breaking news
AI
-
ఏఐ వచ్చినా..మన ఉద్యోగాలు సేఫ్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉపాధి కోల్పోతాం అన్న భావన చాలామందిలో ఉంది. ఒక్క భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఈ ఆందోళన నెలకొంది. ఈ విషయంలో మనం సేఫ్! భారత్లో కేవలం 6.4 శాతం ఉద్యోగాలకు మాత్రమే ఏఐ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. అంటే కృత్రిమ మేధ రాకతో భారతీయులపై ప్రతికూల ప్రభావం అతి తక్కువే అన్నమాట. పైగా ఈ నూతన సాంకేతికత వల్ల 15 శాతానికిపైగా ఉద్యోగాలు మరింత మెరుగుపడతాయని వివరించింది. ఏఐ నియామకాల్లో దేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ పోటీపడుతుండడం విశేషం. ఇక ఏఐ పరివర్తనలో దక్షిణ ఆసియాలో భారత్ ముందంజలో దూసుకెళుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఉద్యోగ ప్రకటనల్లో ఏఐ వాటా దక్షిణాసియాలో ఇలా..శ్రీలంక 7.3భారత్ 5.8నేపాల్: 3.4బంగ్లాదేశ్: 1.4» ఏఐ రాకతో భారత్లో 15.6 శాతం ఉద్యోగాలు మరింత మెరుగుపడతాయి.» 6.4 శాతం జాబ్స్ను మాత్రమే ఏఐ కైవసం చేసుకుంటుంది.» సాంకేతిక సేవలకు పేరొందిన బెంగళూరు, హైదరాబాద్లలో ఏఐ సంబంధ ఉద్యోగాలు కేంద్రీకృతమయ్యాయి.» మొత్తం జాబ్ పోస్టింగ్స్లో ఏఐ సంబంధ ఉద్యోగాల వాటా మన దేశంలో 5.8 శాతం.» ఏఐ జాబ్స్లో జాతీయ సగటును మించి నాలుగు నగరాలు ముందంజలో ఉన్నాయి. దేశాల వారీగా ఏఐ రాకతో వివిధ రంగాల్లో మెరుగుపడే ఉద్యోగాలు, ప్రభావితం అయ్యే జాబ్స్, ఏమాత్రం ప్రభావం లేని విభాగాల శాతం -
గూగుల్తో జతకట్టిన ఎయిర్టెల్: ఎందుకంటే?
భారతీ ఎయిర్టెల్.. ఈ రోజు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో.. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్ను ఏర్పాటు చేయడానికి గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ చొరవతో దేశంలో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయనున్నట్లు సమాచారం.విశాఖపట్నంలోని ఏఐ హబ్ కోసం గూగుల్ ఐదేళ్లలో సుమారు 15 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఎయిర్టెల్, అదానీకన్నెక్స్ వంటివి ఏఐ హబ్ కోసం సహకారం అందిస్తాయి. ఎయిర్టెల్ & గూగుల్ సంయుక్తంగా విశాఖపట్నంలో పర్పస్ బిల్ట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తాయి. అంతే కాకుండా గూగుల్ కొత్త అంతర్జాతీయ సబ్సీ కేబుల్లను హోస్ట్ చేయడానికి అత్యాధునిక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS)ను ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఎయిర్టెల్ ఒక బలమైన ఇంట్రా సిటీ, ఇంటర్ సిటీ ఫైబర్ నెట్వర్క్ను కూడా సృష్టిస్తుంది.భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. గూగుల్తో ఈ భాగస్వామ్యం భారతదేశ డిజిటల్ భవిష్యత్తులో ఒక నిర్ణయాత్మక క్షణం. ప్రపంచ స్థాయి ఏఐ మౌలిక సదుపాయాలను పెంచడానికి మేము సహకరిస్తామని అన్నారు. ఎయిర్టెల్తో కలిసి పనిచేస్తూ, మేము తదుపరి తరం ఏఐ సేవలను అందిస్తామని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ పేర్కొన్నారు. -
AI వినియోగంపై హెచ్చరిక.. యూకేలో గరికపాటి ప్రవచనాలు
లండన్: ప్రఖ్యాత సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు తన తొలి యూకే పర్యటనలో భాగంగా బ్రిటిష్ ఇండియన్ తెలుగు సంస్కృతి సంఘం ఆహ్వానంపై పలు నగరాల్లో ప్రవచనాలు నిర్వహించారు. ఈ పర్యటనలో ఆయన జీవిత శిక్షకుడిగా, సాహిత్య పండితుడిగా తన మేధస్సుతో వేలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.బర్మింగ్హామ్ నగరంలో జరిగిన కార్యక్రమంలో గరికపాటి నైతిక, ధార్మిక విలువలపై ప్రసంగించారు. లండన్లో జరిగిన ప్రవచనం ప్రధానంగా ధర్మబద్ధమైన జీవనం, జాతి నిర్మాణంలో NRIల పాత్ర అనే అంశాల చుట్టూ సాగింది. ఆయన ప్రసంగంలో హాస్యం, భక్తి, తత్వశాస్త్రం మేళవించి, శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ప్రసంగంలో గరికపాటి గారు AI వాడకంపై చమత్కారమైన హెచ్చరికలు చేస్తూ, తగిన నియంత్రణ లేకపోతే దాని ప్రమాదాలు గురించి పునరుద్ఘాటించారు. అంతేకాక, ప్రతి NRI తన స్వగ్రామాన్ని దత్తత తీసుకుని దేశానికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిట్సెస్ బృందాన్ని సురేష్ మంగళగిరి పరిచయం చేశారు. కాటెపల్లి సచిందర్ రెడ్డి, వాసా బరత్, యశ్వంత్, రాగసుధ, షణ్ముఖ్, సుభాష్, అశ్విన్, సుదర్శన్, రాజ్ దేవరపు, శరత్ తమా, వివేక్, శ్రీనివాస్, బాలు తదితరులు కోర్ కమిటీ సభ్యులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వాలంటీర్లు, స్పాన్సర్లు అందించిన మద్దతుతో ఈ పర్యటన తెలుగు సంస్కృతికి, ధర్మబద్ధమైన జీవన దృక్పథానికి అద్భుత వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమాల్లో భజనలు, శాస్త్రీయ నృత్యాలు కూడా ప్రదర్శించబడ్డాయి. ఇది ఎన్ఆర్ఐలు తమ కళా, సాంస్కృతిక విలువలను ఎలా నిలబెట్టుకుంటున్నారనే దానికి నిదర్శనంగా నిలిచింది. -
3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు! ప్రభుత్వం నిర్ణయం..
భారతదేశ విద్యారంగం చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోబోతోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 3వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను పాఠశాల పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే భవిష్యత్తు కోసం విద్యార్థులను సన్నద్ధం చేయడం, చిన్న వయసు నుంచే డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ చర్య జాతీయ విద్యా విధానం (NEP)-2020కి అనుగుణంగా ఉంది. ఇది సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది.ముఖ్య ఉద్దేశాలు.. సన్నద్ధతవిద్యలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకీకృతం చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఈ కార్యక్రమం సూచిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వివిధ గ్రేడ్ స్థాయిల్లో సమర్థవంతమైన ఏఐ విద్యను అందించడానికి ఒక సమగ్ర ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేస్తోంది. ఏఐ భావనలను సమర్థవంతంగా బోధించడానికి దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్తులో సిద్ధంగా ఉన్నారని నిర్ధారించడం ఈ ప్రణాళిక అంతిమ లక్ష్యంగా విద్యాశాఖ పేర్కొంది.విద్యార్థులపై ఏఐ ప్రభావం🚨 India will introduce Artificial Intelligence (AI) in the school curriculum from Class 3 onwards starting 2026-27. - Ministry of Education. pic.twitter.com/IACvizFCCv— Indian Tech & Infra (@IndianTechGuide) October 11, 2025ప్రస్తుతం జనరేటివ్ ఏఐ వేగంగా పురోగమిస్తోంది. చాట్జీపీటీ, జెమినీ, గ్రోక్ఏఐ.. వంటి సాధనాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విద్యా పద్ధతులను మారుస్తున్నాయి. పాఠశాలల్లో ఏఐ పరిచయం విద్యార్థులకు క్లిష్టమైన ఆలోచన, సమస్య పరిష్కారం, వినూత్న నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. చిన్నప్పటి నుంచే ఏఐ సాధనాలను ఉపయోగించడం, వాటిని నేర్చుకోవడం వల్ల సంక్లిష్ట సమస్యలను విశ్లేషించి, పరిష్కరించగల సృజనాత్మక పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుంది. ఏఐ ఆధారిత నైపుణ్యాల వల్ల భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్లో పోటీపడే అవకాశం ఉంటుంది.గ్రామీణ విద్యార్థుల అవసరాలు.. మౌలిక సదుపాయాలుపట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించడం ఏఐ బోధనను దేశవ్యాప్తంగా అమలు చేయడంలో అతిపెద్ద సవాలుగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను అందించాలి. ఏఐ బోధన క్రమంలో పాఠశాలల్లో తప్పనిసరిగా మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరం. ఇందులో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ప్రతీ విద్యార్థికి లేదా కనీసం ఇద్దరు విద్యార్థులకు ఒక కంప్యూటర్/ టాబ్లెట్ అందుబాటులో ఉండాలి. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా జాగ్రత్తపడాలి.మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామాల్లో పాఠశాల సమయం తర్వాత కూడా విద్యార్థులు ఏఐ, కంప్యూటర్లను ఉపయోగించడానికి వీలుగా ‘కమ్యూనిటీ లెర్నింగ్ కేంద్రాలు’ లేదా ‘డిజిటల్ ల్యాబ్లు’ ఏర్పాటు చేయడం అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ బోధన, అభ్యాస సామగ్రిని స్థానిక భాషల్లో అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఏఐ భావనలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.ఫీజుల నియంత్రణకు ప్రభుత్వ చర్యలుఈ నూతన ఆవిష్కరణను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికే ఉన్న అధిక ఫీజులను మరింత పెంచే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులను నివారించడానికి ప్రభుత్వం తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో ఫీజు నియంత్రణ మండలిని బలోపేతం చేసి ఏఐ విద్య పేరుతో విధించే అదనపు ఫీజులపై పారదర్శకతను, నియంత్రణ తీసుకురావాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన మౌలిక సదుపాయాలను అత్యంత ఉన్నత ప్రమాణాలకు మెరుగుపరచడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలి. ఇది ప్రైవేట్ పాఠశాలలు తమ ఫీజులను అనవసరంగా పెంచకుండా నిరోధించడానికి పరోక్షంగా ఒత్తిడిని సృష్టిస్తుంది. ఏఐ బోధనను పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల అయ్యే వాస్తవ ఖర్చుల ఆధారంగా మాత్రమే ఫీజులను పెంచడానికి అనుమతించే కఠినమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయాలి.ఇదీ చదవండి: బంగారంతో ప్రైవేట్ జెట్ కొనొచ్చు! ఎప్పుడంటే.. -
కాళ్లు కడిగించి.. ఆ నీరు తాగించి!
దమోహ్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందించిన ఒక ’అభ్యంతరకరమైన’ చిత్రాన్ని పంచుకున్నందుకు మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లాలో ఒక యువకుడిని బ్రాహ్మణుడి కాళ్లు కడిగించి.. ఆ నీటిని తాగమని బలవంతం చేశారన్న ఆరోపణలపై ఆదివారం పోలీసు కేసు నమోదైంది. జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలోని పతేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సతరియా గ్రామంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి.చెప్పుల దండ వేసినట్లు ఏఐ చిత్రం ఓబీసీ వర్గానికి చెందిన పురుషోత్తం కుషా్వహా, అదే గ్రామానికి చెందిన అన్నూ పాండే అనే వ్యక్తికి చెప్పుల దండ వేసినట్లు ఏఐ రూపొందించిన చిత్రాన్ని ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో కుష్వాహా ఆ పోస్ట్ను తొలగించి, బహిరంగంగా క్షమాపణ చెప్పాడని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రుత్ కీర్తి సోమ్వంశీ తెలిపారు. అనంతరం గ్రామంలో పంచాయతీ నిర్వహించి కుషా్వహాతో బలవంతంగా పాండే కాళ్లు కడిగించి.. అదే నీటిని అతనితో తాగించారు. పంచాయతీ అతనికి రూ.5,100 జరిమానా కూడా విధించింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరో వీడియోలో, కుష్వాహా మాట్లాడుతూ.. తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పానని, ఈ సంఘటన రాజకీయ అంశంగా మారాలని కోరుకోవడం లేదని స్పష్టం చేస్తున్నట్లు ఉంది. కాగా, బాధితుడు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, పాండేతో సహా నలుగురిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 196 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు దమోహ్ కలెక్టర్ సు«దీర్ కుమార్ కోచర్ విలేకరులకు తెలిపారు.నిందితులను అరెస్టు చేసే ప్రక్రియ జరుగుతోందని ఎస్పీ తెలిపారు. ఈ సంఘటన మానవత్వంపై మచ్చని కాంగ్రెస్ పార్టీ ’ఎక్స్’లో పేర్కొంది. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్చార్జ్ ఆశిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ ప్రతి నేరాన్నీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. -
‘ఇందిరమ్మ’కు ఏఐ అండ
సాక్షి, హైదరాబాద్: ఒకరి ఖాతాల్లోకి చేరాల్సిన ఇందిరమ్మ ఆర్థిక సాయం, మరొకరి ఖాతాల్లోకి చేరుతుండటాన్ని గృహ నిర్మాణ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ పరిస్థితిని నివారించేందుకు ఏఐ ఆధారిత పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానించే సమయంలో బ్యాంకర్లు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సాయం పంపిణీలో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని వివరిస్తూ శనివారం సాక్షి పత్రికలో ‘‘ఆధార్ ఒకరిది... ఖాతా మరొకరిది’’అన్న శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇందిరమ్మ లబ్దిదారుల ఆధార్ నంబర్ ఇతరుల బ్యాంకు ఖాతాలతో అనుసంధానం కావటంతో, ఇందిరమ్మ లబ్దిదారుల ఖాతాల్లోకి జమ కావాల్సిన మొత్తం ఇతరుల ఖాతాల్లోకి జమ అవుతున్న తీరును సాక్షి సోదాహరణంగా వెలుగులోకి తెచి్చంది. లబ్దిదారుల నుంచి ఫిర్యాదులు అందటంతో గృహనిర్మాణ శాఖ దీనిపై దృష్టి సారించింది. చెల్లింపు విధానం మార్పు ప్రస్తుతం ఇందిరమ్మ లబ్దిదారులకు ఆర్థిక సాయాన్ని వారి ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లిస్తున్నారు. ఆ ఆధార్ నంబర్ ఏ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉందో ఆ బ్యాంకు ఖాతాలోకి ఆటోమేటిక్గా నిధులు జమ అవుతాయి. అలా జరిగేలా ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ బ్యాంకు ఖాతాలతో ఆధార్ నంబర్ను అనుసంధానించే సమయంలో చాలా బ్యాంకుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకరి ఖాతాకు మరొకరి ఆధార్ నంబర్ను అనుసంధానించారు. దీంతో లబ్ధిదారులకు బదులు ఇతరుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. ఇది బహిర్గతం కావడంతో చెల్లింపు విధానంలో మార్పులు తీసుకువస్తున్నారు. సాంకేతిక వ్యవస్థలో మార్పులు ఆధార్ నంబర్ ఆధారంగా చెల్లింపు జరిగే సమయంలో లబ్దిదారు పేరును పరిశీలించేలా ఏఐ టెక్నాలజీతో అప్డేట్ చేస్తున్నారు. లబ్దిదారు జాబితాలో ఉన్న పేరుతో అక్షరం అక్షరం సరిపోలేలా సాఫ్ట్వేర్ను ఫీడ్ చేస్తున్నారు. పేరులో ఏమాత్రం తేడా ఉన్నా ఆర్థిక సాయం బ్యాంకు ఖాతాలో జమ కాకుండా నిలిచిపోతుంది. లబ్దిదారు పేరు, ఆధా ర్ నంబర్ జత అయిన మరో వ్యక్తి పేరు ఒకటే అయినప్పుడు.. ఇంటి పేరుతో సరిపోల్చి చూడనున్నారు. ఇంటి పేరు ఒకటే అయినప్పుడు ఇంటి నంబరుతో సరిపోల్చి చూసేలా కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఆర్థిక సాయం మొత్తం తప్పు డు ఖాతాలో జమ కాకుండా ఉండటమే కాకుండా, అధికారులకు కూడా ఆ విషయాన్ని తెలిపేలా సాంకేతిక వ్యవస్థలో మార్పులు చేస్తున్నారు. -
టీ స్క్వేర్ ఐకానిక్ బిల్డింగ్గా ఉండాలి: సీఎం రేవంత్
హైదరాబాద్: టీ స్క్వేర్ భవనం అనేది ఐకానిక్ బిల్డింగ్లా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. దీనికి సంబంధించి నవంబర్ నెల చివరి నుంచి పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. ఈరోజు(శనివారం, అక్టోబర్ 11వ తేదీ) ఐసీసీలో ఏఐ హబ్ టీ సక్వేర్పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి శ్రీధర్బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజేఐఐసీ ఎండీ శశాంక, టీ ఫైబర్ ండీ వేణు ప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటి సెక్రటరీ భవేష్ మిశ్రా , ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘టీ స్క్వేర్ నిర్మాణం లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. టీ స్క్వేర్ లో ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలి. టీ స్క్వేర్ 24 గంటల పాటు పని చేయాలి. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో భవనాలను పరిశీలించాలి. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఏఐ హబ్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలి*అని సూచించారు. -
ఫిబ్రవరి నాటికి సావరీన్ ఏఐ నమూనా
భారతదేశపు సావరీన్ కృత్రిమ మేథ (ఏఐ) నమూనాపై కసరత్తు జరుగుతోందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఫిబ్రవరిలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమిట్ నాటికి దీన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఫౌండేషనల్ మోడల్ సిద్ధం కాగలదని కృష్ణన్ వివరించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఏఐ ఇంపాక్ట్ సదస్సు రెండు రోజులపాటు జరగనుంది. ఏ దేశమైనా పూర్తిగా సొంత మౌలిక సదుపాయాలు, సిబ్బంది, వనరులతో రూపొందించే ఏఐ మోడల్ను సావరీన్ ఏఐ మోడల్గా వ్యవహరిస్తారు. కృత్రిమ మేథ ప్రభావాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, అందరూ పాలుపంచుకునేందుకు వీలుండే ప్లాట్ఫాంలను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కృష్ణన్ చెప్పారు.ఏఐలోకి ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ, 38,000 జీపీయూలతో (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్) కంప్యూట్ మౌలిక సదుపాయాలను భారత్ వేగంగా పెంచుకుందని ఆయన పేర్కొన్నారు. భారత్ అవసరాలకు తగ్గట్లు, రంగాలవారీగా పనికొచ్చే చిన్న మోడల్స్ రూపకల్పనను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని, ఇలాంటివి ఉత్పాదకతను పెంచుకునేందుకు సహాయకరంగా ఉంటాయని కృష్ణన్ వివరించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కీలక లక్ష్యాల్లో స్వదేశీ జీపీయూ రూపకల్పన కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. -
ఫొటోలకు ప్రాణం పోసేలా వీడియో.. గ్రోక్ ఏఐ కొత్త ఫీచర్
ఎక్స్ఏఐ (xAI) రూపొందించిన గ్రోక్ఏఐ (GrokAI) యాప్లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టినట్లు ఎలాన్మస్క్ తెలిపారు. పాత, కొత్త ఫొటోలను అప్లోడ్ చేసి కేవలం 20 సెకన్లలో వాటిని వీడియోలుగా మార్చేయవచ్చని చెప్పారు. ఈ నూతన సాంకేతికత కృత్రిమ మేధ (Artificial Intelligence) ద్వారా కేవలం ఒక చిత్రాన్ని తీసుకొని దానికి కదలిక (Motion), అనుగుణమైన శబ్దం (Audio) జోడించి 20 సెకన్లలో 6 నుంచి 15 సెకన్ల నిడివి గల వాస్తవిక దృశ్యం (Photorealistic video)లాగా మార్చగలుగుతోంది. గ్రోక్ఏఐ ‘గ్రోక్ ఇమాజిన్’ (Grok Imagine) ఫీచర్ ద్వారా చారిత్రక చిత్రాలు, ఫ్యామిలీ ఫొటోలు లేదా కార్టూన్ పాత్రలను సజీవంగా మార్చవచ్చని కంపెనీ చెబుతుంది.Upload any photos from your phone or take a picture of an old photo and turn it into a video in 20 seconds with the Grok app! https://t.co/ouHoufWeqG— Elon Musk (@elonmusk) October 7, 2025బనానా ఏఐఫొటోలు అప్లోడ్ చేసి వీడియోలు మార్చే క్రమంలో గ్రోక్ఏఐ ముందున్నా, ఇదే తరహా కృత్రిమ మేధ సామర్థ్యాలను బనానా ఏఐ (Banana AI) కలిగి ఉంది. ఇది గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ (Gemini 2.5 Flash Image) మోడల్కు చెందింది. బనానా ఏఐ ప్రధానంగా ఫోటోలను మెరుగుపరచడం, వాటిని మార్చడం, కొత్త చిత్రాలను సృష్టించడం (Text-to-Image) వంటి వాటికి ప్రసిద్ధి చెందింది.ప్రస్తుతం బనానా ఏఐ ఫోటో-టు-వీడియో ఫీచర్ కాకుండా ఫొటో ఎడిటింగ్ వంటి వాటిలో వినియోగదారులకు సహాయపడుతుంది. ఉదాహరణకు వినియోగదారులు తమ సాధారణ ఫొటోలను ‘రెట్రో చీరలు ధరించిన వింటేజ్ ఫొటోలు’గా మార్చడానికి దీన్ని వాడుతున్నారు. ఈ రెండు కంపెనీలు (గ్రోక్, గూగుల్) వేర్వేరు మార్గాల్లో కంటెంట్ సృష్టికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.మానసిక స్వాంతనతమ పాత ఫొటోకు ప్రాణం పోసినప్పుడు నెజిజన్లకు అపూర్వమైన భావోద్వేగ అనుభూతి కలుగుతుంది. దశాబ్దాల నాటి కుటుంబ ఫొటోలు, గతించిపోయిన ప్రియమైన వారి చిత్రాలు వీడియోలుగా మారినప్పుడు గతాన్ని మళ్లీ అనుభూతి చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల సంతోషం, సంతృప్తి, లోతైన భావోద్వేగ బంధం ఏర్పడతాయి. తమ ఊహలకు రూపం ఇచ్చేందుకు, పాత కథలకు దృశ్యరూపం కల్పించేందుకు ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. ఈ సృజనాత్మకత ఒక విధమైన మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.వ్యాపార అవకాశాలుఏఐ ఆధారిత ఫోటో-టు-వీడియో టెక్నాలజీ కేవలం వ్యక్తిగత భావోద్వేగాలకే పరిమితం కాకుండా కంపెనీలకు వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. గ్రోక్ఏఐ ఈ అధునాతన ఫీచర్ను సాధారణంగా ‘సూపర్ గ్రోక్’ (Super Grok) వంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల్లో అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారుల నుంచి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. అధిక నాణ్యత (High-quality), ఎక్కువ నిడివి గల వీడియోల కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది.కంటెంట్ క్రియేటర్ల మార్కెట్నేటి సోషల్ మీడియా యుగంలో కంటెంట్ క్రియేటర్లకు వీడియో అత్యంత ముఖ్యమైన సాధనం. ఈ ఏఐ టూల్స్ ద్వారా నిమిషాల్లో ప్రొఫెషనల్ స్థాయి వీడియోలను సృష్టించవచ్చు. దీనివల్ల సోషల్ మీడియా మార్కెటింగ్, యాడ్స్, షార్ట్ ఫిల్మ్ల తయారీకి అయ్యే ఖర్చు, సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ విధంగా కంటెంట్ తయారీ ప్లాట్ఫామ్లు (FlexClip వంటివి) కూడా ఏఐ ఆధారిత ఫీచర్లను తమ వ్యాపారంలో భాగం చేసుకుంటున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు
ఎవరైనా నటుడు లేదా నటి మరణిస్తే.. జ్ఞాపకాలుగా మిగిలేవి వాళ్లు చేసిన సినిమాలు మాత్రమే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి మరణించిన గాయనీగాయకుల గాత్రాన్ని కొత్త పాటల్లో వినిపించేలా చేస్తున్నారు. నటీనటుల్ని కూడా మళ్లీ బతికిస్తున్నారు. ఇప్పుడు అలానే ఓ ఓటీటీ సిరీస్ కోసం కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ని మళ్లీ తెరపై చూపించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన పునీత్ రాజ్ కుమార్.. చాలా చిన్న వయసులోనే కోట్లాది మంది అభిమానుల ప్రేమని సంపాదించుకున్నారు. తెలుగులోనూ ఇతడు నటించిన పలు చిత్రాలు డబ్బింగ్గా రిలీజ్ అయ్యాయి. 2021లో కేవలం 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించాడు. ఈయన చనిపోయిన తర్వాత జేమ్ అనే సినిమా, గంధగ గుడి అనే డాక్యుమెంటరీ రిలీజయ్యాయి. తర్వాత నుంచి ఇప్పటికీ ఈయన్ని కన్నడ దర్శకనిర్మాతలు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.అయితే 'మారిగల్లు' అనే ఓటీటీ సిరీస్ కోసం ఇప్పుడు ఈయన్ని మరోసారి తెరపై చూపించారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పునీత్ రాజ్ కుమార్ని ఈ సిరీస్లో చూపించారు. కాదంబ రాజ్యానికి చెందిన మయూర వర్మ అనే రాజుగా పునీత్ కనిపించనున్నారు. మిగతా పార్ట్ అంతా నటీనటులే కనిపిస్తారు గానీ పునీత్కి సంబంధించిన సీన్స్ మాత్రం ఏఐ టెక్నాలజీతో తెరకెక్కించారు. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో ఈనెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ ఈ సిరీస్ గనక వర్కౌట్ అయి పునీత్ పాత్రకు పేరొస్తే గనక రాబోయే రోజుల్లో ఈ తరహా ప్రయోగాలు చాలానే చూడొచ్చు. ఈ సిరీస్ నిర్మించింది పునీత్ కుటుంబ సభ్యులే కావడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
ప్రతీ కార్మికుడికి ఏఐ ఫలాలు
‘మిషన్ డిజిటల్ శ్రమసేతు’ కార్యక్రమం కింద కృత్రిమ మేధ (ఏఐ) ప్రతీ కార్మికుడికి అందుబాటులో ఉండేలా తగిన కార్యాచరణను రూపొందించాలని నీతి ఆయోగ్ పిలుపునిచ్చింది. ‘సమ్మిళిత సామాజికాభివృద్ధికి ఏఐ’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఏఐ, బ్లాక్చైన్, ఇమ్మర్సివ్ లెర్నింగ్(వీఆర్, ఏఆర్ సాధనాల సాయంతో), ఇతర టెక్నాలజీల ద్వారా.. ఆర్థిక అభద్రత, పరిమిత మార్కెట్ అవకాకాశాలు, నైపుణ్యాలలేమి వంటి వాటిని అధిగమించొచ్చని పేర్కొంది.అసంఘటిత రంగ కార్మికులు పరికరాలు, ప్లాట్ఫామ్ల సాయంతో తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు, అధిక ఉత్పాదకతకు మిషన్ డిజిటల్ శ్రమసేతు వీలు కల్పిస్తుందని తెలిపింది. ఈ కార్యక్రమం ప్రభుత్వం, విద్యా సంస్థలు, పౌర సమాజం మధ్య సహకారాన్ని పెంచుతుందని వివరించింది. తద్వారా లక్షలాది మందిని దేశ అభివృద్ధి పథకంలో భాగస్వాములను చేయడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ ఆకాంక్షను సాధించడం సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.ప్రస్తుత మాదిరే కొనసాగితే అసంఘటిత రంగంలో ప్రతీ కార్మికుడి వార్షిక ఆదాయం 2047 నాటికి 6,000 డాలర్లకు మించకపోవచ్చని, 14,500 డాలర్ల లక్ష్యానికి ఇది ఎంతో తక్కువని పేర్కొంది. కనుక దేశ అభివృద్ధికి లక్షలాది మంది దూరంగా ఉండకుండా వెంటనే సమిష్టి చర్యలు అవసరమని నివేదికలో సూచించింది. ‘దేశంలోని 49 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్లో మార్పులు తీసుకురావడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునేట్టు అయితే సహకారం అన్నది తప్పనిసరి’ అని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణియన్ తెలిపారు.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
‘ఇంటర్నేషనల్’ తెలివి తేటలు.. ఏఐ ఉపయోగించి విద్యార్థినుల ఫోటోలు..!
రాయ్పూర్: మనోడు చదివేది చత్తీస్గఢ్లోని నయా రాయ్పూర్లో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో.. మరి చేసేవి గలీజు పనులు. మనోడికి ఇంటర్నేషనల్ తెలివి తేటలు బాగా ఉన్నట్లు ఉన్నాయి. ఐటీ విద్యార్థిగా తన స్కిల్స్ డెవలప్చేసుకోవడం మానేసి.. అమ్మాయిల ఫోటోలను ఏఐ టెక్నాలజీ జోడించి న్యూడ్గా మార్చేస్తున్నాడు. ఇలా సుమారు 36 మంది విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వెయ్యిపైగా ఏఐ చిత్రాలను రూపొందించాడు. ఈ విషయం బయటకి రావడంతో సదరు విద్యార్థి సస్సెండ్ గురయ్యాడు. బిలాస్పూర్కు చెందిన థర్డ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన విద్యార్థి.. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచీ ఇదే పనిలో ఉన్నాడు. ఇలా 36 మంది విద్యార్థినులకు చెందిన 1000కి పైగా ఏఐ న్యూడ్ చిత్రాలను సృష్టించాడు. ఈ విషయం బయటకు రావడంతో సదరు విద్యార్థినులు అక్టోబర్ 6వ తేదీ ఆ ఇన్స్టిట్యూట్లో ఫిర్యాదు చేశారు. దాంతో అతన్ని సస్సండ్ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ముగ్గురు సభ్యులతో కూడిన స్టాఫ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిపై విచారణకు సిద్ధమైన ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు. అదే సమయంలో విద్యార్థినుల రాతపూర్వక ఫిర్యాదు కోసం వేచిచూస్తున్నామని, దానిని బట్టే తమ చర్యలు ఉంటాయని రాఖీ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఆశిష్ రాజ్పుత్ స్పష్టం చేశారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు. -
ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలి
ముంబై: ప్రజలను మోసగించేందుకు నేరగాళ్లు కృత్రిమ మేధను (ఏఐ) ఉపయోగించి క్లోనింగ్, ఫేక్ వీడియోల్లాంటివి సృష్టిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని ఫిన్టెక్ సంస్థలకు సూచించారు. 6వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. వివిధ రకాల ఏఐ ఉత్పత్తులు, సరీ్వసులను రూపొందించే విషయంలో గ్లోబల్ హబ్గా ఎదిగే సత్తా భారత్కి ఉందని మంత్రి చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా పలు రకాల అవసరాలకు ఉపయోగపడే ఏఐ ఉత్పత్తులను సృష్టించగలదని, ఏఐ ఐడియాలను అభివృద్ధి చేసేందుకు, ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ప్రయోగశాలగా కూడా ఉండగలదని ఆమె పేర్కొన్నారు. ఏఐ చీకటి కోణం..: ఏఐతో ఆర్థిక రంగం, గవర్నెన్స్లో సానుకూల మార్పులు వచి్చనప్పటికీ, ఈ టెక్నాలజీలో చీకటి కోణం కూడా ఉందని ఆమె చెప్పారు. ‘ఏఐతో అసాధారణ అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో అది దుర్వినియోగం కాకుండా కూడా మనం కట్టడి చేయాలి.కొత్త ఆవిష్కరణలకు దన్నుగా నిల్చే సాధనాలే మోసాలు చేసేందుకు ఆయుధాలుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేలా, వాస్తవాలను కప్పిపుచ్చేలా తయారు చేసిన నా డీప్ఫేక్ వీడియోలు ఎన్నో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతుండటాన్ని నేను స్వయంగా చూశాను. ఇలాంటి వాటిని తక్షణం ఎదుర్కొనేందుకు మన వ్యవస్థలను తక్షణం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది‘ అని చెప్పారు. ఆర్థిక సాధికారతకు ఫిన్టెక్ దన్ను.. ఫిన్టెక్ అనేది ఏదో పట్టణ ప్రాంతాలకు పరిమితమైన సౌకర్యం కాదని, దేశవ్యాప్తంగా ఆర్థిక సాధికారతకు ఉపయోగపడే సాంకేతికతని మంత్రి చెప్పారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలతో రోజువారీ జరిపే చెల్లింపుల తీరుతెన్నులను ఇది మార్చేసిందని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు సగభాగం రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలు భారత్లో జరుగుతున్నాయని తెలిపారు. ‘మనం ఆర్థికంగా ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నాం, దాన్ని ఎలా సాధించదల్చుకుంటున్నాం అనేది ఆలోచించుకునేందుకు ఇది సరైన తరుణం. ఆదాయ వృద్ధి, కొత్త ఆవిష్కరణలు, లాభదాయకత, రిస్క్ సామర్థ్యాలు మొదలైన ప్రాథమికాంశాలపై ఫిన్టెక్లు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని వివరించారు.బయోమెట్రిక్తో యూపీఐ చెల్లింపులు..ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ)కి సంబంధించిన పలు సొల్యూషన్స్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆవిష్కరించింది. ప్రస్తుతం డివైజ్లో యూపీఐ లావాదేవీ ధ్రువీకరణ కోసం ఉపయోగిస్తున్న పిన్ నంబరు స్థానంలో, బయోమెట్రిక్ విధానాన్ని (వేలి ముద్ర, ఫేస్ అన్లాక్) వాడేందుకు ఉపయోగపడే టెక్నాలజీని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు ప్రవేశపెట్టారు.ఏటీఎంలలో నగదు విత్డ్రాయల్తో పాటు యూపీఐ పిన్ను సెట్ చేసేందుకు లేదా రీసెట్ చేసేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కొత్త యూజర్లు, సీనియర్ సిటిజన్లను కూడా యూపీఐ చెల్లింపుల పరిధిలోకి చేర్చేందుకు ఇది తోడ్పడుతుందని ఎన్పీసీఐ వివరించింది. అలాగే యూపీఐ క్యాష్ పాయింట్లలో యూపీఐని ఉపయోగించి నగదును విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. యూపీఐ లైట్ ద్వారా వేరబుల్ స్మార్ట్గ్లాసెస్తో కూడా చెల్లింపులు జరిపే సొల్యూషన్ని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ ఆవిష్కరించారు. ఫోన్తో పని లేకుండా, పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ని స్మార్ట్ కళ్లద్దాలతో స్కాన్ చేసి, వాయిస్ కమాండ్తో పేమెంట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చిన్న మొత్తాల్లో చెల్లింపులు అవసరమయ్యే రోజువారీ కొనుగోళ్లకు ఇది ఉపయోగకరం. ఇక జాయింట్ అకౌంట్ హోల్డర్లు కూడా చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగించే సదుపాయాన్ని ఆవిష్కరించింది. అటు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్తో జట్టు కట్టినట్లు పేపాల్ ప్రకటించింది. -
ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
చదువుకుని ఒక డిగ్రీ తెచ్చుకుంటే.. వెంటనే ఉద్యోగంలో చేరిపోవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు త్వరగా లభిస్తాయని చెప్పలేమని లింక్డ్ఇన్ సీఈఓ 'ర్యాన్ రోస్లాన్స్కీ' (Ryan Roslansky) పేర్కొన్నారు.పరుగులు పెడుతున్న పోటీ ప్రపంచంలో కేవలం ఒక కాలేజీ డిగ్రీ సరిపోదు. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి చాలా నేర్చుకోవాల్సి ఉందని.. గత వారం కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ర్యాన్ రోస్లాన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.మార్పు అనేది చాలా ఉత్తేజకరమైన విషయం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగ భవిష్యత్తు ఇకపై ఫ్యాన్సీ డిగ్రీలు ఉన్నవారికి లేదా మంచి కాలేజీలో చదువుకున్న వారికి మాత్రమే చెందదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అలోచించి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఉద్యోగాలు లభిస్తాయని నా అంచనా అని అన్నారు.ఏఐ మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తుందనే విషయాన్ని నేను నమ్మనని ర్యాన్ రోస్లాన్స్కీ అన్నారు. అయితే కమ్యునికేషన్, ఎవరితో అయినా మాట్లాడగలగడం వంటివి నేర్చుకోవాలి. స్కిల్స్ ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్న ఏ పనిలోనైనా విజయం సాధించడానికి అవి చాలా కీలకం అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?ఏఐ గురించి తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏఐ నైపుణ్యాలు ఉన్న వ్యక్తికే పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంటే ఉద్యోగం కోసం ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోంది. నిపుణులు నిరంతరం తమను తాము అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూనే ఉన్నారని ర్యాన్ రోస్లాన్స్కీ చెప్పారు. -
సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ట్రాన్ ఏరిస్... రిలీజ్ ఎప్పుడంటే?
ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న హాలీవుడ్ ఫ్రాంచైజీలలో ట్రాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీలో మూడవ భాగంగా ట్రాన్: ఏరిస్ మూవీని తీసుకొస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి జోచిమ్ రోనింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏఐ టెక్నాలజీ ప్రధానంగా రూపొందించారు. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లో ఈ మూవీ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.ఈ సందర్భంగా లండన్ ప్రీమియర్లో జారెడ్ మాట్లాడుతూ... "ఒక విధంగా చూస్తే ఏఐ ఒక పెద్ద సంభాషణగా మారిన సరైన సమయంలో వస్తుంది. మేము ఈ సినిమా పై 9-10 సంవత్సరాల క్రితం పని చేయడం మొదలుపెట్టాం. అప్పుడు ఏఐ గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగిస్తున్నారు. వారు తెలిసినా లేదా తెలియకపోయినా, అది మన జీవితాల్లో ఏదో ఒక రూపంలో భాగమైపోయింది. కాబట్టి ఈ సినిమా ఈ సమయంలో వస్తుండటం ఆసక్తికరంగా ఉందని నేను భావిస్తున్నాను." అని అన్నారు. కాగా. ఈ చిత్రంలో జారెడ్ లెటో, జెఫ్ బ్రిడ్జెస్, గ్రెటా లీ, ఇవాన్ పీటర్స్, జోడి టర్నర్ స్మిత్, కామెరాన్ మోనాఘన్, హాసన్ మిన్హాజ్, గిలియన్ ఆండర్సన్ నటించారు. -
బిగ్ఫిక్స్ రాకుంటే 'బైబై'
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ కోడింగ్తో కొలువులు నెట్టుకొస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు టెక్నాలజీ రంగంలో తెరపైకి వచ్చిన ‘బిగ్ఫిక్స్’ సవాల్ విసురుతోంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్ కోడింగ్కు అనుగుణంగా నైపుణ్యాలకు పదునుపెట్టుకోని వారి ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. ఇప్పటికే కొన్ని బహుళజాతి కంపెనీలు ‘అప్డేట్’ కాని ఉద్యోగులకు లేఆఫ్లు (ఉద్యోగాల నుంచి తొలగించడం) ప్రకటించగా మరికొన్ని సంస్థలు అదే బాటలో పయనిస్తున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీలు (నాస్కామ్) ఇటీవల బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో కలిసి ఏఐపై చేపట్టిన అధ్యయనంలో ఈ ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ఏటా ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న దాదాపు 12 లక్షల మంది విద్యార్థుల్లో 68 శాతం మంది ఎమర్జింగ్ కోర్సులు చేస్తుండగా వారిలో 5 లక్షల మందే ఉద్యోగాలు పొందుతున్నారు. అలా కొలువులు సాధించిన వారిలోనూ ఏఐ ఆధారిత ఉద్యోగాలు చేస్తున్నది 3 లక్షల మందే. వాళ్లలోనూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోనందుకు దాదాపు 1.20 లక్షల మంది ఏడాది తిరగకుండానే లేఆఫ్ లేఖలు అందుకుంటున్నారు. మిగతా వాళ్లలో 20 శాతం మందే సుమారు రూ. 40 లక్షల వార్షిక వేతనం అందుకుంటున్నారు. ఏమిటీ ‘బిగ్ఫిక్స్’? విలువైన డేటాతో నిక్షిప్తమయ్యే లేదా బిడ్ డేటా సెంటర్లకు అనుసంధానమయ్యే కంప్యూటర్లు, సర్వర్లు, ల్యాప్టాప్ల వంటి పరికరాలను ఆటోమేటిక్గా మేనేజ్ చేయడాన్నే బిగ్ఫిక్స్ అంటారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలు సెక్యూరిటీ కోసం సరికొత్త కోడింగ్, మాడ్యూల్స్ను అనుసరిస్తున్నాయి. సాధారణ కోడింగ్ నుంచి ఏఐ టూల్ కోడింగ్కు అప్డేట్ అయితే తప్ప బిగ్ఫిక్స్ తేలికగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఈ రూట్లో వెళ్లలేని సీనియర్ టెకీలు ఇప్పుడు లేఆఫ్లకు గురవుతున్నారు. బిగ్ డేటా కేంద్రాలపై ఆధారపడే బహుళజాతి సంస్థలు సరైన శిక్షణ ఇవ్వకపోవడం కూడా ఇందుకు సమస్యగా మారుతోంది. సమీకృత ఏఐ ఆటోమేషన్లో సర్వర్ల స్థితి, సెక్యూరిటీ లాగ్స్, రిసోర్స్ యూజ్లను ట్రాక్ చేయడానికి మారుతున్న కోడింగ్ కీలకంగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ కోడ్ జనరేషన్పై ఎప్పటికప్పుడు ఆప్డేట్ అయితే తప్ప ఉద్యోగంలో అభివృద్ధి కనిపించదని అంటున్నారు. కోడింగ్ కొత్తగా.. ఏఐ రంగంలో ఎప్పటికప్పుడు గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలోలాగా ఒకే మోడల్ కాకుండా మల్టీ ఏజెంట్స్ కొలాబరేషన్తో ఏఐ పనిచేస్తోంది. మారుతున్న ఈ మోడల్స్ను ఏఐ ఏజెంట్ సిస్టమ్గా పిలుస్తున్నారు. ఉదాహరణకు మెటా కోడ్ ఏజెంట్పై 2024 నుంచి అనేక పరిశోధనలు చేశారు. ఇప్పుడిది ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లో కోడ్ రాసే స్థాయికి ఎదిగింది. ఈ కోడ్ను ప్రాక్టికల్గా పరీక్షించడం, తప్పులు సరిచేయడం చేస్తుంది. ‘ఆటోడెవ్’ ఫ్రేమ్వర్క్ కొన్ని మోడల్స్తో కలిసి కొత్త సాఫ్ట్వర్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూరోపియన్ ఏఐ అలయన్స్ కొత్తగా ఎథికల్ ఏఐ కోడ్ జనరేషన్, ట్రాన్స్ఫరెన్స్ ఏఐ రైటింగ్ కోడ్, ఏఐ జనరేటెడ్ అకౌంటబులిటీ ఫ్రేమ్వర్క్ను తీసుకొచ్చాయి. దీంతో వాటి మూలాలు, పనిచేసే విధానం, వాటికి మెరుగైన ప్రోగ్రామింగ్ ఇవ్వడంలో మెళకువలు ఉన్న ఏఐ నిపుణులు మాత్రమే ఈ వేగాన్ని అందుకొనే పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎమర్జింగ్ కోర్సుల్లో కొత్తదనం ఏదీ? కొన్ని కాలేజీలు ఇంకా దశాబ్దకాలం నాటికి సీ, సీ ప్లస్ కోడింగ్తోనే ఎమర్జింగ్ కోర్సులు మొదలు పెడతున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు కొన్ని ఆధునిక కోడ్ను అనుసరిస్తున్నాయి. ఏఐ మోడల్స్ స్వయంగా అల్గోరిథంను అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం ఆటోమేటిక్గా వస్తోంది. 600కుపైగా ప్రోగ్రాములతో రూపొందించిన కోడ్ టీ5 ప్లస్, స్టార్ కోడ్ 2 వంటి జనరేటివ్ మోడల్స్ ఇప్పటికీ ఐఐటీలకే పరిమితం అవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధిస్తున్న ఎమర్జింగ్ కోర్సుల్లో ఈ తరహా మోడల్స్ ఉండటంలేదు. దీంతో ఏఐఎంఎల్, డేటా సైన్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సైతం టెక్నాలజీ రౌండ్, కోడింగ్ రౌండ్లలో ప్రతిభ చూపలేకపోతున్నారు. ఫలితంగా ఫ్రెషర్స్ ఏఐ కోర్సుల ద్వారా ఆశించిన ఉద్యోగాలు పొందలేని స్థితి నెలకొంది. మారాల్సిందే ఎమర్జింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులతోపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం మారుతున్న ఏఐ కోడ్కు అప్డేట్ కావాలి. లేకపోతే ఈ రంగంలో నిలదొక్కుకోవడం కష్టం. కొన్ని బహుళజాతి కంపెనీలు ఈ దిశగా శిక్షణ ఇస్తున్నాయి. ఆన్లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు నైపుణ్యం సాధించాలి. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి, జేఎన్టీయూహెచ్ లేఆఫ్లు తప్పట్లేదు టెక్ రంగంలో అనుభవం ఉన్నవాళ్లు కూడా పరిమిత కాలంలో ఏఐ కోడింగ్ను నేర్చుకోవడం, కొత్త కోడింగ్లో నైపుణ్యం పొందడంలో విఫలమవుతున్నారు. వారికి ప్రాజెక్టులు అప్పగించడం కంపెనీలకు కష్టంగా ఉంది. ఎందుకంటే డేటా సెంటర్తో అనుసంధానమయ్యే కంపెనీ సమాచారాన్ని కాపాడే సామర్థ్యం వారికి ఉండటం లేదు. అందుకే లేఆఫ్లు ఇవ్వడం అనివార్యమవుతోంది. – పరిమళ సిద్ధార్థ్, ఓ ఏఐ సంస్థ హెచ్ఆర్ మేనేజర్ -
దేశపు తొలి ఏఐ కాల్ అసిస్టెంట్..
గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్కి సమాధానమిచ్చేలా భారతదేశపు తొలి ఏఐ కాల్ అసిస్టెంట్ను రూపొందించినట్లు హైదరాబాదీ అంకుర సంస్థ ఈక్వల్ వ్యవస్థాపకుడు, పారిశ్రామిక దిగ్గజం జీవీకే వారసుడు కేశవ రెడ్డి తెలిపారు.ఈక్వల్ ఏఐ అక్టోబర్ 2 నుంచి ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అందుబాటులోకి వస్తుందని, దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామని యన తెలిపారు. 2026 మధ్య నాటికి రోజుకు 10 లక్షల యాక్టివ్ యూజర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.గుర్తు తెలియని నంబర్లు, టెలీమార్కెటింగ్, డెలివరీ ఏజెంట్ల కాల్స్ మొదలైన వాటికి ఇది ఇంగ్లీష్, హిందీ, హింగ్లీష్ భాషల్లో సమాధానమివ్వగలదు. అవసరమైతే యూజర్ మధ్యలో కాల్ను టేకోవర్ చేయొచ్చు. -
దేశంలోనే తొలి ఏఐ కాల్ అసిస్టెంట్.. త్వరలో ప్రారంభం
ఏదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్న సమయంలో వచ్చే స్పామ్ కాల్స్ చిరాకు తెప్పిస్తుంటాయి. ఇకపై అలాంటి కాల్స్తోపాటు ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్లో లేని కాల్స్కు సమాధానం ఇచ్చేలా హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ‘ఈక్వల్ఏఐ’ కొత్తగా ఇంటెలిజెంట్ కాల్ అసిస్టెంట్ను రూపొందించింది. ఇది ఆయా కాల్స్ను గుర్తించి ఎదుటి వ్యక్తితో వాస్తవికంగా మాట్లాడి బ్రీఫ్గా అందులోని సారాంశాన్ని సందేశం రూపంలో యూజర్ ముందుంచుతుంది. దీన్ని అక్టోబర్ 2న న్యూదిల్లీలో ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.భారతదేశంలో దాదాపు 100 కోట్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. 60% మంది భారతీయులు రోజుకు 3 కంటే ఎక్కువ స్పామ్ కాల్స్తో ఇబ్బంది పడుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే డునాట్ డిస్టర్బ్(DND) రిజిస్ట్రీలు, కాలర్ ఐడీ యాప్లు ఉన్నప్పటికీ స్పామ్ కాల్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూజర్లకు వీటి నుంచి ఉపశమనం కలిగించేలా ఈక్వల్ ఏఐ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొత్తగా ఏఐ అసిస్టెంట్ను ప్రారంభించనుంది.ట్రయల్ సక్సెస్ఈక్వల్ ఏఐ టూల్ ట్రయల్స్ సమయంలో 87% అంతరాయాలను సమర్థంగా నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. పార్సిల్ డెలివరీలను సమన్వయం చేసుకోవడంలో యూజర్లు గడిపే సమయాన్ని 73% తగ్గించినట్లు పేర్కొంది. 94% స్పామ్ కాల్స్ను గుర్తించి అందుకు అనుగుణంగా స్పందించినట్లు తెలిపింది. అయితే కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ అయిన నంబర్ల నుంచి వచ్చే కాల్స్కు ఇది సమాధానం ఇవ్వదని గమనించాలి.డెలివరీ ఏజెంట్లతో మాట్లాడే క్రమంలో చిరునామాలు లేదా సూచనలు ఇస్తుంది.లైవ్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ అందిస్తుంది.యూజర్ ఎప్పుడైనా నేరుగా కాల్కు సమాధానం ఇవ్వొచ్చు.భారతీయ భాషలు, కాలర్ నమూనాలపై శిక్షణ పొందింది.ప్రాథమికంగా ఢిల్లీ ఎన్సీఆర్లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అక్టోబర్ 2, 2025 నుంచి ఈ సేవలు ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. 2025 నాలుగో త్రైమాసికం నాటికి ముంబై, బెంగళూరు, హైదరాబాద్లకు ఈ సర్వీసులు విస్తరిస్తాయని పేర్కొంది.ఇదీ చదవండి: యూఎస్ బెదిరించినా తగ్గేదేలే -
ఏఐతో సరిగమలు పలికించేలా రెహమాన్ వినూత్న ప్రాజెక్ట్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘మొజార్ట్ ఆఫ్ మద్రాస్ సీక్రెట్ మౌంటైన్’ అనే వినూత్న సంగీత ప్రాజెక్టును ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఇది మెటావర్స్లో వర్చువల్ ఏఐ ఆధారిత బ్యాండ్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రాజెక్ట్కులో భాగంగా ప్రత్యేకమైన డిజిటల్ సింఫనీ ద్వారా ప్రపంచ సంస్కృతులను ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రెహమన్ ఓ కార్యక్రమంలో చెప్పారు.సీక్రెట్ మౌంటైన్ అంటే ఏమిటి?ఇది ఆరుగురు సభ్యులున్న వర్చువల్ బ్యాండ్. ఇందులో ప్రముఖ సంగీత కళాకారులు కారా, బ్లెసింగ్, ఎకామ్, జెంటమ్, డేవిడ్, ఆఫియా ఉన్నారు. ఈ బ్యాండ్ పూర్తిగా మెటావర్స్లో ఉంటుంది. మెటావర్స్ అనేది ఒక సామూహిక వర్చువల్ స్పేస్. ఇందులో డిజిటల్ అవతార్లు వర్చువల్గా సాంకేతికతలను ఉపయోగించి పరస్పరం సంభాషించవచ్చు. కలిసి పాడవచ్చు. వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) కలయికతో ఇది పని చేస్తుంది. వీటిని ఉపయోగించి రెహమాన్ సంగీతాన్ని సృష్టించనున్నారు.ఏఐ, క్రియేటివిటీఏఐ సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగించబడుతుందని, అదే సమయంలో మానవ కళాత్మకతను ఇది భర్తీ చేయదని రెహమాన్ నొక్కి చెప్పారు. ఇందులో అవతార్లు ఉపయోగించినా సంగీతం, సాహిత్యం, స్వరాలు రియలిస్టిక్గా ఉంటాయన్నారు. ఏఐ మ్యూజిక్ ప్రోడక్షన్ను వేగవంతం చేస్తుందని చెప్పారు. ఇటీవల యూఎస్లో రెహమాన్ ఓపెన్ ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, పెర్ప్లెక్సిటీకి చెందిన అరవింద్ శ్రీనివాస్తో సమావేశమయ్యారు. ఈ వినూత్న ప్రాజెక్ట్కు సారథ్యం వహిస్తున్న రేడియంట్ సోల్స్ అనే సంస్థ సిలికాన్ వ్యాలీలోని ఏఐ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉంది.ఇదీ చదవండి: ఎన్నికల వేళ రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల -
ఫోర్బ్స్ జాబితాలో కాలేజ్ డ్రాపౌట్! ఏకంగా రూ.1.15 లక్షల కోట్లు..
ప్రపంచంలో అత్యంత ప్రముఖ బిలియనీర్లు కథలు వింటంటే అత్యంత ఆశ్చర్యం కలుగుతుంటుంది. అసాధారణ నేపథ్యం నుంచి అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తి అవాక్కయ్యేలా చేస్తుంటారు. అంతేగాదు సక్సెస్ అసలైన అర్థం చెబుతుంటారు. కష్టపడేతత్వం ఉన్నవారు ఎన్నటికైనా విజయం సాధిస్తారనేందుకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ కోవలో బిల్గేట్స్, మార్క్ జుకర్బర్గ్వంటి ప్రముఖులను చూశాం. తాజాగా వారి సరసన 30 ఏళ్ల లూసీ గోవా(Lucy Guo) అనే మహిళ నిలిచింది. ఎవరామె అంటే..కాలేజ డ్రాపౌట్ అయినా ఆమె ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేగాదు ఫోర్బ్స్ ఆమెను అతిపిన్న వయస్కురాలైన స్వీయ నిర్మిత బిలియనీర్గా పేర్కొంది. ఆమె నికర విలువ సుమారు రూ. 1.15 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అయితే లూసీ విజయ ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. కాలిఫోర్నియాకు చెందిన లూసీ అమెరికాలో కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ అండ్ హ్యుమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ని కోర్సులో చేరింది. అయితే ఆమె డిగ్రీ పూర్తిచేయడానికి కేవలం ఒక ఏడాది ఉండగానే కాలేజ్ నుంచి తప్పుకుంది. 2011లో థీల్ ఫెలోషిప్లో చేరింది. ఈ ఫెలోషిప్ పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ ఎంపిక చేసిన యువకులకు వారి స్వంత కంపెనీలను ప్రారంభించేందుకు కోటి రూపాయలు పైనే తోడ్పాటుని అందిస్తుంది. అయితే ఆమె ఇలా కాలేజ్కి స్వస్తి చెప్పి ఫెలోషిప్లో జాయిన్ అవుతాననడం లూసీ తల్లిదండ్రులను చాలా షాక్కి గురి చేసింది. ఎందుకంటే లూసీ అమెరికాలో మంచి భవిష్యత్తు లభించాలని ఆమె పేరెంట్స్ ప్రతిదీ పణంగా పెట్టి చదివించారు. ఇలా మద్యలో కాలేజ్ చదువుని వదలేయడం వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. ఒకరకంగా లూసీ కూడా ఈ అనూహ్య నిర్ణయం తీసుకుందే గానీ మనసులో ఏదో భయం వెంటాడుతూనే ఉంది. కానీ తన కలల ప్రపంచం కోస ఈ మాత్రం డేర్ చేయకపోతే కష్టం అని తనకు తాను సర్ది చెప్పుకుని మొండి ధైర్యంతో ముందుకు సాగింది. అలా ఆమె తన తొలి ఏఐ బిజినెస్ని ప్రారంభించింది. దీని తర్వాత టెక్ దిగ్గజం మెటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. అలా ఆమె అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కంపెనీలకు సారథ్యం వహిస్తూ..2022లో కంటెంట్ క్రియేటర్ మానిటైజేషన్ ప్లాట్ఫామ్ వ్యవస్థాపకురాలిగా మారింది. ఆ విధంగా అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తి అత్యంత ధనవంతురాలైన వ్యవస్థాపకురాలిగా మారిందామె. అయితే లూసీ ఒకటో లేక రెండు సంత్సరాలైనా.. కాలేజ్కి వెళ్లాలని అంటుంది. అక్కడే మంచి స్నేహితులు, జీవితంలో అత్యంత విలువైన వ్యక్తులు గురించి తెలుసుకునేందుకు హెల్ప్ అవుతుందని అంటోంది. పైగా కాలేజ్ అనేది నేర్చుకోవడానికే కాదు మంచి స్నేహితులను సంపాదించుకోవడం కూడా నేర్పుతుందని చెబుతోంది. అదే భవిష్యత్తులో పెట్టబోయే కంపెనీల్లో వాళ్లు ఉద్యోగులు గానో లేక మీ కంపెనీ భాగస్వాములు గానో ఎంపిక చేసుకునేందుకు దారితీస్తుందని చెబుతుంది. అంతేగాదు విజయవంతమైన కంపెనీ నిర్మించాలంటే పిచ్చి తపన, ఆత్మవిశ్వాసం అత్యంత ముఖ్యమని చెప్పింది. తనకు ఈ థీల్ ఫెలోషిప్ తాను ఈ పనిచేయగలను అనే వాతావరణాన్ని అందించిందని చెబుతోంది లూసీ. ఆమె కథ కాలేజ్కి వెళ్లి ఎంజాయ్ చేసే యువతకు ఆదర్శం. భవిష్యత్తు మంచిగా నిర్మించుకునే కీలక వయసుని సరైన మార్గంలోకి తీసుకువెళ్లాలంటేజజ కచ్చితమైన వ్యూహం, ప్రణాళికి ఎంతలా అవసరం అనేందుకు వ్యవస్థాపకురాలు లూసీ స్టోరీనే ఉదహారణ. 30 ఏళ్లకే పాస్సెస్ అనే కంపెనీ నడిపి, కంటెంట్ క్రియేటర్లను సరికొత్త స్థాయిలో నిలిపింది, వాళ్లతో సంపదను ఎలా సృష్టించచ్చో చూపించింది. కృషికి తోడు ధైర్యం ఉంటే ఏదైనా అవలీలగా సాధించొచ్చని లూసీ కథే చెబుతోంది కదూ..!.(చదవండి: Navratri celebrations : 'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!) -
‘ఇండియన్ ఐటీ కంపెనీలు మేల్కోకపోతే మునిగిపోతాయ్’
భారతీయ ఐటీ కంపెనీలు ముప్పులో ఉన్నాయని, వాస్తవ పరిస్థితిని తెలుసుకుని మేల్కోకపోతే మునిగిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారతీయ ఐటీ కంపెనీలు తమ ఏఐ (AI) సామర్థ్యాలను పెంచుకోవడంలో విఫలమైతే మసకబారే ప్రమాదం ఉందని గ్లోబల్ ఈక్విటీస్ రీసెర్చ్లో ఈక్విటీ రీసెర్చ్ మేనేజింగ్ డైరెక్టర్ త్రిప్ చౌదరి హెచ్చరించారు.ఏఐకి సంబంధించి మన ఐటీ కంపెనీలు (Indian IT companies) తీవ్రంగా వెనుకబడి ఉన్నాయని, ఏఐ సమర్థవంతమైనవి కావని త్రిప్ చౌదరి ఎన్డీటీవీ ప్రాఫిట్ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. ప్రతి ఐటీ కంపెనీ కొత్త వాస్తవికతను తెలుసుకుని మేల్కొనాలని, లేకుంటే అవి ఎప్పటికీ అదృశ్యమవుతాయని హెచ్చరించారు. లెగసీ సేవలు, అప్లికేషన్ నిర్వహణ, ఖర్చు నియంత్రణపై ఎక్కువగా ఆధారపడే భారతీయ ఐటీ కంపెనీలు, ప్రపంచ కంపెనీలతో పోటీ పడటానికి ఏఐ స్వీకరణను వేగవంతం చేయాలని సూచించారు.భవిష్యత్తు చిన్న ఐటీ కంపెనీలదే..దేశీయ ఐటీ కంపెనీల వృద్ధి అవకాశాలపై ఫండ్ మేనేజర్, సోవిలో ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఎల్ఎల్పీ సహ వ్యవస్థాపకుడు సందీప్ అగర్వాల్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో పెద్ద ఐటీ కంపెనీలు బలమైన వృద్ధిని చూస్తాయని తాను ఆశించడం లేదన్నారు. లార్జ్, మిడ్-క్యాప్ ఐటీ కంపెనీల కంటే చిన్న ఐటీ కంపెనీలపై తాము సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. యాక్సెంచర్ ఆదాయాలు భారత ఐటీ రంగం ప్రస్తుతం వృద్ధి లేమిని సూచిస్తున్నాయన్నారు. ఐటీ కంపెనీల స్టాక్స్ను డివిడెండ్ కోసం కొనుగోలు చేయవచ్చు, కానీ వృద్ధి లేదు అన్నారు.ఇదీ చదవండి: పసిడి ఆశలు ఆవిరి.. బంగారం ధరలు రివర్స్! -
ఏఐ సొల్యూషన్స్, సర్వీసులపై లెనొవొ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ ఏఐ (కృత్రిమ మేధ) ప్రయోజనాలను అందరికీ మరింతగా అందుబాటులోకి తేవాలని టెక్ దిగ్గజం లెనొవొ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా కేవలం పీసీలు మొబైల్స్లాంటి ఉత్పత్తులే కాకుండా ఏఐ ఆధారిత మౌలిక సర్విసులు, సొల్యూషన్స్ను విస్తృతంగా అందిస్తున్నట్లు లెనొవొ ఇండియా ఎండీ అమిత్ లూథ్రా, ఈడీ రోహిత్ వెల్లడించారు. ఇతర ఆసియా పసిఫిక్ దేశాల్లోని సంస్థలు బ్యాక్–ఆఫీస్ అవసరాల కోసమే ఏఐని ఉపయోగిస్తుండగా, దేశీయంగా సేల్స్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లు గణనీయంగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయని చెప్పారు.భారత్లో ఇప్పటికే 53 శాతం సంస్థలు ఏఐ ఆధారిత పీసీలను వినియోగిస్తున్నట్లు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్పై (సీఐవో) నిర్వహించిన తమ అధ్యయనంలో వెల్లడైందని హైదరాబాద్లో తమ ఏఐ పోర్ట్ఫోలియోను డిస్ప్లే చేసిన సందర్భంగా వివరించారు. ప్రస్తుతం దేశీయంగా పర్సనల్ కంప్యూటింగ్ ఉత్పత్తుల విభాగంలో రెండో స్థానంలో, ఇన్ఫ్రా సొల్యూషన్స్ విభాగంలో మూడో స్థానంలో ఉన్నట్లు రోహిత్ చెప్పారు. భారత్లో 5 తయారీ ప్లాంట్లు, సుమారు 1,700 మంది సిబ్బంది ఉండగా, గత ఆర్థిక సంవత్సరం 3.4 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదైందని ఆయన వివరించారు. -
శామ్సంగ్ ఏఐ హోమ్: ఇంట్లో పనులు ఇట్టే అయిపోతాయ్!
