breaking news
Allu Arjun
-
అమ్మ బర్త్ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్ట్!
గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీతో జతకట్టారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో రానున్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కనిపించనుంది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.అయితే తాజాగా ఇవాళ తన తల్లి బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ స్పెషల్ ఫోటోను పంచుకున్నారు. అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫోటోను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మామ్ అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం నిర్మలమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.అవార్డుల అల్లు అర్జున్..పుష్ప-2 సినిమాకు గానూ 'అల్లు అర్జున్' ఉత్తమ నటుడిగా 'గద్దర్' అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని చరిత్ర పుటల్లోకి అల్లు అర్జున్ పేరు చేరింది. అదే విధంగా 69వ జాతీయ అవార్డుల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటింది. అక్కడ కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప) నిలిచారు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. కాగా.. బన్నీ ఇప్పటి వరకు నటించిన సినిమాలు 21.. అయితే ఉత్తమ నటుడిగా 11సార్లు నామినేట్ అయ్యాడు. ఏడు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా అత్యుత్తమ అవార్డ్స్ అందుకున్నాడు. మొత్తంగా దేశంలో పేరు పొందిన 18 అవార్డ్స్ను ఆయన సొంతం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
బన్నీ AA22 సీక్రెట్ రివీల్ చేసిన అట్లీ..
-
TRP Rating: ఇప్పటికి రికార్డులు కొడుతున్న పుష్ప-2
-
'పుష్ప 2'.. హిందీలో మరో సంచలనం
'పుష్ప 2' సినిమా పేరు చెప్పగానే రికార్డులే గుర్తొస్తాయి. ఎందుకంటే థియేటర్లలో రిలీజై ఏకంగా రూ.1800 కోట్ల మేర వసూళ్లు సాధించి హయ్యస్ట్ గ్రాసర్ మూవీస్లో ఒకటిగా నిలవగా.. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా కొన్ని వారాల పాటు టాప్ ట్రెండింగ్లో కొనసాగింది. ఇప్పటికీ పలు షోలు, ప్రోగ్రామ్స్లోనూ పుష్పరాజ్ పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్లో మరో సంచలనానికి ఈ మూవీ కారణమైంది.తొలుత థియేటర్లలో, తర్వాత ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న పుష్ప 2.. ఇప్పుడు బుల్లితెరపై కూడా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా హిందీ వెర్షన్ ఇటీవలే టీవీలో టెలికాస్ట్ చేయగా.. ఏకంగా దేశవ్యాప్తంగా 5.1 టీఆర్పీ వచ్చిందట. ఇది ఐపీఎల్ యావరేజ్ టీఆర్పీ కంటే ఎక్కువ కావడం విశేషం. థియేటర్లతో పాటు టీవీల్లోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న 'స్త్రీ-2' సహా చాలా హిందీ చిత్రాల్ని టీఆర్పీ విషయంలో 'పుష్ప-2' దాటేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: 19 ఏళ్ల హీరోయిన్ అనంతిక.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?)అలానే 5.4 కోట్ల హిందీ జనాలు ఈ సినిమాని చూసినట్లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే కాదు జూన్ 29న అంటే ఆదివారం రీలోడెడ్ హిందీ వెర్షన్ని టీవీలో ప్రసారం చేయనున్నారు. ఈసారి ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో కాకపోయినా సరే కొన్నాళ్ల తర్వాత అయినా సరే 'పుష్ప 3' తీయడం గ్యారంటీ. ఎందుకంటే పుష్ప అంటే సినిమా పేరు కాదు. నార్త్లో అదో బ్రాండ్ అయిపోయింది.బన్నీ విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదివరకే దీపికా పదుకొణెని హీరోయిన్గా ప్రకటించగా మృణాల్, జాన్వీ కపూర్ కూడా ఈ మూవీలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం ఓ చోట మాట్లాడిన డైరెక్టర్ అట్లీ.. దేశంలోనే ఇది ఖరీదైన చిత్రమని చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీతో అల్లు అర్జున్ ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం') -
హీరోలో విలన్
విలన్గా కెరీర్ను ఆరంభించి, ఆ తర్వాత హీరోలైన నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలానే హీరోగా కెరీర్ను ఆరంభించి, ఆ తర్వాత విలన్గా చేస్తున్న జాబితా కూడా పెద్దదిగానే ఉంది. కానీ ఒకవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు విలన్గా చేస్తున్నారు కొందరు తెలుగు హీరోలు. విలన్స్గానూ తమ సత్తా ఏంటో ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారు. ఓసారి ఆ హీరోల్లో ఉన్న విలన్పై ఓ లుక్ వేద్దాం...రజనీకాంత్తో ఢీ: రొమాంటిక్ స్టార్ హీరో నాగార్జున విలన్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది? అనేది ‘కూలీ’ సినిమాలో చూడొచ్చు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’లో నాగార్జున ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమాలో సైమన్ రోల్లో కనిపిస్తారు నాగార్జున. కాగా ‘కూలీ’ చిత్రీకరణప్రారంభమైనప్పుడు ఓ వ్యక్తిని నాగార్జున కిరాతకంగా చంపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో లీకైంది.ఆ వీడియో బయటకు వచ్చినప్పుడే ఈ సినిమాలో నాగార్జున విలన్గా కనిపిస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. ఇక ఈ చిత్రంలో ఉపేంద్ర, శ్రుతీహాసన్, సత్యరాజ్, షౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు చేశారు. అలాగే ఓ స్పెషల్ సాంగ్లో పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులేశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. వెండితెర బ్రహ్మ రాక్షస: యాక్షన్ చిత్రాల్లో విలన్లను చితక్కొడుతుంటారు ప్రభాస్. ఆరడుగుల ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్లు చేస్తుంటే, థియేటర్స్లో విజిల్స్ పడాల్సిందే. కానీ ఇప్పుడు తనలోని విలన్ యాంగిల్ని కూడా చూపించాలనుకుంటున్నారట ప్రభాస్. ఇందులో భాగంగానే ప్రభాస్ ‘బ్రహ్మ రాక్షస’ అనే సినిమా చేయనున్నారని, ‘హను–మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించనుందట. కానీ... ప్రభాస్ ప్రస్తుత కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా సెట్స్కు వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉంది.ఎన్టీఆర్ వార్: ఏ తరహా పాత్రనైనా అవలీలగా చేసేస్తారు ఎన్టీఆర్. ‘జై లవకుశ, టెంపర్’ చిత్రాల్లో హీరోగా కనిపించడంతో పాటు నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లోనూ ప్రేక్షకులను మెప్పించారు. మరోసారి ఈ తరహా పాత్రను ‘వార్ 2’ చిత్రంలో ఎన్టీఆర్ చేసినట్లుగా తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన లేటెస్ట్ స్పై యాక్షన్ మూవీ ‘వార్ 2’.ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్ రోల్స్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రానిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపిస్తారని, ఆ పాత్ర పేరు వీరేంద్రనాథ్ అని బాలీవుడ్ టాక్. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లీడ్ యాక్టర్స్గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘వార్’ (2019)కు సీక్వెల్గా ‘వార్ 2’ రానుంది.హీరో... విలన్ ఒక్కరే!: అల్లు అర్జున్ ‘ఆర్య 2’ సినిమా చూశారుగా! ఆ చిత్రంలో హీరోగా నటించిన అల్లు అర్జున్ పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి పూర్తి స్థాయిలో ఓ నెగటివ్ రోల్లో అల్లు అర్జున్ కనిపించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ మూడింటిలో ఒకటి విలన్ రోల్ అని, ఇప్పటివరకు అల్లు అర్జున్ను సిల్వర్ స్క్రీన్పై చూడని విధంగా ఆయన ఈ పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముంబైలోప్రారంభమైందని తెలిసింది. అల్లు అర్జున్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ ఇతర ప్రధాన హీరోయిన్ పాత్రల్లో నటిస్తారనే ప్రచారం సాగుతోంది.బ్లాక్ స్వార్డ్: నటుడిగా కొంత గ్యాప్ తీసుకుని, ఇటీవల ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మంచు మనోజ్. ఈ చిత్రంలో మనోజ్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. మరోసారి మంచు మనోజ్ విలన్గా కనిపించనున్నారు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ పేరుతో విలన్ పాత్ర చేస్తున్నారు మంచు మనోజ్. ఇటీవల విడుదలైన ‘మిరాయ్’ టీజర్ మనోజ్ది విలన్ పాత్ర అని స్పష్టం చేసింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న రిలీజ్ కానుంది. మండాడిలో విలన్: తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మండాడి’. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్గా మహిమా నంబియార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూర్తి స్థాయి విలన్ పాత్రను సుహాస్ చేస్తున్నారు. ఇక అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’ చిత్రంలోనూ సుహాస్ విలన్గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. వీరే కాదు... రానా, సందీప్ కిషన్, నవీన్ చంద్ర, ఆది పినిశెట్టి, కార్తికేయ, వరుణ్ సందేశ్ వంటి వారు ఒకవైపు హీరో పాత్రలు చేస్తూనే, కథ కుదిరినప్పుడు విలన్ పాత్రలూ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
'అల్లు అర్జున్' అందుకున్న అత్యుత్తమ అవార్డ్స్ ఇవే
పుష్ప–2 సినిమాతో 'అల్లు అర్జున్' ఉత్తమ నటుడిగా 'గద్దర్' అవార్డు అందుకున్నారు. గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ చరిత్రలో బన్నీ పేరు చిరస్థాయిలో ఉండిపోనుంది. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని చరిత్ర పుటల్లోకి అల్లు అర్జున్ పేరు చేరింది. అదే విధంగా 69వ జాతీయ అవార్డుల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటింది. అక్కడ కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప) నిలవడం సరికొత్త ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్.'ఆ బిడ్డ మీద ఒక్క చిన్న గీత పడాలా... గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా...' అంటూ విలన్లకి వార్నింగ్ ఇస్తాడు పుష్పరాజ్. ఇదే డైలాగ్ రీసెంట్గా గద్దర్ అవార్డ్ అందుకుని మరోసారి చెప్పి తన అభిమానుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ (AA22) చిత్రం కోసం పనిచేస్తున్నారు. బన్నీ ఇప్పటి వరకు నటించిన సినిమాలు 21.. అయితే, ఉత్తమ నటుడిగా 11సార్లు నామినేట్ అయ్యాడు. ఏడు చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా అత్యుత్తమ అవార్డ్స్ అందుకున్నాడు. మొత్తంగా దేశంలో పేరు పొందిన 18 అవార్డ్స్ను ఆయన సొంతం చేసుకున్నాడు.ఫిలింఫేర్ అవార్డులుపరుగు (2009)- ఉత్తమ నటుడువేదం (2011)- ఉత్తమ నటుడురేసు గుర్రం (2015)- ఉత్తమ నటుడురుద్రమదేవి (2016)- ఉత్తమ సహాయ నటుడుసరైనోడు (2017)- క్రిటిక్స్ ఉత్తమ నటుడుపుష్ప (2022)- ఉత్తమ నటుడుగద్దర్ అవార్డ్పుష్ప-2 (2024)- ఉత్తమ నటుడుఐఫా అవార్డ్స్రుద్రమదేవి (2016)- ఉత్తమ సహాయ నటుడుసైమా అవార్డ్స్సన్నాఫ్ సత్యమూర్తి (2015)- దక్షిణ భారత సినిమా స్టైలిష్ యూత్ ఐకాన్రుద్రమదేవి (2016)- ఉత్తమ నటుడుఅలా వైకుంఠపురంలో (2021)- ఉత్తమ నటుడుపుష్ప (2022)- ఉత్తమ నటుడు నంది అవార్డ్స్గంగోత్రి (2003) ఆర్య (2004)పరుగు(2008)వేదం(2010)రుద్రమదేవి (2015)నేషనల్ అవార్డ్పుష్ప(2022)- ఉత్తమ నటుడిగా 2023లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ -
అల్లు అర్జున్ డైరెక్టర్ చిత్రాలన్నీ కాపీనే?.. దర్శకుడి రియాక్షన్ ఇదే!
జవాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ. షారూఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ ఏడాది బిగ్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. అది కూడా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుగొణె హీరోయిన్గా కనిపించనుంది.అయితే కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనను డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా డాక్టరేట్ స్వీకరించిన అట్లీ సినిమాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా తన చిత్రాలన్నీ కాపీ చేశారంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ సినిమా గురించి కూడా మాట్లాడారు.అట్లీ మాట్లాడుతూ.. "సాధారణంగా ప్రేక్షకులు నా సినిమాలు కాపీ అని అంటారు.కానీ ఈ రోజు నా జీవితం గురించి నేను మీకు చెప్తా. ఈ రోజు నిజం చెబుతున్నా నేను తీసే సినిమాలన్నీ నా జీవితం నుంచి ప్రేరణ పొందా. ఇవాళ మీకు కనెక్ట్ అయ్యే ఒక ఉదాహరణ చెప్తా. విజయ్ నటించిన బిగిల్ సినిమా.. గ్యాంగ్స్టర్ నుంచి ఫుట్బాల్ కోచ్గా మారిన మైఖేల్ రాయప్పన్ పాత్రను జేపీఆర్ సార్ జీవితం నుంచి ప్రేరణ పొందా. రాయప్పన్ ఈ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ కూడా. ఈ రోజు మీరు నాకు డాక్టరేట్ ఇచ్చారు. నేను ఈ దేశం గర్వపడేలా చేస్తానని హామీ ఇస్తున్నా" అని అన్నారు.అల్లు అర్జున్ చిత్రం గురించి మాట్లాడుతూ..' ఈ సినిమాను కళానిధి మారన్ సర్ (సన్ పిక్చర్స్) నిర్మిస్తున్నారు. ఇది మన దేశంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ మూవీ కోసం అంతా కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఈ చిత్రం కోసం నేను పెద్ద కలలు కంటున్నా. ఈ మూవీ బడ్జెట్ ఇంకా లాక్ కాలేదు. నిర్మాత విడుదల తేదీని నిర్ణయిస్తారు.' అని పంచుకున్నారు. #Atlee: "Generally Audience says my films are copied, but I'm telling truth today that it's all inspired from my life. For Ex Bigil Raayappan character was inspired from JPR sir. You have given doctorate, i promise that I will make proud for this country. #AA22xA6 la therikka… pic.twitter.com/UQeZdqhJev— AmuthaBharathi (@CinemaWithAB) June 14, 2025 -
ఇది నా రిక్వెస్ట్.. గద్దర్ అవార్డుల వేడుకపై దిల్ రాజు
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా గద్దర్ అవార్డుల వేడుక జరిపింది. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఈ వేడుక శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకని దగ్గరుండి విజయవంతం చేసిన దిల్ రాజు.. తాజాగా మీడియాతో మాట్లాడారు. అవార్డ్స్ వేడుక సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.(ఇదీ చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవంపై ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు.. 'గద్దర్ అవార్డ్స్ వేడుకలు నిన్న భారీ ఎత్తున నిర్వహించాం. ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ అవార్డ్స్ వేడుక కోసం గత 6 నెలలు నుంచి వర్క్ చేశాం. ఇది పెద్ద సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అవార్డ్ గ్రహీతలందరికీ థాంక్స్. ముఖ్యమంత్రి గారికి బిగ్ బిగ్ థ్యాంక్స్. ఇంత పెద్ద ఈవెంట్లో సీఎం.. రెండు గంటలు పైన ఉన్నారు. త్వరలో ఏపీలో కూడా అవార్డ్స్ మొదలవుతాయి. ప్రభుత్వం నుంచి అవార్డు వస్తుందంటే స్వీకరించే వాళ్లు ఎన్ని పనులున్నా కచ్చితంగా వచ్చి స్వీకరించాలి ఇది నా రిక్వెస్ట్' అని చెప్పుకొచ్చారు.అలానే ప్రభుత్వ అవార్డుల స్వీకరణలో సినీ పరిశ్రమ తీరుపై ఏఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల కోసం ఆరు నెలలుగా కష్టపడితే సక్సెస్ అయింది. ప్రభుత్వం అవార్డులు ఇస్తుందంటే అందరూ హాజరై తీసుకోవాలి. అవార్డుల తేదీ ప్రకటించాక ఆ తేదీన అందరూ అవార్డు కోసం కేటాయించాలి. ఇంత పెద్ద ఈవెంట్లో ఏవైనా పొరపాట్లు జరిగితే క్షమించాలని దిల్ రాజు కోరారు.ఈ వేడుకలో 'పుష్ప 2' చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ స్వీకరించగా, ఉత్తమ నటిగా '35: ఇది చిన్న కథ కాదు' సినిమాకుగాను నివేదా థామస్ పురస్కారం అందుకుంది. గతేడాది అన్ని విభాగాలకు అవార్డులు బహుకరించగా.. 2014 నుంచి 2023 వరకు మాత్రం మూడేసి ఉత్తమ చిత్రాల్ని ఎంపిక చేసి అవార్డ్స్ ఇచ్చారు. గ్రహీతలకు సిల్వర్ మొమెంటో, ప్రశాంసా పత్రం, రూ.5 లక్షల మొత్తాన్ని అందజేశారు.(ఇదీ చదవండి: హీరోయిన్ నివేదా థామస్ ఇంతలా మారిపోయిందేంటి?) -
స్టేజీపై ఇటు సీఎం.. అటు పుష్ప.. ఫైనల్ డైలాగ్ ఇచ్చాడు చూడు
-
హాలీవుడ్కు వేదికవ్వాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సినీ పరిశ్రమ హాలీవుడ్కు హైదరాబాద్ వేదికగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. ఈ దిశగా సినీ పెద్దలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ అని అందరూ భావించేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. భారతీయ సినిమాల్లో తెలుగు సినిమా ముందు వరుసలో ఉందని చెప్పారు. ఇకపై బాలీవుడ్కు హైదరాబాద్ వేదిక కానుందని పేర్కొన్నారు. శనివారం హైటెక్స్లో తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చలనచిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964లో నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. కొన్ని కారణాలవల్ల ఈ అవార్డుల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సినీ అవార్డుల ప్రదానంపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఇవాళ గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ‘భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే. తెలుగు సినీ పరిశ్రమకు ఏం కావాలో నాకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మరో 22 ఏళ్లు నేను క్రియాశీల రాజకీయాల్లో ఉంటా. నేను ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా. ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం కేటాయిస్తాం. నేను ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి తెలంగాణ విజన్ గురించి వెల్లడించాను. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేరుస్తాం. ఇప్పటివరకు నేను అనుకున్నవన్నీ సాధించాను. ఇది కూడా సాధ్యమవుతుందని 100 శాతం నమ్మకం ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు నాలుగో తరం కొనసాగుతోంది. గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క.. ఆయనే మాకు ఒక స్ఫూర్తిం. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా’ అని రేవంత్రెడ్డి అన్నారు. గద్దర్ ఫౌండేషన్కు రూ.3 కోట్లు గద్దర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గద్దర్ ఫౌండేషన్కు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. ఇక ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. -
సీఎం రేవంత్ సమక్షంలో అల్లు అర్జున్ మాస్ డైలాగ్..వీడియో వైరల్
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుకలో అల్లు అర్జున్కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. 2024 ఏడాదిగాను పుష్ప-2 మూవీకి అల్లు అర్జున్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప 2 చిత్రానికి అందిన తొలి అవార్డు ఇది. తెలంగాణ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఈ అవార్డు వేడుకను ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను’అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పుష్ప-2 మూవీలోని మాస్ డైలాన్ని చెప్పి ఆకట్టుకున్నాడు. ఇది సినిమా ఫంక్షన్ కదా.. తన సినిమాలోని డైలాగ్ను చెప్పవచ్చా.. అని అడిగి మరీ అల్లు అర్జున్ ‘రప్పా రప్పా’ డైలాగ్ చెప్పాడు. -
ఘనంగా గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం.. విజేతలు వీళ్లే
హైదరాబాద్లోని అంగరంగ వైభవంగా గద్దర్ అవార్డుల వేడుక జరిగింది. 2014 నుంచి 2024 వరకు వచ్చిన సినిమాలు, నటీనటులకుగానూ ఈ పురస్కారాల ప్రదానం చేశారు. అవార్డ్తో పాటు సిల్వర్ మొమెంటో, రూ.5 లక్షల ప్రైజ్మనీ అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు.అవార్డులు అందుకున్న విజేతలు వీళ్లేఉత్తమ నటుడు- అల్లు అర్జున్( 2024 ఏడాదికి గాను పుష్ప-2 మూవీ)ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ఉత్తమ చిత్రం : కల్కి 2898 ఏడీద్వితీయ ఉత్తమ చిత్రం : పొట్టేల్తృతీయ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్: మేం ఫ్రెండ్సండీఉత్తమ సహాయ నటుడు: ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్)ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్)ఉత్తమ నేపథ్య గాయకుడు: సిధ్ శ్రీరామ్: ఊరుపేరు భైరవ కోన (నిజమే నే చెబుతున్నా)ఉత్తమ నేపథ్య గాయని:శ్రేయా ఘోషల్: పుష్ప2 (సూసేటి అగ్గిరవ్వ) ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య (దేవర-ఆయుధపూజ)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్స్టర్)ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా2)ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: అధ్నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్కుమార్ (కల్కి 2898 ఏడీ)ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: అరుణ్ దేవ్ (35: చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ కమ్యూనల్ హార్మోనీ సోషల్ అప్లిస్ట్: కమిటీ కుర్రాళ్లు -
గ్రాండ్గా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లోని హైటెక్స్ ఈ వేడుకకు వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాగా.. టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు ఎంతోమంది హాజరయ్యారు. అయితే ప్రత్యేక్ష ఆకర్షణగా అల్లు అర్జున్ నిలిచాడు. బన్నీతో పాటు విజయ్ దేవరకొండ కూడా కనిపించడం విశేషం.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత దిల్ రాజు.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2014 నుంచి 2024 వరకూ గద్దర్ అవార్డులను అందజేశారు. సదరు పురస్కార గ్రహీతలకు సిల్వర్ మెమొంటో, రూ.5 లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రశంసా పత్రం అందించారు. సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. వేల మంది ఈవెంట్కు హాజరయ్యారు.'గామి' సినిమాకుగాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ్ ఆర్ట్ డైరెక్టర్గా అద్నితిన్ జిహానీ చౌదరి.. 'కల్కి 2898ఏడీ' సినిమాకు అవార్డులు అందుకున్నారు. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను (రజాకార్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావు- అజయ్ కుమార్ (కల్కి), ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్ (గామి), ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి (లక్కీ భాస్కర్), ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్, ఉత్తమ స్టోరీ రైటర్ శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి) అవార్డులు అందుకున్నారు. -
దేశంలోనే ఖరీదైన సినిమా.. అట్లీ ఎలివేషన్స్
అల్లు అర్జున్.. 'పుష్ప 2' తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇదివరకే రెండు వీడియోలు రిలీజ్ చేశారు. వీటి ద్వారా మూవీ ఏ రేంజులో ఉండబోతుంది? ఎంత భారీ ఎత్తున నిర్మించబోతున్నారనేది హింట్ ఇచ్చేశారు. కానీ ఇటు బన్నీ గానీ అటు అట్లీ గానీ రీసెంట్ టైంలో మీడియాకు దొరకలేదు. కాబట్టి వీడియోలతో అభిమానులు సరిపెట్టుకున్నారు. కానీ తాజాగా సత్యభామ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్న అట్లీ.. అల్లు అర్జున్తో చేయబోయే చిత్రం గురించి అదిరిపోయే విషయాలు బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?)'దేశంలోనే ఇదే ఖరీదైన సినిమా. చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం. సరికొత్త టెక్నాలజీ కూడా పరిచయం చేయబోతున్నాం. బడ్జెట్ ఎంతనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సినిమా తీయడం వరకే నా బాధ్యత. విడుదల ఎప్పుడనేది నిర్మాత తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది' అని అట్లీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అట్లీ చెప్పిన దాని బట్టి చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకు కాస్ట్ లీ మూవీస్ అంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల గురించి మాట్లాడుకునేవాళ్లు. త్వరలో అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారేమో. ఇందులో బన్నీ.. మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం. అందుకు తగ్గట్లే దీపికా పదుకొణెని ఇదివరకే హీరోయిన్గా ప్రకటించారు. వీళ్లతో పాటు మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్ కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ముంబైలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయిందని టాక్. ప్రస్తుతానికైతే అట్లీ చెప్పినవే అప్డేట్స్. మిగిలినవి త్వరలో బయటపెడతారేమో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) "#AA22xA6 is the most expensive film of our country🫡📈. We are bringing many new technologies into the film🔥. It will make us all proud💯. I'm dreaming big, budget of the film is not yet locked🤞. Release date will be decided by the producer🤝"#Atlee | #AlluArjun pic.twitter.com/qwZx9LdMwp— AmuthaBharathi (@CinemaWithAB) June 14, 2025 -
అల్లు అర్జున్.. 'శక్తిమాన్'
90స్ జనరేషన్కి సూపర్ హీరోలు అనగానే స్పైడర్ మ్యాన్, 'శక్తిమాన్' గుర్తొస్తాయి. స్పైడర్ మ్యాన్ సినిమాల సంగతి కాసేపు పక్కనబెడితే 'శక్తిమాన్' స్టోరీతో అటు సీరియల్ గానీ మూవీస్ గానీ రాలేదు. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో ఈ ప్రాజెక్ట్ తీస్తారనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఫైనల్గా అది అల్లు అర్జున్ చేతిలోకి వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం బన్నీ.. త్రివిక్రమ్తో సినిమా చేయాలి. భారీ బడ్జెట్తో మైథలాజికల్ మూవీ ఒకటి అనుకున్నారు. కానీ అది ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో తమిళ దర్శకుడు అట్లీతో.. బన్నీ కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ఇదో హాలీవుడ్ రేంజ్ సూపర్ హీరో తరహా సినిమా అని అనౌన్స్మెంట్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) రీసెంట్గా బన్నీ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. దీంతో నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అనే టైంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. గతంలో ఇతడు 'మిన్నల్ మురళి' అని లోకల్ సూపర్ హీరో మూవీ ఒకటి తీశాడు. ఈ క్రమంలోనే బన్నీ-బాసిల్ కలిసి 'శక్తిమాన్' చేస్తారనే రూమర్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు ఓ రెండు కలిసి.. గీతా ఆర్ట్స్తో భారీ ఎత్తున నిర్మించబోతున్నారని అంటున్నారు. త్వరలో ప్రకటన రావొచ్చని మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు వినిపిస్తున్నవన్నీ నిజమేనా? లేదంటే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా చేస్తున్నారా అనిపిస్తుంది. కొన్నిరోజులు ఆగితే నిజమేంటనేది క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే కఠిన చర్యలు) -
అల్లు అర్జున్ అంటే అంతే.. కొత్త దర్శకుడికి బిగ్ ఛాన్స్
పుష్ప(Pushpa) తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాల గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పాన్ ఇండియా రేంజ్లో ఆదరణ ఉండటంతో ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) తో ఒక సినిమాను పట్టాలెక్కించాడు. త్రివిక్రమ్(Trivikram) సినిమాను దాదాపు పక్కన పెట్టేసినట్లే అని చెప్పవచ్చు. అయితే, ఇప్పటికే బన్నీ లిస్ట్లో ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఆయనతో ఒక ప్రాజెక్ట్ తప్పకుండా చేస్తారని టాక్ ఉంది. ఇంతలో ఎవరూ ఊహించలేని ఒక దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అట్లీ సినిమా తర్వాత తన దర్శకత్వంలోనే బన్నీ సినిమా అంటూ పెద్ద ఎత్తున్న వైరల్ అవుతుంది.అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరూ ఊహించలేని దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కథ కూడా బన్నీ ఓకే చేశారట. మలయాళ హిట్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్(Basil Joseph)తో బన్నీ సినిమా దాదాపు ఖరారు అయిపోయిందట. మలయాళంలో డైరెక్టర్గానే కాకుండా నటుడిగా కూడా ఆయన సంచలన విజయాలను అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మిన్నల్ మురళీ' (2021) చిత్రానికి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, దర్శకుడిగా ఆయన మూడు చిత్రాలకే పనిచేశారు. స్టోరీ రచయితగా పలు సినిమాలకు పనిచేశారు. జయ జయ జయ జయహే, సూక్ష్మ దర్శిని, పోన్ మాన్ వంటి సినిమాలతో ఆయన తెలుగు వారికి నటుడిగా బాగా దగ్గరయ్యాడు. కేవలం మూడు సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన బాసిల్ జోసెఫ్తో బన్నీ సినిమా చేస్తున్నట్లు వార్తలు రావడంతో నెట్టింట భారీగా వైరల్ అవుతుంది.ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాస్ ఒక సినిమా గురించి మాట్లాడారు. మరో నాలుగు నెలలో గీతా ఆర్ట్స్ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ను ప్రకటిస్తామన్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ మూవీ కాదని కూడా తెలిపాడు. ఎవరూ ఊహించలేని కాంబినేషన్ అని ఆయన అన్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. మలయాళంలో అల్లు అర్జున్కు భారీ ఇమేజ్ ఉంది. దీంతో ఆయన మీద అభిమానంతో దాదాపు నాలుగేళ్లు కష్టపడి ఒక కథను బాసిల్ రెడీ చేశారట. త్వరలో అధికారికంగా ప్రకటన ఉంటుందని సమాచారం. -
లైఫ్ అంతా అల్లు అర్జున్కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు
బన్నీ వాసు (Bunny Vas)ది పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ పరిచయమవ్వడం, అతడితో స్నేహం కుదరడంతో గీతా ఆర్ట్స్లో పని చేశాడు. అనంతరం అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి స్థాపించిన గీతా ఆర్ట్స్ 2 సంస్థలో పార్ట్నర్ అయ్యాడు. నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలందించాడు. ఈ మధ్య తన స్నేహితులతో కలిసి బీవీ వర్క్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించాడు. ఈ బ్యానర్లో బన్నీ వాసు మిత్ర మండలి అనే సినిమా నిర్మిస్తున్నాడు.నా తండ్రికన్నా నీతోనే ఎక్కువ..గురువారం (జూన్ 12న) ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ.. నా జీవితంలో మా తండ్రితో కన్నా ఎక్కువగా మీ (అల్లు అరవింద్)తోనే ఉన్నాను. మా ఇంట్లో కన్నా మీ ఇంట్లోనే ఎక్కువగా ఉన్నాను. అలాంటిది ఈ రోజు ఇక్కడివరకు ఎదిగిన మమ్మల్ని చూస్తుంటే మీకెంత గర్వంగా ఉందో, మిమ్మల్ని చూస్తుంటే మాకూ అంతే సంతోషంగా ఉంది. మా జీవితంలో అల్లు అరవిందే గాడ్ ఫాదర్. ఇంత సపోర్ట్ ఇచ్చి, ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు థాంక్యూ సో మచ్ సర్.బన్నీకి కాపలా కాయడమే..మేమందరం మంచి సినిమాలు తీస్తున్నామంటే అది అరవింద్గారు మాకు నేర్పిన శిక్షణ, విద్య అని చెప్పుకొచ్చాడు. సరిగ్గా అప్పుడే యాంకర్ స్రవంతి.. లైఫ్లో ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేశారా? వాళ్లు పడిపోయారా? అని అడిగింది. అందుకు బన్నీ వాసు ఏ అమ్మాయి నాకు పడిపోలేదు, పైగా తిట్లు తిన్నాను అని రిప్లై ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా.. నేను 19 ఏళ్ల వయసులో అరవింద్గారి దగ్గరకు వచ్చాను. అప్పటినుంచి నన్ను బన్నీగారి దగ్గర వాచ్మెన్గా పెట్టారు. నా జీవితమంతా ఆయనకు కాపలా కాయడమే సరిపోయింది. నా లైఫ్లో లవ్ పార్ట్ ఏదైనా మిస్సయిందంటే దానికి అరవింద్, బన్నీనే కారణం అని నవ్వుతూ చెప్పాడు.చదవండి: పచ్చబొట్టు వేయించుకున్న సురేఖావాణి.. బిల్డప్ దేనికంటూ ట్రోలింగ్ -
బన్నీ సినిమా.. ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించబోతున్న అట్లీ!
