breaking news
Allu Arjun
-
నా పెళ్లికి ముందు అన్న ఇచ్చిన సలహా..: అల్లు శిరీష్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. అన్నావదినలైన అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు (మార్చి 6న)న ప్రేయసి నయనిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అప్పటినుంచి వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నాడు.విలువైన సలహాతాజాగా తన పెళ్లికి ముందు అన్నయ్య ఇచ్చిన ఐడియా గురించి చెప్పుకొచ్చాడు. వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ.. కొన్ని విషయాలు స్వయంగా అనుభూతి చెందాలని అన్నయ్య, నాన్న భావిస్తారు. అందుకనే మనం అడగనంతవరకు వాళ్లు ఎటువంటి సలహాలు ఇవ్వరు. అయితే నా అన్న నాకో విలువైన సలహా ఇచ్చాడు. ఇవే జీవితంలో మధుర క్షణాలుకొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు. అన్నీ అనుకున్నట్లుగా జరగవు. ఫంక్షన్లో కరెక్ట్ సమయానికి దుస్తులు రాకపోవచ్చు, లేదంటే కాస్త ఆలస్యం అవొచ్చు.. అంతమాత్రానికి ఒత్తిడికి లోనవద్దు. ఇవి నీ జీవితంలోనే మధురమైన క్షణాలు.. వాటిని ఆస్వాదించు అని చెప్పాడని గుర్తు చేసుకున్నాడు.లవ్స్టోరీతన లవ్స్టోరీ గురించి మాట్లాడుతూ.. నా కజిన్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి 2023 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన ఓ పార్టీలో మేమిద్దరం కలుసుకున్నాం. సరదాగా మాట్లాడుకున్నాం.. ఫ్రెండ్స్ అయిపోయాం. తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అయితే నయనిక సోదరి.. మా వదిన స్నేహ మంచి ఫ్రెండ్స్. సీరియస్ కాదేమోనని అనుమానంనావల్ల వారి స్నేహానికి ఆటంకం రాకూడదని భావించాను. అలాగే తను కూడా నేను యాక్టర్ను, నేను సీరియస్గా ప్రేమించడం లేదేమోనని భయపడింది. అయితే హీరో నితిన్ భార్య షాలిని తనకు మంచి స్నేహితురాలు. నాగురించి రెండు మంచి మాటలు చెప్పేసరికి ధైర్యం తెచ్చుకుంది. అలా గతేడాది అక్టోబర్లో డేటింగ్ మొదలుపెట్టాం అని శిరీష్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
అల్లు అయాన్ కూడా మొదలుపెట్టేశాడు.. వీడియో వైరల్
అల్లు అర్జున్ కొడుకు అయాన్ కూడా మరికొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని, అల్లు స్నేహ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఇదికాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: మహేశ్ అభిమానులకు సారీ చెప్పిన హరీశ్ శంకర్)అల్లు అర్జున్ సంతానంలో కొడుకు అయాన్ పెద్దోడు కాగా కూతురు అర్హ చిన్నది. అర్హ ఇదివరకే 'శాకుంతలం' మూవీలో నటించేసింది. పర్లేదు ఓకే ఓకే అనిపించింది. అయితే అయాన్.. ఏ సినిమాలోనూ కనిపించనప్పటికీ సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయాన్ మోడల్ అనే ట్యాగ్తో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాడు కూడా. మరి తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లోకి ఎప్పుడొస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)Future star in training!Allu Ayan, son of Allu Arjun, has started martial arts training as he begins learning discipline, strength and focus at a young age. 💥#AlluArjun #AlluAyan pic.twitter.com/DYYsJA4siN— Rathnam News (@RathnamNews) March 11, 2026 View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
Allu Cinemas: 75 అడుగుల డాల్బీ స్క్రీన్.. టికెట్ రేట్లపై చర్చ
హైదరాబాద్లోని కోకాపేట్లో మార్చి 12న కొత్తగా ప్రారంభం కానున్న అల్లు సినిమాస్ ఇప్పుడు సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన అల్లు సినిమాస్ ఒక సినిమా హాల్ మాత్రమే కాదు ఇదొక విజువల్ వండర్. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది. ఇక్కడ సినిమా ఎక్స్పీరియన్స్ మరో లెవెల్లో ఉండనుంది.ఈ మల్టీప్లెక్స్లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకమైన డాల్బీ విజన్ స్క్రీన్. ఇది 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతానికి ఇండియాలో కేవలం మూడు డాల్బీ విజన్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి పూణేలో 55 అడుగుల స్క్రీన్, రెండవది బెంగళూరులో 65 అడుగుల స్క్రీన్, ఇప్పుడు హైదరాబాద్లో 75 అడుగుల స్క్రీన్ రూపంలో అల్లు సినిమాస్. ఈ ప్రత్యేకత వల్ల అల్లు సినిమాస్ టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయన్నది సినీప్రియులలో పెద్ద చర్చగా మారింది. పూణేలోని డాల్బీ స్క్రీన్లో టికెట్ రేట్లు సాధారణ రోజుల్లో రూ.500 లోపు, పెద్ద సినిమాల వీకెండ్స్లో రూ. 900 వరకు ఉంటాయి. ఇక బెంగళూరులోని డాల్బీ స్క్రీన్లో టికెట్ రేట్లు క్యాపింగ్ సిస్టమ్కు ముందు గరిష్టంగా రూ.1000 వరకు ఉంటాయి. దాంతో హైదరాబాద్లోని అల్లు సినిమాస్ టికెట్ రేట్లు కూడా సాధారణ రోజుల్లో రూ.500, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు సీటింగ్ బట్టి రూ.1000 వరకు ఉండే అవకాశం. తెలంగాణలో ప్రత్యేక టెక్నాలజీ, పరిమిత సీటింగ్ సామర్థ్యం ఉన్న స్క్రీన్లకు అధిక ధరలు వసూలు చేయడానికి ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. అల్లు సినిమాస్ అల్ట్రా లగ్జరీ మల్టీప్లెక్స్ సెగ్మెంట్లోకి వస్తుంది. దాంతోడాల్బీ విజన్ స్క్రీన్కు భారీగా టికెట్ రేట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్లోని అల్లు సినిమాస్ ప్రీమియం మల్టీప్లెక్స్లకు కొత్త బెంచ్మార్క్గా నిలవబోతున్నాయి. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 చిత్రాలు ప్రదర్శించబడుతాయి. -
గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. తండ్రిని కోల్పోయిన యువతికి సాయం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిన కోల్పోయిన మానసిక దివ్యాంగురాలికి సాయం అందించారు. కడింపల్లి దుర్గ పోషణ కోసం జీవితాంతం నెలకు రూ.7,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాటు చేశారు.ఈ అగ్ని ప్రమాదంలో ఆమె తండ్రి కడింపల్లి ధనరాజు మరణించగా.. ఆమె తల్లి చాలా ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే, పేలుళ్ల ఘటనలో ఆయన మృతి చెందడంతో దుర్గ ఒంటరి అయిపోయింది. ఆమెకు అన్నం పెట్టే వారు కూడా లేకపోవడంతో చాలామంది చలించిపోయారు. అయితే, ఈ విషయాన్ని సోషల్మీడియా ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ స్పందించారు. నిర్మాత బన్నివాసు ద్వారా తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులను వేట్లపాలెం పంపించారు. అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. దుర్గకు కావాల్సిన సాయం చేయాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ తెలిపారు. Hero #AlluArjun once again showed his big heart ❤️After learning about the tragic fire accident at a fireworks factory in Kakinada district that claimed her father’s life, he extended support to mentally challenged girl Kadimpalli Durga.He announced that ₹7,500 will be… pic.twitter.com/34q252I8FN— Milagro Movies (@MilagroMovies) March 10, 2026 -
విశాఖపట్నంపై మహేష్ బాబు గురి
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూనే మల్టీఫ్లెక్స్ థియేటర్ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్లో ఏషియన్ సినిమాస్తో సంయుక్తంగా ఏఎంబీ సినిమాస్ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్ను విస్తరింపచేయాలని ఆయన ఉన్నారు. హైదరాబాద్లో మొదలైన ఏఎంబీ సినిమాస్ రీసెంట్గా బెంగళూరులో తొమ్మిది స్క్రీన్లతో అత్యాధునిక సదుపాయాలతో మల్టీఫ్లెక్స్ ప్రారంభించారు. అయితే, ఇప్పుడు విశాఖలో కూడా తన వ్యాపారాన్ని విస్తరింపచేయాలని మహేష్ చూస్తున్నట్లు సమాచారం.బెంగుళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా మరో మల్టీప్లెక్స్ నిర్మాణానికి మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గోవా, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ఏఎంబీ మల్టీఫ్లెక్స్ను ప్రారంభించాలని మహేష్ బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో కూడా ఒక భారీ మల్టీప్లెక్స్ను నిర్మించాలని ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విశాఖలో ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అతిపెద్ద షాపింగ్మాల్తో పాటు మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. -
మొన్న భార్యకు.. ఇప్పుడు తల్లికి ఖరీదైన కారు గిఫ్ట్
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. మూడు రోజుల క్రితం తన పెళ్లి రోజు సందర్భంగా భార్య స్నేహారెడ్డికి ఖరీదైన బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడు. అయితే తొలుత ఈ కారు వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో తమ్ముడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా భార్య స్నేహకు బన్నీ దీన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు తల్లికి కూడా ఖరీదైన కారుని ఇచ్చాడు.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్!)ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ తన తల్లి నిర్మలకు ఖరీదైన లెక్సెస్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఒకటి రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని ధర రూ.70 లక్షల నుంచి రూ. కోటి మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. భార్యకు ఇచ్చిన బెంజ్ కారు ఖరీదు మాత్రం రూ.కోటిన్నర మేర ఉంటుందని సమాచారం.ఇకపోతే బన్నీ పెళ్లిరోజునే తమ్ముడు శిరీష్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నయనిక రెడ్డి మెడలో మార్చి 06న మూడు ముళ్లు వేశాడు. మెగాహీరో వరుణ్-లావణ్య బ్యాచిలర్ పార్టీ సందర్బంగా కలిసి వీళ్లిద్దరూ.. తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. శిరీష్ పెళ్లి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)Icon star Allu Arjun gifted a Mercedes Benz car to his wife Sneha Reddy on their 15th Wedding Anniversary!#AlluArjun #AlluSnehaReddy #SnehaReddy pic.twitter.com/mHMHBNFK3A— The News Diary (@The_NewsDiary) March 7, 2026 -
ఉగాదికి 'అల్లు సినిమాస్' ప్రారంభం.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
అల్లు ఫ్యామిలీ నిర్మించిన ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని కోకాపేటలో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయింది. సినీ అభిమానులకు అత్యాధునిక సదుపాయాలతో లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, ఐమ్యాక్స్ స్థాయి విజువల్స్ వంటి ప్రపంచ స్థాయి సాంకేతికతతో అల్లు అరవింద్ దీనిని నిర్మించారు. అయితే, ఈ థియేటర్కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్ పాత్ర ఐకానిక్గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.అయితే, ‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవం మాత్రం మార్చి 12న జరగనుందని తెలుస్తోంది. ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నట్లు సమాచారం. సీఎం చేతులమీదుగా అల్లు సినిమాస్ ప్రారంభం కానుందని ఇప్పటికే సోషల్మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో మొదటి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ప్రదర్శించబడుతాయి. ఈ మల్టీఫ్లెక్స్లో మొత్తం నాలుగు స్క్రీన్లు ఉన్నాయి. ప్రతి స్క్రీన్లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి కొత్త సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద (75 అడుగుల) వెడల్పు గల డాల్బీ స్క్రీన్ను ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.పుష్ప-2 విడుదల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత వారిద్దిరూ గద్దర్ అవార్డ్స్ వేదికపై కలుసుకోవడంతో వాటికి బ్రేక్ పడింది. అల్లు శిరీశ్ పెళ్లి సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ మరోసారి కలిసిని విషయం తెలిసిందే.. వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా ఆలింగనం కూడా చేసుకున్నారు. కొంత సమయం పాటు ఒకే సోఫాలో కూర్చొని సరదాగా మాట్లాడుతూ కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అలా అల్లు ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడటంతో అల్లు సినిమాస్ ప్రారంభోత్సవానికి సీఎం తప్పకుండా వెళ్తారని బన్నీ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. -
భార్యకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్
అల్లు అర్జున్.. తన భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. పెళ్లిరోజు సందర్భంగా కారుని గిఫ్ట్గా ప్రెజెంట్ చేశాడు. నిన్ననే ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే బన్నీ.. తన తమ్ముడు శిరీష్కి ఈ కారుని పెళ్లి కానుకగా దీన్ని ఇచ్చాడని చాలామంది అనుకున్నారు. కానీ పెళ్లిరోజు సందర్భంగా భార్యకు దీన్ని ఇచ్చినట్లు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్)ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. 2011లో స్నేహని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అయాన్, అర్హ అని పిల్లలు ఉన్నారు. శుక్రవారం(మార్చి 06) వీళ్ల పెళ్లిరోజు. ఈ క్రమంలోనే భార్యకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. ఇదే రోజున అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ కూడా నయనికతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం విశేషం.అయితే పెళ్లిరోజున అల్లు అర్జున్ తన భార్యకు విషెస్ చెప్పడంతో పాటు బెంజ్ ఏఎమ్జీ మోడల్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్ కారు ధర రూ.4-5 కోట్ల మధ్యనే ఉంది. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒకటి చేస్తున్నాడు. దీని షూటింగ్ సాగుతోంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్తోనూ ఓ మూవీ కమిట్ అయ్యాడు. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ ఏడాది ద్వితియార్థంలో షూటింగ్ మొదలుపెట్టొచ్చు.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonliine_) -
విరోష్ రిసెప్షన్లో అల్లు అర్జున్ బౌన్సర్లు ఎందుకలా చేశారంటే?
కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ ఇటీవలే పెళ్లిపీటలెక్కింది. ఈ లవ్బర్డ్స్ ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. తర్వాత మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టేజీపై ఫోటో దిగేందుకు వెళ్తుండగా ఆయన వెనకాల ఉన్న ఓ వ్యక్తిని అడ్డుకుని ఆపేశారు.ఏం జరిగిందంటే?కొందు ఆయన్ను సైడ్ యాంగిల్లో చూసి జూనియర్ ఎన్టీఆర్ అనే భ్రమపడ్డారు. అల్లు అర్జున్ బౌన్సర్లు ఎన్టీఆర్ను ఆపేశారా? అని ఆశ్చర్యపోయారు. కానీ, అక్కడున్నది తారక్ కాదు, ఆయనకు డూప్గా నటించే ఈశ్వర్. తాజాగా ఈశ్వర్ అక్కడేం జరిగిందో క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్తో పాటు వీడియోలో ఉన్నది నేనే.. ఆ రోజు ఏం జరిగిందంటే? అల్లు అర్జున్ సర్ లోపలకు వచ్చే సమయంలో నేను కూడా లోనికి వెళ్తున్నాను. జూమ్ చేస్తూ పెద్దగా..స్టేజీపై ఫోటో దిగడం కోసం ఆయన సడన్గా ఆగిపోయారు. ఆయన బౌన్సర్లు ఏమనుకున్నారంటే నేను ఆయనతో ఫోటో దిగడానికి వెళ్తున్నానని భ్రమపడ్డారు. లేదంటే కెమెరాకు అడ్డొస్తానని భావించి నన్ను ఆపేశారు. అది చాలా చిన్న విషయం. దాన్ని జూమ్ చేస్తూ చాలా పెద్దగా చూపించారు. అలా వీడియో చాలా వైరల్ చేశారు. దానివల్ల నాకు కూడా మంచి రీచ్ వచ్చింది. థాంక్యూ సోమచ్ అని వీడియో షేర్ చేశాడు. ఇతడు ఆర్ఆర్ఆర్ మూవీలోని కొన్ని సన్నివేశాల్లో తారక్కు డూప్గా నటించాడు. View this post on Instagram A post shared by Eshwar Harris (@eshwarharris_1) చదవండి: అణిగిమణిగి ఉండాలి.. లేదంటే సైడ్ చేస్తారు: అషూ -
హైదరాబాద్లో గ్రాండ్గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)
-
పావలా శ్యామలకు బన్నీ భరోసా..!
-
క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం
టాలీవుడ్ స్టార్ జంట అల్లు అర్జున్- స్నేహ నేడు (మార్చి 6న) 15వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్ధాంగితో దిగిన ఫోటోను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. మనది 15 ఏళ్ల బంధం.. నువ్వు లేకపోయుంటే ఈ జర్నీ ఇలా ఉండేదే కాదు అని అందమైన క్యాప్షన్ జోడించాడు. ఇది చూసిన అభిమానులు బన్నీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.లవ్ ఎట్ ఫస్ట్ సైట్సినిమాల్లో లవర్బాయ్గా మెప్పించిన అల్లు అర్జున్ నిజజీవితంలో కూడా తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. అమెరికాలో చదువు ముగించుకుని వచ్చిన స్నేహను ఒక స్నేహితుడి పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. మనసులు కలిశాయి. కానీ పెద్దలు ఒప్పుకోలేదు.పెళ్లిఒకరిని విడిచి మరొకరం ఉండలేమని తేల్చి చెప్పేశారు. దాంతో వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. అలా 2010 నవంబర్ 26న అల్లు అర్జున్- స్నేహ నిశ్చితార్థం జరిగింది. 2011 మార్చి 6న వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. 2014లో వీరికి కుమారుడు అయాన్ జన్మించగా.. మరో రెండేళ్లకు కూతురు అర్హ పుట్టింది. బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే.. వీలు కుదుర్చుకుని మరీ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తుంటాడు. వారితో కాలక్షేపం చేస్తుంటాడు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
శ్రీవల్లి రిసెప్షన్ కు పుష్ప.. గ్రాండ్ ఎంట్రీ
-
'ప్రతి ఒక్కరికీ అల్లు కుటుంబం తరఫున కృతజ్ఞతలు'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్పై ట్వీట్ చేశారు. తన తమ్ముడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అందమైన జంటకు తమ ఆశీస్సులు కురిపించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు రావడం మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక వెడ్డింగ్ ఈ నెల 6న జరగనుంది. అంతకుముందే టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ఈనెల 2న గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అల్లు స్టూడియోస్లో జరిగిన ఈ ఈవెంట్లో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. We would like to thank everyone who attended the pre-wedding reception and showered their blessings on the lovely couple. To all those sending their wishes from across the world, our hearts are filled with gratitude.Thank you for all the love and warmth. ALLU FAMILY. pic.twitter.com/0AtL6oCYIu— Allu Arjun (@alluarjun) March 4, 2026 -
పావలా శ్యామలకు అల్లు అర్జున్ సాయం
ఒకప్పుడు తెలుగు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. వృద్ధాప్య సమస్యలకు తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం ఆమె తన కూతురితో కలిసి సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో తల దాచుకుంటోంది. అయితే శ్యామల ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, కనీస మందుల కొనుగోలుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి స్టార్ హీరో అల్లు అర్జున్ స్పందించాడు.ఒక అడుగు ముందుకేసి..శ్యామల, ఆమె కూతురి నిత్యావసరాలు, వైద్యఖర్చుల నిమిత్తం నెలకు రూ.10 వేలప్పున ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. క్రమం తప్పకుండా ప్రతి నెల ఈ డబ్బు ఆమెకు అందేలా శాశ్వత ఏర్పాట్లు చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. గతంలో పలువురు సెలబ్రిటీలు పావలా శ్యామలకు సాయం చేశారు. అయితే బన్నీ ఒక అడుగు ముందుకేసి తాత్కాలిక సాయం కాకుండా శాశ్వతంగా ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ పంపేందుకు చర్యలు తీసుకోవడం విశేషం! -
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్లో సినీ, రాజకీయ ప్రముఖులు ( ఫోటోలు)
-
గ్రాండ్గా అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫొటోలు, వీడియోలు
స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు శిరీష్.. ఈ శుక్రవారం(మార్చి 06న) నయనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం(మార్చి 02) సాయంత్రం హైదరాబాద్లోని అల్లు స్టూడియోస్లో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. దీనికి టాలీవుడ్ ప్రముఖులైన నాగార్జున, నాగచైతన్య, బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అట్లీతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్కి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. The Akkineni family at #AlluSirish & #Nayanika’s Pre-Wedding Reception.#AlluArjunpic.twitter.com/HbwSFXAW7B— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026Legendary Brahmanandam Garu with Icon Star #AlluArjun💜At Pre Wedding Reception of #AlluSirish pic.twitter.com/TKvFEMcaZg— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026Gopichand at #AlluSirish Pre Wedding Reception #AlluArjun pic.twitter.com/oQSTeUk4eG— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026Lakshmi Manchu at #AlluSirish Pre Wedding Reception #AlluArjun #AlluSnehaReddy pic.twitter.com/QGtwefE6sN— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026 -
అల్లు అర్జున్ ఇంటికి విజయ్, రష్మిక జోడీ (ఫోటోలు)
-
అల్లు అర్జున్తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా
సాధారణంగా యాంకర్స్, సీరియల్ నటులు.. సినిమాల్లో ఛాన్సులు దక్కించుకునేందుకు చాలానే కష్టపడుతుంటారు. వీళ్లలో కొందరికి అప్పుడప్పుడు ఊహించని అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాంటి వాళ్లలో హరితేజ ఒకరు. 20కి పైగా సీరియల్స్లో నటించిన యాంకర్గానూ పలు ఈవెంట్స్ హోస్టింగ్ చేసింది. బిగ్బాస్ తొలి సీజన్లో పాల్గొని ఫినాలే వరకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరసగా పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రల్లో కనిపించింది. కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్ రావడంతో తను ఎలాంటి సాహసం చేశానో బయటపెట్టింది.(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య)'అల్లు అర్జున్ పక్కన స్లిమ్, ఫెర్ఫెక్ట్గా కనిపించాలని పెద్ద నిర్ణయం తీసుకున్నాను. 'డీజే'(దువ్వాడ జగన్నాథం)లో అవకాశం వచ్చిన తర్వాత స్లిమ్గా కనిపించాలని వరసగా 15 రోజులు ఆహారం తినడం మానేశాను. కేవలం లిక్వ్డ్ డైటే తీసుకున్నాను. దాంతో కొంత సన్నబడి సినిమాలో బాగానే కనిపించాను. షూటింగ్ రేపు ఉందనగా ముందురోజు ఉత్సాహంతో నిద్ర కూడా పట్టలేదు. ఇక సెట్లో జరిగిన సంఘటన అయితే జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. సెట్కి వెళ్లగానే అల్లు అర్జున్,నా దగ్గరకు వచ్చి 'బిగ్బాస్'లో నీ ఫెర్ఫార్మెన్స్ చూశాను. నీ వర్క్ చాలా నచ్చింది' అని అన్నారు. ఆ మాట వినగానే ఎగిరి గంతేశాను' అని హరితేజ.. బన్నీతో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చింది.బిగ్బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత అఆ, రాజా ది గ్రేట్ తదితర సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు హరితేజ చేసింది. తర్వాత పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల క్రితమే కూతురు పుట్టడంతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. బిగ్బాస్ 8వ సీజన్లో వైల్డ్ కార్ట్ ఎంట్రీగా మళ్లీ వచ్చింది గానీ పెద్దగా మెప్పించకలేకపోయింది. ఏదేమైనా బన్నీ గురించి చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: చాన్నాళ్లకు టాలీవుడ్ ఫిబ్రవరి సెంటిమెంట్ బ్రేక్)#HariTeja: I actually did a 15-day liquid diet just to look slim for #AlluArjun Garu on the ‘DJ’ I was so excited that I couldn't even sleep the day before the shoot he walked up & told me he loved my work in Bigg Boss I was over the moon!"#AA22 #AALoki #AA25 pic.twitter.com/bX2UGTH03g— 𝒱𝒜 𝒸𝓊𝓁𝓉 ᵏʰᵃᵈʰᵃʳ ˢᵗʸˡⁱˢʰ (@khadharkhan1982) February 27, 2026 -
శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్-స్నేహ (ఫొటోలు)
-
పెళ్లిలో అల్లు అర్జున్ సతీమణి సందడి.. వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బంధువుల పెళ్లికి ఆమె హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా స్నేహారెడ్డితో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. కాగా.. బన్నీని స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో పెళ్లికి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి pic.twitter.com/fKmHCFaLYs— Telangana365 (@Telangana365) February 25, 2026 -
కొచ్చిలో 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్.. ట్రెండింగ్ ఫోటోలు చూశారా?