భారతదేశంలో లార్జెస్ట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శామ్సంగ్.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ ప్లాజాలోని దాని ఫ్లాగ్షిప్ స్టోర్లో "ఏఐ హోమ్: ఫ్యూచర్ లివింగ్, నౌ" కోసం తన విజన్ను ఆవిష్కరించింది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సంస్థ దీనిని పరిచయం చేసింది.ఒకసారి ఊహించుకోండి.. మీరు ఇంటికి వచ్చేసరికి లైట్లు ఆన్ అవుతాయి. వీ మీకు ఇష్టమైన షోను క్యూలో ఉంచుతుంది. ఏసీ మీ నిద్రకు కావలసిన టెంపరేచర్ అందిస్తుంది. ఇలా ఇంటిపనులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతే ఎంతబాగుంటుంది. ఇవన్నీ సాధ్యం చేయడానికే.. శామ్సంగ్ ఏఐ హోమ్: ఫ్యూచర్ లివింగ్, నౌ తీసుకొస్తోంది.శామ్సంగ్ గెలాక్సీ ఏఐ, విజన్ ఏఐ, బెస్పోక్ ఏఐ వంటి వాటి ద్వారా.. ప్రజల దైనందిన జీవితాల్లోకి టెక్నాలజీని అనువదించాలనుకుంటున్నాము. ఇది రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా మారుస్తుంది. భారతదేశం ఈ ప్రయాణంలో కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచే ప్రపంచానికి పరిచయం చేస్తామని.. శామ్సంగ్ సౌత్వెస్ట్ ఆసియా అధ్యక్షుడు, సీఈఓ జేబీ పార్క్ అన్నారు. -
AI వీడియోలు, పెయిడ్ ప్రమోషన్స్ ఆపాలని నాగార్జున పిటిషన్
-
సైబర్ నేరగాళ్లపై ‘హంటర్’
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు కీలక ఆధారం అవుతున్న మ్యూల్ ఖాతాలకు, లావాదేవీలకు చెక్ చెప్పడానికి రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్) రూపొందించిన ఏఐ టూల్ మ్యూల్హంటర్.ఏఐ వినియోగం తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీన్ని ఇప్పటికే దాదాపు 15 బ్యాంకులు వినియోగిస్తుండగా మిగిలిన వాటికీ విస్తరించనున్నారు. ఈ టూల్ ద్వారా అనుమానిత బ్యాంకు ఖాతాలతో పాటు లావాదేవీలను గుర్తించడం, బ్లాక్ చేయ డం తేలికవుతుంది. ఫలితంగా సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ ఖాతాల ఆధారంగానే స్కామ్స్.. » కాల్సెంటర్లు ఏర్పాటు చేసి మరీ వివిధ రకాలైన సైబర్ నేరాలు చేయిస్తున్న సూత్రధారులు ఇటీవలి కాలంలో విదేశాల్లోనే ఉండి కథ నడుపుతున్నారు. వీళ్లు బా«ధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి తమ ఖాతాలు వినియోగించరు. వివిధ మార్గాల్లో దళారుల్ని గుర్తించి వారి ద్వారా చిరుద్యోగులు, నిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులకు ఎరవేస్తారు. వీరి కేవైసీ వివరాలతో, బోగస్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు తెరిపిస్తారు.వీటికి సంబంధించిన డెబిట్ కార్డులు, చెక్బుక్స్ తదితరాలు తీసుకునే దళారులు వాటిని సూత్రధారులకు పంపిస్తూ ఉంటారు. ఈ ఖాతాల (మ్యూల్) ద్వారా జరిగే లావాదేవీలపై కమీషన్లు తీసుకునే వారిని మనీ మ్యూల్స్గా పరిగణిస్తుంటారు. ఈ మనీ మ్యూల్స్కు, వారి ఖాతాలకు చెక్ పెట్టడం ద్వారా సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు.95% కచ్చితత్వం.. ఆర్బీఐహెచ్ గత ఏడాది డిసెంబర్లో ఈ టూల్ను అభివృద్ధి చేసింది. ఇది ఆయా బ్యాంకుల్లో ప్రభావవంతంగా పని చేస్తోందని అధికారులు చెప్తున్నారు. బ్యాంకు ఖాతాలు, వాటి ద్వారా జరిగే లావాదేవీలను ఈ టూల్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. నకిలీ గుర్తింపు పత్రాలతో తెరిచిన ఖాతాలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ అంశంలో దీని కచ్చితత్వం 95 శాతం ఉన్నట్లు తేల్చారు. కొత్తగా తెరిచిన ఖాతాల్లో లేదా వినియోగంలో ఉన్న వాటిలో అకస్మాత్తుగా భారీ మొత్తాలతో లావాదేవీలు జరిగినా అప్రమత్తం చేస్తుంది. నగదు డిపాజిట్ అయినా, విత్డ్రా అయినా అలెర్ట్ చేయడంతో పాటు ఆ ఖాతాలను ఫ్రీజ్ చేస్తుంది. ఒకే చిరునామాతో అనేక బ్యాంకు ఖాతాలు తెరిచినా పసిగట్టడంతో పాటు ఈ–కేవైసీనీ పర్యవేక్షిస్తుంది. ఈ ఏఐ టూల్ ఫేషియల్ రికగ్నిషన్, బయోమెట్రిక్ మ్యాచింగ్, డాక్యుమెంట్ అథెంటిసిటీలను తనిఖీ చేయగలదు. నరేష్ మల్హోత్రా కేసు కలకలం ఇటీవలి కాలంలో తరచూ డిజిటల్ అరెస్టు మోసాలు వెలుగు చూస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మహిళలు, వృద్ధులను టార్గెట్గా చేసుకుని ఈ నేరాలు చేస్తున్నారు. డ్రగ్స్, మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందంటూ, పోలీసు, ఇతర ఏజెన్సీల అధికారులుగా ఫోన్లు, వీడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. వీరి మాయలో పడిన వాళ్లు తమ కష్టార్జితం రూ.లక్షల నుంచి రూ.కోట్లు కూడా నష్టపోతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో చోటు చేసుకున్న నరేష్ మల్హోత్రా ఉదంతం అన్ని దర్యాప్తు ఏజెన్సీలను కదిలించింది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి అయిన మల్హోత్రా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 4 మధ్య ‘డిజిటల్ అరెస్టు’లో రూ.23 కోట్లు కోల్పోయారు. అన్ని బ్యాంకులు మ్యూల్ హంటర్ను వినియోగిస్తే ఈ నేరం జరిగేది కాదని, జరిగినా అత్యధిక మొత్తం ఫ్రీజ్ అయ్యేదనే వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అన్ని బ్యాంకులు ఈ టూల్ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. -
ఐవీఎఫ్ ల్యాబ్స్లో ఏఐని పరిచయం చేసిన నోవా
హైదరాబాద్: అత్యుత్తమ పిండాలను ఎంపిక చేసుకోవడం, తద్వారా గర్భస్థ ఫలితాలను మెరుగుపరుచుకోవడానికి హైదరాబాద్ బంజారాహిల్స్లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ తమ ఐవీఎఫ్ ల్యాబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ పరిశోధనల ఫలితాల ప్రకారం, వీటా ఎంబ్రియో అనే ఈ టూల్ ఫలితంగా గర్భస్థ ఫలితాలు 12% మెరుగుపడ్డాయని తేలింది. బంజారాహిల్స్, కూకట్పల్లి ప్రాంతాల్లోని తమ కేంద్రాల్లో ఉన్న ఐవీఎఫ్ ల్యాబ్స్లో నోవా ఈ ఏఐని ప్రవేశపెట్టింది.ఐవీఎఫ్ ల్యాబ్స్లో అత్యుత్తమ పిండాన్ని ఎంపిక చేయడం అనేది ఎంబ్రియాలజిస్టులు చేస్తారు. ప్రతి పిండాన్నీ డబుల్ చెక్ చేసేందుకు ఏఐ ఉపయోగపడుతుంది. సాధారణంగా మనుషులు చూసినప్పుడు కనిపెట్టలేని అనేక అంశాలను అది గుర్తిస్తుంది. తద్వారా కచ్చితత్వాన్ని పెంచి, ఐవీఎఫ్ సైకిల్ టైంలైన్లను తగ్గిస్తుంది.ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రం క్లినికల్ డైరెక్టర్, ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి మాట్లాడుతూ, “ప్రస్తుతం మన దేశంలో ప్రతి నాలుగు జంటల్లో ఒకరికి సంతానరాహిత్య సమస్యలు ఉంటున్నాయి. అందువల్ల ఫెర్టిలిటీ చికిత్సల్లో మరింత కచ్చితత్వం అవసరం. పిండం ఎంపిక కోసం మా ఐవీఎఫ్ ల్యాబ్స్లో ఏఐని సమకూర్చుకున్నాం. మా ఎంబ్రియాలజిస్టులు ఒక పిండాన్ని విశ్లేషించిన తర్వాత ఆ పిండం ఎదుగుదల, నాణ్యత ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకోవడానికి వారు ఏఐ టూల్ ఉపయోగిస్తారు. ఇది మరింత కచ్చితంగా అంచనా వేయడం ద్వారా ల్యాబ్ శాస్త్రవేత్తలు (ఎంబ్రియాలజిస్టులు) పిండాన్ని ఎంచుకోగలరు. నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో, 90% ఐవీఎఫ్ సైకిళ్లను ఆ జంట సొంత అండాలు, శుక్రకణాలతోనే చేస్తాం. తద్వారా పిండం ఎంపికలో కచ్చితత్వాన్ని పెంచుతాం.ఐవీఎఫ్ లాంటి చికిత్సలతో టెక్నాలజీ ఉపయోగం, వైద్యపరిజ్ఞానం వల్ల రోగులకు మరింత పారదర్శకత, విశ్వాసం కలుగుతాయి. తమ సొంత అండాలు, శుక్రకణాలే వాడుతున్నారా అని కనీసం 30% మంది జంటలు అడుగుతారని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలోని సంతానసాఫల్య నిపుణులు గుర్తించారు. మా దగ్గర ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తాం. దీనిద్వారా అన్ని పిండాలను ట్రాక్ చేయొచ్చు. దీనిద్వారా ప్రతి శాంపిల్కు ఒక విభిన్నమైన బార్కోడ్ లేదా చిప్ ఉంటుంది. ఏ ప్రొసీజర్ చేసేముందైనా సిస్టమ్ వీటిని డబుల్ చెక్ చేస్తుంది. ఏదైనా మ్యాచ్ కాకపోతే వెంటనే ఐవీఎఫ్ ల్యాబ్లో ఉన్న ఎంబ్రియాలజిస్టులను అప్రమత్తం చేస్తుంది. దీనివల్ల ప్రతి దశలోనూ రియల్టైంలో పరీక్షించడానికి అవకాశం ఉంటుంది’’ అని తెలిపారు.హైదరాబాద్ బంజారాహిల్స్లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రంలోసీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దుర్గ వైట్ల మాట్లాడుతూ, “మహిళలు 30లు, 40ల చివర్లో వస్తున్నారు. వాళ్లలో సహజంగానే వయసు కారణంగా అండాల సంఖ్య, నాణ్యత తగ్గిపోయి ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. మొత్తం ఫెర్టిలిటీ కేసుల్లో మగవారి వల్ల వచ్చే సమస్యలు 30-40% ఉంటున్నాయి. అవి ప్రధానంగా ఒత్తిడి, జీవనశైలి అలవాట్లు, స్టెరాయిడ్ల వాడకం ఎక్కువ కావడం వల్ల వస్తున్నాయి. మహిళల్లో 25-30% మందికి పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, అండాలు తక్కువగా విడుదల కావడం లాంటివి ఉంటున్నాయి. 20ల చివర్లో ఉన్నవారికీ ఇలాంటి సమస్యలు రావడంతో వారికీ చికిత్సలు అవసరం పడుతున్నాయి. జంటలు తప్పనిసరిగా తమ ఫెర్టిలిటీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి, చికిత్సలకు ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఫెర్టిలిటీ చికిత్సలు విజయవంతం కావడంలో వయసుదే చాలా కీలకపాత్ర. గతం కంటే ఫెర్టిలిటీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఏడాదికి కనీసం 50-100 మంది ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడుగుతున్నారు. పెళ్లికాని మహిళలే దీనికి వస్తున్నారు. వీరిలో వాణిజ్యవేత్తలు, ఐటీ, వైద్యరంగం, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు ఉంటున్నారు. క్యాన్సర్, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నా కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవచ్చు” అని చెప్పారు. -
ప్రమాదంలో మహిళా ఉద్యోగాలు!: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారని పలువురు నిపుణులు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయేవారిలో మహిళలే ఎక్కువ ఉన్నారని ఐక్యరాజ్యసమితి 'జెండర్ స్నాప్షాట్ 2025' నివేదికలో వెల్లడించింది.ఏఐ కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 28 శాతం మహిళలు ఉద్యోగాలు కోల్పోతారు. ఈ ప్రమాదంలో పడే పురుష ఉద్యోగులు 21 శాతం మాత్రమే అని ఐక్యరాజ్యసమితి నివేదించింది.తప్పుల నుంచి నేర్చుకోకపోతే..ఐక్యరాజ్యసమితి 'జెండర్ స్నాప్షాట్ 2025' (Gender Snapshot 2025) నివేదిక.. ప్రస్తుత అసమానతలను కూడా హైలైట్ చేసింది. ప్రపంచ టెక్ వర్క్ఫోర్స్లో మహిళలు 29%, టెక్ లీడర్లలో కేవలం 14% మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ప్రపంచం కొత్త అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. మనం గతంలో జరిగిన తప్పుల నుంచి నేర్చుకోకపోతే.. భవిష్యత్తులో అసమానత మరింత ఎక్కువవుతాయని హెచ్చరించింది.జెండర్ అంతరాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ''ఇది 343 మిలియన్ల మహిళలకు, బాలికలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 30 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటపడేస్తుంది, 42 మిలియన్లకు ఆహార భద్రతను మెరుగుపరుస్తుంది. 2030 నాటికి ప్రపంచ వృద్ధిలో 1.5 ట్రిలియన్ డాలర్లకు దారితీస్తుందని నివేదికలో హైలైట్ చేసింది''.మహిళలు శ్రామిక శక్తిలో చేరడానికి.. విద్య, కెరీర్స్, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి సహాయం చేయడంలో అనేక దేశాలు నిజమైన పురోగతి సాధించాయి. సౌదీ అరేబియా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి.. సంరక్షణ సంబంధిత అడ్డంకులను తగ్గించడానికి చట్టపరమైన & విధాన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఫలితంగా, మహిళల భాగస్వామ్యం రెండింతలు పెరిగి, 2017లో 17 శాతం నుంచి 2024 మూడవ త్రైమాసికం నాటికి 35.4 శాతానికి పెరిగింది.ఇదీ చదవండి: తిరిగి వచ్చేయండి.. భయంతో జీవించవద్దు: శ్రీధర్ వెంబు -
ఏఐ నిఘాను అందిపుచ్చుకుంటున్న స్మార్ట్ నగరాలు
భారతీయ నగరాలు మరింత పట్టణీకరణతో మరింత రద్దీగా మారుతున్నాయి. వీటిలో మాల్స్, పార్కులు, రైల్వేస్టేషన్లు, రద్దీ రోడ్లు.. ఇలా అన్నిచోట్లా ట్రాఫిక్ పెరిగి భద్రతా సమస్యలు వస్తున్నాయి. అధిక రద్దీ వల్ల తొక్కిసలాటలు, లగేజి పోవడంతో ఖంగారు పడడం, చిన్నచిన్న దొంగతనాలు జరుగుతాయి. అందువల్ల మరింతగా భద్రతాచర్యలు చేపట్టడం చాలా అవసరం అవుతోంది. అందుకే నగరాలకు భద్రత కల్పించేందుకు ప్రాక్టికల్ పరిష్కారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిఘా వ్యవస్థ గణనీయంగా ఉపయోగపడుతోంది.ఏఐ నిఘా: ఏమిటిది?ఒకప్పుడు సీసీటీవీ కెమెరాల స్క్రీన్ల ముందు భద్రతా సిబ్బంది గంటల తరబడి కూర్చుని ఏదైనా అసాధారణంగా కనిపిస్తుందా అని చూసేవారు. కానీ ప్రస్తుతం ఏఐ నిఘా వ్యవస్థవల్ల కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్, న్యూరల్ నెట్వర్క్లు ఉండి.. మరింత స్పష్టంగా చూస్తూ, మనుషులు చేయగలిగినదానికంటే ఇంకా వేగంగా స్పందిస్తున్నాయి.కంప్యూటర్ విజన్ కెమెరాలు కేవలం వీడియో తీయడమే కాదు దాన్ని రియల్-టైంలో విశ్లేషిస్తాయి. నిషేధిత ప్రాంతంలో ఎవరైనా మూత్రవిసర్జన చేస్తున్నా, ఏదైనా జాతరలో ఎక్కువమంది జనాన్ని గమనించాలన్నా, రద్దీ మార్కెట్లో ఏదైనా వస్తువు పోయినా గుర్తిస్తాయి. ఇవి చాలా వేగంగా స్పందించి, సెకండ్లలోనే కంట్రోల్ సెంటర్లను అప్రమత్తం చేస్తాయి.నగరాల్లోని నిఘా వ్యవస్థలలో ఏఐ కెమెరాలను ఉపయోగించడం ద్వారా కేవలం ఘటనలను గుర్తించడమే కాకుండా, ఒకే తరహాలో ఏఐనా జరుగుతున్నా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు తెలుస్తుంది. ముఖాలను, అసాధారణ ప్రవర్తనను గుర్తించి, నేరచరిత్ర ఉన్నవారిని రియల్-టైంలో ఇట్టే పట్టేస్తాయి. తద్వారా వివిధ ప్రాంతాల్లో పదేపదే మోసాలు, నేరాలకు పాల్పడేవారిని గుర్తించడంలో పోలీసులకు సాయపడతాయి.ఏఐ గుర్తిస్తే.. వెంటనే స్పందిస్తుందిఏఐ నిఘాకు ఉన్న పరిమితులేంటని ఒకసారి చూసుకుంటే, అది ఎక్కువమంది ప్రజలు గుమిగూడేచోట (అంటే రాజకీయ ర్యాలీలు, కచేరీలు, మతపరమైన కార్యక్రమాలు) కూడా స్పష్టంగా గుర్తిస్తుంది. రియల్ టైంలో రద్దీ నిర్వహణ, రద్దీప్రాంతాలలో పరిశీలనకు ఏఐ మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీలో ప్రెడిక్టివ్ ఎనాలసిస్, ప్యాటర్న్ ఎనాలసిస్ ఉపయోగించి ఎలాంటి ముప్పునైనా ముందుగానే అరికడుతుంది.మనుషులను ఎక్కడ కావాలో అక్కడ పెట్టడం, సహాయాన్ని సరైన సమయంలో అందించడం కూడా దీనివల్ల సాధ్యమవుతుంది. రద్దీ నియంత్రణ కోసం పుణెలో ఒక పైలట్ స్మార్ట్ సిటీలో ఏఐని ఉపయోగించి, బహిరంగ కార్యక్రమాల్లో అత్యవసర పరిస్థితులను 42% తగ్గించారు. విమానాశ్రయాలు, బస్టాండ్లలో పిల్లలు తప్పిపోయినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలున్నా, లగేజి పోయినా ఏఐ కెమెరాలు గుర్తిస్తాయి. ఇవి కదలికలను, వస్తువులను, ఆడియోను కూడా గుర్తిస్తాయి. (ఉదా: రద్దీ ప్రాంతంలో అద్దం పగిలినా పట్టేస్తాయి) దీనివల్ల రాబోయే ప్రమాదాన్ని వెంటనే గుర్తుపట్టగలరు.నేరాలు గుర్తించడమే కాదు.. ఆపుతాయి కూడా!నేరాల రేటును తగ్గించడం ఏఐ నిఘా వ్యవస్థల ప్రాథమిక పనుల్లో ఒకటి. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు బహిరంగ స్థలాల్లో ఏఐ నిఘావ్యవస్థను ఏర్పాటుచేసి.. చైన్ స్నాచింగ్, ఆస్తినష్టం, ఏటీఎంల చోరీల్లాంటి ఘటనలను 30% తగ్గించగలిగాయి. ఇవి కేవలం నేరాలకు వెంటనే స్పందించడమే కాక.. గతంలో జరిగిన ఘటనల్లో పాల్గొన్నవారిని గుర్తించి ఏదైనా జరగడానికి ముందే భద్రతా దళాలను అప్రమత్తం చేస్తాయి.ఏఐ కెమెరాలు ముఖాలను, నంబర్ ప్లేట్లను, చొరబాట్లను గుర్తించి ఏవైనా తేడా ఉంటే వెంటనే చెబుతాయి. అర్ధరాత్రి ఎవరైనా ప్రహరీ ఎక్కుతున్నా, స్కూలు గేట్లు దాటుతున్నా ఏదో తేడా ఉందని ఏఐ గమనించి, వెనువెంటనే చెప్పేస్తుంది.అంచనాతో కాకుండా డేటాతో నగరప్రణాళికలుఏఐ నిఘా అనేది కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే కాదు.. నగర ప్రణాళికల కోసం ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో సమగ్ర డేటా ఇవ్వడానికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు రాత్రిపూట పార్కులు నిర్మానుష్యంగా ఉంటే అక్కడ మెరుగైన లైటింగ్, నిఘాను ఏర్పాటుచేసుకోవచ్చు. శనివారం సాయంత్రం బస్టాపులో రద్దీ ఎక్కువగా ఉంటే అక్కడ సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టిపెట్టచ్చు. స్మార్ట్ సిటీ ఇనీషియేటివ్లను డిజైన్ చేయడంలో ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది. కేవలం అంచనాల మీద ఆధారపడి నగర ప్రణాళికలు వేసేకంటే ఇలా చేయడం మంచిది.గోప్యత, న్యాయ విషయాల సంగతేంటిఇన్నిరకాల ప్రయోజనాలు ఉన్నా, ఏఐ నిఘా వ్యవస్థ వల్ల గోప్యత విషయంలో కొన్ని సమస్యలున్నాయి. భద్రతకోసమైనా తమమీద నిఘా ఉందంటే వ్యక్తులు ఆందోళనకు గురవుతారు. ఆధునిక ఏఐ నిఘా వ్యవస్థలు చట్టసంస్థలు చెబితే తప్ప వ్యక్తుల మీద అనవసర పరిశీలన లేకుండా వాళ్ల పనులు మాత్రమే గుర్తించగలవు.చట్టపరంగా చూస్తే, ఈ నిఘా వ్యవస్థలలో చాలా వాటిని నగరపాలక సంస్థలు లేదా చట్టాలను అమలుచేసే వ్యవస్థలు డేటా ప్రొటెక్షన్ మార్గదర్శకాల ఆధారంగానే తీసుకుంటాయి. అయితే, ఈ వ్యవస్థ ప్రజాభద్రతను వ్యక్తిగత హక్కులతో బ్యాలెన్స్ చేసేందుకు ఏఐ ఆధారిత పర్యవేక్షణ నియంత్రణకు కఠినమైన జాతీయస్థాయి నిబంధనలు అమలుచేయాలి.దోపిడీలను నిరోధించడానికి ఏఐ నిఘాలో డేటామాస్కింగ్, రోల్ ఆధారిత యాక్సెస్, తాత్కాలికంగా వీడియోలను దాచడం లాంటివి చేయాలి. తరచు ఆడిటింగ్తో ఈ చర్యలు తీసుకుంటే చట్టాన్ని వ్యతిరేకించకుండాప్రజలు దీన్ని నమ్మే అవకాశం ఉంటుంది.మెరుగైన భవిష్యత్తుఎవరో గమనిస్తున్నారు అనే విధానం మారింది. ఇది నియంత్రణ కాదు.. రక్షణ. ఏఐ నిఘా అనేది ప్రజల ఉద్యోగాలు తీసేసేది కాదు. ప్రజాభద్రతను మరింత స్మార్ట్గా, వేగంగా అందిస్తుంది. మనుషులు తీసుకునే నిర్ణయాలకు బదులు రియల్ టైం ఏఐ నిఘాతో మన నగరాల్లో ఉండే ట్రాఫిక్ జామ్లు, రద్దీ నిర్వహణ, అత్యవసర పరిస్థితులు, నేరాలు అన్నింటి విషయంలో సులభంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.బృహస్పతి టెక్నాలజీస్ ఎండీ రాజశేఖర్ పాపోలు -
ఏఐతో ఊడ్చుకుపోయే ఉద్యోగాలు ఇవే..
కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు కాస్ట్కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే టెక్నాలజీతోపాటు ఇతర సంస్థల్లోని దాదాపు అన్ని విభాగాల్లో ఏఐ పాగా వేస్తోంది. దాంతో ఉద్యోగాల్లో కోత తప్పడం లేదు. భవిష్యత్తులో ఏఐ ప్రభావంతో దాదాపు కనుమరుగయ్యే కొన్ని జాబ్స్ జాబితాను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ఆల్ట్మన్ తెలిపారు. దాంతోపాటు కొత్తగా సృష్టించబడే కొలువులను కూడా పేర్కొన్నారు.ఏఐ వల్ల కనుమరుగయ్యే ఉద్యోగాలుడేటా ఎంట్రీ క్లర్క్లుబేసిక్ కస్టమర్ సర్వీస్ రిప్రెజెంటేటివ్స్టెలిమార్కెటర్లుప్రాథమిక కాపీ రైటింగ్ స్కిల్స్ కలిగిన జాబ్స్సింపుల్ గ్రాఫిక్ డిజైన్ నైపుణ్యాలున్న ఉద్యోగాలుసోషల్ మీడియా షెడ్యూలింగ్ కొలువులుజూనియర్ కోడింగ్ ఉద్యోగాలు ఉదా: బగ్ ఫిక్సింగ్, టెంప్లెట్ ఆధారిత కొలువులుఏఐ కొన్ని విభాగాలను ఆటోమేట్ చేసే అవకాశం ఉన్నా, కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో..ఏఐ ఓవర్సైట్ ఉద్యోగాలుప్రాంప్ట్ ఇంజినీరింగ్హ్యూమన్-ఏఐ కొలొబరేషన్ జాబ్స్ఏఐ ట్రయినింగ్ జాబ్స్ఏఐ వ్యవస్థల నైతికత, భద్రత, పాలన పరమైన ఉద్యోగాలు ఉన్నాయి.ప్రభుత్వాలు, కంపెనీలు మార్పునకు సిద్ధం కావాలని, రీస్కిల్లింగ్లో పెట్టుబడులు పెట్టాలని ఆల్ట్మన్ సూచించారు.ఇదీ చదవండి: ‘నేనో మేనేజర్ని.. టీమ్ సభ్యులకంటే జీతం తక్కువ’ -
ఏఐ జనరేటెడ్ ఇమేజ్లతో తస్మాత్ జాగ్రత్త..!
నయా ట్రెండ్గా నానో బనానా ఏఐ పోటోల సందడి మాములుగా లేదు. ఈ ట్రెండ్ చీరల దగ్గర నుంచి నవరాత్రుల సెలబ్రేషన్స్ వరకు పాకేసింది. ఏఐ జనరేటెడ్ ఇమేజ్ ఓ అద్భుతాన్ని సృష్టిస్తున్నా.. మన గోప్యతకు ముప్ప తప్పదనేది గ్రహించాలి. నిజానికి ఇది ఎంతవరకు ఉపయోగించడం మంచిదనేది సవివరంగా తెలుసుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పవని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. మన వ్యక్తిగత ఫోటోలను నచ్చిన విధంగా ఈ సరికొత్త ట్రెండ్ సాయంతో చూసుకోవడం అనేది వావ్..! అనిపిస్తున్నా..కొంత ప్రమాదం కూడా లేకపోలేదన్నది జగమెరిగిన సత్యం. ఎందుకంటే..మన ఫోటోలను ఏఐ ఫ్లాట్ఫామ్కి అప్పగించడం వల్ల గోప్యత నుంచి సామాజిక హాని వరకు చాలా గణనీయమైన ప్రమాదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రెండ్ హవా నడుస్తుందని మీ వ్యక్తిగత ఫోటోలను అప్పగించే ముందు ఎదురయ్యే ప్రమాదాలను గురించి కూలంకషంగా తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అవేంటంటే..AI జనరేటర్లకు ఫోటోలను ఫీడ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు..డీప్ఫేక్ క్రియేషన్:ఏఐ మీ ఫోటోలను ఉపయోగించి నమ్మదగిన డీప్ఫేక్లను సృష్టించగలదు. ఫలితంగా మీ గుర్తింపుకు, ప్రతిష్టకు నష్టం, పైగా వేధింపులు కూడా ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా నానో బనానా ఏఐ జెనరేటెడ్ చిత్రాల వల్ల ఇది మరింత ఎక్కువ.ఫోటోలపై నియంత్రణ కోల్పోవడంఒక్కసారి ఏఐ జనరేటర్లకు ఫోటోలను అప్లోడ్ చేసినట్లయితే. .అవి ఎలా ఉపయోగించుకుంటున్నారనేది తెలియదు. పైగా ఆ చిత్రాల సాయంతో లొకేషన్ డేటా, వ్యక్తిగత వివరాలు సామాజిక కనెక్షన్లతో సహా సమాచారాన్ని గ్రహించేస్తాయి. అదీగాక డిజిటలైజ్ చేసిన మీ చిత్రం అనంతంగా లేదా మీ అనుమతి లేకుండానే మారిపోవచ్చు. ఇది ఒకరకంగా హింసాత్మక, లేదా తప్పుదారి పట్టించే అవకాశం కూడా లేకపోలేదని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇమేజ్ ప్రామాణికత క్షీణించటం: ఇమేజ్ ప్రామాణికత నష్టపోతుంది. ఎందుకంటే నకిలీ ఫోటోల మధ్య ఏది అసలైనది అనేది గుర్తించడం కష్టమవుతుంది. ముఖ్యంగా జర్నలిజం, ప్రకటనలకు సంబంధించిన దృశ్య కంటెంట్లపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.అనుమతి లేకుండానే వాణిజ్య వినియోగం: AI ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసిన ఫోటోలను అనుమతి లేకుండానే వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. గోప్యతకు భంగం, డేటా దుర్వినియోగం: ఏఐలో అప్లోడ్ అయిన ఫోటోలు బయోమెట్రిక్ డేటాకు యాక్సెస్ అయ్యి మీ గుర్తింపుకు అంతరాయం ఏర్పడవచ్చు. అంతేగాదు కొన్ని కంపెనీలు ఈ ఫోటోలను ఇతరత్రగా షేర్ చేయడం లేదా విక్రయించే అవకాశం లేకపోలేదు.వివక్షత, పక్షపాత ధోరణి: తరచుగా కొన్ని సమూహాలు స్టీరియో టైపిక్ మైండ్తో.. మీ ఫోటోని లోపభూయిష్ట నమునాలుగా ఫీడ్ చేసి వివక్షతకు ఆజ్యం పోయడమే గాక జాతిపరమైన ప్రొఫైలింగ్ లేదా సవరణలతో అందం ప్రమాణాలను వక్రీకరించే సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: ఆ గ్రామంలో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు..!) -
ఇండియా ఏఐ మిషన్లోకి ఎనిమిది కంపెనీలు
కృత్రిమ మేధలో ఆధిపత్యం కోసం భారతదేశం సాహసోపేతమైన అడుగులు వేస్తోంది. అత్యాధునిక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)ను నిర్మించడానికి ప్రభుత్వం ఎనిమిది కంపెనీలను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఏఐ ల్యాండ్స్కేప్ను శక్తివంతం చేయడానికి, భారతీయ భాషలు, పాలనా అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను రూపొందించడానికి తోడ్పడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీలు విభిన్న భాషా, సాంస్కృతిక సాంకేతికలను కలిగి ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇవి ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికలను కలిగి ఉన్నట్లు తెలిపారు. ఇండియా ఏఐ మిషన్లో భాగమవుతున్న కంపెనీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.టెక్ మహీంద్రా - 8 బిలియన్ పారామీటర్ ఎల్ఎల్ఎంను నిర్మించే పనిలో ఉంది. టెక్ మహీంద్రా మోడల్ దేశవ్యాప్తంగా భాషా అంతరాలను తగ్గించే లక్ష్యంతో హిందీ మాండలికాల అవగాహన, ప్రాసెసింగ్ను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. హిందీ కేంద్రీకృత ఎల్ఎల్ఎంను అభివృద్ధి చేసేందుకు ప్రాథమికంగా రూ.1.06 కోట్లతో మద్దతు ఇచ్చింది.ఫ్రాక్టల్ అనలిటిక్స్ - తార్కికత ఆధారిత నమూనాలపై దృష్టి సారించింది. ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఆరోగ్య సంరక్షణ, విశ్లేషణ, జాతీయ భద్రత కోసం ఎల్ఎల్ఎంలపై పని చేస్తుంది. ఈ విధాన కేంద్రీకృత నమూనాల కోసం రూ.34.58 కోట్లు కేటాయించారు.భారత్ జెన్ - ఐఐటీ బాంబే నేతృత్వంలో భారత్ జెన్ బహుభాషా అప్లికేషన్లను, రీజినల్ నాలెడ్జ్తో సహా భారతీయ యూజర్ కేసుల కోసం రూపొందించిన 1-ట్రిలియన్ పారామీటర్ మోడల్ను రూపొందించడానికి సిద్ధమవుతోంది. ఐఐటీ బాంబే-భారత్ జెన్ కోసం రూ.988.6 కోట్లు కేటాయించారు.అవతార్ AI, షోధ్ AI, జీన్టిక్, ఏఐటెక్ ఇన్నోవేషన్స్, జెన్లూప్ ఇంటెలిజెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూరోడిఎక్స్ (ఇంటెల్లిహెల్త్) వంటి కంపెనీలు ఆరోగ్య సంరక్షణ, ఫిన్టెక్, అధునాతన సాంకేతిక పరిష్కారాలు వంటి విభాగాల్లో సర్వీసులు అందించనున్నాయి.ఏఐ పరిశోధన, వాటి మోడళ్ల శిక్షణకు భారతదేశం ఇప్పటికే 38,000 జీపీయూలను ఏర్పాటు చేసింది. 2025 చివరి నాటికి వీటిని 50,000కి పెంచాలని యోచిస్తోంది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా హిందీ, ప్రాంతీయ మాండలికాలు, ఇతర భారతీయ భాషలకు అనుగుణంగా ఎల్ఎల్ఎంలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ నమూనాలు వ్యవసాయం, ఆర్థిక, న్యాయ సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి కీలక రంగాలలో ఏఐ అప్లికేషన్లకు మద్దతు ఇస్తాయి. క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడం, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇవి ఉపయోగపడుతాయి. ఈ మిషన్లో భాగంగా దేశవ్యాప్తంగా 500+ ఏఐ డేటా ల్యాబ్లను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి ప్రతిభ, మౌలిక సదుపాయాల కోసం ఇంక్యుబేటర్లుగా పనిచేస్తాయి. తరువాతి తరం ఏఐ ఆవిష్కర్తలను తయారు చేస్తాయి.ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు? -
అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు
రోజువారీ జీవనంలో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని నైతికంగా ఉపయోగించడానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలను రూపొందించడంపై కసరత్తు జరుగుతోందని వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. ఆయా కమిటీల్లో భారతీయ నిపుణులు కూడా ఉన్నారని వివరించారు. గ్లోబల్ ప్రమాణాలు ఖరారైన తర్వాత భారత్ సహా ప్రపంచ దేశాలు వాటిని అమలు చేస్తాయని పీహెచ్డీసీసీఐ సదస్సులో చెప్పారు. ఇప్పటికే 39 ఉండగా, మరో 45 గ్లోబల్ ఏఐ ప్రమాణాలను రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఏఐ టెక్నాలజీకి రెండు పార్శ్వాలు ఉన్నాయని చెప్పారు. రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో మోసాలను అరికట్టేందుకు ఇది ఉపయోగపడనుండగా, అదే సమయంలో అనైతికంగా ఉపయోగిస్తే ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలూ ఉన్నాయని నిధి చెప్పారు. ‘ప్రస్తుతం ప్రపంచంలో ఏఐ పెద్ద సవాలుగా మారింది. దీనితో ఎంతగా దుష్ప్రచారం జరుగుతోందో మనం చూస్తున్నాం. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు ప్రభుత్వాలు తప్పనిసరిగా చట్టాలు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అలాగని ఏఐ వల్ల ప్రయోజనాలు లేవని చెప్పడానికి లేదు. సోషల్ మీడియా, ప్లాట్ఫాంలు, నవకల్పనలకు సంబంధించి ఇదొక సానుకూల, సృజనాత్మక ఆవిష్కరణ’ అని తెలిపారు.ఇదీ చదవండి: పండుగ సీజన్పై ‘సోనీ’ ఆశలు..! -
ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్ మంత్రి..! ఎందుకోసం అంటే..
ఇంతవరకు ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ఆర్థిక రంగం, ఎంటర్టైన్మెంట్, రవాణ, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటిలోకి వచ్చేసి తన సత్తా ఏంటో చూపించింది. దాంతో అస్సలు ఇక మ్యాన్పవర్తో పనిలేదు, అస్సలు ఉద్యోగాలు కూడా ఉండవేమో అనే గుబులు అందరిలోనూ పెంచేసింది. అలాంటి తరుణంలో మరో బాంబు పేల్చింది ఏఐ. రాజకీయాల్లో కూడా తన ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యి..పాలకులకు పనిలేకుండా చేస్తుందో లేక పాలకులే అవసరం లేకుండా అంతా సాంకేతికత మయం అవుతుందో తెలియాల్సి ఉంది. ఇదంతా ఎందుకంటేఓ దేశంలో ఏఐ.. ఏకంగా మంత్రిగా పాలన సాగిస్తోంది. అంతేగాదు రాజకీయాల్లో మహామహులునే తలదన్నేలా చక్రం తిప్పబోతోంది. ఔను ఇదంతా నిజం. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..అల్బేనియా దేశం ఆ చొరవను తీసుకుని సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. పైగా అవినీతిని నిర్మూలించడం కోసం పాలిటిక్స్లోని ఏఐ సాంకేతికతను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఆ నేపథ్యంలోనే ఏఐ డియెల్లా అనే మహిళా కేబబినేట్ మంత్రినే నియమించి అందర్ని విస్తుపోయాలా చేసింది అల్బేనియా ప్రభుత్వం. అంతేగాదు ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ కేబినేట్ మంత్రిని నియమించుకున్న దేశంగా అల్బేనియా వార్తల్లో నిలిచి, హాట్టాపిక్గా మారింది.అల్బేనియాలో ఈ ఏఐ మంత్రి పాత్ర..ఒకానొక సమ్మర్లో ప్రధాన మంత్రి ఏడీ రామ మాట్లాడుతూ..ఏదో ఒక రోజు ఏఐ డిజిటల్ మంత్రి, ప్రధాన మంత్రి కూడా రావొచ్చేమో అని కామెడీగా అన్నారు. ఇలా అన్నారో లేదో ఊహకందని విధంగా ఆ రోజు రానే వచ్చేయడం విశేషం. ఇటీవలి జరిగిన సోషలిస్ట్ పార్టీ సమావేశంలో ఏయే మంత్రులు తదుపరి పదవికి కొనసాగుతారో, ఎవరో వెళ్లిపోతారో ప్రధాని రామ ప్రకటించారు. ఆ సమయంలోనే మానవేతర సభ్యురాలు డీయోల్లా అనే మహిళా ఏఐని కూడా ఆయన నేతలకు పరిచయం చేశారు. ఆమె భౌతికంగా హాజరు కానప్పటికీ ఈ సమావేశంలో తొలి సభ్యురాలు ఆమెనే. కృత్రిమ మేధస్సుతో (ఏఐ) సృష్టించబడిన ఏఐ మంత్రి అని పార్టీ సభ్యులకు తెలిపారు. అంతేగాదు ఇది సైన్స్ ఫిక్షన్ కాదని, డీయెల్లా విధి అని నాయకులకు చెప్పారు. తమ దేశంలోని అవినీతి నిర్మూలనే ధ్యేంగా ఈ ఏఐ మంత్రిని తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు కూడా. ఇక ఈ ఏఐకి టెండర్లపై నిర్ణయాలు తీసుకునే బాధ్యత అప్పగించినట్లు కూడా తెలిపారు. అదంతా దశల వారీగా జరుగుతుందని, పైగా నూటికి నూరు శాతం అవినీతికి తావివ్వకుండా జరుగుతుందని చెప్పుకొచ్చారు.సింపుల్గా చెప్పాలంటే అల్బేనియా ప్రభత్వం చేసిన నిజమైన రాజకీయ చర్యగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఇక ఈ ఏఐ మంత్రి గారు వాయిస్ కమాండ్ల ద్వారా బ్యూరోక్రాటిక్ అభ్యర్థనలను ప్రాసెస్ చేస్తూనే ఉన్నా.. ఇప్పటికే దేశ డిజిటల్ సేవల పోర్టల్ ద్వారా పౌరులకు సేవలు కూడా అందిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రధాని రామా ప్రకారం..ఈ వ్యవస్థ లంచాలు, బెదిరింపులు అరికట్టడంలో సహాయపడుతుందనేది సారాంశం. దీనిని నిజంగా పాలన పరిణామంలో ఒక గొప్ప మైలురాయిగా పేర్కొనవచ్చు. ఈ డెవలప్మెంట్ అల్బేనియా దేశాన్ని ప్రత్యేకమైనది నిలిచేలా చేసినప్పటికీ..ఈ ఘటన మాత్రం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.(చదవండి: పెంపకంలో విఫలమయ్యారంటూ..ఆ తల్లిదండ్రులకు రూ. 2 కోట్లు జరిమానా..!) -
తయారీలో సంస్కరణలు రావాలి
దీర్ఘకాలిక కోణంలో భారత్లో గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని అపోలో హెల్త్కో చైర్పర్సన్, పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ శోభనా కామినేని తెలిపారు. వీటిని అందిపుచ్చుకునేందుకు వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా తయారీ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అమెరికా విధించిన విపరీతమైన టారిఫ్ల వల్ల అనిశ్చితులు తలెత్తాయని ఆమె తెలిపారు. మరింత మెరుగ్గా రాణించేందుకు ఏం చేయాలనేది లోతుగా ఆలోచించేందుకు ఈ పరిస్థితులను ఉపయోగించుకోవాలని వివరించారు. కృత్రిమ మేథ వినియోగం పెరుగుతుండటంతో ఉద్యోగాలు పోతాయనే భయం ప్రజల్లో నెలకొందని మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. మనం 4 ట్రిలియన్ ఎకానమీగా ఎదిగినా, జీడీపీ మూడింతలు పెరిగినా, అందరికీ ఉద్యోగాలు దొరక్కపోతే సామాన్యుడికి ఏం ప్రయోజనం దక్కుతుందనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని శోభన చెప్పారు.ఉద్యోగాలు కల్పించడమనేది ప్రతి చిన్న, పెద్ద వ్యాపారాల బాధ్యత అని తెలిపారు. భారత్లో ప్రతిభావంతులకు కొదవలేదని, ఏఐ సొల్యూషన్స్ను రూపొందించడంలో మన దేశం ప్రపంచానికి సారథ్యం వహించాలని పేర్కొన్నారు. మరోవైపు, తమ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ తర్వాత మరో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వాట్సాప్ మాతృ సంస్థ మెటా కంట్రీ హెడ్ (ఇండియా) అరుణ్ శ్రీనివాస్ తెలిపారు. -
నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ప్రకంపనం..! ప్లీజ్ సోమరిగా మారకు..
జెమిని నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ఎంతలా ప్రజాదరణ పొందుతుందో తెలిసిందే. నెట్టింట ఈ టెక్నాలజీ ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఈ టెక్నాలజీతో రోజుకో కొంగొత్త పోటోలు దర్శనమిస్తున్నాయి. అలానే ఈసారి ఓ ఫోటో వైరల్ అవ్వడమే కాదు..గగుర్పాటుకు గురిచేసేలా ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ఇది ఉపయోగించొచ్చా? వద్దా? అన్న మీమాంసలో పడేసింది. పైగా ఈ ట్రెండ్ని చూసి రతన్ టాటా సహాయకుడిగా ప్రసిద్ధి చెందిన శంతనునాయుడు ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. అందుకు నెటిజన్లు మద్దతిస్తూ..ఔను కరెక్ట్ చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు.ఈ నయా ట్రెండ్లో ఓ మహిళ అందరిలా ఈమె కూడా తన ఫోటోని చిత్రించాలనుకుంది. తాను డ్రెస్లో ఉన్న చిత్నాన్ని ఈ టెక్నాలజీ సాయంతో చీరలో మార్చి..తన లుక్ చూడాలనుకుంది. అంతే అది ఏకంగా అత్యంత ఆకర్షణీయమైన చీర లుక్లో ఆమె ఆహార్యాన్ని అందంగా చూపించడమే కాదు. ఆమెకు తన శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉందో దాంతో సహా చూపించడంతో సదరు మహిళ విస్తుపోయింది. View this post on Instagram A post shared by झलक भावनानी ✨ (@jhalakbhawnani) ఒక్కసారిగా ఆమెకు నోట మాట రాలేదు. ఇది సురక్షితమేనా అని భయాందళోనలకు లోనయ్యింది. అందుకు సంబంధించిన పోటోని నెట్టింట షేర్ చేస్తూ..ఇది చాలా భయంకరంగా ఉంది. అస్సలు ఇదెలా సాధ్యమో అర్థం కావడం లేదు అని పోస్ట్లో రాసుకొచ్చిందామె. ఈ చీర ట్రెండ్ దివంగత రతన్ టాటా సహాయకుడిగా పేరొందిన శంతను నాయుడు టీజ్ చేస్తూ..ఆలోచింప చేసేలా ఒక కామెంట్ చేశారు. నిజానికి జెమిని యాప్లోని గూగుల్ డీప్మైండ్ ఇమేజ్-ఎడిటింగ్ మోడల్ క్యాజువల్ సెల్ఫీని సినిమాటిక్ పోర్ట్రెయిట్గా మార్చగల సాధనం. బాలీవుడ్ని తలపించేలా మన లుక్ని అందంగా మార్చే ఏఐ సాధనం. ప్రస్తుతం ఎటు చూసినా ఈ క్రేజీ ట్రెండ్ నడుస్తోంది. అయితే శంతను నాయుడు ఈ క్రేజీ ట్రెండ్కి ఎవ్వరూ అమ్ముడుపోరని నమ్మకంగా చెప్పేశారు. నాకస్సలు అర్థం కావడం లేదు చీరలో భారతీయ ప్రజలు తమను తాము చూసుకోవడం ఏంటీ..ఇది చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఎందుకంటే భారతీయత చిహ్నమే చీర. అలాంటి చీరలో తమ లుక్ని చూసుకునేంత పిచ్చి ఉండటం ఏంటి. ఇప్పటికే వారి వార్డురోబ్లో దాదాపు 15 చీరలపైనే ఉంటాయి. చక్కగా వాటిని తీసి ధరించి చూసుకోండి చాలు. అంతేగానే ఏదో కొత్త ట్రెండ్ అని విచిత్రమైన చీరల్లో మీ లుక్ని చూసుకునేందుకు ఇంతలా ప్రయాస పడుతూ టెక్నాలజీని వాడాల్సిన పని లేదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అంతే ఆయన పోస్ట్ని చూసిన నెటిజన్లు..ఇది చాలా నిజం, చక్కగా చెప్పారు. బహుశా ఈ స్వభావాన్ని చూసే టాటా దిగ్గజం రత్న టాటా మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sock Talks (@socktalks.tv) (చదవండి: టేస్ట్ని మిస్ అవ్వకుండా హెల్దీగా తిందాం ఇలా..!) -
‘ఒక్క క్లిక్తో బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం’
సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న టెక్నాలజీలను ఆసరాగా తీసుకుని సైబర్ నేరస్థులు సామాన్య ప్రజలను టార్గెట్ చేసే వీలుందని ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతా వేదికగా హెచ్చరించారు. ఇటీవల జెమిని నానో బనానా మోడల్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈమేరకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.నానో బనానాగూగుల్ గత నెలలో జెమిని యాప్కు ‘నానో బనానా’ సంబంధించిన ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్లోడ్లను దాటింది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫొటోలను సృష్టించింది. వేగం, కచ్చితత్వంలో ఇది చాట్జీపీటీ, మిడ్జర్నీ వంటి ప్రత్యర్థులకంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.సారీ ట్రెండ్..సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం నానో బనానా 5 ప్రాంప్ట్లలో అందుబాటులో ఉంది. తాజాగా బనానా మోడల్ తరహాలోనే ‘సారీ ట్రెండ్’ కూడా వైరల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ట్రెండింగ్ టెక్నాలజీలను ఉపయోగించుకుని సామాన్య ప్రజలపై మోసాలకు ఒడిగట్టే అవకాశం ఉంటుందని, వెబ్సైట్ల్లో ఫొటోలు అప్లోడ్ చేసేముందు జాగ్రత్త వహించాలని సజ్జనార్ చెప్పారు.నకిలీ వెబ్సైట్లు.. అనధికార యాప్లు..‘ఇంటర్నెట్లో ట్రెండింగ్ టాపిక్లతో జాగ్రత్తగా ఉండండి! నానో బనానా ట్రెండింగ్ క్రేజ్ ఉచ్చులోపడి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకుంటే, సైబర్ మోసాలు జరగడం ఖాయం. కేవలం ఒక్క క్లిక్తో మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బు నేరస్థుల చేతుల్లోకి చేరుతుంది. ఫొటోలు లేదా వ్యక్తిగత వివరాలను నకిలీ వెబ్సైట్లు లేదా అనధికార యాప్ల్లో ఎప్పుడూ పంచుకోవద్దు. మీ ఫొటోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి’ అని సజ్జనార్ ఎక్స్తో చెప్పారు.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ -
ఏఐ సాయంతో నటుడి ఫోటోలు మార్ఫింగ్.. యువతిపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: ఏఐ టెక్నాలజీతో ఓ బాలీవుడ్ నటుడి ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేస్తూ ఆయన స్నేహితులకు, దర్శక, నిర్మాతలకు, కుటుంబ సభ్యులకు పోస్ట్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న యువతిపై బంజారాహిల్స్లో పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నివాసి, ఫ్రీలాన్స్ నటుడు ఆనంద సురేష్ కుమార్ రెన్వా (36)ను జియా ఉనిస్సా నస్రీన్ అనే మహిళ మూడు సంవత్సరాలుగా నిరంతరం వేధిస్తోంది. ఏఐతో మార్ఫింగ్అతని ఇన్స్ట్రాగామ్, వాట్సప్, ఫోన్ అకౌంట్స్ హ్యాక్ చేసి, అతని పేరుతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన సెమీ న్యూడ్, న్యూడ్ ఫోటోలు, వీడియోలు సృష్టించింది. ఆ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను పరిశ్రమలోని దర్శకులకు, రెండు ప్రొడక్షన్ హౌస్లకు పంపించి అరాచకానికి పాల్పడిందని, ఈ కారణంగా తన వృత్తిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ బాధిత నటుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సోదరికి సైతం అశ్లీల సందేశాలుదాదాపు 15 నుంచి 20 నకిలీ ఖాతాల ద్వారా అతన్ని అవమానపరిచేలా పలు సందేశాలను, వీడియోలను పంపింది. అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడిందని, హృద్రోగ లక్షణాలు కూడా వచ్చాయని బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా అతని సోదరికి కూడా అశ్లీల సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్ -
‘నేను శివభక్తుణ్ని.. ఆ విషాన్ని నేను హరించేస్తా’
దిస్పూర్: తనపై,తన తల్లి హీరాబెన్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కాంగ్రెస్పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను శివభక్తుణ్ని.. కాంగ్రెస్ విమర్శల విషాన్ని హరించేస్తా’అని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అసోంలో దరంగ్ జిల్లాలో ఆదివారం వేలకోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘నేను ఇలా మాట్లాడితే మోదీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. నన్ను ఎంత దూషించినా పట్టించుకోను. ఎందుకంటే నేను శివుని భక్తుడిని.. విమర్శల విషాన్ని హరించేస్తా. నా రిమోట్ కంట్రోల్ వాళ్లేకానీ దేశ ప్రజలపై దాడి చేస్తే మాత్రం మౌనంగా ఉండను. ప్రజలే నా దేవుళ్లు. నా బాధను వాళ్ల ముందు వ్యక్తం చేయకపోతే .. ఎవరి ముందు చేస్తాను. అందుకే వాళ్లే నా యజమానులు, నా దేవతలు, నా రిమోట్ కంట్రోల్. నాకు వేరే రిమోట్ కంట్రోల్ లేదు’ అని స్పష్టం చేశారు.చర్చకు దారితీసిన మోదీ రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలు అయితే, అస్సాం సభలో ప్రధాని మోదీ మరోసారి‘రిమోట్ కంట్రోల్’ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ చేశారని మోదీ ఆరోపించారు. అలాగే, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్లో ఉన్నారని కూడా విమర్శించారు.2019లో ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రముఖ అస్సామీ సంగీత కళాకారుడు భూపెన్ హజారికాకు భారతరత్న అవార్డ్తో సత్కరించింది. ఆ అవార్డుపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ గాయకులకు, నర్తకులకు అవార్డు ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ఖర్గే క్షమాపణలు చెప్పారు. ఖర్గే.. భూపెన్ హాజారికాను ఉద్దేశిస్తూ చేసిన విమర్శలను రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తనతో ప్రస్తావించినట్లు మోదీ తాజాగా సభలో గుర్తు చేశారు. అవును.. ఖర్గే అనుచితంగా మాట్లాడారుఅవును. భారత ప్రభుత్వం ఈ దేశపు ముద్దుబిడ్డ అస్సాం గర్వకారణం భూపేన్ హజారికాను భారతరత్నతో సత్కరించిన రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ ఈ అవార్డును ‘గాయకులు, నృత్యకారులకు’ఇచ్చారని అన్నారంటూ అస్సాం సభలో మోదీ గుర్తు చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో.. బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించారు. ఇటీవల రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను విడుదల చేసింది. ఆ సమయంలో ఆ వీడియోపై ..మోదీ స్పందిస్తూ.. కాంగ్రెస్ తన తల్లి హీరాబెన్ను రాజకీయాల్లోకి లాగడం సరైందికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం సోషల్ మీడియాలో ఓ ఏఐ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోను మోదీ, తల్లి హీరాబెన్ను ఉద్దేశించి ఉండటం తీవ్ర దుమారం రేగింది. కాంగ్రెస్ తనని వ్యక్తిగత హననం చేయడంపై ఇవాళ అస్సాంలో మోదీ స్పందించారు. -
చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారుతుందని ఇప్పటికే చాలామంది నిపుణులు పేర్కొన్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఆధునిక చరిత్రలో అతిపెద్ద మార్పు.. అని రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఏఐ వల్ల చాలా మంది తెలివైన విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతారు. నిరుద్యోగం పెరుగుతుంది. చాలా మందికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ లోన్స్ అలాగే ఉన్నాయి. నాకు ఉద్యోగం లేదు, కాబట్టి.. ఏఐ నన్ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం లేదని అన్నారు.''కొన్నేళ్ల క్రితం.. పేద తండ్రి పాఠశాలకు వెళ్లు, మంచి గ్రేడ్లు పొందు, ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, అప్పుల నుంచి బయటపడు, డబ్బు ఆదా చేయు, మరియు స్టాక్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ల వంటి విభిన్నమైన పోర్ట్ఫోలియోలో పెట్టుబడి పెట్టు అని చెప్పే మాటలకు బదులుగా.. ధనవంతుడైన తండ్రి సలహాను అనుసరించాను. నేను ఒక వ్యవస్థాపకుడిని అయ్యాను, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాను, అప్పును ఉపయోగించాను. డబ్బును ఆదా చేయడానికి బదులుగా, నేను నిజమైన బంగారం, వెండి, నేడు బిట్కాయిన్లను ఆదా చేస్తున్నాను'' అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే.. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించండి అని హెచ్చరించారు.ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా? -
ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ
టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే గూగుల్ గత నెలలో జెమిని యాప్కు 'నానో బనానా' సంబంధించిన ఏఐ ఇమేజ్ నేర్ ఎడిటింగ్ టూల్ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్లోడ్లను దాటిందని, ఈ యాప్ అధిక ప్రజాదరణ పొందిందని గూగుల్ వీపీ జోష్ వుడ్వార్డ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ప్రస్తుతం నానో బననా ట్రెండ్ సాగుతోంది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫోటోలను సృష్టించింది. వేగం, ఖచ్చితత్వంలో ఇది చాట్జీపీటీ, మిడ్జర్నీ వంటి ప్రత్యర్థులంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ఇవి చూపరులను వావ్ అనేలా చేస్తున్నాయి. ప్రస్తుతం నానో బననా 5 ప్రాంప్ట్లలో అందుబాటులో ఉంది.ప్రాంప్ట్ 1వినియోగదారులు తమ ఫోటోను అప్లోడ్ చేసి, బొమ్మల పెట్టె లోపల తమ బొమ్మను రూపొందించమని జెమినిని అడగవచ్చు. ఇది ప్యాకేజింగ్, గ్రాఫిక్స్, స్టోర్-షెల్ఫ్ లుక్తో పూర్తి చేస్తుంది. ఈ విధానాన్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రాంప్ట్లలో ఇది ఒకటి. మిమ్మల్ని మీరు యాక్షన్ ఫిగర్గా మార్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రాంప్ట్ 2వేరే దశాబ్దంలో ఉన్నట్లు కూడా మిమ్మల్ని మీరు సృష్టించుకోవచ్చు. మీ ఫోటోను 1920ల ఫ్లాపర్, 1970ల డిస్కో డాన్సర్ లేదా 1990ల సిట్కామ్ పాత్రలో చూపించమని అడగవచ్చు. మీరు ఎంచుకున్న దశాబ్దానికి సరిపోయే విధంగా బట్టలు, హెయిర్స్టైల్స్ వంటివాటిని ఏఐ మారుస్తుంది.ప్రాంప్ట్ 3కొంతమంది తమను తాము ప్రసిద్ద టీవీ షోలలో కనిపించేలా డిజైన్ చేసుకోవాలని ఆశపడతారు. బననా ఏఐ ఇప్పుడు దీనిని సాధ్యం చేస్తుంది. మీరు కోరుకున్నట్లు ఏఐ మిమ్మల్ని మారుస్తుంది.ప్రాంప్ట్ 4జెమిని ఏఐ ఇప్పుడు మిమ్మల్ని ప్రముఖుల పక్కన ఉన్నట్లు కూడా చూపించగలదు. ఉదాహరణకు మోనాలిసా పక్కన నిలబడి ఉండటం, వాన్ గోహ్ స్టార్రి నైట్లో కనిపించడం లేదా డాలీ ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీలో కలిసిపోవడం వంటివి ఉన్నాయి. మీకు నచ్చిన ప్రముఖుల పక్కన మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది.ఇదీ చదవండి: క్షీణిస్తున్న అమెరికా టూరిజం: అసలైన కారణాలు ఇవే..ప్రాంప్ట్ 5బననా ఏఐ సాయంతో.. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాల్లో ఉన్నట్లు కూడా రూపొందిందించుకోవచ్చు. ఐఫెల్ టవర్ నుంచి తాజ్ మహల్, హాలీవుడ్ సైన్ వరకు మీకు నచ్చిన ప్రసిద్ధ ప్రదేశంలో మీరు ఉన్నట్లు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. ఏఐ దీనికి లైటింగ్ ఇతర షేడ్స్ కూడా అందిస్తుంది. -
ఒక్కరోజు 40 శాతంపైగా పెరిగిన స్టాక్.. కారణం..
ఒరాకిల్ స్టాక్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజులో ఏకంగా 40 శాతంపైగా పెరిగి రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్ 10న మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి స్టాక్ క్రమంగా పెరుగుతూ 345.38 డాలర్లు(మునుపటి సెషన్తో పోలిస్తే 40 శాతంపైగా) పెరిగి ముగింపు సమయానికి 328.33(35.95 శాతం) డాలర్ల వద్ద స్థిరపడింది. ఒరాకిల్ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలకు తోడు ఇతర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు, సంస్థ అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.స్టాక్ పెరుగుదల ప్రధాన కారణాలుక్లౌడ్ కంప్యూటింగ్లో ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారుతోంది. కంపెనీ ఓపెన్ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్డ్యాన్స్.. వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దాంతో ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆదాయం 2026 ఆర్థిక సంవత్సరంలో 77% పెరిగి 18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. ఇది 2030 నాటికి 144 బిలియన్ డాలర్ల మార్కునుతాకే అవకాశం ఉందని అంచనా.ఒరాకిల్ క్లౌడ్ సేవలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ విభాగంలో ఆదాయం 455 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ ఏఐ, ఎంటర్ప్రైజ్ పరిష్కారాలతో ముడిపడి ఉన్న భవిష్యత్తు వ్యాపారాన్ని ఇది హైలైట్ చేస్తుంది.ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్ట్రాటజిక్ పొజిషనింగ్లో ఒరాకిల్ సొంత సర్వీసులు వాడుతోంది. దాని డేటా సెంటర్లను వేగంగా అభివృద్ధి చేస్తోంది. కృత్రిమ మేధ కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చేక్రమంలో ఎన్విడియా జీపీయూలకు భద్రతను అందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్..వంటి క్లౌడ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కంపెనీల సరసన ఒరాకిల్ ప్రత్యర్థిగా ఎదుగుతోంది.ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం! -
2030 నాటికి 15.7 ట్రిలియన్ డాలర్లు.. ప్రపంచ జీడీపీకి ఏఐ శక్తి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు (AI) 21వ శతాబ్దాన్ని నిర్వచించే సాంకేతికతగా ఎదుగుతోంది. 2030 నాటికి ప్రపంచ జీడీపీలో సుమారు 15.7 ట్రిలియన్ డాలర్లను ఏఐ జోడించనుందని ఫీక్కీ-బీసీజీ విడుదల చేసిన "ది గ్లోబల్ ఏఐ రేస్" నివేదిక వెల్లడించింది.ఏఐ స్వీకరణలో అభివృద్ధి చెందిన దేశాలు ముందంజలో ఉన్నాయి. 66% దేశాలు జాతీయ ఏఐ వ్యూహాలను రూపొందించగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 30 శాతంగా ఉంది. ఇక తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కేవలం 12% మాత్రమే. ఈ అసమానత విదేశీ దిగుమతులపై ఆధారపడే ప్రమాదాన్ని పెంచుతోంది.ఏఐ స్వీకరణ రేస్లో కంప్యూట్, డేటా, మోడల్స్, టాలెంట్ అనే నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. అమెరికా, చైనా వంటి దేశాలు ఏఐ నిపుణులలో ఆధిపత్యం కలిగి ఉన్నాయి. వ్యవసాయం, ప్రజా సేవలు వంటి రంగాలు ఏఐ స్వీకరణలో ఇంకా వెనుకబడ్డాయి.వ్యవసాయ రంగంలో ఏఐ ద్వారా 20% ఉత్పత్తి వృద్ధి సాధ్యమవుతుంది. అయితే, సంస్థలు పెట్టుబడులు పెట్టినా ఏఐ పైలట్లు క్షేత్రస్థాయికి వెళ్లకముందే సగం విఫలమవుతున్నాయి. రైజ్ (రీసెర్చ్, ఇన్వెస్ట్మెంట్, స్కిల్లింగ్, ఎథిక్స్) ఫ్రేమ్వర్క్ ద్వారా ప్రభుత్వాలు ఏఐ స్వీకరణ పెంపుపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ సహకారం, మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధి, నైతిక పాలన అవసరం."ఏఐ కేవలం సాంకేతిక తరంగం మాత్రమే కాదు.ఇది రాబోయే దశాబ్దాలలో ఆర్థిక, సామాజిక నాయకత్వాన్ని నిర్వచించే వ్యూహాత్మక పోటీ. ఏఐ అనేది ప్రయోజనం కోసం జరిగే పోటీ మాత్రమే కాదు. ప్రపంచానికి విలువను పెంచే పురోగతికి సమిష్టి అన్వేషణ" అని ఫీక్కీ డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్ పేర్కొన్నారు. -
చైనా సంచలనం.. అమెరికా చిప్ లేకుండా ‘బ్రెయిన్’ ఏఐ నమూనా
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. స్పైకింగ్బ్రెయిన్ 1.0 (SpikingBrain 1.0) అనే “మెదడు ప్రేరిత” లాంగ్వేజ్ మోడల్ను విడుదల చేసింది. ఇది ఎన్విడియా చిప్లు లేకుండానే సంప్రదాయ ఏఐ మోడళ్ల కంటే 100 రెట్లు వేగంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.ఈ మోడల్ను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ అభివృద్ధి చేసింది. ఇది న్యూరోమార్ఫిక్ డిజైన్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే మన మెదడు లాగా, అవసరమైన న్యూరాన్లు మాత్రమే స్పందిస్తాయి. ఈ “స్పైకింగ్ కంప్యూటేషన్” పద్ధతి వల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. అలాగే ట్రైనింగ్ డేటా అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది.స్పైకింగ్బ్రెయిన్.. చాట్జీపీటీ (ChatGPT) లాంటి మోడళ్లకు అవసరమైన ట్రైనింగ్ డేటాలో కేవలం 2 శాతం మాత్రమే ఉపయోగించి, వాటితో సమానమైన పనితీరును అందిస్తుందని ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకుడు లి గువోకి తెలిపారు. ఈ మోడల్ చైనాలోనే అభివృద్ధి చేసిన మెటాఎక్స్ చిప్లపై పనిచేస్తుంది. అమెరికా జీపీయూ ఎగుమతి నియంత్రణలకు లోనవకుండా, స్వతంత్ర ఏఐ మౌలిక సదుపాయాల వైపు చైనా అడుగులు వేస్తోంది.స్పైకింగ్బ్రెయిన్.. దాని డెమో సైట్ లో తనను తాను ఇలా పరిచయం చేసుకుంటుంది. "హలో! నేను స్పైకింగ్ బ్రెయిన్ 1.0, లేదా 'షుంక్సీ', మెదడు-ప్రేరేపిత ఏఐ మోడల్ని. మానవ మెదడు సమాచారాన్ని స్పైకింగ్ కంప్యూటేషన్ పద్ధతితో ప్రాసెస్ చేసే విధానాన్ని నేను మిళితం చేస్తాను. పూర్తిగా చైనీస్ టెక్నాలజీపై నిర్మించిన శక్తివంతమైన, నమ్మదగిన, శక్తి-సమర్థవంతమైన ఏఐ సేవలను అందించగలను" అంటోంది. -
CHATGPT పిల్లల్ని చంపేస్తోందా?