అల్లు అర్జున్(Allu Arjun) కొత్త సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైంది. ఇక ఆల్ సెట్ గో... అంటూ అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గొననున్నారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ(Atlee ) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తారు. మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ కూడా హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ ఈ వారంలోనే ప్రారంభం కానుందని తెలిసింది. దాదాపు ఇరవై రోజుల పాటు ముంబైలో జరగనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణలో అల్లు అర్జున్, మృణాల్ ఠాగూర్ పాల్గొంటారని, వీరిద్దరి కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను దర్శకుడు అట్లీ ప్లాన్ చేశారని సమాచారం. ఈ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ను సైతం షూట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట అట్లీ. అయితే ఈ తొలి షెడ్యూల్ షూటింగ్లో దీపికా పదుకోన్ పాల్గొనరట. ఇక ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక ప్రపంచాన్ని అట్లీ సృష్టిస్తున్నారని, ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
కన్ఫ్యూజన్కు ఫుల్స్టాప్.. ఆ స్టార్ హీరోతోనే త్రివిక్రమ్ సినిమా.. నిర్మాత హింట్!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడంతా ఫుల్ బిజీ అయిపోయారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ఇటీవలే వార్-2 షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం ప్రశాంత్నీల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ స్టార్స్ కోసం మరో డైరెక్టర్ వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల అల్లు అర్జున్- అట్లీ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో బన్నీతో మూవీ ప్లాన్ చేసిన త్రివిక్రమ్కు నిరాశే ఎదురైంది. ఇప్పట్లో బన్నీ- త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కేలా కనిపించడం లేదు.అయితే ఈ గ్యాప్లోనే త్రివిక్రమ్.. మెగా హీరో రామ్ చరణ్తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపించింది. అయితే వీటిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇదిలా ఉండగానే బన్నీ ప్లేస్లో మరో స్టార్ హీరోతో మాటల మాంత్రికుడు మూవీ తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు.. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్తోనే తెరకెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సంస్కృతి భాషలో ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అల్లు అర్జున్తో ప్లాన్ చేసిన మైథలాజికల్ ఫాంటసీ చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్నట్లు నాగవంశీ హింట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయ భగవానుడి పాత్రలో అడుగుపెడుతున్నట్లు ఆ ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది. 'అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో నాకు అత్యంత ఇష్టమైన అన్న ఒకరు' అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్తో ఎన్టీఆర్తోనే త్రివిక్రమ్ సినిమా చేయనున్నారని దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది.ఆసక్తికర విషయం ఏంటంటే.. మొదట ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్తోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాతే అల్లు అర్జున్ కు ఆఫర్ చేశారు. ఇప్పుడు బన్నీ.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జత కట్టడంతో నిర్మాతలు మరోసారి ఎన్టీఆర్వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.కాగా.. మహేష్ బాబుతో 'గుంటూరు కారం' తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గతంలో వెంకటేశ్, రామ్ చరణ్తో సినిమాల వార్తలొచ్చినా అవేమీ ఇంకా అప్డేట్స్ రాలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్తోనే సినిమాకు త్రివిక్రమ్ సిద్ధమైనట్లు లేటేస్ట్ టాక్. నాగవంశీ ట్వీట్తో ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. GOD OF WAR is Coming!! pic.twitter.com/MoIcrKduNw— Naga Vamsi (@vamsi84) June 11, 2025 My most favourite anna as one of the most powerful gods. pic.twitter.com/Vq4dFV3lJd— Naga Vamsi (@vamsi84) June 11, 2025 -
బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?
'గుంటూరు కారం' తర్వాత ఏడాదిన్నర నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నారు. ఇంతలో అల్లు అర్జున్ కోసం భారీ మైథలాజికల్ స్టోరీ ఒకటి సిద్ధం చేశారు. త్వరలో అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అనుకునే టైంలో బన్నీ లైనప్ మారింది. 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ని కాదని అట్లీతో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో మాటల మాంత్రికుడు ఎదురు చూడక తప్పని పరిస్థితి. అలానే ఎవరితో సినిమా చేయాలా అని త్రివిక్రమ్ పూర్తిగా కన్ఫ్యూజన్లో పడిపోయారు. అయితే ఇప్పుడు ఈయన గురించి కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి.త్రివిక్రమ్, అల్లు అర్జున్ కోసం రెడీ చేసిన కథని ఇప్పుడు ఎన్టీఆర్తో తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారట. అలా అని ఇది ఇప్పుడు మొదలు కాకపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్.. రామ్ చరణ్, వెంకటేశ్తో వరసగా మూవీస్ చేస్తారని, ఇవి పూర్తయిన తర్వాత తారక్తో మూవీ ఉండొచ్చని తెలుస్తోంది. అంతలో ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్తో ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని వస్తాడని టాక్.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)'అరవింద సమేత' తర్వాతే త్రివిక్రమ్-ఎన్టీఆర్తో మరోసారి పనిచేస్తారని కొన్నేళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఏమైందో ఏమో గానీ ఆ ప్రాజెక్ట్ అలానే ఉండిపోయింది. అదే కథతో త్రివిక్రమ్.. 'గుంటూరు కారం' తీశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తుంటాయి. మరి ఇది నిజమో కాదో సంగతి పక్కనబెడితే ఇప్పుడు మరోసారి ఒకరు చేయాల్సిన స్టోరీతో మరో స్టార్ హీరో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బన్నీ కూడా ప్రస్తుతం అట్లీతో చేస్తున్నాడు. ఒకవేళ కుదిరితే త్రివిక్రమ్తో ప్రాజెక్ట్ ఉంటుంది. లేదంటే మాత్రం సందీప్ రెడ్డి వంగా, పుష్ప 3 మూవీస్ ఉండనే ఉన్నాయి. మరి త్రివిక్రమ్ సినిమా మిస్ అంటున్న వార్తలు నిజమేనా? లేదంటే పుకార్లా అనేది తెలియాల్సి ఉంది. త్వరలో త్రివిక్రమ్-రామ్ చరణ్ మూవీ గురించి ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?) -
రామ్ చరణ్తో త్రివిక్రమ్ ప్లాన్.. బన్నీనే కారణమా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అభిమానులు ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నారు.గుంటూరు కారం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, వెంకటేశ్తో ఆయన సినిమా చేయనున్నట్లు టాక్ వినిపించింది. అయితే ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. తాజాగా త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో జతకట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు కాంబోలో ఓ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్తో సోషయో ఫాంటసీని చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు త్రివిక్రమ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్లో అర్జున్ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీలో హీరోయిన్గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఇప్పుడు బన్నీ అట్లీతో కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించడంతో త్రివిక్రమ్ సినిమా గురించి ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు. దీంతో బన్నీతో సినిమా ఇప్పట్లో పట్టలెక్కేలా కనిపించడం లేదు. ఈ గ్యాప్లోనే త్రివిక్రమ్.. రామ్ చరణ్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చి బాబు సనాతో పెద్ది సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
సమ్మర్ జ్ఞాపకాలు.. మర్చిపోలేకపోతున్న బన్నీ భార్య (ఫొటోలు)
-
ముంబై ఎయిర్పోర్ట్లో అల్లు అర్జున్.. అట్లీ సినిమా గురించేనా (ఫోటోలు)
-
త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?
తెలుగులో టాప్ డైరెక్టర్స్ అనగానే గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్. రైటర్గా కెరీర్ మొదలుపెట్టిన ఈయన.. టాలీవుడ్లో స్టార్ హీరోలతో గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో తీశారు. అలాంటి ఈయన పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగోలేదు. పేరుకే స్టార్ డైరెక్టర్ గానీ సరైన కాంబో సెట్ చేసుకోలేక పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో ఎలా ఉండే త్రివిక్రమ్ ఎలా అయిపోయారా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది?త్రివిక్రమ్ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు, పంచ్లు, ప్రాస డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల తర్వాత ఈయన.. దర్శకుడిగా పూర్తిగా గాడి తప్పారా అనిపిస్తుంది. ఎందుకంటే 'అల వైకుంఠపురములో' తర్వాత ఎన్టీఆర్తో ఓ మూవీ ప్లాన్ చేశారు. కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. దీంతో మహేశ్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. తొలుత ఓ సబ్జెక్ట్తో సినిమా మొదలుపెట్టారు గానీ కొన్నిరోజులకే దాన్ని పక్కనబెట్టి మరో కథతో సినిమా తీసి రిలీజ్ చేశారు. అదే 'గుంటూరు కారం'. మహేశ్ అభిమానులకు ఈ మూవీ నచ్చింది గానీ మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలో లేటెస్ట్ హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)'గుంటూరు కారం' గతేడాది సంక్రాంతికి వచ్చింది. అప్పటి నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉంటున్నారు. మధ్యలో అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ సెట్ అయింది. భారీ బడ్జెట్తో మైథలాజికల్ కథతో దీన్ని తీస్తున్నామని నిర్మాత నాగవంశీ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో గానీ అల్లు అర్జున్.. దీన్ని పక్కనబెట్టి అట్లీతో సినిమా మొదలుపెట్టారు. ఫలితంగా త్రివిక్రమ్ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. రామ్ చరణ్, వెంకటేశ్తో సినిమాలు చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇవి చేసినా సరే టాలీవుడ్కే పరిమితమయ్యే మూవీస్ అవుతాయేమో?త్రివిక్రమ్తో పాటు దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి, సుకుమార్ లాంటి చాలామంది డైరెక్టర్స్.. ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో టాప్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఏ హీరోతో మూవీ చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అటు దర్శకుడిగా ఎవరితో సినిమా చేయాలా అనే దగ్గర నుంచి బన్నీతో ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అనేది తెలియని పరిస్థితి. మరి ప్రస్తుత అడ్డంకులన్నీ దాటుకుని త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) -
స్పిరిట్ పోతేనేం.. బన్నీ పక్కన బంపరాఫర్ కొట్టేసిందిగా..!
-
అల్లు అర్జున్ సినిమా లో దీపికా.. కారణం ఏమిటో తెలుసా..?
-
మహేశ్బాబు, అల్లు అర్జున్.. కొత్తగా మల్టీఫ్లెక్స్ నిర్మాణాలు ఎక్కడంటే?
టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ ఇప్పటికే మల్టీప్లెక్స్ నిర్మాణంలో అడుగుపెట్టారు. ఏషియన్ గ్రూప్స్ భాగస్వామ్యంతో వారు ఈ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్లోనే అత్యంత విలాసవంతమై మల్టీప్లెక్స్ను (AMB) మహేశ్బాబు నిర్మించగా.. (AAA)పేరుతో అల్లు అర్జున్ రీసెంట్గా ఈ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. అయితే, ఇప్పుడు వారిద్దరూ ఇతర రాష్ట్రాల్లో కూడా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్లాన్లో ఉన్నారని తెలుస్తోంది.అయితే, (AMB) పేరుతో బెంగళూరులో ఒక భారీ మల్టీప్లెక్స్ను మహేశ్ నిర్మించారు. త్వరలో ప్రారంభం కానుంది. ఆరు స్క్రీన్స్తో అత్యంత లగ్జరీ సౌకర్యాలతో దీనిని నిర్మించారు. ఇప్పుడు చెన్నై, గోవాలో కూడా మరో మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారు. ఏషియన్ సినిమాస్తో కలిసి అక్కడ అతిపెద్ద థియేటర్ను నిర్మించాలని ప్రిన్స్ మహేశ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తన సన్నిహితుల వద్ద చెప్పారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పటికే హైదరాబాద్లోని అమీర్పేట్లో (AAA) సినిమాస్ పేరుతో ఒక మల్టీప్లెక్స్ను నిర్మించిన విషయం తెలిసిందే. ఆయన కూడా ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతోనే ఈ వ్యాపారంలో అడుగుపెట్టారు. అయితే, ఇప్పుడు ఆయన వైజాగ్లో AAA మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైజాగ్లో త్వరలో ప్రారంభం కానున్న ఇనార్బిట్ మాల్లో హైదరాబాద్లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ కట్టిస్తున్నారట. ఇదే విషయాన్ని సునీల్ నారంగ్ చెప్పుకొచ్చారట. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది.హైదరాబాద్లో అతిపెద్ద ఐమాక్స్ థియేటర్ కూడా త్వరలో నిర్మించనున్నట్లు ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ చెప్పారని మీడియా సర్కిల్లో ఒక వార్త ఉంది. భాగ్యనగరంలో ఇప్పటి వరకు నిజమైన IMAX థియేటర్లు లేవు. గతంలో హైదరాబాద్లో IMAX థియేటర్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు అవి లేవు. అయితే, ప్రసాద్ మల్టీప్లెక్స్లో "PCX" అని పిలువబడే ఒక పెద్ద స్క్రీన్ ఉంది, ఇది 3D IMAX 70mm స్క్రీన్గా ఉండేది.., కానీ ఇప్పుడు కాదు. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే హైదరాబాద్కు తొలి ఐమాక్స్ థియేటర్ త్వరలో రానుంది. -
ప్రభాస్కి నో-బన్నీతో ఫిక్స్.. దీపిక ప్లాన్ ఏంటి?
అల్లు అర్జున్ కొత్త సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెని ఎంపిక చేశారు. గ్రాండ్ ఇంట్రడక్షన్ వీడియోతో అధికారికంగా ప్రకటించారు. ఇందులో సూపర్ ఉమన్ వారియర్ తరహా పాత్రలో దీపిక కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం ప్రభాస్ చిత్రానికి నో చెప్పిన ఈమె.. ఇప్పుడు బన్నీ సినిమాకు ఓకే చెప్పింది. ఈ మధ్యలో ఏం జరిగింది? సోషల్ మీడియాలో అసలేం వినిపిస్తోంది.'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్తో 'స్పిరిట్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి కాగా హీరోయిన్ పాత్ర కోసం దీపికని సంప్రదించాడు. దాదాపు ఓకే అనుకున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే దీపిక పీఆర్ టీమ్.. ఈ విషయాన్ని పలు వెబ్సైట్లకు లీక్ చేసింది. దీపిక పాత్ర ఆహా ఓహో అనే రేంజులో ఉండబోతుందని హైప్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత దీపిక తన కండీషన్స్ గురించి సందీప్తో చెప్పిందని వార్తలొచ్చాయి. రోజుకి 8 గంటల మాత్రమే పనిచేస్తానని, రూ.40 కోట్ల రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో వాటా కావాలని దీపిక డిమాండ్ చేసినట్లు టాక్ వినిపించింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)అలా దీపిక పెట్టిన కండీషన్స్తో పాటు ఆమె పీఆర్ టీమ్ చేసే హడావుడి వల్ల సందీప్కి చిరాకొచ్చింది. దీంతో దీపికకు నో చెప్పేశాడు. ఇది జరిగిన వెంటనే బాలీవుడ్లో 'స్పిరిట్' గురించి నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చాయి. స్టోరీని కూడా లీక్ చేశారు. ఇదో 'ఏ' రేటెడ్ సినిమా అని, హీరోహీరోయిన్ మధ్య రొమాన్స్ గట్టిగానే ఉందని పలు సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో సందీప్ రెడ్డి వంగాకు మండింది. వెంటనే తృప్తి దిమ్రిని హీరోయిన్గా ప్రకటించాడు. దీపిక పేరు ప్రస్తావించకుండా పెద్ద ట్వీట్ పెట్టాడు. ఆమెకు ఇచ్చిపడేశాడు. ఏం చేసుకుంటావో చేస్కో అని అనేశాడు.ఇది జరిగి కొన్నిరోజుల కూడా కాలేదు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో దీపికని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. దీనిపై కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. లెక్క ప్రకారం మృణాల్ ఠాకుర్ని హీరోయిన్గా తొలుత అనౌన్స్ చేయాలనుకున్నారట. కానీ దీపిక నుంచి ఒత్తిడి రావడంతో ఈమెని హీరోయిన్గా అనౌన్స్ చేశారని వినిపిస్తోంది. మరి దీపిక చెప్పిన కండీషన్స్కి దర్శకుడు అట్లీ ఒప్పేసుకున్నట్లే కనిపిస్తుంది. ఈ సినిమాలో బన్నీ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ప్రతి పాత్రకు ఓ హీరోయిన్ ఉంటుంది. దీపిక కాకుండా మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్ని హీరోయిన్లుగా తీసుకోవాలని ఫిక్సయ్యారట.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?) -
బన్నీ సరసన దీపికా పదుకొణె.. వారియర్ తరహా పాత్రలో (ఫొటోలు)
-
అల్లు అర్జున్, అట్లీ కొత్త మూవీ.. హీరోయిన్ ఎవరంటే ?
-
బన్నీ-అట్లీ.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది
'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడా అని ఎదురుచూసిన అభిమానులకు.. కొన్నిరోజుల క్రితం సమాధానమిచ్చేశాడు. తమిళ దర్శకుడు అట్లీతో భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్న నేపథ్యంలో పలు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ఓ అప్డేట్ వచ్చేసింది. హీరోయిన్ ఎవరనేది ప్రకటించారు.ప్రభాల్ 'కల్కి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీపికా పదుకొణెని అల్లు అర్జున్కి జోడీగా ఎంపిక చేశారు. బన్నీకి ఈమెతో పనిచేయడం తొలిసారే. కానీ దర్శకుడు అట్లీ మాత్రం తన గత చిత్రం 'జవాన్'లో దీపికతో కలిసి పనిచేశాడు. ఇప్పుడు బన్నీతో చేయబోయే మూవీలోనూ ఈమెని హీరోయిన్గా ఎంపిక చేశాడు. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేశారు.గత కొన్నిరోజుల నుంచి దీపికా పదుకొణె వార్తల్లో నిలుస్తోంది. 'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి వంగా ఈమెని అప్రోచ్ అయ్యాడు. దాదాపు సెట్ అనుకునే టైంలో ప్రాజెక్ట్ నుంచి దీపిక బయటకొచ్చింది. ఈ క్రమంలోనే స్టోరీని లీక్ చేయడం లాంటివి జరిగేసరికి సందీప్ వంగా.. ఈమె పేరు చెప్పకుండా పరోక్షంగా ట్వీట్ పెట్టాడు. మరోవైపు 8 గంటల షిఫ్ట్ కారణంగా 'కల్కి 2' నుంచి కూడా ఈమె తప్పుకోనుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇలా కాంట్రవర్సీ పుకార్లకు కేరాఫ్ అయిన దీపిక.. బన్నీ-అట్లీ మూవీ విషయంలో ఏం చేస్తుందో చూడాలి?దీపిక స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ.. కెరీర్ ప్రారంభం నుంచి హిందీలోనే సినిమాలు చేస్తూ వచ్చింది. పద్మావత్, రామ్ లీలా తదితర చిత్రాలు ఈమె చాలా గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక తనతో పాటు కలిసి సినిమాలు చేసిన రణ్వీర్ సింగ్ ని ఈమె పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు వీళ్లకు ఓ కూతురు కూడా పుట్టింది. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుంది కానీ ఇప్పుడు మళ్లీ బిజీ కానుంది. -
'దీపికా పడుకోణె'కు గోల్డెన్ ఛాన్స్!
అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ సినిమా (AA22) నుంచి జూన్ 7న ఒక అప్డేట్ రానుందని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్ట్ పంచుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి కూడా.. త్వరలో షూటింగ్కు సిద్ధం అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకుని, అల్లు అర్జున్తో సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు చేశారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 700 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తోంది. అయితే, శనివారం ఉదయం 11గంటలకు ఒక ఆప్డేట్ ఇస్తామని పోస్టర్ను రిలీజ్ చేసింది. బహుశా హీరోయిన్ గురించి ప్రకటన చేస్తారని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.అల్లు అర్జున్- అట్లీ (AA22) సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ 'దీపికా పడుకోణె'( Deepika Padukone) నటిస్తున్నట్లు టాక్ ఉంది. తనకు సంబంధించిన అప్డేట్ శనివారం అఫీషియల్గా ప్రకటిస్తారని సమాచారం. ఇదే ప్రాజెక్ట్లో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, వారిద్దరి గురించి అధికారిక ప్రకటన కోసం కొద్దిరోజులు వేచి ఉండాల్సిందే. దాదాపు జూన్ 7న మాత్రం దీపిక ప్రకటన ఉంటుందని బలంగా వార్తలు వస్తున్నాయి. (AA22) పేరుతో ప్రారంభమైన ఈ మూవీకి ఐకాన్, సూపర్హీరో అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని సమాచారం.ఈ సినిమాలో అల్లు అర్జున్ భిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. కథకు తగ్గట్లుగానే అల్లు అర్జున్ పలు లుక్స్ను ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉండే సైన్స్ఫిక్షన్ సినిమాగా ఇది రానున్నట్లు ప్రచారంలో ఉంది. అందుకోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. హాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగింది.When Elegance meets Magic! ✨ Revealing Tomorrow 11 AM❤️🔥#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥@alluarjun @Atlee_dir#SunPictures #AA22 #A6 pic.twitter.com/AlG9DwRQSR— Sun Pictures (@sunpictures) June 6, 2025 -
ఆర్సీబీ విజయంపై అల్లు అర్జున్ ట్వీట్.. అయాన్ ఫుల్ ఎమోషనల్!
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు టీమ్ విజయంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ క్షణం కోసమే 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని ట్విటర్ వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. వెయిట్ ఈజ్ ఓవర్.. ఈ సాలా కప్ నమ్దే అంటూ బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్సీబీ జట్టుకు, అభిమానులకు అభినందనలు తెలిపారు.ఆర్సీబీ మ్యాచ్ గెలిచన అనంతరం అల్లు అర్జున్ కుమారడు అయాన్ ఫన్నీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తాను కోహ్లీకి వీరాభిమానినని అయాన్ ఆనందం వ్యక్తం చేశాడు. తలపై వాటర్ బాటిల్తో నీళ్లు పోసుకుని బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసిన బన్నీ నవ్వుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫుల్లీ ఎమోషనల్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు ఐకాన్ స్టార్.కాగా.. గతేడాది పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాలకు కాస్తా విరామం ఇచ్చాడు. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయనున్నారు. ఇటీవలే పుష్ప-2 సినిమాకు ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డ్ అందుకున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) THE WAIT IS OVER . “Ee sala cup namde!” At last! ❤️We’ve been waiting for this day for 18 years.A big, big congratulations to RCB! ❤️ pic.twitter.com/2khiWPLWKV— Allu Arjun (@alluarjun) June 3, 2025 -
టీవీల్లో పుష్పరాజ్.. ఎప్పుడు.. ఎక్కడ చూడాలంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1896 కోట్లు రాబట్టింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాహుబలి, కేజీఎఫ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం దంగల్ మూవీ రికార్డ్ను మాత్రమే అధిగమించలేకపోయింది. ఇటీవల ఈ మూవీలో నటనకు గానూ అల్లు అర్జున్కు గద్దర్ అవార్డ్ వరించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. జనవరి 30 నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో బుల్లితెరపై కూడా సందడి చేసింది. థియేటర్లలో విడుదలైన తర్వాత టీవీల్లోనూ పుష్ప-2 ప్రసారమైంది.తాజాగా హిందీ ప్రేక్షకులను కూడా టీవీల్లో అలరించనున్నారు పుష్పరాజ్. ఈనెల 31 వ తేదీన జీ సినిమాలో ప్రసారం చేయనున్నట్లు పుష్పటీమ్ వెల్లడించింది. శనివారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు జీ సినిమాలో ప్రసారం కానున్నట్లు ట్వీట్ చేశారు మేకర్స్. మొదటిసారి బుల్లితెరపై పుష్పరాజ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ప్రకటనతో టీవీల్లో పుష్ప-2 వీక్షించేందుకు బాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా.. పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. 31 May ki shaam,Har ghar goonjegi ek hi awaaz, Pushparaj!Dekhiye #TVParPehliBaar 'Pushpa 2: The Rule', 31 May, shaam 7:30 baje, sirf #ZeeCinema par. @zeecinema #Pushpa2TheRule #TVParPehliBaar #Pushpa2OnZeeCinema #Pushpa2OnZeeCinemaOn31May #WildFirePushpa… pic.twitter.com/aFarZPGepn— Pushpa (@PushpaMovie) May 30, 2025 -
పోటాపోటీగా..?