-
ఈ అవార్డ్ వారికే అంకితమిస్తున్నా: అల్లు అర్జున్
పుష్ప-2 మూవీకి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ రావడంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఇంత అద్భుతమైన గౌరవం ఇచ్చినందుకు ఫిల్మ్ఫేర్కు ధన్యవాదాలు తెలిపారు. నన్ను ఇంతలా ప్రేమించే దేశంలో అవార్డ్ స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు తానెప్పుడు విధేయుడినని ట్వీట్ చేశారు. ఈ అవార్డ్ను హద్దుల్లేని నా అభిమానుల ప్రేమకు అంకితం చేస్తున్నట్లు బన్నీ ప్రకటించారు.కాగా..కేరళలోని కొచ్చిన్లో జరిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్లో ఐకాన్స్టార్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. 2024లో విడుదలైన పుష్ప-2 చిత్రానికి ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, బెస్ట్ మ్యూజిల్ ఆల్బమ్కు దేవీశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో రామకృష్ణ అండ్ మోనిక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా 2024లో ఉత్తమ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో అత్యధికంగా ఐదు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు కొల్లగొట్టింది. Thank you, Filmfare, for this wonderful honour. It’s my absolute pleasure to receive it in a land where I am loved in such a unique way. I’m humbled by everyone’s blessings, and I dedicate this award to all my fans for their infinite love. 🖤 pic.twitter.com/EYPdC9BJl9— Allu Arjun (@alluarjun) February 22, 2026 -
చిరంజీవితో సమానంగా అల్లు అర్జున్.. రికార్డ్ క్రియేట్
కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుకలో పుష్ప-2 చిత్రం సత్తా చాటింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ పరిశ్రమ నుందచి 2024 ఏడాదిలో విడుదలైన సినిమాలకు సంబంధించిన నటీనటులకు తాజాగా అవార్డులు అందజేశారు. అందులో భాగంగా అల్లు అర్జున్ సౌత్ ఉత్తమ నటుడిగా పుష్ప-2 చిత్రానికి గాను పురష్కారాన్ని అందుకున్నారు. ఆపై పుష్ప-2 ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డ్స్ కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.టాలీవుడ్ నుంచి అత్యధికంగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్న నటుడిగా మెగాస్టార్ చిరంజీవి(7) ఉన్నారు. అయితే, తాజాగా చిరంజీవితో పాటు సమానంగా ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న హీరోగా బన్నీ నిలిచారు. కానీ, ఫిల్మ్ఫేర్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, స్పెషల్ లెజెండ్ అవార్డులను చిరు కలిగి ఉండటం విశేషం.అల్లు అర్జున్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 1. పరుగు (2008)2. వేదం (2010)3. రేసుగుర్రం (2014)4. పుష్ప: ది రైజ్ (2021)5. పుష్ప 2: ది రూల్ (2024)6. రుద్రమదేవి (గోన గన్నారెడ్డి పాత్రకు - 2015)7. సరైనోడు (2016) ఉత్తమ నటుడు - క్రిటిక్స్ ఛాయిస్చిరంజీవి అందుకున్న ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ :1. శుభలేఖ (1982)2. విజేత (1985)3. ఆపద్బాంధవుడు (1992)4. ముఠా మేస్త్రి (1993)5. స్నేహం కోసం (1999)6. ఇంద్ర (2002)7. శంకర్ దాదా MBBS (2004) -
ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్..తెలుగులో అత్యధికంగా ఈ సినిమాకే..!
సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక కేరళలో అట్టహాసంగా ప్రారంభమైంది. 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం కొచ్చిలో జరిగింది. ఈ వేడుకల్లో 2024 ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప-2) అవార్డ్ అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ విభాగంలో తేజ సజ్జా(హనుమాన్) అవార్డ్ స్వీకరించారు. అదే ఏడాదికిగానూ ఉత్తమనటిగా నివేదా థామస్(35-చిన్న కథ కాదు) అవార్డ్ అందుకుంది. 2024లో ఉత్తమ చిత్రంగా పుష్ప-2 నిలవగా.. సుకుమార్కు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. ఈ వేడుకను కేరళ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ విత్ కేరళ టూరిజం పేరుతో కొచ్చిలోని అడ్లక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరిగింది. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన సినీ తారలకు అవార్డులు అందించారు. Winners selfie 🤩Allu Arjun and Teja Sajja capture a special moment together after their big win at the #70thFilmfareAwardsSouthwithKeralaTourism.❤️Destination Partner: @KeralaTourism Special Partner: @KamarFilmfactry Co-Powered By: @TTKPRESTIGELTD sensodentk.india… pic.twitter.com/LVPMYwYbFF— Filmfare (@filmfare) February 21, 202670వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ విజేతల పూర్తి జాబితా(తెలుగు)ఉత్తమ చిత్రం: పుష్ప 2: ది రూల్ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2: ది రూల్)ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్ (వెంకీ అట్లూరి)బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్): తేజా సజ్జా (హను-మాన్)ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)ఉత్తమ సహాయనటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)ఉత్తమ సహాయనటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప 2)ఉత్తమ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)ఉత్తమ నేపథ్య గాయకుడు: శ్రీ కృష్ణ (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం)ఉత్తమ నేపథ్య గాయని: శిల్పా రావు (చుట్టమల్లె - దేవర: పార్ట్ 1)బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: యదు వంశీ (కమిటీ కుర్రోల్లు)బెస్ట్ డెబ్యూ యాక్టర్: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోల్లు)బెస్ట్ డెబ్యూ నటి: నయన్ సారిక (గం గం గణేశ)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ), రామకృష్ణ అండ్ మోనిక (పుష్ప 2)ఉత్తమ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ (కుర్చి మడతపెట్టి - గుంటూరు కారం) -
గ్రాండ్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఫుల్ జోష్లో హీరోయిన్స్ (ఫోటోలు)
-
అల్లు అర్జున్ పార్టీ.. ఉపాసన, రామ్ చరణ్తో పాటు సెలబ్రిటీలు
అల్లు కుటుంబంలో పెళ్లి వేడుక మొదలైంది. మార్చి 6న నయనికతో అల్లు శిరీష్ వివాహం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే దుబాయ్లో తమ సన్నిహితులతో ఓ పార్టీ కూడా చేసుకుని వచ్చారు. తాజాగా అల్లు అర్జున్ తమకు బాగా కావాల్సిన వారితో పాటు కుటుంబ సభ్యులకు శుక్రవారం రాత్రి స్పెషల్గా పార్టీ ఇచ్చారు. తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి సందర్భంగా అన్న అల్లు అర్జున్ ఇలా గ్రాండ్గా పార్టీ ఇస్తుంటే ఫ్యాన్స్ కూడా వారి బంధం గురించి పోస్టులు పెడుతున్నారు.అయితే, తాజాగా జరిగిన పార్టీలో పాల్గొన్న వారి లిస్ట్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. గ్రాండ్గా జరిగిన పార్టీలో రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత కొణిదెల, నిహారిక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఆపై తేజా సజ్జా, వైష్ణవ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ, సుశాంత్, కృతి శెట్టి, నేహా శెట్టి, రాశీ ఖన్నా, నభా నటేష్ పాల్గొన్నారని సమాచారం.అల్లు శిరీష్ - నయనికల పెళ్లి పిలుపుల్ని ఇప్పటికే వారు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తమ ఇంటి ఆడబిడ్డ సురేఖకు తొలి శుభలేఖను ఇచ్చారు. ఆ సమయంలో తన మావయ్య చిరంజీవికి అందించిన శిరీష్ ఆశీర్వాదం తీసుకున్నారు. అల్లు అరవింద్ సతీసమేతంగా చిరు దంపతులకు నూతన వస్త్రాలు అందించి పెళ్లికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సరైన వివరాలతో మూడోసారి ‘సంధ్య’ చార్జిషీట్
హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు శుక్రవారం మూడోసారి చార్జిషిట్ను నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో చార్జిషీట్ దాఖలు చేయలేదంటూ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ ఇప్పిటికే రెండుసార్లు చార్జిషిట్ను తిప్పిపంపడంతో తాజాగా ఆయా వివరాలను పొందుపరుస్తూ తిరిగి సమర్పించారు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్తోపాటు థియేటర్ యాజమాన్యం సహా మొత్తం 23 మందిపై సెక్షన్ 105, 118 (1), రెడ్విత్ 3(5) బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే చార్జిషీట్లో లోపాలు ఉన్నాయని కోర్టు తిప్పిపంపగా రెండోసారి అదనపు వివరాలతో చార్జిషిట్ దాఖలు చేశారు. అందులోనూ సరైన సాక్ష్యాలను జత చేర్చలేదంటూ కోర్టు తిప్పిపంపడంతో ఈసారి ఎవిడెన్స్ మెటీరియల్ (హార్డ్ డిస్్కలు, సీడీలు, పెన్ డ్రైవ్లు)ను సేకరించి పూర్తిస్థాయిలో సాక్ష్యాలను జతచేస్తూ చార్జిషిట్ దాఖలు చేశారు. -
ఇన్ స్టాలో రికార్డు సృష్టిస్తోన్న #AA23 మూవీ థీమ్ సాంగ్
-
అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమా ప్రారంభం ఎప్పుడంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే విడుదలైన స్పెషల్ వీడియో పాన్ ఇండియా రేంజ్లో వైరల్ అయింది. మిలియనల్ల కొద్ది వ్యూస్ రాబట్టింది. అయితే, ఈ మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రారంభించనున్నట్టు నిర్మాణ సంస్థ స్పష్టతనిచ్చింది.అల్లు అర్జున్ - అట్లీ (AA22) ప్రాజెక్ట్ కోసం ముంబైలో చాలా రోజులుగా మకాం వేశారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఉండబోతోంది. షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే లోకేశ్ కనగరాజ్ మూవీ సెట్స్లోకి బన్నీ ఎంట్రీ ఇస్తాడు. ఇదే ఏడాదిలోనే షూటింగ్ మొదలు పెడుతామని చిత్ర యూనిట్ తెలిపింది. వీరిద్దరి కలయికపై అభిమానులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇది తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారనుంది. అత్యంత భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. -
వారణాసి, పెద్ది, ప్యారడైస్.. ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుంది?
టాలీవుడ్లో షూటింగ్స్ సందడి మళ్లీ పెరిగింది. సంక్రాంతి సెలవులు, ఇతర విరామాల తర్వాత స్టార్ హీరోలందరూ మేకప్ వేసుకుని లొకేషన్లలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఏ హీరో ఎక్కడ, ఏ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారో ఓ లుక్కేద్దాం.📽️ ప్రభాస్ - ఫౌజీ: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ వార్ డ్రామా ఫౌజీ. ఈ సినిమా కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని దండు మైలారంలో జరుగుతోంది. ఇక్కడ భారీ సెట్లు వేసి యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.📽️ రామ్ చరణ్ - పెద్ది: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం పెద్ది. ఈ సినిమా షూటింగ్ సోమవారం వరకు హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఈ షెడ్యూల్ నిన్నటి పూర్తయిపోయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.📽️ మహేష్ బాబు - వారణాసి: రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం గండిపేట పరిసరాల్లో జరుగుతోంది.📽️ ఎన్టీఆర్ - డ్రాగన్: తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ డ్రాగన్.. ప్రస్తుతం జోర్డాన్ ఎడారిలో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుంటోంది.📽️ అల్లు అర్జున్ - AA22: అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం ముంబైలో మకాం వేశారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఉండబోతోంది.📽️ రవితేజ - ఇరుముడి: శివ నిర్వాణ డైరెక్షన్లో మాస్ రాజా నటిస్తున్న ఇరుముడి షూటింగ్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని సీలేరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది.📽️ విజయ్ దేవరకొండ - రణబాలి: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్హీరోగా నటిస్తున్న రణబాలి మూవీ షూటింగ్ గండిపేట ఏరియాలో జరుగుతోంది.📽️ నాని - ప్యారడైజ్: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ప్యారడైజ్ షూటింగ్ ముచ్చింతల్ (హెలో నేటివ్ స్టూడియోస్)లో వేసిన ప్రత్యేక సెట్స్లో జరుగుతోంది.📽️ వెంకటేష్ - ఆదర్శకుటుంబం: త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా సాగుతోంది.📽️ గోపీచంద్ - సంకల్ప రెడ్డి: వీరి యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ అజీజ్ నగర్ సమీపంలో జరుగుతోంది.📽️ కిరణ్ అబ్బవరం - చెన్నై లవ్ స్టోరీ: ఈ యంగ్ హీరో ప్రస్తుతం పాండిచ్చేరిలో తన సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. -
పుష్ప రాజ్ తో తలపడనున్న భల్లాలదేవ
-
అల్లు అర్జున్పై వ్యాఖ్యలు నా కల్పితమే.. క్షమాపణలు కోరిన కావేరి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కావేరీ బారువా అనే బ్రాండ్ స్ట్రాటజర్ ఓ పాడ్కాస్ట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఆమె తాజాగా క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్ (Allu Arjun)తో యాడ్ షూటింగ్ అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయని కావేరీ బారువా పేర్కొంది. ఆయన్ను కలిసిన తర్వాత ఏం చేయాలి..? ఏం చేయకూడదన్న 42 నిబంధనలు ఉంటాయని చెప్పడంతో బన్నీ మేనేజర్లు ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు.కొన్ని రోజుల తర్వాత కావేరి క్షమాపణలు చెబుతూ తాజాగా ఆమె ఒక నోట్ విడుదల చేసింది. అల్లు అర్జున్పై చేసిన వ్యాఖ్యలు తన సొంత వాదనగా ఆమె చెప్పింది. 42 నిబంధనలు అనే మాట తన కల్పితమేనంటూ ఆమె పేర్కొంది. 42 నిబంధనలకు సంబంధించిన లిస్ట్ ఎవరు విడుదల చేశారో తనకు తెలీదని ఆమె చెప్పింది. తాను ఎలాంటి పత్రాన్ని జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. బన్నీ గురించి తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె పేర్కొంది. తన వ్యాఖ్యలను వాస్తవమని ఎవరూ తీసుకోకూడదని విన్నవించుకుంది. బన్నీ గురించి అలాంటి ప్రకటనలు చేసినందుకు చింతిస్తున్నానని తెలిపింది. ఈ వ్యాఖ్యల వల్ల ఆయన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాని కావేరి తెలిపింది. అల్లు అర్జున్పై ఎంతో గౌరవం ఉందని చెప్పింది. ఫైనల్గా బన్నీ గురించి వైరల్ అయిన 42 నిబంధనలు అనేవి తాన కల్పితమేనని కావేరి బారువా చెప్పడం విశేషం. అదంతా కేవలం ఆమె పాపులర్ అయ్యేందుకే ఇదంతా చేసినట్లు తెలుస్తోంది.ఈ ఇంటర్వ్యూ పాడ్కాస్టర్ స్వీకృతి కూడా తన ఇన్స్టాగ్రామ్లో వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్ గురించి కావేరి మాట్లాడిన పూర్తి పాడ్కాస్ట్ ఎపిసోడ్తో పాటు ఇన్స్టా రీల్ను తొలగించినట్లు వెల్లడించింది. దీంతో తమ హోస్ట్పై వేధింపులు ఆపేయాలని ఆమె కోరింది. View this post on Instagram A post shared by Sweekriti Talks Podcast (@sweekriti.talkspod) -
ప్రభాస్, బన్నీతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుపట్టారా? ఇప్పుడేం చేస్తోంది?
తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నోళ్లు మెల్లమెల్లగా సైడ్ అవుతూనే ఉంటారు. కాకపోతే కొందరు మాత్రం స్టార్స్ అవుతారనుకుంటే పట్టుమని పది మూవీస్ కూడా చేయకుండా తెరమరుగైపోతుంటారు. అలాంటి బ్యూటీనే ఈమె. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్తో చేసినప్పటికీ మాయమైపోయింది. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దీక్షా సేథ్. ఢిల్లీలో పుట్టిన ఈమె.. తండ్రి ఉద్యోగరీత్యా ముంబై, చెన్నై, కోల్కతా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో పెరిగింది. మంచి పొడగరి కావడంతో 2009లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. మోడలింగ్ అనుభవం లేనప్పటికీ టాప్-10లో ఒకరిగా నిలిచింది. ఓ మోడలింగ్ పనిమీద హైదరాబాద్ వచ్చినప్పుడు ఈమెని చూసిన దర్శకుడు క్రిష్.. 'వేదం'లో అవకాశమిచ్చాడు. ఇందులో పూజగా అల్లు అర్జున్ సరసన నటించింది. అలా టాలీవుడ్ దృష్టిలో పడింది.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)తర్వాత రవితేజ 'మిరపకాయ్', నిప్పు, గోపిచంద్ 'వాంటెడ్', మంచు మనోజ్ 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా', ప్రభాస్ 'రెబల్' సినిమాలు చేసింది. వీటిలో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ ఉండేసరికి తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. అనంతరం హిందీలో రెండు, కన్నడలో ఓ మూవీ చేసింది. అయినా సరే పెద్దగా ఉపయోగం లేకపోయేసరికి పూర్తిగా నటనకు దూరమైపోయింది.రీసెంట్ టైంలో ఈమె ఫొటోలు కొన్ని వైరల్ కావడంతో అసలు ఇప్పుడేం చేస్తుందా అని వెతకగా.. స్పెయిన్లో ఎంబీఏ పూర్తి చేసిన దీక్షా, అక్కడే ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటోందట. అలానే ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అయిపోవడంతో జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. అయితే హీరోయిన్గా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే క్యూట్, గ్లామర్గా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) View this post on Instagram A post shared by Deeksha Seth (@deeksha721) -
అల్లు అర్జున్- అట్లీ కాంబో.. మరో హీరోయిన్గా క్రేజీ బ్యూటీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఇదే. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం బిగ్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడా షూటింగ్కు సంబంధించిన సింగిల్ వీడియో కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇది చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణెను ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. లేటేస్ట్గా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బిగ్ ప్రాజెక్ట్లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ను మరో హీరోయిన్గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయాన్ని త్వరలోనే రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ- అట్లీ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. -
బన్నీని చూసి బాలీవుడ్ రగిలిపోతోందా?
‘పుష్ప 2’ ఘన విజయం తర్వాత, దక్షిణాది నటుల్లో ఎవరికీ రానంత దేశవ్యాప్త క్రేజ్ అల్లు అర్జున్కి రావడం, జవాన్ సినిమా తీసిన అట్లీ తన రెండో సినిమాకి ఎంచుకోవడం...అలాగే బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణే వంటి స్టార్స్తో బన్నీ కలిసి నటించనుండడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ బాలీవుడ్లో కొందరికి ముప్పుగా కనిపిస్తున్నారా? అనే ప్రశ్నకు కొందరు సినీ పెద్దలు అవుననే సమాధానమే చెబుతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్లో సినీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. హైదరాబాద్లో సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత అల్లు అర్జున్ ఎదుర్కున్న పరిణామాలు తను కొందరు ప్రముఖులకు టార్గెట్గా మారాడనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించాయి. తాజా పరిణామాల నేపధ్యంలో బన్నీ ని ఈ సారి వేరే రకంగా టార్గెట్ చేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వివాదమా? బాలీవుడ్ వ్యూహమా?ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పాడ్కాస్ట్లో పాల్గొన్న ఓ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అల్లు అర్జున్ ను కలవాలంటే ఏకంగా 42 కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందులో కళ్లలోకి చూడకూడదు, చేతులు కలపకూడదు వంటి ఆంక్షలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఫలితంగా అల్లు అర్జున్ పేరు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లలో ట్రెండింగ్గా మారింది. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, నిజంగానే ఇలాంటి నిబంధనలు ఉన్నాయా? అని కొందరిలో సందేహాలు వ్యక్తమవడం సహజమే.అయితే అదే సమయంలో కొందరు ఇది అల్లు అర్జున్ పెరుగుతున్న పాన్ ఇండియా క్రేజ్ను తగ్గించేందుకు చేసిన ప్రయత్నమని అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే ఇలాంటి వివాదాలను కావాలనే పెద్దవిగా చేసి ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే ఇలా టాలీవుడ్ స్టార్స్పై వ్యతిరేక ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల భారీ విజయం తర్వాత ప్రభాస్ కూడా ఇలాంటి విమర్శలు, నెగెటివ్ ప్రచారం చేశారని కొందరు గుర్తు చేస్తున్నారు. బాలీవుడ్లో చెప్పుకోదగ్గ ఆదరణ పొందిన దక్షిణాది నటులు ఇలాంటి కుట్రలను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్ టీమ్ స్పందన..తమపై పడిన వివాదంపై అల్లు అర్జున్ టీమ్ వెంటనే స్పందించి వైరల్ అవుతున్న ఆరోపణలు అసత్యమని, ఆధారంలేనివని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ ఎప్పుడూ గౌరవంగా, వినయంగా వ్యవహరిస్తారని, ఇలాంటి ప్రచారం ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నదని కూడా తేల్చి చెప్పడం గమనార్హం. ఈ ఉదంతంపై తగినంత కూపీ లాగి కుట్రలపై ఆధారం దొరికిన తర్వాతే అల్లు టీమ్ ఇలా చెప్పి ఉంటుందనేది నిస్సందేహం. అంతేకాదు అల్లు అర్జున్ పై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. తద్వారా ఇకపై కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉందని అల్లు అండ్ కో భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో భారీ ప్రాజెక్టులతో బిజీగా అల్లు అర్జున్ ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు అట్లీతో కలిసి ఓ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్తో కలిసి రెండు భాగాలుగా రూపొందనున్న ఓ భారీ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది. , అల్లు అర్జున్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ కుట్రలలో ఆరితేరిన చరిత్ర ఉన్న కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థల విషయంలో అల్లు అర్జున్ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. -
బన్నీ గురించి చెబుతూ ఏడ్చేసిన యాంకర్ స్రవంతి
-
అల్లు అర్జున్పై సంచలన ఆరోపణలు! పరువు నష్టం దావా..
-
Filmfare Awards 2026: ఫిల్మ్ఫేర్- 2026.. నామినేషన్స్లో ఉన్న సినిమాలివే..
దక్షిణాది చిత్రసీమలకు సంబంధించిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ -2026 ప్రకటన వచ్చేసింది. అవార్డ్ రేసులో ఉన్న నటీనటుల లిస్ట్తో పాటు చిత్రాలను కూడా ప్రకటించారు. కేరళ టూరిజం భాగస్వామ్యంతో ఫిబ్రవరి 21న ఈ వేడుకు జరగనుంది. దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమలకు చెందిన నటీనటులకు అవార్డ్స్తో గౌరవిస్తారు. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ -2026 (filmfare awards south 2026)లో పోటీ పడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది. సౌత్ చిత్ర పరిశ్రమల నుంచి అన్ని భాషలకు సంబంధించిన ఏయే చిత్రాలు పోటీపడుతున్నాయో నామినేషన్స్ను ప్రకటించారు. ఈసారి కేరళలో ఈ వేడుక జరగనుంది. 2024లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డ్స్ ఇస్తున్నారు.ఫిల్మ్ అవార్డ్స్-2026.. పోటీపడుతున్న నటీనటులు, సినిమాల లిస్ట్ ఇదే...ఉత్తమ చిత్రంహను-మాన్పుష్ప-2కల్కి 2898ADలక్కీ భాస్కర్35 చిన్న కథ కాదుకమిటీ కుర్రోళ్లుఉత్తమ దర్శకుడునాగ్ అశ్విన్ (కల్కి 2898AD)సుకుమార్ (పుష్ప-2)ప్రశాంత్ వర్మ (హను-మాన్)వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)యధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)ఉత్తమ నటుడుఅల్లు అర్జున్ (పుష్ప-2)దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)జూ. ఎన్టీఆర్ (దేవర)నాని (సరిపోదా శనివారం)సిద్దు జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్)తేజ సజ్జా (హనుమాన్)ఉత్తమ నటిఅనుపమ పరమేశ్వరణ్ (టిల్లు స్క్వేర్)అషికా రంగనాథ్ (నా సామిరంగా)మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)నివేథా తామస్ (35 చిన్న కథ కాదు)ప్రియాంక మోహన్ ( సరిపోదా శనివారం)రష్మిక మందన్న (పుష్ప-2)ఉత్తమ సహాయ నటుడుఅమితాబ్ బచ్చన్ (కల్కి 2898AD)ఫహద్ ఫాజిల్ (పుష్ప-2)సత్య ( మత్తు వదలరా-2)ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)వినయ్ రాయ్ (హనుమాన్)ధనజయ (జీబ్రా)ఉత్తమ సహాయ నటిఅంజలి (గ్యాంగ్ ఆఫ్ గోదావరి)ఫరియా అబ్దుల్లా ( మత్తు వదలరా-2)రాశి సింగ్ నందు ( ప్రసన్న వదనం)శరణ్య ప్రదీప్ ( అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)శ్రద్ధా శ్రీనాథ్ ( మేకానిక్ రాఖీ)వరలక్ష్మీ శరత్కుమార్ (హనుమాన్)ఉత్తమ సంగీత దర్శకుడుఅనిరుధ్ రవిచందర్ (దేవర)దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప-2)తమన్ (గుంటూరు కారం)జీవీ ప్రకాష్ కుమార్ ( లక్కీ భాస్కర్)చైతన్ భరద్వాజ్ (హరోం హర)జేక్స్ బెజోయ్ ( సరిపోదా శనివారం)గౌర హరి , అనుదీప్ దేవ్ , కృష్ణ సౌరభ్ (హనుమాన్)ఉత్తమ సాహిత్యంరామజోగయ్య శాస్త్రి ( చుట్టమల్లే- దేవర)రామజోగయ్య శాస్త్రి ( ధమ్ మసాల- గుంటూరు కారం)రామజోగయ్య శాస్త్రి ( కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)కృష్ణ కాంత్ (ఆ రోజులు మళ్లీ రావు- కమిటీ కుర్రోళ్లు)శ్రీమణి (శ్రీమతి గారు- లక్కీ భాస్కర్)ఉత్తమ సింగర్అనిరుధ్ రవిచందర్ (ఫీయర్ సాంగ్- దేవర)అనురాగ్ కులకర్ణి (సుట్టంలా సూసి - గ్యాంగ్ ఆఫ్ గోదావరి)అర్జిత్ సింగ్ (అణువణువు- ఓం భీమ్ బుష్)గౌర హరి (పూలమ్మే పిల్ల- హనుమాన్)రామ్ మిరియాల (సుఫియాన- ఆయ్)సంజీత్ హెగ్డే (ధమ్ మసాల- గుంటూరు కారం)శ్రీ కృష్ణ ( కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)ఉత్తమ సింగర్- ఫీమేల్శిల్పి రావ్ (చుట్టమల్లే- దేవర)మంగ్లీ (గుల్లెడు గుల్లెడు గులాబీలు- మెకానిక్ రాఖీ)శ్రెయా ఘోషల్ (సూసేకి- పుష్ప-2)ఉషా ఊతప్ (లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్) -
బన్నీ ఫ్యాన్స్ సడన్ మీటింగ్ దేని గురించి అంటే...!