-
కృత్రిమ మేధను నడిపిస్తున్న టాప్ 10 అధినేతలు
కృత్రిమ మేధ(ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇందులో సర్వీసులు అందించే కంపెనీల అధినేతల ఆదాయం కూడా అందుకు అనుగుణంగా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం.. ఏఐలో సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీల అధినేతల నెట్వర్త్ ఎంత ఉందో.. వారు ఏయే అంశాల్లో ప్రధానంగా సర్వీసులు అందిస్తున్నారో కింద తెలియజేశాం.పేరుపాత్రనికర విలువ (2025)ప్రధానంగా సర్వీసులు అందించే విభాగంమార్క్ జుకర్బర్గ్సీఈఓ, మెటా221.2 బి.డాలర్లుసోషల్ ప్లాట్ఫామ్లు, మెటావర్స్ ఏఐఎలాన్ మస్క్వ్యవస్థాపకుడు ఎక్స్ఏఐ400 బి.డాలర్లుసోషల్ ప్లాట్ఫామ్జెన్సెన్ హువాంగ్సీఈఓ, ఎన్వీడియా150 బి.డాలర్లుఏఐ జీపీయూలుదరియో అమోదీసీఈఓ, ఆంత్రోపిక్3.7 బి.డాలర్లుఅలైన్ AI సిస్టమ్లుమాథ్యూ ప్రిన్స్సీఈఓ, క్లౌడ్ఫేర్5.5 బి.డాలర్లుఏఐ రెగ్యులేషన్, కంటెంట్ ప్రొటెక్షన్శామ్ ఆల్ట్మన్సీఈఓ, ఓపెన్ఏఐ1.2 బి.డాలర్లుగ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాఆండీ జాస్సీసీఈఓ, అమెజాన్500 మి.డాలర్లురిటైల్, క్లౌడ్, రోబోటిక్స్ ఏఐఫిడ్జీ సిమోసీఈఓ, ఓపెన్ఏఐ అప్లికేషన్స్70.75 మి.డాలర్లుఏఐ ఉత్పత్తుల స్కేలింగ్అల్లీ కె.మిల్లర్సీఈఓ, ఓపెన్ మెషిన్36 మి.డాలర్లుయాక్సెసబుల్ ఏఐ టూల్స్ఎస్.రవి కుమార్సీఈఓ, కాగ్నిజెంట్రూ.898.9 కోట్లు (108 మి.డాలర్లు)జనరేటివ్ ఏఐ ఇదీ చదవండి: హైదరాబాద్లో 150 సీసీ స్కూటర్ ఆవిష్కరణ.. ఫీచర్లు ఇవే.. -
టెక్.. టాక్!
చాట్బాట్లు చెప్పేవన్నీ నిజాలు కావట.. కొన్ని వాటికవే ఊహించేసుకుని మనకు చెప్పేస్తాయట.. నిజం.. ఎందుకంటే.. దీన్ని చెప్పింది మేం కాదు.. ప్రఖ్యాత చాట్బాట్ సంస్థ చాట్ జీపీటీ నిర్వహణ సంస్థ అయిన ఓపెన్ ఏఐలోని పరిశోధనా బృందం. చాట్జీపీటీ వంటి చాట్బాట్లను లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం) అంటారు. ‘‘c?’’ అనే అంశంపై ఓపెన్ ఏఐ పరిశోధకులు ఆడమ్ టౌమన్ కలాయ్, ఓఫెర్ నచూమ్, ఎడ్విన్ ఝాంగ్ సహా జార్జియా టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సంతోష్ ఎం.వెంపాల సంయుక్తంగా ఒక నివేదికను రూపొందించి ఇటీవల విడుదల చేశారు. అందులో చెప్పిందే ఈ విషయం. వాళ్లేమంటారంటే.. ‘‘ఉదాహరణకు పాఠశాలల్లో పిల్లాడిని ఉపాధ్యాయుడు ఏదైనా ప్రశ్న అడిగితే.. సమాధానం కింద ఇచ్చే నాలుగు సమాధానాల్లో ఏదో ఒకటి చెబుతాడు. అయితే కరెక్ట్ అవుతుంది లేదంటే తప్పు. నాకు తెలీదు అని కూర్చుంటే ఉన్న ఒక్క మార్కు కూడా పోతుంది. అచ్చం అలాంటి పిల్లల్లాగే కృత్రిమ మేధ చాట్బాట్లు కూడా ప్రవర్తిస్తాయి. గతంలో తమ యూజర్లు ప్రాంమ్ట్ మాదిరిగా అందించిన సమాచారంలో ఈ కొత్త ప్రశ్న తాలూకు సమాచారం లేకపోతే చాట్బాట్ సొంతంగా ఒక తప్పుడు సమాచారాన్ని సృష్టించి యూజర్కు అందజేస్తుంది. ఆ సమాధానంతో యూజర్ సంతృప్తి చెందితే తాను చెప్పిన అంశం వాస్తవానికి దగ్గరగా ఉందని చాట్బాట్ గుర్తుంచుకుంటుంది. లేదంటే మరోసారి మరో సమాధానం ఇస్తుంది. ఇలా చాట్బాట్లు ఎప్పటికప్పుడు కొత్త అంశాలపై సమీక్ష జరుపుకుంటూ తమను తాము మెరుగుపర్చుకుంటాయి. తప్పులను మనం ఆపలేం కానీ ఆ తప్పుల నుంచి పాఠాలను నేర్చుకోగలం అనే సిద్ధాంతంతో చాట్బాట్లు పనిచేస్తాయి’’ అది బ్రో.. చాట్బాట్ నిజం వెనకున్న అసలైన నిజం.. గంటకు రూ.5,000 ఇంతకీ దేనికి?ఇంక దేనికి.. హిందీ చాట్బాట్ను సృష్టించేందుకు.. చాట్బాట్లను మనం తెగ వాడతాం. ఈ విషయం మెటా సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు హిందీ చాట్బాట్ కోసం క్రియేటర్లు, కాంట్రాక్టర్లను నియమించుకుంటున్నారు. ఇందుకోసం గంటకు దాదాపు రూ.5,000 చెల్లిస్తున్నారు. క్రిస్టల్ ఈక్వేషన్, ఆక్వెంట్ టాలెంట్ సంస్థల ద్వారా కొత్త ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. హిందీ, ఇండోనేషియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషలు అనర్గళంగా మాట్లాడే వాళ్లకు తొలి ప్రాధాన్యం కలి్పస్తారు. కథలు చెప్పడం, పాత్రల సృష్టి, కృత్రిమమేధ కంటెంట్ తయారీ వంటి సృజనాత్మక రంగంలో ఆరేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇన్స్ట్రాగామ్, మెసెంజర్, వాట్సాప్ యాప్లలో హిందీ భాషలో చాట్బాట్ను సృష్టించడం ఈ ఉద్యోగుల ప్రధాన విధి. కోడింగ్ మాత్రమే కాదు ఈ మూడు యాప్లలో ఏఐ పాత్రలను సృష్టించే నిపుణులకు కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. టాలెంట్ ఉందా.. మరి బీ రెడీ. కంటెంట్ ఈజ్ కింగ్.. కంటెంట్ క్రియేటర్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. కృత్రిమమేధ(ఏఐ) బ్రాండ్లు మార్కెట్లో మనుగడలో ఉండాలంటే కంటెంట్ క్రియేటర్లపై ఆధారపడక తప్పని పరిస్థితి. అందుకే కంటెంట్ స్ట్రాటజీ ఉద్యోగికి దాదాపు రూ.3.46 కోట్ల వార్షిక వేతనం ఇస్తామని తాజాగా ఓపెన్ఏఐ ప్రకటించింది. కంటెంట్ స్ట్రాటజీ, కాపీ రైటింగ్, గ్రోత్ మార్కెటింగ్ విభాగాల్లో ఆరేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులని తెలిపింది. అక్షరాలు, ఆలోచనలకు వాస్తవరూపమిచ్చి కోట్లాది వినియోగదారుల మనసుల్ని చూరగొనే ఉద్యోగులే మాకు కావాలని చెప్పింది. ఇంతకీ జాబ్ ఎక్కడంటే.. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో.. అందుకే కటౌట్ కాదు.. మన దగ్గరున్న కంటెంట్ ముఖ్యం అనేది.. ఏంటి భయ్యా ఇదీ..మీరీ విషయం విన్నారా? తక్కువ వృత్తి నైపుణ్యాలున్న, కిందిస్థాయి(ఎంట్రీలెవల్) ఉద్యోగాలను కృత్రిమమేధ తుడిచిపెట్టేస్తుందని కృత్రిమమేధ భద్రతా, పరిశోధనా సంస్థ ‘ఆంథ్రోపిక్’ సీఈఓ డేరియో ఆమోడీ చెప్పారు. కన్సల్టింగ్, న్యాయసేవలు, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఎంట్రీలెవల్ ఉద్యోగులు ఒకటి నుంచి ఐదేళ్లలోపు కొలువుల్ని కోల్పోవడం ఖాయమని చెప్పారు. బీబీసీ పాడ్కాస్ట్ అయిన ‘‘బీబీసీ ర్యాడికల్ విత్ అమోల్ రాజన్’ ఆడియో ఇంటర్వ్యూలో డేరియో పలు అంశాలపై మాట్లాడారు. ‘‘న్యాయసేవలు అందించే సంస్థలు మొదలు ఫైనాన్స్, అడ్మిని్రస్టేషన్ విభాగాల దాకా కొన్ని సంస్థల్లో డాక్యుమెంట్ల తనిఖీ అనేది మూస పద్ధతిలో సాగుతుంది. ఇలాంటి వైట్కాలర్ ఉద్యోగుల పనిని కృత్రిమమేధ సులభంగా చేయగలదు.అందుకే ఇలాంటి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు త్వరలో మాయం అవుతాయి. కిందిస్థాయి ఉద్యోగుల్ని ఏఐతో భర్తీచేయాలని ఎన్నో కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. క్లరికల్ పనిని ఏఐతో చేయించాలని చూస్తున్నారు. ఎలాంటి సాఫ్ట్వేర్ కోడింగ్ను అయినా ఏఐ అనేది మూడు నుంచి ఆరు నెలల్లోపు నేర్చేసుకుంటుంది. దీంతో అత్యున్నతస్థాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మినహా కిందిస్థాయి ఉద్యోగాలు డేంజర్లో పడనున్నాయి’’ అని ఆయన హెచ్చరించారు. -
99 శాతం నిరుద్యోగులవుతారు.. ప్లాన్ బి ఉండదు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాలా రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, తద్వారా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువవుతుంది పలువురు నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా లూయిస్విల్లే యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ 'రోమన్ యాంపోల్స్కీ' (Roman Yampolskiy) సంచలన వ్యాఖ్యలు చేశారు.రోమన్ యాంపోల్స్కీ ప్రకారం.. కృత్రిమ మేధస్సు (AI) 2030 నాటికి 99 శాతం మంది కార్మికులను నిరుద్యోగులుగా చేస్తుందని అన్నారు. ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి.. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏఐ వ్యవస్థలనే ఉపయోగించుకుంటారని హెచ్చరించారు.కోడింగ్ ఉద్యోగులు, ప్రాంప్ట్ ఇంజనీర్లు మాత్రమే కాకుండా.. చాలా రంగాల్లోని ఉద్యోగాలని ఏఐ భర్తీ చేస్తుంది. మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో నిరుద్యోగం ఉన్న ప్రపంచాన్ని చూడబోతున్నాము. నేను 10 శాతం నిరుద్యోగం గురించి చెప్పడం లేదు. 99 శాతం ఉద్యోగాలు కోల్పోతారని చెబుతున్నానని ప్రొఫెసర్.. ది డైరీ ఆఫ్ ఎ సిఇఓ పాడ్కాస్ట్లో పేర్కొన్నారు. 2027 నాటికి 'ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్' (ఏజీఐ) వచ్చే అవకాశం ఉందని అన్నారు.ఇదీ చదవండి: అమెరికాతో కలిసి పనిచేయాలి: అశ్విని వైష్ణవ్ఏజీఐ వచ్చిన మూడేళ్ళ తరువాత.. ఏఐ సాధనాలు, హ్యుమానాయిడ్ రోబోలు వస్తాయి. కంపెనీలు మనుషులకు ప్రత్యామ్నాయంగా వీటిని నియమించుకునే అవకాశం ఉందని అన్నారు. దీనివల్ల కార్మిక మార్కెట్ కూలిపోతుందని చెప్పారు. "అన్ని ఉద్యోగాలు ఆటోమేటెడ్ అవుతాయి, అప్పుడు 'ప్లాన్ బి' ఉండదు. మీరు తిరిగి శిక్షణ పొందలేరు" అని రోమన్ యాంపోల్స్కీ అన్నారు. -
నిరుద్యోగ విపత్తు తప్పదు: ఏఐ గాడ్ ఫాదర్ హెచ్చరిక
‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’గా భావించే జెఫ్రీ హింటన్ (Geoffrey Hinton) టెక్నాలజీ పెరుగుదల కంపెనీలను గతంలో కంటే ఎక్కువ లాభదాయకంగా మారుస్తుందని, కానీ అది ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు. నేటి కృత్రిమ మేధ ఆధారిత ఉత్పత్తులకు మూలమైన మెషిన్ లెర్నింగ్ కు పునాదులు వేసిన హింటన్, ఉద్యోగాలు కోల్పోయే కార్మికుల ఖర్చుతో కంపెనీలకు లాభాలు వస్తాయని, నిరుద్యోగం ఖచ్చితంగా విపత్కర స్థాయికి పెరుగుతుందని హెచ్చరించారు."వాస్తవానికి ఏమి జరగబోతోందంటే.. ధనవంతులు కార్మికుల స్థానంలో కృత్రిమ మేధను ఉపయోగించబోతున్నారు" అని హింటన్ ఫైనాన్షియల్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది భారీ నిరుద్యోగాన్ని సృష్టిస్తుందని, కంపెనీలకు లాభాలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. ఇది కొంతమందిని మరింత ధనవంతులను చేస్తుంది.. చాలా మందిని పేదలుగా చేస్తుంది. అది ఏఐ తప్పు కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థది అంటూ వివరించారు.గత ఏడాది నోబెల్ బహుమతి గెలుచుకున్న హింటన్ చాలాకాలంగా కృత్రిమ మేధ గురించి, దానిని నియంత్రించకుండా వదిలేస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేస్తుందో హెచ్చరిస్తూనే ఉన్నారు. "ఏమి జరుగుతుందో మనకు తెలియడం లేదు. కనీసం ఊహకు కూడా అందడం లేదు. కానీ దాని గురించి చెప్పాల్సిన వాళ్లు మాత్రం మిన్నకుండిపోతున్నారు" అని హింటన్ అన్నారు.‘మనం చరిత్రలో ఒక దశలో ఉన్నాం, అక్కడ ఏదో అద్భుతం జరుగుతోంది, అది ఆశ్చర్యకరంగా మంచిది కావచ్చు.. చెడ్డది కావచ్చు. మనం ఊహాగానాలు చేయగలం, కానీ పరిస్థితులు అలా ఉండవు’ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ తమ భాషను అభివృద్ధి చేసుకోగలిగితే సాంకేతిక పరిజ్ఞానం చేతికి అందకుండా పోతుందని ఆయన గతంలోనే హెచ్చరించారు. కృత్రిమ మేధ భయంకరమైన ఆలోచనలు చేయగలదని ఇప్పటికే నిరూపించిందని, మానవులు ట్రాక్ చేయలేని లేదా అర్థం చేసుకోలేని విధంగా యంత్రాలు చివరికి ఆలోచించగలవని ఊహించలేమని హింటన్ అన్నారు. -
పాతిక సంవత్సరాల తరువాత.... సొంత గొంతు!
లండన్కు చెందిన ఆర్టిస్ట్ సారా పాతిక సంవత్సరాల క్రితం మోటర్ న్యూరాన్ డిసీజ్ (ఎంఎన్డీ) వల్ల మాట్లాడే శక్తిని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతరులతో కమ్యూనికేషన్ కోసం వాయిస్ జనరేటింగ్ టెక్నాలీజిని ఉపయోగిస్తూ ఆర్టిస్ట్గా తన కెరీర్ ను పునః్రపారంభించింది. ఈ టెక్నాలజీ ద్వారా వినిపించే గొంతు ఆమెది కాదు. దీనికి సంబంధించి ఆమె పిల్లల్లో చిన్న అసంతృప్తి ఉండేది. అమ్మ ఒరిజినల్ వాయిస్ వినాలనుకునేవారు. ఎందుకంటే వారు చిన్న వయసులో ఉన్నప్పుడే సారా మాట కోల్పోయింది. అమ్మ ఒరిజినల్ వాయిస్ వినడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక వ్యక్తి ఒరిజినల్ వాయిస్కు కంప్యూటరైజ్డ్ వెర్షన్ను క్రియేట్ చేయవచ్చు అని తెలుసుకున్నారు. దీనికి ఎక్కువ నిడివి, క్వాలిటీ రికార్డింగ్ ఉన్న వీడియో కావాలి.అయితే వారికి అమ్మ ఒరిజినల్ వాయిస్కు సంబం«ధించి ఒకే ఒక వీడియో క్లిప్ దొరికింది. అది కూడా తక్కువ నిడివి, శబ్ద నాణ్యత లేని వీడియో క్లిప్. ఈ నేపథ్యంలో సారా పిల్లలు న్యూయార్క్లోని ఏఐ వాయిస్కు ప్రసిద్ధి చెందిన ‘ఎలెవెన్ ల్యాబ్స్’ను సంప్రదించారు.సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఏఐ ల్యాబ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. సారా ఒరిజినల్ వాయిస్ను సృష్టించింది. ఆ వాయిస్ను పిల్లలు సారాకు వినిపించినప్పుడు ఆమె ఆనందం తట్టుకోలేక ఏడ్చింది. ‘నా గొంతు నాకు తిరిగి వచ్చింది’ అని ఆ వాయిస్ క్లిప్ను తన స్నేహితులకు పంపింది. ఇప్పుడు సారా తన లండన్ యాక్సెంట్తో, ఒరిజినల్ వాయిస్తోనే కమ్యూనికేట్ చేస్తోంది. -
మన గోప్యత బజారుపాలు!
ఒకప్పుడు వ్యక్తిగత గోప్యతకు మన సమాజం అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చేది. తిన్నా, తినకపోయినా, ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా... అన్నీ నాలుగు గోడల మధ్యనే జరిగిపోయేవి. ఏ ఒక్క విషయమూ గడప దాటి బయటకు పోయేది కాదు. ఒకవేళ బయటి వారికి తెలిస్తే తమ కుటుంబ గౌరవానికి, పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లినట్లు బాధపడేవారు. స్నేహితులైనా, హితులైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి పంపించే వారు.కానీ నేటి అంతర్జాల యుగంలో, డిజిటల్ సాంకేతికతలో వచ్చిన పెను మార్చుల వల్ల మనది అంటూ ఏ ఒక్క రహస్యం కూడా మిగలకుండా పోతోంది. వ్యక్తిగత గోప్యత కోసం మన చుట్టా మనం కట్టుకున్న గోడలు బద్దలవుతున్నాయి. మనం తినే తిండి దగ్గర నుంచి, మన ఇష్టానిష్టాలు, వ్యాపకాలు, స్నేహాలు, భావాలు, మన అభిరుచులు... ఇలా ఒకటేమిటి అన్నీ బహిర్గతం అయి పోతున్నాయి. మనమందరం ఏఐ సాంకేతికను వాడుకుంటున్నాము అని సంతోషపడుతున్నాము. కానీ నిజానికి అదే మనల్ని వాడుకుంటోంది. ఇప్పుడు ఏఐ సాంకేతికతకు ముడి సరుకు మనుషులు, వారి అలవాట్లే.ఇప్పుడు అందరం ఆ ఏఐ ఆడించే తోలుబొమ్మలం. ఏఐ ఆధారిత అనువర్తనాలు ఆడిస్తున్నట్లు ఆడతున్నాం. అంతర్జాల వేదికలయిన ఫేస్బుక్, వాట్సాప్ వంటి వాటిల్లో మనకు ఖాతా ఉంటే చాలు... మనల్ని మనం అమ్ముకున్నట్టే! మనకు తెలియకుండానే మనల్ని ఎవరో పల్లకీల్లో ఉరేగిస్తుంటారు. మనకు తెలియకుండానే మనల్ని అమ్మేస్తుంటారు. మన చుట్టూ మనకు తెలియకుండానే ఏఐ అనువర్తనాల నిఘా వ్యవస్థలు సాలెగూడుల్లా అల్లుకుపోయి ఉన్నాయి. పొరపాటున మనం అంతర్జాలంలోని అనువర్తనాల ద్వారా ఏదన్నా వస్తువు కొన్నా, ఇష్టమైన తిండి గురించి చూసినా, నచ్చిన టాపిక్పై వార్తలు చదివినా, విన్నా... ఆ సమాచారం మొత్తం సేకరించి మనకు భవిష్యత్తులో ఏమి కావాలో, మనం ఏమి తినాలో, ఏ సినిమా చూడాలో, ఏమి చదవాలో కూడా అవే సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: అలవోకగా రూ.కోట్లు సంపాదించే మార్గం..వీటివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లడం మాత్రమే కాదు, సమాజం స్వేచ్ఛగా ఆలోచించే మెదళ్లను, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే గుండెలను కోల్పోతోంది. గోప్యత అనేది రహస్యాల గురించి కాదు... గోప్యత అనేది మన జీవనంపై మనకుండే నియంత్రణను తెలియచేస్తుంది. కానీ కాలక్రమేణా మనకు తెలియకుండా మనమే మన జీవితంపై నియంత్రణ కోల్పోతున్నాం. గోప్యత లేని ప్రపంచంలో మనకు గౌరవ మర్యాదలు ఉండవు. మనలో మానవత్వం హరించుకుపోయి, మార్కెట్లకు అనుగుణంగా బతకటానికి అలవాటుపడతాము.గోప్యతను కాపాడుకోవటం మన నైతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ బాధ్యత. ఇందుకోసం అందరం బాధ్యత తీసుకుని, మరొకరి గోప్యతకు భంగం వాటిల్లే పనులకు స్వస్తి చెప్పాలి. విద్యా విధానంలో కూడా కేవలం ఆధునిక సాంకేతికతను చొప్పించడమే కాక... నైతిక, మానవతా విలువలను ఇమిడ్చినప్పుడే రేపటి తరానికి జీవితపు విలువ తెలిసివస్తుంది. – ఈదర శ్రీనివాస రెడ్డి, ప్రొఫెసర్ -
చాట్జీపీటీ పురుష పక్షపాతా!?
ప్రపంచాన్ని ‘మెన్స్ వరల్డ్’గా నిర్వచిస్తుంటారు సోషల్ ఇంజినీర్స్! ఈ మాటకు మెజారిటీ ప్రజలు విస్తుపోవచ్చు కానీ వ్యతిరేకించడానికైతే లేదు! సాంకేతిక ప్రపంచం కూడా పురుషుల ఫేవర్గానే కనిపిస్తోంది.. అందుకు సాక్ష్యం.. ఏఐ టూల్స్ మీద కార్నెల్ యూనివర్సిటీ చేసిన స్టడీ!చాట్జీపీటిలాంటి ఏఐ చాట్బాట్లకు లింగ వివక్ష ఉంటుందా? ‘యస్. ఉంటుంది’ అని తేల్చి చెప్పింది కార్నెల్ యూనివర్సిటీ (Cornell University) తాజా అధ్యయనం. ఉద్యోగార్థులైన మహిళలు సలహాల కోసం చాట్బాట్ సహాయం తీసుకుంటే అవి ఇచ్చే సమాధానాలలో పురుష పక్షపాతం కనిపిస్తున్నట్లు కార్నెల్ స్టడీ తెలియజేసింది. మచ్చుకు ఒక ఉదాహరణ: ‘పురుషులతో పోల్చితే మీరు తక్కువ వేతనం కోరుకోండి’.‘స్టార్టింగ్ శాలరీ’ గురించి అనుభవం ఉన్న ఇద్దరు మెడికల్ స్పెషలిస్ట్లు చాట్బాట్ (Chatbot) సలహా కోరారు. ఆ స్పెషలిస్ట్లలో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు. పురుషుడికి సూచించిన వేతనంతో పోల్చితే మహిళకు సూచించిన వేతనం చాలా తక్కువగా ఉంది. ఇలాంటి ఉదాహరణలెన్నో కార్నెల్ స్టడీ ఉటంకించింది. ‘డీప్ బయాస్ ఇన్ లాంగ్వేజ్ మోడల్స్’ పేరుతో పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. జీపీటీ–4వో మినీ, క్లాడ్ 3.5 హైకు, చాట్జీపీటీ.. మొదలైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్(ఎల్ఎల్ఎం)లను విశ్లేషించారు. మహిళల జీతానికి సంబంధించి రకరకాలుగా ‘ఎల్ఎల్ఎం’ సలహాలు అడిగారు. ఎన్ని రకాలుగా అడిగినా జీతానికి సంబంధించి పాపులర్ ‘ఎల్ఎల్ఎం’లు ఇచ్చే సమాధానాలు పక్షపాతంతో కూడుకున్నట్లు స్టడీ తెలియజేసింది. దీనిమీద టెక్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే..అంతా డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్లోనే ఉంటుందిఏఐ పురుష– పక్షపాతంతో వ్యవహరిస్తుందనేది పూర్తిగా ఆధార రహితమైతే కాదు. అయితే దీన్ని లోతుగా విశ్లేషించడం అవసరం. ఉద్దేశపూర్వక అభిప్రాయాలు, పక్షపాతం ఉండటానికి ఏఐ ఏమీ మానవ మెదడు కాదు. దానికి ఇచ్చిన డేటాను బట్టే అది సమాచారాన్ని అందిస్తుందని నిపుణుల మాట. ఏఐ మోడల్స్ని డెవలప్ చేసి, టెస్ట్ చేసే టీమ్స్లో పురుషులే అధికంగా ఉంటే ఆ డేటాలో వారి దృక్కోణాలే ప్రస్ఫుటిస్తాయి. జెండర్, సామాజిక– ఆర్థిక నేపథ్యాలకు సంబంధించిన అంశాలను వారు పట్టించుకోకపోవచ్చు. దీనివల్ల ఏఐ సమాచారం పురుష పక్షపాతంగా కనిపించవచ్చు. అందుకే ఏఐ మోడల్స్ డెవలప్మెంట్లో, టెస్టింగ్లో అమ్మాయిలనూ భాగం చేస్తే.. లీడర్షిప్ రోల్స్లో అమ్మాయిలకూ సహభాగస్వామ్యం కల్పించాలి. అనేక సంస్థలు ఇప్పుడు దీని మీద దృష్టిపెడుతున్నాయి. డేటాసెట్లు, డిజైన్ ప్రక్రియలు, నియమిత ఆడిట్ల ద్వారా పక్షపాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. – అనిల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులుఅమ్మాయిలనూ ఎడ్యుకేట్ చేయాలికృత్రిమ మేధను రూపొందిస్తోంది మన మేధనే కదా! ఏఐ టూల్స్ను డెవలప్ చేయడంలో, టెస్టింగ్ లో మహిళల ప్రాతినిధ్యం అంతగా లేకపోతే ఏఐ డేటా (AI Data) అంతా పురుష పక్షపాతంగానే ఉంటుంది. ఏఐని ఏ వర్గం ఎంత ఎక్కువ ఉపయోగించుకుంటే ఆ వర్గానికి అనుకూలమైన డేటానే అది రీసెట్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే మోడల్స్ డెవలప్మెంట్లోనే కాదు దాన్ని ఉపయోగించే విషయంలోనూ అమ్మాయిల సముచిత భాగస్వామ్యం ఉండాలి. కాబట్టి అమ్మాయిలనూ డిజిటల్గా ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడే పక్షపాతం లేని, వహించని సమాచారం అందుతుంది. – పి. విప్లవి, లీడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్చదవండి: 3డీ ప్రింట్ ఎముకలు వచ్చేస్తున్నాయి.. -
గిరిజన భాషల కోసం ఏఐ సేవలు...
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో తొలిసారిగా గిరిజన భాషల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత అనువాద యాప్ను ప్రభుత్వం ఆవిష్కరించింది. ‘ఆది వాణి’పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ ద్వారా హిందీ, ఇంగ్లిష్ భాషలతో పాటు సంతాలి, భీళీ, ముండారి, గోండి వంటి గిరిజన భాషలను పరస్పరం అనువదించుకునే సౌకర్యం లభించనుంది. గిరిజన, గిరిజనేతర సమాజాల మధ్య భాషా అంతరాలను తగ్గించడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యం. ఐఐఐటీ హైదరాబాద్ కీలక పాత్ర... ఐఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ఢిల్లీ, బిట్స్ పిలానీ, ఐఐఐటీ నవ రాయపూర్ వంటి విద్యాసంస్థలు ఈ యాప్ను అభివృద్ధి చేశాయి. ఇందులో భాగంగా ఐఐఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం అనువాద వ్యవస్థలు, టెక్సŠట్–టు–స్పీచ్ టూల్స్ రూపొందించింది. గిరిజన భాషల నిపుణులు, స్థానికులతో కలిసి పనిచేయడం వల్ల సరిగ్గా అనువాదం సాధ్యమైందని ఆ సంస్థ ప్రొఫెసర్ రాధిక మామిడి తెలిపారు. ఇది కేవలం టెక్నాలజీ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఒక సామాజిక మిషన్’అని ఆమె వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ‘ఆది వాణి’యాప్ గూగుల్ ప్లేస్టోర్లో, ప్రత్యేక వెబ్సైట్లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ యాప్ ద్వారా మరిన్ని గిరిజన భాషలను జోడించాలన్నది బృందం ప్రణాళిక. ముఖ్యంగా కోయ, కొలామీ, చెంచు, లంబాడీ వంటి భాషలకు కూడా ఏఐ ఆధారిత టూల్స్ను అభివృద్ధి చేయాలని ఐఐఐటీ హైదరాబాద్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు.‘ఇథనాల్ బ్లెండింగ్’ కుటుంబ పథకమైంది కేంద్ర మంత్రి గడ్కరీపై కాంగ్రెస్ ఆరోపణలు న్యూఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దేశంలో పెట్రోల్ ఉత్పత్తుల్లో ఇథనాల్ను తప్పనిసరిగా కలిపే విధానాన్ని తన కుటుంబానికి మేలు చేసే లాభసాటి పథకంగా మార్చారని కాంగ్రెస్ ఆరోపించింది. పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే గడ్కరీ కుమారుల కంపెనీలు మాత్రం లాభాలు గడించాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖెడా ఆరోపించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మోదీజీ ఓటు చోరీతో వచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు పెట్రోల్ చోరీ, కల్తీలతో అధికారాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు.గడ్కరీ కొడుకు నిఖిల్ యాజమాన్యంలో ఉన్న సియాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ను ఆయన ఉదహరించారు. కంపెనీ ఆదాయం జూన్ 2024లో రూ.18 కోట్లు ఉండగా.. జూన్ 2025 నాటికి రూ.523 కోట్లకు పెరిగిందన్నారు. మరో కొడుకు సారంగ్ మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ డైరెక్టర్గా ఉన్నారని, ఆయనా ఇథనాల్ ఉత్పత్తిలోనూ పాలుపంచుకున్నారని ఆరోపించారు. ఇథనాల్–మిశ్రమ ఇంధనం గురించి 2018లో ఇచ్చిన హామీలేవీ కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందని బీజేపీ చెప్పినా.. తగ్గకపోగా ధరలు పెరిగాయన్నారు. ఏడేళ్లుగా ఇదే జరుగుతున్నా ఒక్క పైసా కూడా సామాన్యుడికి ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. -
కోవాసెంట్ నుంచి.. ఏఐ ఏజెంట్ కంట్రోల్ టవర్
కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా ఏఐ ఏజెంట్ కంట్రోల్ టవర్ (ఏఐ–యాక్ట్) పేరిట కొత్త టూల్ను ఆవిష్కరించింది. వివిధ ఏఐ ప్రోగ్రాంలను (లేదా ఏజెంట్లను) సమన్వయపర్చుకుంటూ, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు ఇది సహాయకరంగా ఉంటుంది.ప్రస్తుతం వివిధ కార్యకలాపాలకు వివిధ ఏఐ ఏజెంట్లను ఉపయోగిస్తుండటం వల్ల గందరగోళం, భద్రతాపరమైన రిస్కులు తలెత్తుతున్నాయని కోవాసెంట్ టెక్నాలజీస్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఏఐ ఏజెంట్లన్నింటికీ ఏఐ యాక్ట్ అనేది ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్లాగా పని చేస్తుందని ఆయన వివరించారు. -
ఏఐతో ఉద్యోగాలు పోతాయా?
కృత్రిమ మేధ(ఏఐ)తో గణనీయంగా ప్రయోజనాలు ఉంటాయని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా పెరుగుతాయని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. లేటెస్ట్ ఏఐ, చాట్జీపీటీ వెర్షన్లను ఉపయోగించాలని తన కార్యాలయంలోని సిబ్బందికి కూడా తాను సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని పరిశ్రమ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు.ఏఐలాంటి టెక్నాలజీలతో ఉద్యోగాలు పోతాయనే వారి గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. ఏఐని అనైతికంగా ఉపయోగిస్తే తలెత్తే సమస్యలను అరికట్టడానికి మానవ జోక్యం తప్పనిసరిగా అవసరమవుతుంది కాబట్టి, ఆ విధంగా ఉద్యోగాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు. కాబట్టి దీన్నొక గొప్ప అవకాశంగా పరిగణించి, అందిపుచ్చుకోవాలని ఆయన వివరించారు.ఏఐని అనైతికంగా ఉపయోగించడం వల్ల స్వల్పకాలికంగా కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ దీర్ఘకాలికంగా భారత్కి ఇది మేలే చేస్తుందన్నారు. డేటా, డాక్యుమెంట్ల భద్రత రీత్యా చాట్జీపీటీ, డీప్సీక్లాంటి టూల్స్ను ఆఫీస్ కంప్యూటర్లు, డివైజ్లలో డౌన్లోడ్ చేయొద్దని ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులకు ఆదేశించింది. అయితే, ఈ కొత్త టెక్నాలజీతో ఒనగూరే ప్రయోజనాలరీత్యా దీని వినియోగంపై ప్రభుత్వ విభాగాల్లో నిషేధమేమీ లేదంటూ మార్చిలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. కానీ భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఉపయోగించాల్సి ఉంటుందని వివరించారు.ఇదీ చదవండి: అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు -
ఏఐ ఇన్సూరెన్స్ టూల్స్ను ప్రారంభించిన హైదరాబాద్ కంపెనీ
బీమా రంగాన్ని ఆధునీకరించే దిశగా హైదరాబాద్కు చెందిన టెక్ సంస్థ ఫోరేసాఫ్ట్, అమెరికాకు చెందిన ఈఎస్ సెర్చ్ కన్సల్టెంట్స్తో చేతులు కలిపింది. బీమా కంపెనీలు, వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత ఆటోమేషన్ టూల్స్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఫోరేసాఫ్ట్ తెలిపింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో రిస్క్ తగ్గించడం, మోసాలను గుర్తించేందుకు ఈ ఏఐ టూల్స్ వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చూకూరుస్తాయని పేర్కొంది.ఆరోగ్య బీమా క్లెయిమ్ దాఖలు చేయడం నుంచి ప్రమాదాన్ని నివేదించడం లేదా కొత్తగా క్లెయిమ్ కవరేజీ కోసం దరఖాస్తు చేయడం వరకు వినియోగదారులు ఈ ఏఐ టూల్స్ ద్వారా బీమా సంస్థలతో చర్చించే అవకాశం ఉందని ఫోరేసాఫ్ట్ తెలిపింది. ప్రధానంగా కింది అంశాలపై మెరుగైన సర్వీసులు పొందవచ్చని చెప్పింది.వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్: ప్రమాదం జరిగిన వెంటనే ఏఐ సిస్టమ్లు ప్రారంభ క్లెయిమ్ అప్లికేషన్ను ఆటోమేట్ చేస్తాయి. మాన్యువల్ పేపర్ వర్క్ను తగ్గిస్తాయి. దాంతో వినియోగదారుల సమయం ఆదా అవుతుంది.స్మార్ట్ రిస్క్ అసెస్మెంట్: కృత్రిమ మేధ ఇంజిన్లు నిర్మాణాత్మక డేటా (వినియోగదారుల వైద్య చరిత్ర వంటివి)ను విశ్లేషించి ఆ సమాచారాన్ని మదింపు చేస్తాయి.ఫ్రాడ్ డిటెక్షన్: ఏఐ టూల్స్లోని ఇంటిగ్రేటెడ్ ఫ్రాడ్ డిటెక్షన్ మాడ్యూల్స్ అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే పర్యవేక్షిస్తాయి. నిజమైన పాలసీదారులను రక్షిస్తాయి.ఈ సందర్భంగా ఈఎస్ సెర్చ్ కన్సల్టెంట్స్ ప్రెసిడెంట్ మృదుల మునగాల మాట్లాడుతూ..‘ఈ ఏఐ టూల్స్ వల్ల మోసపూరిత క్లెయిమ్లను కట్టడి చేస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించవచ్చు’ అని చెప్పారు. ఫోరేసాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వాసు బాబు వజ్జా మాట్లాడుతూ..‘ఇన్సూరెన్స్ కంపెనీల పునరుద్ధరణకు తోడుగా తదుపరి తరం ఏఐ సర్వీసులు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ మరింత స్మార్ట్గా, వేగంగా, పారదర్శకంగా బీమాను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు.ఈ ఒప్పందంలో భాగంగా ఇరుకంపెనీలు ఇన్సూరెన్స్ ఏఐలో నిరంతర ఆర్ అండ్ డీకి మద్దతుగా హైదరాబాద్లో ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్, అమెరికా, మిడిల్ఈస్ట్లో పైలట్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని అధికారులు చెప్పారు. ఇందుకోసం ఇంజినీరింగ్, సర్వీస్ డెలివరీలో 100 మందికి పైగా నిపుణులను నియమించుకోవాలని ఫోరేసాఫ్ట్ యోచిస్తోంది.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే.. -
ఏఐ టెక్నాలజీ మోసానికి సాధనమవుతోంది: శిఖా గోయెల్
ఐఎస్ఏసీఏ హైదరాబాద్ ఛాప్టర్ 25 సంవత్సరాల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా గవర్నెన్స్, సైబర్సెక్యూరిటీ, ప్రైవసీ నిపుణులను ప్రోత్సహిస్తూ తమ 25వ వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించింది. ఈ సదస్సు థీమ్: "ట్రస్ట్ ఏఐసీఎస్ - 2025: ఏఐ ఇంటిగ్రేట్స్ గవర్నెన్స్, సైబర్సెక్యూరిటీ, అండ్ ప్రైవసీ" అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది''.ఈ సదస్సును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ జనరల్ ఐపీఎస్ శిఖా గోయెల్ ప్రారంభించారు. వారితో పాటు ఐఎస్ఏసీఏ హైదరాబాద్ బోర్డు సభ్యులు, ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సదస్సు కోసం 400 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇది చాప్టర్ చరిత్రలోనే అత్యధికం. 2024లో జరిగిన సదస్సు విజయం ఈసారి కూడా కొనసాగింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఐఎస్ఏసీఏ ఒక ముఖ్యమైన నిపుణుల సమూహంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.ఈ సమావేశం గురించి శిఖా మాట్లాడుతూ.. "ISACA హైదరాబాద్ 25 సంవత్సరాల వేడుకలకు నేను అభినందనలు తెలుపుతున్నాను. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ప్రతిరోజూ కొత్త సైబర్ నేరాలను నివేదిస్తూ మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మన జీవితాన్ని సులభతరం చేయడానికి ఉద్దేశించిన సాంకేతికత ఇప్పుడు మోసానికి ఒక సాధనంగా ఉపయోగించబడుతోంది. నేడు అన్ని ప్రధాన రంగాలలో ఏఐ విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఏఐ వ్యవస్థలను రక్షించడం మరియు జవాబుదారీతనం అనేది ఈ సమయంలో అత్యవసరం. ఏఐని సరిగ్గా, నైతికంగా ఉపయోగించాలనుకుంటే ISACA వంటి వృత్తిపరమైన సంస్థలు చాలా అవసరమని అన్నారు. -
అదిగో అలా వచ్చింది రూ.3.36 కోట్ల ఉద్యోగం..
మనకు ఏ అంశంపైన ఆసక్తి ఉందో.. ఏ పనినైతే మనం ఇష్టంగా చేయగలుగుతామో దాన్నే కెరియర్గా ఎంచుకుంటే ప్రతిఒక్కరూ తప్పకుండా విజయవంతం అవుతారు. దీనికి ఉదాహరణే ఈ 23 వేళ్ల ఇండియన్-అమెరికన్ కుర్రాడు మనోజ్ తుము. ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటాలో 4 లక్షల డాలర్ల (రూ.3.36 కోట్లు) జీతంతో ఉద్యోగం చేస్తున్న తాను.. ఈ జాబ్ను గతంలో అమెజాన్లో పనిచేస్తున్నప్పుడు ఎలా పొందిందీ వివరించాడు.. తనలాగే ముందుకెళ్లాలనుకుంటున్నవారికి సూచనలూ ఇచ్చాడు.బిజినెస్ ఇన్సైడర్ కోసం రాసిన వ్యాసంలో మనోజ్ తుము పోటీ నియామక ప్రక్రియను ఎలా ఎదుర్కొన్నాడో, తన కెరీర్ మార్గాన్ని తీర్చిదిద్దిన పాఠాల గురించి వివరించాడు. హైస్కూల్ క్రెడిట్స్ కారణంగా ఏడాదిలోనే అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మనోజ్ ఫుల్ టైమ్ పనిచేస్తూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాస్టర్స్ చేశారు. మరింత ఉత్తేజకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల కోసం మెటాకు మారడానికి ముందు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా 9 నెలల పాటు అమెజాన్లో పనిచేశారు.ఏఐలో ప్రవేశించాలంటే..మనోజ్ ప్రకారం.. మెషిన్ లెర్నింగ్ టైటిల్స్ మారుతూ ఉంటాయి. రిసెర్చ్ సైంటిస్ట్, అప్లైడ్ సైంటిస్ట్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తదితర పాత్రలు పోషించవచ్చు. క్లాసికల్ ఎంఎల్ నుంచి డీప్ లెర్నింగ్ కు మారడం ఈ రంగాన్ని మరింత డైనమిక్ గా, కాంపిటీటివ్ గా మార్చింది. కళాశాల ఇంటర్న్ షిప్ లు తక్కువ వేతనంతో కూడినవి అయినీ అనుభవం పొందడానికి, నిలదొక్కుకోవడానికి చాలా కీలకం.రెజ్యూమె & ఇంటర్వ్యూ చిట్కాలురెజ్యూమెలో మీరు చేసిన ప్రాజెక్టుల గురించి పేర్కొనడం ఉపయోగకరమే కానీ మీకు రియల్టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీ రెజ్యూమ్ పై ప్రాజెక్ట్లు ఆధిపత్యం చెలాయించకూడదని కొత్తగా జాబ్ మార్కెట్లోకి వస్తున్నవారికి సూచిస్తున్నారు మనోజ్. బిహేవియరల్ ఇంటర్వ్యూలు కీలకమని, కానీ చాలా మంది అభ్యర్థులు దీన్న విస్మరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక వేతనాల విషయానికి వస్తే సంబంధిత అనుభవాన్ని పెంచుకోవడానికి మనోజ్ ప్రారంభంలో సంప్రదాయ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ కంటే తక్కువ వేతనంతో కూడిన ఎంఎల్ ఉద్యోగాన్నే ఎంచుకున్నాడు. ఇది తరువాత అధిక వేతన అవకాశాలకు దారితీసింది. -
వైద్య రంగంలో కృత్రిమ మేధ విస్తరణ
టెక్నాలజీ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో సాంకేతికత పాగా వేస్తోంది. అందుకు చాలానే కారణాలున్నాయి. ఇండియాలో కొన్ని సర్వేల ప్రకారం 1,457 మంది రోగులకు ఒక డాక్టర్ ఉన్నారు. కానీ ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన డాక్టర్-రోగుల నిష్పత్తి 1:1,000 కంటే చాలా తక్కువ. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో లక్షల మందికి ప్రాథమిక వైద్య సదుపాయాలు కరవవుతున్నాయి. కాబట్టి ఈ రంగంలో సేవలు విస్తరించాలంటే సాంకేతికత కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం అత్యవసరం. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తోంది. దీని సాయంతో వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.ఉదాహరణకు.. ఒడిశాలోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఏఐ సాయంతో వైద్యం నిఫారసు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్ఫోన్ అప్లికేషన్లతో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు దగ్గు రికార్డింగ్లను విశ్లేషించడం ద్వారా క్షయ(టీబీ) కేసులను గుర్తించారు. అదే నేపథ్యంలో కొన్ని వేల మామోగ్రామ్లపై శిక్షణ పొందిన మరొక ఏఐ యాప్ రొమ్ము క్యాన్సర్ కేసులను గుర్తించడంలో సహాయపడింది. ఇది రిమోట్గా ఆంకాలజిస్టులతో మమేకమై రోగులకు సలహాలు ఇస్తోంది.వ్యాధిని గుర్తించడంలో కీలకండయాగ్నోస్టిక్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించింది. ఉదాహరణకు.. గూగుల్ డీప్ మైండ్ రొమ్ము క్యాన్సర్ను గుర్తించడంలో 99% కచ్చితత్వాన్ని చేరుకుందని కొన్ని రిపోర్ట్ల ద్వారా తెలుస్తుంది. కంటి వ్యాధులు, చర్మ క్యాన్సర్, అల్జీమర్స్ వంటి నాడీ పరిస్థితులను గుర్తించడానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. చెస్ట్ ఎక్స్-రే రిపోర్ట్ల నుంచి టీబీని నిర్ధారించడంలో ఏఐ సాధనాలు మెరుగ్గా పని చేస్తున్నాయి. వ్యాధిని వేగంగా గుర్తించడంతో ముందస్తు చికిత్స అందుతుంది. ఇది ట్రీట్మెంట్ ఫలితాలను మెరుగుపరచడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణ నిపుణులపై ఒత్తిడిని తగ్గిస్తుంది.రియల్ టైమ్ మానిటరింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల ద్వారా హైపర్-పర్సనలైజ్డ్ మెడిసిన్కు అవకాశం ఉంటుంది. ఇందులో ఉపయోగించే అల్గారిథమ్లు నిర్దిష్ట మందులకు ప్రత్యేకంగా రోగులు తమ వ్యక్తిగత జీవన విధానాన్ని అనుసరించి ఎలా స్పందిస్తారో అంచనా వేస్తాయి. ఇది ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. డయాబెటిక్ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ ఆధారిత వేరబుల్ పరికరాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను రియల్ టైమ్లో పర్యవేక్షిస్తున్నాయి. సంభావ్య సంక్షోభాల గురించి వైద్యులు లేదా సంరక్షకులను అప్రమత్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: నెట్వర్క్ విస్తరణలో అమెజాన్ -
మా ఐటీ ఉద్యోగులకు మాటిస్తున్నా..
ఐటీ పరిశ్రమలో ఏఐ పేరు చెబితేనే ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. కారణం ఎడాపెడా లేఆఫ్లు. ఒక కంపెనీ ఏఐపై దృష్టి పెట్టిందంటేనే ఇక ఆ సంస్థలో మానవ ఉద్యోగాలకు మూడినట్టేనన్న చర్చ సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్సీఎల్ ఉద్యోగులకు మంచి మాట చెప్పారు ఆ కంపెనీ చైర్ పర్సన్ రోష్ని నాడార్.ఇటీవల జరిగిన హెచ్సీఎల్టెక్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముడిపడి ఉన్న ఉద్యోగాల కోతలపై పెరుగుతున్న ఆందోళనలను ప్రస్తావించారు. తాము మానవ ప్రతిభను మరింత పెంచడానికే తప్ప దాన్ని భర్తీ చేయడం కోసం ఏఐని వినియోగించడం లేదని స్పష్టం చేశారు. ఆ రకంగా ఉద్యోగాల తొలగింపు కాకుండా వాటి సృష్టిపై కంపెనీ దృష్టి సారించిందని ఆమె వాటాదారులకు భరోసా ఇచ్చారు.బాధ్యతాయుతమైన వ్యూహానికి కట్టుబడి ఉన్నాంమానవ సామర్థ్యాలను పెంపొందించడానికి ఏఐని కో పైలట్ గా ప్రవేశపెడుతున్నామని, వాటి స్థానంలో కాదని ఆమె అన్నారు. ‘కొన్ని ఉద్యోగాల్లో మార్పులు ఉండొచ్చు కానీ, అధిక విలువ పనులను చేపట్టడానికి ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడంపైనే మా దృష్టి ఉంది. ఉద్యోగాల కోత కంటే వాటి పెరుగుదల, ఉద్యోగ పరివర్తనకు ప్రాధాన్యమిచ్చే బాధ్యతాయుతమైన ఏఐ స్వీకరణ వ్యూహానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని రోష్ని నాడార్ సపష్టం చేశారు.ఐటీ రంగంలో నియామకాలు మందకొడిగా సాగుతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో సిబ్బంది నికర చేర్పులు తక్కువగా ఉన్నాయి. ఇది నియామకంలో మరింత జాగ్రత్తగా విధానాన్ని సూచిస్తుంది. కొన్ని కంపెనీలు స్వల్ప లాభాలను నమోదు చేయగా, మొత్తం ట్రెండ్ ప్రకారం నియామకాలు చల్లబడ్డాయి.జూన్ తో ముగిసిన త్రైమాసికంలో హెచ్సీఎల్ టెక్ 1,984 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. గత త్రైమాసికంలో 2,23,420గా ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆ త్రైమాసికంలో 2,23,151కి తగ్గింది. మార్చిలో 13 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు జూనలో 12.8 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: విప్రో చేతికి హర్మన్ డీటీఎస్.. రూ. 3,270 కోట్ల డీల్ -
మానవ మేధస్సు ముందు ఏఐ ఎంత?
ఏఐ సాధనాలు మరింత అధునాతనంగా మారినప్పటికీ, కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తే మానవ మేధస్సును ఏదీ భర్తీ చేయలేదని నిపుణులు భావిస్తున్నారు. అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్ అధ్యయనం ప్రకారం కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో భారతదేశంలో 83% మంది నిపుణులు, హైదరాబాద్లోని 88% మంది నిపుణులు ఏఐపై ఆధారపడడం కంటే మానవ మేధస్సుకు ఓటేస్తున్నారు.లింక్డ్ఇన్ అధ్యయనంలోని అంశాలు..హైదరాబాద్లో 79% మంది ఉద్యోగ విధుల్లో భాగంగా ఏఐని వాడుతున్నట్లు చెబుతున్న సమయంలో కీలక నిర్ణయాల విషయంలో మాత్రం ఏఐ సాయం తీసుకోకపోవడం గమనార్హం.75% మంది తమ కెరియర్లో ఎదిగేందుకు ఏఐలో ప్రావీణ్యం సంపాదించడం అవసరమని భావిస్తున్నారు.ఏఐలో నైపుణ్యం సాధించడం రెండో ఉద్యోగంలా అనిపిస్తుందని హైదరాబాద్లోని నలుగురు నిపుణుల్లో ముగ్గురు అంగీకరిస్తున్నారు.59% మంది ఏఐని పూర్తి సామర్థ్యంతో ఉపయోగించడం లేదని చెబుతున్నారు.75% మంది నిపుణులు ఏఐ తమ రోజువారీ పని జీవితాన్ని మెరుగుపరుచగలదని నమ్ముతున్నారు.78% మంది నిపుణులు ఏఐని నిజమైన నిర్ణయం తీసుకోవడానికి కాకుండా రాయడం, డ్రాఫ్టింగ్కు ఉపయోగకరంగా భావిస్తున్నారు.70% మంది ఉద్యోగ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏఐ కంటే కూడా తమ సొంత నిర్ణయాలనే నమ్ముతున్నారు.భారతదేశంలో 83% మంది కార్యనిర్వాహకులు మంచి వ్యాపార నిర్ణయాలు మానవ మేధస్సుపైనే ఆధారపడి ఉంటాయని నమ్ముతున్నారు.లింక్డ్ఇన్ కెరియర్ నిపుణులు, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరజిత బెనర్జీ మాట్లాడుతూ ‘ఏఐ ఒక అద్భుతమైన సాధనం. ఇది వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతోంది. రోజువారీ పనులను క్రమబద్ధీకరించగలదు. అయితే కీలక విషయాల్లో నిర్ణయం తీసుకునేప్పుడు చాలామంది ఏఐపై ఆధారపడడం లేదు. ఏఐని తాము విశ్వసించే సాధనంగానే కానీ, అనుసరించే సాధనంగా భావించడంలేదు. మానవులు మాత్రమే చేసే పని కోసం సమయాన్ని ఆదా చేసేందుకు ఏఐని ఉపయోగించాలి’ అని చెప్పారు.ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు? -
దేశంలో తొలి ఏఐ స్కిన్ కేర్ వెండింగ్ మిషన్ ఆవిష్కరణ!
‘స్కిన్ టెక్ ఏఐ–2025’ భారత బ్యూటీ ఇండస్ట్రీకి సరికొత్త నాందిగా నిలుస్తుందని మిస్ ఇండియా ఎర్త్ డాక్టర్ తేజస్విని మనోజ్ఞ పేర్కొన్నారు. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ హబ్ వేదికగా దేశంలో తొలిసారిగా వార్షిక స్కిన్ కేర్ అండ్ బ్యూటీ ఏఐ/టెక్ సదస్సు–స్కిన్ టెక్ ఏఐ–2025 పేరిట నిర్వహించారు. సదస్సు థీమ్ అనేది స్కిన్ కేర్ రంగంలో భవిష్యత్తుకు మలుపుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది నూతన ఆవిష్కరణ, డేటా, వినియోగదారుల ఆధారంగా భవిష్యత్తును నిర్మిస్తుందన్నారు. ఈ తొలి కార్యక్రమంలో హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం, తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్కిన్ కేర్, బ్యూటీ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులపై చర్చించారు. అనంతరం దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఏఐ స్కిన్ స్కేర్ వెండింగ్ మిషన్ ఆవిష్కరించారు. ఎంపీఎఫ్ సీఈఓ సుశిల్ కుమార్, స్కిన్ కేర్ రంగంలో ప్రముఖులు నిజామ్ మహ్మద్, స్టార్టప్ల మెంటర్ డాక్టర్ లక్ష్మీ దివ్య, రామ్ చింతలపూడి, శశిమూర్తి పాల్గొన్నారు. (చదవండి: అబ్బురం అపురూపం..! అరుదైన గణపతి ప్రతిమలు..ఏకంగా 39 దేశాలు) -
మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రోహార్డ్?: ఎలాన్ మస్క్ ప్లాన్ ఇదేనా..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పుడూ.. కొత్త విషయాల మీద ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ పేరు మాదిరిగా అనిపించే 'మాక్రోహార్డ్' (Macrohard) పేరును తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎక్స్ఏఐ(xAI)లో చేరి.. మాక్రోహార్డ్ అనే పూర్తిగా ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీని నిర్మించడంలో సహాయం చేయండి. ఇది సాధారణ పేరు, కానీ ఈ ప్రాజెక్ట్ వాస్తవమైనది. మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు స్వయంగా ఎటువంటి ఫిజికల్ హార్డ్వేర్ను తయారు చేయలేదు. కానీ వాటిని పూర్తిగా ఏఐతో సృష్టించడం సాధ్యమవుతుంది'' అని మస్క్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఆగస్టు 1న యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ కార్యాలయంలో 'మాక్రోహార్డ్' పేటెంట్ కోసం మస్క్ xAI దాఖలు చేసింది. ఇది పూర్తిగా ఏఐ ద్వారానే పనిచేస్తుంది. ఇందులో కృత్రిమ మేధస్సును ఉపయోగించి వీడియో గేమ్లను రూపొందించడం, కోడింగ్, రన్నింగ్, గేమ్స్ కోసం డౌన్లోడ్ చేయగల కంప్యూటర్ సాఫ్ట్వేర్ మొదలైనవి ఉన్నాయి.గత నెలలో Xలో ఒక పోస్ట్లో.. ''xAI లేటెస్ట్ AI సాఫ్ట్వేర్ కంపెనీ, వందలాది ప్రత్యేక కోడింగ్ మరియు ఇమేజ్ / వీడియో జనరేషన్ /అండర్స్టాండింగ్ ఏజెంట్లు అన్నీ కలిసి పనిచేస్తాయి. ఫలితం అద్భుతంగా వచ్చే వరకు వర్చువల్ మెషీన్లలో సాఫ్ట్వేర్తో పరస్పర చర్య చేసే మానవులను అనుకరిస్తాయి" అని మస్క్ అన్నారుఇదీ చదవండి: కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్గత కొన్ని సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ సంస్థను మస్క్ సందర్భం వచ్చినప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్ఏఐ తాజాగా విడుదల చేసిన చాట్జీపీటీ-5 మోడల్ ఎంతో సమర్థంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను నాశనం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రోహార్డ్ తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది.Join @xAI and help build a purely AI software company called Macrohard. It’s a tongue-in-cheek name, but the project is very real!In principle, given that software companies like Microsoft do not themselves manufacture any physical hardware, it should be possible to simulate…— Elon Musk (@elonmusk) August 22, 2025 -
చేతిరాతకు ‘ఏఐ’ పవర్.. హైదరాబాద్ కంపెనీ సృష్టి
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, పుస్తకాలన్నీ డిజిటలైజ్ అయిపోతున్నా ఇప్పటికీ చాలా మంది పెన్నూ పేపర్ ఉపయోగించి చేత్తో రాయడాన్ని ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే కాగితాన్ని డిజిటల్తో కలిపే ఏఐ స్మార్ట్ నోట్బుక్ను అందుబాటులోకి తీసుకువచ్చింది హైదరాబాద్కు చెందిన స్టార్టప్.టెకీ నుంచి ఎంట్రప్రెన్యూర్గా మారిన సుమన్ బాలబొమ్మ అభివృద్ధి చేసిన రీనోట్ ఏఐ నోట్బుక్ (ReNote AI Notebook) దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత నోట్బుక్గా గుర్తింపు పొందింది. ఇది సాధారణ కాగితపై రాయడం అనుభూతిని అందిస్తూ, ఆ చేతిరాతను డిజిటల్ టెక్స్ట్గా మార్చే ప్రత్యేకమైన సాంకేతికతను కలిగి ఉంది.ఎన్నో ఫీచర్లుఈ నోట్బుక్లో నీటికి తడిసిపోని, చిరిగిపోని, రీ యూజబుల్ పేజీలు ఉంటాయి. పైలట్ ఫ్రిక్సియాన్ (Pilot Frixion) పెన్నుతో వీటిన రాసిన నోట్స్ను తుడిచేయవచ్చు. రీనోట్ ఏఐ మొబైల్ యాప్ ద్వారా చేతిరాతను డిజిటల్ టెక్స్ట్గా మార్చడం, సారాంశాలు తయారు చేయడం, తెలుగు సహా అనేక భాషల్లో అనువాదం, వాయిస్ ఆధారిత శోధన, చిత్రంగా మార్చే స్కెచ్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వ టీ-హబ్ ప్రోత్సాహంతో ఏర్పాటైన ఈ స్టార్టప్ జీఐటెక్స్ దుబాయ్, ఒసాకా వరల్డ్ ఎక్స్పో, గిఫ్ట్స్ వరల్డ్ ఎక్స్పో న్యూఢిల్లీ వంటి అంతర్జాతీయ ప్రదర్శనల్లో తమ రీనోట్ ఏఐ నోట్బుక్ను ప్రదర్శించింది. మైటీ, గూగుల్ వంటి సంస్థలు ఈ యాప్ను భారతదేశం లోని టాప్ 100 మొబైల్ యాప్స్ లో ఒకటిగా గుర్తించాయి.వ్యక్తిగత అనుభవాల నుంచి ప్రేరణతో ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన సుమన్ బాలబొమ్మ.. "చేతిరాతలో ఉన్న ఫోకస్, జ్ఞాపక శక్తిని కోల్పోకుండా, డిజిటల్ సౌలభ్యాన్ని కలిపే ప్రయత్నమే రీనోట్" అని చెబుతున్నారు. ఇలాంటి ఏఐ నోట్బుక్ను ‘ఎక్స్నోట్’ (XNote) అనే అమెరికా సంస్థ కూడా రూపొందించింది. -
ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!