-
ఉత్తమ నటుడు అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: పుష్ప–2 సినిమాలో నటనకుగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ నటి అవార్డును నివేదా థామస్ (35 చిన్న కథ కాదు) గెలుచుకున్నారు. ప్రజా వాగ్గేయకారుడు, ఉద్యమకారుడు గద్దర్ పేరుపై ఏర్పాటుచేసిన సినిమా అవార్డులను తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలసి గద్దర్ అవార్డుల జ్యూరీ చైర్పర్సన్, నటి జయసుధ గురువారం అవార్డుల వివరాలను ప్రకటించారు. మొదటి ఉత్తమ చిత్రంగా కల్కి 2898ఏడీ, రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డులు గెలుచుకున్నాయి. మొత్తం 11 కేటగిరీల్లో 1,248 నామినేషన్లు వచ్చినట్లు జయసుధ తెలిపారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా అవార్డులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వచ్చేనెల 14వ తేదీన విజేతలకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. రెండు చిత్రాలకు నాలుగేసి అవార్డులు గద్దర్ అవార్డుల్లో కల్కి 2898ఏడీ, లక్కీ భాస్కర్ సినిమాలు నాలుగు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ స్కీన్ర్ప్లే, ఉత్తమ ఎడిటింగ్, స్పెషల్జ్యూరీ అవార్డులు లక్కీ భాస్కర్ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తం ఆర్ట్ డైరెక్టర్, ఉత్తమ కాసూ్టమ్ డిజైనర్ కేటగిరీల్లో కల్కి అవార్డులు గెలుచుకుంది. రజాకార్ సినిమా చారిత్రక విభాగంలో ఫీచర్ హెరిటేజ్ చిత్రం అవార్డుతోపాటు ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో అవార్డులు దక్కించుకుంది. అన్ని కేటగిరీల్లోనూ 2024కు సంబంధించి గద్దర్ సినిమా అవార్డులను ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వబోతోందని దిల్ రాజు తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా ఎంపిక జరిగిందని చెప్పారు. పారదర్శకంగా స్క్రీనింగ్ చేసి బెస్ట్ ఆఫ్ బెస్ట్ను ఎంపిక చేసినట్లు జయసుధ వివరించారు. 2014, జూన్ నుంచి 2023, డిసెంబర్ వరకు విడుదలైన ఉత్తమ చిత్రాలకు త్వరలో అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందంటూ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చిత్రాల విభాగంలో అవార్డులు మొదటి ఉత్తమ మొదటి చిత్రం: కల్కి రేండో ఉత్తమ చిత్రం: పొట్టేల్ ఉత్తమ మూడవ చిత్రం: లక్కీ భాస్కర్ జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల అభ్యున్నతిపై బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: కమిటీ కుర్రోళ్లు ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: యదువంశీ (కమిటీ కుర్రోళ్లు) ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఆయ్ చారిత్రక విభాగంలో ఫీచర్ హెరిటేజ్ చిత్రం: రజాకార్ వ్యక్తిగత విభాగంలో అవార్డులు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2) ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు) ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి) ఉత్తమ సహాయ నటుడు: ఎస్జే సూర్య (సరిపోదా శనివారం) ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్) ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్) ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన–నిజమే నే చెబుతున్నా..) ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2– సూసేటి అగ్గిరవ్వ) ఉత్తమ హాస్యనటులు: సత్య, వెన్నెల కిశోర్ (మత్తు వదలరా–2) ఉత్తమ బాలనటులు: మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల (35 ఇది చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్) ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి) ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్) ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్) ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి) ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్) ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి) ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేశ్ ఆచార్య (దేవర) ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి) ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: కె. చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్స్టర్) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్) ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి) స్పెషల్ జ్యూరీ అవార్డులు దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్) అన్యన్య నాగళ్ల (పొట్టేల్) సుజిత్, సందీప్ (కేఏ) ప్రశాంత్రెడ్డి, రాజేశ్ (రాజు యాదవ్) స్పెషల్ మెన్షన్: ఫరియా అబ్దుల్దా (మత్తు వదలరా–2) తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం: మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్) -
తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు : అల్లు అర్జున్
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులపై అల్లు అర్జున్ స్పందించారు. పుష్ప 2 చిత్రానికి ఉత్తమ నటుడిగా తనను ఎంపిక చేయడం గౌరవంగా ఉందన్నారు. ఈ గౌరవాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో పాటు పుష్ప టీమ్ మొత్తానికి ఈ ఘనత దక్కుతుందని చెప్పారు. ఈ అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. (చదవండి: గద్దర్ అవార్డులు : ఉత్తమ చిత్రాలివే.. ప్రత్యేకత ఏంటంటే?)అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా గద్దర్ అవార్డులపై స్పందించారు. సినిమా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. దేవర చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు గెలుచుకున్న గణేష్తో పాటు విజేతలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. (చదవండి: :'గద్దర్ అవార్డ్స్' విజేతలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం)కాగా, 2024 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను గురువారం ప్రకటించింది. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డుల వివరాలను గురువారం జ్యూరీ చైర్పర్సన్ జయసుధ వెల్లడించారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మూడు చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. అందులో మొదటి చిత్రం కల్కి , రెండో చిత్రంగా పొట్టేల్, మూడో చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికైంది. ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప 2), ఉత్తమ నటిగా నివేధా థామస్ ( 35 చిన్న కథ కాదు) అవార్డుకు ఎంపికయ్యారు. జూన్ 14న ఈ అవార్డులను అందిస్తారు. -
#GaddarAwards2024 : గద్దర్ అవార్డులు-2024 (ఫొటోలు)
-
అదే నిజమైతే బన్నీ ఫ్యాన్స్ కు షాక్...
-
రాఘవేంద్రరావు కి అల్లు అర్జున్ గౌరవం ఇదే!
-
అల్లు అర్జున్, అట్లీ సినిమా టైటిల్ ఇదేనా..?
‘పుష్ప 2’తో అల్లు అర్జున్, జవాన్తో దర్శకుడు అట్లీ పాన్ ఇండియా రేంజ్లో అదరగొట్టేశారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి కూడా.. త్వరలో షూటింగ్కు సిద్ధం అవుతున్నారు. ఈమేరకు తాజాగా దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకుని, అల్లు అర్జున్తో సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు కొనసాగిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించనున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.అల్లు అర్జున్- అట్లీ (AA22) సినిమాకు రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఐకాన్, సూపర్హీరో వంటి వాటిని ఎంపికచేశారని తెలుస్తోంది. గతంలో దర్శకుడు వేణు శ్రీరామ్ అల్లు అర్జున్తో ఒక సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు. అందుకు ‘ఐకాన్’ టైటిల్ను ఆయన అనుకున్నారు. అయితే, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అట్లీ సినిమాకు ‘ఐకాన్’ టైటిల్ అయితే ఎలా ఉంటుందని బన్నీ ఆలోచిస్తున్నారట. అట్లీ కూడా బాగానే ఉందని చెప్పారట. దాదాపు ఇదే టైటిల్ను ఫిక్స్ చేస్తారని సమాచారం.ప్రతి సినిమాకీ ఓ కొత్త లుక్తో అభిమానులను అలరిస్తారు అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో మాస్ లుక్లో కనిపించిన బన్నీ ఇప్పుడు అట్లీ సినిమా కోసం సరికొత్తగా తన లుక్ను మార్చుకోనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ భిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. కథకు తగ్గట్లుగానే అల్లు అర్జున్ పలు లుక్స్ను ప్రయత్నించినట్లు సమాచారం. పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉండే సైన్స్ఫిక్షన్ సినిమాగా ఇది రానున్నట్లు ప్రచారంలో ఉంది. అందుకోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. హాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగింది. -
అల్లు అర్జున్ మనసులో రాఘవేంద్రరావు స్థానం.. ఫోటో వైరల్
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ తన తొలి చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారిపట్ల ఎంతో గౌరవం, కృతజ్ఞతతో ఉంటాడు. తనను హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును నిత్యం తలచుకునేలా, తన సినీ ప్రయాణం ప్రారంభమైన దశను ప్రతిరోజూ గుర్తు చేసుకునేలా, అల్లు అర్జున్ తన కార్యాలయ ప్రవేశద్వారంలో రాఘవేంద్రరావు ఫోటోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా దర్శకుడిపై తన గౌరవాన్ని చాటుకున్నారు.అల్లు అర్జున్ కెరీర్ విజయాలమీద మాత్రమే కాకుండా, తనకు మద్దతుగా నిలిచిన వారిపట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచే విషయంలో కూడా ఎంతో విలువలతో ఉంటాడు. ఈ విషయంలో ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతో ప్రత్యేకమైనది. రాఘవేంద్రరావు తనను సినిమారంగంలోకి పరిచయం చేసిన తొలి దర్శకుడిగా, ఆయన జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించారు."అల్లు అర్జున్ తన కెరీర్ ఎదుగుదలకు తోడ్పడిన దర్శకుల విషయంలో ఎంతో జెన్యూన్ ప్రేమతో ఉంటాడు. వాళ్ల పట్ల ఎప్పుడూ ఆయన మనసులో ఎంతో గౌరవం ఉంటుంది. అందులో రాఘవేంద్రరావుకు బన్నీ జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. తన దర్శకులు, సాంకేతిక నిపుణులు, చిత్రబృందంలోని ఇతర సభ్యుల పట్ల అల్లు అర్జున్ గల గాఢమైన భావోద్వేగ బంధం గురించి ఆయన తరచూ మాట్లాడుతుంటారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలిదశలో ఆయనకు సహాయపడిన వారిని ఆయన ఎప్పటికీ మరిచిపోరు అని పలువురు అంటున్నారు.అల్లు అర్జున్ కార్యాలయం ప్రవేశద్వారంలో ఉన్న రాఘవేంద్రరావు చిత్రపటం ఆయనలో ఉన్న కృతజ్ఞత, గౌరవం, భావోద్వేగ సమన్వయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ విలువలే ఆయన విజయాలకు పునాది మాత్రమే కాకుండా, స్టార్గా కాకుండా వ్యక్తిగా కూడా ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి అని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్
-
అట్లీ- బన్ని సినిమా అప్డేట్.. ఫ్యాన్స్కి పునకాలు గ్యారెంటీ!
హీరో అల్లు అర్జున్ (Allu Arjun), దర్శకుడు అట్లీ (Atlee)ఫుల్ స్వింగ్లో ఉన్నారు. తమ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో రానున్న సినిమా పనులను స్పీడప్ చేశారు. తాజాగా ఈ చిత్రం ప్రీ డక్షన్ పనుల నిమిత్తమై అల్లు అర్జున్ను కలిసేందుకు హైదారాబాద్ వచ్చారు అట్లీ. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ను ముగించేసి, జూన్లో ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించాలన్నది వీరి ప్లాన్ అని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారట. ఈ మూడు పాత్రల్లో ఒకటి యానిమేటెడ్ రోల్ అనే టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్కి పునకాలు తెప్పించే సన్నివేశాలో ఇందులో చాలా ఉండబోతున్నాయట. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సాగే ఈ చారిత్రాత్మక చిత్రంలో యాక్షన్ సీన్స్ వేరే లెవల్లో ఉంటాయట. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని చిత్రబృందం ముందు నుంచి చెబుతుంది. రూ.700 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటించబోతున్నట్లు సమాచారం. -
రామ్చరణ్ టూ ప్రభాస్..టుస్సాడ్స్లో స్టార్స్...ఎవరు గ్రేట్?
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైనపు విగ్రహాల ప్రదర్శన కేంద్రం. ఇది లండన్, సింగపూర్, దుబాయ్, ఢిల్లీ వంటి భారీ నగరాల్లో ఉంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ నటులు, సంగీతకారులు తదితర అంతర్జాతీయ ప్రముఖుల మైనపు విగ్రహాలను ప్రదర్శిస్తారు. ఆయా సెలబ్రిటీలకు ఆయా సందర్భాల్లో ఉన్న పాప్యులారిటీని దృష్టిలో ఉంచుకుని వీటిని నెలకొల్పుతారు కాబట్టి ఈ విగ్రహాలు అత్యంత ప్రాచుర్యం సెలబ్రిటీలకు స్టేటస్ సింబల్స్గా మారాయి. ఇటీవల మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం భారతీయ సినీ ప్రముఖుల గౌరవార్థం మైనపు విగ్రహాలను ప్రదర్శించడంలో భాగంగా టాలీవుడ్ ప్రముఖులకు ప్రాధాన్యం ఇవ్వడం టాలీవుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో సూచిస్తుంది. ఇందులో పదుల సంఖ్యలోనే ఇండియన్ స్టార్స్ చోటు చేసుకున్నప్పటికీ.. విశేషం ఏమిటంటే... మన టాలీవుడ్ స్టార్స్ నలుగురి విగ్రహాలు ఒక్కోటి ఒక్కో రకమైన ప్రత్యేకతతతో చరిత్ర సృష్టించాయి.లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరిన తాజా మైనపు విగ్రహం టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ది. ఇటీవల లండన్ లో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో రామ్ చరణ్ అతని పెంపుడు కుక్క రైమ్ సహా మైనపు బొమ్మలుగా మారి కొలువుదీరడం విశేషం. క్వీన్ ఎలిజబెత్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో తన పెట్తో సహా కొలువుదీరిన రెండవ సెలబ్రిటీగా, సినీరంగం నుంచి మొదటి వాడిగా రామ్ చరణ్ రికార్డ్ సాధించాడు.గత మార్చి 2024లో, ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం దుబాయ్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలా వైకుంఠపురములో చిత్రం లో కనిపించినట్టుగా ఎరుపు జాకెట్ ధరించి, మేడమ్ టుస్సాడ్స్ లో ఈ విగ్రహం కొలువుదీరింది. పుష్ప ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన బన్నీ ని కింగ్ ఆఫ్ డ్యాన్స్ అంటూ టుస్సాడ్స్ పేర్కొనడం విశేషం.గత 2019 మార్చి లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మహేష్ బాబుకు ఉన్న భారీ అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కారణంగా, ఈ విగ్రహాన్ని సింగపూర్ నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకువచ్చారు. అలా తొలిసారిగా, ఒక భారతీయ నటుడి విగ్రహాన్ని స్వదేశానికి తీసుకువచ్చిన ఘనతను మహేష్ దక్కించుకున్నాడు. ఇక ఇలాంటి అంతర్జాతీయ పాప్యులారిటీకి కొబ్బరికాయ కొట్టిన హీరో ప్రభాస్... మేడమ్ టుస్సాడ్స్లో చోటు సంపాదించిన మొట్టమొదటి దక్షిణ భారత నటుడుగా కూడా ఘనత దక్కించుకున్నాడు. గత 2017మార్చి లో బ్యాంకాక్లోని మేడమ్ టుస్సాడ్స్లో కొలువుదీరిన బాహుబలి తన నటన ద్వారా, బ్లాక్బస్టర్ విజయాల ద్వారా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్ అమెరికా వంటి దేశాలలోనూ ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. -
అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ
-
కేరళలో 'అల్లు అర్జున్'ను స్టార్గా చేసిన ఖాదర్ ఎవరో తెలుసా?
అల్లు అర్జున్కు మలయాళంలో కూడా భారీగా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అక్కడ మన బన్నీకి అంతలా గుర్తింపు రావడం వెనుక ఒక నిర్మాత ఉన్నారని మీకు తెలుసా..? ‘ఆర్య’ సినిమా తర్వాత అల్లు అర్జున్కు మలయాళంలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. మలయాళీలు ఆయన్ను మల్లు అర్జున్ అరి ముద్దుగా పిలుచుకుంటారు. టాలీవుడ్లో ఆయన సినిమాలు ఎంతలా అలరిస్తాయో.. అందుకు ఏమాత్రం తగ్గకుండా.. కేరళలోనూ ఆడుతుంటాయి. పుష్ప విడుదల సమయంలో అక్కడ ఏ సినిమా కూడా పోటీకి దిగలేదు అంతలా స్టార్డమ్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అయితే, మలయాళీ గడ్డమీద మన బన్నీ అడుగులు ఎలా పడ్డాయో తెలుసా.అల్లు అర్జున్ను మలయాళ ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయాణం గురించి నిర్మాత ఖాదర్ హసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, వ్యూహాలతో పాటు కేరళలో అల్లు అర్జున్కు వచ్చిన ప్రజాదరణ గురించి ఆయన మాట్లాడారు. నేను పేరుకే నిర్మాతను. కానీ, నాకు దర్శకత్వం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే అన్ని భాషల సినిమాలను చూస్తుంటాను. అలా 2002లో జెమిని టీవీలో 'నువ్వే నువ్వే' సినిమా చూశాను. అందులో 'ఐ యామ్ వెరీ సారీ' పాట నా దృష్టిని ఆకర్షించింది. వెంటనే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ కేరళలో విడుదల చేయాలని హైదరాబాద్ వచ్చేశాను. నిర్మాత రవి కిషోర్ను కలిసి డబ్బింగ హక్కులను పొందాను. మలయాళంలో 'ప్రణయమయి' పేరుతో విడుదల చేశాను. అయితే, సినిమాకు పెద్దగా డబ్బులు రాలేదు. కానీ, మంచి పేరు వచ్చింది. అలా మొదటిసారి డబ్బింగ్ సినిమాలపై నా అడుగులు పడ్డాయి.'ప్రణయమయి' సినిమా తర్వాత మరోక ప్రాజెక్ట్ను కేరళలో విడుదల చేయాలని నిర్మాత ఖాదర్ హసన్ అనుకుంటున్న సమయంలో ఆర్య పాటలు ఆయన చెవున పడ్డాయి. 'ఆర్య సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ తప్పకుండా కేరళలో స్థానం దక్కించుకుంటాడని నాకు అనిపించింది. 2004లో మళ్లీ హైదరాబాద్ వెళ్లి దిల్రాజును కలిశాను. ఆర్య డబ్బింగ హక్కులు కావాలని అడిగాను. మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. చాలాకష్టపడి ఆయన్ను ఒప్పించి కేరళలో ఆర్య సినిమాను విడుదల చేశాను. అప్పటికి తెలుగు సినిమాలకు ఇక్కడ పెద్దగా మార్కెట్ లేదు. డబ్బింగ్ సినిమాలు అంటేనే చిన్నచూపు చూసేవారు. దానిని నేను ఎలాగైనా సరే మార్చాలని అనుకున్నాను. మలయాళీలకు తగ్గట్టుగా ఆర్య కోసం మంచి సంభాషణలు రాయించాను. మిక్సింగ్, ఇతర సాంకేతిక అంశాలను చెన్నైలోని భరణి వంటి ప్రఖ్యాత స్టూడియోలలో చేపించాను. ఆర్య పాటలను ప్రముఖ మలయాళ గాయకులు పాడారు. ఈ సినిమా కోసం నేను వ్యక్తిగతంగా చాలా రిష్క్ చేశాను. అప్పటికీ నేను అల్లు అర్జున్ను కనీసం కలవలేదు' అని అన్నారు.ఆర్య విజయం కోసం..ఆర్య సినిమా బాగుంది. కానీ, మలయాళీలకు పరిచయం చేయాలని తాను చాలా కష్టపడ్డానని నిర్మాత ఖాదర్ హసన్ అన్నారు. 'ఈ సినిమా పాటలు, ట్రైలర్లను విస్తృతంగా ప్రసారం చేయడానికి మేము ఆసియానెట్ కేబుల్ వారితో కనెక్ట్ అయ్యాం. లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్లను కూడా సంప్రదించాము. ఆపై సినిమా చూడటానికి విద్యార్థులను ఆహ్వానిస్తూ కళాశాలల్లోని యూనియన్లను సంప్రదించాం. అల్లు అర్జున్ స్టిక్కర్స్ను పంపిణీ చేశాం. పిల్లలకు అవి బాగా నచ్చాయి. బన్నీ మాస్క్లను కూడా ఉచితంగానే ఇచ్చాం. వాటితో పాటు మేము 3డి ఫ్యాన్ కార్డ్ను విడుదల చేశాం. ఇలా ఎన్నో ఆర్య సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశాం' అని ఆయన అన్నారు.ఆర్యతో అనుకున్నది చేశాను: ఖాదర్ఆర్య విడుదల తర్వాత తాము అనుకున్నది సాధించామని ఖాదర్ హసన్ అన్నారు. ఎవరూ ఊహించలేనంతగా తమకు లాభాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని చోట్లు ఈ చిత్రం వందరోజులు కూడా రన్ అయినట్లు పేర్కొన్నారు. ఈ మూవీ తర్వాత తాము బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య2 ఇలా దాదాపు అన్ని సినిమాలు మలయాళంలో విడుదల చేశామన్నారు. ఆర్య విజయం తర్వాత కేరళ ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు మలయాళీలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఇప్పటికీ ఆయనంటే అభిమానం చూపుతారు. 'ఈ ప్రయాణంలో, కేరళలో తన ఉనికిని స్థాపించడానికి నేను చేసిన ప్రయత్నాలకు అల్లు కృతజ్ఞతతో ఉన్నాడు. ఆయన మద్దతు మాపై ఎప్పటికీ ఉంటుంది. మలయాళీ ప్రజల పట్ల అల్లు అర్జున్ ఎప్పటికీ కృతజ్ఞతతోనే ఉంటాడు. ఇలా పరస్పర గౌరవం, అవగాహన వల్లే బన్నీతో వృత్తిపరమైన సంబంధాన్ని బలోపేతం చేసింది. నన్ను ఒక స్నేహితుడిగానే మల్లు అర్జున్ చూస్తాడు' అని ఖాదర్ అన్నారు. -
బాలీవుడ్లో ప్రభాస్ని కొట్టేదెవరు?
ఇప్పుడు బాలీవుడ్కి టాలీవుడ్ సత్తా తెలిసివచ్చింది. ఒకనాటి హీరోల్లా ఏదో వచ్చాం అంటే వచ్చాం చేశాం అంటే చేశాం అన్నట్టు ఒకటీ అరా చేసి పోయే రకం కాదని, ఒకసారి కాలు పెడితే కార్చిచ్చులా వ్యాపించే నేటి తరం తెలుగు హీరోలను ఆపడం తమ తరం కాదని హిందీ బెల్ట్కి ఇప్పుడు బాగా అర్ధమవుతోంది. నిజానికి బాలీవుడ్ కి ఒకప్పుడు తెలుగు సినిమా అంటే శతకోటి ఇండస్ట్రీల్లో అదొకటి. తెలుగు ఫిలిం మేకర్స్ ను చాలా తక్కువ చేసి చూసేవారు. దీన్ని మార్చాలని తామూ తక్కువేం కాదని నాటి సీనియర్ హీరోలు చాలా ప్రయత్నించారు. ఒకానొక దశలో అమితాబ్ను కూడా దాటేసి చిరంజీవి దేశంలోనే హైపెయిడ్ ఆర్టిస్ట్గా నిలిచి తన సత్తా చాటారు. అయినా ఇవేవీ బాలీవుడ్ బుర్రకెక్కలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్లు డైరెక్ట్ హిందీ చిత్రాల్లో నటించి అప్పుడప్పుడు అక్కడ మెరుపులు మెరిపించినా పెద్దగా ఒరిగింది అంటూ ఏమీ లేదు. (చదవండి: సమంత డేటింగ్ రూమర్స్.. డైరెక్టర్ రాజ్ సతీమణి పోస్ట్ వైరల్!)అదంతా ఒకెత్తయితే ‘బాహుబలి’ఒక్కటీ ఒకెత్తయింది. బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని వుడ్లూ తనవైపు తలెత్తి చూసే రేంజ్ కు మన తెలుగు సినిమా ఎదిగింది. ఓ వైపు బాలీవుడ్లో ప్రభాస్(Prabhas) ప్రభంజనం కొనసాగుతుండగానే దూసుకొచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్(Jr NTR), రామ్ చరణ్(Ram Charan)లు, ‘పుష్ప’, ‘పుష్ప 2’ల తో అల్లు అర్జున్(Allu Arjun) కూడా నార్త్ లో బాలీవుడ్ హీరోలకు థీటుగా కలెక్షన్లు, ఫాలోయింగ్ను అందుకుంటూ ఇండియన్ సినిమాపై బాలీవుడ్ ఆధిపత్యాన్ని కుప్పకూల్చారు. ఈ నేపధ్యంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగిన మన హీరోల్లో అక్కడ అగ్రపీఠం కోసం ఇంటర్నల్ వార్ మొదలైంది. ప్రస్తుతం వీరిలో ఎవరికి వారే సాటి అన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ... అందరిలో ప్రభాస్ కాస్త ముందున్నాడని చెప్పక తప్పదు. ముఖ్యంగా హైట్, వెయిట్ సహా కటౌట్లో బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ప్రభాస్ను నార్త్ జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బాహుబలి తర్వాత విడుదలైన ప్రభాస్ సినిమాలు కూడా బాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ సాధించడానికి అదే కారణం. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ టాలీవుడ్లో ఫ్లాప్ కాగా, అక్కడ సూపర్ హిట్ గా ‘ఆదిపురుష్’ కి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ‘సలార్’ ‘కల్కి’ లు బాక్సాఫీస్ను షేక్ చేసేశాయి. మరోవైపు ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత దేశవ్యాప్తంగా విడుదలై ఎన్టీఆర్ , రాంచరణ్..ల సినిమాలకు నార్త్లో అంతగా కలెక్షన్స్ రాలేదు. హైప్ కూడా క్రియేట్ కాలేదు. ఇక అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా కనపడింది కానీ.. అది తర్వాతి సినిమా వరకు ఎంత వరకూ కొనసాగుతుందనేది అప్పుడే ఏమీ చెప్పలేము. పుష్ప రాజ్ పాత్ర ఉత్తరాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న స్థాయిలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నాడా? అంటే అవునని అప్పుడే చెప్పడం సరికాదు. ఈ నేపధ్యంలోనే ప్రభాస్ని ఢీ కొట్టడానికి మిగిలిన హీరోలు నార్త్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇక్కడి సినిమాల ద్వారా అక్కడకు వెళ్లడం కాకుండా..నేరుగా బాలీవుడ్ సినిమాలు చేయడం మీద దృష్టి పెట్టారు. ‘వార్ 2’ లో హృతిక్ రోషన్తో పాటు ఎన్టీఆర్ చేస్తున్న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఆమిర్ ఖాన్ తీస్తున్న‘ ‘మహాభారతం’లో అర్జునుడి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. అలాగే రాంచరణ్ కూడా సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అంటున్నాడు. మరి ఈ మల్టీస్టారర్ సినిమాల ద్వారా ప్రభాస్ను ఎంత వరకూ దాటగలరో...బాలీవుడ్లో సౌతిండియా సూపర్స్టార్ ఎవరు కానున్నారో.. -
పుష్ప రాజ్ తో కేజీఎఫ్ 2 భామ
-
పాన్ ఇండియా హీరో..పబ్లిక్ లైఫ్లో జీరో...
ఎర్రచందనం స్మగ్లింగ్.. నీకేం తెలుసు? అని పుష్ప సినిమా చూసిన ప్రేక్షకుడ్ని అడిగితే?.. కల్కి సినిమా స్టోరీ లైన్ ఏమిటంటే ఆ సినిమా చూసిన వారిలో ఎంతమంది ప్రేక్షకులు ఠక్కున చెప్పగలరు? ఆర్ఆర్ఆర్ సినిమా సన్నివేశాలకు మన ఇంటి చుట్టుపక్కల పరిస్థితులకు ఏమన్నా సంబంధం ఉందా? దేవర మూవీలో హీరోని చూస్తూ అతనితో మనకు తెలిసిన వారిని ఎవరినైనా పోల్చుకోగలమా? హిట్ 3లో చూపించిన డార్క్ వెబ్ గురించి తెలియడం అటుంటి అసలు ఆ పదం మనలో ఎందరు విని ఉంటాం?ఛత్..ఇవన్నీ ఎందుకు బాస్... ఆ సినిమాలన్నీ జనం జేబులు కొల్లగొట్టి మనకు కలెక్షన్ల మూటలు కొట్టుకొచ్చాయి కదా. అది చాలు అంటోంది టాలీవుడ్. పాన్ ఇండియా పేరుతో ప్రజలకు పరిచయం లేని సంబంధం లేని అక్కర్లేని, రంగుల హంగుల విచిత్రాల్ని కళ్ల ముందుకు తెస్తోంది. అయితేనేం అవి హిట్ అవడం లేదా అంటే అవుతున్నాయి. బ్రహ్మాండంగా కలెక్షన్లు తెస్తున్నాయి. కానీ అదొక్కటే చాలా? ఏమీ అర్ధం కాకపోయినా జురాసిక్ పార్క్, అవతార్..వగైరా చిత్రాలు మన దగ్గర కూడా భారీ కలెక్షన్లు కురిపించాయి. అంతమాత్రాన అలాంటివే మనమూ తీయాలని అనుకుంటామా? విదేశీ చిత్రాలకు ఇక్కడ మనుషులతో, ఇక్కడి మనస్తత్వాలతో, ఇక్కడి పరిస్థితులతో పనిలేదు.. అవసరం లేదు. కానీ ఇక్కడి సినిమాలు ఇక్కడి మనుషులతో పెనవేసుకున్నాయి. ఇక్కడి ప్రజల కష్టంతో తయారవుతున్నాయి. వారి కష్టంతోనే దర్జాగా బ్రతుకుతున్నాయి. కాబట్టి జనం చూస్తున్నారు మేం తీస్తున్నాం అనేది ప్రాంతీయ సినిమాల వరకూ సరైన విధానం కాదు.(చదవండి: భారత్పై ప్రశంసలు.. హీరోయిన్కి బెదిరింపులు!)పెద్ద ఎన్టీయార్ తరం చూస్తే నాటి హీరోలు ఎన్ని రకాల సినిమాలు చూపించారు? దైవ భక్తి నుంచి దేశభక్తి దాకా బోధించేవి...అవినీతి అరికట్టమని అన్యాయాన్ని ఎదరించమని రక్త సంబంధాలకు విలువీయమని...రాజకీయాలను బాగు చేయమని...సందేశాలిచ్చేవి ఇలా సామాజిక అంశాలతో ముడిపడిన సినిమాలు ఎన్నో వచ్చాయి... మంచి చెడు రెండింటినీ జనానికి విడమరిచాయి. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి సినిమాలు సృష్టించాడు కాబట్టే ఎన్టీయార్ అనే వ్యక్తిని జనం తమ అన్నగా గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు. పార్టీ పెట్టిన ఆర్నెళ్లలోనే సిఎంని చేసి నెత్తిన పెట్టుకున్నారు.(చదవండి: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!)ఆ తర్వాత డ్యాన్సులు, ఫైట్లకు పెద్ద పీట వేసిన చిరంజీవి తరం కూడా జనరంజక సినిమాలనే అది కూడా జనజీవన స్రవంతికి దూరం కాకుండానే అందించింది. తొలిదశలో చేసిన అభిలాష, స్వయంకృషి, ఛాలెంజ్ల నుంచి రాజకీయాలకు ముందు చేసిన ఠాగూర్,స్టాలిన్... దాకా మన సమాజంతో ముడిపడిన కధాంశాలతో చేశాడు కాబట్టే చిరంజీవి ఒక పార్టీ పెట్టి 19 సీట్లు, 70లక్షల ఓట్లు దక్కించుకోగలిగాడు. అయితే ఇక్కడ సినిమా నటులు అందరూ రాజకీయాల్లోకి రావాలని ఈ విషయాలు చెప్పడం లేదు. వారి వృత్తికి, ఎంచుకున్న రంగానికి, చేసే పనికి ప్రజలతో మమేకమైతే అది ఎంతగా ప్రజల్లో వారిపై ఆదరణ పెంచుతుందో సోదాహరణగా చెప్పడమే ఉద్ధేశ్యం. ప్రజల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపే శక్తి సినిమాలకి ఉంది అనడం నిస్సందేహం. అలాంటి సినిమాలను ప్రజల దైనందిన జీవితాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా తెరకెక్కించడం అంటే వారి జేబులు కొల్లగొట్టడం తో తప్ప వారి కష్టనష్టాలతో తమకేమీ సంబంధం లేదని నిస్సిగ్గుగా తేల్చి చెప్పడమే.(చదవండి : ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక)అంటే జనం కోసం సినిమా తీసి మమ్మల్ని డబ్బులు పోగొట్టుకోమంటావా? అని నిర్మాతలు, ఫ్లాప్ సినిమాలతో ఫ్యాన్స్ని దూరం చేసుకోమంటావా? అని ప్రశ్నించే హీరోలు ఉంటారు. అయితే సందేశాత్మక చిత్రాలకు కలెక్షన్లు రావనేది అర్ధసత్యం మాత్రమే. వాటిలోనూ హిట్స్, ఫ్లాప్స్ అవుతుంటాయి. గేమ్ ఛేంజర్ లాగా అవాస్తవిక చిత్రణతో తీస్తే ఫ్లాప్లు అదే ‘కోర్ట్’ లాగా వాస్తవ పరిస్థితులకు అద్దం పడితే కలెక్షన్లు వస్తాయని తెలుస్తూనే ఉంది. అలాగని భారీ చిత్రాలు కాల్పనిక కధాంశాలు వద్దనడం లేదు అవి కూడా తీయవచ్చు, సదరు గ్రాఫిక్ ఆధారిత చిత్రాలతో అంతర్జాతీయంగా మన సినిమాల పేరు ప్రతిష్టలు పెంచవచ్చు. కానీ అవి మాత్రమే తీయాలని అనుకోకూడదు. ప్రజలతో సంబంధం ఉన్నవి కూడా తీయాలి. వారి కష్టనష్టాలకు ఊరటనిచ్చేవి, వారి రేపటికి బాటలు పరిచేవి, వారి బాగుకి దిక్సూచిగా నిలిచేవి కూడా చేయాలి. కనీసం రెండేళ్లకు ఒకటైనా లో బడ్జెట్లో అయినా సామాజిక అంశాలతో సినిమా చేస్తామని పెద్ద హీరోలు తమకు తాము మాట ఇచ్చుకోవాలి. తమకెన్నో ఇచ్చిన సమాజం రుణం తీర్చుకోవాలి. అలా కాదు..అవన్నీ చిన్న హీరోలకు వదిలేస్తాం...మేం మాత్రం ఇలాగే వీడియో గేమ్స్ తరహా చిత్రాలు చేసుకుంటూ ప్రజల కళ్లు విప్పార్చుకునేలా చేస్తూ డబ్బు చేసుకుంటాం...అంటే..ఖచ్చితంగా అది అన్యాయమే, సామాజిక బాధ్యత లేకపోవడమే.. అప్పుడు పెద్ద హీరోల దగ్గర డబ్బులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు..కానీ ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. అలా లేనప్పుడు పేరుకి పెద్ద హీరో అయినా చివరకు జీరోగానే మిగులుతాడు. -
అల్లు అర్జున్ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న 20 ఏళ్ల కుర్రాడు.