-
అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ఓపెనింగ్ ఫిక్స్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
-
పావలా విలువ లేని ట్రోల్స్.. 'అల్లు అర్జున్'పై విమర్శల దాడి
అల్లు అర్జున్.. తన కెరీర్ ప్రారంభం నుంచే వందల ట్రోల్స్ను దాటుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. గంగోత్రి సినిమా నాటికి తన వయసు 20 ఏళ్లు. హీరో లక్షణాలే లేవని నానా రకాలుగా విమర్శించారు. ట్రోలింగ్ అంటే ఏంటో కూడా తెలియని టైమ్లోనే తట్టుకుని నిలబడ్డాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా సరే తనలోంచి తన్నుకొచ్చే ఆత్మవిశ్వాసాన్ని కళ్లల్లోనూ, నవ్వులోనూ, ముఖంలోనూ చూపుతూ తనను తాను మేకోవర్ చేసుకున్నాడు. అలా తెలుగు చిత్రసీమ సగర్వంగా భావించే నటుడిగా అల్లు అర్జున్ ఎదిగాడు. తొలి తెలుగు జాతీయ ఉత్తమ నటుడిగా కీర్తికెక్కాడు. అయినప్పటికీ తనపై తీవ్రమైన ట్రోలింగ్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. పావలా విలువ కూడా చేయని వాళ్లే సోషల్మీడియాలో ట్రోలింగ్కు దిగుతారని తెలిసిందే.3వేల మంది ఫాలోవర్స్ఈ క్రమంలో తాజాగా కావేరీ బారువా అనే బ్రాండింగ్ వ్యూహకర్త చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్తో ప్రకటనల్ని చిత్రీకరించేటప్పుడు 42 రకాల నిబంధనల్ని పాటించాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఒక వ్యూహకర్తగా తన వృత్తికి పనికొచ్చేలా ఉన్నాయి. తనను తాను వైరల్ చేసుకునేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. సోషల్మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోవర్స్ కేవలం 3వేలు మాత్రమే.. దీంతో తను ఒక వ్యూహకర్త కాబట్టి ఇలాగైనా తను పాపులర్ కావచ్చని పక్కా ప్లాన్తోనే బన్నీపై పేలవమైన విమర్శలు చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.ఆధారాలు లేకుండానే..ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా అల్లు అర్జున్పై చేసిన విమర్శలు చాలా అభ్యంతరకంగా ఉన్నాయి. దీంతో ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. వారి ఒత్తిడితో ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూను యూట్యూబ్లో తొలగించారు. అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు ఉంటాయని ఆమె చెప్పింది. కానీ, అవేంటి అనేది చెప్పలేదు. తనకు ఎవరో చెప్పారు అంటుంది. పైగా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర బంధువులు అంటుంది. అసలు బన్నీ ఎవరు.. ఆయన బంధువులు ఎవరు అనేది కూడా తెలియకుండా ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. సంధ్య థియేటర్ గొడవ, ఎయిర్పోర్ట్లో మాస్క్ తీయాలంటూ వీడియో వైరల్, ఇప్పుడు స్ట్రాటజిస్ట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా కొందరు అల్లు అర్జున్కు వ్యతిరేఖంగా నడుపుతున్న యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్బన్నీపై ఆమె చేసిన కామెంట్లతో.. అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు. 42 పాయింట్లతో ఒక పత్రాన్ని రెడీ చేసి సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ టీమ్ కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. బన్నీపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని కోరింది. బన్నీ ఇలాంటి రూల్స్ పెడుతారని ఎవరు చెప్పారో వివరాలు ఇవ్వాలని కోరింది. కానీ, వారి వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ వీడియోను తొలగించి సైలెంట్ అయిపోయారు.ఒకవేళ ఆమె చెప్పిన వ్యాఖ్యల్లో నిజం ఉంటే బన్నీ గురించి చెప్పిన ఆ వ్యక్తి వివరాలు తెలపవచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పాడ్కాస్ట్లో పాల్గొన్న కావేరీ బారువాతో పాటు హోస్ట్పై బూతులతో విరుచుకుపడుతున్నారు. వాటి వల్ల తాము ఇబ్బంది పడుతున్నామంటూ సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వారి అకౌంట్లు కూడా తొలగించేశారు. కావేరి బరువా చేసిన వ్యాఖ్యలు నమ్మేలా లేవని బన్నీ గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఆయనతో పనిచేసిన వారందరూ బన్నీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారు. అవన్నీ కూడా సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. (అల్లు అర్జున్ గురించి ఆయన అభిమానులు విడుదల చేసిన వీడియో) Ilanti person mida edustaru 🙏 pic.twitter.com/IxBpgnHN3b— 𝒞𝒽𝒾𝓀𝒾𝓉𝒽𝒶 (@chikithaaaaaaa) February 10, 2026 -
'అల్లు అర్జున్' సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ స్రవంతి
యాంకర్ స్రవంతి సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన కష్టాన్ని నమ్ముకుని ఇప్పుడు స్టార్ యాంకర్గా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. పలు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, టెలివిజన్ షోలకు యాంకరింగ్ చేస్తూ అందరికీ దగ్గరైంది. 2009లోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ సరైన గుర్తింపు లేక ఛాన్స్ల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే, పుష్ప విడుదల సమయంలో అల్లు అర్జున్తో ఆమె చేసిన ఒక ఇంటర్వ్యూ తన జీవితాన్నే మార్చేసింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి చెబుతూ శ్రవంతి ఎమోషనల్ అయింది.2021లో పుష్ప సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ను యాంకర్ స్రవంతి ఇంటర్వ్యూ చేసింది. ఆమె కెరీర్లో అతిపెద్ద స్టార్ను కలవడం అదే తొలిసారి. తర్వాత ఆ ఇంటర్వ్యూ సోషల్మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమెకు వెంటనే బిగ్బాస్-5లో ఛాన్స్ దక్కింది. అనంతరం తన కెరీర్ పూర్తిగా ఉన్నత స్థానానికి చేరుకుంది. కేవలం బన్నీని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ దక్కడంతోనే తనకు గుర్తింపు వచ్చిందని ఆమె చెబుతుంది. అల్లు అర్జున్ను ఎప్పటికీ మరిచిపోలేనని అంటూ ఆమె ఇలా చెప్పుకొచ్చింది.'పుష్ప సినిమా విడుదలకు ముందు అల్లు అర్జున్తో ఇంటర్వ్యూ చేశాను. అప్పటి వరకు నా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇంటర్వ్యూ యూట్యూబ్లో షేర్ చేయగా మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అలా నాకు మంచి గుర్తింపు దక్కింది. దీంతో వెంటనే బిగ్బాస్-5లో ఛాన్స్ వచ్చింది. ఒక రకంగా అల్లు అర్జున్ వల్ల నా జీవితమే మారిపోయింది. అందుకే ఆయనపట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సైమా అవార్డ్స్లో బన్నీని కలిశాను. సైమా వేదికపై అవార్డ్ అందుకునేందుకు బన్నీ పేరును నేనే పిలిచాను.. అప్పడు నా గతాన్ని గుర్తుచేసుకుని బన్నీని చూడగానే తెలీయకుండానే కన్నీళ్లు వచ్చాయి. నాకు ఆయన చాలా సాయం చేశారు. ప్రతి పుట్టినరోజు నాడు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్తాను. ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటే అందుకు ప్రధాన కారణం అల్లు అర్జున్ మాత్రమే..' అంటూ శ్రవంతి చెప్పింది.అందరూ అనుకుంటున్నట్లు అల్లు అర్జున్లో ఎలాంటి గర్వం ఉండదని స్రవంతి చెప్పారు. కానీ, కొందరు పనికట్టుకుని విమర్శించడం సాధరణమే అన్నారు. రెగ్యూలర్గా చాలామంది ఫ్యాన్స్ ఆయన ఇంటికి వెళ్తుంటారు. వారందరితో కలిసి ఫోటోలు దిగుతారు. ఇతరులను ఆయన ఎప్పడు కూడా చులకన చేసి చూడరు. ఇలా బన్ని గురించి స్రవంతి చెప్పింది.అల్లు అర్జున్ చేసిన సాయం తలుచుకుని కళ్ల నీళ్లు పెట్టుకున్న యాంకర్ స్రవంతి@alluarjun @urs_sravanthi 📹https://t.co/lj4Z1Wb4Z0 pic.twitter.com/5j49D2T4ca— greatandhra (@greatandhranews) February 11, 2026 -
వాంగ అన్నే రెడీయా... తెలుగు హీరోల చూపు అటువైపే
టాలీవుడ్... కోలీవుడ్.... మాలీవుడ్... శాండల్వుడ్... బాలీవుడ్... ఇప్పుడు అన్ని వుడ్స్ ఒకటే. ఇప్పటివరకూ హీరోయిన్లు మాత్రమే రక రకాల భాషల్లో సినిమాలు చేసేవారు. అప్పుడప్పుడూ డైరెక్టర్లు కూడా వేరే భాషల్లో వేరే హీరోలతో సినిమాలు చేసేవారు. అయితే ఆ కాంబినేషన్ అరుదుగా సెట్ అయ్యేది. ఇప్పుడు పాన్ ఇండియా’ హవాతో తెలుగు హీరోలు తమిళ దర్శకులతో... తమిళ హీరోలు తెలుగు దర్శకులతో.... అలానే వేరే భాషల దర్శకులతో ఇంకో భాషకు చెందిన హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎక్కువైంది. ఒక్క తెలుగు గురించి మాట్లాడుకుంటే... ఇక్కడి టాప్ స్టార్స్ కొందరు తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ అవి సెట్స్ మీద ఉన్నాయి. కొన్ని చర్చల్లో ఉన్నాయి. ఇక ‘వాంగ అన్నే... రెడీయా... స్టార్ట్ కెమెరా’ (రండి అన్నా... రెడీయా... స్టార్ట్ కెమెరా) అంటూ తెలుగు హీరోలను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్న తమిళ దర్శకులు, చర్చల్లో ఉన్న దర్శకుల గురించి తెలుసుకుందాం. యంగ్ డైరెక్టర్తో నూరవ చిత్రం నూరవ చిత్రం అనేది ఏ హీరోకైనా వెరీ వెరీ స్పెషల్. ఈ మైల్స్టోన్ మూవీ గ్రాండ్గా ఉండాలని, మంచి కథతో, మంచి దర్శకుడితో రూపొందించాలని అనుకుంటారు. నాగార్జున కూడా అలానే అనుకుని, పకడ్బందీగాప్లాన్ చేసుకున్నారు. అయితే తెలుగు దర్శకుడికి కాకుండా తన నూరవ చిత్రం దర్శకత్వ బాధ్యతను తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్కి ఇచ్చారు. దాదాపు ఏడాది క్రితం నాగార్జునకు కార్తీక్ ఓ స్టోరీ లైన్ వినిపించారని, అది నచ్చి కథగా డెవలప్ చేయమన్నారనీ తెలిసింది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కార్తీక్కి ఇది రెండో చిత్రం.తమిళ చిత్రం ‘నిదమ్ ఒరు వానమ్’తో దర్శకుడిగా పరిచయమై, రెండో ఫీచర్ ఫిల్మ్కే నాగార్జునలాంటి స్టార్ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్, లాటరీ కింగ్’ అనే టైటిల్స్ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం లాటరీ నేపథ్యంలో ఉంటుందని భోగట్టా. అందుకే ‘లాటరీ కింగ్’ టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిత్రంలో టబు నటిస్తున్నారు. అలాగే అనుష్క ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. మల్టీస్టారర్ మూవీలో ఎన్టీఆర్? ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్, ‘వార్ 2’లో హృతిక్ రోషన్ కాంబినేషన్లో నటించిన ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్ మూవీ చేయనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. రజనీకాంత్తో ‘జైలర్’ వంటి హిట్ మూవీ తెరకెక్కించి, ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా రజనీతోనే ‘జైలర్’ 2’ తెరకెక్కిస్తున్న నెల్సన్ దిలీప్కుమార్ నెక్ట్స్ ఓ సినిమాప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ కోసం నెల్సన్ ఓ భారీ యాక్షన్ స్టోరీని తయారు చేశారని సమాచారం. ఆ స్టోరీ లైన్ని ఎన్టీఆర్కి వినిపించారనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్.మరోవైపు కొత్త చిత్రాల కోసం కథలు వింటున్నారట. ఈ నేపథ్యంలోనే నెల్సన్ చెప్పిన స్టోరీ లైన్ విని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే మల్టీస్టారర్ మూవీగా రూపొందనుందని భోగట్టా. ఎన్టీఆర్తో పాటు మరో స్టార్ హీరో ఈ చిత్రంలో నటిస్తారని ప్రచారం అవుతోంది. తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందించాలనుకుంటున్నారట. సో... ఓ తమిళ స్టార్ హీరో నటించే అవకాశం ఉందని అటు చెన్నై ఫిల్మ్నగర్ అంటున్న మాట. మరి... ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుందా? అది సోలో హీరో సినిమానా? లేక మల్టీస్టారరా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.ఇద్దరు దర్శకులతో... వరుసగా ఇద్దరు తమిళ దర్శకులతో అల్లు అర్జున్ సినిమాలు ఒప్పుకోవడం విశేషం. ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఈ హీరో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ సెట్స్లో ఉండగానే... సంక్రాంతి సందర్భంగా మరో చిత్రాన్ని ప్రకటించారు అల్లు అర్జున్. తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఆ మధ్య లోకేశ్ హైదరాబాద్ వచ్చి, అల్లు అర్జున్కి స్టోరీ లైన్ వినిపించారనే వార్త బయటకు వచ్చింది. దీంతో ఈ దర్శకుడి కాంబినేషన్లో ఈ హీరో సినిమా ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఆ ఊహలను నిజం చేస్తూ, ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. ఈ సినిమా ముగిసే సమయానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోని సినిమా షూట్ని ఆరంభించాలనుకుంటున్నారట. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆరంభం కానుందని తెలిసింది. తమిళ దర్శకుడు–తమిళ బేనర్... ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత రామ్ ఓ కొత్త దర్శకుడితో సినిమాకి పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రాన్ని దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మించనున్నారట. కాగా టాలీవుడ్కి చెందిన ఈ కొత్త దర్శకుడు చెప్పిన కథ రామ్కి నచ్చిందని సమాచారం. త్వరలో ఈ సినిమా ఆరంభం కానుందని తెలిసింది. మరోవైపు తెలుగులో బాగా పాపులర్ అయిన తమిళ నటుడు–దర్శకుడు సముద్ర ఖనితో సినిమా చేయడానికి రామ్ అంగీకారం తెలిపారని భోగట్టా. ఈ చిత్రాన్ని తమిళ బేనర్ కేవీఎన్ నిర్మించనుందట.ఈ సినిమా కథ రెడీ అయిందని, రామ్కి సముద్ర ఖని కథ నరేట్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ కథ నచ్చి, ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రాఘవేంద్ర రావు బేనర్లో నూతన దర్శకుడితో సినిమా పూర్తయ్యే సమయానికి సముద్ర ఖనితో సినిమాని పట్టాలెక్కించాలనుకుంటున్నారట రామ్. ఇక సముద్ర ఖని ఇప్పటికే తెలుగులో ‘శంభో శివ శంభో, జెండా పై కపిరాజు, బ్రో’ వంటి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఉన్నట్లా? లేనట్లా? ‘దసరా, హిట్ 3’... ఇలా వరుసగా మాస్ యాక్షన్ సినిమాలు చేస్తున్న నాని ప్రస్తుతం మరో మాస్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చేసిన మాస్ సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా మరో ఎత్తు అనేలా భారీ యాక్షన్తో రూపొందుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాని. ఇక రెండు మూడేళ్లుగా ఫలానా దర్శకుడితో నాని సినిమా చేయనున్నారంటూ వినిపించిన లిస్ట్లో తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి పేరు ప్రముఖంగా ఉంది.శివ కార్తికేయన్ హీరోగా శిబి దర్శకత్వంలో రూపొందిన ‘డాన్’ (2022) సినిమా చూసి, ఇంప్రెస్ అయ్యారట నాని. ఈ నేపథ్యంలోనే శిబి చక్రవర్తి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారనే వార్త ప్రచారమైంది. నానీకి శిబి స్టోరీ లైన్ కూడా చెప్పారట. అయితే ఆ లైన్ అసంతృప్తిగా అనిపించడంతో ఈ ప్రాజెక్ట్ పెండింగ్లో పడిందని సమాచారం. మరి... నాని–శిబి చక్రవర్తి కాంబినేషన్లో సినిమా ఉన్నట్లా? లేనట్లా... కాలమే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉంటే.... ఈ యువదర్శకుడికి సూపర్ స్టార్ రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుందర్ ఔట్ శిబి ఇన్ ‘తలైవర్ 173’ (వర్కింగ్ టైటిల్) పేరుతో రజనీకాంత్ హీరోగా శిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమాకి ముందు సుందర్. సీని దర్శకుడిగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు కమల్హాసన్ ఓ నిర్మాత. కమల్–రజనీ–సుందర్ కాంబినేషన్లో ‘తలైవర్ 173’ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే సుందర్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత పలువురి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్లీ సూపర్ స్టార్ సినిమా శిబి చక్రవర్తికి దక్కింది. ఇలా తెలుగు–తమిళ దర్శకుల కాంబినేషన్లో సినిమాలంటూ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. – డి.జి. భవాని -
'ఆమె వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు.. అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటన'
అల్లు అర్జున్ లాంటి హీరోతో యాడ్ షూటింగ్ చేయాలంటే కఠినమైన రూల్స్ ఉన్నాయంటూ ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఐకాన్ స్టార్తో షూట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన మేనేజర్స్ దాదాపు 42 నిబంధనలతో ఓ నోట్ ఇచ్చారని పేర్కొంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్పై వస్తున్న ఈ కథనంపై ఆయన టీమ్ రియాక్ట్ అయింది. ఆమె చెబుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇలాంటి అవాస్తవాలను ఎవరూ కూడా నమ్మొద్దని ఐకాన్ స్టార్ టీమ్ కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని స్పష్టం చేసింది. ఈ మేరకుఅల్లు అర్జున్ కార్యాలయం నుంచి అధికారిక నోట్ విడుదల చేసింది.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇలాంటి ధృవీకరించని కంటెంట్ను షేర్ చేయకుండా ఉండాలని సూచించింది. కాగా.. గతంలో ఆమె అల్లు అర్జున్తో ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. Unbelievable rules of Allu Arjun.A media professional reveals some of the shocking "do's and don'ts" when meeting megastar Allu Arjun.From strictly following a list of 42 rules to being told "don't look in sir's eyes" and "don't shake hands,"Why someone can't look in your… pic.twitter.com/pGv9UmhhBP— lakshman (@rebel_notout) February 10, 2026 -
'ఐకాన్ స్టార్తో షూట్.. ఈ రూల్స్ పాటించాల్సిందేనట'.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత మరో స్టార్ డైరెక్టర్తో జతకట్టారు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. జవాన్ డైరెక్టర్ అట్లీతో బన్నీ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంచితే అల్లు అర్జున్పై ప్రముఖ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆమె.. అల్లు అర్జున్ను కలవాలంటే కఠిన నిబంధనలు ఉంటాయని తెలిపింది. దాదాపు 42 రూల్స్ పాటించాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కళ్లలోకి చూడకూడదని.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని వెల్లడించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.కావేరి బారువా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. "నా మరో ఆసక్తికరమైన ఇంటర్వ్యూ హైదరాబాద్ మెగా స్టార్ అల్లు అర్జున్తో జరిగింది. ఈ సౌత్ స్టార్ను కలవడానికి ముందు మాకు దాదాపు 42 రూల్స్కు సంబంధించిన నోట్ ఇచ్చారు. మీరు సార్ కళ్లలోకి చూడకూడదు.. అలాగే షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వకూడదని మేనేజర్లు సూచించారని" ఆమె అన్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కావేరి బారువా చేసిన వాదనలు నిజమో కాదో తెలియాలంటే.. అల్లు అర్జున్ బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.Yeh hai Pushpa ka rule : Massive respect to @alluarjun Sir for setting strict rules before meeting any media person! North has always treated their stars like gods with endless protocols, but when South's Icon sets his own in Bombay? Suddenly it's 'too much' and shocking?… pic.twitter.com/FALbtiv1Dn— AnandTanniru (@ceoyktv) February 10, 2026 -
AA22: బన్నీకి విలన్ గా రష్మిక
-
అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ఓపెనింగ్ ఫిక్స్.. మొదటి సినిమా ఇదే..!
మల్టీఫ్లెక్స్ థియేటర్స్ నిర్మించడంలో అల్లు అర్జున్ దూకుడుగా ఉన్నారు. హీరోగా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో కూడా జోరు చూపిస్తున్నారు. మొదట మహేష్ బాబు ఏఎమ్బీతో ఈ ట్రెండ్ క్రియేట్ చేయగా.. ఈ తర్వాత బన్నీ, విజయ్ దేవరకొండ, రవితేజ అదే దారిలో కొనసాగుతున్నారు. వీరందరూ కూడా ఏషియన్ గ్రూప్స్తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని అమిర్పేట్లో ఏఏఏ పేరుతో మల్టీఫ్లెక్స్ నిర్మించిన అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు సినిమాస్ పేరుతో వరల్డ్ క్లాస్ థియేటర్ను ప్రేక్షకులకు అందిస్తున్నారు.అల్లు సినిమాస్ పేరుతో హైదరాబాద్లోని కోకాపేటలో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయింది. ఈ థియేటర్లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో పాటు డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్ వంటి కొత్త సాంకేతికతలను పరిచయం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద (75 అడుగుల) వెడల్పు గల డాల్బీ స్క్రీన్ను ఏర్పాటు చేయడంతో హైదరబాద్ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే, 4 స్క్రీన్లతో ఉన్న ఈ మల్టీప్లెక్స్ను మార్చి 19న ప్రారంభించాలనే ఆలోచనలో అల్లు సినిమాస్ టీమ్ ఉన్నట్లు సమాచారం. ఇందులో తొలి సినిమాగా 'ధురంధర్ 2, టాక్సిక్' ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రదర్శించడంతో దేశవ్యాప్తంగా అల్లు సినిమాస్ బ్రాండ్ విస్తరిస్తుందని ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ సినీప్రియులకు అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభవం అల్లు సినిమాస్తో లభించనుంది. విశాఖపట్నంలో కూడా అతిపెద్ద మల్టీఫ్లెక్స్ నిర్మాణ పనులను అల్లు అర్జున్ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. -
అల్లు అర్జున్ చేతికి గీతా ఆర్ట్స్.. కీలక మార్పులు!
