Alluri Sitarama Raju District Latest News
-
రోడ్డు ప్రమాదంలో విశాఖవాసి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల జంక్షన్ (మెంటాడ జంక్షన్) వద్ద లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గజపతినగరం ఎస్సై కె.కిరణ్కుమార్ నాయుడు తెలియజేసిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన మెరుగు బాలాజీ (25), అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ మూలవలస గ్రామానికి చెందిన కోటపర్తి లక్ష్మణరావు ద్విచక్ర వాహనంపై మధురవాడ నుంచి అనంతగిరి మండలం మూలవలసకు బయలుదేరారు. గజపతినగరం మండల కేంద్రంలోని నాలుగురోడ్ల జంక్షన్ వద్దకు వచ్చేసరికి విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వెళ్తున్న బొగ్గు లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న కోటపర్తి లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న బాలాజీ లారీ చక్రం కింద ఇరుక్కుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే క్షతగాత్రుడ్ని స్థానికులు గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ చోటేలాల్ (మధ్యప్రదేశ్)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు, క్షతగాత్రుడు మధురవాడలో ప్లంబింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గిరిజనులకు తప్పని డోలీ మోత కష్టాలు
ముంచంగిపుట్టు: జిల్లాలో మారుమూల గ్రామాల గిరిజనులకు డోలీమోత కష్టాలు తప్పడం లేదు. ముంచంగిపుట్టు మండలం గొబ్బరపాడలో అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనులను, జి.మాడుగుల మండలం జాములవీధిలో ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని ఆయా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డోలీమోతతో ఆస్పత్రులకు తరలించారు. ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ గొబ్బరపాడ గ్రామంలో ఐదుగురు గిరిజనులు అనారోగ్యం బారిన పడి మంచం పట్టారు. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక కుటుంబ సభ్యులు డోలీ మోతతో, రహదారి ఉన్న రంగబయలు గ్రామం వరకు మూడు కిలో మీటర్లు మోసుకు వచ్చారు.అనంతరం ప్రైవేట్ వాహనంలో లబ్బూరు పీహెచ్సీ తరలించారు.గొబ్బరపాడ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామ గిరిజనులు కోరారు. అనారోగ్య సమస్యతో ఆత్మహత్యాయత్నం జి.మాడుగుల: మండలంలో బొయితిలి పంచాయతీ జాములవీధి గ్రామానికి చెందిన లొంబోరి రవన్నబాబు కొన్నాళ్లుగా జ్వరం, కడునొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం విషం తీసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన డోలీమోతతో మూడు కిలోమీటర్ల దూరంలోగల సూరిమెట్ట గ్రామానికి తీసుకొచ్చి, అక్కడి నుంచి అంబులెన్స్లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో అందరూ పండగ సందడిలో ఉండగా రవన్నబాబు ఆత్మహత్మకు యత్నించినట్టు గ్రామస్తులు చెప్పారు. రవన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వారు తెలిపారు. -
పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు
రంపచోడవరం: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న జీఎం వలస పంచాయతీ కార్యదర్శి కృష్ణప్రసాద్ తీరుపై మారేడుమిల్లి తహసీల్దార్ బాలాజీ ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసినట్టు ఎంపీడీవో తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ఏప్రిల్ 24న పంచాయతీ రాజ్ దివాస్ గ్రామసభ నిర్వహించలేదన్నారు. సర్పంచ్గా తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి ఏకపక్ష నిర్ణయాలతో పంచాయతీ అభివృద్ధి కుంటుపడుతుందని జీఎం వలస పంచాయతీ సర్పంచ్ కారం లక్ష్మి ఫిర్యాదు చేశారన్నారు.గతంలో బొడ్డగండి పంచాయతీ కార్యదర్శిగా నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిపారు. దీనిపై శాఖ పరంగా చర్యలు తీసుకున్నా కార్యదర్శి ప్రవర్తనలో మార్పు లేదన్నారు. కార్యదర్శి పనితీరుపై పూర్తిస్థాయిలో నివేదికను కలెక్టర్ , పీవో, డీపీవోకు అందజేస్తామన్నారు. -
ఘాట్రోడ్డులో వ్యాన్ బోల్తా
ముంచంగిపుట్టు: మండలంలోని దొడిపుట్టు పంచాయతీ రాంపుట్టు గ్రామ సమీపంలో సోమవారం పనసకాయల లోడుతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.ఒడిశా రాష్ట్రం నందపూరు ప్రాంతానికి చెందిన పనసకాయల కొనుగోలుదారులు ఆంఽధ్రాలోని రాంపుట్టు వచ్చి పనసకాయలు కొనుగోలు చేసి ఒడిశాకు వెళ్తుండగా రాంపుట్టు సమీపంలో ఘాట్రోడ్డులో వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో వాహనంలో ఏడుగురు కూలీలు ఉన్న ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
చిరుధాన్యాలతో రవివర్మకు కళాంజలి ఏయూక్యాంపస్: నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు మెకా విజయ్కుమార్ భారతీయ చిత్రకళా దిగ్గజం రాజా రవివర్మ జయంతిని పురస్కరించుకుని అద్భుతమైన కళాఖండాన్ని ఆవిష్కరించారు. విజయ్కుమార్ చిరుధాన్యాలను ఉపయోగించి ఆయన చిత్రపటాన్ని రూపొందించారు. ఇందుకోసం దాదాపు వారం రోజుల పాటు శ్రమించారు. సహజత్వం ఉట్టిపడేలా చిరుధాన్యాలతో చిత్రపటం రూపొందించిన.. రాజా రవివర్మకు ఘనమైన నివాళి అర్పించారు. తాటిచెట్లపాలెం: సికింద్రాబాద్ డివిజన్ పరిధి మహబూబాబాద్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న 3వ లైన్ నిర్మాణం, పలు ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా తేదీల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని దారి మళ్లిస్తున్నట్లు, మరికొన్ని రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. రద్దయిన రైళ్లు ● విశాఖపట్నం–న్యూఢిల్లీ–విశాఖపట్నం(20805/06) ఏపీ ఎక్స్ప్రెస్ మే 27, 28, జూన్ 18, 19వ తేదీల్లోను, విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్(12803) స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ మే 23, 26, జూన్ 16వ తేదీల్లోను, హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(12804) స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ మే 25, 28, జూన్ 18వ తేదీల్లో రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు ● మే 22 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం (18519/20) ఎల్టీటీ ఎక్స్ప్రెస్లు, మే 27, 28వ తేదీల్లో షాలిమర్–హైదరాబాద్(18045)ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, మే 28, 29వ తేదీల్లో హైదరాబాద్–షాలిమర్(18046)ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్, మే 27, 28వ తేదీల్లో చత్రపతి శివాజి టెర్మినస్ ముంబయి–భువనేశ్వర్–చత్రపతి శివాజి టెర్మినస్ ముంబయి (11019/20) కోణార్క్ ఎక్స్ప్రెస్లు, మే 28న షాలిమర్–సికింద్రాబాద్(22849) ఎక్స్ప్రెస్లు వయా విజయవాడ–గుంటూరు–నల్గొండ–పగిడిపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● మే 22, జూన్ 19వ తేదీల్లో విశాఖపట్నం–గాంధీదాం(20803) వీక్లీ ఎక్స్ప్రెస్, మే 25, జూన్ 22వ తేదీల్లో గాంధీదాం–విశాఖపట్నం(20804) వీక్లీ ఎక్స్ప్రెస్, మే 25, జూన్ 15వ తేదీల్లో పూరీ–ఓఖా(20819) ఎక్స్ప్రెస్, మే 28, జూన్ 18వ తేదీల్లో ఓఖా–పూరీ(20820) ఎక్స్ప్రెస్లు వయా లఖోలి–రాయ్పూర్–నాగ్పూర్–బద్నెరా మీదుగా రాకపోకలు సాగిస్తాయి మహబూబాబాద్లో తాత్కాలికంగా హాల్ట్ తొలగింపు : ఆధునీకీకరణ పనుల నిమిత్తం మహబూబాబాద్ స్టేషన్లో కింది రైళ్లకు ఆయా తేదీల్లో తాత్కాలికంగా హాల్ట్ను రద్దు చేశారు. ● మే 24 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–హైదరాబాద్ (12727) గోదావరి ఎక్స్ప్రెస్, మే 24 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం–మహబూబ్నగర్(12861) ఎక్స్ప్రెస్, మే 24, 25, 26వ తేదీల్లో భువనేశ్వర్–చత్రపతి శివాజి టెర్మినస్ ముంబయి (11020) కోణార్క్ ఎక్స్ప్రెస్, మే 24, 25, 26వ తేదీల్లో షాలిమర్–హైదరాబాద్(18045) ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లు ఆయా తేదీల్లో మహబూబాబాద్లో ఆగవు.ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులుకంచరపాలెం : జిల్లాలోని వివిధ ప్రభుత్వ/ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో(ఐటీఐ) ప్రవేశాలకు మే 24లోగా iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జె.శ్రీకాంత్ తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలకు ఒక దరఖాస్తు సరిపోతుందన్నారు. స్టీల్ప్లాంట్ ఆర్ కార్డుకు సంబంధించిన అభ్యర్థులు ప్రత్యేక కేటగిరిలో దరఖాస్తు చేసుకుని వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐ(ఓల్డ్) కంచరపాలెం, ప్రభుత్వ ఐటీఐ(బాలికలు) ఇండస్ట్రీయల్ ఎస్టేట్, ప్రభుత్వ ఐటీఐ(కొత్తది) గాజువాక, ప్రభుత్వ ఐటీఐ నరవలో వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. 37.5 కిలోల గంజాయి స్వాధీనం తాటిచెట్లపాలెం: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని సోమవారం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 37.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి.. జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు సీహెచ్ ధనుంజయనాయుడు, దినేష్కుమార్ దాస్ తమ సిబ్బందితో కలిసి సోమవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాకు చెందిన పి.బాబు, స్నేగా హేచ్ వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వారు విశాఖపట్నం మీదుగా తమిళనాడుకు గంజాయిని రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ.1,87,500 విలువ గల 37.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. పలు రైళ్లకు అదనపు కోచ్లుతాటిచెట్లపాలెం: ప్రయాణికుల సౌక ర్యార్థం పలు రైళ్లకు అదనంగా జనరల్, స్లీపర్ క్లాస్ కోచ్లను తాత్కాలికంగా జతచేస్తున్నారు. విశాఖపట్నం–బ్రహ్మపూర్–విశాఖపట్నం (18526/18525) ఎక్స్ప్రెస్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్లను, విశాఖపట్నం–రాయ్పూర్–విశాఖపట్నం (58528/ 58527) పాసింజర్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ను జతచేస్తున్నారు. అలాగే విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం (58538/58537)పాసింజర్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ను, విశాఖపట్నం–బ్రహ్మపూర్–విశాఖపట్నం (58532/58531)పాసింజర్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఒక జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ను జతచేస్తున్నారు. విశాఖపట్నం–భువనేశ్వర్–విశాఖపట్నం (22820/ 22819) ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు మే ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్లను, విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం(18512/18511) ఎక్స్ప్రెస్కు ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను జతచేస్తున్నారు. -
ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యులు
కూనవరం: స్థానిక సీహెచ్సీ వైద్యులు సకాలంలో స్పందించడంతో గుండెపోటుతో వచ్చిన వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడిన సంఘటన మండల పరిధిలోని కోతులగుట్ట సీహెచ్లో సోమవారం చోటుచేసుకుంది. ఆస్పతి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన నిరుపేద ముత్యాల వెంకటరమణ శనివారం అస్వస్థతకు గురికావడంతో కూనవరం మండల పరిధిలోని కోతులగుట్ట కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వచ్చారు. ఆస్పత్రికి వచ్చిన ఆయనకు చాతినొప్పి, ఒల్లంతా చెమటలు రావడంతో వైద్యాధికారులు, సిబ్బంది వెంటనే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ పరీక్షతో అతనికి గుండె నొప్పి వచ్చినట్టు గుర్తించారు. వైద్యులు మహేష్బాబు, తేజలు తక్షణమే స్పందించి, రోగికి ఆస్పత్రిలో అందుబాటులో రూ.40 వేలు విలువైన టెనెక్టోప్లస్ ఇంజక్షన్ అందజేశారు. దీంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్ మహేష్ బాబు తెలిపారు. ప్రస్తుతం ముత్యాల వెంకటనారాయణను ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాజమండ్రి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎవరికై నా గుండె సంబంధిత సమస్యలు ఉంటే కోతులగుట్ట ఆస్పత్రికి రావొచ్చని, మెరుగైన వైద్యం అందిస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ బాబు చెప్పారు.గుండెపోటు రోగికి టెనెక్టోప్లస్ ఇంజక్షన్ -
పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు
అనంతగిరి(అరకులోయటౌన్): వైఎస్సార్సీపీ లో పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అనంతగిరిలో పార్టీ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడారు. గ్రామ స్ధాయి నుం,ఇ నియోజకవర్గ స్థాయి వరకు ప్రతీ ఒక్కరూ ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొవాలని పిలుపు నిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. మండలంలోని రాజకీయ స్థితి గతులను అడిగి తెలుసుకున్నా రు. ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు శెట్టి ఆనంద్, ఎస్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు స్వామి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అప్పారావు, సర్పంచ్లు రాములమ్మ, పెంటమ్మ, ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, ఎంపీటీసీ సభ్యులు తవిటి నాయుడు, అశోక్, నాయకులు చిన్నయ్య, మధుసుధాన్, తదితరులు పాల్గొన్నారు. -
కేజీహెచ్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి
డాబాగార్డెన్స్: కేజీహెచ్లో 16 ఏళ్ల బాలుడికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను సోమవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నగరంలోని ఏవీఎన్ కళాశాల డౌన్ రోడ్డులో నివాసముంటున్న యశ్వంత్ రెండేళ్లుగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతని తల్లి సంతోషి కేజీహెచ్ వైద్యులను ఆశ్రయించారు. అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు జీవన్దాన్ ద్వారా కిడ్నీ మార్పిడికి సిఫార్సు చేశారు. ఈ మేరకు కేజీహెచ్లో ఆ బాలుడికి ఈ నెల 7న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ఆ బాలుడు పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ శస్త్రచికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని, కేజీహెచ్లో దీన్ని ఉచితంగా నిర్వహించినట్లు డాక్టర్ శివానంద్ తెలిపారు. అలాగే రోగికి రెండేళ్ల కాలానికి రూ.2 లక్షల విలువైన మందులు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ జి.ప్రసాద్, యురాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రాంబాబు, అనస్థీసియా డాక్టర్లు శ్రీలక్ష్మి, డాక్టర్ ప్రీతి, డాక్టర్ రమేష్, నర్సింగ్ సిబ్బంది సూర్యప్రభ, చంద్రకళ, ఇతర సహాయక సిబ్బంది ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్లు సూపరింటెండెంట్ వివరించారు. -
గంజాయి, సారా నిర్మూలనపై దృష్టి పెట్టాలి
హుకుంపేట: మండలంలో గంజాయి, సారాను నిర్మూలించేందుకు దృష్టి పెట్టాలని డీఎస్పీ షెహ్బాజ్ అహ్మద్ ఆదేశించా రు. స్థానిక పోలీస్ స్టేషన్ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, మండలంలో జరుగుతున్న నేరాలు,మత్తు పదార్థాల రవాణా వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి, సారా రవాణా కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన రహదారుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్కుమార్ పాల్గొన్నారు.డీఎస్పీ సహబాజ్ అహ్మద్ -
రేపే అప్పన్న చందనోత్సవం
సింహాచలం : వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని సంవత్సరమంతా చందనం మణుగుల్లో నిత్యరూపంలో దర్శనమిచ్చే సింహాద్రినాథుడి నిజరూప దర్శనం లభించే సమయం ఆసన్నమైంది. సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం బుధవారం జరగనుంది. ఏడాదిలో కేవలం ఒక్క రోజులోని కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు తరలిరానున్నారు. ఈసారి 2 లక్షల మంది భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుంటారని అంచనా వేశారు. సాధారణ భక్తులకు పెద్ద పీట వేస్తూ.. వారికి దర్శనాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. వెండిబొరుగులతో చందనం ఒలుపు చందనోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమా లు ప్రారంభిస్తారు. సుప్రభాతసేవ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, కలశారాధన చేస్తా రు. అనంతరం వెండిబొరుగులతో స్వామిపై ఉన్న చందనాన్ని తీసి నిజరూపభరితుడిని చేస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజుకి తొలిదర్శనం కల్పిస్తా రు. 3.30గంటల నుంచి రాష్ట్రప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించే రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించేవారికి, ప్రముఖులకు దర్శనం కల్పిస్తారు. ఉదయం 6 గంటలతో అంతరాలయ దర్శనాలు పూర్తిచేస్తారు. ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనం ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభిస్తారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000 టికెట్లు క్యూల్లో ఉన్న వారందరికీ దర్శనాలు ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలలోపే సింహగిరిపై దర్శనాల క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాత ఖాళీ బస్సులను కొండపైకి పంపించి కొండపై ఉనన భక్తులను కొండదిగువకి చేరుస్తారు. 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత కూడా భక్తులను కొండపైకి అనుమతించరు. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం సాయంత్రం 6 గంటల తర్వాత సింహగిరిపైకి అనుమతి లేదు రాత్రి 7 గంటలకు సింహగిరిపై క్యూల ప్రవేశ గేట్లు మూసివేత ప్రొటోకాల్ వీఐపీలకు ఉదయం 6 గంటలతో అంతరాలయ దర్శనాలు పూర్తి ఆ తర్వాత అందరికీ నీలాద్రిగుమ్మం నుంచే లఘు దర్శనం 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా సామాన్య భక్తులకే పెద్దపీట బీచ్రోడ్డు(విశాఖ): చందనోత్సవంలో సాధారణ భక్తుల దర్శనానికి తొలి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్లో ఆయన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండపైన, కింద నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆర్టీసీ బస్సులను మాత్రమే నడపాలని ఆదేశించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా విక్రయించే టికెట్లపై సీరియల్ నంబర్, స్కానింగ్, క్యూలను సూచించే బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సింహాచలం ప్రాంతంలోని మద్యం షాపులను మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ముసివేయాలని అధికారులకు ఆదేశించారు. -
‘మన మిత్ర’ యాప్ ద్వారా 250 రకాల సేవలు
రంపచోడవరం: మన మిత్ర వాట్సాప్ యాప్ ద్వారా 250 రకాల సేవలు పొందవచ్చని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఐటీడీఏ సమావేశపు హాలులో ప్రజల చేతిలో మన ప్రభుత్వం, మనమిత్రయాప్ కరపత్రాలను సబ్కలెక్టర్ కల్ప శ్రీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీవో డి.ఎన్.వి.రమణ, ఈఈ శ్రీనివాసరావు, డీఎల్డీవో కోటేశ్వరరావు, తహసీల్దార్ పి.రామకృష్ణ, ఎంపీడీవో ఎస్. శ్రీనివాసరావు, డీడీ షరీఫ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై సమగ్ర సర్వే
సాక్షి,పాడేరు: ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి, యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపునకు ఏర్పాటు చేసిన హైలెవెల్ అధికారుల కమిటీ సమావేశాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామ సర్వేయర్, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు సంయుక్తంగా బంజరు భూములు, గ్రామకంఠం భూముల ఆక్రమణలపై సర్వే చేసి నివేదించాలన్నారు. సర్వేలో రెవెన్యూ,సర్వే అధికారులు కీలకపాత్ర వహించాలని చెప్పారు. ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసి,వారం రోజుల తరువాత రెవెన్యూ,పోలీసు,పంచాయతీ అధికారులు సంయుక్తంగా యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటి పారుదలశాఖల భూముల ఆక్రమణలను గుర్తించి, తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్అండ్బీ భూములను గుర్తించి డి–మార్కు చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అఽధికారి లవరాజు,డీఎస్పీ ఎస్.కె.షహబాజ్ అహ్మద్,డీఎల్పీవో కుమార్,సర్వే ఏడీ కె.దేవేంద్రుడు, ఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబు,ఎస్ఎంఐ ఈఈ రాజేశ్వరరావు,డీఈఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాలు -
సమర యోధుల మ్యూజియాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు చింతపల్లి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టుగా తాజంగిలో చేపట్టిన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్చైర్మన్ శంక ర్రావు అధికారులకు సూచించారు. చింతపల్లి మండలంలో సోమవారం ఆయన పర్యటించా రు.అసంపూర్తిగా నిలిచిపోయిన మ్యూజియం పనులను పరిశీలించారు. నిర్మాణా ల్లో జాప్యానికిగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, ఈవిషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు చొరవ తీసుకోవాలని కమిషన్ తరఫున కోరతామన్నారు.జేసీ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ డీఈఈ రఘు,ఏఈఈ కిషోర్,ఏటీడ బ్ల్యూజయలక్ష్మి,తహసీల్దారురవికుమార్పాల్గొన్నారు. లంబసింగిలో విత్తన ప్రదర్శన సిఫా, వాసన్, ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు ఉమ్మడిగా లంబసింగిలో ఆదివాసీ విత్తన పండగను నిర్వహించారు. ఈసందర్భంగా పలు రకాల విత్తనాలను ప్రదర్శనలో ఉంచారు. ఈకార్యక్రమానికి హాజరైన చైర్మన్ శంకర్రావు విత్తనాలను పరిశీలించారు. అంతరించిపోతున్న సంపదను కాపాడుకోవాలని ఆయన తెలిపారు. -
గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి
అనంతగిరి(అరకులోయటౌన్): రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. మండలంలోని భీంపోల్ పంచాయతీ సరియాపల్లి గ్రామంలో ఎటిరో వెంచర్ నిర్వాహకుడైన గిరిజనేతరుడు ఆక్రమించిన గిరిజనుల భూములను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని నాన్ షెడ్యూల్ ఏరియాలోని ఎన్.ఆర్.పురం, భీంపోల్, గుమ్మకోట, గురుగుబిల్లి, రొంపిల్లి పంచాయతీల్లోని గిరిజనుల భూములపై సమగ్ర విచారణ జరిపి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి రక్షణ కల్పించాలన్నారు. మామిడి రాధమ్మ, అప్పలకొండకు చెందిన భూమిలో ఫెన్సింగ్, అరటి తోటలను జేసీబీలతో ధ్వంసం చేశారని, రెవెన్యూ, పోలీసు అధికారులకు బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్టు చెప్పారు. సర్వేపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ, సీలింగ్, గెడ్డ పోరంబోకు, ఢీ ఫారం భూములను గిరిజనేతరుడు తన ఆధీనంలో తీసుకొని, ఇష్టానుసారం రహదారులు, వంతెనలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఢీ పారం భూములను చదును చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. గిరిజనుల భూములు ఆక్రమిస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు పెరిగాయన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెం నాయుడు, అనిత తదితరుల పేర్లు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరిస్తున్నట్టు గిరిరైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. ఆక్రమణదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. కూటమి నేతలకు గిరిజనులు ముఖ్యమా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముఖ్యమా బహిరంగంగా ప్రకటించాలన్నారు. గిరిజనుల భాములు అన్యాక్రాంతమవుతున్నాయని పలుమార్లు జిల్లా పరిషత్, పాడేరు ఐటీడీఏ సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోతోందన్నారు. దీర్ఘకాలంగా ఈ మండలంలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై న నాన్ షెడ్యూల్ ఏరియాలోని ఐదు పంచాయతీల్లో సమగ్ర విచారణ జరిపి అన్యాక్రాంతమైన భూములను గిరిజనులకు అప్పగించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ భూముల వ్యవహారంపై కలెక్టర్ ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ శెట్టి నీలవేణి, జెడ్పీటీసీ దీసారి గంగరాజు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్.స్వామి, ఎంపీటీసీ శిరగాం అఽశోక్, నాయకులు తవిటి నాయుడు, కృష్ణమూర్తి, మహేష్, అప్పలకొండ, కన్నయ్య, అశ్వర్, రమణ తదితరులున్నారు. మంత్రులు రామ్మోహన్, అనిత, అచ్చెం నాయుడు అండతో ఆక్రమణలు నాన్ షెడ్యూల్ ఏరియా భూములపై సమగ్ర విచారణ జరపాలి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం -
బెల్ట్ దుకాణాలను నియంత్రించాలి
ప్రధాన జంక్షన్లు, గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం ప్రభుత్వానికి తగదు. గ్రామాల్లో నిరంతరం లభ్యమవుతుండడంతో పేద గిరిజనులు మద్యానికి బానిసలవుతున్నారు. మండల కేంద్రాల్లో రోడ్డు పక్కనే ఉన్న మద్యం దుకాణాల వద్దే మందు తాగిస్తుండడంతో రోడ్డుపై నడిచి వెళ్లే మహిళలకు ఇబ్బందిగా మారుతోంది. సాయంత్రం మందు బాబుల బెడద మరింత ఎక్కువగా ఉంటోంది. బెల్ట్షాపులను ప్రభుత్వం నియంత్రించాలి – వి.వి.జయ, ఐద్వా రాష్ట్ర కమిటీ, సభ్యురాలు అరకులోయ -
బీఎస్ఎన్ఎల్ సేవలకు తరచూ అంతరాయం
ముంచంగిపుట్టు: బీఎస్ఎన్ఎల్ సేవలకు తరచూ అంతరాయం ఏర్పడుతుండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రం ముంచంగిపుట్టులో మూడు నెలలుగా సక్రమంగా సిగ్నల్స్ ఉండడం లేదు. అధిక శాతం మంది వినియోగదారులు గతం నుంచి బీఎస్ఎన్ఎల్ నంబర్నే బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేశారు. సిగ్నల్స్ లేకపోవడంతో బ్యాంకుల సేవల్లో, ఓటీపీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఇంటర్నెట్ పనిచేయక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. స్థానికంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అధికారులెవరూ ఇక్కడ అందుబాటులో ఉండడం లేదు. దీంతో సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక స్థానికులు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, చిన్నపాటి వర్షం పడినా సిగ్నిల్స్ పోతున్నాయి. బీఎస్ఎన్ఎల్ అధికారులు ముంచంగిపుట్టు మండల కేంద్రంలో అందుబాటులో ఉంటూ సిగ్నల్స్ అంతరాయం లేకుండా చూ డాలని మండల వినియోగదారులు కోరుతున్నారు.మూడు నెలలుగా వినియోగదారులకు ఇబ్బందులు -
28 ఏళ్ల నుంచి చందనం అరగదీత
నేను 28 ఏళ్ల నుంచి చందనం అరగదీతలో పాల్గొంటున్నాను. చందనం అరగదీత చేపట్టే రోజుల్లో ఆలయం అంతా ఒక కొత్త వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా చందనాన్ని అరగదీస్తాం. స్వామిపై ఉండే చందనం మా చేతుల మీదుగా అరగదీయడం నిజంగా ఆ స్వామి మాకు కల్పించిన మహా భాగ్యమే. – శిడగం అప్పలరాజు, నాల్గవ తరగతి ఉద్యోగి ఇదంతా అప్పన్న స్వామి అనుగ్రహం ఉద్యోగంలో చేరినప్పటి నుంచి స్వామివారి చందనం అరగదీతలో పాల్గొంటున్నా. ఇప్పటికి సుమారు 30 ఏళ్లకు పైగానే చందనం అరగదీశాననుకుంటా. ఏటా నాలుగు విడతల్లో జరిగే అరగదీతలో క్రమంతప్పకుండా పాల్గొంటున్నా. స్వామిపట్ల భక్తితోపాటు, గంటల తరబడి చందనం అరగదీయడం మాకు మంచి వ్యాయామంగా కూడా ఉంటుంది. – భీమవరపు అప్పారావు, నాల్గవ తరగతి ఉద్యోగి ● -
సీలేరు, చింతపల్లిలలో అమ్మవారి సంబరాలు అంబరాన్ని అంటాయి. సీలేరులో మారెమ్మ, చింతపల్లిలో ముత్యాలమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలను అంగరంగవైభవంగా ఊరేగించారు. వేలాదిగా భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో నిర్వహించిన ముత్యాలమ్మ తల్లి సంబరం అంబరాన్ని తాకింది. ఈ నెల 24న ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా శక్తివేషాలు, కోటాలం, థింసా నృత్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇసుక వేస్తే రాలనంతగా దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర వేలాది మందితో రహదారి కిక్కిరిసిపోయింది. ఆలయం వద్ద అమ్మవారిని దర్మించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి గరగలను వైభవంగా ఊరేగించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతపల్లి సీఐ వినోద్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వరరావు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందరిపై ముత్యాలమ్మ ఆశీస్సులు ఉండాలి ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని అరకు ఎంపీ తనుజారాణి అన్నారు. చింతపల్లిలో ముత్యాలమ్మ తల్లిని ఆదివారం ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెను ఉత్సవ కమి టీ ప్రతినిధులు సన్మానించి, ముత్యాలమ్మ తల్లి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. -
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కాపీలు దహనం
పాడేరు: ఇటీవల రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కాపీలను స్పెషల్ డీఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో పాడేరు రేకుల కాలనీ పీఎంఆర్సీ వద్ద ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ డీఎస్సీ సాధన సమితి నాయకులు కూడారాధాకృష్ణ, నాగేశ్వరరావు మాట్లాడు తూ ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగుల కోసం తక్షణమే స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయా లని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటీఫికేషన్లో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఈనెల 30వతేదీలోగా ప్రభుత్వం ఆదివాసీ డీఎస్సీపై ప్రకటన చేయాలనిడిమాండ్ చేశారు. స్పెషల్ డీఎస్సీ సాధన సమితి నాయకులు భాను,ప్రతాప్, కుమారస్వామి,మహేష్,చిరంజీవి, మోహన్ పాల్గొన్నారు. హుకుంపేట: మెగా డీఎస్సీతో ఆదివాసీలకు అన్యా యం జరుగుతోందని నాయకుడు కోటిబాబు, పీసా కమిటీ మండల ఉపాధ్యక్షుడు అప్పలకొండ అన్నారు. మండలంలోని గూడ గ్రామంలో డీఎస్సీ నోటిపికేషన్ పత్రాలను దహనం చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. జి.మాడుగుల: ఆదివాసీ ప్రాంతంలో శత శాతం ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగ యువతకే కల్పించాలని లయ స్వచ్ఛంద సంస్థ మండల కో–ఆర్డినేటర్ పాంగి మత్స్యరాజు, గిరిజన నిరుద్యోగులు డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా ఆదివారం కోరాపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు శతశాతం ఉద్యో గ అవకాశాలు కల్పించాలన్నారు. డీఈడీ, బీఈడీ అభ్యర్థులు చిరంజీవి, బాలకృష్ణ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. డుంబ్రిగుడ: జీవో నంబరు–3ను పునరుద్ధరించా లని, ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కించుమండలో యువకులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఏజెన్సీలో పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేయాలన్నారు. -
తన బాల్యమిత్రుడైన కుచేలుడు పిడికెడు అటుకులిస్తేనే మురిసిపోయి అంతులేని సిరిసంపదలిచ్చాడట శ్రీకృష్ణుడు. సింహాద్రి అప్పన్న కొలువులో నాల్గవ తరగతి సిబ్బంది విషయంలో సీన్ కాస్త రివర్స్. అయినప్పటికీ.. ఆనందం మాత్రం దాదాపు అంతే స్థాయి. కిలో చందనం అరగదీస్తే దేవస్థా
చందనాన్ని అరగదీస్తున్న నాల్గవ తరగతి సిబ్బంది ఒక్కో ఉద్యోగి తీసిన చందనాన్ని తూకం వేస్తున్న వైదికులు(ఫైల్)నాలుగు విడతలుగా చందన సమర్పణ సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందన స్వరూపుడు. ఏటా నాలుగు విడతల్లో స్వామికి పచ్చి చందనాన్ని సమర్పిస్తారు. వైశాఖ శుద్ధ తదియ(అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని జరిగే చందనోత్సవంరోజు స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. నిజరూప దర్శనం పూర్తికాగానే అదే రోజు రాత్రి స్వామికి తొలివిడతగా మూడు మణుగు(సుమారు 125 కిలో)ల పచ్చి చందనాన్ని సమర్పి స్తారు. ఆ తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి పర్వదినాల్లో మరో మూడేసి మణుగులు చొప్పున పచ్చి చందనాన్ని పూస్తారు. ఆయా సమర్పణల పర్వదినాలకు ముందు మూడు నుంచి ఐదు రోజుల పాటు ఆలయ బేడా మండపంలో అరగదీత కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఇందుకు ఉపయోగించే గంధపు చెక్కలను తమిళనాడు నుంచి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్ని స్వామివారి కోసం వినియోగిస్తారు. కిలో చందనం.. మూడు కిలోల బియ్యం ఒక కేజీ చందనం అరగదీస్తే మూడు కిలోల బియ్యాన్ని దేవస్థానం ఈ నాల్గవ తరగతి సిబ్బందికి అందిస్తుంది. అరగదీసిన చందనాన్ని కిలోల లెక్కన వైదికులు తూకం వేసి, వారి ఖాతాలో రాస్తారు. ఇలా ఒక్కో ఉద్యోగి వ్యక్తిగతంగా ఎన్ని కిలోల చందనం అరగదీస్తే అన్ని మూడేసి కిలోల చొప్పున బియ్యాన్ని దేవస్థానం నుంచి తీసుకుంటారు. ఈ బియ్యాన్ని స్వామివారి మహా ప్రసాదంగా వీరంతా స్వీకరిస్తారు. తరతరాలుగా ఎంతో మంది నాల్గవ తరగతి ఉద్యోగులు చందనం అరగదీతలో పాల్గొని తరిస్తున్నారు. చందనం అరగదీసే రోజుల్లో ఆలయమంతా చందన పరిమళాలను వెదజల్లడం ఒక మంచి అనుభూతిని అందిస్తుందని, అనందంగా చెప్తారు. నాల్గవ తరగతి ఉద్యోగులే కీలకం ఆలయంలో విధులు నిర్వర్తించే నాల్గవ తరగతి ఉద్యోగులే చందనం అరగదీతను చేపడతారు. దేవస్థానం అందించే నూతన పంచెలను ధరించి, నోటికి వస్త్రాన్ని కట్టుకుని, ఎంతో భక్తి శ్రద్ధలు, నియమనిష్టలతో చందనాన్ని అరగదీస్తారు. ఒక్కో విడతలో కావాల్సిన సుమారు 125 కిలోల చందనాన్ని వీరే సిద్ధం చేస్తారు. ఇలా అరగదీసిన చందనంలో సుగంధ ద్రవ్యాలను కలిపి ఆయా పర్వదినాల్లో వైదికులు స్వామికి సమర్పిస్తారు. స్వామిపై ఉన్న చందనం తమ చేతుల మీదుగా అరగదీయడాన్ని ఈ ఉద్యోగులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. తమకు మాత్రమే దక్కిన ఈ మహా భాగ్యానికి ఆనందంతో పరవ శిస్తారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాజవొమ్మంగి: మండలంలోని పాకవెలితి గ్రామంలో కరెంట్ షాక్కు గురైన పప్పుల శివప్రసాద్ (18)ను చికిత్స కోసం తీసుకొని వెళ్తుండగా శనివారం రాత్రి మార్గమధ్యలోనే మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో విద్యుత్ వైర్లు కలుపుతు షాక్ గురై 90 శాతం కాలిన గాయాలతో అపస్మారక స్థితి చేరుకొన్న సంగతి తెలిసిందే. కాగా అతనిని మెరుగైన చికిత్స కోసం ఏలేశ్వరం సీహెచ్సీకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు ఈ విధంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు చిన్నయ్య, సావిత్రిల దుఃఖానికి అంతులేకుండా పోయింది. ఈ సంఘటనలో పాకవెలితిలో విషాదం అలముకొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చిన్నబాబు చెప్పారు. ప్రత్తిపాడు ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్టు తెలిపారు. -