-
ఆమిర్ని కలిసిన అల్లు అర్జున్.. భారీ ప్రాజెక్ట్ కోసమేనా?
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) భేటీ అయ్యారు. ముంబైలోని ఆమిర్ నివాసానికి వెళ్లిన బన్నీ..ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇలా ఉన్నపళంగా ఆమిర్తో బన్నీ బేటీ కావడంపై రకరకాల పుకార్లు వెల్లువడుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుందని, దాని కోసమే ఆమిర్ని కలిశాడని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమిర్ తన తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన భారీ బడ్జెట్తో ‘మహా భారతం’ తీయాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోలు నటిస్తారని ఇటీవల ఆయన ప్రకటించారు. తాజాగా బన్నీ వెళ్లి కలవడంతో..‘మహా భారతం’కోసమే ఈ భేటీ జరిగిందనే ప్రచారం మొదలైంది. దీనిపై అధికారిక ప్రకటనలు ఏవీ రాకపోయినా, అటు బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ ఇప్పుడు బన్నీ-ఆమిర్ భేటీనే హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో బీజీగా ఉన్నారు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే బన్నీ షూటింగ్లో పాల్గొంటారు. ఇందులో హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండబోతున్నాయట. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడో కథానాయికగా ‘లైగర్’ ఫేమ్ అనన్యా పాండేను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారని సమాచారం. -
ట్రైనింగ్ షురూ
క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోవడానికి అల్లు అర్జున్ ఏ మాత్రం వెనకాడరు. కెరీర్ తొలి నాళ్లల్లో ‘దేశ ముదురు’ (2007) కోసం సిక్స్ ప్యాక్ చేశారు అల్లు అర్జున్. ఆ తర్వాత క్యారెక్టర్లకు తగ్గట్టుగా తనని తాను మలచుకుంటూ వచ్చారు. తాజాగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో చేయనున్న సినిమా కోసం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్స్ స్టీవెన్ని నియమించుకున్నారు.ఈ విషయాన్ని లాయిడ్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించి, అల్లు అర్జున్, తానూ ఉన్న ఫొటోని షేర్ చేశారు. లాయిడ్స్ మామూలు ట్రైనర్ కాదు. ఇప్పటికే మహేశ్బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్స్కి ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగారు. సో.. అట్లీ సినిమాలో అల్లు అర్జున్ కొత్తగా కనిపిస్తారని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాలనుకుంటున్నారు. -
సెల్ఫీకి అల్లు అర్జున్ నో.. ఎయిర్పోర్ట్లో అభిమానికి నిరాశ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ముంబయిలో సందడి చేశారు. ప్రతిష్టాత్మక వేవ్స్ సమ్మిట్-2025కు బన్నీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఈ సమ్మిట్లో పంచుకున్నారు. సినీరంగంలో తనకు మామయ్య మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శమంటూ కామెంట్స్ చేశారు. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టనున్నారు. ఈ సినిమా బన్నీ కెరీర్లో 22వ చిత్రంగా రానుంది.ఇదంతా పక్కన పెడితే వేవ్స్ సమ్మిట్కు వెళ్తూ మన ఐకాన్ స్టార్ ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే కారు దిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్లే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కానీ అతనితో ఫోటో దిగేందుకు బన్నీ అనుమతించలేదు. అతన్ని పక్కనే ఉన్న సెక్యూరిటీ సైతం వద్దని వారించారు.దీంతో అల్లు అర్జున్ వైఖరిపై నెటిజన్స్ ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని పోస్టులు పెడుతున్నారు. అభిమానులే లేకపోతే అసలు మీరు ఎవరు? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. వెంటనే అల్లు అర్జున్ సినిమాలు చూడటం మానేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే మరికొందరు అల్లు అర్జున్కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల వారికి సమయం ఉండదని అంటున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సింహాచలం దుర్ఘటనపై బీజేపీ ధార్మిక సెల్ కో కన్వీనర్ ఫణీంద్ర ఫైర్
-
అల్లు అర్జున్.. నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా!
మీకు మీమ్ లాంగ్వేజ్ తెలుసా? అవును మీరు సరిగానే విన్నారు. అందరూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వచ్చా అని అంటారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ఉపయోగించేవాళ్లకు మీమ్ లాంగ్వేజ్ అని ఒకటుంది. బయటవాళ్లకు అది అర్థం కాదు కానీ ఇన్ స్టా వాడేవాళ్లకు బాగా తెలుసు.ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే అల్లు అర్జున్(Allu Arjun).. మీమ్ లాంగ్వేజ్ ఉన్న ఓ టీ షర్ట్ ధరించాడు. ముంబై ఎయిర్ పోర్ట్ లో 'నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా' అని ఫేమస్ బ్రహ్మానందం డైలాగ్, ఆయన ఫొటోలతో ఉన్న టీ షర్ట్ తో కనిపించాడు. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ కూడా ట్రెండ్ ఫాలో అయిపోతున్నాడే అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ') సినిమాల విషయానికొస్తే.. 'పుష్ప 2'(Pushpa 2 Movie) బ్లాక్ బస్టర్ తర్వాత మూడు నెలలు గ్యాప్ తీసుకున్న బన్నీ.. తమిళ దర్శకుడు అట్లీతో(Director Atlee) సినిమాను ప్రకటించాడు. మూవీ ఎలా ఉండబోతుందనే వీడియో కూడా రిలీజ్ చేశారు. దీంతో ప్రాజెక్ట్ మొదలవకుండానే హైప్ పెరిగిపోయింది. ప్రస్తుతం హీరోయిన్లు, ఇతర క్యాస్టింగ్ ఎంపిక చేసే పనిలో టీమ్ ఉంది. మరికొన్ని నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.మరోవైపు త్రివిక్రమ్ కూడా బన్నీ కోసం మైథలాజికల్ స్టోరీ ఒకటి రెడీ చేశారు. లెక్క ప్రకారం పుష్ప 2 తర్వాత ఇదే మొదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ గురూజీ స్క్రిప్ట్ ని బన్నీ కాస్త పక్కనబెట్టాడు. అట్లీ ప్రాజెక్ట్ తర్వాత త్రివిక్రమ్ తో బన్నీ సినిమా ఉంటుంది. కానీ దీనికి మరో ఏడాది సమయం పట్టొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) Look At The Tshirt 😂🤍@AlluArjun #AlluArjun pic.twitter.com/8QyTrPX9OT— C/o.AlluArjun (@CareOfAlluArjun) May 2, 2025 -
హీరోయిన్ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్ ప్యాక్ చేశా: అల్లు అర్జున్
అప్పట్లో ఆరుఫలకల దేహానికి ఉన్న క్రేజే వేరు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు.. చాలామంది హీరోలు సిక్స్ ప్యాక్లు ట్రై చేసినవారే.. తెలుగుకు ఆ ట్రెండ్ను తీసుకొచ్చింది మాత్రం హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అనే చెప్పాలి. దేశముదురు సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్తో కనిపించాడు. తర్వాత చాలామంది తెలుగు హీరోలు ఈ ట్రెండ్ను ఫాలో అయ్యారు.20 ఏళ్ల కిందట..గురువారం నాడు వేవ్స్ సదస్సు (Waves Summit 2025)కు హాజరైన అల్లు అర్జున్ ఈ ట్రెండ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బన్నీ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం దక్షిణాదిన ఏ నటుడూ చేయని పని నేను చేసి చూపించాను. మన వల్ల కాదు అన్న పనిని చేసి చూపిస్తే ఆ కిక్కే వేరు. నిజానికి నేను ఆరు ఫలకల దేహం కోసం ప్రయత్నించడానికి ఓ హీరోయిన్ ముఖ్య కారణం. తను నాతో ఓ సినిమా కూడా చేసింది. సౌత్లో ఎవరూ సిక్స్ ప్యాక్స్ చేయలేరు అని కామెంట్స్ చేసింది. సిక్స్ ప్యాక్ చేసి చూపించా..అది నాకు నచ్చలేదు. ఎందుకు చేయలేరు? అని ప్రశ్నించుకున్నాను. ఛాలెంజ్గా తీసుకున్నాను. సిక్స్ ప్యాక్స్ చేసి చూపించాను అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరోయిన్ ఎవరన్నది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. దేశముదురు చిత్రంలో తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హన్సిక కథానాయికగా నటించింది. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం 2007 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: విజయ్ దేవరకొండపై కేసు! ఎందుకంటే? -
ఏప్రిల్ నెల స్వీట్ మెమొరీస్ అంటూ ఫోటోలు షేర్ చేసిన 'అల్లు స్నేహ'
-
ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్ : అల్లు అర్జున్
ప్రమాదం జరిగితే కష్టం, నష్టమే. కానీ, అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మంచి కూడా చేస్తాయి. ప్రముఖ హీరో అల్లు అర్జున్(Allu Arjun) స్వయంగా ఈ మాట అంటున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)(WAVES 2025)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ– ‘‘కెరీర్ తొలి రోజుల్లో నా దృష్టి అంతా ఫిజికల్ ఫిట్నెస్, ఎజిలిటీ మీదే ఉండేది. కానీ, జీవితంలో ఒక ఘటన నా ఆలోచననే మార్చేసింది. నా పదో సినిమా తర్వాత నా భుజానికి దెబ్బ తగిలి, ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకున్నా. అంతా బాగైపోయి, నాలుగో వారం నుంచి సెట్స్ మీదకు వెళ్ళిపోవచ్చనుకున్నా. డాక్టర్లు 6 నెలలు రెస్ట్ తప్పనిసరి అన్నారు. నాకు కొత్తగా పెళ్ళయింది. ఓ సినిమా సగంలో ఉంది. అప్పటి దాకా ఫిజికల్ ఫిట్నెస్కే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది.వయసు పెరిగే కొద్దీ ఫిట్నెస్, ఎజిలిటీ తగ్గుతాయి. కానీ, నటనపై దృష్టి పెడితే అది చిరకాలం మిగిలిపోతుందని గ్రహించా. అక్కడి నుంచి నా ఆలోచనే మారిపోయింది’’ అని వివరించారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘పదో సినిమా దగ్గర మొదలైన ఆ ఆలోచన ఇరవయ్యో సినిమా ‘పుష్ప–1’ దగ్గరకు వచ్చేసరి కల్లా నన్ను జాతీయ ఉత్తమ నటుడిగా, అందులోనూ తెలుగు సినీరంగం నుంచి ఆ ఘనత అందుకున్న తొట్ట తొలి నటుడిగా నిలిపింది. పదో సినిమా సమయంలో ఆ యాక్సిడెంట్ జరగకపోతే... నా దృక్పథం ఇలా మారేది కాదు.అందుకే, కొన్ని యాక్సిడెంట్లు అనుకోకుండా మన మంచికే జరుగుతాయి. మొత్తం నా ఆలోచనలు, కెరీర్నే మార్చేసిన ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్’’ అని అల్లు అర్జున్ వివరించారు. ‘సాక్షి’ ఆయనను పలకరించినప్పుడు ‘‘మెడిసిన్, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో చాలా కాలంగా జరుగుతున్న సమ్మిట్లు చూసి, అలాంటివి మన సినీ, వినోద రంగంలో కూడా జరగాలనుకున్నాను. ప్రధాని మోదీ చొరవతో తొలిసారిగా వేవ్స్ సదస్సు జరగడం శుభారంభం’’ అన్నారు. -
'సినిమాల్లో మామయ్యే నాకు ఆదర్శం'.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్!
ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు హాజరైన బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాల్లో నాకు మామయ్య మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శమని ఐకాన్ స్టార్ ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రభావం తనపై ఎప్పటికీ ఉంటుందని బన్నీ అన్నారు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో జతకట్టారు. జవాన్తో సూపర్ హిట్ సాధించిన అట్లీతో కలిసి బన్నీ పనిచేయనున్నారు. ఇటీవలే వీరి సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. బన్నీ కెరీర్లో 22వ సినిమాగా రానున్న ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి కూడా అల్లు అర్జున్ ఈవెంట్లో ప్రస్తావించారు. తప్పకుండా అభిమానులు ఆశించిన స్థాయిలో విజువల్ ప్రెజెంటేషన్ ఉంటుందని బన్నీ చెప్పుకొచ్చారు. The MEGASTAR | It's A Brand 🔥😎Finally AA About Our Boss 😎❤️🔥Evaraina Naa Chiranjeevi Tharuvathey@KChiruTweets #Chiranjeevi@alluarjun #AlluArjun #MegastarChiranjeevi pic.twitter.com/YimIk1NXIA— We Love Chiranjeevi (@WeLoveMegastar) May 1, 2025 -
అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?
పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అని ఫ్యాన్స్ చూస్తున్న టైంలో తమిళ దర్శకుడు అట్లీ పేరు తెరపైకి వచ్చింది. అంతకు ముందు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లాక్ అవడంతో.. గురూజీతోనే మూవీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అట్లీతో సినిమాను అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్-అట్లీ సినిమాను నిర్మించబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియోతోనే ఈ విషయం అర్థమైపోయింది. హాలీవుడ్ గ్రాఫిక్స్ నిపుణులతో హీరో-దర్శకుడు చర్చలు జరపడం అవి చూస్తుంటే ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా అనిపించింది.అట్లీ సినిమా అంటే హీరోకు ఎన్ని ఎలివేషన్లు ఉంటాయనే సంగతి పక్కనబెడితే హీరోయిన్లు ఒకరు కంటే ఎక్కువ మందే ఉంటారు. ఇక బన్నీతో చేయబోయే మూవీలోనూ ఏకంగా ముగ్గురు భామలు ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్లందరూ బాలీవుడ్ బ్యూటీలా లేదంటే దక్షిణాది హీరోయిన్లు ఉంటారా అనే దగ్గర కన్ఫ్యూజన్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో) మొన్నటివరకు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్ పేర్లు వినిపించాయి. తాజాగా అనన్య పాండే పేరు వినిపించేసరికి బన్నీ ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే అనన్య ఇప్పటివరకు హిందీలో సినిమాలైతే చేస్తోంది గానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. దానికి తోడు ఈమె యాక్టింగ్ పై బోలెడన్ని విమర్శలు.దీంతో హీరోయిన్ గా అనన్య పాండే వద్దు బాబోయ్ అని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే హీరోయిన్లు ఎవరనే సస్పెన్స్.. షూటింగ్ మొదలయ్యే వరకు కొనసాగే అవకాశముంది. మొన్నటివరకు సమంత, దిశా పటానీ పేర్లు కూడా వినిపించాయి కానీ బన్నీ-అట్లీ ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!) -
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకున్నారు. ఇవాళ బాలుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం బాలుడిని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని.. 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వెల్లడించారు. మనుషుల్ని గుర్తు పట్టట్లేదని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ 4 నెలల 25 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 146 రోజుల తర్వాత డిశ్చార్జ్ అవుతున్నారు. శ్రీ తేజకు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించి ఇంటికి తీసుకెళ్లొచ్చవని వైద్యులు సూచించారు.గతేడాది డిసెంబర్లో ఘటనకాగా.. గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ను చూసేందుకు వెళ్లింది. అయితే విపరీతమైన క్రౌడ్ రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్కు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
బన్నీ- అట్లీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
-
బన్నీ,చెర్రీ ఫైట్..ఫ్యాన్స్ ‘కోలా’హలం తప్పదా?
ఇది వేసవి సూర్యుడు ప్రచండ భానుడై ప్రతాపం చూపే సమయం. దాంతో జనమంతా చల్లని పానీయాలకు జై కొట్టే సమయం. సాధారణంగానే కూల్ డ్రింక్స్ అమ్మకాలు పీక్స్లో ఉండే ఈ టైమ్లో అత్యధిక వ్యాపారాన్ని దక్కించుకోవాలని కోలా బ్రాండ్స్ తహతహలాడుతాయి. రకరకాల ప్రకటనల ద్వారా దాహార్తి నిండిన గొంతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. దాంతో ఈ సీజన్ ఆసాంతం ప్రకటనల ‘కోలా’హలంతో నిండిపోతుంది.వేసవి వచ్చినప్పుడల్లా కూల్ డ్రింక్స్ బ్రాండ్స్ మధ్య ఆధిపత్య పోరు ఆటోమేటిక్గా వేడెక్కడం కోలా కంపెనీల్లో రివాజు. అది ఈ సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ సారి ఆధిపత్య పోరు బ్రాండ్స్తో ఆగేటట్టుగా లేదు. ఇప్పటికే ఇద్దరు టాలీవుడ్ అగ్రనటుల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు దీనికి జతయ్యేట్టుగా ఉంది. దానికి కారణం పుష్ప, పెద్దిలే...అదేనండీ.. అల్లు అర్జున్, రామ్చరణ్లే.పుష్ప తో ఆల్ ఇండియా స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ (Allu Arjun) ఇమేజ్ని క్యాష్ చేసుకోవాలని ఎన్నో కంపెనీలు ఉవ్విళ్లూరాయి. అదే క్రమంలో ప్రముఖ కూల్ డ్రింక్ బ్రాండ్ థమ్స్ అప్ తన దక్షిణాది బ్రాండ్ అంబాసిడర్గా అల్లు అర్జున్ ని ఎంచుకుంది. పుష్పరాజ్తో... చాలా ఉత్తేజకరమైన ఎనర్జిటిక్ వీడియోలను తయారు చేసి విడుదల చేసింది. అవి బాగా జనంలోకి దూసుకెళ్లాయి కూడా. అయితే ఇప్పుడు థమ్స్ అప్కి ప్రత్యర్ధిగా ఉన్న క్యాంపా కోలా...బన్నీకి ధీటైన మరో నటుడి గురించి సాగించిన అన్వేషణ మరో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ దగ్గర ఆగింది. తాజా ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఈ కోలా బ్రాండ్ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది.ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్చరణ్ (Ram Charan) ను క్యాంపాకోలా తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం కూల్గా మాట్లాడుకోవాల్సిన కూల్ టాపిక్ను వేడి వేడిచర్చలకు కేంద్ర బిందువైన హాట్ టాపిక్గా మార్చింది.ప్రస్తుతం మెగా , అల్లు కుటుంబాల బంధం మధ్య బన్నీ, చెర్రీలనే అడ్డుగీతలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. రామ్ చరణ్, అల్లు అర్జున్ పరస్పరం ఎడముఖం పెడముఖంగా ఉన్నారు అనడం చాలా చిన్నమాట. బయటకు చెప్పకున్నా, సోషల్ మీడియాలో అన్ఫాలోల దగ్గర నుంచి ఫాలోయర్స్, ఫ్యాన్స్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం వరకూ బన్నీ, చెర్రీల వార్... గట్టిగా నడుస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో రెండు బలమైన కూల్ డ్రింక్ బ్రాండ్స్ కాంపా కోలా, థమ్స్ అప్ లకు వారు అంబాసిడర్లుగా ఎంపిక కావడంతో ఈ వైరం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ రెండు బ్రాండ్స్ భవిష్యత్తులో రూపొందించే ప్రకటనలు ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తాయో.. ఎంత హీట్ తెస్తాయో.....చూడాలి.మరోవైపు క్యాంపా కోలా ప్రకటనలు రామ్ చరణ్ స్టార్ స్టేటస్పై ఎక్కువగా ఆధారపడి రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా మగధీర, ఆర్ఆర్ఆర్ లలోని ప్రసిద్ధ సినిమా సన్నివేశాలను ఇవి వాడుకుంటున్నాయి. -
అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయన్
తెలుగు చిత్రం సీతారామంతో వెలుగులోకి వచ్చిన నటి మృణాల్ ఠాకూర్. అంతకుముందు హిందీ, మరాఠీ తదితర చిత్రాల్లో నటించారు. అయితే సీతారామం చిత్రం ఈమెని తెలుగులో స్టార్ హీరోయిన్ను చేసింది. అంతేకాకుండా తమిళం లోను పాపులర్ చేసింది. ఆమె నటించిన మరో చిత్రం హాయ్ నాన్న. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం నిరాశ పచడంతో క్రేజ్ ఒకసారిగా తగ్గిపోయింది. దీంతో అవకాశాలు కూడా మొఖం దాటేసాయి. అదేవిధంగా హిందీలో లస్ట్ స్టోరీస్ చిత్రంలో మెప్పించిన ఈ బ్యూటీ తెలుగులో అడివి శేష్ చిత్రం డెకాయిట్లో నటిస్తున్నారు. తాజాగా ప్రభాస్కు జతగా స్పిరిట్ చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మడికి మరో లక్కీ సాంగ్స్ వరించిందని తాజాగా సామాజి మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప– 2 చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్నే మార్చేశారు. ఆయనకు డైరెక్ట్గా కోలీవుడ్లొ ఒక చిత్రం చేయాలన్న కోరిక చాలాకాలంగా ఉంది. అలా లింగు స్వామి దర్శకత్వంలో చిత్రం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే, కారణాలు ఏమైనా ఆ చిత్రం సెట్ పైకి వెళ్లలేదు. అలాంటిది తాజాగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం చేయడానికి అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకలు ఉంటారని సమాచారం. అందుకోసం జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటానితో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ లిస్టులో నటి మణాల్ ఠాగూర్ ముందు వరుసలో చేరినట్లు తెలిసింది. ఈమె ఈ క్రేజీ చిత్రంలో నటించడం దాదాపు ఖరారు అయినట్టు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ముగ్గురు అమ్మాయిలు తో అల్లు అర్జున్
-
బన్నీకి రౌడీ హీరో సర్ప్రైజ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీలో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ.. మన బన్నీకి మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు అభిమానం చాటుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్కు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు విజయ్.తాజాగా విజయ్... తన రౌడీ బ్రాండ్ స్టోర్ను హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీకి రౌడీ బ్రాండ్ టీషర్ట్స్ను, పిల్లల కోసం కొన్ని బర్గర్లను పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను పంచుకున్న బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్ అంటూ అని తన స్టోరీస్లో రాసుకొచ్చారు. కాగా.. గతంలోనూ అల్లు అర్జున్కు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా పుష్ప పేరుతో కూడిన టీ షర్ట్లను పంపారు.మరోవైపు పుష్ప-2 తర్వాత బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో జత కట్టనున్నారు. జవాన్ మూవీతో హిట్ అందుకున్ అట్లీ దర్శకత్వంలో నటించునున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది. -
సతీసమేతంగా పెళ్లికి హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (ఫొటోలు)
-
కుటుంబ సమేతంగా పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన పుష్పకు సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం బన్నీ జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఓ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి చేశారు. తన కజిన్ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ పెళ్లికి అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫోటోలను టీమ్ అల్లు అర్జున్ ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Bunny anna : Yesesaava 😳🤣@alluarjun #AA22 pic.twitter.com/6MWEZ36JjK— Allu Babloo AADHF (@allubabloo) April 24, 2025 Icon Star @alluarjun attended his cousin’s wedding, joining the family in the special celebration. ✨#AlluArjun pic.twitter.com/HFR29rUZp1— Team Allu Arjun (@TeamAAOfficial) April 23, 2025 -
బాలకృష్ణ, నాగార్జున, బన్నీ..అందరికీ అదే పిచ్చి!
సినిమా తారలంటే చాలా మందికి డెమీ గాడ్స్ లెక్క. మరీ ముఖ్యంగా హీరోలనైతే ఆరాధ్యదైవాలగానే కొలుస్తారు. వారి కోసం తన్నడానికి , తన్నించుకోవడానికి, వాళ్ల సినిమాలకు ప్రచారం చేయడానికి మాత్రమే కాదు వాళ్ల కోసం ప్రాణాలిచ్చేయడానికి కూడా సై అంటారు. అంతటి ఆదరణ అభిమానాలు పొందినప్పుడు సహజంగానే పేరు ప్రఖ్యాతులతో పాటు దండిగా డబ్బు, సంపద వస్తుంది. దాంతో సెంటిమెంట్స్ కూడా బాగా ఎక్కువే ఉంటాయి.జ్యోతిష్యాన్ని, వాస్తును, ముహుర్తాలను విపరీతంగా నమ్మే హీరోలు మనకు ఎందరో ఉన్నారు. వీరిలో పలువురు సంఖ్యాశాస్త్రాన్ని కూడా బాగా విశ్వసిస్తారు. ఆ విశ్వాసంతోనే తమ వాహనాల నెంబర్ల విషయంలో రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన వాహనం కోసం అత్యంత డిమాండ్ ఉన్న ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్ను రూ.7.75 లక్షలకు దక్కించుకుని బాలకృష్ణ వార్తల్లో నిలిచారు. అదే విధంగా గ్లోబల్ స్టార్ హీరో జూ.ఎన్.టి.ఆర్ సైతం ఫ్యాన్సీ నెంబర్ల వేటలో ముందున్నారు. ఆయన తన లంబోర్గిని ఉరూస్ వాహనం కు టిఎస్09ఎఫ్ఎస్ 9999 నెంబర్ ను రూ.17లక్షలు ఖర్చు పెట్టారు. ఎన్టీయార్ దాదాపుగా తన అన్ని కార్లకూ 9999 నెంబర్నే ఎంచుకుంటారు. సూపర్ స్టార్ మహేష్బాబు తన వాహనాలైన రేంజ్ రోవర్, మెర్సిడెస్ జిఎల్ ఎస్ ల కోసం Výటిఎస్09 ఇకె 600, టిఎస్09జిఒ600 లను కొనుగోలు చేశారు. నాగార్జున బిఎండబ్ల్యూ 7 సిరీస్ కోసం ఎపి 09బిడబ్ల్యు 9000ను వేలంలో దక్కించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రేంజ్రోవర్, వోల్వో ఎక్స్సి 90ల కోసం టిఎస్07 జిఇ9999 నెంబర్ లపై రూ.10లక్షలు పైనే ఖర్చు చేశారు. సీనియర్ హీరో రవితేజ కూడా తన ఎలక్ట్రిక్ వాహనం బివైడి అట్టో 3 నెంబరు టిఎస్09జిబి 2628 కోసం రూ.17,628 వెచ్చించారు.అమితాబ్ ఆద్యుడు అనుకోవాలేమో...స్టార్డమ్ కి దేశంలోనే అందరికీ బిగ్ బి అని పేర్కొనదగ్గ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కు కూడా నెంబర్ సెంటిమెంట్ ఎక్కువే. ఆయన తన వాహనాలన్నింటికీ 11 నెంబర్ వచ్చేలా చూస్తారు. ఆయన పుట్టిన రోజు కూడా అదే కావడం విశేషం. అలాగే తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కి ఇష్టమైన నెంబర్ 2222, ధనుష్ 106 నెంబర్ని ఇష్టపడతారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 2727 నెంబర్ని ఎంచుకుంటారు. షారూఖ్ ఖాన్ 555, సంజయ్ దత్ 4545 తమ వాహనాలకి తరచూ కోరే నెంబర్స్. ఈ తరహా సెంటిమెంట్స్ హీరోయిన్స్కు పెద్దగా లేకపోవడం ఆసక్తికరం. హీరోలు నెంబర్ల వేటలో రూ.లక్షలు వెచ్చిస్తున్నప్పటికీ.. వారితో ధీటుగా ఫాలోయింగ్ అందుకుంటున్న హీరోయిన్లు మాత్రం ఈ నెంబర్ల పిచ్చికి దూరంగా ఉండడం విశేషం. -
మరో ప్రపంచం పిలుస్తోంది... రండి!