గీతా ఆర్ట్స్.. 1972లో అల్లు అరవింద్ స్థాపించిన అగ్రశ్రేణి చలనచిత్ర నిర్మాణ సంస్జ.. గీతా ఆర్ట్స్ పేరు వెనుక మహా నటుడు అల్లు రామలింగయ్య ఉన్నారు. భగవద్గీత సారాంశం నచ్చి ఆ పేరు పెట్టారు. గత ఐదు దశాబ్ధాలుగా వందల సంఖ్యలో ఈ బ్యానర్లో ఉపాధి పొందారు, పొందుతున్నారు. ఈ బ్రాండ్ కేవలం సినిమా రంగానికే పరిమితం కాలేదు. థియేటర్లు, పంపిణీ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి కూడా విస్తరించింది.గీతా ఆర్ట్స్ సంస్థను అల్లు అరవింద్ 50 సంవత్సరాల తరబడి కష్టపడి నిర్మించారు. ఈ కంపెనీకి ఆయన కుమారులు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ వారసులు ఉన్నప్పటికీ గతంలో ఎవరూ రోజువారీ నిర్వహణలో చురుకుగా పాల్గొనలేదు. వ్యాపార పనులన్నీ కూడా అల్లు అరవింద్నే చూసుకునేవారు. గీతా ఆర్ట్స్కు సంబంధించి ప్రతి విభాగంలో సమర్థులైన వ్యక్తులను నియమించుకోవడంతో అల్లు అరవింద్ సక్సెస్ అయ్యారు. దీంతో వ్యక్తిగతంగా ప్రతిపనిలో వారి అవసరం అంతగా కనిపించలేదని చెప్పాలి. ఆపై వారి ఫ్యామిలీ మెంబర్, చిరంజీవి తోడల్లుని కుమార్తె విద్య ఈ నిర్మాణ సంస్థలో కీలక పాత్ర పోషించడంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు.అల్లు అరవింద్ స్థాపించిన వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గీతా అర్ట్స్కు సంబంధించి పలు నిర్ణయాలను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. అతను మొత్తం స్థాయిలో సంస్థను పర్యవేక్షిస్తున్నారు. రోజువారీ చర్చలకు బదులుగా తరచూ సమీక్ష సమావేశాలు, ప్రణాళికలతో పాటు వ్యాపార అభివృద్ధికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటున్నారని టాక్.. గీతా అర్ట్స్లోకి బన్నీ ప్రవేశం తర్వాత, కొన్ని మార్పులు జరిగినట్లు సమాచారం. తమ సంస్థలో చాలా కాలంగా పనిచేస్తున్న సహచరులకు సరైన గౌరవం ఇస్తూనే యువ టాలెంట్ను కూడా సంస్థలోకి తీసుకువచ్చారట. 50 ఏళ్లుగా వ్యాపారంలో బిజీగా గడిపేసిన అల్లు అరవింద్కు ఇప్పుడు కాస్త ఉపశమనం లభించినట్లు టాక్. అల్లు అర్జున్ ఎంట్రీ ఇప్పటికే ఆలస్యమైనప్పటికీ, తన తండ్రి నిర్మించిన వ్యాపారా సామ్రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బలమైన నిర్ణయాలే బన్నీ ముందుకు రావడం సానుకూల చర్యగా విశ్లేషకులు అంటున్నారు. -
హైదరాబాద్లో సమావేశమైన 'అల్లు అర్జున్' ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్లో సమావేశం అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవల్ కమిటీల ఏర్పాటుపై తాజాగా చర్చించారు. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు ఉండాలని వారు సూచించారు.టాలీవుడ్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారందరికీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ అసోసియేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా సొంతంగా తన అభిమానుల సైన్యాన్ని రెడీ చేసుకోనున్నాడు. పుష్ప2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తనకు అండగా ఫ్యాన్స్ లేరనే చెప్పాలి. ఆ సమయంలో తను చెప్పాలనుకున్న విషయాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమయ్యాడు. బన్నీ తరుపున ప్రజలకు చెప్పాల్సిన విషయాన్ని సమర్థవంతంగా రీచ్ చేసేవారు లేరు. అందుకే ఫ్యాన్స్ కొరతను ఆయన గ్రహించారని తెలుస్తోంది. -
అట్లీ మూవీకి.. బన్నీ రికార్డ్ రెమ్యునరేషన్
-
అల్లు అర్జున్ నుదురుపై డైలాగ్ పేపర్.. అదీ కారణం
టాలీవుడ్ సినిమాల్లో ఒకప్పుడు దాదాపుగా తెలుగు నటీనటులు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి వాళ్లో తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గత కొన్నేళ్లలో చూసుకుంటే కీలకమైన సహాయ పాత్రల్లో ఎక్కువగా తమిళ, మలయాళ యాక్టర్స్ దర్శనమిస్తున్నారు. అందులో జయరామ్ ఒకరు. ఈయన అల్లు అర్జున్తో కలిసి 'అల వైకుంఠపురములో' మూవీలో నటిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టారు. అది ఆసక్తికరంగా అనిపించింది.'నాకు తెలుగు తెలియదు. డైలాగ్ ఎన్నిసార్లు చదివినా సరే గుర్తుండట్లేదు. చివరకు డైలాగ్ని ఓ కాగితంపై రాసి ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించి, దాన్ని చూస్తూ డైలాగ్ చెప్పేశాను' అని జయరామ్.. తాజాగా మలయాళ ఎఫ్ఎమ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.స్వతహాగా మలయాళ నటుడు అయిన జయరామ్.. 2018లో అనుష్క 'భాగమతి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా, ఖుషీ, హాయ్ నాన్న, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, మిరాయ్ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. తనదైన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. సాధారణంగా డైలాగ్స్ విషయంలో నంబర్స్ చదువుతారు, లేదంటే పక్కనున్న వ్యక్తులు ప్రాంప్ట్ ఇస్తుంటారు. కానీ జయరామ్ మాత్రం అలా కాకుండా ఏకంగా బన్నీ నుదురుపైనే డైలాగ్ పేపర్ పెట్టి చెప్పడం అంటే కాస్త విశేషమే అని చెప్పొచ్చు. -
జపాన్లో పుష్ప-2.. అక్కడ కూడా తగ్గేదేలే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ పుష్ప-2. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఏకంగా వరల్డ్ వైడ్గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ చిత్రాల జాబితాలో రెండో పేస్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంటే ముందు అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2200 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.అయితే జపాన్లో మన తెలుగు సినిమాలతో పాటు ఇండియన్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మన హిట్ సినిమాలను జపనీస్లోకి డబ్ చేసి అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఇటీవల పుష్ప-2 మూవీని కూడా జపాన్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మూవీని జనవరి 16న జపాన్లో 'పుష్ప కున్రిన్' అనే పేరుతో విడుదల చేశారు. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ అక్కడ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా జపాన్ బాక్సాఫీస్ వద్ద రూ.139.73 కోట్ల వసూళ్లతో ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది.ఇటీవల జపాన్లో రిలీజైన పుష్ప-2 సైతం జపాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా మూవీ రిలీజైన 14 రోజుల్లోనే ఇండియన్ చిత్రాల జాబితాలో టాప్-10లో అడుగుపెట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.రూ.6.06 కోట్ల వసూళ్లతో ఆమిర్ ఖాన్ నటించిన ధూమ్ 3 (రూ6.03 కోట్లు) వసూళ్లను అధిగమించి 10వ స్థానంలో నిలిచింది. దీంతో జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాలలో పుష్ప 2 చోటు దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించింది. జపాన్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితా..ఆర్ఆర్ఆర్ - రూ.139.73 కోట్లుముత్తు - రూ.23.39 కోట్లుబాహుబలి 2: ది కన్క్లూజన్ - రూ.17.61 కోట్లు3 ఇడియట్స్- రూ.9.81 కోట్లుఇంగ్లీష్ వింగ్లీష్- రూ.9.24 కోట్లుది లంచ్బాక్స్- రూ.8.66 కోట్లుసాహో- రూ.7.56 కోట్లుమగధీర- రూ.7.51 కోట్లుఎంతిరన్ (రోబో - రూ.6.33 కోట్లుపుష్ప 2: ది రూల్- రూ.6.06 కోట్లు -
బన్నీ మూవీలో రష్మిక కీ రోల్ ..! అట్లీ ప్లాన్ అదుర్స్
-
కాబోయే భార్యపై ముద్దుల వర్షం.. అల్లు శిరీష్ వీడియో
అల్లు కుటుంబంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లికి రెడీ అయింది. శిరీష్- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. ఆరోజు అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు కావడం విశేషం!బ్యాచిలర్ పార్టీపెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఉండకపోతే ఎలా? సింగిల్ లైఫ్కు చెక్ పెట్టబోతున్నాడు కాబట్టి బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలిగా! అందుకే దుబాయ్లో శిరీష్- నయనిక గ్రాండ్గా బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. ఓ పడవలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాజాగా ఆ వీడియోను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో అల్లు అర్జున్, స్నేహతో పాటు మిగతా అందరూ నచ్చిన ఫుడ్ ఆస్వాదిస్తూ, డ్యాన్స్ చేస్తూ, ఫోటోలు దిగుతూ సంతోషంగా గడిపారు. శిరీష్ కాబోయే భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. దుబాయ్లో జనవరి 30, 31 తేదీల్లో ఈ సెలబ్రేషన్స్ జరిగాయన్నాడు శిరీష్.అలా మొదలైంది.2023 అక్టోబర్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. వీరి పెళ్లి సందర్భంగా హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక వచ్చింది. అదే పార్టీకి శిరీష్ కూడా వెళ్లగా.. అక్కడ నయనికను చూసి తొలిచూపులోనే ఇష్టపడ్డాడు. ఇద్దరి మనసులు కలవడంతో పెద్దలు కూడా ప్రేమకు పచ్చజెండా ఊపారు. అలా ఈ ప్రేమకథ వచ్చే నెలలో పెళ్లిపుస్తకంగా మారనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి: 36 తులాల బంగారం.. చెత్త శుభ్రం చేసే మహిళ కాళ్లు మొక్కిన నటుడు -
నీయవ్వ తగ్గేదేలే..! పుష్ప & ధురంధర్ డైరెక్టర్ మూవీ..!
-
అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)
-
ధురంధర్ డైరక్టర్ తో అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్..!
-
దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)
-
దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)
-
రామ్ చరణ్ దంపతులకు బన్నీ విషెస్.. చిరంజీవి ఫేస్ చూస్తుంటే?
రామ్ చరణ్ దంపతులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందం మరింత రెట్టింపైదన్నారు. ట్విన్స్ రాకతో చిరంజీవి ముఖంలో ఆ గర్వం, సంతోషం కనిపిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులందరి చిరునవ్వుల ముఖాలను చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అందమైన కొత్త ప్రారంభానికి రెట్టింపు ప్రేమ, ఆనందం కలుగుతోందన్నారు.కాగా.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విన్స్కు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉపాసనకు ఓ బాబు, పాప పుట్టారని అన్నారు. బిడ్డలతో పాటు తల్లి కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు. కవలల రాకతో తమ కుటుంబంతో పాటు అభిమానులు సంతోషంలో మునిగిపోయారని అన్నారు. మాపై మీరందరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఉపాసన- చెర్రీ దంపతులకు ఇప్పటికే క్లీంకార అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. Congratulations to @AlwaysRamCharan & @upasanakonidela on being wonderful parents once again. Immense joy and celebration all around. The pride and happiness are radiating on @KChiruTweets garu’s face and Chittika’s as well. So happy to see them and the entire family’s smiling…— Allu Arjun (@alluarjun) February 2, 2026 -
దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్
అల్లు కుటుంబంలో పెళ్లి సందడి. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్.. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నయనిక అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరగ్గా.. మరికొన్ని రోజుల్లో వివాహ వేడుక గ్రాండ్గా జరగనుంది. దీంతో ఇప్పుడు అందరూ కలిసి బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్నాడు. దీనికి దుబాయి వేదికగా నిలిచింది.(ఇదీ చదవండి: నిజంగా పెళ్లాన్ని అడిగినట్లే అడిగారు: శ్రీలీల)అల్లు శిరీష్, నయనికల బ్యాచిలరేట్ పార్టీ.. శనివారం రాత్రి దుబాయిలో జరిగింది. ఓ పడవలో వీళ్లంతా గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ అన్న బాబీ కూడా తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలని పోస్ట్ చేయగా.. బన్నీ భార్య స్నేహ కూడా పలు ఫొటోలని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'చరణ్' చేతిలో రెండేళ్ల బిడ్డ.. మెగా ఫ్యాన్స్ అత్యుత్సాహం)#AlluSirish Pre Wedding shooting Dubai ♥️ pic.twitter.com/HFrY0ux2Rs— Swaasthi (@swaasthi) January 31, 2026 -
Allu Arjun : ఇది సార్.. నా బ్రాండ్
-
20 ఏళ్ల నాటి సినిమాను గుర్తు చేసుకున్న అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన 20 ఏళ్ల నాటి మూవీని గుర్తు చేసుకున్నారు. నా సినీ ప్రయాణంలో అత్యంత ఆనందాన్నిచ్చిన చిత్రాలలో ఇది ఒకటని ట్వీట్ చేశారు. హ్యపీ చిత్రానికి నేటితో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన కరుణాకర్ గారికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు.నా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన హీరోయిన్ జెనీలియా, టాలెంటెడ్ మనోజ్ భాజ్పాయ్.. నాతో పాటు ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులందరూ కలిసి ఈ ప్రయాణాన్ని మర్చిపోలేనిదిగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. హృదయాన్ని హత్తుకునే సంగీతం అందించినందుకు యువన్ రాజాకు, సాంకేతిక నిపుణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు అండగా నిలిచినందుకు మా నాన్న అల్లు అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 20 years of #Happy. 🖤One of the most enjoyable films of my journey.Grateful to #AKarunakar garu for the beautiful vision.My wonderful co-star dear @geneliad, the amazing talent @BajpayeeManoj ji, and many other artists made it a truly joyful ride.@thisisysr garu for his… pic.twitter.com/zeUTwRPdlR— Allu Arjun (@alluarjun) January 27, 2026 -
2030 వరకు సందీప్ వంగా వైల్డ్ ఫైర్
-
జపాన్ అభిమాని దెబ్బకు బిత్తరపోయిన పుష్ప..
-
డబ్బులెక్కువిచ్చారని 'ఖైదీ 2' డ్రాప్.. ఎట్టకేలకు నోరు విప్పిన లోకేశ్
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. అల్లు అర్జున్తో రెండు వారాల క్రితం కొత్త సినిమాని ప్రకటించాడు. దీంతో ఈ దర్శకుడిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేసరికి 'ఖైదీ 2' వదిలేశాడు, LCU(లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) ఆగిపోయింది అని రకరకాల రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై లోకేశ్ స్వయంగా స్పందించాడు. చెన్నైలో సోమవారం ఉదయం జరిగిన ఓ ప్రెస్మీట్లో తనపై వస్తున్న అన్ని పుకార్లకు సమాధానమిచ్చాడు.'గత వారం నుంచి ఎల్సీయూ క్లోజ్ అయిపోయిందని అన్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఖైదీ 2 కూడా ఆగిపోయిందంటున్నారు. ఇది కూడా నిజం కాదు. అల్లు అర్జున్తో చేస్తున్న మూవీ పూర్తవగానే 'ఖైదీ 2' చేస్తా. తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ చిత్రాలు వరసగా వస్తాయి. లారెన్స్తో చేస్తున్న 'బెంజ్' కూడా ఎల్సీయూలో భాగమే. దయచేసి రూమర్స్ నమ్మకండి'(ఇదీ చదవండి: తమిళ బ్లాక్బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)'ఖైదీ 2 ఆలస్యం కావడానికి పారితోషికం కారణం కాదు. వేరే నిర్మాతలు డబ్బులు ఎక్కువ ఇచ్చారని దీన్ని వదిలేయలేదు. ఇతర ప్రాజెక్టుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. 'కూలీ' తర్వాత రజనీకాంత్-కమల్ హాసన్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం చేయమన్నారు. దీంతో ఒకటిన్నర నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాను. వరసగా యాక్షన్ మూవీస్ చేస్తుండటంతో ఒక సింపుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ చేద్దామన్నారు. దాన్ని ఎలా డీల్ చేయాలో తెలీక ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాను''అల్లు అర్జున్తో సినిమా కోసం మైత్రీ మూవీస్ సంస్థతో చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నాయి. అది ఇప్పటికి కుదిరింది. అందుకే బన్నీ మూవీ ఇప్పుడు చేస్తున్నాను తప్పితే 'ఖైదీ 2' వదిలేసి చేయట్లేదు. అలానే దళపతి విజయ్ 'జన నాయగణ్'లో అతిథి పాత్ర చేశా' అని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)#LokeshKanagaraj about UpComing #LCU Film- After my film with #AlluArjun sir, my very next project will be #Kaithi2, #Vikram2, and the #Rolex standalone film are all commitments I’ve made, and I will complete every one of them.#AA23pic.twitter.com/de7CqnwckD— Movie Tamil (@_MovieTamil) January 26, 2026 -
ప్రభాస్ బాటలో బన్నీ.. స్ట్రాటజీ రిపీటు
టాలీవుడ్లో పెద్ద హీరోల్లో వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అంతే వేగంగా షూటింగ్లు పూర్తి చేసే హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేస్తారు. వాటికి బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రభాస్ బాటలో నడుస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు అట్లీతో బన్నీ ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే లోకేశ్ కనగరాజ్తో మరో సినిమా ప్రకటించాడు. ఈ రెండు సినిమాలపై చర్చలు కొనసాగుతుండగానే తాజాగా మరో ప్రాజెక్ట్ను లైన్లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. తమ బ్యానర్పై వంగా దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు. నిజానికి ఈ కాంబినేషన్ కొత్తది కాదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే వంగా-బన్నీ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. కానీ అనుకోని కారణాల వల్ల అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లాక్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా వెంటనే మొదలయ్యే అవకాశం లేదు. అట్లీ, లోకేశ్ కనగరాజ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే బన్నీ వంగా ప్రాజెక్ట్ వైపు వస్తాడు. మరోవైపు సందీప్ రెడ్డి కూడా స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రభాస్ ఒకేసారి 2-3 సినిమాలు ప్రకటించే ట్రెండ్ను మొదలుపెట్టాడు. సలార్, కల్కి, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే ప్రకటించారు. వీటికి అదనంగా సలార్-2, కల్కి-2 కూడా లైన్లో ఉన్నాయి. ఇప్పుడు బన్నీ కూడా అదే తరహాలో ముందు ప్రాజెక్టులు లాక్ చేసి ఆ తర్వాత డేట్స్ కేటాయించే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. టాలీవుడ్లో ఈ కొత్త ట్రెండ్ స్టార్ హీరోల అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
షూటింగ్ షురూ
చిన్న బ్రేక్ తర్వాత షూటింగ్ షురూ చేశారు అల్లు అర్జున్. ఆయన హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, అనూ ఇమ్మాన్యూయేల్ నటించనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైందని, అల్లు అర్జున్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారని బాలీవుడ్ సమాచారం. ఇటీవల ‘పుష్ప 2: ది రూల్’ సినిమా జపాన్లో విడుదల కాగా, ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అల్లు అర్జున్ జపాన్ వెళ్లారు. తిరిగి ఆయన ఇండియాకు వచ్చి అట్లీ డైరెక్షన్లోని సినిమా షూటింగ్తో బిజీ అయ్యారని టాక్. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్స్ కాజోల్, జిమ్ సర్బ్ నటిస్తున్నారనే టాక్ కొత్తగా తెరపైకి వచ్చింది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2027లో విడుదల కానుందని తెలిసింది. ఇక అల్లు అర్జున్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ప్రారంభం అవుతుంది. -
#AA23.. సీక్రెట్ చెప్పేసిన లోకేశ్ కనగరాజ్
'పుష్ప 2' తర్వాత ఆచితూచి సినిమాలు ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి పనిచేస్తున్నాడు. దీని షూటింగ్ ఇప్పటికే జరిగింది. వచ్చే ఏడాది ఇది రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తో బన్నీ కొత్త మూవీ చేయబోతున్నాడని వారం పదిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి స్వయంగా లోకేశ్ మాట్లాడాడు. ఓ సీక్రెట్ చెప్పేశాడు.తాజాగా ఓ మూవీ ఈవెంట్లో పాల్గొన్న లోకేశ్ కనగరాజ్కి యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. ప్రేక్షకుల అంచనాలు లేకుండా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ తీయాలనుకుంటే అది ఎలా ఉండబోతుంది? అని యాంకర్ అడగ్గా.. నా తర్వాతి సినిమా(#AA23) అలానే ఉండబోతుంది అని లోకేశ్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఎందుకంటే లోకేశ్ గతంలో ఖైదీ, విక్రమ్ లాంటి స్టైలిష్ మూవీస్ తీశాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే వాటిని మించే ఉండొచ్చు.(ఇదీ చదవండి: ట్రెండింగ్లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)చాన్నాళ్ల క్రితమే లోకేశ్ ఓ సూపర్ హీరో తరహా స్టోరీ అనుకున్నాడు. ఇందులో హీరోకి ఓ చేయి ఉండదు. బదులుగా ఓ ఐరన్ హ్యాండ్ అమర్చుతారు. అప్పటినుంచి సదరు హీరోకి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు సందర్భాల్లో లోకేశ్ చెప్పాడు. తొలుత హీరో సూర్యతో ఇది చేద్దామనుకున్నాడు. గతేడాది ఆమిర్ ఖాన్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడదే ప్రాజెక్ట్ అల్లు అర్జున్తో చేస్తున్నాడా? అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే బన్నీతో చేస్తున్న మూవీ కోసం అనౌన్స్ చేసిన వీడియోలో.. సినిమా అడవి బ్యాక్డ్రాప్లో ఉండబోతుందని మరి అది ఇది ఒకటేనా అనేది తెలియాల్సి ఉంది.మరోవైపు అల్లు అర్జున్ మూవీ కోసం లోకేశ్ కనగరాజ్.. ఇప్పటికే హైదరాబాద్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టేశాడు. కేవలం నాలుగు నెలల్లోనే మూవీ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అట్లీ ప్రాజెక్ట్ నుంచి కాస్త ఫ్రీ అయిన వెంటనే అల్లు అర్జున్ దీన్ని చేస్తాడని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ) #AA23xLK7Biggest movie in @Dir_Lokesh career... 😳🥵💥The Madness doubled now onwards...🥵☠️#AlluArjun#LokeshKanagaraj#AnirudhRavichanderpic.twitter.com/H32nHFQrtB— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) January 24, 2026 -
పుష్ప 3 లో.. పుష్పరాజ్ హీరో కాదా..?