● గుర్రపు డెక్క.. పూసెను ఎంచక్కా
● చాపరాయిలో కోలాహలం● మంచు అందాలు.. మనసు దోచే చాపరాయి జలవిహారిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. గత మూడు వారాలుగా చాపరాయిని అంతంత మాత్రంగానే పర్యాటకులు సందర్శించారు. ఈ వారం పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇక్కడ వ్యాపారం చేసుకునే గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. అరకు పైనరీని కూడా పర్యాటకులు సందర్శించారు. – డుంబ్రిగుడ మంచు అందాలు పర్యాటకులను మైమరిపిస్తున్నాయి. అరకు రైల్వేట్రాక్, అరకు గ్రామం, జయపూర్ జంక్షన్, డుంబ్రిగుడ తదితర ప్రాంతాల్లో ఆదివారం దట్టంగా మంచుకురిసింది. తెల్లవారు జాము నుంచి భారీగా కురుస్తున్న పొగమంచులో పర్యాటకులు ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేశారు. – డుంబ్రిగుడముంచంగిపుట్టు అంబేడ్కర్ పార్కు సమీపంలో ఉన్న చెరువులో గుర్రపు డెక్క పూలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. చెరువు మొత్తం పూలతో నిండిపోయింది. పచ్చని ఆకుల మధ్య తెలుపు,నీలం రంగులతో పూసిన పూలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. – ముంచంగిపుట్టు -
సింహగిరికి పోటెత్తిన భక్తజనం
సింహాచలం: గంధం అమావాస్య పురస్కరించుకుని సింహగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు, గ్రామీణ ప్రాంత భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. శనివారం రాత్రికే సింహాచలం చేరుకున్న వీరంతా ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. స్వామి ప్రతిరూపాలుగా వెంట తీసుకొచ్చిన కోలలను పుష్కరిణి గట్టుపై ఉంచి పూజలు నిర్వహించారు. వంటలు వండి, కోలలకు ఆరగింపు చేశారు. అమృత కలశాలను, పళ్లను సమర్పించారు. కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. కోలలతో నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. స్నానమాచరించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి ప్రాంగణం అంతా కిటకిలాడింది. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహగిరిపై దర్శనక్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, గంగధార మార్గం భక్తులతో కిటకిటలాడాయి. సింహగిరికి చేరుకున్న భక్తులు సింహగిరిపై కూడా కోలలకు పూజలు నిర్వహించారు. గరిడి నృత్యాలు చేశారు. దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పుష్కరిణి వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం గార్డులు బందోబస్తు నిర్వహించారు. గంధం అమవాస్య భక్తులతో కిక్కిరిసిన వరాహ పుష్కరిణి -
నెలాఖరు వచ్చినా అందని రేషన్ బియ్యం
పెదబయలు: పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర సరకులు ప్రతి నెల 1 తేదీ నుంచి 17 తేదీలోపు పంపిణీ చేయాలి. అయితే మండలంలోని ఐదు డిపోల పరిధిలో ఇప్పటికీ రేషన్ బియ్యం పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు అవస్థలకు గురవుతున్నారు. తమకు వెంటనే బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తామరవీధి గ్రామ కార్డుదారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జీసీసీ, సివిల్ సప్లై అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని వాపోయారు. మండల గోదాం నుంచి బొండాపల్లి, పోయిపల్లి, బొంగరం, పెదబయలు, బొంగరం డీఆర్ డిపోలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యం పూర్తి స్థాయిలో సరఫరాకాలేదు. బొండాపల్లి డిపోలో 590 కార్డులకు గాను 11,150 కిలోల బియ్యం పంపిణీ చేయవలసి ఉండగా 6,800 కిలోల బియ్యం వచ్చాయి. మార్చిలో నిల్వ 615 కిలోలు ఉండగా వచ్చిన బియ్యం,నిల్వ పోగా 3,735 కిలోల బియ్యం రావాల్సి ఉంది. అలాగే పోయిపల్లి 240 కార్డులకుగాను 4,605 కిలోలు రావాల్సి ఉండగా 2,550 కిలోలు వచ్చాయి. బొంగరం డిపోలో 334 కార్డులకు 6,100 కిలోల బియ్యం రావాల్సి ఉండగా 5,100 కిలోలు వచ్చాయి. ఇంకా 1000 కిలోలు రావాల్సి ఉంది. సీకరి డిపోలో 586 కార్డులకు 12,040 కిలోల బియ్యం రావాల్సి ఉండగా 11,100 కిలోలు వచ్చాయి. 940 కిలోల బియ్యం రావాల్సి ఉంది. మండలం కేంద్రం పెదబయలులో 845 కార్డులకు 14,295 కిలోల రావాల్సి ఉండగా 13,300 కిలోలు వచ్చాయి. 995 కిలోల బియ్యం రావాల్సి ఉంది. దీంతో బొండాపల్లి డిపో పరిధిలో తామరవీధి, ఎగువ బొండాపల్లి, తాడేవీధి, కుయిభ గ్రామాలకు, పోయిపల్లి డిపో పరిధిలో అర్లాబు, సైలంకోట, గడ్డిజిలుగులు గ్రామాలతోపాటు మిగిలిన మూడు డిపోల పరిధి లోని గ్రామాల కార్డుదారులకు ఏప్రిల్ నెల బియ్యం అందలేదు. రేషన్ బియ్యం అందక అవస్థలు పడుతున్నామని కార్డుదారులు వాపోయారు. ఈ విషయంపై పెదబయలు జీసీసీ బ్రాంచ్ మేనేజర్ ఒలేసి గాసీని వివరణ కోరగా మండలంలో 10 డిపోలకు పూర్తి స్థాయిలో స్టాక్ రాలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని, తహసీల్దార్కు నివేదించానని చెప్పారు. ఈ నెల 16,17 తేదీల్లో ఐదు డిపోలకు స్టాక్ వచ్చిందని మరో ఐదు డిపోలకు ఇంకా రావాల్సి ఉందన్నారు. జీసీసీ,సివిల్ సప్లై అధికారులకు తెలిపినా స్పందన శూన్యం నిరసన వ్యక్తం చేసిన కార్డుదారులు -
భూ కబ్జాపై బాధితుల ఫిర్యాదు
అనంతగిరి(అరకులోయటౌన్): మండలంలోని భీంపోల్ పంచాయతీ సరియాపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 69/5లో సుమారు 1.50 ఎకరాలకు చెందిన తమ భూమిని గిరిజనేతరుడైన బి.నగేష్ కబ్జా చేసి చదును చేస్తున్నట్టు బాధితురాలు మామిడి రాధమ్మ, ఆమె కుమారుడు అప్పలకొండ అనంతగిరి ఇన్చార్జి తహసీల్దార్ మాణిక్యం, ఎస్ఐ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసినట్టు ఒక ప్రకటనలో వారు తెలిపారు. తాము గ్రామంలో లేని సమయంలో గిరిజనేతరుడు బి.నగేష్తోపాటు అతని అనుచరులు తమ స్థలంలో జేసీబీలతో ఇనుప కంచెలు తొలగించి, అరటి తోటలు ధ్వంసం చేసి, భూమి చదును చేసినట్టు ఫిర్యాదులో తెలిపారు. తమకు వంశపారపర్యంగా సంక్రమించిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించేదుకు పూనుకున్నారన్నారు. తమ భూమిని కబ్జా చేసిన గిరిజనేతరుడు నగేష్తోపాటు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోని, తమ భూమికి రక్షణ కల్పించాలని ఇన్చార్జి తహసీల్దార్, ఎస్ఐలకు కోరామన్నారు. సదరు గిరిజనేతరుడు నగేష్ అనే వ్యక్తి టీడీపీ సానుభూతి పరుడిగా చెబుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ మాణిక్యంకు వివరణ కోరగా మామిడి రాధమ్మ, ఆమె కుమారుడు అప్పలకొండ తమ భూమి కబ్జాపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. స్థానిక ఎస్ఐ శ్రీనివాస్తో కలిసి సోమవారం సరియాపల్లి గ్రామానికి వెళ్లి విచారణ జరుపుతామని మాణిక్యం తెలిపారు.ఆక్రమణకు పాల్పడిన గిరిజనేతరుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
పుట్టగొడుగుల పెంపకంతో గిరిజన యువతకు ఉపాధి
రంపచోడవరం: పుట్టగొడుగుల పెంపకంతో గిరిజన యువత, మహిళలు ఉపాధి పొంది, ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని హిఫర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీతా తెలిపారు. మండలంలో ఉసిరిజొన్నల గ్రామంలో కుటీర పరిశ్రమగా పది సంవత్సరాలుగా పుట్టగొడుగుల పెంపకం నిర్వహిస్తున్న సత్యనారాయణ ఆధ్వర్యంలో నవజీవన్ ఆర్గనైజేషన్, హిఫర్ ఆర్గనైజేష్న్ సహకారంతో 25 మంది రైతులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సునీతా మాట్లాడుతూ పుట్టగొడుగుల పెంపకంలో విత్తనం ప్రధానమని చెప్పారు. ఈ ప్రాంతానికి అనుకూలమైన రకాల ఎంపిక, డార్క్ రూమ్లో ఎన్ని రోజులు ఉంచాలి తదితర విషయాలను వివరించారు. శిక్షణ పొందిన యువతకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నవజీవన్ ఆర్గనైజేషన్ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.శ్రీనివాస్, బీడీవో ఎం.నాగేశ్వరరావు, డీఈవో రాంలాల్, సీఎఫ్లు చిన్నలుదొర, సాయివెంకట్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.ఏఎంసీ ప్రిన్సిపాల్గా సంధ్యా దేవి బీచ్రోడ్డు(విశాఖ): ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా డాక్టర్ కె.వి.ఎస్.ఎం.సంధ్యా దేవిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎంసీ ప్రిన్సిపాల్గా డాక్టర్ బుచ్చిరాజు ఉద్యోగ విరమణ పొందిన తరువాత ఆమె తాత్కాలిక ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రిన్సిపాల్గా కొసాగనున్నారు. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ముగ్గురు ప్రొఫెసర్లను వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు సూపరింటెండెంట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎండోక్రినాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కె.ఎ.వి.సుబ్రహ్మణ్యంను ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్గా.. గైనాకాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సి.అమూల్యను శ్రీకాకుళం జీజీహెచ్ సూపరింటెండెంట్గా.. జనరల్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ వి.మన్మధరావుకు మచిలిపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ముక్కలు
రెక్కలు..గణనీయంగా పడిపోయిన వైజాగ్ ఎయిర్పోర్ట్ వృద్ధి రేటువిశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తును కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. గత ప్రభుత్వం చూపించిన శ్రద్ధతో ఎయిర్పోర్టు కొత్త రెక్కలు తొడుక్కుంది. నవ్య రూపం సంతరించుకుని అంతర్జాతీయ సర్వీసులను ఆకర్షించింది. కూటమి ప్రభుత్వం దీనికి రివర్స్లో విమానం రెక్కలు విరిచేసింది. దీంతో ఎయిర్పోర్టు వృద్ధి రేటులో తిరోగమనం దిశగా పయనిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : ఏడాది క్రితంతో పోలిస్తే విశాఖ విమానాశ్రయంలో విమాన సర్వీసులు, ప్రయాణికుల వృద్ధి క్రమంగా క్షీణిస్తోంది. కోవిడ్ తర్వాత మొదటిసారిగా ప్రయాణికుల రాకపోకల వృద్ధి రేటు 20 శాతం దిగువకు పడిపోవడమే దీనికి నిదర్శనం. గతంలో కనీసం 50 నుంచి 100 శాతానికి పైగా వృద్ధి నమోదయ్యేది. కానీ ఈ ఏడాది మార్చిలో కేవలం 17 శాతానికే పరిమితమైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చేతకానితనం వల్ల ప్రయాణికుల రాకపోకల వృద్ధి రికార్డు స్థాయిలో తగ్గిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఉత్తరాంధ్రకు చెందిన వారైనా.. విమాన సర్వీసులు రద్దవుతున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని సర్వీసులు ఇతర ప్రాంతాలకు తరలించేయడం.. కొత్త సర్వీసులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. మార్చిలో 17 శాతం వృద్ధి మాత్రమే.! ప్రతి నెలా దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో విశాఖ ఎయిర్పోర్టు నుంచి ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్యను గణిస్తుంటారు. గతేడాది అదే నెలలో జరిగిన రాకపోకలతో పోల్చి వృద్ధి రేటు నమోదు చేస్తారు. ఈ వృద్ధి రేటు ఆధారంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తే ఎయిర్లైన్స్ సంస్థలు.. కొత్త సర్వీసులు నడిపేందుకు పోటీ పడుతుంటాయి. 2024 నవంబర్ వరకూ వైజాగ్ ఎయిర్పోర్టు గణనీయంగా వృద్ధి నమోదు చేసింది. దేశీయ విమాన సర్వీసుల్లో 80 నుంచి 100 శాతం వరకూ, అంతర్జాతీయ సర్వీసుల్లో 90 నుంచి 150 శాతం వరకూ వృద్ధి కనిపించింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం విశాఖను విస్మరించిందో అప్పటి నుంచి సర్వీసులు తగ్గిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల వృద్ధి కూడా దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది మార్చిలో 2,55,835 మంది ప్రయాణికులు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసుల్లో ప్రయాణించారు. 2024 మార్చిలో 2,17,243 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రయాణికుల సంఖ్య అంతగా పెరగకపోవడంతో వృద్ధి కేవలం 17.8 శాతం మాత్రమే నమోదైంది. గత ఐదేళ్ల కాలంలో కోవిడ్ మినహాయిస్తే.. ఇదే అత్యల్పం కావడం దురదృష్టకరం. ఈ ఏడాది మార్చిలో 2,55,835 మంది రాకపోకలు గతేడాది మార్చిలో 2,17,243 మంది ప్రయాణం గత మార్చితో పోలిస్తే కేవలం 17.8 శాతం మాత్రమే వృద్ధి కూటమి సర్కారు నిర్వాకంతో పలు విమాన సర్వీసుల రద్దు పట్టించుకోని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఏప్రిల్ నెలలో మరింత దిగజారనున్న వృద్ధి రేటు వచ్చిన విమానాలు వచ్చినట్లే మాయం మార్చిలో 20 శాతం దిగువన నమోదైతే.. ఏప్రిల్లో మరింత దిగువకు పడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏప్రిల్లో విజయవాడ సర్వీసులతో పాటు మరికొన్ని సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణించే వారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. ఇటీవల దుబాయ్ విమానం వైజాగ్ రాకుండా కూటమి సర్కారు అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. అదే నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయింది. ఇటీవలే బ్యాంకాక్, కౌలాలంపూర్ విమాన సర్వీసులు కూడా నిలిపేస్తున్నామని ప్రకటించాయి. విజయవాడ సర్వీసు ఆగిపోయింది. మిగిలిన డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో వైజాగ్ వచ్చేందుకు ఎయిర్లైన్స్ ఆసక్తి చూపిస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం రాకుండా మోకాలడ్డుతోంది. ఇలాగే కొనసాగితే వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి కొత్త సర్వీసులు వచ్చేందుకు అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోతాయని ప్రజలు, అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అంబరాన్నంటిన సంబరాలు
● చింతపల్లిలో వేలాదిగా తరలివచ్చిన భక్తులు ● ప్రత్యేక ఆకర్షణగా సాంస్క ృతిక కార్యక్రమాలు సీలేరు: నిన్నే నమ్ముకుని కొలిచాం... చల్లగా చూడమ్మా మారెమ్మ తల్లీ అంటూ అమ్మవారిని భక్తులు శరణు కోరారు. వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సీలేరులో మారెమ్మ తల్లి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ప్రధాన పండగ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలలతో పాటు సమీప ఒడిశా నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఉదయం 6 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. మండుటెండలో సైతం క్యూలో గంటల తరబడి వేచి ఉన్నారు. పసుపు,కుంకుమలు సమర్పించి, పూజలు నిర్వహించారు. మాలలు ధరించిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శక్తి వేషాలు, థింసా నృత్యాలు పండగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ● సీలేరు గ్రామ నివాసి అయిన కోటేశ్వరమ్మ కుమారుడు జి.వి.వి. సత్యనారాయణ దంపతులు 2,500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీరం గోవిందు అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. ఖమ్మంకు చెందిన నాగరాజు దేవర అనే భక్తుడు అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. ● మారెమ్మ తల్లి పండగకు వచ్చే భక్తులకు ముస్లింలు మజ్జిగ పంపిణీ చేశారు.ఆలయానికి వెళ్లే దారిలో రెగ్యులేటర్ డ్యాం వద్ద ఐదు డ్రమ్ముల మజ్జిగను పంపిణీ చేశారు. మైలపల్లి సత్తిబాబు ఆటో డ్రైవర్ మజ్జిగ పంపిణీ చేశారు. ● జెన్కో చీఫ్ ఇంజినీరు వాసుదేవరావు, సూపరింటెండింగ్ఽ ఇంజినీరు చంద్రశేఖర్ రెడ్డితో పాటు డొంకరాయి, మోతుగూడెంలకు చెందిన ఈఈ, ఏడీఈ,ఏఈలతో పాటు పూర్వ జెన్కో ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారు. ● ఆర్టీసీ అధికారులు విజయనగరం, విశాఖపట్నం,శ్రీకాకుళం, నర్సీపట్నం నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపారు. ● మంగళవారం అమ్మవారికి చల్లనీటి ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించి పసుపు నీటితో గ్రామాన్ని శుద్ధి చేసి గరగను గంగలో నిమఽజ్జనం చేసి, ఉత్సవాలు ముగిస్తారు. ● బుధవారం మరుపూజ చేసి యథావిధిగా మళ్లీ పూజలను ప్రారంభిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ప్రధాన పండగ రోజు ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రవీంద్రనాఽథ్ బందోబస్తు నిర్వహించారు. ఘనంగా మారెమ్మ ప్రధాన పండగ భారీగా తరలివచ్చిన భక్తులు -
కేజీబీవీల్లో రూ.8.55 కోట్లతో అదనపు భవనాలు
దేవరాపల్లి : జిల్లాలో 19 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) రూ.8.55 కోట్లతో మనబడి మన భవిష్యత్ పథకంలో అదనపు భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని సమగ్ర శిక్ష డీఈ కె.గణేష్ తెలిపారు. మండలంలోని బేతపూడి కేజీబీవీలో రూ.51.93 లక్షలతో నిర్మిస్తున్న అదనపు భవన నిర్మాణ పనులను స్థానిక ఏఈ పి.సంతోష్కుమార్తో కలిసి ఆదివారం పర్యవేక్షించారు. కాగా భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పథకంలో రూ.51.93 లక్షలు మంజూరు చేయగా, అప్పట్లో రూ.28 లక్షలకు సంబంధించి పనులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనబడి– మన భవిష్యత్గా పేరు మార్చి పనులను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని 12 కేజీబీవీల్లో జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.1.60 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయిని డీఈ గణేష్ తెలిపారు. బేతపూడి కేజీబీవీకి కూడా జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.1.60 కోట్లు నిధులు మంజూరయ్యాయని, టెండర్ సైతం పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ భవనాలలో ఆరు డార్మెటరి గదులు, రెండు టాయిలెట్లు ఉంటాయన్నారు. మనబడి– మన భవిష్యత్ పథకంలో అదనపు భవనాల నిర్మాణ పనులను వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు డీఈ తెలిపారు. నాణ్యత ప్రమాణాలు సైతం పక్కాగా పాటిస్తూ పనులు చేపడుతున్నట్టు వివరించారు. 12 కేజీబీవీల్లో జూనియర్ కళాశాల భవనాలకు నిధులు మంజూరు సమగ్ర శిక్ష డీఈ గణేష్ వెల్లడి -
నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
ఐటీడీఏ పీవో అపూర్వభరత్ కూనవరం: పోలవరం నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. మండల కేంద్రం కూనవరంలో నిర్వహించిన ఆర్అండ్ఆర్ గ్రామ సభను శనివారం ఆయన పర్యవేక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క నిర్వాసితుడికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కూనవరంలో మొత్తం 1,362 మంది పీడీఎఫ్లు ఉన్నారని వారిలో 1,183 మంది పీడీఎఫ్లను అర్హులుగా గుర్తించామని తెలిపారు. 179 మందిని అనర్హులుగా గుర్తించినట్టు చెప్పారు. అనర్హులు ఆధారాలతో దరఖాస్తులు చేసుకుంటే, వాటిని పరిశీలించి రెండవ గ్రామ సభనాటికి అర్హులుగా గుర్తించి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. నిర్వాసితులు ఎవరూ మధ్యవర్తులను నమ్మి పోవద్దని సూచించారు. అభ్యంతరాలపై 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈసభలో 151 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తహసీల్దార్ తెలిపారు. ఈకార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ పాయం రంగమ్మ, జెడ్పీటీసీ గుజ్జా విజయ, సర్పంచ్ హేమంత్ గాంధీ, ఎంపీటీసీ కొమ్మాని అనంతలక్ష్మి, తహసీల్దారు కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో రామాంజనేయ ప్రసాద్, కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వి.ఆర్.పురం: వడ్డుగూడెం చోప్పల్లి గ్రామంలో పోలవరం నిర్వాసితుల ఆర్అండ్ఆర్ గ్రామసభను శనివారం నిర్వహించారు. గ్రామ సభలో అర్హులు అనర్హులు జాబితాను అధికారులు చదివి వినిపించారు. అభ్యంతారాలు ఉన్న వారు జాబితాలో పేర్లు లేనివారు 15 రోజుల్లో పరిధిలో ఎస్డీసీ వారికి దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్క నిర్వాసితునికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకొంటామన్నారు. ఈ గ్రామసభలో అనర్హులుగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు తీసుకొని రెండో గ్రామ సభలో వాటిని పరిశీలిస్తామన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా జడ్జి దృష్టికి న్యాయవాదుల సమస్యలు
రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా 8వ అడిషనల్ జిల్లా జడ్జి చెన్నయ్య నాయుడు శనివారం రంపచోడవరంలోని ఫస్ట్క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును సందర్శించారు. జిల్లా జడ్జితో పాటు స్థానిక న్యాయమూర్తి పి.బాబు ఉన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.రవిరామ్ భగవాన్ , ఉపాధ్యక్షురాలు కె.శివరంజని, సీనియర్ న్యాయవాదులు కె.ఎన్.వి.రమణ, డి.శ్రీధర్, తదితర న్యాయవాదులు జిల్లా జడ్జిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు స్థానిక న్యాయవాదుల సమస్యలను జిల్లా జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఏయూ వారసత్వాన్ని నిలబెడదాం
విశాఖ విద్య: ఘనమైన వారసత్వం కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అభ్యున్నతికి అందరూ సమష్టిగా కృషి చేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి పిలుపునిచ్చారు. ఏయూ శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా బీచ్రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేకమంది జీవితాలను ప్రభావితం చేసిందన్నారు. అదే విధంగా యువ మస్తిష్కాలను తీర్చిదిద్దిన ఘనత ఏయూ సొంతమని చెప్పారు. ఇది దేశ ప్రగతికి, ప్రపంచ ప్రగతికి దోహదపడిందన్నారు. తనకు ఇక్కడ చెప్పలేనన్ని అపురూప జ్ఞాపకాలు ఉన్నాయని, విద్యార్థిగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులకు జ్ఞానంతో పాటు విలువలు ఎంతో అవసరమని చెప్పారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేదిగా ఈ ప్రయాణం నిలుస్తుందని మధుమూర్తి అన్నారు. జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. త్వరలో రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు అవుతుందని చెబుతూ.. దాని ప్రాముఖ్యాన్ని వివరించారు. భారతదేశానికి యువ జనాభా ఎంతో లాభదాయకంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్లో బోధన విధానాన్ని ఏఐ సాంకేతికత సవాలు చేసే దిశగా మారుతుందన్నారు. విద్య, పరిశోధన, ప్రజాసేవ రంగాల్లో ఏయూ తనదైన శైలిలో ముందుకు వెళ్లాలని సూచించారు. విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. విశిష్ట అతిథి ఐఐటీ పాలక్కాడ్ డైరెక్టర్ ఎ.శేషాద్రి శేఖర్ మాట్లాడుతూ సమగ్ర విద్యను అందించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ప్రాథమిక సూత్రాలు, శాస్త్ర సంబంధ అంశాలపై బలమైన పట్టు సాధించడం ఎంతో అవసరమని, అదే విధంగా సాఫ్ట్ స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా తాను ఈ స్థానంలో నిలవడానికి గల కారణం, సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ప్రతి విద్యార్థి జాతీయ విద్యా విధానం డాక్యుమెంట్ను చదవాలని సూచించారు. ఏయూ ప్రగతికి తా ను సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ, దార్శనికుల వారసత్వం, నాయకత్వం ఏయూను నడిపిస్తోందన్నారు. అకడమిక్, మౌలికసదుపాయాలు, ఔట్రీచ్ రంగాల్లో ఏయూ మరింత పటిష్టంగా పనిచేస్తుందన్నారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగాలను మరింత బలోపేతం చేస్తామని వివరించారు. సహ పాఠ్య కార్యక్రమాల ప్రాధాన్యత గుర్తించి వాటిని విద్యలో భాగం చేస్తామని తెలిపారు. ఏడాది పొడుగునా నిర్వహించే శతాబ్ది వేడుకల్లో నోబెల్ గ్రహీతలను ఆహ్వానిస్తామని వీసీ చెప్పారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకుంటూ వాటిని సాధించే దిశగా పని చేయాలని సూచించారు. పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కె.వి.వి.రావు మాట్లాడుతూ ప్రజల జీవితాన్ని మార్చిన వ్యవస్థగా ఏయూను చెప్పవచ్చన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయరావు తదితరులు ప్రసంగించారు. సాక్షి,పాడేరు: పట్టణంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరిదేవి ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించా రు. ఆలయ ధర్మ కర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధులంతా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే అర్చకుడు రామం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. సాయంత్రం మహిళలు కుంకుమార్చన చేశారు. భక్తులకు ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. నవగ్రహాలకు పూజలు: శనిత్రయోదశిని పురష్కరించుకుని శివాలయం ప్రాంగణంలోని నవగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపారు. అర్చకుడు రామం భక్తులతో నవగ్రహాలకు అభిషేకాలు జరిపించి, పూజలు చేయించారు. ప్రత్యేకాలంకరణలో అమ్మవారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.మధుమూర్తి పిలుపు ఏయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం విజన్ డాక్యుమెంట్, లోగోలు ఆవిష్కరించిన అతిథులు ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులో వాకథాన్ విశ్రాంత ఆచార్యులకు సన్మానం ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు సి.హెచ్ శాంతమ్మ, ఆచార్య బి.ప్రసాద్ రావులను ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం ఆచార్య ప్రసాదరావు చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం విద్యార్థుల మనసులను హత్తుకుంది. తాము చదువుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ రుణం తీర్చుకోవాలని, విలువలతో కూడిన విద్యను అందించాలని ఉద్దేశంతో తాను స్థాపించిన పాఠశాల అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఏయూ విజన్ డాక్యుమెంట్, లోగోలను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమం ఆరంభంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు పూర్వ ఉపకులపతులు, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆచార్యులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. -
ముమ్మరంగా పోలీసు తనిఖీలు
పాడేరు : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎస్పీ అమిత్బర్దర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో సీఐ దీనబంధు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసు జాగిలాలతో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, పాత బస్టాండ్, సినిమాహాల్ సెంటర్, మోదకొండమ్మ ఆలయం, ఐటీడీఏ కార్యాలయం, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి తదితర ముఖ్య కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలను కూడా తనిఖీచేశారు. సీఐ దీనబంధు మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమానిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని తెలిపారు. అరకులోయ టౌన్: అరకులోయని పర్యాట ప్రాంతాల్లో శనివారం అరకు సీఐ హిమగిరి,ఎస్ఐ గోపాలరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పద్మాపురం గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, అరకు రైల్వే స్టేషన్,బస్ స్టేషన్లను బాంబు డిస్పోజల్,డాగ్ స్క్వాడ్తో సీఆర్పీఎఫ్,స్పెషల్ పార్టీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.ప్రయాణికుల వివరాలు సేకరించి, బ్యాగులు, లగేజీలు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఎవరు తిరిగినా, బ్యాగులు,లగేజీలు ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ హిమగిరి స్థానికులను కోరారు. చింతూరు: కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరికల నేపథ్యంలో చింతూరు సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం చింతూరులో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఉగ్రదాడి జరగడంతో ఈ ప్రాంతంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్టు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా చింతూరు బస్టాండ్తో పాటు పలు అనుమానాస్పద ప్రాంతాల్లో మెటల్ డిటెక్టర్లు, డాగ్స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. -
ఏవోబీలో విస్తృతంగా తనిఖీలు
ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా సరిహద్దు ప్రాంతంలో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వారపు సంతతో పాటు జోలాపుట్టు,డుడుమ మార్గాల్లో ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో అధిక సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడంతో పాటు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తప్పించుకున్నట్టు వచ్చిన వార్తలతో సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని ప్రధాన జంక్షన్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు.ప్రయాణికుల లగేజీలు పరిశీలించి,అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ప్రశ్నిస్తూ వాహన రికార్డులతో పాటు గుర్తింపు కార్డులు పరిశీలించి, విడిచి పెట్టారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. -
ఘనంగా అమ్మవారి విగ్రహ ఊరేగింపు
సీలేరు: జీకే వీధి మండలం సీలేరు గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి ఆలయ 53వ వార్షికోత్సవాల సందర్భంగా శనివారం అమ్మవారి ఊరేగింపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి గరగను, ఉత్సవ విగ్రహాలను సీలేరు వీధుల్లో అంగరంగా వైభవంగా ఊరేగించారు. భక్తులు అమ్మవారికి పసుపు,కుంకుమ సమర్పించి, హారతులిచ్చారు. తాడేపల్లిగూడేంకు చెందిన అమ్మవారి శక్తి వేషాలు, తీన్మార్ డప్పులు, థింసా నృత్యాలు, డీజే సౌండ్స్తో ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో సీలేరు పూర్వ విద్యార్థులు, పూర్వ జెన్కో ఉద్యోగులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జీకే వీధి సీఐ వరప్రసాద్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ రవీంద్ర భారీ బందోబస్తు నిర్వహించారు. -
గిరిజనుల భవిష్యత్తుతో ఆటలొద్దు
సాక్షి,పాడేరు/పాడేరు రూరల్: గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాలు కల్పించే జీవో నంబర్ 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో సాధన,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ డిమాండ్తో ఆదివాసీ ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. పలు ఆదివాసీ ప్రజాసంఘాలు శనివారం జిల్లా కేంద్రం పాడేరులోని కాఫీ అతిథి గృహంలో సమావేశమయ్యాయి.స్పెషల్ డీఎస్సీ సాధన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్త చర్చా వేదికను నిర్వహించాయి. ప్రతి సంఘం నుంచి ఆదివాసీ నాయకులు గిరిజన సమాజం అభివృద్ధి అజెండాగా మాట్లాడారు. గిరిజనుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా ఓ గిరిజన బిడ్డగా అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి కూడా ఈచర్చవేదికకు హాజరై ఆదివాసీల పక్షాన తన గళం వినిపించారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణకు పార్లమెంట్లో పోరాడుతున్నానని, గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల కల్పన,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన పోరాటానికి తాను అన్ని విధాల సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ఎంపీ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు జీవో నంబర్ 3 పునరుద్ధరణ,లేని పక్షంలో ప్రత్యామ్నాయ జీవో తెచ్చే బాధ్యత సీఎం చంద్రబాబుదేనని, నూరుశాతం ఉద్యోగ,ఉపాధ్యాయ పోస్టుల భర్తీని వెంటనే అమలుజేయాలని ఈ చర్చా వేదికలో ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సమష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలని తెలిపారు. మెగా డీఎస్సీని రద్దు చేసి ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని కోరారు. వచ్చేనెల 2 నుంచి నిరవధిక బంద్ జీవో నంబర్ 3 పునరుద్ధరణ,ఆదివాసీల స్పెషల్ డీఎస్సీ సాధన డిమాండ్తో ఆదివాసీ ప్రజా సంఘాలు దశలవారీ ఆందోళనకు కార్యాచరణ రూపొందించాయి. ఈనెల 28న మండల కేంద్రాల్లో అన్ని సంఘాలతో సమావేశాలు, 29న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పత్రాలు దహనం, 30న రాష్ట్ర గిరిజన మంత్రి, గవర్నర్లకు వినతిపత్రాలు అందజేత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. మే 2వతేదీ నుంచి నిరవధిక మన్యం బంద్కు పిలుపునిచ్చాయి. జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో బాధ్యత సీఎం చంద్రబాబుదే ఆదివాసీ స్పెషల్ డీఎస్సీని వెంటనే ప్రకటించాలి ఆదివాసీ ప్రజాసంఘాల డిమాండ్ 28 నుంచి దశలవారీగా ఉద్యమం మే 2 నుంచి నిరవధిక మన్యం బంద్కు కార్యాచరణ ఉద్యమానికి అరకు ఎంపీ తనూజరాణి మద్దతు -
ఉపాధి కూలీగా మారిన ఎస్ఐ
ముంచంగిపుట్టు: స్థానిక ఎస్ఐ జె.రామకృష్ణ ఉపాధి కూలీగా మారి గంటపాటు పనిచేశారు. సుజనకోట పంచాయతీ కొత్తసుజనకోట గ్రామ గిరిజనులు ఉపాధిహామీ పనులుచేస్తుండగా శని వారం ఉదయం పనిప్రదేశానికి వెళ్లిన ఎస్ఐ వారి సమస్యలు తెలుసుకుంటూ, పారతో మట్టిని తవ్వారు. మట్టిని తట్టలో వేసి మోసుకుంటూ గంట పాటు ఉపాధి పనిచేశారు. ఉపాధి కూలీలతో కలిసి కాసేపు ముచ్చటించారు.పోలీసుశాఖ ద్వా రా చేస్తున్న సేవలు వారికి వివరించి,గంజాయి జోలికి పోకుండా మంచి జీవితం గడపాలని కూలీలకు సూచించారు. ఎస్ఐ వారితో కలిసి పని చేయడంతో కొత్తసుజనకోట గ్రామ గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. -
తస్మాత్ జాగ్రత్త !