వెండితెరపై ఆడియన్స్కు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ టెక్నాలజీని చూపించేందుకు మన తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందుకోసం కథల్లో సరికొత్త ప్రపంచాలను, ప్రాంతాలను క్రియేట్ చేసి, ఆడియన్స్ను ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ‘మరో ప్రపంచం పిలుస్తోంది... రండి’ అంటూ ఆడియన్స్ను థియేటర్స్కు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్న కొన్ని చిత్రాలపై కథనం.విశ్వంభర వరల్డ్ఫాంటసీ జానర్లో చిరంజీవి హీరోగా ‘అంజి, జగదేకవీరుడు అతిలోక సుందరి’ వంటి సినిమాలొచ్చాయి. కొంత గ్యాప్ తర్వాత చిరంజీవి మళ్లీ ఈ జానర్లో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘బింబిసార’ సినిమాలో కొంత భాగం కథ 500బీసీ టైమ్లో సాగుతుంది. ఈ సీక్వెన్స్లో వచ్చే సన్నివేశాలు సిల్వర్ స్క్రీన్పై ఆడియన్స్కు మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. కాగా మరోసారి తన విజువల్ విజన్ను ‘విశ్వంభర’ సినిమాలోనూ చూపించనున్నారు వశిష్ఠ. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లో సరికొత్త విజువల్స్ కనిపిస్తున్నాయి.పంచభూతాలైన గాలి, నీరు, ఆకాశం, నిప్పు, భూమి ఈ సినిమా కథలో కీలకంగా ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇలా ‘విశ్వంభర’ సినిమాలోని కొంత భాగం ఆడియన్స్ను మరో ప్రపంచానికి తీసుకువెళ్తుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఒక స్పెషల్ సాంగ్ మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ మూవీలో ఆంజనేయ స్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని తెలిసింది. త్రిషా, ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్స్గా నటించగా, చిరంజీవి చెల్లెలి పాత్రల్లో ఇషా చావ్లా, పసుపులేటి రమ్య కనిపిస్తారని సమాచారం. యూవీ క్రియేషన్స్పై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.నాలుగో ప్రపంచం కూడా ఉందా? కురుక్షేత్ర యుద్ధానికి ఆరువేల సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోందో ఊహించి, దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఈ మూవీలో 2898 ఏడీ సమయంలో కాశీ నగరం ఎలా ఉంటుందో ఊహాత్మకంగా, కల్పితంగా స్క్రీన్పై ఆడియన్స్కు చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే ఇదే చిత్రంలో కాంప్లెక్స్, శంభాల అనే మరో రెండు కొత్త ప్రపంచాలను కూడా చూపించారు.అయితే నాలుగో ప్రపంచం కూడా ఉందని, ఇది ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ‘కల్కి 2898 ఏడీ పార్ట్ 2’లో కనిపిస్తుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఇక ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ ప్రీప్రోడక్షన్ వర్క్స్తో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్. తొలి భాగం చిత్రీకరణ సమయంలోనే సీక్వెల్ని కూడా కొంత భాగం చిత్రీకరించారట. అయితే సీక్వెల్ చిత్రీకరణ 2026లో పూర్తి స్థాయిలో ప్రారంభం కావొచ్చని, 2028ప్రారంభంలో ఈ మూవీ రిలీజ్ అవుతుందనే టాక్ ప్రచారంలో ఉంది. ఇక ఈ మూవీని భారీ బడ్జెట్తో వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించనున్నారు.అలాగే ప్రభాస్ హీరోగా ‘హను–మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస’ అనే మూవీ రానుందని, ఈ మూవీ కోసం ప్రశాంత్ వర్మ ఓ అద్భుతమైన ప్రపంచాన్ని రెడీ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇంకా ప్రభాస్ మరో మూవీ ‘సలార్’ కోసం ఖాన్సార్ అనే ఓ కొత్తప్రాంతాన్ని సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ ఖాన్సార్ గురించి మరింతగా ‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో ఉండనున్నట్లుగా తెలిసింది.సైన్స్ లోకం ఆడియన్స్ను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ మూవీ రానుంది. ఈ మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నారట అట్లీ. ఇందుకోసమే ప్రస్తుతం అట్లీ విదేశీ వీఎఫ్ఎక్స్ నిపుణులతో కలిసి ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ చేస్తున్నారు. ఈ ప్రీప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వెండితెరపై అట్లీ చూపించనున్న ఈ సరికొత్త సైన్స్ ఫిక్షన్ మూవీలో కొన్ని కొత్త రకాల జంతువులు కూడా కనిపిస్తాయనే ప్రచారం సాగుతోంది.అంతేకాదు... ఈ మూవీలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తారని, హీరోయిన్స్గా జాన్వీ కపూర్, దిశా పటానీ, శ్రద్ధా కపూర్ల పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణనుప్రారంభించనున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్పిక్చర్స్ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మించనుంది. 2027లో ఈ మూవీ రిలీజ్ అయ్యేలా సినిమా షూటింగ్ను ప్లాన్ చేస్తున్నారట.మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్తో అల్లు అర్జున్ ఓ మూవీ అంగీకరించిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ ఫిల్మ్ ఇది. భారతీయ ఇతిహాసాల నుంచి ఇప్పటివరకు రాని ఓ సరికొత్త పాయింట్తో త్రివిక్రమ్ ఈ మూవీ చేయనున్నారని, ఇందుకోసం స్క్రీన్పై కొత్త ప్రపంచాన్ని టీమ్ రూపొందించనుందని సమాచారం. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సూర్యదేవర రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మించనున్నారు.అంజనాద్రిలో జై హనుమాన్బ్లాక్బస్టర్ మూవీ ‘హను–మాన్’లో దర్శకుడు ప్రశాంత్ వర్మ అంజనాద్రి అనే ఊరుని చూపించారు. తేజా సజ్జా హీరోగా నటించిన చిత్రం ఇది. నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కాగా ‘హను–మాన్’ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ మూవీ రానుంది. ప్రశాంత్ వర్మయే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘జై హను మాన్’ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.ఈ ఏడాది చివర్లో ‘జై హనుమాన్’ చిత్రీకరణలో పాల్గొంటారట రిషబ్ శెట్టి. కాగా... ‘జై హనుమాన్’ మూవీలో రాముడు, లక్ష్మణుడి పాత్రల ప్రస్తావన కూడా ఉంటుందని, ‘హను–మాన్’ సినిమా క్లిప్ హ్యాంగర్ వీడియోను చూసినవారికి అర్థమయ్యే ఉంటుంది. సో... ‘జై హనుమాన్’ సినిమా మరింత పెద్ద స్పాన్తో రూపొందనుందని తెలుస్తోంది. సో... ఆటోమేటిక్గా ‘అంజనాద్రి’ స్పాన్స్ కూడా పెరుగుతుందని ఊహించవచ్చు. ఇలా... అంజనాద్రిలో ‘జై హనుమాన్’ సాహసాలు, విన్యాసాలు చూసేందుకు మాత్రం చాలా సమయం ఉంది.2027లో మూవీ రిలీజ్ కావొచ్చు. ఇంకా హను–మాన్లో నటించిన తేజా సజ్జా ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’లోనూ ఉంటారని తెలిసింది. అలాగే తేజా సజ్జా హీరోగా ‘మిరాయ్’ అనే సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీ రానుంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా కనిపిస్తారు. ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది.మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ సినిమాలో రుద్రవనం అనే కల్పిత విలేజ్లో జరిగే సంఘటనలు ఆడియన్స్ను అలరించాయి. సాయిదుర్గా తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీ తర్వాత హీరో నాగచైతన్యతో దర్శకుడు కార్తీక్ దండు మరో మిస్టిక్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ ఆల్రెడీప్రారంభమైంది. కాగా ఈ చిత్రం కోసం ‘రుద్రవనం’ మాదిరి మరోప్రాంతాన్ని సృష్టిస్తున్నారట కార్తీక్ దండు.ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఓ పక్షి కన్నులో ఓ పెద్ద పర్వతంపై నాగచైతన్య ఉన్నట్లుగా ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే ఈ మూవీలో నాగచైతన్య ఓ స్టైలిష్ లుక్లో కనిపిస్తారని తెలిసింది. ఇక ఈ మూవీలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.వెయ్యేళ్ల క్రితంఆధ్యాత్మిక ప్రపంచం ‘శంబాల’కు ఆడియన్స్ను తీసుకువెళ్లనున్నారు హీరో ఆది సాయికుమార్. జియో సైంటిస్ట్గా ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శంబాల’. కాల్పనిక ప్రపంచం శంబాల నేపథ్యంలో యుగంధర్ ముని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పదివేల సంవత్సరాల క్రితం, వెయ్యి సంత్సరాల క్రితం, 1980... ఇలా మూడు కాలమానాల్లో ఈ సినిమా కథనం సాగుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో శ్వాసిక మరో లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కోసం ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను తీశారు మేకర్స్. త్వరలోనే టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్లపై స్పష్టత ఇవ్వనున్నట్లుగా మేకర్స్ ఇటీవల తెలిపారు.ప్యారడైజ్‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ప్యారడైజ్’. ఈ పీరియాడికల్ ఫిల్మ్లో నాని సరికొత్తగా కనిపిస్తున్నారు. 1980 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో సికింద్రాబాద్ కుర్రాడిలా నాని నటిస్తారని తెలిసింది. ఈ మూవీ ఆడియన్స్కు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ను ఇవ్వనుంది. అప్పటి కాలాన్ని రీ–క్రియేట్ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.ఓ తెగ నాయకుడిగా నాని కనిపిస్తారని, గుర్తింపుకోసం పోరాడే ఓ తెగ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని ఫిల్మ్నగర్ సమాచారం. ‘దసరా’ సినిమాను నిర్మించిన సుధాకర్ చెరికూరియే ఈ సినిమానూ నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘హిట్ 3’ సినిమా ప్రమోషన్స్తో నాని బిజీగా ఉన్నారు. మే 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక మే రెండో వారం నుంచి ‘ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణలో నాని పాల్గొంటారని తెలిసింది. ‘ప్యారడైజ్’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.కిష్కింధపురి!ఆడియన్స్ కోసం ‘కిష్కింధపురి’ అనే హారర్ అండ్ మిస్టీరియస్ వరల్డ్ను క్రియేట్ చేస్తున్నారట బెల్లంకొండ సాయిశ్రీనివాస్. కౌశిక్ పెగళ్లపాడి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మాణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మూవీ చేస్తున్నారు. ఈ హారర్ అండ్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీకి ‘కిష్కింధపురి’ అనే టైటిల్ను అనుకుంటున్నారట మేకర్స్. హారర్ ఎలిమెంట్స్, ప్రేతాత్మల ప్రస్తావన, ఆధ్యాత్మిక అంశాలతో ఈ మూవీ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. అతి త్వరలోనే ఈ మూవీకి చెందిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.ఇలా ఈ తరహాలో ఆడియన్స్ను మరో కొత్త ప్రపంచానికి లేదా కొత్తప్రాంతానికి తీసుకుని వెళ్లే హీరోలు, దర్శక–నిర్మాతలు మరి కొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
అల్లు అర్జున్, అట్లీ మూవీకి పుష్ప సెంటిమెంట్!
-
పుష్ప 2 వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
-
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. మూవీ చూస్తున్నప్పుడు ఏది నిజమో ఏది గ్రాఫిక్సో తెలియనంతంగా టెక్నాలజీ వచ్చేసింది. తాజాగా రిలీజైన పుష్ప 2 వీడియో చూస్తుంటే అదే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) ఎందుకంటే పుష్ప 2 సినిమాలో ప్రారంభంలో వచ్చే జపాన్ ఫైట్, మాల్దీవుల సీన్, పుష్ప డెన్, రామేశ్వరం పడవల ఛేజింగ్, చందన దుంగల లారీలని షెకావత్ పట్టుకోవడం ఇలా చాలా సీన్లు సహజంగానే అనిపించాయి. కానీ అవన్నీ గ్రాఫిక్స్ లో తయారు చేసినవని తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో తెలిసింది.పుష్ప 2 నిర్మాతల్లో ఒకటైన సుకుమార్ రైటింగ్స్ సంస్థ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో ఒకటి రిలీజ్ చేసింది. 6 నిమిషాల నిడివి ఉన్న దీన్ని చూస్తే మీరు కచ్చితంగా సినిమాని సగానికి సగం వీఎఫ్ఎక్స్ సాయంతోనే తీసేశారు కదారా అనిపిస్తుంది. ఎందుకంటే జపాన్ ఫైట్, రామేశ్వరం పడవల ఛేజింగ్.. ఇలా మెయిన్ సీన్స్ అన్ని గ్రాఫిక్స్ లోనే తీసి ప్రేక్షకుల్ని మాయ చేయడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
బన్నీ కోసం ముగ్గురు బ్యూటీస్.. కాకపోతే!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) ఎవరితో సినిమా చేస్తాడా అనుకుంటే తమిళ దర్శకుడు అట్లీకే ఓటేశాడు. త్రివిక్రమ్ పేరు కూడా వినిపించింది కానీ అట్లీతో(Atlee) ప్రాజెక్ట్ ఉంటుందని ఈ మధ్య అధికారికంగానూ ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కాకపోతే హీరోయిన్లు ఎవరనే దగ్గర డిస్కషన్స్ జరుగుతున్నాయి.(ఇదీ చదవండి: సీరియల్ నటి వైష్ణవి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్)బన్నీ-అట్లీ సినిమాని ఇంటర్నేషనల్ లెవల్లో తీయబోతున్నారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్ వీడియోలో దీని గురించి హింట్ ఇచ్చేశారు. కాబట్టి బన్నీకి సరిపోయే హీరోయిన్లని తీసుకోవాలి. ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా ఆప్షన్స్ కనిపించట్లేదు. అందుకే బాలీవుడ్ వైపు చూస్తున్నారట.ఇప్పుడైతే జాన్వీ కపూర్(Janhvi Kapoor), దిశా పటానీ పేర్లు వినిపిస్తున్నారు. వీళ్లు కన్ఫర్మా కాదా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. కాకపోతే ఎవరి డేట్స్ అందుబాటులో ఉన్నాయనే దానిబట్టి హీరోయిన్లని తీసుకోవాలని అనుకుంటున్నారట. మొత్తంగా అల్లు అర్జున్ సరసన ముగ్గురు భామలు కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!) -
ఖరీదైన సినిమా.. సూపర్ స్టార్-ఐకాన్ స్టార్ వార్!
ఈ ఏడాది అత్యంత ఖరీదైన చిత్రాల రూపకల్పనలో భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త శిఖరాలను అధిరోహించనుంది. ఈ నేపధ్యంలోనే ఆల్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ దర్శకుడు అట్లీ కలయికలో తమ కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఇద్దరు టాలీవుడ్ అగ్రగామి నటుల మధ్య సరికొత్త వార్ మొదలైందనొచ్చు. దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమా నాదే అనే కిరీటాన్ని అందుకోవడానికి ఈ ఇద్దరు స్టార్స్ పోటీపడుతున్నారు. వీరిద్దరూ మాత్రమే కాదు నేను కూడా ఉన్నానంటూ బాలీవుడ్ టాప్ స్టార్ కూడా అదే వరుసలో నిలవడంతో.. పోటీ రసకందాయకంగా మారింది.రూ.2 వేల కోట్ల కలెక్షన్స్ నిన్న.. రూ1,000 కోట్ల పెట్టుబడి నేడు.. అన్నట్టుగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ చిత్రం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మహేష్బాబుతో ఆయన తీస్తున్న చిత్రం ఎస్ఎస్ఎస్బి29 బడ్జెట్ రూ.1000 కోట్ల వరకూ ఉండొచ్చునంటున్నారు. మరోవైపు బాలీవుడ్ అగ్ర కధానాయకుల్లో ఒకరైన రణబీర్ కపూర్తో రామాయణం తెరకెక్కుతోంది. ఈ చిత్రం బడ్జెట్ కూడా రూ.900 కోట్లకు దగ్గరగా ఉండొచ్చునని చెబతున్నారు. ఈ రెండు సినిమాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నప్పటికీ... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమ తమ చిత్రాలతో భారీ బ్లాక్బస్టర్లు సాధించిన అల్లు అర్జున్, అట్లీలు సన్ పిక్చర్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో ఓ సినిమా రూపొందిస్తున్నట్టు వచ్చిన ప్రకటన పలు ఆశ్చర్యకరమైన అంకెల్ని సినీ అభిమానుల కళ్ల ముందుకు తెచ్చింది. ప్రస్తుతం ఏఏ22xఏ6 అని పేర్కొంటున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన భారతీయ చలనచిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమా బడ్జెట్ రూ. 800 కోట్లు కాగా ఇందులో నిర్మాణ వ్యయంగా రూ. 200 కోట్లు, విఎఫ్ఎక్స్ (స్పెషల్ ఎఫెక్ట్స్) కోసం రూ.250 కోట్లు, అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ. 175 కోట్లు, దర్శకుడు అట్లీ రెమ్యునరేషన్ రూ. 100 కోట్లుగా లెక్కిస్తున్నారు.ఇదే కాకుండా అల్లు అర్జున్కూ సినిమా లాభంలో 15 శాతం ఉంటుందని, అలాగే అట్లీకి కూడా బ్యాకెండ్ డీల్ ఉంటుందని సమాచారం. అవతార్, ఐరన్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన నిపుణులు ఇందులో భాగం పంచుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమా ఇండియన్ స్క్రీన్పై విజువల్ ట్రీట్గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఒక ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లవచ్చునని.. అట్లీ తరచుగా ఆలోచించినట్టే ఆలోచిస్తే అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభం కానుంది.ప్రస్తుత బడ్జెట్ల ప్రకారం రాజమౌళి, మహేష్ బాబుల సినిమాయే అత్యంత ఖరీదైన చిత్రం కావడం ఖాయంగా తెలుస్తున్నప్పటికీ..మరెన్నో నెలల పాటు.షూటింగ్ సాగే క్రమంలో బడ్జెట్లో కూడికలు, తీసివేతలు.. మార్పు చేర్పులు అంతిమంగా ఈ విషయాన్ని ఖరారు చేస్తాయని అనుకోవచ్చు. -
పవన్ కల్యాణ్ను కలిసిన అల్లు అర్జున్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను స్టార్ హీరో అల్లు అర్జున్ కలుసుకున్నారు. హైదరాబాద్లోని పవన్ ఇంటికి వెళ్లిన బన్ని మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల క్రితం సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు 30 నిమిషాల పాటు అల్లు అర్జున్ దంపతులు మాట్లాడినట్లు తెలుస్తోంది. కానీ, అందుకు సంబంధించిన ఫోటోలు వంటివి అధికారికంగా వెలువడలేదు. -
బన్నీ పైనే తమిళ్ తంబీల ఆశలు
-
అంతకంతకు పెరుగుతున్న పాన్ ఇండియా మూవీ బడ్జెట్స్
-
బ్రేక్ పడింది బాసు!
ఎప్పటి కప్పుడు తమ ఫ్యాన్స్ కోసం సరికొత్త సినిమాలు చేయాలని, స్క్రీన్పై సరికొత్తగా కనిపించాలని హీరోలు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు సమయం పట్టొచ్చు. ఇలా ఓ ఏడాది, రెండు మూడేళ్లు కొందరు హీరోలు సిల్వర్ స్క్రీన్ను మిస్ కావొచ్చు. అలా ఈ ఏడాది ఇప్పటికే కొంతమంది సిల్వర్ స్క్రీన్ను మిస్ కానున్నారు. అలా సోలో హీరోగా ఈ ఏడాది థియేటర్స్కు రాని కొందరు హీరోల గురించి ఓ లుక్ వేద్దాం.కథలు వింటున్నారు... ‘నా సామిరంగ’ సినిమాతో గత ఏడాది సంక్రాంతికి థియేటర్స్కు వచ్చి సూపర్డూపర్ హిట్ అందుకున్నారు నాగార్జున. అయితే ఈ మూవీ తర్వాత నాగార్జున సోలో హీరోగా మరో మూవీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. యువ దర్శకులు నవీన్, కార్తీక్ చెప్పిన కథలను నాగార్జున విన్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల మరో యువ దర్శకుడు చెప్పిన కథను కూడా నాగార్జున విన్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపించాయి. కానీ ఇప్పటివరకైతే నాగార్జున సోలో హీరో మూవీ అనౌన్స్మెంట్ రాలేదు. ఇలా ఈ ఏడాది నాగార్జున సోలో హీరోగా నటించే మూవీ థియేటర్స్కు రాకపోవచ్చని ఊహించవచ్చు. అయితే నాగార్జున అభిమానులు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాగార్జున ఓ లీడ్ రోల్లో నటించిన ‘కుబేర’ (ఇందులో ధనుష్ హీరో), ‘కూలీ’ (రజనీకాంత్ హీరో) చిత్రాలు ఈ ఏడాదే స్క్రీన్పైకి వస్తాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ‘కుబేర’ సినిమా జూన్ 20న విడుదల కానుంది. అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోని ‘కూలీ’ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.రెండేళ్లు ఆగాల్సిందే... గత ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’ సినిమాతో సందడి చేశారు మహేశ్బాబు. ఆ తర్వాత వెంటనే రాజమౌళితో మూవీ ప్రకటించారు. ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోంది. క్వాలిటీ, కంటెంట్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మహేశ్బాబు, రాజమౌళి. దీంతో సహజంగానే ఈ మూవీ థియేటర్స్లోకి రావడానికి సమయం పడుతుంది. పైగా రాజమౌళితో మూవీ అంటే కనీసం రెండేళ్లైనా పడుతుంది.ఇలా ఈ ఏడాది, వచ్చే ఏడాది మహేశ్బాబు స్క్రీన్పై కనిపించే అవకాశాలు లేనట్లే. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. రెండు కీలక షెడ్యూల్స్ చిత్రీకరణ జరిగింది. వేసవి సమయం కావడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లారు మహేశ్బాబు. ఇటు ‘ఆర్ఆర్ ఆర్’ (ఎన్టీఆర్–రామ్చరణ్లు హీరోలుగా నటించిన మూవీ) మూవీపై తీసిన ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రమోషన్స్లో భాగంగా రాజమౌళి జపాన్లో ఉన్నారు. రాజమౌళి, మహేశ్బాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ మూవీ షూట్ మళ్లీ ప్రారంభం అవుతుందని ఊహించవచ్చు.కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం సాగింది. కానీ అలాంటిది ఏమీ లేదని, ఒకటే మూవీగానే విడుదలవుతుందని ఫిల్మ్నగర్ సమాచారం. అంతేకాదు... 2027 మార్చి 25న ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనల్లో రాజమౌళి అండ్ టీమ్ ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ ప్రకారం మహేశ్బాబు సిల్వర్స్క్రీన్పై కనిపించేందుకు రెండేళ్లు ఆయన అభిమానులు ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. రాజాసాబ్ రానట్లే... ప్రస్తుతం ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ‘ది రాజా సాబ్’ సినిమాతో ప్రయాణం చేస్తున్నారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలోని ఈ హారర్ కామెడీ ఫిల్మ్ ఏప్రిల్ 10న విడుదల కావాల్సింది. కానీ రిలీజ్ కాలేదు. ఈ సినిమాకి సంబంధించి కొద్దిగా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, ఇంకా సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉందని ఈ చిత్రదర్శకుడు మారుతి ఇటీవల పేర్కొన్నారు.పైగా ‘ది రాజా సాబ్’ మూవీ కోసం ముందుగా అనుకున్న పాటలను క్యాన్సిల్ చేసి, ఇప్పటి ట్రెండ్కు తగ్గట్లుగా కొత్త పాటలను కంపోజ్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం, సాంగ్స్ బ్యాలెన్స్ ఉండటం, పైగా భారీగా వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉండటం వల్ల ‘ది రాజా సాబ్’ సినిమా ఈ ఏడాది థియేటర్స్కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభాస్ చేస్తున్న మరో మూవీ ‘ఫౌజి’ చిత్రీకరణ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది.సో... ఈ మూవీ 2026లో రిలీజయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ పీరియాడికల్ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ పూర్తిగా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... విష్ణు మంచు హీరోగా చేసిన ‘కన్నప్ప’ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ విషయం ప్రభాస్ ఫ్యాన్స్కు కాస్త ఊరట కలిగించే అంశమనే చెప్పవచ్చు.డ్రాగన్ వచ్చేది వచ్చే ఏడాదే... గత ఏడాది ‘దేవర’ మూవీ తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’తో సూపర్ సక్సెస్ అందుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత హిందీ మూవీ ‘వార్ 2’తో ఎన్టీఆర్ ఫుల్ బిజీ అయిపోయారు. హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ మరో మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ హిందీ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్యా చోప్రా నిర్మాత. ఈ ‘వార్ 2’ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ సోలోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్) మూవీ అనౌన్స్మెంట్ రెండేళ్ల క్రితమే వచ్చింది.కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 20న మొదలైంది. ఈ నెల 22 నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు ఎన్టీఆర్. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ మూవీ రిలీజ్ ఏప్రిల్కి వాయిదా పడిందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ నటి రుక్ష్మిణీ వసంత్, మరో లీడ్ రోల్లో టొవినో థామస్ నటించనున్నారని తెలిసింది. మళ్లీ గ్యాప్... ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ సినిమాల సక్సెస్తో అల్లు అర్జున్ మంచి జోష్లో ఉన్నారు. ముఖ్యంగా ‘పుష్ప: ది రూల్’ చిత్రం బ్లాక్బస్టర్గా నిలవడం, సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసినట్లుగా మేకర్స్ వెల్లడించడం అనేవి అల్లు అర్జున్ కాన్ఫిడెన్స్ను మరింత పెంచినట్లున్నాయి. అయితే ‘పుష్ప: ది రైజ్’ మూవీ విడుదలైన మూడు సంవత్సరాల తర్వాత కానీ... ‘పుష్ప: ది రూల్’ సినిమా థియేటర్స్లోకి రాలేదు.ఇలా అల్లు అర్జున్ను స్క్రీన్పై చూసుకునేందుకు ఆయన అభిమానులు మూడు సంవత్సరాలు వెయిట్ చేశారు. కాగా మళ్లీ అల్లు అర్జున్ను స్క్రీన్పై చూసేందుకు మరో రెండు సంవత్సరాలు వెయిట్ చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపొందనుంది. ఈ చిత్రం కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయనున్నారట అట్లీ. భారీగా వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉంటుందట.పైగా ఈ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ మరో రెండు సంవత్సరాలు థియేటర్స్లోకి రాదని ఊహించవచ్చు. అలాగే 2018లో ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన మరో మూవీ ‘అల... వైకుంఠపురములో..’ 2020లో విడుదలైంది. ఈ గ్యాప్ గురించి, ‘గ్యాప్... ఇవ్వలా వచ్చింది’ అన్నట్లుగా అల్లు అర్జున్ అప్పట్లో పేర్కొన్నారు. ఇలా మరోసారి అల్లు అర్జున్ కెరీర్లో మళ్లీ గ్యాప్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఈ ఏడాది సోలో హీరోగా సిల్వర్ స్క్రీన్ని మిస్ చేసుకోనున్న హీరోలు మరికొందరు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
అల్లు అర్జున్ - అట్లీ మూవీకి 21 ఏళ్ల కుర్రాడు మ్యూజిక్..
-
అల్లు అర్జున్తో సమంత వన్స్మోర్!
అల్లు అర్జున్, సమంత మరోసారి సిల్వర్ స్క్రీన్పై జంటగా కనిపించే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో తెరపైకి వచ్చింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో అల్లు అర్జున్, సమంత తొలిసారిగా జోడీ కట్టారు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలోని ప్రత్యేక గీతం ‘ఊ అంటావా...’లో అల్లు అర్జున్, సమంత కలిసి కొన్ని డ్యాన్స్ స్టెప్పులేశారు. తాజాగా ఈ జోడీ మరోసారి రిపీట్ కానుందట.అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు మెయిన్ హీరోయిన్స్, మరో ముగ్గురు అమ్మాయిలు కీలక పాత్రల్లో నటించనున్నారట. ఈ మెయిన్ హీరోయిన్స్లోని ఒక రోల్ కోసం సమంతను తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. మరి... అల్లు అర్జున్, సమంతల జోడీ మరోసారి స్క్రీన్పై రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘తేరీ’ (తెలుగులో ‘పోలీసోడు’), ‘మెర్సెల్’ (అదిరింది) చిత్రాల్లో సమంత ఓ హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
మార్వెల్ రేంజ్ మూవీ తీస్తున్న బన్నీ, అట్లీ
-
అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరోయిన్కు ఛాన్స్.. అందుకేనా ఈ కామెంట్?