-
జపాన్ లో పుష్ 2.. షాకింగ్ కలెక్షన్స్
-
టాప్ హీరోల ఫోకస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు సినిమా వారణాసి. ఈ ప్రాజెక్ట్ను పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించేందుకు రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల తరువాత మహేష్ బాబు, రామ్ చరణ్ ఇద్దరూ మళ్లీ పాన్ వరల్డ్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ రామ్ చరణ్ కోసం దర్శకుడు సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు. ఈసారి ఆయన రూపొందిస్తున్న కథ పాన్ వరల్డ్ స్థాయిలో యూనివర్సల్ అపీల్ కలిగిన జానర్లో ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంకా హీరోకు నెరేషన్ ఇవ్వలేదు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతే చరణ్ను కలసి కథ వినిపించనున్నారు. ప్రస్తుతం సుకుమార్, ఆయన టీమ్ ఈ పనిపైనే దృష్టి సారించారు. మహేష్ బాబు స్వంత బ్యానర్లో కొత్త ప్రాజెక్ట్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను స్వంత బ్యానర్ జిఎంబిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మొదట్లో డొమెస్టిక్ మార్కెట్కు సరిపడే సినిమా చేయాలని ఆలోచించారు. కానీ ఇప్పుడు ఒక దర్శకుడు చెప్పిన లైన్ మహేష్ను ఆకట్టుకున్నట్లు సమాచారం. ఆ కథ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుంది. జిఎంబితో పాటు మరో బ్యానర్ ఈ ప్రాజెక్ట్లో భాగమవుతుందని సమాచారం. ఇకపై పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి టాప్ హీరోలు ఇకపై కేవలం మన మార్కెట్కు సరిపడే కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. వారి దృష్టి మొత్తం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి ప్రాజెక్టులపైనే ఉంది. టాలీవుడ్లో ఇకపై ప్రతి పెద్ద సినిమా గ్లోబల్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని రూపొందనుందనే చెప్పాలి. -
ఐరన్ హ్యాండ్
సూపర్ హిట్ ‘పుష్ప 1, 2’ చిత్రాల్లో అల్లు అర్జున్ భుజం పైకి ఎత్తి, వెరైటీగా వాక్ చేస్తూ ఓ కొత్త మేనరిజమ్తో ఆకట్టుకున్నారు. మరోసారి సవాల్తో కూడిన పాత్రలో కనిపించనున్నారు అల్లు అర్జున్. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సూపర్ హీరో తరహా పాత్ర చేయనున్నారట అల్లు అర్జున్. ‘ఐరన్ హ్యాండ్’తో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఓ ప్రమాదంలో హీరో చేయి కోల్పోతాడట. ఆ తర్వాత ఐరన్ హ్యాండ్తో ప్రత్యర్థులపై చేసే పోరాటం ఉత్కంఠభరితంగా ఉంటుందని టాక్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీలో అల్లు అర్జున్ పలు పాత్రల్లో (తాత, అతని కొడుకు, ఇద్దరు మనవళ్ల పాత్రలు) కనిపించనున్నారని భోగట్టా. ఆ వెంటనే లోకేశ్ సినిమాలో ప్రయోగాత్మక పాత్రతో రానున్నారు. ఇలా వరుసగా అల్లు అర్జున్ ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఈ చిత్రం పూర్తయ్యే సమయానికి లోకేశ్ కనగరాజ్తో చేయనున్న సినిమా షూట్లో ఎంటర్ అవుతారట. -
చిరంజీవి సినిమాకు రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు లేవని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే కనిపించిన కొన్ని సంఘటనలు ఇవన్నీ నిజమేనేమో అనిపించేలా చేశాయి. కానీ అదంతా సోషల్ మీడియాలో రూమర్స్ మాత్రమేనని క్లారిటీ వస్తుంటాయి. ఇప్పుడు కూడా అల్లు అర్జున్.. చిరంజీవి కొత్త సినిమాకు తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)తాజాగా 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా చూసిన అల్లు అర్జున్.. చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వింటేజ్గా అదరగొట్టేశాడని అన్నాడు. వెంకటేశ్, నయనతార, కేథరిన్, బుల్లిరాజు అలియాస్ రేవంత్ కూడా ఆకట్టుకున్నారని రాసుకొచ్చాడు. హుక్ స్టెప్, మెగావిక్టరీ సాంగ్స్ ఇచ్చిన భీమ్స్కి కంగ్రాట్స్ చెప్పాడు. నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటిని ప్రశంసించాడు. అలానే దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రస్తావిస్తూ.. 'సంక్రాంతికి వస్తారు-హిట్ కొడతారు-రిపీట్' అని డైలాగ్ వేశాడు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు.. సంక్రాంతి 'బాస్'బస్టర్ అని చిరుకి బన్నీ సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు.చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉందని టాక్ కొందరి నుంచి వినిపించినప్పటికీ.. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు కూడా.(ఇదీ చదవండి: పదేళ్లుగా సినిమాలకు దూరమైనా ఇప్పటికీ.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా?)CONGRATULATIONS TO THE ENTIRE TEAM OF #ManaShankaraVaraPrasadGaru The BOSS IS BACK ❤️🔥 L - I - T 🔥Happy to see our megastar @KChiruTweets garu light up the screens again 🔥Full #VintageVibes ⁰@VenkyMama garu rocked the show . #VenkyGowda ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ (Thumba… pic.twitter.com/SI8CF7r9VO— Allu Arjun (@alluarjun) January 20, 2026 -
అల్లు అర్జున్ ఫ్యామిలీ.. జపాన్ ట్రిప్లో ఇలా (ఫొటోలు)
-
జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)
-
ప్రముఖ ఆలయంలో బన్నీ ఫ్యామిలీ.. ఫోటో షేర్ చేసిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం జపాన్ ట్రిప్లో ఉన్నారు. ఇటీవల పుష్ప-2 మూవీని జపాన్లోనూ రిలీజ్ చేశారు. అంతకుముందు మూవీ ప్రమోషన్స్తో పాల్గొన్న బన్నీ.. ఇప్పుడు కుటుంబంతో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా టోక్యోలోని ప్రముఖ సెన్సోజి ఆలయాన్ని తన ఫ్యామిలీతో కలిసి సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి తొలిసారి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవలే ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఇటీవలే బన్నీకి సంబంధించిన మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తో చేయనున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, బన్నీ వాసు వర్క్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
దళపతి రేంజ్కు 'అల్లు అర్జున్'.. బిగ్ లైనప్తో ప్లాన్
అల్లు అర్జున్ పుష్పలో "ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా" అనే పాట తన నిజ జీవితానికి బాగా సెట్ అవుతుంది అని చెప్పొచ్చు. బన్నీ సినిమా విడుదలవుతుంది అంటే చాలు.. అందరికీ తెలిసిన ఒక వర్గం తనను కిందకు లాగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే, బన్నీ కూడా అంతే రేంజ్లో "ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నను కాల్చితే కత్తి అవుతాను" అంటూ తనను ట్రోల్ చేసే వారి గుండెల్లో దడ పుట్టిస్తాడు. టాలీవుడ్లో తన ఫ్యాన్స్ బేస్ చాలా బలంగానే ఉంది. ఇప్పుడు తన చూపు ఇతర ఇండస్ట్రీల మీద ఉంది. ‘ఆర్య’ సినిమా తర్వాత మలయాళంలో మల్లు అర్జున్ అయ్యాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్కు తన మార్కెట్ సత్తా చూపాడు. ఇప్పుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్ మూవీస్తో తమిళ పరిశ్రమపై కన్నేశాడు. తన ప్లాన్ వర్కౌట్ అయితే, తమిళ్లో బిగ్స్టార్గా పాతుకుపోతాడు. అందుకే ఇప్పుడు వరుసగా తమిళ టాప్ దర్శకులతో ప్రాజెక్ట్లు మొదలుపెట్టాడనిపిస్తుంది.దళపతి బాయ్స్తో అల్లు అర్జున్దళపతి విజయ్ బాయ్స్గా అట్లీ, లోకేశ్ కనగరాజ్లకు ఇమేజ్ ఉంది. బిగిల్, మెర్సిల్, తేరి చిత్రాలతో విజయ్కి అట్లీ హిట్స్ ఇస్తే.. లియో, మాస్టర్ మూవీస్తో లోకేశ్ తన మార్క్ చూపించాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్తో వరుసగా సినిమాలు చేస్తుండటంతో విజయ్ ఫ్యాన్స్ కన్ను అల్లు అర్జున్ మీద పడింది. లోకేశ్ తన నెక్ట్స్ మూవీ బన్నీతో అని చెప్పగానే విజయ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. విజయ్, అల్లు అర్జున్ల ఏఐ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్మీడియాలో పంచుకుంటున్నారు.చెన్నైలో జరిగిన పుష్ప-2 ఈవెంట్లో బన్నీ తమిళంలోనే మాట్లాడి వారి ప్రేమను పొందాడు. తమిళ ప్రజలకు కావాల్సింది కూడా అదే.. వారి భాషలో మాట్లాడే హీరోలను తప్పకుండా అక్కున చేర్చుకుంటారు. కన్నడకు చెందిన రజనీకాంత్కు తమిళనాట ఎలాంటి ఆదరణ ఉందో తెలిసిందే.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.అల్లు అర్జున్కు తమిళనాడులో సానుకూలతప్రస్తుతం అల్లు అర్జున్ చూపు తమిళనాడుపై ఉంది. కోలీవుడ్లో దళపతి విజయ్ సినిమాలకు గుడ్బై చెప్పి రాజకీయాల వైపు వెళ్తున్నారు. రజనీకాంత్ వయసు కారణంగా రాబోయే రోజుల్లో సినిమాలు చేసే ఛాన్స్ తక్కువగానే ఉండొచ్చు. ఆపై తమిళ మరో బిగ్ హీరో అజిత్ కూడా సినిమాలపై ఫోకస్ తగ్గించి.. కార్ రేసింగ్పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ముగ్గురి తర్వాత ఏర్పడుతున్న ఆ స్పేస్ను ఉపయోగించుకునేందుకు పక్కా వ్యూహంతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దళపతి విజయ్ మెచ్చిన దర్శకులతో బన్నీ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తన ప్లాన్ సక్సెస్ అవుతుందనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్కు టాప్ ఇమేజ్ ఉంది. ఇదే క్రమంలో తమిళనాడులో కూడా తన ప్లాన్ వర్కౌట్ అయితే సౌత్ ఇండియాలో బన్నీకి సినిమాలకు బిగ్గెస్ట్ మార్కెట్ ఏర్పడుతుంది.బిగ్ లైనప్ సినిమాలతో ప్లాన్అల్లు అర్జున్ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్తో పాటు టాప్ దర్శకులతోనే ఉన్నాయి. అట్లీ, లోకేశ్ కనగరాజ్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ ఇలా వరుసగా పేరున్న డైరెక్టర్స్తో లైనప్ ఉంది. ఆపై తను ఎంచుకున్న స్టోరీలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. అట్లీ సినిమా హిట్ కొడితే చాలు.. సౌత్ ఇండియాలో తన మార్కెట్ పునాది బలంగా పడుతుంది. బాలీవుడ్లో ఎటూ ఖాన్ల మూవీస్కు పోటీగా బన్నీ మార్కెట్ ఉంది. ముఖ్యంగా బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బన్నీ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఆపై తన ఫ్యూచర్ సినిమాల లైనప్ మరింత బలంగా ఉంది కాబట్టి ఇండస్ట్రీలో తన మార్క్ ఏంటో అల్లు అర్జున్ చూపించబోతున్నాడని తెలిసిపోతుంది. -
బన్నీ VS మహేష్ సంక్రాంతి వార్
-
జపాన్లోనూ తగ్గేదేలే.. పుష్ప-2 డైలాగ్స్తో మార్మోగిన థియేటర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ మూవీని జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నెల 16న జపాన్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా ఒక రోజు ముందే జపాన్లో పుష్ప-2 ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ షోకు అల్లు అర్జున్, రష్మిక మందన్నా కూడా హాజరయ్యారు. జపాన్ అభిమానుల ముందు బన్నీ డైలాగ్స్ చెప్పి జోష్ పెంచారు. జపాన్ భాషలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పడంతో థియేటర్ ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియాలో షేర్ చేశారు.The Whistles & VibeAt the #PushpaKunrin premiere...❤️🔥#Pushpa2TheRule Icon Star @alluarjun @IamRashmika pic.twitter.com/p9qiVwkG8I— Bunny Vas (@TheBunnyVas) January 15, 2026 -
టాప్ హీరో ఛీ కొట్టిన స్టోరీ కీ జై కొట్టిన బన్నీ... ఏమిటా ధైర్యం?
ఫుల్ డిమాండ్ లో ఉన్న హీరో ప్లాప్ డైరెక్టర్కు ఛాన్స్ ఇవ్వడం అంటే అది సాధారణ విషయం కాదు. అందుకే ఇప్పుడు బన్నీ, లోకేష్ కనగరాజ్ ల కాంబో సంచలనం గా మారింది.టాలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా సినిమాల ఫ్యాన్స్ మొత్తాన్ని షేక్ చేస్తోంది ఈ కాంబో. భారీ విజయాలను అందించిన పుష్ప 2: ది రూల్ తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు సాధారణ టాలీవుడ్ స్టార్ను దాటిపోయాడు పాన్-ఇండియా సూపర్ స్టార్ రేస్ లో సగర్వంగా నిలబడ్డాడు. మరోవైపు కూలీ వంటి భారీ చిత్రం ద్వారా బోలెడంత అప్రతిష్ట మూట గట్టుకున్నాడు లోకేష్. పెద్ద హీరోల్ని డీల్ చేయలేకపోయాడనే తీవ్ర విమర్శలను ఎదుర్కున్నాడు రజనీ-కమల్ కాంబో సినిమా తో పాటు మరికొన్ని భారీ చిత్రాల ఆఫర్లు పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితి లో ఫుల్ ఫార్మ్ లో ఉన్న అల్లు అర్జున్ ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం వెనుక కారణం ఏమిటి అనేది సినీ పండితుల అంచనాలకు అందడం లేదు. వినవస్తున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబో లో రూపొందనున్నచిత్రం ఓ సూపర్ హీరో సినిమా కావచ్చు. దీనిపై అనేక అంచనాలు అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటనలు ఇంకా రానప్పటికీ జోరుగా ఊహగానాలు సాగుతున్నాయ్. ఇది భారతీయ సినిమాలో సూపర్ హీరో కథలను మరో గమ్యం వైపు నడిపే అవకాశం ఉందని అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఒక కల్చరల్ చరిత్రనూ సృష్టించడం ఖాయమని లోకేష్ టాలెంట్ పట్ల నమ్మకం వున్నవారు అంటున్నారు.అయితే ప్రస్తుతం బన్నీ ఓకే చేసిన స్టోరీ సూర్య హీరో గా లోకేష్ సారద్యం లో తెరకెక్కనున్న సూపర్ హీరో చిత్రం ఇరుంబుకై మాయవి తరహా అనీ, ఈ సినిమా ఆలోచన మొదట బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో చర్చిస్తే ఆయన తిరస్కరించాడని దీనిని బన్నీ ఓకే చేయడం విచిత్రం గా ఉందని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.పుష్ప సిరీస్ తో అనూహ్యమైన ఇమేజ్ స్వంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తీసుకునే ప్రతీ నిర్ణయం అయన భవిష్యత్ కు చాలా కీలకం గా మారనుంది అనేది నిస్సoదేహం. తన తదుపరి చిత్రానికి టాప్ డైరెక్టర్ అట్లీ ని ఎంచుకుని పర్ఫెక్ట్ ఛాయిస్ గా ప్రశంసలు అందుకున్న ఐకాన్ స్టార్ ఆ తర్వాత లోకేష్ ను ఎంచుకోవడం ఖరారైతే అది పెద్ద సాహసం గానే చెప్పాలి. -
జపాన్ లో పుష్పరాజ్: Allu Arjun
-
లోకేశ్తో ఫిక్స్
‘పుష్ప: ది రైజ్’ (2021), ‘పుష్ప 2: ది రూల్’ (2024) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఏఏ 22’ (వర్కింగ్ టైటిల్). తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారు? అంటే... లోకేశ్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగా, బాసిల్ జోసెఫ్ పేర్లు వినిపించాయి. ఫైనల్గా ఆ అవకాశాన్ని లోకేశ్ కనగరాజ్ అందుకున్నారు. అల్లు అర్జున్ నటించనున్న ‘ఏఏ 23’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ ఫిక్స్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్, బన్నీ వాసు వర్క్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బన్నీ వాసు, నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరించ నున్న ఈ మూవీని బుధవారం ప్రకటించారు. ‘‘ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్స్ కలిసి పని చేయబోతున్న ‘ఏఏ 23’ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించేలా ఉంటుంది. అల్లు అర్జున్ని ఇప్పటివరకు చూడని కొత్త లుక్లో చూపించనున్నారు లోకేశ్ కనగరాజ్. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ సినిమా చిత్రీకరణను ఈ ఆగస్టులో ఆరంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
క్రేజీ కాంబో ఫిక్స్.. స్టార్ డైరెక్టర్తో అల్లు అర్జున్ మూవీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ బాటపట్టారు. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే అట్లీతో జతకట్టిన బన్నీ.. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో మూవీకి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు ఏఏ23 వర్కింగ్ టైటిల్ను ప్రకటించింది. అల్లు అర్జున్.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. తొలిసారి వీరిద్దరు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లో 23వ చిత్రంగా రానుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. A Collaboration that will be Eternal in Indian Cinema 🤘🏻🔥💥Icon Star @alluarjun X @Dir_Lokesh X @MythriOfficial X @anirudhofficialSTRIVE FOR GREATNESS🔥 ▶️ https://t.co/AGCi8q89x2Shoot begins in 2026 💥#AALoki #AA23 #LK7 pic.twitter.com/op2vnureqp— Mythri Movie Makers (@MythriOfficial) January 14, 2026 -
జపాన్ లో పుష్ప రాజ్ వైల్డ్ ఫైర్ ఎంట్రీ..
-
స్టార్ దర్శకుడితో 'అల్లు అర్జున్' సినిమా.. సంకాంత్రికి ప్రకటన
అల్లు అర్జున్, అట్లీ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది. అయతే, బన్నీ తదుపరి సినిమాపై అందరి చూపు ఉంది. ఈ క్రమంలో ఆయన మరోసారి తమిళ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. నేడు అధికారికంగా ప్రకటన కూడా రానుందని ఇండస్ట్రీలో టాక్. ఒక వీడియోతో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.కొద్దిరోజుల క్రితమే లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్కు రావడంతో ఈ వార్తలకు బలాన్ని ఇచ్చాయి. అల్లు అర్జున్ను ఆయన కలవడం వంటి పరిణామాల నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా దాదాపు ఖరారు అయిందని టాక్. లోకేశ్ చెప్పిన కథ బన్నీకి నచ్చడంతో లైన్ క్లియర్ అయిందని సమాచారం. మైత్రీ మూవీమేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్. అట్లీతో సినిమా పూర్తి అయిన తర్వాత వెంటనే లోకేశ్ ప్రాజెక్ట్లోకి బన్నీ జాయిన్ అయిపోతారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించే అవకాశం ఉంది. -
పుష్ప అంటే ఇంటర్నేషనల్.. జపాన్లో 'అల్లు అర్జున్' ఎంట్రీ
అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు జపాన్లో అడుగుపెట్టారు. తను నటించిన పుష్ప-2 చిత్రం జనవరి 16న 'పుష్ప కున్రిన్' పేరుతో విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. ఇప్పటికే పలు భాషల్లో విడుదలైన ఈ మూవీ విశేష ప్రేక్షకాదరణను పొందింది. ఇప్పుడు జపాన్లో ఏంతమేరకు మెప్పిస్తుంది అనేది చూడాల్సి ఉంది.‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్’ అంటూ అల్లు అర్జున్ కొట్టిన డైలాగ్కు ఇప్పుడు కెరెక్ట్గా సెట్ అయిందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. పుష్ప-2 మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. గీక్ పిక్చర్స్, షోచికు స్టూడియోలతో కలిసి జపాన్లో విడుదల చేస్తుంది. సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ టోక్యో చేరుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. సినిమాలో జపాన్ నేపథ్యం కూడా ఉండటంతో అక్కడి ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జపాన్ ప్రజలకు ఎర్రచందనం వుడ్తో ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి పుష్ప కలెక్షన్స్ పెరగవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.Icon star #alluarjun land in Japan welcome 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #Pushpa2TheRule #Pushpa2InJapan pic.twitter.com/lE4O004AGL— Allu shan dhanush (@subramanyams755) January 13, 2026 -
అల్లు అర్జున్ మూవీ లైనప్..
-
మొన్న అల్లు అర్జున్, ఇప్పుడు ప్రభాస్.. హరీశ్రావు సంచలన కామెంట్
తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు పలు విమర్శలు చేశారు. సినిమా రంగం అనేది తమ రాజకీయ కక్షలను తీర్చుకునేందుకు ఒక అడ్డాగా మార్చుకున్నారని ఆయన భగ్గుమన్నారు. ఒక సినిమాకు టికెట్ ధరలు పెంచి మరో సినిమాకు పెంచకపోవడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో వస్తుంది. మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు తెలియదు.. ఆ జీఓ ఎలా వచ్చిందో అంటారు. అసలు తన దగ్గరికే ఫైల్ రాలేదని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని హరీశ్రావు ఎద్దేవా చేశారు.వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష కడితే.., మరో సంఘటనలో సీఎం పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే టికెట్ ధర రూ. 600కు పెంచుకోవచ్చని అనుమతి ఇస్తారా..? ఆపై వారం రోజుల పాటు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా..? అంటూ హరీశ్రావు ప్రశ్నించారు. '50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న చిత్ర పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు.' అని ఆయన ఫైర్ అయ్యారు.తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది..సినిమా టికెట్ రేట్ల విషయంలో శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. అని హరీశ్రావు అన్నారు. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు. 'మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో..? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో..?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం.' అని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది.ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత… pic.twitter.com/2ADAbafJa6— Harish Rao Thanneeru (@BRSHarish) January 11, 2026 -
నా జీవితంలో ప్రత్యేకమైన రోజు.. పుట్టినందుకు థాంక్స్
ట్రోలింగ్ను ఎదుర్కోని హీరో లేడు. కెరీర్ తొలినాళ్లలో దారుణమైన ట్రోల్స్ చూశాడు అల్లు అర్జున్. 'గంగోత్రి' సినిమాలో అతడు ఆడవేషం కడితే అందరూ పడీపడీ నవ్వారు. అదే అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీలో చీరకట్టి తాండవం చేస్తే అదుర్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.నాలుగు సార్లు రిపీట్హీరోగా తన తొలి సినిమా గంగోత్రితో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బన్నీ తర్వాతి మూవీ 'ఆర్య'తో తనేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'ఆర్య 2'తో వీరి కాంబినేషన్ మరోసారి హిట్టు అని నిరూపితమైంది. ఆ ధైర్యంతోనే ముచ్చటగా మూడోసారి జత కట్టి 'పుష్ప' సినిమా తీశారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందడంతో పాటు భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఎనలేని గౌరవంపుష్పకు సీక్వెల్గా వచ్చిన 'పుష్ప 2' చిత్రం అయితే రికార్డులు తిరగరాసింది. అల్లు అర్జున్ను తిరుగులేని పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టింది. తనకు ఇంత గుర్తింపు తీసుకొచ్చిన సుకుమార్ అంటే బన్నీకి ఎనలేని గౌరవం. తన కెరీర్ తారాజువ్వలా వెలగడానికి ఆయనే కారణమని బలంగా నమ్ముతాడు. ఈరోజు (జనవరి 11న) సుకుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.నా జీవితాన్ని మార్చేసిన రోజు హ్యాపీ బర్త్డే డార్లింగ్.. ఈరోజు నీకంటే కూడా నాకే ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చేసిన రోజు ఇదే! నువ్వు నా జీవితంలో ప్రసాదించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. పుట్టినందుకు థాంక్స్ సుకుమార్ అంటూ రెండు ఫోటోలు షేర్ చేశాడు. ఈ పోస్ట్ కింద అభిమానులు 'పుష్ప 3' కోసం వెయిటింగ్ అని కామెంట్లు చేస్తున్నారు. Happy Birthday, darling.It’s a special day for me… more than for you… because this day changed my life. No amount of wishes can convey the joy of having you in my life. #HBDSukumar Puttinandhuku thanks!!! 🖤(Copyrights @pnavdeep26 ) pic.twitter.com/mJ7jNBmFQa— Allu Arjun (@alluarjun) January 11, 2026 చదవండి: పొగిడినా, విమర్శించినా నవ్వుతా: అనిల్ రావిపూడి -
Allu Arjun: పుష్ప టార్గెట్ చేశాడంటే..! నీయవ్వ తగ్గేదేలే
-
బాలీవుడ్ స్టార్ తో బన్నీ భారీ యాక్షన్ ప్లాన్
-
కాంబినేషన్ ఫిక్స్?
హీరో అల్లు అర్జున్, తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్కు రావడం, అల్లు అర్జున్ను కలవడం వంటి పరిణామాల నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా దాదాపు ఖరారు అయిందని ఫిల్మ్నగర్ సమాచారం. మైత్రీ మూవీమేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్.ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత లోకేశ్తో చేయనున్న సినిమా షూట్లో అల్లు అర్జున్ పాల్గొంటారని ఊహించవచ్చు. అలాగే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల..వైకుంఠపురములో..’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రానుందని, సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో ఆధ్మాత్మిక టచ్తో ఈ సినిమా కథ సాగుతుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
దీపికా పదుకోణె బర్త్డే.. ఛాన్సులు పోయినా సరే వెనక్కు తగ్గని జీవితం
బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ నేడు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇండియాలోనే పాపులర్ హీరోయిన్గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ (రూ. 20 నుంచి 30 కోట్లు) ఒక్కో సినిమాకు అందుకునే నటిగా కొనసాగుతున్నారు. అయితే, నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే, సీక్వెల్లో ఆమె నటించలేదు.ఛాన్స్లు పోయినా సరే ఎక్కడా తగ్గన దీపికపని గంటలు విషయంలో ఆమె షరతులు పెట్టారని అందుకే కల్కి-2 నుంచి మేకర్స్ తొలగించారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ నుంచి కూడా చర్చల దశలోనే ఆమెను తప్పించారని టాక్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెపై తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. కానీ, తను మాత్రం ఎక్కడా కూడా తిరిగి వారికి కౌంటర్ ఇవ్వలేదు. ఒక వ్యక్తి 8 గంటలకంటే ఎక్కువగా పనిచేయడం కష్టమని ఆమె పదేపదే అన్నారు. అదే మాటపై కట్టుబడుతానని బహిరంగంగా చెప్పారు. అలా ఒప్పుకున్న వారితోనే కలిసి సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల తర్వాత తను చేసిన వ్యాఖ్యలను చాలామంది మేకర్స్ సమర్ధించారు కూడా.. ఈ క్రమంలో తనకు కొన్ని సినిమా ఛాన్సులు కూడా పోయాయి. అయినప్పటికీ తను ఎంతమాత్రం తగ్గలేదు. అయితే, అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ సినిమాలో దీపికా నటిస్తున్నడం విశేషం. నేడు ఆమె బర్త్డే సందర్భంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు దీపికా పదుకోన్. ‘ఐశ్వర్య’ (2006) అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కెరీర్కి చేరువ అవుతున్నారు. కన్నడ, హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లిష్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారామె. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తో ఏడడుగులు వేశారు. 2018 నవంబరు 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా దీపిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ ప్రాజెక్ట్లను సొంతం చేసుకుని, ఔరా అని ఆశ్చర్యపరిచారామె.ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకోన్ పేరు టాప్ ప్లేస్లో ఉండటం విశేషం. పైగా పెళ్లయినప్పటికీ హిందీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కంటిన్యూ అవుతున్నారీ బ్యూటీ. రణ్వీర్–దీపిక దంపతులకు దువా పదుకోన్ సింగ్ అనే పాప ఉంది. 2024లో అమ్మగా ప్రమోషన్ పొందారు దీపిక. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగూ బిజీ అవుతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కింగ్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమాతో పాటు అల్లు అర్జున్ సినిమా కూడా ఉంది.8గంటల పనిపై దీపికా వివరణ‘‘నేనో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మగారిపై మరింత గౌరవం పెరిగింది. వృత్తి జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని బ్యాలెన్స్ చేయొచ్చని చాలామంది అంటుంటారు. కానీ అది చాలా కష్టమైన పని. కొత్తగా తల్లయిన వారు తిరిగి పనికి వచ్చినప్పుడు వారికి అందరూ సపోర్ట్ చేయాలి’’ అని దీపికా పదుకోన్ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు 8 గంటలు మాత్రమే పని చేసే వెసులుబాటును కల్పించాలని దీపిక కొంత కాలంగా పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో మరోమారు ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ– ‘‘రోజుకి 8 గంటల పని మానవ శరీరానికి, మనసుకు సరిపోతుంది.మనం ఆరోగ్యంగా ఉండి, పని చేసినప్పుడే అవుట్పుట్ బాగా వస్తుంది. ఒత్తిడితో పని చేస్తే సరైన ఫలితం రాకపోవచ్చు. మా ఆఫీసులో సోమవారం నుంచి శుక్రవారం వరకు మేం 8 గంటలే పని చేస్తాం. వినేవారికి బోరింగ్గా ఉండొచ్చు. టైమ్ అనేది మన చేతుల్లో ఉన్న ధనంతో సమానం. దీన్ని ఎవరితో, ఎప్పుడు, ఎలా స్పెండ్ చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు ఉండాలి. నా దృష్టిలో సక్సెస్ అంటే ఇదే. 8 గంటలు మాత్రమే పని చేయాలనే నా నిర్ణయం కరెక్టే’’ అని చెప్పుకొచ్చారు దీపికా పదుకోన్. -
ఇద్దరు హీరోల కోసం అనుకున్న స్క్రిప్ట్.. బన్నీ దగ్గరకొచ్చిందా?