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 15 వరకు నమోదైన మలేరియా కేసులు పీహెచ్సీల వారీగా.. చింతూరు మండలం తులసిపాక 38, మోతుగూడెం 44,ఏడుగురాళ్లపల్లి 13ఎటపాక మండలం లక్ష్మీపురం 2, నెల్లిపాక 1, గౌరిదేవిపేట 3 కూనవరం మండలం కూటూరు 31, కూనవరం 13 వీఆర్పురం మండలం రేఖపల్లి 14, జీడుగుప్ప 11 ఎటపాక: గ్రామాల్లో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. పారిశుధ్య లోపం, వర్షాలు కురుస్తుండడంతో దోమలు, చిన్నచిన్న క్రిములు పెరిగి స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో విషజ్వరాలు విజృంభించే అవకాశం ఉంది. వ్యాధుల కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కలుషిత నీరు వల్ల కలరా, టైఫాయిడ్ తదితర వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వందలాదిమంది మలేరియా, వేలాది మంది విషజ్వరాల బారిన పడ్డారు. అయినా నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గ్రామాల్లో దోమల మందు పిచికారీ కూడా నామ మాత్రంగానే ఉంది. దోమతెరలను ఇప్పటికీ పంపిణీ చేయలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకుంటే రానున్న వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యధికారులు సూచిస్తున్నారు. మూడు పీహెచ్సీల పరిధిలో అధిక మలేరియా కేసులు : చింతూరు ఐటీడీఏ పరిధిలో గల పది ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 391 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 ఆస్పత్రుల పరిధిలో 1,45,516 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 35 వలస ఆదివాసీ గ్రామాలు ఉండగా, వీటిలో రహదారి, విద్యుత్, తాగునీటి సౌకర్యం లేని గ్రామాలే అధికం. వైద్యశాఖలో పెద్ద ఎత్తున యంత్రాంగం ఉన్నప్పటికీ ప్రతి ఏటా వర్షాకాలం మొదలుకొని శీతాకాలం వెళ్లేంత వరకూ సీజనల్ వ్యాధులు ఏజెన్సీని అతలాకుతలం చేస్తూనే ఉంటాయి. మలేరియా కేసుల నమోదులో చింతూరు మండలం తులసిపాక పీహెచ్సీ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా కేసులు ఎక్కువగా తులసిపాక, ఏడుగురాళ్లపల్లి, మోతుగూడెం పీహెచ్సీల పరిధిలో నమోదవుతున్నాయి. గత ఏడాది జూన్ నుంచి ఈఏడాది ఏప్రిల్ 15 వరకు చింతూరు ఐటీడీఏ పరిధిలోని చింతూరు,ఎటపాక,వీఆర్ పురం,కూనవరం మండలాల్లో 503 మలేరియా కేసులు నమోదైనట్టు డిప్యూటీ డీఎంహెచ్వో పుల్లయ్య తెలిపారు. వేసవి,వర్షాకాలంలో వలస ఆదివాసీ గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తాయి. వేల సంఖ్యలో ఈ జ్వరాల బారిన పడుతుంటారు.సకాలంలో వైద్యం అందకపోవడంతో మృత్యువాత పడిన సంఘటనలు అనేకం. చింతూరు డివిజన్లో సుమారు 35 వలస ఆదివాసీ గ్రామాలున్నాయి. పలుగ్రామాల ప్రజలు వాగులు, వంకల్లోని చెలమనీటినే తాగుతున్నారు. ఆ నీరు కలుషితం కావడంతో విషజ్వరాలు,డయేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు. వీఆర్పురం,ఎటపాక, చింతూరు మండలాల్లోని పలు ఆది వాసీ గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొంది. వ్యాధులు వస్తే సకాలంలో ప్రభుత్వఆస్పత్రులకు వచ్చి వైద్యం చేయించుకునేందుకు సరైన రహదారి సౌకర్యం కూడా లేకపోవడం గిరిజనులకు శాపంగా మారింది. 192 గ్రామాల్లో మలేరియా : చింతూరు ఐటీడీఏ పరిధిలోని 56,973 మంది జనాభా ఉన్న 192 గ్రామాలను మలేరియా తీవ్రంగా ప్రబలే గ్రామాలుగా గుర్తించారు. ఈ గ్రామాల్లో మొదటి విడతలో దోమల మందు పిచికారీ ప్రారంభించినట్టు డిప్యూటీ డీఎంహెచ్వో తెలిపారు. అదేవిధంగా ఈ గ్రామాల్లో 78,000 దోమతెరలు పంపిణీకి అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వం స్పందించి వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసి విషజ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్లే.పొంచి ఉన్న వ్యాధుల ముప్పుదోమకాటుతో విషజ్వరాలుచింతూరు ఐటీడీఏ పరిధిలో 503 మలేరియా కేసులువ్యాధులకు కలుషిత నీరూ ఓ కారణం వ్యాధుల నియంత్రణకు చర్యలు చింతూరు డివిజన్లో మలేరియా, విషజ్వరాలు ఎక్కువగా ప్రబలుతాయి. వాటి నియంత్రణ కు ముందస్తు చర్యలు చేపడుతున్నాం. అన్ని ఆస్పత్రుల పరిధిలోని సిబ్బందిని అప్రమత్తంచేసి, గుర్తించిన గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తున్నాం. దోమతెరల పంపిణీకి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. – డాక్టర్ పి.పుల్లయ్య, డిప్యూటి డీఎంహెచ్వో -
గంజాయి కేసులో పాత నేరస్తుడు అరెస్ట్
గొలుగొండ: ఏటిగైరంపేట గ్రామంలో 2021లో గంజాయి తరలిస్తున్న సమయంలో బైక్ వదిలేసి పారిపోయిన నిందితుడిని గొలుగొండ ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో శుక్రవారం అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2021లో ఏటిగైరంపేట గ్రామంలో 36 కేజీల గంజాయి బైక్పై తరలిస్తుండగా.. అల్లూరి జిల్లా వాడలపాలెం గ్రామానికి చెందిన వంతల సుందర్రావు అప్పట్లో తప్పించుకుని పారిపోయాడు. వదిలేసిన బైక్ ఆధారంగా ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని, రిమాండ్కు తరలించామని ఎస్ఐ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న ఎస్ఐ, సిబ్బందిని సీఐ రేవతమ్మ, డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి అరెస్ట్ -
ఉగ్రదాడుల్లో మృతులకు నివాళి
రంపచోడవరం/మోతుగూడెం/వై.రామవరం/గంగవరం/కూనవరం: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో ఉగ్రవాదుల దాడుల్లో మృతులకు ఘన నివాళులర్పించారు. రంపచోడవరం, మోతుగూడెం, వై.రామవరం, గంగవరం, కూనవరం ప్రాంతాల్లో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అంత మొందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వెంకట్, కిరణ్, వాణిశ్రీ,, నిర్మల, రాణి, ప్రేమ్స్వరూప్, రామచంద్రనాయుడు, రామ్ప్రసాద్, వల్లీఖాన్ నూకరాజు, కనకరాజు, సుబ్బలక్ష్మి, శారదదేవి, సోమాలమ్మ, నాగమణి, సిద్దు, రమణ,నాగూర్, మణి, సాయి, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్లను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక అడుగులు
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఈఎన్సీ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ డేగాలో యుద్ధ విమానాల పైలట్లకు శిక్షణ తీవ్రతరం చేశారు. వాస్తవంగా ఏడాది పొడవునా ఇక్కడ పైలట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. కానీ ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో దీన్ని మరింత చురుగ్గా కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని దాడులకు తెగబడుతున్న శత్రుదేశాల కుయుక్తుల్ని తిప్పికొట్టేందుకు భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నేవల్ ఎయిర్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (ఎన్ఏఐఎస్ఎస్)ను సిద్ధం చేశారు. ఎయిర్ స్టేషన్లో స్మార్ట్ ఫెన్స్ను అమర్చి.. సీసీకెమెరాల సాయంతో పహారా కాస్తున్నారు. స్మార్ట్ ఫెన్స్లోపలికి ఏ ఎయిర్క్రాఫ్ట్, హెలికాఫ్టర్, మనిషి వచ్చినా.. వెంటనే కంట్రోల్ రూమ్కు అప్రమత్తం చేయడంతో పాటు సెకెన్ల వ్యవధిలో మొత్తం వ్యవస్థకు సమాచారం అందజేస్తుంది. ఎయిర్స్టేషన్ చుట్టూ ఇన్ఫ్రారెడ్ డివైజ్లు, మోషన్ డిటెక్టర్స్, ఏ చిన్న రంధ్రం చేసి లోపలికి ఎవరు ప్రవేశించాలని భావించినా వారిని మట్టుపెట్టేలా యాంటీ పెనిట్రేషన్, థర్మల్ సెన్సార్లతో పాటు డ్రోన్ల పర్యవేక్షణతో పహారా ముమ్మరం చేసినట్లు సమాచారం. ఎయిర్ స్టేషన్కు దాదాపు 2 కిలోమీటర్ల వరకూ ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ వ్యాపింపజేసి.. శత్రువుల చొరబాట్లను సులువుగా పసిగట్టనున్నారు. అదేవిధంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ (ఎన్ఏడీఎస్)ని కూడా డేగాలో అప్రమత్తం చేశారు. భారీ డ్రోన్ల నుంచి తూనీగల పరిమాణంలో ఉన్న మైక్రో డ్రోన్ల వరకూ లేజర్ ఆథారిత కిల్ మెకానిజం సహాయంతో గుర్తించి.. వాటిని మట్టుపెట్టేలా రూపొందించిన ఈ వ్యవస్థ సాయంతో 360 డిగ్రీల కోణంలో.. 10 కిలోమీటర్ల పరిధిలో ఏ రకమైన డ్రోన్ ఉన్నా.. పసిగట్టి నాశనం చేయగలదు. -
రీ సర్వే వివరాలను వెంటనే అప్లోడ్ చేయండి
రంపచోడవరం: ఏజెన్సీ ఏడు మండలాల్లో భూహక్కు, భూ చట్టం ద్వారా రీ సర్వేకు సంబంధించిన వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశపు హాలులో శుక్రవారం తహసీల్దార్లు, సర్వేయర్లతో రీ సర్వే ప్రక్రియపై వర్క్ షాప్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సర్వే చేసిన భూముల వివరాలను వీఆర్వోల లాగిన్ నుంచి తహసీల్దార్ లాగిన్కు అప్లోడ్ చేయాలని తెలిపారు. రీ సర్వేలో ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఒక ఇంట్లో యజమానుల పేర్లతో ఉన్న భూములు వారసులకు మ్యుటేషన్ చేయాలని తెలిపారు. ఆర్డీడీ కేజీయా కుమారి మాట్లాడుతూ ఏజెన్సీలో 133 గ్రామాల్లో రీ సర్వే చేసినట్టు చెప్పారు. ఇంకా 268 గ్రామాల్లో చేయాల్సి ఉందన్నారు. 133 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసిన వాటికి గెజిట్ నోటిఫికేషన్ కోసం ఈ వర్క్షాప్ నిర్వహించినట్టు తెలిపారు -
మాచ్ఖండ్ ప్రాజెక్టుకు చెందిన గృహం స్వాధీనం
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న అధికారుల కోసం నిర్మించిన నివాస గృహం ఆక్రమణకు గురైంది.ప్రాజెక్టులో గతంలో పనిచేసిన ఆనందో నందో కుమారుడు అనిల్కుమార్ నందో ప్రాజెక్టు నివాస గృహాన్ని ఆక్రమించి,ఆధునిక హంగులతో పనులు చేయిస్తున్నాడు.ప్రాజెక్టు అధికారులు పలుమార్లు ఇంటిని ఖాళీ చేయమని,పనులు ఆపాలని చెప్పినా వినిపించుకోలేదు.దీంతో అధికారులు పోలీసులకు తెలియజేశారు.పోలీసులు సైతం చెప్పినా పనులు చేస్తూ ఉన్నాడు. దీంతో ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.ఉన్నత అధికారులు కొరాపుట్ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు అదనపు తహసీల్దార్ ఉదవ్ సబర్,ప్రాజెక్టు ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావులు రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి తాళాలు పగలగొట్టి గృహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
సాక్షి, పాడేరు: పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో రెండు రోజుల క్రితం ప్రాణప్రతిష్ట జరిగిన లక్ష్మిదేవికి తొలి శుక్రవారంతో ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. సాయంత్రం లక్ష్మిదేవిని మహిళలంతా దర్శించుకుని కుంకుమార్చన పూజలు చేశారు. భజన కార్యక్రమాలతో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. నేడు ఆలయ వార్షికోత్సవం పట్టణంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరిదేవి ఆలయ తొలి వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహచలంనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. శనిత్రయోదశి పురస్కరించుకుని నవగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. వైభవ వెంకటేశ్వరస్వామి విగ్రహం వద్ద పూజలు జరుగుతాయన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొవాలని కోరారు. సీలేరు: సీలేరులో మారెమ్మ ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన ఎం.కె.టి.ఎన్.వీ ప్రసాద్ , మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో సహస్రదీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయకమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఘనంగా అమ్మవారి గరగల ఊరేగింపు చింతపల్లి: చింతపల్లిలో ముత్యాలమ్మ తల్లి ఉత్సవం ఘనంగా జరుగుతోంది. వేడుకలో భాగంగా రెండోరోజు సుర్లవంశీయుల ఇంటి వద్ద కొలువుతీరిన అమ్మవారి గరగలు, పాదుకలు, ఘటాలకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భాజభజంత్రీలు, డప్పుల చప్పుళ్ల మధ్య అమ్మవారి గరగలను ఊరేగింపుగా ఽఽఽశతకంపట్టు వద్దకు తీసుకువచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఎంపీపీ కోరాబు అనూషాదేవి, ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దురియా హేమంత్కుమార్, పసుపులేటి వినాయకరావు, సభ్యులు బేతాళుడులు గరగలను ఽశతకం పట్టువద్దకు తీసుకువచ్చారు. సుర్లవంశీయులు సుర్ల అప్పారావు. తిరుపతి పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో కుంకుమపూజలు అమ్మవార్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
పాడేరు : గురుకుల విద్యాలయాల్లో ప్రవేశం కల్పించేందుకు జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. స్థానిక గిరిజన గురుకుల బాలికల పాఠశాల, శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, తలార్సింగి సీఏహెచ్ బాలుర పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5,6,7,8 తరగతులకు సంబంధించి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 5,6,7,8 తరగతులకు సంబంధించి 312 మంది విద్యార్థులకు గాను 176 మంది హాజరు కాగా, 136 మంది గైర్హాజరయ్యారు. ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షకు 843 మందికి గాను 591 మంది హాజరు కాగా, 252 మంది హాజరు కాలేదు. ఈ పరీక్ష కేంద్రాలను డీఆర్వో పద్మలత, జిల్లా విద్యాశాఖా ధికారి బ్రహ్మాజీరావు, పరీక్షల అసిస్టెంట కమిషనర్ ఆర్. శశికుమార్ తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
సాయమేది బాబూ!
ఖరీఫ్కుపశువులను అమ్ముకుంటున్న గిరిజన రైతులుజిల్లాలో ఖరీఫ్ పంటల సాధారణ విస్తీర్ణం పంట హెక్టార్లు వరి 56,792 చోడి,ఇతర చిరుధాన్యాలు 23,642 పప్పుదినుసులు 1,948 నూనెగింజలు 1,740 పత్తి 3,467 పొగాకు 200 చెరకు 82 మొత్తం 87,871 -
మలేరియా రహితసమాజం కోసం కృషి
● ఐటీడీఏ పీవో అపూర్వభరత్ చింతూరు: మలేరియా రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో చింతూరులో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ చింతూరు డివిజన్లో గత ఏడాది 382 మలేరియా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 170 కేసులు నమోదైనట్టు తెలిపారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు దో మతెరలు వినియోగించాలని, మురుగునీరు నిలువ లేకుండా చూడాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పుల్లయ్య, ఎంపీడీవో రామకృష్ణ, డాక్టర్ నిఖిల్ పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 104 అర్జీలు
పాడేరు : ప్రజల సమస్యలను గడువులోగా పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కార వేది క కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో పద్మలతతో కలిసి సబ్ కలెక్టర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 104 అర్జీలు స్వీకరించా రు. రహదారుల నిర్మాణ, తాగునీటి సమస్య, పింఛన్లు, అటవీ హక్కుల పత్రాలు మంజూరు చేయాలని, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ అధిక వినతులు వచ్చాయి.డీఎంహెచ్వో డాక్టర్ జమల్బాషా, టీడబ్ల్యూ ఇన్చార్జి డీడీ కమల, డీఈవో బ్రహ్మాజీరావు, డీఎస్డీవో జగన్మోహన్రావు, జిల్లా రవాణా అధికారి లీలాప్రసాద్, కార్మిక శాఖ అధికారి సుజాత, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రోహిణి పాల్గొన్నారు. -
‘వికసిత అల్లూరి జిల్లా’ లక్ష్యంతో పనిచేయాలి
సాక్షి, పాడేరు: వికసిత అల్లూరి సీతారామరాజు జిల్లా లక్ష్యంతో అధికారులు పనిచేయాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పాడేరు చేరుకుని కలెక్టరేట్లో పలుశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, జేసీఅభిషే క్గౌడ సమక్షంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కాంపోనెంట్ నిధులు, జల్జీవన్ మిషన్, గ్రామీణ సడక్ యోజన, లాక్పతి దీదీ, గరీబ్ కల్యాణ్ యోజన, పీఎం సూర్యఘర్, పీఎం ఆవాస్ యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం జన్మన్, పీఎం స్వనిధి తదితర కేంద్ర ప్రాయోజిత పథకాలను సమర్థంగా అమలుజేయాలన్నారు. ఉపాధిహామీ వేతనం సగటున రూ.263 ఉందని, రూ.300కు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 105 అమృత సరోవర్ పనులు సకాలంలో జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ సడక్ యోజనలో రూ.180.86 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలో చేపడుతున్న పనులు త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. పీఎం ఆవాస్ యోజ నలో 17,111 గృహాలు, పీఎం జన్మన్లో 34,236 గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. స్వదేశి దర్శన్లో బొర్రాగుహలలో మౌలిక సదు పాయాల కల్పన, అభివృద్ధి పనులకు రూ.29.30 కోట్లు మంజూరయ్యాయని, అరకు–లంబసింగి టూరి జం అభివృద్ధికి రూ.50 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి మాట్లాడుతూ పెదబయలు మండలంలోని తారాబు జలపాతం అభివృద్ధికి రూ.4 కోట్ల ఎంపీలాడ్ నిధులు మంజూరైనట్టు తెలిపారు. ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు. బొర్రా గుహల అభివృద్ధికి రూ.29.30 కోట్లు మంజూరు అరకు–లంబసింగి టూరిజం అభివృద్ధికి రూ.50 కోట్లతో ప్రతిపాదనలు 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ -
క్రీడల్లో గెలుపోటములు సహజం
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అనంతగిరి(అరకులోయటౌన్): క్రీడల్లో గెలుపోటములు సహజమని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీ దిగువశోభ గ్రామంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని చెప్పారు. అనంతరం ఎగువశోభ సచివాలయాన్ని సందర్శించి, రికార్డులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దిసరి గంగరాజు, సర్పంచ్లు కొర్రా సింహాద్రి, మొష్యా, వార్డు సభ్యులు లక్ష్మణ్, ప్రసాద్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం మోసం చేసింది
చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి, తీవ్ర అన్యాయం చేశారు. అన్నదాత సుఖీభవ హామీని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. గత ఏడాది రైతులకు పెట్టుబడి సాయం అందజేయలేదు. ఈఏడాది కూడా పంపిణీ అనుమానంగానే ఉంది. గిరిజన రైతుల ఆర్థిక పరిస్థితిని గమనించి సాయం అందజేయాలి. – గబ్బాడ లక్ష్మయ్య,గిరిజన రైతు, కుజ్జెలి గ్రామం, పాడేరు మండలంసాక్షి.పాడేరు: జిల్లాలో ఎక్కువ మంది రైతులు పేదలే. రెక్కాడితే గాని డొక్కాడని వారికి వ్యవసాయమే ఆధారం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉండేది. రైతుల సంక్షేమం లక్ష్యంగా అప్పటి సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పలు కార్యక్రమాలను అమలుచేశారు. 90 శాతం సబ్సిడీపై విత్తనాలతో పాటు ప్రతి ఏడాది రైతు భరోసా పథకంలో ఆర్థిక సాయం అందించడంతో ప్రతి గిరిజన రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేశారు. గత ప్రభు త్వం ఖరీఫ్ యాక్షన్ ప్లాన్కు ముందుగానే ఆమోదం తెలపడంతో గత ఖరీఫ్ సమయంలో వరి,ఇతర వాణిజ్య పంటల విత్తనాలు సమకూరాయి. రైతు భరోసా పథకంలో మూడు విడతలుగా ఏడాదికి రూ.13,500 చొప్పున 1,69,264 మంది రైతులు ఏటా రూ.104 కోట్లు ఆర్థిక సాయం పొందారు. ఉసూరుమంటున్న గిరిజన రైతులు జిల్లాలోని గిరిజన రైతులు వ్యవసాయానికి పెట్టుబడి సాయం లేక ఉసూరుమంటున్నారు. సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేలు సాయం చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు గద్దెనెక్కిన తరువాత ఆ విషయం విస్మరించారు. గత ఖరీఫ్లో పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.2వేలు మాత్రమే దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదు. దీంతో అప్పులు చేసి, పశువులను అమ్ముకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఖరీఫ్ వ్యవసాయ పనులకు గిరిజన రైతులు శ్రీకారం చుట్టారు. వర్షాలు కురుస్తుండడంతో దుక్కిపనులతో పాటు మెట్ట పంటలకు విత్తనాలు జల్లుతున్నారు. అయితే ఇంతవరకు 90 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రారంభించలేదు.అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం కోసం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఖరీఫ్లో ప్రతి గిరిజన రైతుకు పెట్టుబడికి కనీసం రూ.15వేలు అవసరం. ఆ సొమ్ములేక చాలా మంది రైతులు తమ పశువులను అమ్ముకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్కు దుక్కిపనులు చేస్తున్న గిరిజన రైతుగత ఏడాదీ ఇబ్బందులు పడ్డా గత ఖరీఫ్ సీజన్లోను వ్యవసాయ పెట్టుబడికి ఇబ్బంది పడ్డాను.రైతు భరోసా ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిఏడాది రూ.13,500 సాయం అందించేది. వ్యవసాయ పెట్టుబడు లకు మంచి అదునులో ఈసొమ్ము ఉపయో గపడేది. పీఎం కిసాన్ యోజన రూ.2వేలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం అందలేదు. – బంగురు వాసుదేవ, గిరిజన రైతు, గడి కించుమండ, హుకుంపేట మండలంపశువులను అమ్ముకుంటున్నారు పేద గిరిజన రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.తిండి గింజలు,ఇతర వాణిజ్య పంటలు పండించుకుని జీవించే రైతులు వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు పశువులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను కూడా రెండు దుక్కి పశువులను హుకుంపేట సంతలో అమ్ముకున్నాను. – రేంగ పండన్న, గిరిజన రైతు, బొడ్డాపుట్టు, హుకుంపేట మండలం ఆర్థిక ఇబ్బందుల్లో గిరి రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపు గత ప్రభుత్వం హయాంలో 1,69,264 మందికి రైతు భరోసా ఏటా రూ.104 కోట్ల ఆర్థిక సాయం గత ఖరీఫ్ నుంచి కూటమి ప్రభుత్వ సాయం నిల్ ఈ ఏడాది కూడా సాయం ఊసేత్తని సర్కార్ -
రెండు కుటుంబాల్లో తీరని విషాదం
పెదబయలు/జి.మాడుగుల: పిల్లల సరదా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పుట్టిన రోజును సరదాగా స్నేహితులతో గడుపుదామని వెళ్లి, పిట్టలబొర్ర (తారాబు)జలపాతంలో ఈతకొడుతూ గల్లంతైన కిశోర్(22), గుర్రాయి గెడ్డలో ఈత కొడుతూ గల్లంతైన ఉల్లి మహి ప్రసాద్ వర్మ(14) అనే బాలుడు మరణించారు. తీవ్రంగా గాలించి వారి మృతదేహాలను పోలీసులు శుక్రవారం బయటకు తీశారు. తమ కలలు నెరవేరుస్తారనుకున్న పిల్లలు కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉండడం చూసి భరించలేని తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. వారి రోదనలు స్థానికులను కలచివేశాయి. విశాఖ జిల్లా పెందుర్తిలో గల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఏలూరు జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన గొన్నురు కిశోర్ తన స్నేహితులతో కలిసి ఈతకొట్టడానికి గురువారం తారాబు జలపాతంలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. శుక్రవారం ఐదుగంటల పాటు గాలించి, మృతదేహాన్ని వెలికి తీశారు. ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించినట్టు స్థానిక ఎస్ఐ కె.రమణ తెలిపారు. తమకు ఒక్కడే కుమారుడని, గారాబంగా పెంచి, చదివిస్తున్నామని పుట్టిన రోజు నాడు ఇలా విగతజీవిగా మారుతాడనుకోలేదని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. గాలింపు చర్యల్లో పెదబయలు ఆర్ఐ పూర్ణయ్య, జామిగుడ సర్పంచ్ తెరవాడ అన్నమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు తెరవాడ వెంకటరావు, వీఆర్ఏ కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.● జి.మాడుగుల మండలంలో సింగర్భ పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన ఉల్లి మహి ప్రసాద్ వర్మ(14) ఐదుగురు స్నేహితులతో కలసి గురువారం గుర్రాయి గ్రామ సమీపంలో గల గెడ్డలో ఈతకొట్టడానికి వెళ్లి, ప్రవాహంలో గల్లంతైన విషయం తెలిసిందే. గెడ్డ ఊబిలో కూరుకుపోయి మరణించిన ప్రసాద్ వర్మ మృతదేహాన్ని శుక్రవారం బయటకుతీశారు. సంఘటన స్థలం వద్ద మృతదేహాన్ని స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ షణ్ముఖరావు పరిశీలించి పోస్టుమార్టానికి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
గిరి రైతుల ఆర్గానిక్ఉత్పత్తులకు గిరాకీ
● ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడ పాడేరు : గిరిజన రైతులు సాగు చేస్తున్న ఆర్గాని క్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. ఐటీడీఏ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, పరిశ్రమల శాఖ అధికారులు, ఎంపీడీవోలతో గ్రామీణ పరిశ్రమల పార్క్ ఏర్పాటుపై గురువారం ఒకరోజు వర్క్షాప్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి.మాడుగుల మండలం సొలభంలో రూరల్ ఇండస్ట్రీయల్ పార్క్ఏర్పాటు చేసేందుకు యో చిస్తున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శౌర్యమన్పటేల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి.రవిశంకర్, వెటర్నరీ ఏడీ నర్సింహు లు, ఎల్డీఎం మాతునాయుడు పాల్గొన్నారు. -
తొలి విడత చందనం అరగదీత ప్రారంభం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొలివిడత చందనం అరగదీత గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ నెల 30న వైశాఖ శుద్ధ తదియనాడు జరిగే స్వామివారి చందనోత్సవం(నిజరూప దర్శనం) అనంతరం ఆ రోజు రాత్రి తొలివిడతగా సమర్పించాల్సిన మూడు మణుగుల(సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని సమకూర్చేందుకు ఏకాదశిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. తొలుత ఆలయ బేడా మండపంలోని భాండాగారం వద్ద తొలి చందనం చెక్కను ఉంచి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, షోడషోపచారపూజలు జరిపారు. అనంతరం ఆ చందనం చెక్కతో ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు మంగళవాయిద్యాలు, వేద మంత్రోశ్చరణల మధ్య బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. అనంతరం నోటికి వస్త్రం చుట్టుకుని తొలిచందనాన్ని అరగదీశారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు చందనాన్ని అరగదీశారు. అరగదీసిన చందనాన్ని స్వామివారి మూలవిరాట్కి సమర్పించారు. అనంతరం 20 మంది నాల్గవ తరగతి సిబ్బంది చందనం అరగదీతలో పాల్గొన్నారు. ఆలయ ఏఈవో ఆనంద్కుమార్, సూపరింటెండెంట్ త్రిమూర్తులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ఇటుకల కోటలు
ఇటుకల పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పెరగడం, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల బట్టీల యజమానులు సతమతమవుతున్నారు. ఇటుక బలంగా తయారు కావడానికి బంకమట్టి, వరిపొట్టు మిశ్రమం అవసరం. వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. మరో పక్క కొనుగోలుదారులు లేక నిల్వలు భారీగా పేరుకుపోయాయి. తయారైన ఇటుకలు.. భారీ వర్షాల వల్ల పాడైపోవడంతో నష్టం ఏర్పడింది. దీంతో బట్టీలు మూతపడుతున్నాయి. కూలుతున్నముంచంగిపుట్టు: ఇటుకల వ్యాపారులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా అమ్మకాలు లేక నష్టాలను చవిచూస్తున్నారు.రోజు రోజుకు ఊక,కర్రలు వంటి ముడి సరకుల ధరలు పెరుగుతూ ఉండడంతో పాటు కూలీల వ్యయం అధికం కావడంతో బట్టీలు మూతపడుతున్నాయి. ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, హుకుంపేట మండలాలల్లో సుమారు 50 బట్టీలున్నాయి. వీటిలో అత్యధిక బట్టీల్లో రెండు నెలలుగా ఇటుకల తయారీ నిలిపివేశారు. సరిహద్దులో సుమారు 150 కుటుంబాలు ఇటుకల బట్టీల ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఒడిశా రాష్ట్రం జయపురం, కోరాపుట్, సిమిలిగూడ, మల్కన్గిరి,రాయపూరు వంటి పట్టణాల నుంచి ఇటుకల తయారీకి కోసం ప్రతి ఏడాది 150 కుటుంబాల వారు వస్తారు. డిసెంబర్ నుంచి మే వరకు ఆరు నెలల పాటు ఇటుకలను తయారు చేస్తూ ఉంటారు. ఒక్కో బట్టీలో వారానికి 50 వేల ఇటుకలు తయారవుతాయి. ఈ లెక్కన ఆరు నెలల్లో సుమారు 12 లక్షల ఇటుకలు తయారు చేస్తారు. ఒక్కో ఇటుక రూ.5.50 నుంచి రూ.6 చొప్పున విక్రయిస్తారు. గత ఏడాది వరకు విక్రయాలు బాగున్నాయి. సిమెంట్ ఇటుకల కారణంగా ఈ ఏడాది విక్రయాలు బాగా తగ్గిపోయాయి. సుమారు ఐదు లక్షల ఇటుకలు తయారీదారుల వద్ద ఉండిపోయాయి. సిమెంట్ ఇటుక ధర రూ.20 ఉన్నా... పని త్వరగా పూర్తవుతుండడంతో ఆ ఇటుకల వినియోగంపై ఎక్కువ మంది మొగ్గు చూపుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 580 గ్రామాలకు సరఫరా సరిహద్దులోని 580 గ్రామాలకు చెందిన వారు ముంచంగిపుట్టు,పెదబయలు మండలాల నుంచే ఇటుకలను కొనుగోలు చేస్తారు. ఇక్కడ తయారైన ఇటుకలకు నాణ్యత,సైజ్ పరంగా మంచి గుర్తింపు ఉంది. అయితే గత మూడు నెలలుగా ఇటుకల అమ్మకాలు లేకపోవడంతో నిల్వలు అధికంగా పేరుకుపోయాయి. దీనికి తోడు గత రెండు నెలలుగా సరిహద్దులో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయి.తయారు చేసిన ఇటుకలు తడిసిపోయి పాడైపోతున్నాయి. దీంతో చాలా మంది ఇటుకల వ్యాపారులు నష్టాలను భరించలేక బట్టీలను తాత్కాలికంగా మూసివేశారు. పెరిగిన ముడిసరకుల ధరలు ఇటుకల తయారీకి ఉపయోగించే ముడిసరకుల ధరలు గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఊక ధర గత ఏడాది కిలో రూ.3 ఉంటే ప్రస్తుతం రూ.6 ఉంది.కట్టెలు ట్రాక్టర్ లోడు గత ఏడాది రూ.4వేలు ఉంటే ప్రస్తుతం రూ.6వేలకు చేరింది. బొందు ఇసుక వ్యాన్ లోడు గత ఏడాది రూ.6,500 ఉంటే ప్రస్తుతం రూ.10వేలు ఉంది. దీనికి తోడు రోజుకు వెయ్యి ఇటుకలు తయారీ చేస్తే రూ.1,300 కూలి చెల్లించాలి. వర్షం, ఇతర కారణాల వల్ల ఇటుకలు పాడైతే ఆ నష్టాన్ని బట్టీ నిర్వాహకుడే భరించాలి. రూ.4,500 ఖర్చు చేసి వెయ్యి ఇటుకలు అమ్మకానికి సిద్ధం చేస్తే మార్కెట్లో రూ.5వేలు నుంచి రూ.5,500 ధర మాత్రమే లభిస్తోంది. దుర్భర పరిస్థితుల్లో వలస కూలీలు ఈ ఏడాది మూడు నెలలకే ఇటుకల తయారీని బట్టీల నిర్వాహకులు నిలిపివేసి, కూలీలను తిరిగి ఇంటికి పంపించేశారు.దీంతో ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి వచ్చిన వందలాది మంది ఇటుకల తయారీ వలస కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. గత 10 సంవత్సరాలుగా ఏటా సరిహద్దులో ఇటుకల తయారీకి వచ్చి ఆరు నెలల పాటు ఉపాధి పొందే కూలీలు నేడు అవస్థలు పడుతున్నారు. ఇటుకల తయారీ పనినే నమ్ముకుని జీవించే వారి పరిస్థితి దుర్భరంగా మారింది.రానున్న రోజుల్లో ఇటుకల తయారీ పనిని వదులుకుని మరేదైనా పని చేసుకుంటే తప్ప కుటుంబాలను పోషించుకోలేమని వలస కూలీలు వాపోతున్నారు.పనిలేకఇబ్బందులు పడుతున్న వలసకూలీలుమూతపడుతున్న బట్టీలునష్టాల్లో తయారీదారులు భారీగా పెరిగిన ముడిసరకుల ధరలుకొనుగోలు దారులు లేక పేరుకుపోతున్న నిల్వలు మండలం మొత్తం మూతపడినవి బట్టీలు ముంచంగిపుట్టు 20 06 పెదబయలు 14 06 జి.మాడుగుల 10 04 హుకుంపేట 07 06వర్షాలతో పాడైపోతున్న ఇటుకలు ఈ పనే మాకు ఆధారం ఇటుకలు తయారు చేసేందుకు ఒడిశాలోని జయపురం నుంచి వచ్చాను. గత ఏడాది ఆరు నెలల పాటు పని చేశాను. రూ.లక్ష వరకు ఇంటికి తీసుకు వెళ్లాను.ఈ ఏడాది మూడు నెలలు పని చేసి, రూ.20 వేలు కూడా సంపాదించలేకపోయాను.ఇటుకలకు డిమాండ్ లేక నిర్వాహకులు ఇంటికి వెళ్లి పోవాలని చెప్పారు. ఈ పని లేకపోతే కుటుంబ పోషణ చాలా కష్టంగా మారుతుంది. – హరిజన్, వలస కూలీ,జయపురం,ఒడిశా రాష్ట్రంరూ.3 లక్షల నష్టం వచ్చింది ఇటుకల బట్టీల నిర్వహణ చాలా కష్టంగా ఉంది.ప్రస్తుతం సిమెంట్ ఇటుకలకు డిమాండ్ ఉంది. కొనుగోలు దారులు లేక మట్టి ఇటుకల నిల్వలు పెరిగిపోయాయి. ఊక,కర్రలు తదితర ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. వర్షాలకు ఇటుకలు పాడైపోయాయి. ఈ ఏడాది రూ.3లక్షల వరకు నష్టం వచ్చింది. – బొరగం శ్రీనివాసరావు, ఇటుకల బట్టీ నిర్వాహకుడు, పెద్దపుట్టు గ్రామం -
పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే గ్రామాల అభివృద్ధి
పాడేరు : గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ ఎ.ఎస్. దినేష్కుమార్ అన్నారు. మండలంలోని డి.గొందూరులో సర్పంచ్ సీదరి రాంబాబు అధ్యక్షతన గురువారం పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. డి.గొందూరు వికసిత్ పంచాయతీ కింద ఎంపిక కావడం పంచాయతీ ప్రజల అదృష్టమన్నారు. వికసిత్ పంచాయతీలకు అన్ని రకాల మౌలిక వసతులు సమకూరుతాయని చెప్పారు. పంచాయతీ పరిధిలోని పాలమానుశంక గ్రామానికి సీసీ రోడ్డు నిర్మించాలని, మర్రిపాలెం, వాకపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా సర్పంచ్ సీదరి రాంబాబు కలెక్టర్ను కోరారు. అనంతరం జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు నిర్మాణ మంజూరు పత్రాలు, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ బాబు, డీఎల్పీవో కుమార్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు గల్లంతు
పెదబయలు/జి.మాడుగుల: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఇద్దరు గల్లంతయ్యారు. పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పిట్టలబొర్ర జలపాతంలో బీటెక్ విద్యార్థి గొ న్నురు కిశోర్, జి.మాడుగుల మండలం గుర్రాయి గ్రామ సమీపంలో గల గుర్రాయిగెడ్డలో మహి వరప్రసాద్ అనే బాలుడు గల్లంతయ్యారు. వివరాలు...విశాఖ జిల్లా పెందుర్తిలో గల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు గ్రామానికి చెందిన గొన్నురు కిశోర్ తన పుట్టిన రోజు వేడుకలను అరకులోయలో శుక్రవారం జరుపుకోవాలని భావించాడు. ఇందుకోసం తన ముగ్గురు స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి పెందుర్తి నుంచి రెండు బైక్లపై బయలుదేరాడు. రాత్రి రెండు గంటలకు గొన్నురు కిశోర్, స్నేహితులు లోకవరపు చంద్రశేఖర్, పాడి శ్యామ్యూల్,కమ్మనైని సంతోష్ అరకువేలి చేరుకుని, బసచేశారు. గురువారం ఉదయం 7.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పెదబయలు మీదుగా పిట్టలబొర్ర వెళ్లారు. నలుగురు జలపాతం వద్ద సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకుని ఆనందంగా గడిపారు. అనంతరం ఈత కొట్టేందుకు జలపాతంలోకి దిగారు. కిశోర్(22) జలపాతంలోని సొరంగ ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయాడు. గమనించిన మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతం లోతుగా ఉండడం వల్ల అందులోకి దిగేందుకు ఎవరూ సాహసించలేదు. ఇక్కడ లోతైన సొరంగం ఉందని చెప్పినా వారు వినిపించుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కె.రమణ తెలిపారు. చీకటి పడడంతో శుక్రవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. కిశోర్ తల్లి,అక్క, బంధువులకు సమాచారం పంపినట్టు ఎస్ఐ తెలిపారు. కిశోర్ శుక్రవారం అరకులోయలో తన పుట్టిరోజు వేడుకలను జరుపుకోవల్సి ఉండగా...ఇంతలో ప్రమాదానికి గురయ్యాడు. గత ఏడాది మే 25తేదీన అరకులోయ మండలం మాడగడ పంచాయతీ దొరగుడ గ్రామానికి చెందిన సమరెడ్డి అరుణ్కుమార్(24) అనే యువకుడు ఈ జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ కాలుజారిపడి సుడిగుండలో మునిగి గల్లంతయ్యాడు. ఈత కోసం వెళ్లి... జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన ఉల్లి మహి వరప్రసాద్(14) అనే బాలుడు, తన ఐదుగురు స్నేహితులు బొర్రమామిడి గ్రామానికి చెందిన పాంగిబాబు, తీగలమెట్ట గ్రామానికి చెందిన కొర్ర చలపతి, పాంగి వంశీ, పాంగి నాగేశ్వరరావు, గుప్పవీధికి చెందిన కొర్రా కిరణ్ సాయికుమార్తో కలసి గుర్రాయి గెడ్డలో ఈతకొట్టడానికి గురువారం సాయంత్రం ఓ ఆటో వెళ్లాడు. ఇద్దరు బయట ఉండగా, నలుగురు గెడ్డలో దిగి ఈతకొడుతూ పెద్ద పనుకుపై నుంచి జాలువారే నీటి ప్రవాహంలో జారుతూ సరదాగా గడిపారు. ఆ సమయంలో వరప్రసాద్ గెడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయి అక్కడున్న ఊబిలో కూరుకుపోయాడు. వరప్రసాద్ కోసం గెడ్డలో చాలా సమయం గాలించినా కనిపించలేదని స్నేహితులు తెలిపారు. సమాచారం తెలిసిన తండ్రి సత్తిబాబు, కుటుంబ సభ్యులు గెడ్డ వద్దకు వెళ్లి గాలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది. పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు వెళ్లి ప్రమాదానికి గురైన బీటెక్ విద్యార్థి ఈతకోసం వెళ్లి గెడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలుడు పెదబయలు, జి.మాడుగుల మండలాల్లో ఘటనలు -
పీఎం జన్మన్నుసద్వినియోగం చేసుకోవాలి
● 20 సూత్రాల పథకం చైర్మన్ దినకర్ అరకులోయటౌన్: పీఎం జన్మన్ను సద్వినియోగం చేసుకోవాలని 20 సూత్రాల పథకం చైర్మన్ లంక దినకర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం అనంతగిరి మండలంలోని పైనంపాడు, కాకరపాడు గ్రామాల్లో పర్యటించిన ఆయన సాయంత్రం అరకులోయ మండలంలోని శిమిలిగుడలో పర్యటించి, పీఎం జన్మన్ గృహాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన గిరిజనుల స్థితిగతులు, సమస్యలను గుర్తించేందుకే పీవీటీజీ గ్రామాల్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. జన్మన్ గృహ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. పీఎం జన్మన్ పథకంలో తాగునీరు, రోడ్లు, విద్యుత్, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల చేతివృత్తుల వారికి శిక్షణ ఇచ్చి, పనిముట్లు, రుణాలు అందిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలను శుక్రవారం పాడేరులో కలెక్టర్తో జరిగే సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ తేజ, అరకులోయ తహసీల్దార్ ఎం.వి.వి.ప్రసాద్, ఎంపీడీవో అడపా లవరాజు, ఎంపీటీసీ లక్ష్మి, హౌసింగ్ ఏఈ కాంతి, ఆర్ఐ బలరామ్, వీఆర్వో ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. -
సీలేరు, అడ్డతీగలలో ర్యాలీ నిర్వహిస్తున్న గ్రామస్తులు
అరకులోయ టౌన్/చింతూరు/కొయ్యూరు/పాడేరురూరల్/సీలేరు/అడ్డతీగల: జమ్మూకాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు డాడులు జరిపి వారి ప్రాణాలు తీసుకోవడం హేయమైన చర్యని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. గురువారం ఉగ్రదాడికి నిరసనగా అరకులోయ ప్రధాన కూడలిలో కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన చేశారు. జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగంతో పాటు జిల్లా వ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ పర్యాటకులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన ముష్కర ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. -
ఆహ్వానించి అవమానపరిచారు
రాజవొమ్మంగి: జల్జీవన్ మిషన్ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించి అవమానపరచారని, మండలంలోని వాతంగి పంచాయతీ సర్పంచ్ భీంరెడ్డి శుభలక్ష్మి వాపోయారు. వాతంగి పంచాయతీ పెదగర్రంగిలో రూ.14 లక్షలతో చేపట్టనున్న జేజేఎం పథకం పనులను ఎమ్మెల్యే శిరిషాదేవి శంకుస్థాపన చేశారు. కాగా ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం 4 గంటలకు హాజరుకావాలని సర్పంచ్, వైస్ ఎంపీపీలను అధికారులు ఆహ్వానించారు. ఆ గ్రామానికి మేము 3.30 నిమిషాలకే వెళ్లామని, అయితే అప్పటికే అధికారులు, ఎమ్మెల్యే కార్యక్రమాలు ముగించుకొని వెళ్లిపోయారని సర్పంచ్ శుభలక్ష్మి, వైస్ ఎంపీపీ రాజేశ్వరి విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఆహ్వానించి, తమను కించపరిచారన్నారు. దీనిపై కలెక్టర్ దినేష్కుమార్కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
మోదకొండమ్మ తల్లి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
పాడేరు : గిరిజనుల ఇలవేల్పు, ఉత్తరాంధ్ర ప్రజల ఆర్యాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను మే 11,12,13 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పాడేరు ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్ మత్య్సరాస విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు. స్థానిక మోదకొండమ్మ తల్లి ఆలయంలో ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో ఉత్సవాల పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గతంలో కన్నా ఎంతో భిన్నంగా అన్ని వర్గాల ప్రజలు, భక్తులను కలుపుకొని ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు కొట్టగుళ్లి సుబ్బారావు, చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్, ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలం నాయుడు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కూడా సురేష్కుమార్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, సూర్యనారాయణ, కేజీయారాణి, రత్నబాయ్, ప్రశాంత్, మాజీ మంత్రి మత్య్సరాస మణికుమారి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.14 ఏళ్లుగా పరారీలో ఉన్న గంజాయి నిందితుడు అరెస్ట్ నాతవరం: కోర్టు వాయిదాలకు రాకుండా 14 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న గంజాయి నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశామని నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ తెలిపారు. గురువారం నాతవరం ఎస్ఐ సిహెచ్.భీమరాజుతో కలిసి ఆమె మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా మీనంబలంపురం గ్రామానికి చెందిన పంగలి దేవన్ గంజాయి రవాణా చేస్తుండగా నాతవరం పోలీసులకు 2011లో పట్టుబడ్డాడన్నారు. ఆయన నుంచి 450 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని అప్పట్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన ఆయన అప్పటి నుంచి వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. నిందితుడి ఆచూకీ కోసం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేక దృిష్టి సారించారన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్టాల సరిహద్దులో సంచరిస్తున్న నిందితుడిని కేడీ పేట ఏఎస్ఐ వై.వెంకటరావు, నాతవరం పోలీసు కానిస్టేబుల్ కె.లోవరాజు ఈ నెల 23న చాకచాక్యంగా పట్టుకున్నారన్నారు. గురువారం అరెస్ట్ చేసి కోర్డుకు తరలించామన్నారు. ఎళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతున్న దేవన్ను పట్టుకున్న వెంకటరావు, లోవరాజులను ఎస్పీ తుహిన్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారని సీఐ తెలిపారు. -
ఏయూలో శతాబ్ది ఉత్సవాల జోష్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాల జోష్ కనిపిస్తోంది. ఈ నెల 26న వర్సిటీ వందో ఏట అడుగుపెట్టనున్న సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందులో భాగంగా వర్సిటీ పరిపాలన భవనాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో క్యాంపస్లో శతాబ్ది ఉత్సవాల శోభ వెల్లివిరుస్తోంది. ఈ వేడుకల కోసం క్యాంపస్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. గురువారం సాయంత్రం కాలేజీ విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులందరూ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలనే సందేశాన్ని ఇస్తూ.. నృత్యాలతో అలరించారు. -
అందరికీ నచ్చేలా ‘సారంగపాణి జాతకం’
డాబాగార్డెన్స్: ‘సారంగపాణి జాతకం’లో తాను చేసిన పాత్ర, ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని హీరో ప్రియదర్శి తెలిపారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ గురువారం నగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా జగదాంబ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడారు. తాను నటించిన మల్లేశం, బలగం, కోర్ట్ సినిమా తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే సారంగపాణి జాతకం అన్నారు. ఇంద్రగంటితో ఒక ఫొటో దిగితే చాలనుకునే వాడినని.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం కోసం ఇంద్రగంటే ఎక్కువ కష్టపడ్డారన్నారు. ఈ సినిమాలో ఆంధ్ర యాసలో డైలాగ్లు చెప్పినట్లు వివరించారు. హీరోయిన్ మాట్లాడుతూ అందర్నీ ఈ సినిమా ఆకట్టుకుంటుందన్నారు. ఆద్యంతం హాస్యంతో పాటు ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. అష్టాచమ్మా చిత్రం విశాఖలో షూటింగ్ చేసి.. నానీని హీరోగా పరిచయం చేిసినట్లు చెప్పారు. మంచి కథతో అందరూ ఇష్టపడే హాస్యంతో రూపొందించిన ఈ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. హీరో ప్రియదర్శి -
జాతరలో ముమ్మర ఏర్పాట్లు
చింతపల్లి: చింతపల్లిలో ముత్యాలమ్మతల్లి జాతర సందర్భంగా ముమ్మర ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి అమ్మవారి వేడుకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా స్థానిక ఆర్అండ్బీ కార్యాలయం ప్రాంగణంలో వైద్యశాఖ, ఐసిడిఎస్,గిరిజన సహకార సంస్థ,వ్యవసాయ,ఉద్యాన శాఖలు,పశుసంవర్ధక, ఉపాధి హామీ పథకం, వెలుగు, మరియు పంచాయితీ అద్వర్యంలో విద్యుత్ వ్యర్థాల సేకరణ స్టాల్స్ను ఆయా శాఖలు అధికారులు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో ముత్యాలమ్మ జాతర సందర్భంగా నీటి సమస్య తలెత్తకుండా పలుచోట్ల తాగునీటి ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. పారిశుధ్య సమస్య తలెత్తకుండా 50 మంది అదనపు కార్మికులను ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. వాహనాల దారి మళ్లింపు ముత్యాలమ్మతల్లి జాతర సందర్భంగా మండల కేంద్రానికి చేరుకునే వాహనాలను దారి మళ్లించే విధంగా పోలీసు చర్యలు చేపట్టారు. చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఆదేశాల మేరకు సీఐ వినోద్బాబు ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి తెల్లవారుజాము వరకు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. చింతపల్లికి నర్సీపట్నం నుంచి వచ్చే వాహనాలను స్థానిక ఏపీఆర్ కళాశాల నుంచి జీకే వీధి, కేడి పేట నుంచి వచ్చే వాహనాలను జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద, పాడేరు జెర్రెల నుంచి వచ్చే వాహనాలను డిగ్రీ కళాశాల నుంచి దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ నాలుగు రోజుల పాటు చింతపల్లి ప్రాంతమంతా పోలీసు బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు సీఐ వినోద్బాబు తెలిపారు. -
విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
పాడేరు : గిరిజన విద్యార్థులు తమ ప్రాథమిక విద్య దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకొని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అన్నారు. పది ఫలితాల్లో సూపర్ ఫిప్టీ ద్వారా ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచారని ఆయన ప్రశంసించారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో సూపర్ ఫిప్టీ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులతో విజయోత్సవ సభ నిర్వహించారు. సూపర్ ఫిప్టీ ద్వారా గిరిజన విద్యార్థుల ప్రగతికి గత ఐటీడీఏ పీవో అభిషేక్ బాటలు వేశారని, దాన్ని తాము కూడా కొనసాగిస్తామన్నారు. సూపర్ ఫిప్టీ విద్యార్థులకు ఐటీడీఏ అండగా ఉంటుందన్నారు. కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ప్రవేశ పరీక్షలు రాసి సీట్లు సంపాదించుకోవాలన్నారు. బాలికలు తమ చదువులను పూర్తి చేసుకొని స్థిరపడేంత వరకు వివాహాలు చేసుకోవద్దని సూచించారు. సూపర్ పిప్టీ బ్యాచ్ విజయవంతం కావటానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, సూపర్ పిప్టీ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులను ఆయన శాలువలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ వెంకటేశ్వరరావు, రజనీ, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
తోటలో తమిళనాడు వాసి మృతి
రోలుగుంట: తమిళనాడు రాష్ట్రం నుంచి కనగరాజ్ రమేష్(42) వడ్డిప నుంచి అర్ల వెళ్లే అడవి మార్గంలోని ఓ ఊప్లిస్ తోటలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి గురువారం వెళ్లి పరిశీలించారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు మేనల్లుడు దయానిధి మండలంలో బొప్పన గ్లోబల్ అండ్ సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. దీంతో తనకు కూడా డ్రైవర్ జాబ్ చూడమని చెప్పి దయానిధి వద్దకు రమేష్ వచ్చాడు. ఆరోగ్యం సరిగా ఉండడం లేదని, వెనక్కి వెళ్లిపోవాలని చెప్పి మృతుడికి దయానిధి కొంత డబ్బు ఇచ్చాడని ఎస్ఐ తెలిపారు. ఆ డబ్బులతో కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలోనే పూటుగా మద్యం తాగుతూ తిరిగాడని, దీనికి తోడు సరైన ఆహారం అందకపోవడంతో తోటలో చనిపోయినట్టు భావిస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనకాపల్లి నుంచి క్లూస్ టీంను రప్పించి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. -
గంజాయి వినియోగంతో సమాజానికి చేటు
సాక్షి,పాడేరు: గంజాయి వినియోగంతో సమాజానికి చేటు అని, గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైన ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గంజాయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటల సాగుపై పలు శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గంజాయి తగ్గుముఖం పట్టిందన్నారు.గంజాయి సాగు చేసే రైతులు, రవాణాదారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి సాగు విడిచిపెట్టిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సాగు, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, బ్యాంకుల రుణాలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. 15వేల ఎకరాల్లో నీడతోటలు, పండ్ల మొక్కలు పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి సాగు, రవాణా చేస్తే స్థిరచరాస్తుల జప్తు జిల్లా ఎస్పీ అమిత్బర్ధర్ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా చేసినా వారి స్థిర, చరాస్తులు జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గంజాయి స్మగ్లర్లను గిరిజన గ్రామాల్లో ఆశ్రయం కల్పించడం నేరమన్నారు. జిల్లా వ్యాప్తంగా 221 గ్రామాల్లో గంజాయి సాగు నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఒక్క మార్చి నెలలోనే 782 కిలోల గంజాయిని పట్టుకుని 9మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు గంజాయి నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లును విడుదల చేశారు. జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, పాడేరు, రంపచోడవరం సబ్కలెక్టర్లు సౌర్యమన్ పటేల్, కల్పశ్రీ, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన అధికారులు నందు, రమేష్కుమార్రావు, డీఈవో బ్రహ్మజీరావు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం
డుంబ్రిగుడ/చింతపల్లి/ జీకే వీధి/రంపచోడవరం/గంగవరం : జిల్లాలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ పంచాయతీల ప్రక్షాళనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా పీవీటీజీలకు అందజేస్తున్న గృహల నిర్మాణాలకు మండలంలోని అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శిలు సహకారించాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టం ద్వారానే గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, దాని ద్వారానే నేడు పల్లెలో వెలుగులు చూడగలుగుతున్నామన్నారు. అరకులో జరిగి కార్యక్రమంలో సర్పంచ్ గగ్గుడు శారద ఆధ్వర్యంలో గృహ లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. డుంబ్రిగుడలో జెడ్పీటీసీ చటారి జానకమ్మ, ఎంపీపీ బాకా ఈశ్వరి, ఎంపీడీవో ప్రేమ్సాగర్, వైఎస్ ఎంపీపీ శెట్టి ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు. చింతపల్లిలో ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు, వైస్ ఎంపీపీ శారద, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈవో ప్రసాద్, పిఆర్ జెఇ బాలకిషోర్, గూడెంకొత్తవీధిలో దామనాపల్లి సర్పంచ్ కుందరి రామకృష్ణ, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ పాపారావు పాల్గొన్నారు. గంగవరంలోని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, ఎంపీడీవో వై.లక్ష్మిణరావు , సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పాల్గొన్నారు. రంపచోవరంలో సమీర్, చందు, రామకృష్ణ, సన్నీ, రవి, తేజ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
మమ్మేలు..ముత్యాలమ్మా
చింతపల్లి: మన్యం ప్రజల ఆరాధ్యదేవత చింతపల్లి ముత్యాలమ్మతల్లి జాతర గురువారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలో పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర తరువాత జరిగే అతి పెద్ద రెండవ జాతర చింతపల్లి ముత్యాలమ్మతల్లి ఉత్సవమే. మన్యం వాసులుకోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం ముత్యాలమ్మ తల్లి జాతర గురువారం ప్రారంభమై ఆదివారం వరకు జరుగుతుంది. ఏటా గంధం అమావాస్య రోజున జరిగే పండగ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ముత్యాలమ్మ జాతరకు సుదీర్ఘ చరిత్ర ఉంది. మొదట్లో అమావాస్య రోజున ముత్యాలమ్మ తల్లి పండగను డప్పుల పండగగా ఒక్క రోజు నిర్వహించేవారు.అనంతరం 1990వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవాలను నాలుగు రోజులు పాటు చేయడం ప్రారంభించారు. ● 25వ తేదీ శుక్రవారం అమ్మవారి పూజారులు (సుర్ల వంశస్తులు) ఇంటినుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం,ఇత్తడి పాదాలను, గరగలను ఊరేగింపుగా అమ్మవారి సతకం పట్టువరకూ తీసుకువచ్చి తొలిరోజు కొలువు దీరుస్తారు. ● 26వ తేదీ శనివారం రోజున రాత్రి సతకం పట్టువద్ద కొలువు దీరిన అమ్మవారిని చింతపల్లిలో గల అన్ని వీధుల్లో ఊరేగింపు నిర్వహించి, జాగార కార్యక్రమం చేపట్టి, అమ్మవారిని పూజారులు ఇంటికి చేరుస్తారు. ● 27వతేదీ ఆదివారం చివరి రోజున పెద్ద పండగ సందర్భంగా పూజారుల ఇంటినుంచి అమ్మవారి ఉత్పవ విగ్రహాన్ని, ఘటాలను భారీ ఊరేగింపుతో ఆలయం వరకూ తీసుకురావడంతో పండగ ముగుస్తుంది. ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ అలంకరణ ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా ఈ ఏడాది విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు.సాయిబాబా ఆలయం నుంచి జిల్లా పరిషత్ అతిథి గృహం వరకూ,మూడు రోడ్ల జంక్షన్ నుంచి సంతబయలుతో పాటు మండల కేంద్రంలోని వీధుల్లోను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేకంగా మూడు రోడ్లు జంక్షన్,కోర్టు,రంగా సెంటర్,పాత బస్ స్టాండుతో పాటు అమ్మవారి ఆలయం,వద్ద భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మందు గుండు సామగ్రిని పెద్ద ఎత్తున కాల్చనున్నారు.బస్ స్టాండులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షన గా నిలిచింది. ఉత్సవాల్లో ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో మూడు వందల మందితో భారీ బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
షర్మిలకు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సత్కారం
సాక్షి,పాడేరు: పాడేరులోని అక్షర ప్రైవేట్ స్కూల్కు చెందిన జనపరెడ్డి షర్మిల 580 మార్కులతో జిల్లాలో నాల్గవ స్థానంలో నిలవడంతో పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అభినందించారు.తన క్యాంపు కార్యాలయంలో షర్మిలకు దుశ్శాలువా కప్పి సత్కరించారు.అక్షర పాఠశాల యాజమాన్యంతో పాటు విద్యార్థిని తండ్రి జనపరెడ్డి శ్రీనులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో డి.గొందూరు సర్పంచ్ సీదరి రాంబాబు,వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్,ఎస్టీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణలు పాల్గొన్నారు. -
180 కిలోల గంజాయి స్వాధీనం
చింతపల్లి: మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 115 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. సబ్డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. మండలంలోని అన్నవరం పోలీసులు రోజువారీ తనిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం లోతుగెడ్డ వంతెన వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సమయంలో వచ్చిన ఒక ఆటోను తనిఖీ చేసి, మూడు బస్తాలతో గంజాయిని తరలిస్తున్నట్టు గురించినట్టు ఏఎస్పీ తెలిపారు. ఈ గంజాయి ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా రోల్లగెడ్డ గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్సరిహద్దు బలపం మీదుగా పాడేరు తరలిస్తున్నారన్నారు. బెంగళూరుకి చెందిన వ్యక్తికి అప్పగించడానికి ఒప్పందం కుదుర్చుకుని ఒక ఆటోతో పాటు బైక్తో తరలిస్తున్నట్టు తెలిపారు. గంజాయి తరలింపులో కుడుమసారి పంచాయితీ కోటగున్నలు గ్రామానికి చెందిన వారున్నారు. దీని విలువ రూ.5.5 లక్షలు విలువ ఉంటుందని తెలిపారు.గంజాయిని తరలిస్తున్న ఆటో,బైక్తో పాటు రెండు సెల్ఫోన్లును సీజ్ చేసినట్టు చెప్పారు. అరెస్టు చేసిన నలుగురిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. గంజాయిని పట్టుకున్న ఎస్ఐ వీరబాబును అభినందించారు.ఈ కార్యక్రమంలో సీఐ వినోద్బాబు తదితరులు ఉన్నారు. పెదబయలు: మండలంలోని సీతగుంట పంచాయతీ సమీపంలోని ఏవోబీ వంతెన వద్ద బుధవారం వాహన తనిఖీలు చేస్తుండగా 65 కిలోల గంజాయి పట్టుకున్నట్టు ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు. మల్కర్గిరి జిల్లా చిత్తరకొండ ప్రాంతం నుంచి రూడకోట మీదుగా ఒడిశా పాడువకు వెళ్తున్న ఆటోను తనిఖీ చేయగా గంజాయి లభ్యమైనట్టు చెప్పారు. గంజాయి తరలిస్తున్న కొరాపుట్టు జిల్లా నందపూర్ బ్లాక్ మర్రిపాలెం గ్రామానికి చెందిన లబో కిడంగ్, అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం బురిడి అర్జున్ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 2.50లక్షలు ఉంటుందని తెలిపారు. -
నేటి నుంచి చందనోత్సవం టికెట్ల విక్రయం
ఆన్లైన్లో కూడా అందుబాటులో... సింహాచలం: ఈనెల 30న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి రూ.300, రూ.1000 దర్శన టికెట్ల విక్రయాలు గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. సింహాచలం కొండపైన దేవస్థానం పాత పీఆర్వో కార్యాలయం వద్ద, నగరంలోని పలు బ్యాంకుల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకుని ఆధార్ నెంబరుతో పూర్తిచేసి టికెట్లు నేరుగా పొందవచ్చన్నారు. సింహాచలంలోని యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ల్లోను, అక్కయ్యపాలెం, కేజీహెచ్, మహారాణిపేటలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ల్లో టికెట్లు లభిస్తాయని తెలిపారు. అలాగే బిర్లా జంక్షన్, సాలిగ్రామపురం(అక్కయ్యపాలెం) ఎస్బీఐ బ్రాంచ్ల్లో టికెట్లు లభిస్తాయని పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ వరకు మాత్రమే టికెట్లు విక్రయాలు జరుగుతాయన్నారు. చందనోత్సవం రోజు ఎలాంటి దర్శన టికెట్ల విక్రయాలు జరగవని పేర్కొన్నారు. ఈనెల 24వ తేదీ ఉదయం 7 నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు www. aptemples.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా టికెట్లు పొందవచ్చని తెలిపారు. -
త్వరితగతిన అర్జీల పరిష్కారం
కలెక్టర్ దినేష్కుమార్చింతూరు: మారుమూల గ్రామాలకు సంబంధించిన ప్రజలు అందించిన వ్యక్తిగత దరఖాస్తులను ఆయాశాఖల అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ పీవో అపూర్వభరత్తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ వివిధ శాఖలకు సంబంధించి 146 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఆర్అండ్ఆర్ సమస్యలకు 67 దరఖాస్తులు వచ్చినట్టు ఆయన తెలిపారు. వీటిని ఆయా శాఖల అధికారులు పరిశీలించి అర్హతలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు పోలవరం ముంపు, వలస ఆదివాసీ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీలు బుధవారం చింతూరు ఐటీడీఏ ఎదుట ఆందోళనలు చేపట్టారు. వీఆర్ పురం మండలం అన్నవరం గ్రామాన్ని 41.15 కాంటూరులో చేర్చి పోలవరం పరిహారం అందచేయాలని నినాదాలు చేస్తూ గ్రామస్తులు ఐటీడీఏ ఎదుట బైఠాయించారు. అనంతరం వారు కలెక్టర్ను కలసి ఏటా వరదలతో ఇబ్బందులు పడుతున్నామని తమ గ్రామాన్ని ముంపులో చేర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. చింతూరు డివిజన్లోని వలన ఆదివాసీ గ్రామాల్లో విద్యుత్, రహదారి, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో వలస ఆదివాసీలు ఆందోళన నిర్వహించారు. గత 30 ఏళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, నేటికీ తమ గ్రామాలకు రహదారి, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు కలెక్టర్ను కలసి వినతిపత్రం అందజేశారు.విద్యుత్ సౌకర్యం కల్పించాలి గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రిపూట చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నాం. విషసర్పాలు గ్రామంలోకి వస్తుండడంతో భయంతో గడపాల్సి వస్తోంది. అధికారులు స్పందించి మా గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలి. – కొవ్వాసి కోసమ్మ, బలిమెల గ్రామం, చింతూరు మండలం రహదారి సౌకర్యం లేకఇబ్బందులు గత 30 ఏళ్లుగా ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడతున్నాం. వర్షాకాలు అత్యవసర సమయాల్లో సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులున్నాయి. – పొడియం జోగారావు, సోడేరుపాడు, వీఆర్పురం మండలం -
ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్
రాజవొమ్మంగి: ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని ప్రకటించాలని ఆదివాసీ గిరిజన సంఘం , ఆదివాసీ జేఏసీ గిరిజన నిరుద్యోగులు , ఆదివాసీ ప్రజాప్రతినిధులు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించి, కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం తక్షణం ఏజెన్సీ డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తు నినాదాలు చేశారు. నూరు శాతం ఉద్యోగాలు ఆదివాసీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తు బుధవారం జరుగాల్సిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తు సభను బహిష్కరించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు. ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ గిరిజన సంఘం, పీసా కమిటీ సభ్యులు వంతు బాలకృష్ణ, తాము సూరిబాబు, వజ్రపు అప్పారావు, కోండ్ల సూరిబాబు, రామకృష్ణ, ప్రసాద్, తెడ్ల రాంబాబు, పెద్దిరాజు, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వీరికి సభకు హాజరైన ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి, సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఆందోళన కారులకు మద్దతు ప్రకటించి సభ నుంచి బయటకు వచ్చేశారు. -