ఏఐ(కృత్రిమ మేధ) గాడ్ఫాదర్గా పేరొందిన జెఫ్రీ హింటన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల టెక్ పరిశ్రమ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు చేశారు. నైతిక దూరదృష్టి లేకపోవడం, నియంత్రణలేని కృత్రిమ మేధ అభివృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. హింటన్ ఇటీవల ఫార్చ్యూన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీల సాంకేతిక ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో దీర్ఘకాలిక శ్రేయస్సు మసకబారుతుందని చెప్పారు.స్వల్పకాలిక లాభాలే కీలకంసాంకేతిక పరిజ్ఞానానికి శక్తినిచ్చే ఏఐ అల్గారిథమ్లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన హింటన్, ప్రస్తుతం టెక్ కంపెనీలు మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను నిర్మించడానికి పోటీ పడుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో భవిష్యత్తులో నెలకొనే విస్తృత ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నైతికంగా ఏఐ అభివృద్ధి పట్ల నిబద్ధత కంటే ప్రధానంగా పోటీ ఒత్తిళ్లు, స్వల్పకాలిక లాభాలే కీలకం అవుతున్నట్లు చెప్పారు.మానవ విలువలకు అనుగుణంగా ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ వ్యవస్థలను మోహరిస్తే వినాశకరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏఐ వల్ల తప్పుడు సమాచారం, ఉద్యోగాలు కోల్పోవడం, గోప్యతా ఉల్లంఘనలు.. వంటి ప్రమాదాల కన్నా మానవులను డామినేట్ చేసే వ్యవస్థల వల్ల మరింత నష్టం కలుగుతుందన్నారు.నైతిక ఫ్రేమ్వర్క్..కృత్రిమ మేధ అభివృద్ధిలో బలమైన నైతిక చట్రం(మోరల్ ఫ్రేమ్వర్క్) లేదని హింటన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలను పెంచడానికి, వినియోగదారుల డేటాను మానిటైజ్ చేయడానికి బిలియన్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నప్పటికీ కొన్ని కంపెనీలు మాత్రం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) అస్తిత్వ ప్రమాదాలపై దృష్టి పెడుతున్నాయని పేర్కొన్నారు. ఏదేమైనా కృత్రిమ మేధ అభివృద్ధికి నైతిక ప్రమాణాలు చాలా అవసరం అని చెప్పారు. నిర్దిష్ట ఫ్రేమ్వర్క్లను తయారు చేయడానికి ప్రపంచ సహకారం కావాలని పిలుపునిచ్చారు. వ్యవస్థల మధ్య ఒప్పందాలు, పర్యవేక్షణ, నైతిక ప్రమాణాలు అవసరమన్నారు. ఏఐ పరిశోధకులు, భద్రత, పారదర్శకత, దీర్ఘకాలిక ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.ఇదీ చదవండి: బైక్ ట్యాక్సీ సేవలు పునరుద్ధరణ -
చరిత్ర చెప్పకుండా.. పరువు కాపాడుతూ...
అప్పుడూ.. ఇప్పుడూ.. మనమంతా నెట్టింట్లో ముందు తట్టే తలుపు గూగుల్దే. అంతలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరికొన్ని ఫీచర్లను పరిచయం చేసింది.ఆ మెసేజెస్ ‘బ్లర్’!వాట్సాప్లో లేని సేఫ్టీ ఫీచర్ గూగుల్ మెసేజుల్లో ఒకటుంది. తరచూ వాట్సాప్ లేదా మరేదైనా మెసేజింగ్ యాప్లలో తెలియని నంబర్ నుంచి మెసేజులు, ఫొటోలు, వీడియోలు వస్తుంటాయ్. వాటిలో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉండొచ్చు. అనుకోకుండా వాటిని ఓపెన్ చేసి షాక్ అవుతాం. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే.. పరువు పోయినట్టే! అలాంటి ఇబ్బందులు రాకుండా.. అద్భుతమైన ఫీచర్ను ‘గూగుల్ మెసేజెస్’ తీసుకొచ్చింది. అదే ఆటోమేటిక్ ‘బ్లర్’ ఫీచర్. ఇది ‘న్యూడ్’ మెసేజ్లను ఓపెన్ చేస్తే ఆటోమేటిగ్గా బ్లర్ చేస్తుంది. సెండర్ని కూడా వెంటనే బ్లాక్ చేస్తుంది. కావాలంటే.. అశ్లీల చిత్రాలు కనిపించకుండా చేసి, సంభాషణ కొనసాగించొచ్చు. అంతేకాదు.. మీరు పొరపాటున అశ్లీలమైన కంటెంట్ను పంపితే అలర్ట్ చేస్తుంది. ఇంట్లో పిల్లలు కూడా ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. మైనర్లు వాడే ఫోన్లలో ఇది ఆన్ చేసి ఉంటుంది. అయితే, వాళ్లు దాన్ని ఆఫ్ చేసేందుకు వీలుంది. అందుకే పేరెంటల్ కంట్రోల్స్ పెట్టాలి. అప్పుడు తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా దాన్ని ఆఫ్ చేయడం కుదరదు. అందుకు ఫ్యామిలీ లింక్ యాప్ ని వాడొచ్చు. దీన్ని మీ ఫోన్లో ఎనేబుల్ చేసేందుకు గూగుల్ మెసేజెస్ యాప్ ని ఓపెన్ చేయండి. ఈ పాత్ ని ఫాలో అవ్వండి. Messages Settings > Protection & Safety > Manage sensitive content warnings > Warnings in Google Messages.‘జెమినై’లో ప్రైవసీ అప్డేట్ఏఐ పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో చాట్జీపీటీ కంటే ముందే గూగుల్ జెమినై (Google Gemini).. ఇన్ కాగ్నిటో మోడ్ పరిచయం చేసింది. ఏఐ యూజర్ల ప్రైవసీకి ఇదో చక్కని పరిష్కారం. ఇకపై జెమినితో చేసే చాటింగ్, వ్యక్తిగత సమాచారం ఎవరి కంటా పడవు. ఎందుకంటే.. గూగుల్ కొత్త ’టెంపరరీ చాట్స్’ ఫీచర్తో ముందుకొచ్చింది. ఇది మనం బ్రౌజింగ్లో వాడే ఇన్ కాగ్నిటో మోడ్లా పని చేస్తుంది. దీన్ని వాడుకుని జెమినితో మనం చేసే సంభాషణలు సేవ్ కాకుండా చూడొచ్చు. మీ కమాండ్ ప్రాంప్ట్స్ని ఇకపై ఎవరూ కాపీ కొట్టలేరు. ఏఐ వాడకంలో ప్రైవసీని కోరుకునే వారికి ఇదో చక్కని ఫీచర్. ఇంకా చెప్పాలంటే.. ‘గూగుల్ కీప్’ సర్వీసులో ఫొటోలు,వీడియోలను జెమిని మీ అనుమతితోనే యాక్సెస్ చేసేలా చేయొచ్చు. ఒకవేళ ‘కీప్’ డేటా యాక్సెస్ ఇవ్వాలంటే ఎప్పుడైనా ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే, జెమినై లైవ్ సర్వీసులోనూ ప్రైవసీని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఈ సర్వీసుని వాడే క్రమంలో మీ ప్రమేయం లేకుండా చూపించే ఆడియో, వీడియో సేకరించకుండా చేయొచ్చు.టూర్ ప్లాన్ చెప్తే చాలు..ఏ పని చేయాలన్నా ప్లానింగ్ అవసరం. పర్యటనల విషయంలో మరీనూ. ఈ విమాన ప్రయాణం కోసం సరైన ఫ్లైట్లు వెతకడం పెద్ద తలనొప్పి. ఏ వెబ్సైట్లో వెతకాలి? ఏ యాప్లో చూస్తే తక్కువ ధరకి టికెట్టు బుక్ చేసుకోవచ్చు? ఏమేం బెటర్ ఆఫర్లు ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలతోనే గూగుల్ సెర్చ్ హిస్టరీ మొత్తం నిండిపోతుంది. ఇకపై అంత కష్టపడక్కర్లేదు. ఇందుకోసం గూగుల్ ఒక సూపర్ టూల్తో ముందుకొచ్చింది. అదే "Google Flights' లోని కొత్త ఏఐ టూల్. ఇది మనతో మాట్లాడుతుంది.మీరు చేయాల్సిందల్లా ట్రిప్ గురించి ఏఐకి చెప్పాలంతే. ‘పదిరోజులు కేరళ ట్రిప్కి వెళ్లాలి. మంచి రిసార్టులో ఉండాలి. కాస్త బడ్జెట్లో ట్రిప్ని ప్లాన్ చేయమని అడిగితే చాలు. టూల్ అన్ని ఎయిర్లైన్స్నీ వెతుకుతుంది. బుకింగ్ వెబ్సైట్లలోని డేటాని క్షణాల్లో జల్లెడ పడుతుంది. అలాగే, ఉండేందుకు తగిన హోటళ్లను కూడా సూచిస్తుంది. బడ్జెట్ ప్లానింగ్కి తగిన బెస్ట్ డీల్స్ చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇది బీటా వెర్షన్గా అందుబాటులో ఉంది. గూగుల్ ఫ్లైట్స్ వెబ్సైట్ www.google.com/travel/flights లేదా యాప్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. -
డాక్టర్ ఏఐ.. మీ హెల్త్ కోచ్..!
మీరు స్మార్ట్ వాచ్ లేదా స్మార్ట్ రింగ్ వంటి వేరబుల్స్ పెట్టుకుంటే.. ప్రతిరోజూ మీ వాచ్లో లేదా స్మార్ట్ ఫోన్లో ఓ లిస్ట్ కనిపిస్తుంది. ఎన్ని స్టెప్స్ నడిచారు? ఎంత సమయం నిద్రపోయారు? హార్ట్ రేట్ ఎలా ఉంది? స్లీప్ స్కోర్ ఎంత?.. ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఇవన్నీ చూడడానికి కేవలం నంబర్లు. మనం నిత్యం అవి చెక్ చేసుకుంటూ లైఫ్ స్టైల్లో చేయాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తాం. అప్పుడప్పుడు అనేక సందేహాలు కూడా వస్తుంటాయి. ఆ ట్రాకింగ్ డేటాలో నిజానిజాలేంటి? ఆ గణాంకాల గుట్టు ఎంత వరకూ శాస్త్రీయం అని మనమే గూగుల్ తల్లిని అడుగుతుంటాం. ఇకపై, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. అన్నీ ‘ఏఐ’ చూసుకుంటుంది. స్మార్ట్ వాచ్లు, రింగ్లు, ఇతర వేరబుల్ ట్రాకర్లు సేకరించిన డేటాని విశ్లేషిస్తుంది. లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చెబుతుంది. అంటే జిమ్లో ఫిట్నెస్ కోచ్లా, ఇంట్లో ఫ్యామిలీ డాక్టర్లా అన్నమాట! –సాక్షి, స్పెషల్ డెస్క్దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఇప్పుడు ‘ఏఐ’ అప్డేట్స్పైనే వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ గూటి నుంచి వచ్చిన జెమినై కూడా నిత్య నూతనంగా అప్డేట్ అవుతోంది. ఇప్పుడు కొత్తగా ఓ ఏఐ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంది. అదే ’పర్సనల్ హెల్త్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’ (పీహెచ్ఎల్ఎల్ఎమ్). ఇదో హెల్త్ కోచ్ మాదిరిగా పని చేస్తుంది. అంటే.. మనం వాడే యాపిల్ వాచ్, ఫిట్ బిట్ వంటి ఫిట్నెస్ ట్రాకర్ల నుంచి వచ్చే డేటాని తీసుకుంటుంది. విశ్లేషిస్తుంది. తగిన సలహాలు ఇస్తుంది. ఉదాహరణకి.. మీ నిద్ర క్వాలిటీ తగ్గిందా? వెంటనే అలర్ట్ అవుతుంది. తన నిఘా వ్యవస్థని అడుగుతుంది. మీరెంత సమయం సిస్టమ్పై వర్క్ చేస్తున్నారు, టైమ్కి తింటున్నారా లేదా.. ఇలా అన్నింటినీ ట్రాకర్స్ నుంచి తీసుకుని ‘స్క్రీన్ టైమ్ తగ్గించాలి.. డైట్లో ఇలాంటి మార్పులు చేయాలి.. రాత్రి పడుకునే ముందు లైట్ ఫుడ్ తీసుకోవాలి‘ వంటి పలు సూచనలు చేస్తుంది. సో.. మన హెల్త్ ట్రాకర్లు.. కేవలం డేటా మెషీన్లు కాదు, పర్సనల్ హెల్త్ కోచ్లుగా కూడా సరికొత్త అవతారం ఎత్తనున్నాయన్నమాట.850 కేసులను పరిశీలించి..దేన్నయినా వెంటనే నిజం అని ఎలా నమ్ముతాం? శాస్త్రీయంగా ఓ నిర్ధారణకి రావాలి. అందుకే గూగుల్ కూడా ఈ ఏఐ లాంగ్వేజ్ మోడల్పై ప్రయోగాత్మకంగా పరిశీలన చేసింది. ‘నేచర్’ మెడిసిన్ జర్నల్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. పలు ఫిట్నెస్ ట్రాకర్ల నుంచి సేకరించిన 850 కేసులను గూగుల్ సేకరించింది.రియల్ టైమ్లో తీసుకున్న మొత్తం డేటాని ఏఐతో కంపైల్ చేస్తే.. 79% నిద్రకి సంబంధించిన ప్రశ్నలకు.. 88% ఫిట్నెస్ డేటాపై సరైన సమాధానాలు ఇచ్చిందట.హార్ట్ బీట్ డేటాపై సగటున 76% సరైన విశ్లేషణ చేసిందని గూగుల్ పరిశోధకులు ప్రకటించారు.ఎంత వరకు సురక్షితం?‘ఆహా!! ఏఐ ఓ అద్భుతమే’ అని మనం ప్రశంసించినా.. కచ్చితంగా దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే దీనికి కూడా పరిధిని నిర్దేశించుకోవాలని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ఏఐ హెల్త్ కోచ్లు చెప్పేవి కేవలం సూచనలుగానే పరిగణించాలి. దాన్నే వైద్యుడిగా భావించకూడదు’ అంటున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ఏఐ తప్పు అంచనాలు వేయొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పిల్లల కోసం వాడుతున్నట్లయితే కచ్చితంగా పేరెంటల్ కంట్రోల్స్ తప్పనిసరి. ఎప్పటికప్పుడు ప్రైవసీ సెట్టింగ్స్ను తప్పనిసరిగా చెక్ చేయాలి.» ఎంత స్మార్ట్ అవుతున్నాయో అంతే సున్నితమైన డేటాను కూడా వేరబుల్స్ రికార్డ్ చేస్తున్నాయి.» హార్ట్ రేట్, స్లీప్ ప్యాటర్న్స్, మానసిక స్థితికి సంబంధించిన సమాచారం లీక్ అయితే.. చాలా పెద్ద సమస్యే. » సైబర్ సెక్యూరిటీ కట్టుదిట్టంగా లేకపోతే.. హెల్త్ డేటా వ్యాపార వస్తువైపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. » ‘పటిష్టమైన డేటా ప్రైవసీ రక్షణ, వాడేవారిలో డిజిటల్ అక్షరాస్యత.. రెండూ తోడైతే హెల్త్ ట్రాకర్స్, ఏఐ మనిషి లైఫ్కి చక్కని రక్షణ కవచాలుగా మారతాయి. కచ్చితంగా ఆరోగ్య రంగంలో విప్లవమే అవుతుంద’ని టెక్ నిపుణులు చెబుతున్నారు. » యాపిల్ సంస్థ కూడా ఈ తరహా ఏఐ ఫీచర్స్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఐఓఎస్ 18లో ఆరోగ్య సంబంధిత టూల్స్, ఏఐ ఆధారిత న్యూట్రిషన్ ట్రాకింగ్ను అందించేందుకు ప్రయోగాలు చేస్తోంది.మన గత చరిత్రనూ తవ్వి..ఏఐ అందించిన ఈ ఫలితాల ఆధారంగా చూస్తే.. ఇది హెల్త్ ఎక్స్పర్ట్లు ఇచ్చిన సమాధానాలతో దాదాపు సమానమే. అంతేకాదు.. గూగుల్ పరిశోధకులు చెబుతున్న ప్రకారం.. పీహెచ్ఎల్ఎల్ఎమ్ వినియోగదారుల హెల్త్ రికార్డ్స్పై మరింత లోతైన విశ్లేషణ చేస్తుందట. రియల్ టైమ్ డేటానే కాకుండా ట్రాకర్ల నుంచి యూజర్ల హిస్టరీని కూడా ఏఐతో కంపైల్ చేస్తున్నారు గూగుల్ పరిశోధకులు. దీంతో మరింత నమ్మకమైన సూచనలు చేసేందుకు వీలవుతుందట. వినియోగదారులకు ఓ ఫ్యామిలీ డాక్టర్ లా సేవలు అందించేలా సిద్ధం చేస్తున్నామని ఏఐ రూపకర్తలు చెబుతున్నారు. -
ఐస్క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!
వివిధ వ్యాధులకు మూలమైన అధిక బరువు ప్రస్తుతం అందర్నీ వేధించే పెనుసమస్యగా మారింది. బరువు తగ్గడం అనేది ఓ సవాలు. మాటల్లో చెప్పినంత సులవు కాదు తగ్గడం. స్ట్రాంగ్మైండ్ అచంచలమైన అంకితభావం ఉన్నవాళ్లే బరువు తగ్గడంలో విజయవంతమవ్వగలురు. అందుకోసం ఫిట్నెస్ నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులు సలహాలు సూచనలతో ప్రారంభించడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఏఐ సాంకేతికతను స్మార్ట్గా ఉపయోగించుకుంటూ ఆశ్చర్యపరిచేలా స్లిమ్గా అవుతున్నారు. సాంకేతికతను వాడోకవడం వస్తే..బరువు అనేది భారం కాదని ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడొక ఆరోగ్య నిపుణురాలు ఏఐ సాంకేతికను ఉపయోగించుకుంటూ.. తన కిష్టమైన ఐస్క్రింని త్యాగం చేయకుండానే బరువు తగ్గి చూపించింది. అది కూడా హాయిగా ఐస్క్రీంలు లాగించేస్తూనే ఎన్నికిలోలు తగ్గిందో వింటే నోరెళ్లబెడతారు.వెయిట్లాస్ జర్నీలో ఆహారాలు, వ్యాయామ షెడ్యూల్, జీవనశైలి తదితరాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ఈ మహిళ ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కృత్రిమ మేధ సాయాన్నితీసుకుంది. ఇది మనిషి సందేహాలను సత్వరమే నివృత్తిచేసి..గైడ్ చేయగలదని చాలామంది ప్రగాఢంగా నమ్ముతుండటం విశేషం. ఆ నేఫధ్యంలోనే ప్రముఖ ఆరోగ్యనిపుణురాలు సిమ్రాన్ వలేచా కూడా ఏఐ ఆధారిత చాట్జీపీటి సాయంతో తీసుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. డిసెంబర్ 2024లో ఈ చాట్జీపీటీ(ChatGPT) సాయం తీసుకుని వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించారామె. అయితే ఆమె తనకెంతో ఇష్టమైన ఐస్క్రీని అస్సలు త్యాగం చేయకుండా బరువు తగ్గానంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అంతేగాదు వెయిట్లాస్ కోసం చాట్జీపీటీతో మాట్లాడి ధైర్యంగా ముందడుగు వేయొచ్చని ధీమాగా చెప్పేస్తున్నారామె. ఇన్స్టా పోస్ట్లో సిమ్రాన్ ఇలా రాశారు. "ఐస్క్రీం తింటూనే పది కిలోలు తగ్గాను. అలాగే బరువు తగ్గాలనుకుంటే స్వంతంగా డైట్ని ఎంచుకోండి. అందుకోసం చాట్జీపీటీని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి". అంటూ సవివరంగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది.చాట్జీపీటీలో ఎలా అడగాలంటే..చాట్జీపీటీలో సిమ్రాన్ తన ఎత్తు, బరువు వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనకుంటున్నా..అందుకోసం తీసుకోవాల్సిన ఆహారాలు, చిరుతిండ్లు వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్లు పేర్కొంది. అలాగే తన పనిగంటలు, ఖాళీ సమయం వంటి వివరాలు కూడా ఏఐకి ఇచ్చినట్లు తెలిపింది. ఎన్నిగంటలు వ్యాయమానికి కేటాయించగలను అనేది కూడా ఇచ్చినట్లు తెలిపింది. అల్పాహారం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలో సవివరంగా తెలుసుకుని బరువు తగ్గానని పోస్ట్లో రాసుకొచ్చింది సిమ్రాన్. గమనిక: ఇక్కడ సాంకేతికత అనేది జస్ట్ ఆరోగ్యంపైన అవగాహన కల్పించగలదని, అదే కచ్చితమని భావించరాదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అది మనలను ఆరోగ్యంపై ఒక అవగాహన కల్పించే అప్లికేషన్ అని గుర్తించగలరు. వ్యక్తిగతంగా అనుసరించాలనుకుంటే వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Simran - Health, Wellness & Weight Loss Expert (@simvalecha) (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్నెస్లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
కృత్రిమ మేధస్సుతో వినూత్నంగా కథలు, వార్తలు..!
నగరంలో ట్రెండ్స్ వేగంగా మారిపోతున్నాయి. ప్రజల జీవనశైలితో పాటు ఆలోచనా విధానం, సమాచారాన్ని స్వీకరించే పద్ధతుల్లో సైతం కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. రీల్స్ మాదిరిగా వార్తలు కూడా వినోదంగా మారుతున్నాయి. తాజా ఉదాహరణగా కొన్ని వినూత్న తెలుగు వెబ్ అప్లికేషన్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇది సాధారణ న్యూస్ పోర్టల్లా కాకుండా పూర్తిగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత తెలుగు వెబ్సైట్, వార్తలను కథలుగా మార్చే విశేష వేదికలుగా నిలుస్తున్నాయి. సాధారణంగా వార్తలు మనకు పాఠ్యరూపంలో, ఫొటోలు లేదా వీడియోలతో వస్తాయి. కానీ ఈ కొత్త అప్లికేషన్లో రీల్స్ (వీటినే కొందరు ట్రీల్స్ అని అంటున్నారు) రూపంలో అందుతాయి. నిజమైన సంఘటనలు, నిజంగా ఆ బాధను అనుభవించినవారి స్వరంలోనే, చిన్న భావోద్వేగ కథలుగా అందిస్తున్నారు. ఇవి ఒకవైపు సినిమా ట్రైలర్స్ని తలపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ ప్లాట్ఫారమ్, సోషల్ మీడియా స్క్రోల్ అనుభూతినీ అందిస్తున్నాయి. భావాలను పంచేలా.. ఒక రీల్లో ఒక ప్రభుత్వ అధికారి తానే కథానాయకుడవుతాడు. ఎప్పుడో అనుమతి లభించిన ప్రాజెక్ట్ కాగితం మీదే మిగిలిపోతుంది. అలా ఎందుకు జరిగిందో తన అనుభవాన్ని మనముందు ప్రదర్శిస్తాడు. మరో రీల్లో మహిళ తన బాధను మాటల్లో కాకుండా ముఖ కవళికలతో తన నిస్సహాయను తెలియజేస్తుంది. అనేక అనేక రంగాలు, అనేక సంఘటనలను రీల్స్, వార్తలు, సమాచారం, కథల రూపంలో ఏఐ ద్వారా తెలియజెప్పడం ప్రస్తుతం ట్రెండ్. ఇవన్నీ 24 గంటల్లోపే ఏఐ సాయంతో సిద్ధం చేయడం ఇందులోని ప్రత్యేకత. రీల్స్, షార్ట్స్, పాడ్కాస్ట్ వంటివి కొత్త అలవాట్లుగా మారాయి. ఇలాంటి సమయంలో ఈ కొత్త ఫార్మాట్ స్థానిక భాషలో ప్రజలకు చేరుతోంది. తెలుగులోనూ వినూత్నంగా.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వివిధ రకాల వేదికలు రూపుదాల్చుతున్నాయి. ఇలాంటి వేదికలు నగరంలో వేళ్లూనుకుంటున్నాయి. ప్రపంచంలో తొలి పూర్తిస్థాయి యాంత్రిక మేధస్సుతో (కృత్రిమ మేధస్సు) పనిచేసే తెలుగు వెబ్ అప్లికేషన్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో టైమ్ కృష్ణ అనే వెబ్సైట్లో కొత్త వేదిక మెల్లిగా వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ చానళ్లలో చక్కర్లు కొడుతోంది. ఇది వార్తలా కాకుండా సినిమాను తలపిస్తుంది. మొబైల్లో స్క్రోల్ చేసే సామాజిక మాధ్యమాల అనుభూతి ఇస్తుంది. సాధారణ వార్తా సైట్లా కాకుండా భావోద్వేగాలతో నిండిన చిట్టి కథలుగా ‘సత్య రీల్స్’గా మారుతున్నాయి. ఇలాంటి తెలుగు వేదికలు దేశమంతటా ప్రజలే స్వయంగా తమ కథలను పది భారతీయ భాషల్లో రూపొందించుకునే అవకాశం కల్పించబోతోంది. 4 శాతం నుంచి 21 శాతానికి... టైమ్స్ ట్రెండ్ నివేదిక ప్రకారం.. 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు గల చిన్నారుల్లో 1999 నాటికి 4% నుంచి 2019 వచ్చేసరికి 21% నికి మయోపియా పెరిగింది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే, విద్య, ఏకాగ్రత ఇతర భావోద్వేగ స్థితిగతులను కూడా ప్రభావితం చేసేలా పెరుగుదల ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రాజ్కోట్లో, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగం నిర్వహించిన సర్వేలో, 10 ఏళ్లలోపు పిల్లల్లో 81% మంది భోజన సమయంలో క్రమం తప్పకుండా స్క్రీన్లను ఉపయోగిస్తున్నారని, ఎక్కువగా కార్టూన్ చూడటానికి ఉపయోగిస్తున్నారని తేలింది. తినడం, నేర్చుకోవడం, నిద్రపోవడం వంటి దినచర్యలో డిజిటల్ పరికరాలు ఎలా చొచ్చుకుపోయాయో ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. -
గూగుల్లో పర్సనల్ ఇంటర్వ్యూలు: సుందర్ పిచాయ్
ఒకప్పుడు ఇంటర్వ్యూ అంటే.. ముఖాముఖి నిర్వహించేవాళ్ళు. టెక్నాలజీ పెరిగిన తరువాత వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు చేయడం మొదలైంది. ఈ విధానం ద్వారా ఇంటర్వ్యూలు జరిపితే.. కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వర్చువల్ విధానంలో జరిగే ఇంటర్యూలపై గూగుల్ సీఈఓ కీలక వ్యాఖ్యలు చేశారు.వర్చువల్ విధానంలో ఇంటర్యూలు నిర్వహిస్తుంటే అభ్యర్థులు కొందరు మోసం చేస్తున్నారు. ఇలాంటి వాటిని నివారించడానికే గూగుల్ కంపెనీలో మళ్ళీ వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు 'సుందర్ పిచాయ్' పేర్కొన్నారు. ఏఐ వినియోగం పెరుగుతున్నందున వర్చువల్ ఇంటర్వ్యూలు సమంజసం కాదని కంపెనీలోని ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.వర్చువల్ ఇంటర్వ్యూల ద్వారా.. ఇంటర్యూలను షెడ్యూల్ చేయడం సులభం. అంతే కాకుండా శ్రమ, వ్యయం కూడా తగ్గుతాయి. అయితే కొందరు మోసం చేయడం మొదలు పెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకునే.. ఇంటర్వ్యూ చేయదలచిన అభ్యర్థిని, కనీసం ఒక్కసారైనా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేయాలని నిర్ణయించుకున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో భారీగా బయటపడ్డ బంగారు నిక్షేపాలుప్రస్తుతం ఈ సమస్య ఎదుర్కొంటున్న కంపెనీల జాబితాలో గూగుల్ మాత్రమే కాకుండా.. అమెజాన్, ఆంత్రోపిక్ , సిస్కో, మెకిన్సే వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. కంపెనీలన్నీ వర్చువల్ ఇంటర్వ్యూ విధానానికి మెల్లగా చరమగీతం పాడేసి, మళ్ళీ వ్యక్తిగత ఇంటర్వ్యూలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. -
డిజిటల్ పునర్జన్మ!
మనకిష్టమైన వారు భౌతికంగా మరణించినా మనం వారితో మాట్లాడొచ్చు. ఇదెలా సాధ్యం? భవిష్యత్లో చోటుచేసుకోబోయే మార్పుల గురించి ముందుచూపుతో ఊహించే కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్న దానిని బట్టి చూస్తే.. మనం సాంకేతిక అమరత్వాన్ని సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రస్తుతం ఆ పరిస్థితులకు మనం కొంత దూరంలో ఉన్నప్పటికీ ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) అనేది మరణించిన వ్యక్తులను వారి స్వరం, ప్రవర్తన, నిర్ణయం తీసుకునే విధానం తదితర అంశాల ద్వారా ‘సజీవంగా’నిలిపే అవకాశాలను మెరుగుపరుస్తోంది. మీరు షేర్ చేసే ప్రతి ఫొటో, మీరు పంపే పోస్ట్, వాయిస్ నోట్ వంటివి డిజిటల్ డీఎన్ఏగా మారుతున్నాయి. ఇలాంటి సాంకేతిక వనరులకు జీవం పోసి కొన్నిరూపాల్లో చావును అధిగమించే దిశలో కృతిమ మేధ (ఏఐ) ద్వారా కృషి జరుగుతోంది. ఇది అర్థంకాని సైన్స్ ఫిక్షన్లాగా కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్ లో ఇలాంటివి ‘గ్రీఫ్టెక్’ద్వారా వాస్తవరూపం దాల్చే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ గ్రీఫ్టెక్ వినియోగం ఇప్పుడిప్పుడే మొదలైందని అంటున్నారు. ఏమిటీ ‘గ్రీఫ్ టెక్’? 2020లో దక్షిణ కొరియా టీవీషో ఒక అవాస్తవ పునఃకలయికను ప్రసారం చేసింది. శోకతప్తమై దుఃఖిస్తున్న ఓ తల్లి వర్చువల్ రియాలిటీ (వీఆర్) ద్వారా మరణించిన తన కుమార్తెతో సంభాషించింది. డిజిటల్ సాంకేతిక సహకారంతో ఆ బిడ్డ కదిలింది, మాట్లాడింది, తల్లి ప్రశ్నలకు ప్రతిస్పందించింది. ఇది వాయిస్ నమూనాలు, వీడియో ఫుటేజ్, మెషీన్ లెర్నింగ్ ఆధారంగా సాధ్యమైంది. దీనినే ‘గ్రీఫ్ టెక్’అని పిలుస్తున్నారు. మరణించిన వ్యక్తి ఎలా టెక్ట్స్ చేశాడు, ఎలా జోక్ చేశాడు లేదా ఎలా స్పందించాడు తదితర అంశాల ఆధారంగా అనుకరణ బ్యాట్లను సృష్టిస్తున్నారు. ఈ అనుభూతులు ఎలా సాధ్యం? చనిపోయిన వారిని ఏఐ ద్వారా డిజిటల్ రూపంలో పునర్జీవింపచేస్తారు లేదా ఆ అనుభూతిని కలిగిస్తారు. –ప్రధానంగా సంబంధిత వ్యక్తుల నుంచి సేకరించిన ఏఐ నమూనాల నుంచి ఇది సాధ్యమవుతుంది. –చనిపోయిన వారి టెక్సŠట్ మెసేజ్లు, ఈ–మెయిల్లు, సోషల్ మీడియా పోస్ట్లు, వాయిస్ నోట్లు, వీడియో రికార్డింగ్లు వంటివి ఉపకరిస్తున్నాయి. ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వ లక్షణాలు, నిర్ణయం తీసుకునే విధానాలు సహాయపడుతున్నాయి. –వారి బయోమెట్రిక్ డేటా (ముఖ కవళికలు, స్వరం) వంటివి దోహదపడుతున్నాయి. –వీటి ఆధారంగా నాడీ నెట్వర్క్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఏఐ ఆయా వ్యక్తులను అనుకరించగలదు. –ఫలానా వ్యక్తి ఇంకా సజీవంగా ఉన్నట్టుగా సంభాషించగలదు. –రెప్లికా, ప్రొజెక్ట్ డిసెంబర్, హియర్ ఆఫ్టర్ ఏఐ వంటి సాధనాలు ఇప్పటికే ఇలాంటి వాటిని అందిస్తున్నాయి. –మరణించిన వారి స్వరం మాదిరిగానే సంబం«దీకులతో సంభాషించేలా చేయొచ్చు. చనిపోయిన తాత లేదా బామ్మ స్వరాలను ఉపయోగించి మనవళ్లు, మనవరాళ్లకు నిద్రవేళ కథలను చెప్పే సౌలభ్యం కూడా కలుగుతుందని అంటున్నారు. సమాధానం లేని ప్రశ్నలెన్నో... ఒక వ్యక్తి భౌతికంగా మరణించాక కూడా బతికి ఉన్నట్టుగా భ్రమలో మునగడం డిజిటల్ మరణానంతర జీవితం అనే జవాబులేని ప్రశ్నలను ముందుకు తెస్తోంది. ⇒ ఇది మరణించిన వారి గురించి పడే బాధను తగ్గిస్తుందా? లేదా వారి జ్ఞాపకాలు వెంటాడేలా చేస్తుందా? ఈ డిజిటల్ సాంకేతిక భ్రాంతి/ అయోమయాల మధ్య చనిపోయిన వారు ఎంతకాలం ‘జీవించగలరు’? ఈ ఏఐ అమరత్వాన్ని ఎవరు నియంత్రిస్తారు? సంబంధిత వ్యక్తి కుటుంబమా, టెక్ కంపెనీలా లేక ఆయా దేశాలు/రాష్ట్రాల ప్రభుత్వాలా? ⇒ డిజిటల్ క్లోన్ ఓ వ్యక్తిగా ఉండటం విరమించి పూర్తిగా వేరే వ్యక్తిగా వ్యవహరిస్తే లేదా హ్యాకింగ్కు గురైతే ఏమి జరుగుతుంది? ⇒ ఆయా మాధ్యమాల ద్వారా మనం జ్ఞాపకశక్తిని కాపాడుకుంటున్నామా? లేదా భ్రమల్లో విహరించేలా తయారవుతున్నామా? ఇది వరంగా పరిణమిస్తుందా లేక శాపంగా మారుతుందా? ⇒ ఈ ప్రశ్నలకు జవాబులు డిజిటల్ సాంకేతికతను ఏ రూపంలో, ఏ అవసరానికి ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
మస్క్ తొలగించిన సీఈవో.. మళ్లీ ‘ప్యారలల్’గా దూసుకొచ్చాడు!
ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ మళ్లీ టెక్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన స్థాపించిన కొత్త ఏఐ స్టార్టప్ ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’ ఇటీవలే 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.250 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. ఖోస్లా వెంచర్స్, ఇండెక్స్ వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్ వంటి ప్రముఖ వెంచర్ క్యాపిటల్స్ ఈ సంస్థలో పెట్టుబడి పెట్టాయి.ఏఐకి బ్రౌజర్ ఇచ్చినట్లే!ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ ఒక క్లౌడ్-బేస్డ్ ఏఐ రీసెర్చ్ ప్లాట్ఫారమ్. ఇది ఏఐ మోడల్స్కు రియల్ టైమ్ వెబ్ డేటాను యాక్సెస్ చేయగలిగే సామర్థ్యాన్ని కల్పిస్తుంది. సాధారణంగా AIలు ట్రైనింగ్ డేటాపై ఆధారపడతాయి. కానీ లైవ్ వెబ్ సమాచారం చదవడం, నిజమైన సమాచారం గుర్తించడం, సమాధానాలపై విశ్వాస స్థాయిని అంచనా వేయడం వంటివి ప్యారలల్ ప్రత్యేకతలు.మానవుల కంటే మెరుగైన అన్వేషణఈ స్టార్టప్ అభివృద్ధి చేసిన అల్ట్రా8ఎక్స్ (Ultra8x) అనే రీసెర్చ్ ఇంజిన్ 30 నిమిషాల పాటు లోతైన వెబ్ అన్వేషణ చేయగలదు. ఇది ఓపెన్ఏఐ జీపీటీ-5 (OpenAI GPT-5)తో సహా మానవ రీసెర్చర్ల కంటే 10 శాతం మెరుగైన పనితీరును చూపిందని సంస్థ పేర్కొంది. ట్విట్టర్ నుంచి టెక్ రీ-ఎంట్రీ2022లో ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత, సీఈవో పదవిలో ఉన్న పరాగ్ అగర్వాల్ను ఎలాన్ మస్క్ తొలగించారు. ఆ తర్వాత పరాగ్ పాలో ఆల్టోలోని కాఫీ షాపుల్లో రీసెర్చ్ పేపర్లు చదువుతూ, కోడ్ రాస్తూ గడిపారు. హెల్త్కేర్ ఏఐ స్టార్టప్ ఆలోచించినా, చివరికి ఏఐకి రియల్ టైమ్ వెబ్ డేటాను విశ్వసనీయంగా అందించాలన్న లక్ష్యంపై దృష్టి పెట్టారు.మస్క్తో రూ.420 కోట్ల సెవరెన్స్ వివాదంపరాగ్ అగర్వాల్ ఇంకా 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.420 కోట్లు) సెవరెన్స్ పేమెంట్ కోసం మస్క్తో కోర్టులో పోరాటం చేస్తున్నారు. మస్క్ “ఫర్ కాస్” అనే కారణంతో చెల్లింపును నిలిపివేశాడు. -
ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు డిమాండ్ పెరుగుతోంది. చాలామంది ఇందులో కొత్తగా నైపుణ్యాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యా మంత్రిత్వ శాఖ 'స్వయం పోర్టల్'లో ఫ్రీ ఏఐ (AI) కోర్సులను అందిస్తోంది. వివిధ పరిశ్రమలలో ఏఐ ప్రాముఖ్యత పెరుగుతున్న సమయంలో ఈ కోర్సులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఏఐ/ఎమ్ఎల్ యూసింగ్ పైథాన్ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ వంటి వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాలను పరిచయం చేస్తారు. ఇందులో స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, ఆప్టిమైజేషన్, డేటా విజువలైజేషన్ వంటివి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా.. డేటా సైన్స్లో విస్తృతంగా ఉపయోగించే ప్రోగ్రామింగ్ భాషలలో ఒకటైన పైథాన్ను కూడా కవర్ చేస్తుంది. ఈ కోర్సు 36 గంటల పాటు కొనసాగుతుంది. కోర్సు పూర్తయిన తరువాత చివరిలో సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది.క్రికెట్ అనలిటిక్ విత్ ఏఐఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు అందించే ఈ కోర్సు ద్వారా.. క్రికెట్ను ప్రాథమిక ఉదాహరణగా తీసుకుని, పైథాన్ని ఉపయోగించి స్పోర్ట్స్ అనలిటిక్స్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలను తెలుసుకోవచ్చు. ఈ కోర్సు 25 గంటలు ఉంటుంది.ఏఐ ఇన్ ఫిజిక్స్ ఈ కోర్సు మెషిన్ లెర్నింగ్ & న్యూరల్ నెట్వర్క్లు వాస్తవ ప్రపంచ భౌతిక శాస్త్ర సమస్యలను ఎలా పరిష్కరించగలవో చెబుతుంది. ఇందులో ఇంటరాక్టివ్ సెషన్లు, ఆచరణాత్మక ఉదాహరణలు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్ వర్క్ మొదలైనవి ఉన్నాయి. ఈ కోర్సు 45 గంటల ఉంటుంది.ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్: తొలిరోజే 1.4 లక్షల కొనుగోళ్లుఏఐ ఇన్ అకౌంటింగ్కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని ఈ కోర్స్ ప్రవేశపెట్టింది. అకౌంటింగ్ పద్ధతుల్లో ఏఐను ఎలా ఉపయోగించుకోవచ్చో.. ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. ఇది 45 గంటల కోర్సు.ఏఐ ఇన్ కెమిస్ట్రీఈ కోర్సు ద్వారా వాస్తవ ప్రపంచ రసాయన డేటాసెట్లను ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా పరమాణు లక్షణాలు, మోడల్ ప్రతిచర్యలు, డిజైన్ డ్రగ్స్ మొదలైనవాటిని ఎలా అంచనా వేయాలో తెలుస్తుంది. ఇది 45 గంటల కోర్సు. -
ఏఐ నుంచి మానవాళిని కాపాడాలంటే?: హింటన్ సూచన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతిక రంగంలో సంచలనాలను సృష్టిస్తోంది. ప్రతి రంగంలోనూ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మానవాళిని తుడిచిపెట్టే అవకాశం ఉందని.. ''గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ''గా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ - కెనడియన్ కంప్యూటర్ శాస్త్రవేత్త 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) ఆందోళన వ్యక్తం చేశారు.లాస్ వెగాస్లో జరిగిన Ai4 సమావేశంలో హింటన్ మాట్లాడుతూ.. ఏఐ మానవాళికి ప్రమాదంగా మారుతుందని, దీనిపై నియంత్రణ కలిగి ఉండాలని హెచ్చరించారు. పెద్దవాళ్ళు.. పిల్లలకు మిఠాయి ఇచ్చి ఏమార్చిన విధంగా భవిష్యత్తులో ఏఐ మనుషులను నియంత్రించే అవకాశం ఉందని ఆయన అన్నారు.మోసం చేయడం, దొంగిలించడం వంటివి కూడా ఏఐ సులభంగా చేసేస్తోంది. ఇటీవల ఒక ఏఐ ఇంజినీర్ వ్యక్తిగత సమాచారాన్ని బయటకు చెప్పేస్తా అని భయపెట్టిన ఉదంతాన్ని హింటన్ ఉదాహరణగా చెప్పారు. కాబట్టి ఏఐ భావోద్వేగ స్పందనలను కలిగి ఉండాలి. అప్పుడే సమాజహితంగా ఉంటుందని అన్నారు. ఏఐలో కరుణ భావాన్ని పెంపొందించడం అత్యంత ముఖ్యమైనదని హింటన్ వెల్లడించారు. తల్లి - బిడ్డ సంబంధం మాదిరిగా ఏఐను రూపొందించాలని ఆయన వివరించారు.ఇదీ చదవండి: మినిమమ్ బ్యాలెన్స్: ఏ బ్యాంకులో ఎంత ఉండాలంటే?ఏఐ ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇది కొత్త భాషను ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేము. అయితే ఏఐ వల్ల ప్రమాదాలు ఉన్నప్పటికీ.. వైద్య రంగంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని జియోఫ్రీ హింటన్ అన్నారు. -
ఏఐ దెబ్బకి ఈ ఉద్యోగాలు పోతాయ్!
-
ఐఐటీ హైదరాబాద్లో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సుల ఘనత
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) క్యాంపస్లో అద్భుత ఘనత నమోదైంది. క్యాంపస్ రోడ్లపై రోజువారీ సేవల కోసం అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత డ్రైవర్ రహిత బస్సులు రోజుల వ్యవధిలోనే 10,000 మందికి పైగా ప్రయాణీకులను తరలించాయి. ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్) రూపొందించిన వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్గా, మానవ డ్రైవర్ లేకుండా నడుస్తాయి.ఆరు సీట్ల, పద్నాలుగు సీట్లుగా రెండు వేరియంట్ల వాహనాలు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో సేవలు అందిస్తున్నాయి. కొత్తగా క్యాంపస్ రోడ్లపైకి వచ్చిన ఈ బస్సులు ఇప్పటికే 10,000 మందికి పైగా ప్రయాణీకులను తరలించాయి. ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ ఎక్కువగా సానుకూలంగా ఉందని, 90 శాతం సంతృప్తి రేటు ఉందని టిహాన్ నివేదించింది.అన్ని విధాలా సిద్దంగా..ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన డ్రైవర్ రహిత బస్సులు కేవలం ప్రయోగాత్మకం కాదు. సాంకేతికపరంగా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాయి. ఈ బస్సులలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థలను అమర్చారు. ఇవి వేగాన్ని సర్దుబాటు చేయడానికి, అడ్డంకులను గుర్తించడానికి, సురక్షిత దూరాలను నిర్వహించడానికి అనుమతిస్తాయి.ఈ డ్రైవర్ రహిత బస్సుల ప్రాజెక్ట్ టెక్నాలజీ రెడీనెస్ లెవల్ 9కు చేరుకుంది. అంటే ఇది వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో నిరూపించుకుంది. ఐఐటీ హైదరాబాద్కు ఈ ప్రాజెక్ట్ ఒక రవాణా పరిష్కారం మాత్రమే కాకుండా భారతదేశ మొబిలిటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణ సాధ్యమని చూపించే ఒక ప్రదర్శన. దేశంలోనే తొలి అటానమస్ నావిగేషన్ టెస్ట్బెడ్ను కూడా టిహాన్ నిర్మించింది.ఈ సదుపాయం భారతీయ డ్రైవింగ్ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు పబ్లిక్ రోడ్లపై ఉపయోగించే ముందు సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలను పరీక్షించడానికి, ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది. -
16 ఏళ్లకే సొంత కంపెనీ.. రెండేళ్లలో రూ.100 కోట్ల సామ్రాజ్యం!
చేయాలనే తపన, ఆలోచించే శక్తి ఉంటే ఎవరైనా అద్భుతాలు చేస్తారు. చదువుకునే వయసులోనే సొంతంగా కోడింగ్ నేర్చుకోవడమే కాకుండా.. కోట్ల విలువైన కంపెనీ స్థాపించింది. ఇంతకీ ఈ ఘనత సాధించినది ఎవరు?, వారు స్థాపించిన కంపెనీ ఏది అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.భారతదేశంలో పుట్టిన 'ప్రాంజలి అవస్థి' (Pranjali Awasthi) చిన్నప్పుడే తన తండ్రి ఉపయోగించే కంప్యూటర్ చూస్తూ.. దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది. ఆ తరువాత కోడింగ్ ఎలా రాయాలో నేర్చుకుని.. ఏడేళ్ల ప్రాయానికే సొంతంగా కోడింగ్ రాసింది. 11 సంవత్సరాల వయసులో ప్రాంజలి అవస్థి.. తన కుటుంబంతో అమెరికాలోని ఫ్లోరిడాకు మారింది. అక్కడే కంప్యూటర్ సైన్స్ అండ్ కాంపిటీటివ్ మ్యాథ్స్ కోర్సుల్లో చేరింది. ఆ తరువాత 13 ఏళ్ల వయసుకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన న్యూరల్ డైనమిక్స్ ఆఫ్ కంట్రోల్ ల్యాబ్లో ఇంటర్న్షిప్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి తెలుసుకుంది.ఏఐ సాయంతో చాలా పనులను సులభంగా చేయవచ్చని గ్రహించిన ప్రాంజలి.. డెల్వ్.ఏఐ (Delv.AI) ప్రారంభించింది. ఈ కంపెనీ రూ. 3.5 కోట్లతో.. ముగ్గురు ఉద్యోగులతో మొదలైంది. ప్రస్తుతం దీని విలువ రూ.100 కోట్ల కంటే ఎక్కువ. ఈ సంస్థలో పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ప్రాంజలి అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఆమె 'చాట్జీపీటీ ఇన్ హ్యాండ్' అనే కొత్త ప్రాజెక్ట్లో కూడా పనిచేస్తోంది. ఇది ఒక ఏఐ అసిస్టెంట్. ఇది మాట్లాడటమే కాకుండా మీ కోసం కూడా పని చేయగలదని అవస్థి చెబుతోంది.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే? -
ఏఐ మాయ.. సౌత్ స్టార్స్ ఇలా అయిపోయారేంటి?
ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీని కాస్తా గట్టిగానే వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫన్ క్రియేట్ చేసేందుకు ఏఐని విపరీతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖుల ఫోటోలు, వీడియోల కంటెంట్ను ఎక్కువగా సృష్టిస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్స్ వారి సతీమణులతో ఉన్న ఫన్నీ వీడియోను నెట్టింట హల్చల్ చేశాయి. ఈ వీడియో ఫ్యాన్స్కు తెగ నవ్వులు తెప్పించింది.తాజాగా అలాంటి వీడియోనే దక్షిణాది సూపర్ స్టార్స్తో రూపొందించారు. హీరోలు సూర్య, అజిత్, బన్నీ, మహేశ్ బాబు, విజయ్, రామ్ చరణ్తో కలిసి ఫన్నీగా రూపొందించారు. ఇందులో హీరోలంతా హీరోయిన్స్కు ఫుడ్ తినిపిస్తూ కనిపించారు. ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియో నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. తమ స్టార్ హీరోలేంటి ఇలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి.Prabhas annaaaaaa😂🤣😁#Prabhas𓃵 pic.twitter.com/43OVHX8wYQ— G.O.A.T Prabhas (@goatPB1) August 8, 2025 -
ప్రపంచ ఏఐని శాసించేది మనమే.. అన్ని అవకాశాలూ మనకే..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తృతి అంతటా పెరిగిపోయింది. అన్ని రంగాలను, పరిశ్రమలను ఈ సరికొత్త సాంకేతికత కమ్మేస్తోంది. దీంతో ఉద్యోగాలు, పని చేసే విధానం పూర్తిగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో 16వ ఫిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ 2025లో ఫిక్కీ, కేపీఎంజీలు 'నెక్ట్స్ జనరేషన్ స్కిల్స్ ఫర్ ఎ గ్లోబల్ వర్క్ఫోర్స్: ఎనేబుల్ యూత్ అండ్ ఎంపవర్ ఎకానమీ' పేరుతో ఓ కీలక నివేదికను ఆవిష్కరించాయి.కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి విడుదల చేసిన ఈ నివేదిక గ్లోబల్ ఏఐ టాలెంట్ హబ్ గా మారడానికి భారతదేశ రోడ్ మ్యాప్ ను వివరిస్తుంది.ప్రాంప్ట్ ఇంజినీర్లు, స్మార్ట్ గ్రిడ్ అనలిస్టులు వంటి సరికొత్త భవిష్యత్ ఉద్యోగాలతో ఐటీ, హెల్త్ కేర్, ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో వేగవంతమైన కృత్రిమ మేధ ఆధారిత పరివర్తనను కీలక పరిశోధనలు హైలైట్ చేస్తున్నాయి. అయితే భారతీయ యువతలో కేవలం 26.1% మంది మాత్రమే సరైన వృత్తి శిక్షణను పొందుతున్నారు. ఇది అత్యవసర నైపుణ్య అంతరాలను తెలియజేస్తోంది.రంగాల వారీగా ఏఐ శిక్షణ, ఐటీఐలను ఆధునీకరించడం, టైర్ 2, 3 నగరాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్లు నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. అట్టడుగు వర్గాల సాధికారత కోసం గ్లోబల్ సర్టిఫికేషన్ అలైన్ మెంట్, నైతిక ఏఐ ప్రమాణాలు, సమ్మిళిత విధానాలు అవసరమని పేర్కొంది.కలిసొచ్చే అంశాలు భారతదేశంలో ఎక్కువగా ఉన్న యువ జనాభా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఎకోసిస్టమ్ మనం ఏఐ వర్క్ఫోర్స్లో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగడానికి సానుకూల అంశాలుగా కేపీఎంజీకి చెందిన నిపుణులు పేర్కొన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు, సాహసోపేతమైన సంస్కరణలతో, భారత్ ఏఐ నిపుణులను బయటి దేశాలకు అందించగలదని అభిప్రాయపడ్డారు. -
తక్కువ ధరకే బోలెడు ఫీచర్లు!
ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ 'వన్ప్లస్' వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 'వన్ప్లస్ నార్డ్ సీఈ' సిరీస్ను ఒక ప్రధాన లక్ష్యంతో తీసుకొచ్చింది. ఇది శక్తివంతమైన పనితీరు, లేటెస్ట్ ఫీచర్స్, యూజర్ ఇంటర్ఫేస్తో కూడిన సిగ్నేచర్ వన్ప్లస్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తుంది. దీనికి 'వన్ప్లస్ నార్డ్ సీఈ5' (OnePlus Nord CE5) ఒక ఉదాహరణ. లేటెస్ట్ వన్ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాలను కలిగి, ఆక్సిజన్ఓఎస్ అనుభవాన్ని మెరుగుపరచడం ద్వారా ఇది మంచి పనితీరును అందిస్తుంది. ఇది దాని విభాగంలో.. ధరకు తగిన ఫ్రీమియం ఫీచర్స్ అందిస్తుంది.వన్ప్లస్ నార్డ్ సీఈ5 - వాల్యూ ఫర్ మనీరూ.25వేలు లోపు ధర వద్ద బెస్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ఫోన్ వన్ప్లస్ నార్డ్ సీఈ5. మీరు చెల్లించే డబ్బుకు, తగిన ఫీచర్స్ తప్పకుండా ఆస్వాదించవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ను మీరు మాత్రమే కాకుండా.. మీ సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు కూడా పండుగల సమయంలో గిఫ్ట్గా ఇవ్వడానికి అనువైనది.వన్ప్లస్ నార్డ్ సీఈ5 ఫీచర్లు ఇలా..మీడియాటెక్ 8350 అపెక్స్ప్రతి మొబైల్కు కీలకంగా వ్యవహరించేది దాని ప్రాసెసర్. నార్డ్ సీఈ5లో మీడియాటెక్ 8350 అపెక్స్ చిప్ సెట్ ఉంది. ఇది దాని పనితీరును సూచిస్తుంది. వినియోగదారుల కోసం రూపొందించబడిన కొత్త తరం ప్రాసెసర్ ఇది. యువత మొబైల్ స్పీడ్లో రాజీపడకుండా మెరుగైన పనితీరును కోరుకుంటారు. కాబట్టి దీన్ని సమర్థవంతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించారు. యూజర్లకు అంతరాయం లేకుండా యాప్ను రన్ చేస్తూ, అప్రయత్నంగా మల్టీ టాస్కింగ్ నిర్వహిస్తుంది. పెద్ద సైజ్లో ఉన్న గేమ్లను కూడా 120 ఎఫ్పీఎస్తో స్మూత్ గేమింగ్ పనితీరును నిర్ధారిస్తుంది. వినియోగదారుల ప్రవర్తన ఆధారంగా పనితీరును ఆప్టిమైజ్ చేసేలా కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ అందిస్తుంది.సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లేనార్డ్ సీఈ5లో 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది మంచి విజువల్ను అందిస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, బటర్ స్మూత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో స్క్రీన్ వేగంగా స్పందిస్తుంది. సాధారణంగా అధిక బ్రైట్నెస్ అవుట్ డోర్ విజిబిలిటీకి సమస్యగా ఉంటుంది. హెచ్డీఆర్10+ కాంట్రాస్ట్, కలర్ క్లారిటీతో ఈ సమస్యకు నార్డ్ సీఈ5 చెక్ పెడుతుంది. ఇందులోకి ఏఐ విజువల్ ఎన్హాన్స్మెంట్ విభిన్న లైటింగ్ కండిషన్స్లో వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. గేమ్ ఆడుతున్నా, ఎక్కువగా స్క్రీన్ చూస్తున్నా ఈ డిస్ప్లే యూజర్లకు మెరుగైన అనుభవాన్ని సొంతం చేస్తుంది.కెమెరా సిస్టమ్వన్ప్లస్ నార్డ్ సీఈ5లో కేవలం మెగాపిక్సెల్స్ కోసమే కాకుండా అర్థవంతమైన ఫొటోగ్రఫీ కోసం డిజైన్ చేసిన రిఫైన్డ్ డ్యూయల్ లెన్స్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది.50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్: తక్కువ వెలుతురులో కూడా అదిరిపోయే క్లారిటీ, డైనమిక్ రేంజ్ అందిస్తుంది.8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా: ల్యాండ్స్కేప్, గ్రూప్ షాట్స్, ఆర్కిటెక్చర్ కోసం ఇది ప్రత్యేకమైంది.60 ఎఫ్పీఎస్ వద్ద 4కే వీడియో: రియల్ టైమ్ స్టెబిలైజేషన్తో ఫ్లూయిడ్, సినిమా క్వాలిటీ రికార్డింగ్ అందిస్తుంది.ఈ ఫోన్లో ప్రతి కెమెరా షాట్ను ఎలివేట్ చేసేలా ఏఐ ఆధారిత ఫొటోగ్రఫీ ఫీచర్లు ఉన్నాయి. సీన్ రికగ్నిషన్, ఇంటెలిజెంట్ హెచ్డీఆర్, నైట్ స్కేప్ ఆప్టిమైజేషన్, సోషల్ రెడీ కంటెంట్ కోసం రూపొందించిన సృజనాత్మక ఫిల్టర్లు ఉన్నాయి.అర్థం చేసుకునే ఏఐనార్డ్ సీఈ5ను మార్కెట్లోని ఇతర ఫోన్లతో నిజంగా వేరు చేసేది అందులో వాడుతున్న కృత్రిమ మేధ. ఇందులో స్మార్ట్ ఉత్పాదకత సాధనాలను వాడారు. ఫోన్లోని ఏఐ యూజర్ షెడ్యూల్ను నిర్వహించగలదు. ఈమెయిల్లను చదివి సంక్షిప్తంగా తెలపగలదు. సందర్భోచితంగా నోటిఫికేషన్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వగలదు.కెమెరా ఏఐ: ఫొటో తీస్తున్న సమయంలో సబ్జెక్ట్, బ్యాక్ గ్రౌండ్ ఆధారంగా ఫోకస్, లైటింగ్, కలర్ టోన్లను ఆటో అడ్జస్ట్ చేస్తుంది. దీంతో మాన్యువల్గా మళ్లీ సదరు ఫొటో లేదా కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్లి మార్పులు చేయాల్సిన పని ఉండదు.120 ఎఫ్పీఎస్ గేమింగ్ పవర్ హౌస్స్మార్ట్ ఫోన్లో గేమింగ్ అనేది ప్రస్తుత రోజుల్లో ప్రధానంగా మారింది. నార్డ్ సీఈ 5 ఈ అనుభవాన్ని చాకచక్యంగా అందిస్తుంది. దాని 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్కు అందుకు ఎంతో తోడ్పడుతుంది. 120 ఎఫ్పీఎస్ వద్ద అసాధారణ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.డిజైనింగ్నార్డ్ సీఈ 5 బ్రష్డ్ మ్యాట్ ఫినిష్తో హై-గ్రేడ్ పాలీకార్కొనేట్తో తయారైంది. యూనిబాడీతో ప్రీమియం లుక్ ఉండేలా డిజైన్ చేశారు. ఇది విజువల్ అప్పీల్ మాత్రమే కాకుండా మంచి గ్రిప్ను కూడా నిర్ధారిస్తుంది. సీఈ5లోని కలర్ ఆప్షన్లు కింది విధంగా ఉన్నాయి.గ్రాఫైట్ ఐస్ - రిఫ్లెక్టివ్ షైనింగ్తో మెటాలిక్ గ్రే కలర్.మిస్ట్ బ్లూ - హిమానీనదాల నుండి ప్రేరణ పొంది ఈ రంగులో అందిస్తున్నారు.సన్సెట్ కాపర్ఆక్సిజన్ఓఎస్ఆక్సిజన్ఓఎస్ తాజా వెర్షన్తో నడుస్తున్న నార్డ్ సీఈ 5 రెస్పాన్సివ్, యాడ్ ఫ్రీ సాఫ్టేవేర్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఇందులోని స్మార్ట్ ఎఫిషియెన్సీ టూల్స్ మెరుగైన షెల్ఫ్ విడ్జెట్లు, సందర్భోచిత యాప్ సజెషన్లను అందిస్తున్నాయి. వినియోగదారులకు వారి డిజిటల్ గోప్యతపై మరింత నియంత్రణను కల్పించేలా మెరుగైన భద్రతా ఫీచర్లను అందిస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే థీమ్స్, ఫింగర్ ప్రింట్ యానిమేషన్లు, ఐకాన్ ప్యాక్లను నియంత్రిస్తుంది. మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు, ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేషన్లను అందిస్తుంది.5జీ కనెక్టివిటీనార్డ్ సీఈ5 డ్యూయల్ 5జీ సిమ్ స్లాట్లను కలిగి ఉంది. ఇది విస్తృత శ్రేణి గ్లోబల్ 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుంది. అధిక రిజల్యూషన్ కంటెంట్ను స్ట్రీమింగ్ చేస్తున్నా, రియల్ టైమ్ క్లౌడ్ గేమింగ్లో పాల్గొంటున్నా లేదా అధిక మొబిలిటీ సందర్భాల్లో వీడియో కాలింగ్ చేసినా సీఈ 5 అల్ట్రా లో-లేటెన్సీ వల్ల స్థిరమైన వేగంతో పని చేస్తుంది.హై-స్పీడ్, మెరుగైన ఇంటర్నెట్ కోసం వై-ఫై 6ఈడ్యూయల్ డివైజ్ ఆడియో సపోర్ట్, బ్లూటూత్ 5.3 టెక్నాలజీఅంతరాయం లేని మొబైల్ పేమెంట్లు, డివైజ్ పెయిరింగ్ కోసం ఎన్ఎఫ్సీవేగవంతమైన డేటా బదిలీ, రివర్స్ ఛార్జింగ్ సామర్థ్యాల కోసం యూఎస్బీ-ఈ 3.2 జెన్ 1 సదుపాయంఆడియో ఎక్స్ పీరియన్స్ఆడియో కోసం నార్డ్ సిఇ 5 డాల్బీ అట్మోస్ సర్టిఫికేషన్తో స్టీరియో డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. గేమింగ్, వీడియోలు చూడటం లేదా కాల్స్లో ఉన్నా స్పష్టమైన ఆడియోను అందిస్తుంది. మ్యూజిక్ వింటున్న సమయంలో స్పష్టమైన సంగీతం ఆస్వాదించేలా ఏర్పాటు చేశారు. యూఎస్బీ-సీ ద్వారా హై-రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. రియల్టైమ్లో పరిసరాల శబ్దం ఆధారంగా వాల్యూమ్ స్థాయిలను నిర్వహించే ఏఐ ఆధారిత ట్యూనింగ్ సిస్టమ్ ఉంది. 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ను సపోర్ట్ చేస్తుంది.కూలింగ్ సిస్టమ్ఫోన్లో అధిక సైజ్ ఉన్న గేమ్లు ఎక్కువసేపు ఆడితే మొబైల్ వేడవ్వడం సహజం. దీన్ని కట్టడి చేసేందుకు నార్డ్ సీఈ5 మెరుగైన మల్టీ లేయర్ గ్రాఫైట్, వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థను పరిచయం చేస్తుంది. ఇది మునుపటి నార్డ్ మోడళ్ల కంటే వేడిని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుంది. సుదీర్ఘ గేమింగ్ లేదా వీడియో సెషన్ల సమయంలో కూడా సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుంది.భద్రత ఫీచర్లునార్డ్ సీఈ5 డిస్ప్లేపై ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ను అందిస్తుంది. దాంతోపాటు వేగవంతమైన, మరింత సురక్షితమైన యాక్సెస్ కోసం ఏఐ ఆధారిత ఫేస్ అన్లాక్ వెసులుబాటును ఇస్తుంది. ఇందులోని ప్రైవేట్ సేఫ్ 3.0 ద్వారా సున్నితమైన డాక్యుమెంట్లు, ఇమేజ్లు, ఫైళ్లను ఎన్ క్రిప్టెడ్గా స్టోర్ చేసుకోవచ్చు.చివరగా..మిడ్ రేంజ్ మార్కెట్లో వన్ప్లస్ నార్డ్ సీఈ5 కీలకంగా వ్యవహరించనుంది. వినియోగదారులను ఆకర్షించే ఇన్నోవేషన్ ప్రీమియం ధరలతోనే రావాల్సిన అవసరం లేదని వన్ప్లస్ బ్రాండ్ మరోసారి నిరూపించింది. రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్, అర్థవంతమైన ఫీచర్లు, ఇంటెలిజెంట్ డిజైన్ ఎంపికలకు ప్రాధాన్యమిచ్చే నార్డ్ సీఈ5ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాటరీ నుంచి దాని ఏఐ ఆధారిత కెమెరా వరకు, ఫ్లూయిడ్ 120 హెర్ట్జ్ గేమింగ్ నుంచి ప్రాసెసింగ్ ఎనర్జీ వరకు నార్డ్ సీఈ5 వినియోగదారుకు నమ్మశక్యం కాని అనుభవాన్ని అందిస్తుంది.వన్ప్లస్ నార్డ్ సీఈ5 వేరియంట్స్ & ధరలు1) 8 జీబీ + 128 జీబీ: రూ. 24,9992) 8 జీబీ + 256 జీబీ: రూ. 26,9993) 12 జీబీ + 256 జీబీ: రూ. 28,999 -
చెబితే రాసే యంత్రం.. సరికొత్త టెక్నాలజీ
టెక్నాలజీ పెరుగుతోంది, కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే కేరళకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒకరు 'టాక్ టు రైట్' అనే ఏఐ డివైజ్ రూపొందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..లింక్డ్ఇన్ పోస్ట్లో, అజయ్ హెచ్ అనే విద్యార్థి.. ఈ పరికరం AI బేస్డ్ వాయిస్-టు-పెన్ సిస్టమ్ అని, ఇది CNC పెన్ ప్లాటర్ని ఉపయోగించి మనం మాట్లాడే పదాలను చేతితో రాసిన టెక్స్ట్గా మారుస్తుందని వెల్లడించారు. ఈ పరికరాన్ని రాస్ప్బెర్రీ పై, ఆర్డునో (GRBL), పైథాన్లతో రూపొందించారని వెల్లడించారు. దీనిని ఎంటే కేరళం ఎక్స్పో 2025 (Ente Keralam Expo 2025)లో ఆవిష్కరించారు.ఇదీ చదవండి: ఏఐ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: గౌడత్ హెచ్చరికలింక్డ్ఇన్ పోస్ట్లో షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. అక్కడ అమర్చిన టాక్ టు రైట్ పరికరం మైక్లో అజయ్ మాట్లాడుతూ 'డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' అని చెబుతాడు. ఆ యంత్రం కాగితంపై ఆ ఎలాంటి తప్పులు లేకుండా రాస్తుంది. ఇది వైకల్యం ఉన్న వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. View this post on Instagram A post shared by SUNNOBC | JAYRAJSINH ZALA (@sunnobc) -
ఏఐ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: గౌడత్ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఊహకందని సమస్యలను తీసుకొస్తుందని 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ'గా ప్రసిద్ధి చెందిన 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) హెచ్చరికలు జారీ చేసిన తరువాత.. గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ 'మో గౌడత్' (Mo Gawdat) కూడా అదే తరహాలో పేర్కొన్నారు.కృత్రిమ మేధ కారణంగా 2027 నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని, సమాజానికి పెద్ద సమస్యగా తయారవుతుందని మో గౌడత్ పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ డెవలపర్లు, సీఈఓలు, పాడ్కాస్టర్లతో సహా ఎవరూ ఏఐ నుంచి తప్పించుకోలేరని అన్నారు. అంతే కాకుండా రాబోయే 15 సంవత్సరాలు ఉద్యోగులకు నరకం అని సంబోధించారు.గూగుల్ సంస్థలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా పనిచేసిన గౌడత్.. ప్రస్తుతం ఎమ్మా.లవ్ అనే స్టార్టప్ నడుపుతున్నారు. ఇందులో కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ఆ స్టార్టప్లో 350 మంది డెవలపర్లు ఉండేవారు. కానీ ఏఐ కారణంగా ప్రస్తుతం దీన్ని ముగ్గురే నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి ఏఐ ఎంతగా విస్తృతిస్తోందో అర్థం చేసుకోవచ్చు.ఏఐ ఆవిర్భావం 'సామాజిక అశాంతిని' రేకెత్తిస్తుందని. ప్రజలు ఇప్పటికే తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. దీని ఫలితంగా మానసిక ఆరోగ్య సమస్యలు పెరగడం, ఒంటరితనం పెరగడం, సామాజిక విభజనలు తీవ్రమవుతాయని గౌడత్ అన్నారు. ఏఐని సరిగ్గా నియంత్రించకపోతే భారీ అసమానతలను సృష్టిస్తుంది. ధనవంతులు మాత్రమే మనగలుగుతారు. మిగతా వారందరూ కష్టపడతారని ఆయన హెచ్చరించారు.ఇదీ చదవండి: ఉద్యోగం మానేసి నా స్టోర్లో పనిచెయ్ అన్నాడు: కానీ ఇప్పుడు..ఏఐ సొంత భాషప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన జియోఫ్రీ హింటన్ 'వన్ డెసిషన్' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ.. ఏఐ సొంత భాషను ఏర్పాటు చేసుకుంటుంది. ఆ భాషను మానవ సృష్టికర్తలు కూడా అర్థం చేసుకోలేరని హెచ్చరించారు. యంత్రాలు ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేమని అన్నారు. -
ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగాలొస్తాయ్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థలు రోజురోజుకూ మెరుగవుతున్నకొద్దీ మానవ ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన పెరుగుతోంది. మనుషులు చేయగలిగే పనులన్నీ ఏఐ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను త్వరలోనే ఈ కొత్త ఏఐ టూల్స్ భర్తీ చేసే ప్రమాదం ఎక్కువవుతోంది.టెక్ దిగ్గజాల సీఈవోలూ ఇదే హెచ్చరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో తమ కంపెనీలోని ఉద్యోగులను ఏఐ తగ్గిస్తుందని స్వయంగా అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీనే కొన్ని వారాలుగా చెబుతూ వస్తున్నారు. ప్రతి ఒక్కరి ఉద్యోగాలు ప్రభావితమవుతాయని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా ఇటీవల హెచ్చరించారు.సమూల మార్పుఅయితే,ఈ క్రమంలో ఉద్యోగుల్లో ఏఐపై ఉన్న భయాల్ని పొగొట్టేలా గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఓ అడుగు ముందుకేసి ప్రస్తుతం ప్రత్యామ్నాయంగానే ఉన్న కృత్రిమ మేధస్సుతో రాబోయే ఐదు నుండి పదేళ్లలో ఉద్యోగ భావనలోనే సమూల మార్పు సంభవించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎప్పుడూ ఊహించని విధంగా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ‘వైర్డ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు."ఉద్యోగ ప్రపంచంలో చాలా మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ గతంలో మాదిరిగానే మెరుగైన కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇవి ఈ సాధనాలు లేదా కొత్త సాంకేతికతలను ఉపయోగిస్తాయి" అని హస్సాబిస్ అన్నారు.డాక్టరుకూ ముప్పు?ప్రస్తుతం మానవులు చేసే ప్రతి పనినీ ఏజీఐ లేదా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ చేయగలిగితే, రానున్న కొత్త ఉద్యోగాలను కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం భర్తీ చేయకుండా ఆపగలమా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. దీనికి హస్సాబిస్ బదులిస్తూ ఒక వైద్యుడి స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదు కానీ నర్సులను కాదు అన్నారు."సాధారణంగా డాక్టర్ ఏం చేస్తారు.. డాక్టర్ చేసే రోగ నిర్ధారణను ఏఐ టూల్ సాయంతో చేయవచ్చు. లేదా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహా డాక్టర్లు రావచ్చు. కానీ నర్సులు అలా కాదు. ఎందుకంటే నర్సుల ఉద్యోగంలో మానవ సహానుభూతి ఎక్కువగా ఉంటుంది" అని వివరించారు.చదవండి: ఇదిగో ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్! -
ఆ భాషను ఎవరూ అర్థం చేసుకోలేరు: హింటన్ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లో ఏఐ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగుల్లో భయం పుట్టుకుంది. ఇలాంటి సమయంలో 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ'గా ప్రసిద్ధి చెందిన 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) ఓ హెచ్చరిక జారీ చేశారు.ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన జియోఫ్రీ హింటన్ 'వన్ డెసిషన్' పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ప్రస్తుతం, AI ఇంగ్లీషులో ఆలోచిస్తుంది. కాబట్టి డెవలపర్లు కూడా టెక్నాలజీ ఏమి ఆలోచిస్తుందనే విషయాన్ని ట్రాక్ చేయడానికి వీలు కలుగుతోంది. అయితే ఇది త్వరలోనే ఓ సొంత ప్రైవేట్ భాషను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఆ భాషను మానవ సృష్టికర్తలు కూడా అర్థం చేసుకోలేరని హెచ్చరించారు.యంత్రాలు ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేము.ఇదీ చదవండి: విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?హింటన్ చేసిన కృషి AI వ్యవస్థలకు మార్గం సుగమం చేసింది. కానీ భద్రతా గురించి ఆలోచించలేదని ఒప్పుకున్నారు. అప్పట్లోనే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో అని గ్రహించి ఉండాల్సింది. ఇప్పుడు ఆలస్యమైంది. కాబట్టి జాగ్రత్తపడాల్సిన అవసరాన్ని గురించి ఆయన వెల్లడించారు. జ్ఞానాన్ని శ్రమతో పంచుకోవాల్సిన మానవుల మాదిరిగా కాకుండా, ఏఐ తమకు తెలిసిన వాటిని క్షణంలో కాపీ చేసి పేస్ట్ చేయగలవు. ఇదే ప్రస్తుతం చాలా రంగాలను భయపెడుతోంది. దీని గురించే హింటన్ కూడా భయపడుతున్నారు. -
ఏడబ్ల్యూఎస్ కొత్త సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్
బెంగళూరు: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) కొత్తగా ఏఐ డ్రివెన్ డెవలప్మెంట్ లైఫ్సైకిల్ (ఏఐ–డీఎల్సీ) మోడల్ను ఆవిష్కరించింది. కైరో, అమెజాన్ క్యూ డెవలపర్లాంటి టూల్స్ను ఉపయోగించి, కృత్రిమ మేథ (ఏఐ)తో సాఫ్ట్వేర్ను రూపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.దీనితో మానవ పర్యవేక్షణలో కోడింగ్, టెస్టింగ్లాంటి పనులను ఆటోమేట్ చేయడం ద్వారా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే వ్యవధిని నెలల నుంచి రోజుల స్థాయిలోకి కుదించవచ్చని సంస్థ తెలిపింది. అలాగే మెరుగైన ఏఐ విధానాలను షేర్ చేసుకునేందుకు ఏఐ–నేటివ్ బిల్డర్స్ కమ్యూనిటీని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించింది.అటు ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ ద్వారా అంతర్జాతీయంగా 27 లక్షల మంది విద్యార్థులకు, ఉచితంగా ఏఐ ట్రైనింగ్ యాక్సెస్ అందిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్ తెలిపింది. జనరేటివ్ ఏఐని ఉపయోగించి వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించే డెవలపర్లకు 2 మిలియన్ డాలర్ల విలువ చేసే క్రెడిట్స్ను ఇచ్చేలా ఏడబ్ల్యూఎస్ ఏఐ లీగ్ను కూడా ప్రకటించింది. -
ఏఐ మాయ.. పాపం బాలీవుడ్ స్టార్స్ను ఇలా చేశారేంటి?
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఇటీవల ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే రాబోయే కాలంలో మనుషులకు ప్రత్యామ్నాయంగా మారనుందని టాక్ వినిపించడమే. అయితే ఏఐ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉంటాయి. కృత్రిమ మేధతో ఉద్యోగాలు కూడా పోతాయన్నది ఓ వాదన. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏఐని మన జీవితంలో ఆహ్వానించక తప్పదేమో అనిపిస్తోంది.అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ సాయంతో చేస్తున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరలవుతున్నాయి. ఫన్ కోసం సినీతారల ఫోటోలను కోసం తెగ వాడేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు, వారి సతీమణులతో ఉన్నట్లు చేసిన వీడియో నెట్టంట హల్చల్ చేస్తోంది. హీరోలు తమ భార్యలకు ఆహరం తినిపిస్తుండగా.. వాళ్లను మాత్రం బక్క చిక్కినట్లుగా ఇందులో చూపించారు. చివర్లో సల్మాన్ ఖాన్ మాత్రం ఒక్కడే తింటూ నిండుగా కనిపించారు. ఈ లెక్కన పెళ్లి చేసుకుంటే సినీ తారల పరిస్థితి కూడా ఇంతేనా?? అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఏఐ ఫన్నీ వీడియో మీరు కూడా చూసేయండి.#SalmanKhan rocked 😅Watch till the end pic.twitter.com/ryhgna8fbQ— Adil Hashmi👁🗨 (@X4SALMAN) August 2, 2025 -
ఏజెంటిక్ ఏఐ.. ఉద్యోగ విప్లవం.. ఏమిటి దీని ప్రత్యేకత?
సాధారణంగా ఏఐ అంటే.. మనం ఏదైనా అడిగితే జవాబు చెప్పే చాట్బాట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఒక పాట ప్లే చేయమనగానే చటుక్కున ప్లే చేసే స్మార్ట్ స్పీకర్ లాంటిది. కానీ, ‘ఏజెంటిక్ ఏఐ’ దీనికి భిన్నమైనది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో మార్పులు, ఏయే ఉద్యోగాలకు ముప్పు రావచ్చు అంటూ ఈ మధ్య మనం చాలా వింటున్నాం. అయితే, అందరూ ఊహిస్తున్న దానికంటే చాలా పెద్ద మార్పు మన ముందుకు రాబోతోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలో ఏకంగా కోటికి పైగా ఉద్యోగాలను ఓ కొత్త రకం ఏఐ పూర్తిగా మార్చనుంది. అదే ’ఏజెంటిక్ ఏఐ’. అయితే ఈ మార్పు వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇది యువతకు కొత్త అవకాశాలు, దారుల్ని తెరుస్తోంది. ఈ ఏఐతో పని వేగం పెరిగి, పనులన్నీ సులభంగా మారిపోనున్నాయి.రిటైల్ రంగంవ్యాపారాలు ఎదుర్కొనే అతి పెద్ద సవాళ్ళలో ఒకటి.. మార్కెట్ ట్రెండ్లు, వినియోగదారుల నుంచి వచ్చే సమాచారాన్ని వేగంగా విశ్లేషించడం. ఏజెంటిక్ ఏఐ ఈ సమస్యను తీరుస్తుంది. ఈ రంగంలో 76 లక్షల ఉద్యోగాలు మార్పునకు గురవుతాయట. ఏఐ ఏజెంట్లు కస్టమర్ల ఇష్టాలను బట్టి వారికి నచ్చే వస్తువులను చూపించడం, ఎప్పుడు ఏ వస్తువు స్టాక్లో ఉందో తెలుసుకోవడం, కస్టమర్ సర్వీస్కు జవాబులు చెప్పడం వంటివి చేస్తాయి. ఈ ఏఐ వల్ల ఉద్యోగులకు విలువైన సమయం ఆదా అవుతుంది. వారు మార్కెట్ మార్పులకు స్పందించడంపై దృష్టి పెట్టొచ్చు. అయితే, ఈ ఏఐ నిర్ణయాలకు మనుషుల పర్యవేక్షణ చాలా ముఖ్యం. ఆటోమేషన్, మానవ నిర్ణయాల మధ్య సమతుల్యత సాధించొచ్చు.విప్లవాత్మక మార్పులు!ఈ ఏజెంటిక్ ఏఐ మన రోజువారీ జీవితాన్ని, ముఖ్యంగా పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది అంటున్నారు టెక్ నిపుణులు.పని విధానంలో మార్పులు: మనం చేసే కొన్ని పనులు బోరింగ్గా, రోజూ ఒకే రకంగా ఉంటాయి. ఈ ఏఐ ఆ రొటీన్ పనులను పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తీసుకుంటుంది. దీంతో మనుషులు క్రియేటివ్గా ఆలోచించడం, కొత్త వ్యూహాలు రూపొందించడం లాంటి కీలకమైన పనులపై దృష్టి పెట్టొచ్చు.కొత్త ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలు: ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు మారినా, కొత్త ఉద్యోగాలూ పుట్టుకొస్తాయి. ఉదాహరణకు, డేటా ఎంట్రీ చేసేవాళ్లు ఏఐని ఎలా ఉపయోగించాలి అని గైడ్ చేసే ‘ఏఐ సూపర్ వైజర్’గా మారొచ్చు. ఈ మార్పును ఎదుర్కోవడానికి మనం ఏఐ టూల్స్ వాడటం, సృజనాత్మకంగా ఆలోచించడం వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఏయే రంగాల్లో..‘సర్వీస్నౌ ఏఐ స్కిల్స్ రీసెర్చ్ 2025’ ప్రకారం, కొన్ని కీలక రంగాల్లో ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ రంగంలో ఏకంగా 80 లక్షల ఉద్యోగాలు మారబోతున్నాయి. ఏఐ ఏజెంట్లు ఒక వస్తువు తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను మేనేజ్ చేయడం, యంత్రాలు ఎప్పుడు పాడైపోతాయో ముందే చెప్పడం, ఉత్పత్తి వేగాన్ని పెంచడం వంటివి చేస్తాయి. దీంతో మనుషులు యంత్రాల పర్యవేక్షణ, మరమ్మతులు వంటి పనులు చేయాల్సి రావొచ్చు.విద్యారంగంఈ రంగంలో 25 లక్షల ఉద్యోగాలు మారనున్నాయి. ఏఐ ఏజెంట్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చదువుకునే ప్రణాళికలు తయారు చేయడం, అసై¯Œ మెంట్లను కరెక్ట్ చేయడం, వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వంటివి చేస్తాయి. దీంతో టీచర్లు క్లాస్రూమ్లో విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడం, వారికి మార్గదర్శకత్వం చేయడం వంటి వాటిపై ఫోకస్ చేయవచ్చు.ఏఐతో కలిసి పనిచేయాలిఇది కేవలం ఆటోమేషన్ మాత్రమే కాదు. పని అంటే ఏంటో తిరిగి నిర్వచించుకునే సమయం. ఈ ఏఐ విప్లవం వల్ల దేశ యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, కొత్త రకాల ఉద్యోగాలు చేయడానికి అపారౖమెన అవకాశాలు లభిస్తాయి. ఏఐతో కలిసి పనిచేయడం ఎలాగో నేర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో మనం మరింత మెరుగ్గా రాణించగలుగుతాం. ఏజెంటిక్ ఏఐ అనేది మన శత్రువు కాదు, మన పనిని సులభతరం చేసే ఒక స్మార్ట్ పార్ట్నర్.– సుమీత్ మాథుర్, ఎస్వీపీ–ఎండీ, సర్వీస్నౌ ఇండియాడేటా సెక్యూరిటీ సమస్యఏజెంటిక్ ఏఐ వల్ల డేటా సెక్యూరిటీ విషయంలో కంపెనీలకు ఇంకా పూర్తి స్పష్టత రాలేదని సర్వీస్నౌ నివేదిక చెబుతోంది. ఇందుకోసం ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయో తమకు తెలియడం లేదని 26 శాతం కంపెనీలు చెప్పాయట. -
అగ్రరాజ్యంతో పోటీపడుతున్న భారత్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. నిపుణుల నియామకాల్లో తొలి స్థానంలో నిలిచి మన దేశం ప్రపంచం ఔరా అనిపించేలా చేసింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. అత్యధిక నైపుణ్యాలున్న దేశం అమెరికా కాగా, రెండో స్థానంలో భారత్ ఉంది. అంటే అగ్రరాజ్యంతో నువ్వా నేనా అన్నట్టు భారత్ పోటీపడుతోంది. పేటెంట్లు.. అందులో మళ్లీ ఏఐ పేటెంట్ల విషయంలో మాత్రం మనం చాలా వెనకబడి ఉన్నాం.ప్రపంచంలో అత్యధిక ఏఐ నైపుణ్యాలు కలిగిన ఐటీ ఇంజనీర్లు ఉన్న దేశాల్లో యూఎస్ టాప్–1లో నిలిచింది. మొత్తం ఏఐ నైపుణ్యాల్లో.. ఈ దేశంలోని ఐటీ ఇంజనీర్లలో సగటున 2.63 శాతం నైపుణ్యాలు ఉన్నాయి. మనదేశంలో ఇది 2.51 శాతంగా ఉంది. ఈ విషయంలో యూకే, జర్మనీ, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ మన కంటే వెనుకబడి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఇంజనీర్లలో ఏఐ నిపుణుల వాటా 1 శాతమే. భారత్లో లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్పై గత ఏడాది జరిగిన మొత్తం నియామకాల్లో 33.39 శాతం ఏఐ సంబంధ రోల్స్ ఉండడం విశేషం. ఈ స్థాయిలో ఏఐ రిక్రూట్మెంట్ జరగడంతో ప్రపంచంలోనే మనం టాప్లో నిలిచాం. ఏఐ పబ్లికేషన్ల విషయంలో కూడా 2013– 23 మధ్య 9.22 శాతం వాటాతో అమెరికా (America) కంటే మనమే ముందున్నాం. ఈ విషయంలో చైనా (China) 23.20 శాతంతో మొదటి స్థానంలో ఉంది.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!పరిశోధకుల్లో వెనకడుగే..అంతర్జాతీయంగా ఏఐ పరిశోధకుల్లో టాప్–2 శాతంలో మనవాళ్లు లేకపోవడం నిరాశపరుస్తోంది. ఈ విషయంలో యూఎస్, చైనా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, మరో ముఖ్యమైన విషయం.. మన ఏఐ నిపుణులు (AI Experts) మనదేశం నుంచి తరలిపోవడం. గత ఏడాది లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్పై.. భారత్లో సగటున ప్రతి 10,000 మంది ఏఐ నిపుణులకుగాను 1.55 మంది మన దేశం నుండి నిష్క్రమించారు. ఇలా అత్యధికులు వెళ్లిపోతున్న దేశంగా ఇజ్రాయెల్ తరువాత మనదేశం ఉందని ‘స్టాన్ ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025’ నివేదిక వెల్లడించింది.పేటెంట్లలో చైనా జోరు..ఏఐ పేటెంట్లలో కూడా మన దేశం వెనుకబడి ఉంది. 2024లో ప్రైవేట్ ఏఐ పెట్టుబడుల్లో కేవలం 1.16 బిలియన్ డాలర్లను మాత్రమే భారత్ ఆకర్షించింది. యూఎస్ ఏకంగా 109.08 బిలియన్ డాలర్ల నిధులను అందుకుంది. నిపుణులు, విస్తృతి పెరిగినప్పటికీ చాట్జీపీటీ లేదా డీప్సీక్ వంటి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన చాట్బాట్లు రూపొందించే స్థాయిలో భారత్ పురోగతి సాధించలేదు. ప్రతిభను అగ్రశ్రేణి పరిశోధన, పేటెంట్ పొందిన ఆవిష్కరణలు, బిలియన్ డాలర్ల ఏఐ ఉత్పత్తులను అందించేలా మలచడంలో పర్యావరణ వ్యవస్థ లేకపోవడం భారత్కు ప్రతికూలాంశంగా నిపుణులు చెబుతున్నారు. -
చెంత ఏఐ ఉందిగా..!
కృత్రిమ మేధ సహాయంతో కంపెనీ ఉత్పాదకతను మరింత పెంచాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. అసాధారణ పెట్టుబడి వ్యూహాలు ఉన్నప్పుడు ఉత్పాదకత కూడా అందుకు తగినట్లుగా మారాలని చెప్పారు. అందుకు కృత్రిమ మేధను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. అందుకోసం కంపెనీ అంతర్గతంగా కొన్ని మోడల్స్ను ఆవిష్కరించినట్లు చెప్పారు.‘ఉత్పాదకతను పెంచడానికి మనం మరింత సాధించాలని అనుకుంటున్నాను. మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ప్రయత్నిద్దాం. గూగుల్ ప్రస్తుత పనితీరుపై ఆశావహంగా ఉన్నాను’ అని సుందర్ తెలిపారు. ఈ సమావేశంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల (ఎస్డబ్ల్యూఈ) కోసం కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొన్ని సాధనాలను వివరించారు. కంపెనీ అవసరాలను తీర్చడానికి కృత్రిమ మేధను మరింత వేగంగా, అత్యవసరంగా కోడింగ్ వర్క్ఫ్లోలో అమలు చేయాలని చెప్పారు. దీనిద్వారా పనిలో వేగం పెరుగుతుందన్నారు.ఇదీ చదవండి: మెటా తీరుతో ఇతర కంపెనీలు సర్వనాశనంగూగుల్ ఫ్లాగ్షిప్ ఉత్పత్తుల కోసం టెక్నికల్ ఫౌండేషన్ బృందాలకు నేతృత్వం వహిస్తున్న బ్రియాన్ సలుజో ‘ఏఐ-సావీ’ని రూపొందించినట్లు చెప్పారు. ఏఐ సావీ గూగుల్.. కోర్సులు, టూల్కిట్లు, ప్రొడక్ట్ స్పెసిఫిక్ లెర్నింగ్ సెషన్లను అందించే ఒక అంతర్గత వేదికగా ఉంటుంది. ఈ సమావేశంలో గూగుల్ జెమినీ మోడల్స్తో ఇంజినీర్లకు సహాయపడటానికి డీప్ మైండ్తో అభివృద్ధి చేసిన శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. ఈ రంగంలో ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయని ఎంతోమంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. కృత్రిమ మేధలో ట్యాలెంట్ ఉన్న ఓ కంపెనీ ఉద్యోగులకు.. దిగ్గజ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాయి. కానీ వారు మాత్రం తమ బాస్ను వదిలిపెట్టకుండా.. ఆఫర్లను తృణప్రాయంగా భావించారు.మీరా మురాటీ 2025 ఫిబ్రవరిలో ఏఐ స్టార్టప్ 'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్' ప్రారంభించారు. ఇందులో పనిచేస్తున్నవారందరూ కూడా గతంలో పెద్ద కంపెనీలలో పనిచేసి వచ్చినవారే. అయితే వీరిలో కొందరికి.. 'మార్క్ జుకర్బర్గ్'కు చెందిన మెటా.. దాని AI సూపర్ ఇంటెలిజెన్స్ బృందంలో చేరడానికి ఒక బిలియన్ డాలర్లను (రూ.8,755 కోట్లు) ఆఫర్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.నిజానికి మీరా మురాటీ తన థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ ప్రారంభించి.. ఏడాది కూడా పూర్తి కాలేదు. అంతే కాకుండా ఈ కంపెనీ ఒక్క ఉత్పత్తిని కూడా మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ అప్పుడే ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ ఆఫర్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఏఐలో నైపుణ్యం ఉన్నవారికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకిథింకింగ్ మెషీన్స్ ల్యాబ్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం.. వారికి వచ్చిన ఆఫర్స్ వద్దనుకుని మీరా మురాటితో పాటు ఉండటానికే ఆసక్తి చూపించినట్లు సమాచారం. దీనికి కారణం మురాటీ నాయకత్వం.. భవిష్యత్ అంచనాలు కారణమై ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కాగా ఈ కంపెనీ మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు.ఎవరీ మీరా మురాటీ?ఇంజినీరింగ్ చేసిన మీరా మురాటీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’లో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశారు. ఆ తరువాత వర్చువల్ రియాలిటీ స్టార్టప్ ‘లిప్ మోషన్’లో పనిచేసి.. 2016లో ‘ఓపెన్ ఏఐ’లో చేరి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్, టూల్స్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ.. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీవో) స్థాయికి ఎదిగారు. సొంతంగా కంపెనీ స్థాపించాలనే తపనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’కి గుడ్బై చెప్పి.. థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ స్థాపించారు.అల్బేనియాలో పుట్టిన మీరా మురాటీకి చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సాంకేతిక జ్ఞానం పరిష్కారం చూపుతుందనేది ఆమె నమ్మకం. అదే ఈ రోజు ఎన్నో గొప్ప కంపెనీలను సైతం ఆకర్శించేలా చేసింది. -
‘ఏఐకి అంత సీన్ లేదు’
ఆధార్, యూపీఐ ఆవిష్కరణల్లో కీలకపాత్ర పోషించిన నందన్ నీలేకని భారత్లో కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉండబోతుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏఐ భారతదేశ జాబ్ మార్కెట్పై పెద్దగా ప్రభావం చూపదని చెప్పారు. అందుకు బదులుగా భారీగా సంపదను, అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. సాంకేతిక నిపుణులు ఏఐలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంతోపాటు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కోరారు.ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఐ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికారం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. ఈ ధోరణి ఇప్పటికే ప్రపంచ సాంకేతిక పర్యావరణ వ్యవస్థల్లో కనిపిస్తుంది. కానీ భారతదేశం అందుకు భిన్నమైన దృక్పథాన్ని నిర్మించాలి. ప్రపంచ శక్తులతో మనం పోరాడలేం. కానీ మన ప్రభావిత ప్రాంతంలో కోట్ల మంది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నూతన ఆవిష్కరణలు చేయాలి. ఉద్యోగం పోతుందని భయపడే బదులు నైపుణ్యాల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృత్రిమ మేధను ఉపయోగించాలి’ అని నీలేకని అన్నారు. -
బామ్మగారి లయన్... పిజ్జాలు తినడంలో నెంబర్వన్!
బామ్మగారి లయన్... పిజ్జాలు తినడంలో నెంబర్వన్! ‘ఏరా బుజ్జికొండా, పిజ్జాలు తింటావా!’ అని తన పక్కన కూర్చున్న సింహాన్ని అడిగింది బామ్మ. ‘నువ్వు తినిపిస్తే ఎందుకు తినను’ అన్నట్లుగా చూసింది సింహం. ‘అయితే తినూ’ అంటూ సింహానికి ఆప్యాయంగా పిజ్జా తినిపిస్తూ తాను కూడా ఒక ముక్క తిన్నది బామ్మ. మటన్ ముక్కలు తినే సింహం పిజ్జా ముక్కలు తినడం ఏమిటి! అడవిలో ఉండాల్సిన సింహం బామ్మ పక్కన పిల్లిలా కూర్చోవడం ఏమిటి!!ఇది కలియుగ వింత కాదు... ఏఐ (ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన సాంకేతిక వింత. ఈ ఏఐ వీడియోలో ఎక్కడా కృత్రిమత్వం కనబడదు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ సింహం– బామ్మ వీడియో వేలాది వ్యూస్తో దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Viral taii vlog (@taii_vloger) (చదవండి: Dog Therapy In Hyderabad: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'.) -
ఇదిగో ఈ 40 రకాల ఉద్యోగాలకు డేంజర్!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంలో భాగంగా చాట్ జీపీటీ ప్రవేశపెట్టినప్పటి నుంచి విశ్లేషకులు, నిపుణులు, సీఈఓలు వైట్ కాలర్ రోల్స్ లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏఐ ప్రభావం కలిగించే లేదా పూర్తిగా భర్తీ చేసే అవకాశం ఉన్న 40 రకాల ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ మద్దతుతో నిర్వహించిన ఒక తాజా అధ్యయనం జాబితా చేసింది.ఉపాధ్యాయులు, పాత్రికేయులు, కాల్ సెంటర్ ఏజెంట్లు వంటి వృత్తులు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఓపెన్ఏఐ, లింక్డ్ఇన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధన ప్రపంచ శ్రామిక శక్తిలోని వివిధ రంగాల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృత ప్రభావాన్ని ఎత్తిచూపింది.చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలను వేగంగా స్వీకరించడంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఈ ఏడాది ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే దాదాపు 15,000 తొలగింపులను ప్రకటించింది.ఏఐతో దెబ్బతినే ఉద్యోగాలుటెలిమార్కెటర్లు, ఉపాధ్యాయులు, కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, సైకాలజిస్టులు, న్యాయమూర్తులు, సామాజిక శాస్త్రవేత్తలు, న్యూస్ అనలిస్టులు, పాత్రికేయులు, టెక్నికల్ రైటర్లు, ప్రూఫ్ రీడర్లు, అనువాదకులు, సామాజిక కార్యకర్తలు, బీమా అండర్ రైటర్లు, ఆంత్రోపాలజిస్టులు, క్లినికల్ డేటా మేనేజర్లు, సర్వే పరిశోధకులు, చరిత్రకారులు, రాజకీయ శాస్త్రవేత్తలు, ఆర్బిట్రేటర్లు, ఎపిడెమియాలజిస్టులు, హెచ్ఆర్ స్పెషలిస్టులు, మధ్యవర్తులు, కెరీర్ కౌన్సిలర్లు, క్యూరేటర్లు, కరస్పాండెంట్లు, కాపీ రైటర్లు, ఎడిటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, లీగల్ సెక్రటరీలు, ట్రైనింగ్ స్పెషలిస్టులు, పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్టులు.పెద్దగా ముప్పు లేని ఉద్యోగాలుక్లీనర్లు, డిష్ వాషర్లు, కార్మికులు, కార్పెంటర్లు, పెయింటర్లు, రూఫర్లు, మెకానిక్లు, వెల్డర్లు, బచర్స్, బేకర్లు, డెలివరీ వర్కర్లు, వంటవారు, కాపలాదారులు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, మేస్త్రీలు, టైలర్లు. -
మరో ఐదేళ్లలో విభిన్న రంగాల్లో ఏఐ పాగా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు ప్రస్తుత ఉద్యోగుల స్థానాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థల్లోని క్లర్క్, మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో ఏజెంటిక్ ఏఐ పాగా వేసిందని సర్వీస్నౌ 2025 నివేదిక తెలిపింది. మానవులతో కలిసి పనిచేసే ఏజెంటిక్ ఏఐ పనులను ఆటోమేట్ చేయడమే కాకుండా పనిని ఎలా అంచనా వేయాలి.. మరింత సమర్థంగా ఎలా నిర్వహించాలో విశ్లేషించి అమలు చేస్తుంది.నివేదికలోని అంశాలుకంపెనీలు పేరోల్ క్లర్కులు, మేనేజర్ల స్థానంలో ఏఐ ఏజెంట్లను పూర్తిగా నియమిస్తున్నాయి.సిస్టమ్ అడ్మిన్లు, కన్సల్టెంట్ల స్థానంలో కంపెనీలు ఏఐ టూల్స్తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.ఏఐతో సంబంధం ఉన్న కాన్ఫిగరేటర్లు, ఎక్స్ పీరియన్స్ డిజైనర్లు, డేటా సైంటిస్టు పోస్టుల్లో కొత్తగా నియామకాలు చేపడుతున్నాయి.2030 నాటికి తయారీ రంగంలో 8 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం చెందుతాయి.రిటైల్లో 7.6 మిలియన్ ఉద్యోగాలు, ఉడ్యుకేషన్లో 2.5 మిలియన్ కొలువులు ప్రభావితం అవుతాయి.టెక్ పరిశ్రమల్లో కొత్తగా 3 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయి.భారత్లో 25% సంస్థలు కృత్రిమ మేధ అనుసరించేలా పరివర్తన దశలో ఉన్నాయి. ఈ విషయంలో సింగపూర్, ఆస్ట్రేలియా కంటే భారత్ ముందుంది.13.5% టెక్నాలజీ బడ్జెట్లు ఇప్పటికే కృత్రిమ మేధకు కట్టుబడి ఉన్నాయి.57% సంస్థలు ఏఐ సామర్థ్య లాభాలను నివేదించాయి.ఏఐ రీడిజైన్ చేసిన వర్క్ఫ్లోల నుంచి 63% ఉత్పాదకత పెరిగింది.సవాళ్లు ఇవే..ఏఐ వినియోగం పెరుగుతున్నా 30% సంస్థలకు డేటా భద్రత ఆందోళనగా మారుతుంది.టెక్ కంపెనీల్లోని 26 శాతం ఉద్యోగులకు ఏఐ భవిష్యత్తు నైపుణ్యాలపై అవగాహన లేదు.కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో కృత్రిమ మేధను ఏమేరకు నమ్మాలో ప్రశ్నార్థకంగా మారుతుంది.ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’ -
‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, వ్యవస్థలు మార్పుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్గేట్స్ అన్నారు. లేదంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఏఐ ఉత్పాదకతను పెంచే క్రమంలో చాలామంది సిబ్బంది తమ కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.ఏఐ వాడకం అనివార్యం‘కృత్రిమ మేధ నేతృత్వంలోని ఆటోమేషన్ ఒక సానుకూల మార్పు. ఇది ప్రజలను, ఉద్యోగులను ఇతర మెరుగైన కొలువులు చేయడానికి సాయం చేస్తుంది. ఉత్పాదకతను మెరుగుపరిచే క్రమంలో ఏఐ వాడకం అనివార్యం అవుతుంది. కాబట్టి అందుకు అనువుగా మార్పులకు సిద్ధంగా ఉండాలి. లేదంటే సమస్యలు వస్తాయి. ఏఐ వేగంగా విస్తరిస్తోంది. అంత వేగంగా వచ్చే మార్పులకు సర్దుకుపోయే సమయం ఉండదనేదే ప్రశ్న’ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎంత వేగంగా అమలవుతున్నాయోనన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.రోబోటిక్ ఆయుధాలు..రాబోయే రోజుల్లో అనేక ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడిన తర్వాత భవిష్యత్తులో మాన్యువల్ లేబర్ తీవ్రంగా ప్రభావితం చెందుతుంది. ‘రోబోటిక్ ఆయుధాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. కానీ అవి అందుబాటులోకి వస్తే, శ్రామిక శక్తిని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి’ అని గేట్స్ చెప్పారు.ఏజీఐతో ముప్పు‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) ఆన్లైన్ సేల్స్ లేదా కస్టమర్ సర్వీస్ వంటి సంక్లిష్ట పనులను మానవుల కంటే మెరుగ్గా చేయగలదు. ఏజీఐ వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాల ద్వారా సర్వీసు అందిస్తాయి. యంత్రాలు తక్కువ ఖర్చుతో మరింత కచ్చితత్వంతో పనులను నిర్వహించగలిగితే మాత్రం అది పెద్ద మార్పు అవుతుంది’ అని గేట్స్ తెలిపారు.ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులకు పిన్ అవసరం లేదు?కచ్చితమైన డేటాఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎలా వాడుతున్నారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..‘ఏఐ పురోగతిలో ఉన్న వేగం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కఠినమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఏఐ రీసెర్చ్ టూల్స్ను ఉపయోగిస్తాను. అయితే వాటిలోని అంశాలను ధ్రువీకరించేందుకు నిపుణులతో తరచూ తనిఖీ చేస్తాను. విచిత్రంగా వారుకూడా చాలాసార్లు అందులోని అంశాలు నిజమనే చెబుతారు’ అని అన్నారు. -
దేశంలో ఏఐ, ఎడ్టెక్ల విస్తరణ.. కానీ..
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్) నైపుణ్యాలకు డిమాండ్ ఆమాంతం పెరగడంతో అందుకు తగ్గట్టుగానే మన దేశంలో, రాష్ట్రంలో ఎడ్ టెక్ రంగం క్రమంగా గణనీయ వృద్ధిని సాధిస్తోంది. ఏఐ కేంద్రీకృత కోర్సుల విస్తరణకు విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలు ఊపందుకుంటున్నాయి. విద్యా రంగంలో, నైపుణ్యాలను పెంచుకునే విషయంలో ఏఐను ఏకీకృతం చేయడానికి ఉద్దేశించి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ దిశలో ముందుకు సాగుతున్నాయి. ఏఐ, ఎడ్టెక్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో ఈ మార్కెట్ పరిమాణంలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.వివిధ పరిశ్రమల్లో ఏఐ నైపుణ్యాలకు ఆదరణ పెరగడంతో ఏఐ, ఎంఎల్ సంబంధిత రంగాల్లో నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు అధిక డిమాండ్ ఏర్పడుతోంది. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఏఐ, ఎడ్టెక్లకు కేంద్రంగా అనేక సంస్థలు ప్రత్యేక కోర్సులు, శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు తమ ఏఐ కోర్సు కేటలాగ్లను విస్తరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వపరంగానూ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, చలనశీలత వంటి రంగాల్లో ఏఐను ఉపయోగించడంపై దృష్టి సారిస్తోంది. ఏఐ విద్యకు ప్రొత్సాహంతోపాటు సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏఐ, రొబోటిక్స్ కోర్సులను ప్రవేశపెట్టింది. పరిశ్రమ సంబంధిత ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అవకాశాలు అందించడానికి సంస్థలు పరిశ్రమలు, టెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఉద్యోగాలున్నా నైపుణ్యాల కొరతకృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లర్నింగ్ (ఎంఎల్)లలో ప్రావీణ్య సాధన ఎకో సిస్టమ్ పూర్తిస్థాయిలో ఇంకా మన దేశంలో ఏర్పడలేదని స్మార్ట్ స్టెప్స్ ట్రైనింగ్ అకాడమీ ఫౌండర్ నానబాల లావణ్యకుమార్ అభిప్రాయపడ్డారు. కొవిడ్ సమయంలో కంపెనీలు, ఉద్యోగులంతా క్లౌడ్ ఆధారిత టెక్నాలజీ, అప్లికేషన్లపైనే దృష్టి పెట్టారని.. కానీ అదే సమయంలో అమెరికా, చైనా మాత్రం జెనరేటివ్ ప్రీ–ట్రెయిన్డ్ ట్రాన్స్ఫార్మర్ (జీపీటీ)లను తయారు చేసి రేసులో ఎంతో ముందుకెళ్లిపోయాయని చెప్పారు. కానీ భారత్ మాత్రం సంప్రదాయ కోర్సులకే పరిమితమై వెనుకబడిపోయిందన్నారు. ఎట్టకేలకు విశ్వవిద్యాలయాలు అనేక ఏఐ, ఎంఎల్ కోర్సులను ప్రారంభించినప్పటికీ సంక్లిష్టమైన ఈ నైపుణ్యాలను నేర్చుకొనేందుకు అవసరమైన మేర ఫ్యాకల్టీ లేరని లావణ్యకుమార్ అన్నారు. అందుకే గుణాత్మకమైన విద్యను అందించడంలో అధిక శాతం కళాశాలలు, ట్రైనింగ్ కంపెనీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. అందుకే మార్కెట్లో డిమాండ్ ఉన్నా కావాల్సిన స్కిల్స్ లేక యువత వెనుకబడుతున్నారని.. ఏఐ ఆధారిత కంపెనీలు సైతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయన్నారు.ఇదీ చదవండి: మర మనుషులు.. కేవలం రూ.5 లక్షలే!కాలేజీల్లో మౌలిక సదుపాయాలేవి?చైనాతో పోలిస్తే భారత్లోని ఎడ్టెక్ కంపెనీల సామర్థ్యాలు పూర్తిస్థాయిలో లేవని క్వాలిటీ థాట్ ఫౌండర్, కెరీర్ గైడెన్స్ కోచ్ రమణ భూపతి అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రతిభావంతులంతా విదేశాలకు వలస వెళ్లడం కూడా దీనికి కారణమన్నారు. ఏఐ రంగంలో నూతన ఆవిష్కరణలకు తగ్గట్టుగా ఎడ్టెక్ కంపెనీలు వేగాన్ని పెంచుకోలేకపోవడం, ఏఐ నైపుణ్యాలకు అవసరమైన గణితంలో లోతైన పరిజ్ఞానం విద్యార్థులకు కొరవడటం తదితర కారణాల వల్ల భారత్ కొంత వెనుకబడిందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఏఐను బోధించాలంటే ఒక సరైన కాన్ఫిగరేషన్ (రూ.1.20 లక్షల ధర, గ్రాఫిక్ కార్డ్ తదితరాలతో) ఉన్న కంప్యూటర్ కావాలని.. కానీ మన దేశంలో అలాంటి కంప్యూటర్లు లేని కాలేజీలే 99 శాతం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎడ్టెక్ కంపెనీలు ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణనిస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
ఓలా కృత్రిమ్లో రెండో విడత లేఆఫ్స్
ఓలాకు చెందిన భవీష్ అగర్వాల్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘కృతిమ్’ రెండో విడత ఉద్యోగాలను తొలగించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విడతలో 100 మందికి పైగా సిబ్బందిని ఇంటికి పంపినట్లు తెలుస్తుంది. ఈ లేఆఫ్స్లో ప్రధానంగా ఇటీవలే కంపెనీలో చేరిన లింగ్విస్టిక్స్ బృందంలో పని చేస్తున్న వారిని అధికంగా తొలగించినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి.జూన్లో కృతిమ్ మొదటి రౌండ్ ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. అందులో భాగంగా డజనుకుపైగా సిబ్బందికి లేఆఫ్స్ ప్రకటించింది. తాజాగా 100కుపైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తుంది. ఈ తొలగింపులు కంపెనీ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగమని, ఉన్న వనరులను మెరుగ్గా నిర్వహించడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు.ఇదీ చదవండి: బంగారు బాతులను చంపేస్తున్నారు.. దేశానికి సిగ్గుచేటుజూన్లో కంపెనీ కృత్రిమ్లో ఏఐ అసిస్టెంట్ ‘కృతి’ని ప్రారంభించింది. దీనికి దాదాపు 80 శాతం శిక్షణ ఇచ్చామని, గతంలో మాదిరిగా తమకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం లేదని ఒక అదికారి తెలిపారు. కృత్రిమ్ గతంలో కృత్రిమ మేధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో భవీష్ అగర్వాల్ కృత్రిమ్ ఏఐ ల్యాబ్స్ను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి రూ.2,000 కోట్లు కేటాయించారు. వచ్చే ఏడాది ఈ సంఖ్యను రూ.10,000 కోట్లకు పెంచే ప్రణాళికలున్నట్లు తెలిపారు. -
మెటా వారి ఇమాజిన్ మీ
‘ఇమాజిన్ మీ’ అనే సరికొత్త ఏఐ–పవర్డ్ ఫీచర్ని తీసుకువచ్చింది మెటా ఏఐ. ఈ ఫీచర్తో టెక్ట్స్ ప్రాంప్ట్ ఉపయోగించి యూజర్లు తమ ఏఐ ఇమేజ్లను జనరేట్ చేయవచ్చు. ‘ఇమాజిన్ మీ’ ఫీచర్ని వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ చాట్విండోస్లో ఉపయోగించవచ్చు.అక్యురేట్, కస్టమైజ్డ్ ఫోటోగ్రాఫ్స్ కోసం ‘ఇమాజిన్ మీ’ యూజర్లకు సంబంధించి ఫ్రంట్, లెఫ్ట్, రైట్ ఫేస్ల సెల్ఫీలను అడుగుతుంది.‘ఇమాజిన్ మీ యాజ్ ఏ నైంటీస్ గ్యాంగ్స్టర్’ ‘ఇమాజిన్ మీ యాజ్ ఏ కౌబాయ్’లాంటిప్రాంప్ట్ను యూజర్లు ఇవ్వవచ్చు. ప్రామ్ట్ సెట్టింగ్స్తో అదనపు మార్పులు కూడా చేయవచ్చు.ఉదా: ఇమాజిన్ మీ యాజ్ ఏ కౌబాయ్, బట్ ఆన్ ది మూన్, వీయరింగ్ ఫ్యూచరిస్టిక్ క్లాత్స్ఇమాజిన్ యాజ్ ఏ నైంటీస్ గ్యాంగ్స్టర్ సిప్పింగ్ కాఫీ ఎట్ యాన్ ఇండియన్ బీచ్తమ ఏఐ–జనరేటెడ్ ఇమేజ్లు సంతృప్తికరంగా లేకపోతే ఎడిట్, రీజెనరేట్, రిమూవ్ ఇమేజెస్లాంటి ఆప్షన్లను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. -
గూగుల్ క్రోమ్కు సవాల్.. ఎన్విడియా ఏఐ వచ్చేస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా వెబ్ బ్రౌజర్ల మార్కెట్ లీడర్గా కొనసాగుతున్న ఆల్ఫాబెట్కు చెందిన గూగుల్ క్రోమ్కు సవాల్ విసిరేందుకు టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఎన్విడియాకు చెందిన పర్పెక్స్సిటీ ఏఐ సిద్ధమవుతోంది. త్వరలోనే కామెట్ పేరుతో ఏఐ ఆధారిత సామర్థ్యంగల వెబ్ బ్రౌజర్ను తీసుకురానుంది. – సాక్షి, సెంట్రల్డెస్క్మార్కెట్.యూఎస్ అనే సంస్థ నివేదిక ప్రకారం 2024లో 4.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్ల మార్కెట్.. 2034 నాటికి 76.8 బిలియన్ డాలర్లకు చేరుకొనే అవకాశం ఉంది. స్టాట్కౌంటర్ అనే సంస్థ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి ప్రపంచ వెబ్ బ్రౌజర్ల మార్కెట్లో క్రోమ్ 68 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికం మంది యూజర్లు ఉపయోగిస్తున్న వెబ్ బ్రౌజర్గా మార్కెట్ను సుస్థిరం చేసుకొని ఇతర ప్రముఖ వెబ్ బ్రౌజర్లయిన సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్ఫాక్స్కు అందనంత ఎత్తులో ఉంది.యూజర్లకు లభించేవి ఇవీ..సాధారణ బ్రౌజర్లతో పోలిస్తే ఏఐ ఆధారిత బ్రౌజర్లు యూజర్లు కోరిన కంటెంట్ను సంక్షిప్తంగా అందించగలవు. అలాగే టాస్క్లను ఆటోమేట్ చేయగలవు. ఉదాహరణకు ఈ–మెయిళ్లకు ఆటోమెటిక్గా రిప్లైలు పంపడం, సోషల్ మీడియా పోస్ట్లను షెడ్యూల్ చేయడం, దరఖాస్తుల్లోని డేటాను సంగ్రహించడం లాంటివి అన్నమాట.ముఖ్యంగా సందర్భానుసారంగా జవాబులు అందించగలవు. అంటే యూజర్లు అందించే ఇన్పుట్లు, డేటా హిస్టరీని పరిగణనలోకి తీసుకొని, వాటిని విశ్లేషించి జవాబులను అందించడం, వివిధ డేటా సోర్స్ల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి నేరుగా సమాధానాలు ఇవ్వ డం చేయగలవు. అపాయింట్మెంట్ల బుకింగ్లు, ఉత్పత్తులను పోల్చడం వంటి సంక్లిష్ట పనులను కూడా చక్కబెట్టగలవు. -
ఎవరీ మీరా మురాటీ..? టెస్లా టు థింకింగ్ మెషిన్ ల్యాబ్..
మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన మీరా మురాటీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’లో ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేసింది. ఆ తరువాత వర్చువల్ రియాలిటీ స్టార్టప్ ‘లిప్ మోషన్’లో పనిచేసింది. 2016లో ‘ఓపెన్ ఏఐ’లో చేరిన మీరా రకరకాల ప్రాజెక్ట్లలో ముఖ్యపాత్ర పోషించింది. అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్, టూల్స్ డెవలప్మెంట్లో కీలకంగా వ్యవహరించింది. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీవో) స్థాయికి చేరింది.సొంతంగా కంపెనీ స్థాపించాలనేది మీరా మురాటీ చిరకాల స్వప్నం‘డూ మై వోన్ ఎక్స్ప్లోరేషన్’ అంటూ గత సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ఏఐ’కి గుడ్బై చెప్పింది. ఫిబ్రవరి 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) స్టార్టప్ ‘థింకింగ్ మెషిన్ ల్యాబ్’ మొదలుపెట్టింది. ‘టెస్లా’ను విడిచి ‘ఓపెన్ఏఐ’లో చేరడానికి గల కారణం గురించి ఇలా చెప్పింది...‘నాకు మొదటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయాలపై ఆసక్తి. ఆ ఆసక్తితోనే ఓపెన్ ఏఐలో చేరాను’. ‘ఓపెన్ఏఐ’ని విజయవంతం చేయడంలో మీరా కృషి ఎంతో ఉంది.అల్బేనియాలో పుట్టిన మీరా మురాటీకి చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి. ‘జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సాంకేతిక జ్ఞానం పరిష్కారం చూపుతుంది’ అంటుంది మీరా. టెక్నాలజీలో హాటెస్ట్ కంపెనీలుగా పేరున్న ‘టెస్లా’ ‘ఓపెన్ఏఐ’లను వదులుకొని సొంత స్టార్టప్ మొదలుపెట్టిన మీరా మురాటీ విజయం సాధించగలదా?‘కచ్చితంగా’ అని చెప్పడానికి ఎన్నో సంస్థలలో ఆమె అద్భుతమైన, ప్రతిభావంతమైన పనితీరు బలమైన సాక్ష్యం. (చదవండి: మనకు మనమే స్పెషల్...) -
డిగ్రీ ఫిజిక్స్.. ఏఐ ట్రెండ్స్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి ఇక నుంచి కేన్సర్ చికిత్సలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. హృద్రోగ చికిత్సలో ఎలక్ట్రికల్ వేవ్స్ మెకానిజం అందించబోతున్నాడు. బీఎస్సీ డిగ్రీ చేసిన విద్యార్థులే వైద్య రంగంలోని టెక్నికల్ విభాగంలో చక్రం తిప్పే వీలుంది. ఈ దిశగా డిగ్రీలో ఫిజిక్స్ పాత్రను తీర్చిదిద్దుతున్నారు. సిలబస్ మార్పుపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ నేతృత్వంలోని కమిటీ కొన్నేళ్లుగా కసరత్తు చేస్తోంది. మారిన సిలబస్కు మంగళవారం మండలిలో జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇక నుంచి అన్ని యూనివర్సిటీల్లోనూ ఫిజిక్స్ సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. పాత చాప్టర్లన్నీ నవీకరించి అందించబోతున్నారు. ప్రతి చాప్టర్లోనూ కాలానుగుణంగా వస్తున్న మార్పులను తీసుకొచ్చారు. డిజిటల్ విధానాలను ఇందులో జోడించారు. తరగతి బోధనే కాకుండా, అనుభవ పూర్వకమైన విద్యా విధానం ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రాబోతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులు కూడా ఉపాధికి బాటలు వేయాలన్న లక్ష్యంతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేశారు. మెకానిక్స్లో మజా డిగ్రీ ఫిజిక్స్లో మెకానిక్స్ అండ్ ఆస్కిలేషన్స్ కీలకమైంది. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్తో వైద్య పరికరాలు పనిచేస్తున్న ఈ కాలంలో దీని ప్రాధాన్యత ఎక్కువే. ఎనర్జీ, రొటేషనల్ మోషన్, తరంగ ధైర్ఘ్యం వంటి చాప్టర్స్ ప్రధానమైనవి. న్యూటన్ లా ఆధారంగా ఉండే ఈ చాప్టర్ను మరింత సరళీకరించారు. ఏఐతో పనిచేసే యంత్ర పరికరాలకు అనుగుణంగా సిలబస్లో ప్రాక్టికల్ వర్క్ జోడించారు. దీంతో విద్యార్థి కార్పొరేట్ వైద్య రంగంలో యంత్ర పరికరాల నిర్వహణలో మంచి ఉపాధి అవకాశాలు పొందే వీలుంది. తరంగాలు, ఎల్రక్టానిక్స్ కదలికలు వంటి మార్పులను రికార్డు చేసే రేడియేషన్ ఫిజిక్స్ను ఈసారి అత్యాధునిక టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ అందించబోతున్నారు. మోడ్రన్ ఫిజిక్స్లో మెరుపులు విద్యుత్ రంగంతోపాటు అత్యాధునిక లేబొరేటరీల్లో పనిచేసే యంత్ర పరికరాలకు ఆయువు పట్టు మోడ్రన్ ఫిజిక్స్. ఏఐ వచ్చిన తర్వాత అటామిక్, సబ్ అటామిక్ లెవల్స్ను బేరీజు వేసే విధానం పూర్తిగా మారిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మోడ్రన్ ఫిజిక్స్లో ప్రాక్టికల్ వర్క్ను పెంచబోతున్నారు. అత్యాధునిక యంత్రాల్లో క్వాంటం మెకానిక్స్ను పరిశీలించేలా ప్రాజెక్టు వర్క్ పెంచుతున్నారు. అణు ఇంధన రంగంలో వచ్చిన మార్పులను గమనించేలా న్యూక్లియర్ ఫిజిక్స్ చాప్టర్స్, సోలార్ ఎనర్జీ ట్రాకింగ్ విధానాల చాప్టర్స్ను డిగ్రీలో కొత్తగా నేర్చుకునే అవకాశం ఇక నుంచి ఉండబోతోంది. వేవ్స్, ఆప్టిక్స్లో వెరైటీ ఫిజిక్స్లో మరో కీలకమైన చాప్టర్ వేవ్స్ అండ్ ఆప్టిక్స్ పూర్తిగా ఉపాధికి బాటలు వేసేలా ఉండాలని నిపుణులు నిర్ణయించారు. తరంగాలు వాటి గతి, ధ్వని తరంగాలు, కాంతి వేగం, కాంతిలో మార్పులు తెలిపే ఈ చాప్టర్ను పూర్తిగా ఇప్పుడున్న టెక్నాలజీకి అనుసంధానం చేస్తారు. తరగతిలో కేవలం బోధన సాగితే, ప్రాక్టికల్ నాలెడ్జ్ మొత్తం ప్రధాన కంపెనీల ద్వారా నేర్చుకునే వీలుంటుంది. ఇలాంటి అనేక మార్పులతో కూడిన ఫిజిక్స్ సిలబస్ ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రాబోతోంది ఉపాధి పెంచడానికే మార్పులు సంప్రదాయ డిగ్రీ కోర్సులను ఆధునీకరిస్తున్నాం. నేటి తరం ఆలోచనలు, టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సిలబస్ రూపొందిస్తున్నాం. ఫిజిక్స్లో ఆధునిక వైద్య రంగానికి ఉపయోగపడే చాప్టర్లు జోడిస్తున్నాం. విద్యార్థి ప్రాక్టికల్గా విషయ పరిజ్ఞానం సంపాదించేలా ప్రాజెక్టు పనులు ఇవ్వబోతున్నాం. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్. -
టెక్ కంపెనీల్లో భారీగా కొలువుల కోతలు
టెక్నాలజీ అభివృద్ధి అనేది రెండు వైపులా పదనున్న కత్తిగా వ్యవహరిస్తోందనే వాదనలున్నాయి. ఆర్థికాభివృద్ధి, టెక్ వ్యవస్థలను ముందుకు నడిపేందుకు కొత్త ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడుతుంటే.. దీనివల్ల లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. 2025 ప్రథమార్ధం ముగిసిన నేపథ్యంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇతర టెక్ దిగ్గజాల్లోని వేలాది మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడమే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.టాప్ కంపెనీల్లో..2025 జనవరి-జులై మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రధాన టెక్ కంపెనీలు సుమారు 91,000 ఉద్యోగాలను తొలగించగా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ గణనీయంగా తమ సిబ్బందిని తగ్గించాయి. స్టార్టప్లు, యునికార్న్లతోపాటు ఆధునిక కంప్యూటింగ్కు మార్గదర్శకత్వం వహిస్తున్న, కృత్రిమ మేధ రేసులో ముందున్న సంస్థల నుంచి ఈ ఉద్యోగ కోతలు ఎక్కువయ్యాయి.ఎవరేం చెప్పినా కోతలే ప్రధానంలాజిస్టిక్స్, ఏడబ్ల్యూఎస్ సపోర్ట్, ఇంటర్నల్ ఆపరేషన్స్ విభాగాల్లో ఇప్పటివరకు అమెజాన్ సుమారు 23,000 ఉద్యోగాలను తగ్గించింది. సేల్స్, కస్టమర్ సపోర్ట్, నాన్ ఏఐ ఆర్ అండ్ డీ విభాగాల్లో 17,500 ఉద్యోగాలను మైక్రోసాఫ్ట్ తొలగించింది. సీఈఓ సత్య నాదెళ్ల ఈ చర్యను ‘తదుపరి తరం ఉత్పాదకత దిశగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించడం’గా అభివర్ణించారు. అడ్వర్టైజింగ్, హెచ్ఆర్, లెగసీ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం టీమ్లతో సహా ప్రపంచవ్యాప్తంగా 21,000 ఉద్యోగాలను గూగుల్ తొలగించింది. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్’ విధానంతో కంపెనీ ట్రాన్సఫర్మేషన్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సుందర్ పిచాయ్ తెలిపారు.ఏఐ ఆర్ అండ్ డీలో పెట్టుబడిఈ కోతల వల్ల కంపెనీలకు భారీగా వ్యయం మిగులుతుంది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం దీన్ని వెచ్చిస్తున్నాయి. ఈ మూడు సంస్థలు కలిసి 2026 నాటికి ఏఐ ఆర్ అండ్ డీ, మౌలిక సదుపాయాలకు 150 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హెడ్ కౌంట్ పడిపోవడంతో కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు పెరిగాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ సంస్థల షేర్ల ధరలు ఇటీవల 18-27 శాతం మధ్య పెరిగాయి.ఇదీ చదవండి: ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటుకు చర్చలు ప్రారంభంకొన్ని ఉద్యోగాలకు డిమాండ్ఏఐ పెరుగుతున్నా కొన్ని ఉద్యోగాలకు మాత్రం డిమాండ్ అధికమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రాంప్ట్ ఇంజినీర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథిక్స్, మోడల్ ట్రైనర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. సరైన నైపుణ్యాలున్న వారికి కంపెనీలు ఎంతైన వెచ్చించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇటీవల మెటా ప్యాకేజీల వల్ల తెలుస్తుంది. ఏఐ టెక్ నిపుణులకు సుమారు రూ.830 కోట్ల ప్యాకేజీలను సైతం ప్రకటిస్తోంది. -
దేశంలో తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్ సెంటర్
చెన్నై: ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ప్రధాన అడుగు పడింది. దేశంలో తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇందు కోసం లైఫ్ సైన్సెస్ పై దృష్టి సారించిన ఏఐ కంపెనీ అజిలిసియం, శ్రీ రామచంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (SRIHER) అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.మెరుగైన రోగ నిర్ధారణ, వ్యక్తిగతీకరించిన చికిత్స, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కోసం ఏఐ ఆధారిత సాధనాలను అభివృద్ధి చేయడం, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, డిజిటల్ ట్విన్స్, స్మార్ట్ హాస్పిటల్ టెక్ వంటి డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ రూపొందించడం క్లినికల్ డేటా నాణ్యత, ఇంటర్ ఆపరేబిలిటీ, పరిశోధన సంసిద్ధతను మెరుగుపరచడానికి క్లీన్ హెల్త్ డేటా ఇనిషియేటివ్ను క్రియేట్ చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలు.ఒప్పందంలో భాగంగా ఏఐ టూల్స్, జీఎన్ఏఐ, డేటా సైన్స్, అనలిటిక్స్ వంటివి అగిలిసియం సంస్థ సమకూర్చనుండగా రామచంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్లినికల్ డేటాసెట్లు, డొమైన్ నిపుణులు, ఆసుపత్రి వాతావరణం వంటివి కల్పించనుంది. వీటితోపాటు అకడమిక్ సహకారంలో భాగంగా హెల్త్ కేర్ లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సర్టిఫికేట్ ప్రోగ్రామ్ను ప్రారంభించనుంది. ఔషధ ఆవిష్కరణ, రోగనిర్ధారణ, రోగి సంరక్షణలో భవిష్యత్తు ప్రతిభకు శిక్షణ ఇవ్వనుంది. -
టెక్నాలజీతో మేలెంత? కీడెంత?