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ ఈ ఏడాది అక్టోబరు వరకు ఉండనుందని తెలుస్తోంది. అంటే థియేటర్లలోకి రావడం దాదాపు వచ్చే ఏడాదే అనమాట. సరే ఈ మూవీ సంగతి పక్కనబెడితే బన్నీ నెక్స్ట్ ఏ దర్శకుడితో పనిచేస్తాడా అనే గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లిస్టులో మరో పేరు వచ్చింది. స్టోరీ ఏంటనేది కూడా టాక్ నడుస్తోంది.అట్లీ తర్వాత త్రివిక్రమ్తోనే బన్నీ కలిసి పనిచేయబోతున్నాడని కొన్నిరోజుల ముందు రూమర్స్ వచ్చాయి. గతంలో అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి, ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిపోయిన 'గాడ్ ఆఫ్ వార్' అనే స్క్రిప్ట్ మళ్లీ బన్నీ దగ్గరకొచ్చిందని.. ఈ ఏడాదిలో విషయంపై క్లారిటీ రావొచ్చని కొన్ని రోజుల ముందే మాట్లాడుకున్నారు. ఇది నిజమో కాదో అనే సంగతి పక్కనబెడితే కొత్తగా లోకేశ్ కనగరాజ్ పేరు తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్)మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బన్నీ-లోకేశ్ కలిసి ఓ మూవీ చేయబోతున్నారని టాక్ అయితే బయటకొచ్చింది. అయితే గతంలో లోకేశ్ రాసుకున్న 'ఇరుంబక్కు మాయావీ' స్క్రిప్ట్నే ఇప్పటి జనరేషన్కి తగ్గట్లు మార్పులు చేసి బన్నీతో చేయబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఈ స్టోరీ గతంలో సూర్యతో అనుకున్నారు. కానీ కుదర్లేదు. 'కూలీ' టైంలో దీన్ని ఆమిర్ ఖాన్తో లోకేశ్ చేయనున్నాడని మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తే బన్నీ పేరు తెరపైకి వచ్చింది. నిజమా కాదా అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.ఓ ప్రమాదంలో చేతిని కోల్పోయిన ఓ వ్యక్తికి లోహంతో తయారు చేసిన చేతిని అమర్చుతారు. దీంతో అతడికి ఎలాంటి సూపర్ పవర్స్ వచ్చాయి? తర్వాత ఏమైంది అనేదే 'ఇరుంబక్కు మాయావీ' స్టోరీ లైన్ అని గతంలోనే లోకేశ్ ఓసారి చెప్పాడు. మరి బన్నీతో చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనా కాదా అనేది చూడాలి? దీనికి అనిరుధ్ సంగీతమందించే అవకాశముందని కూడా మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్గారు' ట్రైలర్ వచ్చేసింది) -
అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్
ఎప్పటినుంచో ఈ సమస్య ఉన్నప్పటికీ.. రీసెంట్ టైంలో ఇది మరీ ఎక్కువగా అనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం 'రాజాసాబ్' ప్రమోషన్లో భాగంగా ఓ మాల్కి నిధి అగర్వాల్ వచ్చింది. వెళ్లే క్రమంలోనే అక్కడున్న జనం ఈమెని చాలా ఇబ్బంది పెట్టేశారు. అందుకు సంబంధించిన మాల్ యాజమాన్యంపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఇలానే అల్లు అర్జున్, అతడి భార్య కాస్త ఇబ్బంది పడ్డారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రకుల్ రొమాంటిక్ కామెడీ సినిమా)ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఇకపోతే హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు సినిమాస్ పేరిట కొత్తగా పెద్దగా థియేటర్ని నిర్మించాడు. దీని లాంచింగ్ తర్వాత తిరిగెళ్లే క్రమంలో హైటెక్ సిటీలోని ఓ కేఫేకి భార్య స్నేహతో కలిసి వెళ్లాడు. దీని నుంచి బయటకొచ్చే క్రమంలోనే వీళ్లని అక్కడున్న జనం చుట్టుముట్టారు. దీంతో బన్నీ, అతడి భార్య కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదే కాదు కొన్నిరోజుల క్రితం ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత వెళ్లి వస్తున్న టైంలో ఇలాంటిదే జరిగింది. మలేసియాలో 'జన నాయగణ్' ఈవెంట్ ముగించుకుని చెన్నై తిరిగొచ్చిన తర్వాత విమానాశ్రయంలో అయితే హీరో విజయ్ని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఇతడు దాదాపు కిందపడిపోయేంత ఇబ్బంది పెట్టారు. ఏదేమైనా ఈ మధ్య సెలబ్రిటీలు బయట తిరగడం చాలా కష్టమైపోతోంది.(ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్గారు' ట్రైలర్ వచ్చేసింది)అల్లు అర్జున్ తన భార్య స్నేహ తో కలిసి హైటెక్ సిటీలోని కేఫ్ నీలోఫర్లో కనిపించారు.#AlluArjun #Sneha #HitechCity #CafeNiloufer #Hyderabad pic.twitter.com/L0n1u8EdgC— Everest News (@Everest_News7) January 4, 2026 -
కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్ (ఫోటోలు)
-
అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?
-
న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
2025లో ఈ హీరోలు కనిపించలేదు గురూ!
ఒకప్పుడు ఏడాదికి ఏడెనిమిది సినిమాల్లో కనిపించేవారు స్టార్ హీరోలు. ట్రెండ్ మారాక ఏడాదికి ఒక్కసారి కనిపించడమే పెద్ద విషయంగా మారిపోయింది. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల నిర్మాణానికి ఎక్కువ రోజులు పట్టడమో, అనుకున్న సమయానికి విడుదల కాకుండా వాయిదా పడటమో వంటి కారణాలతో ఈ ఏడాది కొందరు టాప్ స్టార్స్ వెండితెరపై కనిపించలేదు. కొందరు యువ హీరోలు కూడా వెండితెరకు ఎక్కలేదు. అయితే 2026లో ‘నో గ్యాప్’ అంటూ సిల్వర్ స్క్రీన్ పై కనువిందు చేయనున్నారు. ఆ విశేషాల్లోకి...టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి 2024ని మాత్రమే కాదు... 2025ని కూడా మిస్సయ్యారు. అయితే 2026లో మాత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు, విశ్వంభర’ సినిమాలతో ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. చిరంజీవి హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘భోళా శంకర్’ 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఈ చిత్రం తర్వాత ఆయన నటించిన ‘విశ్వంభర’ 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. దీంతో చిరంజీవి సినిమా విడుదలై, దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. అయితే 2026లో సంక్రాంతి బరిలో దిగుతున్నారాయన. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘మన శంకరవరప్రసాద్గారు’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ ఏడాది వాయిదా పడిన ‘విశ్వంభర’ సినిమా 2026 సమ్మర్లో విడుదల కానుంది. ఆ రకంగా అభిమానులకు డబుల్ ఫీస్ట్ ఇవ్వనున్నారు చిరంజీవి2026లోనూ నో?2024 సంక్రాంతికి ప్రేక్షకులకు ‘గుంటూరు కారం’ ఘాటు చూపించిన మహేశ్బాబు 2025ని మిస్ అయ్యారు.‘గుంటూరు కారం’ తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్గా ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రనిర్మాణానికి ఎక్కువ రోజులు పట్టడం సహజం. సో... ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ మూవీ 2026లోనూ విడుదలయ్యే అవకాశం లేదు. 2027 వేసవిలో ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అంచనా ఉంది. ఈ లెక్కన మహేశ్బాబు 2026లోనూ సిల్వర్ స్క్రీన్ ని మిస్ అవుతున్నట్టే అన్నమాట.వచ్చే ఏడాదీ లేనట్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్ . ఆయన నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్బస్టర్ గా నిలవడంతోపాటు సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అయితే 2025 లో అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ని మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఏఏ 22 అండ్ ఏ 6’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూపర్ హీరో కాన్సెప్ట్తో సైన్ప్ ఫిక్షన్గా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో అనుకున్నారు. భారీ కథ, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న కారణంగా చిత్రీకరణకు ఎక్కువ టైమ్ పడుతోందట. దాంతో 2027లో ఈ చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. అంటే వరుసగా 2025, 2026ని అల్లు అర్జున్ మిస్ అయినట్లే. వచ్చే ఏడాదిపోరాట యోధుడిగా...సీనియర్ హీరోల్లో గోపీచంద్ ఈ ఏడాది తెరపై కనిపించలేదు. ఆయన హీరోగా నటించిన ‘విశ్వం’ సినిమా 2024 అక్టోబరు 11న విడుదలైంది. ఆ తర్వాత ఆయన ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు గోపీచంద్. ఏడో శతాబ్దం నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రక ఘట్టంతో ఈ చిత్రం రూపొందుతోందట. ఇంకా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ ని మిస్ అయిన సీనియర్ హీరోలు మరికొందరు ఉన్నారు. పైన పేర్కొన్నవారే కాదు.. మరికొందరు యువ హీరోలు కూడా 2025ని మిస్ అయిన వారి జాబితాలో ఉన్నారు. వారిలో కొందరయినా 2026లో వెండితెరపై వెలుగుతారని కోరుకుందాం.రెండు భాగాలుగా రూపొందిన ‘బాహుబలి’ సినిమా అప్పుడు ప్రభాస్ వెండితెరపై రెండు మూడేళ్ల గ్యాప్లో కనిపించారు. అయితే ఆ గ్యాప్ విలువైనదనే చె΄్పాలి. ప్రభాస్ని పాన్ ఇండియన్ స్టార్గా నిలబెట్టిన చిత్రం ‘బాహుబలి’. కానీ ఇకపై తమ అభిమాన హీరో సిల్వర్ స్క్రీన్ పై గ్యాప్ లేకుండా కనిపించాలనిఅభిమానులు ఆశించారు. గత ఏడాది ‘కల్కి 2898ఏడీ’లో హీరోగా కనిపించారు ప్రభాస్. అనుకోకుండా 2025లో గ్యాప్ వచ్చింది. కానీ ‘కన్నప్ప’లో చేసిన అతిథి పాత్ర కొంతవరకూ అభిమానులను సంతప్తిపరిచింది. ఇక ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ 2026 జనవరి 9న విడుదలవుతోంది. అలాగే ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రం కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది. సో... అభిమానులకు డబుల్ ధమాకా అన్నమాట.2026లో ఫుల్ మాస్2025 లో ఎన్టీఆర్ ఏ తెలుగు సినిమా చేయకపోయినా హిందీ చిత్రం ‘వార్ 2’లో కనిపించి, ఫ్యాన్స్ని ఆ విధంగా ఆనందపరిచారు. అయితే ఎంత లేదన్నా మాతృభాషలో కనిపిస్తేనే ఫ్యాన్స్కి మజా వస్తుంది. ఆ కొరత ఈ ఏడాది ఉన్నప్పటికీ వచ్చే ఏడాది అసలు సిసలు ఫుల్ మాస్ కమర్షియల్ తెలుగు సినిమాలో కనిపిస్తారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ హీరో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. థాయ్ల్యాండ్, మయన్మార్, లావోస్ సరిహద్దుల్లోని గోల్డెన్ ట్రయాంగిల్ప్రాంతం చుట్టూ ఈ కథ తిరుగుతుందని, అక్కడ జరిగే అక్రమ కార్యకలాపాలను హీరో పాత్ర ఎదుర్కొంటుందనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ లో ఈ చిత్రం విడుదల కానుంది.యువ హీరోలకు సైతం గ్యాప్కొందరు యువ హీరోలు సైతం 2025ని మిస్సయ్యారు. శర్వానంద్ నటించిన ‘మనమే’ చిత్రం 2024 జూన్ 7న రిలీజైంది. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన ‘నారీ నారీ నడుమ మురారి, బైకర్’ చిత్రాలు 2025లో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడ్డాయి. ఈ రెండు సినిమాలూ 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం జనవరి 14న విడుదలవుతోంది. వరుణ్ తేజ్ కూడా ఆడియన్స్ని పలకరించి ఏడాదికి పైనే అయింది. ఆయన హీరోగా నటించిన ‘మట్కా’ మూవీ 2024 నవంబరు 14న రిలీజైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా 2026 లో విడుదలకానుంది.అడివి శేష్కి కూడా 2025లో గ్యాప్ వచ్చింది. ఆయన నటిస్తున్న ‘డెకాయిట్’, ‘జీ 2’ చిత్రాలు 2026లో రిలీజ్ కానున్నాయి. ఇక అక్కినేని అఖిల్ ఆడియన్స్ ముందుకొచ్చి రెండున్నరేళ్లకు పైనే అయింది. ఆయన నటించిన ‘ఏజెంట్’ మూవీ 2023 ఏప్రిల్ 28న విడుదలైంది. ఆ తర్వాత అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. ఈ సినిమా 2026లో రిలీజ్ కానుంది. మరో యువ హీరో సాయిదుర్గా తేజ్ కూడా ఆడియన్స్ని పలకరించి రెండున్నరేళ్లకు పైనే అవుతోంది.‘విరూపాక్ష’, ‘బ్రో’ (2023) వంటి సినిమాల తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రం 2026లో విడుదలకానుంది. అదే విధంగా నిఖిల్ సిద్ధార్థ్ సినిమా విడుదలై ఏడాదికి పైనే అయ్యింది. నిఖల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ 2024 నవంబరు 8న రిలీజైంది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమా 2026లో ఆడియన్స్ ముందుకు రానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
అల్లు శిరీష్ పెళ్లి ప్రకటన.. అన్నయ్య, వదినపై ప్రేమ
నటుడు అల్లు శిరీష్ కొత్త ఏడాదిలో తను ప్రేమించిన ప్రియురాలు నయనికతో ఏడడుగులు వేయబోతున్నాడు. అక్టోబర్లో వారిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తన పెళ్లి తేదీని శిరీష్ ప్రకటించాడు. 2026 మార్చి 6న తన పెళ్లి జరుగుతుందని ఒక పాటతో చెప్పాడు. అల్లు అయాన్, ఆర్హలతో కలిసి చేసిన ఒక రీల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.సరదాగా ఉన్న ఆ వీడియోలో బాబాయ్ సంగీత్ ఎప్పుడు అంటూ అని వారు అడగ్గా.. మనం దక్షిణాది వాళ్లం కాబట్టి అలాంటి వేడుక ఉండదని శిరీష్ చెప్తాడు. కానీ, పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్- స్నేహారెడ్డిల వివాహం కూడా 2011 మార్చి 6నే జరిగింది. సెంటిమెంట్తో అదే తేదీని శిరీష్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.అల్లు శిరీష్- నయనిక స్నేహం మొదలైన కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. 2023లో వరుణ్తేజ్- లావణ్యల పెళ్లి సందర్భంగా హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్ తరపున శిరీష్ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
అల్లు అర్జున్ పై కక్ష సాధింపు.. చంద్రబాబు చేయిస్తున్నాడా!
-
కొనసాగుతున్న కక్ష సాధింపు
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ కథా నాయకుడిగా నటించిన పుష్ప–2 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి ఆ హాలు నిర్వాహకులే కారణమని హైదరాబాద్ పోలీసులు తేల్చినా, అల్లు అర్జున్ను కేసులో ఏ11గా కొనసాగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత ఏడాది డిసెంబర్ 4న చోటుచేసుకున్న ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పట్ల అల్లు అర్జున్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేవతి మృతికి సంతాపం తెలిపారు. రేవతి భర్తకు ఆరి్థక సహాయం చేసి.. శ్రీతేజ చికిత్సకు అవసరమైన నిధులను సమకూర్చారు. ప్రజల్లో క్రేజ్ ఉన్న సినీ నటుడు సంధ్య థియేటర్కు వస్తున్న నేపథ్యంలో భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. వారు ముందుగానే తగిన భద్రత కలి్పంచి ఉంటే తొక్కిసలాటకు తావుండేదే కాదు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ, ఆయనపై చార్జ్షీట్ దాఖలు చేయడం సబబు కాదని, ఇది కక్ష పూరితమని సినీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారిస్తూ మేనేజ్మెంట్తోపాటు మేనేజర్పైనా అభియోగాలు మోపారు. అల్లు అర్జున్, ఆయన బృందం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై బీఎన్ఎస్ 105, 118 (1) రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల జాబితాలో మొత్తం 23 మంది ఉండగా.. అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. ఆయనతోపాటు ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపైనా చార్జిషిట్ దాఖలైంది. ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు గత ఏడాది డిసెంబర్ 13న అరెస్టు చేశారు. కింది కోర్టు రిమాండ్ విధించగా, అదే రోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలకు సంబంధించిన లాంఛనాలు పూర్తి కాకపోవడంతో ఆయన ఆ రోజు రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉండాల్సి వచి్చంది. అక్కడొక న్యాయం.. ఇక్కడొక న్యాయం.. అల్లు అర్జున్ను ఏ–11గా చేర్చుతూ పోలీసులు చార్జిషిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో తొక్కిసలాట ఘటనలకు బాధ్యుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలని మేధావులు, సామాజిక వేత్తలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశి్నస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ, ఆయనపై చార్జ్షీట్ దాఖలు చేయడం ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోందని ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు. ‘ఆంధప్రదేశ్లో 2015 జూలై 14న రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను నాటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆ సమయంలో తన ప్రచార కండూతితో ఒకేసారి భక్తులను ఘాట్లోకి వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. 2022 డిసెంబర్ 28న టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు కందుకూరులో ఇరుకు సందుల్లో నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించారు. 2023 జనవరి 1న గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న సంక్రాంతి కానుక పంపిణీ సభలోనూ తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించారు. ఇలా పలు ఘటనల్లో తొక్కిసలాటతో పదుల సంఖ్యలో జనం చనిపోవడానికి చంద్రబాబే బాధ్యుడని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి బాబుపై ఎన్ని కేసులు నమోదు చేయాలి? ఎన్ని చార్జిషిట్లు నమోదు చేయాలి?’ అని మేధావులు ప్రశ్నింస్తున్నారు. తెలంగాణలోని రేవంతరెడ్డి సర్కార్ తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అల్లు అర్జున్పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేసిందని స్పష్టం చేస్తున్నారు. రెండు పక్క పక్క రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం అంటూ విస్తుపోతున్నారు. -
పుష్ప-2 తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. A11గా అల్లు అర్జున్
-
'పుష్ప-2' తొక్కిసలాట కేసు: ఏ-11గా అల్లు అర్జున్
'పుష్ప 2: ది రూల్' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ రేవతి మరణానికి సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ను, ఏ-11గా అల్లు అర్జున్(Allu Arjun)ని చేర్చుతూ.. ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ ఫైల్ చేశారు. గత డిసెంబర్ 4న హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్లో 'పుష్ప 2' బెనిఫిట్ షో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్కు వచ్చారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.దర్యాప్తులో భాగంగా పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చారు. థియేటర్లో తగిన భద్రతా చర్యలు, ప్రత్యేక ఎంట్రీ-ఎగ్జిట్ ఏర్పాట్లు లేకపోవడం, అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఒకేసారి అనుమతించడం వంటి లోపాలు గుర్తించారు. అయితే, అల్లు అర్జున్ రాకను ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, ఆయన బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టడం వంటి కారణాలతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్టు చేయగా.. బెయిల్పై బయటకు వచ్చారు. -
బాక్సాఫీస్ వార్ స్టార్ట్! 1000 కోట్ల బ్లాక్ బస్టర్ పై ఫోకస్
-
అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?
ఒకరు చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు. ఒకసారి వేరే హీరో అనుకున్న తర్వాత లేదు లేదు మళ్లీ పాత హీరోతోనే మూవీ చేయడం లాంటివి మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్లో అదే జరగనుందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తద్వారా అల్లు అర్జున్, ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయారు. ఇంతకీ ఏంటి విషయం?అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి హిట్స్ పడ్డాయి. అలా వీళ్లిద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారని ఏడాది-ఏడాదిన్నర క్రితం తెగ మాట్లాడుకున్నారు. అదో భారీ మైథలాజికల్ సబ్జెక్ట్ అనే టాక్ బయటకొచ్చింది. లెక్క ప్రకారం 'పుష్ప 2' తర్వాత బన్నీ, త్రివిక్రమ్తో ఈ మూవీ చేస్తారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ తన కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా తారక్తో ఈ ప్రాజెక్ట్ చేస్తారని న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)ఇందుకు తగ్గట్లే ఎన్టీఆర్ కూడా 'ద గాడ్ ఆఫ్ వార్' పుస్తకం పట్టుకుని ఒకటి రెండుసార్లు కనిపించాడు. నిర్మాత నాగవంశీ కూడా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ ఎత్తున ఈ సినిమా ఉండబోతుందన్నట్లు పరోక్షంగా ట్వీట్స్ చేశాడు. తాజాగా ఓ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు.. కొన్ని సందర్భాల్లో సినిమాలు చేతులు మారుతుంటాయని అన్నాడు. ఇది బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసమేనని నెటిజన్ల అంటున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో కొత్త మూవీస్ ఏం లేవు. అట్లీది వేసవికల్లా పూర్తవుతుంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్తోనూ బన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో బన్నీతో చేసేవారిలో ఎవరు ముందు ఎవరు వెనక అనేది చూడాలి? పరిస్థితులు చూస్తుంటే త్రివిక్రమ్.. మరోసారి తారక్కి హ్యాండ్ ఇచ్చాడా అనిపిస్తుంది. గతంలో 'ఆర్ఆర్ఆర్' తర్వాత కూడా ఎన్టీఆర్తో త్రివిక్రమ్ మూవీ ప్రకటించారు. కానీ దాన్ని పట్టాలెక్కించలేకపోయారు.(ఇదీ చదవండి: 17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి.. ఎవరీ అనస్వర) -
పుష్ప సిరీస్ దారిలో అల్లు అర్జున్ - అట్లీ చిత్రం?
-
పాన్ ఇండియాకి వణుకు పుట్టే కాంబినేషన్
-
'కోర్ట్' మూవీ, టీమ్పై అల్లు అర్జున్ ప్రశంసలు (ఫొటోలు)
-
రణ్వీర్ సింగ్ దురంధర్.. ఐకాన్ స్టార్ రివ్యూ..!
