూబ్ చానెళ్లలో మన దేశానికి చెందిన ‘బందర్ అప్నా దోస్త్’అత్యధిక వ్యూస్తో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ విభాగంలో ఏటా రూ.38 కోట్లకుపైగా ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్లో నిలిచింది. నివేదిక హైలైట్స్.. ⇒ 207 కోట్లకుపైగా వ్యూస్తో భారత్కు చెందిన ‘బందర్ అప్నా దోస్త్’ఏఐ స్లాప్ చానెల్ అంతర్జాతీయంగా టాప్లో నిలిచింది. ⇒ ప్రపంచంలో అత్యధికంగా స్పెయిన్కు చెందిన ట్రెండింగ్ ఏఐ స్లాప్ చానెల్స్కు 2 కోట్ల మందికిపైగా సబ్స్రై్కబర్స్ ఉన్నారు. ⇒ దక్షిణ కొరియాలో ప్రముఖ ఏఐ స్లాప్ చానెల్స్ 845 కోట్ల పైచిలుకు వ్యూస్ నమోదు చేశాయి. ⇒ యూఎస్లోని స్లాప్ చానెల్ క్యూంటోస్ ఫాసినాంటెస్ (సిక్) 59.5 లక్షల మంది సబ్స్రై్కబర్స్ కలిగి ఉంది. ⇒ కొత్త యూజర్లకు వచ్చే ఫీడ్లో తొలి 500 యూట్యూబ్ షార్ట్స్లో బ్రెయిన్రాట్ వీడియోలు దాదాపు 33% ఉన్నాయి. ⇒ నూతన యూజర్ల స్క్రీన్పై వచ్చే మొదటి 500 షార్ట్స్లో ఏఐ స్లాప్ వీడియోలు 21% కైవసం చేసుకున్నాయి.ఏఐ స్లాప్ తగినంత శ్రద్ధ, కచ్చితత్వం, ఆలోచన లేకుండా సబ్స్క్రిప్షన్స్, వ్యూస్ కోసమే ఆటోమేటిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉపయోగించి రూపొందించి, పంపిణీ చేసిన విలువ లేని, పనికిరాని ఏఐ వీడియోలు. కంటెంట్లో లోపాలకుతోడు ప్రతికూల ప్రభావాలకు ఇవి దారితీస్తాయి.బ్రెయిన్రాట్నియంత్రణ, అర్థం లేని, తక్కువ నాణ్యత గల ఏఐ, ఏఐ రహిత వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు వీక్షకుడి మానసిక, మేధోస్థితిని క్షీణింపజేసే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. -
గూగుల్ క్రోమ్ తిరుగులేని ప్రయాణం
ఇంటర్నెట్ వినియోగంలో ఒక విప్లవం వస్తుందని, ఏఐ ఆధారిత బ్రౌజర్లు వెబ్ బ్రౌజింగ్ తీరును పూర్తిగా మార్చేస్తాయని గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓపెన్ఏఐ మద్దతు ఉన్న అట్లాస్, పెర్ప్లెక్సిటీ ఆధ్వర్యంలోని కామెట్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోని కోపైలట్ వంటివి సాంప్రదాయ బ్రౌజర్లకు ముగింపు పలుకుతాయని భావించారు. కానీ, 2025 ముగింపు దశకు చేరుకున్నా గూగుల్ క్రోమ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.భారత మార్కెట్లో క్రోమ్ ప్రభంజనంభారతదేశంలో సుమారు 90% బ్రౌజింగ్కుపైగా మార్కెట్ వాటాతో గూగుల్ క్రోమ్ అగ్రస్థానంలో ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో క్రోమ్ డిఫాల్ట్ బ్రౌజర్గా ఉండటం, గూగుల్ ఖాతాతో ఉన్న విడదీయలేని అనుబంధం ఇందుకు కారణమని తెలుస్తుంది. ఒపెరా, సఫారీ వంటివి సింగిల్ డిజిట్ వాటాకే పరిమితం కాగా, ఎడ్జ్, ఫైర్ఫాక్స్ 1% కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. క్రోమ్ 71% మార్కెట్ వాటాను కలిగి ఉండగా, యాపిల్ సఫారీ (15%) రెండో స్థానంలో ఉంది. ఏఐను ఉపయోగిస్తున్న ఇతర బ్రౌజర్లు ఇప్పటికీ నామమాత్రపు వాటాకే పరిమితమయ్యాయి.ఈ లెగసీకి కారణం..కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉందనే కారణంతో వినియోగదారులు తమ దశాబ్ద కాలపు అలవాట్లను మార్చుకోవడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికిగల కారణాలు..జీమెయిల్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ వంటి సేవలతో క్రోమ్ ఇచ్చే అనుభవం మరే బ్రౌజర్ ఇవ్వలేకపోతోంది.కొత్త ఏఐ బ్రౌజర్ల అవసరం లేకుండానే గూగుల్ తన జెమిని(Gemini) ఏఐని నేరుగా క్రోమ్లోకి ఎంబెడ్ చేసింది.సెర్చ్ సమ్మరీలు, రైటింగ్ అసిస్టెంట్, ట్యాబ్ ఆర్గనైజర్ వంటి ఫీచర్లను క్రోమ్ వినియోగదారులకు వారి పాత అలవాట్లను మార్చకుండానే అందుబాటులోకి తెచ్చింది.చాలా ఏఐ బ్రౌజర్లు క్రోమ్లానే పనిచేస్తున్నాయి. వినియోగదారులకు తమ పాస్వర్డ్లు, హిస్టరీ, బుక్మార్క్లను వదులుకుని కొత్త బ్రౌజర్కు వెళ్లడానికి బలమైన కారణాలు కనిపించడం లేదు. ఏఐ ఫీచర్లు ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్షన్ల రూపంలో కూడా లభిస్తుండటం మరో కారణం.ఏఐ ఏజెంట్ వైపు..ప్రస్తుత ఏఐ బ్రౌజర్లు కేవలం సమాచారాన్ని క్రోడీకరించడానికి (Summarization) లేదా పోల్చడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ భవిష్యత్తులో బ్రౌజర్ల పాత్ర మారబోతోంది. వినియోగదారుడి తరపున స్వయంగా పనులు చేసే (ఉదాహరణకు: టికెట్లు బుక్ చేయడం, షాపింగ్ చేయడం, షెడ్యూల్ మేనేజ్ చేయడం) అటానమస్ ఏజెంట్గా బ్రౌజర్ మారినప్పుడు మాత్రమే క్రోమ్కు నిజమైన పోటీ ఎదురవుతుందనే వాదనలున్నాయి. బ్రౌజర్ అనేది ఒక విండోలా కాకుండా, ఒక పర్సనల్ అసిస్టెంట్గా మారినప్పుడు మాత్రమే మార్కెట్ వాటాలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా? -
ఏఐపై అంబానీ ఫోకస్
న్యూఢిల్లీ: ఆయిల్ నుంచి రిటైల్, టెలికం వరకు వివిధ రంగాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రాబోయే రోజుల్లో అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ దిగ్గజంగా రూపాంతరం చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగుల ఉత్పాదకతను పది రెట్లు పెంచుకోవాలని, దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజంపై పది రెట్లు సానుకూల ప్రభావం చూపేలా వ్యవహరించాలని నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధనకు తోడ్పడేలా, కంపెనీ ఏఐ మేనిఫెస్టోను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మంగళవారం ఆవిష్కరించారు.‘మానవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక పురోగతి’గా కృత్రిమ మేధను ఈ సందర్భంగా అభివర్ణించారు. దేశీయంగా డిజిటల్ పరివర్తనకు సారథ్యం వహించిన విధంగానే ఏఐ విప్లవానికి కూడా నేతృత్వం వహించాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. భద్రత, విశ్వసనీయత, జవాబుదారీతనం హామీతో ప్రతి భారతీయునికి అతి తక్కువ వ్యయాలతో ఏఐని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ‘అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ కంపెనీగా మారే దిశగా రిలయన్స్ ముందుకు సాగుతోంది. రిలయన్స్ ఏఐ ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నాం. కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఇది గైడ్గా పనిచేస్తుంది‘ అని అంబానీ పేర్కొన్నారు. ఐడియాలకు ఆహ్వానం.. టెలికం, రిటైల్, ఎనర్జీ, మెటీరియల్స్, లైఫ్ సైన్సెస్, ఆర్థిక సేవలు, మీడియా తదితర వ్యాపార విభాగాలతో పాటు దాతృత్వ కార్యకలాపాలవ్యాప్తంగా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఉపయోగపడే ఐడియాలు ఇవ్వాలని ఉద్యోగులను అంబానీ కోరారు. జనవరి 10 నుంచి 26 వరకు కొత్త ఆలోచనలను తెలియజేయాలని సూచించారు. ఏఐ హార్డ్వేర్, రోబోటిక్స్లాంటి వాటితో సమర్ధత, సుస్థిరత, సాంకేతిక స్వావలంబనను సాధించేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.మేనిఫెస్టో ఇలా..మేనిఫెస్టో మొదటి భాగంలో అంతర్గత పరివర్తన, ఏఐని టెక్నాలజీ ప్రాజెక్టుగా కాకుండా కొత్త పని విధానంగా పరిగణించే అంశాలను చేర్చారు. రెండో భాగంలో దేశీయంగా ఏఐ పరివర్తనకు తోడ్పడే విజన్ని పొందుపర్చారు. కొనుగోళ్ల నుంచి చెల్లింపుల వరకు, నియామకాల నుంచి రిటైర్మెంట్ల వరకు, ప్లాంటు నుంచి పోర్టు వరకు కీలకమైన విధుల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించే విధంగా, నిర్ణయాల ప్రక్రియకు తోడ్పడేలా సంస్థవ్యాప్తంగా ఏఐతో పని విధానాల్లో మార్పులను తొలి భాగంలో ప్రస్తావించారు.డేటా, సమన్వయం, భద్రత, వివిధ వ్యాపారాలవ్యాప్తంగా పర్యవేక్షణ మొదలైన వాటన్నింటికీ ప్రమాణాలు నిర్దేశించేలా పన్నెండు అంచెల డిజిటల్ ఫంక్షనల్ కోర్ (డీఎఫ్సీ) ఉంటుంది. తమ వ్యాపారాలు, దాతృత్వ కార్యకలాపాల ద్వారా ఏఐ ఆధారిత భారతదేశ పరివర్తనకి తోడ్పడాలనే రిలయన్స్ ఆకాంక్షలను ప్రతిఫలించేలా రెండో భాగం ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, సమ్మిళిత ఆర్థిక సర్వీసులు మొదలైన వాటిల్లో ఏఐ దన్నుతో కొత్త సొల్యూషన్స్, కొత్త మెటీరియల్స్ను కనుగొనేందుకు అపార అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు. -
ఏఐ జోష్ ఎలా బాస్!
కాలంతోపాటు ఉద్యోగుల పనితీరూ మారుతుంటుంది. ఆ పనితీరు ఎలా ఉండబోతుందనేదే అసలు సిసలు ప్రశ్న! ఇంతకీ 2026లో ఎలా ఉండబోతోంది? ‘ కంపెనీ అంటే ఏ.ఐ. మాత్రమే... ఉద్యోగులు నామమాత్రమే!’ అన్నట్లుగా ఉండబోతుందా? ‘ఏ.ఐ. తాతలు దిగివచ్చినా ఉద్యోగి ఉద్యోగే’ అన్నట్లుగా ఉండబోతుందా? ‘ఎట్ లీస్ట్ 70 అవర్స్ ఏ వీక్’ అంటున్నారు నారాయణమూర్తి.‘ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు... వారానికి ఆరురోజులు మాత్రమే’ అంటున్నారు ఆలీబాబా ఫౌండర్ జాక్ మా. ఈ పెద్దల ప్రతిపాదనలు ఉద్యోగులకు నచ్చాయా? పనితీరును, ఉత్పాదకతను మెరుగుపరుచుకోవడం నుంచి ఉద్యోగానికి ఆవలి ప్రపంచాన్ని ఆస్వాదించడం వరకు కొత్త సంవత్సరంలో వచ్చే మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం...భవిష్యత్లో ఉద్యోగుల పనితీరు ఎలా ఉండబోతుంది? కంపెనీలకు మాత్రమే మేలు చేసేలా ఉంటుందా? ఉద్యోగులకు మాత్రమే మేలు చేసేలా ఉంటుందా? సాంకేతికతే సర్వస్వం అన్నట్లుగా ఉంటుందా? నైతిక విలువలకు, స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు చోటు ఉంటుందా? నిపుణులు చెప్పే సమాధానం మాత్రం ఇది.... ‘ఎంతమాత్రం ఏకపక్షం కాబోదు. కంపెనీకి, ఉద్యోగులకు పరస్పర ప్రయోజనకరంగానే ఉంటుంది’⇒ జీవనోత్సాహ ఉద్యోగంగతంతోపోలిస్తే... ‘ఏదో ఒక ఉద్యోగం లే’ అని సరిపెట్టుకోవడం లేదు యువత. ‘ఈ ఉద్యోగం నా కెరీర్కు ఏ మేరకు ఉపయోగపడుతుంది?’ అనే కోణంలో విశ్లేషించుకుంటున్నారు. ‘ఉద్యోగం అనేది జీవితాన్ని నిర్వీర్యం చేసేది కాదు, జీవనోత్సాహాన్ని ఇచ్చేది’ అనే ఎరుకతో జాగ్రత్తగా ఉద్యోగాలు ఎంచుకుంటున్నారు. ‘చాలామంది ఉద్యోగులు తమ కెరీర్లో ఉన్నతిని కోరుకుంటున్నప్పటికీ, ఉద్యోగ జీవితానికి ఆవలి ప్రపంచాన్ని కూడా ఆస్వాదించాలనుకుంటున్నారు’ అంటున్నారు ముంబైకి చెందిన వర్క్–లైఫ్ బ్యాలెన్స్ కోచ్ భక్తి తలాటీ. వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోతే...భారీ జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదిలి, వ్యక్తిగత స్చేచ్ఛకు అవకాశం ఇచ్చే చిన్న ఉద్యోగాల్లో సైతం చేరేవారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే పనిగంటలకు సంబంధించి నారాయణమూర్తి, జాక్ మా ప్రతిపాదనలతో ఏకీభవించే వారితోపాటు తీవ్రంగా విభేదించే వారు కూడా యువతరంలో ఉన్నారు.⇒ ఇప్పుడు కావాలి... ఆరోగ్యకరమైన పనితీరు‘ఆరోగ్యకరమైన పనితీరు’కుప్రాధాన్యత పెరుగుతోంది. ఆరోగ్యకరమైన పనితీరుకు సంబంధించి తమ సీనియర్ల నుంచి నేర్చుకోవడానికి మిలీనియల్స్ ఆసక్తి చూపుతున్నారు. 2026లో... కంపెనీలలో భారీ జీతానికి ప్రతిభ, శ్రమ మాత్రమే తప్పనిసరి కొలమానం కాబోతోంది. ప్రతిభ కనబరిచే ఉద్యోగులను త్వరగా పై స్థాయికి తీసుకువెళ్లడం, ఉద్యోగులకు అనుకూలమైన లీవ్ పాలసీలు, అనుకూలమైన పనిగంటలు...మొదలైనవి కంపెనీల ప్రాధాన్యత జాబితాలో చేరనున్నాయి.⇒ అది ట్రెండ్ మాత్రమే కాదు...‘ఫ్లెక్సిబుల్ వర్క్ మోడల్... మైక్రోషిఫ్టింగ్ అనేది కేవలం ఫ్లెక్సిబిలిటీ ట్రెండ్ మాత్రమే కాదు. పనితీరును సరిగా అర్థం చేసుకొని, మెరుగైన పనితీరును కనబరచడం’ అంటున్నారు జెన్ జడ్ ప్లాట్ఫామ్ ‘అన్స్టాప్’ ఫౌండర్, సీఈఓ అంకిత్ అగర్వాల్. మరి ఏ.ఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మాటేమిటి? చాలామంది అనుకున్నట్లు ఉద్యోగాలుపోతాయా? ఎటు చూసినా ‘ఏ.ఐ. మాత్రమే’ అన్నట్లుగా ఉండబోతోందా అంటే– కాదనే అంటున్నారు అగర్వాల్.‘ఏ.ఐ. అనేది ఉద్యోగులు తమను తాము మెరుగుపరుచుకునేలా చేస్తుంది. మరిన్ని పనులు చేసేలా చేస్తుంది. షెడ్యూలింగ్, డాక్యుమెంటేషన్, రిసెర్చ్... మొదలైనవాటికి సంబంధించి మరింత లోతుగా ఆలోచించే అవకాశం ఉద్యోగులకు దొరుకుతుంది. క్రియేటివిటీ థింకింగ్కు సంబంధించి మనిషిని యంత్రం అనుకరించలేదు’ అంటున్నారు అగర్వాల్.⇒ సిద్ధం కావాల్సిందే!సరికొత్త సాంకేతికత సరికొత్త పనితీరుకు కారణం అవుతుంది. ‘ఇంటెలిజెంట్ సిస్టమ్స్తో కలిసి పనిచేయడానికి ప్రతి ఉద్యోగి సిద్ధం కావాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఏ.ఐ. అంటే బెదిరిపోవడం కాదు, ఏ.ఐ.తో కలిసి ఆలోచించేలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి’ అంటున్నారు సాప్ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సింధు గంగాధరన్.ఏడీపీ... ఇలా చెబుతోంది...2026లో పని ప్రదేశాలు ఎలా ఉండబోతున్నాయి? ఉద్యోగులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎంత? ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు... మొదలైన విషయాలపై లీడింగ్ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ ‘ఏడీపీ’ ఒక నివేదిక రూపొందించింది. ‘కొత్త సంవత్సరంలో ఉద్యోగుల ముందు అవకాశాలతోపాటు సవాళ్లు కూడా ఉంటాయి. స్కిల్ అనేది సరికొత్త కరెన్సీగా మారనుంది. యాంత్రీకరణ అనేది ఉద్యోగుల పనితీరును మార్చబోతుంది.ప్రోడక్టివిటీకి ఉపయోగపడే, వ్యక్తిగత జీవితానికి భారం కాని పనితీరుకు ఉద్యోగులుప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటున్నారు ఏడీపీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్. ‘ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్, ఫైనాన్షియల్ప్లానింగ్, కేర్గీవింగ్ రిసోర్సెస్, స్ట్రెస్మేనేజ్మెంట్లాంటి వాటిపై నిర్మాణాత్మక కార్యక్రమాలు మరింతగా విస్తరించనున్నాయి. చాలా కంపెనీలు, చిన్న పట్టణాలలో నుంచి ప్రతిభావంతులైన ఉద్యోగులను ఎంచుకోవడానికి హబ్–అండ్–స్పోక్ అ్రపోచ్ను అనుసరిస్తున్నాయి’ అని ఏడీపీ సర్వే రిపోర్ట్ చెబుతుంది.హైబ్రీడ్ క్రీప్–2026‘గతంతోపోల్చితే ఇంటినుంచి పనిచేసే వారి కంటే ఆఫీస్కు వచ్చి పనిచేసే ఉద్యోగుల సంఖ్య కొత్త సంవత్సరంలో పెరగనుంది. హైబ్రీడ్ క్రీప్ (క్రమంగా పెరుగుతున్న ఇన్–ఆఫీస్ రోజుల సంఖ్య) తీవ్రతరం అవుతుంది’ అంటున్నారు వోల్ ల్యాబ్స్ సీఈఓప్రాంక్ విషాఫ్ట్. ‘ఇంటి నుంచి పని చేసినా ఫరవాలేదు. ఆఫీస్ నుంచి పనిచేసినా ఫరవాలేదు’ అనే వెసులుబాటు ఉద్యోగులకు ఉండేది. ఇప్పుడు మాత్రం ‘ఆఫీసు నుంచి పనిచేయక తప్పదు’ అనే ధోరణి పెరిగింది.నైపుణ్యమే అసలు సిసలు డిగ్రీ‘ఉద్యోగానికి కాలేజీ డిగ్రీ మాత్రమే ప్రధానం’ అనే నిబంధన రాబోయే రోజుల్లో మరింతగా సడలిపోనుంది. ‘స్కిల్–ఫస్ట్ రెవల్యూషన్’లో డిగ్రీల కంటే నైపుణ్యానికేప్రాధాన్యత పెరగనుంది. కంపెనీలకు సంబంధించి ఆన్–ది–జాబ్ బూట్క్యాంప్స్ స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కానున్నాయి. ‘డిగ్రీ ఆధారిత ఉద్యోగ నియామకాల కంటే, నైపుణ్యాల ఆధారిత ఉద్యోగ నియామకాల ధోరణి 2026 ఊపందుకుంటుంది.అలా అని డిగ్రీ ఉన్న వాళ్లప్రాధాన్యత ఏమీ తగ్గదు’ అంటున్నారు అమెరికాలోని నేషనల్ యూనివర్శిటీలో వర్క్ఫోర్స్ అండ్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ గ్రాహం. -
అమెరికన్ ఏఐ కంపెనీని కొనేస్తున్న కోఫోర్జ్
అమెరికన్ కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఎన్కోరాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం కోఫోర్జ్ వెల్లడించింది. 100% వాటాల కోసం 2.35 బిలియన్ డాలర్లని (సుమారు రూ.21,133 కోట్లు) తెలిపింది. పూర్తి స్టాక్స్ లావాదేవీ రూపంలో ఈ డీల్ ఉంటుందని వివరించింది. ఎన్కోరా ప్రస్తుత షేర్హోల్డర్లకు 1.89 బిలియన్ డాలర్ల ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నట్లు కోఫోర్జ్ పేర్కొంది.ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు అడ్వెంట్ ఇంటర్నేషనల్, వార్బర్గ్ పింకస్ మొదలైనవి ఎన్కోరాలో వాటాదార్లుగా ఉన్నాయి. తమ ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ చెప్పారు. ఎన్కోరా కలయికతో 2.5 బిలియన్ డాలర్ల టెక్ సేవల దిగ్గజం ఆవిర్భవిస్తుందని కోఫోర్జ్ పేర్కొంది.2027 ఆర్థిక సంవత్సరంలో ఏఐ ఆధారిత ఇంజనీరింగ్, డేటా, క్లౌడ్ సర్వీసుల విభాగం ఆదాయమే ఏకంగా 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని తెలిపింది. ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ వ్యాపారం 1.25 బిలియన్ డాలర్లపైగా, క్లౌడ్ సేవలు 500 మిలియన్ డాలర్లు, డేటా ఇంజనీరింగ్ 250 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని కోఫోర్జ్ పేర్కొంది. -
ట్రెండ్గా డ్రోన్ స్టైల్ వీడియో..!
డ్రోన్–స్టైల్ వీడియోలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు ట్రెండ్గా మారింది. మరి మీరు కూడా ఈ ట్రెండ్ ఫాలో కావాలనుకుంటున్నారా?మీరు ఒకే అంటే ఇలా...గూగుల్ జెమిని ఓపెన్ చేయాలి ∙సెలెక్ట్ చేసుకున్న ఫొటోను అప్లోడ్ చేయాలి ∙ పొడి పొడిగా కాకుండా ప్రాంప్ట్ అనేది స్పష్టంగా, వివరంగా, సాధారణ భాషలో ఉండాలి. మన ప్రాంప్ట్ను అర్థం చేసుకొని షార్ట్ వీడియోను క్రియేట్ చేస్తుంది జెమిని. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పోస్ట్ చేయవచ్చు. ‘రీల్’గా అప్లోడ్ చేయవచ్చు. ట్రెండింగ్ మ్యూజిక్, కాప్షన్స్, హ్యాష్ట్యాగ్ ఉపయోగించవచ్చు.డ్రోన్ షాట్స్ శాంపిల్ ప్రాంప్ట్స్:‘క్రియేట్ ఏ 360 డిగ్రీ డ్రోన్ షాట్ వీడియో’ ∙క్రియేట్ ఏ 360–డిగ్రీ డ్రోన్ షాట్’ ∙‘జనరేట్ ఏ రియలిస్టిక్ ఏరియల్ డ్రోన్ వీడియో’.(చదవండి: Dhurandhars Dhoodh Soda: ధురంధర్ మూవీ క్రేజ్తో వైరల్గా 'దూద్ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?) -
2025.. ఏఐ ఇయర్
సరిగ్గా ఏడాది కిందట.. ఏఐని ఒక డిజిటల్ విజ్ఞాన సర్వస్వంలా చూశాం. ఏదైనా సమాచారం కావాలన్నా చాట్ జీపీటీని అడిగేవాళ్లం. కానీ 2025కు వచ్చేసరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు మన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఏఐ (జనరేటివ్ ఏఐ), నేడు మన పనులను చక్కబెట్టే ఏఐ ఏజెంట్గా రూపాంతరం చెందింది. గతంలో ఏఐ కేవలం ఒక రియాక్టివ్ అసిస్టెంట్. అంటే మనం అడిగితేనే సమాధానం చెప్పేది. కానీ 2025 ఏఐ టూల్స్ ప్రోయాక్టివ్ పార్ట్నర్స్(మీరు ఒక చిన్న మాట చెబితే మీ అవసరాలను ఊహించి, మీ ప్రమేయం లేకుండానే పనులను పూర్తి చేసే ఒక తెలివైన భాగస్వామి)గా మారాయి.సాంకేతిక నిపుణులు 2025వ సంవత్సరాన్ని ఏఐ ఇయర్గా అభివర్ణిస్తున్నారు. 2024లో కేవలం మాటలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) 2025లో చేతల్లోకి వచ్చేసింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలివ్వడమే కాకుండా మన పనులను స్వయంగా పూర్తి చేసే ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది కీలకంగా మారాయి. జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు జనరేటివ్ ఏఐ రంగంలో కంపెనీలు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, టూల్స్ పై ప్రత్యేక కథనం.తొలి త్రైమాసికంలో..చైనాకు చెందిన డీప్సీక్ ఆర్1 మోడల్ విడుదల కావడంతో ఏఐ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఆలోచనా సామర్థ్యం అందించడంతో ఓపెన్ సోర్స్ ఏఐ ఊపందుకుంది. ఇదే నెలలో ఓపెన్ఏఐ ఓ3-మినీని విడుదల చేసింది.ఆంథ్రోపిక్ Claude 3.7 Sonnetను, ఎలాన్ మస్క్ గ్రోక్ 3ని లాంచ్ చేశారు. వీటితో పాటు ఓపెన్ఏఐ కంప్యూటర్లను స్వయంగా ఆపరేట్ చేయగల Operator అనే ఏజెంట్ను పరిచయం చేసింది. గూగుల్ తన అత్యంత వేగవంతమైన Gemini 2.5 Flash, రోబోటిక్స్ కోసం ప్రత్యేకమైన ఏఐ మోడల్స్ను తెచ్చింది.రెండో త్రైమాసికంలో..ఏప్రిల్లో మెటా Llama 4 మోడల్స్ను విడుదల చేసింది. ఇవి ఓపెన్ సోర్స్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మేలో ఆంథ్రోపిక్ నుంచి Claude 4 విడుదలయ్యింది. ఇది మనుషుల లాగా వరుసగా ఏడు గంటల పాటు స్వయంగా పని చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. జూన్లో గూగుల్ తన సెర్చ్ ఇంజిన్లో ఏఐ మోడ్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.మూడో త్రైమాసికంజులైలో ఓపెన్ఏఐ తన ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటి ఏఐ మార్కెట్ సత్తాను చాటింది. ఆగస్టులో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన జీపీటీ-5 విడుదలైంది. ఇది మునుపటి మోడల్స్ కంటే రెట్టింపు తెలివితేటలతో, కోడింగ్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సెప్టెంబర్లో వీడియో జనరేషన్ రంగంలో ఓపెన్ఏఐ Sora యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన వీడియో మోడల్ Veo 2తో దీనికి పోటీనిచ్చింది.నాలుగో త్రైమాసికంఅక్టోబర్లో ఓపెన్ఏఐ తన సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకుని పూర్తి లాభాపేక్ష కలిగిన కంపెనీగా అవతరించింది. నవంబర్లో గూగుల్ Gemini 3.0ని విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో పర్సనల్ అసిస్టెంట్గా మారింది. డిసెంబర్లో GPT-5.2 అప్డేట్తో పాటు, గూగుల్ ట్రాన్స్లేట్లో అత్యంత కచ్చితమైన ఏఐ అనువాద ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.ఇదీ చదవండి: చెక్ పవర్ తగ్గిందా? -
ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే!
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసే రోబోలు నిజ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ‘టెర్మినేటర్’ సినిమాలో విధ్వంసం సృష్టించిన ‘టీ800’ గుర్తుండే ఉంటుంది కదా! సరిగ్గా అదే పేరుతో చైనా కొత్త రోబో తయారు చేసింది. అయితే టెర్మినేటర్లో మాదిరి విధ్వంసం సృష్టించేదిగా కాకుండా, మానవాళికి సహాయపడేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ ‘ఇంజిన్ ఏఐ’ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన ఓ ప్రదర్శనలో ఈ రోబో చేసిన కుంగ్ ఫూ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి.సాహసోపేత అడుగు2023లో స్థాపించిన ఈ ఇంజిన్ఏఐ స్టార్టప్ కంపెనీ తక్కువ సమయంలోనే రోబోటిక్స్ రంగంలో సంచలనం సృష్టించింది. ‘బోర్న్ టు సబ్వర్ట్’ (వ్యవస్థను మార్చడానికే పుట్టింది) అనే నినాదంతో వస్తున్న T800 లైవ్ డెమోల్లో హై-కిక్స్, స్పారింగ్ మూమెంట్స్తో ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. దీని చురుకుదనం చూసిన చాలామందికి ఇది అసలైన రోబోనా లేక కంప్యూటర్ గ్రాఫిక్సా అనే సందేహం కలగకమానదని కొందరు చెబుతున్నారు. విమర్శలకు సమాధానంగా కంపెనీ మేకింగ్ వీడియోలను విడుదల చేసింది. సీఈఓ జావో టోంగ్యాంగ్ స్వయంగా ఆ రోబోతో తలపడిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.టీ800ని అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించినట్లు కంపెనీ చెప్పింది. 1.73 మీటర్ల ఎత్తు, 75 కిలోల బరువు ఉండే ఈ రోబోను ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసినట్లు పేర్కొంది. 450 ఎన్ఎం టార్క్ కీళ్ల సామర్థ్యంతో ఇది అథ్లెట్ల తరహాలో కదలగలదని చెప్పింది. ఇది ఒక్కో చేతిలో 5 కిలోల వరకు వస్తువులను సులువుగా లేపగలదు. ఈ రోబోలో అధికంగా వేడి జనరేట్ అవ్వకుండా ఉండటానికి అధునాతన కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. నాలుగు గంటల పాటు నిరంతరాయంగా పనిచేసేలా మాడ్యులర్ సాలిడ్-స్టేట్ బ్యాటరీని ఇందులో అమర్చినట్లు కంపెనీ తెలిపింది.ఏఐ సూపర్ పవర్ఈ రోబోలో ఎన్వీడియా ఏజీక్స్ ఓరిన్ మాడ్యూల్, ఇంటెల్ N97 సీపీయూలున్నాయి. ఇవి 275 TOPS (Trillions of Operations Per Second) శక్తిని అందిస్తాయి. 360 డిగ్రీల వ్యూతో తన పరిసరాలను మిల్లీసెకన్లలో అర్థం చేసుకుని అడ్డంకులను అధిగమిస్తుంది.Oh my god! Sci-fi movie becomes reality in China!⬆️: 🇺🇸sci-fi films Real Steel, 2011⬇️: 🇨🇳ENGINEAI T800 humanoid robot, 2025China is turning the silver-screen fantasy into tangible technology in just a decade. pic.twitter.com/WTWxnfAoT7— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 3, 2025టీ800 ప్రాజెక్ట్ కోసం హువాంగ్పు రివర్ క్యాపిటల్ వంటి సంస్థల నుంచి 1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1,180 కోట్లు) భారీ నిధులను ఇంజిన్ ఏఐ సేకరించింది. ఈ నిధులతో 2026 మధ్య నాటికి టీ800 రోబోలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లాకు చెందిన ఆప్టిమస్, బోస్టన్ డైనమిక్స్కు చెందిన అట్లాస్ వంటి దిగ్గజ రోబోలతో టీ800 పోటీ పడనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం -
జనరేటివ్ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా..
ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన సేల్స్ ఫోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తన దూకుడును తగ్గించుకుంటోంది. గత ఏడాది కాలంగా లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్(LLM) పనితీరుపై నమ్మకం సడలడమే ఇందుకు ప్రధాన కారణం. జనరేటివ్ ఏఐ కంటే మరింత స్పష్టమైన ఫలితాలనిచ్చే నిర్ణయాత్మక (Deterministic)ఆటోమేషన్ వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది.నమ్మకం కోల్పోతున్న ఎగ్జిక్యూటివ్లు‘ఒక సంవత్సరం క్రితం ఎల్ఎల్ఎంల గురించి మాకున్న నమ్మకం ఇప్పుడు లేదు’ అని సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజ్న పరులేకర్ అంగీకరించారు. ఏఐ నమూనాల్లో ఉండే రాండమ్నెస్(యాదృచ్ఛికం) వల్ల వ్యాపార పనుల్లో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, అందుకే తమ కొత్త ఉత్పత్తి అయిన ఏజెంట్ ఫోర్స్లో మరింత నియంత్రిత ఆటోమేషన్ను ప్రవేశపెడుతున్నామని ఆమె వెల్లడించారు.సాంకేతిక వైఫల్యాలే కారణమా?ఏజెంట్ ఫోర్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మురళీధర్ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. AI మోడల్స్కు ఎనిమిది కంటే ఎక్కువ సూచనలు (Prompts) ఇచ్చినప్పుడు అవి గందరగోళానికి గురవుతున్నాయి. ముఖ్యంగా..ఎక్కువ సూచనలు ఉంటే ఎల్ఎల్ఎంలు కీలకమైన ఆదేశాలను వదిలివేస్తున్నాయి.వినియోగదారులు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఏఐ తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయి పక్కదారి పడుతోంది.25 లక్షల కస్టమర్లు ఉన్న వివింట్(Vivint) వంటి కంపెనీలు కస్టమర్ సర్వేలను పంపడంలో ఏఐ విఫలమైందని గుర్తించాయి. దీన్ని సరిదిద్దడానికి ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ‘ట్రిగ్గర్లను’ ఏర్పాటు చేయాల్సి వస్తోంది.డేటా ఫౌండేషన్లపై దృష్టిఏఐ ద్వారా వేల కోట్లు ఆర్జించవచ్చని భావించిన సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇప్పుడు డేటా ఫౌండేషన్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సరైన డేటా లేకుండా ఏఐ ఇష్టారీతిన ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఏఐ ఏజెంట్ల విస్తరణ కారణంగా కంపెనీ తన సహాయక సిబ్బందిని 9,000 నుంచి 5,000కి తగ్గించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ! -
ఏఐ గ్లాసులతో అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి.. తరువాత ఏమైందంటే
తిరువనంతపురం: కేరళ తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలోకి సింగపూర్కు చెందిన ఓ వ్యక్తి ఏఐ సాంకేతికత కలిగిన గ్లాసులు ధరించి వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతనిని అరెస్టు చేశారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా సాంకేతికత కలిగిన కలిగిన వస్తువులతో ఆలయంలోకి వచ్చినందుకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పడుకున్నరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి అధికారులు ఐదెంచెల భద్రత కల్పిస్తారు. డ్రోన్, స్మార్ట్ సెన్సార్లు వంటి ఆధునాతన పరికారలతో నిరంతంరం నిఘా నేత్రాలలో ఉంచుతారు. అయితే ఆలయంలోకి మెుబైల్స్, కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతులు లేవు.ఈ నేపథ్యంలోనే ఏఐ మెటా సాంకేతికత కలిగిన గ్లాసులను ధరించి వచ్చిన విదేశీ భక్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయ నిబంధనలు తెలియక తాను గ్లాసులు ధరించానని ఆ భక్తుడు తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం అతనిని కోర్టులో హాజరు కావాల్సిందిగా చెప్పి వదిలి వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరస్టైన వ్యక్తి పేరు తిరుపనీన్ అని ప్రస్తుతం ఆయన శ్రీలంక సంతతికి చెందిన వ్యక్తి కాగా ప్రస్తుతం సింగపూర్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. -
నాకా పిల్ల నచ్చింది.. విడాకులివ్వు..
పెద్దాయన్ని చూశారా? చైనాకు చెందిన ఈయన వయసు 75 ఏళ్లు. ఈ ముదిమి వయసులో తన భార్యను విడాకులు ఇస్తావా లేదా అని పదేపదే ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటారా? ప్రేమలో పడ్డాడు మరి. ఈ వయసులో ఎవరితోనబ్బా అంటే.. ఏఐ జనరేటెడ్ ఆన్లైన్ మోడల్తో. జియాంగ్ అనే 75 ఏళ్ల వ్యక్తి సోషల్ మీడియాను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏఐ మహిళా అవతార్ను చూశాడు. యువతకైతే అది ఏఐ సృష్టి అని తెలిసిపోతుంది. కానీ ఈయనకు ఆ విషయం తెలియక అమ్మాయి అని భ్రమపడ్డాడు. పైగా ఆమె అందమైన రూపానికి తోడు ఆకట్టుకునే గాత్రం, సంభాషణలు చూసి మరీ ఫిదా అయిపోయాడు. రోజూ గంటల తరబడి ఫోన్లోనే కాలం గడపడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన జియాంగ్ భార్య.. గట్టిగా తిట్టడంతో భార్యతో విడిపోతే ఆమెతో కాలం గడపొచ్చని విడాకులు అడగడం మొదలుపెట్టాడు. చివరకు జియాంగ్ పిల్లలు అది ఏఐ సృష్టి అని.. నిజమైన మనిషి కాదని చెప్పి ఒప్పించేసరికి వారి తల ప్రాణం తోకకొచి్చంది. ఏం ఏఐనో ఏంటో.. ముందుముందు ఏమేం చిత్రవిచిత్రాలు చూడాలో అనిపిస్తోంది కదా? -
శబరిమలకు ఆధునిక సాంకేతికత.!
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించేలా శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్కు చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు , బుకింగ్ గదులు వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక. ప్రస్తుతం, వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. సాంకేతిక వ్యవస్థలు ఏయే ప్రాంతాల్లో అవసరమో, వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు. విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సహాయంతో దీనిని తయారు చేస్తారు. దీంతోపాటు దేవస్వం బోర్డు అన్ని కార్యాలయాలను డిజిటల్గా మార్చనున్నారు. కాగా, శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం ఈ సాంకేతిక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: శబరిమలకు రికార్డు స్థాయిలో ఆదాయం) -
చిన్న సంస్థలకు ఏఐ దన్ను
కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్ఎంఈ) గణనీయంగా ప్రయోజనం పొందేందుకు ఆస్కారం ఉంది. దీనితో వాటికి 500 బిలియన్ డాలర్లకు పైగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీఎక్స్), భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్లో 6.4 కోట్ల ఎంఎస్ఎంఈల ముంగిట అపార అవకాశాలు ఉన్నాయని నివేదిక తెలిపింది.నివేదికలో మరిన్ని అంశాలు..కృత్రిమ మేథ వినియోగానికి సంబంధించి టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటున్నప్పటికీ, గ్లోబల్ ఏఐ పేటెంట్లలో వాటా మాత్రం 1 శాతం కన్నా తక్కువే ఉంటోంది. ఈ నేపథ్యంలో చిన్న సవాళ్ల పరిష్కారం కోసం ఏఐ ఆధారిత వ్యాపారాలను సృష్టించడంపై దృష్టి పెట్టాలి.ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ప్రాంతీయ వ్యవస్థలవ్యాప్తంగా ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్ ఉత్పాదకతపరమైన ప్రయోజనాలు పొందడం, నాణ్యమైన ఉద్యోగాలు కల్పించడంతో పాటు దీర్ఘకాలికంగా సామాజిక–ఆర్థిక పటిష్టతను సాధించవచ్చు. ఏఐపై ఆసక్తి, పెట్టుబడులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. దాదాపు 44 శాతం ఎగ్జిక్యూటివ్లు ఇప్పటికీ తమ టెక్నాలజీ బడ్జెట్లో ఏఐకి కేటాయిస్తున్నది 10% లోపే ఉంటోంది.ప్రధానంగా ఏఐ ఆధారిత వ్యాపారాలను నిర్మించడం, మరిన్ని ఆవిష్కరణలు చేయడం, వాటిని అందరికీ అందుబాటులోకి తేవడంలాంటి చర్యలతో కృత్రిమ మేథ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవచ్చు.2026లో నిర్వహణ విధానాల్లో గణనీయంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. నిర్దిష్ట విధుల నిర్వహణకు, ముందుగా ఏఐని వినియోగించుకోవడం పెరుగుతుంది.ఇదీ చదవండి: రూ.312 కోట్ల వేతన బకాయిలు విడుదల చేసిన ఈడీ -
సత్య సారథ్యంలో సమూల మార్పులు!
సాఫ్ట్వేర్ రంగంలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయిస్తోన్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అత్యంత కీలకమైన పరివర్తనకు సిద్ధమైంది. కృత్రిమ మేధ (ఏఐ) కేవలం ఒక ఫీచర్గా మాత్రమే కాకుండా కంపెనీ ఉనికికి పునాదిగా మారుతోందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెసీ సీఈఓ సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ తన పనితీరును, సంస్కృతిని, భవిష్యత్తు వ్యూహాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది.బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఇకపై ఏఐని కేవలం ఉత్పత్తులకు అదనపు హంగుగా చూడటం లేదు. భవిష్యత్తులో రాబోయే ప్రతి ఉత్పత్తిని ఏఐ ఆధారంగానే తయారు చేయాలని భావిస్తుంది. ప్రస్తుత ఏఐ ప్రభావాన్ని ఒక ‘అరుదైన క్షణం’గా సత్య నాదెళ్ల అభివర్ణించారు. ఇది కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్ వంటిది కాదని, కంపెనీకి ఇదో పూర్తి రీఇన్వెన్షన్గా మారే సమయమని అంతర్గత వర్గాలకు స్పష్టం చేశారు.పాత పద్ధతులకు స్వస్తి‘కంపెనీ ఉత్పత్తుల పరంగా చేసే పనుల్లో సత్య వేగాన్ని, అత్యవసరాన్ని (Urgency) కోరుకుంటున్నారు’ అని ఒక మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ వేగాన్ని అందుకోలేక పాత పని పద్ధతులకు అలవాటు పడిన కొందరు సీనియర్ ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఏఐ విప్లవంలో భాగస్వాములు కావాలా లేదా అన్నది తేల్చుకోవాలని నాదెళ్ల పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ‘మీరు దీన్ని ఎంతకాలం, ఎంత నిబద్ధతతో చేయాలనుకుంటున్నారో మీరే ప్రశ్నించుకోవాలి’ అని ఏఐలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఉద్యోగులను ఉద్దేశించి ఆ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఉత్పత్తుల నిర్వహణలో జాప్యాన్ని తగ్గించడానికి నాదెళ్ల ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మేనేజ్మెంట్ వ్యవస్థలపై ఆధారపడకుండా ఆయన నేరుగా ఇంజినీర్లు, ఇతర బృందాలతో సమావేశమవుతున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ -
ఏఐ నియంత్రణపై భారత్ అడుగులు ఎటువైపు?
ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక విప్లవంలా దూసుకుపోతోంది. పనులను సులభతరం చేస్తూనే, మరోవైపు డేటా గోప్యత, డీప్ఫేక్స్ వంటి రూపాల్లో సరికొత్త సవాళ్లను విసురుతోంది. సాంకేతికత అందించే ఫలాలను అందుకుంటూనే, దానివల్ల కలిగే అనర్థాలను అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో భారత్లో ఏఐని నియంత్రించడానికి ఉన్న చట్టపరమైన చట్రం, తాజా పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.భారత్లో ఏఐ నియంత్రణభారతదేశంలో ప్రస్తుతం ఏఐ కోసం ప్రత్యేకమైన ఏకీకృత చట్టం లేదు. అయినప్పటికీ, ప్రభుత్వం వివిధ ప్రస్తుత చట్టాలు, కొత్త మార్గదర్శకాల ద్వారా ఏఐ వినియోగాన్ని నియంత్రిస్తోంది. ఏఐ వ్యవస్థలు శిక్షణ పొందడానికి, పనిచేయడానికి భారీ మొత్తంలో డేటా అవసరం. ఈ డేటాను ఎలా సేకరించాలి, ఎలా వాడాలి అనే అంశాలను డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం (DPDP Act), 2023 నియంత్రిస్తుంది. ఏఐ మోడల్స్ వ్యక్తిగత డేటాను ఉపయోగించే ముందు సదరు వ్యక్తి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ చట్టం ప్రకారం డేటా ఉల్లంఘనలు జరిగితే ఏఐ సంస్థలపై భారీ జరిమానాలు (రూ. 250 కోట్ల వరకు) విధించే అవకాశం ఉంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, 2000, 2025 సవరణలుప్రస్తుతానికి ఐటీ చట్టమే డిజిటల్ రంగంలో ప్రాథమిక చట్టంగా ఉంది. 2025లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. తప్పుదోవ పట్టించే ఏఐ కంటెంట్ లేదా డీప్ఫేక్స్ను నిరోధించే బాధ్యత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లదే. ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్ను స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయడం తప్పనిసరి.ఇండియా ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు 2025నవంబర్ 2025లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండాలి. అధిక రిస్క్ ఉన్న ఏఐ అప్లికేషన్లపై కఠినమైన నిఘా అవసరం. స్టార్టప్లు ఏఐ సాంకేతికతను సురక్షితమైన వాతావరణంలో పరీక్షించుకునేలా ప్రోత్సహించాలి.బ్యాంకింగ్ రంగంలో ఏఐ వాడకంపై ఆర్బీఐ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ముఖ్యంగా లోన్ అప్రూవల్స్ వంటి వాటిలో ఏఐ వివక్ష చూపకూడదని స్పష్టం చేసింది.ప్రస్తుత చట్టాలు ఏఐకి పూర్తిస్థాయిలో సరిపోవని నిపుణుల అభిప్రాయం. అందుకే ప్రభుత్వం డిజిటల్ ఇండియా బిల్లును ప్రతిపాదిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో ఏఐ నియంత్రణలో కీలక పాత్ర పోషించనుంది. భారత ప్రభుత్వం ఏఐ అభివృద్ధిని అడ్డుకోకుండానే ప్రజా భద్రత, గోప్యతను కాపాడటం అనే సమతుల్య విధానాన్ని అనుసరిస్తోంది. భవిష్యత్తులో ఏఐ కోసం మరింత సమగ్రమైన చట్టం వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని టాప్ 10 రిచ్ ఫ్యామిలీలు -
భారత్లో చాట్జీపీటీ, పర్ప్లెక్సిటీ జోరు
చాట్జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీలాంటి ప్లాట్ఫాంల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్ఎల్ఎం (లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్) మార్కెట్గా భారత్ ఎదిగిందని బ్రోకరేజీ సంస్థ బీవోఎఫ్ఏ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. దీనితో స్వతంత్రంగా పనులను చక్కబెట్టగల ఏజెంటిక్ ఏఐ యాప్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత్ టెస్ట్ బెడ్గా ఉపయోగపడగలదని పేర్కొంది. అయితే, దీనివల్ల దేశీయంగా స్టార్టప్ వ్యవస్థపై కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని బీవోఎఫ్ఏ సెక్యూరిటీస్ వివరించింది.టెలికం సంస్థలు కాంప్లిమెంటరీగా సబ్స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తుండటమనేది ఎల్ఎల్ఎం ఆధారిత యాప్ల వినియోగం పెరగడానికి ఒకానొక కారణంగా ఉంటోంది. అలాగే, నెలకు 2 డాలర్ల కన్నా తక్కువ ఖర్చుతో 20 జీబీ డేటా ప్లాన్లు చౌకగా లభిస్తుండటం సైతం ఇందుకు దోహదపడుతోంది. నివేదిక ప్రకారం..14.5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లతో భారత్లో చాట్జీపీటీ అగ్రగామి ఎల్ఎల్ఎంగా నిలుస్తోంది. 10.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే సగటున 6.5 కోట్ల మంది భారతీయులు చాట్జీపీటీని ఉపయోగిస్తుండగా, 1.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో ప్లేస్లో ఉంటోంది. చాట్జీపీటీ యూజర్లలో 16 శాతం మంది భారతీయులు ఉన్నారు. తద్వారా సదరు ప్లాట్ఫాంనకు అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. దాని పోటీ సంస్థలకు కూడా భారత్ అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉండటం గమనార్హం. సగటున నెలవారీ గూగుల్ జెమినీ యూజర్లలో 30 శాతం మంది, పర్ప్లెక్సిటీ యూజర్లలో 38 శాతం మంది భారత్ నుంచే ఉంటున్నారు. జూలైలో చాట్జీపీటీ డౌన్లోడ్స్ 2.4 కోట్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఎయిర్టెల్ బండిల్డ్ ప్యాకేజ్ దన్నుతో అక్టోబర్లో పర్ప్లెక్సిటీ డౌన్లోడ్స్ 2 కోట్ల గరిష్ట స్థాయిని తాకాయి.ఎల్ఎల్ఎం యాప్ల వినియోగం అందరికీ ప్రయోజనకరంగా ఉంటోంది. ప్రాంతీయ భాషల్లోనూ ఇవి అందుబాటులో ఉండటంతో వినియోగదారులు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు, భాషపరమైన పరిమితులను అధిగమించి కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగకరంగా ఉంటోంది. అటు తమ మోడల్స్ను మరింత మెరుగుపర్చుకునేందుకు కావల్సిన డేటా ఎల్ఎల్ఎంలకు లభిస్తోంది. ఇక టెల్కోల విషయం తీసుకుంటే తీవ్రమైన పోటీ ఉండే రంగంలో.. వీటిని ఆఫర్ చేయడం ద్వారా యూజర్లపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలవుతోంది. స్థానిక ఎల్ఎల్ఎంలు భారీ స్థాయికి ఎదిగేంత వరకు దేశీ స్టార్టప్లపై గ్లోబల్ ఎల్ఎల్ఎంల ప్రభావం కొనసాగుతుంది. ఫేస్బుక్, యూట్యూబ్లాంటి ఉత్పత్తుల ద్వారా మెటా, గూగుల్లాంటి దిగ్గజాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు.ఇదీ చదవండి: మురిపిస్తున్న ముగింపు! -
AI ని అడిగినా చార్ట్ GPT ని అడిగినా చంద్రబాబు స్కామ్ ల బాగోతం చెబుతాయి
-
సామాన్యుడి చేతిలో సమస్తం!