ఇటీవల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న నటి సమంత తెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. అయితే వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. అంతకన్నా షోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. త్వరలో మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా పుష్ప– 2 చిత్రంతో ప్రపంచ స్థాయిలో దుమ్మురేపిన నటుడు అల్లు అర్జున్ తాజాగా అంతకు మించిన చిత్రం చేయడానికి రెడీ అయ్యిపోయారు. ఆయన నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రానికి సబంధించిన ప్రకటన అట్టహాసంగా వెలువడిన విషయం తెలిసిందే. చేసిన ఐదు చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న యువ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ నటించనున్నారు. కోలీవుడ్లో చిత్రం చేయాలన్నది అల్లు అర్జున్ చిరకాల కోరిక. చాలా కాలం క్రితమే లింగుసామి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబధించిన ప్రకటనను గ్రాండ్గా వెల్లడించారు. అయితే కారణాలేమైనా ఆ చిత్రం సెట్పైకి రాలేదు. అలాంటిది తాజాగా అల్లుఅర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ రూ.600 కోట్ల బడ్జెట్లో ప్లాన్ చేస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ చిత్ర యూనిట్కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో నటి సమంత కూడా ఉన్నారు. ఆమె ఇంతకు ముందు నటుడు అల్లు అర్జున్కు జంటగా సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించారు. అదే విధంగా దర్శకుడు అట్లీతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈయన ఇంతకు ముందు దర్శకత్వం వమించిన మెర్సల్, తెరి చిత్రాల్లో నాయకిగా నటించారన్నది గమనార్హం. ఇకపోతే నటి సమంత నటుడు అల్లు అర్జున్ గురించి తన ఇన్స్ట్రాగామ్లో చేసిన పోస్ట్లో మళ్లీ ఒక ఏడాది.ఈ అద్భుతమైన నటుడి ఎదుగుదలను చూడటానికి సహనం పాటించలేకపోతున్నాను. తెరపై మిమ్మల్ని ఎప్పుడు చూసినా మధురమైన దిగ్భ్రాంతి. ప్రతిసారి హద్దులు దాటిన చర్యలకు ధన్యవాదాలు. మీ ఆరోగ్యం బాగుండాలి. ఆసక్తి తగ్గకుండా మీరు ప్రేమించే కార్యాలను వరుసగా చేయాలని భగవంతుడు ఆశ్వీదించా అని నటి సమంత పేర్కొన్నారు. సమంత పోస్ట్ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా అల్లుఅర్జున్, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈభారీ చిత్రంలో నటి సమంత కూడా భాగం కానున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. -
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీ ఎందుకు ఆలస్యం అవుతోంది?
-
అల్లు అర్జున్, అట్లీ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!
-
అల్లు అర్జున్ బర్త్ డే రోజున ఇలా..(ఫొటోలు)
-
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
అల్లు అర్జున్ (Allu Arjun) కొత్త సినిమా ప్రకటించాడు. తమిళ దర్శకుడు అట్లీతో (Director Atlee) కలిసి సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్ తీయబోతున్నాడు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఇదంతా అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా 20 ఏళ్ల కుర్రాడిని పరిచయం చేయబోతున్నారు. ఇంతకీ అతడెవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)యూట్యూబ్ లో గతేడాది వైరల్ అయిన ఆల్బమ్ సాంగ్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా 'కచ్చి సేరా', 'ఆశా కూడా' పాటలు ఉంటాయి. ఎందుకంటే తలో ఒకటి 200 మిలియన్ వ్యూస్ సాధించాయి. వీటిని పాడి, ఇందులో కనిపించిన కుర్రాడే సాయి అభయంకర్(Sai Abhyankkar).అప్పట్లో తెలుగు, తమిళ సినిమాల్లో పాటలు పాడిన సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే సాయి. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. అనిరుధ్ దగ్గర స్పెషల్ ప్రోగ్రామ్ కంపోజర్ గా పనిచేశాడు. గతేడాది బెంజ్ అనే తమిళ మూవీలో సంగీత దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నాడు. దీంతో పాటు మరో రెండు-మూడు ప్రాజెక్టులు కూడా సొంతం చేసుకున్నాడు.(ఇదీ చదవండి: తమన్నా 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్)మిగతా సినిమాల సంగతేమో గానీ అల్లు అర్జున్-అట్లీ సినిమా కోసం సాయి ఎంపికవడం మాత్రం అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కోసం 20 ఏళ్ల కుర్రాడిని ఎంపిక చేశారంటే విషయం గట్టిగానే ఉందనమాట. అనౌన్స్ మెంట్ వీడియోకు ఇచ్చిన మ్యూజిక్ వింటేనే ఈ విషయం అర్థమైపోతుంది. ప్రస్తుతానికి ఇతడు బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లు అధికారికంగా చెప్పలేదు. త్వరలో మంచిరోజు చూసి ప్రకటిస్తారేమో చూడాలి. ఇకపోతే సాయి అభయంకర్ కి ట్విన్ సిస్టర్ ఉంది. ఆమె పేరు సాయిస్మృతి. ఈమె కూడా సింగరే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా) -
ఊహలకు అందని ప్రపంచం
హీరో అల్లు అర్జున్ , దర్శకుడు అట్లీ కాంబోలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా మంగళవారం (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఓ వీడియోతో ఈ మూవీని ప్రకటించారు. అల్లు అర్జున్ కెరీర్లో ఇది 22వ సినిమా కాగా, అట్లీ కెరీర్లో 6వ చిత్రం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణనుప్రారంభించనున్నామని, నటీనటులు– సాంకేతిక నిపుణులు, విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘‘మ్యాజిక్ విత్ మాస్. ఊహలకు అందని ప్రపంచం. సన్ పిక్చర్స్ సపోర్ట్తో అట్లీగారితో సినిమా చేయనుండటం నిజంగా అద్భుతం’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు అల్లు అర్జున్ . ‘‘అల్లుఅర్జున్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు. నా కలను నిజం చేస్తున్న కళానిధిమారన్ సార్కి, సన్ పిక్చర్స్కు థ్యాంక్స్’’ అని అట్లీ పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మైథలాజికల్ ఫిల్మ్ రానుంది. అల్లు రామలింగయ్య, మమత సమర్పణలో హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ మూవీ చిత్రీకరణను త్వరలోనేప్రారంభించనున్నట్లు పేర్కొని, అల్లు అర్జున్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. -
తోడుగా, నీడగా.. ఐకాన్ స్టార్కు భార్య బర్త్డే విషెస్
విమర్శలు ఎక్కుపెట్టినవారితోనే శభాష్ అనిపించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు.. అతడి ప్రయాణం చూసిన ఎవరైనా ఔరా అనాల్సిందే! ఈసారి పాన్ ఇండియాను కాకుండా పాన్ వరల్డ్ బాక్సాఫీస్కే ఎక్కుపెట్టాడు బన్నీ. అట్లీతో సినిమా.. దీనికి హాలీవుడ్ టెక్నీషియన్స్ వీఎఫ్ఎక్స్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.గడిచిన ఏడాది కష్టంగా..సాదాసీదా హీరో నుంచి ఐకాన్ స్టార్ వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు బన్నీ. అయితే ఆయన సంతోషాన్నే కాకుండా కష్టాన్ని కూడా ఇష్టంగా పంచుకుంది భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy). గడిచిన ఏడాది బన్నీ పుష్ప 2 హిట్తో భారీ విజయం అందుకున్నాడు. కానీ అతడు సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్కు వెళ్లినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందడం.. ఆ కేసు తన మెడకు చుట్టుకోవడంతో ఆ సంతోషమే లేకుండా పోయింది. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టయి ఒక రాత్రి జైలులో గడపడం అతడి జీవితంలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.43వ బర్త్డేఅతడు జైలు నుంచి తిరిగి ఇంటికి చేరుకోగానే స్నేహ చంటిపిల్లలా అతడిని హత్తుకుంది. ఆ సమయంలో కుటుంబాన్ని తనే జాగ్రత్తగా చూసుకుంది. తాజాగా ఆమె అల్లు అర్జున్కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నా జీవితంలో ప్రేమను పంచిన నీకు 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జీవితంలో నీతో కలిసి నడుస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఫ్యామిలీ సంతోషంగా ఉన్న వీడియో క్లిప్పింగ్స్ను పొందుపరిచింది. అలాగే బన్నీతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు బన్నీకి మీరే బలం అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు: కీర్తి భావోద్వేగం -
టాలీవుడ్ రూపురేఖలు మార్చబోతున్న బన్నీ 3000 కోట్లు ఫిక్స్
-
AA22 Update: అల్లు అర్జున్- అట్లీ 'AA22' ప్రకటన వచ్చేసింది (వీడియో)
పుష్ప – 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్ (Allu Arjun).. ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా రేంజ్లో గురి పెట్టాడు. అల్లు అర్జున్-అట్లీ సినిమాపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కోలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ 'సన్ పిక్చర్స్' అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది. నేడు బన్నీ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. 'AA22' పేరుతో చిత్రాన్ని ప్రకటించారు. విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, బిగిల్, తేరి చిత్రాలు చేసి తమిళ ఇండస్ట్రీలో హ్యాట్రిక్ కొట్టిన అట్లీ.. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్లి నటుడు షారుఖ్ ఖాన్తో జవాన్ తెరకెక్కించి అక్కడ కూడా సూపర్ హిట్ అందకున్నాడు. అలా పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటి గుర్తుంపు తెచ్చుకున్న సౌత్ ఇండియా స్టార్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేస్తే రికార్డ్స్ ఏమైనా మిగులుతాయా..? అంటూ అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. -
అల్లు అర్జున్ బర్త్డే: 'ఎదురు నీకు లేదులే.. అడ్డు నీకు రాదులే'
స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా సత్తా చాటుతున్నాడు. ‘ఆర్య’ సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు.. పొరుగు ఇండస్ట్రీల్లోనూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ అని పిలుచుకునే బన్ని మలయాళంలో మల్లు అర్జున్ అయ్యారు. బాలీవుడ్ వాల్లకు పుష్పరాజ్గా స్థిరపడిపోయారు. హిందీలో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్కు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో అత్యంత శక్తివంతమైన హీరోగా ఆయన టాప్లో ఉన్నారు. నేడు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని రికార్డ్స్ రప్పా రప్పా అంటూ.. కొట్టేయాలని కొన్ని విషయాలు తెలుసుకుందాం.అల్లు అర్జున్లో ఇవన్నీ ప్రత్యేకమే..🎥 దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డ్🎥 రెండు సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్🎥 'పుష్ప' సినిమాతో తన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు.🎥 టాలీవుడ్లో 'దేశ ముదురు' సినిమాతో సిక్స్ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జున్నే🎥 అల్లు అర్జున్కు బాగా నచ్చే సినిమాలు టైటానిక్, ఇంద్ర.. ఇప్పటికే చాలాసార్లు ఆ సినిమాలు చూశారట🎥 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా పుష్ప: ది రైజ్ రికార్డ్ క్రియేట్ చేసింది.🎥 2025 పుష్ప2తో తొలిరోజు రూ. 294 కోట్ల వసూళ్లు సాధించిన ఇండియన్ తొలి చిత్రంగా రికార్డ్🎥 100 ఏళ్ల హిందీ చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో రూ. 1000 కోట్లు సాధించిన ఏకైక చిత్రంగా పుష్ప2 రికార్డ్🎥 అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ జాబితాలో పుష్ప2కు రెండో స్థానం, ఫస్ట్ దంగల్ 🎥 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్కు గుర్తింపు🎥 ప్రముఖ సినిమా మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ కవర్పై అల్లు అర్జున్ ఫోటో 🎥 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్న బన్నీ 🎥 'రుద్రమదేవి' సినిమా సమస్యల్లో ఉందని తెలుసుకున్న అర్జున్.. ఆ ప్రాజెక్ట్కు తనలాంటి స్టార్ అవసరమనుకున్నాడు. అందుకే పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్ర పోషించాడు.🎥 బన్నీకి నటి ఐశ్వర్యరాయ్ అంటే అభిమానం. ఆవిడకు పెళ్లయినప్పుడు చాలా బాధపడ్డాడట🎥 ఇన్స్టాలో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా 28 మిలియన్లు ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ కావడం విశేషం -
Allu Arjun: ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' పుట్టినరోజు.. మధురమైన జ్ఞాపకాలు (ఫోటోలు)
-
బుల్లితెరపై పుష్పరాజ్.. ఏ ఛానెల్.. ఎన్ని గంటలకో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప- 2' మూవీతో బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టించాడు. రిలీజైన కొద్ది రోజుల్లోనే రికార్డులన్నీ రప్పా రప్పా అంటూ తుడిచి పెట్టేశాడు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ఫ్లిక్స్లో సౌత్ భాషల్లోనూ అందుబాటులో ఉంది.తాజాగా ఈ మూవీ బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ విషయాన్ని హక్కులు దక్కించుకున్న ఛానెల్ రివీల్ చేసింది. స్టార్ మాలో ఏప్రిల్ 13న ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రసారం కానుందని ఆ ఛానెల్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో బుల్లితెరపై కూడా పుష్పరాజ్ సందడి చూసే అవకాశం రానుంది. కాగా..ఇక పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. Pushpa Raj is back to rule the game 🔥 #PushpagadiRuleuu #Pushpa2OnStarMaa pic.twitter.com/JQIMwCJgw6— Starmaa (@StarMaa) April 7, 2025 -
ఇన్స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
ఐకాన్స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి (Allu Sneha Reddy)కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. సినిమాల్లో నటించకపోయినా ఓ స్టార్ హీరోయిన్కు ఉన్నంత ఫాలోవర్స్లో ఆమెకు ఉన్నారు. తరచు అల్లు అయాన్, అర్హ ఫోటోలను షేర్ చేయడంతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు హెల్త్ టిప్స్ కూడా ఇస్తుంటారు. అందుకే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను పెద్ద ఎత్తున ఫాలో అవుతుంటారు.తాజాగా స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో ఓ అమ్మాయికి బ్లడ్ ఎక్కిస్తున్నట్లుగా ఓ ఫోటో షేర్ చేశారు. ‘నాకు ప్రస్తుతం ఏం కావాలంటే’ అంటూ దీనికి క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ బ్లడ్ ప్యాకెట్పై ట్రావెల్ అని రాసుంది. దీనిని చూసిన అల్లు అభిమానులు అల్లు కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయ్యిందా అని ఆందోళన చెందుతున్నారు. ఆమెకే హెల్త్ బాగోలేక ఆస్పత్రిలో చేరిందని, ఈ విషయాన్ని చెప్పడానికే ఆ ఫోటోని షేర్ చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అల్లు స్నేహ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.కాగా,అల్లు అర్జున్-స్నేహల వివాహం 2011 మార్చి 6న జరిగింది. ఈ జంటకి 2014లో అయాన్ జన్మించగా.. 2016లో అర్హ పుట్టింది. అల్లు అర్జున్ సినిమాలు, షూటింగ్స్, ఇతర పనులతో బిజీగా ఉంటే..స్నేహ ఫ్యామిలీని చూసుకుంటూ భర్తకు తోడుగా ఉంటుంది. -
అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయబోతున్న ప్రియాంక చోప్రా
-
అల్లు అర్జున్, అట్లీ సినిమాలో క్రేజీ హీరోయిన్.. భారీ రెమ్యునరేషన్
పుష్ప – 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్ (Allu Arjun).. ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను బద్దలు కొట్టేశాడు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించే తదుపరి చిత్రం మామూలుగా ఉండకూడదు. అది కచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అయ్యే ఉండాలి. దీంతో నటుడు అల్లు అర్జున్ అలాంటి చిత్రం వైపే నడుస్తున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ యువ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ ప్రాజెక్ట్ను ప్రకటించనున్నారని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది.రాజారాణి చిత్రంతో దర్శకుడిగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అట్లీ. ఆ తర్వాత నటుడు విజయ్ హీరోగా వరుసగా మెర్సల్, బిగిల్, తేరి చిత్రాలు చేసి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్లి నటుడు షారుఖ్ ఖాన్ కథానాయకుడుగా జవాన్ చిత్రాన్ని చేశారు. ఇందులో నయనతార, దీపిక పడుకొనే హీరోయిన్స్గా నటించారు. అయితే, అల్లు అర్జున్తో నటించే హీరోయిన్ను కూడా అట్లీ ఫైనల్ చేశారట. ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో కూడా రాణిస్తున్న ప్రియాంక చోప్రాను హీరోయిన్గా తీసుకోవాలని ఆయన ప్లాన్ చేశారట. ఈ చిత్రంలో నటించడానికి ఆమె రూ.30 నుంచి 40 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు గాని ఆమె గనుక నటిస్తే ఈ చిత్రం వేరే లెవల్కు వెళుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథకు మూలం పునర్జన్మ కాన్సెప్ట్ను ఎంపిక చేశారట. భారీ పీరియాడిక్ డ్రామా కథతో రానున్నారట. ఇందులో అల్లు అర్జున్ రెండు భిన్న గెటప్పుల్లో కనిపిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్లో ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యముందని వైరల్ అవుతుంది. ఆగష్టులో ఈ మూవీ షూటింగ్ పనులు ప్రారంభం కావచ్చు. -
ఐకాన్ స్టార్ వారసుడి బర్త్ డే.. బన్నీ దంపతుల స్పెషల్ విషెస్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమారుడికి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే చిన్ని బాబు అని ముద్దుగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సైతం అయాన్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.అయాన్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ప్రత్యేకంగా వీడియోను షేర్ చేసింది. అయాన్తో సంతోషంగా ఉన్న క్షణాలను వీడియో రూపంలో పంచుకుంది. నువ్వు మా జీవితంలో భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ స్నేహా రెడ్డి పోస్ట్ చేసింది. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. పుష్పకు సీక్వెల్గా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) Many many happy returns of the day to the love of my life … Happy Birthday my Chinni Babu #AlluAyaan 😘😘😘 pic.twitter.com/1r6fn7xXdc— Allu Arjun (@alluarjun) April 3, 2025 -
పుష్ప-2ను మించి అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా
-
అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?
సినిమా సెలబ్రిటీలపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలానే అల్లు అర్జున్ (Allu Arjun) గురించి కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్వరలో పేరు మార్చుకోబోతున్నాడని పలు ఇంగ్లీష్ వెబ్ సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత?పుష్ప 2 (Pushpa 2 Movie) మూవీతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ కి ఊహించని స్టార్ డమ్ వచ్చింది. దీంతో ఆచితూచి మూవీస్ చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమా కన్ఫర్మ్, అట్లీతో కూడా ఖరారైందని అంటున్నారు. పుట్టినరోజున (ఏప్రిల్ 8న) అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?)ఇలా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు మాట్లాడుకుంటున్న ఈ టైంలో బన్నీ (Bunny) పేరు మార్చుకోబోతున్నాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలు జాతకాలు, న్యుమరాలజీ లాంటివి ఎక్కువగా నమ్ముతుంటారు. అలానే న్యూమరాలజీ ప్రకారం.. తన పేరులో అదనంగా ఇంగ్లీష్ అక్షరం U,N గానీ బన్నీ జోడించుకుంటాడని.. ఇలా చేస్తే గుర్తింపు మరింత పెరుగుతుందని నమ్మకమట. మరి బన్నీ పేరు మార్పుపై వస్తున్న రూమర్స్ నిజమా కాదా కొత్త సినిమా ప్రకటిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పటిలానే పేరు ఉంటే ఓకే. లేదంటే మార్పు వార్తలు నిజమేనని తేలుతుంది.(ఇదీ చదవండి: యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!) -
రామ్ చరణ్ బర్త్ డే.. బయటపడ్డ విభేధాలు!
-
కొత్తపాత్రలో అల్లు అర్జున్
-
పుష్ప2 'కిస్సిక్' సాంగ్ మేకింగ్ వీడియో చూశారా..?
పుష్ప సినిమా 'ఊ అంటావా మామ' సాంగ్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.. పుష్ప2లో కిస్.. కిస్.. కిస్సిక్ సాంగ్ వైరల్ అయింది. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం నటి శ్రీలీల (Sreeleela) తనదైన గ్లామర్, స్టెప్పులతో దుమ్మురేపింది. అయితే, ఇప్పుడు ఆ సాంగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా కిస్సిక్ రికార్డు సృష్టించింది. ఈ సాంగ్కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. సింగర్ సుభ్లాషిణి ఆలపించారు. ఇప్పటికే ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్లో ఉంది. తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేయడంతో నెట్టింట ట్రెండ్ అవుతుంది. కిస్సిక్ అంటూ మీరూ చూసేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. -
అట్లీతో సినిమా ఇప్పట్లో లేదు.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
హిందీలో షారుక్ ఖాన్తో ‘జవాన్’ తీసి, బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ ( Atlee Kumar). ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రూ. వెయ్యి కోట్లకు పైగా దాటాయి. ఈ క్రమంలో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రం ఏంటి..? అనే చర్చలు చాలారోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్(Allu Arjun), సల్మాన్ ఖాన్లలో ఒకరితో ఆయన సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంబినేషన్లోనే అట్లీ సినిమా దాదాపు ఖరారైనట్లే అనే టాక్ బాలీవుడ్లో బలంగా వినిపించింది. ఈ సినిమాను దక్షిణాదిలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వైరల్ అయింది. అయితే, తాజాగా ఈ విషయంపై సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. అట్లీతో సినిమా ఇప్పట్లో ఉండదని ఆయన తేల్చేశారు. ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతోనే కాస్త వాయిదా వేస్తున్నట్లు సల్మాన్ ప్రకటించారు. అయితే, అట్లీతో సినిమా ఉంటుందని మాత్రం ఆయన చెప్పుకొచ్చారు.బన్నీ- అట్లీ లైన్ క్లియర్బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలతో అల్లు అర్జున్- అట్లీ మూవీ దాదాపు ఖరారైపోయిందని చెప్పవచ్చు. 'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం త్రివిక్రమ్తో బన్నీ మూవీ చేయాలి. కానీ ఇది భారీ బడ్జెట్తో తీసే మైథలాజికల్ కావడంతో ప్రీ ప్రొడక్షన్కే చాలా సమయం పట్టే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్లో మరో మూవీ చేయాలని బన్నీ అనుకున్నాడట. ఈ క్రమంలోనే అట్లీ లైనులోకి వచ్చాడు. ఈ ప్రాజెక్టుని బన్నీ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. -
ఛలో గల్ఫ్ అన్న బన్నీ, చరణ్.. టాలీవుడ్ సీక్రెట్ అదేనా?
గత కొంతకాలంగా దక్షిణాది సినిమాలకు అత్యంత విశ్వసనీయ నేస్తంగా వర్ధిల్లుతున్నాయి గల్ఫ్ దేశాలు.. ముఖ్యంగా దుబాయ్. మన అవార్డు ఫంక్షన్ల నుంచీ, సంగీత కార్యక్రమాలు, ఇతరత్రా ఈవెంట్స్ దాకా దుబాయ్తో భాయ్ భాయ్ అంటుంటారు దక్షిణాది చిత్ర ప్రముఖులు.. అందులోనూ మన తెలుగు సినీ ప్రముఖులు మరింత ముందుంటార ని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఇటీవల ఏ వేడుకా లేకపోయినా, ఏ ముఖ్యమైన కార్యక్రమం లేకపోయినా కూడా టాలీవుడ్ స్టార్లు తరచుగా దుబాయ్కి రాకపోకలు సాగిస్తుండడం కనిపిస్తోంది. దీనిపై రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి.(చదవండి: వాటాలు పంచుకుందాం..టాలీవుడ్ దర్శకులు ఓకే అంటారా?)చీమ చిటుక్కు మంటే చాలు చిటికెలో దాన్ని బయటకు తెచ్చేసి చీల్చి చెండాడేసే ఈ సోషల్ మీడియా యుగంలో... రహస్యాల్ని కాపాడుకోవడానికి తెరమీద వీరోచితంగా పోరాటాలు చేసే హీరోలు...తెరవెనుక మాత్రం ఛలో దుబాయ్ అంటున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది.వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా, తెలుగు టాప్ స్టార్లు, డైరెక్టర్లు ఇప్పుడు అరబ్ దేశాలను తాము ఇష్టపడే సమావేశ గమ్యస్థానాలుగా మార్చుకుంటున్నారని అర్ధమవుతోంది. దీనికి కొన్ని నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఇటీవల, టాలీవుడ టాప్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు సుకుమార్ లు అబుదాబిలో చక్కర్లు కొడుతూ కనిపించారు, వారి తదుపరి చిత్రం గురించి చర్చించడానికే వీరిద్దరూ ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారని సమాచారం. రంగస్థలం తో భారీ విజయాన్ని నమోదు చేసిన వీరి కాంబినేషన్, ఆధునిక టచ్తో కూడిన యాక్షన్–ప్యాక్డ్ చిత్రం కోసం మళ్లీ చేతులు కలిపింది. (చదవండి: సల్మాన్ కొత్త సినిమాకు ఘోరమైన పరిస్థితి!)మరోవైపు టాప్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా దుబాయ్లో ప్రఖ్యాత తమిళ దర్శకుడు అట్లీతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఇప్పటికే బన్నీ తదుపరి చిత్రంపై రకరకాల అంచనాలు , పుకార్లు షికారు చేస్తుండగా, వాటికి ఊతమివ్వడం ఇష్టం లేకే బన్నీ, అట్లీలు కూడా గల్ఫ్ బాట పట్టి ఉంటారని అంటున్నారు.‘ఈ తారలు మీడియా హడావిడి, తొంగి చూడడాలు లేకుండా వారితో సహకరించడానికి ఆసక్తి ఉన్న పరిశ్రమ పెద్దల జోక్యం లేకుండా చర్చలు జరపడానికి తగిన గోప్యతను కోరుకుంటారు‘ అని ఒక నిర్మాత తెలిపారు. అకాల లీక్లు తరచుగా వాస్తవాలను ఇష్టారాజ్యంగా వక్రీకరిస్తాయని ఆ నిర్మాత వివరిస్తున్నారు. ‘ప్రత్యర్థి నిర్మాతలు కొన్నిసార్లు మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం, సగం వండిన సమాచారాన్ని అందజేస్తారు, ఇది అనవసరమైన ఊహాగానాలకు దారి తీస్తుంది. ఒక ప్రాజెక్ట్ పాన్–ఇండియా చిత్రం అని చెప్పవచ్చు, మరొక దాంట్లో అల్లు అర్జున్ తో స్క్రీన్ ను పంచుకోనున్నారంటూ ఎవరెవరో తారలను సూచిస్తుంది, ఇది చిత్రాన్ని రూపొందించే రూపకర్తల వాస్తవ ప్రణాళికల చుట్టూ గందరగోళాన్ని సృష్టిస్తుంది.‘హైదరాబాద్, ముంబై చెన్నై లు ఫొటో/ వీడియోగ్రాఫర్లతో నిండిపోవడంతో, తెలుగు తారలు అధికారిక ప్రకటనలు చేయడానికి ముందుగా, ప్రాజెక్ట్లను ఖరారు చేయడానికి తెలివిగా తగిన ప్రదేశాలను అన్వేషిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో, ఒక్క ఎయిర్పోర్ట్ను చూసినా లేదా లీక్ అయిన ఇమేజ్ అయినా కూడా విపరీతమైన పుకార్లు నిరాధారమైన ఊహాగానాలకు దారి తీస్తుంది. ‘తరచుగా, ఈ నివేదికలలో ఎటువంటి నిజం ఉండదు,‘ అని ఆ నిర్మాత విశ్లేషించారు. -
బన్నీ ఫ్యాన్స్ కి కిక్కెక్కించే న్యూస్ డ్యూయెల్ రోల్ లో బన్నీ
-
రామ్ చరణ్- అల్లు అర్జున్.. ఈ సారికి లేనట్టే!
ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun).. పాన్ ఇండియా హీరోలుగా పుల్ క్రేజ్ సంపాదించారు. చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఓ మూవీ చేస్తున్నాడు. మరో మూవీ లైనులో ఉంది. బన్నీ కూడా రెండు సినిమాల కోసం సిద్ధమవుతున్నాడు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ బ్యాడ్ న్యూస్ అభిమానుల మధ్య చర్చకు కారణమవుతోంది.హీరోలన్నాక సినిమాలు చేస్తుంటారు. మంచి రోజులు చూసుకుని అప్డేట్స్ ఇస్తుంటారు. ఇక పుట్టినరోజున గ్లింప్స్, పోస్టర్స్ లాంటివి రిలీజ్ చేస్తుంటారు. త్వరలో చరణ్ (మార్చి 27), బన్నీ (ఏప్రిల్ 8) బర్త్ డేలు రాబోతున్నాయి. దీంతో కొత్త మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఈసారి అలాంటివేం ఉండవని తెలుస్తోంది.(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్)చరణ్-బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహమాన్ (Ar Rahman) సంగీత దర్శకుడు. కొన్నిరోజుల క్రితం ఈయన గుండెల్లో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. డిశ్చార్జ్ కూడా అయిపోయి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే గ్లింప్స్ విజువల్స్ రెడీ అయిపోయినా సరే మ్యూజిక్ బాకీ ఉండటంతో చరణ్ పుట్టినరోజు దీన్ని రిలీజ్ చేయడం కష్టమేనని మాట్లాడుకుంటున్నారు.మరోవైపు అల్లు అర్జున్ కొత్త మూవీస్ కి సంబంధించి పుట్టినరోజున అనౌన్స్ మెంట్స్ ఉండొచ్చని అనుకున్నారు. కానీ బన్నీ నానమ్మ ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సినిమాల ప్రకటన సరికాదని, వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ రూమర్స్ బట్టి చూస్తే త్వరలో మంచి రోజు చూసుకుని చరణ్, బన్నీ మూవీస్ అప్డేట్స్ రిలీజ్ చేస్తారనిపిస్తుంది.(ఇదీ చదవండి: వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ.. ఇప్పుడు ఎలా ఉందంటే?) -
వెంటిలేటర్ పై అల్లు అర్జున్ నానమ్మ!