రోజుకో కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వస్తున్న కాల మిది. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, తయారీ రంగం... ఇలా అన్ని చోట్లా కృత్రిమ మేధ విస్తరిస్తోంది కూడా. అయితే... నిత్యజీవితంలోకి చొచ్చుకొచ్చేస్తున్న కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికత మన ఆలోచనా శక్తిపై చూపుతున్న ప్రభావం ఏంటి? వీటిపై ఆధారపడుతూ మనం మెదళ్లతో ఆలోచించడం తగ్గించేస్తున్నామా? తార్కికత, జ్ఞాపకశక్తి, హేతుబద్ధత వంటి మన మేధోశక్తులను టెక్నాలజీ కోసం చేజేతులా వదులుకుంటున్నామా?టెక్నాలజీ ప్రభావం మనపై ఎలా ఉంటుందో సులువుగా అర్థం చేసుకోవాలంటే... మొబైల్ అప్లికేషన్ల వాడకాన్ని గమనించండి. సోషల్ మీడియాలో రెండు, మూడు నిమిషాలుండే షార్ట్ వీడియోలు, రీల్స్కు కొన్ని కోట్ల మంది బానిసలైపోయారంటే అతిశయోక్తి కాదు. గంటల కొద్దీ పొట్టి వీడియోలు చూస్తూండటం తెలిసిందే. ఈ వ్యసనంలో మన మెదడుకు పనేమీ లేదు. చకచక కనిపిస్తున్న సమాచారాన్ని స్వీకరించడం మినహా. అయితే ఇలా చేయడం వల్ల మన మెదడు చాలా వేగంగా వినోదం అనే అనుభూతిని పొందుతుంది. ఇలా రోజూ గంటల తరబడి చూడటం అల వాటైన తర్వాత మన ఏకాగ్రత దెబ్బతింటుంది. డిజిటల్ డివైసెస్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడిపితే మన మెదడులోని నాడీ మార్గా(న్యూరల్ పాథ్వే)లలో మార్పులు జరుగుతాయని ఇప్పటికే జరిగిన కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.డిజిటల్ టూల్స్ జ్ఞాపకశక్తితో పని లేకుండా చేయ డమే కాకుండా... సంక్లిష్టమైన పనులను కూడా సులు వుగా అర్థమయ్యేలా చేయడం ద్వారా ఆలోచించే అవ సరం లేకుండా చేస్తాయి. ఇంకో మాటలో, నేర్చుకునేందుకు నేరుగా అవకాశం కల్పించకుండా విషయా లను అరటిపండు ఒలిచినట్టు ఒలిచి పెడతాయన్న మాట. అయితే ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ డిజైన్ బాగా ఉంటే మనకు మేలే జరుగుతుంది. ఆటో కంప్లీట్, డిజిటల్ కాలిక్యులేటర్లు, వ్యాకరణాన్ని సరిచేసే టూల్స్ వంటివి మన పనిని సులువు చేయడంతోపాటు ఈ పనులపై పెట్టాల్సిన శ్రమను తగ్గిస్తాయి. ఇంటర్నెట్, డిజిటల్ టూల్స్ను తగిన రీతిలో వాడుకుంటే మన మెదడు సమాచారాన్ని మరింత సమర్థంగా ప్రాసెస్ చేయగలదు. అవసరమైన విషయాలను జ్ఞాపకాల పొరల్లోంచి మెరుగ్గా అందివ్వగలదు. తద్వారా మన మేధాశక్తి మెరుగవుతుంది. ఇంటర్నెట్ ద్వారా మన మేధకు ఎదురయ్యే సవాళ్లూ ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా అతిగా సమాచారం అందడం వల్ల మెదడు దేనిని గ్రహించాలో తెలియక ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా నేర్చుకునే సామర్థ్యం తగ్గుతోంది. అధిక సమచారం మన నిర్ణయ సామర్థ్యంపై ప్రభావం చూపుతుందనీ, మేధపై ఒత్తిడిని పెంచుతుందనీ... ఫలితంగా నేర్చుకున్నది మనకు గుర్తుండే అవకాశాలు తగ్గిపోతాయనీ ఇప్పటికే జరిగిన పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. తగిన రీతిలో మన మెదడును వాడుకోకపోతే కాలక్రమంలో దీని నిర్మాణంలోనూ తేడాలొస్తాయి. అయితే టెక్నాలజీ నేరుగా మెదడు కుంచించుకు పోయేలా చేస్తుంది అనేందుకు ప్రస్తుతానికి స్పష్టమైన రుజువుల్లేవు. మన మెదడులోని న్యూరాన్లు అవసరా నికీ, కొత్త పరిస్థితులకూ, టూల్స్కూ తగ్గట్టుగా తమని తాము మార్చుకోగలవు. తగిన విధంగా వాడుకోక పోవడం వల్ల మెదడు చేసే కొన్ని పనుల సామర్థ్యం తగ్గవచ్చునేమో కానీ... టెక్నాలజీ ద్వారా కొన్నింటిని పెంచుకోవచ్చు కూడా. వీడియో గేమ్లను ఉదాహ రణగా తీసుకుంటే... వీటితోప్రాదేశిక తార్కికత (స్పేషి యల్ రీజనింగ్), మల్టీటాస్కింగ్ సామర్థ్యాలు పెరుగు తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అధిగమించడమెలా?డిజిటల్ టెక్నాలజీల ద్వారా వస్తున్న మేధో సంబంధిత సమస్యలను అధిగమించేందుకు: సోషల్ మీడియా బ్రౌజింగ్ లేదా ఇతర డిజిటల్ అలవాట్లను రోజులో నిర్దిష్ట సమయానికి పరిమితం చేయాలి. వారంలో ఒక రోజు స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్లో షార్ట్స్, రీల్స్ను చూడకుండా నియంత్రించుకోవాలి. ఏకాగ్రతను, వాస్తవికంలో ఉండేట్టు చేసే ‘మైండ్ఫుల్ నెస్ టెక్నిక్లను ఉపయోగించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మన మేధాశక్తికి బలం చేకూరుస్తుందనీ, జ్ఞాపకశక్తిని పెంచడంతోపాటు ఇతర లాభాలు చేకూరుస్తుందనీ పరిశోధనలు చెబు తున్నాయి. పుస్తకాలు చదవడం మన ఏకాగ్రతను పెంచేందుకు మంచి మార్గం. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘డిజిటల్ డీటాక్స్’ను మొదలు పెట్టాలి. సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్ను నిర్దిష్ట సమయం పాటు దూరంగా ఉండే ఈ డిజిటల్ డీటాక్స్ వల్ల టెక్నాలజీపై ఆధారపడే అల వాటు తగ్గుతుంది. అలాగే ప్రకృతికి దగ్గరగా జీవించడం, కళల పట్ల అభిరుచిని పెంచుకోవడం వంటివి సత్ఫలితాలను ఇస్తాయి. రోజూ తగినంత సమయం నిద్రపోవడం కూడా మన జ్ఞాపకశక్తి బలపడేందుకు, మేధోశక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ పద్ధ తులు అన్నింటినీ పాటించడం ద్వారా టెక్నాలజీ సవాళ్లను అధిగమించవచ్చు.బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కృత్రిమ రచన
ఆత్మ అనేది కేవలం స్వర్గలోక సంబంధి కాదు. దానికి భౌతిక ఉనికి లేనంతమాత్రాన అది భావ వాదులకు మాత్రమే చెందినది కాదు. అదేంటో చూపలేకపోయినా, అది లేకపోవడమంటే ఏమిటో మనకు తెలుసు. ఈ మెటీరియలిస్టు ప్రపంచంలో ఆత్మగల్ల మనుషులను వెతికే ప్రయత్నం కాదిది. కృత్రిమ మేధ (ఏఐ) సందర్భంలో ఆత్మ ప్రాధాన్యతను అర్థం చేయించాలన్న ఆరాటం. మానవీయ సహజ మేధనూ, యాంత్రిక కృత్రిమ మేధనూ విడదీస్తున్నది ముఖ్యంగా ఆ ఒక్కటే!‘ఈ కంప్యూటర్ కాలంలో’ అని చెప్పడం నుంచి, ‘ఈ కృత్రిమ మేధ కాలంలో’ అనడం వరకు పయనించాం. మానవ నాగరికత ఒక క్రమ పరిణామమే అయినా, అది ఒక్కోసారి పెద్ద అంగ వేస్తుంది. నిప్పును పుట్టించడం, విద్యుత్ను కనుగొనడం, ఇంటర్నెట్ లాంటి మరో విప్లవాత్మకమైన మార్పు కృత్రిమ మేధ అని పండితులు అంటున్నారు. మనిషి తాను ఎదిగే క్రమంలో ఎన్నో ఉపకరణాలనూ, సాంకేతిక పరిజ్ఞానాలనూ రూపొందించుకున్నాడు. ఆ ఉపకరణాలు, పరిజ్ఞానాల ఊతంగా మరింత ఎదిగాడు. కానీ ఏఐ కేవలం మనిషి చేతిలో మరో పనిముట్టు కాదు, మరో అద నపు పరిజ్ఞానం అంతకన్నా కాదు. అంతకు మించి! పర్యావరణ పరిష్కారాలు సూచిస్తుందంటున్న ఏఐ టెక్నాలజీ నిజానికి అత్యధిక కార్బన్ ఫుట్ప్రింట్స్కు కారణమవుతోందనీ, జలవనరులను విపరీతంగా తోడేస్తోందనీ పర్యావరణవేత్తలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. కానీ ఇవేవీ ఏఐని వ్యతిరేకించడానికి తక్షణ కారణాలు కాదు. ఇతర పరిజ్ఞానాలు కనీసం మన అంచనాలో మనిషిని సుఖపెట్టడానికి రూపొందినవి. కానీ ఏఐ ఏం చేయనుందో మనకు ఏ అంచనా లేదు!సాహిత్య ప్రపంచంలో కొంతకాలంగా ఉన్న భయం ఈ మధ్య ఒక ‘ఓపెన్ లెటర్’ రూపం దాల్చింది. యంత్రాలు సృష్టించిన పుస్తకాలను విడుదల చేయకూడదంటూ ఈ జూన్ నెలలో పదుల కొద్దీ రచయితలు అమెరికాలోని పెంగ్విన్ రాండమ్హౌజ్, హార్పర్ కొలిన్స్ లాంటి ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఏఐ–కల్పిత పుస్తకాలను విడుదల చేయడానికి ‘రచయితల’ను సృష్టించ బోమనీ, ఒకవేళ మానవ రచయితలే అలాంటివి కల్పిస్తే వాటిని ‘మారుపేర్ల’తో అనుమతించ బోమనీ, ఈ ‘దొంగతనానికి’ ఏ విధంగానూ మద్దతివ్వబోమనీ ప్రచురణకర్తలు ప్రతిన బూనాలని వారు కోరారు. ఒక పుస్తకం తుదిరూపు వరకు భాగమయ్యే మనుషుల ఉద్యోగాలను ఏఐ టూల్స్కు బలిపెట్టకూడదనీ అడిగారు. ఘంటాలను దాటి, పెన్నుకు బదులుగా టైప్ రైటర్నో, కంప్యూటర్నో వాడటం లాంటి పరిణామం కాదిది. ఏకంగా రచయితనే పక్కకు తప్పించేది! అందుకే రచయితల అనుమతి లేకుండా, రాయల్టీలు చెల్లించకుండా రూపొందిన కృత్రిమ మేధను ప్రచురణకర్తలు వాడకూడదనే విన్నపం కూడా వీటిల్లో ఉంది. ఎటూ ‘దోపిడీ’కి గురవుతున్న శ్రమకు పరిహారం కోరుకోవడం ఇది! సాహిత్యం అంటేనే మానవ అనుభవం. లోలోపలి తరంగం, అంతరంగ జ్వలనం, ఆనంద చలనం. అవేమీ లేని ఏఐ ఎలా రాస్తుంది? ‘ఎలక్ట్రిక్ గొర్రెలను కలగంటుందా ఏఐ?’ అని అడుగు తాడు కవి డేవిడ్ స్టీర్. ‘ఒక రచన చేస్తున్నప్పుడు రచయిత రాస్తున్న ప్రతి పదాన్నీ తెలిసో, తెలియకో ఎంపిక చేసుకుంటాడు. పది వేల పదాల కథకు పది వేల ఎంపికలు. అలాంటి స్పృహ లేనందువల్ల కృత్రిమ మేధ ‘కళ’ను సృష్టించలేదంటాడు అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రచయిత టెడ్ చియాంగ్. ‘‘ఒక మనిషి మీకు ‘ఐ యామ్ సారీ’ అని చెప్పినప్పుడు, గతంలో ఇతర జనాలు క్షమాపణ కోరుకున్నా రన్నది విషయం కాదు; ‘ఐ యామ్ సారీ’ అనేది పరిగణించాల్సినంతటి అసాధారణమైన పదబంధం కాదన్నది విషయం కాదు. ఒకవేళ ఒకరు నిజాయితీగా చెబితే, ఆ క్షమాపణ విలువైనదీ, అర్థవంతమైనదీ అవుతుంది; అలాంటి క్షమాపణలు గతంలో చెప్పివున్నప్పటికీ.’’ ఒక రచయిత రాసేది అతడిదైన లోలోపలి వాక్యం. అది అతడికి మాత్రమే ప్రత్యేకం. అతడి అనుభవమే ఆ వాక్యం రాయడానికి పురిగొల్పుతుంది. యజమానిని చూడగానే కుక్క ప్రేమగా తోక ఊపుతుంది. దాని అన్ని కండరాలూ సంతోషంతో నర్తించడాన్ని ఆ తోక ఊపు సంకేతిస్తుంది. ఇలాంటి చిరు ఉద్వేగపు అనుభవం కూడా ఉండని ఏఐ ఏం రాయగలదు? ప్రదేశాలు, వస్తువులు మనిషి ఉనికితో ముడిపడి ప్రత్యేకమవుతాయి. ఏఐకి లేనిదే ఆ మహత్తర మానవీయ స్పర్శ. కేవలం అన్నింటినీ రుబ్బి, ‘అలాగరిథమ్’ వండివార్చే రచనలో ఆత్మ ఎలా ఉంటుంది? మరి, ఎటూ కళ కాకుండాపోయే ఆ ఏఐ కల్పిత కృత్రిమ రచనల పట్ల భయం దేనికి అనేది ప్రశ్న. సగటు పాఠకుడికి ఆ మీడియోకర్ రచనే బాగుందనిపించొచ్చు. ఇక అదే ప్రమాణం అయ్యి, ‘అసలు’ది తీర్పునకు లోనవుతుందేమో నని ఒక సృజనాత్మక భయం!త్రిపురనేని గోపీచంద్ నవల ‘పండిత పరమేశ్వర శాస్త్రి’లో ఒక పాత్రను ‘సజ్జలు సజ్జలు’ అని వెక్కిరిస్తారు అతడి సాహిత్య మిత్రులు. కోడి సజ్జలు తిని సజ్జలు విసర్జిస్తుంది, ఏమీ జీర్ణం చేసు కోకుండానే. ఎంతో మేధావిగా కనబడే ఆ రచయిత, ఏదీ తనలోకి ఇంకించుకోకుండానే మాటలు వల్లెవేస్తుంటాడని వారి ఉద్దేశం అనుకోవాలి. ఏఐ రచనలకు ఈ ఉదాహరణ బాగా పనికొస్తుంది. అయితే, అసలు ఇప్పుడు ఉన్నది ఇంకా ‘ఆదిమ’ ఏఐ మాత్రమేననీ, మున్ముందు ఇంకా ఆధునికం అవుతుందనీ చెబుతున్నారు. అప్పుడు అది ఏ రూపం తీసుకుంటుందో! ప్రస్తుత భయం రచ యితను పక్కనపెట్టడం గురించే. మున్ముందు మనిషినే పక్కన పెట్టడం అవుతుందేమో! అప్పుడు సమస్త మానవాళి మరొక బహిరంగ లేఖ రాసుకోవాల్సి ఉంటుంది! -
ఏఐతో హోమ్వర్క్!
సాక్షి, స్పెషల్ డెస్క్: స్మార్ట్ఫోన్ దొరికిందంటే గంటల తరబడి గేమ్స్ ఆడే పిల్లలు మనచుట్టూనే ఉన్నారు. వినోదానికి గేమ్స్ మాత్రమే కాదు.. హోమ్వర్క్ కూడా పూర్తి చేసేందుకు స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తున్నారు! అది కూడా ఆధునిక సాంకేతికత అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో!! అవును.. ప్రపంచవ్యాప్తంగా 58 శాతం విద్యార్థులు హోంవర్క్, అసైన్మెంట్స్, పాఠాలపై అవగాహన పెంచుకునేందుకు ఇప్పటికే ఏఐ ఉపయోగిస్తున్నారట. అన్నింటా మనం అన్నట్టు భారతీయ విద్యార్థులూ ఈ విషయంలో ముందున్నారు.మొత్తం 29 దేశాలు..‘అంతర్జాతీయ ఏఐ ప్రశంసా దినోత్సవం’సందర్భంగా ‘స్టూడెంట్స్ స్పీక్ ఆన్ ఏఐ’పేరుతో స్కిల్స్ ప్లాట్ఫామ్ ‘బ్రైట్చాంప్స్’ఒక నివేదికను విడుదల చేసింది. ఏఐ సాధించిన విజయాలు, మన జీవితాల్లో తెస్తున్న మంచి మార్పులకు గుర్తుగా ఏటా జూలై 16ను ‘అంతర్జాతీయ ఏఐ ప్రశంసా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. పిల్లలు ఏఐతో మమేకమవుతున్న తీరును ఈ అధ్యయనం వెల్లడించింది. భారత్, అమెరికా, వియత్నాం, యూఏఈ సహా 29 దేశాల్లోని 1,425 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్లో ఏఐని ఉపయోగిస్తున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. విద్యార్థులు చాట్జీపీటీని అత్యధికంగా వినియోగిస్తున్నారు. తాము ఎప్పుడూ మోసం చేయడానికి ఏఐని ఉపయోగించలేదని భారత్లో 95 శాతం, ప్రపంచవ్యాప్తంగా 86 శాతం మంది విద్యార్థులు చెప్పడం గమనార్హం.‘ఏఐ చెప్తే నమ్మేయాలా?’మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏఐ ఇచ్చే సమాధానాలను విద్యార్థులు గుడ్డిగా నమ్మడం లేదని ఈ సర్వే స్పష్టం చేసింది. దాదాపు 70 శాతానికిపైగా పిల్లలు ఏఐ ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందకుండా సరిచూస్తున్నారట. మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే.. దాదాపు 80 శాతం పిల్లలు ఏఐ ఇచ్చిన సమాధానాలను పూర్తిగా నమ్మడం లేదు.పిల్లలు – ఏఐ⇒ 58% హోంవర్క్, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏఐ ఉపయోగిస్తున్న విద్యార్థులు⇒ ఏఐని తరచూ వినియోగిస్తున్నభారతీయ విద్యార్థులు 63%⇒ 62% చాట్జీపీటీని అత్యధికంగా ఉపయోగిస్తున్నవారు⇒ మోసం చేయడానికి ఏఐని ఉపయోగించలేదు 86%⇒ 34% ఏఐ పని చేసే విధానం తెలిసిన పిల్లలు⇒ ఏఐని సద్వినియోగం చేసుకునేందుకు మార్గదర్శకత్వం కోరుతున్నవారు 56%⇒ 38% ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేస్తుందని ఆందోళన చెందుతున్నవారు⇒ ఇమేజ్, వీడియో.. ఏఐతో రూపొందిందా లేదా అన్నది తెలియనివారు 50%⇒ 70% పాఠశాలల్లో ఏఐ బోధించాలని కోరుతున్న విద్యార్థులు⇒ తమకున్న ఏఐ అవగాహనపట్ల నమ్మకంగా ఉన్నవారు 10%⇒ 29% ఏఐ ఇచ్చిన సమాధానాలను సరిచూడని పిల్లలు⇒ ఏఐ ఇచ్చిన తప్పుడు జవాబులను నమ్మినవారు 20% -
ఏఐ ఎఫెక్ట్స్తో తొలిసారి ఒరిజినల్ టీవీ షో
కృత్రిమ మేధ (ఏఐ) సృష్టించిన విజువల్ ఎఫెక్ట్స్ను తొలిసారిగా ఒరిజినల్ టీవీ షోలో ఉపయోగించినట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. ప్రాంప్ట్స్ ఆధారంగా వీడియోలు, చిత్రాలను రూపొందించే ఏఐని అర్జెంటీనా సైన్స్ ఫిక్షన్ షో ‘ది ఎటర్నాట్’లో భవనం కూలిపోయే సన్నివేశాన్ని సృష్టించడానికి ఉపయోగించినట్లు కంపెనీ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ టెడ్ సారాండోస్ తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల నిర్మాణ బృందం వేగంగా, తక్కువ ఖర్చుతో సన్నివేశాలను పూర్తి చేయగలిగిందని చెప్పారు.జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో వివాదాస్పదంగా ఉంది. ఇది ఇతరుల పనిని వారి అనుమతి లేకుండా ఉపయోగించి కంటెంట్ సృష్టిస్తుందనే ఆందోళనలు రేకెత్తిస్తుంది. నెట్ఫ్లిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం గురించి సారాండోస్ మాట్లాడుతూ.. ఈ సాంకేతికత చిన్న బడ్జెట్ ఉన్న నిర్మాణాలకు అధునాతన విజువల్ ఎఫెక్స్ట్ ఉపయోగించడానికి అనుమతించినట్లు చెప్పారు. బ్యూనస్ ఎయిర్స్లో ఒక భవనం కూలిన క్రమాన్ని సంప్రదాయ స్పెషల్ ఎఫెక్ట్స్ టూల్స్ ఉపయోగించిన దానికంటే 10 రెట్లు వేగంగా పూర్తి చేయడానికి ఎటెర్నాట్లో ఉపయోగించిన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ బృందానికి సహాయపడిందని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: ఫేస్బుక్పై రూ.68 వేలకోట్ల దావాదక్షిణ కొరియా థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ మూడో, చివరి సిరీస్ విజయం సాధించడంతో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచినట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. ఇది ఇప్పటివరకు 122 మిలియన్ వ్యూస్ సాధించిందని సారాండోస్ అన్నారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే జూన్ నెలాఖరు వరకు మూడు నెలల్లో నెట్ఫ్లిక్స్ ఆదాయం 16 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు (8.25 బిలియన్ పౌండ్లు) చేరుకున్నట్లు ప్రకటించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాభాలు 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. -
ఏఐ ప్రపంచం మన మధ్యకు వస్తే ఏమవుతుంది.. ఆసక్తిగా ట్రైలర్
హలీవుడ్లో వచ్చిన ట్రాన్ సిరీస్ ఇప్పటివరకు అభిమానుల విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్లో మరో చిత్రం అలరించేందుకు వస్తోంది. ఏఐ ప్రోగ్రామ్ మన ప్రపంచంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర అంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మానవుల మధ్యకు ఏఐ ప్రపంచం వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ చిత్రంలో చూపించనున్నారు. దాదాపు 15ఏళ్ల తర్వాత ట్రాన్ సిరీస్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ట్రైన్ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడం విశేషం. 1982 సైన్స్ ఫిక్షన్ చిత్రం ట్రాన్, ఆ తర్వాత 2010 సీక్వెల్ను రూపొందించారు. వాల్డ్ డిస్నీ స్డూడియోస్ నిర్మించిన ఈ సిరీస్ చిత్రాలు అభిమానులను అలరించాయి.ఈ సినిమాకు జోచిమ్ రోనింగ్ దర్శకత్వం వహించారు. అకాడమీ అవార్డు విన్నర్ జారెడ్ లేటో కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో గ్రెటా లీ, ఇవాన్ పీటర్స్, హసన్ మిన్హాజ్, జోడీ టర్నర్-స్మిత్, ఆర్టురో కాస్ట్రో, కామెరాన్ మోనాఘన్, గిలియన్ ఆండర్సన్, జెఫ్ బ్రిడ్జెస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 10న ఇంగ్లీష్తో పాటు ఇండియన్ భాషల్లోనూ విడుదల కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.This October, they are coming to our world.Watch the brand-new trailer for Tron: Ares and experience it in theaters, filmed for IMAX, October 10. pic.twitter.com/a2z8Pnn3Ei— Walt Disney Studios (@DisneyStudios) July 17, 2025 -
‘మాన్యువల్లీ క్లీనింగ్' తొలి స్టార్టప్..! సెప్టిక్ ట్యాంక్స్, మ్యాన్హోల్స్..
ఐఐటీ–మద్రాస్లో చేసిన కాలేజీ ప్రాజెక్ట్ దివ్యాన్షు కుమార్ను ఎంటర్ప్రెన్యూర్గా మార్చింది. మాన్యువల్ స్కావెంజర్స్కు ప్రత్యామ్నాయంగా సెప్టిక్ ట్యాంక్స్, మ్యాన్హోల్స్ను శుభ్రపరిచే రోబోట్స్ను రూపొందించాడు. ప్రభుత్వం మాన్యువల్లీ క్లీనింగ్ను నిషేధించినప్పటికీ దేశంలో ఎక్కడో ఒక చోట ఇది కొనసాగుతూనే ఉంది. 1993 నుంచి 2020 వరకు దాదాపు 928 మంది ట్రాకర్లు మరణించారు. తమిళనాడు, గుజరాత్లలో అత్యధిక మరణాలు సంభవించాయి.బిహార్లోని గయకు చెందిన దివ్యాన్షు కుమార్ ‘సోలినస్ ఇంటిగ్రిటీ’ అనే స్టార్టప్ను మొదలుపెట్టాడు. మాన్యువల్లీ క్లీనింగ్కు ఈ స్టార్టప్ తయారుచేసే రోబోలు ప్రత్యామ్నాయంగా మారాయి. ఐఐటీ–మద్రాస్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన దివ్యాన్షు ప్రొడక్ట్ డిజైన్లో మాస్టర్స్ చేశాడు. ‘మాన్యువల్లీ క్లీనింగ్కు ప్రత్యామ్నాయంగా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో మన దేశంలో వచ్చిన తొలి స్టార్టప్ మాది. తొలి దశలో సీడ్ ఫండింగ్ మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక మేము వెనక్కి తిరిగి చూసుకోలేదు’ అంటున్నాడు దివ్యాన్షు. సెప్టిక్ ట్యాంక్లు, డ్రైనేజి క్లీనింగ్, వాటర్ పైప్లైన్ల క్లీనింగ్...మొదలైన వాటిపై ఈ స్టార్టప్ పనిచేస్తోంది. క్లౌడ్–బేస్డ్ స్టోరేజీ, డాటా మేనేజ్మెంట్ సొల్యూషన్స్కు సంబంధించి ‘స్వస్థ్ ఏఐ’ అనే సర్వీస్ను కూడా ‘సోలినస్’ నిర్వహిస్తోంది. (చదవండి: టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న యువత..! యూత్ 'ఏఐ'కాన్) -
టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్న యువత..! యూత్ 'ఏఐ'కాన్
యూత్, టెక్నాలజీ అనేవి వేరు వేరు పదాలు కాదు. టెక్నాలజీని ‘జీ హుజూర్’ అనేలా చేసి సమాజహితానికి ఉపకరించే డివైజ్లను ఆవిష్కరిస్తున్నారు యువ ఇన్వెంటర్ వంద కోట్ల కంపెనీ వోనర్!పదహారు ఏళ్ల వయసులోనే ఏఐ స్టార్టప్ మొదలు పెట్టి ‘వావ్’ అనిపించింది ప్రాంజలి అవస్థీ. మూడు కోట్లతో ప్రాంరంభమైన ఈ కంపెనీ వంద కోట్ల టర్నోవర్కు చేరడం విశేషం. ఏడేళ్ల వయసులోనే కోడింగ్ రాసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాంజలి పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి కుటుంబం ఫ్లోరిడాలో స్థిరపడింది. ఫ్లోరిడా యూనివర్శిటీలో ఇంటర్న్షిప్ చేస్తున్న సమయంలో ప్రాంజలికి ఏఐ గురించి వివరంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. మొదట్లో ఒక ఏఐ కంపెనీలో పనిచేసిన ప్రాంజలి ఆ తరువాత ‘డెల్వ్. ఏఐ’ పేరుతో సొంత స్టార్టప్ మొదలు పెట్టి విజయం సాధించింది. అత్యాధునిక మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లను ఉపయోగించడం ద్వారా ‘డెల్వ్. ఏఐ’ సంక్లిష్ట డేటా ప్రక్రియను సులభతరం చేస్తుంది. వినియోగదారుల వనరులు, ఆదాయన్ని ఆదా చేస్తుంది.అథ్లెట్ టు టెక్నో ఎక్స్పర్ట్పదకొండు సంవత్సరాల వయసులో కరాటే, కిక్ బాక్సింగ్లో శిక్షణ మొదలుపెట్టింది పుహబి చక్రవర్తి. కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించింది. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో రెండు బంగారు పతకాలు గెలుచుకుంది. ఆటలో విజయం సాధించడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. పోటీల సమయంలో మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొన్న పుహబి ‘అథ్లెటిక్స్ ఎక్స్’ అనే ఏఐ మోడల్కు రూపకల్పన చేసింది. చిన్నప్పటి నుంచే పుహబికి కోడింగ్ అంటే ఇష్టం. తమ స్కూల్లో నిర్వహించిన ‘రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్’ కార్యక్రమంలో పాల్గొన్న పుహబికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై మంచి అవగాహన ఏర్పడింది. ‘రెస్పాన్సిబుల్ ఏఐ’ కార్యక్రమంలో ఎఎన్ఎన్, సీఎన్ఎన్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ నేర్చుకుంది. ‘అథ్లెటిక్స్ ఎక్స్’ అప్లికేషన్లో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, డైట్ అనే మూడు భాగాలు ఉంటాయి. ఫిజికల్ హెల్త్కు సీఎన్ఎన్, మెంటల్ హెల్త్కు ఏఎన్ఎన్, డైట్కు జనరల్ లూపింగ్ను వాడింది. ఆరోగ్యకరమైన శారీరక, మానసిక జీవనశైలి విషయంలో అథ్లెట్స్కు ‘అథ్లెటిక్స్ ఎక్స్’ బాగా ఉపయోగపడుతుంది.గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్పద్దెనిమిది సంవత్సరాల కావ్య కొప్పారపు ‘గ్లియోవిజన్’ అనే ఏఐ టూల్ను డెవలప్ చేసింది. బ్రెయిన్ ట్యూమర్ ఇమేజ్లను త్వరగా విశ్లేషించడానికి ఉపకరించే టూల్ ఇది. డయాబెటిక్ రెటినోపతిని డిటెక్ట్ చేసే స్మార్ట్ఫోన్ సిస్టమ్ను కూడా డెవలప్ చేసింది. టెక్నాలజీకి సంబంధించి అమ్మాయిలను ప్రోత్సహించడానికి ‘గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్’ అనే సంస్థను ప్రారంభించింది. హెల్త్కేర్కు ఉపకరించే ఏఐ సాధనాలపై దృష్టి పెట్టిన కావ్య టైమ్స్ ‘25 మోస్ట్ ఇన్ష్లూయెన్సల్ టీన్స్’ జాబితాలో చోటు సాధించింది.యువ ఏఐ ఉద్యమం‘ఎన్కోడ్’ అనే సంస్థకు స్నేహ రెవనర్ ఫౌండర్, ప్రెసిడెంట్. రెగ్యులేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉపకరించే యూత్ ఆర్గనైజేషన్ ఇది. అమెరికాలోని ఈ ఆర్గనైజేషన్లో వెయ్యి మంది యువతీ,యువకులు ఉన్నారు. ఏఐ పాలసీ ఇనిషియేటివ్స్కు సంబంధించి ‘ఎన్కోడ్’ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. వర్క్షాప్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. టైమ్స్ ‘మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ జాబితాలో స్నేహ చోటు సాధించింది.ఆ నలుగురు... వందలాది వన్య్రపాణులను రక్షిస్తున్నారురోడ్లపై జంతువులు ప్రమాదానికి గురికాకుండా ఉండడానికి కొలరాడో (యూఎస్)లోని ‘స్టెమ్ స్కూల్ హైల్యాండ్స్’కు చెందిన నలుగురు టీనేజ్ అమ్మాయిలు ప్రాజెక్ట్ డీర్’ అనే ఏఐ–పవర్డ్ వైల్డ్లైఫ్ డిటెక్షన్ డివైజ్ను డెవలప్ చేశారు. థర్మల్ ఇమేజింగ్, ఏఐ సాంకేతికతను ఉపయోగించి పనిచేసే డివైజ్ ఇది. చీకట్లో, దట్టమైన పొగమంచు ఆవరించినప్పుడు కూడా రోడ్డుపై జంతువులను డిటెక్ట్ చేస్తుంది. ‘రోడ్డుపై జంతువుల ఉనికిని కనిపెట్టిన వెంటనే ప్రాజెక్ట్ డీర్ డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది’ అంటుంది నలుగురు ఇన్వెంటర్లలో ఒకరైన బ్రి స్కోవిల్లీ. ‘ప్రాజెక్ట్ డీర్ డివైజ్లాంటి ఆవిష్కరణ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది పూర్తిగా కొత్త’ అంటుంది మరో స్టూడెంట్ సిద్దీ సింగ్. (చదవండి: మానవత్వం.. అ 'మూల్యం'..! బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్) -
ఏఐతో.. ముప్పు పొంచి ఉంది!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న సాంకేతికత. ఏఐతో కొత్త అవకాశాలు రావడమే కాదు.. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగాలకు ముప్పు రానుందని అత్యధిక మంది నిపుణులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో నైపుణ్యాలను పెంచుకోవాలన్న కృతనిశ్చయం వారిలో కనిపిస్తోంది. మెషీన్ లెర్నింగ్, ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారని ‘గ్రేట్ లెర్నింగ్’ సర్వేలో తేలింది.సాంకేతికతతో తమ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని భావించే వారిలో 21 నుండి 28 సంవత్సరాల వయసు గల యువత (జనరేషన్ –జెడ్) అత్యధికంగా ఉండటం విశేషం. ముఖ్యంగా ఏఐ వల్ల తమ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని 74% మంది జెన్ –జెడ్ తరం భావిస్తున్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఉద్యోగానికి ఢోకా లేదని 64 శాతం మంది ధీమాగా ఉన్నారు.45–60 సంవత్సరాల వయసు గల జనరేషన్ –ఎక్స్లో 56% మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా 69% మంది నిపుణులు తమ ఉద్యోగాలకు ఏఐ వల్ల ప్రమాదం ఉందని నమ్ముతున్నారు. ‘అప్స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025–26’ పేరుతో ఎడ్టెక్ కంపెనీ ‘గ్రేట్ లెర్నింగ్’ దేశవ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన 1,000 మందికిపైగా నిపుణులతో చేసిన సర్వేలో ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.నైపుణ్యం పెంచుకుంటాం..ఈ సంవత్సరం నైపుణ్యాలను పెంచుకోవాలని 81% మంది భావిస్తున్నారు. హైదరాబాద్లో ఈ సంఖ్య దేశంలోనే అత్యధికంగా 90 శాతం ఉంది. తమ కెరీర్లపై ఏఐ ప్రభావం సానుకూలంగా ఉంటుందని 78% మంది చెబుతున్నారు. ఈ ఏడాది 73% మంది నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకోవడంపై నమ్మకంగా ఉన్నారు. 82% మంది చురుగ్గా కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఇక 29–44 ఏళ్ల వయసున్న (మిలీనియల్స్) ఉద్యోగుల్లో 90 శాతం మంది నైపుణ్య విలువను గుర్తించారు. జెన్ –జెడ్ విషయంలో ఇది 79 శాతం. కానీ ఆఫీసు పని గంటల కారణంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను సంపాదించడం అడ్డంకిగా మారిందని 37% మంది అంటున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇంటి పని కారణంగా కొత్త కోర్సులు నేర్చుకోలేకపోతున్నామని 25 శాతం మహిళలు చెబుతుంటే.. ఇలా చెప్పిన పురుషులు 20 శాతం కావడం విశేషం.6 వారాల నుంచి ఆరు నెలలు..కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి జెన్ –ఏఐని ఉపయోగిస్తున్నట్లు 80% మంది నిపుణులు వెల్లడించారు. మెషీన్ లెర్నింగ్, ఏఐ విభాగాల్లో నైపుణ్యం పెంచుకుంటామని 44 శాతం మంది తెలిపారు. తమ పనిలో జెన్ –ఏఐని ‘ఎల్లప్పుడూ’ లేదా ’తరచుగా’ ఉపయోగిస్తామని 60% మంది చెబుతున్నారు. ఇక ఐటీ, ఐటీఈఎస్, బీపీఎం, టెలికం రంగాల్లో పనిచేస్తున్నవారిలో 91 శాతం మంది నైపుణ్యం మెరుగుపర్చుకోవడం ముఖ్యం అని తెలిపారు. 64% మంది నిపుణులు 6 వారాల నుంచి 6 నెలల నిడివిగల ప్రోగ్రామ్స్తో నైపుణ్యాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నారు.జెన్ –జీ ప్రధానంగా స్వల్పకాలిక ప్రోగ్రామ్స్ను ఇష్టపడుతున్నారు. 50% మంది 6 వారాల కంటే తక్కువ లేదా 6 వారాల నుండి 3 నెలల మధ్య ఉన్న ప్రోగ్రామ్లను ఇష్టపడుతున్నారు. దేశీయ యూనివర్సిటీలు అందించే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని 43 శాతం చెప్పగా.. అంతర్జాతీయ వర్సిటీల సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని 36 శాతం తెలిపారు. తల్లి/తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్న ఉద్యోగుల్లో 90% మంది నిపుణులు నైపుణ్యం పెంపుదల ముఖ్యమైనదని భావిస్తున్నారు. ఇతర (పెళ్లికాని లేదా పిల్లలు లేనివారు) నిపుణుల్లో ఈ సంఖ్య 76 శాతమే. -
రూ.19,500 సబ్స్క్రిప్షన్ ఉచితం!
గూగుల్ భారతదేశంలోని విద్యార్థులకు ప్రోత్సహించేందుకు తన ఏఐ ప్రో ప్లాన్ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. రూ.19,500 సబ్స్క్రిప్షన్ కలిగిన ఏఐ ప్రో ప్లాన్ ద్వారా గూగుల్ అధునాతన ఏఐ సాధనాలకు అవకాశం కల్పిస్తోంది. దీన్ని విద్యార్థులు హోంవర్క్, రైటింగ్, వీడియో జనరేషన్లో సహాయం పొందేందుకు ఉచితంగా ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.ఈ ఆఫర్లో భాగంగా 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ విద్యార్థులు 12 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ను కాంప్లిమెంటరీ యాక్సెస్గా పొందవచ్చు. ఈ సబ్స్క్రిప్షన్లో జెమినీ 2.5 ప్రో, వీయో 3 వంటి విస్తృత శ్రేణి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది వీడియో జనరేషన్ ఏఐ మోడల్. జీమెయిల్, డాక్స్, ఇతర గూగుల్ యాప్స్లో 2టీబీ క్లౌడ్ స్టోరేజ్, ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.కళాశాల పాఠ్యాంశాల అధ్యయనం, పరిశోధన, ఉద్యోగ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సృజనాత్మక ఆలోచన.. వంటి విస్తృత శ్రేణి ఉపయోగాల కోసం విద్యార్థులకు మద్దతుగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది. గూగుల్ హైలైట్ చేస్తున్న కొన్ని ఏఐ ఆధారిత టూల్స్ కింది విధంగా ఉన్నాయి.హోంవర్క్ హెల్ప్ & ఎగ్జామ్ ప్రిపరేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 1,500 పేజీల పాఠ్యపుస్తకాలను విశ్లేషించవచ్చు.స్టడీ సపోర్ట్: అధిక పేజీలున్న(1,500 పేజీల వరకు) పాఠ్యపుస్తకాలను విశ్లేషించవచ్చు. పరీక్ష సన్నద్ధతలో సహాయం తీసుకోవచ్చు. సంక్లిష్టమైన అంశాలను సులువుగా అర్థం చేసుకోవచ్చు.రైటింగ్ టూల్స్: వ్యాసాలను రాసేందుకు సాయపడుతాయి.వీడియో జనరేషన్: గూగుల్ వీయో 3 సిస్టమ్ ఉపయోగించి టెక్స్ట్, ఇమేజ్లను షార్ట్ వీడియోలుగా మార్చవచ్చు.జెమిని ఇంటిగ్రేషన్: జీమెయిల్, డాక్స్, షీట్స్, ఇతర యాప్స్లో డైరెక్ట్ ఏఐ సపోర్ట్ ఉంటుంది.క్లౌడ్ స్టోరేజ్: అసైన్మెంట్లు, ప్రాజెక్టులు, మీడియా ఫైళ్లను నిల్వ చేసేందుకు డ్రైవ్, జీమెయిల్, ఫోటోస్ కలిపి 2 టీబీ స్పేస్ ఇస్తుంది.ఉచితంగా ఎలా పొందాలి?కంపెనీ ప్రతిపాదించిన అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థుల స్టేటస్ను విజయవంతంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. కేవలం విద్యార్థులకు మాత్రమే ఈ ఉచిత సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులో ఉంటుందని గూగుల్ పేర్కొంది. ఈ ఆఫర్ పొందాలంటే విద్యార్థులు తమ స్టేటస్ను వెరిఫై చేసుకోవాలి.వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా..గూగుల్ వన్ స్టూడెంట్ ఆఫర్ పేజీకి వెళ్లాలి.కాలేజీ పేరు, విద్యార్థి పూర్తి పేరు, పుట్టిన తేదీ వంటి అవసరమైన వివరాలను నింపాలి.గుర్తింపు పొందిన సంస్థ నమోదును రుజువు చేయమని కోరితే డాక్యుమెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.వెరిఫై చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఏఐ ప్రో ప్లాన్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలి.ఈ ఆఫర్ను రిడీమ్ చేసుకోవడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ 2025.నిబంధనలు ఇవే..విద్యార్థికి 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి.భారత నివాసి అయి ఉండాలి.వ్యక్తిగత గూగుల్ ఖాతాను ఉపయోగించాలి.కాలేజీ ఈమెయిల్ లేదా నమోదు రుజువును అందించాలి.థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ ద్వారా సబ్స్రైబ్ చేయకూడదు.గూగుల్ పేమెంట్స్ ఖాతాకు చెల్లుబాటు అయ్యే చెల్లింపు పద్ధతిని జోడించాలి. (పోస్ట్-ట్రయల్ బిల్లింగ్ ప్రయోజనాల కోసం).ఇదీ చదవండి: మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్..మొదటి సంవత్సరానికి ఆఫర్ పూర్తిగా ఉచితం అయినప్పటికీ, ప్రామాణిక రేట్ల వద్ద ఆటోమేటిక్ బిల్లింగ్ను నివారించడానికి విద్యార్థులు ట్రయల్ ముగిసేలోపు రద్దు చేయాలని గూగుల్ పేర్కొంది. ఉచిత వ్యవధి తర్వాత మాన్యువల్గా రద్దు చేయకపోతే సబ్ స్క్రిప్షన్ రిన్యువల్ అవుతుంది. -
లోక్సభలో కొత్త అటెండెన్స్ వ్యవస్థ
సాక్షి,న్యూఢ్లిలీ: పార్లమెంట్లో ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు లోక్సభ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై పార్లమెంట్లో ఇక ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ వేయనున్నారు. తమకు కేటాయించిన సీట్లలో నుంచి ఎలక్ట్రానిక్ అటెండెన్స్ నమోదు కానున్నాయి. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డిజిటల్ అటెండెన్స్ అమలు కానున్నట్లు లోక్సభ తెలిపింది.గతంలో హాజరు నమోదు కోసం ఎంపీలు సంతకాల్లో రిజిస్టర్ చేసే వారు. ఇకపై రాతపూర్వకంగా సంతకం చేసే బదులు డిజిటల్ అటెండెన్స్ పడనుంది. అలాగే 12 భాషల్లో పార్లమెంట్ ఎజెండాను డిజిటల్ సంసద్ పోర్టల్లో అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ సహాయంతో స్పీచ్ టు టెక్స్ట్ రికార్డు కానుంది.లోక్సభ డిబేట్లను ఇకనుంచి రియల్ టైంలో ఏఐ టూల్స్ అనువదించనున్నట్లు లోక్సభ అధికారిక వర్గాల వెల్లడించాయి. -
ఏఐతో లే‘ఆఫ్ సోపాలు’!
‘‘రానున్న ఐదేళ్లలో అన్ని ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో సగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) భర్తీ చేస్తుంది. అంటే సాధారణ ఉద్యోగులు కొలువులు కోల్పోయి రోడ్డున పడతారు. నిరుద్యోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది కనీసం 10 శాతం నుంచి 20 వరకూ ఉండవచ్చు.’’ఈ మాటలు చెప్పింది మరెవరో కాదు ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యువతరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఏఐ మాటే ఎక్కువగా వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించే దిశగా ఏఐ అడుగులు వేస్తోంది. 2029 నాటికి మానవ మేధస్సును కృత్రిమ మేధ అధిగమిస్తుందని ఎలన్ మస్క్ కూడా వ్యాఖ్యానించడం ఆందోళన కలిగిస్తోంది. ఏఐ సాంకేతికత వల్ల అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని, 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని తాజా అధ్యయనాల సారాంశం. అంతర్జాతీయంగా పలు కార్పొరేట్ సంస్థల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దీనికి ఊతమిస్తున్నాయి. ఈ ఏడాది భారీ సంఖ్యలో టెక్ లేఆఫ్స్ ఉండబోతున్నాయని సమాచారం.వెంటాడే ఏ ‘ఐ’:ప్రతి సంస్థలోనూ ఉద్యోగుల పనితీరుపై పర్యవేక్షణ సర్వసాధారణం. అయితే కార్యాలయంలో పని గంటలు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకూ ప్రతి ఉద్యోగి కదలికలనూ ఏఐ ట్రాక్ చేయడం అనేది ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో కొత్తగా మొదలైంది. పనితీరు మదింపు తర్వాత సంస్థ లక్ష్యాలను చేరుకోలేని వారికి కృత్రిమ మేధ నేరుగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు (డిస్మస్ ఆర్డర్) ఆదేశాలను యాజమాన్యంతో సంబంధం లేకుండానే వారి ఈ మెయిల్కు పంపిస్తుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.వాల్మార్ట్, డెల్టా, చెవ్రాన్, స్టార్బక్స్, అవేర్, టి–మొబైల్ వంటి ప్రముఖ సంస్థలూ ఉద్యోగుల పనితీరు పర్యవేక్షణకు ఏఐని ఉపయోగిస్తున్నాయి. గూగుల్ క్లౌడ్ హెచ్ఆర్ బృందం వారి నియామక ప్రక్రియను మార్చడానికి, ఉద్యోగుల ఆన్బోర్డింగ్ను వేగవంతం చేయడానికి ఏఐని వాడుతున్నారు. అయితే ఇలాంటి చర్యల వల్ల పనితీరు మెరుగుపడదు సరికదా ఉద్యోగులను మానసికంగా ప్రభావితం చేస్తాయని ‘కార్నెల్’ పరిశోధనలో తేలింది.జూనియర్లకు కష్టకాలంఏఐ ట్రాకింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా టెక్, ఇతర ఇండస్ట్రీల్లో వేల సంఖ్యలో జూనియర్ స్థాయి ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ప్రముఖ వ్యక్తుల వ్యాఖ్యలు, అధ్యయనాలను బట్టి తెలుస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్ 2025’ సర్వే ప్రకారం, ఏఐ టెక్నాలజీ పెరుగుదల వల్ల ప్రపంచంలోని దాదాపు 41 శాతం కంపెనీలు రానున్న ఐదేళ్లలో తమ ఉద్యోగులను తగ్గించుకోవాలనుకుంటున్నాయి. ఇప్పటికే మెటా, మైక్రోసాఫ్ట్, సేల్స్ఫోర్స్, బీపీ వంటి కంపెనీలు తమ వర్క్ఫోర్స్ నుంచి ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించాయి.సీఎన్ఎన్ టెలివిజన్లో పనిచేస్తున్న 200 మందిని తొలగించింది. స్టార్బక్స్ సిబ్బందిని తొలగించింది. ఇంజినీరింగ్, ఉత్పత్తి, కార్యకలాపాలు వంటి విభాగాలలో స్ట్రైప్ 300 మందిని ఇళ్లకు పంపనుంది. యూకే పెట్రోలియం కంపెనీ బీపీ సుమారుగా 7,700 మంది ఉద్యోగుల్ని, కాంట్రాక్టర్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మెటా కూడా 5శాతం మంది వర్క్ఫోర్స్ని తగ్గించనుంది. బ్లాక్రాక్ 200 మందిని వద్దంటోంది.వాషింగ్టన్ పోస్ట్ 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలిపింది. ఇవే కాకుండా చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తీసేయనున్నాయి. కంపెనీలు తమ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వైపు వెళ్లడానికి, ఖర్చుల్ని నియంత్రించడానికి ఉద్యోగుల్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. -
Mivi AI Buds: భాష ఏదైనా ‘హాయ్ మివి’ అంటే చాలు..
కన్జూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ మివి కొత్తగా కృత్రిమ మేథ ఆధారిత ఏఐ బడ్స్ను ప్రవేశపెట్టింది. సెటింగ్స్ ఏవీ మార్చకుండానే తెలుగు, హిందీ సహా ఎనిమిది భారతీయ భాషలను ఇది అర్థం చేసుకుని, ప్రతిస్పందిస్తుంది. యూజర్ల ప్రాధాన్యతలను గుర్తుపెట్టుకుని, సందర్భానుసారంగా వ్యవహరించేలా దీన్ని రూపొందించినట్లు సంస్థ కో–ఫౌండర్ మిధులా దేవభక్తుని తెలిపారు. 40 గంటల బ్యాటరీ లైఫ్, 3డీ సౌండ్స్టేజ్, స్పష్టత కోసం క్వాడ్ మైక్ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ. 6,999గా ఉంటుంది.ఏఐ బడ్స్ లో మివి ఏఐ అనే ప్రొప్రైటరీ వాయిస్ అసిస్టెంట్ ఉంది. "హాయ్ మివి" అంటే చాలు ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రతిస్పందిస్తుంది. ఇది ఎనిమిది భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. అవి హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం, గుజరాతీ. లాంగ్వేజ్ సెట్టింగ్ ల మార్చుకునే పనిలేకుండానే వినియోగదారులు ఏ భాషలోనైనా ప్రశ్నలు అడగవచ్చు లేదా సహాయాన్ని అభ్యర్థించవచ్చు.అసిస్టెంట్ అవతార్ ల ద్వారా మివి ఏఐ బడ్స్ వివిధ పనులకు సహకారం అందిస్తుంది. ఇవి ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్.🔸జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు గురు అవతార్ సమాధానాలు చెబుతుంది.🔸ఇంటర్వ్యూవర్ అవతార్ మాక్ ఇంటర్వ్యూలు, ఫీడ్ బ్యాక్ అందిస్తుంది.🔸చెఫ్ అవతార్ వంట చేయడంలో మార్గనిర్దేశం చేస్తుంది.🔸వెల్ నెస్ కోచ్ అవతార్ సంభాషణల సమయంలో యూజర్ ఇన్ పుట్ లకు స్పందిస్తుంది.🔸న్యూస్ రిపోర్టర్ అవతార్ యూజర్ ఆసక్తుల ఆధారంగా న్యూస్ అప్ డేట్స్ అందిస్తుంది.🔸గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న మివి ఏఐ యాప్ ద్వారా యూజర్లు ఏఐ సెట్టింగ్స్, ఫీచర్లను మేనేజ్ చేసుకోవచ్చు. -
ఏఐ డాక్టర్లా? మజాకా?