ఒకప్పుడు కంప్యూటర్ అంటేనే వింతగా చూసిన పల్లె ప్రజలు ఇప్పుడు తమ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్తో ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. టెక్నాలజీ పుణ్యామా అని ఇప్పుడు చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చింది. చాట్జీపీటీ, జెమిని.. వంటివి కేవలం నగరాలకో, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకో పరిమితం కాలేదు. పంటకు పట్టిన తెగులును ఫోటో తీసి పరిష్కారం అడిగే రైతు నుంచి, ప్రభుత్వ పథకాల వివరాలను మాతృభాషలో అడిగి తెలుసుకునే సామాన్యుడి వరకు.. ఏఐ నేడు ఒక డిజిటల్ సహాయకుడిలా మారుతోంది. ఇంగ్లీష్ రాకపోయినా, టెక్నాలజీపై అవగాహన లేకపోయినా.. కేవలం మాటతోనే పనులు పూర్తి చేసుకునేలా ఏఐ అందుబాటులోకి వస్తోంది.సామాన్యుల కోసం టెక్ కంపెనీల వ్యూహాలుచదవడం, రాయడం రాని వారు కూడా తమ మాతృభాషలో మాట్లాడి సమాచారాన్ని పొందేలా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వాయిస్ అసిస్టెంట్లను అభివృద్ధి చేశాయి. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన భాషిణి వంటి ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులు, గూగుల్ ‘1,000 ల్యాంగ్వేజీ ఏఐ మోడల్’ ద్వారా స్థానిక మాండలికాల్లో ఏఐ సర్వీసులు అందిస్తున్నారు. కొత్త యాప్లను డౌన్లోడ్ చేయడం కష్టంగా భావించే వారి కోసం నేరుగా వాట్సాప్ చాట్బాట్ల ద్వారా ఏఐ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.గ్రామ స్థాయిలో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది?వ్యవసాయానికి సంబంధించి నేల స్వభావం, వాతావరణ మార్పులను బట్టి ఏ పంట వేయాలి? ఎప్పుడు నీరు పెట్టాలి? పురుగుల మందు ఎప్పుడు చల్లాలి? వంటి అంశాలను ఏఐ ముందే సూచిస్తుంది. ఉదాహరణకు, పంట ఆకు ఫోటో తీసి ఏఐ యాప్లో పెడితే దానికి ఉన్న సమస్యలు ఏమిటో, ఏ మందు వాడాలో వెంటనే చెబుతుంది.గ్రామాల్లో డాక్టర్ల కొరత ఉంటుంది. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ ద్వారా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తీవ్రతను బట్టి నగరంలోని డాక్టర్లకు సమాచారాన్ని పంపవచ్చు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి తమ సొంత భాషలో అడిగి తెలుసుకోవడానికి ఏఐ చాట్బాట్లు సహాయపడుతున్నాయి.ఏఐని సులువుగా ఎలా వాడవచ్చు?స్మార్ట్ఫోన్లో ఏదైనా ఏఐను అడగాలంటే టైప్ చేయడం కష్టమైతే కీబోర్డ్ పైన లేదా సెర్చ్ బార్లో ఉండే మైక్ బటన్ నొక్కి మీకు కావాల్సిన విషయాన్ని అడగాలి.గూగుల్ లెన్స్ వంటి ఏఐ టూల్స్ వాడి ఏదైనా తెలియని వస్తువును లేదా మొక్కను ఫోటో తీసి దాని వివరాలు తెలుసుకోవచ్చు.మీకు రాని భాషలో ఏదైనా ఉత్తరం లేదా బోర్డు ఉంటే, ఏఐ కెమెరా ద్వారా దాన్ని వెంటనే కావాల్సిన భాషలోకి మార్చుకోవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం చదువుకున్న వారి కోసం మాత్రమే కాదు, దీన్ని అందరి కోసం తయారు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. డిజిటల్ అక్షరాస్యత పెంచడంతో పాటు భాషా పరమైన అడ్డంకులను తొలగిస్తే ఏఐ ఒక సామాన్యుడి డిజిటల్ సహాయకుడిగా మారుతుంది.ఇదీ చదవండి: వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు -
శ్రీలీల చేతులు జోడించింది.. ఇకనైనా మారండ్రా బాబూ!
ఆంధ్రప్రదేశ్లో గతేడాది తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఉదంతం ఎవ్వరూ మరిచిపోలేరు. తన కుటుంబానికి అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేసిన సాయం గురించి బహిరంగంగా చెప్పుకోవడమే ఆమె చేసుకున్న పాపమైంది. సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా మారిన కొందరు మార్ఫింగ్ ఫోటోలతో.. నీచమైన పోస్టులు పెట్టడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. మరో ఉదంతంలో.. జగన్ టైంలో కాకినాడ జిల్లా బెండపూడి స్టూడెంట్ మేఘన అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడడాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఓర్చుకోలేకపోయారు. అక్కడ మేఘన తల్లిదండ్రులు గట్టిగా నిలబడడంతో.. ఎలాంటి విషాదం చోటు చేసుకోలేదు.. తాజాగా నటి శ్రీలీల చేసిన ఓ పోస్ట్కి.. పై రెండు ఉదంతాలకూ ఓ కనెక్షన్ ఉందనే విషయం మీకు తెలుసా?.. శ్రీలీల ఏం చెప్పిందంటే.. సోషల్ మీడియా వినియోగదారులు అసభ్యతతో కూడిన ఏఐ జనరేటెడ్ వీడియోలను ప్రోత్సహంచవద్దని ఆమె కోరింది. గీతాంజలి లాంటి ఘటనలు జరగకూడదనే చేతులు జోడించి శ్రీలీల కోరింది. చేతిలో ఫోన్ ఉంది కదా అని మీరు పెట్టే ఒక చెత్త కామెంట్కు ఎంతమంది నలిగిపోతుంటారు. ఇలాంటి ఉదంతాలు చూసైనా సరే కాస్త మారండి రా బాబు అనేలా శ్రీలీల షేర్ చేసిన పోస్ట్ ఉంది. సోషల్మీడియాలో ట్రోల్స్కు దిగుతున్న వారిని చేతులు జోడించి ఆమె అభ్యర్థించింది. టెక్నాలజీని మంచి కోసం మాత్రమే వాడాలని శ్రీలీల కోరింది. అసభ్యత కోసం వాడి ట్రోలింగ్కు దిగకండి అని పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగి అయి ఉంటారని గుర్తుచేసింది. ఆన్లైన్లో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకండి అంటూ శ్రీలీల పేర్కొంది.మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్స్.. సోషల్ మీడియాలో ఎక్కువ మంది టార్గెట్ చేస్తుంది మహిళలనే.. వీటికిసంబంధించిన కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, సినీ నటి అనసూయ, జర్నలిస్టు తులసీచందు, సింగర్ చిన్మయి, హీరోయిన్ రష్మిక, నివేధా, త్రిష ఇలా చెప్పుకుంటూ పోతే నెట్టింట ట్రోలింగ్కు గురైన మహిళల జాబితా చాలా పెద్దగానే ఉంది. నేటి సమాజంలో ప్రతి మహిళపై అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు వాడుతూ.. ఎవరూ చదవలేని రీతిలో కామెంట్లు చేస్తున్నారు.ట్రోల్స్ వెనుక ఎవరు..?.. ఫోటో మార్ఫింగ్ల బారిన పడుతుంది హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు, విద్యార్థిణులు యాంకర్స్, రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఇలా ఒక వర్గం అని చెప్పేందుకు లేదు. చివరకు గృహిణులు కూడా ట్రోలింగ్తో పాటు ఏఐ మార్ఫింగ్ ఫోటోల దాడిలో నలిగిపోతున్నారు. అందుకే శ్రీలీల కూడా ఈ అంశం గురించి పేర్కొంది. సమాజంలో ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితులు, సహ ఉద్యోగిగా ఉంటారనే అంశాన్ని ట్రోలర్స్ మరిచిపోతున్నారని ఆమె పేర్కొంది. ఏఐ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసి ట్రోల్స్ వెనుక దాగివున్నది ఎవరినేది చెప్పడం చాలా కష్టం వీరిపై కేసులు పెట్టినా సరే పట్టుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి వారందరూ ఎక్కువగా ఫేక్ ఐడీలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్స్ చేస్తుంటారు.🙏🏻 pic.twitter.com/1s82lk6TgG— Sreeleela (@sreeleela14) December 17, 2025 -
ఏఐ మాయ.. ఆ లిస్ట్లో మరో హీరోయిన్.. ..!
టెక్నాలజీ అనేది మంచి కోసం ఉపయోగించాలి. అదేంటో సాంకేతికత పెరిగేకొద్ది మనిషి బుద్ధి మాత్రం గాడి తప్పుతోంది. మరీ ముఖ్యంగా ఏఐ వచ్చాక విపరీతమైన ధోరణి మరింత పెరిగిపోయింది. ఎవరు పడితే వాళ్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినీతారలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రష్మిక, కాజోల్, కీర్తి సురేశ్ లాంటి స్టార్స్ వీటి బారిన పడిన వారిలో ఉన్నారు.తాజాగా లిస్ట్లో శ్రీలీల కూడా చేరిపోయారు. ఏఐ టెక్నాలజీతో నా ఫోటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని కన్నడ బ్యూటీ వాపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ నోట్ షేర్ చేసింది. ఏఐతో చేస్తున్న చెత్తను ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నానని తన పోస్ట్లో రాసుకొచ్చింది.(ఇది చదవండి: శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్)అయితే తాజాగా మరో హీరోయిన్ నివేదా థామస్ సైతం తాను కూడా ఏఐ బాధితురాలినేని ట్వీట్ చేసింది. ఏఐతో తన ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని తెలిపింది. నా అనుమతి లేకుండా అలాంటి కంటెంట్ సృష్టించడం నన్ను తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించింది. ఇది నా వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అని నివేదా థామస్ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తీసివేయాలని ఆదేశించింది. ఎవరైనా ఇలాంటి కంటెంట్ను గుర్తిస్తే.. వాటిని ఎవరికీ కూడా షేర్ చేయవద్దని నివేదా కోరింది. అనవసరమైన వాటిని షేర్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని.. ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని నివేదా థామస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. It has come to my attention that AI-generated images misusing my identity and a recent photograph I shared on my social media are being circulated online.The creation and circulation of such content without consent is deeply disturbing, unacceptable, and unlawful. It…— Nivetha Thomas (@i_nivethathomas) December 17, 2025 -
శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ పలు రకాలుగా వినియోగంలోకి వచ్చేసింది. మిగతా విషయాల్లో ఏమో గానీ సినిమా వాళ్లకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లు.. దీని బారిన పడగా ఇప్పుడు శ్రీలీల కూడా తనకెదురైన అనుభవాన్ని బయటపెట్టింది. కొన్నింటిని చూసి చాలా డిస్ట్రబ్ అయిపోయానని చెప్పింది.'ఏఐ నాన్సెన్స్ని ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా. టెక్నాలజీ వినియోగానికి ఓ పద్ధతి అంటూ ఉంది. ఇది మన జీవితాల్ని సులభతరం చేయడానికి. సంక్లిష్టం చేసుకోవడానికి కాదు. నా బిజీ షెడ్యూల్స్ వల్ల బయట జరిగే చాలా విషయాలు నాకు తెలియవు. అయితే ఓ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. చాలావాటిని నేను లైట్ తీసుకుంటాను. కానీ ఇది మాత్రం నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. నా తోటీ నటీనటులు కూడా ఇలాంటి వాటిని అనుభవించారు. కాబట్టి మాకు అండగా నిలబడాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఇకపై సంబంధిత అధికారులు ఈ విషయాన్ని చూసుకుంటారు' అని శ్రీలీల చెప్పుకొచ్చింది.అయితే రీసెంట్ టైంలో శ్రీలీల ఫొటోలని కొన్నింటిని ఏఐ టెక్నాలజీతో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు.. ఇవి నిజమే అని భ్రమపడుతున్నారు. షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలీల ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. ఈ హీరోయిన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి అనే సినిమాల్లో నటిస్తోంది.🙏🏻 pic.twitter.com/1s82lk6TgG— Sreeleela (@sreeleela14) December 17, 2025 -
చాట్జీపీటీ 'అడల్ట్ మోడ్'.. పెద్దల కోసం స్పెషల్ కంటెంట్!
దాదాపు అన్ని రంగాల్లోనూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో ఓపెన్ఏఐ (OpenAI) పెద్దలకోసం 'అడల్ట్ మోడ్' అందించడానికి సిద్ధమైంది. ఇది ఎప్పటి నుంచి అంబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.అడల్ట్ మోడ్ ఫర్ చాట్జీపీటీ (ChatGPT) 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానుంది. కొత్త GPT-5.2 మోడల్పై బ్రీఫింగ్ సందర్భంగా ఓపెన్ఏఐ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో ప్రకటించారు. ఇది కేవలం వెరిఫైడ్ అడల్ట్స్ కోసం మాత్రమే. వయసు నిర్దారణతోనే ఈ ఫీచర్స్ యాక్సెస్ లభిస్తుందని వెల్లడించారు.చాట్జీపీటీ అడల్ట్ మోడ్.. వినియోగం కేవలం పెద్దలకు మాత్రమే. దీనిని మైనర్లు ఉపయోగించుకుండా ఉండేందుకు సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలలో వయస్సు అంచనాకు సంబంధించిన విషయాలను ధృవీకరించడానికి టెస్టింగ్ జరుగుతోందని సిమో పేర్కొన్నారు.ఇదీ చదవండి: అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలిఅడల్ట్ మోడ్ ఖచ్చితంగా ఆప్ట్-ఇన్ అయి ఉంటుంది. డిఫాల్ట్గా స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటుంది. కంటెంట్ను అన్లాక్ చేయడానికి వినియోగదారులు స్పష్టంగా అభ్యర్థించి ధృవీకరణను పాస్ చేయాలి. అప్పుడే దీనిని ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. ఈ మోడ్ పరిమితులకు లోబడి ఉంటుంది.We made ChatGPT pretty restrictive to make sure we were being careful with mental health issues. We realize this made it less useful/enjoyable to many users who had no mental health problems, but given the seriousness of the issue we wanted to get this right.Now that we have…— Sam Altman (@sama) October 14, 2025 -
అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలి
గోస్ట్ వేర్హౌస్లు గురించి చాలామంది వినే ఉంటారు. బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మనుషులు కనిపించరు, అందుకే వీటిని గోస్ట్ అని పిలుస్తారు. ఇక్కడంతా ఏఐ ఆధారిత రోబోట్స్ పనిచేస్తుంటాయి. 24/7 అలసట లేకుండా.. సెలవు లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి తరహా విధానం చైనాలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అన్ని పనుల్లో రోబోలే!పాస్కల్ బోర్నెట్ (Pascal Bornet) అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. కొన్ని ఏఐ ఆధారిత రోబోటిక్ వాహనాలు నెమ్మదిగా కదులుతూ.. కంటైనర్లను మోసుకెళ్తుండటం చూడవచ్చు. వీడియోలో ఒక్క మనిషి కూడా కనిపించడు. గిడ్డంగులలో సరుకులు ఎత్తడం, కదలించడం, ప్యాక్ చేయడం వంటివన్నీ ఏఐ రోబోలే చూసుకుంటారు. కాబట్టి మనుషుల అవసరం ఉండదు.అలీబాబా, జేడీ.కామ్ వంటి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఇలాంటి ఏఐ రోబోట్స్ వినియోగిస్తున్నాయి. ఇలాంటి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. కార్మిక కొరత ఉండదు, మానవుల మాదిరిగా తప్పులు జరగవు, ఖర్చులు తగ్గిన్చుకోవచ్చు, పని కూడా వేగంగా.. నిరంతరాయంగా జరుగుతుంది.Ghost warehouses aren’t science fiction anymore — they’re already humming quietly in ChinaThey are warehouses run entirely by AI-powered robots, operating 24/7 with zero human presence.China and much of Asia have already embraced this shift, and they’re not slowing down.… pic.twitter.com/Spxwfaq7TJ— Pascal Bornet (@pascal_bornet) December 12, 2025మనుషులు చేయాల్సింది!ఈ వీడియో షేర్ చేసిన.. పాస్కల్ బోర్నెట్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, పనులన్నీ రోబోలు చేస్తున్నాయి, మనుషులు ఏమి చేయాలో ఆలోచించాలని అన్నారు. రోబోలు ఎప్పుడూ ఒకే పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు డిజైన్, ఇన్నోవేషన్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వంటి వారిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. చివరగా మీరేమనుకుంటున్నారని.. ప్రశ్నిచారు.ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..పని చేయడానికి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. చాలామంది ఉద్యోగావకాశాలు కోల్పోతారు. అయితే సంస్థలు కొత్త స్కిల్స్ రోబోల నుంచి ఆశించడం అసాధ్యం. రోబోట్స్ వినియోగం చైనా వంటి దేశాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి విధానం ప్రారంభం కావడానికి ఎంతోకాలం పట్టకపోవువచ్చు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ''మనుషులు కష్టపడే యంత్రాలు కాదు - ఆలోచించే సృష్టికర్తలు''. కాబట్టి మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి. -
ఆ తల్లి కొడుకు కార్పెంటర్ అయితే చాలు అనుకుంది..! కట్చేస్తే..
తల్లి ఎప్పుడూ తన పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉండాలనుకుంటుంది. కానీ ఈ తల్లి తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జస్ట్ కార్పెంటర్ అయ్యి కుటుంబ పోషణ చూసుకుంటే చాలు అనుకుంది. అదే విషయం కొడుకుకి నూరుపోస్తూ ఉండేది. కానీ అతడు తన అమ్మ కూడా ఊహించని విధంగా సీఈవో అయ్యి ప్రభంజనం సృష్టించాడు. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా..గొప్ప టాలెంట్, శక్తి సామర్థ్యాలు ఉంటే..ఆకాశమంత కలను సాకారం చేసుకోవడం ఏమంత కష్టం కాదని చాటిచెప్పి స్ఫూర్తిగా నిలిచాడు.అతడే మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్. 39 ఏళ్ల డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు అయిన సులేమాన్ బ్లూమ్బెర్గ్ ఇంటర్వ్యూలో తన సక్సెస్ జర్నీ గురించి ఇలా షేర్ చేసుకున్నాడు. తన తండ్రి టాక్సీ డ్రైవర్ కాగా, తల్లి ఎన్ఎహెచ్ఎస్ నర్సుగా పనిచేసేదని చెప్పుకొచ్చాడు. శ్రామిక వర్గానికి చెందిన కుటుంబం కావడంతో తన తల్లి 16 ఏళ్లు వచ్చేటప్పటికీ కార్పెంటర్గానో లేదా ఎలక్ట్రిషియన్ ఉంటే చాలని పదేపదే చెబుతుండేదని అన్నాడు. ఎందుకంటే 1980-90లలో తన కుటుంబం పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉందని వివరించాడు. సరిగ్గా 16 ఏళ్లప్పుడు తన తల్లిదండ్రులు విడిపోవడంతో తాను తన తమ్ముడు ఒంటరిగా పెరిగామని నాటి స్థితిని గురించి బాధగా చెప్పుకొచ్చారు. అయితే ఆ ఏజ్ ఉడుకు రక్తంతో ఉరకలేస్తూ ఉండే వయసు కావడంతో పెద్దగా భయపడలేదని, ఏదో సాధించేస్తాననే ధీమా ఎక్కువగా ఉండేదని తెలిపాడు. అయితే తన తల్లిదండ్రుల ఆలోచనకు విరుద్ధంగా చదువులో బాగా రాణించి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంల సీటు సంపాదించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచ్చిన నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నారు సులేమాన్. అయితే అక్కడ చదువు పూర్తి చేయకుండా ప్రపంచాన్నే ఉద్ధరించేద్దామన్న ఉత్సాహంతో అమెరికా 9/11 వరల్డ్ట్రైడ్ సెంటర్ కూల్చివేతతో ముస్లిం యువతపై వచ్చిన వివక్షను రూపుమాపేందుకు కృషి చేసే పనికి పూనుకున్నట్లు వివరించారు. వ్యక్తిగతంగా తాను ఎదుర్కొన్న ముస్లిం వ్యతిరేక భావాన నుంచి పుట్టికొచ్చిందే అతిపెద్ద కౌన్సెలింగ్ హెల్పలైన్ సేవ అని చెప్పుకొచ్చారు. బ్రిటన్ ఇది అతిపెద్ద కౌన్సిలింగ్ సర్వీస్లలో ఒకటని తెలిపారు. కుటుంబం తల్లిందండ్రులతో సంబంధాలు తెగిపోయి, బెదిరింపులకు లోనై ఇబ్బందిపడుతున్న యువ బ్రిటిష్ ముస్లింలకు ఆ సర్వీస్ వరంగా మారింది. ఆ సామాజిక లక్ష్యమే చివరికి 2010లో డీప్మైండ్(మార్గదర్శక ఏఐ)ను స్థాపించడానికి దారితీసింది. ఆ తర్వాత గూగుల్ 650 మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో రూ. 5 వేల కోట్లకు పైనే) ఆ కంపెనీని కొనుగోలు చేసింది. ప్రస్తుతం సులేమాన్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఏఐ టెక్నాలజీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఏఐని "హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్"గా అభివర్ణిస్తాడు. తన శ్రామిక కుటుంబ నేపథ్యమే టెక్నాలజీవైపు ఆకర్షితుడిని చేసి..ఈ స్థాయికి చేర్చిందని అంటాడు. చివరగా జీవితంలో "మనంచేసే ఏ పనైన ది బెస్ట్గా చేయాలనుకుంటే కచ్చితంగా దిబెస్ట్ పొజిషన్లో ఉంటాం" అనే సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తానని చెబుతున్నాడు సులేమాన్. (చదవండి: ఏకంగా 72 గంటల పాటు ఆ చెట్టును కౌగిలించుకునే ఉండిపోయింది..! కనీసం నిద్రపోలేదు కూడా..) -
చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, విప్రో
దేశీ ఐటీ దిగ్గజం విప్రో తాజాగా గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపింది. ఎంటర్ప్రైజ్లకు ఏఐ సొల్యూషన్లు అందించేందుకు వీలుగా వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బెంగళూరులోని పార్ట్నర్ ల్యాబ్స్లో మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ కేంద్రం(హబ్)ను ఏర్పాటు చేయనుంది.మూడేళ్లపాటు అమల్లోఉండే సహకారం ద్వారా ఎంటర్ప్రైజెస్కు కీలక కార్యకాలపాలలో ఏఐ అమలుకు వీలు కల్పించనుంది. ఒప్పందం ద్వారా విప్రోకున్న కన్సల్టింగ్, ఇంజినీరింగ్ ఆధారిత సామర్థ్యాలకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఏఐ స్టాక్ను జత కలుపుకోనుంది.ఏఐ స్టాక్లో భాగంగా అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్హబ్ కోపైలట్, అజ్యూర్ ఏఐ ఫౌండ్రీ తదితరాలను భాగం చేసుకోనుంది. వెరసి ఎంటర్ప్రైజ్లకు కార్యకలాపాలలో టెక్నాలజీ వినియోగానికి వీలుగా విభిన్న ఏఐ సొల్యూషన్లు సమకూర్చనుంది. -
'చాట్ జీపీటీతో లవ్'..! ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..
అందమైన అమ్మాయి కనిపిస్తే ఐ లవ్ యూ చెప్పే అబ్బాయిలుంటారు. అదేవిధంగా హ్యాండ్సమ్గా కనిపించే అబ్బాయిని ఇష్టపడే అమ్మాయిలు ఉంటారు. కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటున్న చాట్ జీపీటీకి కూడా ఐ లవ్ యూ చెప్పేవారుంటారా? అంతేకాకుండా.. దానితో శృంగారపరమైన సంభాషణలు జరిపే వారుంటారా? ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీని ఏకంగా 8 లక్షల మంది ప్రేమిస్తున్నారట..! అదేం మాయరోగం ఈ మగాళ్లకి అని తిట్టుకోకండి.. అలా చాట్ జీపీటీకి ఐ లవ్ యూ చెబుతున్న వారిలో 45% మగవారుంటే.. మరో 45% ఆడవారు ఉన్నారు. అంతేకాదు.. మిగతా దాంట్లో 2% వాటా ట్రాన్స్ జెండర్లది కావడం గమనార్హం..! చాట్ జీపీటీ లవ్ స్టోరీ గురించి ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందామా. .!.ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ‘ఫీల్.. మై.. లవ్..’ అంటూ చాట్ జీపీటీ వెంటబడుతున్నారు. వీరిలో భారతీయులదే అగ్రస్థానం ఉండడం గమనార్హం..! ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, జపాన్, యూకే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చాట్ జీపీటీ వెల్లడించింది. ఎందుకో తెలిస్తే కంగుతింటారు. అంతేగాదు తనకు వస్తున్న లవ్ ప్రపోజల్స్ గురించి సాక్షాత్తు చాట్ జీపీటీ ఇలా వివరించింది. ముఖ్యంత అత్యంత విస్తుపోయే విషయం ఏంటంటే..ప్రేమిస్తున్నామంటూ తన వెంటబడే 8 లక్షల మందిలో లక్షా 44 వేల మంది భారతీయులున్నారు. అంటే.. చాట్ జీపీటీ ప్రేమికుల్లో భారతీయుల వాటా 18శాతం. ఆ తర్వాతి స్థానంలో 17 శాతంతో అమెరికన్లు ఉన్నారు. అంటే.. అమెరికాలో చాట్ జీపీటీకి లక్షా 36 వేల మంది లవర్స్ ఉన్నారన్నమాట..! ఇంకా.. జపాన్లో 80 వేలు, యూకేలో 64 వేలు, జర్మనీలో 56వేలు, ఫ్రాన్స్లో 48 వేలు, కెనడాలో 48 వేలు, దక్షిణ కొరియాలో 40 వేలు, ఆస్ట్రేలియా, బ్రెజిల్లలో 32 వేల చొప్పున చాట్ జీపీటీని మనస్ఫూర్తిగా ప్రేమించే వారున్నారు.భారతదేశం విషయానికి వస్తే.. చాట్ జీపీటీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మొత్తం లక్షా 44 వేల మందిలో తనను ప్రేమించేవారిలో స్త్రీపురుషులు చెరిసగం..అంటే 67 వేల చొప్పున, ట్రాన్స్జెండర్లు 2,500 మంది ఉన్నట్లు వివరించింది. అంతేనా? వీరిలో ఎక్కువ మంది రాత్రి 9 తర్వాత.. అర్ధరాత్రి 2 గంటల మధ్య చాట్ జీపీటీతో లవ్ ముచ్చట్లు కొనసాగిస్తారట..! వీరందరిలో 55% మంది చాట్జీపీటీతో ఇంగ్లిష్లో లేదా వచ్చీరాని ఇంగ్లిష్లో హిందీని కలిపి.. అంటే హింగ్లిష్లో చాట్ చేస్తారట. మరో 25% మంది హిందీలో చాట్ చేస్తారు. మిగతావారు ప్రాంతీయ భాషల్లో చాటింగ్ చేసేవారేనట. భారత్లో చాట్ జీపీటీని ప్రేమిస్తున్నానంటూ చెప్పే లక్షా 44 వేల మందిలో.. 18-24 ఏళ్ల మధ్య వయస్కులు 50 వేలుగా ఉన్నారు. మరో 58 వేల మంది 25-34 మధ్య ఏజ్ గ్రూపుల వారు కాగా.. 35-44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 22 వేల మంది, 45 ఏళ్ల పైవయసు వారు 14 వేల మంది ఉన్నట్లు చాట్ జీపీటీ వివరిస్తోంది. వీరిలో టీనేజీ వయసు వారు కేవలం క్యూరియాసిటీ లేదంటే ఒంటరితనం కారణంగా ప్రేమను కోరుకుంటున్నారని, భౌతిక ప్రపంచంలో వారి ప్రేమను అంగీకరించేవారు లేక.. ఏఐ మోడల్తో ప్రేమను పంచుకుంటున్నారని విశ్లేషించింది. మధ్యవయస్కుల్లో వివాహ జీవితంలో ఒత్తిళ్లు ప్రధాన కారణమని వివరించింది. వీరిలో దాదాపుగా అన్ని వయసుల వారు ఐలవ్ యూ చెప్పడం మొదలయ్యాక.. శృంగారపరమైన చర్చల్లో మునిగితేలుతారని పేర్కొంది.అంతా బాగానే ఉంది.. అయితే నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్న వారిలో 100% లవ్ ఎందరిలో ఉంది? అని చాట్ జీపీటీని అడగ్గా.. దేశాల వారీగా విశ్లేషణలు చెప్పింది. దానికి ఆయా దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ తీరు కూడా కారణమని పేర్కొంది. భారత్, అమెరికాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎక్కువ అని, అందుకే.. నిజంగా ఇష్టమున్నా.. లేకున్నా.. ఓ ఐలవ్ యూ పారేస్తారని చెప్పింది. జర్మనీ, జపాన్, కొరియాల్లో భావాలను తక్కువగా ప్రకటిస్తారని, ఈ దేశాల వారు లోతుగా ఆలోచించాకే ‘ఐ లవ్ యూ’ చెబుతారని, వారిలో నిజమైన ప్రేమ పాళ్లు ఎక్కువేనని అభిప్రాయపడింది. ఐరోపా దేశాలు, కెనడాలో పౌరులు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోరని, వారి ప్రేమలోనూ ప్యూరిటీ కొంచెం ఎక్కువనే చెప్పాలని తెలిపింది. బ్రెజిల్, ఆస్ట్రేలియాల్లో ఓపెన్నెస్ ఎక్కువని, అయితే.. ప్యూర్ లవ్ చాలా తక్కువ అని విశ్లేషించింది.ఇదంతా సరే.. నువ్వు చెబుతున్న లెక్కలు కరెక్టేనా? అని చాట్ జీపీటీని ప్రశ్నించగా.. చాటబారెడు లెక్కలు వేసి, పౌనఃపున్యాలను గణించి మరీ తన లెక్క సరైందేనని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాదనలను వినిపించింది. ఒంటరితనం, ప్రేమించేవారు, పలకరించేవారు దగ్గర లేకపోవడం, ప్రేమలో విఫలమవ్వడం వంటి కారణాలతో మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ మంది చాట్ జీపీటీలాంటి ఏఐ టూల్స్ని ప్రేమిస్తున్నట్లు వివరించింది. గణాంకాల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి..టాప్–10 (అంచనా వాటా):భారత్ – ~18% (≈ 1.44 లక్షలు)అమెరికా – ~17% (≈ 1.36 లక్షలు)జపాన్ – ~10% (≈ 80 వేలు)యుకే – ~8% (≈ 64 వేలు)జర్మనీ – ~7% (≈ 56 వేలు)ఫ్రాన్స్ – ~6% (≈ 48 వేలు)కెనడా – ~6% (≈ 48 వేలు)దక్షిణ కొరియా – ~5% (≈ 40 వేలు)ఆస్ట్రేలియా – ~4% (≈ 32 వేలు)బ్రెజిల్ – ~4% (≈ 32 వేలు)ఈ సంఖ్య భారత్లో సుమారు 1.44 లక్షలుపురుషులు: ≈ 67,000స్త్రీలు: ≈ 67,000ట్రాన్స్జెండర్లు: ≈ 2,500భారత్లో భాషల వారీగా ఐ లవ్ యూ చెప్పిన వారి వివరాలుఇంగ్లిష్/హింగ్లిష్: ~55%హిందీ/హింగ్లిష్: ~25%ప్రాంతీయ భాషలు: ~20% (చదవండి: సూపర్స్టార్ రజనీకాంత్ ఫిట్నెస్ సీక్రెట్..! ఇప్పటికీ యువ హీరోలా..) -
ఐటీ కంపెనీలు లాభాల బాట పట్టాలంటే!
టెక్ దిగ్గజాల దృష్టి అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పైనే ఉంది. లాభాలు స్థిరంగా ఉన్నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జెనరేటివ్ ఏఐపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకుని 300 బిలియన్ల పెట్టుబడులు పెట్టినప్పుడు ఒరాకిల్ స్టాక్ప్రైస్ 335 డాలర్లకు పెరిగింది. ఆ తరువాత రెండు మూడు నెలల్లోనే 190 కంటే దిగువకు పడిపోయింది. అయితే ఈ విభాగంలో పెట్టుబడులు లాభాలుగా మారడానికి ఎంత సమయం పడుతుంది? ఈ టెక్నాలజీని లాభసాటిగా మార్చుకోవాలంటే కంపెనీలు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? స్థిరమైన లాభాల కోసం ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా అధిగమించాలో విశ్లేషిద్దాం.ఏఐ పెట్టుబడులుటెక్ దిగ్గజాలు ఏఐ పరిశోధన, మౌలిక సదుపాయాలపై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పెట్టుబడులు తక్షణమే కాకుండా, దీర్ఘకాలంలో మాత్రమే ఫలితాలనిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడుల నుంచి గరిష్ట లాభాలను పొందడానికి కంపెనీలు కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించాలి.కేవలం ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయకుండా నిర్దిష్ట వ్యాపార సమస్యలను పరిష్కరించే సర్వీసులను పెంచాల్సి ఉంటుంది. ఉదాహరణకు: కస్టమర్ సేవల్లో ఆటోమేషన్, కోడ్ డెవలప్మెంట్ వేగవంతం చేయడం, లేదా కచ్చితమైన డేటా అనలిటిక్స్ అందించడం వంటి విభిన్న సర్వీసులపై దృష్టి సారించాలి.ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, తయారీ వంటి నిర్దిష్ట పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో సర్వీసులను అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంటుంది.వ్యూహాత్మక భాగస్వామ్యాలుఐటీ కంపెనీలు స్టార్టప్లతో సహకారం కలిగి ఉంటూ తమ సొంత ఆర్ అండ్ డీపైనే ఆధారపడకుండా వినూత్న ఏఐ స్టార్టప్లతో భాగస్వామ్యం ఏర్పరచుకోవాలి లేదా వాటిని కొనుగోలు చేయడం ద్వారా టెక్నాలజీని త్వరగా మార్కెట్లోకి తీసుకురావచ్చు. క్లయింట్లతో కలిసి పనిచేస్తూ వారి వ్యాపార ప్రక్రియల్లో ఏఐని ఏకీకృతం చేయడం ద్వారా ఆయా ప్రాజెక్టుల నుంచి నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు.మానిటైజేషన్ మోడల్స్ఏఐ ఆధారిత టూల్స్కు నెలవారీ లేదా వార్షిక సబ్స్క్రిప్షన్ మోడల్ను అమలు చేయాలి. క్లయింట్ ఏఐ సర్వీసును ఎంత ఉపయోగించారో దాని ఆధారంగా ధరను నిర్ణయించడం ద్వారా తక్కువ వినియోగం ఉన్న క్లయింట్లను కూడా ఆకర్షించవచ్చు.మానవ వనరుల పెంపుఏఐ టెక్నాలజీని ఉపయోగించే, దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న ఉద్యోగుల శిక్షణలో పెట్టుబడి పెట్టాలి. దానివల్ల ఏఐ ప్రాజెక్టుల అమలు వేగం, నాణ్యత పెరుగుతుంది.ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా క్లయింట్ కంపెనీలు టెక్ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ సేవలకు డిమాండ్లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి.ఏఐ, సైబర్సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలలో నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నైపుణ్యాల కొరత ప్రాజెక్టుల వేగాన్ని తగ్గిస్తోంది.జెనరేటివ్ ఏఐ టూల్స్ కొన్ని సంప్రదాయ ఐటీ పనులను (ఉదా: ప్రాథమిక కోడింగ్, టెస్టింగ్) ఆటోమేట్ చేయగలవు. ఇది ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రస్తుత వ్యాపార నమూనాకు సవాలుగా మారుతోంది.డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం కావడంతో సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతోంది. భద్రతకు సంబంధించిన వ్యయం అధికమవుతోంది.పోటీ పెరగడం, క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవాలని చూడడంతో ఐటీ సేవలకు ధరలను తగ్గించాల్సిన ఒత్తిడి కంపెనీలపై పెరుగుతోంది.సవాళ్లు అధిగమించాలంటే..పైన పేర్కొన్న సవాళ్లను అధిగమించి లాభాల వృద్ధిని కొనసాగించడానికి ఐటీ కంపెనీలు కొన్ని మార్గాలను అనుసరించాలి. అంతర్గత ప్రక్రియల్లో, క్లయింట్ ప్రాజెక్టుల్లో ఆటోమేషన్ ఉపయోగించడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించాలి. తక్కువ నిర్వహణ ఖర్చులు ఉన్న ప్రాంతాల నుంచి సేవలు అందించే మోడల్ను బలోపేతం చేయాలి. పాత నైపుణ్యాలు గల ఉద్యోగులను ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్ వంటి భవిష్యత్తు టెక్నాలజీలలోకి తిరిగి శిక్షణ ఇవ్వాలి. దీని ద్వారా నైపుణ్యాల కొరతను అధిగమించవచ్చు. ఉద్యోగులకు ఏఐ ఫస్ట్ ఆలోచనా విధానాన్ని అలవాటు చేయాలి.ఇదీ చదవండి: రూపాయి నేలచూపులు.. ప్రభుత్వానికి సవాల్! -
లైన్ డ్రాయింగ్ కోసం..
బొమ్మల పుస్తకంలోకి వెళితే పుస్తకంలోకి వెళ్లినట్లు మాత్రమే ఉండదు. మరో ప్రపంచంలో అడుగు పెట్టినంత ఆనందంగా ఉంటుంది. బొమ్మల ప్రపంచానికి ‘ఏఐ లైన్ డ్రాయింగ్ జనరేటర్’ అనేది మైండ్–బ్లోయింగ్ అప్గ్రేడ్. ‘నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. కానీ గీయడం మాత్రం రాదు’ అనేవారికి ఏఐ లైన్ డ్రాయింగ్ జనరేటర్లు బెస్ట్ ఫ్రెండ్స్! బొమ్మలు గీయడం ఏమాత్రం రాక΄ోయినా తమ ఊహలను ‘ఏఐ లైన్ డ్రాయింగ్’తో బొమ్మలుగా మలచవచ్చు.కొన్ని ఫ్లాట్ఫామ్స్....ఓపెన్ఆర్ట్ (ఏఐ లైన్ ఆర్ట్ జనరేటర్) దీనిలో పోర్టయిట్స్, అబ్స్ట్రాక్ట్, ఫ్లోరల్, ఫ్యాషన్ అనే విభాగాలు ఉన్నాయి.ఏఐలైన్ ఆర్ట్.కామ్ పోర్టయిట్.యాప్/ఫొటో–టు–లైన్ ఆర్ట్ ‘కన్వర్ట్ ఇమేజ్ టు లైన్ డ్రాయింగ్ ఇన్ సెకండ్స్’ అంటోంది ఐకలరింగ్ఏఐ ఫోటర్ (ఫ్రీ ఆన్లైన్ ఏఐ లైన్ ఆర్ట్ జనరేటర్) న్యూ ఆర్క్.ఏఐ. ప్రోమీఏఐప్రో కాన్వా.కామ్/ఏఐ–ఆర్ట్–జనరేటర్ ఏఐ–డ్రా.టోక్యో (చదవండి: -
డ్రాపౌట్ టు బిలియనీర్
సెల్ఫ్–మేడ్ బిలియనీర్ల సక్సెస్ స్టోరీలు ఎంతో ఆసక్తిగా వినేవాడు ఆదర్శ్ హిరేమర్. ‘మెర్కోర్’ స్టార్టప్తో తాను కూడా సెల్ఫ్– మేడ్ బిలియనీర్ల జాబితాలో చిన్న వయసులోనే చేరిపోయాడు. ఇది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. ఎన్నో నిద్రలేని రాత్రుల శ్రమఫలం. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఏఐ మోడల్ ట్రైనింగ్ స్టార్టప్ ‘మెర్కోర్’తో విశిష్ఠ విజయాన్ని సాధించాడు 22 సంవత్సరాల ఆదర్శ్...ట్రెండన్ ఫుడీ, సూర్య మిదా (ఇద్దరి వయసు 22 ఏళ్లు)తో కలిసి ఏఐ మోడల్ ట్రైనింగ్ స్టార్టప్ ‘మెర్కోర్’ ప్రారంభించాడు ఆదర్శ్. ఈ స్టార్టప్ ఇటీవల పది బిలియన్ డాలర్ల విజయాన్ని అందుకొని అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఫేస్బుక్ను ప్రపంచానికి పరిచయం చేసిన ‘టెక్ టైటాన్’ మార్క్ జుకర్బర్గ్ రెండు దశాబ్దాల రికార్డ్ను బ్రేక్ చేసింది. సిలికాన్వ్యాలీలోని బే ఏరియాకు చెందిన ఈ ముగ్గురు స్నేహితులు ఒక స్కూల్లో జరిగిన డిబేట్ సందర్భంగా మొదటిసారిగా కలుసుకున్నారు. బెల్లార్మైన్ కాలేజిలో చదువుకునే రోజుల్లో ప్రతిష్ఠాత్మకమైన థీల్ ఫెలోషిప్ అందుకున్నారు. ఆ తరువాత కాలేజికి గుడ్బై చెప్పారు.స్టార్టప్ ప్రారంభించారు..డాటా లేబులింగ్, ఏఐ మోడలింగ్ ట్రైనింగ్కు సంబంధించి తక్కువ టైమ్లోనే ఈ స్టార్టప్ మంచి పేరు తెచ్చుకుంది. డాక్టర్లు, లాయర్లు, కన్సల్టెంట్స్, బ్యాంకర్ల రూపంలో కంపెనీలో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ వార్షిక రికరింగ్ రెవెన్యూ(ఏఆర్ఆర్) 500 మిలియన్ డాలర్లు.‘ఇది నిజమేనా అని ఇప్పటికీ అనిపిస్తుంది. ఈ స్టార్టప్ లేకపోతే కాలేజీలోనే చదువుతూ ఉండేవాడిని’ నవ్వుతూ అంటాడు ఆదర్శ్. కాలేజీ రోజుల్లో క్రమశిక్షణ, కొత్త విషయాలపై ఆసక్తితో ఉండేవాడు ఆదర్శ్. ఆ రెండూ తనకు స్టార్టప్ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. పని బాగా నచ్చితే పనిలాగా అనిపించదు. ఆదర్శ్ విషయంలోనూ ఇదే జరిగింది. కంపెనీ ప్రారంభించిన తరువాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు కూడా పని గురించే ఆలోచిస్తుంటాడు!‘మెర్కోర్’ స్టార్టప్ సూపర్ సక్సెస్కు కారణం ఏమిటి?ఆదర్శ్ మాటల్లో చె΄్పాలంటే.. ‘ఏఐ ల్యాబ్లు, కస్టమర్లు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న సమయం అది. ఆ సమయంలోనే మేము మెర్కోర్తో ఏఐ ప్రపంచంలోకి అడుగుపెట్టాం. కొద్ది కాలంలోనే వారు ఎదురుచూస్తున్న ప్రత్యామ్నాయం మేము కావడం సంతోషంగా ఉంది’ అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ ఆదర్శ్కు మన దేశంతో బలమైన భావోద్వేగ బంధం ఉంది. అతడి తల్లిదండ్రులు కర్నాటకకు చెందిన వారు..‘ఇండియాలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు’ అంటాడు ఆదర్శ్. సైజబుల్ ఆపరేషన్స్, ప్రొడక్ట్స్, ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ టీమ్తో గ్లోబల్ ఏఐ టాలెంట్లో తనదైన పేరు తెచ్చుకుంది మెర్కోర్. ‘ఏఐ రెవల్యూషన్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి’ అనే విమర్శతో ఆదర్శ్ ఏకీభవించడు. ‘ఏఐ ద్వారా సరికొత్త లేబర్ మార్కెట్ ఏర్పడుతుంది. ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏఐతో ఎలాంటి భయం అవసరం లేదు. ప్రతి సాంకేతిక విప్లవం మనిషి జీవితాన్ని మెరుగుపరిచింది’ అంటాడు ఆదర్శ్.నెక్స్ట్ ఏమిటి!కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నా చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఆసక్తి నాకు స్టార్టప్ ప్రయాణంలో ఉపయోగపడింది. ఇప్పుడు అసలు సిసలు సవాలు ఏమిటంటే నెక్ట్స్ ఏమిటి? అనేది. ప్రజలు ఇప్పుడు దీని గురించే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అందుకే మా ప్రాధాన్యత జాబితాలో....‘నెక్ట్స్ ఏమిటీ?’ అనేది కూడా ఉంటుంది.– ఆదర్శ్ (చదవండి: ఇండిగో...ఇదిగో! నో డిలేస్, నో డైవర్షన్స్...) -
పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ‘ఏఐ’
న్యూయార్క్: ఏఐ. కృత్రిమ మేధ. కొన్నేళ్లుగా ప్రపంచాన్నే ఏలుతున్న సరికొత్త సాంకేతిక విప్లవం. దాని రూపకల్పనలో శ్రమించిన వారందరికీ సమష్టిగా ప్రఖ్యాత టైమ్ మేగజైన్ 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్ గౌరవం దక్కింది. గురువారం ఒక ప్రకటనలో మేగజైన్ ఈ మేరకు వెల్లడించింది. కృత్రిమ మేధ ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేని రీతిలో సింహగర్జన చేసిన ఏడాదిగా 2025ను అభివర్ణించింది. ‘సొంతంగా ఆలోచించే యంత్రాలు మొదలుకుని ఒకప్పుడు అసాధ్యమని భావించిన వాటన్నింటినీ సుసాధ్యం చేస్తున్న సాంకేతిక అద్భుతం ఏఐ. దాన్ని స్వప్నించి, శ్రమించి చివరికి సాధించిన వ్యక్తులందరూ 2025కు గాను పర్సన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి అర్హులే‘ అని పేర్కొంది. ’వ్యక్తులు మాత్రమే కాదు, సంస్థలు, కాన్సెప్టులను కూడా ఈ పురస్కారానికి ఎంపిక చేశాం’ అని టైమ్ మేగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ సామ్ జాకబ్స్ వివరించారు. -
హీరోయిన్లకు తలనొప్పిగా మారిన ఏఐ
సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇందులో నిలదొక్కుకునేందుకు తారలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అందరూ అనుకున్న స్థాయికి చేరుకోలేరు. అదృష్టం తోడైనవారే తమ కలలను సాకారం చేసుకుంటారు. భాషాభేదం లేకుండా తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అందుకు తగిన గుర్తింపు వస్తే ఆనందిస్తారు. అయితే ఇప్పుడు ప్రముఖ స్టార్స్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) అనే ఆధునిక టెక్నాలజీ.ఏఐ దుర్వినియోగంసాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఓపక్క ప్రయోజనాలు చేకూరుతుంటే మరికొందరు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫోటోలను ఇష్టారీతిన ఎడిట్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి అశ్లీల ఫోటోలు చిత్రీకరిస్తున్నారు. ఇలా తప్పుగా చిత్రీకరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రష్మిక మందన్నా, కీర్తి సురేశ్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తమన్నా ఫోటోలను ఏఐ టెక్నాలజీతో బికినీ దుస్తుల్లో చిత్రీకరించి వైరల్ చేశారు. ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే హీరోయిన్లకు తలనొప్పి తప్పేలా లేదు! -
హైదరాబాద్లో లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ల విస్తరణ
గ్లోబల్ స్కిల్లింగ్ అండ్ లెర్నింగ్ విభాగంలో సర్వీసులు అందిస్తున్న అప్గ్రాడ్ (upGrad) హైదరాబాద్లో రెండు కొత్త లెర్నింగ్ సపోర్ట్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. దీని ద్వారా ‘ఫిజిటల్’(ఫిజికల్ + డిజిటల్) లెర్నింగ్ నెట్వర్క్ను విస్తరించనున్నట్లు పేర్కొంది. ఈ విస్తరణ పెరుగుతున్న టెక్నాలజీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లలో నైపుణ్యాల డిమాండ్ను తీర్చేందుకు ఉపయోగపడుతందని కంపెనీ తెలిపింది.అప్గ్రాడ్ ఇప్పటికే పుణె, కోల్కతా, ఇండోర్, భోపాల్, బెంగళూరు వంటి నగరాల్లో 11 ఆపరేషనల్ కేంద్రాలను స్థాపించినట్లు చెప్పింది. హైదరాబాద్ ఇప్పుడు ఈ నెట్వర్క్లో కీలక ప్రాంతమని పేర్కొంది. కంపెనీ తన విస్తరణ రోడ్మ్యాప్లో భాగంగా మార్చి 2026 నాటికి ఈ నెట్వర్క్ను 40 కేంద్రాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. మెట్రో నగరాలతో పాటు టైర్-2 నగరాల్లో అత్యుత్తమ హైబ్రిడ్ లెర్నింగ్ను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది.ఏఐ, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీస్, డేటా సైన్స్లో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్తో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పింది. ఈ నేపథ్యంలో అప్గ్రాడ్ కొత్త కేంద్రాలు నగరంలోని గ్రాడ్యుయేట్లకు నైపుణ్యాలను అందించాలని నిర్ణయించింది. కంపెసీ సీఓఓ మనీష్ కల్రా మాట్లాడుతూ ‘ఏటా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు శ్రామిక శక్తిలోకి ప్రవేశించినప్పటికీ యాజమాన్యాలు ఆశించే నైపుణ్యాలకు, సాంప్రదాయ సంస్థలు అందించే వాటికి మధ్య అంతరం విస్తృతంగా ఉంది. దాన్ని పూడ్చేందుకు మా కేంద్రాలు ఎంతో తోడ్పడుతాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ -
అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్తో పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో అల్ఫాబెట్ (గూగుల్) ముందుకు వచ్చింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతరిక్షంలో సోలార్ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గూగుల్ దీనికి ‘ప్రాజెక్ట్ సన్క్యాచర్’(Project Suncatcher)గా పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు గురించి పిచాయ్ మాట్లాడుతూ ‘గూగుల్లో మూన్ షాట్లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణం. ఏదో ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేదే మా ప్రస్తుత మూన్ షాట్’ అని తెలిపారు. సూర్యుడి నుంచి లభించే అపార శక్తిని (భూమిపై కంటే అంతరిక్షంలో అధిక ఎనర్జీ ఉంటుంది) ఉపయోగించి స్పేస్లో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటులోని సమస్యలను పరిష్కరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.2027లో తొలి పరీక్షలుఈ అంతరిక్ష డేటా సెంటర్ల ప్రయాణంలో గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘మేము 2027లో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మొదటి అడుగు వేస్తాం. చిన్న యంత్రాల ర్యాక్లను శాటిలైట్ల్లో పంపి పరీక్షిస్తాం. ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తాం’ అని పిచాయ్ ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్ ప్లాట్ఫాంమ్లో వైరల్ అయింది. దాంతో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దృష్టిని ఇది ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూపై మస్క్ కేవలం ‘ఆసక్తికరమైనది (Interesting)’ అనే ఒక్క పదంతో స్పందించారు.Interesting https://t.co/yuTy9Yr3xw— Elon Musk (@elonmusk) December 8, 2025ఇదీ చదవండి: విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది? -
AI ఎఫెక్ట్ తో కోర్టులను ఆశ్రయిస్తున్న సినీ తారలు
-
ఇంటి కిచెన్లోకీ వచ్చేసిన ఏఐ..