రణ్వీర్ సింగ్ దురంధర్పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. అత్యుత్తమ సాంకేతిక విలువలు, అద్భుతమైన సౌండ్ ట్రాక్తో నిర్మించారని బన్నీ కొనియాడారు. మై బ్రదర్ రణ్వీర్ సింగ్ తన టాలెంట్తో మరోసారి అభిమానులను ఊపేశారని అన్నారు. దురంధర్ మూవీని ఇప్పుడే చూశానని.. ఎక్స్ట్రార్డినరీగా అనిపించిందని బన్నీ ట్వీట్ చేశారు.బన్నీ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. 'దురంధర్ మూవీ ఇప్పుడే చూశా. అద్భుతమైన ప్రదర్శనలు, అత్యుత్తమ సాంకేతిక అంశాలు, సౌండ్ట్రాక్లతో నిర్మించిన చిత్రమిది. మై బ్రదర్ రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడు. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో మెప్పించారు. మొత్తంగా దురంధర్ టెక్నికల్ టీమ్, చిత్రబృందానికి నా ప్రత్యేక అభినందనలు. ఈ మూవీ కెప్టెన్ ఆదిత్య ధార్ అద్భుతంగా తీర్చిద్దారు. నాకు ఇది చాలా నచ్చింది. దీన్ని కూడా చూసి దురంధర్ను ఆస్వాదించండి గాయ్స్' అంటూ పోస్ట్ చేశారు.రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీని పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఇందులో రణ్వీర్ సింగ్ యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్ల దిశగా ముందుకెళ్తోంది. Just watched #Dhurandhar. A brilliantly made film filled with fine performances, the finest technical aspects, and amazing soundtracks.Magnetic presence by my brother @RanveerOfficial, he rocked the show with his versatility.Charismatic aura by #AkshayeKhanna ji, and the…— Allu Arjun (@alluarjun) December 12, 2025 -
ఐకాన్ స్టార్ను కలిసిన కోర్ట్ మూవీ టీమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కోర్ట్ మూవీ టీమ్ కలిశారు. బన్నీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రియదర్శి పులికొండ. ఐకాన్ స్టార్తో ఐకానిక్ మూమెంట్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. కోర్ట్ మూవీ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది.కోర్ట్ కథేంటంటే..కాగా.. మైనర్ బాలికల రక్షణ కోసం ఉన్న పోక్సో చట్టం బ్యాక్ డ్రాప్ స్టోరీతో కోర్ట్ మూవీ తీశారు. మంగపతిగా శివాజీ, లాయర్గా ప్రియదర్శి నటించారు. టీనేజీ ప్రేమికులుగా హర్ష రోషన్, శ్రీదేవీ ఆకట్టుకున్నారు. ఈ మూవీని హీరో నాని నిర్మించారు. రామ్ జగదీశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తీసిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శివాజీ, ప్రియదర్శితో పాటు హర్ష రోషన్-శ్రీదేవి జంట నటనకు ప్రశంసలు దక్కాయి.What an Ikonic moment…@alluarjun Anna ❤️🙏🫂#Court pic.twitter.com/eBMCtTyEsQ— Priyadarshi Pulikonda (@Preyadarshe) December 11, 2025 -
పుష్ప ఏపిక్ తో బాక్సాఫీస్ పీస్ పీస్ చేయడానికి సుకుమార్ రెడీ
-
పుష్ప 2: ది రూల్'కి ఏడాది... అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్!
-
బన్నీతో కొరటాల స్టోరీ డిస్కషన్స్?
-
పుష్ప-2 స్పెషల్ షో.. పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గతేడాది ఇదే రోజు రిలీజైన చిత్రం పుష్ప-2. ఈ మూవీ డిసెంబర్ 2, 2024న విడుదలైన బ్లాక్బస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఘనత సాధించింది. ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ కోసం రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందుకోసం బాలానగర్లో విమల్ థియేటర్లో షో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ గొడవ పడ్డారు.అయితే ఈ షో టికెట్లను ఆఫ్లైన్లో విక్రయానికి ఉంచారు. కేవలం సింగిల్ షో కావడంతో మరోసారి అభిమానులు బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్ నట విశ్వరూపం చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో టికెట్ల కోసం ఫ్యాన్స్ కొట్టుకున్నట్లు తెలుస్తోంది. కొందరికి మాత్రమే టికెట్స్ దక్కడంతో మరికొందరు ఫ్యాన్స్ గొడవకు దిగారు. కొందరు ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ ఏకంగా కర్రలతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సంధ్య థియేటర్ ఘటన..పుష్ప సంధ్య థియేటర్ ఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఈ విషాద ఘటన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన భాస్కర్ సతీమణి రేవతి (35) కన్నుమూయగా, వారి కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ అండగా నిలిచింది. ప్రస్తుతం శ్రీతేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నాుడు. Sad to see these things This has happened almost for 3rd time during the Pushpa 2 release, then Arya 2 re-release & now in Pushpa 2 re-release ..Strict ga online trolls lo matrame undandi, OFFLINE lo kaadu 🙏#1YearForIndianIHPushpa2 #Pushpa2TheRule pic.twitter.com/9ix0F9cepz— Sumanth (@SumanthOffl) December 4, 2025 -
పుష్ప-2కు ఏడాది.. అల్లు అర్జున్ ఏమన్నారంటే..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం‘పుష్ప: ది రూల్’.. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్మీడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన పుష్ప అనేక రికార్డ్లను క్రియేట్ చేసింది. కేవలం బాలీవుడ్లోనే రూ.750 కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. దీంతో బాలీవుడ్ హిస్టరీలో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. పుష్ప ప్రాంఛైజీ నుంచి వచ్చిన రెండు సినిమాలు భారీ విజయం అందుకోవడంతో అల్లు అర్జున్ ఇమేజ్ చాలా ఎత్తుకు చేరుకుంది.పుష్ప-2కు ఏడాది సందర్భంగా అల్లు అర్జున్ ఇలా అన్నారు. ' పుష్ప మా జీవితంలో మరపురాని ఐదు సంవత్సరాల ప్రయాణం. నా జీవితంలో పుష్ప చాలా ప్రత్యేకం. ప్రేక్షకులు నుంచి అపారమైన ప్రేమ, బలం, ధైర్యం ఈ సినిమాతో మాకు దక్కింది. ఈ మూవీ విజయంలో ప్రపంచవ్యాప్తంగా భాగమైన ప్రతి ఒక్కరికీ మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము. నాతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, యూనిట్ సభ్యులు, నిర్మాతలు, పంపిణీదారులు, మా కెప్టెన్ సుకుమార్తో కలిసి ఈ ప్రయాణంలో నడవడం నాకు గౌరవంగా ఉంది. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతతో నిండిన హృదయంతో అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను.PUSHPA has been an unforgettable five-year journey in our lives.This movie’s audience has given us immense love, strength, and courage to dive deeper into our craft. We will always be grateful to everyone in this country and beyond for making it a phenomenon.It has been my… pic.twitter.com/R45nH33dOR— Allu Arjun (@alluarjun) December 5, 2025 -
రెండు కోట్లు డిపాజిట్ చేశాం.. ఇంకా సాయం కావాలన్నారు: దిల్ రాజు
పుష్ప సంధ్య థియేటర్ ఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఈ విషాద ఘటన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన భాస్కర్ సతీమణి రేవతి (35) కన్నుమూయగా, వారి కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. భాస్కర్ కుటుంబానికి సాయం, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని గురించి వివరించారు. భాస్కర్, ఆయన సోదరుడితో కలిసి మాట్లాడారు.దిల్ రాజు మాట్లాడుతూ..'గతేడాది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో భాస్కర్ కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అల్లు అర్జున్ ముందుకు వచ్చి శ్రీతేజ్ పేరుపై రూ.2కోట్లు డిపాజిట్ చేశారు. ఆ డబ్బుపై వచ్చే వడ్డీతో నెలకు రూ.75వేలు భాస్కర్ కుటుంబ ఖర్చులు, శ్రీతేజ్ ఆస్పత్రి బిల్లులకు వినియోగిస్తున్నాం. మిగిలిన మొత్తాన్ని అసలులో కలిపి ఆపై వచ్చే వడ్డీని ఏటా పెంచి అందించేలా ఏర్పాటు చేశాం. ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం అల్లు అర్జున్, అల్లు అరవింద్ రూ.75 లక్షలు ఇప్పటికే చెల్లించారు. ఇంకా అదనపు సహకారం కావాలని భాస్కర్ అడుగుతున్నారు. ఈ విషయాన్ని బన్నీకి తెలిపా' అని దిల్ రాజు అన్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ మాట్లాడుతూ.. 'ఆ రోజు నుంచి ఇప్పటివరకూ అల్లు అర్జున్, బన్నివాస్ల సపోర్ట్ ఉంది. ఇంకా అదనపు సాయం కావాలని దిల్ రాజు సార్కు చెప్పా. బాబుకు ఆర్నెల్ల పాటు రిహాబిలిటేషన్ కొనసాగాల్సి ఉంది. ఇదే విషయాన్ని దిల్రాజు దృష్టికి తీసుకొచ్చాం. అందుకు అవసరమైన వైద్య ఖర్చులు గురించి కూడా చెప్పా. అల్లు అర్జున్ సార్తో మాట్లాడినందుకు దిల్ రాజుకు ధన్యవాదాలు' అని అన్నారు.Facts r facts Icon star @AlluArjun has already extended his support to Sritej, contributing a total of ₹3.20 Crores so far, including a fixed deposit of ₹1.5 Crores for the boy’s future. When Sritej’s father recently reached out again for additional financial help, #DilRaju… pic.twitter.com/0mHSu4NXCP— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 4, 2025 -
జపాన్ లోకి ఎంట్రీ ఇస్తోన్న పుష్పరాజ్
-
జపాన్కి పుష్పరాజ్
పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటిన పుష్పరాజ్ జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. హీరో అల్లు అర్జున్ టైటిల్ రోల్ (పుష్పరాజ్)లో నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా 2026 జనవరి 16న జపాన్లో విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించగా, శ్రీలీల ప్రత్యేక పాటలో సందడి చేశారు. సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతేకాదు... విడుదలైన 32 రోజుల్లోనే ‘పుష్ప 2: ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై (డిసెంబరు 4న ప్రీమియర్స్) నేటికి ఏడాది అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని విమల్ థియేటర్లో స్పెషల్ షో ఏర్పాటు చేశారు నిర్మాతలు. మరి.. వచ్చే ఏడాది జపాన్ భాషలో రిలీజ్ కానున్న ‘పుష్ప 2: ది రూల్’ ఎన్ని వసూళ్లు సాధిస్తుంది? ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
బన్నీ కోలీవుడ్ ఎంట్రీతో మార్కెట్ షేక్ అవుతుందా?
-
బన్నీ గడప ముందు బడా డైరెక్టర్లు.. చాన్స్ ఎవరికి?
పుష్ప, పుష్ప 2 చిత్రాలలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంతకు ముందు వరకు సౌత్ ఇండస్ట్రీకే పరిచయం ఉన్న బన్నీ..పుష్ప చిత్రంతో నార్త్ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా అంటే.. బాలీవుడ్ సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. బన్నీ కూడా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోనే కథలను ఎంచుకుంటున్నాడు. తన తదుపరి చిత్రాన్ని అట్లీతో ప్రకటించాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బన్నీతో సినిమా చేసేందుకు పలువురు బడా డైరెక్టర్లు లైన్లో ఉన్నారు.అందులో ముందు వరుసలో ఉన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్. పుష్ప 2 చిత్రం తర్వాత బన్నీ.. త్రివిక్రమ్తోనే సినిమా చేయాల్సి ఉంది. నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే అల్లు అర్జున్(Allu Arjun) సడెన్గా అట్లీ వైపు మొగ్గు చూపాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ అదే కథతో ఎన్టీఆర్తో సినిమా చేస్తాడనే పుకార్లు వచ్చాయి కానీ..దీనిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ ఆ కథను బన్నీతో చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నాడట. మరోవైపు యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి ప్రభాస్తో సినిమా ప్రకటించాడు. అదే సమయంలో అల్లు అర్జున్తోనూ ఓ సినిమా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం అట్లీ సినిమాతో బన్నీ.. ప్రభాస్ స్పిరిట్ చిత్రంలో సందీప్ బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీకి కాస్త టైం పట్టే అవకాశం ఉంది.అయితే త్రివిక్రమ్, సందీప్తో పాటు తాజాగా మరో దర్శకుడి పేరు కూడా బన్నీ ఖాతాలో చేరింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) కూడా అల్లు అర్జున్తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పటికే లోకేష్ కనగరాజన్ బన్నీకి కథ వినిపించాడట. వీరిద్దరి కాంబినేషన్ దాదాపు సెట్ అయినట్లేనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు ప్రశాంత్ నీల్, సంజయ్ లీలీ భన్సాలీ కూడా బన్నీ కోసం కథలను సిద్ధం చేసుకున్నారట. మరి వీరిలో బన్నీ ఎవరికి చాన్స్ ఇస్తారనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.ప్రస్తుతం బన్నీ తన ఫోకస్ అంతా అట్లీ సినిమాపైనే పెడుతున్నాడు. రూ.700 కోట్ల బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ పాత్ర మూడు కోణాల్లో సాగుతుందని సమాచారం. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంతోపాటు... విజువల్ ఎఫెక్ట్స్కి పెద్దపీట వేస్తూ ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. -
'పుష్ప' రిలీజ్.. ఏడాది వరకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదు: నిర్మాత
ప్రస్తుతం టాలీవుడ్లో పరిస్థితులు ఏం బాగోలేవు. భారీ బడ్జెట్ సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు పెట్టుబడికి వచ్చిన కలెక్షన్స్కి అస్సలు సంబంధం ఉండటం లేదు. గత కొన్నాళ్ల నుంచి అయితే హీరోల రెమ్యునరేషన్ల విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా రిలీజైన కొన్ని సినిమాలకు హీరోలు, పారితోషికం తీసుకోకుండానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్పై మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు.(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)మైత్రీ మూవీస్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. రామ్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న దృష్ట్యా.. మీడియా మీట్ నిర్వహించారు. నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలు, వాళ్ల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో నటించినందుకుగానూ రామ్ రెమ్యునరేషన్ తీసుకోలేదని, బదులుగా నైజాం, గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హకుల్ని తీసుకున్నారని తెలిపారు. మిగతా హీరోల గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురవగా ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చారు.'రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్ అయినా, ప్రభాస్ అయినా ఎప్పుడుంటే అప్పుడివ్వండనే టైపు.. 'మీకు మిగిలితేనే ఇవ్వండి లేకపోతే లేదు' అని పవన్ కల్యాణ్ అన్నారు. 'పుష్ప' రిలీజ్ అయిన ఏడాది వరకూ అల్లు అర్జున్కు పూర్తి రెమ్యూనరేషన్ మేం ఇవ్వలేదు. 'రంగస్థలం' సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ నాలుగు కోట్లు ఎంతో మేం బ్యాలెన్స్ ఉన్నాం. నాకు అవసరం అయినప్పుడు తీసుకుంటా అని, అప్పుడొక ఇరవై, అప్పుడొక పాతిక లక్షల చొప్పున రెండేళ్లు తీసుకున్నారు. మా వరకూ అందరు హీరోలూ సహకరించారు' అని నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలతో తమ బాండింగ్ గురించి వెల్లడించారు.(ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా' మొదటి రోజు కలెక్షన్ ఎంత?) -
ఏఐ వీడియో.. ప్రభాస్-అనుష్క పెళ్లి.. చిందులేసిన బన్నీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)..ఇప్పుడు ప్రపంచాన్ని కింగ్లా శాసిస్తుంది. విద్య, వైద్య.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇది ప్రవేశించింది. సాధారణ ప్రజలు కూడా వారి దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నారు. ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సాధ్యం కానిది ఏమున్నది అన్నట్లుగా తమ ఆలోచనలకు నెటిజన్లు రూపమిస్తున్నారు. తాము కోరుకున్నది నిజజీవితంలో కాకపోతే.. ఏఐ రూపంలో అది నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు విషయంలో ఈ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. తమ ఫేవరేట్ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారు..అలా ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. అంతేకాదు తమకు నచ్చిన హీరోహీరోయిన్లకు ఈ టెక్నాలజీతో పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. గతంలో ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్కి పెళ్లి జరిగి..పిల్లలు పుడితే వాళ్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఏఐ టెక్నాలజీతో వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలకు పెళ్లి జరిపించారు. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా తలో ఓ పని చేశారు.ప్రభాస్-అనుష్కల పెళ్లికి నాగార్జున-నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్, రవితేజ చిందులేశారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటలు చేయగా..గోపిచంద్ వడ్డించాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ బంతి భోజనం చేశారు. కాజల్, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్ చేస్తుండగా.. మహేశ్ బాబు, వెంకటేశ్ పంచ కట్టుతో పెళ్లికి హాజరయ్యారు. ప్రభాస్-అనుష్కల పెళ్లి ..అందరూ ఆహ్వానితులే అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇది వాస్తవం అయితే ఎంత బాగుండేదో.. అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Prabhas weds Anushka🥰అందరు ఆహ్వానితులే 🙏🏻#Prabhas #AnushkaShetty pic.twitter.com/7tsH0vVrRN— 🧚 NIMMI 💫✨🐦 (@AlwaysNirmala_) November 26, 2025 -
దుబాయి మ్యూజియంలో అల్లు స్నేహ (ఫొటోలు)
-
దుబాయిలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్
ఈ మధ్యే అల్లు అర్జున్ ఫ్యామిలీ దుబాయి ట్రిప్ వేశారు. తన కూతురు అర్హ పుట్టినరోజు వేడుకల్ని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు ఫొటోలేం బయటకు రాలేదు. ఇప్పుడు బన్నీ భార్య స్నేహ తన సోషల్ మీడియాలో ఆయా ఫొటోలని షేర్ చేశారు. తన బేబీ గర్ల్కి తొమ్మిదేళ్లు నిండాయని చెబుతూ దుబాయి ట్రిప్ ఫొటోలని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)అయితే బన్నీ ఫ్యామిలీ దుబాయిలోనే ఈ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణముంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. పలు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దుబాయిలో కొత్త షెడ్యూల్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబంతో పాటు బన్నీ.. దుబాయి వెళ్లాడు. స్నేహతో పాటు పిల్లలు అయాన్, అర్హ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. బన్నీ మాత్రం అక్కడే ఉండిపోయాడు.అల్లు అర్జున్-అట్లీ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన 'డ్యూడ్'కి సంగీతమందించింది ఇతడే. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజయ్యే అవకాశముందని అంటున్నారు. 'పుష్ప'తో పాన్ ఇండియా లెవల్లో అలరించిన బన్నీ.. ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్గా పెట్టుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: అమెజాన్ ఓటీటీపై ఘోరంగా ట్రోలింగ్.. ఏంటి విషయం?) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
చలిలో వెచ్చని టీ తాగుతున్న స్టార్ హీరోలు (ఫోటోలు)
-
అల్లు అర్హ బర్త్ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్ట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ముద్దుల కూతురి అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అర్హ పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే టూ మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు కూడా అర్హకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప -2 లాంటి బ్లాక్బస్టర్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ మూవీని భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోందని తెలిసింది. కాగా సూపర్ హీరో కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందుతోందని.. భారీగా గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉంటుందని, ఈ కారణాల వల్ల ఈ సినిమా విడుదల 2027లో ఉండొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ను అట్లీ పక్కాగా ప్లాన్ చేయడమే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027లో కాకుండా ఒక ఏడాది ముందే తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Happy birthday to my little princess #AlluArha 💖 pic.twitter.com/pRnMDIOlTe— Allu Arjun (@alluarjun) November 21, 2025 Wishing our sweetest and adorable little princess #AlluArha a very Happy Birthday! 🤩May this year bring you endless happiness and beautiful memories. ❤️#HBDAlluArha #HappyBirthdayAlluArha pic.twitter.com/ZSWgFi8Tl7— Geetha Arts (@GeethaArts) November 21, 2025 -
వచ్చే ఏడాదే రిలీజ్?
‘పుష్ప 2: ది రూల్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది. కాగా సూపర్ హీరో కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందుతోందని, భారీగా గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉంటుందని, ఈ కారణాల వల్ల ఈ సినిమా విడుదల 2027లో ఉండొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.కానీ ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉందని, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ను అట్లీ పక్కాగా ప్లాన్ చేయడమే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027లో కాకుండా ఒక ఏడాది ముందే తెరపైకి వచ్చే చాన్స్ ఉందట. షూటింగ్ జెట్ స్పీడ్తో కొనసాగుతుండటంతో 2026లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట.ఇక ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్స్ విషయానికొస్తే... డిసెంబరు – జనవరి మధ్యలో ఓ కీలక షెడ్యూల్ను అట్లీప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ పూర్తయితే ఈ మూవీ రిలీజ్పై మేకర్స్ నుంచే ఓ స్పష్టత రావచ్చని ఫిల్మ్నగర్ భోగట్టా. మే నాటికి షూటింగ్ పూర్తి చేసేసి, దసరాకు విడుదల చేయాలన్నది టీమ్ప్లాన్ అని టాక్. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. -
తెలుగు స్టార్ హీరోల పిల్లలు.. భవిష్యత్ ప్లాన్స్ ఏంటి?
ప్రస్తుత జనరేషన్ తెలుగు హీరోల్లో చాలామంది ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు తండ్రి బాధ్యతల్ని అంతే చక్కగా పూర్తి చేస్తున్నారు. తమ కొడుకు లేదా కూతురికి ఏం కావాలంటే అది చేస్తున్నారు. దీంతో హీరోల కొడుకులు హీరోలే కావాలని కాకుండా పలు రంగాల్లో తమ ప్రతిభ చూపించే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతకీ టాలీవుడ్ యంగ్ హీరోల వారసులు ఏం చేస్తున్నారు? వాళ్ల భవిష్యత్ ప్లాన్స్ ఏంటి? చిల్డ్రన్స్ డే (బాలల దినోత్సవం) సందర్భంగా మీకోసం.మహేశ్ బాబు విషయానికొస్తే కొడుకు గౌతమ్, కూతురు సితార.. ఇదివరకే తన సినిమాల్లో చాలా చిన్న పాత్రల్లో కనిపించారు. గౌతమ్కి స్పోర్ట్స్ స్టార్గా ఎదగాలని కల ఉందట. మరి అందుకు తగ్గ ప్రిపరేషన్స్లో ఉన్నాడో లేదో తెలియదు గానీ ప్రస్తుతానికైతే విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. సితార అయితే టీనేజీలోకి రాకముందు నుంచి నటి కావాలని తెగ ఇంట్రెస్ట్ చూపించింది. క్లాసికల్ డ్యాన్స్ ఇప్పటికే నేర్చుకుంది. జ్యూవెల్లరీ షాప్ యాడ్ కూడా చేసేసింది. చూస్తుంటే అటు గౌతమ్, ఇటు సితార ఇద్దరూ కూడా నటులే అయ్యేలా కనిపిస్తున్నారు.అల్లు అర్జున్ విషయానికొస్తే.. కొడుకు అయాన్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. తండ్రిలా నటుడు అవుతాడా లేదా అనేది స్తుతానికి సస్పెన్స్. కూతురు అర్హ మాత్రం కచ్చితంగా హీరోయిన్ అవుతుంది. గతంలోనే సమంత 'శాకుంతలం'లో బాలనటిగా చేసింది. చూస్తుంటే పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ కావడం గ్యారంటీ అనిపిస్తుంది.ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్.. తండ్రిలా హీరో కావాలని అనుకోవట్లేదట. దర్శకుడిగా మారాలనే ఆలోచనలో ఉన్నాడట. రవితేజ కొడుకు మహాధన్.. గతంలో 'రాజా ది గ్రేట్' చిత్రంలో తండ్రి చిన్నప్పటి పాత్రలో బాలనటుడిగా చేశాడు. కానీ ఇతడి మనసులో మాత్రం దర్శకత్వం ఆలోచనే ఉందట. ప్రస్తుతం వెంకీ అట్లూరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు మోక్షద అయితే అటు నటన ఇటు దర్శకత్వం లాంటివి కాకుండా నిర్మాత అయ్యే ఆలోచనలో ఉందట. ఆల్రెడీ అదే పనిలో ఉందని కూడా తెలుస్తోంది.నాని కొడుకు అర్జున్.. ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. పియానో ప్లే చేస్తున్న వీడియోని నాని భార్య అంజన.. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. మరి సంగీతం వైపు వస్తాడా లేదంటే తండ్రిలా యాక్టర్ అవుతానని అంటాడా అనేది తెలియాలంటే ఇంకొన్నేళ్లు ఆగాలి. మంచు విష్ణు వారసులు ఇప్పటికే స్క్రీన్ పై కనిపించేశారు. కుమార్తెలు అరియానా, వివియానా.. కొడుకు అవ్రామ్.. 'కన్నప్ప' మూవీలో యాక్ట్ చేశారు. చూస్తుంటే విష్ణు తర్వాత తరాన్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడనమాట.తెలుగు దర్శకుల్లో సుకుమార్ కూతురు సుకృతి.. ఇప్పటికే 'గాంధీ తాత చెట్టు' మూవీలో నటించింది. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. కానీ ఈమెకు మాత్రం మ్యూజిక్ టీచర్ కావాలని ఉందట. డైరెక్టర్ త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి మనోజ్.. ఇప్పటికే దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. ప్రభాస్ 'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాడట.వీళ్లందరినీ చూస్తుంటే రాబోయే తరంలోనూ నటీనటులతో పాటు మ్యూజిక్ వైపు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి వీళ్లలో ఎవరెవరు ఏమేమవుతారనేది రాబోయే కొన్నేళ్లలో కాలమే నిర్ణయిస్తుంది. -
ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందించిన అల్లు అర్జున్
ఢిల్లీ పేలుడు ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ విషాద సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలో బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేశారు. మళ్లీ ఎప్పటిలాగే శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాని ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. కాగా..ఈ కారు పేలుడు ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది.కాగా.. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప-2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న వస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. Deeply saddened by the tragic incident near Delhi's Red Fort. My heartfelt prayers are with the victims and their families, and I wish for peace to prevail once again. 🙏🏼 🇮🇳— Allu Arjun (@alluarjun) November 11, 2025 -
సినిమాల వరదలో పుష్పరాజ్..! రాజమౌళి - బన్నీ కాంబినేషన్ పక్కా అవుతుందా?