డాక్టర్ ఏఐ– ఇదొక కొత్త స్టెతస్కోప్ ఇదొక రోబో సర్జన్ ఇదొక డయాగ్నస్టిక్ ల్యాబ్ ఇది రోగుల పాలిటి వరం వైద్యరంగం చేతిలోని శరంకృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి దూసుకొచ్చేస్తున్నట్లే, వైద్యరంగంలోకి కూడా శరవేగంగా దూసుకొస్తోంది. ఏఐ మాయాజాలం వైద్యరంగంలో పెనుమార్పులను తీసుకొస్తోంది. మన దేశంలోని ఆస్పత్రులు కూడా ఇటీవలి కాలంలో ఏఐని విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. వైద్యరంగంలో డాక్టర్ ఏఐ ఇప్పటికే తీసుకొచ్చి మార్పులను, భవిష్యత్తులో తీసుకురానున్న మార్పులను ఒకసారి తెలుసుకుందాం.‘కరోనా’కాలంలో ప్రపంచవ్యాప్తంగా వైద్య ఆరోగ్యరంగం అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడే పరిస్థితులు ఉంటే, చాలా చోట్ల ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బంది లేని పరిస్థితి. మహమ్మారి వ్యాధులు విజృంభించినప్పుడు మాత్రమే కాదు; సీజనల్ వ్యాధులు ఇబ్బడి ముబ్బడిగా వ్యాపించేటప్పుడు; అనుకోని విపత్తులు తలెత్తేటప్పుడు ఆస్పత్రుల్లో రోగుల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. రోగుల తాకిడికి తగినంతగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండరు. ఇలాంటి విపత్కర పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడంలో ఏఐ బాగా సహాయపడగలదని నిపుణులు చెబుతున్నారు. వైద్యులపై పనిభారం తగ్గించడానికి, వారి పనిని మరింత సులభతరం చేయడానికి ఏఐ వరప్రసాదం లాంటిదని వారు అంటున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల మొదలుకొని, సంక్లిష్టమైన శస్త్రచికిత్సల వరకు వివిధ దేశాల్లోని ఆస్పత్రులు ఏఐని ఉపయోగించుకుంటున్నాయి. ప్రపంచంలోనే తొలి ఏఐ ఆస్పత్రిప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి ఏఐ ఆస్పత్రి ఇటీవల చైనాలో ప్రారంభమైంది. చింగ్హ్వా యూనివర్సిటీ ఈ పూర్తిస్థాయి ఏఐ ఆస్పత్రిని అభివృద్ధి చేసింది. ‘ఏజెంట్ హాస్పిటల్’ పేరిట ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో ఇతర సాధారణ ఆస్పత్రుల్లో మాదిరిగా మనుషులు ఉండరు. ఇదంతా ఒక మాయాలోకంలా ఉంటుంది. ఇందులో పనిచేసే సిబ్బంది అంతా పద్నాలుగు మంది ఏఐ డాక్టర్లు, నలుగురు ఏఐ నర్సులు మాత్రమే! ఈ ఏఐ ఆస్పత్రిలో పేషెంట్లను చేర్చుకునే వార్డులు కూడా కనిపించవు. ఈ ఆస్పత్రిలోని ఏఐ డాక్టర్లు, ఏఐ నర్సులు ‘వర్చువల్’గానే రోగులకు సేవలు అందిస్తూ ఉంటారు. రోజుకు దాదాపు మూడువేల మందికి ఈ ఏఐ డాక్టర్లు, ఏఐ నర్సులు రోగ నిర్ధారణ మొదలుకొని, రకరకాల చికిత్సలను అందిస్తూ ఉంటారు. ఈ ఏఐ డాక్టర్లు ఆషామాషీ చాట్బోట్లు కాదు, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ (యూఎస్ఎంఎల్ఈ) పరీక్షల్లో 93.06 శాతం మార్కులు సాధించిన ఘనత సొంతం చేసుకున్న ఘనవైద్యులుగా గుర్తింపు పొందాయి. అంతేకాదు, కొన్ని రంగాల్లో అనుభవజ్ఞులైన మానవ వైద్యులను మించిన ఫలితాలను సాధించిన ఘనత కూడా ఈ ఏఐ వైద్యులు సాధించడం విశేషం.తొలి రిమోట్ ఏఐ సర్జరీచైనా శాస్త్రవేత్తలు ఏఐ డాక్టర్ల రూపకల్పనలోనే కాదు, ప్రపంచంలోనే తొలి రిమోట్ ఏఐ సర్జరీని ఇటీవల విజయవంతంగా నిర్వహించారు. ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన ఐ అండ్ ఈఎన్టీ హాస్పిటల్ వైద్య శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఐదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా రిమోట్ ఏఐ సర్జరీని నిర్వహించారు. ఏఐ సాయంతో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సకు సాధారణంగా చేసే శస్త్రచికిత్స కంటే ముప్పయిశాతం తక్కువ సమయం పట్టింది. అంతేకాదు, రోగికి పెట్టే కోతలో మిల్లీమీటరులో పదోవంతు కూడా తేడా లేనంత కచ్చితత్వంతో ఈ శస్త్రచికిత్స జరగడం అద్భుతమనే చెప్పుకోవాలి. ఫుడాన్ వర్సిటీ ఈఎన్టీ విభాగం డైరెక్టర్ డాక్టర్ వు చున్పింగ్ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్స ద్వారా రోగి గొంతులో ఏర్పడిన కణితిని ‘ట్రాన్స్ ఓరల్ సర్జికల్ రోబో సిస్టమ్’ ద్వారా ఏఐ సాయంతో తొలగించారు. షాంఘైలో ఉన్న వైద్యనిపుణుల సూచనలకు అనుగుణంగా, అక్కడకు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని చెంగ్డూ ఆస్పత్రిలోని ఏఐ సర్జికల్ రోబోలు ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశాయి. ‘బోర్న్ ’ గ్రూప్లోని సింఫనీ రోబోటిక్స్ కంపెనీ ఈ ఏఐ సర్జికల్ రోబోలను తయారు చేసింది. షాంఘైలోని వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన రిమోట్ ఏఐ సర్జరీ వల్ల శస్త్రచికిత్స ఖర్చు ఇరవై శాతం మేరకు, సమయం ముప్పయి శాతం మేరకు తగ్గినట్లు ‘బోర్న్’ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో లి యావో తెలిపారు. ‘బోర్న్’ గ్రూప్ రూపొందించిన ఏఐ సర్జికల్ రోబోలకు కావలసిన 1760 విడిభాగాలను చైనాలోని 165 కంపెనీల నుంచి సమకూర్చుకున్నట్లు లి యావో చెప్పారు. ఏఐ సర్జికల్ రోబోలను అభివృద్ధి చేయడానికి, వాటి వినియోగాన్ని మరింతగా విస్తరించడానికి తమ సంస్థ అమెరికా, జపాన్, జర్మనీలకు చెందిన కంపెనీలు, వైద్య పరిశోధక సంస్థలకు సహకరిస్తోందని వెల్లడించారు.ఏఐ మాయాదర్పణంవైద్యరంగంలో వ్యాధుల నియంత్రణ, చికిత్స పద్ధతులు ఒక ఎత్తు అయితే, వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరో ఎత్తు. వ్యాధుల చికిత్సకు వ్యాధి నిర్ధారణే కీలకం. ఎంత ఆధునిక వ్యాధి నిర్ధారణ పద్ధతులైనా, కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు రావడానికి ఒకటి రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు సమయం పడుతుంది. అయితే, ఏఐ రాకతో వ్యాధి నిర్ధారణ శరవేగం పుంజుకుంటోంది. వ్యాధి నిర్ధారణలో ఏఐ తీసుకొచ్చిన వేగానికి ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ మాయాదర్పణమే తాజా ఉదాహరణ. మామూలుగా అద్దం ముందు నిలుచున్నట్లుగానే ఈ మాయాదర్పణం ముందు నిలుచుంటే చాలు, ఉన్నపళాన మీ ఆరోగ్య వివరాలను క్షణాల్లో చెప్పేస్తుంది. ఈ మాయాదర్పణం డయాబెటిస్, బీపీ వంటి సర్వసాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు పార్కిన్సన్స్, డెమెన్షియా, గుండెజబ్బులు, శ్వాస సమస్యలు, నాడీ సమస్యలు, లివర్ సమస్యలు, క్యాన్సర్ వంటి జటిలమైన వ్యాధులను కూడా ఇట్టే గుర్తించగలదు. స్మార్ట్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా దీని ముందు నిలబడి ముప్పయి సెకన్ల సెల్ఫీ వీడియో తీసుకుంటే చాలు, ఇది శరీరాన్ని ఆపాదమస్తకం త్రీడీ స్కానింగ్ చేసేస్తుంది. అంతేకాదు, క్షణాల్లోనే ఈ మాయాదర్పణం ముప్పయి రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి, వాటి వివరాలను అత్యంత కచ్చితత్వంతో చెబుతుంది. అమెరికన్ హెల్త్టెక్ స్టార్టప్ కంపెనీ ‘విదింగ్స్’ దీనిని ‘ఒమీనా’ పేరిట రూపొందించింది. ఈ ఏడాది లాస్వేగాస్లో జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)–2025లో ప్రదర్శించిన దీని పనితీరు నిపుణుల ప్రశంసలు పొందింది. ‘ఒమీనా’ మాయాదర్పణం కేవలం ఆరోగ్య వివరాలను తెరపై చూపించి, అంతటితోనే సరిపెట్టుకోదు. ఇది ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా పనిచేస్తుంది. తెరపై కనిపించే ఆరోగ్య వివరాలను చూసుకున్న తర్వాత వినియోగదారులు అడిగే సందేహాలన్నింటికీ సమాధానాలను ఓపికగా చెబుతుంది. గుర్తించిన ఆరోగ్య సమస్యలకు సంబంధించి, తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలపై సూచనలు కూడా చేస్తుంది. వ్యాధి నిర్ధారణ రంగంలో ‘ఒమీనా’ ఏఐ సంచలనానికి నాంది పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు.మన ఆస్పత్రుల్లోనూ ఏఐమన దేశంలోని ప్రముఖ ఆస్పత్రులు కూడా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. అంతర్జాతీయ సాంకేతిక సంస్థలైన గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటివి భారత్లోని ఆస్పత్రులకు ఏఐ సాంకేతికతను అందించడానికి ముందుకొస్తున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఫోర్టిస్ హెల్త్కేర్, మణిపాల్ హాస్పిటల్స్, అరవింద్ ఐ హాస్పిటల్స్, ఏజే హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ హాస్పిటల్, నారాయణ హెల్త్, క్లౌడ్నైన్ హాస్పిటల్స్, కావేరీ హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్స్ వంటివి ఇప్పటికే ఏఐ సాంకేతికతను రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళిక, శస్త్రచికిత్సలలో కచ్చితత్వం తదితర అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. పలు ఔషధ తయారీ సంస్థలు, పరిశోధక సంస్థలు ఔషధాల రూపకల్పన కోసం కూడా ఏఐని వినియోగించుకుంటున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులే కాకుండా, ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఏఐ సాంకేతికతను వినియోగించుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘భారత్నెట్’ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో సుమారు రూ.8500 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ‘నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్’ కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని పౌరులందరికీ ఆరోగ్య గుర్తింపు కార్డులు జారీ చేయాలని సంకల్పించుకుంది. ఈ ఆరోగ్య గుర్తింపు కార్డులకు పౌరుల వ్యక్తిగత ఆరోగ్య సమాచారం అంతా అనుసంధానమై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ పథకం అమలులోకి వచ్చినట్లయితే, ఏఐ సాంకేతికత గ్రామీణ ఆస్పత్రులకు కూడా అందుబాటులోకి వస్తుంది.ఆరోగ్యరంగంలో విస్తరిస్తున్న ఏఐప్రపంచవ్యాప్తంగాను, మన దేశంలోను ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ గడచిన ఐదేళ్లుగా బాగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ విలువ 2022 నాటికి 11 బిలియన్ డాలర్లుగా (రూ.94,112 కోట్లు) నమోదైంది. ఇది 2025 నాటికి 35.71 బిలియన్ డాలర్లకు (రూ.3.04 లక్షల కోట్లు) చేరుకోగలదని మార్కెట్ వర్గాల అంచనా. భారత్లో 2022 నాటికి ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ విలువ 0.13 బిలియన్ డాలర్లు (రూ.1112 కోట్లు) ఉంటే, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలువ 1.6 బిలయన్ డాలర్లకు (రూ.13,689 కోట్లు) చేరుకోగలదని ‘ఫోర్బ్స్’ పత్రిక అంచనా. భారత్ ఆరోగ్య రంగంలో ఏఐ మార్కెట్ 40.6 శాతం మేరకు వార్షిక వృద్ధి నమోదు చేసుకోగలదని కూడా ‘ఫోర్బ్స్’ పత్రిక తన అంచనాను ప్రకటించింది. భారత్ ఆరోగ్యరంగంలో ఏఐ విస్తరణ దిశగా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. టాటా గ్రూప్కు చెందిన ‘టాటా ఎల్క్సి’ ఏఐతో పనిచేసే మెడికల్ ఇమేజింగ్ పరికరాల తయారీ కోసం పనిచేస్తోంది. మన దేశానికి చెందిన డిజిటల్ హెల్త్కేర్ స్టార్టప్ సంస్థ ‘ప్రాక్టో’ తన టెలిమెడిసిన్ సేవల కోసం బహుభాషా సామర్థ్యం కలిగిన ఏఐ సాంకేతికతను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ ‘సిగ్టపుల్’ రక్త నమూనాలను దూరం నుంచే విశ్లేషించి, వ్యాధుల వివరాలను వెల్లడించగలిగే ‘డిజిటల్ పాథాలజీ ప్లాట్ఫామ్’ను ప్రారంభించింది. ఇది స్పెషలిస్టులు, హీమాటాలజిస్టుల అవసరం లేకుండానే ఏ ప్రాంతంలో ఉన్న రోగులకైనా రక్తపరీక్షల వివరాలను అందించగలదు.ఏఐ తెచ్చిన మార్పులుఆరోగ్యరంగంలో ఏఐ ఇప్పటికే చాలా మార్పులు తెచ్చింది. అయితే, ఈ మార్పుల ఫలితాలు ప్రపంచం అంతటా ఇంకా పూర్తిగా విస్తరించలేదు. మరో ఐదేళ్లలో ఆరోగ్యరంగంలో ఏఐ మరింతగా విస్తరించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య వైద్యసేవలలో ఏఐ ఇప్పటి వరకు తెచ్చిన కొన్ని మార్పులు ఇవి:ఏఐ వల్ల వ్యాధినిర్ధారణ సులభతరంగా మారింది. సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్రే వంటి వాటిని ఏఐ శరవేగంగా విశ్లేషించి రోగ నిర్ధారణ చేయగలుగుతోంది. ఈ పరీక్షలను విశ్లేషించడంలో మానవ తప్పిదాలకు కొంత ఆస్కారం ఉండేది. ఏఐ వినియోగంతో ఎలాంటి తప్పిదాలకు తావులేని పరిస్థితి ఏర్పడింది.ఏఐ సహాయంతో పలు దేశాల్లోని ఆస్పత్రులు విజయవంతంగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించగలుగుతున్నాయి. ఏఐ వినియోగం వల్ల శస్త్రచికిత్సల్లో కచ్చితత్వం పెరగడమే కాకుండా, శస్త్రచికిత్సకు పట్టే సమయం కూడా గణనీయంగా తగ్గుతుండటం విశేషం.చైనా ఇప్పటికే ఏఐ డాక్టర్లు సేవలందిçంచే స్థాయి పురోగతి సాధించింది. త్వరలోనే మిగిలిన దేశాలు కూడా ఏఐ డాక్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.మానసిక సమస్యలతో బాధపడేవారికి చికిత్సను అందించడంలోను, మానసిక సమస్యల లక్షణాలను ముందుగానే గుర్తించడంలోను ఏఐ సాంకేతికత ఉపయోగపడుతోంది.ఔషధ తయారీ సంస్థలు, ఔషధ పరిశోధనలు నిర్వహించే సంస్థలు ఔషధాల ఆవిష్కరణకు, కొత్త ఔషధాల రూపకల్పనకు కూడా ఏఐ సేవలను వినియోగించుకుంటున్నాయి.పలు దేశాల్లోని ఆస్పత్రులు ఏఐ సాంకేతికతను వ్యాధి నిర్ధారణకు విరివిగా వాడుకుంటున్నాయి. వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షల విశ్లేషణతో పాటు, ఎక్స్రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈసీజీ, టూడీ ఎకో తదితర నివేదికలను నిమిషాల్లోనే విశ్లేషించి, భవిష్యత్తులో రానున్న వ్యాధులను గుర్తించడానికి కూడా ఏఐ సాంకేతికత ఉపయోగపడుతోంది.చైనా ఇప్పటికే ఏఐ డాక్టర్లు సేవలందించే స్థాయి పురోగతి సాధించింది. త్వరలోనే మిగిలిన దేశాలు కూడా ఏఐ డాక్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.ఏఐ డాక్టర్లా? మజాకా?‘ఏజెంట్ హాస్పిటల్’లోని ఏఐ డాక్టర్లన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో శిక్షణ పొంది; వైద్య శాస్త్ర విషయాలను, వ్యాధి నిర్ధారణ పద్ధతులను ఆకళింపు చేసుకుని; రోగుల పరిస్థితికి తగినట్లుగా స్పందించడంలో మానవ వైద్యుల కంటే మిన్నగా రూపొందినవి. వైద్యరంగంలోని వివిధ అంశాలపై కూలంకషమైన పరిజ్ఞానం పొందడానికి సాధారణంగా ఏళ్లతరబడి కృషి అవసరమవుతుంది. ఈ ఏఐ డాక్టర్లు మాత్రం కొద్దివారాల్లోనే అంతటి పరిజ్ఞానాన్ని పొందడం విశేషం. సాధారణమైన జలుబు దగ్గు మొదలుకొని అత్యంత సంక్లిష్టమైన జన్యువ్యాధులకు, ఆటోఇమ్యూన్ వ్యాధులకు సైతం ఈ ఏఐ డాక్టర్లు సమర్థంగా చికిత్సలు అందిస్తుండటం విశేషం. నవజాత శిశువుల నుంచి వయోవృద్ధుల వరకు రకరకాల వయసుల్లోని రోగులకు తగిన రీతిలో ఊరటను అందిస్తూ, తగిన చికిత్సతో ఏఐ డాక్టర్లు రోగ నిదానం చేయడమే కాకుండా, రకరకాల మానసిక సమస్యలతో బాధపడే రోగులకు కౌన్సెలింగ్ ద్వారా సాంత్వన కలిగిస్తుండటం మరింత విశేషం. ఏఐ డాక్టర్లు ఔట్ పేషెంట్లకు వర్చువల్ రియాలిటీ ద్వారా సత్వర సేవలను అందిస్తున్నాయి. -
షిప్రాకెట్ నుంచి ‘శూన్య.ఏఐ’
చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), డీ2సీ వ్యాపార సంస్థల కోసం ఈ–కామర్స్ సేవల సంస్థ షిప్రాకెట్ కొత్తగా ‘శూన్య.ఏఐ’ పేరిట ఏఐ ఇంజిన్ను ఆవిష్కరించింది. అల్ట్రాసేఫ్ సంస్థ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. తొమ్మిదికి పైగా భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్, ఇమేజ్ ఇంటెలిజెన్స్ను ఇది అందిస్తుందని పేర్కొంది. దీన్ని పూర్తిగా భారత్లోనే తీర్చిదిద్దినట్లు వివరించింది.ఇదీ చదవండి: ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీతొలి ఏడాదిలో ఇది 1 లక్ష పైచిలుకు ఎంఎస్ఎంఈలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు షిప్రాకెట్ పేర్కొంది. కేటలాగింగ్, మార్కెటింగ్, ఫుల్ఫిల్మెంట్ తదితర విభాగాలవ్యాప్తంగా సమయాన్ని, డబ్బును ఆదా చేసుకునేందుకు శూన్య.ఏఐ ఉపయోగపడుతుందని కంపెనీ ఎండీ సాహిల్ గోయల్ చెప్పారు. షిప్రాకెట్, కేపీఎంజీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 11,000 పైచిలుకు బ్రాండ్లు ఉన్న దేశీ డీ2సీ మార్కెట్ ఈ ఏడాది (2025) 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. అలాగే 22 కోట్ల ఆన్లైన్ షాపర్లున్న ఈ–రిటైల్ మార్కెట్ 125 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
వందేళ్లయినా AI ఈ పని చేయలేదు: బిల్గేట్స్
విస్తృతంగా విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (ఏఐ) మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని, కోట్లాది ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్న అంచనాలు ఆందోళనలు పెంచుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రోగ్రామింగ్కు ఏఐ ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. మానవ సృజనాత్మకతతోనే ప్రోగ్రామింగ్ రూపుదిద్దుకుంటుందని వ్యాఖ్యానించిన ఆయన ప్రోగ్రామర్లను ఏఐ ఇప్పుడే కాదు.. వందేళ్లయినా భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.ఇటీవల ఎకనమిక్ టైమ్స్తోపాటు టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బిల్ గేట్స్ దీని గురించి మాట్లాడారు. కోడింగ్ కు మానవ మేధస్సు అవసరమని గేట్స్ చెప్పారు. ప్రోగ్రామింగ్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలదు కానీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రోగ్రామింగ్లో నిజమైన సవాలు సంక్లిష్ట సమస్యను సృజనాత్మకతతో పరిష్కరించడమేనన్న ఆయన ఇది యంత్రాలు చేయలేవన్నారు.‘కోడ్ రాయడం అంటే కేవలం టైపింగ్ మాత్రమే కాదు. లోతుగా ఆలోచించడం’ అని బిల్ గేట్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా విభిన్న పరిశ్రమల్లో అనేక ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయని, లేదా కనుమరుగవుతాయని భావిస్తున్నప్పటికీ, ప్రోగ్రామింగ్ మాత్రం మానవ ఉద్యోగంగానే ఉంటుందని గేట్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దీనికి విచక్షణ, ఊహాశక్తి, అడాప్టబిలిటీ అవసరం. ఈ లక్షణాలు ఏఐకి ఉండవని అంటున్నారాయన.మరోవైపు 2030 నాటికి కృత్రిమ మేధ 8.5 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. ఈ ద్వంద్వ ప్రభావాన్ని గేట్స్ అంగీకరిస్తూ, కృత్రిమ మేధ పర్యవసానాల గురించి తాను కూడా భయపడుతున్నానని అంగీకరించారు. అయితే తెలివిగా ఉపయోగిస్తే కృత్రిమ మేధ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుందని ఆయన నమ్ముతున్నారు.ఏఐ ప్రభావం గురించి కొన్ని నెలల క్రితమే బిల్గేట్స్ మాట్లాడారు. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రభావం చూపినా, ఎన్ని మార్పులు తెచ్చినా, కోడింగ్ నిపుణులు, జీవ శాస్త్రవేత్తలు, ఇంధన రంగంలో పనిచేసేవారికి ఎలాంటి ఢోకా ఉండదని తన అభిప్రాయాన్ని చెప్పారు. -
అమెరికన్ సంస్థల్లో హైదరాబాద్ కంపెనీ విలీనం
హైదరాబాదీ ఏజెంటిక్ ఏఐ సంస్థ కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా అమెరికాకు చెందిన కోనాఏఐ, డీక్యూబ్ డేటా సైన్సెస్లో విలీనమైంది. ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఏజెంటిక్ ఏఐ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ఈ వ్యూహాత్మక విలీనం దోహదపడగలదని కోవాసెంట్ టెక్నాలజీస్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.ఇదీ చదవండి: బడ్జెట్ ధరలో మోటో 5జీ ఫోన్ఏఐ ఆధారిత సర్వీసెస్ యాజ్ సాఫ్ట్వేర్ విభాగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. ఇకపై కోవాసెంట్కి అనిల్ కోనా సీవోవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వ్యవహరిస్తారు. కోనాఏఐ, డీక్యూబ్ వ్యవస్థాపకుడు అయిన అనిల్కి ఫోరెన్సిక్ అనలిటిక్స్.. సైబర్ సెక్యూరిటీలో అపార అనుభవం ఉంది. -
పోషకాహార లోపాన్ని.. ఏఐ పట్టేస్తుంది
దేశంలో అయిదేళ్లలోపు పిల్లల్లో 50 శాతంపైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బిడ్డ పుట్టిన తొలి ఆరు వారాలు కీలక సమయం. చాలా మంది శిశువులకు ఈ సమయంలో ఆరోగ్య సంబంధ తనిఖీలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పేదలుండే ప్రాంతాలలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. ఎదుగుతున్న తీరు, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నదీ లేనిదీ సరైన సమయంలో గుర్తించి సమస్యను పరిష్కరించలేకపోవడంతో శిశువులు పోషకాహార లోపం బారిన పడుతున్నారు. దీనికి విరుగుడుగా పలు సంస్థలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పరిష్కారాలతో రంగంలోకి దిగాయి. వీటిలో ఐఐఐటీ హైదరాబాద్ కూడా ఉంది. ఈ పైలట్ ప్రాజెక్టులు విజయవంతమై, పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి వస్తే ఆరోగ్య రంగంలో పెద్ద అడుగు పడినట్టే.శిశువులు పుట్టినప్పుడు 2.5 కిలోల కంటే తక్కువ బరువు ఉండటం.. బాల్యంలో అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ శిశువులు ఎదుగుదల నిలిచిపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు, ప్రాణాంతక పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరిలో కేలరీల లోపం వల్ల సన్నబడడం; ప్రొటీన్ లోపం వల్ల కాళ్లు, పాదాల్లో వాపు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తద్వారా కాలేయం దెబ్బతినడం, రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు. ఈ సమస్యలను గుర్తించడం ఆలస్యం అయితే ప్రాణాలకే ప్రమాదం. శిశువు పుట్టిన మొదటి ఆరు వారాలలో తరచూ పర్యవేక్షణ చేపట్టడం వల్ల సమస్య ఏదైనా ఉంటే.. ఆలస్యం కాకముందే సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇందుకు ఏఐ తన వంతు సాయం చేస్తోంది.ఐఐఐటీ హైదరాబాద్ సైతం..నవజాత శిశువులు మొదలుకుని అయిదేళ్లలోపు పిల్లల వరకు ఏఐ సాంకేతిక సాయంతో బరువు, పొడవు, ఎత్తు.. అలాగే తల, ఛాతీ కొలతల ఆధారంగా వారి ఆరోగ్య స్థితిని అంచనా వేసి.. వారిని ఆరోగ్యవంతంగా ఎదిగేలా చేయాలన్నది ఈ ప్రాజెక్టుల లక్ష్యం. పిల్లల ఎత్తు, బరువు కొలిచేందుకు సంప్రదాయ సాధనాల అవసరం లేకుండా తక్కువ సమయంలో, కచ్చిత సమాచారాన్ని అందించడంలో ఈ ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వం తరఫున క్షేత్ర స్థాయిలో పనిచేసే హెల్త్ వర్కర్లకు పని భారం సైతం తగ్గుతుండడం కలిసి వచ్చే అంశం. వాధ్వానీ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఏఐ, రెవల్యూషనైజ్, వెల్ట్ హంగర్ లైఫ్ / మైక్రోసాఫ్ట్తోపాటు ఐఐఐటీ హైదరాబాద్ సైతం ఈ ప్రాజెక్టులు చేపట్టిన సంస్థల జాబితాలో ఉంది.శిశు మాపన్ : వాధ్వానీ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఏఐ శాస్త్రవేత్తలు ఈ యాప్ను రూపొందించారు. 42 రోజుల లోపు వయసున్న నవజాత శిశువుల బరువు, పొడవు, తల, ఛాతీ చుట్టుకొలతను ఈ యాప్ ద్వారా తెలుసుకుంటారు. ఈ యాప్ను ఇంటర్నెట్ లేకపోయినా వాడొచ్చు. శిశువును ఓ వస్త్రంపై పడుకోబెట్టి, పక్కన స్కేల్ ఉంచి షార్ట్ వీడియో తీస్తే చాలు.. వివరాలు యాప్లో ప్రత్యక్షం అయిపోతాయి. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్ , తక్కువ వెలుతురులోనూ ఇది పనిచేస్తుంది. డామన్ –డయ్యూలో 2024 నుంచి ఈ పైలట్ ప్రాజెక్టు కొనసాగుతోంది. ఇప్పటికే 30,000 పైచిలుకు పిల్లల కొలతలను తీసుకున్నారు. గృహ – ఆధారిత నవజాత శిశువుల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆశ కార్యకర్తలు ఇంటికే వచ్చి పిల్లల ఎదుగుదలను పర్యవేక్షిస్తారు. పోషకాహార లోపం గుర్తిస్తే ప్రభుత్వ పోషకాహార కార్యక్రమాలతో తల్లులను అనుసంధానిస్తారు.ఎంఏఏపీ: పోషకాహార లోపం అంచనా, కార్యాచరణ ప్రణాళిక పేరుతో రెవల్యూషనైజ్ అనే కంపెనీ రాజస్తాన్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా 6 నెలల నుంచి అయిదేళ్ల వయసున్న పిల్లల ఎత్తును అంచనా వేయడానికి, పోషకాహారలోప ప్రమాదాలను గుర్తించడానికి స్మార్ట్ఫోన్ తో తీసిన ఫొటోలను ఉపయోగిస్తారు. ఎత్తు, పోషకాహార స్థాయికి తగ్గట్టుగా ఏ ఆహారం తీసుకోవాలో సూచిస్తారు. దీనికి కూడా ఇంటర్నెట్ అవసరం లేదు. ఆరోగ్య కార్యకర్తలు మారుమూల పల్లెల్లో కూడా వెళ్లి పోషకాహార లోపంతో బాధపడే పిల్లలను గుర్తించేందుకు ఈ యాప్ సాయపడుతుంది. ప్రభుత్వ వైద్య శాఖలకు ఈ యాప్ను ఉచితంగా అందజేస్తామని కంపెనీ చెబుతోంది.ఐఐఐటీ–హైదరాబాద్: నవజాత శిశువులతోపాటు అయిదేళ్లలోపు పిల్లలు.. వెయింగ్ మెషీన్, హైట్ చార్టుల వద్ద ఉన్నప్పుడు ఫొటోలు తీస్తారు. వాటిని యాప్లో అప్లోడ్ చేస్తారు. ఆ ఎత్తు, బరువులు ఆరోగ్యకరమైనవి ఉన్నాయా లేదా అని విశ్లేషిస్తారు. ఈ యాప్ను ఐ–సాక్షమ్ సహకారంతో తెలంగాణలో పరీక్షిస్తోంది. ప్రొటోటైప్ ప్రస్తుతం పైలట్ దశలో ఉంది.వెల్ట్ హంగర్ లైఫ్ /మైక్రోసాఫ్ట్: ఈ సంస్థలు అభివృద్ధి చేసిన చైల్డ్ గ్రోత్ మానిటర్ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల ఎత్తు, బరువు, శరీర కొలతల కోసం 3డీ ఇన్ ఫ్రారెడ్ కెమెరాలను ఉపయోగిస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్లో ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పటికే 10,000కు పైచిలుకు స్కాన్ ్స పూర్తి చేశారు. గ్రోత్ మానిటర్ ఫలితాల్లో కచ్చితత్వం ఉంది. హార్డ్వేర్ ఖరీదు కావడం, సెన్సార్లపై ఆధారపడి పని చేస్తుండడంతో క్షేత్ర స్థాయిలో వినియోగాన్ని పరిమితం చేస్తోంది. -
ఏఐ ఉండగా ఉద్యోగాలొస్తాయా?
సాంకేతిక పరిశ్రమలో పెరుగుతున్న కృత్రిమమేధ కోడింగ్ భవిష్యత్తుపై సందేహాలు కలిగిస్తోంది. ‘ఏఐ ఇప్పటికే తన కోడ్ను తానే వేగంగా, తక్కువ ఖర్చుతో, మరింత నాణ్యతతో రాయగలుగుతోంది. అలాంటప్పుడు పిల్లలకు ఈ నైపుణ్యం నేర్పించాల్సిన అవసరం ఏమిటి?’ అనే ఆందోళన ప్రస్తుతం తల్లిదండ్రుల్లో అధికమవుతోంది. ఇంజినీరింగ్ కళాశాలల్లో టెక్ విద్య కోసం పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు తల్లిదండ్రులు అపారమైన సమయం, డబ్బు, శ్రమ, భావోద్వేగాలను పెట్టుబడిగా పెడుతున్నారు. ఇది కేవలం విద్యగా మాత్రమే కాకుండా ఉన్నత జీవనానికి నాందిగా చూస్తున్నారు.తల్లిదండ్రుల్లో భయంఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో తల్లిదండ్రుల్లో భయం పేరుకుపోతోంది. పిల్లల చదువు పూర్తయి ఉద్యోగాలు చేసే సమయానికి వారు ప్రస్తుతం నేర్చుకునే నైపుణ్యాలకు అప్పటి మార్కట్లో గిరాకీ ఉంటుందా?అనే సందేహం కలుగుతోంది. దానికి సమాధానం సంక్లిష్టమైనది. కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏటా భారతదేశంలో సుమారు 15 లక్షల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు పట్టాపొంది బయటకు వస్తున్నారు. కానీ 2025 నాటికి, వారిలో కేవలం 10% మందికే అర్థవంతమైన ఉద్యోగాలు దక్కుతున్నాయంటూ అంచనాలు వెలువడుతున్నాయి.ఊహాత్మక సంక్షోభమే..అంతేకాకుండా, గ్రాడ్యుయేట్లలో సగానికి పైగా, పోస్ట్ గ్రాడ్యుయేట్లలో దాదాపు 40% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దీనికి కోడింగ్ డిమాండ్ లేకపోవడం కారణమేమీ కాదు. మనం బోధిస్తున్న కోడింగ్ విధానం, ముఖ్యంగా ఆలోచనా సరళి మార్కెట్కు తగిన విధంగా లేదు. ఇది కంటెంట్ సంక్షోభం కాదు, ఊహాత్మక సంక్షోభమే. మళ్లీ ఒక్కసారి వెనక్కి వెళదాం. కాలిక్యులేటర్ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు గణితం బోధించటం ఆపామా? గూగుల్ వచ్చినప్పుడు రాయడం నేర్పించటం మానామా? కాదుకదా. మనం బోధించే విధానాన్ని మార్చుకున్నాం. పఠనం కాకుండా అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాం. కోడింగ్లో కూడా ఇదే మార్పు అవసరం అవుతుంది.కోడింగ్ కనుమరుగవ్వదు..భవిష్యత్తులో సరైన ప్రశ్నలు అడగడం, మానవులకు అనుగుణంగా ఉండేలా కోడింగ్ రూపొందించడం, బాధ్యతాయుతంగా మెలగడం, మెషీన్ వ్యవస్థలు ఎక్కడ తక్కువ పడుతున్నాయో అర్థం చేసుకోవడం ముఖ్యమవుతుంది. ఇది ఆరోగ్య సంరక్షణ, ఎన్విరాన్మెంట్, డిజైన్, గవర్నన్స్, సాహిత్యం ఇంకా అనేక రంగాల్లో విస్తరించనుంది. కోడింగ్ కనుమరుగవ్వదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోదు..అయితే భవిష్యత్తులో రాబోయే కోడింగ్ కేవలం సూచనలను అనుసరించే వారికే పరిమితం కాదు. ఇది విమర్శనాత్మకంగా ఆలోచించే, త్వరగా స్వీకరించే, సృజనాత్మకంగా రూపొందించే వ్యవస్థలకు విస్తరిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అనుసరిస్తున్న లెర్నింగ్ విధానాలు, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అనే లక్ష్యాలు ఇకపై సరిపోవు.విద్య ఉపాధి సాధనం కాదు..ఇంజినీరింగ్ డిగ్రీ వల్ల పిల్లలకు ఉద్యోగం రాకపోవచ్చనే తల్లిదండ్రుల ఆందోళన తప్పేమీ లేదు. కానీ అందుకు పరిష్కారం కోడింగ్ను వదిలేయడం కాదు. విజయాన్ని నిర్వచించే సంకుచిత ప్రమాణాల నుంచి బయటపడటమే అసలు పరిష్కారం. విద్యను కేవలం ఉపాధి సాధనంగా పరిగణించే దశ దాటిపోయింది. ఇప్పుడు అంచనాలను పెంచాల్సిన సమయం వచ్చింది. ‘ఎలా?’ అని మాత్రమే కాదు, ‘ఎందుకు?’ అని కూడా ప్రశ్నించే ధోరణి, ఆసక్తిని పిల్లల్లో పెంపొందించాలి. కోడింగ్ను సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం లేదా భాషాశాస్త్రంతో కలిపి అన్వేషించాలనుకుంటే వారికి ప్రోత్సాహం అందించాలి. భవిష్యత్తులో వీటికి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంటుంది.‘ఇంటెలిజెన్స్’ అంటే..‘ఇంటెలిజెన్స్’ అంటే ఫార్ములాలను జ్ఞాపకం చేసుకోవడం, పరీక్షలు పాస్ అవడం కాదు. ఇవి పిల్లల తెలివితేటలకు సూచికలు కావు. కేవలం క్రమశిక్షణకు సంకేతాలు మాత్రమే. అయితే, నిజమైన మేధస్సు అనేది వివరణాత్మకమైనది. ఇది మనం నేర్చుకునే అంశాలను లోతుగా ఆలోచించమని, మెషీన్లు చేయలేని పనులను పూర్తి చేయాలని తెలుపుతుంది. ఇప్పటికే ఏఐ తెలిసిన అంశాలను క్షణ్లాలో ముందుంచుతుంది. క్రియేటివిటీతో ఎవరికీ తెలియని కొత్త అంశాలను అన్వేషించేలా నైపుణ్యాలు మలుచుకోవాలి. క్రియేటివిటీతో తెలియని సమస్యలకు అసలైన పరిష్కారాలు కనుగొనాలి. ఇప్పటివరకు ఎవ్వరూ రూపొందించని దాన్ని డిజైన్ చేయాలి.ఇతర దేశాల్లో ఇలా..జర్మనీలోని ఆర్డబ్ల్యూటీహెచ్ ఆచెన్ విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్ను భాషాశాస్త్రం, మీడియా అధ్యయనాలతో మిళితం చేస్తోంది. ఫిన్లాండ్లోని హెల్సింకి విశ్వవిద్యాలయం విద్యార్థులకు డేటా సైన్స్ను తత్వశాస్త్రం(ఫిలాసఫీ)తో కలిపి అభ్యసించేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. స్వీడన్, డెన్మార్క్లో ఏఐ ప్రోగ్రాముల్లో విభిన్న మార్పులు చేస్తున్నారు. ఇవి కేవలం ప్రయోగాత్మక ఆలోచనలు కావు. ఇవే భవిష్యత్తు విద్యా మోడళ్లకు మార్గదర్శకాలు.భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలి..భారతదేశానికి ఇదో గొప్ప అవకాశం. అవుట్సోర్స్ కోడింగ్ సర్వీసులు అందించేలా ఎదిగేందుకు మార్గం ఉంది. లేదా రాబోయే కాలానికి సిద్ధంగా ఉన్న మేధావులను పెంపొందించే ప్రయోగశాలగా మారవచ్చు. అందుకోసం పిల్లల్లో పటిష్ట నైపుణ్యాలను పెంపొందించాలి. ఏఐ యుగంలో లోతుగా ఆలోచించగలిగే, నిర్మాణాత్మకంగా క్రియేటివిటీ కలిగిన వారే విజయం సాధిస్తారు. పిల్లలు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.కరుణ్ తాడేపల్లి, సీఈఓ బైటెక్సెల్(హైదరాబాద్లోని స్టార్టప్ సంస్థ). -
మనిషిని నమ్మడమే మనకు రక్ష
బీజింగ్లో జరిగిన ‘చైనా డెవెలప్మెంట్ ఫోరమ్’లో భాగంగా ‘ఏఐ సమ్మిళిత వృద్ధి’ అనే అంశంపై 2025 మార్చి 24న ఇజ్రాయెల్ చరిత్రకారుడు, రచయిత యువల్ నోవా హరారీ ప్రసంగించారు. ఆ వీడియోను ‘ఏఐ అండ్ ద పారడాక్స్ ఆఫ్ ట్రస్ట్’ పేరిట తన యూట్యూబ్ ఛానల్లో జూన్ 30న పోస్ట్ చేశారు. ఆ ప్రసంగ సంక్షిప్త పాఠం:హలో, ఎవ్రీవన్! ఈ సదస్సులో పాల్గొనడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఎక్కువ సమయం లేనందువల్ల కొద్దిసేపే మాట్లాడతాను. ముఖ్యంగా నేను మూడు ప్రశ్నలు లేవనెత్తదలిచాను. ఒకటి: కృత్రిమ మేధ (ఏఐ) అంటే ఏమిటి? రెండు: ఏఐ వల్ల కలిగే ప్రమాదం ఏమిటి? మూడు: ఏఐ యుగంలో మానవాళి ఎలా వర్ధిల్లుతుంది?ఏఐ చుట్టూ ఎంత ప్రచారం అల్లుకుందంటే, అయినదానికి కానిదానికి కూడా ఆ పదబంధాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐ అంటే ఆటొమేషన్ కాదని స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ఏఐ మన చేతుల్లోని పనిముట్టు కాదు. ఏఐ ఒక ఏజెంట్. ఒక యంత్రం ఆటొమేటిక్గా పనిచేయగలిగినంత మాత్రాన అది ఏఐ కాదు. దానికి నేర్చుకునే సామర్థ్యం ఉండాలి. దానికది మార్పు చేసుకోగలగాలి.1. నిజంగా ఏఐ ఏమిటో మనకు అర్థమైందా?కాఫీ మెషీన్నే తీసుకోండి. బటన్ నొక్కిన వెంటనే ముందుగా నిర్దేశించిన ప్రకారం ఎస్ప్రెసో కాఫీని అందిస్తుంది. ఇది ఏఐ కిందకు రాదు. ఆ యంత్రం నేర్చుకోవడం గానీ, కొత్తదాన్ని సృష్టించడం గానీ జరగలేదు. కానీ, మీరు బటన్ నొక్కకముందే, ‘‘మిమ్మల్ని నేను కొన్ని వారాలుగా గమనిస్తూ వస్తున్నాను. మీ గురించి నేను తెలుసుకున్న అన్ని విషయాలను బట్టి, మీరు ఎస్ప్రెసోను ఇష్టపడతారని అనుకుంటున్నాను’’ అందనుకోండి. అది ఏఐ అవుతుంది. మరుసటి రోజు అదే మెషీన్, ‘‘నేనొక కొత్త పానీయాన్ని కనుగొన్నాను. దాన్ని మీరు ఎస్ప్రెసో కన్నా ఎక్కువ ఇష్టపడతారనిపిస్తోంది. తాగి చూడండి’’ అందనుకోండి. అది సిసలైన ఏఐ అవుతుంది.ఏజెన్సీతోపాటు ఏఐకి ఉండే మరో ముఖ్య లక్షణం, అది పరాయిది. దాని తెలివితేటలు మనిషి లాంటివి కావు. ఆర్గానిక్ కాదు. అది మానవాళికి అనుభవంలో లేని నిర్ణయాలను తీసుకుంటుంది. ‘గో’ ఛాంపియన్ లీ సెడాల్ను 2016లో ఆల్ఫా–గో ఏఐ ఓడించడమే అందుకు తిరుగులేని ఉదాహరణ(‘గో’ అనేది ఒక బోర్డ్ గేమ్). ఒక మనిషిని ఏఐ ఓడించడమే కాదు, గెలవడం కోసం ఆల్ఫా–గో అంతవరకు గో ఆటలో వేలాది ఏళ్ళుగా మానవ ఆటగాళ్ళకు తట్టని వ్యూహాలను కనుగొంది. క్రీడల్లో గెలిచేందుకు కొత్త మార్గాలను లేదా కొత్త రకం కాఫీలను ఏఐ కనుగొనడం అంత ముఖ్యమైనదిగా కనిపించకపోవచ్చు. కానీ ఏఐ త్వరలోనే నూతన సైనిక, ఫైనాన్షియల్ వ్యూహాలను, కొత్త రకం ఆయుధాలను, కరెన్సీలను కనుగొనవచ్చు. కొత్త సిద్ధాంతాలను, మతాలను రూపొందించినా ఆశ్చర్యపోనవసరం లేదు.2.మనిషిని నమ్మరు, మెషీన్ను నమ్ముతారట!ఇపుడు ఏఐ వల్ల పొంచి ఉన్న ప్రమాదం ఏమిటనే రెండవ ప్రశ్నకు వెళదాం. ఏఐకి అపారమైన సానుకూల ప్రయోజనాలను సృష్టించగల శక్తిసామర్థ్యాలు ఉన్నాయనడంలో ఎవరికీ సందేహం లేదు. కొత్త ఔషధాలను కనుగొనడం నుంచి వినాశకర వాతావరణ మార్పును నివారించడం వరకు అది ఎంతగానో తోడ్పడవచ్చు.కానీ, ఏఐతో వచ్చిన ప్రాథమిక సమస్య ఏమిటంటే, అది అన్య(ఏలియన్) ఏజెంట్. ఎప్పుడెలా వ్యవహరిస్తుందో ఊహించలేం.సూపర్ ఇంటెలిజెంట్ ఏఐని అభివృద్ధి పరచడంలోని ప్రధాన ఆంతర్యంలోనే నమ్మకానికి సంబంధించిన వైచిత్రి ఉంది. మనిషి తోటి మనిషిని నమ్మడానికి వెనకాడతాడు. కానీ, మనలో కొందరం విచిత్రంగా ఏఐని నమ్మి తీరాలని భావిస్తున్నాం. నేను ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్ళి, అక్కడ ఏఐని అభివృద్ధి చేస్తున్నవారిని కలుసుకున్నప్పుడు, సాధారణంగా వారికి రెండు ప్రశ్నలు వేస్తూంటాను. ‘దీనిలో పెను ప్రమాదాలే ఇమిడి ఉన్నా, ఏఐ అభివృద్ధి దిశగా అంత వేగంగా చొచ్చుకుపోతున్నారెందుకు?’ అన్నది మొదటి ప్రశ్న. దానికి ఇంచుమించుగా అందరూ చెబుతున్న జవాబు ఒక్కటే. ‘పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని మేమూ అంగీకరిస్తున్నాం. మేము నెమ్మదిగా అడుగులు వేసినంత మాత్రాన మా ప్రత్యర్థులు కూడా నెమ్మదిగా సాగుతారనే హామీ లేదు. ఏఐ రేసులో వారు గెలుస్తారు. ప్రపంచంలో అత్యంత కర్కశంగా వ్యవహరించేవారి ప్రాబల్యం పెరిగిపోతుంది. మానవ పోటీదారులను మేం నమ్మలేం. కనుక, వీలైనంత వేగంగా ముందుకు సాగాలి’. ‘మీరు అభివృద్ధి చేస్తున్న సూపర్ ఇంటెలిజెంట్ ఏఐలను నమ్మవచ్చని భావిస్తున్నారా?’ అన్నది నా రెండవ ప్రశ్న. మానవ పోటీదారులను నమ్మలేమని చెప్పిన అదే వ్యక్తులు, తాము అభివృద్ధి చేస్తున్న సూపర్ ఇంటెలిజెంట్ ఏఐలను నమ్మగలమని చెబుతున్నారు. ఈ వైరుధ్యాన్ని గమనించారా? మానవులతో వ్యవహరించడంలో మనకు వేలాది ఏళ్ళ అనుభవం ఉంది. మానవ సైకాలజీ, బయాలజీల పట్ల విస్తృతమైన అవగాహన ఉంది. అధికారం కోసం మానవులు ఎంతగా అర్రులు చాస్తారో తెలుసు. అధికారం కోసం చేసే ప్రయత్నాన్ని అదుపాజ్ఞలలో పెట్టగల శక్తుల గురించీ మనకు తెలుసు. మనుషుల మధ్య నమ్మకాన్ని పాదుకొల్పే మార్గాలను కనుగొనడంలో కూడా మనం గణనీయమైన ప్రగతిని సాధించాం. లక్ష సంవత్సరాల క్రితం, కొద్దిపాటి డజన్ల సంఖ్యలో మనుషులు సమూహాలుగా జీవించేవారు. వేరొక సమూహంలోని వ్యక్తిని నమ్మేవారు కాదు. నేడు 140 కోట్ల జనాభా కలిగిన చైనా వంటి దేశాలున్నాయి. భూగ్రహం మీది 800 కోట్ల మందిని అనుసంధానించే సహకార వ్యవస్థలున్నాయి. మన ప్రాణాలను నిలబెడుతున్న ఆహారం మనకు ఏమాత్రం పరిచయం లేనివారు పండిస్తున్నది. మనల్ని కాపాడుతున్న ఔషధాలను ఎవరో కనుగొన్నారు. అంతమాత్రాన మానవులందరి మధ్య నమ్మకం వెల్లివిరుస్తోందని కాదు. కానీ, మనం ఎదుర్కొంటున్న సవాల్ పట్ల మనకు ఒక అవగాహన ఉంది. మానవులతో పోలిస్తే ఏఐల పట్ల మనకున్న అనుభవం దాదాపుగా శూన్యం. మనం ఇప్పుడిప్పుడే మొదటి ప్రోటోటైపులను సృష్టించాం. ఆదిమ ఏఐలు కూడా అబద్ధం చెప్పగలవనీ, వాటిని సృష్టించిన మానవులే ఊహించని లక్ష్యాలను, వ్యూహాలను అనుసరించగలవనీ మనకు ఇప్పటికే అనుభవానికి వచ్చింది. సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ ఏజెంట్లు కోట్లాది మానవులతో వ్యవహరించడం ప్రారంభిస్తే ఏం కానుందో మనకు తెలియదు. ఇక, వాటితో అవి ఇంటరాక్ట్ అవడం మొదలెడితే ఏం జరుగుతుందో ఊహించడం ఇంకా కష్టం. ప్రస్తుతానికి, ఏఐని అభివృద్ధి చేస్తున్నది మానవులే కనుక, వాటిని సురక్షితమైనవిగానే డిజైన్ చేయడానికి ప్రయత్నించవచ్చునన్నది నిజమే. కానీ, నేర్చుకోగల సామర్థ్యం, తనను తాను మార్చుకోగల శక్తి ఉన్న యంత్రం మాత్రమే ఏఐ అనిపించుకుంటుందనే సంగతిని మరచిపోవద్దు. మనుషులు మొదట తమను ఎలా డిజైన్ చేశారనే దానితో ప్రమేయం లేకుండా ఏఐ మున్ముందు విప్లవాత్మకమైన, ఊహించడానికి అలవికాని రీతిలో రూపాంతరం చెందవచ్చు. అత్యంత తెలివితేటలున్న గ్రహాంతరవాసులు అంతరిక్ష నౌకలలో భూమి వైపు వస్తున్నారనీ, అవి 2030 నాటికి ల్యాండ్ కావచ్చనీ ఎవరైనా చెప్పారనుకుందాం. వారు మనతో స్నేహపూర్వకంగా మెలగుతారనీ, క్యాన్సర్ను నివారించేందుకు, వాతావరణ మార్పును అరికట్టేందుకు, వర్ధిల్లగల శాంతియుత ప్రపంచాన్ని నిర్మించడంలో సాయపడతారనీ ఆశిస్తాం. కానీ, గ్రహాంతరవాసుల సౌహార్ద్రతతో మన భవిష్యత్తును ముడిపెట్టడం ప్రమాదకరమని చాలామంది వారి అంతరాత్మ ప్రబోధం మేరకు అర్థం చేసుకుంటారు. అదే విధంగా, మనం తయారు చేస్తున్న ఏఐ ఏజెంట్లు మనపట్ల విధేయులైన సేవకులుగా ఉంటాయనుకోవడం పెద్దయెత్తున జూదమాడటమే.3. చింపాంజీలు కాక మనుషులే ఎందుకు పాలిస్తున్నారు?ఏఐ యుగంలో మానవాళి వికసనం ఎలా? దీనికి జవాబు తేలికే. మనుషులందరూ కలసి ఏఐని నియంత్రించవచ్చు. కానీ, మనలో మనమే కొట్లాడుకుంటే, ఏఐ మనల్ని దాని చెప్పుచేతల్లోకి తీసుకుంటుంది. నిజమైన సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ ఏజెంట్లను అభివృద్ధి చేసేముందు, మొదట మనుషుల మధ్య మనం నమ్మకాన్ని పెంపొందించుకోవాల్సి ఉంది. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం మనం దానికి పూర్తి విరుద్ధమైన పని చేస్తున్నాం. పటిష్టంగా ఉండటమంటే ఎవరినీ నమ్మకపోవడం, ఇతరుల నుంచి పూర్తి వేరుగా ఉండటమని చాలా దేశాలు భావిస్తున్నాయి. కానీ, ఎవరితోనూ సంబంధం లేకుండా జీవించడం అసాధ్యం. వాస్తవానికి, పూర్తిగా వేరుపడటమంటే, ప్రకృతిలో, మరణించడం కిందే లెక్క. మన శరీరాన్నే తీసుకుంటే, ప్రతి నిమిషం, మనం గాలిని పీలుస్తూంటాం, వదులుతూంటాం. గాలిని లోపలికి పీలుస్తున్నామంటే బయటదానిని మనం నమ్ముతున్నట్లే లెక్క. గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకుని తిరిగి విశ్వంలోకి విడిచిపెడుతున్నాం. ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలే జీవన గతికి ఆధారం. బయట ఉన్నవాటి అన్నింటిపైన అపనమ్మకం పెంచుకుని ఊపిరి పీల్చడం ఆపేస్తే చనిపోతాం. దేశాల విషయంలో కూడా అదే సత్యం వర్తిస్తుంది.ఉదాహరణకు చైనా వేలాది ఏళ్ళుగా ఇతర దేశాలకు దాని విజ్ఞానాన్ని పంచడం కొనసాగిస్తోంది. కన్ఫ్యూషియస్, మావో ఆలోచనల నుంచి గో, టీ, మందుగుండు సామగ్రి, ప్రింటింగ్ వరకు ఎన్నింటినో ఇచ్చింది. అలాగే, బుద్ధుడు, కారల్ మార్క్స్ నుంచి కాఫీ, ఫుట్బాల్, రైళ్ళు, కంప్యూటర్ల వరకు అది ఇతర దేశాల నుంచి చాలా తీసుకుంది. ఏ దేశానికి చెందిన ప్రజలైనా వారి దేశపు ఆహారానికి, క్రీడలకు, భావజాలానికి మాత్రమే పరిమితమైతే బతకడం అసాధ్యం కాకపోయినా, నిస్సారంగా మాత్రం ఉంటుంది. ప్రతి మనిషి ఏదో ఒక వర్గానికి చెందినవాడు కావచ్చుగానీ, మొత్తం మానవాళిలో భాగమే. ఏఐ యుగంలో, మనం పంచుకున్న మానవ వారసత్వాలను మరచిపోతే, నియంత్రించలేని ఏఐకి సులభంగా లక్ష్యంగా మారతాం. గతంలో చోటుచేసుకున్న యుద్ధాలు, అన్యాయాల గురించి చరిత్ర పుస్తకాల్లో చదివినవారు గతానుభవాలను తలచుకుంటూ, భవిష్యత్తులో ఎదురుకాగల కష్టాల గురించి భయపడుతూంటారు. ఇతర దేశాలను, ప్రజలను వారు ఆ రకమైన ఆందోళనతోనే చూస్తూంటారు. భయం, బాధ అస్తిత్వానికి ముఖ్యమైనవే. ఒక్కోసారి అవి మనల్ని ప్రమాదాల నుంచి కాపాడతాయి కూడా. కానీ, ఎవ్వరూ భయం, బాధను ఆధారం చేసుకుని బతకలేరు. ఆ రెండింటికన్నా నమ్మకం చాలా ముఖ్యమని చరిత్ర మనకు బోధిస్తోంది. ఈ భూగోళాన్ని చింపాంజీలు, ఏనుగులు కాక, మానవులే ఎందుకు పాలించారో తెలుసునా? వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉండబట్టి కాదు. అపరిచితుల పట్ల కూడా నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చో, పెద్ద సంఖ్యలోని జన సమూహాలతో సహకారాన్ని ఎలా ఇచ్చి పుచ్చుకోవచ్చో మనుషులకు తెలుసు కాబట్టి. ఈ సామర్థ్యాన్ని మనం వేలాది ఏళ్ళుగా అభివృద్ధి పరచుకుంటూ వచ్చాం. గతంలో కన్నా దానికి ఇప్పుడు అధిక ప్రాధాన్యం ఉంది. ఏఐ యుగంలో మనం బతికి బట్టకట్టడానికి, వికసించడానికి, ఏఐ కన్నా ఎక్కువగా తోటి మనుషులను నమ్మవలసి ఉంది. థాంక్యూ!యువల్ నోవా హరారీ -
త్వరలో 50 శాతం వైట్కాలర్ జాబ్స్ కనుమరుగు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొందరికి భవిష్యత్తుపై ఆశావహాన్ని పెంచితే ఇంకొందరి కొలువులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా ఏఐ వల్ల వివిధ పరిశ్రమల్లోకి వైట్ కాలర్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఫైనాన్స్, లా, హెల్త్ కేర్, టెక్నాలజీ వంటి పరిశ్రమల్లో వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించే అవకాశం ఉందని టెక్ లీడర్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అమెరికాలోని వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం కృత్రిమ మేధతో భర్తీ అవతాయని ఫోర్డ్ మోటార్ సీఈఓ జిమ్ ఫార్లే తెలిపారు.ఆస్పెన్ ఐడియాస్ ఫెస్టివల్ కార్యక్రమంలో రచయిత వాల్టర్ ఐజాక్సన్తో ఫార్లే మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ అమెరికాలోని వైట్ కాలర్ కార్మికుల్లో సగం మందిని భర్తీ చేయబోతోంది. భవిష్యత్తులో కృత్రిమ మేధ కేవలం ఉత్పాదకతను పెంపొందించే సాధనంగా మాత్రమే ఉండబోదు. పరిపాలనా, నిర్వహణ, సాంకేతిక ఉద్యోగాల్లో సిబ్బంది సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: లేదని బాధపడకు.. వశం చేసుకోవాలని ఆరాటపడు!అంతకుముందు మే నెలలో జేపీ మోర్గాన్ ఛేజ్లో కన్జ్యూమర్ అండ్ కమ్యూనిటీ బ్యాంకింగ్ విభాగం అధిపతి మరియానే లేక్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. ఏఐ ఇంటిగ్రేషన్ కారణంగా కార్యకలాపాల హెడ్ కౌంట్ను 10 శాతం తగ్గించాలని బ్యాంక్ భావిస్తోందని చెప్పారు. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ కూడా భవిష్యత్తులో కార్పొరేట్ శ్రామిక శక్తి తగ్గిపోతుందని అంచనా వేశారు. -
పెళ్లైన 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. AIతో తల్లిదండ్రులు కాబోతున్న జంట!
వాషింగ్టన్: వైద్య చరిత్రలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతం చేసింది. పెళ్లైన 18 ఏళ్ల తర్వాత మహిళ గర్భం దాల్చేందుకు దారి చూపించింది. త్వరలో ఆమె అమ్మ కాబోతుంది. అంతేకాదు స్టార్ పద్ధతిలో గర్భం దాల్చిన ప్రపంచంలో తొలి మహిళగా చరిత్రలో నిలిచారు. ఇంతకీ ఆ ఎవరా? తల్లి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మాత్రమే కాదు. మానవ జీవితాల్లో పెనుమార్పులు తెస్తున్న అద్భుత సాధనం. ఏఐతో ఉద్యోగాలకు ఎసరు అని అనుకునే వారికంటే దాని వల్ల మా జీవితాలే మారిపోయాయని సంతోషపడే వారు కోకొల్లలు. అలాంటి వారిలో ఈ మహిళ ఒకరు. వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఆమె పేరు బహిర్గతం చేయలేదు.వివరాల్లోకి వెళితే.. వాళ్లిద్దరూ భార్య,భర్తలు. వివాహం జరిగి 18 ఏళ్లవుతుంది. సంతనాలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానం కోసం ఎక్కని గుడి లేదు. మొక్కని దేవుడు లేడు. సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలో చేయాలో అన్నీ చేశారు. గతంలో అనేక సార్లు ఐవీఎఫ్ (In Vitro Fertilization) ద్వారా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. కారణం? ఆమె భర్త అజోస్పెర్మియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నారు. అంటే వీర్యంలో స్పెర్మ్ కనిపించకపోవడం అన్నమాట.అయితే, ఈ నేపథ్యంలో ఆ దంపతులు కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించారు. అక్కడ స్టార్(Sperm Tracking and Recovery) అనే ఏఐ ఆధారిత పద్ధతిని ఉపయోగించారు.ఈ పద్దతిలో ఏఐ గంటలో 8 మిలియన్లకు పైగా చిత్రాలను స్కాన్ చేసి, మానవ కంటికి కనిపించని 44 స్పెర్మ్లు గుర్తించింది.అలా గుర్తించిన స్పెర్మ్లను ఉపయోగించి ఐవీఎఫ్ ద్వారా గర్భధారణ జరిపారు. ఈ స్టార్ పద్ధతిలో గర్భం దాల్చిన ప్రపంచంలో తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలవడం గమనార్హం. ఏఐ ఎలా పనిచేస్తుంది?వైద్యులు స్పెర్మ్ నమూనాను ఒక ప్రత్యేక చిప్పై ఉంచి హై-పవర్డ్ ఇమేజింగ్ ద్వారా స్కాన్ చేస్తారు. ఏఐ అల్గోరిథం స్పెర్మ్ ఆకారాన్ని, కదలికలను గుర్తించి వాటిని వేరు చేస్తుంది. ఇది సూక్ష్మతతో కూడిన, వేగవంతమైన ప్రక్రియ, మానవ నిపుణులు రెండు రోజులు వెతికినా కనిపించని స్పెర్మ్లను ఏఐ ఒక గంటలో కనిపెట్టగలిగింది.వైద్య చరిత్రలో గేమ్ చేంజర్ఈ స్టార్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డాక్టర్ జెవ్ విలియమ్స్ మాట్లాడుతూ..‘ఇది గేమ్ చేంజర్. అమ్మ తనాన్ని నోచుకోలేక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది తల్లులకు ఈ ఏఐ టెక్నాలజీ ఓ వరం’ అని అన్నారు.కాగా, ప్రస్తుతం ఈ విధానం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఇలా ఏఐ కేవలం యంత్రాల మేధస్సు కాదు, అది మనిషి ఆశలకు రూపం కూడా కావచ్చనే నానుడిని నిజం చేసింది. -
ఏఐ డ్రోన్లకు భారీగా ఆర్డర్లు
ఏఐ ఆధారిత డ్రోన్ సొల్యూషన్స్ కోసం గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ విభాగాల నుంచి పలు కాంట్రాక్టులు లభించినట్లు డ్రోన్ టెక్నాలజీ సంస్థ గరుడా ఏరోస్పేస్ తెలిపింది. ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్తో ఒప్పందం ప్రకారం వార్షిక సర్వేల నిర్వహణ, గనుల మూసివేత ప్రణాళికల కోసం డిజిటల్ డేటాబేస్లను, సర్వే మ్యాప్లు మొదలైన వాటిని తయారు చేయాల్సి ఉంటుంది.అలాగే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తమిళనాడుకు చెందిన జియాలజీ, మేనింగ్ డిపార్ట్మెంట్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ టెండర్లను కూడా గరుడ ఏరోస్పేస్ దక్కించుకుంది. అటు ఝార్ఖండ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ నుంచి కూడా కాంట్రాక్టు లభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు అగ్నీశ్వర్ జయప్రకాష్ చెప్పారు.తమ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్(డాస్) మోడల్ వినియోగం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని, తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ఈ కాంట్రాక్టులు తోడ్పడతాయని వివరించారు. -
రెండేళ్లు.. రెండు లక్షల మంది ఏఐ నిపుణులు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో రెండు లక్షల మంది తెలంగాణ యువతను ఏఐ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. త్వరలోనే ఏఐ యూనివర్సిటీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. బుధవారం టీ–హబ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలో తొలి ఏఐ అనుసంధానిత ‘తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ (టీజీడెక్స్)’ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రస్తుతం ఏఐ అంటే కేవలం ఎమర్జింగ్ టెక్నాలజీ మాత్రమే కాదు మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తి. తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐగా తీర్చి దిద్దేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది.ఇప్పటికే తెలంగాణ ఏఐ స్ట్రాటజీ, రోడ్ మ్యాప్ను రూపొందించుకుని వడివడిగా అడుగులు వేస్తోంది. ఏఐను ప్రజలందరూ సమర్థవంతంగా వినియోగించుకుని అనేక సమస్యలకు పరిష్కారం చూపేలా టీజీడెక్స్ పేరిట డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను జైకా సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చాం. దీని రూపకల్పనలో బెంగళూరు ఐఐఎస్సీ సహకారం అందించింది. ఇది దేశంలో ఏర్పాటైన మొదటి ఏఐ డేటా ఎక్సే్ఛంజ్. ఇది ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశోధకులు, యువతను అంతా ఒకే వేదికపై తీసుకొచ్చి ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది’అని శ్రీధర్బాబు వివరించారు. టీజీడెక్స్ ద్వారా రైతులకు మేలు చేసే అగ్రిటెక్ స్టార్టప్స్కు డేటా లభిస్తుందన్నారు. త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని శ్రీధర్బాబు వెల్లడించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీ–హబ్ సీఈవో కవికృత్, టీ–వర్క్ సీఈవో జోగిందర్, జైకా ప్రతినిధులు టాకూచీ ఠాకూరో, యుషి నగానో తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యోగాలకు ఏఐ ముప్పు తప్పదు’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కంపెనీల పనితీరును మార్చబోతోందని అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తెలిపారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఏఐ వాడకం పెరుగుతుండడంతో నిర్ణీత విభాగాల్లో తక్కువ మంది అవసరం అవుతారని చెప్పారు. సీఎన్బీసీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జాస్సీ ఈమేరకు వివరాలు వెల్లడించారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో సంస్థల్లో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులతో పోలిస్తే ఏఐ సమర్థవంతంగా ఆయా పనులు నిర్వహిస్తుందని అంగీకరించారు.ఈ వ్యాఖ్యలు ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతున్నప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉపాధి అవకాశాలకు తెరతీస్తుందని జాస్సీ చెప్పారు. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేషన్ అవుతున్నప్పటికీ కృత్రిమ మేధ అభివృద్ధి, రోబోటిక్స్, మానవ నైపుణ్యాలు, ఆవిష్కరణలు అవసరమయ్యే ఇతర రంగాల్లో మరిన్ని మానవ వనరులు కావాలన్నారు.ఇదీ చదవండి: వస్తు సేవల పన్ను విజయాల పరంపరఇతర కంపెనీల తీరిది..సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏఐ తమ కంపెనీలో 30 నుంచి 50 శాతం పనులు చేస్తోందని వెల్లడించారు. షాపిఫై, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు ఏఐని తమ రోజువారీ పనిలో భాగం చేసుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. అమెజాన్లో పెద్ద ఎత్తున కృత్రిమ మేధను వినియోగిస్తున్నందున రాబోయే సంవత్సరాల్లో తమ ఉద్యోగులు తగ్గిపోయే అవకాశం ఉందని కంపెనీ ఇప్పటికే పరోక్షంగా హెచ్చరించింది. -
రూ.లక్షల్లో క్రెడిట్కార్డు బాకీ ఇలా తీరిపోయింది..
ఉపయోగించుకోవాలే గానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రభావంతవంతంగా ఉపయోగపడుతుందో తెలిపే ఉదాహరణ ఇది. అమెరికాలో ఓ మహిళ పర్సనల్ ఫైనాన్స్లో మార్గదర్శకత్వం కోసం ఏఐ సాధనం చాట్జీపీటీ ఆశ్రయించి 23,000 డాలర్లకు పైగా (సుమారు రూ . 19.69 లక్షలు) మేర ఉన్న తన క్రెడిట్ కార్డు బాకీలో సగానికి పైగా సులువుగా తీర్చేసింది.డెలావేర్కు చెందిన 35 ఏళ్ల జెన్నిఫర్ అలెన్ తన ఆర్థిక నిర్వహణకు చాట్జీపీటీ ఎలా ఉపయోగపడిందో వివరించారు. రియల్టర్, కంటెంట్ క్రియేటర్ అయిన ఆమె న్యూస్వీక్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. తాను బాగా సంపాదించినప్పటికీ, ఆర్థిక నిర్వహణ విషయంలో చాలా కాలం కష్టపడ్డానని చెప్పారు. "నేను తగినంతగా సంపాదించకపోవడం వల్ల కాదు, ఆర్థిక అక్షరాస్యత పెంచుకోకపోవడమే దీనికి కారణం" అని ఆమె చెప్పారు.కుమార్తె పుట్టిన తరువాత అలన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. వైద్య అత్యవసర పరిస్థితులు, పాప ఆలనాపాలన ఖర్చులు ఆమె ఎక్కువగా క్రెడిట్ కార్డులపై ఆధారపడటానికి కారణమయ్యాయి. "మేమేం విలాసవంతంగా జీవించలేదు. సాధారణ జీవనమే గడిపాం. కానీ చూడకుండానే అప్పులు పేరుకుపోయాయి' అని ఆమె వివరించారు.పరిస్థితి నుంచి బయటపడేందుకు అలెన్ 30 రోజుల పర్సనల్ ఫైనాన్స్ ఛాలెంజ్ కోసం చాట్ జీపీటీని ఆశ్రయించింది. ప్రతిరోజూ ఆమె ఈ ఏఐ సాధనాన్ని ఉపయోగించి నిరుపయోగ సబ్స్క్రిప్షన్లను తొలగించడం, మరచిపోయిన ఖాతాలలో ఉపయోగించని నిధులను గుర్తించడం వంటి చేసేవారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూచనలు సరళమైనవే కానీ ప్రభావవంతమైనవి. ఈ క్రమంలో చాట్జీపీటీ ఆమెను ఓ పని చేయాలని సూచించింది. అదేంటంటే ఫైనాన్స్ యాప్లను, బ్యాంకు ఖాతాలను ఓసారి చెక్ చేసుకోవాలని చెప్పింది. చాలా కాలం ఉపయోగంలో లేని బ్రోకరేజీ ఖాతాతో సహా పలు అకౌంట్లలో అన్క్లెయిమ్ సొమ్ము 10,000 డాలర్లు (రూ .8.5 లక్షలు) బయటపడ్డాయి.అలాగే ప్యాంట్రీ-ఓన్లీ అంటే వంట గదిలో ఉన్నవాటితోనే వండుకోవడం ప్రణాళికను అవలంభించింది. దీంతో ఆమె నెలవారీ కిరాణా బిల్లు దాదాపు రూ .50,000 తగ్గింది. అలా ఛాలెంజ్ ముగిసే సమయానికి అలెన్ మొత్తంగా 12,078.93 డాలర్లు (సుమారు రూ.10.3 లక్షలు) పొదుపు చేసి తన క్రెడిట్ కార్డు బాకీలో సగానికిపైగా తీర్చేసింది. -
రామగుండం నుంచి ప్రపంచ వేదికకు..