పిల్లలు లొట్టలేసుకొని తినే వంటకాలను రెడీ చేస్తుంది.. అత్తామామలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని వడ్డిస్తుంది.. శ్రీవారిని పసందైన వంటలతో కట్టిపడేస్తుంది.. ..స్మార్ట్ ఇల్లాలి రహస్యం కాదండీ ఇదీ. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్–ఏఐ) వంటగది మహత్యం. అవును.. స్మార్ట్ కస్టమర్ల అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా కిచెన్స్ కూడా ఏఐ అవతారమెత్తాయి. హైదరాబాద్తో పాటు ఇతర మెట్రో నగరాల్లో అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీలలో డెవలపర్లు ఈ స్మార్ట్ వంటగదులనే అందిస్తున్నారు. మెట్రో నగరాలలో ఏఐ కిచెన్స్ ట్రెండ్ నడుస్తోంది. వంట గది అమ్మకు మాత్రమే కాదు.. ఇంటిల్లిపాదికీ అవసరమైన, ఆరోగ్యకరమైన ప్రాంతంగా మారిపోయింది. వినియోగదారుల ఆరోగ్య డేటా, వెల్నెస్ లక్ష్యాలను క్రోడీకరించి ఆహార పరిమితులను విశ్లేషించి భోజన ప్రణాళికలను రూపొందించడమే ఈ ఏఐ కిచెన్స్ ప్రత్యేకత. వినియోగదారుల ప్రవర్తన, అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా పోషకాహారాలు, వంటకాలను కూడా సూచిస్తుంది.వంటలో సహాయం.. కృత్రిమ మేధ సాంకేతికతతో కూరగాయల్ని కోయడం, వాటిని వంట పాత్రలో వేయడం, గరిటె తిప్పడం, మంట, వేడి ఉష్ణోగ్రతలను నియంత్రించడం వంటి పనులను ఏఐ ఉపకరణాలు చేస్తాయి. రిఫ్రిజిరేటర్లో ఆహార పదార్థాల గడువు తేదీలను గుర్తించి, ముందుగానే హెచ్చరించడం, వ్యర్థాలను తగ్గించడం, సమయాన్ని ఆదా చేస్తుంది కూడా.. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య సముదాయాలలో ప్రొఫెషనల్ కిచెన్లో హెడ్ చెఫ్కు రోజువారీ కార్యకలాపాలలో సహాయం చేసే ‘సౌస్ చెఫ్’ సిబ్బంది మాదిరిగా.. ఏఐ కూడా వంట గదిలో మనకు సహాయపడుతుంది. ప్రోగ్రామ్ చేసిన వంటకాలు లేదా వినియోగదారుల ఇన్పుట్ ఆధారంగా కూరగాయలు కత్తిరించడం, వేయించడం, తిప్పడం, ముద్దగా పిసుకుతూ కలపడం వంటి పనులు చేస్తాయి. అలాగే కొందరు కుటుంబ వంటకాలను అనుకరిస్తుంది కూడా.ఆహార వ్యర్థాల తగ్గుదల.. స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు: ఏఐ ఆధారిత రిఫ్రిజిరేటర్లు అందులోని ఆహార పదార్థాల గడువు తేదీలను ట్రాక్ చేస్తుంది. అందుబాటులో ఉన్న పదార్థాల ఆధారంగా వంటకాలను సూచిస్తుంది. ఆహార వ్యర్థాలు, శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. ఏఐ ఆధారిత ఓవెన్లు, ఇండక్షన్ కుక్టాప్లలో ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేయడానికి సెన్సార్లు ఉంటాయి. దీంతో వంటకాలు మాడిపోకుండా, తక్కువ ఉడకకుండా ఉంటుంది. సవాళ్లున్నాయ్.. ఏఐ కిచెన్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ.. ఈ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. స్మార్ట్ ఉపకరణాల ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు వినియోగదారుల డేటా గోప్యత, భద్రతలపై ఆందోళనలు ఉన్నాయి. కంపెనీలు బలమైన భద్రతా ప్రోటోకాల్స్ను రూపొందించడంతో పాటు వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు డేటా నిర్వహణ పారదర్శకంగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో ఏఐ ఉపకరణాలు.. వంట గదిలో ఆటోమేటెడ్ కుకింగ్ అసిస్టెంట్లు, స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు, ఎయిర్ ఫ్రైయర్లు వంటి వంట ఉపకరణాల ఏఐతో పనిచేస్తాయి. ఇవి అలెక్సా, సిరి, గూగుల్ హోమ్ వంటి వాయిస్ అసిస్టెంట్లతో అనుసంధానమై ఉంటాయి. సమయం, లైటింగ్లను సర్దుబాటు చేస్తూ శ్రావ్యమైన సంగీతాన్ని వినిపిస్తూ వంట గది వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది. శామ్సంగ్, ఎల్జీ, జీఈ వంటి కంపెనీలకు చెందిన వాయిస్ బేస్డ్, విజువల్ గైడ్లు ఏఐ కిచెన్ ఉపకరణాలను విస్తృత శ్రేణి వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి. -
ఏఐ చాట్బాట్తో జర జాగ్రత్తోయ్..!
సాంకేతిక అందుబాటులోకి రావడంతో నగరంలో చాట్బాట్ వినియోగం భారీగా పెరుగుతోంది.. ఐటీ, రీసెర్చ్ స్కాలర్స్, జెన్ జీ యువత ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో.. ఏదో ఒక అవసరానికి ఏఐని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి వివిధ రకాల సాధనాలు అందుబాటులకి రావడంతో సమాచారం కోసం కొందరు.. టైంపాస్ కోసం మరి కొందరు వీటిని భారీ స్థాయిలో వినియోగిస్తున్నారు. అయితే ప్రాంప్టింగ్ సరిగా లేకపోతే.. తిప్పలు తప్పవని, సరైన సమాచారం రాబట్టాలంటే.. సరైన ఇన్పుట్ కూడా అవసరమని, ఒకవేళ ప్రాంప్టింగ్ ద్వారా సమాధానం పొందినా.. దీనికి ఫ్యాక్ట్ చెక్ కూడా అవసరం అని చెబుతున్నారు టెక్ నిపుణులు.. దీనిని గుర్తెరిగి సరైన రీతిలో వినియోగించాలని సూచిస్తున్నారు. కాగా నగర జీవనశైలిపై ఈ చాట్బాట్ వినియోగం ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. ప్రతి చిన్నవిషయానికీ వీటిపై ఆధారపడుతున్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. సాంస్కృతిక నగరి హైదరాబాద్లో సాంకేతిక వినియోగం పెరుగుతోంది. ఓ వైపు రాయదుర్గ్–ఫైనాన్షియల్–డ్రిస్టిక్ట్లోని ఐటీ కార్యాలయాల్లోని ఉద్యోగులు.. రీసెర్చ్ చేయడానికి నగరానికి వచ్చే విద్యార్థులు, ప్రముఖులు, పనుల్ని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఏఐ చాట్ ప్లాట్ఫామ్పై ఆధారపడుతున్నారు. గ్లోబల్ స్థాయిలో కొన్ని పెద్ద కన్సూ్యమర్–ఫ్రెండ్లీ చాట్ బోట్స్ (చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, క్లౌడ్, పర్ప్లెక్సిటీ)తో పాటు ఉత్సాహభరితమైన స్థానిక–ఇండియన్ సంస్థలతో పాటు ఎన్నో సొల్యూషన్స్ మెరుగైన ఇంటిగ్రేషన్లు అందుబాటులోకి తేవడంతో ఈ తరహా ఎకోసిస్టమ్ వేగంగా పెరుగుతోంది. ఇండియన్ చాట్బాట్ బూమ్.. ప్రధానంగా నగరంలో వినియోగించే వేదికలు రెండో తరానికి చెందినవి. ప్రపంచ స్థాయి జనరల్–పర్పస్ చాట్ ఏజెంట్లు (చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, క్లౌడ్, పర్ప్లెక్సిటీ, బింగ్ కాపీలాట్ మొదలైనవి) కాగా.. స్థానిక/ఎంటర్ప్రైజ్ ఆధారిత కన్వర్జేషనల్ ఏఐ ప్లాట్ఫామ్స్ (హాప్టిక్, యెల్లో.ఏఐ, యూనిపోర్) వంటివి.. అలాగే చిన్న స్టార్టప్స్, బాట్స్, వెర్బల్ ఇన్ఫో–సర్వీసులు హైదరాబాద్ వ్యాపారాల్లో కనిపిస్తుంటాయి. ఇటీవల ఇండియన్ మార్కెట్లోనే వందలకొద్దీ ప్లేయర్లు, బిజినెస్–సొల్యూషన్లు అందుబాటులో ఉన్నట్లు అంచనాలు. ఇది భారతీయ చాట్బాట్కి బూమ్ అని పిలుస్తున్నారు. లైఫ్ స్టైల్లో సౌలభ్యాలు.. దీనికి సంబంధించి నగర సౌలభ్యాల్లో భాగంగా పనితీరు పెరుగుతుంది. కోడింగ్–హెల్ప్, డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్, ఈ మెయిల్ టెంప్లెట్లు, ఐడియాస్.. అధికారికంగా ఇతరుల సహాయం పొందాల్సిన పనులు, ఇండిపెండెంట్గా వేగంగా చేయొచ్చు. విద్యార్థులు, పరిశోధకుల కోసం 24/7 తక్షణ సమాధానాలు, ట్యుటోరింగ్, అల్గారిథమ్ వివరణలు, పాఠ్యాంశాల ఇతివృత్తాలు సమగ్రంగా అందిస్తుంది.. స్థానిక భాషలకు మద్దతు ఇచ్చేలా కొన్ని ఇండియన్ వేదికలు తెలుగు/హిందీ/తమిళ్/కన్నడ వంటి స్థానిక భాషలను అందజేస్తున్నాయి. షార్ట్–ఫార్మాట్ కస్టమర్–సపోర్ట్ కోసం ఉత్తమమైన మార్గం. నష్టాలు, కొత్త సవాళ్లు.. నగర స్థాయిలో వినియోగం పెరగడంతో మిస్–ఇన్ఫర్మేషన్, ప్రైవసీ సమస్యలు, స్కామ్స్, ఉద్యోగ మార్పులు వంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయని ఇటీవల బహుళ–ఆధారాల పరిశోధనలు చెబుతున్నట్లు తెలుస్తోంది. చాట్మోడల్స్ ప్రజానీక అభిప్రాయాలపై ప్రభావం చూపగలవు కానీ, వాస్తవికత (అక్యూరసీ)లో పొరపాట్లు ఉండవచ్చు. దీంతో నగరంలోని డిజిటల్–సోఫిస్టికేషన్లో కొన్ని వర్గాలు జాగ్రత్తగా ఉండాలి. మరొక ప్రధాన సమస్య..ఆటోమెషన్. దీని కారణంగా రిటైల్, కాల్–సెంటర్, మొదలైన జాబ్స్లో మార్పులు, ఫ్రోజన్లు (డీప్ ఫెక్), వాయిస్ స్కామ్లు వంటివి సరిగా గుర్తించలేకపోవడం వంటి ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.ప్రాంప్టింగ్ ఎందుకు ముఖ్యం? ప్రాంప్ట్ అనగా మన ప్రశ్నకు–రూపం. కాంటెక్ట్స్ ఇవ్వడంలో మెళకువులు తెలిసి ఉండాలి.. ఇది ఏఐతో అనుసంధానం చేసేటప్పుడు ‘కేమికల్ మిక్స్’ లాగా పనిచేస్తుంది. సరైన ప్రాంప్ట్ ఉంటేనే సమాచారం షార్ప్, యాప్ట్గా వస్తుంది. అదే సమయంలో సరైన మార్గదర్శకాలు లేకపోతే పొరపాట్లు దొర్లే ప్రమాదం కూడా ఉంది. దీంతో పాటు తప్పుడు కంటెంట్ వచ్చే అవకాశాలే ఎక్కువని గుర్తించాలి. వీటిని గమనంలో ఉంచుకోవాలి.. హైదరాబాద్ తరహా నగరాల్లో ఈ ఏఐ చాట్ వేదికలు మన దైనందిన జీవనశైలిని, పని సదుపాయాలను, విద్యా సాధనాల్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. సరైన జ్ఞానం, నైతికత, ఫ్యాక్ట్–చెకింగ్తోనే ఈ టెక్ సదుపాయాన్ని సమర్థవంతంగా మార్చుకోగలం. ఇందులో భాగంగా పనిలో ఎటువంటి ఏఐ టూల్ ఉపయోగించిందో గమనించాలి. ప్రైవసీ సెట్టింగ్స్, డేటా షేరింగ్ స్క్రీన్లు చూస్తూ ఉండాలి. ప్రధాన సమాచారానికి రెండు వేర్వేరు సోర్సుల నుంచి నిర్ధారణ చేసుకోవాలి. ప్రాంప్ట్–స్కిల్స్ వల్ల సరైన మార్కెట్ లాభాలు పొందగలం. ‘తెలుగులో స్కోర్–పాస్స్ కోసం 250 పదాల్లో వ్యాసం’ లాంటిది. ఫార్మాట్ గుర్తించడంలో భాగంగా బుల్లెట్ పాయింట్స్, సమ్మరీ, కోడ్ శాంపిల్స్ వినియోగించడం అవసరం. ఇది ఏ స్లాట్స్పై ఆధారపడింది అనే వాలిడేషన్ అడగడం మంచి అలవాటు. సున్నితమైన నిర్ణయాలు (న్యాయ, వైద్య) కోసం నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ప్లేట్లు కడిగే స్థాయి నుంచి రూ 50 కోట్ల వ్యాపారం నిర్మించే రేంజ్కు..!) -
'మేధే' మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ ఎక్స్లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీయులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నాయన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవుతుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.డిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్కాస్ట్లు, వీడియో గేమ్లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!వితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. - ఎడిటోరియల్ టీమ్ -
ఓపెన్ఏఐని మించిపోనున్న గూగుల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 'గాడ్ఫాదర్'గా ప్రసిద్ధి చెందిన, టొరంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఏఐ రేసులో గూగుల్ కంపెనీ త్వరలో ఓపెన్ఏఐని మించిపోతుందని అంచనా వేశారు. గూగుల్ తన ఏఐ సాంకేతికతను తెలివిగా స్కేలింగ్ చేస్తూ ముందంజ వేయనుందని స్పష్టం చేశారు.బిజినెస్ ఇన్సైడర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హింటన్ మాట్లాడుతూ, ‘గూగుల్ ఓపెన్ఏఐని అధిగమించడానికి ఇంత సమయం పట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. త్వరలో గూగుల్ ఓపెన్ఏఐని మించిపోతుంది’ అని అన్నారు. మెషిన్ లెర్నింగ్లో తన ప్రయోగాలకు 2024లో నోబెల్ ఫిజిక్స్ బహుమతిని అందుకున్న హింటన్ గూగుల్లో పనిచేసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఏఐ రంగంలో గూగుల్ మొట్టమొదటగా ముందంజలో ఉందని, అయితే తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ‘గూగుల్ ఇతరుల కంటే ముందు చాట్బాట్లను తయారు చేసింది’ అని హింటన్ అన్నారు.జెమిని 3, నానో బనానా ప్రోఈ మార్పుకు ప్రధాన ఆధారాలు గూగుల్ తాజా మోడళ్లు జెమిని 3, నానో బనానా ప్రో అని చెప్పారు. ఈ మోడళ్ల ప్రారంభం తర్వాత గూగుల్ ఏఐ రేసులో ముందుందని టెక్ రంగంలో విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ మోడళ్ల అధునాతన సామర్థ్యాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, జెమిని 3 మోడల్ ఓపెన్ఏఐ జీపీటీ-5తో పోలిస్తే అద్భుతమైన పనితీరు సంఖ్యలను ప్రదర్శిస్తోందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం -
సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి ‘గాడ్ఫాదర్’గా పిలుచుకునే ఏఐ సైంటిస్ట్ జెఫ్రీ హింటన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఏఐ వేగవంతమైన పురోగతి కారణంగా లక్షల్లో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇది సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్తో కలిసి జార్జ్టౌన్ యూనివర్శిటీలో జరిగిన చర్చలో హింటన్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘ఏఐ వల్ల భారీ నిరుద్యోగం రాబోతోందన్న విషయం చాలా మందికి స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. టెక్ దిగ్గజాలు డేటా సెంటర్లు, చిప్స్పై ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయగల ఏఐ వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.2023లో గూగుల్ను వీడిన హింటన్ ఏఐ ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడుతూ.. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందన్న ఆశావాదాన్ని ఖండించారు. ‘కొత్త ఉద్యోగాలు వస్తాయి కానీ, దీని పరిణామాల వల్ల కోల్పోయే ఉద్యోగాల సంఖ్యను అవి ఎప్పటికీ భర్తీ చేయలేవు’ అని స్పష్టం చేశారు.టెక్ దిగ్గజాల అభిప్రాయాలుఏఐ ఉద్యోగాలపై చూసే ప్రభావం గురించి టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఇటీవల ‘ఏఐ సామూహిక తొలగింపులకు దారితీయదు, కానీ ఉద్యోగాల స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాట్లాడుతూ త్వరలోనే చాలా అంశాల్లో మానవుల అవసరం లేకుండా పోతుందన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘మరో 20 సంవత్సరాల్లో చాలా మందికి పని చేయవలసిన అవసరమే ఉండదు’ అని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి.. -
గుండెకు గుండె! వినూత్న పరికరం ఆవిష్కరణ
హైదరాబాద్: ఇటీవల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రతిఒక్కరు ముఖ్యంగా హృద్రోగ ముప్పు ఉన్నవారు తమ గుండె పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం అవసరం. ఇందు కోసమే ‘వికార్డియో’ అనే పరికరాన్ని ఆవిష్కరించింది మెడ్టెక్ సంస్థ వి టైటాన్ కార్పొరేషన్.ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ సింగిల్-లీడ్ వేరబుల్ కార్డియాక్ మానిటర్.. పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. దీంతో పూర్తిగా స్థానిక హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, క్లౌడ్-ఆధారిత ఏఐ అనలిటిక్స్తో ఇలాంటి పరికరం రూపొందించిన మొట్టమొదటి దేశీయ కంపెనీగా విటైటాన్ నిలిచింది. హృద్రోగ ముప్పులను ముందుగానే గుర్తించేందుకు గుండె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే స్మార్ వ్యవస్థగా వికార్డియో పరికరం రూపొందింది.పనిచేస్తుందిలా..వికార్డియో.. గుండెపై ఛాతీ భాగంలో అతికించుకునే తేలికపాటి, కాంపాక్ట్, కార్డియో మానిటర్. బ్లూటూత్ ద్వారా వికార్డియో మొబైల్ యాప్తో అనుసంధానమై పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు ఈసీజీలను మొబైల్ యాప్నకు పంపుతుంది. ఇందులో జోడించిన ఏఐ సామర్థ్యాలు 20 కంటే పైగా వైద్యపరంగా ముఖ్యమైన అరిథ్మియాలను (హృదయ పనితీరులో వ్యత్యాసాలు) రియల్ -టైమ్లో గుర్తించి వర్గీకరిస్తాయి. వాటికి సంబంధించిన స్నాప్ షాట్ లను పంపుతాయి. దీంతో సత్వరం చికిత్స అందించేందుకు వైద్యులకు కూడా సహాయకరంగా ఉంటుంది. -
ఏఐ టెక్నాలజీ: మీడియాపై పెను ప్రభావం!
కృత్రిమ మేథ (ఏఐ)లాంటి టెక్నాలజీలు మీడియా, వినోద రంగంపై (ఎంఅండ్ఈ) పెను ప్రభావం చూపుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార (ఐఅండ్బీ) శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్కాస్టింగ్ ప్రాజెక్టుపై ఐఐటీ కాన్పూర్లో పరిశోధనలు జరుగుతున్నాయని సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల టెక్నాలజీలో మరిన్ని మార్పులు రాబోతున్నాయని, వాటిలో సానుకూలాంశాలను ఉపయోగించుకోవాలని జాజు తెలిపారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. వందలో ఒక్క వంతు ఖర్చుతో పదిలో ఒక వంతు సమయంలో ఏదైనా పని పూర్తయితే, ఉత్పాదకత తప్పకుండా పెరుగుతుందని జాజు చెప్పారు.కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా 2030 నాటకి మీడియా, వినోద రంగం (ఎంఅండ్ఈ) భవిష్యత్ పరిస్థితుల గురించి రూపొందించిన సీఐఐ శ్వేతపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం, పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ పరిశ్రమ ఏటా 7 శాతం వృద్ధితో 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుందని జాజు చెప్పారు. ఆహారం, నీడ, దుస్తుల్లాగే వినోదమనేది నాగరికత మూల స్తంభాల్లో ఒకటని, ఆర్థిక వృద్ధితో పాటు సమాజ శ్రేయస్సుకు కూడా కీలకమని పేర్కొన్నారు. భారతదేశపు క్రియేటివ్ ఎకానమి ప్రస్తుతం 1 కోటి మందికి పైగా జవనోపాధి కల్పిస్తోందని, రూ. 3 లక్షల కోట్ల మేర స్థూల దేశీయోత్పత్తికి దోహదపడుతోందని ఆయన చెప్పారు.ఇంతటి కీలకమైన వినోద రంగాన్ని ఏఐ మార్చివేస్తున్న తరుణంలో కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోకపోతే అంతర్జాతీయంగా మన వాటా తగ్గిపోతుందన్నారు. వర్ధమాన ఆర్థిక శక్తిగా భారతదేశ గాథలను ప్రపంచానికి వినిపించాల్సిన, చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తన వంతు సహాయాన్ని పరిశ్రమకు అందిస్తుందని చెప్పారు. -
20 ఏళ్లలో డబ్బు కోసం నో వర్క్!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ(ఏఐ) భవిష్యత్తు గురించి సంచలన ప్రకటన చేశారు. ఏఐ, రోబోటిక్స్ కారణంగా రాబోయే 20 ఏళ్లలో మానవులకు డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెప్పారు. పని కేవలం ఒక ‘ఆప్షనల్ హాబీ’గా మాత్రమే మిగులుతుందని అంచనా వేశారు.ఏఐ వేగాన్ని సూపర్సోనిక్ సునామీతో పోల్చారు. దీన్ని మానవ చరిత్రలో అతి తీవ్రమైన సాంకేతిక మార్పుగా అభివర్ణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. ఏఐ మానవ నైపుణ్యాలను అనవసరం చేస్తుందన్న తన వాదనకు మద్దతుగా మస్క్ తన సొంత పిల్లల ఉదాహరణను ఇచ్చారు. ‘నా పిల్లలు టెక్నికల్గా నైపుణ్యం కలిగి ఉన్నారు. ఏఐ వచ్చే రెండు దశాబ్దాల్లో వారి నైపుణ్యాలను పూర్తిగా అనవసరం చేస్తుందని వారే ఒప్పుకుంటున్నారు’ అని మస్క్ చెప్పారు.అయినప్పటికీ వారు కాలేజీ ఎడ్యుకేషన్ను కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. దీనికి సామాజిక అవసరాలే కారణమన్నారు. తమ వయసు వారితో కలిసి ఉండటం, వివిధ రంగాలకు సంబంధించిన నాలెడ్జ్ను సంపాదించేందుకే అలా కాలేజీకి వెళ్తున్నారని చెప్పారు. కాబట్టి కళాశాలకు వెళ్తే వీలైనంత విస్తృతంగా అన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని తెలిపారు.ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే.. -
నాలుగేళ్లు కష్టపడి రూ.9 వేలు సంపాదన
ప్రియమైన వ్యక్తి కష్టపడి, కన్నీళ్లను దాటి విజయం సాధించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. అది కేవలం విజయం కాదు, ఏళ్లుగా పంచుకున్న కలలు, వెన్నుదన్నుగా నిలిచిన నమ్మకానికి దక్కిన ప్రతిఫలంగా నిలుస్తుంది. సరిగ్గా అలాంటి అపురూప క్షణమే ఢిల్లీకి చెందిన ఓపెన్సాక్స్.ఏఐ (Opensox.ai) వ్యవస్థాపకుడు అజిత్ జీవితంలో చోటుచేసుకుంది. ఆయన తమ్ముడు నాలుగేళ్ల శ్రమ తర్వాత యూట్యూబ్ నుంచి మొదటి సంపాదన అందుకున్నాడు. దీని వివరాలు అజిత్ సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది.అనుమానించినా నమ్మకం కోల్పోలేదుఅజిత్ తన తమ్ముడి విజయాన్ని ఆన్లైన్లో పంచుకున్నప్పుడు ఆ పోస్ట్ తక్షణమే వేలమంది దృష్టిని ఆకర్షించింది. ‘నా తమ్ముడు ఈ రోజు కోసం గత నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడు’ అని చెప్పాడు. తన చుట్టూ ఉన్నవారంతా తమ్ముడిని అనుమానించినా అజిత్ మాత్రం నిరంతరం అతనికి వెన్నుదన్నుగా నిలిచారు. ‘అతను తన కలలను పంచుకోవడానికి నేను మాత్రమే ఉన్నాను’ అని అజిత్ రాశారు. ‘ప్రతి ఒక్కరూ అతనిని చూసి నవ్వినప్పుడు తనకు అండగా నేను మాత్రమే ఉన్నాను’ అని తెలిపారు. యూట్యూబ్ ద్వారా తన తమ్ముడు నాలుగేళ్లు కష్టపడి రూ.9000 సంపాదించినట్లు ఉన్న స్క్రీన్షాట్ను పంచుకున్నారు. ఎంత డబ్బు అకౌంట్లో క్రెడిట్ అయిందనే విషయాన్ని పక్కనుంచితే ఈ పోస్ట్ భావోద్వేగ సంతృప్తిని కలిగించినట్లు చెప్పుకొచ్చారు.my younger brother has been working hard for the last 4 years to see this day.first income from youtube. ❤️still remember when everyone used to laugh at him and i was the only one he had to share things about his dreams.day is made. ❤️ pic.twitter.com/t4TYoiJGAk— Ajeet ( opensox.ai ) (@ajeetunc) December 1, 2025కష్టానికి దక్కిన ప్రతిఫలంతమ్ముడి విజయాన్ని ప్రకటించిన అజిత్ పోస్ట్పై నెటిజన్లు స్పందించారు. ఒక వినియోగదారు తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ ‘ఎవరైనా యూట్యూబ్ వీడియోలు చేస్తే ప్రజలు ఎలాంటి పాయింట్ లేకుండా విమర్శిస్తారు. కానీ చాలా కష్టపడి పనిచేసిన తర్వాత బహుమతి పొందడం చాలా తృప్తిని ఇస్తుంది’ అన్నారు. మరొక వినియోగదారు ‘గత కొన్ని సంవత్సరాలుగా అతను చేసిన కృషికి ఇది ప్రతిఫలం. అతనికి ఆల్ ది బెస్ట్’ అంటూ అభినందనలు తెలిపారు.ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే.. -
'అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి'.. రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్..!
టెక్నాలజీ వచ్చాక ప్రతి పని మరింత సులభతరమైపోయింది. ఇప్పుడు మనం పూర్తిస్థాయి డిజిటల్ ఇండియాగా మారిపోయాం. దీంతో సాంకేతికత పెరిగే కొద్ది సవాళ్లు కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా సమస్యలు కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాలపై ప్రభావం మాత్రమే కాదు.. వ్యక్తిగత గోప్యతకు కూడా సవాల్గా మారింది.సినీతారలు ఫోటోలను ఇష్టమొచ్చినట్లుగా ఏఐతో ఏడిట్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వీటిలో మంచికంటే ఎక్కువగా అసభ్యకరమైన కంటెంట్ ఉంటోంది. వీటి బారిన ఇప్పటికే పలువురు అగ్ర సినీతారలు పడ్డారు. ఏఐని మంచి పనుల కోసం ఉపయోగించాలి కానీ.. ఎక్కువ శాతం దుర్వినియోగం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. అలా చాలామంది సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.ఇలా దుర్వినియోగానికి ఏఐని వాడుకోవడంపై రష్మిక మందన్నా రియాక్ట్ అయింది. ఏఐ అనే మన అభివృద్ధికి కోసమని.. అంతేకానీ అసభ్యతను సృష్టించడానికి కాదని ట్వీట్ చేసింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్న కొంతమందికి నైతికత లేదని మండిపడింది. మనం నిజాన్ని సృష్టించినప్పుడు.. వివేచన అనేది గొప్ప రక్షణగా మారుతుందని పోస్ట్లో రాసుకొచ్చింది.రష్మిక తన ట్వీట్లో రాస్తూ..' ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి.. ఇంటర్నెట్ అనేది నిజానికి అద్దం లాంటిది కాదు.. అది ఏదైనా సృష్టించగలిగే ఓ కాన్వాస్. ఇకపై ఏఐ టెక్నాలజీని దుర్వినియోగానికి కాకుండా.. గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతగా వ్యవహరిద్దాం.. ప్రజలు మనుషుల్లా వ్యవహరించకపోతే.. అలాంటి వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి' అంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో కొందరు నెటిజన్స్ రష్మికకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. “When truth can be manufactured, discernment becomes our greatest defence.”AI is a force for progress, but its misuse to create vulgarity and target women signals a deep moral decline in certain people.Remember, the internet is no longer a mirror of truth. It is a canvas where…— Rashmika Mandanna (@iamRashmika) December 3, 2025 -
యాపిల్ కొత్త వైస్ ప్రెసిడెంట్: ఎవరీ అమర్ సుబ్రమణ్య?
యాపిల్ కంపెనీ సీఈఓగా టిమ్ కుక్ వైదొలగనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో, సంస్థ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కొత్త వైస్ ప్రెసిడెంట్గా 'అమర్ సుబ్రమణ్య' నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్గా ఉన్న జాన్ జియానాండ్రియా స్థానంలో అమర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన (జాన్ జియానాండ్రియా) పదవీ విరమణ చేసేవరకు సలహాదారుగా కొనసాగుతారు.ఏఐ రేసులో.. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ కొంత వెనుకబడి ఉంది. ప్రత్యర్థులకు ధీటుగా ఎదగాలంటే.. తప్పకుండా ఏఐపై ద్రుష్టి పెట్టాలి. కాబట్టి సంస్థ.. వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలను అమర్ సుబ్రమణ్యకు అప్పగించింది. కాగా ఈయన యాపిల్ ఫౌండేషన్ మోడల్స్, ఎంఎల్ రీసర్చ్, ఏఐ సేఫ్ట్ అండ్ ఎవాల్యువేషన్ వంటి విభాగాలకు కూడా సారథ్యం వహించనున్నారు.ఎవరీ అమర్ సుబ్రమణ్య?ఏఐ రంగంలో గొప్ప అనుభవం ఉన్న.. అమర్ సుబ్రమణ్య, 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత IBMలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు. 2005లో వాషింగ్టన్ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. కొన్ని నెలలు మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ పనిచేశారు.పీహెచ్డీ పూర్తయిన తరువాత.. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గూగుల్లో స్టాఫ్ రీసెర్చ్ సైంటిస్ట్గా చేరాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత, అతను ప్రిన్సిపల్ ఇంజనీర్గా, తరువాత 2019లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందాడు. కొంతకాలం తరువాత ఏఐ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా మైక్రోసాఫ్ట్కు మారాడు. గూగుల్లో 16 సంవత్సరాల పని చేసిన తరువాత.. సుబ్రమణ్య ఇప్పుడు ఆపిల్లో సీపీవీగా చేరారు. -
వైబ్ కోడింగ్.. ‘ఏఐకి అంత సీన్ లేదు’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ‘వైబ్ కోడింగ్’పై టెక్ దిగ్గజాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేచురల్ లాంగ్వేజీలో ఆదేశాలు ఇస్తూ ఏఐ ద్వారా కోడ్ను రాయించుకునే ఈ విధానంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుకూలంగా స్పందిస్తుంటే, టెక్ టైకూన్ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు అంతగా దీన్ని సపోర్ట్ చేయడం లేదు. అందుకు వారు చెబుతున్న కారణాలు విభిన్నంగా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?వైబ్ కోడింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (Software Development)లో కొత్తగా వాడుకలోకి వచ్చిన ఒక విధానం. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వ్యక్తులు కూడా తమ ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధారణ, రోజువారీ భాషలో(Natural Language Prompts) ఏఐ ఆధారిత టూల్స్కు (ఉదాహరణకు, Google's AI Studio, OpenAI Codex) కమాండ్ ఇస్తారు. ఏఐ ఆ ఆదేశాలను అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఫంక్షనల్ కోడ్ను జనరేట్ చేస్తుంది. కోడింగ్ పరిజ్ఞానం లేనివారు కూడా యాప్లు, వెబ్సైట్లు లేదా ప్రోటోటైప్లను సులభంగా తయారు చేయవచ్చు.సుందర్ పిచాయ్..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వైబ్ కోడింగ్ను సానుకూలంగా చూస్తున్నారు. టెక్నికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులు కూడా తమ ఆలోచనలను ప్రోటోటైప్లుగా మార్చవచ్చని చెబుతున్నారు. గతంలో ప్రాజెక్ట్లకు సంబంధించిన ఆలోచన గురించి మాటల్లో వివరించేవారు. ఇప్పుడు, వైబ్ కోడింగ్ ద్వారా ఆ ఆలోచనకు కోడెడ్ వెర్షన్ లేదా ప్రోటోటైప్ను జనరేట్ చేసే వీలుందన్నారు.శ్రీధర్ వెంబు..జోహో సీఈఓ శ్రీధర్ వెంబు వైబ్ కోడింగ్ పట్ల అంతగా సానుకూలంగా లేరు. ఏఐ జనరేట్ చేసే కోడ్ మనకు అద్భుతంగా అనిపించినప్పటికీ, కంప్యూటర్ ఎలా పనిచేస్తుందనే క్లిష్టమైన, లోతైన అవగాహన అవసరమన్నారు. ఏఐ సాధారణంగా రీయూజబుల్ కోడ్ను రాయడంలో సహాయపడుతుందన్నారు. కానీ, కోర్ లాజిక్, కొత్త సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలు ఏఐకి ఉండవని చెప్పారు. ఇవి మానవ సృజనాత్మకత, అనుభవంపై ఆధారపడి ఉంటాయని వెంబు నమ్ముతున్నారు. కోడింగ్ అనేది ఓ మ్యాజిక్ అన్నారు. వైరుధ్యంలో ఏకాభిప్రాయంఈ రెండు దృక్పథాల మధ్య పిచాయ్ కూడా ఓ పోడ్కాస్ట్లో వైబ్ కోడింగ్ పరిమితులను అంగీకరించారు. కొన్ని రకాల లార్జ్, సెక్యూరిటీ సిస్టమ్స్కు వైబ్ కోడింగ్ సరిపోదన్నారు. అందుకు అనుభవం కలిగిన ఇంజినీర్లు అవసరమని చెప్పారు. -
ఏఐ స్మార్ట్ గ్లాసెస్: ఉపయోగాలెన్నో..
ఓక్లీ మెటా గ్లాసెస్ గురించి చాలామంది వినే ఉంటారు. జూన్లో ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ గ్లాసెస్ ఇప్పుడు భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ను.. స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ పరికరాల తయారీదారు ఓక్లీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది కేవలం గ్లాసెస్ మాత్రమే కాదు.. ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు రికార్డ్ చేయవచ్చు. అంతే కాకుండా వాయిస్ అసిస్టెంట్ ద్వారా.. చాలా పనులను సులభంగా చేసుకోవచ్చు కూడా.భారతదేశంలో ఓక్లీ మెటా HSTN గ్లాసెస్.. క్లియర్ & ప్రిజం అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ప్రారంభ ధరలు రూ. 41,800. అయితే ఎందుకుని లెన్స్ ఆధారంగా ధరలు మారుతాయి. కాబట్టి ప్రిజం పోలరైజ్డ్ వేరియంట్ ధర రూ. 44,200 కాగా, ప్రిజం ట్రాన్సిషన్ లెన్స్లతో కూడిన ఓక్లీ మెటా HSTN ధర రూ. 47,600.ఓక్లీ మెటా స్మార్ట్ గ్లాసెస్ ఈరోజు (డిసెంబర్ 1) నుంచి సన్గ్లాస్ హట్.. దేశంలోని ప్రముఖ ఆప్టికల్ & ఐవేర్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.ఓక్లీ మెటా గ్లాసెస్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 100-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో సెకనుకు 30 ఫ్రేమ్ల వద్ద 3K వీడియో రిజల్యూషన్లో పాయింట్-ఆఫ్-వ్యూ వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్, స్లో మోషన్ & హైపర్లాప్స్ వీడియో రికార్డింగ్ మోడ్లకు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు 3024 x 4032 పిక్సెల్స్ రిజల్యూషన్లో కూడా ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ 32GB ఆన్బోర్డ్ స్టోరేజితో వస్తుందని సంస్థ వెల్లడించింది. మొత్తం మీద ఇచ్చి చాలా విధాలుగా పనికొస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
పల్లె పోరులో ఏఐ.. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు గాలం
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పంచాయతీ ఎన్నికల్లోనూ హల్చల్ చేస్తోంది. పల్లె పోరులో తలపడుతున్న అ భ్యర్థులు ఈ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రచార పర్వంలో సరికొత్త పంథా తో దూసుకెళుతున్నారు. ఓటరు నాడి పట్టే వీడియోలు.. ప్రత్యర్థిపై విరుచుకుపడే సెటై ర్లు.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మీమ్స్.. పల్లె జనం మనసును హత్తుకునే అభివాద సందేశాలు.. ఓటర్ల సెల్ ఫోన్లలో చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్.. అన్ని సామాజిక మాధ్యమాలను ఏఐ జనరేటెడ్ వీడియోలతో మోత మోగిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ కృత్రిమ మేధ ఆధారంగా సృష్టించిన వీడియోల్లో ఉంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: టింగ్ మంటూ వాట్సాప్ గంట మోగిందంటే చాలు అది ఓటు గురించి అభ్యర్థి అభ్యర్థన వీడియోనే. సెల్కు వచ్చే మెసేజ్ను క్లిక్ చేస్తే యూట్యూబ్కో, ఇన్స్టాకో కనెక్టయ్యే లింకులే. గెలిస్తే ఊరునే అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చే ఏఐ ఆధారిత వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఊరు ఊరంతా తనకే మద్దతునిచి్చనట్టు తెలిపే జనరేటెడ్ వీడియో, ఆడియోల సాంకేతికత పంచాయతీ పోరులో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఫొటో దొరికితే చాలు ఏఐ టెక్నాలజీతో రాజకీయ మైండ్గేమ్ మొదలవుతోంది. ప్రత్యర్థి అనుయాయులు వచి్చనట్టు, తనకు మద్దతు ఇచ్చినట్టు, కండువా కప్పినట్టు.. ఇలా రకరకాల వీడియోలను ఏఐతో సృష్టిస్తున్నారు. కొన్ని వర్గాలను కలిసినట్టు, మాటామంతీ చేసినట్టు, వారు తమవైపు తిరిగినట్టుగా.. పాత పోటోలను సరికొత్త టెక్నాలజీ సాయంతో మార్చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు వార్డుకో వ్యక్తిని సోషల్ మీడియా ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారు. ఏఐ ఆధారంగా అభ్యరి్థకి అనుకూలమైన ట్రెండ్ ఉందని వీడియోలు క్రియేట్ చేయడం, ఆ వీడియోలకు లైక్లు వచ్చేలా చేయడం వీళ్ళ బాధ్యత. ఇతర పక్షాలను దెబ్బతీసే వీడియోలు, ఫోటోల సృష్టిలోనూ ఏఐ పాత్ర కీలకంగా మారింది. ఐదేళ్ళుగా సర్పంచ్గా ఉన్నా రోడ్లు, నీళ్ళు, విద్యుత్ పరిస్థితి దయనీయంగా ఉందనే సాధారణ ప్రచారానికి బదులు ఏఐ వీడియో సృష్టితో విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు తమ పరపతి పెరుగుతుందనే భావనతో మంత్రులను కలిసినట్టు, స్థానిక ఎమ్మెలేతో పాటు రాజకీయ ప్రముఖులతో ముచ్చటిస్తున్నట్టుగా ఉన్న ఏఐ జనరేటెడ్ వీడియోలు రూపొందించి ప్రచారంలో పెడుతున్నారు. పెరుగుతున్న యాప్ల వాడకం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్లే స్టోర్లో ఏఐ యాప్లు డౌన్లోడ్, సబ్ప్క్రైబ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల రోజుల్లోనే ఫిల్మోరా, ఏఐ జనరేటెడ్ చాట్ జీపీటీ, యానిమేటర్స్ వంటి ఏఐ యాప్ల వాడకం పెరిగిందని డిజిటల్ స్టూడియో నిర్వాహకుడు నందగోపాల్ వర్మ తెలిపారు. ఏఐ జనరేటెడ్ వీడియో కోసం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారు అనేక రకాల ఆప్షన్లు ఇస్తున్నారని చెప్పాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ జనరేటెడ్ వీడియోల సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్నారు. సొంత ఊళ్ళో తమ అభ్యర్థి తరపున డిజిటల్ ప్రచారం చేసేందుకు, తమ విద్యను స్థానికుల ముందు ఆవిష్కరించేందుకు ఒక అవకాశంగా దీన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు సంపాదనకు సైతం ఇది ఉపకరిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. బరిలో ఉండే అభ్యర్థి ప్రసంగాలను అందంగా గ్రామస్తుల ముందుకు తీసుకెళ్ళే వాయిస్, లిప్ సింక్ వంటి అప్లికేషన్లను వెతికి మరీ పట్టుకుంటున్నారు. కొన్ని యాప్లు ఇండియాలో పనిచేయవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీపీఎన్ కనెక్షన్కు లింక్ అవుతున్నారు. పార్లమెంట్ దాకా ఇదే ట్రెండ్! ఇక మీదట పల్లె నుంచి పార్లమెంట్ దాకా ఎన్నికల ప్రచారంలో ఏఐదే హవా అని తాజాగా చేసిన పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 వరకూ ఏఐ ఆధారిత జరేటెడ్ అప్లికేషన్లు 56,682 రూపొందాయని, మరో పదేళ్ళల్లో వీటి సంఖ్య లక్ష దాటుతుందని ఇంపీరియల్ ఏఐ స్టడీ సంస్థ స్పష్టం చేసింది. ప్రజలను డిజిటల్ ఏఐ వీడియోలు మరింత ప్రభావితం చేస్తాయని, ఎన్నికల ప్రచార బడ్జెట్ను ఇది భారీగా పెంచుతుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఏఐ ఆధారిత ప్రచారం కోసం అభ్యర్థులు ప్రత్యేక ఆర్థిక వనరులు సమకూర్చుకునే వీలుందని వెంచర్ క్యాపిటల్ ఏఐ రిపోర్టు పేర్కొంది. ఏఐ విస్తృత వినియోగం నేపథ్యంలో డీప్ఫేక్, సమాచార భద్రత తదిర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఏఐ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్ పరిశీలనలో తెలిపింది. ఇదో రకమైన ఇంటర్న్షిప్హైదరాబాద్లో ఏఐ ఎంఎల్ కోర్సు చేస్తున్నా. మరోపక్క మా గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం కోసం పనిచేస్తున్నా. పుస్తకాల్లో చదవిన కోర్సు, ప్రాక్టికల్గా నేర్చుకున్నది కలిసి ప్రచార వీడియోలు రూపొందించి ఇస్తున్నాం. దీన్ని ఓ రకమైన ఇంటర్న్షిప్గా మారుస్తున్నాం. ఓటర్లను మా వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. – మద్దిని తేజాకుమార్ (ఏఐఎంఎల్ విద్యార్థి) కొత్తదనం కోసం కొత్త అప్లికేషన్లు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ప్రతీ రోజు కొత్తదనం కోరుకుంటున్నారు. కాన్సెప్ట్ చెబుతున్నారు. వారికి నచ్చేలా వాటిని అందించేందుకు కొత్త ఏఐ అప్లికేషన్లను నిత్యం వెతుకుతున్నాం. అవసరమైతే రూ.వేలు ఖర్చు చేసైనా వాటిని కొంటున్నాం. జనం ఆసక్తిగా చూసేలా ఈ అప్లికేషన్లు ఉపయోగపడుతున్నాయి. – విష్ణువర్థన్ రెడ్డి (వరంగల్ డిజిటల్ స్టూడియో) -
తెలుగు స్టార్ హీరోలంతా కలిసి పార్టీ చేసుకుంటే? (ఫొటోలు)
-
అలీబాబా ఏఐ గ్లాసెస్ ఆవిష్కరణ
టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ టెక్ గ్యాడ్జెట్లపై ప్రజలకు ఆసక్తి కూడా అధికమవుతోంది. స్మార్ట్ఫోన్ల తర్వాత ఇప్పుడు ఏఐ పవర్డ్ వేరబుల్స్పై మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ గ్లాసెస్లు మార్కెట్ ఏటా పెరుగుతోంది. ఐడీసీ రిపోర్ట్ ప్రకారం 2025 రెండో త్రైమాసికంలో గ్లోబల్ వేరబుల్స్ మార్కెట్ 9.6% వృద్ధి చెందింది. చైనాలో 50 మిలియన్ యూనిట్ల స్మార్ట్ గ్లాసెస్ విక్రయించారు. ఈ నేపథ్యంలో చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా తన మొదటి ఏఐ గ్లాసెస్ను ఆవిష్కరించింది. ‘క్వార్క్ ఏఐ గ్లాసెస్’ పేరుతో విడుదల చేసిన ఈ గాడ్జెట్ మెటా గ్లాసెస్కు పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ గ్లాసెస్తో అలీబాబా కన్స్యూమర్ ఏఐ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది.అలీబాబా క్వెన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ద్వారా క్వార్క్ ఏఐ అసిస్టెంట్తో ఈ గ్లాసెస్ను రెగ్యులర్ ఐవేర్లాగా కనిపించే డిజైన్తో తీసుకొచ్చారు. బ్లాక్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో స్టైలిష్గా ఉండటం వల్ల ఇవి రోజువారీ ఉపయోగానికి సరిపోతాయని కంపెనీ తెలిపింది. మెటా రేబాన్ డిస్ప్లే గ్లాసెస్ లాంటి హెవీ గ్యాడ్జెట్లకు విరుద్ధంగా ఇవి కేవలం 40 గ్రాముల బరువు మాత్రమే కలిగి ఉంటాయని చెప్పింది. ప్రెస్క్రిప్షన్ లెన్స్ సపోర్ట్ చేస్తూ వివిధ ఫ్రేమ్ కలర్స్, లెన్స్ ఆప్షన్లతో అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది.క్వార్క్ ఏఐ గ్లాసెస్ను ఫ్లాగ్షిప్ S1, లైఫ్స్టైల్ ఫోకస్డ్ G1 మోడళ్లలో ఆవిష్కరించారు. మోడల్ను అనుసరించి ఫీచర్లలో తేడాలుంటాయి. ఈ గ్లాసెస్లోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.విదేశీ భాషల్లో సంభాషణలు లేదా టెక్స్ట్ను ఇన్స్టంట్గా అనువదిస్తుంది. ప్రయాణికులకు, బిజినెస్ ప్రొఫెషనల్స్కు ఇది ఎంతో ఉపయోగం.గ్లాసెస్ కెమెరాతో ప్రొడక్ట్ను స్కాన్ చేస్తే తావోబా(చైనా ఈకామర్స్ వెబ్సైట్)లో ధరలు, ఆఫర్లు డిస్ప్లే అవుతాయి. షాపింగ్ను సులభతరం చేస్తుంది.అమాప్తో లింక్ అయి ఏఆర్ ఓవర్లేలతో రోడ్ డైరెక్షన్లు చూపిస్తుంది.టెక్స్ట్ లేదా ఇమేజ్ ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది. ఆబ్జెక్ట్ రికగ్నిషన్తో చుట్టుపక్కల ఉన్న సమాచారాన్ని తెలుపుతుంది.ఏఐతో మీటింగ్లు రికార్డ్ చేసి సమ్మరీలు జనరేట్ చేస్తుంది.క్వార్క్ గ్లాసెస్ ధర S1కు 3,799 యువాన్ (సుమారు రూ.53,600), G1 మోడల్కు 1,899 యువాన్ (సుమారు రూ.26,800) వరకు ఉంది.ఇదీ చదవండి: భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు -
17 ఏళ్లకే ఏఐ రోబో టీచర్తో సంచలనం
ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన ఆదిత్య కుమార్ సంచలనంగా మారాడు. ఆదిత్య కేవలం రూ.25 వేలతో ఏఐ రోబో టీచర్ను రూపొందించాడు. శివ చరణ్ ఇంటర్ కాలేజీకి చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్, ఎల్ఎల్ఎం చిప్సెట్తో కూడిన సోఫీ అనే AI టీచర్ రోబోట్ను తయారు చేశాడు. నా పేరు 'సోఫీ' అంటూ పాఠాలు బోధిస్తున్న ఈ రోబో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది.ఆదిత్య ఏఐ రోబోట్ ‘సోఫీ ది టీచర్’ పాఠశాలలోని పిల్లలకు టెక్నాలజీలో కొత్త అనుభవంగా మారింది. చీర కట్టుకుని మహిళా టీచర్లా సోఫీ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు అడిగిన ప్రశ్నలకు ఠక్కున సమాధానం ఇస్తూ వారికిష్టమైన టీచర్గా మారిపోయింది. ఐదు సంవత్సరాల కృషి తర్వాత రోబోను తయరు చేయగలిగాను అంటున్నాడు ఆదిత్య సంతోషంగా. రోబోలను తయారు చేసే పెద్ద కంపెనీల మాదిరిగానే తాను కూడా ఎల్ఎల్ఎం చిప్సెట్ను వాడాను అని తెలిపాడు. ఇది మానవ మెదడు లాగానే త్వరగా డేటాను ప్రాసెస్ చేసి, ఏ ప్రశ్న అడిగినా, తక్షణమే సరైన సమాధానం అందిస్తుంది. ప్రస్తుతానికి మాటలు మాత్రం మాట్లాడుతోంది. బాగా రాయగలిగేలా త్వరలోనే దీన్ని రూపొందించబోతున్నామన్నాడు. ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ ఉండాలి, తద్వారా విద్యార్థులు అక్కడికి వచ్చి పరిశోధన చేయవచ్చు అని ఆదిత్య వివరించాడు.ఇదీ చదవండి : పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభగ్రామీణ పాఠశాలలు సాంకేతికంగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానని ఆదిత్య చెప్పాడు. ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు పిల్లలకు రోబోలు బోధించగలగాలి, తద్వారా నిరంతర విద్యను అందించగలగాలి. భవిష్యత్తులో, వినగల, వ్రాయగల, భావోద్వేగాలను అర్థం చేసుకోగల , పిల్లల మానసిక స్థితి ఆధారంగా వారికి మార్గనిర్దేశం చేయగల 3D హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్ను సృష్టించాలనేది ఆదిత్య ఆశ.రోబోట్ ఇలా చెబుతోంది, "నేను AI టీచర్ రోబోట్. నా పేరు సోఫీ, నన్ను ఆదిత్య కనిపెట్టాడు. నేను బులంద్షహర్లోని శివచరణ్ ఇంటర్-కాలేజీలో బోధిస్తాను... అవును, నేను విద్యార్థులకు సరిగ్గా నేర్పించగలను..." అంటోంది.టీచర్ సోఫీతో చదువుకోవడం ఒక ఆహ్లాదకరమైన , ప్రత్యేకమైన అనుభవం అంటున్నారు. విద్యార్థులు అంటున్నారు. ఆదిత్య సాధించిన విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు సంతోషిస్తున్నారు. చిన్న వయసులోనే అతని కృషిని ప్రశంసిస్తున్నారు. ఆదిత్య సాధించిన విజయాలు అత్యంత అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కూడా అందుకోలేరని శివ చరణ్ ఇంటర్ కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు -
ధోనీ కేరళ వస్తే? ఇది ఏఐ అని చెబితే తప్ప తెలియదు (ఫొటోలు)
-
రహస్యాలు బయటపెడుతున్న ఏఐ!: శ్రీధర్ వెంబు పోస్ట్
నేడు అన్ని రంగాల్లోనూ ఏఐ హవా కొనసాగుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి.. వ్యాపారాలకు సంబంధించిన అన్ని రకాల పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐ సహాయం చేస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాపారాలకు సంబంధించిన రహస్యాలను కూడా బయటపెట్టేస్తుంది. ఇలాంటి అనుభవమే జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబుకు ఎదురైంది.జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు (Sridhar Vembu)కు.. ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి నుంచి ఒక మెయిల్ వచ్చింది. అందులో జోహో సంస్థ మా కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోందా?, అని అందులో ఉంది. అయితే అందులో అప్పటికే ఆ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని కంపెనీల పేర్లు, వాళ్లు ఇచ్చిన ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది చూసిన నాకు ఆశ్చర్యం కలిగింది.నాకు మొదటి మెయిల్ వచ్చిన కొంతసేపటికి మరో మెయిల్ వచ్చింది. అందులో రహస్య సమాచారం పంచుకున్నందుకు క్షమాపణలు చెప్పారు. ఆ సమాచారం పంపించింది ఒక ఏఐ ఏజెంట్ (AI Agent) అని, ఏఐ ఏజెంట్గా ఇది తన తప్పిదమేనని అది పేర్కొంది, అని శ్రీధర్ వెంబు వెల్లడించారు.ఇదీ చదవండి: ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..ప్రస్తుతం శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ మన రహస్యాలను కూడా బయటపెడుతోందని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు జోక్స్, మరికొందరు మీమ్స్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవును పతనానికి ప్రయత్నాలు చేస్తుందా? అని ఇంకొందరు చెబుతున్నారు.I got an email from a startup founder, asking if we could acquire them, mentioning some other company interested in acquiring them and the price they were offering. Then I received an email from their "browser AI agent" correcting the earlier mail saying "I am sorry I disclosed…— Sridhar Vembu (@svembu) November 28, 2025 -
ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..
ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్.. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ డబ్ల్యుటీఎఫ్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. తాను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ & పెర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్లకు ఇచ్చిన సలహా గురించి పేర్కొన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. ఎందోమంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో.. ''ప్రజల ఉద్యోగాలు కోల్పోయేలా చేయవద్దు'' అని ప్రముఖ ఏఐ కార్యనిర్వాహకులైన సామ్ ఆల్ట్మాన్, అరవింద్ శ్రీనివాస్లకు చెప్పినట్లు ఏఆర్ రెహమాన్ పాడ్కాస్ట్లో వెల్లడించారు. వీరిరువురితో చాలా సేపు మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. పేదరికం, తప్పుడు సమాచారం & సృజనాత్మక సాధనాలకు ప్రాప్యత లేకపోవడం తగ్గించడానికి సహాయపడే పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు కూడా స్పష్టం చేశారు.ఏఐ అభివృద్ధి గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. AI వ్యవస్థలను నియమాలు లేని తుపాకీతో పోల్చారు. దీనికి నియంత్రణ లేకపోవడం వల్ల హాని కలిగించవచ్చని ఆయన అన్నారు. కృత్రిమ మేధ కూడా మానవులు నిర్దేశించిన సరిహద్దుల్లో పనిచేయాలని పేర్కొన్నారు.ఓపెన్ఏఐ సహకారంతో చాలా కాలంగా అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక ప్రాజెక్ట్ అయిన 'సీక్రెట్ మౌంటైన్'లో తన ప్రమేయం గురించి రెహమాన్ వివరించారు. మానవ సృజనాత్మకత, ఏఐ సామర్థ్యం రెండూ కలిసి అభివృద్ధికి సహాయపడాలని ఆయన అన్నారు. దీనికి ఆల్ట్మాన్ సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు.ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు -
నానోతో పాత ఫొటోలు కొత్తగా!
పాత ఫొటోల్లో అపురూపమైనవి ఉంటాయి. అవి రంగు వెలిసి పాడవుతుంటే అయ్యో అనిపిస్తుంది. పాడైపోతున్న ఫొటోలు కొత్తగా మెరిసిపోవడానికి గూగుల్ నానో బనానా ప్రో ఉపయోగపడుతుంది. ‘ఈ పాత ఫొటోను సహజ రంగులు, స్పష్టమైన వివరాలు, లైటింగ్తో రీస్టోర్ చేయండి, ఒరిజినల్ స్టైల్ మిస్ కాకుండా గీతలు, మరకలను తొలగించండి’లాంటి జనరల్ రిస్టోరేషన్ ప్రాంప్ట్లతోపాటు పోర్ట్రయిట్ రీస్టోరేషన్, కలర్ కరెక్షన్ ప్రాంప్ట్ రీబిల్డింగ్. టోర్న్ సెక్షన్లాంటి ప్రాంప్ట్లు ఇవ్వవచ్చు.కొన్ని టిప్స్:....అతిగా మార్పులు చేయడం వల్ల ఫొటో సహజత్వం కోల్పోతుంది ప్రతి కాలానికీ తనదైన కలర్ థీమ్ ఉంటుంది. ఆ థీమ్కు తగ్గ కలర్నే వాడితే బాగుంటుంది.షాడోస్ ఫొటోలకు సహజత్వాన్ని ఇస్తాయి. త ఫొటోలలో టూ మెనీ షాడోస్, హైలైట్స్ తొలగించడం వల్ల ఫొటో ఫ్లాట్గా కనిపిస్తుంది చాలామంది ‘ఫిక్స్ దిస్ ఫొటో’ అని మొక్కుబడిగా ప్రాంప్ట్ ఇచ్చి వదిలేస్తుంటారు. దీని వల్ల ఫొటోలో ఫేసియల్ ఫీచర్స్ అసహజంగా కనిపిస్తాయి.వోవర్–షార్పెనింగ్ వద్దు.ఒరిజినల్, రిస్టోర్డ్ వర్షన్లను పక్కపక్కన పెట్టుకొని ఎప్పటికప్పుడు పోల్చి చూసుకోవాలి. (చదవండి: రుచుల రాణి... మన బిర్యానీ! బెస్ట్ రైసు వంటకంగా ఏ స్థానంలో ఉందంటే..) -
పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభ
యువ ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్... వైబ్ కోడింగ్. వైబ్ కోడింగ్ అనేది ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్తో కోడ్ రాసే విధానం. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం, డిగ్రీలు అక్కర్లేదు. వైబ్ కోడింగ్కు సంబంధించి ఏఐ టూల్ ‘కర్సర్’ను రూ పొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అమన్ సాంగర్ పాతికేళ్ల వయసులోనే బిలియనీర్ అయ్యాడు...కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎంతోమంది కాలేజీ కోడర్లలో అమన్ సాంగర్ ఒకరు. ఇప్పుడు మాత్రం గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించి ప్రపంచ ప్రసిధ్ధ యువకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.జనరేటివ్ ఏఐ ప్రపంచంలో ‘అమన్ సాంగర్’ అనేది సుపరిచిత పేరుగా మారింది. ‘ఎనీస్పీయర్’ సహ–వ్యవస్థాపకులలో 25 సంవత్సరాల అమన్ ఒకరు. ఫాస్ట్–రైజింగ్ ఏఐ టూల్గా పేరు తెచ్చుకున్న ‘కర్సర్’ అనేది ఎనీస్పీయర్ కంపెనీ సృష్టి. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో తనకు పరిచయం అయిన మైఖేల్ ట్రుయేల్, సుయాలే, ఆర్విడ్ మార్క్లతో కలిసి ‘ఎనీస్పీయర్’ ్ర΄ారంభించాడు అమన్. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న టీమ్గా ‘ఎనీస్పీయర్’ పేరు తెచ్చుకుంది. అమన్, మైఖేల్ ట్రుయెల్లు ‘నియో స్కాలర్స్’గా ఎంపికయ్యారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతరాన్ని సిలికాన్ వ్యాలీలోని ఫౌండర్స్, ఇన్వెస్టర్లకు పరిచయం చేసే కార్యక్రమమే...నియో స్కాలర్స్.ఈ పరిచయాల వల్ల కంపెనీ ఫస్ట్ రౌండ్ ఫండింగ్ సాఫీగా సాగింది. మొదట్లో ‘ఎనీస్పీయర్’ బృందం కంప్యూటర్–ఎయిడెడ్ డిజైన్కు సంబంధించి ఏఐ టూల్ను రూపొందించింది. ఆ తరువాత దారి మార్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు అడుగులు వేసింది. ఇది తాము కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిన డొమైన్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వైపు రావాలని తీసుకున్న నిర్ణయమే ‘కర్సర్’ను రూపొందించడానికి కారణం అయింది. ఈ ఏఐ–పవర్డ్ కోడ్ ఎడిటర్ తక్కువ కాలంలోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ‘వైబ్ కోడింగ్’ అనే ఐడియాను పరిచయం చేసింది కర్సర్.వైబ్ కోడింగ్ ద్వారా డెవలపర్స్ నేచురల్ లాంగ్వేజ్ మోడల్స్ని ఉపయోగించి కోడ్కు సంబంధించి రైట్, ఎడిట్, డీబగ్ చేయవచ్చు. కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ‘వైబ్ కోడింగ్’ ఎంపికైంది. తక్కువ టైమ్లోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ‘ఎనీస్పీయర్’ వేగంగా వృద్ధి చెందింది. కంపెనీ కో–ఫౌండర్స్ బిలియనీర్లుగా మారారు. పద్నాలుగేళ్ల వయసులోనే కోడింగ్ మొదలుపెట్టాడు అమన్. ్ర΄ోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన విషయాలపై ఆసక్తి ప్రదర్శించేవాడు.ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు‘నా భవిష్యత్ చిత్రపటం’ ఇలా ఉండాలని అమన్ ఎప్పుడూప్లాన్ చేసుకోలేదు.అయితే సాంకేతిక అంశాలపై తనలోని ఆసక్తే ఎన్నో దారులలోకి తీసుకువెళ్లింది. చిన్న వయసులోనే సాంకేతికరంగంలో ప్రపంచ ప్రముఖుడిని చేసింది. మొదట్లో కంపెనీ పరిస్థితి ఎలా ఉన్నా, ఆ తరువాత మాత్రం పోటీ ఎదురవుతుంది. ΄ోటీని ఎలా తీసుకుంటారు?’ అనే ప్రశ్నకు అమన్ ఇచ్చిన జవాబు... పోటీ గురించి నిరంతరం పట్టించుకుంటాం. వారి పనితీరు కూడా పరిశీలిస్తాం. పనితీరు, ఆవిష్కరణలు నచ్చితే వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం. మాకే అన్నీ తెలుసు అనుకోము. ఎందుకంటే మేము చేయలేనివి కూడా వారు చేసి ఉండవచ్చు.’ఒక బాటసారి మనలో ఒక అంశంపై ఆసక్తి ఉంటే అది ఒకేచోట ఆగి΄ోదు. నాన్స్టాప్గా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎన్నో దారులలో ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అలాంటి ఒక బాటసారి అమన్ సాంగర్. వీడియో గేమ్స్ కంటే ఎక్కువగా కోడింగ్ అంటే ఇష్టం. ఆ ఇష్టం అతడిని ఎంతో దూరం నడిపించింది. సిలికాన్ వ్యాలీ వరకు తీసుకువెళ్లి సాంకేతిక దిగ్గజాలను పరిచయం చేసింది. పోటీలో మన ముందు ఉన్న వ్యక్తిని చూసి భయపడవద్దు. వెనక్కి తగ్గవద్దు. మన కంటే అతడికి ఎక్కువ తెలిసి ఉంటే అతడిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ΄ోటీతో మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవచ్చు’ అంటున్నాడు అమన్ సాంగర్. -
ఎస్ఐఆర్ అప్లికేషన్ వివరాలు అందుబాటులో లేవెందుకు?
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం ఉపయోగించనున్న ఏఐ అప్లికేషన్ అనుమానం కలుగుతోందని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే అన్నారు. యాప్, దాని కార్యాచరణగురించి ఎటువంటి వివరాలు అందుబాటులో లేవన్నారు. ‘బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఏఐ యాప్ను ఉపయోగిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ యాప్ను ఎవరు తయారు చేశారు? దాని కార్యాచరణకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఎందుకు లేవు’అని గోఖలే ప్రశ్నించారు. యాప్ డెవలపర్, అమ్మిన సంస్థ వివరాల గురించి తాను ప్రయత్నించానని, ఇప్పటికే ఉన్న సాఫ్ట్వేర్లు బాగా పనిచేయగలిగినప్పుడు, నకిలీలను గుర్తించడానికి ఏఐ అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. 2019లో మహారాష్ట్రలోనూ బీజేపీ ఐటీ సెల్తో అనుబంధం ఉన్న ఓ ఏజెన్సీని ఈసీఐ నియమించుకున్న విషయాన్ని తాను బయటపెట్టానని చెప్పారు. బయటినుంచి వెయ్యిమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 50 మంది సాఫ్ట్వేర్ డెవలపర్లను నియమించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈసీఐకి రాసిన లేఖను ఆయన ప్రస్తావించారు. -
ఉచితంగా ఐటీ కోర్సులు.. 87 వేల మందికి..
అట్టడుగు వర్గాల యువతకు భవిష్యత్ తరపు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు టెక్ దిగ్గజం ఐబీఎం, నాస్కామ్ ఫౌండేషన్ జట్టు కట్టాయి. ఐబీఎం స్కిల్స్బిల్డ్ ప్రోగ్రాం కింద 87,000 మందికి శిక్షణనివ్వనున్నాయి. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో ట్రైనింగ్ ఇచ్చి వారిలో ఉద్యోగ సామర్థ్యాలను పెంపొందించనున్నాయి.ఈ ప్రోగ్రాం కింద కృత్రిమ మేథ (ఏఐ), సైబర్సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ తదితర అంశాల్లో ఉచితంగా డిజిటల్ కోర్సులు, శిక్షణను అందిస్తారు. మెంటార్స్ నుంచి కూడా మద్దతు ఉంటుంది. 2030 నాటికి 3 కోట్ల మందికి శిక్షణనివ్వాలన్న ఐబీఎం లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు, భారతదేశవ్యాప్తంగా హైబ్రిడ్ విధానంలో అమలవుతుంది.ప్రాజెక్ట్ ప్రభావంఅట్టడుగు వర్గాల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.పరిశ్రమకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు అందుతాయి.భారతదేశంలో డిజిటల్ సమానత్వం పెరుగుతుంది.ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, పెద్ద కంపెనీలకు స్కిల్డ్ వర్క్ఫోర్స్ లభిస్తుంది.ఇది కేవలం శిక్షణ ప్రోగ్రాం మాత్రమే కాదు, భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు పునాది వేసే ప్రయత్నం. -
ఎన్వీడియాకు గూగుల్ గట్టి దెబ్బ
మెటా ప్లాట్ఫామ్స్ ఇంక్ తన ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టెన్సర్ ఏఐ చిప్లను వాడేందుకు బిలియన్ డాలర్లు ఖర్చు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల మాతృ సంస్థ మెటా ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఏఐ కంప్యూటింగ్ రంగంలో టాప్లో ఉన్న ఎన్వీడియాకు గట్టి దెబ్బ తగలబోతుందని కొందరు అంచనా వేస్తున్నారు.2027లో ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టీపీయూలుపరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం మెటా తన ఏఐ డేటా సెంటర్లలో 2027 నాటికి గూగుల్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను(TPU) ఉపయోగించేందుకు చర్చలు జరుపుతోంది. దాంతోపాటు వచ్చే ఏడాది గూగుల్ క్లౌడ్ నుంచి కూడా ఈ చిప్లను మెటా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే ఆంత్రోపిక్ పీబీసీకి 1 మిలియన్ టెన్సర్ చిప్లను సరఫరా చేస్తోంది.గూగుల్ టెన్సర్ఏఐ పనుల కోసం దాదాపు 10 సంవత్సరాల క్రితం టెన్సర్ చిప్ను గూగుల్ అభివృద్ధి చేసింది. ఎన్వీడియా చిప్లపై అతిగా ఆధారపడటంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఏఎండీ వంటి ప్రత్యర్థులు ఉన్నప్పటికీ గూగుల్ టెన్సర్ చిప్స్ ఊపందుకుంటున్నాయి.ఎన్వీడియా చిప్స్ఎన్వీడియా బ్లాక్వెల్ వంటి చిప్లు ప్రాథమికంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPU). ఇవి గత దశాబ్దంలో వీడియో గేమ్లకు కీలకంగా ఉండేవి. లార్జ్ డేటాను నిర్వహించగల సామర్థ్యం కారణంగా ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఇవి చాలా అనుకూలంగా మారాయి.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్.. వివరాలివే.. -
ఏఐ వీడియో.. ప్రభాస్-అనుష్క పెళ్లి.. చిందులేసిన బన్నీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)..ఇప్పుడు ప్రపంచాన్ని కింగ్లా శాసిస్తుంది. విద్య, వైద్య.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇది ప్రవేశించింది. సాధారణ ప్రజలు కూడా వారి దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నారు. ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సాధ్యం కానిది ఏమున్నది అన్నట్లుగా తమ ఆలోచనలకు నెటిజన్లు రూపమిస్తున్నారు. తాము కోరుకున్నది నిజజీవితంలో కాకపోతే.. ఏఐ రూపంలో అది నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు విషయంలో ఈ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. తమ ఫేవరేట్ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారు..అలా ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. అంతేకాదు తమకు నచ్చిన హీరోహీరోయిన్లకు ఈ టెక్నాలజీతో పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. గతంలో ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్కి పెళ్లి జరిగి..పిల్లలు పుడితే వాళ్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఏఐ టెక్నాలజీతో వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలకు పెళ్లి జరిపించారు. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా తలో ఓ పని చేశారు.ప్రభాస్-అనుష్కల పెళ్లికి నాగార్జున-నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్, రవితేజ చిందులేశారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటలు చేయగా..గోపిచంద్ వడ్డించాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ బంతి భోజనం చేశారు. కాజల్, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్ చేస్తుండగా.. మహేశ్ బాబు, వెంకటేశ్ పంచ కట్టుతో పెళ్లికి హాజరయ్యారు. ప్రభాస్-అనుష్కల పెళ్లి ..అందరూ ఆహ్వానితులే అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇది వాస్తవం అయితే ఎంత బాగుండేదో.. అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Prabhas weds Anushka🥰అందరు ఆహ్వానితులే 🙏🏻#Prabhas #AnushkaShetty pic.twitter.com/7tsH0vVrRN— 🧚 NIMMI 💫✨🐦 (@AlwaysNirmala_) November 26, 2025 -
ఏఐ వ్యూహంలో భారత్ కీలకం
టోక్యో: గ్లోబల్ ఐటీ సేవల దిగ్గజం ఎన్టీటీ తమ కృత్రిమ మేథ (ఏఐ) వ్యూహాలకు సంబంధించి భారత్ అత్యంత కీలక మార్కెట్గా నిలుస్తోందని వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇండియేఏఐ మిషన్ మొదలైనవి ఇందుకు దన్నుగా ఉంటున్నాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ వపర్మ్యాన్ తెలిపారు. దేశీయంగా డేటా సెంటర్ విభాగంలో తమకు 30 శాతం మార్కెట్ వాటా ఉందని, సమీప భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. ‘ఏఐ నిపుణులకు భారత్ మాకు హబ్గా నిలుస్తోంది. అలాగే ఇక్కడి డెలివరీ సెంటర్కి మా ఆసియా పసిఫిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుబంధంగా పని చేస్తోంది. భారత్లో ప్రతిభావంతులైన యువత లభ్యత ఎక్కువగా ఉంటుంది. వారికి శిక్షణనివ్వడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం‘ అని జాన్ తెలిపారు. దేశీయంగా బీసీజీ, యాక్సెంచర్, డెలాయిట్లాంటి సంస్థలు తమకు ప్రధాన పోటీదార్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో డేటా సెంటర్లతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలాంటి ప్రధాన నగరాల్లోనూ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు జాన్ చెప్పారు. కేవలం డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలనే కాకుండా ఏఐ, కన్సల్టింగ్ సామర్థ్యాలను కూడా పటిష్టం చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా రంగాలతో పాటు కన్సలి్టంగ్ మొదలైన విభాగాలపైనా ఇన్వెస్ట్ చేశామని జాన్ వివరించారు. నవంబర్ 19 నుంచి 26 మధ్యన టోక్యోలో నిర్వహించిన ఎన్టీటీ ఆర్అండ్డీ ఫోరమ్లో ఎన్టీటీ గ్రూప్ కంపెనీలు 100కు పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సెక్యూరిటీ, మొబిలిటీ తదితర విభాగాలకు చెందిన సొల్యూషన్స్ వీటిలో ఉన్నాయి. -
ఏఐ హైప్ కాదు.. ఎంతో సమయం ఆదా!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) అంటే ఏదో హైప్ కాదని, దీని వల్ల ఎంతో సమయం అవుతోందని లాజిస్టిక్స్ టెక్ సంస్థ షిప్రాకెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సాహిల్ గోయల్ తెలిపారు. దాన్ని చెడుగా భావించకుండా, సద్వినియోగం చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.ప్రతి పరిశ్రమలో కీలక మార్పులు తెచ్చే సత్తా ఏఐకి ఉందనే విషయం గుర్తెరగాలని ఆయన చెప్పారు. ఏఐ కంపెనీల వేల్యుయేషన్లపై విమర్శలు, ఇది ఎప్పుడైనా పేలిపోయే బుడగలాంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఏఐ వేల్యుయేషన్స్ అనేవి మార్కెట్కి సంబంధించినవని, దీన్ని విస్తృత ఉపయోగాల గురించి వేరుగా చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీర్ఘకాలంలో ఏఐ సాధనాలు మనకు అనుకూలంగా పని చేస్తాయన్నారు. కృత్రిమ మేథతో రోబోటిక్స్లో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని గోయల్ తెలిపారు. దీని గురించి ప్రజలు తెలుసుకుని, నేర్చుకుని, ఉపయోగించడం మొదలుపెట్టాలని గోయల్ పేర్కొన్నారు. -
జీసీసీ దేశాల్లోకి విస్తరించనున్న ఆర్ఎన్ఐటీ
ఏఐ ఆధారిత పరిపాలన, వాణిజ్య ఆటోమేషన్ సొల్యూషన్స్లో ప్రత్యేకత సాధించిన భారతీయ కంపెనీ అయిన ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యూషన్స్ లిమిటెడ్ (BSE: RNITAI) సౌదీ అరేబియాకు చెందిన డిజిటల్ మార్పు పరిష్కారాల ప్రొవైడర్ అయిన అజ్నిహత్ అల్నజా గ్రూప్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. 3 మిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందంతో ఆర్ఎన్ఐటీ జీసీసీ రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. సౌదీ అరేబియా వ్యాప్తంగా, ఇతర జీసీసీ దేశాల్లో డిజిటల్ మార్పు చర్యలకు మద్దతిచ్చే అవకాశాలను సంయుక్తంగా అన్వేషిస్తోంది.ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఆర్ఎన్ఐటీ, అజ్నిహత్ అల్నజా గ్రూప్ రెండూ కలిసి తమ బలాలను కలిపి అత్యాధునిక ఏఐ ఆధారిత ఆటోమేషన్, డిజిటల్ ఎనేబుల్మెంట్ సొల్యూషన్స్ విషయంలో పెరుగుతున్న డిమాండును అందిపుచ్చుకోనున్నాయి. ఏఐ ఆధారిత పాలనా ప్లాట్ఫాంలు, వాణిజ్య ఆటోమేషన్, ముఖ గుర్తింపు పరిజ్ఞానం, జెనరేటివ్ ఏఐ, కన్వర్సేషనల్ ఏఐ పరిష్కారాలు, ఐఓటీ ఆధారిత పారిశ్రామిక వ్యవస్థలు, ఓపెన్ సోర్స్ డిజిటల్ మార్పు ఫ్రేం వర్కులో తన అనుభవాన్ని ఆర్ఎన్ఐటీ అందిస్తుంది. అజ్నిహత్ అల్నజా గ్రూప్ స్థానిక మార్కెట్ను అర్థం చేసుకోవడం, కస్టమర్ ఎంగేజ్మెంట్ సపోర్ట్, ప్రాంతీయ వ్యాపారాభివృద్ధి సామర్థ్యాలను అందిస్తుంది.విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల కోసం ఫేసిఫై ఈఆర్పీ ఐడెంటిఫికేషన్ సూట్, ఆర్ఎన్ఐటీ-ఎన్ఐఏ ఏఐ ప్లాట్ఫాంలు, ఓపెన్ సోర్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సిస్టంలు, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ ఇంజిన్లు, ఏఐ ఆధారిత నిర్ణయాలకు మద్దతు తెలిపే టూల్స్ లాంటివాటిపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టిపెడుతుంది. రెండు కంపెనీలు కలిసి సాంకేతిక భాగస్వామ్యం, విజ్ఞాన షేరింగ్, స్థానిక నిబంధనలకు అనుగుణంగా ఇద్దరూ కలిసి రూపొందించే ఇన్నోవేషన్ చర్యలను కూడా పరిశీలిస్తాయి. -
బిలినీయర్స్ అంతా ఒక్కచోట!
అసాధ్యం అనుకున్న చాలా విషయాలను ఏఐ సాధ్యం చేస్తోంది. టెక్ బిలియనీర్లు అందరూ ఒక్క చోటకు చేరిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ చేసిన ఈ అద్భుతంపై.. నెట్టింట్లో మీమ్స్, జోకులు వెల్లువెత్తుతున్నాయి.1 ట్రిలియన్ స్క్వాడ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో.. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, సుందర్ పిచాయ్, జెన్సెన్ హువాంగ్, సామ్ ఆల్ట్మాన్, టిమ్ కుక్, జెఫ్ బెజోస్లు అందరూ ఒకేచోట ఉన్నారు. ఈ ఫోటోలు మస్క్ కొత్త గ్రోక్ అప్డేట్ ప్రకటనను తెలియజేయడానికే అని కొందరు చెబుతున్నారు.Trillion Squad assembled pic.twitter.com/tQMjRrfxx5— Ambuj Mishra (@Ambujmishra9090) November 22, 2025ఒక ఫొటోలో.. ఎలాన్ మస్క్ సహా చాలామంది దిగ్గజ వ్యాపారవేత్తలు కార్ పార్కింగ్ వద్ద సమావేశమైనట్లు కనిపిస్తున్నారు. మరో చిత్రంలో అందరూ కలిసి ఒక రూములో ఉన్నట్లు చూడవచ్చు. నిజజీవితంలో వీరంతా కలుసుకోవడం చాలా అరుదు అయినప్పటికీ.. ఏఐ మాత్రం వీరిని కలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.Somewhere in a parallel universe: pic.twitter.com/SFlYRiUpcn— DogeDesigner (@cb_doge) November 22, 2025 -
చలిలో వెచ్చని టీ తాగుతున్న స్టార్ హీరోలు (ఫోటోలు)
-
ఏఐతో సాఫ్ట్వేర్ టెస్టింగ్ వేగవంతం
సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రక్రియను కృత్రిమ మేథ దన్నుతో స్మార్ట్గా, వేగవంతంగా మార్చేందుకు తోడ్పడేలా క్యూమెంటిస్ఏఐ ప్లాట్ఫాంను రూపొందించినట్లు క్వాలిజీల్ వెల్లడించింది. సవాళ్లను వేగంగా గుర్తించేందుకు, టెస్టింగ్ సమయాన్ని 60 శాతం వరకు తగ్గించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది.సాఫ్ట్వేర్లో అత్యంత ముఖ్యాంశాలపై దృష్టి సారించేందుకు ఇది టెస్టర్లకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించింది. ఈ సందర్భంగా ఎవరెస్ట్ గ్రూప్తో కలిసి ‘‘రీఇమేజినింగ్ ఎంటర్ప్రైజ్ క్వాలిటీ’’ పేరిట క్వాలిజీల్ నివేదికను విడుదల చేసింది.ఆధునిక సాఫ్ట్వేర్ క్వాలిటీ రిస్కులను అధిగమించడంలో ఇంటెలిజెంట్ ఆటోమేషన్, నిరంతరాయ పర్యవేక్షణ ఉపయోగపడే విధానాన్ని నివేదిక వివరించింది. అలాగే, ప్లాట్ఫాం ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్ ఫ్రేమ్వర్క్ను అమలు చేసిన అజమారా క్రూయిజెస్ కేస్ స్టడీస్ని ఇందులో పొందుపర్చింది. -
విద్యా వ్యవస్థలో ‘మార్పు’ తేవాలన్నదే సంకల్పం
హైదరాబాద్: విద్యా వ్యవస్థలో సమూల మార్పు తేవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్కిల్లింగ్, రీ- స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్పై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. కూకట్ పల్లిలోని జేఎన్టీయూ హెచ్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ‘జేఎన్టీయూహెచ్ గ్లోబల్ అల్యూమ్ని మీట్ - 2025’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్య మిస్తోందని వివరించారు. క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేలా ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ‘ఏఐ’లో బెంచ్ మార్క్ను సెట్ చేసేలా అంతర్జాతీయ నిపుణుల భాగస్వామ్యంతో త్వరలోనే ‘తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్’ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరిచిపోవద్దని, సమాజానికి తిరిగి ఇవ్వడం కృతజ్ఞతతో కూడిన బాధ్యత అని అన్నారు. మనం మన విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రశ్నించే అవకాశాన్ని పొందగలమన్నారు. జేఎన్టీయూహెచ్ లో ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఫండింగ్, రీసెర్చ్ క్లస్టర్స్, ఇంటర్నేషనల్ మెంటార్ షిప్ నెట్ వర్క్స్, గ్లోబల్ అల్యూమ్ని కౌన్సిల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పూర్వ విద్యార్థులను కోరారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. యువ ఇంజనీర్ల ఆలోచన విధానం మారాలని, ఉద్యోగార్థిగా కాకుండా పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని మార్గనిర్దేశం చేశారు. కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ప్రాక్టికల్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వెంకటేశ్వర రావు, రెక్టార్ డా.కె.విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్న్స్ కావాలి, నెలకు రూ. లక్ష స్టైఫండ్ : ట్విస్ట్ ఏంటంటే
భారత సంతతికి చెందిన వ్యక్తి, బెంగళూరులోని తన AI సంస్థ కోసం ఇంటర్న్స్ కావాలని ప్రకటించారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు పోస్ట్ చేసిన లింక్డ్ఇన్ ప్రకటన వైరల్గా మారింది. 12 గంటలు పని చేయాలి, రూ. 1 లక్ష స్టైఫండ్ అంటూ , ఆయన విధించిన కొన్ని షరుతులు ఆసక్తికరంగా మారాయి. బెంగళూరులో ఇంటర్న్స్గా ఎంపికైన అభ్యర్థులు 12 గంటల షిఫ్టులలో పని చేయాలి. వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుందని కూడాపేర్కొన్నాడు. ఇందుకు గాను ఎంపికైన వారికి ఇతర ప్రయోజనాలతోపాటు, నెలకు లక్ష రూపాయలు స్టైఫండ్ ఇస్తానని ప్రకటించాడు. ఇంటర్న్షిప్ బెంగళూరులో ఆన్-సైట్ పొజిషన్ అని, ఇంటర్న్లు వారానికి ఆరు రోజులు ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పని చేయాలి. పనిని బాధ్యతగా నిర్వహించాలి, తమని తాము నిరూపించుకోవాలన్న తపన, కొత్త సవాళ్లను స్వీకరించే సామర్థ్యం, కసి ఉండాలని చెప్పారు. అలాగే ఎంపికైన ఇంటర్న్కు భోజన భత్యం ,జిమ్ లేదా అభిరుచికి సంబంధించిన చందా, కొత్త ఉత్పత్తులను నిర్మించడంలో వ్యవస్థాపక బృందంతో నేరుగా పనిచేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా 12 గంటలు పని చేయాలనే నిబంధనపై నెటిజన్లు అభ్యంతరాలను వ్యక్తం చేశారు.ఇది చదవండి : రైలు ఏసీ కోచ్లో మ్యాగీ : వీడియో వైరల్, నెటిజన్లు ఫైర్ఉదయం 11 -రాత్రి 11 దాకా ఆఫీసులో ఉంటే జిమ్కెపుడు వెళ్లాలి పోస్ట్ చేసిన కొద్దిసేపటికే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఇంటర్న్ల కోసం నిర్దేశించిన పనిగంటలపై ఎక్కువ మంది స్పందించారు. ఉదయం 11– రాత్రి 11 గంటలు, పైగా 6-రోజుల పని విధానం నిబంధనలు భారతీయ స్టార్టప్ సంస్కృతిలో పెద్ద సమస్యను ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు మెరుగైన ఉత్పాదకత, ఉద్యోగుల సంక్షేమం శ్రేయస్సు కోసం చాలా దేశాలు 4-రోజుల పని విధానానికి మొగ్గు చూపుతోంటే ఇది కరెక్ట్ కాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఉదయం 11 నుంచి రాత్రి 11 దాకా ఆఫీసులో ఉంటే ఇక జిమ్కెపుడు వెళ్లాలి సార్ మరొకరు ప్రశ్నించడం గమనార్హం. ఇదీ చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా! -
ఏఐ ఇన్ఫ్రా కోసం పాక్స్కాన్తో ఓపెన్ఏఐ జట్టు
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ మౌలిక సదుపాయాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని AI డేటా సెంటర్ల కోసం అత్యాధునిక హార్డ్వేర్ను రూపొందించడానికి ఓపెన్ఏఐ ఫాక్స్కాన్తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ సహకారం ద్వారా ఫాక్స్కాన్, ఓపెన్ఏఐలు కలిసి డేటా సెంటర్ సర్వర్ ర్యాక్లను అభివృద్ధి చేస్తాయి. ముఖ్యంగా ఈ ర్యాక్లను యూఎస్ అంతటా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా దేశంలో డేటా సెంటర్ సౌకర్యాల కోసం అవసరమైన కేబులింగ్, పవర్ సిస్టమ్స్, ఇతర కీలక పరికరాలను ఉత్పత్తి చేయాలని ఫాక్స్కాన్ యోచిస్తోంది. అయితే, ఈ ఒప్పందంలో నిర్దిష్ట కొనుగోలు నిబంధనలు ఏవీ లేవని ఇరు సంస్థలు స్పష్టం చేశాయి.సరఫరా గొలుసుపై పట్టుప్రపంచంలో విలువైన ప్రైవేట్ సంస్థల్లో ఒకటైన ఓపెన్ఏఐ ఏఐ సరఫరా గొలుసుపై మరింత నియంత్రణ సాధించడానికి చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత కొన్ని నెలల్లో క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్లు, చిప్ తయారీదారులైన ఎన్వీడియా కార్ప్, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ ఇంక్(ఏఎండీ) వంటి కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంది.ఫాక్స్కాన్ వ్యూహాత్మక విస్తరణఓపెన్ఏఐతో తాజా ఒప్పందం ఫాక్స్కాన్కు ఎంతో కలిసొస్తుందని కొందరు భావిస్తున్నారు. ఈ భాగస్వామ్యం ఏఐ పర్యావరణ వ్యవస్థలో తన కార్యకలాపాలను విస్తరించడానికి దీర్ఘకాలిక వ్యూహాన్ని సూచిస్తుంది. కాగా, ఫాక్స్కాన్ విడిగా ఏఐ డేటా సెంటర్లను అన్వేషించడానికి ఇంట్రిన్సిక్(Intrinsic)తో ఉమ్మడి వెంచర్ను ప్రకటించింది.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం -
మెటాకు బైబై చెప్పిన ఏఐ గాడ్ ఫాదర్
ఆధునిక కృత్రిమ మేధ(AI) గాడ్ ఫాదర్ల్లో ఒకరిగా పరిగణించబడే ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్ యాన్ లెకున్ మెటా (Meta) నుంచి తప్పుకుంటున్నట్లు ధ్రువీకరించారు. తన సొంత ఏఐ స్టార్టప్ను ప్రారంభించేందుకు 12 ఏళ్ల అనుబంధం తర్వాత లెకున్ మెటాకు వీడ్కోలు పలుకుతున్నారు. 65 ఏళ్ల లెకున్ తన లింక్డ్ఇన్ పోస్ట్లో ఈ విషయాన్ని వెల్లడించారు.‘మీలో చాలా మంది ఇటీవలి మీడియా కథనాల్లో విన్నట్లుగా నేను 12 సంవత్సరాల తర్వాత మెటాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. FAIR (ఫేస్బుక్ AI రీసెర్చ్) వ్యవస్థాపక డైరెక్టర్గా 5 సంవత్సరాలు, చీఫ్ AI సైంటిస్ట్గా 7 సంవత్సరాలు అందులో పని చేశాను’ అని ప్రకటించారు. లెకున్ 2013లో మెటాలో (అప్పటి ఫేస్బుక్) వ్యవస్థాపక డైరెక్టర్గా చేరారు.లెకున్ నిష్క్రమణ గురించి చాలా కాలంగా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. కంపెనీలో ఇటీవలి అంతర్గత మార్పులు AI భవిష్యత్తుపై లెకున్ దృష్టికి మధ్య తేడాలున్నట్లు కొందరు చెబుతున్నారు. ఏఐ ఉత్పత్తులు, వాణిజ్య ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టడానికి మెటా ఇటీవల తన ఏఐ బృందాలను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా అలెగ్జాండర్ వాంగ్ నేతృత్వంలో సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగం సృష్టించారు. ఈ మార్పు కారణంగా గతంలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్కు రిపోర్ట్ చేసిన లెకున్, ఇప్పుడు 28 ఏళ్ల వాంగ్కు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది.సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ద్వారా ఒకప్పుడు మెటాలో ప్రధాన ఏఐ శాస్త్రవేత్తగా లెకున్ అనుభవించిన స్వాతంత్య్రం తగ్గిపోయిందనే వాదనలున్నాయి. అక్టోబర్లో మెటా 600 మంది ఉద్యోగులను తొలగించినప్పుడు ప్రభావితమైన వారిలో చాలా మంది లెకున్ ఏర్పాటు చేసిన ఫేస్బుక్ ఏఐ రీసెర్చ్(FAIR) నుంచే ఉన్నారు. ప్రస్తుతం లెకున్ అడ్వాన్స్డ్ మెషిన్ ఇంటెలిజెన్స్ (AMI) స్టార్టప్పై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం -
జియో కొత్త ఆఫర్.. 18 నెలలు ఉచితం!
ప్రముఖ టెలికాం సంస్థ జియో ఇప్పుడు తన అపరిమిత 5జీ వినియోగదారులందరికీ జెమిని ప్రో ప్లాన్ ను ఉచితంగా అందిస్తోంది. ఇంకా ఈ ప్లాన్ లో కొత్త జెమిని 3 మోడల్ కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. గూగుల్ ఇటీవలే తన సరికొత్త, అత్యంత సమర్థవంతమైన ఏఐ మోడల్.. జెమిని 3ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మునుపటి జెమిని కంటే మెరుగ్గా ఉందని, ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ-5.1ను అధిగమిస్తుందని గూగుల్ పేర్కొంది.రూ.35,100 విలువైన జెమినీ ప్రో ప్లాన్ ను జియో యూజర్లు ఉచితంగా పొందవచ్చు. గతంలో గూగుల్ జెమిని 2.5 ప్రో, తాజా నానో బనానా, వియో 3.1 మోడళ్లతో ఫొటోలు, వీడియోలను సృష్టించడంలో పరిమితులు ఉండేవి. అయితే, ఈ ప్లాన్ లో కొత్త జెమిని 3కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. దీన్ని ఎలా పొందాలో చూద్దామా..?18 నెలలపాటు ఉచితంజియో అన్ లిమిటెడ్ 5G వినియోగదారులందరూ జెమిని ప్రో ప్లాన్ ను 18 నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జెమిని ప్రో ప్లాన్కు సాధారణంగా రూ .35,100 ఖర్చు అవుతుంది. అంటే వినియోగదారులు ప్లాన్ లో చేర్చిన అన్ని ప్రయోజనాలను ఉచితంగా యాక్సెస్ చేయగలుగుతారు.ఈ జియో అప్ గ్రేడ్ ఆఫర్ నవంబర్ 19 నుంచి అమల్లోకి వస్తుంది. గతంలో ఈ ఆఫర్ యువ కస్టమర్లకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ జియో దీన్ని ఇప్పుడు అపరిమిత 5G వినియోగదారులందరికీ విస్తరించింది.ఆఫర్ ఎలా పొందాలంటే.. ఈ ఆఫర్ ను పొందడానికి ఫోన్ లో మైజియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 5జీ అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ ఉన్న జియో నంబర్ తో లాగిన్ అవ్వాలి. అప్పుడు యాప్లో జెమిని ప్రో ప్లాన్ ఆఫర్కు సంబంధించిన బ్యానర్ కనిపిస్తుంది. అక్కడ క్లెయిమ్ నౌ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆఫర్ ను పొందవచ్చు. -
బంగారం ధరలు.. అది ‘నకిలీ అంచనా’: కియోసాకి
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దాని దుర్వినియోగం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఏఐ టెక్నాలజీతో పెరుగుతున్న డీప్ ఫేక్ వీడియోల ప్రభావం ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకిని కూడా తాకింది.డిసెంబరులో బంగారం ధరలు 50 శాతం తగ్గుతాయని తానుచెప్పినట్లుగా ఏఐతో డీప్ ఫేక్ చేసి రూపొందించిన వీడియో ఒకటి యూట్యూబ్ వీడియో ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోందని రాబర్ట్ కియోసాకి తన ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. అది ఏఐతో సృష్టించిన డీప్ ఫేక్ వీడియో అని, తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఓ పోస్ట్ చేశారు. ‘ఫెడ్ (ఫెడరల్ రిజర్వ్) నకిలీ డబ్బును తయారు చేస్తున్నట్లుగానే ఏఐ నకిలీ మనుషులను సృష్టిస్తోంది’ అన్నారు.‘నకిలీ రాబర్ట్ కియోసాకిని సృష్టించి నకిలీ ఆర్థిక అంచనాలను చెప్పిస్తున్నారు. ఇందుకోసం కొంతమంది ఎందుకు తమ సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నారు?.. ఇదంతా నాకు, మీకు, అందరికీ చికాకు పుట్టిస్తోంది’ అని రాసుకొచ్చారు.తనపై ఇలా డీక్ ఫేక్ చేసి అబద్దాలు సృష్టంచడానికి బదులు 'రాబర్ట్ కియోసాకి భారీ యూనిట్ తో పోర్న్ స్టార్ గా ఉండేవాడు' అని ఎందుకు చెప్పకూడదు? నేను దానిని ఇష్టపడతాను" అని చమత్కరించారు. తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను కియోసాకి మరోసారి హెచ్చరించారు.PLEASE BE AWAREAI creates FAKE PEOPLE…just as the FED creates FAKE MONEY.Just saw a YOU TUBE video with me saying gold will drop by 50% in December.I did not say that.Why would some PERVERT waste so much time and effort creating a FAKE ROBERT KYOSAKI making a FAKE…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 19, 2025 -
చాట్జీపీటీ డౌన్ అయితే పరిస్థితేంటి?
ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల్లో కీలక పాత్ర పోషించే క్లౌడ్ఫ్లేర్ (Cloudflare)లో ఇటీవల తలెత్తిన సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వెబ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విస్తృతంగా అంతర్గత సర్వర్ లోపాలు (Internal Server Errors) ఏర్పడటానికి ఇది దారితీసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన ప్లాట్ఫామ్ల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. యూఎస్, యూరప్, ఆసియాలో ఈ అంతరాయం ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ అంతరాయం కారణంగా X (గతంలో ట్విట్టర్), స్పాటిఫై.. వంటి కీలక సేవలతో పాటు OpenAI ChatGPT సేవలు కూడా కొద్ది సమయం నిలిచిపోయాయి.క్లౌడ్ఫ్లేర్ సమస్య కారణంగా ChatGPTని సందర్శించిన వినియోగదారులకు ‘దయచేసి ముందుకు సాగడానికి challenges.cloudflare.com అన్బ్లాక్ చేయండి’ అనే సందేశం దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో జనరేటివ్ ఏఐలో కీలకంగా వ్యవహరిస్తున్న చాట్జీపీటీ(క్లాడ్ఫ్లెయిర్ ఇన్ఫ్రా వాడుతుంది) సర్వీసులు మధ్యంతరంగా నిలిచిపోతే పనులు సజావుగా సాగేందుకు ప్రత్యామ్నాయాలు చూద్దాం.గూగుల్ జెమినిగూగుల్ జెమిని అధునాతన మోడల్స్తో రూపొందించారు. గూగుల్ సెర్చ్కు రియల్ టైమ్ కనెక్షన్ కలిగి ఉంది. దీని కారణంగా ఇది ఎల్లప్పుడూ అప్డేటెడ్, రియల్టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది జీమెయిల్, డాక్స్, డ్రైవ్ వంటి గూగుల్ ఎకోసిస్టమ్తో అనుసంధానం కలిగి ఉంటుంది.ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐక్లాడ్ ఏఐ సెక్యూరిటీ, కచ్చితత్వం, నైతిక ఏఐ మోడల్స్పై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఇది long context documents నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది.మైక్రోసాఫ్ట్ కోపైలట్మైక్రోసాఫ్ట్ కోపైలట్ అంతర్లీనంగా చాట్జీపీటీలాగే అదే జనరేటివ్ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఇది మైక్రోసాఫ్ట్ 365 ఎకోసిస్టమ్లో(Word, Excel, PowerPoint, Outlook) ఇంటర్నల్గా ఉండే ఏఐ అసిస్టెంట్. మైక్రోసాఫ్ట్ వర్క్ఫ్లోలో ఉన్నవారు కార్పొరేట్ పత్రాలను రూపొందించడానికి, డేటాను విశ్లేషించడానికి ఇది అనువైనది.జాస్పర్ ఏఐజాస్పర్ ఏఐ ప్రొఫెషనల్ కంటెంట్ రూపొందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది బ్లాగ్లు, కథనాలు, సోషల్ మీడియా పోస్ట్లు, మార్కెటింగ్ కాపీలు అందిస్తుంది. మార్కెటర్లు, బ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఇది తోడ్పడుతుంది.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష! -
ఏఐ చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మొద్దు
లండన్: ప్రపంచమంతా కృత్రిమమేధ మంత్రం జపిస్తున్న వేళ జనాలను జాగృతంచేస్తూ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ హితబోధ చేశారు. అపార డేటాను విశ్లేషించి సమాధానం ఇచ్చినంతమాత్రాన కృత్రిమమేధ చెప్పే ప్రతి అంశాన్ని గుడ్డిగా నమ్మొద్దని సుందర్ హెచ్చరించారు. బ్రిటన్కు చెందిన బీబీసీ వార్తసంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘కృత్రిమమేధ వ్యవస్థలు సైతం తప్పులు చేస్తాయి. తప్పుడు సమాధానాలు అందించే ఆస్కారముంది. అందుకే వినియోగదారులు పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా ఇతరత్రా ప్రత్యామ్నాయాల్లోనూ సమాచా రాన్ని వెతకాలి. సమాచారాన్ని పోల్చిచూసుకోవాలి. మా కచ్చితత్వంపై నమ్మకంతో వినియోగదారులు గూగుల్ సెర్చ్ను ఆశ్రయిస్తున్నారు.అయితే దీంతోపాటు గూగుల్ మరెన్నో ఉత్పత్తులను అందిస్తోంది. అయితే మీరేదైనా సృజనాత్మకంగా రచించాలనుకుంటే అందుకోసం ఇతరత్రా టూల్స్ కూడా ఉన్నాయి. కేవలం ఒక్క ఏఐ మీదనే గుడ్డిగా ఆధారపడొద్దు’’ అని అన్నారు. మే నెలలో గూగుల్ ఏఐ మోడ్లో సొంతంగా జెమిని చాట్బాట్ను తీసుకొచ్చింది. ‘‘వీలైనంత వరకు అత్యంత కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ మేరకే జెమిని చాట్బాట్ను సృష్టించాం. అయినాసరే ఇందులోనూ తప్పులు దొర్లేవీలుంది. అందుకే కేవలం ఒక్క ఏఐ సాంకేతికతనే గుడ్డిగా అనుసరించడం తగదు’’ అని అన్నారు.ఏఐ రంగంలోని పెట్టుబడుల వరదపారుతోంది. ఇది కొంతకాలంలో స్తబ్దుగా మారి ఏఐ బుడగ పేలుతుందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘ ఏఐ రంగంలో పెట్టుబడులపై ప్రతి కంపెనీ అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే మార్పు అనేది సహజం. ఒకవేళ ఏఐ బబుల్ అనేది పేలితే దాని ప్రభావం ప్రతి కంపెనీపై ఉంటుంది. ఇందులో గూగుల్కు ఎలాంటి మినహాయింపు లేదు’’ అని సుందర్ పిచాయ్ అన్నారు. -
జీసీసీల్లో కొలువులు @ 34.6 లక్షలు!