అల్లు అర్జున్ నానమ్మ ఆస్పత్రిలో చేరారు. 95 ఏళ్ల వయసున్న ఈమెకు గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఈమె వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: లేడీ కమెడియన్ కొడుక్కి పేరు పెట్టిన కమల్ హాసన్)అల్లు అర్జున్ నానమ్మ పేరు కనక రత్నం. తాత పేరు అల్లు రామలింగయ్య. ఈయన నటుడిగా మనందరికి తెలుసు. వీళ్లకు నలుగురు పిల్లలు. అల్లు అరవింద్ కొడుకు కాగా.. సురేఖ (చిరంజీవి భార్య), వసంత, భారతి కూతుళ్లు.అల్లు అర్జున్ కి నానమ్మ అంటే రామ్ చరణ్ కి ఈమె స్వయానా అమ్మమ్మ అవుతుంది. బహుశా మనవళ్లు ఇద్దరూ ఈ పాటికే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి వచ్చుంటారు. కాకపోతే ఇది బయటకు రానట్లు ఉంది. ప్రస్తుతం చరణ్, బన్నీ ఎవరి మూవీస్ తో వాళ్లు బిజీగా ఉన్నారు.(ఇదీ చదవండి: వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్) -
వీడియో: దుబాయిలోని హిందూ దేవాలయంలో అల్లు అర్జున్
'పుష్ప 2'తో దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం కొత్త సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన రానుంది. అయితే తనకు దొరికిన విరామాన్ని ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా దుబాయి వెళ్లిన బన్నీ.. అక్కడే కట్టిన హిందూ దేవాలయాన్ని సందర్శించాడు. (ఇదీ చదవండి: జపాన్ లో 'దేవర'.. భార్యతో కలిసి వెళ్లిన తారక్)అబుదాబిలో ప్రఖ్యాత హిందూ దేవాలయం స్వామి నారాయణ్ మందిర్ ని కొన్నాళ్ల క్రితం స్థాపించారు. ఇప్పుడు దీన్నే అల్లు అర్జున్ సందర్శించారు. శనివారం అక్కడికి వెళ్లిన బన్నీకి ఆలయ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజాలు కూడా చేయించారు.ఇకపోతే ఆలయ ప్రతినిధులు..బన్నీకి ఈ ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల విషయానికొస్తే.. త్వరలో అట్లీతో ఓ మూవీ చేయబోతున్నాడు. దీని తర్వాతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 25 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతున్న సినిమా)Bunny Boyy visits the #AbuDhabiMandir ❤️#AlluArjun pic.twitter.com/PHjmE8FGp9— Bunny_boy_private (@Bunnyboiprivate) March 22, 2025 -
అల్లు అర్జున్.. హీరో కమ్ విలన్!?
అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో చేయడం దాదాపు ఖరారైపోయింది. ఎప్పుడు అధికారికంగా ప్రకటించనున్నారనేది కూడా రూమర్స్ వచ్చేస్తున్నాయి. అలానే స్టోరీ గురించి చిన్న హింట్ తో పాటు రెమ్యునరేషన్ డీటైల్స్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం త్రివిక్రమ్ తో బన్నీ మూవీ చేయాలి. కానీ ఇది భారీ బడ్జెట్ తో తీసే మైథలాజికల్ కావడంతో ప్రీ ప్రొడక్షన్ కే చాలా సమయం పట్టే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్ లో మరో మూవీ చేయాలని బన్నీ అనుకున్నాడట. ఈ క్రమంలోనే అట్లీ లైనులోకి వచ్చాడు. ఈ ప్రాజెక్టుని బన్నీ పుట్టినరోజు అంటే ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించనున్నారట.మరోవైపు ఈ సినిమాలో అల్లు అర్జున్.. హీరో కమ్ విలన్ గా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. అంటే అటు హీరోయిక్ ఎలివేషన్లతో పాటు విలన్ గానూ రచ్చ చేస్తాడేమో. ఇకపోతే ఈ మూవీ చేస్తున్నందుకు గానూ రూ.175 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 20 శాతం వాటా కూడా తీసుకోబోతున్నాడని అంటున్నారు. మరి వీటిలో నిజమెంతో తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. ఇప్పటికీ తెగని పంచాయితీ!) -
బాలీవుడ్లో ఒక్క హీరోకు కూడా చేతకాలేదు, కానీ అల్లు అర్జున్..: గణేశ్ ఆచార్య
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. అలాగే 24 విభాగాలు సరిగా పనిచేస్తేనే సినిమా సంపూర్ణమవుతుంది. కానీ సినిమా విజయం సాధించినప్పుడు చాలామంది కేవలం దర్శకులు, హీరోలను మాత్రమే మెచ్చుకుంటారు. ఆ విజయానికి దోహదపడ్డవారిని ప్రత్యేకంగా గుర్తించరు. అయితే దక్షిణాదిన మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందంటున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య (Ganesh Acharya). ముఖ్యంగా అల్లు అర్జున్ పిలిచి మరీ అభినందించడం మర్చిపోలేనంటున్నాడు. ఇతడు పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ అందించాడు.ఒకేసారి మేకప్తాజాగా కమెడియన్ భారతీ సింగ్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గణేశ్ ఆచార్య మాట్లాడుతూ.. 'దక్షిణాదిలో టెక్నీషియన్లకు గుర్తింపు, గౌరవం ఇస్తారు. నటీనటులు పదేపదే మేకప్స్ వేసుకోరు. ఉదయం ఒక్కసారి మేకప్ వేసుకున్నాక నేరుగా లంచ్కు వెళ్లిపోతారు. ఆ మధ్యలో మళ్లీ ముఖానికి రంగు పూసుకోవడం ఉండదు. మేనేజర్ల హడావుడి అసలే ఉండదు. అంతా ఒక పద్ధతిగా సాగిపోతుంది.చివరి నిమిషంలో డ్యాన్స్ స్టెప్పులు మార్చమంటారుడ్యాన్స్ విషయానికి వస్తే.. చాలామంది దర్శనిర్మాతలు మా కొరియోగ్రఫీ బాగుందని, దాన్ని యథాతథంగా పాటలో ఉంచాల్సిందేనని మా ముందు బీరాలు పలుకుతారు. కానీ స్టార్ హీరోల ముందు మాత్రం మౌనంగా ఉండిపోతారు. వారు అభ్యంతరం చెప్పగానే చివరి నిమిషంలో స్టెప్పుల్ని మార్చేయమంటారు. ఆ పాట కోసం మేమెంత కష్టపడ్డామన్నది పట్టించుకోరు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా నాకెంతో బాధగా అనిపిస్తుంది.మనకు ఇగో ఎక్కువ.. కానీ సౌత్లో..బాలీవుడ్లో జనాలు కేవలం హీరోనే పొగుడుతారు. దర్శకుడు, కొరియోగ్రాఫర్, టెక్నీషియన్ల ప్రతిభను, కష్టాన్ని ఏమాత్రం గుర్తించరు. పైగా మనకు ఇగోలు ఎక్కువ. కానీ సౌత్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పుష్ప పాటలకు నేను కొరియోగ్రఫీ చేసిన కొద్ది రోజుల తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) నన్ను పిలిచి మరీ అభినందించాడు. మాస్టర్, మీ వల్లే ఇదంతా సాధ్యమైంది అని మెచ్చుకున్నారు. బాలీవుడ్లో అలా అభినందించిన హీరో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. (చదవండి: విశాల్ చెల్లెలి భర్తపై సీబీఐ కేసు)పుష్ప సక్సెస్ పార్టీకి ఆహ్వానంకానీ అల్లు అర్జున్ నన్ను గుర్తించాడు. జనాలు నా డ్యాన్స్ చూసి పొగుడుతున్నారంటే దానికి కారణం మీరే అన్నారు. మనసు సంతోషంతో నిండిపోయింది. అక్కడితో ఆగలేదు. హైదరాబాద్లో జరిగిన పుష్ప సక్సెస్ పార్టీకి నన్ను ఆహ్వానించాడు. తాగి తూలుతూ డ్యాన్స్ చేసే పార్టీ కాదది. ప్రతి టెక్నీషియన్ ఆ పార్టీలో భాగమయ్యాడు. స్టేజీపై పుష్ప సినిమాకు పని చేసిన లైట్మెన్ను కూడా అవార్డుతో సత్కరించారు.బాలీవుడ్ను తక్కువ చేయాలని కాదు!నేను బాలీవుడ్ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. హిందీ ఇండస్ట్రీ మాకెంతో ఇచ్చింది. దానివల్లే ఈ స్థాయిలో ఉన్నాం. కానీ కొందరి కారణంగా మన చిత్రపరిశ్రమ అద్వాణ్నంగా మారిపోతోంది. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గణేశ్ ఆచార్య చెప్పుకొచ్చాడు. ఈయన పుష్ప 1లో దాక్కో దాక్కో మేక.., ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా పాటకు కొరియోగ్రఫీ చేశాడు. పుష్ప 2లో సూసేకి అగ్గిరవ్వ మాదిరి.., కిస్సిక్.. పాటకు స్టెప్పులు నేర్పించాడు.చదవండి: ఇంట్లో ఉన్నప్పుడు ఐదారుగురు మంది అసభ్యంగా తాకారు.. ఏడ్చేసిన వరలక్ష్మి -
రంగంలోకి పుష్ప 3 మరి రామ్ చరణ్ సంగతేంటి
-
పుష్ప- 2 గంగమ్మ జాతర సాంగ్.. అల్లు అర్జున్ ఒంటినిండా గాయాలే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప-2. గతంలో 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో కేజీఎఫ్ 2, బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాల రికార్డులను తిరగరాసింది. అమిర్ ఖాన్ దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.అయితే ఈ సినిమాలో సాంగ్స్ కూడా అభిమానులను ఊర్రూతలూగించాయి. కిస్సిక్ సాంగ్తో పాటు గంగమ్మ జాతర పాట కూడా ఆడియన్స్కు గూస్బంప్స్ తెప్పించాయి. ముఖ్యందా గంగమ్మ జాతర సాంగ్ బన్నీ ఫ్యాన్స్ను ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ పాటలకు కొరియోగ్రాఫర్గా పనిచేసిన గణేష్ ఆచార్య తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. గంగో రేణుక తల్లి పాట చిత్రీకరణ గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సాంగ్ షూట్ సమయంలో అల్లు అర్జున్కు గాయాలైనప్పటికీ పట్టు వదలకుండా పూర్తి చేశాడని కొనియాడారు.కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య మాట్లాడుతూ..'జాతర పాటను చిత్రీకరించడం మాకు చాలా సవాలుగా అనిపించింది. దాదాపు 29 రోజుల పాటు నిరంతరాయంగా చిత్రీకరించడం చాలా కష్టమైన పని. కానీ ఈ సాంగ్ క్రెడిట్ అంతా అల్లు అర్జున్కే చెందుతుంది. పుష్ప రెండు చిత్రాలకు ఆయన ఐదేళ్లు అంకితమిచ్చారు. జాతర సాంగ్లో అతను చీర, నెక్లెస్, బ్లౌజ్ ధరించాడు. షూట్ సమయంలో ప్రతి 5 నుంచి 10 రోజులకు అతనికి గాయాలు అయ్యేవి. కొన్నిసార్లు అతని పాదాలు, మెడకు కూడా గాయాలయ్యాయి. కానీ అల్లు అర్జున్ ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వలేదు' బన్నీ అంకితభావాన్ని కొనియాడారు. కాగా..బాలీవుడ్లో స్టార్ కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్న గణేశ్ ఆచార్య.. గోవిందా, సంజయ్ దత్, సన్నీ డియోల్, సునీల్ శెట్టి, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్స్తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం పింటూ కి పప్పి చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. -
ఆ ఏడాదే పుష్ప 3 రిలీజ్.. ప్రకటించిన నిర్మాత
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు.. కాదుకాదు, వైల్డ్ ఫైరు.. అని నిరూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప ఫ్రాంచైజీ (Pushpa Movie)తో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాడు. పుష్ప 1.. 2021లో విడుదల కాగా దాని సీక్వెల్ 2024లో రిలీజైంది. మరి పుష్ప 3 ఎప్పుడు? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.వారి ఎదురుచూపులకు నిర్మాత రవిశంకర్ తెర దించాడు. 2028లో పుష్ప 3 (Pushpa 3 Movie) విడుదల చేస్తామని వెల్లడించాడు. విజయవాడలో ఆదివారం జరిగిన రాబిన్హుడ్ ప్రెస్మీట్లో ఈ విషయాన్ని తెలిపాడు. అలాగే బన్నీ.. ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతిని కూడా బయటపెట్టాడు.పుష్పరాజ్ ప్రయాణం ఎలా మొదలైందంటే?అల్లు అర్జున్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుష్ప (Pushpa: The Rise). ఫహద్ ఫాజిల్, సునీల్, డాలి ధనంజయ, అజయ్ ఘోష్, జగదీశ్ ప్రతాప్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీకాంత్ విస్స డైలాగ్స్ రాశాడు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు.దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో దీనికి సీక్వెల్గా పుష్ప: ద రూల్ తెరకెక్కింది. 2024 డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1650 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత సృష్టించిన పుష్ప 2కి సీక్వెల్ ఉంటుందని చిత్రయూనిట్ ఎప్పుడో ప్రకటించింది. తాజాగా రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: ఆ సినిమా చూస్తుంటే చేదు గతం కళ్లముందుకు..: టాలీవుడ్ హీరోయిన్ -
సెంచరీ కొట్టిన పుష్పరాజ్ .. మేకర్స్ స్పెషల్ వీడియో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అమిర్ ఖాన్ దంగల్ తర్వాత (రూ. 2,070 కోట్లు) ఇండియాలోనే రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, బాహుబలి లాంటి సినిమాల రికార్డులను తుడిచిపెట్టేసింది.అయితే ఈ సినిమా విడుదలై నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పుష్ప 2 ది రూల్.. 100 డేస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బద్దలు కొడుతూ.. భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.కాగా.. పుష్ప -2 విషయానికి వస్తే 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా.. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. 100 DAYS FOR INDIAN CINEMA'S INDUSTRY HIT #Pushpa2TheRule ❤️🔥From wildfire moments on the screen to record-breaking moments at the box office, #Pushpa2 has taken Indian Cinema to the next level 💥💥💥#100DaysofPushpa2TheRule#WildFirePushpa pic.twitter.com/cjJVVTeoUR— Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2025 -
గురూజీని పక్కన పెట్టిన బన్నీ..! కన్ ఫ్యూజన్ లో త్రివిక్రమ్
-
నిర్మాతలని టెన్షన్ పెడుతున్న అట్లీ రెమ్యూనరేషన్..
-
బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
-
ఆరు నెలలు ఆగండి.. త్రివిక్రమ్కు బన్నీ రిక్వెస్ట్!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun ) నటించే తదుపరి సినిమా ఏంటనేదానిపై ఇప్పుడు రకరకాల ఊహగానాలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. మొన్నటి వరకు త్రివిక్రమ్( Trivikram Srinivas)తో సినిమా ఉంటుంది.. అది కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా అని వార్తలు వినిపించాయి. ఇప్పుడేమో బన్నీ మరో తమిళ దర్శకుడితో చేతులు కలిపాడని, అదే ఇప్పుడు తెరకెక్కుతుందని అంటున్నారు. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.బన్నీ కోసం స్టోరీ రెడీ చేసిన గురూజీగుంటూరుకారం తర్వాత తివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేయలేదు. ఆ సినిమా రిలీజ్కి ముందే బన్నీతో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బన్నీ సరికొత్త గెటప్లో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారట. పుష్ప 2 రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కేస్తుందని అంతా భావించారు. కానీ బన్నీ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తివిక్రమ్ కంటే ముందు వేరే దర్శకుడితో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట.నా కోసం ఆరు నెలలు ఆగండితన కోసం కథ రెడీ చేసి సిద్ధంగా ఉన్న త్రివిక్రమ్ని తాజాగా బన్నీ కలిశారు. మరోసారి ఇద్దరు స్క్రిప్ట్ గురించి చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బన్నీ తన మనసులో మాట చెప్పేశాడట. ఈ సినిమా షూటింగ్ కంటే ముందు మరో సినిమా చేస్తానని, 2026లో అది రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తివ్రిక్రమ్కి వివరించారట. ఆ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే.. ఈ సినిమా కూడా ప్రారంభిద్దామని, తనకోసం ఓ ఆరు నెలలు వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేశారట. దీనికి త్రివిక్రమ్ కూడా అంగీకరించారట.రెండు సినిమాల షూటింగ్స్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకోమని బన్నీని అడిగారట. ఆ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయేవరకు తాను ఆగలేనని, మధ్యలో జాయిన్ అవుతానంటే తనకు ఓకే అని చెప్పారట. బన్నీ కూడా మొదట అట్లీ సినిమా షూటింగ్ ప్రారంభించి, తర్వాత త్రివిక్రమ్ మూవీని సెట్పైకి తీసుకురావాలనుకుంటున్నాడట. త్రివిక్రమ్ మూవీ షూటింగ్కి చాలా సమయం పడుతుంది. 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మధ్యలో అట్లీ సినిమా చేస్తే..అది వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసి గ్యాప్ లేకుండా చూసుకోవాలని బన్నీ భావిస్తున్నాడట. పుష్ప 1,2 చిత్రాల కోసం ఐదేళ్లు కేటాయించిన బన్నీ..ఇప్పుడు వరుస సినిమాలతో ఫ్యాన్స్ని అలరించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. -
'పుష్ప'రాజ్గా జడేజా.. వీడియో రిలీజ్ చేసిన 'చెన్నై సూపర్ కింగ్స్'
అంతర్జాతీయ క్రికెట్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప మార్క్ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడు, సెంచరీ బాదినప్పుడు ఎవరైనా సంబరాలు చేసుకుంటుంటారు. కానీ, పుష్ప సినిమా విడుదల తర్వాత ట్రెండ్ మారిపోయింది. భారత క్రికెటర్స్తో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు సైతం పుష్ప మార్క్ స్టైల్లో 'తగ్గేదేలే' అంటూ బన్నీని అనుకరించడం చూశాం. తాజాగా పుష్ప2 విడుదలైంది. మార్చి 22నుంచి ఐపీఎల్-2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఒక వీడియోను పంచుకుంది. అందులో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 'పుష్ప' గాడి రూల్ సీన్ను రీక్రియేట్ చేశారు. సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ను వారు రీక్రియేట్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్ అవుతుంది.కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో పుష్ప ట్రెండ్ మార్క్ తప్పకుండా కనిపిస్తుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా దగ్గర కావడంతో ఈసారి స్టేడియంలో పుష్పరాజ్ గెటప్లో చాలామంది కనిపిస్తారు. క్రికెటర్స్ వికెట్ తీసినా, సెంచరీ కొట్టినా 'తగ్గేదేలే' అంటూ ఫోజులు ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో జడేజా విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే పుష్ప స్టైల్లో తన బ్రాండ్ను చూపించాడు. ఆ విజువల్ నెట్టింట భారీగా వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా జడేజాతో పుష్ప బీజీఎమ్తో ఒక సీన్ రీక్రియేట్ చేసి సోషల్మీడియాలో పంచుకుంది. వైల్డ్ఫైర్ అంటూ తమ డెన్ పూర్తి సిద్ధంగా ఉందంటూ ఐపీఎల్ 2025 కప్ కోసం ఛాలెంజ్ విసిరింది.క్రికెట్లో పుష్ప మార్క్క్రికెట్ స్టేడియంలో బ్యాటింగ్కు దిగాడంటే రెచ్చిపోయే ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సైతం పుష్పగాడికి అభిమాని అయిపోయాడు. పలుమార్లు 'తగ్గేదేలే' అంటూ బన్నీ అభిమానులను మెప్పించాడు. రీసెంట్గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా పుష్ప మార్క్ చూపించాడు. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్పై శతకంతో అలరించిన ఆయన అర్ధశతకం నమోదు చేయగానే ‘పుష్ప’ స్టైల్లో నితీశ్ స్వాగ్ చూపించాడు. దీంతో స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు. వెస్టిండీస్ ఆల్రౌండర్ డీజే బ్రావో, పాండ్యా,నజ్ముల్ ఇస్లాం,శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ ఇలా ఎందరో పుష్పగాడి స్వాగ్కు ఫ్యాన్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
బన్నీ - అట్లీ మల్టీస్టారర్ లో శివకార్తికేయన్
-
అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డ్
-
అల్లు అర్జున్- స్నేహారెడ్డి మ్యారేజ్ డే.. పిల్లలతో కలిసి సెలబ్రేషన్స్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి గ్రాండ్గా వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు బన్నీ భార్య స్నేహారెడ్డి. తమ పిల్లలతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ యానివర్సరీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. బన్నీ- స్నేహారెడ్డి 2011లో మార్చి 6వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ టాలీవుడ్ కపుల్ తమ 14వ వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. 2011లో వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఈ టాలీవుడ్ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లైన మూడేళ్లకు 2014లో అల్లు అయాన్ జన్నించగా.. ఆ తర్వాత 2016లో ఈ జంటకు కూతురు పుట్టింది. బన్నీ తమ ముద్దుల కూతురికి అల్లు అర్హ అని నామకరణం చేశారు. తమ అభిమాన హీరో పెళ్లి రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తాయి. తమ హీరోకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.కాగా.. గతేడాది పుష్ప-2 మూవీతో సూపర్హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా ఈ చిత్రం భారీ రికార్డులు సృష్టించింది. ఏకంగా కేజీఎఫ్, బాహుబలి సినిమాల రికార్డ్లను దాటేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ వేదికగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. Happy Anniversary to the most adorable couple's#alluarjun #AlluSnehaReddy 💙🤍 pic.twitter.com/ph25JnihdF— SAITEJA_Bunny🚩 (@SaiTeja307799) March 6, 2025 -
ఐదుగురు హీరోయిన్స్ తో బన్నీ రొమాన్స్..!
-
అల్లు అర్జున్, స్నేహరెడ్డిల బంధానికి 14 ఏళ్లు.. ఈ ఫోటోలు చూశారా..?
-
ఐదుగురు నాయికలతో..?
హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ రూపొందనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందని, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారనీ ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని, ఇందులో ముగ్గురు విదేశీ నాయికలు ఉంటారని భోగట్టా. అయితే మెయిన్ హీరోయిన్ మాత్రం జాన్వీ కపూర్ అని సమాచారం. మరి... వార్తల్లో ఉన్నట్లు అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్ మూవీలో ఐదుగురు నాయికలు ఉంటారా? అనే ప్రశ్నకు క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు. -
Atlee: ఐకాన్ స్టార్ కొత్త ప్రాజెక్ట్ కోసం
-
కేరళకు అల్లు అరవింద్.. నిర్మాత బన్నీవాసు క్లారిటీ
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఛావా తెలుగు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఛావాను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంపై అరవింద్ ఎలా రియాక్ట్ అయ్యారని మీడియా ప్రతినిధులు బన్నీవాసును ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ అల్లు అరవింద్ ప్రస్తుతం కేరళలో ఉన్నారని తెలిపారు. ట్రీట్మెంట్ కోసం ఆయన కేరళ వెళ్లారని వెల్లడించారు.అయితే ఆయన కేవలం వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం వెళ్లారని బన్నీ వాసు అన్నారు. బరువు తగ్గేందుకు ప్రకృతి వైద్య చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. ఛావా నిర్మాతలతో మాట్లాడి తెలుగు రిలీజ్ చేసేందుకు ప్రయత్నించాలని అరవింద్ చెప్పారని తెలిపారు. ఆయన డైరెక్షన్లోనే ఛావాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.కాగా.. బాలీవుడ్ మూవీ ఛావాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఈ చిత్రాన్ని శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో శంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్, యేసుబాయిగా రష్మిక మందన్నా నటించారు. గతనెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ సూపర్ హిట్గా నిలవడంతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. -
బన్నీ నెక్స్ట్ మూవీకి ఏంటి సమస్య?
'పుష్ప 2' వచ్చి మూడు నెలలు దాటేసింది. అల్లు అర్జున్ ఇప్పుడు ఏ సినిమా.. ఎవరితో చేస్తాడనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే ఇద్దరి డైరెక్టర్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలింతకీ ఏంటి సమస్య? ఎవరితో ఫస్ట్ చేయొచ్చు?అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకులు రెడీగా ఉన్నారు కానీ ఇదివరకే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పీరియాడిక్ సెటప్ ఉన్న కథ కావడంతో ప్రీ ప్రొడక్షన్ కే చాలా టైమ్ పట్టేలా ఉంది. నిర్మాత నాగవంశీ.. రీసెంట్ గానే మాట్లాడుతూ ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రాజెక్ట్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. అంటే మరో ఆరేడు నెలలు బన్నీ ఖాళీగానే ఉంటాడు.(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)మరోవైపు అల్లు అర్జున్.. తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్. కాకపోతే బడ్జెట్-రెమ్యునరేషన్ దగ్గరే చిక్కంతా వచ్చి పడిందని తెలుస్తోంది. రూ.600 కోట్ల బడ్జెట్ కాగా.. పారితోషికం కింద తనకే రూ.100 కోట్లు ఇవ్వాలని అట్లీ అంటున్నాడట. ఈ పాయింట్ దగ్గరే డిష్కసన్స్ నడుస్తున్నాయని, ఏదో ఒక విషయం తేలితో త్వరలో బన్నీ-అట్లీ కాంబోపై క్లారిటీ వస్తుందని టాక్.అట్లీ ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమా వచ్చే ఏడాదే మొదలవుతుంది. లేదంటే మాత్రం ఈ ఏడాది చివర్లో షురూ చేసేస్తారు. మరి బన్నీ ఏం చేస్తాడనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. స్ట్రీమింగ్ అందులోనే) -
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? బన్నీ, ప్రభాస్ సినిమాల్లో హీరోయినే కానీ (ఫొటోలు)
-
మళ్లీ దిల్ - డీజే కాంబో
-
గ్లోబల్ స్టేజీపై 'పీలింగ్స్'.. వైబ్ అదిరింది!
తెలుగు సినిమా ఇప్పుడు ఎల్లలు దాటిపోయింది. బాహుబలికి వచ్చిన గుర్తింపు కావొచ్చు, ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటుకు వచ్చిన ఆస్కార్ కావొచ్చు. మన సినిమా స్థాయిని పెంచేశాయి. ఇక పాటల గురించైతే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అలానే 'పుష్ప 2'లోని(Pushpa 2 Movie) పీలింగ్స్ పాట గ్లోబల్ స్టేజీ దద్దరిల్లిపోయేలా చేసింది.మన దగ్గర బాస్కెట్ బాల్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు గానీ అమెరికాలో ఈ ఆటకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్బీఏ అయితే ఎప్పటికప్పుడు మ్యాచులు నిర్వహిస్తూనే ఉంటుంది. తాజాగా అలానే అమెరికాలోని టెక్సాస్ లో హ్యూస్టర్ రాకెట్స్ vs మిల్వాకీ బక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. విరామ సమయంలో స్టేడియంలో కూర్చున్న వీక్షకుల్ని అలరించేందుకు డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చేశారు.(ఇదీ చదవండి: కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్?)ఇందులో భాగంగా 45 మంది డ్యాన్సర్స్.. పుష్ప 2చిత్రంలోని పీలింగ్స్ పాటకు (Peelings Song) స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 ఫీవర్ గ్లోబల్ స్టేజీ వరకు వెళ్లిందని బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.గతేడాది డిసెంబర్ 5న 'పుష్ప 2' (Allu Arjun) థియేటర్లలో రిలీజైంది. రూ.1800 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)A grand tribute to Icon Star @alluarjun & #Pushpa2 at the Houston Rockets vs Milwaukee Bucks game during the halftime show at @NBA!A proud and historic moment, celebrating Indian cinema and culture on a global stage! 🌍🇮🇳#Pushpa2TheRule #AlluArjunpic.twitter.com/hEjhB9K2Pf— Milagro Movies (@MilagroMovies) February 27, 2025 -
Allu Arjun: అట్లీ సినిమా అప్డేట్
-
'గం గం.. గణేశా' సినిమా నిర్మాత మృతి
టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్లో మరణించారు. అయితే, ఆయన మరణానికి కారణాలు తెలియడం లేదు. తెలుగులో 'గం గం.. గణేశా' మూవీని కేదార్ నిర్మించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం గతేడాదిలో విడుదలైంది. అయితే, కేదార్ సెలగంశెట్టి మరణ వార్తను తెలుసుకున్న ఆయన మిత్రులు సంతాపం తెలుపుతున్నారు. కేదార్ సెలగంశెట్టికి ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. అల్లు అర్జున్, నిర్మాత బన్నీవాస్, విజయ్ దేవరకొండలకు ఆయన అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.కేదార్ సెలగంశెట్టిని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అల్లు అర్జున్ అని తెలిసిందే. ఇప్పటికే చాలామంది స్నేహితులను ఇండస్ట్రీకి అల్లు అర్జున్ పరిచయం చేశారు. ఈ క్రమంలో కేదార్ను కూడా బన్నీనే సపోర్ట్ చేశారు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్పై పలు చిత్రాలను నిర్మించాలని కేదార్ సెలగంశెట్టి ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఒక మూవీని కూడా వారు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆయన హఠాత్తుగా మరణించారని వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ఆయన స్నేహితులు కూడా షాక్ అవుతున్నారు. -
చీర కట్టుకోవాలంటే భయమేసింది, నటుడిగా 5.5 మార్కులే..: అల్లు అర్జున్
తగ్గేదేలె అన్న డైలాగ్ను సినిమాలోనే కాదు రియల్ లైఫ్లోనూ ఫాలో అవుతున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప 2 చిత్రంతో ఏకంగా రూ.1871 కోట్లు సాధించి రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. అలాగే ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ తొలి సంచికపై కనిపించిన మొట్టమొదటి భారతీయ హీరోగా అరుదైన ఘనత సాధించాడు. ఈ కవర్ పేజీ షోటషూట్ సమయంలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.భయపడ్డా..అల్లు అర్జున్ మాట్లాడుతూ.. గంగమ్మ జాతర సన్నివేశంలో చీర కట్టుకోవాలని చెప్పినప్పుడు నేను మొదట భయపడ్డాను. ఇది వర్కవుట్ కాదేమో అన్నాను. కానీ సుకుమార్ (Sukumar) మాత్రం ఆ సన్నివేశంలో నువ్వు చీర కట్టుకుని అమ్మాయిగా కనిపించాలంతే అన్నాడు. అందుకోసం మొదట డ్రాయింగ్స్ వేశారు. నాకు ఏ లుక్ సూటవుతుందని పరీక్షించారు. తర్వాత నెమ్మదిగా నాలోనూ నమ్మకం మొదలైంది. కచ్చితంగా ఇది సినిమాకే హైలైట్గా నిలుస్తుందనిపించింది. నటుడిగా ఐదున్నర మార్కులుఅదే సమయంలో ఇది నాకెంతో ఛాలెంజింగ్గానూ అనిపించింది. ఎందుకంటే చీర కట్టినా కూడా ఎంతో పవర్ఫుల్గా కనిపించాలి. ఫైనల్గా ఆ సీన్ అనుకున్నట్లుగానే చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ అయిందని నేను గర్వాన్ని తలకెక్కించుకోలేదు. నటుడిగా నాకు 10కి 5.5 మార్కులు వేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. పుష్ప 2 (Pushpa 2 The Rule) విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప 1 చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కింది. సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించాడు.చదవండి: దుబాయ్లో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అఖిల్ 'నాటు నాటు' స్టెప్పులు -
హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఐకాన్ స్టార్ (ఫోటోలు)
-
ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?!