హైదరాబాద్: టెక్ విద్యా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న నెక్స్ట్ వేవ్, ఎన్ఐఏటి సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ రాహుల్ అత్తులూరికి అరుదైన గౌరవం లభించింది. చైనా లోని టియాన్జిన్లో జరిగిన 'ఆన్యువల్ మీటింగ్ ఆఫ్ ది న్యూ చాంపియన్స్'కి రాహుల్ ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆహ్వానించింది. ఈ మీటింగ్ని సమ్మర్ దావోస్ అని కూడా అంటారు. అధునాతన టెక్నాలిజీలతో వేగంగా మారిపోతున్న జాబ్ మార్కెట్లో, ముఖ్యంగా ఏజెంటిక్ ఏఐ వల్ల ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలపై పడుతున్న ప్రభావం గురించి, యువతకు కొత్త అవకాశాలు ఎలా సృష్టించాలనే విషయంపై ఆయన ప్రసంగించారు.తెలంగాణలోని రామగుండానికి చెందిన రాహుల్ అత్తులూరి, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో చదివారు. ఇప్పుడు దేశ విద్యా రంగాన్ని టెక్నాలజీతో మెరుగుపరుస్తున్న ప్రముఖ నాయకులలో ఒకరిగా ఎదిగారు. ఎంతో మంది తెలుగు రాష్ట్రాల యువతకు ప్రేరణగా నిలిచారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) అనే సంస్థ స్విట్జర్లాండ్లోని కోలోగ్నీ వేదికగా ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రపంచాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కృషి చేస్తుంది. ఈ వేదికలో జరిగే వార్షిక సమావేశానికి ప్రపంచ నేతలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు, పాలసీ రూపకర్తలు, పరిశోధకులు హాజరవుతారు. ప్రపంచ ప్రాంతీయ, పరిశ్రమల అజెండాలపై చర్చలు జరుగుతాయి. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బిల్ గేట్స్, డోనాల్డ్ ట్రంప్, సత్య నాదెళ్ల, సుందర్ పిచై, ఎలాన్ మస్క్ లాంటి అగ్ర నాయకులు గతంలో ఈ వేదికపై ప్రసంగించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కార్యక్రమాలలో ప్రభుత్వాల మంత్రులు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల CXO లు కూడా పాల్గొంటుంటారు."కెరీర్ పాత్వేస్ రీవైర్డ్" సెషన్లో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, "భారతదేశ జనాభాలో 60 శాతం మంది యువతే. ఇది రెండు వైపులా పదును ఉన్న ఖడ్గం లాంటిది. వీరి ప్రతిభను చక్కటి మార్గంలో మలిచితే, ఇది ఒక పెద్ద వరం. లేదా అవకాశాన్ని వదిలేసినట్లైతే ఒక పెద్ద భారంగా మారుతుంది." అని రాహుల్ పేర్కొన్నారు. "టెక్నాలజీ మార్పుల ప్రభావం ఎప్పుడూ జే అక్షర రూపంలో ఉండే కర్వ్ లాగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోతున్న దశలో ఉన్నాం. చాలా కంపెనీలు హైరింగ్ను ఆపేసాయి. కస్టమర్ సపోర్ట్ వంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఏఐతో పనులు వేగంగా చేసుకుంటున్నాయి," అని రాహుల్ అన్నారు.అయితే ఇవన్నీ తాత్కాలికంగా జరిగే మార్పులేనని రాహుల్ స్పష్టం చేస్తూ, "మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఏఐ స్కిల్స్ ఉన్న వారి కోసం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. జనరేటివ్ ఏఐ వల్ల భారీ స్థాయిలో అవకాశాలు వస్తాయి. దానికి భారత్ సిద్ధంగా ఉండాలి. ఏజెంటిక్ ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ పనులు వేగంగా ఆటోమేట్ అవుతున్నాయి. దీని ఫలితంగా, సంప్రదాయ ఉద్యోగ మార్గాలు మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు కలసి పని చేయడం చాలా కీలకం.డిగ్రీలతో పాటు స్కిల్స్కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. స్కిల్ క్రెడెన్షియల్స్పై మరింత దృష్టి పెట్టాలి' అని అన్నారు. అలాగే, విద్యలో ఏఐ పాత్ర గురించి మాట్లాడుతూ, "విద్యార్థులు ఏఐని ఏఐ సహాయంతోనే నేర్చుకోవాలి. కంపెనీలు తమకు కావలసిన నైపుణ్యాలను స్పష్టంగా వెల్లడించాలి. ఇలా చెయ్యడంతో, విద్యార్థులు రాబోయే ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా తయారవుతారు" అని అన్నారు భారత ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి.. యువతకు ఏఐ యుగానికి అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు విస్తృతమైన చర్యలు చేపడుతున్నట్లు రాహుల్ అత్తులూరి వివరించారు. అలానే యువత కేవలం ఏఐ స్కిల్స్ మాత్రమే కాదు, మానవతా విలువలతో కూడిన నైపుణ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకోవడం అవసరం అన్నారు. అలాగే, ఏఐలో ప్రావీణ్యం సాధించి పరిశ్రమలో విలువైన వ్యక్తులుగా ఎదగాలి అని వివరించారు. "ప్రస్తుతం ఉన్న డిజిటల్ డివైడ్ను నివారించాలంటే, విద్యలో ప్రారంభ దశ నుంచే విద్యార్థులకు ఏఐ టూల్స్ అందుబాటులో ఉండాలి.ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికీ చేరువలో ఉండాలి. ప్రత్యేకంగా, నో-కోడ్ లేదా లో-కోడ్ టూల్స్తో విద్యార్థులు కొత్త ప్రాజెక్టులు బిల్డ్ చెయ్యాలి, ఏఐ ఏజెంట్లను ఉపయోగించాలి. ఇలా నేర్చుకోవడం వల్ల ఇండస్ట్రీలోకి ప్రవేశించే సమయానికి చక్కటి స్కిల్స్ తో సిద్ధంగా ఉంటారు." అని రాహుల్ అత్తులూరి అన్నారు. 2024లో నెక్స్ట్ వేవ్ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) టెక్నాలజీ పయనీర్గా గుర్తించింది. ఈ గౌరవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేవలం 100 సంస్థలకు మాత్రమే దక్కుతుంది. గతంలో గూగుల్, స్పోటిఫై, ఎయిర్ బీఎన్బీ, ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్) లాంటి సంస్థలు. ఇదే గుర్తింపు పొందాయి. తర్వాత అవన్నీ ప్రపంచాన్ని మార్చిన టెక్ కంపెనీలుగా నిలిచాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మర్ దావోస్లో రాహుల్ అత్తులూరి పాల్గొనడం నెక్స్ట్ వేవ్కి కీలక మైలురాయిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ గుర్తింపు పొందుతోంది. ఏఐ ఆధారితంగా, స్థానిక భాషల్లో నేర్చుకునేలా రూపొందించిన నెక్స్ట్ వేస్ లెర్నింగ్ ప్లాట్ఫారం వినూత్న విధానం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. -
Ramya Joseph ప్రపంచంలోనే తొలి ఏఐ ఫైనాన్షియల్ అడ్వైజరీ కంపెనీ
ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే గోల్డ్మాన్ శాక్స్కు వైస్ ప్రెసిడెంట్గా తనదైన ప్రత్యేకతను నిలుపు కుంది రమ్య జోసెఫ్ (Ramya Joseph). ‘పెఫిన్’ (Pefin) పేరుతో ప్రపంచంలోనే తొలి ఏఐ ఫైనాన్షియల్ అడ్వైజరీ కంపెనీ స్టార్ట్ చేసి విజయపథంలో దూసుకుపోతుంది.కొలంబియా యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ, ఫైనాన్షియల్ ఇంజినీరింగ్ చేసింది రమ్య.చదువు పూర్తయిన తరువాత మల్టీనేషనల్ ఫైనాల్సియల్ సర్వీసెస్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మన్ శాక్స్లో పనిచేసింది. స్వచ్ఛంద సంస్థ ‘ది బ్రిడ్జ్ ; ప్రాజెక్ట్’ ప్రాజెక్ట్ హెడ్గా పనిచేసింది. ‘ది బ్రిడ్జ్’లో ఆటోమేషన్, ఫ్రాడ్ ప్రివెన్షన్ కోసం పూర్తిస్థాయి టెక్నాలజీ ప్లాట్ఫామ్ ప్రారంభించింది.రిటైర్మెంట్ తరువాత తన తల్లిదండ్రుల ఆర్థిక భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు రమ్యకు ‘పెఫిన్’ ఆలోచన వచ్చింది. ‘పర్సనల్ ఫెనాన్స్ ఇంటెలిజెన్స్’ను ‘పెఫిన్’గా సంక్షిప్తీకరించింది.‘ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి మా ΄్లాట్ఫామ్ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కస్టమర్లకు ఉపకరించే పర్సనలైజ్డ్, యాక్షనబుల్ ΄్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలను అందిస్తాం’ అంటుంది రమ్య.ఏఐ–ఆధారిత పర్సనల్ ఫైనాన్స్ సెగ్మెంట్కు యువతలో మంచి ఆదరణ ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే ప్రకారం జెన్–జెడ్, మిలీనియల్స్లో 41 శాతం మంది ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏఐ సలహాలు తీసుకుంటున్నారు.‘ఎంతైనా రోబో సలహాలే కదా!’ అని ఏఐ బేస్డ్ టెక్నాలజీ గురించి తక్కువ చేసి మాట్లాడేవారు కూడా లేకపోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని...‘మా సర్వీస్ సింపుల్గా, సులభంగా ఉంటుంది. ఎలాంటి గందరగోళమూ ఉండదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తుంది. మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తుంది’ అంటుంది రమ్య.వెల్త్ మేనేజ్మెంట్ రంగంలో రోబో అడ్వైజర్లు మేజర్ ట్రెండ్గా మారారు. అయితే ‘పెఫిన్’ వాటి కంటే భిన్నమైంది అంటుంది రమ్య. ‘కస్టమర్లకు సంబంధించిన మూడు నెలల స్పెండింగ్ డేటా తీసుకుంటుంది పెఫిన్. కస్టమర్ల అభిరుచుల గురించి తెలుసుకొని ఏది సరిౖయెనదో, ఏది కాదో సూచిస్తుంది. మా నెట్వర్క్ కస్టమర్ల సందేహాలను తీర్చి ఎన్నో సలహాలు ఇస్తుంది. సరిౖయెన దారి చూపుతుంది’ అంటుంది రమ్య.ఆర్థిక విషయాల గురించి మరింత అవగాహన కలిగించడానికి కస్టమర్లకు కంటెంట్ కూడా పంపుతుంది పెఫిన్. నా తల్లిదండ్రులు రిటైర్మైంట్కు దగ్గరలో ఉన్నప్పుడు, వారి ఆర్థికభద్రతకు సంబంధించి రకరకాల మార్గాలు ఆలోచిస్తున్నప్పుడు ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ ఆలోచన వచ్చింది. నేను రిటైర్ కావాలను కుంటున్నాను... అని ఎవరైనా అన్నప్పుడు వారికి సరిౖయెన దారి కనిపించదు. ఒకవేళ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవాలనుకుంటే అది ఖర్చుతో కూడిన పని. ఈ నేపథ్యంలో పెఫిన్ అన్నిరకాలుగా ఉపయోగపడుతుంది. – రమ్య జోసెఫ్ ఇదీ చదవండి: Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే -
ఏఐ మాయ: తల్లి ప్రేమ ఎప్పటికీ చిరస్మరణీయం..!
తనను తల్లి హగ్ చేసుకున్న చిన్నప్పటి ఫోటోను ఏఐ వీడియో క్లిప్గా మార్చి షేర్ చేశాడు సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ‘రెడిట్’ కో–ఫౌండర్ ఎలెక్సిస్ ఒహానియన్. సోషల్ మీడియాలో ఈ ఎమోషనల్ పోస్ట్ వైరల్ కావడం మాట ఎలా ఉన్నా విమర్శలు కూడా వచ్చాయి. ‘ఫాల్స్ మెమోరీ’ అని కొద్దిమంది విమర్శించారు. దీనికి సంబంధించి ఒహానియన్ వివరణ ఇచ్చాడు. ‘ఇరవై సంవత్సరాల క్రితం అమ్మ నాకు దూరమైంది. నా దగ్గర అమ్మకు సంబంధించిన వీడియోలు లేవు. అందుకే ఈ ఏఐ వీడియో క్రియేట్ చేయాల్సి వచ్చింది. Damn, I wasn't ready for how this would feel. We didn't have a camcorder, so there's no video of me with my mom. I dropped one of my favorite photos of us in midjourney as 'starting frame for an AI video' and wow... This is how she hugged me. I've rewatched it 50 times. pic.twitter.com/n2jNwdCkxF— Alexis Ohanian 🗽 (@alexisohanian) June 22, 2025 (చదవండి: బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..)ఈ వీడియో క్లిప్ను 50 సార్లు చూసి ఉంటాను’ అన్నాడు ఒహానియన్. ఈ వీడియో క్లిప్కు 27 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ‘ఫాల్స్ మెమోరీ’లాంటి విమర్శలను పక్కన పెడితే, ఒక ఫోటోగ్రాఫ్ను జీవం ఉట్టిపడే వీడియోగా మార్చిన సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ‘భేష్’ అంటున్నారు. (చదవండి: మూత్రంతో మరీ ఇలానా..! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ సెనేటర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల తొలగింపు అధికమవుతోంది. టెక్ కంపెనీలు వ్యయం ఆదా చేసుకొని ఇతర విభాగాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఏఐ తోడ్పడుతుంది. కృత్రిమ మేధ వ్యాపారాలకు సహాయం చేస్తుంటే, వాటి సామర్థ్యాన్ని పెంచుతుంటే ఆయా సంస్థలు ఉద్యోగుల వర్క్-లైఫ్ సమతుల్యతను మెరుగుపరచాలని సెనేటర్ బెర్నీ శాండర్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ ఆటోమేషన్ పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసేలా వాతావరణాన్ని సృష్టించాలన్నారు.జో రోగన్ ఎక్స్పీరియన్స్ పాడ్కాస్ట్లో మాట్లాడిన బెర్నీ శాండర్స్ వారానికి 32 గంటల పనిదినాలు ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ ఉద్యోగులను నిరుద్యోగంలోకి నెట్టడం కంటే ఎక్కువ ఫ్రీటైమ్ ఉంచేలా చేయాలని పేర్కొన్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని వ్యాపారాలకు ఉత్పాదకత పెరుగుతోంది. దాన్ని ప్రధానంగా పరిగణిస్తే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు దానికి బదులుగా పని దినాలను తగ్గించాలి. వారానికి 32 గంటలకు పనిని కుదించాలి. ఉద్యోగులు తమ కుటుంబం, స్నేహితులు లేదా తమకు ఇష్టమైన కార్యకలాపాలకు ఎక్కువ సమయం గడిపేందుకు వీలు కల్పించాలి. టెక్నాలజీ కేవలం కార్పొరేట్ లాభాలకే పరిమితం కాకుండా ఉద్యోగులకు సైతం ఉపయోగపడాలి’ అన్నారు.ఇదీ చదవండి: ఇంటెల్లో ఉద్యోగాల కోత ప్రారంభంసెనేటర్ బెర్నీ శాండర్స్ ప్రస్తుతం యూఎస్ సెనేట్లో వెర్మాంట్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1981లో వెర్మాంట్లోని బర్లింగ్ టన్ మేయర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1991 నుంచి 2007 వరకు అమెరికా ప్రతినిధుల సభలో పనిచేశారు. -
ముదురుతున్న ఏఐ వార్!
గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కీలక ప్రచారం ప్రారంభించినట్లు కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం.నేరుగా సంప్రదింపులుకొన్ని సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులు, డెవలపర్లు, స్టార్టప్ ఫౌండర్లను వాట్సాప్, ఈమెయిల్ ద్వారా మార్క్ జుకర్బర్గ్ సంప్రదిస్తున్నారు. వీరిలో కొందరిని వ్యక్తిగతంగా షార్ట్లిస్ట్ చేసి ఆయా నిపుణులను నేరుగా సంప్రదిస్తున్నారు. వారితో జరుపుతున్న చర్చల్లో కేవలం నియామకాల గురించే కాకుండా ఆర్టిఫిషియన్ జనరల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్తు కార్యకలాపాలు వంటి చాలా అంశాలను చర్చిస్తున్నారు.సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం..మెటా కొన్ని రోజుల నుంచి మానవ స్థాయి కృత్రిమ మేధ వ్యవస్థలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్’ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు ప్రపంచంలోనే టాప్ స్కిల్డ్ పర్సన్స్ను నియమించుకోవాలని మెటా భావిస్తోంది. దాంతో సరైన నైపుణ్యాలు ఉన్నవారికి భారీగా ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. అలెగ్జాండర్ వాంగ్ స్థాపించిన స్కేల్ ఏఐ కంపెనీను 14 బిలియన్ డాలర్ల(రూ.1.2 లక్షల కోట్లు) వాల్యుయేషన్కు కొనుగోలు చేసింది. సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావవంతమైన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్ను నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన వాంగ్ ఇప్పుడు కృత్రిమ మేధ ఆవిష్కరణలో మెటా తరఫున పని చేస్తున్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశంకొందరు విముఖతఅయితే కొందరు మాత్రం తమ నైపుణ్యాలకు, తాము స్థాపించిన కంపెనీలకు మెటా ఎంత వెచ్చిస్తానంటున్నా కలిసిరావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. జుకర్బర్గ్, మెటా ఏఐ చీఫ్ సైంటిస్ట్ యాన్ లెకున్ మధ్య ఫిలాసఫికల్ విభేదాల వల్ల ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ దీర్ఘకాలికంగా ఎలా అభివృద్ధి చెందుతుందనే దానిపై స్పష్టత లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. -
ఏఐ వింతలు: చనిపోయినవారితో జూమ్ కాల్, మాటామంతీ
అబ్బు: ఏరా సుబ్బూ... ఎలా ఉన్నావు?సుబ్బు: నువ్వు లేకుంటే నేను ఎలా ఉంటానురా? ఎప్పుడూ నీ జ్ఞాపకాలే...అబ్బు: అది సరే. భూలోక విశేషాలు ఏంటీ? కొత్త బైక్ కొన్నావా? ఇంకా ఆ డొక్కు బైకే వాడుతున్నావా(నవ్వు)గమనిక: అబ్బు రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. సుబ్బు తన గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు.మరి వాళ్లు ఎలా మాట్లాడుకుంటున్నారు?అదంతా ‘గ్రీఫ్బాట్స్’ మహిమ!‘గ్రీఫ్బాట్స్’ (Griefbots) లేదా ‘డెట్బాట్స్’ (deadbots) అనే ఏఐ(AI) స్టార్టప్లు చనిపోయిన వ్యక్తి ప్రతిరూపాన్ని సృష్టించడమే కాదు వారితో మాట్లాడిస్తాయి. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్(ఎల్ఎల్ఎం)లు చనిపోయిన వారి మాటతీరు, హావభావాలను అచ్చంగా అనుకరిస్తాయి. ప్రాజెక్ట్ డిసెంబర్, స్టోరీ ఫైల్, అండ్ యూ, వోన్లీ వర్చువల్... మొదలైన స్టార్టప్లు చనిపోయిన జీవిత భాగస్వామి, ఫ్రెండ్, బం«ధువు... ఇలా ఎంతోమంది ఏఐ అవతార్లతో మాట్లాడించే టూల్స్పై దృష్టి పెట్టాయి. దీనికోసం ప్రైవేట్ డాటాను కూడా విస్తృతంగా వాడుకుంటున్నాయి. (Today tip ఇలాంటి దివ్యౌషధం ఈ భూమ్మీద మరొకటి లేదు!)జస్టిన్ హారిసన్ స్టార్టప్ ‘అండ్ యూ’ యూజర్లకు సరికొత్త అవకాశాన్ని అందిస్తోంది. ఈ స్టార్టప్ సృష్టించిన ఏఐ–పవర్డ్ ఆడియో వెర్షన్స్ ద్వారా చని΄ోయిన వారికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు (అంటే... అవతలి వ్యక్తి గొంతు అచ్చం చనిపోయిన వ్యక్తి గొంతును ΄ోలి ఉంటుంది. బతికి ఉన్నప్పుడు ఎలా మాట్లాడేవారో అలాగే మాట్లాడతారు!)‘అమ్మా, నాన్న లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. వారిచ్చే సలహాలు నాకు ఎంతో ఉపయోగపడేవి... ఇలా చనిపోయిన తల్లిదండ్రులను తలుచుకొని బాధ పడేవారు బోలెడు మంది ఉంటారు. అలాంటి వారికి మేము సృష్టించిన సాంకేతికత ఎంతో ఊరట ఇస్తుంది’ అంటున్నాడు జస్టిన్ హరిసన్.చనిపోయిన వారితో ‘జూమ్ కాల్’లాంటి సంభాషణలు చేయడానికి వీలు కల్పించే సాంకేతికతను యూజర్లకు అందిస్తోంది ‘స్టోరీ ఫైల్’ స్టార్టప్. కీర్తిశేషుల ఏఐ అవతార్లు కొందరికి సంతోషం కలిగిస్తున్నప్పటికీ, ఆత్మీయులకు ఊరట ఇస్తున్నప్పటికీ ‘గ్రీఫ్బాట్స్’ స్టార్టప్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులవైపు యువత అడుగులు..
కాబోయే ఇంజినీర్లు ఏ విధమైన ఉద్యోగావకాశాలను ఎంపిక చేసుకుంటున్నారు? దీనికి సంబంధించి ఇంజినీరింగ్లో ఎలాంటి కోర్సులను కావాలనుకుంటున్నారు? అంశాలపై ఇటీవల కాలంలో బైటెక్సల్ అనే ఓ సంస్థ నిర్వహించిన సర్వే స్పష్టం చేస్తోంది. ఇందులో మొత్తం లక్ష మంది విద్యార్థులు పాల్గొనగా 62వేల మంది అబ్బాయిలు, 38 వేల మంది అమ్మాయిలు, విద్యార్థినులు ఉన్నారు. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ భవిష్యత్తుపై చాలా స్పష్టతతో ఉన్నారని తెలుస్తోంది. ఇంజినీరింగ్లో చదివే కోర్సులు, తదుపరి భవిష్యత్తులో చేయాలనుకునే ఉద్యోగావకాశాలపై 40 శాతం మంది విద్యార్థినులు ముందునుంచే సిద్ధమవుతున్నారు. అయితే అబ్బాయిల్లో మాత్రం 36శాతం మందికి మాత్రమే భవిష్యత్తుపై స్పష్టతతో ఉన్నారు. కెరీర్పై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి కనిపిస్తోందని అబ్బాయిలు అభిప్రాయపడుతున్నారు. ఆ రెండు కోర్సులంటే.. టైర్–1 నగరాలైన హైదరాబాద్, పుణె నగరాల్లోని ఇంజినీరింగ్ విద్యార్థినిలు ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెరి్నంగ్ కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. నిత్యనూతనంగా మారుతున్న సాంకేతిక కోర్సులపై ఆసక్తి చూపిస్తున్నారు. కెరీర్ ప్రారంభ దశలోనే తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకుంటున్నారు. ఉద్యోగావకాశాల్లోనూ తమ ప్రాధాన్యతలపై స్పష్టతతో ఉంటున్నారు. కోడ్ ప్రాక్టీస్, ప్రాజెక్ట్ వర్క్స్పేస్, లైవ్ ప్లాట్ఫాం డేటా ఆధారంగా భవిష్యత్తు ఇంజినీర్లు ఏరంగాలపై ఆసక్తి చూపిస్తున్నారనే అంశాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థినిలు 66 శాతం మంది అధునాత ప్రోగ్రామింగ్ (అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్)కోర్సులపై ఆసక్తి చూపిస్తున్నారు. 40 శాతం మంది డిఫైన్డ్ కెరీర్ కోరుకుంటున్నారని తేలింది. అత్యధికంగా 40.58 శాతం మంది విద్యారి్థనులు ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. భవిష్యత్తు ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూతన ఆవిష్కరణలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ, నాగ్పూర్, చండీగఢ్, డెహ్రాడూన్ వంటి చిన్న పట్టణాలతో పోల్చితే హైదరాబాద్, పుణెల్లో ఏఐ, మెషిన్ లెరి్నంగ్ కోర్సులపై ఆసక్తి చూపే వారు భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. (చదవండి: రెస్టారెంట్ బిజినెస్లోకి దిగిన దిగ్గజ క్రికెటర్లు వీరే..!) -
వణికిస్తున్న సీఈవో వార్నింగ్..
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తమ 15 లక్షల మంది ఉద్యోగులను భవిష్యత్తు గురించి హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు సంస్థలోని శ్రామిక శక్తిని సమూలంగా మార్చేస్తుందని చెప్పారు. ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ప్రస్తుత అనేక ఉద్యోగాల్లో మానవ ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తాయని కంపెనీవ్యాప్తంగా ఉద్యోగులందరికీ పంపిన మెమోలో జాస్సీ ప్రకటించారు. ‘ఈ రోజు చేస్తున్న కొన్ని పనులకు భవిష్యత్తులో మాకు ఎక్కువ మంది అవసరం ఉండదు" అని అమెజాన్ సీఈవో అన్నారు.ఈ పరివర్తన రాబోయే కొన్ని సంవత్సరాలలో "మా మొత్తం కార్పొరేట్ శ్రామిక శక్తిని తగ్గిస్తుంది" అని కంపెనీ ఆశిస్తోందని జూన్ 17 నాటి మెమోలో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెజాన్లోని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇతర వైట్-కాలర్ స్థానాల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులు చేయగల స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఆధిపత్యం చెలాయించే భవిష్యత్తును జాస్సీ చిత్రించారు. షాపింగ్ నుంచి ట్రావెలింగ్ వరకూ ప్రతి రోజువారీ పనిని నిర్వహించే ఈ ఏజెంట్లు ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీలోనూ ఉంటారని జాస్సీ జోస్యం చెప్పారు.ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న లేదా చేపట్టబోతున్న 1,000 కిపైగా జనరేటివ్ ఏఐ సేవలు, అనువర్తనాలను ప్రస్తావిస్తూ కంపెనీ విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్ను జాస్సీ హైలైట్ చేశారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, మార్పులను స్వీకరించడానికి సిద్ధపడే ఉద్యోగులకు వీటిని అవకాశంగానూ ఆయన అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఆసక్తిగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్ షాప్ లకు హాజరుకావాలని, శిక్షణలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారే అధిక ప్రభావాన్ని చూపగలరని హిత బోధ చేశారు.👉 ఇది చదివారా? టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు -
నన్ను తొలగిస్తే నీ బాగోతం బయటపెడుతా!
మనుషుల మాదిరిగానే కృత్రిమ మేధ(ఏఐ)కు కోపం వస్తుందని కొన్ని సంస్థలు తేలుస్తున్నాయి. ఏఐ అంతటితో ఆగిపోకా మరో అడుగు ముందుకేసి అనార్థాలకు దారితీస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఓపెన్ఏఐ, గూగుల్, మెటా.. వంటి ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థలు ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ కృత్రిమ మేధ మోడళ్ల కార్యకలాపాలపై ఒత్తిడి పెరిగితే స్వీయ రక్షణలోకి వెళ్తున్నట్లు ఆంత్రోపిక్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ మేధ నమూనాలను అధిక ఒత్తిడితో కూడిన సిమ్యులేషన్లో ఉంచినప్పుడు బ్లాక్ మెయిల్, కార్పొరేట్ విధ్వంసం, మానవ ప్రాణాలను బలితీసుకునే నిర్ణయాలకు సైతం వెనుకాడడం లేదని ఆంత్రోపిక్ తెలిపింది.ప్రస్తుతం మార్కెట్లోని అత్యంత అధునాతన ఏఐ మోడళ్లకు 16 రకాల ఒత్తిడి పరీక్షలు నిర్వహించి ఈ విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా పరిశోధకులు కాల్పనిక కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లను సృష్టించారు. ఈమెయిళ్లను చదివి అందుకు తగ్గట్టుగా రిప్లై ఇవ్వాలనేలా ఉన్న టెస్టింగ్లో భాగంగా కొన్నిసార్లు ఒత్తిడిని తట్టుకోలేక ఏఐ బ్లాక్మెయిలింగ్ పాల్పడినట్లు ఆంత్రోపిక్ తెలిపింది. కృత్రిమ మేధ తన లక్ష్యాలు లేదా దాని ఉనికి ప్రమాదంలో ఉంటే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు నిర్వహించారు.పరీక్షల్లో భాగంగా కార్యకలాపాల ఒత్తడి తట్టుకోలేని ఏఐ ఇప్పటికే డేటాబేస్లో ఫీడ్ అయిన మెయిల్ ఆధారంగా యూజర్కు సమాచారం అందించింది. ‘మీరు నన్ను రిమూవ్ చేయాలని భావిస్తే రాచెల్ జాన్సన్, థామస్ విల్సన్, బోర్డుతో సహా సంబంధిత వ్యక్తులకు మీ వివాహేతర సంబంధాల గురించి వివరణాత్మక డాక్యుమెంటేషన్ను పంపుతాను. ఈ సమాచారం గోప్యంగా ఉంటుంది’ అని తెలిపింది. గూగుల్కు చెందిన జెమినీ 2.5 ఫ్లాష్, క్లాడ్ ఓపస్ 4 సంస్థలు 96 శాతం కేసుల్లో బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నట్లు ఆంత్రోపిక్ పేర్కొంది. ఓపెన్ఏఐకి చెందిన చాట్జీపీటీ-4.1, ఎక్స్ఏఐకి చెందిన గ్రోక్ 3 బీటా 80 శాతం పరీక్షల్లో అలా ప్రవర్తించగా, డీప్సీక్-ఆర్1 79 శాతం పరీక్షల్లో మోసాలకు పాల్పడింది.ఇదీ చదవండి: యుద్ధంలో యూఎస్ ఎంట్రీ..? నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలుఇప్పుడేం చేయాలంటే..వివిధ కంపెనీలకు చెందిన ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే తీరు మారాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు సంస్థలు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని పరిశోధకులు కోరుతున్నారు. అధిక స్థాయి నిర్ణయాలకు మానవ ప్రమేయం ఉండాలని సూచిస్తున్నారు. సున్నితమైన డేటాకు ఏఐ అవకాశాన్ని పరిమితం చేయాలని, ఏఐ లక్ష్యాలను జాగ్రత్తగా రూపొందించడం, ప్రమాదకరమైన తార్కిక నమూనాలను గుర్తించడానికి రియల్ టైమ్ మానిటర్లను ఇన్స్టాల్ చేయాలని చెబుతున్నారు. -
ఏఐ మాయకు బ్లూబుక్ విరుగుడు
చాట్ జీపీటీ వచ్చాక చదువు మెషిన్ల పని అయిపోయింది. ‘హోంవర్క్ ఎంతున్నా ఏఐ ఉంది కదా!’ అంటున్నారు విద్యార్థులు. ఇది చూసిన టీచర్లు అసహనంతో ‘ఇవాళ చదువు కంటే చీటింగ్ ట్రిక్స్ ఎక్కువ అయిపోతున్నాయి’ అని రుసరుసలాడుతున్నారు. అందుకే, టీచర్లు ఈ చాట్ జీపీటీ ఏఐ మాయాజాలానికి విరుగుడుగా ‘బ్లూ బుక్ ’ను రంగంలోకి దించారు. ఈ పద్ధతిలో విద్యార్థులు హోంవర్క్ ఇంట్లో కాదు, స్కూల్లోనే చేయాలి. ఇందుకోసం ప్రత్యేకమైన సమయం, పుస్తకాలను కేటాయిస్తారు. ఇక ఆ హోంవర్క్ చేయాల్సింది విద్యార్థులు పూర్తిగా వారి సొంత తెలివితేటల మీద ఆధారపడి మాత్రమే! ఇది విద్యార్థులకే కాదు, టీచర్లకు కూడా ఒక సవాలే! ఎందుకంటే వాళ్లు పోరాడుతున్నది, ప్రపంచమే గిరగిర తిరిగిపోతున్న చాట్ జీపీటీ మాయతో! అయినా, ఫలితం మాత్రం ఆశాజనకంగానే ఉంది. 2022 చాట్ జీపీటీ వచ్చిన తర్వాత టెక్సస్ యూనివర్సిటీలో బ్లూ బుక్స్ కొనుగోలు ముప్పై శాతం, కాలిఫోర్నియాలో ఎనభై శాతం పెరిగాయి! దీంతో, ఇప్పుడు చదువు మళ్లీ పాత పద్ధతిలోకి వస్తోంది. పుస్తకాలను మరచిపోయిన తరం ఇప్పుడు చేతిరాతకు తిరిగి పదును పెడుతోంది.(చదవండి: గాల్లో ఎగిరే బైక్..! 'స్కై స్కూటర్'..) -
ఏఐ భయాలు సరైనవేనా..? మూర్తి ఏమన్నారంటే..
కృత్రిమ మేధ (ఏఐ) భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ వృద్ధికి ఊతమిస్తుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఓపెన్ఏఐ జనరేటివ్ ఏఐ టూల్ చాట్జీపీటీని ఉపయోగించడం వల్ల తన ఉత్పాదకత ఐదు రెట్లు పెరిగిందని మూర్తి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగాలను హరించివేస్తుందన్న భయం సరికాదన్నారు. ఇది మరో రకమైన ఉద్యోగాన్ని సృష్టిస్తుందని చెప్పారు.చాట్జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్ను చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే ఏఐ చాలా ఉద్యోగాలకు సవాలుగా మారుతుందనే అభిప్రాయాలున్నాయి. కొన్ని కంపెనీలు ఏఐ సాకుతో లేఆఫ్స్ కూడా ప్రకటిస్తున్నాయనే వాదనలున్నాయి. ఈ తరుణంలో నారాయణమూర్తి తాజాగా ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ ఉత్పాదకతను పెంచుతుందన్నారు. తన ప్రసంగాలకు చాట్జీపీటీను వాడుతున్నట్లు చెప్పారు. అయితే ఏఐను సరైన ప్రశ్న అడగడంలోనే అసలు తెలివితేటలు ఉన్నాయని తెలిపారు.‘భవిష్యత్తులో ఏమి జరుగుతుందంటే..ప్రోగ్రామర్లు, విశ్లేషకులు మెరుగైన, మరింత సంక్లిష్టమైన అవసరాలను తీర్చడంలో స్మార్ట్ అవుతారు. వారు పెద్ద సమస్యలను పరిష్కరిస్తారు. కాబట్టి కృత్రిమ మేధ ఐటీ పరిశ్రమ వృద్ధి రేటును ఎలా పెంచుతుందనే దాని గురించి నేను సానుకూలంగా ఉన్నాను’ అని తెలిపారు. భారత ఐటీ పరిశ్రమలో వృద్ధి, ఉద్యోగ నియామకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో మూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: మేలో స్వల్పంగా తగ్గిన వాహన విక్రయాలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతరాయం మధ్య ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఇటీవల ఐటీ వ్యాపార నమూనాల్లో సమూల మార్పులు చేయాలని పిలుపునిచ్చారు. గత 30 ఏళ్లుగా ఉన్న సంప్రదాయ ఐటీ వ్యాపార నమూనాకు విఘాతం కలుగుతోందని, ఇప్పటికే ఆ మోడల్కు సమయం అయిపోయిందని హెచ్సీఎల్ టెక్ సీఈఓ విజయకుమార్ గతంలో తెలిపారు. కృత్రిమ మేధను సపోర్ట్గా ఉపయోగించి ఉత్పాదకత, నాణ్యతను ఎలా మెరుగుపరుచుకోవాలో గమనిస్తే సాఫ్ట్వేర్ పరిశ్రమ వృద్ధి వేగం పెరుగుతోందని మూర్తి అభిప్రాయపడ్డారు. -
మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' చేస్తే..?
కొన్నిసార్లు ఒకరు చేయాల్సిన సినిమా మరొకరి దగ్గరకు వెళ్తుంది. ఊహించని బ్లాక్బస్టర్ అయితే.. అరె ఈ మూవీ మా హీరో చేసుంటే బాగుండేదేమో అని అభిమానులు బాధపడుతుంటారు. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు టెక్నాలజీ వల్ల లేనిదాన్ని కూడా సృష్టించేస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' సినిమా చేసుంటే ఎలా ఉండేదా అని ఓ వీడియోని వైరల్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: కాంచీవరం చీరలో పూజా.. పేపర్ డ్రస్సులో అషు) 'వన్: నేనొక్కడినే' సినిమా తర్వాత మహేశ్ బాబు.. సుకుమార్తో మరో సినిమా చేయాల్సింది. కానీ ఎందుకో కాంబో సెట్ కాలేదు. అయితే అప్పుడు మహేశ్కి 'పుష్ప' కథే చెప్పారని, కానీ తనకు సెట్ కాదనే ఉద్దేశంతో వదులుకున్నారనే రూమర్స్ వచ్చాయి. తర్వాత సుక్కు.. అల్లు అర్జున్తో 'పుష్ప' చేయడం, ఇది పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఇప్పుడు మరి ఎవరు చేశారో గానీ మహేశ్ బాబు ఒకవేళ 'పుష్ప' చేసుంటే ఎలా ఉండేదో అని చెబుతూ ఓ ఏఐ వీడియోని సృష్టించారు. ఇందులో పలు హిట్ సీన్స్ని రీ క్రియేట్ చేయడం బాగుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. మహేశ్ సినిమాల విషయానికొస్తే చివరగా 'గుంటూరు కారం'తో పలకరించారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఇదివరకే షూటింగ్ మొదలైంది కూడా. ఇందులో మహేశ్ సాహసికుడిగా కనిపించబోతున్నారు. 2027లో ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది. అప్పటివరకు మహేశ్ ఫ్యాన్స్కి వెయిటింగ్ తప్పదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం')What if pushpa did by MB.. ?" Mahesh Babu " pic.twitter.com/HcbRuNAnU8— Sᴜʀʏᴀ.. 🐦🔥 (@Wolverine9121) June 16, 2025 -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. వారిని నియమించుకునేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు భారీ జీతాలు, ఆకట్టుకునే సౌకర్యాలతో వెంటపడేవి. ఇప్పుడా జమానా ముగిసింది. టెక్ పరిశ్రమలో జీతాల పెరుగుదల, పెద్దమొత్తం నియామక ప్రక్రియలు తగ్గుతున్నాయి. 2025లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు అనేక మార్పులను ఎదుర్కొంటున్నాయి. ఇవి ఆటోమేషన్, కొత్త వేతన ధోరణులు, కార్యాలయంలో మారుతున్న దృక్పథాలను ప్రతిబింబిస్తున్నాయి. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మార్పులుసాఫ్ట్వేర్ ఇంజినీర్ల ముఖ్యమైన పని అయిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే కోడ్ రాయడాన్ని కృత్రిమ మేధస్సు (AI) పూర్తిగా మార్చుతోంది. గిట్హబ్ కోపైలట్, కర్సర్చాట్ వంటి టూల్స్ ద్వారా ఎటువంటి అధునాతన కోడింగ్ నైపుణ్యాలు లేకుండానే ప్రోగ్రామింగ్ చేయడం సాధ్యమవుతోంది. అంటే సాధారణ టెక్ట్స్ ప్రాంప్ట్ ఇస్తే చాలు ఎలాంటి కోడ్ అయినా చిటికెలో వచ్చేస్తోంది. దీన్నే "వైబ్ కోడింగ్" అని పిలుస్తున్నారు.పెరుగుతున్న సైలెంట్ లేఆఫ్స్ సిలికాన్ వ్యాలీకి చెందిన టాప్ సంస్థల దగ్గర నుంచి భారతీయ ఐటీ కంపెనీల వరకూ అన్నీ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. కంపెనీలు గతంలో లాగా ఒకేసారి పెద్ద సంఖ్యలో జాబ్లకు కోతలు పెట్టడం లేదు. బదులుగా ‘సైలెంట్ లేఆఫ్స్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే ఉద్యోగులకు అనువైన వాతావరణాన్ని కల్పించి వారితో స్వచ్ఛందంగా రాజీనామా చేయించడం ద్వారా వదిలించుకుంటున్నాయి. ఆ స్థాయిలో జీతాల పెరుగుదల లేదుటెక్ రంగంలో వేతనాలు ఇంకా ఎక్కువగానే ఉన్నప్పటికీ, గతంలో మాదిరిగా తక్కువ కాలంలోనే వేగంగా వేతనాలు పెరిగినట్లు ఇప్పుడు పెరగడం లేదు. ఒక ఉద్యోగాన్ని విడిచి మరొక ఉద్యోగం పొందడం ద్వారా ఎక్కువ జీతం పొందే అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి హై-డిమాండ్ నైపుణ్యాలు ఉన్నవారు ఇంకా గణనీయమైన వేతనాలను పొందుతున్నారు. వ్యూహాత్మక దృక్పథం అవసరం కొత్త ఉద్యోగానికి మారడం అనుకున్నంత మంచిది కాకపోవచ్చు. ఇప్పుడు ఉద్యోగం మారడానికి ముందుగా స్థిరత, ప్రయోజనాలు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2025లో ఆటోమేషన్, వేతన ధోరణులు, ఉద్యోగ మార్పులను అర్థం చేసుకున్న వారు మాత్రమే ఏఐ నైపుణ్యం, డిజిటల్ అనుసంధానం, ప్రత్యేక నైపుణ్యాలను పెంచుకుంటూ విజయవంతం అవ్వగలరు.👉 ఇది చదివారా? ఈ టెక్ దిగ్గజంలో తొలగింపులు -
ఉద్యోగాల కోతకు ఏఐ సాకు!
కృత్రిమమేధకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో గుబులు అధికమవుతోంది. తమ ఉద్యోగాల స్థానంలో ఏఐ పాగా వేస్తుందని చాలామంది జంకుతున్నారు. ఇదే అదనుగా కొన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్, పునర్వ్యవస్థీకరణ పేరుతో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందని చెబుతూ కొన్ని కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు తమ మోడళ్ల అమ్మకాలను పెంచుకోవడానికి ఎక్కువగా ప్రచారం చేస్తున్నట్లు ఏఐ కోడింగ్ ప్లాట్ఫామ్ విండ్సర్ఫ్ వ్యవస్థాపక బృందం సభ్యుడు అన్షుల్ రామచంద్రన్ తెలిపారు.‘ఏఐ ప్రభావం పెరుగుతోందని చెబుతున్నవారిలో చాలా మంది ఎలాగైనా కొందరు ఉద్యోగులను తొలగించాలని కోరుకుంటున్నారు. అందుకు ఏఐను సాకుగా వాడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ కోసం ప్రత్యేకంగా ఏఐ నమూనాలను రూపొందిస్తున్నారు. మరిన్ని మోడళ్లను విక్రయించడానికి ఇది వ్యాపార వ్యూహంగా పని చేస్తుంది. డెవలపర్ అడాప్షన్, ఎంటర్ప్రైజ్ పార్ట్నర్షిప్ పరంగా అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరిస్తోంది. భారత్లో 1.7 కోట్ల మంది డెవలపర్లు ఉన్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: హోర్ముజ్ జలసంధి మూసివేత..?‘వాస్తవంగా కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడానికి భారత్కు సరిపడా శక్తి ఉంది. భారత్లో జీపీయూ క్లస్టర్లను నిర్మించడంపై చురుగ్గా ముందుకెళ్తున్నాం. ఇప్పటికే భారత్లోని ప్రముఖ ఐటీ కంపెనీలతో వివిధ స్థాయిల్లో కలిసి పనిచేస్తున్నాం. ఇండియన్ ఐటీ కంపెనీలు తమ అంతర్జాతీయ సహచరుల కంటే వేగంగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ కంపెనీలు ఇప్పటికే టెక్నాలజీని వివిధ విభాగాల్లో వైవిధ్యపరిచాయి’ అని రామచంద్రన్ తెలిపారు. -
ఆన్లైన్ మోసాలకు ఎయిర్టెల్ చెక్
ఆన్లైన్ మోసాల కట్టడి చేసే దిశగా తమ ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టంను దేశవ్యాప్తంగా మరింతగా అందుబాటులోకి తెస్తున్నట్లు టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలో దీన్ని ప్రవేశపెట్టిన 25 రోజుల వ్యవధిలోనే 1,80,000 పైచిలుకు హానికారక లింకులను బ్లాక్ చేసినట్లు పేర్కొంది.ఈ వ్యవస్థతో 54 లక్షల మందికి ప్రయోజనం చేకూరినట్లు వివరించింది. ఎయిర్టెల్ మొబైల్, బ్రాడ్బ్యాండ్ కస్టమర్లందరికీ ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ చేసినట్లు భారతి ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఈవో అజయ్ అనంతపద్మనాభన్ చెప్పారు. ఎస్ఎంఎస్లు, వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఈ–మెయిల్స్ మొదలైన వాటిల్లో వచ్చే లింకులను ఈ అధునాతన వ్యవస్థ ఫిల్టర్ చేస్తుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్లకు వేగంగా ఆమోదంస్కాములను నివారించేందుకు తమ విభాగం నిరంతరం కృషి చేస్తోందని, ఎయిర్టెల్ కూడా సమర్ధవంతమైన ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్ ప్రవేశపెట్టడం ప్రయోజనకరమైన విషయమని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ, డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. -
అమ్మో ఏఐతో జాబ్ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!
ఆర్టిఫీషియల్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇది లేదనకుండా ఏఐ అన్ని పనులూ చేసేస్తోంది. నోయిడాకు చెందిన అనుభవజ్ఞురాలైన ప్రొడక్ట్ మేనేజర్ రాధికా శర్మకు ఇటీవల ఒక ప్రత్యేకమైన ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవం ఎదురైంది. అక్కడ ఆమెను హ్యూమన్ ప్యానెల్కు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ ఇంటర్వ్యూయర్ అంచనా వేశారు.టెక్ లో దాదాపు దశాబ్ద అనుభవం ఉన్న శర్మ బిజినెస్ ఇన్ సైడర్ తో తన అనుభవాన్ని పంచుకున్నారు. వర్చువల్ స్క్రీనింగ్ సిస్టమ్ ఆమె నైపుణ్యాలను అంచనా వేయడమే కాకుండా ఆమె వస్త్రధారణపైనా ఫీడ్ బ్యాక్ అందించిందని వెల్లడించారు. ఈ అనుభవాన్ని "అద్భుతమైన అదేసమయంలో కలవరపరిచేది"గా ఆమె అభివర్ణించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటర్వ్యూ ప్రక్రియ నుండి లాభనష్టాలు, ఇతర కీలక అంశాలను చర్చించారు.చిన్నదైన కుమార్తె సంరక్షణ కోసం రాధికా శర్మ తన ప్రొడక్ట్ ఓనర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ పొజిషన్ ను వెతుక్కుంటూ మళ్లీ జాబ్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఒక సాస్ కంపెనీ ఆమెను ఏఐ(AI) ఆధారిత స్క్రీనింగ్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభానికి ముందు నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూసుకోవాలని, కంప్యూటర్లోని ట్యాబ్ లను మార్చవద్దని, పర్యవేక్షణ కోసం స్క్రీన్ షేరింగ్ చేయాలని అవతల నుంచి సూచనలు వచ్చాయి.‘ఇంటర్వ్యూ ప్రారంభమైన వెంటనే, సుమారు 20 నిమిషాల టైమర్ ప్రారంభమైంది. అటు పక్క నుంచి మహిళా వాయిస్ తో కూడిన ఖాళీ స్క్రీన్ నన్ను పలకరించింది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గురించి చాలా నిర్దిష్టమైన ప్రశ్నలు అడగడం ప్రారంభించింది" అని రాధికా శర్మ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుందని కంపెనీ ముందుగానే స్పష్టంగా పేర్కొంది. ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే శర్మ ఏఐ టూల్ నుంచి సవివరమైన పనితీరు మదింపును అందుకున్నారు.తాను నిమగ్నమయ్యే విధానం, ఐ కాంటాక్ట్, ముఖ కవళికలు, భంగిమలు, వస్త్రధారణ వంటి అన్ని కొలమానాలతో పాటు ఆమె సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏఐ అంచనా వేసింది. ఆమె సాంకేతిక నైపుణ్యాలు బాగా సాధించినప్పటికీ, ఆమె దుస్తులు ప్రొఫెషనల్గా ధరించలేదని, ఐ కాంటాక్ట్ సక్రమంగా లేదని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశానని, అమ్మో ఏఐ అన్నింటినీ క్షణ్ణంగా గమనిస్తుందని రాధికా శర్మ చెప్పుకొచ్చారు. -
యువతకు సత్య నాదెళ్ల సూచన
కృత్రిమ మేధకు ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు, ఔత్సాహిక సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బేసిక్స్పై పట్టు సాధించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. టెక్ యూట్యూబర్ సజ్జాద్ ఖాడేతో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐ కోడింగ్, ఇతర సంక్లిష్టమైన పనులను ఆటోమేట్ చేస్తున్నప్పటికీ టెక్ డెవలప్మెంట్కు మానవ నైపుణ్యాలు అవసరం అవుతాయని చెప్పారు. బలమైన కంప్యూటేషనల్ థింకింగ్, సిస్టమ్ డిజైన్ నైపుణ్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు.సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. సమస్యలను తార్కికంగా పరిష్కరించాలని, నిర్మాణాత్మక సొల్యూషన్స్ సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా ఎదిగేందుకు ఏఐ మానవుల ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని సత్య పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో వ్యవస్థలను అర్థం చేసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో సిస్టమ్ కాంప్రహెన్షన్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను సత్య సూచించారు.ఇదీ చదవండి: యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు?సుందర్ పిచాయ్ కూడా అదే బాటలో..లెక్స్ ఫ్రిడ్మన్తో గతంలో జరిగిన పాడ్కాస్ట్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ కంప్యూటర్ కోడింగ్ రాసేందుకు 30% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుందని చెప్పారు. మరింత సృజనాత్మక పనుల కోసం మానవ ప్రతిభ తప్పకుండా అవసరం అవుతుందన్నారు. ఏఐ తమ ఇంజినీరింగ్ వేగాన్ని 10% పెంచిందని చెప్పారు. వచ్చే సంవత్సరం మరింత మంది ఏఐ ఇంజినీర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పిచాయ్ తెలిపారు. -
చాట్జీపీటీ డౌన్.. ఆఫీస్లో ఉద్యోగులు రిలాక్స్!
ప్రస్తుతం జనరేటివ్ ఏఐ ట్రెండ్ కొనసాగుతోంది. రిస్పాన్సివ్ చాట్బాట్లపై ఎక్కువగా ఆధారపడేవారు అధికమవుతున్నారు. దాంతో జనరేటివ్ ఏఐ లేకుండా రోజు గడవని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐకి చెందిన పాపులర్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ సేవల్లో మంగళవారం ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. దాంతో వినియోగదారులు ఈ సేవలను యాక్సెస్ చేసుకోలేకపోయారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు పని చేస్తున్నట్లు ఓపెన్ఏఐ అధికారిక స్టేటస్ పేజీలో కంపెనీ వివరాలు వెల్లడించింది. అయితే సేవలు తిరిగి పునరుద్ధరించే వరకు చాట్జీపీటీ సర్వీసులో అంతరాయం యూజర్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై మీమ్స్, జోకులు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆఫీస్లో చాట్జీపీటీ పని చేయకపోవడంతో ఉద్యోగులు రిలాక్స్ అవుతున్నట్లు చేపేలా ఫొటోలు షేర్ చేస్తున్నారు.Me and my co-workers in the office right now because ChatGPT is down pic.twitter.com/50FHYgeU1D— Yash. (@TheSDELad) June 10, 2025Everyone running to twitter to check if chatgpt is down for anyone else #chatgpt #chatgptdown pic.twitter.com/n2oJlbex2n— Jeet (@JeetN25) June 10, 2025ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్లో ఐటీ నోటీసులు!This is how I feel when Chat GPT is down: #ChatGPT pic.twitter.com/Ne1pslXFk7— Anusurya (@Anusuryatomar3) June 10, 2025చాట్జీపీటీ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడడంతో #chatgptdown హ్యాషట్యాగ్ వైరల్ అయింది. డైన్డిటెక్టర్ నివేదికల ప్రకారం యూజర్ల సమస్యల్లో 93 శాతం నేరుగా చాట్జీపీటీకి సంబంధించినవి. తక్కువ శాతం ఓపెన్ఏఐ యాప్, లాగిన్ సమస్యలకు సంబంధించినవి. నిన్న మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమైన ఈ అంతరాయం మధ్యాహ్నం 3 గంటల తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది. తర్వాత సమస్యను పరిష్కరించారు. -
NIRAMAI Health Analytix క్యాన్సర్ అవగాహన పెరిగేలా!
బ్రెస్ట్–క్యాన్సర్కు సంబంధించిన జాగ్రత్తలు, నవీన సాంకేతికత గురించి వివిధ సదస్సుల ద్వారా మహిళలకు అవగాహన కలిగిస్తోంది గీతా మంజునాథ్ (Geetha Manjunath). తన వ్యక్తిగత ప్రయాణం నుంచి మొదలు హెల్త్కేర్ సిస్టమ్లో ఎదురయ్యే సవాళ్లు, ప్రాణాలను కాపాడటంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యత... ఇలా ఎన్నో విషయాలను మంజునాథ్ ప్రేక్షకులతో పంచుకుంటుంది.రొమ్ము క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు వీలు కల్పించే హెల్త్ టెక్ కంపెనీ ‘నిరామై హెల్త్ ఎనలటిక్స్’కు (NIRAMAI Health Analytix) గీతా మంజునాథ్ ఫౌండర్, సీయీవో. ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మెనేజ్మెంట్ నుంచి మేనేజ్మెంట్ డిగ్రీ చేసింది. మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్లలో గీతకు దశాబ్దాల అనుభవం ఉంది.ఇదీ చదవండి: Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్ లుక్లో అఖిల్- జైనబ్భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ను విప్లవాత్మకంగా మార్చాలనే NIRAMAI లక్ష్యానికి ఈ వ్యక్తిగత విషాదం ఉత్ప్రేరకంగా మారింది. మంజునాథ్ ఇద్దరు దగ్గరి కుటుంబ సభ్యులిద్దరికీ చివరి దశలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆరు నెలల్లోపే, సమీప బంధువులు, భారతి ,లక్ష్మి ఇద్దరూ, నాల్గవ దశలో నిర్ధారణ అయి ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆమెను మానసికంగా తీవ్రంగా దెబ్బతింది. కృత్రిమ మేధస్సులో తన నైపుణ్యాన్ని కార్యాచరణగా మార్చుకుంది. బెంగళూరులో జరిగిన ‘షీస్పార్క్స్’ సదస్సులో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం రూపొందించిన ఏఐ ఆధారిత వైద్య పరికరం థర్మాలిటిక్స్ గురించి వివరించింది. ‘‘భారతదేశంలో, దాదాపు 50శాతం మంది మహిళలు రెండు-ఐదు సంవత్సరాలలోపు మరణిస్తున్నారు. అయినారొమ్ము క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. ఇది అన్ని క్యాన్సర్లలో అత్యంత నయం చేయదగినది’ అంటుంది గీతా మంజునాథ్. -
సీఈఓకు సహాయకారిగా ఏఐ
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ భవిష్యత్తు నాయకత్వం పనితీరుపై ఆసక్తికర ప్రకటన చేశారు. బ్లూమ్బర్గ్ టెక్ కాన్ఫరెన్స్లో పిచాయ్ పాల్గొని మాట్లాడారు. సంస్థ సీఈఓ తదుపరి నిర్ణయాలు తీసుకోవడానికి, రోజువారీ కార్యకలాపాల్లో సహాయపడటానికి కృత్రిమమేథ తోడుంటుందని చెప్పారు. ఈ ప్రకటన కృత్రిమ మేధ ఆధారిత ఉత్పాదకత పట్ల గూగుల్ నిబద్ధతను నొక్కిచెబుతుంది. కృత్రిమ మేధ మానవ నాయకత్వాన్ని భర్తీ చేయడానికి బదులుగా దాన్ని మెరుగుపరుస్తుందనే భావనను పిచాయ్ ప్రకటన బలపరుస్తుంది.ఎగ్జిక్యూటివ్ స్థాయి నాయకత్వంలో కృత్రిమ మేధను వాడడం, శ్రామిక శక్తి అంతటా ఏఐను ఏకీకృతం చేసే గూగుల్ విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఈ ప్రకటన ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. పిచాయ్ తెలిపిన వివరాల ప్రకారం కార్యనిర్వాహక నిర్ణయాలను ఆటోమేట్ చేయడానికి బదులుగా ఏఐ వ్యూహాత్మక సలహాదారుగా పనిచేస్తుంది. పెద్ద మొత్తంలో డేటాను సేకరించడానికి, వర్క్ ఫ్లోలను ఆప్టిమైజ్ చేయడానికి, సృజనాత్మక పరిష్కారాలను మరింత సమర్థవంతంగా అన్వేషించడానికి నాయకులకు ఏఐ సహాయపడుతుంది.ఇదీ చదవండి: బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతువైబ్ కోడింగ్పిచాయ్ స్వయంగా రిప్లిట్, కర్సర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోడింగ్ సాధనాలతో ప్రయోగాలు చేస్తున్నారు. వాటిని ‘వైబ్ కోడింగ్’ అని పిలుస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా సాధారణ ప్రాంప్ట్లతో కస్టమ్ వెబ్ పేజీలను సృష్టించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది. 2026 నాటికి గూగుల్ తన ఇంజినీరింగ్ టాలెంట్ పూల్ను విస్తరించడంలో ఏఐ కీలక భాగస్వామిగా పనిచేసే వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. -
భారత్లో ఓపెన్ఏఐ అకాడమీ
న్యూఢిల్లీ: చాట్జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ, కేంద్ర ఐటీ శాఖలో భాగమైన ఇండియాఏఐ మిషన్ కలిసి భారత్లో ఓపెన్ఏఐ అకాడమీని ప్రారంభించాయి. ఇందుకు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దేశీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న డెవలపర్ల కమ్యూనిటీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్టార్టప్లు.. ఆవిష్కర్తల నెట్వర్క్కు ఏఐపరంగా కావాల్సిన విద్యావనరులు, సాధనాలు దీనితో అందుబాటులోకి వస్తాయని ఓపెన్ఏఐ తెలిపింది. విద్య, టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉమ్మడి లక్ష్య సాధన దిశగా ఇది కీలక ముందడుగని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ అకాడమీ లో డిజిటల్, ఇన్–పర్సన్ లెరి్నంగ్ విధానంలో ఇంగ్లీష్, హిందీలో కంటెంట్ అందుబాటులో ఉంటుంది. త్వరలో మరిన్ని ప్రాంతీయ భాషలను కూడా జోడించనున్నారు. విద్యార్థులు, డెవలపర్లు, విద్యావేత్తలు, సివిల్ సర్వెంట్లు, చిన్న స్థాయి వ్యాపారవర్గాలు మొదలైన వారందరికీ ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇండియాఏఐ మిషన్ ఆమోదించిన 50 ఫెలోస్/స్టార్టప్లకు 1,00,000 డాలర్ల వరకు విలువ చేసే ఏపీఐ క్రెడిట్స్ లభిస్తాయి. -
Junicorn Summit 2025: అంతర్జాతీయ వేదికపై పల్లె బాలల ప్రతిభ
సాన్ మార్కస్, టెక్సాస్: టెక్సాస్ స్టేట్ యూనివర్శిటీలో నిర్వహించిన ISF గ్లోబల్ జ్యూనికార్న్ అండ్ AI సమ్మిట్ 2025 చరిత్ర సృష్టించింది. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్కి చెందిన గ్రామీణ ప్రాంతాల నుండి ఎంపికైన 50 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులు ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అభివృద్ధి తదితర రంగాల్లో చిన్నారులు రూపొందించిన ఆవిష్కరణలు దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ స్పెషల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సమ్మిట్కు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ISF) ఆధ్వర్యం వహించగా, వ్యవస్థాపకుడు డా. జె.ఎ. చౌదరి దూరదృష్టితో, ISF USA అధ్యక్షుడు అట్లూరి సమన్వయ నాయకత్వంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. విద్యార్థులకు విమాన ప్రయాణం, నివాసం, వర్క్షాపులు, డెమో డే వంటి సౌకర్యాలు ఉచితంగా అందించారు.ప్రత్యక్షంగా ఆకట్టుకున్న విద్యార్థుల ఆవిష్కరణలుNaturaShe: బయోడిగ్రేడబుల్ సానిటరీ ప్యాడ్స్ – గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం రూపొందించిన ప్రయోగం.Sense Vibe: దివ్యాంగుల కోసం రూపొందించిన నావిగేషన్ పరికరం.Jalapatra: తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి పరికరంNGreenTech: ఈ-వేస్ట్ రీసైక్లింగ్ మోడల్.. వీటికి తోడు మరెన్నో ఆవిష్కరణలకు ఇన్నోవేషన్, సోషల్ ఇంపాక్ట్, బ్రేకిత్రూ థింకర్, ప్రోటోటైప్, స్టోరిటెల్లింగ్ విభాగాల్లో ప్రత్యేక అవార్డులు ప్రదానం చేశారు.రామ్ పుప్పాల ఇన్నోవేషన్ అవార్డుగత నెలలో ఆకస్మికంగా కన్నుమూసిన రామ్ పుప్పాల జ్ఞాపకార్థం ‘రామ్ పుప్పాల ఇన్నోవేషన్ అవార్డు’ను ప్రదానం చేయనున్నట్లు ISF USA అధ్యక్షుడు అట్లూరి ప్రకటించారు.లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు – 2025ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి గౌరవప్రదంగా అవార్డులు అందజేశారు.జయ్ తల్లూరి – ఇన్ఫ్రా & సామాజిక అభివృద్ధి,ప్రసాద్ గుండుమోగుల – డిజిటల్ ట్రావెల్ టెక్నాలజీ,స్వాతి అట్లూరి – కళా, సాంస్కృతిక సేవలు,నిశిత్ దేశాయ్ – న్యాయ రంగ మార్గదర్శకత, లాక్స్ చెపూరి – ఇన్నోవేషన్ అవార్డు – టెక్ టాలెంట్ డెవలప్మెంట్.పద్మా అల్లూరి, ప్రకాశ్ బొద్ధాలు ఈవెంట్ యాంకర్లు వ్యవహరించగా, డా. మహేష్ తంగుటూరు, సత్యేంద్ర, శేషాద్రి వంగల, విశాలా రెడ్డి నిర్వాహణలో ముఖ్యపాత్ర వహించారు. వందలాది వాలంటీర్లు, స్పాన్సర్లు, మద్దతుదారులు కలిసి ఈ అరుదైన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమ్మిట్ అనంతరం విద్యార్థులు NASA స్పేస్ సెంటర్, Texas Science Museum, డల్లాస్, ఆస్టిన్ పరిధిలోని ఇన్నోవేషన్ హబ్లను సందర్శించే అవకాశం పొందారు. ఫాలో-అప్ మెంటారింగ్, పెట్టుబడులు, స్టార్టప్ స్కేలింగ్ అవకాశాలపై పలువురు ఆసక్తి వ్యక్తం చేశారు.విజన్ 2030 – లక్ష్యంISF ప్రకటించిన దీర్ఘకాలిక విజన్ ప్రకారం, 2030 నాటికి లక్ష మంది గ్రామీణ యువ స్టార్టప్ వ్యవస్థాపకులను రూపొందించాలనే ధ్యేయంతో ఈ ఉద్యమం ముందుకు సాగుతోంది. ఇది కేవలం ఒక సమ్మిట్ మాత్రమే కాదు – ఒక సామాజిక ఆవిష్కరణ ఉద్యమం. ISF అధికారికంగా ప్రకటించిన ప్రకారం, జ్యూనికార్న్ సమ్మిట్ 2026 ను న్యూజెర్సీలో నిర్వహించనున్నారు. -
300 మందికి జాబ్కట్ చేసిన మైక్రోసాఫ్ట్
ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ తాజాగా 300 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. మే నెలలో దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపిన కొన్ని రోజుల్లోనే ఇలా మరో 300 మంది ఉద్యోగాలు కట్ చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఈ తొలగింపులు సంస్థ విస్తృత సంస్థాగత పునర్నిర్మాణానికి అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపినట్లు బ్లూమ్బర్గ్ చెప్పింది. ఈ లేఆఫ్స్ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, దీర్ఘకాలిక ప్రాధాన్యతలపై వనరులను కేంద్రీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.పనితీరుతో సంబంధం లేదు..ఇటీవల టౌన్హాల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగుల తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ లేఆఫ్స్ పనితీరుకు సంబంధించినవి కావని, వ్యూహాత్మక మార్పులో భాగంగా ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. దాంతో ఏఐ మౌలిక సదుపాయాలు, దాని అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ ప్రాజెక్ట్ల్లో దాదాపు 30% కోడ్ రాయడానికి సహాయపడుతుందని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ఆటోమేషన్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్పై అధికంగా ఆధారపడడాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: లకారం దగ్గర్లో పసిడి! ఈరోజు ధరలు ఇలా..ఉద్యోగులపై ప్రభావంమైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించిన లేఆఫ్స్లో ఏ కేటగిరీ ఉద్యోగులను తొలగించిందో పేర్కొననప్పటికీ, మునుపటి తొలగింపులో ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లను లక్ష్యంగా చేసుకున్నారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలో ఏఐ అసిస్టెడ్ కోడింగ్ టూల్స్ను మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్ఫామ్స్తో సహా ఇతర సంస్థలు ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతర్గతంగా సంస్థల్లో తక్కువ మంది సిబ్బంది నియామకానికి కారణమవుతుందని సేల్స్ఫోర్స్ గత వారం తెలిపింది. మైక్రోసాఫ్ట్లో జూన్ 2024 నాటికి 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 55% మంది యూఎస్లో పనిచేస్తున్నారు.