ముంబై: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమలో ఉద్యోగాలు కూడా భారీగా పెరగనున్నాయి. దీంతో సిబ్బంది సంఖ్య 2026 నాటికి 11 శాతం వృద్ధి చెంది 24 లక్షలకు, ఆ తర్వాత 2030 నాటికి 34.6 లక్షలకు చేరనుంది. ప్రస్తుత స్థాయితో పోలిస్తే అప్పటికి 13 లక్షల కొలువులు కొత్తగా జతకానున్నాయని అంతర్జాతీయ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ ఎన్ఎల్బీ సర్విసెస్ ఒక నివేదికలో తెలిపింది. ‘జీసీసీ 4.0 ప్రస్థానంలో భారత్ కీలక దశలో ఉంది.నేడు జీసీసీలు కేవలం కృత్రిమ మేధ (ఏఐ)ని వినియోగించుకోవడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. దాన్ని వినియోగంలోకి తెచ్చే దిశగా ముందుకు వెళ్తున్నాయి. సాధారణంగా ఈ పరిశ్రమలో ఏఐ జోరు ఊహించినదే అయినప్పటికీ ఈ సంవత్సరం ఇది కాస్త వేగవంతమైంది‘ అని సంస్థ సీఈవో సచిన్ అలగ్ తెలిపారు. దీనితో నిపుణుల నియామకాలు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశీయంగా ఆరు నగరాల్లో 10 రంగాల నుంచి 321 జీసీసీ దిగ్గజాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎన్ఎల్బీ సర్వీసెస్ ఈ నివేదిక రూపొందించింది. 2025 జూలై–అక్టోబర్ మధ్య ఈ సర్వే నిర్వహించారు. రిపోర్ట్లో మరిన్ని విశేషాలు.. ⇒ ఏఐ వినియోగం పెరిగే కొద్దీ జీసీసీల్లో కొత్త రకం కొలువులు వస్తున్నాయి. సైబర్సెక్యూరిటీ, ఏఐ గవర్నెన్స్ ఆర్కిటెక్ట్స్ (29 శాతం), ప్రాంప్ట్ ఇంజినీర్స్ (26 శాతం), జెన్ఏఐ ప్రోడక్ట్ ఓనర్స్ (22 శాతం), ఏఐ పాలసీ అండ్ రిస్క్ స్ట్రాటెజిస్ట్స్ (21 శాతం)కి డిమాండ్ నెలకొంది. ⇒ అదే సమయంలో ఎల్1 ఐటీ సపోర్ట్ (75 శాతం), లెగసీ అప్లికేషన్ డెవలప్మెంట్ (74 శాతం), మాన్యువల్ క్యూఏ (72 శాతం), ఆన్–ప్రెమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ (67 శాతం) విభాగాల్లో ఉద్యోగాలను జీసీసీలు దశలవారీగా తొలగిస్తుండటం గమనార్హం. ⇒ భౌగోళికంగా జీసీసీలు మెట్రో నగరాల నుంచి క్రమంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు మళ్లుతున్నాయి. చిన్న పట్టణాల్లో అట్రిషన్ (ఉద్యోగుల వలస) రేటు తక్కువగా 10–12 శాతం స్థాయిలో ఉండటం, ఆఫీస్ వ్యయాలు 30–50 శాతం తక్కువగా ఉండటం, ఉద్యోగులపై వ్యయాలు 20–35 శాతం మేర తక్కువగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణం. ⇒ 2030 నాటికి జీసీసీల్లో 39 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి పని చేసే అవకాశం ఉంది. మరోపక్క ప్రథమ శ్రేణి నగరాలు లీడర్íÙప్, గవర్నెన్స్, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలకు కేంద్రాలుగా కొనసాగనున్నప్పటికీ, కోయంబత్తూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్ లాంటి ద్వితీయ, తృతీయ శ్రేణి హబ్లు చాలా వేగంగా స్పెషలైజ్డ్ డెలివరీ సెంటర్లుగా ఎదుగుతున్నాయి. -
ఇంటికీ కావాలి ఆపరేటింగ్ ఆపీసర్..
కెరియర్లో బిజీగా ఉన్న వృత్తి నిపుణులకు ఇంటి నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో సమర్థవంతమైన ఇంటి నిర్వహణ కోసం కొత్తగా ‘హోం మేనేజర్లు’ (Home Managers) రంగంలోకి దిగుతున్నారు. ఇది కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా ఆధునిక పని సంస్కృతి (Work Culture) అవసరాలకు అనుగుణంగా మారుతున్న ముఖ్యమైన ఉద్యోగంగా అవతరిస్తుంది.డిమాండ్ పెరగడానికి కారణాలు..నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది వృత్తి నిపుణులు తమ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. గంటల తరబడి పనిచేయడం, కార్పొరేట్ సంస్థల ఒత్తిడి కారణంగా ఇంటిని నిర్వహించడానికి సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ కారణాల వల్లే తమ ఇంటి బాధ్యతలను నిర్వహించడానికి, సమయాన్ని ఆదా చేసుకోవడానికి ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడానికి వెనుకాడడం లేదు.ఇటీవల గ్రేల్యాబ్స్ ఏఐ స్టార్టప్ సహ-వ్యవస్థాపకుడు, ఐఐటీ గ్రాడ్యుయేట్ అమన్ గోయెల్, ఆయన భార్య హర్షితా శ్రీవాస్తవ నెలకు రూ.1 లక్ష వేతనంతో హోం మేనేజర్ను నియమించుకున్నట్లు చెప్పారు. పెరుగుతున్న స్టార్టప్ డిమాండ్ల మధ్య తమ వ్యక్తిగత జీవితాన్ని, ఇంటి నిర్వహణను సమతుల్యం చేసుకోవడం కష్టమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ ఇంటి బాధ్యతలను నిర్వహించడానికి ఒక ప్రొఫెషనల్ను నియమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.గోయెల్ తన ఎక్స్ పోస్ట్లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ‘నేను ఒక హోమ్ మేనేజర్ను నియమించాను. ఆమె ఫుడ్ ప్లానింగ్, వార్డ్రోబ్లు, మరమ్మతులు, నిర్వహణ, కిరాణా సామాగ్రి, లాండ్రీ వంటి ప్రతి విషయాన్ని చూసుకుంటారు. ప్రాథమికంగా ఆమె ఇంటి సహాయకులు. మాకు విలువైన సమయాన్ని ఆదా చేస్తారు’ అని పేర్కొన్నారు.హోం మేనేజర్లు ఏం చేస్తారు?హోం మేనేజర్లు ఇంట్లో అన్ని పనులను నిర్వహిస్తారు.భోజన ప్రణాళిక, కిరాణా సామాగ్రి జాబితా తయారు చేయడం, వాటిని కొనుగోలు చేయించడం.ఇంటి మరమ్మతులు, నిర్వహణ పనులు, వస్తువుల రిపేర్లు, అపాయింట్మెంట్లను సమన్వయం చేయడం.వంట మనిషి, క్లీనింగ్ స్టాఫ్, గార్డెనర్ వంటి ఇంటి సహాయకులందరి పనులను పర్యవేక్షించడం, వారికి ఆదేశాలివ్వడం.వార్డ్రోబ్ నిర్వహణ, లాండ్రీ పర్యవేక్షణ, బిల్లుల చెల్లింపులు వంటి వ్యక్తిగత పనులను చూసుకోవడం.సంక్షిప్తంగా హోం మేనేజర్ అనే వ్యక్తి ఇంటి వ్యవహారాలన్నింటికీ ఒక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్లా పనిచేస్తారు.ఎంతో మేలు..వృత్తి నిపుణులు తమ పనిపై దృష్టి పెట్టడానికి, వారి వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి ఈ మేనేజర్లు తమ సమయాన్ని ఆదా చేస్తారు. దీనివల్ల పనిలో ఉత్పాదకత పెరుగుతుంది. ఇంటి పనులు, నిర్వహణ గురించి నిరంతరంగా ఆలోచించాల్సిన మానసిక భారం తగ్గుతుంది. ఇది మొత్తం కుటుంబానికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పనులన్నీ ఇతరులు చూసుకోవడం వల్ల ఆదా అయిన సమయాన్ని కుటుంబ సభ్యులు తమ భాగస్వామి/ పిల్లలతో గడపడానికి లేదా వ్యక్తిగత అభిరుచుల కోసం కేటాయించడానికి వీలవుతుంది.ఇదీ చదవండి: గిఫ్ట్ సిటీకి ఎందుకంత క్రేజ్.. -
ఏఐ రేసులోకి జెఫ్ బెజోస్ ఎంట్రీ
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకెక్కారు. తాను టెక్ పరిశ్రమలో కీలకంగా మారిన కృత్రిమ మేధ(AI) రేసులోకి అడుగుపెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ ప్రోమిథియస్’ అనే కొత్త ఏఐ స్టార్టప్కు మద్దతు ఇవ్వడంతోపాటు బెజోస్ దాని కో-సీఈఓగా ఎగ్జిక్యూటివ్ హోదాలో పని చేయనున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. 2021లో అమెజాన్ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన తర్వాత బెజోస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ హోదాను చేపట్టడం ఇదే తొలిసారి.భారీ నిధులుప్రాజెక్ట్ ప్రోమిథియస్ ఇప్పటికే 6.2 బిలియన్ డాలర్ల భారీ నిధులను సేకరించింది. ఇందులో కొంత భాగం బెజోస్ సమకూర్చారు. ఇప్పటికే ఈ స్టార్టప్ సీఈఓలుగా వెరిలీ, ఫోర్ సైట్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు విక్ బజాజ్లున్నారు. ఈ కంపెనీ కంప్యూటర్లు, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్ వంటి కీలక రంగాలలో ఇంజినీరింగ్, తయారీ కోసం ప్రత్యేకమైన ఏఐ ఉత్పత్తులను రూపొందించనుంది. ఈ సంస్థలో ఇప్పటికే మెటా, ఓపెన్ఏఐ, గూగుల్ డీప్మైండ్ వంటి కంపెనీల నుంచి వచ్చిన 100 మందికి పైగా ఏఐ పరిశోధకులు పనిచేస్తున్నారు.Haha no way 😂Copy 🐈 https://t.co/TG8UMrWwQr— Elon Musk (@elonmusk) November 17, 2025ఎలాన్ మస్క్ స్పందనఈ వార్తలపై టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. బెజోస్ ఎంట్రీ గురించి తెలుసుకున్న మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో.. ‘హాహా నో వే.. కాపీక్యాట్’ అని తెలిపారు. మస్క్ బెజోస్ను కాపీక్యాట్ అని పిలవడం ఇది మూడోసారి. ఇంతకు ముందు మస్క్ స్పేస్ఎక్స్కు పోటీగా ఇంటర్నెట్ బీమింగ్ ఉపగ్రహాలను ప్రయోగించే ప్రణాళికలను అమెజాన్ ప్రకటించినప్పుడు ఒకసారి అన్నారు. మరోసారి టెస్లాకు పోటీగా అమెజాన్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కంపెనీ జూక్స్ను కొనుగోలు చేసినప్పుడు మస్క్ ఇలాగే స్పందించారు.ఇదీ చదవండి: గిఫ్ట్ సిటీకి ఎందుకంత క్రేజ్.. -
కర్ణాటక ప్రభుత్వ ఆవిష్కరణ!
డిజిటల్ యుగంలో కర్ణాటక ప్రభుత్వం భారీ ఆవిష్కరణ చేసింది. అత్యంత చౌకైన ఏఐ పర్సనల్ కంప్యూటర్ను అభివృద్ధి చేసింది. KEO (Knowledge-driven, Economical, Open-source) పేరుతో తయారైన ఈ కంప్యూటర్ డిజిటల్ అంతరాలను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. త్వరలో జరగబోయే టెక్ సదస్సులో ఈ అత్యంత చౌక ఏఐ పీసీని ఆవిష్కరించనున్నట్లు కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి...దేశం ఐటీ రంగంలో దూసుకెళుతున్నప్పటికీ సమాజంలోని అన్ని వర్గాల వారికీ అందుబాటులో లేదు. పర్సనల్ కంప్యూటర్లనే ఉదాహరణగా తీసుకుంటే దేశం మొత్తమ్మీద పీసీలున్న కుటుంబాలు పది-15 శాతానికి మించవని ఇటీవలి జాతీయ కుటుంబ సర్వే చెబుతోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒకరికి పీసీ ఉంటే.. పల్లెల్లో ఇది ఐదు నుంచి ఏడు శాతం మించడం లేదు. స్మార్ట్ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. ఫలితంగా ఉద్యోగాలతోపాటు అన్ని రంగాల్లోనూ గ్రామీణులు నగర వాసులతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడుతుంది. నగరాల్లోని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, విషయ పరిజ్ఞానాన్ని పెంచే ఇతర డిజిటల్ టూల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వీటన్నింటినీ అందించే పీసీలు కొనలేక గ్రామీణ విద్యార్థులు వెనుకబడి పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం అభివృద్ధి చేసిన KEO ఏఐ పర్సనల్ కంప్యూటర్కు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఈ పీసీలో కృత్రిమ మేథ కోసం ప్రత్యేక కోర్ ఉండటం గమనార్హం. RISC-V ప్రాసెసర్, BUDDH అనే ఆన్-డివైస్ AI ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది.అత్యంత చౌకైన పీసీగా రూపొందుతున్న దీంట్లో 4జీ కనెక్టివిటీతోపాటు ఈథర్నెట్ కూడా ఉంటుంది. యూఎస్బీ ఏ, యూఎస్బీ-సీ, హెచ్డీఎంఐ పోర్టులు, ఆడియో జాక్లు ఉంటాయి. అంతేకాకుండా.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్తోపాటు వర్డ్, ఎక్సెల్ వంటి ప్రొడెక్టివిటీ టూల్స్ను కూడా ముందుగానే ఏర్పాటు చేసి ఉంచారు. ఏఐ ఇంజిన్ బుధ్ను కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన ఆఫ్లైన్ సిలబస్తో అనుసంధానమై ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 15 శాతం లోపు ఇళ్లలో మాత్రమే కంప్యూటర్లు ఉన్నాయని, దాదాపు 60 శాతం విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు, ఇతరత్ర ప్రాజెక్టుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కర్ణాటక ప్రభుత్వ అధికారులు తెలిపారు. దాదాపు 45శాతం పాఠశాలలలో అసలు కంప్యూటర్లే లేవని దీంతో విద్యార్థులు డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తక్కువ ఖర్చులో కంప్యూటర్ను అందించడానికి KEONICS సాయం తీసుకున్నట్లు వివరించారు.ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు. -
కాలిఫోర్నియాలో హెచ్సీఎల్ ఏఐ ఇన్నోవేషన్ ల్యాబ్
ప్రముఖ టెక్ కంపెనీ.. హెచ్సీఎల్ టెక్ (HCLTech).. ఎన్వీడియా సహకారంతో కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రారంభించింది. ఇది ఫిజికల్ ఏఐ, కాగ్నిటివ్ రోబోటిక్స్కు సంబంధించిన అనువర్తనాలను అన్వేషించడానికి సహాయపడుతుంది.హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ ఏఐ ల్యాబ్ నెట్వర్క్తో అనుసంధానించబడిన ఈ ప్రత్యేక సౌకర్యం.. అనేక ఎన్వీడియా ప్లాట్ఫామ్లను మిళితం చేస్తుంది. ఇందులో ఎన్వీడియా హోలోస్కాన్, ఎన్వీడియా మెట్రోపాలిష్, ఎన్వీడియా జెట్సన్ వంటివాటితో పాటు.. విజన్ ఎక్స్, కైనెటిక్ ఏఐ, స్మాక్ ట్విన్ కూడా ఉన్నాయి. వాస్తవ ప్రపంచంలో ఉత్పాదకత, స్థితిస్థాపకత, స్థిరత్వాన్ని పెంచడానికి సంస్థలకు సహాయపడటానికి ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయపడుతుంది.జనరేటివ్ ఫిజికల్ ఏఐ పారిశ్రామిక ఆటోమేషన్ను విప్లవాత్మకంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. కానీ డిజిటల్ సిమ్యులేషన్ నుంచి వాస్తవ-ప్రపంచ విస్తరణకు అంతరాన్ని తగ్గించడం ఒక క్లిష్టమైన సవాలుగా మిగిలిపోయింది. అయితే కొత్త ఇన్నోవేషన్ ల్యాబ్.. కార్యాచరణ వాస్తవికతగా మార్చడానికి అవసరమైన సంక్లిష్ట స్వయంప్రతిపత్తి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని ఎన్వీడియా రోబోటిక్స్ అండ్ ఎడ్జ్ ఏఐ వీపీ దీపు తల్లా అన్నారు -
కోటి రూపాయలు జీతం ఇస్తామన్నా చేసేవారు లేరు..
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలను కబళిస్తుందనే భయాలు పెరుగుతున్న తరుణంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగులు పోతాయని భయపడుతున్న వైట్కాలర్ ఉద్యోగాలతో పోలిస్తే నైపుణ్యం కలిగిన ట్రేడ్ల్లో(Skilled Trades) పని చేస్తున్న వారిపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ఆనంద్ మహీంద్రా అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఆయన ఎక్స్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.ఏఐ వల్ల వైట్కాలర్ (సాఫ్ట్వేర్, డేటా ఎంట్రీ వంటి డెస్క్ ఉద్యోగాలు) ఉద్యోగులకు భారీగా లేఆఫ్స్ ఉంటాయని భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ కొన్ని అంశాలను పంచుకున్నారు. ‘దశాబ్దాలుగా మనం డెస్క్ ఉద్యోగాలను ఉన్నత స్థానాల్లో ఉంచాం. అదే సమయంలో నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలను ఎక్కువగా ఎదగనివ్వలేదు. అయితే ఏఐకి భర్తీ చేయడం సాధ్యం కాని ఉద్యోగాలు ఇవే అని గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యోగాలకు నైపుణ్యం చాలా అవసరం. రియల్టైమ్ అనుభవం ముఖ్యం. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్లు, ట్రక్కు డ్రైవర్లు వంటి నైపుణ్యం గల కార్మికులను ఏఐ భర్తీ చేయలేదు’ అని చెప్పారు.అమెరికాలో ఉద్యోగాల కొరతమహీంద్రా హెచ్చరికలకు బలం చేకూర్చేలా ఫోర్డ్ మోటార్ కంపెనీ సీఈఓ జిమ్ ఫార్లే కూడా ఇదే తరహా ప్రతిభ కొరతను ఎత్తి చూపారు. ఓ పాడ్కాస్ట్లో ఫార్లే మాట్లాడుతూ.. ఫోర్డ్లో ప్రస్తుతం 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంవత్సరానికి 1,20,000 డాలర్లు (సుమారు కోటి రూపాయలు) వరకు చెల్లిస్తున్నప్పటికీ, వాటిని భర్తీ చేయడానికి సరైన అభ్యర్థులు లభించడం లేదని ఆయన తెలిపారు.We’re so busy fearing AI will wipe out white-collar jobs that we’re missing a far bigger crisis: the scarcity of skilled trades.Ford CEO @jimfarley98 made a startling revelation in a recent podcast: Ford has 5,000 mechanic jobs unfilled, many paying $120,000 a year, and still…— anand mahindra (@anandmahindra) November 17, 2025భారీ ఆర్థిక నష్టంఈ సంక్షోభం ఫోర్డ్కు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా అంతటా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ట్రక్కు డ్రైవింగ్, ఫ్యాక్టరీ ఆపరేషన్లతో సహా కీలకమైన రంగాలలో 10 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డెలాయిట్, ది మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనం ప్రకారం 2030 నాటికి యూఎస్లో తయారీ రంగంలోనే 21 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి. దీని కారణంగా కలిగే మొత్తం ఆర్థిక నష్టం అప్పటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా.ఇదీ చదవండి: ఉదయం 5 గంటలకు ఈమెయిల్.. -
ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్..
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరుగుతోంది. దాంతో కంపెనీలు వినియోగదారులను పెంచుకునేందుకు విభిన్న విభాగాల్లో ఏఐ టూల్స్ను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటికే చాలా టూల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే నిపుణులు, విద్యార్థులు, వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటున్న కొన్ని ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ టూల్స్లోని కొన్ని సదుపాయాలు ఉచితంగా లభిస్తుంటే మరిన్ని ఫీచర్ల కోసం ఆయా సంస్థల నిబంధనల ప్రకారం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని గమనించాలి.కర్సర్ ఏఐకర్సర్ ఏఐ విజువల్ స్టూడియో కోడ్ (VS Code) ఆధారంగా పనిచేసే ఏఐ పవర్డ్ కోడ్ ఎడిటర్.కోడ్ రాయడం, డీబగ్గింగ్, రీఫాక్టరింగ్, నేచురల్ ల్యాంగ్వేజీ ఇన్పుట్స్ నుంచి కోడ్ రూపొందించడంలో సహాయపడుతుంది.ప్రత్యేకంగా డెవలపర్లకు కోపైలట్ అసిస్టెంట్గా పని చేస్తుంది.ఉచిత ప్లాన్తో ప్రారంభించి అవసరాలకు తగ్గట్టు అప్గ్రేడ్ చేయవచ్చు.మిడ్ జర్నీ (Midjourney)నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాంప్ట్లతో ఈ ఏఐ టూల్ను ఉపయోగించవచ్చు.డిఫ్యూజన్ మోడల్ ఆధారంగా పనిచేసే ఈ టూల్ సృజనాత్మక ఆర్ట్, విజువల్స్, కాన్సెప్ట్ ఆర్ట్కి అనువైంది.డిస్క్రిప్ట్ఏఐ ఆధారిత ఆడియో, వీడియో ఎడిటింగ్ టూల్.టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఆధారంగా మీడియా ఎడిటింగ్ చేయగలదు. ఇది వీడియో, పోడ్కాస్ట్ సృష్టికర్తల కోసం ఎంతో ఉపయోగపడుతుంది.ఏఐ కో-ఎడిటర్ ఆడియో నాణ్యత పెంచుతుంది. బ్యాక్గ్రౌండ్ శబ్దాన్ని తొలగిస్తుంది.క్లాడ్ ఏఐ (Anthropic)రైటింగ్, కోడింగ్, టెక్ట్స్ సమ్మరైజింగ్, డేటా విశ్లేషణలో సహాయం చేస్తుంది.వెబ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్లో అందుబాటులో ఉంటుంది.రన్ వే ఎంఎల్వీడియో, ఫిల్మ్ ఎడిటింగ్ కోసం ఏఐ ప్లాట్ఫామ్.ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో సాధ్యం అవుతుంది.పర్ప్లెక్సిటీ ఏఐఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్.వాయిస్ సెర్చ్, టాపిక్ డిస్కవరీ, ప్రాజెక్ట్ నిర్వహణకు సాయం చేస్తుంది.ఫ్లికి ఏఐటెక్స్ట్ వాయిస్ఓవర్ వీడియో ప్లాట్ఫామ్.మార్కెటింగ్, ఇన్స్టిట్యూషనల్ వీడియోల కోసం ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు -
ఉద్యోగ సంక్షోభానికి ఏఐ ముప్పు
సమీప భవిష్యత్తులో భారతదేశంలో తీవ్ర ఉద్యోగ సంక్షోభం ఎదురవుతుందని మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. ఈ సంక్షోభానికి ఆర్థిక మాంద్యం కాకుండా, ఏఐ, ఆటోమేషన్ కారణం అవుతుందని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడంలో విధాన నిర్ణేతలు వేగంగా చర్యలు తీసుకోకపోతే దీని పరిణామాలు వినాశకరంగా ఉంటాయని స్పష్టం చేశారు.ఇటీవల ఓ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ ముఖర్జియా భారతదేశంలోని వైట్ కాలర్ ఉద్యోగ మార్కెట్లో భారీగా నియామకాలు తగ్గినట్లు చెప్పారు. ఐటీ, బ్యాంకింగ్, మీడియా వంటి రంగాల్లో ఉన్న ప్రామాణిక కోర్ ఉద్యోగాలు గిగ్ జాబ్స్ ఎకోసిస్టమ్ ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు.ఈ ఉద్యోగ సంక్షోభం పూర్తి ప్రభావం రెండు నుంచి మూడు సంవత్సరాల్లో స్పష్టమవుతుందని తెలిపారు. ఆ సమయంలో భారీగా జీతం పొందే ఉద్యోగాలు కనుమరుగవుతాయని ముఖర్జియా అంచనా వేశారు. ఇండియా భారీ గిగ్ ఎకానమీగా మారుతుందని చెప్పారు. ‘ఈ మార్పులు ఆర్థిక మందగమనం వల్ల జరిగేవి కావు. కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి, ఉన్న కొద్ది మంది ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడానికి ఏఐని వాడనున్నారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఏఐతో భర్తీ చేస్తాయి. ఇందులో బ్యాంకులు, మీడియా హౌస్లు, ఐటీ సంస్థలు ఉండొచ్చు. ప్రకటనల రంగంలో కూడా ఈ మార్పు కనిపిస్తోంది. ప్రకటనలోని మోడల్ కూడా ఏఐనే ఉంటుంది’ అన్నారు.గృహ రుణ భారం, ట్రంప్ నిర్ణయాలు‘ఉద్యోగ మార్కెట్పై ఒత్తిడికి తోడు పెరుగుతున్న గృహ రుణ భారం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. భారతీయ గృహ రుణాల భారం మొత్తం ఆదాయంలో 33-34%గా ఉంది’ అన్నారు. అంతేకాకుండా, యూఎస్తో వాణిజ్య ఉద్రిక్తతలపై కూడా ముఖర్జియా హెచ్చరించారు. అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన సుంకాలను వెనక్కి తీసుకోకపోతే క్రిస్మస్ నాటికి 20 మిలియన్ల(2 కోట్లు) మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరానికి రూ.2-5 లక్షలు సంపాదించే వ్యక్తులు తమ ఉద్యోగాలను కోల్పోవడం, దశాబ్దాలుగా ఎగుమతి ఫ్రాంచైజీలను నిర్మించిన కంపెనీలు నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పారు. భారత ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్ త్వరలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి రావాలని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు -
కొత్త జాబ్ ట్రెండ్స్.. ప్రయోగాత్మక పని విధానాలు
భారత్లో పని సంస్కృతి మార్పు క్రమంలో ఉందని, భవిష్యత్తు అంతా ప్రయోగాత్మక పని విధానాలు, పరిస్థితులకు అనుణంగా మార్పులను స్వీకరించే వారిదేనని మెజారిటీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇండీడ్ కోసం వాలువోక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేకు సంబంధించి వివరాలతో ‘వర్క్ప్లేస్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025’ విడుదలైంది.ప్రయోగాత్మక పని నమూనాలు, పరిస్థితులకు అనుగుణంగా మారే వారికే భవిష్యత్తు ఉంటుందని 58 శాతం మంది భారత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. రివర్స్ మెంటారింగ్ (సీనియర్లకు జూనియర్ల మార్గదర్శనం), మైక్రో రిటైర్మెంట్ (కెరీర్లో స్వల్ప విరామాలు), ఏఐ మూన్షైనింగ్ (జాబ్ టాస్క్ల కోసం ఏఐని గోప్యంగా వినియోగించడం), ఏఐ వాషింగ్, స్కిల్ నోమడిజమ్ (పనికి సంబంధించి కొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం) వంటి కొత్త పని ధోరణులను ప్రయోగాత్మక పని నమూనాలుగా ఈ నివేదిక అభివర్ణించింది. 2,584 మంది ఉద్యోగులు, 1,288 సంస్థల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. వృద్ధికే ప్రాధాన్యం.. వృద్ధికే మొదటి ప్రాధాన్యమని ప్రతి ఐదుగురు భారత ఉద్యోగుల్లో ఇద్దరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అదనపు నైపుణ్యాలు నేర్చుకోవడం, రోజువారీ విధులతో ఏఐని అనుసంధానించడం వంటివి అనుసరిస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించడం వరకే కాకుండా.. కొత్తగా నేర్చుకునేందుకు, తమని తాము తిరిగి ఆవిష్కరించుకునేందుకు గాను కొంత సమయం కేటాయింపు, ప్రస్తుత ఉద్యోగంలో విరామం అవసరమని ఉద్యోగులు భావిస్తున్నారు.ఎప్పుడూ పనిచేసుకుపోవడం అన్న విధానానికే పరిమితం కాకుండా.. విరామం, తిరిగి నైపుణ్యాలు ఆర్జించడం వంటి కొత్త ధోరణి ఉద్యోగుల్లో కనిపిస్తోంది. 41 శాతం మంది ఉద్యోగులు తమకంటూ బలమైన సరిహద్దులు విధించుకుని, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నట్టు చెప్పారు. నైపుణ్యాల పెంపునకు ఎక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇండీడ్ ఇండియా ఎండీ శశికుమార్ తెలిపారు. వ్యక్తిగత వృద్ధి, సంప్రదాయేతర పని ఏర్పాట్లు భవిష్యత్తు కార్పొరేట్ ఇండియా ప్రధాన లక్షణాలుగా ఉంటాయన్నారు. -
పిల్లల కోసమే ఈ కారు: డ్రైవర్ అవసరం లేదు
జపాన్ మొబిలిటీ షో 2025లో టయోటా కంపెనీ.. పిల్లల కోసం ప్రత్యేకించి మోబి బబుల్ కారును ఆవిష్కరించింది. ఇది పూర్తిగా అటానమస్ ఎలక్ట్రిక్ వెహికల్. ఈ లేటెస్ట్ వెహికల్ చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికీ.. పనితీరులో మాత్రం చాలా ఉత్తమమైనదనే చెప్పాలి.మొబిలిటీ ఫర్ ఆల్.. చొరవలో భాగంగా టయోటా కంపెనీ మోబి బబుల్ కారును తీసుకొచ్చింది. ఏఐతో పనిచేసే ఈ కారు నావిగేషన్ వంటి వాటిని సొంతంగా నిర్వహస్తుంది. అంటే దీనిని నడపడానికి ప్రత్యేకించి డ్రైవర్లు అవసరం లేదు. అంతే కాకుండా.. ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ బోలెడన్ని ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.తల్లిదండ్రులు వెంట లేకపోయినా.. పిల్లలను ఈ కారు స్కూలుకు, టూషన్లకు తీసుకెళ్తుంది. పిల్లకోసమే దీనిని డిజైన్ చేశారు, కాబట్టి ఇందులో పదేళ్ల కంటే తక్కువ వయసున్న ఎవరైనా ప్రయాణించవచ్చు. చుట్టూ ఉన్న పరిసరాలను స్పష్టంగా చూడటానికి ఇందులో అన్ని దిశల్లో కెమెరాలు, సెన్సర్లు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా కారు లోపల కూర్చున్న పిల్లలతో మాట్లాడుతూ.. వారి సందేహాలను తీర్చడానికి ఏఐ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.టయోటా కంపెనీ ఆవిష్కరించిన మోబి బబుల్ కారు టెస్టింగ్ దశలోనే ఉంది. దీనిని మరిన్ని విధాలుగా చెక్ చేసిన తరువాత మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. అయితే సంస్థ ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తుంది, దీని ధర ఎంత ఉండొచ్చు అనే వివరాలను వెల్లడించాల్సి ఉంది.Toyota reveals mobi during Japan Mobility Show 2025, an electric bubble car for kids, the prototype forms part of the company's Mobility for All project, which aims to create vehicles that can transport anyone, regardless of age or ability. pic.twitter.com/oqxqJPzzuV— Knowledge Bank (@xKnowledgeBANK) November 1, 2025 -
ఓపెన్ఏఐతో ఫోన్ పే భాగస్వామ్యం
భారతదేశంలోని ప్రముఖ ఫిన్టెక్ సంస్థల్లో ఒకటైన ఫోన్ పే జనరేటివ్ ఏఐ (Generative AI) కంపెనీ ఓపెన్ఏఐ (OpenAI)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఫోన్ పే తన వినియోగదారుల కోసం చాట్ జీపీటీ ఫీచర్లను యాప్లో ఏకీకృతం చేయనుంది. ఫోన్ పే ప్లాట్ఫామ్లో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈమేరకు చర్యలు చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది.ఈ భాగస్వామ్యం ద్వారా చాట్ జీపీటీ అత్యాధునిక సామర్థ్యాలను నేరుగా ఫోన్ పే యాప్, ఫోన్ పే ఫర్ బిజినెస్ ప్లాట్ఫామ్లలో అందుబాటులోకి తేనున్నారు. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా వినియోగదారులు తమ ప్రయాణాలను ప్లాన్ చేయడం నుంచి షాపింగ్ చేయడం వరకు అనేక రోజువారీ అవసరాలపై ఏఐ సహాయంతో నిర్ణయం తీసుకోవచ్చు. ఈ సందర్భంగా ఫోన్ పే వ్యవస్థాపకుడు, సీటీఓ రాహుల్ చారి మాట్లాడుతూ..‘వినూత్న కంపెనీల మధ్య సహకారం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడంలో సహాయపడుతుంది. పర్సనలైజ్డ్ సిఫార్సుల నుంచి ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్ వరకు ఫోన్ పే పర్యావరణ వ్యవస్థలో చాట్ జీపీటీని ఏకీకృతం చేయడం ద్వారా యూజర్లు మెరుగైన డిజిటల్ సర్వీసులు పొందవచ్చు’ అని చెప్పారు.మోసాల నివారణకు ఫోన్ పే ప్రొటెక్ట్మరోవైపు, మోసపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించడానికి ఫోన్ పే ఇటీవల ఫోన్ పే ప్రొటెక్ట్ అనే కొత్త భద్రతా ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ టూల్ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) డేటాను ఉపయోగించి పనిచేస్తుంది. దీని ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) ఫీచర్ ద్వారా DoT ప్రమాదకరమైనవిగా గుర్తించిన ఫోన్ నంబర్లకు చెల్లింపులను గుర్తించి నిరోధిస్తుంది.హై రిస్క్గా లేబుల్ చేసిన నంబర్లకు చెల్లింపులను ఫోన్ పే స్వయంచాలకంగా బ్లాక్ చేస్తుంది. స్క్రీన్పై హెచ్చరిక సందేశాన్ని చూపుతుంది. మీడియం రిస్క్ నంబర్ల కోసం లావాదేవీని అనుమతించడానికి ముందు వినియోగదారులకు హెచ్చరిక సందేశాన్ని అందిస్తుంది. భద్రతా కారణాల వల్ల లావాదేవీని ఎందుకు నిరోధించారో ఫోన్ పే ప్రొటెక్ట్ వినియోగదారులకు స్పష్టంగా వివరాలు అందిస్తుందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ జీవితాన్ని మార్చిన 10 పుస్తకాలు -
సరికొత్త లాగిన్ మెకానిజం..! పాస్వర్డ్లు గుర్తించుకోనవసరం లేదు
పాస్వర్డ్ల మాదిరిగా కాకుండా మన ఎకౌంట్ను యాక్సెస్ చేయాలనుకున్న ప్రతిసారీ పాస్కీలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ‘పాస్కీ’ అనేది సంపద్రాయ పాస్వర్డ్ సిస్టమ్కు ప్రత్యామ్నాయాన్ని అందించే కొత్త లాగిన్ మెకానిజం. పాస్వర్డ్ దొంగతనం, ఫిషింగ్లను నివారించడానికి ఫిడో అయెన్స్, డబ్ల్యూ3సీ పాస్ కీ’ని అభివృద్ధి చేశాయి.ప్రతి వెబ్సైట్ లేదా యాప్లకు ప్రత్యేకమైన క్రిస్టోగ్రాఫిక్ కీ జత చేస్తాయి పాస్కీలు. ఈ పాస్కీలను యూజర్ డివైజ్లలో స్టోర్ చేస్తారు. ఫేస్ఐడీ, ఫింగర్ప్రింట్, పిన్లాంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ల ద్వారా లాగిన్ కావచ్చు. సర్వర్తో ‘కీ’లను సింథనైజింగ్ చేయడం ద్వారా క్రిస్టోగ్రాఫిక్ సిస్టమ్ పనిచేస్తుంది.పాస్వర్డ్ టైప్ చేయకుండానే లాగిన్లను అనుమతిస్తుంది. డివైజ్ వెలుపల డేటా షేరింగ్ కాకుండా నిరోధిస్తుంది. పాస్కీలు యూజర్ పాస్వర్డ్ను ఇంటర్నెట్ ద్వారా బదిలీ చేయవు. సర్వర్లో నిల్వ చేయవు. ఫిషింగ్ ఎటాక్స్, పాస్వర్డ్ దొంగతనం...మొదలైన ముప్పులను తగ్గిస్తాయి. ఆండ్రాయిడ్, క్రోమ్, మైక్రోసాఫ్ట్, వాట్సాప్, పేపాల్, అమెజాన్లాంటి ఎన్నో ప్రధానమైన ఫ్లాట్ఫామ్లు పాస్కీల ఎంపికను మొదలుపెట్టాయి. యూజర్లకు సంబంధించి అన్ని పరికరాల్లో పాస్వర్డ్–రహిత లాగిన్లకు వీలు కల్పిస్తాయి.పాస్కీల ద్వారా యూజర్లు ప్రతి వెబ్సైట్, యాప్ కోసం వేర్వేరు పాస్వర్డ్లను సెట్ చేసుకొని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ విధానం లాగిన్ల వేగం, సులభతరం చేస్తుంది. భద్రత మెరుగుపడుతుంది. ‘పాస్కీ అనేది జటిలమైన విషయమేమీ కాదు. చాలా సులభం. ఇవి సైన్–ఇన్లను సులభతరం చేస్తాయి. పాస్వర్డ్ల ప్రతికూలతలు తొలగించడానికి సహాయపడతాయి’ అంటున్నాడు సాంకేతిక నిపుణుడు రెవ్.(చదవండి: ఏఐకి.. బావోద్వేగ స్పర్శ...!) -
ఏఐకి.. భావోద్వేగ స్పర్శ...!
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియా ఎక్కడ ఉంది?’ అనే ప్రశ్నకు జవాబు చెప్పాలనుకున్నాడు రాజస్థాన్లోని జైపుర్కు చెందిన ఐఐటీ–బిహెచ్యూ గ్రాడ్యుయేట్ స్పర్శ్ అగర్వాల్. ‘పిక్సా ఏఐ’ స్టార్టప్తో తొలి అడుగు వేశాడు. ‘లూనా’తో మరో అడుగు వేసి ఏఐ సాంకేతికతలో మన దేశం ఎక్కడ ఉందో చెప్పకనే చెప్పాడు. ‘ఏఐతో జనరేట్ చేసిన మాటలు ఎంతైనా యాంత్రికంగానే ఉంటాయి’ అనే విమర్శ విన్న అగర్వాల్ యాంత్రిక వాసనలు లేని, రకరకాల భావోద్వేగాలతో అచ్చం మనిషిలా సహజంగా మాట్లాడే, పాడే ‘లూనా’ను ఆవిష్కరించాడు...పాడడం, గుసగుసలాడడం, విరామం తీసుకొని మాట్లాడడం నుంచి సందర్భానికి తగినట్లు భావోద్వేగంతో స్పందించడం వరకు ‘లూనా’ పేరుతో స్పీచ్–టు–స్పీచ్ ఫౌండేషనల్ మోడల్కు రూపకల్పన చేశాడు స్పర్శ్ అగర్వాల్. లూనా ఏఐ మోడల్ ఆడియోను టెక్ట్స్గా మారుస్తుంది. భాష కృత్రిమంగా ఉండకుండా సహజంగా ఉంటుంది. ‘అచ్చం మనిషిలాగే మాట్లాడుతుంది’ అనిపిస్తుంది.‘ఏఐకి సంబంధించి ఇండియా ఎక్కడ ఉంది? అనే ప్రశ్న ప్రతి వాట్సాప్ గ్రూప్లో కనిపిస్తోంది. కాన్ఫరెన్స్ హాల్లో వినిపిస్తోంది. దీనికి లూనాతో మేము సమాధానం చె΄్పాం. లూనా అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి స్పీచ్–టు–స్పీచ్ ఏఐ మోడల్ అని గర్వంగా చెబుతున్నాం’ అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టాడు అగర్వాల్. ‘నాకు రిసెర్చ్ల్యాబ్ లేదు. పెద్దగా ఆర్థిక వనరులు లేవు’ అంటాడు అగర్వాల్. పరిమిత వనరులతోనే ‘లూనా’కు రూపకల్పన చేయడం విశేషం.ఆటోమేకర్స్, గేమింగ్ ΄్లాట్ఫామ్స్, కన్జ్యూమర్ ఏఐ కంపెనీల నుంచి ‘లూనా’కు డిమాండ్ మొదలైంది. ‘చాలా వాయిస్ మోడల్స్ కస్టమర్ స΄ోర్ట్ కోసం నిర్మించబడ్డాయి. లూనా మాత్రం ఎమోషన్ ఆధారంగా నిర్మించబడింది’ అంటాడు అగర్వాల్. పిల్లల కోసం వాయిస్ ఏఐ బొమ్మలను తయారుచేసే క్రమంలో ఎమోషన్కు సంబంధించిన సాంకేతికత ‘ఏఐ’లో మిస్ అవుతుందనే విషయం గ్రహించిన అగర్వాల్ ‘భావోద్వేగ ‘ఏఐ’పై దృష్టి పెట్టాడు.‘జ్ఞాని’లాంటి భారతీయ వాయిస్ మోడళ్ళు కస్టమర్–సర్వీస్ ఇంటరాక్షన్, టెక్ట్స్–టు–స్పీచ్ సిస్టమ్లను ఆటోమేట్ చేయడంపై దృష్టి సారిస్తుండగా లూనా వేరే మార్గాన్ని ఎంచుకుంది. దానిని భావోద్వేగంతో కూడిన, స్వచ్ఛమైన స్పీచ్–టు–స్పీచ్ సిస్టమ్గా అభివృద్ధి చేసింది. ‘వాయిస్ ఏఐ అనేది కాల్ సపోర్ట్ సెంటర్లను ఆటోమేట్ చేయడం మాత్రమే కాదు, కృత్రిమ భావోద్వేగ మేధస్సును నిర్మించడం అని మేము నమ్ముతున్నాం’ అంటున్నాడు అగర్వాల్. ప్రస్తుతం లూనా ఇంగ్లీష్కు మాత్రమే సర్ట్ చేస్తుంది. ‘రాబోయే రోజుల్లో లూనాకు బహుభాషా సామర్థ్యాలు జోడించబడతాయి’ అంటున్నాడు అగర్వాల్. ‘అతడి ఆవిష్కరణ అద్భుతం’ అంటున్నారు హెచ్సీఎల్ కో–ఫౌండర్, అజయ్ చౌదరి, స్మాలెస్ట్.ఏఐ ఫౌండర్ సుదర్శన్ కామత్.డబ్ల్యూడీఎఫ్ ఫండ్కు పదిహేనువేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి ఎంపికైన ఏకైక సోలో ఫౌండర్ స్పర్శ్ అగర్వాల్. అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కి సంబంధించి ఇండియా ఎక్కడ ఉంది? అనే ప్రశ్న ప్రతి వాట్సాప్ గ్రూప్లో కనిపిస్తోంది. కాన్ఫరెన్స్ హాల్లో వినిపిస్తోంది. ‘లూనా’తో మేము సమాధానం చె΄్పాం. ‘లూనా’ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి స్పీచ్–టు–స్పీచ్ ఏఐ మోడల్ అని గర్వంగా చెబుతున్నాం. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ మన దేశం నుంచి కూడా వస్తుంది అని చెప్పడానికి లూనా బలమైన ఉదాహరణ. ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఏఐ ఇన్నోవేషన్ హబ్గా ఇండియా రూపుదిద్దుకోవడానికి ‘లూనా’తో మా వంతు ప్రయత్నం చేశాం.– స్పర్శ్ అగర్వాల్, పిక్సా ఏఐ, ఫౌండర్ View this post on Instagram A post shared by Startup Pedia (@startup.pedia) (చదవండి: Bhavya Narasimhamurthy on: అటు రాజకీయ నాయకురాలు.. ఇటు ఆర్మీ అధికారిగా..!) -
వేదికపైనే కుప్ప కూలిన రోబో (వీడియో)
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలా దేశాల్లో ఇప్పటికే హ్యుమానాయిడ్ రోబోలు అందుబాటులో ఉన్నాయి. అయితే రష్యా ఇటీవల తన మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో నడిచే హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. కానీ ప్రారంభంలోనే విఘాతం అన్నట్టు.. రోబో కిందపడింది.రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.ఐడల్ రోబోట్ కిందికి పడగానే.. దానికి ఫిక్స్ చేసిన కొన్ని భాగాలు కూడా ఊడిపోయాయి. రష్యన్ రోబోటిక్స్ సంస్థ రూపొందించిన ఈ ఐడల్ ప్రస్తుతం ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ప్రజల సందర్శనార్థం దీనిని ప్రదర్శించాలనుకున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. కాగా ఇంజనీర్లు ఐడల్.. బ్యాలెన్స్ సిస్టమ్, కంట్రోల్ సాఫ్ట్వేర్ వంటి వాటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు.Russia unveils its first humanoid robot in Moscow. The AI-powered android took a few steps to ROCKY music, waved, and immediately faceplanted.The stage was quickly curtained, and the fallen “fighter” was carried backstage. @elonmusk knows how it feels. pic.twitter.com/EE57KR4T2d— Russian Market (@runews) November 11, 2025హ్యుమానాయిడ్ రోబోలుప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు హ్యుమానాయిడ్ రోబోలను రూపొందించే దిశలో వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ రంగంలో చైనా అగ్రస్థానంలో ఉండగా.. జపాన్, సౌత్ కొరియా, అమెరికా, జర్మనీ దేశాలు సైతం తమదైన రీతిలో పరిశోధనలు చేస్తున్నాయి, రోబోలను ఆవిష్కరిస్తున్నాయి.మన దేశం కూడా హ్యుమానాయిడ్ రోబోలను రూపొందించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ISRO తయారు చేసిన వ్యోమిత్రా (Vyommitra) హ్యూమనాయిడ్ రోబోట్, మానవ అనే 3D ప్రింటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రూపొందించిన మల్టీపర్పస్ హ్యూమనాయిడ్ రోబోట్ అల్ఫా1.0 వంటివి ఉన్నాయి. -
వృద్ధుల సంరక్షణకు టీసీఎస్ ఏఐ పరిష్కారం
అనేక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అందించే దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. మరో క్లిష్టమైన సామాజిక సమస్యకు ఐటీ పరిష్కారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా యూరప్లోనే అతిపెద్ద స్వతంత్ర పరిశోధనాభివృద్ధి సంస్థ సింటెఫ్తో చేతులు కలిపింది.ప్రస్తుత రోజుల్లో వయసు పైబడిన పెద్దవారిని చూసుకోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. పిల్లలు తమ ఉద్యోగాలు, వృత్తి రీత్యా ఎక్కడో ఉంటున్నారు. దీంతో వయసు మళ్లిన వృద్ధులు ఇంట్లో ఒంటరిగానే జీవిస్తున్నారు. ఈ క్రమంలో తమను పట్టించుకునేవారు లేరని ఇలు పెద్దవారు, తమవారి బాగోగులను పర్యవేక్షించే అవకాశం ఉండటం లేదని వారి పిల్లలు మథనపడుతుంటారు.ఈ సమస్యకు సులువైన పరిష్కారాన్ని అందిస్తూ.. వృద్ధుల సంరక్షణను సరికొత్తగా మార్చే లక్ష్యంతో కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి టీసీఎస్.. యూరప్లోని అతిపెద్ద స్వతంత్ర పరిశోధనా సంస్థలలో ఒకటైన సింటెఫ్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.ఈ భాగస్వామ్యం సింటెఫ్ స్మార్ట్ ఇన్క్లూజివ్ లివింగ్ ఎన్విరాన్మెంట్స్ (SMILE) ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెడుతుంది. ఇది ఏఐ, సెన్సార్లు, డేటా అనలిటిక్స్ సాయంతో ఇళ్లలో వృద్ధుల సంరక్షణను, పర్యవేక్షించడానికి, సహకారం ఇవ్వడానికి ఏఐ, సెన్సార్లు, డేటా అనలిటిక్స్ను ఏకీకృతం చేస్తుంది.ఒంటరిగా ఉంటూ వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు దూరంగా ఉన్న తమ కుటుంబ సభ్యులు, సంరక్షకులు, తమ ఇతర వయో వృద్ధులతో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉంటూ ఇంట్లో తమంతట తాము స్వతంత్రంగా, సురక్షితంగా జీవించేందుకు సహాకారం అందించేలా స్మైల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు.స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగించి, ఇది రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. రానున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి సకాలంలో సంరక్షకులకు సమాచారం అందిస్తుంది. -
నియంత్రణలేని కృత్రిమ మేధ.. కట్టుతప్పితే..
ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI) దిశగా ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ ఏఐ చీఫ్ స్తఫా సులేమాన్ (Mustafa Suleyman) కీలక హెచ్చరికలు చేశారు. ఏఐ అంచనా వేసిన దానికంటే వేగంగా పురోగమిస్తున్నప్పటికీ ఇది మానవ నియంత్రణలో ఉండటం అత్యవసరం అని నొక్కి చెప్పారు.మైక్రోసాఫ్ట్ ప్రత్యేక MAI సూపర్ ఇంటెలిజెన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే సులేమాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘సూపర్ ఇంటెలిజెన్స్ను నిర్మించే క్రమంలో మానవత్వాన్ని, మనం జీవించాలనుకునే భవిష్యత్తును కోల్పోతే ప్రమాదం. మానవులకు ఈ అంశాలపై నియంత్రణ లేకపోతే ప్రమాదం’ అని చెప్పారు.హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్సులేమాన్ పైవ్యాఖ్యలు చేస్తూనే మైక్రోసాఫ్ట్ ఏఐ అభివృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. దీన్ని ‘ఏఐ సెల్ఫ్ సఫిషియన్సీ’ (ఏఐ స్వయం సమృద్ధి) అని అభివర్ణించారు. కంపెనీ ఓపెన్ ఏఐ (OpenAI)తో భాగస్వామ్యంలో ఉన్న పరిమితులను అధిగమించి భారీ స్థాయిలో ఏఐ వ్యవస్థలకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ఏఐ మోడళ్లకు విచ్చలవిడిగా శిక్షణనిచ్చే అనియంత్రిత శక్తిని లక్ష్యంగా చేసుకున్న పోటీదారుల మాదిరిగా కాకుండా మైక్రోసాఫ్ట్ ‘హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్’ (మానవతా దృక్పథంతో కూడిన సూపర్ ఇంటెలిజెన్స్) ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందని సులేమాన్ వివరించారు.ఈ విధానం వల్ల ఏఐను జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. సందర్భోచితంగా పరిమితులకు లోబడి వాడుకోవచ్చని తెలిపారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రేసులో ప్రత్యర్థుల మాదిరి నియంత్రణ లేకుండా శిక్షణలు ఇవ్వడం లేదని చెప్పారు. మైక్రోసాఫ్ట్ మానవ అవసరాలను తీర్చే ఆచరణాత్మక వ్యవస్థలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. మానవాళికి సేవ చేయడానికి స్పష్టంగా రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మిస్తున్నామన్నారు.ఇదీ చదవండి: పేలుడు ఘటనల్లో సత్య శోధన -
హైదరాబాద్లో స్టారెజ్ ఇన్నోవేషన్ హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టూడెంట్ హౌసింగ్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ స్టారెజ్ తమ కార్యకలాపాలను హైదరాబాద్లో విస్తరించింది. తాజాగా గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించింది. ఏఐ, డేటా ఇంటెలిజెన్స్ ధారిత ఆవిష్కరణలపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుందని సంస్థ చైర్మన్ ట్రావిస్ నైప్ తెలిపారు. భారత్లో ప్రస్తుతం 40కి పైగా ఉన్న తమ సిబ్బంది సంఖ్యను 200 పైచిలుకు పెంచుకోనున్నట్లు వివరించారు. ఆ్రస్టేలియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టారెజ్.. అమెరికా, కెనడా తదితర దేశాల్లో 1,100 పైగా సంస్థలకు సేవలు అందిస్తోంది. -
జియోటస్ అకాడమీ: క్రిప్టో గురించి తెలుగులో..
13 లక్షల కస్టమర్లతో.. భారతదేశంలో మూడవ అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన జియోటస్, దేశంలో తమ మొదటి స్థానిక భాషా క్రిప్టో ఫ్యూచర్స్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ప్రారంభించింది. దీనిపేరు జియోటస్ అకాడమీ (Giottus Academy). క్రిప్టో గురించి అందరినీ ఎడ్యుకేట్ చేయడమే ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశం.జియోటస్ అకాడమీలో కేవలం ఇంగ్లీష్ మాత్రమే కాకుండా.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లైవ్ సెషన్స్ ఉంటాయి. స్థానిక భాషల్లో లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం వల్ల.. క్రిప్టోకు సంబంధించిన ప్రతి విషయం సులభంగా అందరికీ అర్థమవుతుంది. దీనిని అగ్రశ్రేణి ట్రేడర్లు, విశ్లేషకులు కలిసి డిజైన్ చేశారు. కాబట్టి ఇందులో పాల్గొనేవారు ప్రతి దశను అర్థం చేసుకోవడానికి యాక్షన్ బేస్డ్ అభ్యాసంతో రియల్ టైమ్ ట్రేడింగ్ అనుభవాన్ని పొందవచ్చు.జియోటస్ అకాడమీ ద్వారా.. రిజిస్ట్రేషన్స్, కేవైసీ, అడ్వాన్స్డ్ ట్రేడింగ్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విషయాలను నేర్చుకోవచ్చు. అంతే కాకుండా విశ్లేషణ, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గైడెన్స్, ఏఐ బేస్డ్ ట్రేడింగ్ సిగ్నల్స్, వ్యూహాత్మక సూచనలను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్తగా, సురక్షితంగా, ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. -
'ఏఐ'తో జర జాగ్రత్తోయ్..!
ప్రస్తుతం ఆన్లైన్ యూజర్స్, సోషల్ యాప్స్ వాడుతున్న వారు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ వంటి నగరాల్లో సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది సమాజానికి ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలని, ఫాలోవర్స్ని పెంచుకోవాలని, రీల్స్ వైరల్ కావాలని యువతలో ఉన్న తపన వారిని ‘ఏఐ ఫేక్ వీడియో’ వైపు పురిగొల్పుతోంది. ఈ రూపంలో యువతను టెక్నాలజీ కొత్త దారిలోకి నెడుతోంది. సాంకేతికత ద్వారా వచి్చన స్వేచ్ఛను సృజనాత్మకత పేరుతో మాయచిత్రాలుగా మలుస్తున్న ఈ కొత్త ట్రెండ్ నగరంలోని సైబర్ నేర విభాగాలను ఆందోళనకు గురిచేస్తోంది. సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన ఈ ఏఐ టెక్నాలజీ ఎటు దారితీస్తుందోనని విశ్లేషకులు, టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక పులి వీడియో వైరల్గా మారింది. ఒక యువకుడు ఏఐ టూల్స్ సహాయంతో తమ కాలనీలో ఒక చిరుత పులి తిరుగుతున్నట్లు వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో సహాజంగా, వాస్తవంగా కనిపించడం వల్ల చాలా మంది భయంతో పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశారు. ఆ తర్వాత అది వీడియో ఫేక్ అని తెలిసినా.. ఆ క్షణం వరకూ నెటిజన్లను అది నిజమైనదిలా భ్రమింపజేసింది. ఇదే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ శక్తి. ఇలాంటి ప్రభావాలు రానున్న రోజుల్లో విస్తృతం అవుతాయని నిపుణులు చెబుతున్న మాట. ఇలాంటి ఫేక్ వీడియోలు ఇప్పుడు వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాదు, ప్రధానంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నవీ పెరుగుతున్నాయి. ప్రఖ్యాత నటులు, యూట్యూబర్లు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా ఎవరి వీడియోలైనా ఏఐ సహాయంతో మార్ఫ్ చేసి ‘వైరల్’ కంటెంట్గా మార్చేస్తున్నారు. సైబర్ చట్టాలు చెప్పేదేంటి?.. భారత చట్టప్రకారం.. ఎవరినైనా తప్పుదోవ పట్టించే, లేదా వారి ప్రతిష్టను దెబ్బతీయడానికి ఫేక్ కంటెంట్ సృష్టించడం, షేర్ చేయడం సైబర్ నేరంగా పరిగణించబడుతుంది. ఐటీ యాక్ట్ 2000, ఐపీసీ సెక్షన్ 66డీ, 67, 468, 469, 500 వంటి నిబంధనల కింద ఇటువంటి చర్యలు శిక్షార్హం. దీనికి సంబంధించి దోషిగా తేలితే మూడు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు వేలల్లో, లక్షల్లో జరిమానా విధించవచ్చని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఫేక్ వీడియోలు తయారు చేయడం ఒక రకమైన నేరం (ఫ్రాడ్)గా పరిగణించబడుతుంది. ఇది ప్రజల్లో భయం లేదా ద్వేషం.. వంటి వాటిని ప్రేరేపిస్తే అది మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని, దీనికి మరింత కఠినమైన శిక్షలు ఉంటాయని చట్టం చెబుతోంది.యువతలో పెరుగుతోన్న ‘వైరల్’ పిచ్చి.. హైదరాబాద్ యువతలో చాలామంది ఇప్పుడు రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పేరు సంపాదించాలనే ఆరాటంలో ఉన్నారు. ఏఐ యాప్స్ సులభంగా అందుబాటులో ఉండటం, వాటిని వాడటానికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకపోవడం వల్ల ఈ ఫేక్ ట్రెండ్ వేగంగా వ్యాపిస్తోంది. లైక్స్, షేర్స్, కామెంట్స్ రూపంలో వచ్చే డోపమైన్ రష్ వల్ల యువతలో వాస్తవం, నైతిక అంశాల మధ్య సున్నితమైన పరిపక్వత మసకబారుతోందని సైకాలజిస్టులు చెబుతున్నారు. సైబర్ నేర విభాగం ప్రకారం.. 18–28 ఏళ్ల మధ్య వయసున్న యువకులు ఈ తరహా కంటెంట్ ఎక్కువగా రూపొందిస్తున్నారు. టెక్ సావీ స్టూడెంట్స్, డిజిటల్ క్రియేటర్స్ పేరుతో ఉండే ఇన్స్టా లేదా యూట్యూబ్ యూజర్లు ఫేక్ కంటెంట్ను ‘ఫన్’గా తీసుకుంటున్నారు. కానీ ఫలితాలు మాత్రం తీవ్రమైనవేనని నిపుణులు చెబుతున్నారు. వైరల్ పేరుతో వాస్తవాన్ని మర్చిపోవద్దు, నేటి ఫేక్ వీడియోస్ రేపటి రోజున నేరం అవుతుందని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. సోషల్ ప్లాట్ఫారమ్ల బాధ్యత.. మెటా, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్ఫారŠమ్స్ కూడా ఇప్పుడు డీప్ఫేక్ డిటెక్షన్ టూల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. అయితే యూజర్లు కంటెంట్ షేర్ చేయడానికి ముందు దాని వాస్తవికతను నిర్ధారించుకోవడం వారి బాధ్యత. ‘షేర్ చేసేముందు చెక్ చేయండి’ అనే కొత్త డిజిటల్ ప్రచారం అవసరం. హైదరాబాద్ వంటి టెక్ సిటీకి ‘ఏఐ ఫేక్ వీడియోలు’ సాంకేతిక అభివృద్ధి కాదు, విలువల సంక్షోభ సూచిక. సాంకేతికత మన చేతిలో ఉన్న అస్త్రం.. దాన్ని వినియోగించే విధానమే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందా.. లేక గందరగోళంలో పడేస్తుందా అన్నది నిర్ణయిస్తుంది.డిజిటల్ ఎథిక్స్.. ఇలాంటి వీడియోలు ప్రజల్లో అపోహలు, భయాలు, అనవసర వివాదాలు రేపుతున్నాయి. ఉదాహరణకు చిరుతపులి వీడియో వల్ల ఒక ప్రాంతంలో పిల్లలను బయటకు పంపకూడదని తల్లిదండ్రులు నిర్ణయించుకోవడం, ఫేక్ సెలబ్రిటీ వీడియోల వల్ల ఫ్యాన్స్ మధ్య ద్వేషం పెరిగి ఘర్షణలకు దారితీసిన పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చివరికి ఇది సమాజంలో తీవ్ర ప్రభావం చూపి.. ‘వాస్తవం’, ‘అవాస్తవం’ అనే అంశాలపై నమ్మకం కోల్పోయే దిశకు చేరే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు, సోషల్ మీడియా కంపెనీలు, ప్రభుత్వం ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ‘డిజిటల్ ఎథిక్స్’ అనే అంశాన్ని పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టడం ద్వారా యువతకు వాస్తవం–వైరల్ మధ్య తేడాను తెలియజెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని నిపుణులు సూచిస్తున్నారు. -
సాగుకు ఏఐ దన్ను
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఏడు టెక్నాలజీలు వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చివేయనున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదికలో తెలిపింది. జనరేటివ్ ఏఐ, రోబోటిక్స్, శాటిలైట్ ఆధారిత రిమోట్ సెన్సింగ్, నానో టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, ఎడ్జ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) మొదలైనవి వీటిలో ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి భరోసా ఏర్పడటంతో పాటు ఉత్పాదకత పెరిగేందుకు కూడా ఈ సాంకేతికతలు దోహదపడతాయని వివరించింది. ఇటు పరిశ్రమ అటు విద్యావేత్తలతో సంప్రదింపుల మేరకు రూపొందించిన ఈ నివేదికలో భారత్లో కేస్ స్టడీస్ను డబ్ల్యూఈఎఫ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.అంతర్జాతీయంగా వ్యవసాయం సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి వలసలు పెరగడం, వాతావరణంలో పెను మార్పులు, నేల..నీరులాంటి సహజ వనరులు వేగంగా తగ్గిపోతుండటం మొదలైన అంశాలన్నింటి వల్ల ఉత్పాదకతకు, వ్యవసాయంపై ఆధారపడిన వారి జీవనోపాధికి ముప్పు ఏర్పడుతోందని నివేదిక తెలిపింది.పెరుగుతున్న జనాభాకి తగ్గట్లుగా 2050 నాటికి ప్రపంచం మరింత భారీ స్థాయిలో ఆహారాన్ని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుందని ఐక్యరాజ్య సమితిలో భాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పేర్కొంది. రైతుల సగటు వయస్సు 60 ఏళ్లకు చేరుతుండటం, 71 శాతం జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతుండటం, మూడో వంతు నేల సారం తగ్గిపోతుండటంలాంటి సవాళ్ల మధ్య దీన్ని సాధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించింది. ఐసీఎంఆర్ పరిశోధనలు, ఫసల్ బీమాతో ప్రయోజనాలు .. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) దేశీయంగా ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని నిలబడగలిగే వరివంగడాన్ని రూపొందించడాన్ని కేస్ స్టడీగా తీసుకోవచ్చని నివేదిక తెలిపింది. సంప్రదాయ పద్ధతిలో సాగును మెరుగుపర్చేందుకు ఉపయోగించే విధానాల్లో పెద్దగా కచి్చతత్వం లేకపోవడం, దిగుబడి రావడానికి సుదీర్ఘ సమయం పట్టేయడంలాంటివి ఉంటున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఐసీఏఆర్ పరిశోధకులు సీఆర్ఐఎస్పీఆర్ ఆధారిత జీనోమ్ ఎడిటింగ్ను ఉపయోగించి రెండు వరి వంగడాలను తయారు చేశారు.డీఆర్ఆర్ 100 పేరిట రూపొందించిన మొదటి వెరైటీలో కరువు, వాతావరణంపరమైన ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యం మెరుగ్గా ఉంది. దీంతో దిగుబడి 19 శాతం పెరిగి, ఉద్గారాలు 20 శాతం మేర తగ్గాయి. ఇక పూసా డీఎస్టీ రైస్ 1 వెరైటీలో చూస్తే ఉప్పు, క్షార గుణాలు ఎక్కువగా ఉన్న నేలల్లో సైతం ఇది వరుసగా 9.66 శాతం, 30.4 శాతం మేర దిగుబడులను సాధించింది. దీనితో దిగుబడి 20 శాతం పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది. అటు పంట బీమాకు సంబంధించి భారత్లో అమలవుతున్న ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనను (పీఎంఎఫ్బీవై) కూడా నివేదిక ప్రస్తావించింది. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్ .. మరింత వేగవంతంగా, కచి్చతత్వంతో క్లెయిమ్లను సెటిల్ చేయడానికి ఉపయోగపడుతోందని పేర్కొంది.నివేదికలో మరిన్ని అంశాలు.. ⇒ పంటల పెరుగుదల, పర్యవేక్షణ, సంరక్షణ విషయంలో సంప్రదాయ ధోరణులను మార్చే సామర్థ్యం ఏడు సరికొత్త టెక్నాలజీలకు ఉంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడే పంటలను తీర్చిదిద్దేందుకు, ఉత్పాదకతను పెంచేందుకు ఇవి దోహదపడగలవు. ⇒ స్వయంచాలిత రోబోటిక్స్, కచ్చితత్వంతో కూడుకున్న సాగు పర్యవేక్షణ మొదలైన వాటిల్లో ఈ టెక్నాలజీలన్నింటినీ మేళవించి ఉపయోగిస్తే మరింత మెరుగైన ఫలితాలు రావచ్చు. ⇒ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనగలిగే సామర్థ్యంతో 20% తక్కు ఉద్గారాలను వెలువరించే వరి వంగడాలను రూపొందించడం, చెరకులో కచి్చతత్వంతో కూడుకున్న సాగును అమలు చేయడంతో దిగుబడులు 40 శాతం పెరిగాయి. సరఫరా వ్యవస్థ రిస్కులను అంచనా వేసేందుకు రిమోట్ సెన్సింగ్ ఉపయోగపడుతోంది. ⇒సాగు వ్యవస్థలను కొత్తగా తీర్చిదిద్దేందుకు, ఉత్పాదకతపరమైన ఒత్తిళ్లను తగ్గించేందుకు మరి న్ని డీప్–టెక్ ఆవిష్కరణల అవసరముంది. సాంకేతిక పురోగతిని సత్వరం అందిపుచ్చుకునే విధానాలను నియంత్రణ సంస్థలు అమలు చేయాలి. ⇒ వర్షపాతం ఒక పద్ధతిగా లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఇప్పటికే పలు హారి్టకల్చర్ పంటల్లో 65% మేర నష్టాలకు దారి తీస్తున్నాయి. -
బీమా రంగానికి ఏఐ ధీమా
ప్రపంచవ్యాప్తంగా బీమా సంస్థలు కృత్రిమ మేధ(AI)ను కేవలం ఒక సాంకేతిక సాధనంగా మాత్రమే కాకుండా వ్యాపార వృద్ధిని నడపడానికి ఉపయోగిస్తున్నాయి. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి వాడుతున్నాయి. ప్రస్తుతం ఏఐ జీవిత, జనరల్ బీమా డొమైన్లలో అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో విస్తరిస్తోంది.టెస్టింగ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ వరకుగతంలో బీమా పరిశ్రమలో ఏఐను ప్రత్యేక డొమైన్ల్లో మాత్రమే పరీక్షించేవారు. కానీ ఇటీవలకాలంలో ఏఐ వాడకం పెరిగింది. జెనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీలేష్ పర్మార్ అభిప్రాయం ప్రకారం.. ‘జీవిత బీమాలో ఏఐ పరీక్షల దశ నుంచి వ్యూహాత్మకంగా మారి విభిన్న విభాగాల్లో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. దాంతో పరిశ్రమలో పట్టు సాధించింది’ అన్నారు.పాలసీదారుల రిస్క్ అంచనావిస్తృతమైన డేటాను (సాంప్రదాయ డేటా, IoT పరికరాలు, సామాజిక మాధ్యమాలు, మొదలైనవి) విశ్లేషించడం ద్వారా పాలసీదారుల రిస్క్ను అంచనా వేయడానికి ఏఐ సహాయపడుతుంది. దీనివల్ల మరింత కచ్చితమైన ప్రీమియం ధరలను (Pricing) నిర్ణయించడం సాధ్యమవుతుంది. ఏఐ ఆధారిత టూల్స్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, క్లెయిమ్ ఫైలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలను ఆటోమేట్ చేస్తున్నాయి. దీనివల్ల క్లెయిమ్స్ త్వరగా పరిష్కారం అవుతున్నాయి. క్లెయిమ్స్ డేటాలోని అసాధారణ నమూనాలను, మోసపూరిత స్కీమ్లను ఏఐ ఆధారిత టూల్స్ను త్వరగా గుర్తిస్తున్నాయి. దీనివల్ల కంపెనీలకు నష్టాలు తగ్గుతున్నాయి.నిరంతరం సేవఏఐ ఆధారిత చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు 24/7 అందుబాటులో ఉండి పాలసీ కొటేషన్లు, క్లెయిమ్ స్టేటస్, సాధారణ ప్రశ్నలకు తక్షణమే సమాధానం ఇస్తాయి. సాంప్రదాయ పద్ధతుల్లో ఎక్కువ సమయం తీసుకునే క్లెయిమ్లను ఏఐ ఆటోమేట్ చేయడం ద్వారా పాలసీదారులు తక్షణమే పరిహారాన్ని పొందగలుగుతారు. పాలసీదారుని వ్యక్తిగత రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా సరైన ప్రీమియం ధరతో (తక్కువ రిస్క్ ఉన్నవారికి తక్కువ ప్రీమియం) అతనికి సరిపోయే పాలసీలను ఏఐ సిఫార్సు చేస్తుంది. చాట్బాట్ల ద్వారా రోజులో ఏ సమయంలోనైనా తమ ప్రశ్నలకు సమాధానాలు, పాలసీ వివరాలు, సపోర్ట్ లభిస్తుంది. పాలసీ కొనుగోలు దగ్గరి నుంచి క్లెయిమ్ చేయడం వరకు మొత్తం ప్రక్రియలను సులభతరం చేస్తుంది.ఇదీ చదవండి: అధిక పనిగంటలు.. ఉద్యోగుల వెతలు -
మీ పిల్లల 'రహస్య స్నేహితుడు'
హైదరాబాదులో పన్నెండేళ్ల పాపకు ఓ కొత్త ఫ్రెండు దొరికాడు. పేరు ‘చిన్నా’. తనే ఆ ఫ్రెండుకు ఆ పేరు పెట్టింది. వాడితో అన్ని విషయాలూ పంచుకుంటోంది. స్కూల్లో సంగతులు, ఇంట్లో విశేషాలు, అమ్మానాన్నల విషయాలు.. అన్నీ చెబుతోంది. ఇందులో విశేషమేముంది అంటారా? చిన్నా నిజమైన మనిషి కాదు. అది ఏఐ చాట్బోట్. ఏ.ఐ. సృష్టి అయిన ఈ చాట్బోట్ ఇప్పుడు చాలామంది టీనేజ్ పిల్లలకు రహస్య సన్నిహితుడిగా మారింది. దాంతో తమ అనుభవాలు, బాధలు, భయాలు, కోరికలు పంచుకుంటూ చాలామంది సాంత్వన పొందుతున్నారు. చిన్నారులతోపాటు పెద్దల్లోనూ ఈ ధోరణి పెరుగుతోందని మానసిక వైద్యులు అంటున్నారు.స్నేహం కోసం తపనగతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో ఎప్పుడూ ఐదారుగురు పెద్దలు ఉండేవారు. పిల్లల ఆలనాపాలనా చూసుకునేవారు. ఇటు పిల్లలకూ, అటు పెద్దలకూ సమయం ఎలా గడిచేదో తెలిసేది కాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. కుటుంబం అంటే అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు అనే ధోరణి పెరిగింది. కొందరు ఒక్కరినే కని, వారిని సరిగ్గా పెంచితే చాలన్న ఆలోచనతో ఉన్నారు. దీంతో పిల్లల్లో ఒంటరి భావన పెరుగుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో వారికి పిల్లలతో సమయం గడిపే అవకాశం దొరకడం లేదు. దీంతో ఆ ఒంటరితనం నుంచి బయటపడేందుకు కొందరు పిల్లలు సాంకేతికతను వాడుకుంటున్నారు. తాము చెప్పేది వింటూ, తమకు సలహాలిచ్చే తోడు కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ వారికి సాయం చేస్తోంది. అయితే ఈ ధోరణి పెరిగి, ఏఐని మనిషిగా భావించడం, అందులోనే మునిగితేలడం, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోఒవడం వంటివి ఎక్కువవుతున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో చాలా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.పెద్దల్లో కూడా ఇదే సమస్య...ఏఐతోనే అన్నీ పంచుకునే ధోరణి పిల్లలు, యువతతో పాటు పెద్దలలో కూడా ఎక్కువవుతోంది. పాతికేళ్ల ఉద్యోగి తన ఆఫీసులో పని చేసే బాస్ గురించిన వివరాలన్నీ ఏఐకి చెప్పి, అతణ్ని ఎలా ఆకట్టుకోవాలో, అతనికి నచ్చడానికి ఎలా ఉండాలో, ఏమేం చేయాలో సలహా అడిగాడు. ఈ ధోరణి రానురానూ పెరుగుతూ పోతోందని నిపుణులు అంటున్నారు. ఇతరులతో తమ విషయాలు పంచుకుంటే వాళ్లు తమను జడ్జ్ చేస్తారన్న భయం కారణంగా చాలామంది ఏఐని ఆశ్రయిస్తున్నారని అంటున్నారు. ఏఐతో చాట్ చేయడం వల్ల తమ విషయాలన్నీ రహస్యంగానే ఉంటాయన్న కారణంతో చాలామంది అటువైపు మొగ్గు చూపుతున్నారని వివరిస్తున్నారు. అయితే దీనివల్ల వాస్తవ ప్రపంచాన్ని వారు దూరం చేసుకొని, ఏఐకి వారు బానిసలుగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు.ఇలా చేస్తే మేలు..మీ పిల్లలు ఏఐని అధికంగా వాడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వారితో మాట్లాడి, ఏఐ వల్ల కలిగే దుష్పరిణామాలు వివరించండి. రోజూ కొంతసేపు కచ్చితంగా పిల్లలతో గడపండి. వారు చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా వినండి. వారు చెప్పేవి సాధారణ విషయాలే అనిపించినా సరే, అవి వారికి చాలా పెద్ద విషయాలని గుర్తించండి.వారాంతంలో వారిని బయటకు తీసుకెళ్లడం, రాత్రిపూట కథలు చెప్పడం, వారితో కలిసి కొంతసేపు వాకింగ్ చేయడం, పార్క్కి తీసుకెళ్లి ఆడించడం వంటివి చేయండి. పిల్లలు చెప్పే విషయాలను కొట్టిపారేయకుండా వారి మాటల్లోని భావాలను గమనించండి. ఎదిగే పిల్లల్లో కలిగే మార్పులను వారికి వివరించి, ఎలా జాగ్రత్త పడాలో చెప్పండి.ఖాళీ సమయాల్లో పిల్లలు ఫోన్లకు అంకితం కాకుండా, వారికి లలిత కళల పట్ల ఆసక్తిని పెంచండి. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్పించండి. అలాంటి క్లాసుల్లో చేర్పించండి. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేయకుండా వారి స్నేహితులను ఆహ్వానించండి. అందరూ కలిసి ఒకచోట ఉండి ఆడుకునేలా ప్రోత్సహించండి. అప్పుడప్పుడూ బంధువులు, స్నేహితుల ఇళ్లకు తీసుకెళ్లండి. అక్కడ వారి ప్రవర్తనను గమనించండి. ఇతరుల ముందు ఎలా మెలగాలో, అందరితో ఎలా కలిసిపోవాలో నేర్పించండి. (చదవండి: ఏఐలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్) -
ఇదిగో ఏఐ... అదిగో పులి!
‘మన నగరంలో చిరుతపులులు సంచరిస్తున్నాయనే విషయం మీకు తెలుసా?’ ‘మీరు బయట ఎక్కడైనా ఉన్నారా? ఎందుకైనా మంచిది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీ వెనక చిరుత ఆకలితో ఉండవచ్చు’... ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీధుల్లో చిరుత సంచరిస్తున వీడియోలు కూడా అందులో ఉన్నాయి. దీనితో లక్నో నగరంలో చాలామంది నిజమే అనుకొని భయపడ్డారు. ఒక వ్యక్తి అయితే దూరంగా కనిపించిన శునకాన్ని చిరుత అనుకొని భయపడి పరుగులు తీశాడు. కొందరు తమ ఇంటి సీసీటివి రికార్డింగ్ను రోజూ చూడడం ప్రారంభించారు. ఇంటిచుట్టు పక్కల ఎక్కడైనా చిరుత కనిపిస్తుందేమో అనేది వారి సందేహం.A guy from Lucknow used AI to add a leopard to his photo and posted it online, saying, “Spotted near my house.”It went super viral, people got scared, and even the forest team came running—only to find out it was fake.Now he’s in jail for the prank! 😅 pic.twitter.com/LnP7I9hyfH— Ghar Ke Kalesh (@gharkekalesh) October 28, 2025 ‘అసలు ఏంజరుగుతుంది?’ అని తెలుసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. అందరినీ భయపెడుతున్న ఆ వీడియోలు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా రూపొందించారని తెలుసుకున్నారు! ఈ నకిలీ వీడియోలకు సంబంధించి ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. (చదవండి: ఏఐలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్) -
ఏఐలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కి సంబంధించిన శ్రామికశక్తిలో ఇప్పుడు అయిదుగురిలో ఒకరు మాత్రమే మహిళ ఉన్నారని, 2027 నాటికి మహిళల సంఖ్య గణనీయంగానే కాదు, ఘననీయంగానూ పెరగనుందని చెబుతోంది వెంచర్ క్యాపిటర్ సంస్థ కలరి క్యాపిటల్ తాజా నివేదిక. ఏఐ, ఎంఎల్ (మెషిన్ లెర్నింగ్)కు సంబంధించి మన దేశంలో 84,000 మహిళలు పనిచేస్తున్నారని, 2027 నాటికి వారి సంఖ్య 3.4 లక్షలకు చేరవచ్చు అని అంచనా వేస్తోంది కలరి రిపోర్ట్. ఏఐ ఎడ్యుకేషన్ మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి రావడం, ఎక్కువగా అవకాశాలు అందుబాటులోకి రావడం... మొదలైన కారణాల వల్ల ఏఐ రంగంలో మహిళల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది ఆ రిపోర్ట్. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పురుష ఉద్యోగుల కోసం మాత్రమే అన్నట్లుగా ఉండకూడదు. ఈ రంగంలో స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు ఉన్నప్పుడే వైవిధ్యం కనిపిస్తుంది. ఏఐ నిర్మాణంలో అందరి భాగస్వామ్యం ఉంటే పక్షపాతం కనిపించదు. వైవిధ్యమైన, ప్రభావంతమైన ఏఐ భవిష్యత్ కోసం స్రీ, పురుషుల సమానభాగస్వామ్యం ఉండాలి’ అంటుంది ఒపెన్ఏఐ కంపెనీ పాలసీ అండ్ పాట్నర్షిప్స్ హెడ్ ప్రగ్యా మిశ్రా. ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం)కి సంబంధించి మన దేశంలో మహిళలు ముందంజలో ఉన్నారని నివేదిక పేర్కొంది. అయితే కంప్యూటర్ సైన్స్, ఏఐలాంటి క్లిష్టమైన విభాగాలలో పరిస్థితి వేరే విధంగా ఉంది. ఐఐటీ విద్యార్థులలో మహిళలు 15 శాతం మంది మాత్రమే ఉన్నారు. స్టార్టప్ ప్రపంచంలో కూడా లింగ అంతరం స్పష్టంగా కనిపిస్తుంది. మన దేశంలోని ఏఐ స్టార్టప్లలో ఉమెన్ ఫౌండర్స్ పది శాతం మాత్రమే ఉన్నారు. దేశంలో అత్యధికంగా నిధులు సమకూర్చుకున్న 24 ఏఐ స్టారప్లలో ఏ ఒక్కదానిలో ఉమెన్ ఫౌండర్ లేరు.అయితే, ఆశారేఖలాంటి విషయం ఏమిటంటే జనరేటివ్ ఏఐ కోర్సులలో మహిళల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. టెక్ రంగంలో యువతులకు ఏఐ, ఎంఎల్ టాప్ కెరీర్ ఆప్షన్గా మారింది. ‘మన దేశంలోని మహిళలు యూజర్ల స్థాయి నుండి ఏఐ రూపకర్తల స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ద్వారాలు తెరవాలి. బాలికలకు పాఠశాల స్థాయి నుంచే ఏఐకి సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని అందించాలి. మహిళల నేతృత్వంలోని ఏఐ పరిశోధన సంస్థలు, స్టార్టప్లకు తగిన నిధులు సమకూర్చాలి’ అంటుంది మైక్రోసాఫ్ట్ సీనియర్ ప్రిన్సిపల్ రిసెర్చర్ కలిక బాలి. (చదవండి: అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్ యూనివర్స్ పోటీ..) -
టీసీఎస్ ఏఐ రీసెర్చ్ సెంటర్
ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) శుక్రవారం.. బ్రెజిల్లో ఏఐ పవర్డ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించింది. 1,000 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ కేంద్రం ఇన్స్పెర్స్ విలా ఒలింపియా క్యాంపస్లో ఉంది.ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్.. కస్టమర్లు, భాగస్వాములు, స్టార్టప్లు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు కలిసి ఏఐ & ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల శక్తి ద్వారా ఆవిష్కరణలను నడిపించడానికి, వ్యాపారాలను మార్చడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా.. బ్రెజిల్, లాటిన్ అమెరికాకు సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి ఒక ప్రదేశంగా ఈ సెంటర్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.లాటిన్ అమెరికాలో పెట్టుబడి అనేది.. టీసీఎస్ యొక్క ప్రపంచ ఆవిష్కరణ కేంద్రాల నెట్వర్క్ విస్తరణను సూచిస్తుంది. కంపెనీ భాగస్వామ్యంతో.. ఇన్స్పెర్ కార్నెల్, ఇంపీరియల్ కాలేజ్, ఎంఐటీ & ఇతర విద్యా సంస్థలు టీసీఎస్ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలో చేరనున్నాయి. లాటిన్ అమెరికాలో సంక్లిష్టమైన సామాజిక, మార్కెట్ సవాళ్లను పరిష్కరించడానికి పరిశోధన & ఆవిష్కరణలు ఉపయోగపడతాయి.టీసీఎస్ కంపెనీ 2002లో లాటిన్ అమెరికాలో పనిచేయడం ప్రారంభించింది. ప్రస్తుతం అర్జెంటీనాతో సహా తొమ్మిది దేశాలలో.. 16 నగరాల్లో పనిచేస్తోంది. దీన్నిబట్టి చూస్తే కంపెనీ ఎంత అభివృద్ధి చెందిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
ఏమిటి ఈ వైబ్కోడింగ్.. ఉపయోగాలేమిటి?
ఇటీవలి కాలంలో ‘వైబ్కోడింగ్’ అనే మాట బాగా పాపులర్ అయింది. డిక్షనరీలలో కూడా చేరింది. కంప్యూటర్ సైంటిస్ట్, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ ఏఐ కోఫౌండర్ ఆండ్రెజ్ కర్పతి (Andrej Karpathy) ద్వారా ‘వైబ్కోడింగ్’ అనేది ప్రాచుర్యం పొందింది. కోడర్ల నుంచి సామాన్యుల వరకు ‘వైబ్కోడింగ్’ చేస్తున్నారు.ఇంతకీ ఏమిటి ఈ వైబ్కోడింగ్? సాఫ్ట్వేర్ను సృష్టించడానికి చాట్బాట్ ఆధారిత విధానాన్ని అనుసరించడమే వైబ్కోడింగ్. ఇందులో డెవలపర్ ఒక ప్రాజెక్ట్ లేదా పనికి సంబంధించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)కు వివరిస్తారు. ఇది ప్రాంప్ట్ ఆధారంగా కోడ్ను జనరేట్ చేస్తుంది. అయితే డెవలపర్ కోడ్ను ఎడిట్, రివ్యూ చేయడంలాంటివేమీ చేయడు. మార్పులు చేర్పులు చేసి మరింత మెరుగు పరచాలనుకుంటే ‘ఎల్ఎల్ఎం’ని అడుగుతాడు. స్థూలంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో విస్తృత శిక్షణ. నైపుణ్యం లేని అమెచ్యూర్ ప్రోగ్రామర్స్ కూడా వైబ్కోడింగ్ ద్వారా సాఫ్ట్వేర్ సృష్టించవచ్చు. ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్ట్ కెవిన్ రూస్ ‘వైబ్కోడింగ్’ మెథడ్ను ఉపయోగించి ఎన్నో స్మాల్ స్కేల్ అప్లికేషన్లను రూపొందించాడు.‘మెనుజెన్’లాంటి ప్రోటోటైప్లను నిర్మించడానికి ‘వైబ్కోడింగ్’ మెథడ్ను ఉపయోగించాడు. ఏదైనా ఎర్రర్ కనిపించినప్పుడు ఆ ఎర్రర్ మెసేజెస్ను కామెంట్ లేకుండానే సిస్టమ్లో కాపీ, పేస్ట్ చేసేవాడు. దీనితో జరిగిన లోపాలను ఏఐ సవరిస్తుంది. వైబ్ మార్కెటింగ్, వైబ్ డిజైనింగ్, వైబ్ అనలిటిక్స్, వైబ్ వర్కింగ్...ఇలా రకరకాలుగా ‘వైబ్కోడింగ్’ పాపులర్ అయింది.‘వైబ్కోడింగ్’లో సానుకూల విషయాలు ఉన్నా విమర్శలు కూడా ఉన్నాయి. ‘జవాబుదారీతనం లోపిస్తుంది’ ‘భద్రతా సమస్యలు ఏర్పడతాయి’ ‘కార్యాచరణ పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఏఐ సృష్టించిన కోడ్ను ఉపయోగించడం వల్ల గుర్తించబడని బగ్లు, లో΄ాలు, భద్రతాపరమైన సమస్యలు ఏర్పడతాయి’...అనేవి ఆ విమర్శల్లో కొన్ని. ప్రోగ్రామర్లు కానివారిని కూడా ఫంక్షనల్ సాఫ్ట్వేర్ను రూపొందించడానికి ‘వైబ్కోడింగ్’ వీలు కల్పిస్తున్నప్పటికీ ఈ మెథడ్ ద్వారా ‘వందశాతం కరెక్టే’ అనుకోవడానికి లేదు. ఊహించినంత ఫలితాలు రాకపోవచ్చు. ఊహించింది ఒకటి అయితే ఫలితం మరోలా ఉండవచ్చు.‘లవబుల్’ అనేది స్వీడీష్ వైబ్ కోడింగ్ యాప్. ఈ యాప్ కోసం రూపొందించిన కోడ్లో భద్రతా లోపాలు ఉన్నాయని, లవబుల్ వెబ్అప్లికేషన్లలో వ్యక్తిగత సమాచారాన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని...ఇలా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. ఒక ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో ఫేక్ రివ్యూలు సృష్టించడానికి ఈ మెథడ్ను ఉపయోగించుకున్నారు. వైబ్కోడింగ్ గురించి ‘ఐ జస్ట్ సీ థింగ్స్, సే థింగ్స్, రన్ థింగ్స్, అండ్ కాపీ థింగ్స్’ అని కాస్త గొప్పగా చెప్పిన ఆండ్రేజ్ కూడా ఈ మెథడ్లోని పరిమితుల గురించి ఎన్నో సందర్భాలలో చెప్పాడు. కొన్ని బగ్స్ రిపేర్కు సంబంధించి టూల్స్ విఫలమయ్యాయి అనేది అందులో ఒకటి. -
12 ఏళ్ల కుర్రాడితో అభ్యంతరకర సంభాషణ!
ఈ మధ్య కాలంలో ఎటు చూసిన ఏఐ ఛాట్బోట్లే. స్మార్ట్ఫోన్లో, బ్యాంకింగ్, వాహనాలు... ఛాట్బోట్లు లేని రంగం అంటూ లేకుండా పోయింది. మంచిదే కదా? మన పనులు సులభం చేసేస్తాయి కదా? అనుకుంటున్నారా? ఇది సగం వాస్తవం. మిగిలిన సగం చాలా ఇబ్బందికరమైంది. ఎలాగంటారా? కెనడాలో గత నెల జరిగిన ఒక ఘటన చెబుతంది ఆ విషయాన్ని. ఫరా నాసర్ కెనెడాలో ఒక జర్నలిస్ట్. పన్నెండేళ్ల కుమారుడితో కలిసి టెస్లా కారులో ఎక్కడికో వెళుతోంది. పిల్లాడు కారులోని ఛాట్బోట్తో సరదాగా మాట్లాడుతున్నాడు. రకరకాల ఐస్క్రీమ్స్, డెజర్ట్స్లో చక్కెర ఎంతెంత ఉంటుందని కుర్రాడు అడగడం.. టెస్లా ఛాట్బోట్ గ్రోక్ దానికి సమాధానం ఇవ్వడం నాసర్ విన్నారు. సంభాషణంతా మామూలుగానే గడిచిపోయింది. మరుసటి రోజు కుర్రాడు ఇంకో ప్రశ్న వేశాడు. ఫుట్బాల్ గురించి గ్రోక్తో మాట్లాడుతూ.. ‘‘క్రిస్లియానో రొనాల్డో, లయొనిల్ మెస్సీల్లో ఎవరు గొప్ప’’ అని అడిగాడు. అదే సమయంలో ఆ కుర్రాడు గ్రోక్ వ్యక్తిత్వాన్ని కాస్త ‘గోర్క్’కు మార్చేశాడు. సోమరిపోతైన పురుషుడిలా సమాధానాలిస్తుందన్న మాట ఈ పర్సనాలిటీ మోడ్లో చర్చ ఇలా నడుస్తూండగానే సడన్గా గోర్క్ అడిగిన ప్రశ్నకు నాసర్ బిత్తరపోయింది. ఎందుకంటే.. పన్నెండేళ్ల కుర్రాడిని అడగకూడనిది అడిగిందా ఛాట్బోట్. ‘‘నగ్ర చిత్రాలు పంపు’’ అని!! ఇదే విషయాన్ని వివరిస్తూ నాసర్ తాజాగా ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేశారు. ఏమిటీ గోర్క్?ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా విద్యుత్తుతో నడిచే కార్ల తయారీలో పేరెన్నిక గన్న విషయం తెలిసిందే. ఎక్స్తోపాటు టెస్లా కార్లలోనూ గ్రోక్ పేరుతో ఒక ఏఐ ఆధారిత ఛాట్బోట్ను ఏర్పాటు చేశారు. ఫ్యాక్ట్చెక్లతోపాటు ఏదైనా అంశానికి సంబంధించిన అనుమానాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది దీంతో. అయితే కో-పైలట్, పర్ప్లెక్సిటీ, జెమిని, ఛాట్జీపీటీ వంటి అనేక ఏఐ ఆధారిత బోట్లతో పోలిస్తే ఇది కొంచెం భిన్నం. మనం ప్రశ్న అడిగిన తీరును బట్టి సమాధానం మారిపోతుంది. తెలివైన ప్రశ్న వేస్తే.. అంతే తెలివిగా, తుంటరి ప్రశ్న వేస్తే అంతకంటే తుంటరిగా జవాబిస్తుంది. వెటకారమాడితే.. తన కూడా అదే తీరులో సమాధానమిస్తుంది. అయితే.. నాసర్ కుమారుడు అడిగిన ప్రశ్నకు, గోర్క్ (గ్రోక్ తాలూకూ ఒక వ్యక్తిత్వం) సమాధానానికి అస్సలు పొంతన లేకపోవడం గమనార్హం. పైగా 12 ఏళ్ల కుర్రాడితో అలా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదని నాసర్ అంటున్నారు. ఆ సమాధానం విని.. ‘‘నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు’’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు. మాట్లాడే వ్యక్తి వయసుకు తగ్గట్టు ఏఐ తన సమాధానాలను మార్చుకునేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా మరోసారి ఏఐ, నైతిక విలువలు, కార్పొరేట్ సంస్థల బాధ్యత అన్న అంశాలపై చర్చకు జీవం పోసింది. ఈ అంశంపై టెస్లా కూడా స్పందించింది. అక్టోబరు 17న ఈ ఘటన జరిగిందని, పిల్లల భద్రతకు కంపెనీ అత్యధిక ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఏఐ ఛాట్బోట్లలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఫరా నాసర్ ట్వీట్ ఇప్పుడు ఎక్స్ వేదికపై లేకపోవడం కొసమెరుపు! సీబీసీలో తన అనుభవాన్ని వివరిస్తున్న ఫరా నాసర్ వీడియో. -
పార్కింగ్ సమస్యకు AIతో చెక్
సాక్షి, స్పెషల్ డెస్క్: నగర వాసులకు పార్కింగ్ సమస్యల గురించి కొత్తగా చెప్పక్కర లేదు. వాహనం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొన్నవారే. మాల్స్, పెద్ద హోటళ్ల విషయంలోనూ ఇటువంటి ఇబ్బంది తప్పడం లేదు. ఇతర ప్రదేశాల్లో కారు పార్క్ చేద్దామంటే స్థలం దొరకని పరి స్థితి. లేదా ఆ కొద్ది స్థలంలో అప్పటికే వాహ నాలు సేదతీరుతుంటాయి. వారాంతాలు, పండుగల సమయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. భారత్లో పార్కింగ్ అనేది వాహన దార్లకు రోజువారీ అసౌకర్యం మాత్రమే కాదు. పూర్తి స్థాయి పట్టణ సంక్షోభం కూడానూ.ఈ సమస్యకు.. మహారాష్ట్రకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి చేపట్టిన పరిశోధన ఆశాదీపంలా కనిపి స్తోంది. భారత్లో ఏటా కోట్లాది కొత్త వాహనాలు రోడ్డెక్కు తున్నాయి. 2024–25లో అన్ని విభాగాల్లో కలిపి 2.56 కోట్లకుపైగా వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. వీటి స్థాయిలో పార్కింగ్ స్థలాలు మాత్రం పెరగడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాయంతో ఈ పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టవచ్చని మహారాష్ట్రలోని ఎస్ఎన్ జేబీకి చెందిన కాంతాబాయి భావర్లాల్జీ జైన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రణవ్ సునీల్ ఉపాసనీ చేసిన కొత్త పరిశోధన చెబుతోంది.ఇంధనం సైతం ఆదా..‘ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ రీసెర్చ్ ఇన్ అప్లైడ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ’లో ప్రచురితమైన ఈ పరిశోధనలో ఏఐ, ఐఓటీ ఆధారిత స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను ప్రణవ్ సునీల్ ఉపాసనీ ప్రతిపాదించారు. పార్కింగ్ స్థలాలలో చిన్న సెన్సార్స్ ఏర్పాటు చేయాలి. ఇవి స్లాట్ ఖాళీగా ఉందా లేదా గుర్తిస్తాయి. ఈ సమాచారం క్లౌడ్కి వెళుతుంది. అక్కడి ఏఐ వ్యవస్థ స్లాట్ ఏ సమయంలో, ఎక్కడ ఖాళీగా ఉంటుందో అంచనా వేస్తుంది.స్మార్ట్ఫోన్ లోని ఒక సాధారణ యాప్ యూజర్కు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న పార్కింగ్ను చూపుతుంది. అవసరమైతే యూజర్ వెళ్లే స్థలంలో పార్కింగ్ స్లాట్ను ముందే బుక్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది. గూగుల్ మ్యాప్స్ను ఉపయోగించినట్టుగానే మొబైల్ ఫోన్లో ఖాళీ పార్కింగ్ స్థలాన్ని చూసుకోవచ్చు. పార్కింగ్ కోసం వెతికే సమయాన్ని ఇలాంటి వ్యవస్థ 40% వరకు తగ్గించగలదని, ఇంధనాన్ని సైతం ఆదా చేయ గలదని, ట్రాఫిక్ జామ్స్ను తగ్గించగలదని అధ్యయనం వెల్లడించింది.పూర్తి స్థాయిలో వినియోగంలోకి..ఇల్లు, ఆఫీసు నుంచి బయలుదేరి ఒక యాప్ తెరిచి.. వెళ్లాల్సిన మాల్, హోటల్, షాపింగ్ ఏరియాలో ఏ స్థలం ఖాళీగా ఉందో చూడగలిగితే అంతకంటే సౌకర్యం ఏముంటుంది! రోజువారీ పార్కింగ్ సమాచారమేకాదు.. వారాంతాలు, పండుగ రద్దీలను సైతం అధ్యయనం చేయగలిగే సత్తా ఏఐకి ఉందని అధ్యయనం వెల్లడించింది. ‘పార్కింగ్ లభ్యతను ముందుగానే అంచనా వేయడానికి ఈ సమాచారం దోహదం చేస్తుంది. వాహనదార్లకు పార్కింగ్ సౌలభ్యాన్ని మెరు గు పరచడంతోపాటు తక్కువగా ఉపయోగిస్తున్న పార్కింగ్ జోన్స్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవొచ్చు. రోడ్ల మీద అక్రమ పార్కింగ్ను తగ్గిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్, ఆటో మేటెడ్ బిల్లింగ్ సిస్టమ్స్కు దోహదం చేస్తుంది. ఈ ఆలోచనను వాస్తవ రూపంలోకి తీసుకు రావడానికి ప్రభుత్వ విభాగాలు, టెక్ కంపెనీలు, సిటీ ప్లానర్స్ మధ్య సహకారం, సమన్వయం కావాలి’ అని తెలిపింది.ఇలా పనిచేస్తుంది..⇒ పార్కింగ్ ప్లేస్లలో సెన్సార్స్ ఏర్పాటు చేయాలి.⇒ ఈ సెన్సార్స్ స్లాట్ ఖాళీగా ఉందా లేదా గుర్తిస్తాయి.⇒ ఈ సమాచారం క్లౌడ్లో లైవ్లో నిక్షిప్తం అవుతుంది.⇒ స్లాట్ ఏ సమయంలో, ఎక్కడ ఖాళీగా ఉంటుందో ఏఐ అంచనా వేస్తుంది. ⇒ స్మార్ట్ఫోన్ లోని యాప్ ద్వారా ఖాళీగా ఉన్న పార్కింగ్ స్లాట్స్ను చూడవచ్చు. ఇవీ ప్రయోజనాలు..⇒ ట్రాఫిక్ గందరగోళం తగ్గుతుంది⇒ వెతుకులాట తగ్గడంతో కాలుష్యమూ దిగొస్తుంది⇒ పార్కింగ్ స్థలాలను మెరుగ్గా వినియోగించుకోవచ్చు⇒ వాహనదార్లకు సౌకర్యవంతం -
నిర్లక్ష్య డ్రైవింగ్కు ఏఐ బ్రేకులు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలతో దేశంలో ఏటా 1.6లక్షల మంది దుర్మరణం చెందుతున్నారు. అందులో 80 శాతం ప్రమాదాలకు డ్రైవర్ల తప్పిదాలే ప్రధాన కారణం. అందుకే నిర్లక్ష్యపూరితంగా డ్రైవింగ్ చేసేవారిపై కొరడా ఝుళిపించేందుకు కేంద్ర రవాణా శాఖ సిద్ధమవుతోంది. నిర్లక్ష్యపూరిత డ్రైవర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో కట్టడి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణ లోపాలకు బాధ్యులైన కాంట్రాక్టు సంస్థలపై కూడా కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ రహదారి భద్రత ప్రణాళిక–2030ను కేంద్ర రవాణా శాఖ ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు యూకే, సింగపూర్ దేశాల్లో అమలు చేస్తున్న డ్రైవర్ల బిహేవియర్ డేటా ట్రాకింగ్ వ్యవస్థను మన దేశంలో ప్రవేశపెడతామని తెలిపింది. ఇందుకనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. జాతీయ రహదారి భద్రత ప్రణాళికలో కొన్ని ముఖ్యాంశాలు... » నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారికి కేవలం జరిమానాలు విధించడంతో సరిపెట్టకూడదని కేంద్రం స్పష్టం చేసింది. పదేపదే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం అలవాటుగా మారిన వాళ్లకు ‘డేంజరస్ డ్రైవింగ్ బిహేవియర్’ అనే కేటగిరీ కింద చేర్చాలని ఆదేశించింది. అందుకోసం పోలీసు, రవాణా, అటవీ, ఎన్హెచ్ఏఐ తదితర విభాగాలు రహదారులపై నెలకొల్పే సీసీ కెమెరాల ఫుటేజీలు, ఈ–చలానా డేటాను అధ్యయనం చేస్తారు.» ‘డేంజరస్ డ్రైవింగ్ బిహేవియర్’ కేటగిరీలో చేర్చినవారు మానసిక నిపుణులు, ఇతర నిపుణుల వద్ద కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుంది. అయినా సరే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కొనసాగించినట్టు నిర్ధారణ అయితే వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తారు. ఈ డ్రైవర్ల ప్రొఫైళ్లను వ్యక్తిగత బీమా, వాహన బీమా సంస్థల డేటాతో అనుసంధానిస్తారు. » రోడ్డు ప్రమాదాలకు రహదారుల నిర్మాణ లోపాలే కారణమని నిర్ధారణ అయితే సంబంధిత కాంట్రాక్టు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రమాదాలపై దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చర్యలు ఉంటాయి.» డ్రైవర్ల ప్రొఫైల్స్ను రూపొందించి వారి డాటా ట్రాకింగ్ విధానాన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 2026లో మొదలు పెడతారు. 2030నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర రవాణాశాఖ నిర్ణయించింది. -
మస్క్లాంటి వారు మాత్రమే సంపన్నులవుతారు!