ఎక్కడ చూసినా ఛావా (Chhaava Movie) ప్రభంజనమే! ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఛత్రపతి శివాజీ ధైర్యసాహసాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన కుమారుడు శంబాజీ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఆయన చరిత్రను అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో తెరకెక్కిన సినిమా ఛావా. ఓపక్క ప్రేక్షకుల రక్తం మరిగేలా చేస్తూ మరోపక్క వారిని సీట్లకు కట్టిపడేసి కన్నీళ్లు పెట్టిస్తోందీ మూవీ.పుష్ప 2 Vs ఛావా అయ్యేది!ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజైంది. నిజానికి గతేడాది డిసెంబర్ 6న ఛావాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా (Pushpa 2: The Rule) కూడా సరిగ్గా అప్పుడే వస్తున్నట్లు తెలిసి ఆలోచనలో పడ్డారు. అప్పటికే పుష్ప 1 బ్లాక్బస్టర్. దానికి సీక్వెల్గా వస్తున్న పుష్ప 2ను పాన్ ఇండియావైడ్గా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఇలాంటి సమయంలో పుష్పరాజ్కు పోటీగా వెళ్తే రెండు సినిమాల కలెక్షన్స్ దెబ్బతినే అవకాశం ఉందని ఛావా మేకర్స్ వెనక్కు తగ్గారు.పుష్పరాజ్కు దారిచ్చిన ఛావాపుష్పరాజ్కు దారిస్తూ కొత్త డేట్ వెతుక్కున్నారు. అందుకుగానూ అల్లు అర్జున్ (Allu Arjun) ఛావా యూనిట్కు స్పెషల్గా థాంక్స్ కూడా చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రెండు సినిమాలు లాభపడ్డాయి. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1850 కోట్లు సాధించింది. ఇప్పుడు ఛావాకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ ఊపందుకుంటున్నాయి. ఇక ఈ రెండు సినిమాల్లోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించడం విశేషం. (చదవండి: Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో)ఇద్దరి కెరీర్లో మైలురాయి..అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప ఎలాగో విక్కీ కౌశల్ కెరీర్లో ఛావా అంతే ప్రత్యకంగా నిలిచిపోనుంది. ఛావా సినిమాపై ప్రధాని నరేంద్రమోదీ సైతం ప్రశంసలు కురిపించారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఛావా అన్నిచోట్లా ఆదరణ పొందుతోంది. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల వల్ల శంభాజీ వీరత్వాన్ని సినిమాగా పరిచయం చేయడానికి వీలైంది అన్నారు.మోదీ ప్రశంసలుఇందుకు సంబంధించిన వీడియోను విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీ ఛావాను ప్రశంసించడం, ఛత్రపతి శంభాజీ మహారాజ్ త్యాగాన్ని కీర్తించినందుకు గర్వంగా ఉంది. ఆనందంతో మనసు ఉప్పొంగుతోంది అని రాసుకొచ్చాడు. ఛావాలో శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసుబాయిగా రష్మిక మందన్నా, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా రాబట్టింది.చదవండి: అయ్య బాబోయ్.. కిచ్చ సుదీప్కి ఇంత పెద్ద కూతురు ఉందా? -
వినయం ముఖ్యం: అల్లు అర్జున్
‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్’ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించడంతో పాటు ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ‘పుష్ప: ది రైజ్’లో తన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. అలాగే ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్ల వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ తాజాగా మరో అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు.ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజీన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇప్పుడు ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేరుతో ఇండియాలోనూ అడుగుపెట్టింది. ఈ మ్యాగజీన్ తొలి సంచిక కవర్ పేజీ అల్లు అర్జున్ ఫొటోతో ‘అల్లు అర్జున్: ది రూల్’ పేరుతో రానుండటం విశేషం. తాజాగా ఈ కవర్ పేజ్ ఫొటోషూట్ను నిర్వహించారు. ఆప్రోమో వీడియోను షేర్ చేశారు. అందులో అల్లు అర్జున్ పంచుకున్న కొన్ని విషయాలను చూపారు. ‘‘ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది. బలం, ఆత్మవిశ్వాసం అనేవి మనసులో ఉంటాయి. వాటిని ఎవరూ తీసేయలేరు.కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి. ఇది అలాంటిదే. విజయం తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యం. జీవితంలో సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలా మందిని చూశాను. అది వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నేను వంద శాతం సామాన్యుడినే. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇదే భావనతో ఉంటాను. అలాగే విరామ సమయంలో కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటాను. ఏమీ చేయకుండా ఉండటమే నాకిష్టం. కనీసం పుస్తకం కూడా చదవను’’ అంటూ ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పేర్కొన్నారు. -
గురూ.... కొత్త కాంబినేషన్ షురూ
జానర్ మాత్రమే కాదు... ఒక్కోసారి కాంబినేషన్స్ కూడా ఆడియన్స్ను థియేటర్స్కు రప్పిస్తాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ మూవీస్కు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. కొందరు తెలుగు స్టార్ హీరోలు ఇప్పటివరకు తమతో సినిమాలు చేయని దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న కొన్ని కొత్త కాంబినేషన్స్ కథా కమామీషుపై ఓ లుక్ వేయండి.ప్రభాస్తో లోకేశ్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లోని ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ‘స్పిరిట్’ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. అయితే తనతో ‘సలార్’ వంటి మాస్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్తో ప్రభాస్ మూడు సినిమాలు కమిటయ్యారు. ఈ మూడు సినిమాలు వరుసగా 2026, 2027, 2028లలో విడుదల కానున్నాయి.కాగా వీటిలో ఓ చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే లోకేశ్ కార్తీతో ‘ఖైదీ 2’ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభాస్–లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లోని మూవీ చిత్రీకరణ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యే చాన్సెస్ ఉన్నాయి.అలాగే ‘హనుమాన్’ తో భారీ బ్లాక్బస్టర్ హిట్ సాధించిన ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ‘జై హనుమాన్’తో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్తో ప్రశాంత్ వర్మ సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్నగర్ సమాచారం.గ్రీన్ సిగ్నల్తమిళంలో రజనీకాంత్తో ‘జైలర్’ సినిమా తీసి సూపర్హిట్ అందుకున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్. ప్రస్తుతం రజనీకాంత్తోనే ‘జైలర్ 2’ సినిమా చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నెల్సన్. అయితే ‘జైలర్’కు, ‘జైలర్ 2’కు మధ్య తనకు లభించిన గ్యాప్లో ఓ కథ రాసుకున్నారట నెల్సన్. ఈ కథను ఎన్టీఆర్కు వినిపించగా, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.అయితే ఇటీవలే హిందీలో ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) సినిమాను పూర్తి చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో తాను కమిటైన ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ సినిమా కోసం కావాల్సిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్.ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత నెల్సన్ సినిమాను ఎన్టీఆర్ సెట్స్కు తీసుకువెళతారని ఊహించవచ్చు. అలాగే ‘హాయ్ నాన్న’ వంటి ఫీల్గుడ్ మూవీ తీసిన శౌర్యువ్ కూడా ఎన్టీఆర్కుప్రాథమికంగా ఓ లైన్ చెప్పారని, స్టోరీ కుదిరితే శౌర్యువ్తోనూ ఎన్టీఆర్ మూవీ చేస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది.అర్జున్తో అట్లీ‘పుష్ప: ది రూల్’ సినిమా సక్సెస్తో మంచి జోష్లో ఉన్నారు అల్లు అర్జున్. ఈ సక్సెస్ను ఎంజాయ్ చేసేందుకు ప్రస్తుతం స్పెయిన్లో ఉన్నారు అల్లు అర్జున్. కాగా ‘పుష్ప’ సినిమా నిర్మాణం సమయంలోనే దర్శకుడు త్రివిక్రమ్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నట్లుగా అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అయితే ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీతో సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉండటంతో అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్తో చేస్తారనే టాక్ వినిపించింది.కానీ త్రివిక్రమ్తో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాకు మైథలాజికల్ బ్యాక్డ్రాప్ ఉంటుందట, చాలా గ్రాఫిక్స్ వర్క్ అవసరం అవుతుందట. ఇలా ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ ఇంకా సమయం పడుతుందట. దీంతో తన నెక్ట్స్ మూవీ కోసం తమిళ టాప్ డైరెక్టర్ అట్లీతో చర్చలు జరిపారట అల్లు అర్జున్. అట్లీ డైరెక్షన్లోనే అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ సెట్స్పైకి వెళ్లనుందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారని, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందని భోగట్టా. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా రూ. 1871 కోట్ల వసూళ్లు రాబట్టింది.మరోవైపు దర్శకుడిగా షారుక్ ఖాన్తో రూ. 1000 కోట్ల ‘జవాను’ను తీశారు అట్లీ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్పై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ స్పెయిన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ మూవీ పై మరింత సమాచారం బయటకు రానుందని తెలిసింది. అలాగే ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ఇటీవల ముంబైలో కలిశారు అల్లు అర్జున్. వీరి మధ్య ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయి. సో... భన్సాలీతో కూడా అల్లు అర్జున్ సినిమా చేసే చాన్స్ ఉందని ఊహించవచ్చు.మాస్ ప్లస్ క్లాస్ ఎక్కువగా మాస్, వీలైనప్పుడు క్లాస్ మూవీస్ చేస్తుంటారు రవితేజ. అయితే రీసెంట్ టైమ్స్లో రవితేజ మాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘మాస్ జాతర’ మాస్ అప్పీల్ ఉన్న సినిమాయే. దీంతో ఓ క్లాస్ మూవీ చేయాలని రవితేజ అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కిశోర్ తిరుమల రెడీ చేసిన ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీకి రవితేజ పచ్చజెండా ఊపారని, త్వరలోనే ఈ వీరి కాంబినేషన్లోని మూవీపై స్పష్టత రానుందని ఫిల్మ్నగర్ సమాచారం.ఓకే చెప్పిన నానీశివ కార్తికేయన్తో తమిళంలో ‘డాన్’ (2022) వంటి క్యాంపస్ డ్రామా ఫిల్మ్ తీసి హిట్ సాధించారు తమిళ యంగ్ డైరెక్టర్ సిబీ చక్రవర్తి. అప్పట్నుంచి సిబీ చక్రవర్తితో ఓ మూవీ చేయాలని నానీ అనుకుంటున్నారట. ఆ సమయం ఇప్పడు వచ్చిందని, నానీ–సిబీ చక్రవర్తి కాంబినేషన్లోని మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయని, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నానీ ‘హిట్ 3’ మూవీతో బిజీగా ఉన్నారు.మే 1న ఈ చిత్రం రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత తనకు ‘దసరా’ వంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నానీ ‘ప్యారడైజ్’ అనే మూవీ చేస్తారు. అయితే ‘ప్యారడైజ్’ చిత్రానికి సమాంతరంగా సిబీ సినిమాను కూడా నానీ చేస్తారా? లేక ‘ప్యారడైజ్’ చిత్రాన్ని పూర్తి చేశాక సిబీ చక్రవర్తి సినిమాను స్టార్ట్ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన ఓ కథ నానీని ఇంప్రెస్ చేసిందని, నానీ ప్రస్తుత కమిట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత శేఖర్ కమ్ములతో చేసే మూవీపై ఓ స్పష్టత వస్తుందని సమాచారం. ఈ నెల 24న నానీ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ హీరో తదుపరి చిత్రాలపై అధికారిక అప్డేట్స్ ఏమైనా వస్తాయా? అనేది చూడాలి.కిల్ డైరెక్టర్తో..!హిందీలో ‘కిల్’ వంటి మాస్ యాక్షన్ ఫిల్మ్ తీసి, ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యారు దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్. ఈ దర్శకుడు ఇప్పుడు ఓ క్రేజీ తెలుగు హీరోతో భారీ బడ్జెట్ మూవీ తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్లో విజయ్ దేవరకొండను కలిశారు నిఖిల్ నగేశ్. వీరి మధ్య ఓ కొత్త సినిమా గురించిన చర్చలు జరిగాయి. ప్రస్తుతం ‘కింగ్డమ్’ మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.మే 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్తో రాయలసీమ నేపథ్యంలో ఓ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్, రవికిరణ్ కోలాతో ఓ విలేజ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలు పూర్తయ్యాక విజయ్ దేవరకొండ–నిఖిల్ నగేశ్ల కాంబినేషన్లోని మూవీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
‘హాలీవుడ్ రిపోర్టర్’పై అల్లు అర్జున్.. అరుదైన ఘనత
పుష్ప చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). ఇటీవల విడుదలైన పుష్ప2 చిత్రం హాలీవుడ్ని సైతం మెప్పించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 1871 కోట్లు వసూళ్లను సాధించింది రికార్డులు సృష్టించింది. ఇలా పుష్ప, పుష్ప 2 చిత్రాలతో ఎన్నో అవార్డులను, రికార్డులను తన ఖాతాలో వేసుకున్న బన్నీ తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ 'ది హాలీవుడ్ రిపోర్టర్' ఇప్పుడు ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ (The Hollywood Reporter India) పేరుతో భారత్లోనూ ప్రచురితం కానుంది. ఈ మ్యాగజైన్ తొలి సంచిక అల్లు అర్జున్ ముఖచిత్రంతో తీసుకురావడం విశేషం. తాజాగా ఈ కవర్ పేజ్ ఫొటో షూట్ను నిర్వహించారు. దానికి సంబంధించిన ప్రోమో వీడియోను తాజాగా షేర్ చేశారు. అందులో అల్లు అర్జున్ పంచుకున్న కొన్ని విషయాలను చూపారు.‘ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది. బలం, ఆత్మవిశ్వాసం అనేవి మనసులో ఉంటాయి. వాటిని ఎవరూ తీసేయలేరు. కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి. ఇది అలాంటిదే. విజయం తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యం. జీవితంలో సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేని చాలా మందిని నేను చూశాను. అది వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే నేను వంద శాతం సామాన్యుడినే. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇదే భావనతో ఉంటాను. అలాగే విరామ సమయంలో కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటాను. ఏమీ చేయకుండా ఉండటమే నాకిష్టం. కనీసం పుస్తకం కూడా చదవను’అని ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ వివరించారు. -
'బాహుబలి 2' రికార్డును బ్రేక్ చేసిన 'పుష్ప 2'.. కలెక్షన్స్ ఎంతంటే?
-
అల్లు అర్జున్ అట్లీ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ కన్ఫర్మ్..?
-
అల్లు అర్జున్కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ..?
తెలుగు చిత్ర పరిశ్రమలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు జాన్వీ. ప్రస్తుతం రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోయిన్గా చేస్తున్నారామె. ఈ యంగ్ బ్యూటీకి మరో సూపర్ చాన్స్ దక్కిందట. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా అట్లీ(Atlee) దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుందనే టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని నిర్మించనుందట. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మరి... ఈ వార్త నిజమై అల్లు అర్జున్ సరసన జాన్వీ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... ప్రస్తుతం వెకేషన్లో భాగంగా అల్లు అర్జున్ స్పెయిన్లో ఉన్నారు. తిరిగొచ్చిన తర్వాత ఈ సినిమాకు చెందిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయని తెలిసింది. -
'పుష్ప2' ఫైనల్ కలెక్షన్స్.. ప్రకటించిన మేకర్స్
పుష్ప2 ఫైనల్ కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను రప్పా.. రప్పా.. రప్పా అంటూ దాటుకుంటూ వచ్చేసింది. 75 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్ల (గ్రాస్) వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. 2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ‘పుష్ప 2’ నిలవడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీగా నిలిచింది. సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ మూవీగా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది.ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో 'దంగల్' (రూ.2024 కోట్లు) టాప్లో కొనసాగుతుంది. రెండో స్థానంలో 'పుష్ప2' (రూ. 1871 కోట్లు), మూడో స్థానంలో బాహుబలి-2 (రూ.1810 కోట్లు) ఉంది. తర్వాతి స్థానాల్లో ఆర్ఆర్ఆర్ (రూ.1387 కోట్లు), కేజీయఫ్- 2 (రూ.1250 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.1153 కోట్లు), జవాన్ (రూ.1148 కోట్లు), పఠాన్ (రూ.1050 కోట్లు) వరుసగా ఉన్నాయి.ముఖ్యంగా పుష్ప2 సినిమాకు బాలీవుడ్లోనే అత్యధికంగా కలెక్షన్స్ వచ్చాయి. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్పగాడికి ప్రత్యేక స్థానం దక్కింది. కేవలం హిందీ బెల్ట్లోనే రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అక్కడ త్రీడీ వెర్షన్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గుర్తుండిపోయే రికార్డ్లను నమోదు చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో కొనసాగుతుంది. ఓటీటీ కోసం రీలోడెడ్ వర్షన్ పేరుతో అదనం మరో 24 నిమిషాల సీన్లను కలిపారు. దీంతో ఈ మూవీ నిడివి మొత్తం 3 గంటల 40 నిమిషాలుగా ఉంది. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
టాలీవుడ్ లో పాతుకపోతున్న జాన్వీ కపూర్
-
అల్లు అర్జున్ థ్రిల్లర్ మూవీ ఫిక్స్
-
ఈ స్టార్ హీరోల రెస్టారెంట్స్, పబ్స్ గురించి తెలుసా..?
ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న వ్యాపారరంగంలోకి కంగనా రనౌత్ అడుగుపెట్టారు. సినీ, రాజకీయ రంగాల్లో బిజీగా ఉన్న ఆమె హిమాచల్లోని మనాలిలో కేఫ్ను ప్రారంభించారు. హిమాలయాల నడిబొడ్డున ‘ది మౌంటెన్ స్టోరీ’ పేరుతో ఒక సుందరమైన రెస్టారెంట్ను ప్రారంభించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, హైదరాబాద్ వేదికగా కొందరు సినీ సెలబ్రిటీలు పలు రెస్టారెంట్స్లను ప్రారంభించారు. విలాసవంతమైన ఆహారం, బ్రేవరేజస్తో పాటు, అధునాతన జీవన శైలికి అద్ధం పట్టే అద్భుతమైన ఇంటీరియర్ ఫ్యాషన్ లుక్ నేటి రెస్టారెంట్ కల్చర్లో భాగమైపోయింది. అయితే నగర వాసుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షించేందుకు ఎవరికి వారు తమ సొంత స్టైల్లో యునీక్ యాంబియన్స్ కోసం తాపత్రయపడుతున్నారు.బంజారా హిల్స్లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 'AN రెస్టారెంట్'తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ డిసెంబర్ 8, 2022న AN రెస్టారెంట్ని బంజారా హిల్స్లో ప్రారంభించారు. మినర్వా, ఆసియన్ ఫుడ్ గ్రూపులతో కలిసి వారు దీనిని ప్రారంభించారు. రెస్టారెంట్లో అద్భుతమైన ఇంటీరియర్స్, అగ్రశ్రేణి సర్వీస్తో పాటు వివిధ రకాల ప్రపంచ వంటకాలతో భారీగానే మెనూ లిస్ట్ ఉంటుంది. ఆహార ప్రియులకు తప్పకుండా నచ్చేలా ఇక్కడి ఫుడ్ ఉంటుందని చాలామంది పేర్కొన్నారు.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వన్–8 కమ్యూన్గత ఏడాదిలో హైదరాబాద్లోని హైటెక్ సిటీకి దగ్గరలో వన్–8 కమ్యూన్ పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్ను కోహ్లీ, అనుష్క శర్మ ప్రారంభించారు. హైదరాబాద్కు ఉన్న రాజసాన్ని, రిచ్ ఫ్లేవర్ను ప్రతిబింబిస్తుంది. ఇందులోని కిచెన్.. పాక ప్రపంచానికి నూతన హంగులు అద్దిందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. వన్–8 కమ్యూన్ బ్రాండ్ ఎథోస్కు కట్టుబడి, రెస్టారెంట్ డిజైన్ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడి వింటేజ్ లుక్స్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తుంది. జుహు, బెంగుళూరు, గుర్గావ్లలో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ రెస్ట్రో బార్ను ఇక్కడ ఏర్పాటు చేయడంతో చాలామంది చిల్ అవుతున్నారు. ఫుడ్ లవర్స్తో పాటు క్రికెట్ ప్రియులు సైతం ఆసక్తిగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. రెస్ట్రో బార్లో భాగంగా రిచ్ ఫుడ్ డిషెస్తో పాటు బ్రేవరేజస్ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల వారికీ హాట్ స్పాట్గా మారింది. కోహ్లీకి అత్యంత ఇష్టమైన కార్న్ బార్లీ రిసోట్టో, మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్, టార్టేర్ టాప్డ్ అవకాడో వంటి పలు వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ 'ఆరంభం'గచ్చిబౌలి 'ఎఫ్ 45' పేరుతో జిమ్ను ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ .. జూబ్లీహిల్స్లో కూడా ఓ బ్రాంచ్ మొదలు పెట్టి లీజ్కు ఇచ్చేసింది. అయితే, ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంలో, నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్లో మిల్లెట్ ఆధారిత రెస్టారెంట్ను ప్రారంభించారు. హైదరాబాద్లోని మాదాపూర్ వద్ద 'ఆరంభం' పేరుతో ఒక రెస్టారెంట్ను ఓపెన్ చేశారు. Curefoods భాగస్వామ్యంతో, సాంప్రదాయ భారతీయ వంటకాల డొమైన్లో మిల్లెట్-ఎయిడెడ్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేయడానికి ఆమె ఈ వెంచర్ను ప్రారంభించారు. మిల్లెట్ను భారతీయ ఆహారంలో ప్రధాన భాగం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఈ చొరవ తీసుకున్నట్లు ఆమె చెప్పారు. రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన, పోషకమైన భోజనం అందిస్తున్నట్లు ఆమె రెస్టారెంట్పై ప్రశంసలు వచ్చాయి. అల్లు అర్జున్ హైలైఫ్పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కూడా రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్నారు. అంతర్జాతీయ రేంజ్లో గుర్తింపు ఉన్న హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీ గురించి వినే వింటారు. హైలైఫ్ పేరుతో 2016లోనే జూబ్లీహిల్స్లో ఈ రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ హాస్పిటాలిటీ బ్రాండ్ M కిచెన్, నిర్మాత కేదార్ సెలగంశెట్టితో కలిసి రన్ చేస్తున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోబఫెలో వైల్డ్ వింగ్స్ (B-డబ్స్) అనే అమెరికన్ రెస్టారెంట్ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ రెండూ కూడా హైదరాబాద్లోని పార్టీలకు స్వర్గధామంగా మారాయి. మీరు ఏదైనా సందర్బంలో పార్టీ కోసం వెతుకుతున్నట్లయితే, హైలైఫ్ మీకు సరైన స్థలమని చెప్పవచ్చు.అక్కినేని నాగార్జున యొక్క 'N గ్రిల్, N ఏషియన్'టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు కూడా హైదరాబాద్లో ప్రముఖ రెస్టారెంట్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ వద్ద N గ్రిల్ పేరుతో ఆయనకు ఒక రెస్టారెంట్ ఉంది. 2014లో ఎంటర్ప్రెన్యూర్ ప్రీతం రెడ్డి సహకారంతో ఆయన దీనిని ప్రారంభించారు. ఇది ఆధునిక గ్రిల్ హౌస్గా గుర్తింపు ఉంది. దీంతో పాటు జూబ్లీ హిల్స్లో కూడా ఎన్ ఏషియన్ అనే చైనీస్ రెస్టారెంట్ని కూడా నాగ్ ఏర్పాటు చేయడం విశేషం. రెండు రెస్టారెంట్లు భారతీయ, ఇటాలియన్, పాన్ ఆసియన్తో పాటు మెడిటరేనియన్ వంటకాలను అందించే విభిన్న మెనూకు ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్లో ప్రీమియం డైనింగ్ అనుభవం కోసం వెతుకుతున్న ఆహార ప్రియుల కోసం ఈ ప్రదేశాలు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. నాగ చైతన్య 'షోయూ'ఫుడ్ బిజినెస్లోకి 2022లోనే నాగచైతన్య ఎంట్రీ ఇచ్చేశాడు. 'షోయూ' పేరుతో జూబ్లీహిల్స్ ప్రాంతలో ఓ సరికొత్త రెస్టారెంట్ను ఆయన ఓపెన్ చేశాడు. అక్కడ అనేక రకాల పాన్-ఆసియన్ వంటకాలు దొరుకుతాయి. క్లౌడ్ కిచెన్గా తన వ్యాపారాన్ని ఆయన ప్రారంభించారు. స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆహారప్రియులకు తమ వంటకాలను అందిస్తుంది. రుచికరమైన జపనీస్ మీల్స్ అక్కడి ప్రత్యేకత. బ్రాండ్ స్థిరమైన ప్యాకేజింగ్ను ఉపయోగించడం ద్వారా పర్యావరణ స్పృహతో కూడిన విధానాన్ని అవలంబిస్తుంది, క్లయింట్లు పర్యావరణ ప్రయోజనకరమైన భోజన అనుభవాన్ని కలిగి ఉండేలా రెస్టారెంట్ యాజమాన్యం చూస్తుంది.నవదీప్- BPM పబ్హీరో నవదీప్ కూడా చాలా రోజుల క్రితమే ఒక పబ్ను ప్రారంభించారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ వ్యాపారంలో ఆయన రాణించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బీట్స్ పర్ మినిట్ అకా BPM పబ్ను నవదీప్ నడుపుతున్నాడు. చాలామంది సెలబ్రిటీలు అక్కడకు వెళ్తూ ఉంటారు. -
పుష్ప ఓ కథ కాదు.. విజయానికి కారణం ఇదే: నాగార్జున
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప, పుష్ప 2 చిత్రాలు సృష్టించిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు టాలీవుడ్లో నెగెటివ్ టాకే వినిపించింది. కానీ బాలీవుడ్లో మాత్రం తొలి రోజు నుంచే హిట్ టాక్తో దూసుకెళ్లింది. ఆ తర్వాత పుష్ప 2(pushpa 2: The Rule) కూడా మన దగ్గర కంటే బాలీవుడ్లోనే ఎక్కువ వసూళ్లను రాబట్టించింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 చిత్రాన్ని ఆదరించారు. విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ని రాబట్టింది. పుష్ప సీక్వెల్ ఈ స్థాయిలో విజయం సాధించడం వెనక గల కారణాలను సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna Akkineni) వెల్లడించాడు. పుష్ప చిత్రం ఇంత సూపర్ హిట్గా నిలవడానికి కారణం కథ కాదని.. పుష్పరాజ్ పాత్రకు దక్కిన ఆదరణనే అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘పుష్ప రిలీజ్ తర్వాత పుష్పరాజ్ పాత్ర ఒక సూపర్ హీరో పాత్రగా మారాడు. సోషల్ మీడియాలో ఆ పాత్రకు విపరీతమైన క్రేజీ ఏర్పడింది. మీమ్స్, స్పూఫ్లోనూ పుష్పరాజ్ ఒక ట్రెండ్ సెట్టర్గా మారాడు. అందుకే పుష్ప 2 చిత్రం భారీ విజయం సాధించింది. ఇక్కడ కథ ముఖ్యం కాలేదు.. ఒక పాత్రకు దక్కిన ఆదరణ ఇది’అని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. థియేటర్స్లో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. -
వరల్డ్ ఫేమస్ లవర్.. పుష్ప గాడు ప్రేమిస్తే అట్టా ఉంటది మరి