26 నుంచి ఏయూ శతాబ్ది ఉత్సవాలు
విశాఖ సిటీ : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 26న ప్రారంభం కానున్నాయని ఏయూ ఉపకులపతి ప్రొ.రాజశేఖర్ తెలిపారు. అకడమిక్ సెనేట్ మందిరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వందేళ్ల ఉత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలి రోజు ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకూ శతాబ్ది వాక్థాన్తో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయని తెలిపారు. ఉదయం 9 గంటలకు ఏయూ పరిపాలన భవనం వద్ద బెలూన్ లాంచింగ్ అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రధాన వేడుకలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.మధుమూర్తి, ఐఐటీ పాలక్కడ్ డైరెక్టర్ ప్రొ.శేషాద్రి శేఖర్ అతిథులుగా హాజరవుతారన్నారు. ఇందులో భాగంగా విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఏడాది పొడవునా విభిన్న కార్యక్రమాలతో నిర్వహించే శతాబ్ది ఉత్సవాల వార్షిక క్యాలెండర్ను కూడా ఆవిష్కరిస్తామన్నారు. విశ్వవిద్యాలయంలో నూతన భవనాలు, సెంట్రల్ ల్యాబ్ ఫెసిలిటీ, పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన జ్ఞాపికగా ప్రత్యేక ఐకానిక్ టవర్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. -
ఉగ్రదాడికి నిరసనగా శాంతి ప్రదర్శన
పాడేరు: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు అతి కిరాతంగా దాడులు జరిపి, వారి ప్రాణాలను బలిగొనడం అత్యంత హేయమైన చర్య అని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణి, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. ఉగ్రవాదుల దాడులకు నిరసనగా, మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ బుధవారం సాయంత్రం పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించారు. భారత్ మాతాకీ జై, భారత పౌరులపై ఉగ్రవాదుల దాడులను ఖండిద్దాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీ తనుజారాణి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో భారత పౌరులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రక్షణ రంగానికి అధిక మొత్తంలో నిధులను కేటాయించి భారత సైన్యాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, జీకే వీధి జెడ్పీటీసీ కిముడు శివరత్నం, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్, వైఎస్సార్సీపీ వైద్య విభాగం జోనల్ ఇన్చార్జి నర్సింగరావు, జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వత మ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, పార్టీ మండల అధ్యక్షులు సీదరి రాంబాబు, నుర్మాని మత్య్సకొండంనాయుడు, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు ఊర్వశీరాణి, అధిక సంఖ్యలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్సార్సీపీ శ్రేణులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
సూపర్ ఫిప్టీలో నూరుశాతం పాస్
సాక్షి,పాడేరు: పాడేరు ఐటీడీఏ పరిధిలోని వివిధ పాఠశాలల్లో బాగా చదివిన 50 మంది టెన్త్ విద్యార్థులకు రెండు పాఠశాలల్లో సూపర్ ఫిప్టీ పేరిట ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ పొందిన విద్యార్థినీవిద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. చదువులో ప్రతిభ కనబరిచిన 28 మంది గిరిజన బాలికలకు గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోను, 22మంది గిరిజన బాలురకు దిగుమోదాపుట్టు ఆశ్రమ పాఠశాలలోను సూపర్ ఫిప్టీ పేరుతో పాడేరు ఐటీడీఏ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. శిక్షణ పొందిన విద్యార్థులు గత ఏడాది వలే ఈసారి కూడా 50మందికి 50మంది ఉత్తీర్ణులయ్యారు.49 మంది ప్రథమ శ్రేణిలోను,ఒక్కరు ద్వితీయ శ్రేణిలోను పాస్ అయ్యారు. బాలికలు ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించారు. కొంటా భవానీ 577 మార్కులతో సూపర్ ఫిప్టీలో ప్రథమ స్థానంలో నిలిచింది. చంపా పావని 567, గబ్బాడ ఈశ్వరమ్మ 566, కిల్లో అరుణ 565, జనపరెడ్డి రేవతి 558, ఎస్.త్రినాథ్ 569, జి.మణికంఠ 550, జి.చరణ్ 535 మార్కులు సాధించారు. కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్కు 34 మంది ఎంపిక సూపర్ ఫిప్టీలో పాస్ అయిన 50 మంది విద్యార్థుల్లో 34 మంది కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఇంటర్ చదువుకు ఎంపికయ్యారని జేసీ, ఇన్చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్గౌడ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన 19 మంది బాలికలు మారికవలస, విసన్నపేట, 15 మంది బాలురు జోగంపేట కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ప్రవేశాలు పొందుతారని ఆయన తెలిపారు. అలాగే సూపర్ 50లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉత్తమ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన గుత్తులపుట్టు హెచ్ఎం సింహాచల, ఇతర ఉపాధ్యాయులకు పీవో అభినందనలు తెలిపారు. -
అ
ట్టడుగునల్లూరి2025 48 %టెన్త్ విద్యార్థులు ● టెన్త్లో దారుణంగా ఫలితాలు ● గత ఏడాది 90.95 శాతంతో 9వ స్థానం ● ఈ ఏడాది 48 శాతంతో రాష్ట్రంలోనే చివరిస్థానం ● సగానికి తగ్గిన ఉత్తీర్ణత ● 11,472 మందికి 5,465 మంది మాత్రమే పాస్ ● 6007 మంది ఫెయిల్ ● ఉత్తీర్ణులైన వారిలో బాలికలే అధికం ● దిగజారిన ఫలితాలతో తల్లిదండ్రుల ఆవేదనసాక్షి,పాడేరు: జిల్లాలో టెన్త్ ఫలితాలు దారుణంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశ కలిగించింది. గత ఏడాది కంటే ఫలితాలు సగానికి తగ్గాయి. 48 శాతంతో రాష్ట్రంలో చిట్టచివరి 26 స్థానంలో జిల్లా నిలిచింది. దీంతో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఉసూరుమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 258 అన్ని యాజమాన్య పాఠశాలల పరిధిలో 11,472 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా, కేవలం 5,465 మంది మాత్రమే పాసై 48 శాతం ఉత్తీర్ణత సాధించారు. 6007మంది విదార్థులు ఫెయిలయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో బాలికలే అధికంగా ఉన్నారు. 5,292 మంది బాలురకు 2,330 మంది పాస్ అయ్యారు. 6,180 మంది బాలికలకు 3,135 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 10,823 మంది పరీక్షలు రాయగా, 9,843 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.95 శాతం ఫలితాలతో రాష్ట్రంలో 9వ స్థానంలో జిల్లా నిలిచింది. ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో ఆఖరు స్థానంలో ఉండడం ఆందోళన కలిగించింది. పలు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు,ఆశ్రమ పాఠశాలలు, గుత్తులపుట్టులోని సూపర్ ఫిప్టీ,ఇతర ప్రైవేట్ పాఠశాలల్లో టెన్త్ ఫలితాలు కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లా టాపర్ ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని 590 మార్కులతో కూనవరం మండలం టేకులబోరు మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన అరవ మాధవి మొదటి స్థానంలో నిలవగా, నెల్లిపాక జెడ్పీ హైస్కూల్కు చెందిన కాదులూరి లాస్యంత్ 582 మార్కులతో 2వస్థానం, పాడేరులోని అక్షర పాఠశాలకు చెందిన శెట్టి నవదీపిక 580మార్కులతో 3వస్థానం, ఇదే పాఠశాలకు చెందిన జనపరెడ్డి షర్మిల 580 మార్కులతో 4వస్థానం, చింతపల్లి సెయింట్ ఆన్స్ ఇంగ్లిషు మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బి.జానకీరామరాజు 578 మార్కులతో 5వస్థానం, గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాల సూపర్ ఫిప్టీ విద్యార్థిని కొట్నా గంగాభవాని 577మార్కులతో 6వస్థానం, అడ్డతీగల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన యట్ల ప్రవీణ్కుమార్రెడ్డి 576మార్కులతో 7వస్థానం, పాడేరులోని మోదమాంబ ప్రైవేట్ పాఠశాలకు చెందిన రాంశెట్టి మధుబాబు 576మార్కులతో 8వస్థానం, ఇదే పాఠశాలకు చెందిన కిముడు లక్ష్మీప్రసన్న 574 మార్కులతో 9వస్థానం, రంపచోడవరం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన చింతకాయల దుర్గాభవానీ 571 మార్కులతో 10వ స్థానంలో నిలిచారు. టాప్ టెన్లో నిలిచిన విద్యార్థులతో పాటు టెన్త్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరినీ కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్, డీఈవో పి.బ్రహ్మాజీరావు,ఇతర అధికారులు అభినందించారు.2024 90.95 %ఐదు పాఠశాలల్లోసున్నా ఫలితాలు.. సాక్షి,పాడేరు: జిల్లాలో ఐదు పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ పాస్ కాలేదు. జీకే వీధి మండలంలోని దారకొండ, జర్రెల, అప్పర్ సీలేరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, డుంబ్రిగుడ కేజీబీవీ, మాచ్ఖండ్ ప్రాజెక్ట్స్ సంగడ హైస్కూల్లో ఒక్కరు కూడా పాస్ కాకపోవడంతో సున్న ఫలితాలు వచ్చాయి. 2023 61.41 %అత్యల్ప ఫలితాలు..జిల్లాలో పలు పాఠశాలలు అత్యల్ప ఫలితాలతో చతికిలపడ్డాయి. నాలుగు పాఠశాల్లో ఒక్కొక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. జి.మాడుగుల మండలం బందవీధి ఆశ్రమ పాఠశాలలో 66 మందికి 65 మందీ ఫెయిల్ అయ్యారు జీకే వీధి మండలంలోని పెదవలస ఆశ్రమ పాఠశాలలో 31 మందికి 30 మంది, గూడెం ఆశ్రమ పాఠశాలలో 35 మందికి 34, అరకులోయ మండలం బస్కిలో 25 మందికి 24, జి.మాడుగుల మండలం నుర్మతిలో 38 మందికి 36, జి.మాడుగుల కేజీబీవీలో 37 మందికి 35, అనంతగిరి మండలంలోని బొర్రా ఆశ్రమ పాఠశాలలో 43 మందికి 40,శివలింగపురంలో 42 మందికి 39, హుకుంపేట మండలంలోని జి.బొడ్డాపుట్టులో 29 మందికి 27, చింతపల్లి మండలంలోని లంబసింగి ఆశ్రమ పాఠశాలలో 42 మందికి 39 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. -
జిల్లా టాపర్లకు కలెక్టర్, పీవో అభినందన
కూనవరం/ఎటపాక: పదో తరగతి ఫలితాల్లో జిల్లా టాపర్లుగా నిలిచిన కూనవరం మండలం టేకులబోరు మాంటిస్సోరి ఉన్నత పాఠశాల విద్యార్థిని అరవా మాధవి, నెల్లిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కాదులూరి లాస్యంత్ను కలెక్టర్ దినేష్ కుమార్, చింతూరు ఐటీటీఏ పీవో అపూర్వభరత్ చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేసి, అభినందించారు. ఐఏఎస్ అవుతా... 590 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిన అరవా మాధవి తండ్రి అరవా రాము, తల్లి ధనలక్ష్మి గృహిణి. ఇద్దరూ కూలిపని చేసుకుంటూ తమ కుమార్తెను కష్టపడి చదివిస్తున్నారు. తల్లిద్రండుల కృషికి తగ్గట్టుగా మాధవి పదో తరగతిలో అత్యధిక మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. భవిష్యత్తులో ఏమి కావాలని కోరుకుంటున్నావని కలెక్టర్ మాధవిని ప్రశ్నించగా తాను ఐఏఎస్ అవుతానని సమాధానం చెప్పింది. మెకానికల్ ఇంజినీర్ కావాలన్నది ధ్యేయం టెన్త్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 587 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిన మండలంలో లక్ష్మీపురం గ్రామానికి చెందిన నెల్లిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కాదులూరి లాస్యంత్ తల్లిదండ్రులు రామ్మోహనరావు,నాగేశ్వరి. టైలర్ వృత్తి చేస్తూ కుమారుడు, కుమార్తెను ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్నారు. కుమారుడు లాస్యంత్ నెల్లిపాక హైస్కూల్లో చదవుతుండగా, కుమార్తె హర్షిణి రేఖపల్లి కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. ట్రిపుల్ఐటీలో సీటు సాధించి మెకానికల్ ఇంజినీర్ కావాలనేది తన ధ్యేయమని లాస్యంత్ తెలిపాడు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను మంచి మార్కులు సాధించగలిగానని చెప్పాడు. పాఠశాల సెలవు రోజుల్లో తాము కుట్టుమిషన్ పనిచేస్తున్నప్పుడు మాకు సహాయంగా దుస్తులకు బటన్స్ వేయటం,ఇసీ్త్ర చేయడం తదితర పనులను లాస్యంత్ చేస్తుంటాడని తల్లిదండ్రులు తెలిపారు. -
65 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
అడ్డతీగల: మండలంలోని దుప్పులపాలెంలో ఓ ఇంటిలో నిల్వ ఉంచిన 65 బస్తాల (3,372 కిలోలు) ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని బుధవారం పట్టుకున్నట్టు తహసీల్దార్ కొమరం సూర్యారావు తెలిపారు. జీడి పిక్కలు కొనుగోలు చేసే దుప్పలపాలెంకి చెందిన ఒరిస్సై అనే ఓ వ్యాపారి ప్రజల వద్ద నుంచి భారీగా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి, రవాణాకు సిద్ధం చేసినట్టు సమాచారంరావడంతో దాడులు నిర్వహించినట్టు చెప్పారు. బియ్యం సీజ్ చేసి, ఆ వ్యాపారిపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. స్వాఽధీనం చేసుకున్న బియ్యాన్ని అడ్డతీగలలోని మండల స్టాక్ పాయింట్కి తరలించినట్టు చెప్పారు. పీడీఎస్ బియ్యాన్ని ఎవరైనా కొనుగోలు చేసినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. -
నిర్వాసితులందరికీ ఆర్అండ్ఆర్ పరిహారం
కలెక్టర్ దినేష్కుమార్చింతూరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. బుధవారం ఆయన చింతూరులో విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ముంపులో భాగంగా ఫేజ్–1బిలో చేర్చిన 32 గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు 24 గ్రామాల్లో గ్రామసభలు పూర్తయ్యాయని మరో ఎనిమిది గ్రామాల్లో ఈ నెలాఖరుకల్లా గ్రామసభలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. డ్రాఫ్ట్ అవార్డు పూర్తయిన తరువాత 32 గ్రామాలకు చెందిన 13,790 కుటుంబాలకు పరిహారం అందించడంతో పాటు పునరావాస కేంద్రాలకు తరలిస్తామని ఆయన చెప్పారు. గ్రామాల్లో స్థానికత కలిగి ఉన్న వ్యాపారాలు, కూలిపనులు, విద్య నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉంటే వారికి కూడా పరిహారం అందచేస్తామని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి కటాఫ్ తేదీకంటే ముందుగా వచ్చి స్థిరపడిన వారికి, ఉపాధి కోల్పోతున్న కుటుంబాలకు కూడా పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ తెలిపారు. మరో మూడు నెలల్లో నిర్వాసితులకు పునరావాసం కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ముంపు గ్రామాల అర్హుల జాబితాలను ఎప్పటికప్పుడు ఆయా గ్రామ సచివాలయాల నోటీసుబోర్డుల్లో ఉంచుతామని ఆయన తెలిపారు. చింతూరులో ఇళ్ల పరిహారం విషయంపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇచ్చే విషయంపై గత ప్రభుత్వం జీవో జారీచేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అభిషేక్, ఐటీడీఏ పీవో అపూర్వభరత్ పాల్గొన్నారు. -
చెక్డ్యాంలకు గ్రహణం
వర్షాకాలం ప్రారంభానికి ఇంకా రెండు నెలలే సమయం ఉంది. తొలకరి జల్లులను ఒడిసి పడితే సాగుకు నీరందుతుంది. కానీ చాలాచోట్ల చెక్డ్యాంలు దెబ్బతిన్నాయి. తూములు మరమ్మతులకు గురికావడంతో చుక్కనీరు లేకుండా పోతోంది. కొన్ని చెక్డ్యాంల మరమ్మతులకు అధికారులు అంచనాలు తయారు చేసి, ప్రతిపాదనలు పంపారు. అయితే పనుల్లో జాప్యం నెలకొంది. చింతపల్లి: గిరిజన రైతులకు మేలు చేయాలి.. పంటలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన చెక్డ్యాంలు ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. నిర్వహణ కరువై...ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో 321 చెక్డ్యాంలు దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు లేక నీరందడం లేదని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కాలువల్లో పూడిక తీత కూడా లేదని, దీనివల్ల నీరు సరిగా ప్రవహించడం లేదని వాపోతున్నారు. పాడేరు డివిజన్ పరిధిలో జలవనరుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వాటిపై స్పెషల్మైనర్ ఇరిగేషన్ ఇంజినీరింగ్ (ఎస్ఎంఐ) అధికారులు దృష్టిసారించకపోవడంతో చెక్డ్యామ్లు పూడుకుపోయాయి. దీంతో సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. వర్షాలు కురిసినప్పుడు కొండ గెడ్డలు,ఊటగెడ్డల ద్వారా చెక్ డ్యాంలు, చెరువులకు నీరు చేరుతుంది. వాటిలో నిల్వ ఉన్న నీటితో వందలాది ఎకరాల్లో రెండు పంటలు సాగు చేసేవారు. వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు,పూలు పండించేవారు. డివిజన్ పరిధిలో చాలా చెక్డ్యాంలు పూర్తిగా దెబ్బతినడంతో నీరంతా కొండ గెడ్డల్లో కలసిపోయి వృథాగా పోతోంది. రెండవ పంట పండించే పరిస్థితి లేకుండా పోయింది. నీరందక వందలాది ఎకరాలు బీడుగా మిగిలిపోయాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 321 చెక్డ్యామ్ల మరమ్మతులకు ఇటీవల అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటిలో 148 చెక్డ్యామ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయగా 104 పనులు సాగుతున్నాయి. చింతపల్లి సబ్ డివిజన్ ఎత్తివేతతో రైతులకు అవస్థలు చింతపల్లి కేంద్రంగా నీటిపారుదల శాఖ సబ్డివిజన్ కార్యకలాపాలు నిర్వహించేవారు. చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో చింతపల్లి,జీకే వీధి,కొయ్యూరు మండలాలు ఉండేవి. చెక్ డ్యాంలు,చెరువుల నిర్మాణం, నిర్వహణ తదితర కార్యకలాపాలను చింతపల్లి కేంద్రంగానే ఇంజినీరింగ్ అధికారులు నిర్వహించేవారు. ఈ శాఖ ద్వారానే మూడు మండలాల్లో మారుమూల గ్రామాల్లో పలు చెక్డ్యామ్లు నిర్మించారు. దీంతో గిరిజన రైతాంగానికి వ్యవసాయానికి తోడ్పాటునందించినట్టయింది.ఎన్నో వందలు ఎకరాల కొండభూములు,బీడుభూములు సాగులోకి వచ్చాయి. అయితే 2006 సంవత్సరంలో సబ్ డివిజన్ను ఎత్తివేసి, మైదాన ప్రాంతానికి తరలించారు. దీంతో ఈ ప్రాంత రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి.ఆ కార్యాలయ భవనాన్ని కొంతకాలం గిరిజన సంక్షేయ శాఖ కార్యాలయంగా ఉపయోగించారు.అనంతరం ఆ భవనం నిరుపయోగంగా ఉండడంతో శిథిలావస్థకు చేరుకుంది. దెబ్బతిన్న చెక్డ్యాంలకు మరమ్మతులు కరువు వృథాగా పోతున్న సాగునీరు దృష్టి సారించని స్పెషల్మైనర్ ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులు బీడువారిన వందలాది ఎకరాలు చెక్డ్యాంలకు మరమ్మతులు చేపట్టాలి చింతపల్లి మండంలోని పలు ప్రాంతాల్లో చెక్డ్యాంలు పూర్తిగా దెబ్బతినడంతో సాగు నీరు వృథాగా పోతోంది. పంటలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పాత చెక్డ్యాంలను బాగుచేయడంతో పాటు, కొత్తవాటిని నిర్మించాలి. – గెమ్మిలి అబ్బాయినాయుడు, గిరిజన రైతు,దిగువపాకలు గ్రామం 321 చెక్డ్యాంలు గుర్తింపు పాడేరు డివిజన్ పరిధిలో 321 చెక్డ్యాంలకు మరమ్మతులు చేయాలని గుర్తించాం. ఇప్పటికే కలెక్టర్ 148 చెక్డ్యాంల మరమ్మతులకు నిధులు మంజూరు చేశారు.వాటిలో 104 పనులు జరుగుతున్నాయి.మిగిలిన వాటికి ప్రతిపాదనలు పంపించాం.నిధులు మంజూరు అయితే పనులు ప్రారంభిస్తాం. – నాగేశ్వరరావు, డీఈ, స్పెషల్ మైనర్ ఇరిగేషన్,చింతపల్లి -
మెగా డీఎస్సీలో ఏజెన్సీ పోస్టులు మినహాయించాలి
సాక్షి, పాడేరు: మెగా డీఎస్సీలో ఏజెన్సీ పోస్టులను మినహాయించి ఈనెల 30వతేదీ నాటికి ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ప్రకటన చేయాలని, లేని పక్షంలో మన్యంలో నిరవధిక బంద్ చేపడతామని గిరిజన సంఘం జాతీయ సభ్యుడు పి.అప్పలనరస హెచ్చరించారు. గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక మోదకొండమ్మతల్లి ఆలయ సమావేశమందిరంలో ఆదివాసీ, ప్రజా సంఘాల అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ యువతకు అన్యాయం చేస్తోందన్నారు. గిరిజన సంక్షేమశాఖలో గల 881 పోస్టులకు గాను 42 ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే ఆదివాసీలకు కేటాయించడం అన్యాయమన్నారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించి, ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను నూరుశాతం గిరిజనులతోనే భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఈనెల 26న పాడేరులో జరిగే ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కంబిడి నీలకంఠం,డీఎల్వో కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.మాణిక్యం,బీటీఏ జిల్లా అధ్యక్షుడు వల్లా వెంకటరమణ,గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మానపడాల్,పలు సంఘాల నేతలు నాగేశ్వరరావు,రాజబాబు,జీవన్కృష్ణ,కాంతారావు తది తరులు పాల్గొన్నారు. లేని పక్షంలో నిరవధిక మన్యం బంద్ నిర్వహిస్తాం గిరిజన సంఘం జాతీయ సభ్యుడు అప్పలనర్స -
విస్తృతంగా వాహన తనిఖీలు
వై.రామవరం: సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో వై.రామవరం శివారులో లోతట్టు ప్రాంతానికి వెళ్లే ప్రధానరహదారిలో సీఐ బి.నరసింహా మూర్తి ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వై.రామవ రంలో జరిగిన సంతకు వచ్చివెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల్లో ప్రయాణిస్తున్న అపరిచితులు, అనుమానితులపై నిఘా పెట్టారు. రికార్డులు, డ్రైవింగు లైసెన్సులు సక్రమంగా లేని వాహనాలపై యజమానులపై కేసులు నమోదు చేశారు. -
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
పాడేరు రూరల్: హామీలు అమలు చేయడంలో కూట మి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గిరిజన సంఘ ం,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ నాయకులు ధ్వజమెత్తారు. ఆ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ నిరుద్యోగులు సోమవారం ఐటీడీఏ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరుద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు సోమవారం నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ఎన్నికల ముందు అరకులోయలో నిర్వ హించిన బహిరంగ సభలో ఆదివాసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబునాయుడు మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నంబర్3ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స మాట్లాడుతూ మోసం చేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించకుండా డీఎస్సీని ప్రకటించడం ఆదివాసీలకు తీవ్ర అన్యా యం చేయడమేనని చెప్పారు. తక్షణం జీవో నంబర్ 3ను పునరుద్ధరించి, ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ హామీలను అమలు చేయకుండా కూట మి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. గిరిజనులహక్కులు,చట్టాల జోలికివస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి,నిరుద్యోగ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆదివాసీ, ప్రజా సంఘాల నాయకుల ధ్వజం పాడేరు ఐటీడీఏ వద్ద నిరుద్యోగుల నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు -
దద్దరిల్లిన ఐటీడీఏ
1/70 చట్టం నిర్వీర్యం పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దీంతో గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. పెండింగ్లో ఉన్న ఎల్టీఆర్ కేసులను త్వరగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలన్నారు. ఐటీడీఏలో అవినీతి రాజ్యమేలుతోందని, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పాడేరు మెడికల్ కళాశాలలో భర్తీ చేస్తున్న 256 సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాల నియామకాల్లో గిరిజన నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరుగుతోందని, తక్షణమే పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటీఫికేషన్ జారీ చేయాలని, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజన నిరుద్యోగ అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యం బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, హెల్త్ వలంటీర్లను నియమించాలన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరారు. -
మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు అన్యాయం
జి.మాడుగుల/పాడేరు రూరల్: మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయుని పోస్టులను గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అంగనయిని ఆనంద్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347ఉపాధ్యాయుల పోస్టులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో గిరిజన అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.గిరిజన ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయుని పోస్టులో మెగా డిఎస్సీలో చేర్చటం దారుణమన్నారు. దీని వలన గిరిజన అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని, ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఉద్యోగం సాధించవచ్చని ఆశతో ఇప్పటి వరకు ఉన్నారని కూటమి ప్రభుత్వం నిరాశపరిచిందన్నారు. అరుకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు జీవో నంబర్ 3ని పునరుద్దరణ చేస్తానని, ప్రత్యేక డిఎస్సీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి తీరా అధికారం వచ్చాక మొండిచేయి చూపారని ఆయన మండిపడ్డారు. తక్షణమే గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయుని పోస్టులు గిరిజన అభ్యర్థులుతో భర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముంచంగిపుట్టు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఉస్సిలో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని గిరిజన సంఘం మండల కార్యదర్శి కె.నర్సయ్య అన్నారు.మండలంలో గల బంగారుమెట్ట పంచాయతీ మాలగుమ్మిలో సోమవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి నర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని విస్మరించడం దారుణమన్నారు.అల్లూరి జిల్లాలో ప్రకటించిన డీఎస్సిలో 400 పోస్టులలో ఎస్టీలకు కేవలం 24 పోస్టులే ఉండడం ఆదివాసీలకు నష్టం జరుగుతుందని,ఎంతో మంది గిరిజన నిరుద్యోగ యువతకు డిఎస్సిలో మోసం జరిగిందని,తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి స్పెషల్ డిఎస్సిను ప్రకటించాలని,లేని పక్షనా గిరిజన యువతతో ఆందోదన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. నాయకులు దేవన్న,నాగరాజు తదితరులు పాల్గోన్నారు. -
గరిష్ట స్థాయికి చేరుకుంటున్న డిమాండ్
ఉమ్మడి విశాఖ సర్కిల్(అనకాపల్లి, అల్లూరి జిల్లాలు)లో విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకనుగుణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకునేందుకు ఈపీడీసీఎల్ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి విశాఖ సర్కిల్ పరిధిలో సగటు వినియోగం 24 నుంచి 25 మిలియన్ యూనిట్లుగా ఉంది. ప్రస్తుతం 26 నుంచి 27 మిలియన్ యూనిట్లకు పైగా కరెంట్ ఖర్చవుతోంది. సరఫరాకు మించి వినియోగం ఉండటంతో అధికారులు లోటు భర్తీ చేసేందుకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనకాపల్లి జిల్లాల్లో లలితా త్రిపురసుందరీ ఫెర్రో అల్లాయిస్, అభిజిత్ ఫెర్రో అల్లాయిస్ వంటి భారీ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోవడంతో మూతపడ్డాయి. ఈ కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గింది లేదంటే.. 28 నుంచి 30 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
అరకులోయ టౌన్: అరకులోయ డిగ్రీ కళాశాలలో కోటి రూపాయలతో నిర్మించిన నూతన అదనపు భవనాన్ని సోమవారం గిరిజన సంక్షేమశాఖ,శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. మొదటగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.డిగ్రీ కళాశాల సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ప్రిన్సిపాల్ భరత్కుమార్ నాయక్ మంత్రిను కోరారు. దీనికి స్పందించిన మంత్రి పాత భవనాలకు మరమ్మతు చేస్తామని, లేనిపక్షంలో నూతన భవనా న్ని నిర్మిస్తామన్నారు. ఇంజనీరింగ్ అధికారులు పాత భవనాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో టీచర్ల కొరత ఉంటే ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు.పార్టీల అతీతంగా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు కలెక్టర్ దినేష్కుమార్, జెసి, పాడేరు ఐటీడీఏ ఇన్చార్జ పివో అభిషేక్, సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, ఇంజనీరింగ్ ఇన్ చీప్ శ్రీనివాస,ఈఈ వేణుగోపాల్,ఏఈఈ అభిషేక్,జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్,విజయనగరం రీజన్ ఆర్టీసీ చైర్మన్ దొన్నుదొర తదితరులు పాల్గోన్నారు. డుంబ్రిగుడ: మండలంలోని కించుమండ సంపంగి గెడ్డ వద్ద నిర్మించిన వంతెనను గిరిజన సంక్షేమశాఖ,శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి సంధ్యారాణి బుధవారం ప్రారంభించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఈ వంతెనుకు నిధులు మంజూరయ్యాయి. -
డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేస్తున్నాం..
రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. దానికనుగుణంగా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. పెరిగిన విద్యుత్ కనెక్షన్లు, వాటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మే నెలలో మరింత ఎక్కువగా డిమాండ్ ఉండబోతోంది. దానికోసం ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒకే సమయంలో అందరూ ఏసీలు, కూలర్లు ఆన్ చేస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో లోడ్ పెరిగి ట్రిప్ అవుతూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీన్ని కూడా తక్కువ సమయంలోనూ పరిష్కరిస్తున్నాం. ఎంత అవసరమైనా కోతలు లేకుండా విద్యుత్ అందించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్యామ్బాబు, ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ -
లభ్యంకాని యువకుల ఆచూకీ
చింతూరు: మండలంలోని కల్లేరు వద్ద సీలేరు నదిలో గల్లంతైన యువకుల ఆచూకీ సోమవారం కూడా లభ్యంకాలేదు. ఆదివారం సరదాగా గడిపేందుకు సీలేరు నదికి వెళ్లిన ఆరుగురు యువకుల్లో నాగుల దిలీప్కుమార్(25), సుగ్రియ శ్రీను(25) నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. ఎస్డీఆర్ఎఫ్ బృందంతో పాటు డ్రోన్, స్పీడ్బోట్, వలల సాయంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా యువకుల జాడ కానరాలేదు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్, ఏఎస్పీ పంకజ్కుమార్ మీనా నదివద్ద గాలింపు చర్యలను పర్యవేక్షించారు. నది లోతుగా ఉండడంతో పాటు, నీరు అధికంగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సోమవారం సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యంకాలేదని, రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశామని, తిరిగి మంగళవారం ఉదయం నుంచి గాలింపు చేపడతామని ఎస్ఐ రమేష్ తెలిపారు. -
భానుడు భగభగ..మీటర్ గిరగిర!