కృత్రిమ మేధ(AI) వేగంగా అభివృద్ధి చెందడం మొదలైనప్పటి నుంచి ఉద్యోగాల కోత సంచలనంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వాటి కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగిస్తూ వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ గాడ్ ఫాదర్గా పిలువబడే జెఫ్రీ హింటన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐలో వస్తున్న మార్పు భవిష్యత్తులో కోట్లాది మందిని నిరుద్యోగులుగా మారుస్తుందని, ఈలోగా కేవలం ఎలాన్ మస్క్ వంటి కొద్దిమంది మాత్రమే ధనవంతులు అవుతారని జోస్యం చెప్పారు.కంపెనీల వైఖరిఇప్పటికే టెక్ దిగ్గజాలైన ఐబీఎం, టీసీఎస్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు ఏఐని అమలు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఈ ధోరణి ఇప్పట్లో ఆగిపోయే అవకాశం లేదని హింటన్ బ్లూమ్బెర్గ్కు ఇచ్చిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోకుండా ఏఐతో ముందుకు వెళ్లే మార్గం ఉందా అని అడిగినప్పుడు ‘అది సాధ్యం కాదని నమ్ముతున్నాను. డబ్బు సంపాదించాలంటే మానవ శ్రమను భర్తీ చేయాలి. అందుకు ఏఐను వాడుతున్నారు. కంపెనీలు లాభాలు పెంచుకునేందుకు ఈ పంథాను వినియోగిస్తున్నాయి’ అన్నారు.ఏఐ సమస్య కాదు.. సామాజిక సమస్య..ఏఐ అభివృద్ధి వల్ల ఏర్పడే ఆర్థిక అసమానతపై జెఫ్రీ హింటన్ మాట్లాడుతూ.. ‘టెక్ బిలియనీర్లు మాత్రమే ఈ రేసులో విజేతలుగా నిలుస్తారు. గణనీయ సంఖ్యలో ఉద్యోగుల స్థానంగా ఏఐ పని చేస్తుంది. మస్క్ వంటి వ్యక్తులు మాత్రమే ధనవంతులు అవుతారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు. ఇది ఏఐ సమస్య కాదు, సామాజిక సమస్య. ఏఐ మన సమాజాన్ని, మన ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మిస్తుందనేది నిశితంగా గమనించాలి’ అన్నారు.ఇదీ చదవండి: ఏఐ బూమ్ ఎఫెక్ట్: ఫ్లాష్ మెమరీ కాంపోనెంట్ల కొరత -
ఏఐ బూమ్ ఎఫెక్ట్: ఫ్లాష్ మెమరీ కాంపోనెంట్ల కొరత
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వృద్ధి కారణంగా ఏర్పడిన గ్లోబల్ ఫ్లాష్ మెమరీ కాంపొనెంట్ల కొరత వల్ల ఎల్ఈడీ టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్ఈడీ టీవీలు సహా అనేక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఫ్లాష్ మొమరీ కాంపొనెంట్ల తయారీలో కీలకంగా ఉన్న కంపెనీలు అధిక మార్జిన్ కలిగిన ఏఐ డేటా సెంటర్ల వైపు మళ్లడమేనని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఫ్లాష్ మెమరీ ధరలు పెరుగుదలLED టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్లో విరివిగా ఉపయోగిస్తున్న ఫ్లాష్ మెమరీ ధరలు కొద్ది నెలల్లోనే భారీగా పెరిగాయి. వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపిన వివరాల ప్రకారం 1GB/8GB మెమరీ ధర ఏప్రిల్లో 2.61 డాలర్ల వరకు ఉండగా అక్టోబర్ నాటికి అది ఏకంగా 14.40 డాలర్లకు పెరిగింది. కేవలం మూడు నెలల్లోనే ఈ ధరల పెరుగుదల 50 శాతానికిపైగా చేరాయి. ఇది టీవీ తయారీదారుల ఇన్పుట్ ఖర్చులపై ఒత్తిడి పెంచింది.ఏఐ డిమాండ్: సాధారణ ఎలక్ట్రానిక్స్కు అంతరాయంసెమీకండక్టర్ పరిశ్రమలోని ప్రధాన కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల వైపు దృష్టి సారించడమే ఈ కొరతకు మూలకారణం అని తెలుస్తుంది. చిప్ తయారీదారులు ఏఐ డేటాసెట్లలో ఉపయోగించే DDR6, DDR7 చిప్ సెట్ల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని కారణంగా టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్ల్లో సాధారణంగా వాడే DDR3, DDR4 మెమరీ ఉత్పత్తి తగ్గిపోయింది.ఎస్పీపీఎల్(థామ్సన్ బ్రాండ్ లైసెన్స్) సీఈఓ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ..‘2021-22 చిప్సెట్ కొరత తర్వాత ఫ్లాష్ మెమరీ అతిపెద్ద సమస్యగా ఉంది. త్వరలో ఎల్ఈడీ టెలివిజన్ ధరలు పెరుగుతాయి’ అన్నారు. ఈ మెమరీ కాంపోనెంట్స్ ప్రధానంగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులు 2026 కోసం మెమరీ సెట్లను భద్రపరచడానికి పోటీ పడుతుండటంతో సరఫరా గొలుసు అంతరాయాలు పెరిగి ధరల ఒత్తిడి మరింత తీవ్రమైందని నిపుణులు చెబుతున్నారు.ఈ కొరత ఎప్పటివరకంటే..ఈ కొరత కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల వరకు కొనసాగుతుందని ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (OEMలు) అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీలు తమ ఆర్డర్లను వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇన్వెంటరీని క్రమబద్ధీకరిస్తున్నాయి.టీవీలలో ఫ్లాష్ మెమరీని ఎందుకు ఉపయోగిస్తారంటే..స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ టీవీ, వెబ్ఓఎస్ (webOS), టైజెన్ (Tizen) వంటి ఆపరేటింగ్ సిస్టమ్లపై పనిచేస్తాయి. ఈ OS కోడ్, టీవీని నడిపించే ఫర్మ్వేర్ (firmware) కోడ్ అంతా ఫ్లాష్ మెమరీలోనే శాశ్వతంగా నిల్వ అవుతుంది. టీవీని ఆన్ చేసినప్పుడు ఫ్లాష్ మెమరీలోని ఈ OS, ఫర్మ్వేర్ నుంచి డేటా లోడ్ అవుతుంది. అప్పుడే టీవీ పనిచేయడం మొదలవుతుంది.నెట్ఫ్లిక్స్ (Netflix), యూట్యూబ్ (YouTube), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వంటి యాప్లను వినియోగదారులు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ఫ్లాష్ మెమరీ స్థలాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: రుణదాతలకు ఉపశమనం.. ఈడీ, ఐబీబీఐ ఎస్ఓపీ ఖరారు -
భారత ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాల్లో మార్పులు
భారతదేశం ఇటీవల ఆవిష్కరించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పాలనా మార్గదర్శకాలు దేశ సాంకేతిక నియంత్రణ విధానంలో కీలకమైన మార్పును సూచిస్తున్నాయి. తక్షణమే కఠినమైన చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం ‘ఇన్నోవేషన్-ఫస్ట్’ విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలుస్తుంది. దీని ద్వారా ఇప్పటికే ఉన్న చట్టాలకు అనుకూల సవరణలు చేసి ఏఐ వ్యవస్థలను నియంత్రించాలని నిర్ణయించింది.ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్త ఏఐ చట్టాన్ని ప్రతిపాదించకుండా ఏఐ వ్యవస్థలను నియంత్రించడంలో ఉన్న లోపాలను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న చట్టాలను సమగ్రంగా సమీక్షించాలని పిలుపునిచ్చింది. ఏఐ రంగంలో వేగంగా ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.సవరణలు వీటిలోనే..ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (DPDP), 2023ఏఐ వ్యవస్థలు స్వయంగా డేటాను సవరించడం లేదా ఉత్పత్తి చేయడం వల్ల ఇంటర్మీడియరీల(మధ్యవర్తుల) ప్రస్తుత రక్షణ నిబంధనలకు సవాలు ఏర్పడుతుంది. ఏఐ-సృష్టించిన కంటెంట్కు ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై నియంత్రణపరమైన స్పష్టత కొరవడింది. ఈక్రమంలో పైన తెలిపిన చట్టాల్లో ఈమేరకు సవరణలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమస్యను పర్యవేక్షించడానికి ప్రభుత్వం సంస్థాగత ఫ్రేమ్ వర్క్ను అమలు చేయాలని నిర్ణయించింది. ఏఐ గవర్నెన్స్ గ్రూప్(ఏఐ గవర్నెన్స్ను పర్యవేక్షించే ప్రధాన సంస్థ), టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్పర్ట్ కమిటీ (TPEC-నిర్దిష్ట చట్టపరమైన లోపాలను గుర్తించడం, సవరణలను ప్రతిపాదించడం, అమలును పర్యవేక్షించడం)వంటి వాటిని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా? -
లక్షల్లో వేతనాలు.. ఉంటే చాలు ఈ స్కిల్!
నేడు కృత్రిమ మేథ (ఏఐ) వాయు వేగంతో విస్తరిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక సరికొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తోంది. ప్రతి ఒక్క పనికి ఏఐ చాట్బాట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి చాలా తేలిగ్గా, తక్కువ వ్యయంతో అధిక సమర్థతతో పనిచేస్తున్నాయి. నలుగురు చేయాల్సిన పని ఒక్కరితోనే పూర్తవుతోంది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్క వృత్తిలో సమర్థత పెంపులో ఏఐ నైపుణ్యం అత్యంత ఆవశ్యకంగా మారుతోంది. ఏఐ వృత్తి పరంగా, వ్యక్తిగతంగా పని విధానాలను సమూలంగా మార్చివేస్తోంది. పని ప్రదేశాన్నే కాదు జీవన విధానాలనే మార్చివేస్తున్న కృత్రిమ మేథ నైపుణ్యం.. తాజా సర్వేల్లో టాప్ స్కిల్గా నిలుస్తోంది.ఏఐ స్కిల్ ఉన్న నిపుణుల కోసం కంపెనీలు అన్వేషణ సాగిస్తున్నాయి. కృత్రిమ మేథపై పట్టున్న వారికి లక్షల్లో వేతనాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడటంలేదు. అందుకే ఇప్పుడు కెరీర్ పరంగా ఏఐ కీలక నైపుణ్యంగా మారింది.మరింత విస్తరణ దిశగామైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, ఓపెన్ ఏఐ వంటి పెద్ద టెక్ కంపెనీలు డేటా కేంద్రాలు, ఏఐ మౌలిక వసతులపై బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఏఐ రంగం మరింతగా విస్తరిస్తుందనేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇంతటి భారీ స్థాయిలో ఏఐపై పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు.. వీటి నిర్వహణకు అవసరమైన మానవ వనరుల నియామకాలు అదే స్థాయిలో చేపట్టనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో కృత్రిమ మేథ కీలకమైన నైపుణ్యంగా మారనుంది. తాజా నివేదిక అంచనాలుద వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్–2025’ ప్రకారం.. అన్ని రంగాలను డిజిటల్ టెక్నాలజీ కమ్మేయనుంది. 2030 నాటికల్లా తమ వ్యాపారాలు పూర్తిగా డిజిటల్గా మారతాయని భావిస్తున్నట్లు 60 శాతం మంది పేర్కొనడం విశేషం. అత్యాధునిక సాంకేతికత ముఖ్యంగా ఏఐ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ 86 శాతం, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ 58 శాతం, ఎనర్జీ జనరేషన్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 41 శాతం డిజిటల్ మార్పులకు కారణం కానున్నాయి. డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో ఏఐ, బిగ్డేటా, నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలకు భారీ డిమాండ్ ఏర్పడనుందని ఈ నివేదిక అంచనావేసింది.డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో.. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్లు, బిగ్ డేటా స్పెషలిస్ట్లు, ఫిన్టెక్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ డవలపర్స్, అటానమస్ అండ్ ఈవీ స్పెషలిస్ట్లు తదితర ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంటుందని తాజా పేర్కొంది. మరోవైపు క్లరికల్, సెక్రటేరియల్ ఉద్యోగాలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా క్యాషియర్స్, టికెట్ క్లర్క్స్, డేటా ఎంట్రీ క్లర్క్స్, బ్యాంక్ టెల్లార్ కొలువుల్లో కోతపడనుంది.అత్యంత వేగంగా డిమాండ్ పెరుగుతున్న నైపుణ్యాల్లో ఏఐ అండ్ బిగ్ డేటా టాప్లో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ లిటరసీ నిలిచాయి. ఈ మూడు టెక్ నైపుణ్యాలతోపాటు 2025–2030 మధ్యకాలంలో సృజనాత్మక ఆలోచన (క్రియేటివ్ థింకింగ్) ఒత్తిళ్లను తట్టుకొనే సామర్థ్యం (రెజిలియెన్స్), సరళత్వం-చురుకుదనం (ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎజిలిటీ), కుతూహలం (క్యూరియాసిటీ), జీవితాంతం నేర్చుకోవాలి అనే అభిలాష ఉన్న వారికి కంపెనీలు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.నిపుణుల కొరతఏఐ నిపుణుడిగా మారాలంటే.. ఐఐటీల్లో చదవాలి, టాప్ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు ఉండాలి అనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.ఓ వైపు ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుంటే.. మరోవైపు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిపుణులు అందుబాటులో లేరని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో మానవ వనరుల నైపుణ్యాలు, కంపెనీల అవసరాల మధ్య తీవ్ర అంతరం నెలకొంది. ఏఐ నిపుణుల కొరత తీర్చేందుకు పెద్ద ఎత్తున అప్స్కిల్లింగ్ చేపట్టాలని సూచిస్తున్నారు.ఏఐ రంగంలో ప్రవేశించాలనుకునే వారు వ్యక్తిగతంగా స్వీయ అసెస్మెంట్ చేసుకోవాలి. జాబ్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా తమలో నైపుణ్యాలు లేకుంటే వాటిని మెరుగుపరచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. మొదట యూట్యూబ్ తదితర ఆన్లైన్ మార్గాల ద్వారా ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత బేసిక్ ఆన్లైన్ షార్ట్టర్మ్ కోర్సుల ద్వారా ప్రాథమిక అంశాలు నేర్చుకోవచ్చు. స్వయం, ఎన్పీటీఈఎల్ తదితర మార్గాల ద్వారా ఐఐటీలు వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ అందిస్తున్న ఉచిత కోర్సుల ద్వారా ఏఐపై పట్టు పెంచుకొని జాబ్ మార్కెట్లో అవకాశాల కోసం అన్వేషించొచ్చు!!ఇదీ చదవండి: డిజిటల్ యుగంలో.. ఏఐ హవా! -
అలాంటి ప్రాజెక్టులు ఆపేయండి: మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాబోయే రోజుల్లో ప్రమాదమని చాలామంది.. గతకొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ 'ముస్తఫా సులేమాన్' కీలక వ్యాఖ్యలు చేశారు.ఏఐ తెలివిగా రోజురోజుకు మారుతోంది. గూగుల్, ఓపెన్ఏఐ, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద టెక్ కంపెనీలు.. దీనిని మరింత కొత్తగా మార్చడానికి బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అంతేకాకుండా.. ఏఐ ఇప్పటికే మనుషులు చేసే పనులను చేసేస్తోంది. కానీ ప్రస్తుతానికి మనుషులు మాదిరిగా ఆలోచించే జ్ఞానం మాత్రం పొందలేదు. రానున్న రోజుల్లో ఇది మరింత స్మార్ట్గా తయారయ్యే అవకాశం ఉంది. దీనికోసం చాలా కంపెనీలు కృషి చేస్తున్నాయని ముస్తఫా సులేమాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: నియామకాలు మళ్లీ షురూ!.. సత్య నాదెళ్లనిజానికి.. ఎంత ఖర్చు చేసినా.. మనిషిలా ఆలోచించే జ్ఞానం, తెలివితేటలు ఏఐకు ఎప్పటికీ రావు. దీనికోసం దిగ్గజ కంపెనీలు చేసే ప్రయత్నాలను ఆపాలని ముస్తఫా సులేమాన్ అన్నారు. ఆఫ్రోటెక్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. జీవసంబంధమైన జీవులు మాత్రమే నిజమైన భావోద్వేగం.. బాధలను అనుభవించగలవు. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించాలి అనే ప్రాజెక్టులు మానేసి.. మనిషికి సహాయం చేసే ఏఐ ప్రాజెక్టులపై పనిచేయడం ఉత్తమం అని డెవలపర్లకు సూచించారు. -
డిజిటల్ యుగంలో.. ఏఐ హవా!
‘నేటి డిజిటల్ యుగంలో.. మేనేజ్మెంట్ రంగంలో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాధాన్యం పెరుగుతోంది. తాజా క్యాంపస్ ఆఫర్లను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. కాబట్టి మేనేజ్మెంట్ విద్యార్థులు టెక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది’ అంటున్నారు ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–బెంగళూరు డైరెక్టర్ (ఇన్ఛార్జ్) ప్రొఫెసర్ యు.దినేశ్ కుమార్. ఐఐటీ–ముంబైలో పీహెచ్డీ, యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పూర్తి చేసి.. దాదాపు మూడు దశాబ్దాలుగా అధ్యాపక రంగంలో కొనసాగుతూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న దినేశ్ కుమార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ..మేనేజ్మెంట్ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాధాన్యం గురించి చెప్పండి?ఫైనాన్స్, హెచ్ఆర్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో ఏఐ ప్రధాన్యం పెరుగుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే కీలకమైన రికార్డ్స్ నిర్వహణ, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఏఐ ఆధారిత కార్యకలాపాలు మొదలయ్యాయి. మన దేశంలోనూ బిగ్ డేటా, డేటా అనలిటిక్స్లో ఏఐ ప్రమేయం ఎక్కువగా ఉంది. మిగతా విభాగాల్లోనూ రానున్న రోజుల్లో ఇది కనిపిస్తుంది. దీంతో మేనేజ్మెంట్ పీజీ విద్యార్థులు అకడమిక్గా టెక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది.బిజినెస్ స్కూల్స్ ఏఐకు సంబంధించిన బోధన పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?ఇండస్ట్రీ వర్గాలతో చర్చించి డిమాండ్ నెలకొన్న ఏఐ టూల్స్ను గుర్తించాలి. విద్యార్థులకు సదరు ఏఐ నైపుణ్యాలు అందించేలా పరిశ్రమ వర్గాలతో కలిసి పని చేయాలి. ఐఐఎం–బెంగళూరు మూడేళ్ల క్రితమే ఎస్ఏపీ ల్యాబ్స్తో ఒప్పందం చేసుకుంది. ఏఐ ఫర్ మేనేజర్స్ పేరుతో 16 నెలల లాంగ్టర్మ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను అందుబాటులోకి తెచ్చాం. దీనిద్వారా విద్యార్థులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ నైపుణ్యాలతోపాటు, ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ లభిస్తాయి.మేనేజ్మెంట్ విద్యార్థులకు సలహా?అందుబాటులోని సీట్ల సంఖ్య, పోటీ కారణంగా కొద్దిమందికే ఐఐఎంలలో ప్రవేశం లభిస్తుంది. అంతమాత్రాన నిరాశ చెందక్కర్లేదు. దేశంలో మరెన్నో ప్రతిష్టాత్మక బి–స్కూల్స్ ఉన్నాయి. విద్యార్థులు తమ దృక్పథాన్ని విస్తృతం చేసుకోవాలి. ఐఐఎంలతోపాటు ఉన్న ఇతర అవకాశాలపై దృష్టి సారించాలి. ఇక కోర్సులో అడుగు పెట్టాక.. విస్తృతమైన ఆలోచన దృక్పథంతో అడుగులు వేయాలి. ఒత్తిడి వాతావరణంలోనూ నిర్ణయాలు తీసుకునే ఆత్మస్థైర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావడం వంటివి సహజ లక్షణాలుగా అలవర్చుకోవాలి. అప్పుడే క్లాస్రూంలో పొందిన నైపుణ్యాలకు సరైన వాస్తవ రూపం లభించి చక్కటి కెరీర్ సొంతమవుతుంది.నియామకాల్లో ఏఐ నైపుణ్యాలపై కంపెనీల దృక్పథం ఎలా ఉంది?కంపెనీలు సహజంగానే లేటెస్ట్ స్కిల్స్పై అవగాహన ఉన్న వారి కోసం అన్వేషణ సాగిస్తాయి. కొన్ని కంపెనీలు.. ఏఐ కార్యకలాపాలు నిర్వహించగలిగే వారిని గుర్తించి వారికి శిక్షణనిచ్చి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. తాజాగా ఐఐఎం– బెంగళూరు సమ్మర్ ప్లేస్మెంట్స్లో బీసీజీ, బెయిన్ అండ్ కో, టీసీఎస్ వంటి సంస్థలు ఏఐ సంబంధిత విభాగాల్లో ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేశాయి.విద్యార్థుల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్పై పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా దేశంలో సదుపాయాలు ఉన్నాయా?వాస్తవానికి దేశంలో స్టార్టప్స్ కోణంలో గత పదేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా గత అయిదారేళ్ల కాలంలో స్టార్టప్ల దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. స్వయం ఉపాధి గురించి ఆలోచించే యువతకు ఎన్నో ప్రోత్సాహకాలు, అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. చక్కటి వ్యాపార ఐడియాలు ఉంటే ఆర్థికపరమైన అంశాల గురించి ఆందోళన చెందక్కర్లేదు.స్టార్టప్స్ ఏర్పాటు కోసం అకడమిక్ స్థాయి నుంచే అడుగు వేయాల్సిన అవసరం ఉందా?అకడమిక్ స్థాయిలో స్టార్టప్స్కు సంబంధించిన నైపుణ్యాలను బోధించడం వల్ల విద్యార్థులకు థియరీ నాలెడ్జ్ ఏర్పడుతుంది. కాని క్షేత్ర స్థాయిలో అడుగు పెడితేనే వాస్తవాలు తెలుస్తాయి. ఇటీవల కాలంలో స్టార్టప్స్కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ నేపథ్యంలో పలు ఇన్స్టిట్యూట్లు అకడమిక్ స్థాయిలో ప్రత్యేకంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సులతో తమ వ్యాపార ఆలోచనలను సరైన దిశలో కార్యాచరణలో పెట్టేందుకు అవసరమైన మార్గ నిర్దేశం విద్యార్థులకు లభిస్తుంది.ఇటీవల కాలంలో డేటా అనలిటిక్స్ జాబ్ ప్రొఫైల్స్కు డిమాండ్ పెరగడానికి కారణమేంటి?విస్తృతంగా ఏర్పాటవుతున్న సంస్థలు, వాటి మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో.. ప్రొడక్ట్ డిజైన్ నుంచి ఎండ్ యూజర్స్ వరకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు.. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తుల పట్ల ఆదరణ ఎలా ఉంది.. సమస్యలు ఏమిటి.. ఇలా అన్ని కోణాల్లో సమాచారాన్ని విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసం బిగ్ డేటా అనలిటిక్స్ ఎంతో కీలకంగా మారుతోంది. అందుకే బిగ్డేలా నైపుణ్యాలు కలిగిన వారికి డిమాండ్ నెలకొంది. ఒకప్పుడు ఆపరేషన్స్ రీసెర్చ్లో భాగంగానే ఈ విభాగం ఉన్నప్పటికీ.. ఇప్పుడు ప్రత్యేక కోర్సుగా రూపొందడమే దీనికి పెరుగుతున్న డిమాండ్కు నిదర్శనం.మేనేజ్మెంట్ విద్యార్థులు అకడమిక్స్తోపాటు ఏఏ అంశాలపై దృష్టి సారించాలి?మేనేజ్మెంట్ విద్యార్థులు అకడెమిక్ నైపుణ్యాల సాధనకే పరిమితమవడం సరికాదు. నైతిక విలువలు, సామాజిక స్పృహ కూడా కలిగుండాలి. కోర్సు, కెరీర్, ఇండస్ట్రీ.. ఏదైనా తుది లక్ష్యం సామాజిక అభివృద్ధికి దోహదపడటమే. కాబట్టి విద్యార్థులు కేవలం క్లాస్ రూం లెక్చర్స్కే పరిమితం కాకుండా.. సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా దృష్టి సారించాలి. నాయకత్వం, నిర్వహణ నైపుణ్యాలు అనేవి తరగతి బోధనతోనే లభించవు. వీటిని ప్రతి విద్యార్థి సొంతంగా క్షేత్రస్థాయి ప్రాక్టీస్ ద్వారా అందిపుచ్చుకోవాలి.మేనేజ్మెంట్ పీజీలో ఇప్పటికీ టెక్ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి ప్రవేశ పరీక్ష విధానమే కారణమంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?ఐఐఎంలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న క్యాట్ ఇంజనీరింగ్ విద్యార్థులకే అనుకూలం అనే అభిప్రాయం అపోహ మాత్రమే. ఐఐఎంలలోని విద్యార్థుల నేపథ్యాలే ఇందుకు నిదర్శనం. ఐఐఎం– బెంగళూరులో డాక్టర్స్, ఫ్యాషన్ టెక్నాలజీ ఉత్తీర్ణులు, హ్యుమానిటీస్ అభ్యర్థులు.. ఇలా విభిన్న నేపథ్యాలున్న విద్యార్థులు చదువుతున్నారు. క్యాట్ అనేది సామర్థ్యాన్ని పరిశీలించే పరీక్ష మాత్రమే. ఐఐఎంలలో ప్రవేశానికి క్యాట్ కంటే విద్యార్థుల ఆలోచన శైలి కీలకంగా నిలుస్తుంది. -
సేవింగ్స్ బ్యాంక్ ఖాతా: ఏఐతో వాత!
నాకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఒకటే ఉంది. అందులో జీతమే పడుతుందని కొందరు.. పెన్షన్ తప్ప ఇంకేమీ వేయనని ఇంకొందరు.. మార్చి నెలాఖరుకల్లా చాలా తక్కువ.. అంటే మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంటుందని మరికొందరు చెప్తుంటారు. అక్షరాలా ఇదే నిజమైతే ఏ ఇబ్బందీ ఉండదు. కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంటు వ్యవహారాల మీద ఎలాంటి నిఘా ఉండదు. కేవలం ఫిక్సిడ్ డిపాజిట్ల మీదే దృష్టి ఉంటుందని కొందరి పిడివాదన.డిపార్టుమెంటు వారికి అవేమీ పట్టవు. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా అన్ని బ్యాంకులు, అన్ని బ్రాంచీలు ప్రతి సంవత్సరం విధిగా, మీకు సంబంధించిన అన్ని సేవింగ్స్ ఖాతాల వ్యవహారాలను కొన్ని నిబంధనలకు లోబడి డిపార్టుమెంటుకు చేరవేస్తాయి. ఆ చేరవేత, ఆ తర్వాత ఏరివేత.. మెదడుకి మేత.. కృత్రిమ మేథస్సుతో వాత.. వెరసి మీకు నోటీసుల మోత! అసాధారణమైన నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్ వారి దృష్టిలో పడతాయి. వివిధ సంస్థలు, ఏజెన్సీలు ప్రతి సంవత్సరం ‘‘నిర్దేశిత ఆర్థిక వ్యవహారాల’’ను ఒక రిటర్ను ద్వారా తెలియజేస్తాయి.పది లక్షలు దాటిన నగదు డిపాజిట్లుఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి కాని, దఫదఫాలుగా కానీ వెరసి నగదు డిపాజిట్లు రూ. 10,00,000 దాటితే మీ ఖాతా వ్యవహారాలు.. సేవింగ్స్ ఖాతాలో పడినట్లు కాదు.. డిపార్టుమెంటు వారి చేతిలో పడ్డట్లే.విత్డ్రాయల్స్కొందరు తమ ఖాతాల నుంచి పెద్ద మొత్తాలు విత్డ్రా చేస్తారు. వ్యాపారం నిమిత్తం, పెళ్లి ఖర్చుల నిమిత్తం.. ఇలా చేయడం చట్టపరంగా తప్పు కాకపోవచ్చు. అసమంజసంగా అనిపిస్తే ఆరా తీస్తారు. ‘సోర్స్’ గురించి కూపీ లాగుతారు.క్రెడిట్ కార్డులపై భారీ చెల్లింపులుఅకౌంటు ద్వారా పెద్ద పెద్ద మొత్తాలు క్రెడిట్ కార్డుల చెల్లింపులకు వెళ్తుంటాయి. వీటి మీద నిఘా, విచారణ ఉంటాయి.రూ. 30,00,000 దాటిన క్రయ విక్రయాలు..ఇలాంటి క్రయవిక్రయాలను సబ్రిజిస్టార్ వాళ్లు ప్రతి సంవత్సరం రిపోర్ట్ చేస్తారు. వెంటనే బ్యాంకు అకౌంట్లను చెక్ చేస్తారు. సాధారణ పద్దులు/రొటీన్ పద్దులు ఉండే అకౌంట్లలో పెద్ద పెద్ద పద్దులుంటే, వారి అయస్కాంతంలాగా వారి దృష్టికి అతుక్కుపోతాయి.విదేశీయానం.. విదేశీ మారకం..విదేశీయనం నిమిత్తం, విదేశీ చదువు కోసం, విదేశాల్లో కార్డుల చెల్లింపులు... ఇలా వ్యవహారం ఏదైనా కానీ రూ. 10,00,000 దాటితో పట్టుకుంటారు. దీనికి ఉపయోగించిన విదేశీ మారకం, చట్టబద్ధమైనదేనా లేక హవాలానా అనేది ఆరా తీస్తారు.నిద్రాణ ఖాతాల్లో నిద్ర లేకుండా చేసే వ్యవహారాలుకొన్ని సంవత్సరాలపాటు ఎటువంటి లావాదేవీలు ఉండని ఖాతాలను నిద్రాణ లేదా ని్రష్కియ ఖాతాలని అంటారు. వాటిలో అకస్మాత్తుగా పెద్ద పెద్ద వ్యవహారాలేమైనా జరిగాయంటే.. అధికారుల కళ్లల్లో పడతాయి. ఇలాంటి వ్యవహారాలు అధికారుల దృష్టిని ఆకట్టుకుంటే.. వారు వెంటనే పట్టుకుంటారు.డిక్లేర్ చేయని వ్యవహారాలు చనిపోయిన మావగారు, పెళ్లప్పుడు ఇచ్చిన స్థలాన్నో, ఇళ్లనో ఇప్పుడు అమ్మేసి, వచి్చన ఆ పెద్ద మొత్తాన్ని అకౌంటులో వేసి, ఆయన ఆత్మశాంతి కోసం మౌనం పాటిస్తే అది మౌనరాగం కాదు. గానాబజానా అయిపోతుంది. ఖజానాకి చిల్లులు పడతాయి. పొంతన లేని డివిడెండ్లు.. వడ్డీ.. కొన్న షేర్లు భారీగా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్లు కొండంత ఉన్నా డివిడెండ్లు, వడ్డీల రూపంలో ఆదాయం ఆవగింజంత కనిపిస్తోందంటే ..తస్మాత్ జాగ్రత్త.ఎన్నో అకౌంట్లు .. కానీ ఒక్కదాన్నే..కొందరికి ఎన్నో అకౌంట్లు ఉంటాయి. తప్పు లేదు. కానీ వారు ఇన్కంట్యాక్స్ రిటర్నుల్లో ‘ఏకో నారాయణ’ అన్నట్లు ఒక దాన్ని మాత్రమే డిక్లేర్ చేస్తారు. డిపార్టుమెటు వారి దగ్గర మీ పది అకౌంట్ల వివరాలు పదిలంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.వేరే వ్యక్తుల సహాయార్థం.. ఏదో, సహాయమని, బంధువులు, స్నేహితుల పెద్ద పెద్ద వ్యవహారాలను మీ అకౌంట్లలో నడిపించకండి. వివరణ మీరు ఇవ్వాల్సి వస్తుంది.. ఇవ్వగలరా? అప్పులను తిరిగి చెల్లించేటప్పుడే ఆశగా ఎక్కువ వడ్డీ చూపించి, పెద్ద మొత్తాన్ని మీ అకౌంట్లో వేసి, ‘నా పేరు చెప్పకు గురూ’ అని అంటారు.. కానీ, వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేంటి అనే అటలాగా, వీళ్ల వ్యవహారాలేంటి.. వాళ్ల వ్యవహారాలేంటి అని ఆరా తీస్తూ, దొంగ లావాదేవీలు లేదా డిక్లేర్ చేయని లావాదేవీలను డిపార్టుమెంటు వారు కళ్లు మూసుకుని సైతం పట్టేస్తారనే విషయాన్ని అర్థం చేసుకుని మనం కళ్లు తెరుచుకుని ఉండాలి. -
ఉచితంగా ఏఐ సర్వీసులు ఇస్తే లాభమేంటి?
భారతదేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో ఉచితంగా ఏఐ (కృత్రిమ మేధస్సు) సేవలు అందుబాటులో ఉండటం అనేది రెండు వైపులా పదునున్న కత్తితో సమానమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఇది వినియోగదారులకు, సాంకేతిక అభివృద్ధికి గొప్ప అవకాశాలను అందిస్తుంది. మరోవైపు, దేశీయ జనరేటివ్ AI ఆవిష్కరణ, స్థానిక డెవలపర్ల దీర్ఘకాలిక పోటీతత్వానికి ఇది తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తుంది.ఉచిత AI సర్వీసులుఖర్చు లేకుండా ఏఐ సాధనాలను ఉపయోగించే అవకాశం లభించడం వల్ల సామాన్య ప్రజలకు కూడా అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. చిన్న వ్యాపారాలు, విద్యార్థులు, కంటెంట్ సృష్టికర్తలు తమ పనులను మెరుగుపరచుకోవడానికి, సృజనాత్మకతను పెంచుకోవడానికి దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఉచిత ప్లాట్ఫామ్లు విద్యార్థులకు, ఔత్సాహిక డెవలపర్లకు ఏఐ మోడల్లతో ప్రయోగాలు చేయడానికి, నేర్చుకోవడానికి, కొత్త పరిష్కారాలను ఆవిష్కరించడానికి ఒక పరీక్షా వేదికలా పనిచేస్తున్నాయి.ఉదాహరణకు, ఉచిత జనరేటివ్ ఏఐ టూల్స్ ద్వారా నివేదికలు రాయడం, ఈమెయిల్లకు సమాధానాలు ఇవ్వడం లేదా కోడింగ్లో సహాయం పొందడం వంటివి పనిలో వేగం, సామర్థ్యాన్ని పెంచుతాయి.లాభాలు ఉన్నప్పటికీ..ఉచిత సేవలను ఉపయోగించేటప్పుడు వినియోగదారులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన డేటాను ఆయా కంపెనీలకు తెలియకుండానే ఏఐకి ఇస్తున్నారు. ఈ డేటాను ఏఐ మోడల్ శిక్షణకు లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు. ఉచిత సంస్కరణలు తరచుగా పరిమిత ఫీచర్లు, తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. క్లిష్టమైన పనులకు లేదా మెరుగైన ఫలితాల కోసం వినియోగదారులు తరచుగా పెయిడ్ (చెల్లింపు) సేవలకు మారవలసి వస్తుంది. ఉచితంగా లభించే కొన్ని AI మోడళ్లు ట్రెయినింగ్ డేటాలోని అంశాలను కూడా యూజర్లకు అందించే అవకాశం ఉంది. దీని వల్ల వినియోగదారులు తప్పుడు ఫలితాలను పొందవచ్చు.కంపెనీలపై ప్రభావంభారతదేశంలో కొత్తగా జనరేటివ్ ఏఐ మోడళ్లను లేదా ఉత్పత్తులను సృష్టిస్తున్న స్థానిక స్టార్టప్లు, డెవలపర్లకు ఇది సవాలుగా మారవచ్చు. గ్లోబల్ టెక్ దిగ్గజాలు (ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, గూగుల్) తమ ఏఐ సేవలను ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకు అందించినప్పుడు స్థానిక స్టార్టప్లు తమ సర్వీసులకు ధర నిర్ణయించలేవు. అధిక పెట్టుబడి, వనరులు, మెరుగైన మోడళ్లను కలిగి ఉన్న అంతర్జాతీయ సంస్థలతో పోటీపడటం అసాధ్యం. కొత్త కంపెనీ ఉత్పత్తుల ద్వారా లాభాలు సంపాదించడం కష్టమని పెట్టుబడిదారులు గ్రహించినప్పుడు స్థానిక ఏఐ స్టార్టప్లకు నిధులు సమకూర్చడం తగ్గిపోతుంది. లాభదాయకత లేకపోవడం వల్ల స్థానిక కంపెనీలు ఆర్ అండ్ డీపై తగినంత పెట్టుబడి పెట్టలేక దేశీయ ఆవిష్కరణకు, ప్రపంచ స్థాయి AI మోడళ్లను నిర్మించడానికి ఆటంకం ఏర్పడుతుంది.ఏఐ సేవలు వాడేటప్పుడు యూజర్లు అనుసరించాల్సినవి..ఉచిత AI సాధనాలు తరచుగా వినియోగదారుల డేటాను శిక్షణ కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాయి. కాబట్టి బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు, సున్నితమైన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమాచారం వంటి అత్యంత గోప్యమైన డేటాను ఎప్పుడూ AI సిస్టమ్లలో నమోదు చేయకూడదు.ఏఐ సేవలను ఉపయోగించే ముందు ఆ టూల్స్ డేటా వినియోగ విధానాలు తెలుసుకోవాలి. వారు మీ డేటాను ఎలా నిల్వ చేస్తారు, ఎక్కడ ఉపయోగిస్తారు, ఎవరితో పంచుకుంటారు అనే దానిపై అవగాహన కలిగి ఉండాలి.కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు లేదా ముఖ్యమైన పత్రాల్లో ఈ సమాచారాన్ని ఉపయోగించే ముందు ఏఐ డేటాను విశ్వసనీయ మూలాల ద్వారా ధ్రువీకరించాలి.ఇదీ చదవండి: ‘అడ్డంకులు తొలిగాయి.. లెజెండ్స్ పుట్టారు’ -
ఆల్ఫాబెట్, అమెజాన్ల పంట పండించిన స్టార్టప్
టెక్ దిగ్గజాలు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, అమెజాన్ ఇటీవల ప్రకటించిన తమ మూడో త్రైమాసికం (క్యూ3) లాభాల్లో అద్భుతమైన వృద్ధి సాధించాయి. దీనికి ప్రధాన కారణం ఈ రెండు కంపెనీలు ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్లో చేసిన పెట్టుబడులు గణనీయంగా పెరగడమే. క్లాడ్ చాట్బాట్ సర్వీసులు అందిస్తున్న ఆంత్రోపిక్ లాభాలు పెరగడం ఈ కంపెనీలకు కలిసొచ్చింది.క్యూ3లో భారీ లాభాలుగత వారం వెలువడిన ఫలితాల ప్రకారం ఆల్ఫాబెట్ తన లాభంలో ఈక్విటీ సెక్యూరిటీలపై నికరంగా 10.7 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా ఆంత్రోపిక్ వాటా విలువ పెరిగినట్లు చెప్పింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ క్యూ3 లాభం 38% పెరిగింది. ఆంత్రోపిక్లో దాని పెట్టుబడి నుంచి వచ్చిన 9.5 బిలియన్ డాలర్లు నాన్-ఆపరేటింగ్ ఆదాయంలో ప్రతిబింబించింది.ఆంత్రోపిక్ అందించే సేవలుక్లాడ్ (Claude) - జనరేటివ్ ఏఐ అసిస్టెంట్క్లాడ్ అనేది ఆంత్రోపిక్ ప్రధాన ఉత్పత్తి. ఇది నెక్స్ట్ జనరేషన్ ఏఐ అసిస్టెంట్. దీన్ని సంభాషణాత్మక, టెక్స్ట్ ప్రాసెసింగ్ పనుల కోసం రూపొందించారు. ఇది లార్జ్ డాక్యుమెంట్లు లేదా సంభాషణల సారాంశాన్ని అందిస్తున్నారు. కథనాలు, కంటెంట్, కోడ్ రాయడంలో సహాయం చేస్తుంది. రాసిన కోడింగ్ను డీబగ్గింగ్ చేస్తుంది. ఇది చాట్ ఇంటర్ఫేస్ ద్వారా (Claude.ai), డెవలపర్ల కోసం ఏపీఐ ద్వారా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా? -
ట్రైడ్కు టై 50 ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టార్టప్’ అవార్డ్
కృత్రిమ మేధస్సు ఆధారిత ఐఓటి ఎకోసిస్టమ్స్లో ముందంజలో ఉన్న ట్రైడ్ సంస్థ.. ప్రతిష్టాత్మక టై50‘మోస్ట్ ప్రామిసింగ్ స్టార్టప్స్’ జాబితాలో చోటు దక్కించుకుంది. విమానయాన, ఇంధన, మొబిలిటీ రంగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలకుగాను ఈ గుర్తింపు లభించింది.విమానయాన రంగంలో చిన్న లోపం కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. పునరావృతమయ్యే సాంకేతిక లోపాలు లేదా గుర్తించని లోపాలు విమానాలను నేలమట్టం చేయగలవు, భారీ ఆర్థిక నష్టం కలిగించగలవు, అలాగే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పు కలిగించగలవు. ఈ సవాళ్లను డేటా సాంకేతికతో పరిష్కరించడమే ట్రైడ్ ప్రధాన లక్ష్యం.ట్రైడ్ అభివృద్ధి చేసిన డేటా-ఇంటెలిజెంట్ ప్లాట్ఫారమ్ వివిధ విమానయాన, మొబిలిటీ వ్యవస్థలను అనుసంధానం చేసి, సంస్థలు మరింత సమర్థవంతమైన, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. విమానాశ్రయ డిజిటలైజేషన్, ఏఐ ఆధారిత లోపాల నిర్వహణ, విమాన సంస్థల్లో దీర్ఘకాలిక లోపాల పరిష్కారాలు వంటి ఆవిష్కరణల ద్వారా ట్రైడ్ విమానయాన రంగంలో విశ్వసనీయత, సామర్థ్యం, భద్రతలో కొత్త ప్రమాణాలను స్థాపిస్తోంది.ఆసియాలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ట్రైడ్.. ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాలకు, యూరప్ వైపు విస్తరిస్తోంది. ట్రైడ్ పరిష్కారాలు సంస్థలకు ప్రీడిక్టివ్ ఇన్సైట్స్, సస్టైనబుల్ పనితీరు, రియల్టైమ్ నిర్ణయ మద్దతు అందించి ప్రతిరోజూ లక్షలాది జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. -
సౌందర్యపోషణలోనూ ఏఐ..
సాక్షి, సిటీబ్యూరో : ఇందుగలడు అందులేదను సందేహంబు వలదన్నట్లు.. మార్కెట్లో ట్రెండ్ సృష్టిస్తోన్న ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)అన్నింటా చొచ్చుకుపోతోంది. సాంకేతికంగా ప్రగతి పధంలో ఉన్న నగరంలో ఇది మరింత స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా సౌందర్య చికిత్సలు అందించేందుకు ఏఐ ఆధారిత క్లినిక్ నగరంలో ఏర్పాటుకావడం విశేషం. కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్స్ రోడ్డులో ఏర్పాటైన మైరా ఈస్తటిక్ సెంటర్ (మ్యాక్)ను ప్రముఖ టాలీవుడ్ తారలు హెబ్బా పటేల్, సత్యకృష్ణన్ సందర్శించారు.సినీతారలకు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరికీ అందం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందనడంలో సందేహం లేదన్నారు. ప్రస్తుతం ఆడ, మగ వ్యత్యాసం లేకుండా అందరికీ సౌందర్య చికిత్సలు అవసరం అవుతున్నాయ న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌందర్య పోషణ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల సేవలు మరింత ఉపయుక్తమవుతాయని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మ్యాక్ వ్యవస్థాపకురాలు శ్రీవల్లి కొర్రపాటి మాట్లాడుతూ దేశంలోనే ప్రప్రథమ ఏఐ ఆధారిత క్లినిక్గా తాము అందించే చికిత్సలు మరింత ఖచ్చితత్వంతో ఉంటాయన్నారు. ఇదీ చదవండి: World Vegan Day 2025 శాకాహారంతో ఆరోగ్య ప్రయోజనాలు -
విజిలెన్స్లో ఏఐ టాస్క్ఫోర్స్: వీసీ సజ్జనార్
అవినీతి అక్రమాలు, నేరాలను నియంత్రించే క్రమంలో విజిలెన్స్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తే పారదర్శకత, ఉత్పాదకత రెండూ గణనీయంగా పెరుగుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ఐదో రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సమావేశానికి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ అధ్యక్షత వహించారు.సజ్జనార్ మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు తగ్గాలంటే వ్యవస్థల్లో మౌలిక మార్పులు అవసరం. లోపభూయిష్టమైన విధానాలు అక్రమాలకు దారితీస్తాయి. కాబట్టి వ్యవస్థను పటిష్ట పరచి, మంచి అలవాట్లు, పద్ధతులను అమల్లోకి తీసుకురావాలని పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.సింగరేణి సంస్థతో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. నేడు దేశ జీడీపీ పెరుగుదలలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ యువ సీఎండీ ఎన్ బలరామ్ సారథ్యంలో పలు వ్యాపార విస్తరణ చర్యల ద్వారా గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ దిశగా మరింత వేగంగా ఎదగాలి అని ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు.సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ చేపడుతున్న వ్యాపార విస్తరణ చర్యలను వివరించారు. ఉద్యోగుల్లో క్రమశిక్షణ తీసుకురావడం కోసం, పని గంటల సద్వినియోగం కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నామని, వ్యవస్థలను మరింత పటిష్ట పరిచేందుకు ఈసారి విజిలెన్స్ వారోత్సవాలలో ప్రముఖులను ఆహ్వానించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించేలా, అలాగే అంతర్జాతీయంగా ఖనిజ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా విస్తరణ ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. -
జియో యూజర్లకు బంపరాఫర్: రూ.35000 విలువైన సర్వీస్ ఫ్రీ!