-
నా అభిమానులకు అంకితమిస్తున్నా.. ఐకాన్ స్టార్ ట్వీట్
ప్రతిష్టాత్మక అవార్డ్ను తన అభిమానులకు అంకితమిస్తున్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాంటి అరుదైన గౌరవమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది అవార్డులు పొందిన వారికి హృదయపూర్వక అభినందనలు చెబుతూ ఐకాన్ స్టార్ ట్వీట్ చేశారు. 2024 ఏడాదిగానూ ప్రకటించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను తాజాగా ప్రకటించారు.ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. అంతేకాకుండా పుష్ప-2 మూవీకి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ అవార్డ్స్లో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా సత్తా చాటింది. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ -2025లో ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. గతేడాది విడుదలై ప్రేక్షకుల్ని భయంతో పరుగులు పెట్టించిన శ్రద్దాకపూర్ మూవీ స్త్రీ- 2 ఉత్తమ చిత్రంగా అవార్డును దక్కించుకుంది.దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో ఉత్తమ నటీనటులుగా కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ నిలిచారు. చందు ఛాంపియన్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా కబీర్ ఖాన్, ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్గా దినేశ్ విజన్ అవార్డులు సొంతం చేసుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా లాపత్తా లేడీస్, ఉత్తమ నటీనటులుగా విక్రాంత్ మాస్సే, నితాన్షీ గోయెల్ అవార్డులు దక్కించుకున్నారు. ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్గా ఏఆర్ రెహమాన్ నిలిచారు. Thanks to the Dadasaheb Phalke International Film Awards for the incredible honour. Truly humbled. @Dpiff_official My warm congratulations to all the winners across categories this year.A sincere thank you to my audience for your continued love and support… I humbly dedicate…— Allu Arjun (@alluarjun) November 2, 2025 -
అల్లు అర్జున్-అట్లీ కాంబో.. ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్!
పుష్ప -2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కొన్ని నెలలుగా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అంతే కాకుండా మరో ముగ్గురు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని టాక్ నడిచింది.ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్లో సీతారామం బ్యూటీ హీరోయిన్గా కన్ఫామ్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మృణాల్ షూట్లో కూడా పాల్గొన్నారని లేటేస్ట్ అప్డేట్. అంతేకాకుండా అల్లు అర్జున్తో కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబోలో మృణాల్ ఎంట్రీలో మూవీపై మరింత బజ్ ఏర్పడింది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను AA22xA6 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ సైతం నటిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ను టార్గెట్ చేస్తూ మరికొందరిని హాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.Buzz is that actress Mrunal Thakur has joined Allu Arjun in Atlee’s upcoming sci-fi action spectacle “AA22xA6”. Backed by Sun Pictures, the film is said to be a high-octane futuristic thriller packed with massive action sequences, time-travel elements, and cutting-edge VFX. The… pic.twitter.com/xqnzdR7DlJ— SIIMA (@siima) October 28, 2025 -
AA22 Movie: ఒకే సినిమాలో నాలుగు హీరోయిన్లు
-
కాంతార1 పై బన్నీ ప్రశంసలు..!
-
అల్లు అర్జున్ స్పెషల్ వీడియో.. రెండు లారీల థాంక్స్ చెప్పిన నాగ్
తెలుగు ఇండస్ట్రీలో కొత్త శకానికి నాంది పలికిన సినిమా శివ (Shiva Movie). రాంగోపాల్వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) హీరోగా నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమా నవంబర్ 14న రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో విడుదల చేశాడు. మన శివ మూవీ రిలీజ్ అయి దాదాపు 36 ఏళ్లవుతోంది. తెలుగు సినీ చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనూ ఇదొక ఐకానిక్ సినిమాగా నిలిచింది.రెండు లారీల పేపర్స్ఈ క్లాసిక్ సినిమాను సెలబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది. ఈసారి థియేటర్స్కు రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండి అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను నాగార్జున షేర్ చేస్తూ.. డియర్ అల్లు అర్జున్ (Allu Arjun), నీకు రెండు లారీల థాంక్స్ అని ట్వీట్ చేశాడు. కాగా శివ సినిమాలో అమల హీరోయిన్గా నటించింది. 1989 అక్టోబర్ 5న రిలీజైన ఈ సినిమాకు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మాతలుగా వ్యవహరించగా ఇళయరాజా సంగీతం అందించారు. ఇది తెలుగులో సెన్సేషన్ హిట్ అవడంతో శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు ఆర్జీవీ. Dear @alluarjun rendu lorryla thanks to you !!!💥💥💥#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025చదవండి: సౌత్ సినిమాలు ఇప్పటికైనా చూస్తున్నారు: ప్రియమణి -
పూజా హెగ్డేకు రూ. 5 కోట్లా..?
సక్సెస్ వల్ల ఇమెజ్ వస్తుంది. ఆ ఇమేజ్ను వాడుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు తెరపైకి వచ్చే మొదటి విషయం పారితోషకం. సాధారణంగా ఇప్పుడు హీరోయిన్ల పారితోషకం రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకూ ఉంటోంది. అది వారి ఇమేజ్ను బట్టి పెరగొచ్చు, తగ్గొచ్చు. అయితే క్రేజ్ ఉన్న హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటించడానికి పారితోషికాన్ని కాస్త ఎక్కువగానే డిమాండ్ చేస్తుంటారు. చాలా మంది హీరోయిన్లు ప్రత్యేక పాటలో నటిస్తూ పారితోషకాన్ని అధిక మొత్తంలో పుచ్చుకుంటున్నారు. ఇందుకు పూజా హెగ్డే అతీతం కాదు. ఈ అమ్మడు ఇంతకుముందు తెలుగులో రంగస్థలం చిత్రంలో జిల్జిల్జిగేలు రాజా అనే ఐటమ్ సాంగ్లో నటించి బాగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత కూలీ చిత్రంలో మోనికా పాటలో నటించి అందరిని అలరించారు. తాజాగా మరో భారీ చిత్రంలో ప్రత్యేక పాటలో చిందేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే 5, 6 మంది హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో దీపికా పడుకొనే, జాన్వీకపూర్, మృణాల్ఠాకూర్, రష్మిక మందన్నా వంటి స్టార్ హీరోయిన్ల పేరు చోటు చేసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో పూజాహెగ్డేను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. 5నిమిషాలపాటు సాగే ఈ పాటలో నటించడానికి ఈ అమ్మడు రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ మధ్య అవకాశాలు లేని ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. -
నాగార్జున 'శివ' రీ రిలీజ్.. బన్నీ పోస్టర్ రిలీజ్..!
అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ బ్లాక్బస్టర్ మూవీ 'శివ'. ఈ మూవీ నాగ్ కెరీర్లోనే చాలా ప్రత్యేకం. ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో రామ్గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజైంది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్గానూ నిలిచింది. ఈ సినిమాని శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు.ఈ సినిమా 4కె వర్షన్, డాల్బీ అట్మాస్లో ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. తెలుగులో మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. టాలీవుడ్ సినిమా శివ మూవీ తెచ్చిన మార్పు గురించి ప్రస్తావించనున్నారు. ఈ శుక్రవారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మాట్లాడనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. దీంతో బన్నీ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివ మూవీ గురించి ఏం మాట్లాతారనే విషయంపై అభిమానులతో పాటు అందరిలోనూ ఆతృత నెలకొంది. కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. కాగా.. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్ని సృష్టించారు వర్మ. ICON STAR of Indian Cinema 🔥🔥🔥× ICONIC FILM of Indian Cinema ❤️🔥❤️🔥❤️🔥Watch India's Favourite Star, @alluarjun talks about the Impact of SHIVA, Tomorrow at 11:07 AM💥💥💥#SHIVA4K with Dolby Atmos Grand Re-Release in theatres on NOVEMBER 14TH, 2025. #50YearsOfAnnapurna… pic.twitter.com/b2sB6nLIk5— Annapurna Studios (@AnnapurnaStdios) October 24, 2025 -
అల్లు అర్జున్ కోసం పూజ హెగ్దే సాహసం
-
‘కాంతార’పై ఆలస్యంగా స్పందించిన అల్లు అర్జున్..కారణం?
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన కాంతార: చాప్టర్ 1(Kantara: Chapter 1) సినిమా ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 818 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ ఇప్పటికే రూ. 110 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. సినిమా అదిరిపోయిందని సోషల్ మీడియా వేదికగా రిషబ్పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా కాంతార: చాప్టర్పై ప్రశంసలు జల్లు కురిపించారు. ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని ట్వీట్ చేశాడురిషబ్..వన్మ్యాన్ షో‘నిన్న రాత్రి కాంతార చాప్టర్ 1 సినిమా చూశాను. వావ్..ఎంత అద్భుతమైన సినిమా. ఈ మూవీ చూస్తూ నేను ట్రాన్స్లోకి వెళ్లిపోయా. రచయితగా, డైరెక్టర్గా, యాక్టర్గా రిషబ్ శెట్టి వన్మ్యాన్ షో అని చెప్పాలి. ప్రతి క్రాప్ట్లో ఆయన రాణించారు. రుక్మిణి, జయరామ్, గుల్షన్ దేవయ్యతో పాటు మిగతా నటీనటులంతా చక్కగా నటించారు. టెక్నికల్ టీమ్ పనితీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అజనీష్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి ఆర్ట్ డైరెక్టన్, అరుణ్ రాజ్ స్టంట్స్ చాలా బాగున్నాయి. నిర్మాత విజయ్ కిరంగదూర్, హోంబులే బ్యానర్కి శుభాకాంక్షలు’ అని బన్నీ తన ఎక్స్లో రాసుకొచ్చాడు.లేట్ ఎందుకు?కాంతార సినిమా అక్టోబర్ 2న విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన వారం రోజులలోపే సినీ ప్రముఖులంతా ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా లేట్గా స్పందించాడు. సూపర్ హిట్ టాక్ వచ్చిన ఓ సినిమాను ఇంత ఆలస్యంగా చూడడానికి గల కారణం ఏంటని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అసలు విషయం ఏంటి అంటే..బన్నీ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ముంబైలో ఓ భారీ సెట్ కూడా వేశారు. అందులోనూ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్తో బిజీగా ఉండడం వల్లే అల్లు అర్జున్ కాంతార సినిమాను చూడలేకపోయాడు అట. ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకడంతో సినిమా చూసి..వెంటనే సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.Watched #Kantara last night. Wow, what a mind-blowing film. I was in a trance watching it.Kudos to @shetty_rishab garu for a one-man show as writer, director, and actor. He excelled in every craft.Aesthetic performances by @rukminitweets garu, #Jayaram garu, @gulshandevaiah… pic.twitter.com/qneOccCjvd— Allu Arjun (@alluarjun) October 24, 2025 -
స్టార్ హీరోల సినిమా.. హీరోయిన్స్ వీళ్లేనా?
‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా... నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా’.. ఈ పాట మహేశ్బాబు హీరోగా చేసిన బ్లాక్బస్టర్ మూవీ ‘మురారి’ లోనిదని ప్రత్యేకించి చెపక్కర్లేదు. ఇప్పుడు ఈ పాటను సరదాగా కొందరు తెలుగు హీరోలు పాడుకుంటున్నారట... ఎందుకంటే ఈ హీరోలు కమిట్ అయిన తాజా చిత్రాల్లో ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. అయితే ఫలానా హీరో సరసన ఫలానా హీరోయిన్ నటించనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరి... ఈ కొత్త ఊహా తారల కహానీ ఏంటో మీరూ ఓ లుక్ వేయండి. గ్యాంగ్స్టర్ డ్రామాలో... చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. కాగా, ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) తెరకెక్కించనున్న గ్యాంగ్స్టర్ డ్రామాలో చిరంజీవి హీరోగా నటిస్తారు. కేవీన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్హిట్ తర్వాత చిరంజీవి, బాబీల కాంబినేషన్లో రూపొందనున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ వర్క్స్లో భాగంగానే దర్శకుడు బాబీ ఈ చిత్రంలోని ఇతర నటీనటుల ఎంపికపై కూడా దృష్టి పెట్టారని తెలిసింది. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్కు చాన్స్ ఉందట. ఈ హీరోయిన్స్ రోల్స్కు మాళవికా మోహనన్, రాశీ ఖన్నాలను సంప్రదించారట బాబీ. అలాగే ఈ మూవీలో ఓ పవర్ఫుల్ రోల్ కూడా ఉందని, ఈ పాత్ర కోసం చిత్రయూనిట్ మోహన్లాల్ వంటి యాక్టర్స్తో చర్చలు జరుపుతోందనే టాక్ తెరపైకి వచ్చింది. మరి... చిరంజీవి సినిమాలో మాళవికా మోహనన్, రాశీ ఖన్నా భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. జోడీ రిపీట్ నాగార్జున కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్). నాగార్జున కెరీర్లో ఇది వందో సినిమా. తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్కు చాన్స్ ఉందట. ఇప్పటికే అనుష్కా శెట్టి, టబు భాగమయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది. 2005లో వచ్చిన ‘సూపర్’ సినిమా కోసం నాగార్జున, అనుష్క తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ‘డాన్’, ‘రగడ’, ‘ఢమరుకం’ చిత్రాల్లో నటించారు. అలాగే ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నాగార్జున, అనుష్కా శెట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇంకా నాగార్జున ‘కింగ్, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాల్లో అనుష్క అతిథిగా నటించారు. మరి... ‘కింగ్ 100’లో కూడా అనుష్కా శెట్టి భాగం అవుతారా? అయితే హీరోయిన్గా నటిస్తారా? లేక ఏదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తారా? అనే అంశాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ‘నిన్నే పెళ్లాడతా.., ఆవిడా మా ఆవిడే!’ వంటి సినిమాల్లో నాగార్జున – టబు హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ‘కింగ్ 100’ సినిమాలో టబు కూడా కనిపిస్తారా? ఈ జోడీలు రిపీట్ అవుతాయా? వేచి చూడాలి. ఇక ‘కింగ్ 100’ సినిమా పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కబురు వెళ్లిందా? ‘రంగస్థలం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో రామ్చరణ్(Ram Charan), దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చి ఏడాదిన్నర పైనే అవుతున్నా ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. రామ్చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతనే సుకుమార్తో చేయాల్సిన మూవీని సెట్స్కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట రామ్చరణ్. ఈలోపు ఈ సినిమా స్క్రిప్ట్కు సంబంధించిన పనులపై దర్శకుడు సుకుమార్ మరింత ఫోకస్ పెట్టారట. అలాగే ఇందులోని నటీనటుల ఎంపిక గురించి కూడా సుకుమార్ ఆలోచిస్తున్నారట. ఆల్రెడీ సమంత, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో మహేశ్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో కృతీ సనన్ హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి... రామ్చరణ్తో సుకుమార్ చేయబోయే సినిమా గురించిన కబురు కృతీ సనన్కు వెళ్లిందా? ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అంతర్జాతీయ స్థాయిలో... అల్లు అర్జున్( Allu Arjun) హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్కు చాన్స్ ఉందట. ఆల్రెడీ దీపికా పదుకోన్ ఈ చిత్రంలో భాగమయ్యారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే కూడా ఈ చిత్రంలో హీరోయిన్స్గా నటిస్తారనే ప్రచారం టాలీవుడ్లో తెరపైకి వచ్చింది. అయితే ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. ఇక మిగతా హీరోయిన్స్ ఎంపికలపై కూడా త్వరలోనే ఓ ప్రకటన రానుందని ఫిల్మ్నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. అంతర్జాతీయ స్థాయిలో 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని, ఈ దిశగా అల్లు అర్జున్, అట్లీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. జూలియట్ ఎవరో! ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణతో ప్రస్తుతం నాని బిజీగా ఉన్నారు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అయితే నాని హీరోగా సుజిత్ డైరెక్షన్లోని సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సుజిత్తో చేసే చిత్రం షూటింగ్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట నాని. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ను అనుకుంటున్నారని, ఇదో గ్యాంగ్స్టర్ సినిమా అనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత ప్రియాంకా అరుళ్ మోహన్ పేరు వినిపించింది. నాని – ప్రియాంక ‘నానీస్ గ్యాంగ్లీడర్, సరిపోదా శనివారం’ చిత్రాల్లో జోడీగా నటించారు. కానీ ‘బ్లడీ రోమియో’ సినిమాలోని హీరోయిన్గా పూజా హెగ్డే కనిపిస్తారనే ప్రచారం లేటెస్ట్గా ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఫైనల్గా ఈ ‘బ్లడీ రోమియో’ సరసన జూలియట్గా ఎవరు కనిపిస్తారనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. 2026 చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి... ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి రిపీట్ కానుందని ఫిల్మ్నగర్ సమాచారం. ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. రాయలసీమ నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోనే విజయ్–రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మరి... విజయ్–రష్మిక మందన్నాల జోడీ మళ్లీ స్క్రీన్పై మ్యాజిక్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దేవి సరసన.... సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా రానుందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘బలగం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ అనే ఓ రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తారంటూ నాని, నితిన్, శర్వానంద్ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్గా ఈ చాన్స్ దేవిశ్రీ ప్రసాద్కు లభించిందని, కథ నచ్చడంతో దేవిశ్రీ కూడా ‘ఎల్లమ్మ’ సినిమా చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో దేవి సరసన హీరోయిన్గా కీర్తీ సురేష్ దాదాపు ఖరారు అయ్యారని, త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. డబుల్ ఎంట్రీ సూపర్స్టార్ మహేశ్బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా కెరీర్ను స్టార్ట్ చేయనున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్. ఈ సినిమాలో రవీనా టాండన్ కుమార్తె రాషా టాండన్ హీరోయిన్గా నటిస్తారని, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ కూడా జరిగిందట. ఈ యూత్ఫుల్ లవ్స్టోరీ సినిమాను వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్నాయని ఫిల్మ్నగర్ భోగట్టా. ఇక జయకృష్ణకు యాక్టర్గా ఇది తొలి చిత్రం అయితే, రాషాకు తెలుగులో ఇది తొలి మూవీ అవుతుంది. అయితే ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఇలా హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కావాల్సిన మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
పూజా హెగ్దే కోసం ట్రై చేస్తున్న బన్నీ.. దానికోసమేనా..?
-
అందుకే అల్లు అర్జున్ టాప్లో ఉన్నాడు.. నిర్మాత ఎస్కేఎన్ కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై ప్రశంసలు కురిపించారు. కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ బ్లాక్బస్టర్ మీట్లో పాల్గొన్న ఎస్కేఎన్ బన్నీని కొనియాడారు. ఈ రోజు అల్లు అర్జున్ ఈ స్థానంలో ఉన్నారంటే అదొక్కటే కారణమన్నారు.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసు గుర్రం సినిమా గురించి నిర్మాత ఎస్కేఎన్ ఈవెంట్లో ప్రస్తావించారు. ఈ చిత్రంలో బ్రహ్మనందం చివరి పది నుంచి పదిహేను నిమిషాల్లో ఎక్కువగా డామినేట్ చేశారని అన్నారు. కానీ ఆయన ఫుల్ డామినేట్ చేశారని ఆ రోజు అల్లు అర్జున్ ఫీలవ్వలేదని చెప్పారు. ఆ సినిమాకు ఏది వర్కవుట్ అవుతుందో అది మాత్రమే చూశాడు బన్నీ. అందుకే ఈ రోజు బన్నీ టాప్ పొజిషన్లో ఉన్నారని నిర్మాత ఎస్కేఎన్ ప్రశంసలతో ముంచెత్తారు. కాగా.. యంగ్ హీరో కిరణ్ బ్బవరం నటించిన కె ర్యాంప్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అప్పుడు #AlluArjun.. ఇప్పుడు #KiranAbbavaram.. - Producer #SKN #RaceGurram #KRamp #TeluguFilmNagar pic.twitter.com/8UNlnpdY0x— Telugu FilmNagar (@telugufilmnagar) October 21, 2025 -
ఫారిన్లో అల్లు స్నేహా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
బన్నీ, అట్లీ మూవీలో సమంత.. మళ్ళీ ఊ అంటావా అననుందా..?
-
బర్త్ డే నైట్ మేమిద్దరం మాత్రమే.. అల్లు స్నేహా పోస్ట్ వైరల్
'పుష్ప 2' సినిమాతో ఇతర దేశాల్లోనూ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా ముంబైలో షూటింగ్ జరుగుతోంది. అయితే కొన్నిరోజుల క్రితం బ్రేక్ తీసుకున్న బన్నీ.. భార్య స్నేహాతో కలిసి ఫారిన్ ట్రిప్ వేశాడు. అక్కడ స్నేహా పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోల్ని ఇప్పుడు ఈమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి) సెప్టెంబరు 29న స్నేహా పుట్టినరోజు. ఈ క్రమంలోనే ఈమె తన భర్త అల్లు అర్జున్తో కలిసి ఆమ్స్టర్ డామ్ దేశానికి వెళ్లిపోయింది. అక్కడే బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఆ దేశంలో తిరుగుతున్న కొన్ని ఫొటోలని స్నేహా పోస్ట్ చేసింది. ఇప్పుడు పుట్టినరోజుని బన్నీ, తాను మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి కొన్ని ఫొటోలని షేర్ చేసింది. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే) -
అల్లు అర్జున్ గొప్పోడయ్యాడు.. దేశంలోనే..: సాయిదుర్గ తేజ్
అల్లు అర్జున్ (Allu Arjun) గారు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అంటున్నాడు మెగా హీరో సాయిదుర్గతేజ్ (Sai Durga Tej). ఆయన్ను చూస్తే చాలా గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తాజాగా సాయిదుర్గ తేజ్ హైదరాబాద్లో.. ఫాస్ట్ అండ్ క్యూరియస్ ది జెన్ జెడ్ ఆటో ఎక్స్పోను ప్రారంభించాడు. ఈ ఈవెంట్లో విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఒకరు అల్లు అర్జున్ గురించి ప్రశ్న అడిగారు.పాన్ ఇండియా స్టార్అందుకు సాయి దుర్గతేజ్ స్పందిస్తూ అల్లు అర్జున్ గారు అని సంబోధించాడు. అల్లు అర్జున్గారి గురించి ఏం చెప్పాలండి? ఆయన సూపర్గా యాక్ట్ చేస్తారు. దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిపోయారు. చాలా గొప్పోళ్లు అయిపోయారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎంతో గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.సినిమాసినిమాల విషయానికి వస్తే.. సాయిదుర్గతేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్లో రిలీజవ్వాల్సిన మూవీని పలు కారణాలతో వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.చదవండి: గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు -
అట్లీతో సినిమా.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) తివిక్రమ్తో సినిమా చేయాల్సింది. కానీ అనూహ్యంగా అట్లీతో సినిమా(AA22)ను ప్రకటించి షాకిచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇంత త్వరగా సెట్స్పై వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. పనులన్నీ చకచక పూర్తి చేసి..షూటింగ్ని ప్రారంభించారు. తాజాగా ఈ మూవీకి సంబంధిచి ఓ క్రేజీ రూమర్ నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రానికిగానూ అల్లు అర్జున్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడట.తగ్గేదేలే.. మొన్నటి వరకు తెలుగు నుంచి ప్రభాస్(Prabhas) ఒక్కడే ఇండియన్ బాక్సాఫీస్ని శాసించాడు. ఇప్పుడు ఆ లిస్ట్లో బన్నీ కూడా చేరిపోయాడు. ఆయన నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డును సృష్టించింది. ఈ చిత్రం తర్వాత బన్నీ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న చిత్రానికి అత్యధికంగా రూ. 180 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఒక్కడే రూ. 120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఇప్పుడు ఆ విషయంలో ప్రభాస్ని దాటేశాడు బన్నీ. మార్కెట్లో తనకున్న డిమాండ్ దృష్ట్యా.. నిర్మాతలు కూడా అంత పెద్దమొత్తంలో ఇవ్వడానికి ఒకే చెప్పేశారట. చిత్ర దర్శకుడు అట్లీ, హీరోయిన్ దీపికా పదుకొణెలు కూడా ఎక్కువగానే చార్జ్ చేస్తున్నారట.కొత్త ప్రపంచంఇప్పుడు బన్నీ నుంచి ఒక సినిమా వస్తుందంటే అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయం. ఆ అంచనాలను మించేలా అట్లీ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఇందుకుగాను అట్లీ ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నాడట. అది ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని చెబుతున్నాడు. రూ. 700 కోట్ల బడ్జెట్తో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్ కోసమే రూ. 250 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే.. విజువల్స్ పరంగా సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్కు కూడా పరిచయం చేసేందుకు ప్రముఖ మార్కెటింగ్ సంస్థతో భాగస్వామ్యం అయింది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.