సాక్షి, విశాఖపట్నం: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఉక్కబోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి అంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు విపరీతంగా వినియోగిస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంటోంది. సాధారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మార్చి మూడో వారం నుంచి నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కరెంటు వినియోగం కూడా పెరుగుతుంటుంది. కానీ ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎండలు మండిపోతున్నాయి. అప్పటి నుంచి డిమాండ్ పీక్స్కు వెళ్లిపోయింది. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. లోడ్ పెరుగుతుండటంతో సరఫరాలోనూ లోపాలు తలెత్తుతున్నాయి. తేదీ వినియోగం (మిలియన్ యూనిట్లలో) 15– ఏప్రిల్ 14.196 16– ఏప్రిల్ 14.464 17– ఏప్రిల్ 15.612 18– ఏప్రిల్ 15.060 19– ఏప్రిల్ 15.074 20– ఏప్రిల్ 14.454 మండుతున్న ఎండలతో పెరుగుతున్న విద్యుత్ వినియోగం విశాఖ సర్కిల్ పరిధిలో రోజూ సాధారణ వినియోగం 12 మిలియన్ యూనిట్లు ప్రస్తుతం 14–15 మిలియన్ యూనిట్లకు.. ఒక్కసారిగా లోడ్ పెరగడంతోసరఫరాలో లోపాలు 2 మిలియన్ యూనిట్లు అదనంగా... విశాఖ సర్కిల్ పరిధిలో ప్రతి రోజూ సగటున 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగుతుంది. అయితే భానుడి ప్రతాపంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. గత కొద్ది వారాలుగా సగటు విద్యుత్ వినియోగం రోజుకు 14 నుంచి 15 మిలియన్ యూనిట్లుగా మారిపోయింది. ఏప్రిల్ 1న రికార్డు స్థాయిలో 15.976 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడేశారంటే.. ఎండ తీవ్రత నుంచి రక్షించుకునేందుకు ప్రజలు ఎంతలా కరెంట్ వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గత వారం రోజులుగా పరిశీలిస్తే ఏ రోజూ 14 మిలియన్ యూనిట్లకు దిగువన రీడింగ్ లేదు. -
25 కిలోల గంజాయితో నలుగురి అరెస్టు
రోలుగుంట: గంజాయి వ్యాపారులపై స్థానిక ఎస్ఐ రామకృష్ణారావు కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆదేశాలతో సోమవారం దిబ్బలపాలెం గ్రామంలో దాడి చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, వారి నుంచి 25 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. వివరాలివి. మండలంలోని దిబ్బలపాలెం గ్రామానికి చెందిన చవ్వాకుల చిన్నమ్మలు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చి నిల్వ చేసి ప్యాకెట్ల రూపంలో విక్రయాలు చేస్తోంది. ఇదే మండలం జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన వడ్డాది సాయి, బంగారు పవన్ అనే వ్యక్తుల సాయంతో మద్దె గరువు ప్రాంతం వెళ్లి పెదబయలు మండలం తగ్గుపాడు గ్రామానికి చెందిన కిలో తిమోతి వద్ద 25 కేజీల గంజాయి కొనుగోలు చేసి, మైదాన ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా నలుగురు వ్యక్తులను కొంతలం కూడలి వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. గంజాయితో పాటు వారు రవాణాకు వినియోగించిన రెండు ద్విచక్రవాహనాలు, నాలుగు సెల్ఫోన్లు సీజ్ చేసినట్టు విలేకరులకు వివరించారు. 10 కిలోల గంజాయితో మైనర్ అరెస్టు చీడికాడ: 10 కిలోల గంజాయితో ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ముందస్తు మేరకు మండలంలోని కోనాం పంచాయతీ గుడివాడ బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహించగా పెదబయలు మండలం గొమంగి పంచాయతీ చావిడిమామిడికి చెందిన మైనర్ బాలుడు స్కూటీపై 10 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డాడన్నారు. ఆ బాలుడిని విచారించగా తనకు రూ.5వేలు అవసరం కాగా స్కూటీ యజమాని అయిన పెదబయలుకు చెందిన వ్యక్తిని సంప్రదించడంతో గంజాయిని అనకాపల్లి వరకు తరలించి అప్పగిస్తే ఆ నగదు ఇస్తానని చెప్పాడన్నారు. పరారీలో ఉన్న ఆ వ్యక్తిని పట్టుకుంటామని ఎస్ఐ చెప్పారు. -
వైద్య కళాశాలలు ప్రైవేట్పరం బాధ్యతారాహిత్యం
● ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డాబాగార్డెన్స్: ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేయడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పూర్వ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగం..మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అనే అంశంపై డాక్టర్ హరిప్రసాద్ స్మారక ఉపన్యాం నిర్వహించారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆరోగ్య రంగంలో మార్పులు రావడం లేదని, ప్రైవేట్ రంగానికి వైద్యం అప్పగించడం ఆందోళనకరమన్నారు. కేరళ ఆరోగ్య రంగంలో ఆదర్శంగా ఉందని, అక్కడ మరణాల రేటు తక్కువగా, వైద్య సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని, పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం, క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయడం సమర్థనీయం కాదన్నారు. ప్రభుత్వ కళాశాలల కంటే ప్రైవేట్ కళాశాలల సంఖ్య ఎక్కువగా ఉండటం దారుణమన్నారు. వైద్య విద్యా మాజీ డైరెక్టర్ డాక్టర్ కె.సత్య వరప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం పరీక్షల పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. ఐదు జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూలు లేవని, వైద్యరంగంలో సేవా దృక్పథం తగ్గి వ్యాపార కాంక్ష పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ జరిగితే ఫీజులు పెరిగిపోతాయని, రిజర్వేషన్లు తగ్గిపోతాయని, పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉండదని డాక్టర్ ఎంవీ రమణయ్య అన్నారు. రాష్ట్రంలో మల్టీపర్పస్ అసిస్టెంట్ పోస్టులు, జనరల్ మెడిసిన్ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆరోగ్య విభాగం ప్రతినిది, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్
కశింకోట: కశింకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను అతి కష్టం మీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సీఐ అల్లు స్వామినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేరళ నుంచి ఒడిశా వైపు వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీ వేగంగా వచ్చి ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. దీంతో తమిళనాడు లారీ డ్రైవర్ ముత్తు స్వామి పళని కాలు విరిగి తీవ్రంగా గాయపడి లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. పోలీసులు ఆయనను అతి కష్టం మీద బయటకు తీసి అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో నిలిచిపోయిన లారీని రెండు జేసీబీల సహాయంతో అడ్డు తొలగించారు. ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతింది. సంఘటన వల్ల నిలిచిపోయిన ట్రాఫిక్ను పోలీసులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి క్రమబద్ధీకరించారు. -
పీజీఆర్ఎస్కు 65 అర్జీలు
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీలు 65 అర్జీలను స్వీకరించారు. రాజవొమ్మంగి మండలం ఉర్లలాకులపాడు గ్రామంలోని బండకొండ రిజర్వాయర్ ద్వారా 600 ఎకరాలకు సాగునీరందించే చెరువుకు మరమ్మతులు చేయించాలని పలువురు కోరారు. వై.రామవరం అప్పర్ పార్ట్లోని మంగంపాడులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం మోటార్లకు మరమ్మతులు చేయించాలని ఆ గ్రామ గిరిజనులు విజ్ఞప్తి చేశారు. మంగంపాడులో 64 మంది గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయా లని సరంకోట అబ్బాయిరెడ్డి అర్జీ అందజేశారు. పెద్దూరు గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించాలని, గ్రామంలో పాడైయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు కోరారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు అర్జీలు అందజేశారు. సమావేశంలో ఎస్డీసీ అంబేడ్కర్, డీడీ రుక్మాండ య్య, ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
న్యూరోసర్జరీ విభాగానికి వైద్య పరికరాల అందజేత
డాబాగార్డెన్స్: కేజీహెచ్లోని న్యూరో సర్జరీ విభాగానికి రూ.8 లక్షల విలువ గల వైద్య పరికరాలను డాక్టర్ సుంకర బాలపరమేశ్వరరావు కుటుంబ సభ్యులు సుంకర ఆదిలక్ష్మి, సుబ్బలక్ష్మి, డాక్టర్ ఎస్జే బాలపరమేశ్వరరావు(న్యూరో సర్జన్), సుంకర రాజగోపాల్ సోమవారం విరాళంగా అందజేశారు. ఈ మేరకు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ బాలపరమేశ్వరరావు కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో బాలపరమేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు కేజీహెచ్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్జిత్రే, ఇతర న్యూరో సర్జరీ వైద్యులు పాల్గొన్నారు. ఈ వార్డుకు గత నెల 17వ తేదీన ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ సుంకర బాలపరమేశ్వరరావు న్యూరోసర్జరీ వార్డుగా నామకరణం చేసిన విషయం విదితమే. -
నకిలీ మావోయిస్టు అరెస్టు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రంలో మావోయిస్టు పేరుతో డబ్బుల కోసం ప్రముఖులను బెదిరించిన వ్యక్తిని విజయనగరం వన్టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా చినముషిడివాడకు చెందిన కుచ్చర్లపాటి వెంకటబంగార్రాజు పీపుల్స్ వార్ ఏఓబీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి, యాక్షన్ కమిటీ కామ్రెడ్ సాయన్న అలియాస్ బిర్సా పేరుతో నగరంలోని ఇద్దరు ప్రముఖులకు బెదిరింపు లేఖలు ఇచ్చారు. ఒకరికి రూ.25లక్షలు, మరొకరికి రూ.20 లక్షలు ఇవ్వాలని లేఖల ద్వారా డిమాండ్ చేశారు. సంబంధిత వ్యక్తులు చేసిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం. ఎస్పీ ఆదేశాలతో నగరంలోని అన్ని సీసీ పుటేజ్లను పరిశీలించి నిందితుడు వెంకట బంగార్రాజుగా గుర్తించాం. అతని కదిలికలపై నిఘా పెట్టి విజయనగరంలోని బాలాజీ కూడలి వద్ద అదుపులోకి తీసుకున్నాం. అతని నుంచి విప్లవసాహిత్యం, బైక్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేంద్రనాయుడు, హెచ్సీ రమణరావు, కానిస్టేబుళ్లు శివశంకర్, గౌరీశంకర్ను డీఎస్పీ అభినందించారు. -
సారా స్థావరాలపై మెరుపు దాడులు
రావికమతం: అనకాపల్లి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎన్.సుర్జీత్ సింగ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వి.సుధీర్ ఆదేశాల మేరకు మాడుగుల ఎకై ్సజ్ పోలీసులు రావికమతం మండలం మేడివాడ గ్రామ శివారులో జీడి తోటల్లోని నాటు సారా స్థావరాలపై సోమవారం మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1500 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసినట్టు వి.మాడుగుల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎల్.ఉపేంద్ర, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో మేడివాడ గ్రామానికి చెందిన గేడి చిన్నా, గేడి రమణను అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. -
నేడు పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
సాక్షి, పాడేరు: పాడేరు ఐటీడీఏ 74వ పాలకవర్గ సమావేశం ఈనెల 21వ తేదీ సోమవారం ఉదయం 11గంటలకు జరగనుంది.ఐటీడీఏ చైర్మన్,కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అధ్యక్షతన జరిగే పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి జిల్లా ఇన్చార్జి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరుకానున్నారు. సమావేశానికి హాజరుకావాలని అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర,పాడేరు,అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం,ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు,గాదే శ్రీనివాసులునాయుడు,ఎంపీపీలు,జెడ్పీటీసీల కు ఆహ్వానం పంపినట్టు జేసీ,ఇన్చార్జి ఐటీడీఏ పీవో ఎం.జె.అభిషేక్గౌడ ఓ ప్రకటనలో తెలి పారు. అన్నిశాఖల అధికారులు తమ శాఖల సమగ్ర వివరాలతో నిర్దేఽశిత సమయానికి పాల కవర్గ సమావేశానికి హాజరు కావాలని పేర్కొన్నారు. -
ఇన్చార్జుల పాలన ఇంకెన్నాళ్లు?
రెగ్యులర్ పీవోలేని పాడేరు ఐటీడీఏ రెండు నెలలుగా జాయింట్ కలెక్టర్కు ఇన్చార్జి బాధ్యతలు గిరిజన సంక్షేమ డీడీ పోస్టుదీ అదే పరిస్థితి సాక్షి,పాడేరు: రాష్ట్రంలోని ఐటీడీఏల్లో పెద్దదైన, ఏడు లక్షల గిరిజన జనాభా కలిగిన పాడేరు ఐటీడీఏలో ప్రధాన పోస్టుల భర్తీలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పాడేరు ఐటీడీఏకు ప్రాజెక్టు అధికారిని గత రెండు నెలలుగా నియమించలేదు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 244 పంచాయతీల గిరిజనుల సమస్యలను పరిష్కరించడంతో పాటు గిరిజనుల అభివృద్ధికి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని, నిధులు ఖర్చుపెట్టాల్సిన బాధ్యత ఐటీడీఏ పీవోదే. ఇంత కీలకమైన పోస్టును జాయింట్ కలెక్టర్తోనే అదనపు విధుల్లో భాగంగా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇక్కడ ఐటీడీఏ పీవోగా పనిచేసిన అభిషేక్ను పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 3న బదిలీ చేసింది. అయితే ఆయన స్థానంలో మరో ఐఏఎస్ అధికారిని ఐటీడీఏ పీవోగా నియమించాల్సి ఉన్నప్పటికీ పాడేరు జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ అభిషేక్గౌడకు ఐటీడీఏ పీవోగా ఎఫ్ఏసీ బాధ్యతలను అప్పగించింది. అప్పటి నుంచి ఆయన జేసీగాను, ఐటీడీఏ పీవోగాను విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకు ఐటీడీఏ పీవో పోస్టును భర్తీ చేయకపోవడంతో ఐటీడీఏ పరంగా గిరిజనులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ప్రతి శుక్రవారం ఐటీడీఏలో జరిగే మీ–కోసంలో మాత్రమే ఇన్చార్జి పీవో అయిన జేసీకి సమస్యలు చెప్పుకుంటున్నామని, మిగిలిన రోజుల్లో ఇబ్బందిగా ఉంటుందని గిరిజనులు వాపోతున్నారు. పూర్తిస్థాయి పీవో లేకపోవడంతో ఐటీడీఏలో పరిపాలన పరమైన అంశాలలోను ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. పూర్తిస్థాయి పీవో లేకుండానే పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం సోమవారం జరగనుంది. డాక్టర్ అభిషేక్గౌడ నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. పాలకవర్గ సమావేశానికి ముందే ఐటీడీఏకు రెగ్యులర్ పీవో నియమిస్తారని భావించినా, కూటమి ప్రభుత్వం స్పందించలేదు. ఆరు నెలలుగా గిరిజన సంక్షేమ డీడీ పోస్టు ఖాళీ గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన కీలకమైన పాడేరు ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పోస్టును ప్రభుత్వం ఆరు నెలలుగా భర్తీ చేయలేదు.గతంలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన కొండలరావును క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 30న ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖకు సరెండర్ చేసింది.ఆయన స్థానంలో పాడేరు సహాయ గిరిజన సంక్షేమశాఖ అధికారి(ఏటీడబ్ల్యూవో) ఎల్.రజనీని ఇన్చార్జి డీడీగా నియమించారు. పూర్తిస్థాయి డీడీ లేక గిరిజన విద్యకు సంబంధించిన పలు అంశాలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాడేరు ఐటీడీఏలో కీలకమైన పీవోతో పాటు గిరిజన సంక్షేమశాఖ డీడీ పోస్టులను భర్తీ చేయాలని జిల్లా ఇన్చార్జి,రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి కూడా వినతులు అందినాఇంతవరకు ఎలాంటి నియామకాలు జరపకపోవడం గమనార్హం.పూర్తిస్థాయి పీవో లేకుండానే ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నేడు పీవో, డీడీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి పాడేరు ఐటీడీఏలో కీలకమైన ప్రాజెక్టు అధికారి,గిరిజన సంక్షేమశాఖ డీడీ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి.ఏ కష్టమొచ్చిన గిరిజనులు నేరుగా ఐటీడీఏకు వెళ్లి పీవోకు సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉండేది.పాత పీవో అభిషేక్ బదిలీ అయిన నాటి నుంచి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.పాత డీడీని సరెండర్ చేసి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు మరో డీడీని నియమించకపోవడం అన్యాయం.జిల్లా ఇన్చార్జి మంత్రి వెంటనే దృష్టిపెట్టాలి. – పొద్దు బాలదేవ్, గిరిజన సంఘం జిల్లా నేత, అరకులోయ రెగ్యులర్ పీవో లేక ఇబ్బందులు పాడేరు ఐటీడీఏకు రెగ్యులర్ పీవోను ప్రభుత్వం నియమించకపోవడంతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. చింతపల్లి మాక్స్కు కాఫీ పండ్లు విక్రయించిన రైతులకు బోనస్ చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. రైతుల ఇతర సమస్యల పరిష్కారంలోనూ ఇదే పరిస్థితి. రెగ్యులర్ పీవో అయితే నిరంతరం ఐటీడీఏలో అందుబాటులో ఉంటారు.ఇన్చార్జి పీవో అయిన జేసీకి సమస్యలు చెప్పుకున్నా... వెంటనే పరిష్కారం కావనే భావనలో రైతులు ఉన్నారు. – పాలికి లక్కు, కాఫీ రైతు సంఘం నేత, పాడేరు -
మోదమ్మకు పోలవరం అడ్మినిస్ట్రేటర్ అభిషేక్ పూజలు
సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లిని పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అధికారి వి.అభిషేక్ ఆదివారం తల్లిదండ్రులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆధ్వర్యంలో అభిషేక్, వారి తల్లిదండ్రు లను ఘనంగా సత్కరించారు. మోదమ్మ చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. మే 11,12,13 తేదీల్లో జరిగే మోదమ్మ ఉత్సవా లకు రావాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు.. అభిషేక్కు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు కూడ సురేష్కుమార్, కొణతాల ప్రశాంత్, కేజీయారాణి, ఆలయ కమిటీ ప్రతినిధులు సల్లా రామకృష్ణ,రాధాకృష్ణ,చిన్న,బొనంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
విదేశీ చూపు
ఏయూ వైపుగత ఆరేళ్లలో అడ్మిషన్లు ఇలా 2019–20 190 2020–21 262 2021–22 217 2022–23 333 2023–24 338 2024–25 465 ఆంధ్ర యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రస్తుతం 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యతకు తోడు విశాఖ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా తీసుకున్న చర్యలతో ఆంధ్ర యూనివర్సిటీ వైపు విదేశీ విద్యార్థులు ఆకర్షితులయ్యారు. 2019–20 విద్యా సంవత్సరంలో 190 మంది విదేశీ విద్యార్థుల చేరగా.. 2024–25 నాటికి ఆ సంఖ్య 465కు చేరింది. ఒకే ఏడాదిలో ఎక్కువ సంఖ్యలో విదేశీ ప్రవేశాలు పొందిన యూనివర్సిటీగా ఏయూ రికార్డు సొంతం చేసుకుంది. అంతే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించే యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది చదువుకునేది ఏయూలోనే కావడం గమనార్హం. ప్రత్యేక హాస్టళ్లు ఆంధ్ర యనివర్సిటీలో చదువుకునేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు ఆహారం విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వర్సిటీలో ప్రవేశాలు పొందే వారిలో 70 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ హాస్టళ్లులో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీరి కోసమని ప్రత్యేకంగా వర్సిటీలో ఏడు హాస్టళ్లు అందుబాటులో తీసుకొచ్చారు. వారికి నచ్చిన వంటకాలు తయారు చేసుకునేలా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎఫైర్స్ విభాగం డీన్ ఆచార్య ధనుంజయరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్సిటీలో అంతర్జాతీయ వ్యవహారాల విభాగం విద్యార్థుల చదువులతో పాటు, వారి సదుపాయాలపై కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తుండటంతో.. వారి చదువులు సాఫీగా సాగిపోతున్నాయి. సినిమాల్లోనూ అవకాశాలు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు సినిమాల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో విశాఖ నగరంతో పాటు, పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్కు ఎక్కువగా జరుగుతుండటంతో వీటిలో విదేశీ విద్యార్థులకు అవకాశాలు దక్కుతున్నాయి. ఓ సినిమాలో కంబోడియాలో చిక్కుకుపోయిన 25 మంది యువతను వైజాగ్కు తీసుకొచ్చే సన్నివేశా న్ని ఇక్కడి విద్యార్థులతోనే చిత్రీకరించారు.. ఇక్కడి ఆఫ్రికన్ విద్యార్థుల బృందం.. హీరో సూర్య నటించిన చిత్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం చేసే విలన్ సహచరుల పాత్రల్లో నటించింది. ఈ నెల 26 నుంచి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతుండగా.. వీటిలో విదేశీ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇదే జోష్ ఉంటుందా? కూటమి ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీపై శీతకన్ను వేస్తోంది. విశాఖలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీని బలోపేతం చేసేలా పరోక్షంగా సహకారమందిస్తోంది. విశాఖలోని ఆ ప్రైవేటు యూనివర్సిటీలో చేరితేనే మేలు అన్నట్లుగా ఏయూ పాలనాధికారులతో పాటు ఓ వర్గం వ్యవహరిస్తుందనే విమర్శలు సైతం ఉన్నాయి. ఈ ప్రభావం 2025–26 విద్యా సంవత్సరం అడ్మిషన్లపై పడుతోందని వర్సిటీ మేలు కోరే వారు అంటున్నారు. ఫలితంగా విదేశీ విద్యార్థుల జోష్ ఉంటుందా..? అనేది వేచి చూడాలి. చదువుతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవాలనే కోరికతో విశాఖకు వచ్చే విదేశీ విద్యార్థుల నమ్మకాన్ని నిలబెడుతూ విద్య అందిస్తున్నాం. ఇక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే స్పందించి.. వారికి తోడుగా నిలిచేలా ఇంటర్నేషనల్ ఎఫైర్స్ విభాగం పని చేస్తోంది. – ఆచార్య ధనుంజయరావు, ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డీన్, ఆంధ్ర యూనివర్సిటీ గ్లోబల్ విద్యార్థులతో వర్సిటీలో జోష్ 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యాభ్యాసం ఏయూకు క్రేజ్ పెంచిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఖ్యాతిఆంధ్ర యూనివర్సిటీలో ఒకప్పుడు కొన్ని ప్రత్యేక కోర్సులకే పరిమితమైన విదేశీ విద్యార్థుల సంఖ్య ఇప్పుడు అనూహ్యంగా పెరిగింది. ఏకంగా 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. కేవలం ఐదేళ్లలో ఈ సంఖ్య రెండింతలు కావడం విశేషం. దేశంలోని మరే ఇతర విశ్వవిద్యాలయంలోనూ ఇంత మంది విదేశీ విద్యార్థులు లేకపోవడం ఆంధ్ర యూనివర్సిటీని అంతర్జాతీయ విద్యా కేంద్రంగా నిలబెడుతోంది. ప్రత్యేక హాస్టళ్లు, వారికి నచ్చిన ఆహారం, వంటి సౌకర్యాలు ఇక్కడకు మరింత మందిని ఆకర్షిస్తున్నాయి. నగరంలోని ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు కూడా తోడవడంతో ఆంధ్ర యూనివర్సిటీ.. మినీ ప్రపంచాన్ని తలపిస్తోంది. – విశాఖ విద్య కోర్సుల వారీగా విదేశీ విద్యార్థులు స్పెషలైజేషన్ యూజీ పీజీ పీహెచ్డీ మొత్తం ఆర్ట్స్ 3 44 136 183 సైన్స్ అండ్ టెక్నాలజీ 6 52 38 96 ఇంజినీరింగ్ 373 55 44 472 ఫార్మాస్యూటికల్ 146 39 20 205 ఇంటర్నేషనల్ బిజినెస్ 143 24 – 167 లా 1 5 6 ఐఏఎస్ఈ 1 1 మొత్తం 671 216 243 1,130 -
అక్రమంగా తరలిస్తున్న బియ్యం, కందిపప్పు పట్టివేత
రంపచోడవరం: స్థానిక సినిమాహాల్ రోడ్డులో ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహం నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి బస్తాలను పోలీసులు పట్టుకున్నారు. వసతి గృహానికి చెందిన ఒక గోధుమ పిండి, రెండు కందిపప్పు, పది బియ్యం బస్తాలను శనివారం అర్ధరాత్రి ఆటోలో తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులు, ఐటీడీఏ పీవోకు సమాచారమిచ్చారు.దీంతో స్థానిక పోలీసులు హాస్టల్ వద్దకు వచ్చి సరుకులను, ఆటోను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ ఈ ఘటనకు సంబంధించి గిరిజన సంక్షేమ హాస్టల్ వార్డెన్ కత్తుల కృష్ణాబాయిని సస్పెండ్ చేసినట్టు ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. హాస్టల్ నుంచి బియ్యం, ఇతర సరుకుల అక్రమ తరలింపుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తదుపరి చర్యలు చేపడతామన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి గిరిజన సంక్షేమ హాస్టల్లో బియ్యాన్ని వ్యాపారులకు విక్రయించిన వార్డెన్పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ మట్ల వాణిశ్రీ డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. వసతి గృహాలపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే సరుకులు అక్రమంగా తరలిపోతున్నాయని చెప్పారు. కొంత మంది అధికారుల సహకారంతోనే వార్డెన్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హాస్టల్ నుంచి ఆటోలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు -
గుడివాడలో ఘనంగా బడ్డు సంబరం
సాక్షి, పాడేరు: పట్టణంలోని గుడివాడ గిరిజనులు కూడా పూర్వ సంప్రదాయ బడ్డుతాడు సంబరానికి శ్రీకారం చుట్టారు. ఇటుకల పండగలో భాగంగా ఆదివారం గుడివాడ శంకులమ్మతల్లి ఆలయం ఆవరణలో బడ్డుతాడు సంబరం వైభవంగా జరిగింది. ముందుగా గొడుగుల ఊరేగింపును పాడేరు పుర వీధుల్లో నిర్వహించారు. అనంతరం శంకులమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బడ్డుతాడుకు గ్రామ పెద్దలంతా పూజలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన మహిళల థింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలు హోరెత్తాయి. గుడివాడకు చెందిన ఆడపిల్లలు, బయట నుంచి వచ్చిన వదిన, మరదళ్లు పోటాపోటీగా బడ్డుతాడును లాగారు. ఈ పోటీలో ఊరి ఆడపిల్లలే తాడును లాగుకుపోయి విజయం సాధించారు. వదిన, మరదళ్లు వంటి మహిళలు ఓడిపోయారు. గ్రామంలో పశుసంపదతో పాటు అందరూ సంతోషంగా జీవించాలని, పంటలు బాగా పండాలని కాంక్షిస్తూ ఇటుకల పండగలో భాగంగా ఈ బడ్డుతాడు సంబరంను గిరిజనులు నిర్వహించడం ఆనవాయితీ. పాత పాడేరు, గుడివాడ గ్రామాల్లో మాత్రమే పూర్వం నుంచి బడ్డుతాడు సంబరం జరుగుతుంది. మధ్యలో కొన్నేళ్లు గుడివాడలో ఈ సంబరం జరగనప్పటికీ శంకులమ్మతల్లి ఆలయం నిర్మాణం తరువాత అన్ని కుటుంబాల గిరిజనులు బడ్డుతాడు సంబరాన్ని కొనసాగిస్తున్నాయి. -
ఈదురు గాలులు... భారీ వర్షం
సాక్షి,పాడేరు: జిల్లాలో రోజూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12గంటల నుంచి గంటన్నర పాటు పాడేరులో భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులతో పాటు పిడుగుల శబ్దాలు మరింత భయపెట్టాయి. ఇళ్ల పైకప్పు రేకులు ధ్వంసం పెదబయలు: మండలంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మారుమూల జామిగుడ పంచాయతీ పినరావెలి గ్రామంలో కిల్లో లక్ష్మి, మండి సావిత్రి ఇళ్ల పైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మండి ప్రభుదాస్ ఇంటిపై కప్పు పాక్షికంగా దెబ్బతింది. దీంతో ఇంటి లోపల ఉన్న ధాన్యం, రాగులు, బియ్యం, దుస్తులు, ఇతర వంట సామగ్రి తడిసిపోయాయి. ప్రభుత్వం తమకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధితులు కోరారు. -
రోడ్డు కోసం భారీ ర్యాలీ
సీలేరు: అంతర్రాష్ట్ర రోడ్డును తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేస్తూ అంతర్రాష్ట్ర రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దారకొండ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఆర్వీనగర్ నుంచి దారకొండ, సీలేరు మీదుగా పాలగెడ్డ వరకు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. దశాబ్ద కాలంగా ఈ రోడ్డుపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆందోళనకారులు తెలిపారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి ఆర్వీనగర్ నుంచి సీలేరు మీదుగా పాలగెడ్డ వరకు రోడ్డు నిర్మించేందుకు పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపట్టి, మండల బంద్కు పిలుపు ఇస్తామని అంతర్రాష్ట్ర రోడ్డు సాధన కమిటీ నాయకులు తెలిపారు. గంగవరం,అగ్రహారం,చోడిరాయి వద్ద గత ఏడాది కొట్టుకుపోయిన వంతెనలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని,ముంపునకు గురైన గిరిజనుల భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాలికొండ ఎంపీటీసీ బుజ్జిబాబు, గుమ్మిరేవుల మాజీ సర్పంచ్ బాబురావు, అల్లంగి రాజు, సీలేరు మాజీ ఉప సర్పంచ్ కారె శ్రీనివాసు, పలు రాజకీయ పార్టీల నాయకులు సిద్ధాఽర్థ్ మార్క్, మల్లుదొర, సొన్ను బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,139 పోస్టులు
● జోనల్ స్థాయిలో మరో 400 పోస్టులు ● డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ● దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం ● జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు విశాఖ విద్య: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఆదివారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీ, మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలోని పాఠశాలల్లో 734 పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో 400 పోస్టులు భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జువనైల్ హోమ్లో ఐదు ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1,139 పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇవి కాకుండా జోనల్ స్థాయిలో ఏపీ రెసిడెన్షియల్/మోడల్ స్కూల్స్/ సోషల్ వెల్ఫేర్/బీసీ వెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్(గురుకులాలు) పరిధిలోని విద్యాలయాల్లో 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. రోస్టర్ పాయింట్లు ప్రకటించిన జిల్లా విద్యాశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనుంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని విద్యాలయాల్లో సబ్జెక్టుల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది విద్యాశాఖాధికారులు ఇప్పటికే లెక్క తీశారు. మండల పరిషత్, జెడ్పీ, మున్సిపల్ మేనేజ్మెంట్ల వారీగా రోస్టర్ పాయింట్లు సైతం ప్రకటించారు. ప్రభుత్వ/జెడ్పీ/ఎంపీ/మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలో భర్తీ చేయనున్న 734 పోస్టుల్లో 290 ఓపెన్ కేటగిరీ కోసం కేటాయించారు. ఈ పోస్టులకు ఎవరైనా పోటీ పడవచ్చు. బీసీ ఏ–42, బీసీ బీ–65, బీసీ సీ–6, బీసీ డీ–44, బీసీ ఈ –26, ఎస్సీ గ్రూప్ 1–26, ఎస్సీ గ్రూప్ 2–7, ఎస్సీ గ్రూప్ 3–36, ఎస్టీ–37, ఈడబ్ల్యూఎస్–65 పోస్టులు కేటాయించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేరకు ఏఏ సబ్జెక్టుల్లో ఎన్ని పోస్టులు కేటాయించామనేది స్పష్టత ఇస్తూ.. జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచారు. షెడ్యూల్ ఇలా.. : 2024 జూలై 1 కటాఫ్గా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్డ్ కేటగిరీల వారికి మరో ఐదేళ్లు సడలింపు ఇచ్చారు. తగిన విద్యార్హతలు ఉన్న వారు మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్న వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వారంతా కొత్తగా దరఖాస్తు ఫారాన్ని నింపి వెబ్సైట్లో సబ్మిట్ చేయాలి. అయితే అర్హతల మేరకు మరేదైనా సబ్జెక్టు కోసం పరీక్ష రాయాలనుకుంటే.. తగిన ఫీజు చెల్లించి, మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రైబల్ వెల్ఫేర్లో.. ఎస్ఏ తెలుగు 7 హిందీ 11 గణితం 7 ఫిజికల్ సైన్సు 35 సోషల్ 5 ఎస్జీటీ 335 మొత్తం 400 జువనైల్ విభాగంలో ఎస్జీటీ 4 పీఈటీ 1 జోనల్ పరిధిలో పోస్టులు ఇలా.. ఉత్తరాంధ్రలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో జోనల్ ప్రాతిపదికన 400 పోస్టులు భర్తీ చేయనున్నారు. పీజీటీ 73 టీజీటీ 299 పీడీ 6 పీఈటీ 22 సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా.. ఎస్ఏ లాంగ్వేజీ–1 26 హిందీ 28 ఇంగ్లిష్ 55 గణితం 59 ఫిజికల్ సైన్స్ 39 బయాలజీ 58 సోషల్ 91 పీఈటీ 139 ఎస్జీటీ 239 మొత్తం 734 -
గత ప్రభుత్వ ప్రాజెక్టులా.. ఆపేయ్.!