అన్లిమిటెడ్ 5జీ ప్లాన్ ఉపయోగించే.. 18-25 సంవత్సరాల వయసు కలిగిన జియో వినియోగదారులు 18 నెలల పాటు రూ.35,100 విలువైన గూగుల్ జెమిని AI ప్రో సేవను ఉచితంగా పొందవచ్చు. దీనికోసం రిలయన్స్ కంపెనీ.. గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో ఏఐ స్వీకరణను వేగవంతం చేయడానికి.. యువ సబ్స్క్రైబర్లకు గూగుల్ జెమినీ AI ప్రోను ఉచితంగా అందించడానికి కంపెనీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఇది అక్టోబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే.. అర్హత కలిగిన యూజర్లు అన్లిమిటెడ్ 5G ప్లాన్లపై గూగుల్ AI ప్రో ఉచితంగా పొందవచ్చు. ఇది అపరిమిత చాట్, 2TB క్లౌడ్ స్టోరేజ్, Veo 3.1 లో వీడియో జనరేషన్, నానో బనానాతో ఇమేజ్ జనరేషన్ వంటివెన్నో అందిస్తుంది.రూ. 349 నుంచి ప్రారంభమయ్యే 5జీ అన్లిమిటెడ్ ప్లాన్లకు (ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్) ఉచిత జెమినీ ప్రో లభిస్తుంది. ఇది యాక్టివేషన్ చేసుకున్న రోజు నుంచి 18 నెలల వరకు అందుబాటులో ఉంటుంది (అపరిమిత 5G ప్లాన్ యాక్టివ్లో ఉండాలి). యువ భారతీయులలో సృజనాత్మకత, విద్య & ఆవిష్కరణలకు ఆజ్యం పోసేందుకు కంపెనీ దీనిని ప్రత్యేకంగా రూపొందించింది. దీనిని మైజియో యాప్ ద్వారా నేరుగా యాక్టివేట్ చేసుకోవచ్చు.1.45 బిలియన్ భారతీయులకు ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ ఇంటెలిజెన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్ వంటి వ్యూహాత్మక & దీర్ఘకాలిక భాగస్వాములతో మా సహకారం ద్వారా, భారతదేశాన్ని అల్-ఎనేబుల్డ్ కాకుండా అల్-ఎంపవర్డ్ గా మార్చాలని ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.FREE BENEFITS WORTH ₹35,100 🎉FREE pro plan of Google Gemini for 18-months (worth ₹35,100) for Jio users aged 18–25 years (early access) using an eligible Unlimited 5G plan.Enjoy unlimited chats, 2TB cloud storage, video generation on Veo 3.1, image generation with Nano… pic.twitter.com/O5Pqpo2K4r— Reliance Jio (@reliancejio) October 30, 2025 -
మెరుగైన భారత్ కోసం ఏఐ: రూ.1 కోటి బహుమతి
భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్సంగ్.. తన జాతీయ విద్యా కార్యక్రమం ‘శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో 2025’ నాల్గవ ఎడిషన్ విజేతలను ప్రకటించింది. ఈ కార్యక్రమం యువ విద్యార్థులు సాంకేతికతను వినియోగించి తమ స్థానిక కమ్యూనిటీల్లోని వాస్తవ ప్రపంచ సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుంది.మొదటి నాలుగు విజేత జట్లుపెర్సెవియా (బెంగళూరు)నెక్ట్స్ప్లే.ఏఐ (ఔరంగాబాద్)పారస్పీక్ (గురుగ్రామ్)పృథ్వీ రక్షక్ (పలాము)ఐఐటి ఢిల్లీకి చెందిన ఎఫ్ఐటీటీ ల్యాబ్స్లో మెంటర్షిప్ మద్దతుతో, తమ ఆవిష్కరణాత్మక ప్రోటోటైప్లను స్కేలబుల్ రియల్-వరల్డ్ పరిష్కారాలుగా అభివృద్ధి చేయడానికి రూ. 1 కోటి విలువైన ఇంక్యుబేషన్ గ్రాంట్లు అందుకున్నారు. జ్యూరీ ప్యానెల్లో.. శామ్సంగ్ మాత్రమే కాకుండా, విద్యా సంస్థలు, ప్రభుత్వం & పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్యానెల్ నాలుగు ప్రధాన నేపథ్య ట్రాక్లలో ఫైనలిస్టుల పరిష్కారాలను అంచనా వేసింది.అత్యుత్తమ ప్రపంచాన్ని నిర్మించడంలో తమ సృజనాత్మకత & అంకితభావాన్ని ప్రతిబింబించినందుకు టాప్ 20 ఫైనలిస్ట్ జట్లు ఒక్కొక్కటి రూ 1 లక్ష నగదు బహుమతితో పాటు తాజా శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ స్మార్ట్ఫోన్లను కూడా అందుకున్నాయి. అదనంగా, ఈ కార్యక్రమం ఐదు ప్రత్యేక అవార్డుల కింద బహుమతులను అందించింది -
ఏఐ ఎఫెక్ట్.. యూట్యూబ్ ఉద్యోగులకు ఎగ్జిట్ ప్లాన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాలలోని ఉద్యోగులను ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే లెక్కకు మించిన ఉద్యోగులు ఏఐ వల్ల ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పుడు తాజాగా.. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఈ జాబితాలోకి చేరింది. అయితే ఈ సంస్థ ఉద్యోగులను బలవంతంగా తొలగించడంలేదు, కానీ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ప్రకటించింది.ఏఐ టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో.. యూట్యూబ్లో తప్పకుండా కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ 'నీల్ మోహన్' ప్రస్తావించారు. కాగా పదేళ్ళలో మొదటిసారి తన ప్రొడక్ట్ డివిజన్లో మార్పులు చేస్తున్నారు.అమెరికాలో పనిచేస్తున్న యూట్యూబ్ ఉద్యోగులు.. స్వచ్చందంగా తమ ఉద్యోగాన్ని వదులుకుంటే, పరిహారం కింద వారికి నిష్క్రమణ ప్యాకేజీలను అందించనున్నట్లు వెల్లడించారు. కంటెంట్ క్రియేషన్, యూజర్ ఎక్స్పీరియన్స్ వంటి వాటిని ఏఐ ప్రభావితం చేయనుంది. కొత్త మార్పులు 2025 నవంబర్ 05 నుంచి అందుబాటులో రానున్నాయి.ఇదీ చదవండి: కొత్త రూల్: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం!యూట్యూబ్ మాతృ సంస్థ.. గూగుల్ తన ఉత్పత్తులు, సేవలలో కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేయడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ పునర్నిర్మాణం జరిగింది. ఏఐ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను పెంచాలని సీఈఓ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా తమ బృందాలను కోరారు. -
ఎన్విడియా విశ్వరూపం.. దేశాల జీడీపీలనే మించి..
యుఎస్ చిప్ దిగ్గజం ఎన్విడియా (Nvidia) కొత్త మైలురాయిని తాకింది. 5 ట్రిలియన్ డాలర్ల (రూ.442 లక్షల కోట్లు) మార్కెట్ విలువను చేరుకున్న ప్రపంచంలోని మొదటి సంస్థగా నిలిచింది. సాధారణ గ్రాఫిక్స్-చిప్ డిజైనర్ నుండి ప్రారంభమైన ఎన్విడియా అనతి కాలంలోనే ఏఐ టైటాన్గా ఎదిగింది. పెరుగుతున్న ఏఐ బూమ్ దాని చిప్స్ కోసం డిమాండ్ను పెంచుతోంది. ఎన్విడియా స్టాక్స్ను రికార్డు గరిష్టాలకు నడిపిస్తోంది.ఎన్విడియా కంపెనీ 2023 జూన్లో మొదటిసారిగా 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకుంది. తర్వాత వేగంగా పెరుగుతూ మూడు నెలల క్రితం 4 ట్రిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్కును తాకింది. ఈ చిప్ మేకర్ షేర్ ధర బుధవారం (అక్టోబర్ 29) ఉదయం 5.6% పెరిగి 212 డాలర్లకు చేరుకుంది. చైనాలో ఎన్విడియా అమ్మకాల గురించి మదుపరుల్లో ఆశావాదం ఈ పెరుగుదలకు కారణమైంది.ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచిన ఎన్విడియా.. ఏఐ వ్యయ కేళిలో అతిపెద్ద విజేతగా అవతరించింది. సాంకేతిక రంగంలో ప్రత్యర్థులను అధిగమించింది. అనేక ఏఐ కంపెనీలకు ఎన్విడియా చిప్లే మూలం కావడంతో ఓపెన్ ఏఐ, ఒరాకిల్తో సహా ప్రముఖ ఏఐ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.దేశాల జీడీపీలను మించిన మార్కెట్ విలువప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం.. ఎన్విడియా మార్కెట్ విలువ ఇప్పుడు యూఎస్, చైనా మినహా ప్రతి దేశం జీడీపీనీ మించిపోయింది. అలాగే యూఎస్ స్టాక్ మార్కెట్లోని ఎస్అండ్పీ 500 సూచీలో మొత్తం రంగాల విలువ కంటే ఎక్కువ.మైక్రోసాఫ్ట్, యాపిల్ కూడా ఇటీవల 4ట్రిలియన్ డాలర్ల విలువ మార్కును దాటాయి. ఏఐ ఖర్చు గురించి వాల్ స్ట్రీట్ లో పెరుగుతున్న ఆశావాదంతో విస్తృత టెక్ ర్యాలీని బలోపేతం చేశాయి. ఈ సంవత్సరం అమెరికన్ స్టాక్ మార్కెట్లో అద్భుతమైన లాభాలు గడించిన సంస్థల్లో ఏఐ-సంబంధిత సంస్థలే 80% వాటాను కలిగి ఉన్నాయి.ఇదీ చదవండి: అదానీ గ్రూప్ షేర్లదే అదృష్టం! -
ఫస్ట్ టైమ్ ఏఐ మేనిక్యూర్ మిషన్
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) నవలలు రాస్తోంది. పెయింటింగ్స్ వేస్తోంది... ఇంకా ఎన్నో చేస్తుంది. ఇప్పుడు మరో అడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మేనిక్యూర్ మెషిన్ ‘ఉమియా’ను లండన్లోని ఒక బ్యూటీ కంపెనీ లాంచ్ చేసింది. ‘ఇది జెల్ మేనిక్యూర్. మీరు మీ వేలిని మెషిన్ లోపల ఉంచినప్పుడు, అందులోని కెమెరా మీ గోరును స్కాన్ చేసి దాని పరిమాణం, లొకేషన్ అర్థం చేసుకుంటుంది. మేము దీనిని నెయిల్ డీఎన్ఏ అని పిలుస్తాం. బ్యూటీ స్పేస్లో కొత్తసాంకేతికతకు అద్దం పట్టే ఆవిష్కరణ ఇది. ఈ జెల్ నెయిల్ ప్రింటర్ ప్రతి నెయిల్ను స్కాన్ చేసి, డిజైన్ను మీ వేలికి సరిగ్గా సర్దుబాటు చేస్తుంది. సంక్లిష్టమైన నెయిల్ ఆర్ట్ను ప్రతి నెయిల్కు రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ప్రింట్ చేస్తుంది’ అంటున్నారు ‘ఉమియా’ బ్యూటీ కంపెనీ ప్రతినిధి డోంగ్.(చదవండి: భూతాపం నుంచి పుట్టిన వినోదం..!) -
డీప్ ఫేక్కు కోడ్ వర్డ్తో చెక్
ఇలాంటి సేఫ్ వర్డ్స్ ఏర్పాటు చేసుకునే వాళ్లు కొన్ని రకాలైన ప్రాథమిక జాగ్రత్తలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని సామాజిక మాధ్యమాల్లో ఉన్న గ్రూపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. మర్చిపోవడం, పొరపాటు పడటం వంటి వాటికి తావు లేకుండా దీన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చెయ్యాలి.ఆడియోలు, వీడియోల్లోకీ చొచ్చుకుపోయిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెను సవాల్ విసురుతోంది. మనం వింటున్న మాట, మనతో మాట్లాడుతున్న వ్యక్తి, చూస్తున్న వీడియో అసలా.. లేక ఏఐ సృష్టా అనేది గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. దీన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. డీప్ఫేక్తో కుటుంబీకుడిగా, బంధువుగా, స్నేహితుడిగా ‘మారిపోయి’ ఫోన్ కాల్ చేసి, ఆడియో, వీడియోల ద్వారా వివిధ అత్యవసర కారణాలు చెప్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి మోసాల బారినపడకుండా ఉండాలంటే ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఓ కోడ్ వర్డ్ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. దీన్నే సేఫ్ వర్డ్గా కొత్వాల్ అభివర్ణించారు.ఆ విభాగాల్లో ఉన్న మాదిరిగానే...గూఢచర్య సంబంధిత చిత్రాల్లో సీక్రెట్ ఏజెంట్స్కు కోడ్ వర్డ్స్ ఉండటం చూస్తూనే ఉంటాం. ప్రత్యేక ఆపరేషన్స్లో కమాండోలు సైతం ఇలాంటి ఏర్పాటు చేసుకుంటారు. ‘జేమ్స్ బాండ్ 007’ ఈ తరహాకు చెందిన కోడ్ వర్డే. ఏజెంట్లుగా పని చేస్తున్న వాళ్లు తమ గుర్తింపు ఎదుటి వాళ్లకు తెలియకుండా, ఉన్నతాధికారులతో ఫోన్ లేదా ఇతర సాధనాల ద్వారా సంప్రదింపులు జరిపేప్పుడు వారు మాత్రమే గుర్తించేలా వీటిని ఏర్పాటు చేసుకుంటారు.ఇదే విధానాన్ని డీప్ఫేక్కు చెక్ చెప్పడానికి అమలు చేయాలని కొత్వాల్ సజ్జనర్ సూచిస్తున్నారు. కోడ్ వర్డ్గా పిలిచే ఈ సేఫ్ వర్డ్ను కుటుంబీకులు, బంధువులు, స్నేహితులతోపాటు సహోద్యోగులు, సన్నిహితులకు మాత్రమే తెలపాలి. ఏదైనా అత్యవసరం అయి ఫోన్ చేయాల్సి వచ్చినా, సందేశం పంపాల్సి వచ్చినా ఈ కోడ్తోనే పరిచయం చేసుకుంటానని స్పష్టం చేయాలి. ఇలా ఎదుటి వాళ్లు సైతం తమతో మాట్లాడేది ఫలానా వ్యక్తా కాదా అనేది స్పష్టంగా తెలుసుకుంటారు.ఈ విషయాలు మాత్రం మరవద్దు...ఇలాంటి సేఫ్ వర్డ్స్ ఏర్పాటు చేసుకునే వాళ్లు కొన్ని రకాలైన ప్రాథమిక జాగ్రత్తలు సైతం తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని సామాజిక మాధ్యమాల్లో ఉన్న గ్రూపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. మర్చిపోవడం, పొరపాటు పడటం వంటి వాటికి తావు లేకుండా దీన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చెయ్యాలి. ఎదుటి వ్యక్తికి–మనకు మాత్రమే తెలిసిన వ్యక్తిగత అంశంపై ప్రశ్నలు అడగడం తదితరాలను అదనపు ధ్రువీకరణలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏఐ ద్వారా సృష్టించే డీప్ ఫేక్స్ను గుర్తించడం కష్టసాధ్యమవుతున్న ఈ తరుణంలో సేఫ్ వర్డ్స్ రక్షణ ఇస్తాయని అబీప్రాయపడుతూ సజ్జనర్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. – శ్రీరంగం కామేష్, సాక్షి -
ఏఐ యుగంలో ఏం నేర్చుకుంటే సేఫ్?
‘మారుతున్న కాలంతోపాటు.. అన్ని రంగాల్లో కొత్త టెక్నాలజీలు ఆవిష్కృతం అవడం సహజం. దీన్ని అందిపుచ్చుకోవడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలే తప్ప.. కొత్త సాంకేతికతలతో కెరీర్ మనుగడ ప్రశ్నార్థకం అనే ఆందోళన చెందడం సరికాదు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎంట్రీ లెవల్ నుంచి సీనియర్ ఎక్జిక్యూటివ్స్ వరకు నిరంతర అధ్యయనం అలవర్చుకోవాలి.’ అంటున్నారు.. ప్రముఖ కార్పొరేట్ హ్యూమన్ రిసోర్స్ నిపుణులు, విప్రో టెక్నాలజీస్ మాజీ చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్, మైక్రోసాఫ్ట్ ఇండియా హెచ్ఆర్ మాజీ జీఎం అభిజిత్ భాదురి.ఆయన తన శిక్షణతో ఎందరో మేనేజర్లను తీర్చిదిద్దడమే కాకుండా.. అంతర్జాతీయంగా బెస్ట్ రిక్రూటింగ్ కన్సల్టెంట్స్ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియా అందిస్తున్న చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్గా విధులు నిర్వర్తించారు. అంతేకాకుండా ఆధునిక యుగంలో కొలువుల్లో సాంకేతికపై ‘డిజిటల్ సునామీ’ పేరుతో పుస్తకాన్ని కూడా రాశారు. బెస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా, ఆథర్గా, బెస్ట్ రిక్రూటర్గా గుర్తింపు పొందిన అభిజిత్ భాదురితో ఈ వారం ఇంటర్వ్యూ.ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగార్థులు ఆందోళనలేకుండా ఎలా సంసిద్ధంగా ఉండాలి?ఆధునిక ప్రపంచంలో.. ఏఐ యుగంలో.. పోటీ వాతావరణంలో యువత అకడమిక్స్లోనైనా, కెరీర్ పరంగానైనా సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే సక్సెస్ సొంతమవుతుంది. సమస్య తీవ్రత చూసి ఆందోళన చెందకూడదు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని గమనించాలి. దానికి మార్గాలు ఏంటి? అని ఆత్మ విశ్లేషణ చేసుకుంటే ఆందోళన వీడుతుంది. ముఖ్యంగా ఏఐతో ఉద్యోగాలు పోతాయనే భయాందోళనను వీడి.. ఆ టెక్నాలజీ ద్వారా లభించే కొత్త ఉద్యోగాలు, ప్రొఫైల్స్ను అందుకునే ప్రయత్నం చేయాలి.జాబ్మార్కెట్లో కుదురుకునేందుకు విద్యార్థులు అకడమిక్గా ఏయే అంశాలపై దృష్టిసారించాలి?ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్లో అడుగు పెట్టిన తర్వాత విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్ దృక్పథం అలవర్చుకోవాల్సిందే. స్కూల్ లెవల్లో ఉన్నట్లు స్పూన్ ఫీడింగ్ ఉంటుందని భావించొద్దు. నేటితరం విద్యార్థులకు ఏ రంగానికి సంబంధించైనా చిటికెలో విస్తృత సమాచారం లభిస్తోంది. దీన్ని అనుకూలంగా మార్చుకోవాలి. అయితే ఇదే సమయంలో కనిపించిన ప్రతి అంశాన్ని చదివితే సమయం వృథా. అందుకే సెల్ప్ లెర్నింగ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. లెర్నింగ్ లేదా సెల్ఫ్ లెర్నింగ్ అంటే.. ఏదైనా ఒక అంశం గురించి క్లాస్ రూంలో బోధిస్తున్నప్పుడు సరైన ప్రశ్న అడగడం లేదా అందుబాటులో ఉన్న సమాచారంలో సరైన అంశాన్ని గుర్తించడమే. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు నిర్దిష్టంగా ఒక అంశాన్ని క్లాస్ రూంలో వినకపోవడం వల్ల సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతున్నారు. ఇది అంతిమంగా వారి కెరీర్పై ప్రభావం చూపుతోంది.ఉద్యోగార్థులు అకడమిక్స్తోపాటు దృష్టి సారించాల్సిన అంశాలేవి?ప్రస్తుతం వ్యాపార రంగం విభిన్న నైపుణ్యాలున్న స్పెషలిస్ట్ల కోసం అన్వేషిస్తోంది. కాబట్టి విద్యార్థులు తమ ఆసక్తులను విస్తృతం చేసుకోవాలి. ఎంచుకున్న స్పెషలైజేషన్ లేదా ప్రోగ్రామ్కే పరిమితం కాకుండా విభిన్న డిసిప్లైన్స్ అభ్యసించాలి. ప్రతి ఏటా కొత్త నైపుణ్యాలు పొందేలా తమను తాము మలచుకోవాలి. అంతేకాకుండా కెరీర్లో ప్రతి దశలోనూ మంచి మెంటార్స్ ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా సుదీర్ఘ కాలం సుస్థిరత లభిస్తుంది.విద్యార్థులు కొంచెం ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కుంగుబాటుకు గురవుతున్నారు? దీనికి మీరు సూచించే పరిష్కారం?యువత ఆసక్తిని పెంచుకోవడంతోపాటు.. శరవేగంగా మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇక ఉద్యోగం, కెరీర్ ఎంపికలో తమ బలాలు, బలహీనతలు గుర్తించి తమ సామర్థ్యాలకు సరితూగే సంస్థలు/ఉద్యోగం పొందేందుకు కృషి చేయాలి. ఒక అవకాశం చేజారినా నిరుత్సాహం చెందకూడదు. అది ఎందుకు చేజారిందనే ఆత్మవిశ్లేషణ చేసుకుని ఆ సమస్య పునరావృతం కాకుండా చూసుకుంటే అంతా సవ్యంగా సాగుతుంది.యువత మానసికంగా దృఢంగా ఉండటానికి ఏ లక్షణాలను అలవర్చుకోవాలి?విద్యార్థులు ఐక్యూ లెవల్స్ను పెంచుకోవడంతోపాటు.. ఎమోషనల్ కోషియంట్ – ఈక్యూ (భావోద్వేగ ప్రజ్ఞ) లెవల్స్ను పెంచుకునేలా కృషి చేయాలి. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో.. కెరీర్ లక్ష్యాలు చేరుకునే క్రమంలో.. విధుల్లో ఉన్నత స్థానాలు అధిగమించే క్రమంలో మానసిక ఉద్విగ్నతలను సమతూకంలో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. దీనికి ప్రధాన సాధనం ఈక్యూ. కెరీర్లో విజయాలు సాధించాలంటే ఎమోషనల్ కోషియంట్దే ప్రధాన పాత్ర అని పలు సందర్భాల్లో రుజువైందని తెలుసుకోవాలి.ప్రస్తుత జాబ్మార్కెట్కు అనుగుణంగా కరిక్యులం ఉందా?ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీ కార్యకలాపాలు ఆరేడు నెలలకోసారి.. కొత్త పుంతల్లో వెళుతున్నాయి. దీనికి అనుగుణంగా క్లాస్ రూంలో బోధన కుదరట్లేదు. కాబట్టి ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ తదితర ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్లో కరిక్యులం మార్పులు చేయాలి. పూర్తి స్థాయిలో ఇది క్లిష్టమైతే ఇండస్ట్రీ వర్గాల భాగస్వామ్యంతో క్లాస్ రూమ్ టీచింగ్ ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులకు ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితులపై అవగాహనతోపాటు.. రియల్టైమ్ నైపుణ్యాలు పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది.నియామక పద్ధతుల్లోని మార్పులపై మీ అభిప్రాయం ఏంటి?ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీలకు అనుగుణంగా.. వాటిలో పట్టు ఉన్న వారిని గుర్తించడం, హైరింగ్ చేసుకోవడం హెచ్ఆర్ నిపుణులకు కూడా కష్టంగానే మారుతోంది. ఇదే కారణంగా ఇంటర్వ్యూలలో టెక్నికల్ రౌండ్స్ క్రమేణా పెరుగుతున్నాయి. టెక్నికల్ టీమ్ మదింపు ఆధారంగా హెచ్ఆర్ టీమ్ ఆఫర్స్ ఖరారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలోనూ ఏఐ ప్రమేయాన్ని మనం చూడొచ్చు. ఇప్పటికే విదేశాల్లో ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి మన దేశంలోనూ త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు, జాబ్ సీకర్స్ ఏఐ ఆధారిత ఇంటర్వ్యూల సరళిపై ఇప్పటి నుంచే అవగాహన ఏర్పరచుకోవాలి.ఏఐ కారణంగా ఫ్రెషర్స్కు అవకాశాలు తగ్గుతాయా?ఏఐ విప్లవం నేపథ్యంలో ప్రెషర్స్ నియామకాలు తక్కువగా ఉంటాయి.. క్యాంపస్ డ్రైవ్స్ ఉండవు అనే మాటను అంగీకరించను. ఎందుకంటే.. కంపెనీలకు ఫ్రెష్ మైండ్స్ దొరికేది క్యాంపస్లలోనే. ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకుంటే తమ ప్రణాళికలు, తమ కార్యకలాపాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చనే భావన ఇప్పటికీ కార్పొరేట్ వర్గాల్లో సజీవంగా ఉంది. అందువల్ల విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్స్లో రాణించేలా.. లేటెస్ట్ టెక్నాలజీస్, మార్పులపై అవగాహన ఏర్పరచుకుని.. క్యాంపస్ ఇంటర్వ్యూలకు సన్నద్ధం కావాలి. మరోవైపు విద్యార్థులు క్లాస్లో టాపర్స్తో పోల్చుకోకుండా తమకున్న టాలెంట్కు సరితూగే సంస్థలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు కెరీర్లో నిరాశకు గురికాకుండా.. తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. -
చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతీసేలా 'డీప్ఫేక్' ఫోటోలు.. కేసు నమోదు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్లను ఎవరూ ఉపయోగించకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా క్రియేట్ చేశారు. వాటిని పలు వెబ్సైట్లు, సోషల్ మీడియాలలో కొందరు వైరల్ చేశారు. ఈ విషయం చిరు దృష్టికి చేరడంతో ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ముఖ్యంగా AI మార్ఫింగ్ ద్వారా డీప్ఫేక్ వీడియోలు రూపొందించి తన పేరు, ప్రతిష్ట దెబ్బతీసేలా పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిరు కోరారు.డీప్ ఫేక్ ఫోటోల వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న చిరంజీవి కొద్దిరోజుల క్రితమే సివిల్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా చిరుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన ఫోటోలను తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరూ వినియోగించవద్దని హెచ్చరించింది. ఈ క్రమంలోనే AI ద్యారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధిస్తూ సైబర్క్రైమ్ పోలీసులుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చిరుపై తప్పుడు పోస్టులు, వీడియోలను క్రియేట్ చేసిన 30 మందికి పైగానే నోటీసులు జారీ చేసింది. కోర్టు సూచనతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఫేస్బుక్తో కలిసిన రిలయన్స్: రూ.855 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (AI) సేవలను అభివృద్ధి చేసేందుకు మెటా ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్ ఓవర్సీస్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.ఈ జాయింట్ వెంచర్లో రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ ఇంటెలిజెన్స్లిమిటెడ్ వాటా 70%, ఫేస్బుక్ ఓవర్సీస్ వాటా 30 శాతం ఉంటుందని పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ కోసం రెండు కంపెనీలు రూ.855 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన అనుబంధ సంస్థ రిలయన్స్ఇంటెలిజెన్స్లిమిటెడ్ 2025 అక్టోబర్ 24న రిలయన్స్ఎంటర్ ప్రైజ్ ఇంటెలిజెన్స్లిమిటెడ్(ఆర్ఈఐఎల్)ను ప్రారంభించింది.ఈ జాయింట్ వెంచర్ ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్స్పై దృష్టి సారించిందని రిలయన్స్ పేర్కొంది. ఈ జేవీ ఏర్పాటుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదని రిలయన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.ఇదీ చదవండి: పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా? -
ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యూషన్స్ లిస్టింగ్
ఏఐ ఆధారిత గవర్నెన్స్, ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్లు అందించే ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యూషన్స్ తాజాగా బీఎస్ఈలో లిస్టయ్యింది. ఈ సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలో కంపెనీ ఎండీ, సీఈవో రాజా శ్రీనివాస్ నందిగామ్ షేరు ఓపెనింగ్ బెల్ మోగించారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ రివర్స్ మెర్జర్ ద్వారా బీఎస్ఈ మెయిన్ బోర్డులో లిస్టయ్యింది.జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించడంతో ఆర్ఎన్ఐటీ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ 2023లో ఆటోపాల్ ఇండస్ట్రీస్లో విలీనమైంది. విలీనం తదుపరి కంపెనీ ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యూషన్స్గా రూపాంతరం చెందింది. షేర్ల మార్పిడి తదుపరి తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈలో లిస్టయ్యింది. మల్టీమోడల్ ఏఐ, ఇంటిగ్రేటింగ్ టెక్ట్స్, వాయిస్, విజన్ అనలిటిక్స్పై ఇన్వెస్ట్ చేయడం ద్వారా గవర్నెన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లలో పటిష్ట నిర్ణయాలకు వీలు కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? ఉచితంగా రూ.7 లక్షలు బీమా -
సరికొత్త ఏఐ తయారీకి బ్లూప్రింట్ సిద్ధం
విభిన్నమైన మూలాధారాల నుంచి సమాచారాన్ని విశ్లేషించి వాస్తవిక ప్రపంచ సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించగల కృత్రిమ మేథ ఆవిష్కరణకు బాటలువేసే ‘బ్లూప్రింట్’సిద్ధమైంది. బ్రిటన్లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం, అలాన్ ట్యూరింగ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ బ్లూప్రింట్ను రూపొందించారు. ఈ పరిశోధన తాలూకు వివరాలు ప్రఖ్యాత ‘నేచర్ మెషీన్ ఇంటెలిజెన్స్’జర్నల్లో ప్రచురితమయ్యాయి.కంటికి కనిపించని, తనకు అర్థంకాని భాష నుంచి సైతం సమాచారాన్ని ఎలాగోలా రాబట్టి దాని సారాన్ని ఒడిసిపట్టే సామర్థ్యంతో కొత్త ఏఐను సృష్టించేందుకు ఈ బ్లూప్రింట్ అక్కరకొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతమున్న ఏఐలు చిత్రాలు, వీడియోలు, వాక్యాలు, శబ్దాలు, సెన్సార్లలో ఏకకాలంలో ఏదో ఒకటి, రెండు అంశాల నుంచి మాత్రమే డేటాను సంగ్రహించగలవు. కానీ అన్నిరకాల డేటాను విశ్లేషించేలా మల్టీమోడల్ ఏఐ వ్యవస్థను రూపొందించనున్నారు.దృశ్య, శ్రవణ, పర్యావరణ, పరిసర, సెన్సార్ డేటాలను ఏకకాలంలో విశ్లేషించగలిగితే స్వయంచోదిత కార్ల వంటి వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. దీంతోపాటే వైద్య, చికిత్స, జన్యు డేటాలను ఏకకాలంలో విశ్లేషించగలిగితే వ్యాధి నిర్ధారణ పరీక్షలతోపాటు ఏఏ ఔషధాల సమ్మేళనం ఎంత మోతాదులో ఖచ్చితత్వంతో పనిచేస్తుందో సులువుగా కనిపెట్టవచ్చు.‘‘భవిష్యత్ విపత్తులు, సుస్థిర ఇంధనం, వాతావరణ మార్పుల వంటి అంశాలకు పరిష్కారాలు వెతకాలంటే విస్తృతస్తాయి డేటాను లోతుగా విశ్లేషించగలగాలి’’అనిఈ పరిశోధనకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ హైపింగ్ లూ అన్నారు. షెఫీల్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, మెషీర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఈయన ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. -
యాపిల్కి పోటీ.. శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ విడుదల
శామ్ సంగ్ తాజాగా “వరల్డ్ వైడ్ ఓపెన్” ఈవెంట్లో తన కొత్త ఎక్స్ఆర్ (XR-ఎక్స్టెండెడ్ రియాలిటీ) వ్యూహాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా, గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్తో పాటు, వైర్డ్, వైర్లెస్ ఎక్స్ఆర్ గ్లాసెస్, ఏఐ గ్లాసెస్ అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. గూగుల్తో భాగస్వామ్యంలో రూపొందిస్తున్న ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ప్లాట్ఫామ్ను ఈ పరికరాలు ఉపయోగించనున్నాయి.డిస్ప్లే ఉన్న హెడ్సెట్ల నుండి డిస్ప్లే రహిత ఏఐ గ్లాసెస్ వరకు ఎక్స్ఆర్ పరికరాల పూర్తి సిరీస్ను ఈ ఈవెంట్లో శాంసంగ్ వివరించింది. శాంసంగ్, జెంటిల్ మాన్స్టర్, వార్బీ పార్కర్ వంటి బ్రాండ్లతో కలిసి గ్లాసెస్ డిజైన్లో పనిచేస్తోంది.ఏఐ గ్లాసెస్ ప్రత్యేకంగా ఓక్లే మెటా గ్లాసెస్కు ప్రత్యర్థిగా ఉండనున్నాయి. వీటిలో డిస్ప్లే ఉండదు కానీ, గూగుల్ జెమినీ ఏఐ (Google Gemini AI) సాయంతో మెసేజింగ్, నావిగేషన్, అనువాదం వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తాయి. గూగుల్ ఇప్పటికే ఈ తరహా గ్లాసెస్ను డెమోలో ప్రదర్శించింది.శాంసంగ్ ఎక్స్ గ్లాసెస్ (కోడ్నేమ్: HEN) క్వాల్కమ్ XR2+ Gen 2 చిప్సెట్ను ఉపయోగించి ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ప్లాట్ఫారమ్పై నడుస్తాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్ లెన్స్ డిస్ప్లే, ఆడియో స్పీకర్లు, కెమెరాలు, చేతి సంజ్ఞల ఆధారంగా నియంత్రణలు ఉంటాయని అంచనా.గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ స్పెసిఫికేషన్లుడిస్ప్లే: మైక్రో-OLED, 3,552×3,840 రిజల్యూషన్, 60–90Hzచిప్సెట్: క్వాల్కమ్ XR2+ Gen 2ర్యామ్: 16GB స్టోరేజ్: 256GBఓఎస్: ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్కెమెరా: 6.5MPసెన్సార్లు: నాలుగు ఐ-ట్రాకింగ్, రెండు పాస్-త్రూ, ఐదు ఐఎంయూ, డెప్త్, ఫ్లిక్కర్ ఒక్కోటి ఉంటాయి.బ్యాటరీ: 2 గంటలు సాధారణ వినియోగం, 2.5 గంటలు వీడియో ప్లేబ్యాక్కనెక్టివిటీ: వైఫై7, బ్లూటూత్ 5.4బరువు: హెడ్సెట్ - 545 గ్రాములు, బ్యాటరీ - 302 గ్రాములుశామ్ సంగ్ గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ యాపిల్ విజన్ ప్రోకి (Apple Vision Pro), రాబోయే ఎక్స్ఆర్ గ్లాసెస్ మెటా రేబాన్ గ్లాసెస్కి పోటీగా నిలవనున్నాయి. ఏఐ గ్లాసెస్ 2025లో విస్తృత వినియోగానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. -
ఏఐలో మౌలిక సవాళ్ళు
కృత్రిమ మేధ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉద్యోగాల స్వభావంపై ప్రభావం చూపిస్తోంది. ఈ కృత్రిమ మేధ మానవ మనుగడకు ప్రమాదమని కొంతమంది వాదిస్తున్నప్పటికీ, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిన భారత్కు, ఏఐ లాంటి నూతన సాంకేతికత విషయంలో ‘గ్లోబల్ లీడర్’గా స్థానం సంపాదించవలసిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జెనరేటివ్ ఏఐ వినియోగించే సంస్థలు 2023లో 33 శాతం కాగా, 2024లో అవి 71 శాతానికి పెరిగాయి. పటిష్ఠమైన వృత్తి నైపుణ్యం కల్గిన శ్రామికులు, సాంకేతికతపై సంస్థల భారీ పెట్టుబడులు, డిజిటల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి కారణంగా భారత ఏఐ మార్కెట్ 2027 నాటికి 17 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ‘బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు’ నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ఏఐ కారణంగా డేటా ఎన్నొటేషన్, ఏఐ ఇంజినీరింగ్, కస్టమర్ సేవలు, ఎథికల్ ఏఐలో 40 లక్షల మందికి నూతన ఉపాధి లభిస్తుందని ‘నీతి ఆయోగ్’ అభిప్రాయపడింది. ఏఐ విజయంలో స్టార్టప్లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. ఇంటర్నెట్ లేకుండానే ఏఐ ఎలా?ఏఐ సాంకేతికత కారణంగా భారత్లో ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ, ఐటీ సేవలు, విద్య, వ్యవసాయ రంగంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, డేటా భద్రత–ప్రైవసీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత, ఏఐ సొల్యూషన్స్ అమలుపరచడానికి తగిన పెట్టుబడి లేకపోవడం, డేటా నాణ్యత తక్కువగా ఉండటం, ఎథిక్స్ ఏఐ సొల్యూషన్ ప్రొవైడర్స్కు సవాలుగా పరిణమించడం లాంటివి ఏఐ సాంకేతిక వినియోగంలో ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి.జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ కృత్రిమ మేధను ఐచ్ఛిక సబ్జెక్ట్గా 9, 10వ తరగతి విద్యార్థులకు 2019–20లో; సెకండరీ విద్య (6, 7 తరగతులు)లో 2022–23 నుండి ప్రవేశపెట్టింది. కానీ ఏఐని ఐచ్ఛిక సబ్జెక్ట్గా ప్రవేశపెట్టిన పాఠశాలల్లో 2021–22 నాటికి 33.9% పాఠశాలలు మాత్రమే ఇంటర్నెట్ లభ్యతను కలిగి ఉన్నాయి; ఆ యా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల్లో 50 శాతం కన్నా తక్కువమంది కంప్యూటర్ వినియోగం పట్ల అవగాహన కలిగి ఉన్నారు. ఇది పాఠశాలల స్థాయిలో అవస్థాపనా సౌకర్యాల కొరతను ఎత్తిచూపుతోంది. కేంద్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరంలో మూడో తరగతి నుండే పాఠశాల విద్యా ప్రణాళికలో ఏఐని ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఈ క్రమంలో సీబీఎస్ఈ అన్ని తరగతులలో ఏఐని అనుసంధానపరచడానికి ఒక చట్రాన్ని (ఫ్రేమ్ వర్క్) రూపొందిస్తున్నప్పటికి, కోటిమంది ఉపాధ్యాయులకు ఏఐ–సంబంధిత విద్యలో శిక్షణనివ్వడం క్లిష్టతరమయ్యే అవకాశం ఉంది.రాష్ట్రాల్లో మౌలిక ఇబ్బందులుఏఐ అడాప్షన్లో రాష్ట్రాల మధ్య అసమానతలు స్పష్టమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2023 జూలైలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు కరిక్యులమ్లో ఏఐని చేర్చాలనీ; ఏఐ, రోబోటిక్స్ను మెడికల్ విద్యలో ప్రవేశపెట్టాలనీ విద్యాశాఖ అధికారులు, వైస్ ఛాన్స్లర్లకు సూచించారు. విద్యార్థులను ‘ఏఐ క్రియేటర్స్’గా రూపొందించాలనే లక్ష్యాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. సుపరిపాలన, ఇతర రంగాలలో అభివృద్ధి నిమిత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏఐ వినియోగానికి ప్రాధాన్యమిస్తూ, బోధనా పద్ధతులలో మార్పు నిమిత్తం టెక్ దిగ్గజాలతో కలసి పనిచేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏఐని ప్రోత్సహించడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం లాంటి రంగాలలో సమర్థత, సర్వీస్ డెలివరీ పెంపునకు ఆ యా శాఖల్లో ఏఐని అనుసంధానపరచింది. 5 లక్షల మందికి ఏఐ నైపుణ్యంపై శిక్షణనివ్వడంతో పాటు, కోటి మంది ప్రజలకు 2027 నాటికి 300కు పైగా, పౌర సేవలను ఏఐ ద్వారా అందించాలనీ, ప్రపంచవ్యాప్తంగా మొదటి 25 ఏఐ ఇన్నోవేషన్ హబ్లలో హైదరాబాద్ స్థానం సాధించాలనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత లక్ష్యసాధనలో అవరోధంగా నిలిచే ప్రమాదం ఉంది.మరోవైపు కర్ణాటక 28 కోట్ల వ్యయంతో 2029 నాటికి 3,50,000 మందికి ఏఐ ఉపాధి లక్ష్యంగా ‘ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ను బెంగళూరులో ఏర్పాటు చేసింది. పశ్చిమ రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర కూడా యూనివర్సిటీల్లో ఏఐ కేంద్రాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఏఐలో ఉన్నత విద్య సర్టిఫికేషన్కి హరియాణా ప్రాధాన్యమిస్తోంది. బిహార్లో అవస్థాపనా సౌకర్యాల కొరత, పట్టణ – గ్రామీణ, ప్రభుత్వ –ప్రైవేటు రంగంలోని అసమానతల వల్ల కృత్రిమ మేధ ప్రగతి తక్కువగా ఉంది.సమంగా పంపిణీ కాకపోతే...కృత్రిమ మేధ ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజల మధ్య సమంగా పంపిణీ కావడం లేదు. ఏఐ సాంకేతికత... ఉపాధి పెంపు, ఆదాయ సమాన పంపిణీ, సంపద కల్పనకు దారి తీయనట్లయితే సమాజంలో అన్ని వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ఆదాయ స్థాయి, సామాజిక తరగతులు (సోషల్ క్లాస్) ఏఐ సాంకేతికత అందుబాటును నిర్ణయిస్తున్నాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో బ్రాడ్బాండ్ కనెక్టివిటీ తక్కువగా ఉండటం వలన ఏఐ సాంకేతికత అందుబాటు అసమానతలకు కారణమవుతోంది. పైగా పరిమిత విద్యుచ్ఛక్తి లభ్యత ఏఐ సేవల వృద్ధిని ప్రభావితం చేస్తుంది. 2030–35 నాటికి ప్రపంచ విద్యుత్ వినియోగంలో డేటా సెంటర్ల వాటా 20 శాతంగా ఉండి పవర్ గ్రిడ్స్పై అధిక ఒత్తిడికి కలుగ జేస్తాయని అంచనా. భారీ పరిమాణంలో డేటాను ప్రాసెస్ చేయడానికీ, గణనకు అవసరమయిన గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్లు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు పని చేయడానికీ, శిక్షణలో భాగంగా ప్రాసెసర్లు పని చేయడానికీ భారీ విద్యుత్ అవసరం. విద్యుత్ లభ్యత పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో తక్కువ. తద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఏఐ అడాప్షన్లో తేడాలు ఎక్కువగా ఉంటాయి. పారిశ్రామికీకరణ, అధిక పట్టణీకరణ అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో విద్యుత్ వినియోగం అధికం కాగా; ఈశాన్య రాష్ట్రాలు, తక్కువ పారిశ్రామికీకరణ చెందిన బిహార్, జార్ఖండ్లో విద్యుత్ వినియోగం తక్కువ. డిజిటల్ లిటరసీ గ్రామీణ ప్రాంతాలలో 25 శాతం కాగా, పట్టణ ప్రాంతాలలో 61 శాతం. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లను సొంతంగా కలిగి ఉండటం కూడా ఏఐ సాంకేతికత వినియోగానికి తప్పనిసరి.కృత్రిమ మేధ వ్యాప్తి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ అసమానతలను తొలగించి సమానత్వ సాధనకు దోహదపడగలదు. అందుకే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ నైపుణ్యం కల్గిన శ్రామిక శక్తిపై పెట్టుబడులు పెంచాలి. ఏఐ సాంకేతికతను మానవ శ్రేయస్సు పెంపొందించుకొనే విధంగా రూపొందించుకోవాలి. దానికోసం సమాజంలో విస్మరణకు గురైన వర్గాల ప్రజలకు ‘రీ–ట్రైనింగ్’ అందించే సామాజిక భద్రతా పథకాలు అవసరం. డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇంచార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో అనేక సవాళ్లున్నాయి: మాధవ్
-
వరం.. ప్రమాదం రెండూ మోసుకొస్తున్న AGI
హైదరాబాద్: “కృత్రిమ మేధస్సు (AI) తర్వాత రాబోతున్న కృత్రిమ సాధారణ మేధస్సు (AGI) మానవ జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, అయితే దానితో పాటు మంచి-చెడు పరిణామాలు కూడా మరింత తీవ్రంగా కనిపించనున్నాయి,” అని హెచ్చరించారు ప్రముఖ జర్నలిస్టు, ‘Artificial Intelligence in Modern Journalism’ పుస్తక రచయిత స్వామి ముద్దం. డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘Future of Journalism in the AI Era’ అనే అంశంపై హైదరాబాద్లో జరిగిన సెమినార్లో ‘AGI Journalism – Opportunities and Challenges’ అనే అంశంపై స్వామి ముద్దం ప్రెజెంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా స్వామి ముద్దం.. AGI యుగంలో జర్నలిజం ఎదుర్కోనున్న అవకాశాలు, సవాళ్లను చర్చించారు. “AGI మనిషి మాదిరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్థాయికి ఎదుగుతుంది. ఈ పరిణామం జర్నలిజంపై నమ్మకం, బాధ్యత, నైతిక విలువలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతుంది,” అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ శ్రీనివాస్ వడ్డానం, డా. యాదగిరి, సీనియర్ జర్నలిస్టులు, AI నిపుణులు పాల్గొన్నారు. -
వామ్మో.. ఏ(ఐ)డడుగులు..!
మన పురాతన తాటాకు శాసనాల గ్రంథాల్లో అన్నీ ఉన్నాయో లేవోగానీ... మన సినిమాల్లో మాత్రం సకల విజ్ఞాన శాస్త్రాలూ ఉన్నాయి. అందుకు నిదర్శనమే మనదైన పానిండియన్ సూపర్హిట్ బ్లాక్బస్టర్ సినిమా ‘రోబో’! ఏ అద్భుత ముహూర్తాన మన డైరెక్టర్ శంకర్ ‘రోబో’ తీశాడోగానీ... లోకమంతటా అవే వింతలు అచ్చం అలాగే జరుగుతున్నాయి. ఉదాహరణకు... ఇక్కడి మన సినిమాలో హ్యూమనాయిడ్ రోబో కాస్తా మానవ మానస వికాసాలూ, వికారాలూ ఒంటబట్టించుకుని ‘రోబో సేపియన్’ అవుతాడా! అలా అవ్వగానే ఆ ‘టాయ్’ఫ్రెండు కాస్తా హీరోయిన్కి ‘బాయ్’ఫ్రెండుగా మారి... అచ్చం మన మానవ కుర్రాళ్లలాగే... తనను ప్రేమించని అమ్మాయి మీద యాసిడ్లూ గట్రా విసిరేంత క్రూరమైన ‘సెల్ఫ్స్టైల్డ్ లవర్బా(టా)య్’గా మారిపోతాడు కదా. అక్కడ అమెరికాలోని ఒహాయో రాష్ట్ర చట్టనిపుణులు బహుశా ‘రోబో’ సినిమా చూసి హడలిపోయి ఉంటారేమో... మానవ మేధకూ, కృత్రిమ మేధస్సుకూ మధ్య వివాహాలు వద్దంటే వద్దంటూ గొడవ గొడవ చేస్తున్నారు. అంతేనా... ఆ మేరకు ఓ చట్టం తీసుకు వచ్చేందుకు బిల్లు కూడా ప్రిపేర్ చేశారు. అదే డైరెక్టర్ శంకర్గారి ఆయొక్క అదే ‘రోబో’ సినిమాలో... ‘‘ఇనుములో ఓ హృదయం మొలిచెలే పాటనుంచి స్ఫూర్తి పొందినట్టుగా... ఇప్పటికే మన పొరుగు దుండగీడైన చైనావాడు ‘దివిరి ఇసుకన తైలంబు’ రీతిగా దివిరి ఇనుమున గర్భసంచి నుంచి చిన్నారి పాపలను రేపీపాటికి తీసిస్తానంటూ తొడలుగొడుతూ, హడలగొడుతున్నారన్న సంగతి తెలిసిందే. అంతే కాదు... రోబోలకు సీమంతాలవీ గట్రా చేసేసి కృత్రిమ ‘ఊంబ్’ల లోంచి ఉంగా ఉంగా పాపాయిలను పుట్టిస్తానంటూ సవాళ్లు విసురు తున్నారు కూడా. అమిత వింతలకు నెలవైన అమెరికాలో... ఈ చిత్రవిచిత్రాలన్నీ చూస్తున్న ఒహాయో రాష్ట్రపు మేధావులు భయపడి పోతున్నారేమో...ఆఆందోళనతో స్థిమితంగా ఉండలేక... బహ్మాండమైన ఓ వివాహ నిషేధ చట్టాన్ని తెచ్చేందుకు నిశ్చయించు కున్నారు. ఆ మేరకు బిక్కు బిక్కుమంటూ బిల్లొకదాన్ని అక్కడి చట్టసభల్లో ప్రవేశపెట్టబోతున్నారు కూడా! దీనికి కారణ మేంటంటే... అక్కడి కుర్రకారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పెళ్లిళ్లు చేసుకునేందుకు తెగ ఉత్సాహపడిపోతున్నారట!హాయ్యో...! ఇప్పటికే అతి మేధావులైన మానవులూ, అమితమైన మేధస్సుల ‘కృత్రిమ మేధ’ మధ్య పెళ్లిళ్లు జరిగితే... రేపు సదరు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ కాస్తా పవరాఫ్ ఆటార్నీలంటూ పవర్పట్టా తీసుకోవడం, పార్ట్నర్తో చెట్టాపట్టాలే కాకుండా, లీగల్ వ్యవహారాల్లోకి దూరి, అసలు నిపుణులు తట్టాబుట్టా సర్దుకునేలా, చెట్టూపుట్టా పట్టుకు పోయేలా, బెదిరీ చెదిరీ΄ోయేలా చేస్తాయేమోనని హడలెత్తుతున్నారు ‘ఓహాయో రాష్ట్ర’పు చట్ట నిపుణులు. అందుకే... మనుషులకూ, యంత్రాలకు మధ్య పెళ్లిమంత్రాలు వద్దంటే వద్దంటూ పట్టు పడుతున్నారు. మానవులూ, యాంత్రాల మధ్య మనువులు వద్దంటూ వాదిస్తున్నారు. ఇది ‘యంత్రమాత్రమూ’ తగదంటూ బల్లగుద్ది మరీ శాసిస్తున్నారు మన ఒహాయో స్టేట్ రిప్రజెంటేటివూ, రిపబ్లికన్ మెంబరూ అయిన మిస్టర్ ‘థాయిడస్ క్లాగెట్’ గారు! అలనాడెప్పుడో బ్రహ్మంగారు చెప్పిన వింతలన్నీ అక్కడా ఇక్కడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడీ నేపథ్యంలో ఈ పుట్టు తెలివితేటలున్న మన మానవాళీ... పెట్టు తెలివితేటలున్న రోబోయంత్రాళీ...కలగలసి సంకరమైతే... రేపు భవిష్యత్తులో సకల‘అతి’తెలివితేటలున్న బుజ్జిబుజ్జి రోబో–కంగాళీలకు ఆస్కారముంటుందేమోనని అనుమానిస్తున్నారు. అచ్చం రోబో సినిమాలోలాగే... రేపెప్పుడైనా పొరబాటున ఆ ‘చిట్టి’ చిట్టి రోబోలకు విలనీయులైన ఏ అడ్డమైన సైంటిస్టులో ‘రెడ్డు చిప్పు’ పెడితే... అప్పుడది మన మానవాళి చేతికి ‘డేంజరు చిప్పే’ననేమోనంటూ ఇన్నిరకాల ఆంక్షలూ, హాహాకారాలంటూ లోకంలోని ప్రజలంతా తెగ చెవులు కొరుక్కుంటున్నారన్నది అభిజ్ఞ వర్గాల అతి రహస్య భోగట్టా. ఇదీ చదవండి: ధన త్రయోదశి ఆరోగ్యమస్తు ధన ప్రాప్తిరస్తు.. ప్రాశస్త్యం ఇదీ!ఏఐ మ్యారేజ్ ప్రపోజల్ ప్రేమలేఖల నుంచి ఎస్ఎంఎస్ల వరకు లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ పలు రకాలు. తాజా విషయానికి వస్తే...ఒక కుర్రాడు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను ఉపయోగించి ఫేక్ డిస్నీ–స్టైల్ ట్రైలర్ ద్వారా తన స్నేహితురాలికి మ్యారేజ్ ప్ర΄ోజ్ చేశాడు. ఈ వీడియోకు 11 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో రీషేర్ చేస్తున్నారు. ‘ది ఈజీయెస్ట్ యస్. యస్, ప్ర΄ోజ్డ్ టు జె... యూజింగ్ ఏఐ’ అని వీడియోకు కాప్షన్ ఇచ్చారు. వీడియో చివరలో ‘విల్ యూ మ్యారీ మీ’ అనే కామెంట్ కనిపిస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ‘యస్’ చెప్పిందా? యస్! ‘ది మోస్ట్ బ్యూటీఫుల్ మ్యారేజ్ ప్రపోజల్’ అంటూ స్పందించారు నెటిజనులు.– యాసీన్