● అభివృద్ధికి శాపం.. కూటమి పాలన ● వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన వంతెనలను పూర్తి చేయని వైనం ● వంతెనల అప్రోచ్ రోడ్లకు నిధుల్లేక నిలిచిపోయిన పనులు సీలేరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన పలు ప్రాజెక్టులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గిరిజనుల సౌకర్యార్థం మంజూరు చేసిన వంతెనల నిర్మాణంపై కక్ష ధోరణి ప్రదర్శిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం నుంచి గిరిజన గ్రామాల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు ప్రధాన వంతెనలు మంజూరయ్యాయి. కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ వంతెనలను పూర్తి చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆయా గెడ్డలు, వాగుల్లో ఉధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి కాని పిల్లి గెడ్డ వంతెన రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు సీలేరు సమీప పిల్లి గెడ్డ వద్ద ఎన్నో ఏళ్లుగా రాకపోకలు కష్టంగా ఉండేది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.2.34 కోట్లు మంజూరు చేసి వంతెన పనులు ప్రారంభించింది. వంతెన నిర్మాణం పూర్తయింది. రెండు వైపులా అప్రోచ్ రోడ్డు పూర్తి కాకుండా గడిచిన 7 నెలలుగా పనులు నిలిచిపోయాయి. గతేడాది సెప్టెంబర్లో భారీ విపత్తు వచ్చి వర్షానికి పిల్లి గెడ్డ వంతెన అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రెండు వైపులా వాలు కట్టేందుకు రూ.30 లక్షలతో ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. కొట్టుకుపోయిన చిన్న గంగవరం వంతెన అల్లూరు జిల్లా నుంచి గూడెం కొత్తవీధి మండలం దాటి దారకొండ మీదుగా ఒడిశా వెళ్లేందుకు చిన్న గంగవరం వంతెన కీలకం. 2014 ఏడాదిలో రూ.40 లక్షలతో ఈ వంతెనను నిర్మించారు. చుట్టు పక్కల అటవీ ప్రాంతం నుంచి పడిన వర్షపు నీరు అంతా ఈ వంతెన మీదుగా ప్రవహిస్తుంది. గతేడాది సెప్టెంబర్లో భారీ తుపాను వచ్చి వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. వెంటనే భారీ వంతెన నిర్మించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇటీవల ఆ ప్రాంత గ్రామ గిరిజనులు వంతెన నిర్మించాలని పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు. నెల రోజుల కిందట ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు వంతెన పరిశీలించి తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. వర్షాలు పడితే పూర్తిగా సరిహద్దుకు రాకపోకలు నిలిచిపోతాయని, నిత్యావసర సరకులు కూడా తెచ్చుకోలేమని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. అస్తవ్యస్తంగా మాదిగ మల్లు అప్రోచ్ రోడ్డు జిల్లా నుంచి ధారకొండ మీదుగా తూర్పుగోదావరి, ఛత్తీస్గఢ్, ఒడిశా వెళ్లేందుకు గుమ్మురేవులు రోడ్డు మార్గం మధ్యలో మాదిగ మల్లు వంతెన కీలకం. ధారాలమ్మ ఘాట్ రోడ్డులో భారీగా కురిసే వర్షపు నీరంతా ఈ వంతెన నుంచే ప్రవహిస్తోంది. దీంతో గత ప్రభుత్వం రెండు కోట్ల 40 లక్షల రూపాయలతో భారీ వంతెనను మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేసింది. ఆ తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం అప్రోచ్ రోడ్డును ఇప్పటికీ పూర్తి చేయలేదు. గతేడాది తొమ్మిదో నెలలో వచ్చిన భారీ వర్షానికి కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా నిర్మించి రాకపోకలు సాగించారు. అప్పటి నుంచి అసంపూర్తిగానే వంతెన ఉంది. తరచూ కురుస్తున్న వర్షాలకు అప్రోచ్ రోడ్డు సక్రమంగా లేకపోవడంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. మూడు రోజుల కిందట ఆర్టీసీ బస్సు వర్షానికి బురదలో కూరుకుపోయింది. రెండు వైపులా అప్రోచ్ రోడ్డు వేసేందుకు రూ.1.80 కోట్లతో జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు ఎట్టకేలకు వచ్చాయి. దీంతో టెండర్లు పిలిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల రోజుల్లో పనులు జరగకపోతే రానున్న వర్షాకాలంలో ఈ వంతెనపై కూడా రాకపోకలు కష్టమేనని ఆ ప్రాంత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో సప్పర్ల వంతెన సప్పర్ల నుంచి గొల్లపల్లి వెళ్లే మార్గంలో పెద్ద వాగు ఉంది. వర్షాకాలంలో రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వంలో రెండు కోట్ల 80 లక్షల రూపాయలతో వంతెన మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఈ వంతెన పూర్తయితే అవతల ఉన్న గ్రామాల నుంచి పండించిన పంటలు తరలించడానికి సులువవుతుంది. అప్రోచ్ రోడ్లు పూర్తి చేయాలి వంతెనలకు ఇరువైపులా చేపట్టాల్సిన అప్రోచ్ రోడ్ల నిర్మాణం తక్షణం పూర్తి చేయాలి. లేకపోతే ఆందోళన చేస్తాం. వర్షా కాలం ప్రారంభమైతే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. తక్షణం నిర్మాణాలు పూర్తి చేయాలి. – కారే శ్రీనివాస్, స్థానిక నాయకుడు అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.. పిల్లిగెడ్డ, మాదిగ మల్లు, సప్పర్ల వంతెనలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం. మాదిగ మల్లు వంతెన వద్ద అప్రోచ్ రోడ్డుకు కలెక్టర్ రూ.1.80 కోట్లతో అనుమతులు ఇచ్చారు. త్వరలోనే పనులు చేపడతాం. – కళ్యాణ్ కుమార్, డీఈ, ట్రైబల్ వెల్ఫేర్ -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
రాజవొమ్మంగి: స్థానిక గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కేంద్రంగా ఆదివారం జరిగిన గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతగా సాగింది. వివిధ మండలాల నుంచి 237 మంది హాజరై పరీక్ష రాసినట్లు ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. గురుకులంలో 6వ తరగతిలో ప్రవేశానికి, మరి కొన్ని బ్యాగ్లాగ్ సీట్ల భర్తీ కోసం 309 మంది దరఖాస్తు చేసుకోగా 72 మంది గైర్హాజరయ్యారన్నారు. ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష రంపచోడవరం: రంపచోడవరంలో నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షలు ముగిసినట్లు డీడీ రుక్మాంగాధయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాలను డీడీ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆరో సెంటర్ల్లో పరీక్షలు నిర్వహించగా 1500 మంది విద్యార్థులకు 1193 మంది హాజరైనట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 307 మంది గైర్హాజరైనట్టు చెప్పారు. అడ్డతీగల: గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్షకు 87 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు అడ్డతీగల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీపాద రామకృష్ణ తెలిపారు. ఐదో తరగతిలో రెగ్యులర్ అడ్మిషన్లతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ నిమిత్తం ఆదివారం ప్రవేశ పరీక్షకు 355 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉందన్నారు. కానీ 268 మంది విద్యార్థులు పరీక్ష రాశారన్నారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకు అల్పాహారం, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. -
ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
పాడేరు రూరల్: మెగా డీఎస్సీతో పాటు ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదివాసీ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తక్షణం ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ప్రకటించి వంద శాతం ఆదివాసీలతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆదివాసీ నిరుద్యోగులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా పోతుందన్నారు. దీనిపై పాడేరు ఐటీడీఏ పాలక వర్గం సమవేశంలో స్పష్టమైన వైఖరి ప్రకటించి తీర్మా నం చేయాలన్నారు. మన్యంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఆదివాసీ నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
సీలేరు నదిలో ఇద్దరు యువకుల గల్లంతు
చింతూరు: సరదా గడుపుదామని సీలేరు నది వద్దకు వెళ్లిన ఆరుగురు యువకుల్లో ఇద్దరు నదిలో మునిగి గల్లంతయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. చింతూరుకు చెందిన మనోజ్కుమార్, రవి, సిద్ధార్థ, వెంకన్నబాబు, దిలీప్కుమార్, శ్రీనులు సరదాగా గడిపేందుకు ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని చింతూరు మండలం కల్లేరు వద్దనున్న సీలేరు నది వద్దకు వెళ్లారు. కాసేపు నదివద్ద గడిపిన అనంతరం వారిలో సుగ్రీవ శ్రీను స్నానం చేసేందుకు నదిలో దిగగా నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో అతనిని కాపాడేందుకు స్నేహితుడైన నాగుల దిలీప్కుమార్ కూడా నదిలో దిగాడు. లోతు అధికంగా ఉండడంతో అతను కూడా నీటిలో కొట్టుకుపోయాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు వారి జాడకోసం గాలించినా ఆచూకీ లభ్యంకాలేదు. అప్పటికే చీకటి పడడంతో గాలింపు చర్యలు చేపట్టడం సాధ్యపడలేదు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్, ఏఎస్పీ పంకజ్కుమార్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సోమవారం ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టాలని ఎస్ఐ రమేష్కు వారు సూచించారు. -
గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టాలి
● ఎస్పీ అమిత్ బర్దర్ చింతపల్లి: జిల్లాలో గంజాయి నిర్మూలనకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. మండలంలో అన్నవరం పోలీసు స్టేషన్ను ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాతో కలసి శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. నూతనంగా నిర్మిస్తున్న పోలీసు స్టేషన్ భవనాన్ని పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోగల ఈపోలీసు స్టేషన్ పరిధి ఎక్కువగా ఉండడంతో గంజాయి రవాణాకు అవకాశం ఉందని, దానిని నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా యువ త ఎటువంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి అవకాశాలను గిరిజన రైతులు,యువత సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీఐ వినోద్ బాబు,ఎస్ఐ వీరబాబు పాల్గొన్నారు. -
అడవుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
చింతపల్లి డీఎఫ్వో నర్సింహారావుచింతపల్లి: డివిజన్పరిధిలో అడవుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చింతపల్లి డీఎఫ్వో నర్సింహారావు తెలిపారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శనివారం జరిగిన డివిజన్ సమావేశంలో 2025–26కు సంబంధించి అటవీశాఖ అధికారులు అమలు చేయాల్సిన కార్యక్రమాలు, పనులపై డీఎఫ్వో పలు సూచనలు చేశారు. అడవుల పరిరక్షణకు సిబ్బందికి ప్రత్యేక లక్ష్యాలను నిర్ణయించినట్టు చెప్పారు. అడవుల్లో విలువైన కలప అక్రమ నరికివేత, రవాణా వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ చెక్పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయాలని తెలిపారు. త్వరలో చెక్పోస్టుల వద్ద సీసీకెమె రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రంగురాళ్ల తవ్వ కాలు జరగకుండా క్వారీల వద్ద నిరంతరం నిఘా ఉంచేందుకు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. రంగురాళ్ల తవ్వకాలకు పాల్పడకుండా గిరిజనులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించా రు. ఇటీవల పలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పో యిన అటవీశాఖ సిబ్బందికి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు అటవీ శాఖ ఉద్యోగుల సంక్షేమ నిధినుంచి ఆర్థిక సాయం అందజేశారు. ఈకార్యక్రమంలో రేంజ్ అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్లోగిరిజన విద్యార్థి సత్తా
● దేశవ్యాప్త ఎస్టీ కేటగిరిలో 137 ర్యాంకు సాక్షి,పాడేరు: మండలకేంద్రం పాడేరు పట్టణంలోని నీలకంఠనగర్కు చెందిన గిరిజన విద్యార్థి సమర్ధి నందవర్ధన్ నిహాల్ జేఈఈ మెయిన్స్లో సత్తా చాటి, దేశావ్యాప్త ఎస్టీ కేటగిరిలో 137 ర్యాంక్ సాధించాడు. పాడేరుకు చెందిన సమర్ధి రఘు,ఉర్వశి దంపతుల పెద్ద కుమారుడు నందవర్ధన్ నిహాల్ పార్వతీపురం మన్యం జిల్లా జోగంపేటలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్ చదవి, ఇటీవల వచ్చిన ఫలితాల్లో 959 మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్లో సత్తా చాటిన నందవర్ధన్ నిహాల్ను పార్వతీపురంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం ఘనంగా సత్కరించి, అభినందించారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
ముంచంగిపుట్టు: ఈత సరదా ప్రాణం తీసింది. ఎండవేడిని తట్టుకోలేక స్నేహితులతో కలిసి మత్స్యగెడ్డలో ఈత కొడదామని వెళ్లిన ఓ గిరిజన యువకుడు నీటిలో మునిగి మరణించాడు. స్థానిక ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం ఎండ వేడి అధికంగా ఉండడంతో మండలంలోని ఏనుగురాయి పంచాయతీ నడుమూరు గ్రామానికి చెందిన సిరగం వంశీకృష్ణ(18) తన స్నేహితులు కవెర్ల భూపతిరాజు, సిరగం మణికంఠ,సిరగం సిద్ధార్థ,కవెర్ల జగదీష్ వర్మ,సిమిలియ శ్రీనులతో కలిసి కుమ్మిగూడ గ్రామ సమీపంలో మత్స్యగెడ్డలో ఈత కొడదామని వెళ్లాడు.అందరూ ఈత కొడుతుండగా వంశీకృష్ణ ప్రమాదవశాత్తూ మత్స్యగెడ్డలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వంశీకృష్ణ మునిగిపోయిన చోట గాలించారు. ఫలితం లేకపోవడంతో నడుమూరు గ్రామస్తులకు జరిగిన సంఘటనపై సమాచారం ఇచ్చారు.దీంతో నడుమూరు,ఏనుగురాయి,గాదెలబురుగు,రాతులపుట్టు,కుమ్మిగూడ గ్రామాలకు చెందిన గిరిజనులు తరలి వచ్చి మత్స్యగెడ్డలో నాటుపడవతో గాలించారు. గంట తరువాత వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు.ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. వంశీకృష్ణ స్నేహితులతో మాట్లాడి ప్రమాదం వివరాలు సేకరించారు. తమ కుమారుడు వంశీకృష్ణను డాక్టర్ చదివిద్దామనుకున్నామని, ఇంతలో మృతి చెందాడని తల్లిదండ్రులు జానకమ్మ,నాగరాజు గుండెలు అవిసేలా రోదించడం అందరిని కలిసివేసింది. వంశీకృష్ణ వారికి రెండో కుమారుడు. ముంచంగిపుట్టు పీహెచ్సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.సంఘటన జరిగిన కుమ్మిగూడ మత్స్యగెడ్డ వద్ద ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారని,చాలా ప్రమాదకర ప్రదేశమని స్థానికులు తెలిపారు.వంశీ కృష్ణ (ఫైల్) మత్స్యగెడ్డలో మునిగి గిరిజన యువకుడి మృతి నడుమూరులో విషాదం -
ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి. వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటులో ఉండాలి, శానిటేషన్, రోగులకు కల్పించే సదుపాయాల్లో లోటు ఉండకూడదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడుగు పెట్టగానే.. కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చామా అన్న భావన ప్రజలకు రావాలి, ఆ
ఎన్క్యూఏఎస్ బృందంగుర్తించిన అంశాలు ● ఆస్పత్రిలో ప్రత్యేకంగా మూడు వేస్ట్ డస్ట్ బిన్ల ఏర్పాటు ● పూర్తి స్థాయి పరికరాలతో లేబర్ రూమ్ ● మందుల పంపిణీకి ప్రత్యేక గది ● ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక గదిలో బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ● రెండు వైద్యుల గదుల ఆధునికీకరణ ● పురుషులు, మహిళలకు వేర్వేరు వార్డులు, ప్రత్యేకంగా వాష్ రూమ్లు, కామన్ వాష్ రూమ్ ● లేబొరేటరీ ● బర్త్ వెయిటింగ్ రూమ్ ● రోగుల సౌకర్యార్థం ఆర్వో ప్లాంట్ ● ఆస్పత్రిలో ముఖ ద్వారం వద్ద ఆర్చ్ నిర్మాణం ఆస్పత్రిలో 24 గంటలవైద్య సేవలు ● పీహెచ్సీలో 24గంటలు అందుబాటు లో ఉంటూ సేవలందిస్తున్న డాక్టర్,వైద్య సిబ్బంది. ● ఆస్పత్రి ఆవరణను రోజూమూడు సార్లు శుభ్రంచేస్తున్న పారిశుధ్య సిబ్బంది. ● పీహెచ్సీలో ప్రతి రోజు ఓపీ 75 నుంచి 80 వరకు ఉంటుంది. ● సోమవారం సంత రోజు 150కు పైగా ఓపీ ఉంటుంది. ● ప్రతి నెల పీహెచ్సీలో 15 నుంచి 20 కాన్పులు జరుగుతున్నాయి. ● మందులు పుష్కలంగా ఉన్నాయి. పీహెచ్సీలో లేని మందులు బయట నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు. ● ఆస్పత్రిలో ఒక అంబులెన్స్తోపాటు ఒక తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంది.ఆనందంగా ఉంది అనంతగిరి పీహెచ్సీని ఎన్క్యూఏఎస్ బృందం సభ్యులు గత నెల 24, 25 తేదీల్లో పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను, రోగులకు వైద్యు లు అందిస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూశారు. వైద్య సిబ్బంది సేవలు సైతం గుర్తించారు. పీహెచ్సీకి గుర్తింపు లభించడం చాలా ఆనందంగా ఉంది. పీహెచ్సీని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలుతీసుకుంటున్నాం. – జ్ఞానేశ్వరి, డాక్టర్, అనంతగిరి పీహెచ్సీ అనంతగిరి(అరకులోయటౌన్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సమకూర్చిన సౌకర్యాలతో ప్రజారోగ్య సదుపాయల కల్పనలో రాష్ట్రంలోనే మేటి పీహెచ్సీగా అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రాష్ట్రంలో మూడు పీహెచ్సీలు.. తూర్పుగోదావరి జిల్లా సారంగధర మెట్ట, అనంతపురం జిల్లా శ్రీనివాసనగర్, అల్లూరి జిల్లా అనంతగిరి పీహెచ్సీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా అందులో అనంతగిరి పీహెచ్సీ 91.64 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. గత నెల 24, 25 తేదీల్లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్క్యూఏస్) బృందం ప్రతినిధులు మనీషా, షణ్మఖవేల్ పీహెచ్సీలో రోగులకు అందిస్తున్న సేవలు, ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు,పరిసరాలు, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. రోగులకు వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలందిస్తున్నట్టు గుర్తించిన ఎన్క్యూఏఎస్ బృందం ఈనెల 16వ తేదీన జాతీయ స్థాయి గుర్తింపు పత్రాన్ని వాట్సప్ ద్వారా అందించారని డాక్టర్ జ్ఞానేశ్వరి తెలిపారు. గుర్తింపు ప్రక్రియ ఇలా.. పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ), ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రులకు ఎన్క్యూఏఎస్ గుర్తింపు ఇస్తారు. ఆస్పత్రిని బట్టి గుర్తింపు లభించడానికి ప్రమాణాలు మారుతాయి. పీహెచ్సీల్లో ఆరు డిపార్ట్మెంట్లలో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏరియా ఆస్పత్రుల్లో 18 అంశాలను పరిశీలిస్తారు. సంబంధింత ఆస్పత్రికి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చి ఆస్పత్రిలో ప్రమాణాలన్నింటినీ పరిశీలించి, అనంతరం గుర్తింపు ఇస్తుంది. ఔట్ పేషెంట్లు, ఇన్పేషెంట్లు, డయాగ్నొస్టిక్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్, రోగులకు సమకూర్చిన సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. నాడు – నేడుతోనే... చాలా ఏళ్ల పాటు శిథిలభవనంలో కొనసాగిన అనంతగిరి పీహెచ్సీ రూపురేఖలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో పూర్తిగా మారాయి. నాడు–నేడు కార్యక్రమంలో రూ.45 లక్షలతో పూర్తిగా ఆధునికీకరించడతో పాటు అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే అగ్రస్థానంలో అనంతగిరి నిలవగలిగింది. నంతగిరి..నాడు–నేడు నిధులురూ. 45 లక్షలతో ఆస్పత్రి ఆధునికీకరణ, ఇతర సౌకర్యాల కల్పన రూ.3 లక్షల మండల పరిషత్, హెచ్డీఎస్నిధులతో మెట్లు,రిటైనింగ్ వాల్ నిర్మాణం సేవలు బాగున్నాయి. అనంతగిరి పీహెచ్సీలో వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయి. 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లవలసిన పని లేదు. – పంచాడి అప్పన్న, గిరిజనుడు, షాడ గ్రామం, అనంతగిరి మండలంఈనెల 16న వాట్సప్ద్వారా గుర్తింపు పత్రం అందజేత పూర్తి సహకారం పీహెచ్సీలో ఎటువంటి సమస్య లేకుండా మండల పరిషత్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఆస్పత్రిలో మెట్ల మార్గం, ప్రహరీ నిర్మాణానికి మండల పరిషత్ నుంచి రూ. రెండు లక్షలు, ఆస్పత్రి అభివృద్ధి నిధులు రూ.లక్ష కేటాయించాం. గిరిజన రోగులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నాం. – శెట్టి నీలవేణి, ఎంపీపీ, అనంతగిరి మండలం -
ఎస్టీ సర్టిఫికెట్లు పొందిన ఒడిశా వాసుల జాబితా ఇవ్వండి
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయటౌన్: ఒడిశా రాష్ట్రం నుంచి అరకులోయకు బతుకు తెరువు కోసం వచ్చి, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందిన వారి జాబితాను అందజేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పద్మాపుం సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శనివారం సచివాలయాన్ని ఎమ్మె ల్యే ఆకస్మికంగా సందర్శించారు. ఒడిశా నుంచి వచ్చిన వారంతా పద్మాపురం పంచాయతీ సంతో ష్నగర్లో ఎస్టీ సర్టిఫికెట్ పొంది, అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని, వారి వివరాలు అందజేయాలన్నారు. అనంతరం యండపల్లివలసలోని గురుకుల బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. వంటశాలకు వెళ్లి వంటకాలు పరిశీలించారు. నాణ్యమైన, రుచికరమైన పదార్థాలను వండి వడ్డించాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. -
టీడీపీలో అరాచకాలకు పాల్పడుతున్న నేతలకు అడ్డుకట్ట వేయాలి
ముంచంగిపుట్టు: మండలంలో తెలుగుదేశం పార్టీలో అరాచకాలకు పాల్పడుతున్న నాయకులకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు కోరారు. మండల కేంద్రం ముంచంగిపుట్టలో శనివారం టీడీపీ మండల నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కొంతమంది టీడీపీ నేతల వల్ల జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయకుండా తిరోగమన చర్యలకు పాల్పడుతున్న నాయకులపై అధిష్టానం దృష్టి పెట్టి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలో అందరినీ ఏకం చేయడంలో విఫలం అవుతున్న అసమర్థులను పదవుల నుంచి నుంచి తొలగించి, పార్టీ కోసం కష్టపడిన వారికి బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్చార్జులుగా, కుటుంబ సాధికార సారథులుగా నియమించాలని, గ్రామ కమిటీల్లో స్థానం కల్పించాలన్నారు. పార్టీలో నాయకుల తీరు మారకపోతే చాలా మంది నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. స్వార్థపూరిత రాజకీయ నాయకుల వల్ల టీడీపీకి భారీ నష్టం తప్పదన్నారు.అసమర్థ నాయకుల స్వార్థ ప్రయోజనాలతో నిస్వార్థమైన నేతలు, కార్యకర్తలు బలైపోతున్నారని తెలిపారు. తక్షణమే పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి పార్టీలో అసమర్థులను వారి స్థానాల నుంచి తొలగించాలని,లేని పక్షాన పార్టీకి భారీ సంఖ్యలో నేతలు,కార్యకర్తలు దూరమవతారని శాస్త్రిబాబుతో పాటు టీడీపీ నేతలు,కార్యకర్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ఆర్.నీలకంఠం పాత్రో, పార్టీ సీనియర్ నేతలు సుబ్రహ్మణ్యం,రఘునాఽథ్,రామదాసు,చిరంజీవి,పరుశురాం తదితరులు పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు అధిష్టానం దృష్టి పెట్టాలని డిమాండ్ -
విద్యుత్ వ్యర్థాలతో ఆరోగ్యానికి హాని
కలెక్టర్ దినేష్కుమార్చింతపల్లి: విద్యుత్ వ్యర్థాలతో ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. స్థానిక పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన వృథా విద్యుత్ పరికరాల సేకరణ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ గౌడతో కలసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఉన్న విద్యుత్ వ్యర్థ పరికరాలు, ప్టాస్టిక్ వస్తువుల వినియోగంతో అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయన్నారు. ఈ వ్యర్థాల వల్ల తాగునీరు, వాతావరణంలో కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. ప్లాస్టిక్, విద్యుత్ వ్యర్థ పరికరాలతో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం 10వేల జనాభా దాటిన చింతపల్లి, పాడేరు, పెదలబుడు, రంపచోడవరం పంచాయతీ కేంద్రాల్లో ఈ వ్యర్థ విద్యుత్ పరికరాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసిన ట్టు చెప్పారు. చింతపల్లి ఎంపీపీ,సర్పంచ్ తన దృష్టికి తీసుకువచ్చిన తాగునీరు, పారిశుధ్య స మస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాత బస్టాండ్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు నిర్వహించిన సీమంతం కార్యక్రమం, దివ్యాంగుల గుర్తింపు శిబిరంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మె ల్యే గిడ్డి ఈశ్వరి,డీఎల్పీవో కుమార్,ఉపాధి ఏపీడీ లాలం సీతయ్య,ఎంపీపీ కోరాబు అనూషదేవి,సర్పంచ్ దురియా పుష్పలత,ఎంపీడీవో శ్రీనివాసరావు ఎంఈవోలు ప్రసాద్, బోడంనాయుడు, డీటీ చంద్రశేఖర్, కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యపై గ్రామాల్లో ఆందోళన
ముంచంగిపుట్టు: తాగునీటి సమస్యను తీర్చాలని ఖాళీ బిందెలతో మండలంలో గల కించాయిపుట్టు పంచాయతీ గుమ్మసిరగంపుట్టు గ్రామంలో శుక్రవారం గిరిజన మహిళలు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన దిగారు. గ్రామంలో నీటి కోసం కష్టాలు పడుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎం.ఎం.శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా జరుగుతున్న పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. ఆర్డబ్ల్యూస్ ఆధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మకై బిల్లులు మాత్రం మారుస్తున్నారని, నీటి పనులు మాత్రం పూర్తి కావడం లేదని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులకు ఊటనీరే దిక్కుగా మారుతుందని ఆవేదన చెందారు. కలుషిత నీటితో గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి గుమ్మసిరగంపుట్టులో తాగునీటి సమస్య పరిష్కరించాలని లేనిపక్షంలో మండల కేంద్రంలో మహిళలతో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. గ్రామ మహిళలు పాల్గొన్నారు. ఎటపాక: వలస ఆదివాసీలు తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలపాడు గ్రామంలో దశాబ్దాల కాలంగా వలస ఆదివాసీలు నివాసముంటున్నారు. అయితే గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేసి వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు. సోలార్ వాటర్ ట్యాంక్ మూలకు చేరింది. దీంతో తాగునీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు సీపీఐ ఎంఎల్ మాస్లైన్ నాయకుడు సాయన్న ఆధ్వర్యంలో గతంలో ధర్నా చేసి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. శుక్రవారం ఖాళీ బిందెలతో సోలార్ వాటర్ ట్యాంక్ వద్ద స్థానికులు నిరసన తెలిపారు. అధికారులు స్పందించి గ్రామానికి విద్యుత్, రహదారి సౌకర్యం కల్పించి నీటి సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు. భీమరాజు, శాంతమ్మ, పాలమ్మ, కన్నమ్మ, లక్ష్మి, సునీత, పావని, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అండర్–23 క్రికెట్ జట్టు ఎంపికలు ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ నెట్స్లో శుక్రవారం అండర్–23 పురుషుల జట్టు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మూడేళ్లుగా వీడీసీఏ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లతో పాటు కొత్తగా మరికొందరు ఓపెన్ కేటగిరీలో అవకాశం దక్కడంతో.. వీరంతా ట్రయల్స్లో పాల్గొన్నారు. ఇప్పటికే వీడీసీఏ బ్యాటింగ్ విభాగంలో 27 మందిని, వికెట్ కీపర్లుగా ఐదుగురిని, ఫాస్ట్ బౌలర్లుగా 14 మందిని, స్పిన్నర్లుగా మరో 13 మందిని ప్రాబబుల్స్గా ఎంపిక చేసింది. అయితే ఔత్సాహిక క్రీడాకారులు తమకు అవకాశం ఇవ్వాలని కోరడంతో విశాఖ క్రికెట్ సంఘం స్పందించింది. ఓపెన్ కేటగిరీలో అవకాశం కల్పించడంతో ప్రాబబుల్స్తో పాటు దాదాపు ఇరవై మంది ఔత్సాహికులు ఈ ట్రయల్స్కు హాజరయ్యారు. ఈ ఎంపిక ప్రక్రియ శనివారం కూడా కొనసాగనుంది. సోమవారం విశాఖ జిల్లా అండర్–23 జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ జట్టు 2025–26 సీజన్లో జరిగే వన్డే, మల్టీ–డే ఫార్మాట్ మ్యాచ్ల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎంపిక ప్రక్రియలో వయసు ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆటగాళ్లను అనుమతించారు. బ్యాటింగ్, ఫీల్డింగ్తో పాటు బౌలింగ్ నైపుణ్యాల సెలెక్టర్లు నిశితంగా పరిశీలించారు. ప్రాబబుల్స్తో పాటు ఔత్సాహికులకు అవకాశం -
ఆన్లైన్ పరీక్షల్లో జియాన్ గోల్‘మాల్’!
పెందుర్తి: పోటీ పరీక్షల్లో వేలాది మంది అభ్యర్థుల విలాపానికి.. అడ్డదారిలో కొలువు దక్కించుకున్న వారి విలాసానికి వేదికగా చినముషిడివాడలోని జియాన్ డిజిటల్ కేంద్రం ఆరోపణలు మూటగట్టుకుంది. ఇక్కడ ప్రతిభ కంటే పైసాకే ఎక్కువ ప్రాధాన్యత అని ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే నిదర్శనం. ఈ కేంద్రంలో జరిగే ప్రతి పోటీ పరీక్షలోనూ అడ్డదారుల్లో అభ్యర్థులకు సహకారం అందుతోందని బాధిత అభ్యర్థులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతూ ఈ నెల 11న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) సూపర్వైజర్ ట్రైనీ ఇంజనీర్ ఆన్లైన్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ ఘటన వెలుగుజూసింది. గత నెల 25న ఇదే కేంద్రంలో జరిగిన అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పరీక్షలోనూ ఇదే తరహా మాల్ ప్రాక్టిస్ జరిగిందని కొంత మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ చైర్పర్సన్కు ఫిర్యాదు చేశారు. మాల్ ప్రాక్టీస్కు సంపూర్ణ సహకారం చినముషిడివాడ జియాన్ డిజిటల్స్లో ఏడేళ్లుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉద్యోగాలకు ఆన్లైన్ పరీక్షలు జరుగుతున్నాయి. గత రెండేళ్లుగా కేంద్రంలో ఆన్లైన్ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ కొందరు బ్రోకర్ల అవతారం ఎత్తి ఉద్యోగాన్ని బట్టి బేరం కుదుర్చుకుంటున్నారు. ఆ తర్వాత ఆన్లైన్ పరీక్ష కేంద్రం నిర్వాహకులతో ఒప్పందం చేసుకుని, పరీక్ష సమయానికి ఏం చేయాలనే అంశంపై ముడుపులిచ్చిన అభ్యర్థులకు ముందుగానే ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపణ. సదరు అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్ పాడవడం మొదటి ప్లాన్ అయితే, ముందుగానే జవాబు పత్రాన్ని అడ్మిట్ కార్డుపై ముద్రించడం రెండో ప్రణాళిక. ఇలా ఏదో ఒకటి అమలు చేసి డబ్బులు కట్టిన అభ్యర్థికి అధిక మార్కులు వచ్చేలా చేసి, మిగిలిన వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఒక్కో స్థాయిలో ఒక్కో వ్యవహారం వాస్తవంగా పరీక్ష కేంద్రంలో నిర్ణీత సమయంలో అభ్యర్థి తన అడ్మిట్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే ప్రశ్నాపత్రం ప్రత్యక్షమవుతుంది. ముందుగా లీక్ అయ్యే అవకాశం ఉండదు. అయితే ఆయా ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన బృందంలోని వ్యక్తులు బయటకు ఇస్తే మాత్రం బ్రోకర్లు దాన్ని సొమ్ము చేసుకుంటారు. ఇక ఆన్లైన్ పరీక్ష పర్యవేక్షణ చేసే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని డిజిటల్ కేంద్రమే ఏర్పాటు చేస్తుంది. టీసీఎస్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ అంతా కేంద్రానిదే. ఇక్కడి నిర్వాహకులు తమకు డబ్బులు చెల్లించిన అభ్యర్థికి కంప్యూటర్ పాడైందన్న సాకుతో సీసీ కెమెరాల పర్యవేక్షణ లేని మరో కంప్యూటర్ను కేటాయిస్తారు. అక్కడ పేపర్ను మొబైల్లో రికార్డు చేసుకుని, వీలైనంత వేగంగా దానికి కీ రూపొందిస్తారు. ఆ కీని అభ్యర్థికి అందించి, కష్టపడి చదివిన వారికి అన్యాయం చేస్తున్నారు. జియాన్ డిజిటల్ కేంద్రంలో ఇలాంటి వ్యవహారాలు చాలా జరిగినట్లు బలమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ మాల్ప్రాక్టీస్ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వెస్ట్ జోన్ ఏసీపీ పృధ్వితేజ విచారణాధికారిగా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భెల్, టీసీఎస్ల నివేదికలు కూడా ఈ కేసులో అత్యంత కీలకం కానున్నాయి. కాగా జియాన్ డిజిటల్ కేంద్రంలో ఆన్లైన్ పరీక్షలు జరిగే సమయంలో ఏనాడూ పోలీస్ బందోబస్తు కోసం అభ్యర్థించిన దాఖలాల్లేకపోవడం కొనమెరుపు. జియాన్ కేంద్రంగా జరిగిన పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్పై ఆరోపణలు ఉద్యోగ స్థాయిని బట్టి అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు! ‘భెల్’తో పాటు ఇతర పరీక్షల అవకతవకలపై ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు అన్ని పరీక్షల కాపీయింగ్పై ఉన్నతస్థాయిలో సమగ్ర విచారణ -
లోయలోకి దూసుకుపోయిన కారు
ముంచంగిపుట్టు: భూసిపుట్టు పంచాయతీ తుడుమురాయి గ్రామ సమీపంలో పర్యాటకుల కారు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. ముగ్గురు పర్యాటకులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు పెదబయలు మండలం తారాబు జలపాతం చూసేందుకు శుక్రవారం ఉదయం కారులో బయలుదేరారు. తుడుమురాయి గ్రామ సమీపంలోకి వచ్చేసరికి కారు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది. స్థానికులు హూటహూటిన ప్రమాదానికి గురైన ముగ్గురు యువకులను బయటకు తీశారు. స్వల్పగాయాలతో బయటపడ్డారు. అనంతరం సంఘటన స్థలం నుంచి భయంతో ముగ్గురు పరారయ్యారు. కారు మాత్రం లోయలోనే ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.ముగ్గురు పర్యాటకులకు స్వల్ప గాయాలు -
టెండర్
ఈపీడీసీఎల్కు● సబ్ స్టేషన్లు పంచుకుంటున్నారు ● ఈపీడీసీఎల్ పరిధిలో సబ్ స్టేషన్ల నిర్మాణంలో హస్తలాఘవం ● మూడు సంస్థలకే అన్ని ప్యాకేజీల అప్పగింత సాక్షి, విశాఖపట్నం : ఆస్తులు పంచుకున్నట్లు.. ఈపీడీసీఎల్లో పనులు పంచేసుకుంటున్నారు. అధికారుల అండదండలతో ఈ భాగంలో పనులు నీకు.. ఆ భాగంలో నీకు.. అంటూ వాటాలు వేసుకుంటూ మరీ.. టెండర్ల ప్యాకేజీలు అప్పనంగా అప్పగించేస్తున్నారు. సర్కిల్ ఏదైనా ఎలాంటి సబ్స్టేషన్ అయినా ఆ మూడు సంస్థలకే పనులు కట్టబెట్టేలా విద్యుత్ శాఖ అధికారులు హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకసారి టెండర్ ధర కంటే లెస్కు వేస్తే మరోసారి అధికంగా వేస్తారు. అయినా వారికే కాంట్రాక్టులు కట్టబెడతారు. ఇటీవల దాదాపు 35 సబ్ స్టేషన్ల నిర్మాణ పనులన్నీ మూడు కాంట్రాక్టు సంస్థల జేబుల్లోకే వెళ్లిపోయాయి. గత ఏడాది కాలంలో ఈపీడీసీఎల్ పరిధిలో 35 సెమీ ఇండోర్ సబ్ స్టేషన్లు, అవుట్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సర్కిళ్ల వారీగా టెండర్లు పిలిచారు. ఇక్కడే విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్కనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం సర్కిల్, విశాఖపట్నం (పాతసర్కిల్) పరిధిలో 3 సెమీ ఇండోర్ సబ్స్టేషన్లు, 6 అవుట్డోర్ సబ్స్టేషన్ల నిర్మాణంతో పాటు కనెక్టింగ్ లైన్స్, ఇంటర్ లింకింగ్ లైన్స్ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్యాకేజీగా టెండర్లు పిలిచారు. అదేవిధంగా పాత తూర్పుగోదావరి సర్కిల్ పరిఽధిలో 8 అవుట్ డోర్ సబ్స్టేషన్లు, 8 ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణం, ఇతర పనులకు, పాత పశ్చిమ గోదావరి సర్కిల్ పరిధిలో 5 అవుట్డోర్, 5 ఇండోర్ సబ్స్టేషన్లు, ఇతర పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. మొత్తం 35 సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల్ని మూడు ప్యాకేజీలుగా సర్కిళ్ల వారీగా విభజించారు. మీరు లెస్కు.. మేం ఎక్సెస్కు.. సదరు కాంట్రాక్టు సంస్థలు కూడా ఈ పనుల విషయంలో రింగ్గా వ్యవహరించినట్లు ఈపీడీసీఎల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ప్రాంతంలో టెండరు విలువ కంటే తక్కువకు కోట్ చేస్తే.. మరో ప్రాంతంలో అధిక ధరకు టెండరు దాఖలు చేశారు. వారు ఎలా టెండర్ ఫైల్ చేసినా.. ఇవ్వాలన్నదే విద్యుత్ అధికారుల అంతిమ లక్ష్యంగా వ్యవహరించారని సమాచారం. విజయనగరం, విశాఖపట్నం సర్కిళ్ల పరిధిలో రూ.21.77 కోట్లకు టెండర్లు పిలవగా సదరు సంస్థ 1.31 శాతం అధికంగా రూ.22.06 కోట్లకు టెండర్ వేసింది. అయినా సదరు కాంట్రాక్టు సంస్థకే టెండరు దక్కింది. అదేవిధంగా పాత పశ్చిమ గోదావరి సర్కిల్ పరిధిలో రూ.16.42 కోట్లకు టెండర్లు పిలిస్తే 1.35 లెస్తో రూ.16.2 కోట్లతో టెండర్లు దాఖలు చేసిన సంస్థకు అప్పగించారు. 13.6 శాతం లెస్కు వేస్తే నాణ్యత ఎలా.? ఇక పాత ఈస్ట్గోదావరి సర్కిల్ పరిధిలో విచిత్రంగా తక్కువ ధరకే పనులు చేసేస్తామంటూ సదరు సంస్థ టెండరు దాఖలు చేసింది. ఈ సర్కిల్ పరిధిలో రూ.18.58 కోట్లకు టెండర్లు పిలిచారు. అయితే అధికారుల అనుయాయ కాంట్రాక్టు సంస్థ ఏకంగా 13.6 శాతం లెస్కు అంటే రూ.16.06 కోట్లకు టెండర్ ఫైల్ చేసింది. విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, కనెక్టింగ్ లైన్స్, ఇంటర్లింకింగ్ లైన్స్ని పూర్తి నాణ్యతతో నిర్మించాలి. కానీ సదరు సంస్థ 13.6 శాతం లెస్కు వేసినప్పుడు తక్కువ సొమ్ముతో నాణ్యమైన సబ్స్టేషన్లు నిర్మాణం ఎలా సాగుతుందన్న ఆలోచన విద్యుత్ శాఖ అధికారులకు వచ్చినా వాటన్నింటినీ పక్కనపెట్టేసి పనులు కట్టబెట్టెయ్యడం గమనార్హం. కాంట్రాక్టు సంస్థలకు విద్యుత్ శాఖ అధికారులు దాసోహం అన్నట్లుగానే విద్యుత్ శాఖ అధికారులు ఈపీడీసీఎల్ పరిధిలో ఏ భారీ టెండర్ అయినా.. సదరు మూడు సంస్థలకే ప్రథమ ప్రాధాన్యమిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిల్కి ఒక కాంట్రాక్టర్ చొప్పున.. సర్కిళ్ల వారీగా పిలిచిన ఈ పనులను ఈపీడీసీఎల్ను శాసిస్తున్న మూడు కాంట్రాక్టు సంస్థలకు వచ్చేలా టెండర్ల నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు కాంట్రాక్టు సంస్థలు తమ క్వాలిఫికేషన్లకు అనుగుణంగానే టెండర్ల నిబంధనలు దగ్గరుండి మరీ తయారు చేసినట్లు తెలుస్తోంది. వారి అడుగులకు మడుగులొత్తే విధంగా విద్యుత్ శాఖ అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించారు. తాము ముందుగా అనుకున్నట్లుగానే టెండర్లను మూడు భాగాలుగా విభజించి ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో కాంట్రాక్టర్కు పంచేశారు. -
ముత్యాలమ్మ ఉత్సవానికి ముహూర్తపు రాట
చింతపల్లి: మండల కేంద్రంలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకూ ముత్యాలమ్మ తల్లి జాతర జరగనుంది. జాతరకు సంబంధించి ఇప్పటికే ఉత్సవ కమిటీ అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. జాతర ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారి ఆలయం వద్ద ముహుర్తపు రాట వేశారు. ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్థలతో జరిగింది. ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దురియా హేమంత్కుమార్, పసుపులేటి వినాయకరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనూషాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు బాలయ్య, భక్తులు పాల్గొన్నారు. జాతర విజయవంతానికి అందరూ అన్ని విధాలుగా సహకరించాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. బేతాళుడు, జోగేశ్వరరావు, రమణమూర్తి, రమణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి
అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని వెంకయ్యపాలెం–చిలకలగెడ్డ మధ్యలో శుక్రవారం జరిగిన రోడ్ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మరణించారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అందజేసిన వివరాలు.. ఎన్.ఆర్.పురం పంచాయతీలో వీఆర్ఏగా పనిచేస్తున్న జన్ని మచ్చయ్య (45) కె.లచ్చయ్యతో కలసి స్కూటీపై శృంగవరపుకోట వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా అరకు నుంచి వస్తున్న వాహనం వీరిని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో మచ్చయ్య స్పాట్లోనే మరణించారు. గాయపడిన లచ్చయ్యను శృంగవరపుకోటకు స్థానికులు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం లచ్చయ్యను విశాఖపట్నం కేజీహెచ్కు రిఫర్ చేశారు. సంతల్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటుచేయాలి డుంబ్రిగుడ: గిరిజన ప్రాంతంలోని వారపు సంతల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అరకు నియోజకవర్గ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులతో కలిసి మండల కేంద్రంలోని వారపు సంతలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంతల్లో తాగునీటి సదుపాయం, సామాజిక మరుగుదొడ్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటుచేయాలన్నారు. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి రైతుల అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేయాలన్నారు. రైతుల తమ సరకులను భద్రపరుచుకునేందుకు కోల్ట్ స్టోరేజీలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. సంతలో రహదారి అధ్వానంగా ఉందని, బాగు చేయాలని కోరారు. నాయకులు సుబ్బారావు, అప్పారావు, గాసి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామగ్రామానికీ వైద్య సేవలు అందాలి.. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి.. ముఖ్యంగా పేదలకు ఏ కష్టం రాకూడదు.. ఇదీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన విలేజ్ హెల్త్ క్లినిక్ ఆశయం. జిల్లాలో 135 గ్రామ పంచాయతీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు నెలకొల్పి, భవనాలు నిర్మ
పూర్తయిన భవనాలనుఅప్పగిస్తాం పూర్తయిన భవనాలను అప్పగించి విలేజ్ హెల్త్ క్లినిక్లు అందుబాటులోకి వచ్చేలా చూస్తాము. ప్రస్తుతం నిర్మాణ పనుల్లో ఉన్న భవనాల నివేదికను ఉన్నతాధికారులకు పంపించాము. నిధులు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాము. –టి.కొండయ్య పడాల్,పీఆర్ ఈఈ, పాడేరు డివిజన్ ఉత్తమ ఆశయానికి గండి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనతో గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో విలేజ్ క్లినిక్లకు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం ఆ ప్రయోజనాలు ప్రజలకు చేరకుండా చేస్తోంది. వెంటనే క్లినిక్ భవనాలకు నిధులు మంజూరు చేసి అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయాలి. – సిరగం భాగ్యవతి, వైస్ ఎంపీపీ, ముంచంగిపుట్టు మండలం నిధులు విడుదల చేయని చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 135 విలేజ్ హెల్త్ క్లినిక్లు మంజూరు నేటికీ నిర్మాణ దశలోనే 96 భవనాలు అందుబాటులోకి వస్తే గ్రామాల చెంతకే మెరుగైన వైద్యంముంచంగిపుట్టు: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కార్యక్రమాలు రాజకీయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగిపోవాలి. ముఖ్యంగా వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం తగదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు వైద్య ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. విలేజ్ హెల్త్ క్లినిక్ అనే కాన్సెప్ట్ గ్రామీణ ప్రజలకు వరం. రాజకీయాలకు అతీతంగా ఆ ఆశయాన్ని కొనసాగిస్తే కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కానీ చంద్రబాబు సర్కారు ఆలోచన వేరే విధంగా ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేసిన ముద్రను చెరిపేయాలన్నదే వారి ఉద్దేశం. నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్న 30 భవనాలను కూడా ప్రారంభించడానికి మనసు రాలేదంటే ఇంకేమనుకోవాలి. ప్రస్తుతం విలేజ్ క్లినిక్లు సొంత గూడు లేక సబ్ సెంటర్లు, సచివాలయాల్లో మొక్కుబడిగా నడుస్తున్నాయి. ఎక్కడి పనులు అక్కడే జిల్లాలో 135 గ్రామ పంచాయతీల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మించడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పనులు చేపట్టేందుకు ఒక్కో భవనానికి రూ.20 లక్షల 80 వేలు కేటాయించారు. రూ.28 కోట్ల 70 లక్షల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి, అప్పట్లోనే రూ.12 కోట్ల 80 లక్షలు విడుదల చేశారు. 39 భవనాలు పూర్తయ్యాయి. 96 నిర్మాణ దశలో ఉండగా ప్రభుత్వం మారింది. కూటమి సర్కారు పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. సుమారు రూ.16 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంది. అది జరగకపోవడంతో విలేజ్ హెల్త్ క్లినిక్ల భవనాలు నిర్మాణ స్థాయిలోనే నిలిచిపోయాయి. పునాదులు, గోడలకే పరిమితమయ్యాయి. అధికారంలోకి వచ్చిన మూడు నెలలోనే అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ల భవనాలు పూర్తి చేస్తామని ఎన్నికల ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా వాటి ఊసే లేదు. బిల్లులు విడుదల కాక నిలిచిన నిర్మాణాలు విలేజ్ హెల్త్ క్లినిక్ల భవన పనులు బిల్లులు విడుదల కాకపోవడంతో నిలిచిపోయాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన భవనాలకు కూటమి ప్రభుత్వం ద్వారా బిల్లులు అందుతాయన్న నమ్మకం లేక కాంట్రాక్టర్లు గత 10 నెలలుగా పనులు చేయకుండా వదిలేశారు. కొన్నిచోట్ల దాదాపు పూర్తి చేసిన భవనాలకూ నిధులు విడుదల చేయలేదు. నిధులు అందిన తరువాతే భవనాలు అప్పగిస్తామని గుత్తేదారులు భవనాలకు తాళాలు వేసి కూర్చున్నారు. అప్పుడు కేటాయించిన నిధులు సరిపోవని, అప్పటితో పోలిస్తే సామగ్రి, ఇసుక, సిమెంట్, ఐరెన్ వంటి ధరలు అమాంతం పెరిగిపోయాయని, నిధులు పెంచాలని కొంతమంది కోరుతున్నారు.కుమడలో పూర్తయినా ప్రారంభానికి నోచుకోని విలేజ్ హెల్త్ క్లినిక్ భవనంగ్రామీణ ప్రజలకు వరంవిలేజ్ హెల్త్ క్లినిక్ కలనిజం చేయాలి జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి వ్యాధులకు 10 కిలోమీటర్ల దూరంలో లబ్బూరు పీహెచ్సీకి వెళ్లడం కష్టంగా ఉంటుంది. కిలోమీటర్ దూరంలో బరడ పంచాయతీ కేంద్రంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ఉంటే సత్వర వైద్యం పొందవచ్చును. ముఖ్యంగా గర్భిణుల సాధారణ పరీక్షలకు వ్యయప్రయాసలు తగ్గుతాయి. –కోడా విక్రమ్, బలియగూడ గ్రామం, బరడ పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం మండలాల వారీగా విలేజ్ హెల్త్ క్లినిక్ల వివరాలు అడ్డతీగల–9, అనంతగిరి–14, అరకువేలి–2, కూనవరం–1, కొయ్యూరు–13, జి.మాడుగల– 10, గంగవరం–4, గూడెం కొత్తవీధి– 10, చింతపల్లి–7, చింతూరు–5, డుంబ్రిగూడ–6, దేవీపట్నం–5, పాడేరు–3, పెదబయలు–6, మారేడుమిల్లి–5, ముంచంగిపుట్టు– 10, రంపచోడవరం–6, రాజవొమ్మంగి–5, వరరామచంద్రపురం–1, వై.రామవరం–4, హుకుంపేట–9 చొప్పున మొత్తం 135 విలేజ్ హెల్త్ క్లినిక్లు మంజూరయ్యాయి. విలేజ్ హెల్త్ క్లినిక్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుతాయి. పల్లెలోనే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, చికిత్స, కుటుంబ నియంత్ర సలహాలను అందిస్తారు. సాధారణ జ్వరం, జలుబు, బీపీ, సుగర్, ఇతర సాధారణ అనారోగ్యాలకు చికిత్స అందిస్తారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడం, ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం, చికిత్స ప్రారంభించి, అరికట్టడం జరుగుతుంది. సీహెచ్వో, సచివాలయాల ఏఎన్ఎం, ఆశా వర్కర్లు విలేజ్ క్లినిక్లో వైద్య సేవలు అందిస్తారు. క్లినిక్లో 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. -
కీ బోర్డుపై క్రీస్తు గీతాలు
–ఇద్దరు బాలలకు గిన్నిస్ బుక్ సర్టిఫికెట్ మోతుగూడెం/ముంచంగిపుట్టు: హోలెల్ మ్యూజిక్ స్కూల్ ప్రోత్సాహంతో క్రీస్తు గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో పాల్గొని ఇద్దరు బాలలు ప్రతిభ చూపారు. గిన్నిస్ బుక్ సర్టిఫికెట్ సొంతం చేసుకున్నారు. కీబోర్డు వాయిస్తున్న సంగీత కళాకారుల బృందం గంటలో 1046 వీడియోలు అప్లోడ్ చేసింది. ఇందులో ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు పంచాయతీ మొంజాపుట్టు గ్రామానికి చెందిన గడుతుల కామేశ్వరరావు, పుష్పకళ దంపతుల కుమారుడు జాసన్ జోయెల్ అనే బాలుడు పాల్గొన్నాడు. చింతూరు మండలం మోతుగూడెం జెడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న వేముల ఇజ్రాయిల్ కూడా ప్రతిభ చూపాడు. గత ఏడాది డిసెంబర్లో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సంగీత కచేరీలో వీరు పాల్గొన్నారు. 18 దేశాలకు చెందిన వాయిద్య కళాకారులతో కలిసి పాల్గొని గంట వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
జాతీయ వర్క్షాపులో అరకు జెడ్పీటీసీ
అరకులోయ టౌన్: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ హర్యానాలోని రోతాక్లో నిర్వహించిన రెసిడెన్షియల్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వర్క్షాప్లో అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి పాల్గొన్నారు. ఐదు రోజులపాటు జరిగిన వర్క్షాప్లో పాల్గొని తిరిగి వచ్చిన జెడ్పీటీసీ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, రవాణా, పారిశుధ్యం తదితర అంశాలపై వర్క్షాప్ నిర్వహించారన్నారు. తాను రోడ్లు, విద్య అంశాలపై నివేదిక ఇచ్చానని, ఈ రంగాల్లో అభివృద్ధికి పలు సూచనలు చేశానన్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన అరకులోయ మండలం గన్నెల పంచాయతీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రహదారుల గురించి తాను సమర్పించిన పత్రంలో పేర్కొన్నానని చెప్పారు. ఏజెన్సీలో ఇంకా చాలాచోట్ల విద్య, విద్యుత్, తాగునీరు, పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందని చెబుతూ.. గిరిజనులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరినట్టు జెడ్పీటీసీ శెట్టి రోషిణి చెప్పారు. రాష్ట్రం నుంచి తనతోపాటు తిరుపతి జిల్లా తెల్లకూర్ జెడ్పీటీసీ ప్రిస్కిల్లా, అధికారులు హాజరైనట్టు ఆమె వివరించారు. -
గుర్తేడుపై పోలీస్ గురి
రంపచోడవరం: అల్లూరి మన్యంలో పట్టు కోల్పోయిన మావోయిస్టులు తిరిగి తమ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. వై.రామవరం మండలంలో గుర్తేడు పోలీస్ స్టేషన్ మొదటి నుంచి మారేడుమిల్లిలోనే కొనసాగుతోంది. తాజాగా గుర్తేడులోనే తాత్కాలిక పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పోలీసులు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. గత 20 ఏళ్లుగా మారేడుమిల్లిలోనే కొనసాగుతున్న గుర్తేడు స్టేషన్ను ఒక్కసారిగా గుర్తేడులో ఏర్పాటు చేయడంతో ఏజెన్సీలో చర్చ జరుగుతోంది. దండకారణ్యంలో మావోయిస్టులపై నిర్బంధకాండ కొనసాగడంతో ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయి. దీంతో ఇక్కడ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులు గుర్తేడులో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి అక్కడ గిరిజనులు, యువతతో మమేకమయ్యారు. గుర్తేడులోనే రాత్రి బస చేశారు. 40 మంది మావోయిస్టుల సంచారం! ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో మావోయిస్టు కదలికలతో అల్లూరి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ పోలీసులు గుర్తేడు, పాతకోట, సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా కూబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల మావోయిస్టు కీలక నేత కాకూరి పండయ్య అలియస్ జగన్ గుర్తేడు, పాతకోట గ్రామాల్లో మోటార్ బైక్పై తిరిగినట్లు పోలీసుల వద్ద సమాచారముంది. పండయ్య ఈ ప్రాంతానికి చెందిన వాడు కావడంతో ఎందుకొచ్చాడు, మావోల వ్యూహం ఏమిటనేది తెలుసుకునేందుకు పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. 40 మంది వరకు మావోయిస్టులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏవోబీ దళ డిప్యూటీ కమాండర్ రవి ఆధ్వర్యంలో ఒడిశా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన మావోయిస్టులు కూడా సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కీలకమైన రోడ్డు పనులు పూర్తి చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో నిలిచిపోయిన పాతకోట–మంగంపాడు రోడ్డు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. అలాగే పాతకోట– ధారకొండ రోడ్డు, వై.రామవరం– ఉప్పర గోతుల, మఠం భీమవరం రోడ్డు పనులను పూర్తి చేసి లోతట్టు ప్రాంతంలో గ్రామాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో సెల్ టవర్లు నిర్మించి సమాచార వ్యవస్థ బలోపేతం చేస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి గిరిజన యువత మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై సర్వత్రా చర్చ అడవిని జల్లెడ పడుతున్న బలగాలు మావోయిస్టు కీలక నేత సంచారంపై అప్రమత్తమైన పోలీసులు -
విద్యార్థి దశ నుంచేఉన్నత లక్ష్యాలు
చింతపల్లి: విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ అన్నారు. చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల 17 వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. కశాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.విజయభారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సబ్కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థి దశలోనే మంచి లక్ష్యాలను, అలవాట్లను నిర్దేశించుకోవాలన్నారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసపాత్రుడు, అధ్యాపకులు లీలాపావని, కెజియారాణి, సంతోషిణి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
● పాడేరును కుదిపేసిన భారీ వర్షం ● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు ● జిల్లాలో పలుచోట్ల స్తంభించిన జనజీవనం ● విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం పాడేరు: జిల్లా అంతటా శుక్రవారం కుంభవృష్టి కురిసింది. ఈదురుగాలుల బీభత్సానికి భారీ నష్టం జరిగింది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాడేరు పరిసర ప్రాంతాల్లో ఉదయం ఎండ చుర్రుమనిపించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. వెనువెంటనే భారీ వర్షం కురిసింది. గాలులకు పట్టణంలో తలారిసింగి వద్ద భారీ వృక్షం నేలమట్టమైంది. పాడేరు–చోడవరం ప్రధాన రహదారి సాయిబాబా ఆలయం సమీపంలో మరో భారీ వృక్షం రహదారికి అడ్డంగా పడిపోయింది. దీంతో అక్కడ నిలిపి ఉన్న స్కూటీ పూర్తిగా ధ్వంసమైంది. భారీ వృక్షం విద్యుత్ స్తంభాలు, తీగలపై పడింది. పాడేరు–జి.మాడుగుల ప్రధాన రహదారిపై డి.గొందూరు సమీపంలో భారీ మామిడి చెట్టు నేలపై కూలిపోయింది. పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆర్ఆండ్బీ అధికారులు, స్థానికులు కలిసి చెట్లను తొలగించడంతో వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగించాయి. జిల్లాలో చాలాచోట్ల రాత్రి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నీకు అంతరాయం ఏర్పడింది. దీంతో సోంపేట, పాడేరు జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన మ్యాచ్ను నిర్వాహకులు నిలిపివేశారు. శుక్రవారంనాటి వర్షాల వల్ల మామిడి, జీడి పంటలకు నష్టం వాటిల్లింది. రహదారులను వర్షపు నీరు ముంచెత్తింది. డుంబ్రిగుడలోని పోతంగి పంచాయతీ చంపాపట్టి గ్రామంలో ఈదురుగాలులకు పాఠశాల పైకప్పు ఎగిరిపోయింది. కొయ్యూరు మండలంలోని నడింపాలెం రహదారికి అడ్డంగా భారీ వృక్షం పడిపోయింది. దీంతో నడింపాలెం–పెదమాకవరం రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. గూడెం కొత్తవీధి రంపుల ప్రాంతంలో వడగళ్ల వాన కురిసింది. -
సారా బట్టీలపై దాడి–ఇద్దరి అరెస్టు
● 1600 లీటర్ల బెల్లపు పులుపు ధ్వంసం అడ్డతీగల: మండలం కిమ్మూరు సమీపాన సారా బట్టీపై గురువారం దాడులు నిర్వహించి 1600 లీటర్లు బెల్లపు పులుపుని ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సిఐ శ్రీధర్ తెలిపారు. దాడిలో సంఘటనా స్థలం నుంచి 30 లీటర్లు సారా స్వాధీనం చేసుకొని, ఇద్దరు సారా తయారీదారులను అరెస్ట్ చేశామన్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించామన్నారు. సారా తయారీ, క్రయ,విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీధర్ హెచ్చరించారు. సారాపై ఎటువంటి సమాచారం ఇచ్చినా గోప్యంగా ఉంచి నిరోధానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. -
కార్యదర్శిపై చర్యలకు డిమాండ్
పెదబయలు: మండలంలోని గోమంగి గోమంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి మనోజ్కుమార్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈవోపీఆర్డీ నర్సింగరావుకు ఉప సర్పంచ్ కూడ మత్స్యకొండబాబు, వైఎస్సార్సీపీ నాయకులు సత్తిబాబు, టీడీపీ నాయకుడు పురసకారి భాస్కరరావు తదితరులు గురువారం వినతిపత్రం అందజేశారు. గత రెండు నెల నుంచి కార్యదర్శి విధులకు గైర్హాజరమవుతున్నారని అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అతని స్థానంలో మరో కార్యదర్శిని నియమించాలని కోరారు. లేనిపక్షంలో జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
స్టార్ రేటెడ్తోనే ఇంధన పొదుపు, కాలుష్య నివారణ
ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ చంద్రంసాక్షి, విశాఖపట్నం : భారత ప్రమాణాల బ్యూరో(బీఈఈ) సూచించిన స్టార్ రేటెడ్ విద్యుత్ పరికరాల వినియోగంతో ఇంధన పొదుపుతో పాటు కర్బన ఉద్గారాల నియంత్రణ సాధ్యమవుతుందని ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్(ఫైనాన్స్) చంద్రం అన్నారు. డిస్కమ్ల సామర్థ్య నిర్మాణం, డిమాండ్కు అనుగుణంగా ఇంధన సామర్థ్య నిర్వహణ(డీఎస్ఎం) అంశంపై నగరంలోని ఓ హోటల్లో గురువారం సదస్సు నిర్వహించారు. ఈపీడీసీఎల్, బీఈఈ, ఐసీఎఫ్ సహకారంతో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు డీఎస్ఎంకి ఉపయుక్తమయ్యే విధానాలపై చర్చించారు. బీఈఈ, ఐసీఎఫ్ కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం తగ్గించడమే లక్ష్యంగా గృహ విద్యుత్ పరికరాలను ప్రారంభించారు. అనంతరం డైరెక్టర్ చంద్రం మాట్లాడుతూ డీఎస్ఎం సూచించిన పరికరాలను వినియోగిస్తే విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చన్నారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో ఓఎస్డీ శివరామ్కుమార్ మాట్లాడుతూ విశాఖలో ప్రారంభించిన కార్యక్రమం ఏపీ, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లోని డిస్కమ్లలోనూ సాగుతుందన్నారు. గృహ విద్యుత్ రంగంలో 10 లక్షల ఎల్ఈడీ ట్యూబ్లైట్లు, 8 లక్షల బీఎల్డీసీ ఫ్యాన్ల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఐసీఎఫ్ కన్సల్టింగ్ ఇండియా ప్రైవేట్లిమిటెడ్ ఎండీ గురుప్రీత్ చుగ్ తెలిపారు. వాణిజ్య రంగంలో 4 లక్షల ట్యూబ్లైట్లు, 1.6 లక్షల ఫ్యాన్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈపీడీసీఎల్ ఎనర్జీ కన్జర్వేషన్ సోలార్ ఎనర్జీ సీజీఎం శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో బీఈఈ, ఈపీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు. -
సీబీఐ, ఈడీలు బీజేపీ జేబు సంస్థలా?
డాబాగార్డెన్స్: దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఓ జడ్జి ఇంట్లో రూ.500 కోట్ల నల్లధనం దొరికితే చిన్న కేసు కూడా పెట్టలేని ప్రధాని మోదీ, అమిత్షా ఏం చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ప్రశ్నించారు. విశాఖలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చింతా మాట్లాడుతూ మాజీ సీఎం ఇంట్లో రూ.5 లక్షలు కనిపిస్తే పట్టుకుని, జడ్జి ఇంట్లో రూ.500 కోట్లు కనిపిస్తే ఈ రోజు దాకా కేసు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీలు బీజేపీ జేబు సంస్థల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఓ జడ్జిని కలిసేందుకు ఎవరు వెళ్లినా.. వాటర్ బాటిల్ను కూడా స్క్రీనింగ్ చేస్తారని.. అలాంటిది అంత డబ్బు జడ్జి ఇంట్లోకి ఎలా చేరిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డు ఆస్తులపై వాదనలు విన్న తర్వాత, భారత రాజ్యాంగం అంటే ఏంటో కేంద్ర ప్రభుత్వానికి తెలియదనిపించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి మామూలు వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో వర్గీకరణ విషయానికొస్తే మాల, మాదిగల గూర్చి చంద్రబాబు చాలా బాధతో ఉపన్యాసం ఇచ్చారని, మైన్స్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల్లో కూడా వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీ కేసులు దారుణమని, దాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మీడియాతో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ -
పాత గంగవరం తీరంలో విద్యార్థి గల్లంతు
పెదగంట్యాడ: పాత గంగవరం తీరంలో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. శ్రీనగర్, గాజువాక చైతన్య టెక్నో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, గాజువాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన ఇద్దరు విద్యార్థులు స్నేహితులు. వీరందరూ కలసి మూడు సైకిళ్లపై గురువారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో పాత గంగవరం తీరానికి వెళ్లారు. అందరూ కలసి సముద్రంలో స్నానం చేసిన తర్వాత బయట వచ్చి ఇసుకలో ఆటలాడుతుండగా.. అందులో రోహిత్, భరత్, తనూష్ మళ్లీ సముద్రంలోకి వెళ్లారు. సరదాగా గడుపుతుండగా కెరటాల ఉధృతికి నడుపూరుకు చెందిన ఒనుం తనూష్(15) సముద్రంలోకి కొట్టుకొనిపోయాడు. విద్యార్థిని రక్షించేందుకు తోటి స్నేహితులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న గాజువాక ఏసీపీ త్రినాథ్, న్యూపోర్టు పోలీస్ స్టేషన్ సీఐ కామేశ్వరరావు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. విద్యార్థి ఆచూకీ కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. తనూష్ తండ్రి మంగరాజు ఫిర్యాదు మేరకు న్యూపోర్టు పోలీస్స్టేషన్ సీఐ కామేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగని మృత్యుఘోష
కై లాసపట్నం పేలుడులో గాయపడిన మరొకరు మృతి కోటవురట్ల: బాణసంచా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజు నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. కై లాసపట్నంలోని విజయలక్ష్మి గణేష్ ఫైర్ క్రాకర్స్లో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 8 మంది గాయపడిన సంగతి తెలిసిందే. అందులో రాట్నాలపాలేనికి చెందిన జల్లూరి నాగరాజు (50) 90 శాతం కాలిన గాయాలతో విశాఖలోని కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. కాగా మెడికవర్లో చికిత్స పొందుతున్న విజయలక్ష్మి గణేష్ క్రాకర్స్ మేనేజర్ మడగల జానకీరాం పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మిన్నంటిన రోదనలు నాగరాజు మృతదేహం విశాఖ నుంచి కోటవురట్ల శివారు రాట్నాలపాలేనికి సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంది. ఉదయమే నాగరాజు మృతి చెందిన సంగతి గ్రామంలో తెలియడంతో విషాదఛాయలు అలముకున్నాయి. వివాద రహితుడు, అందరితో మంచిగా తిరిగే నాగరాజు మృతి అందరినీ కన్నీరుపెట్టించింది. భార్యా పిల్లలు గుండెలవిసేలా రోదించారు. వారిని ఆపడం ఎవరితరం కాలేదు. మృతుడు నాగరాజుకు భార్య అప్పలనర్స, కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె మౌనిక ఉన్నారు. కన్నీటి రోదనల మధ్య నాగరాజు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. -
న్యాయం కావాలి
● పెట్రోల్ బాటిల్తో సెల్ టవర్ ఎక్కిన ‘రెవెన్యూ’ బాధితుడు ● అన్యాయంగా తన స్థలం వేరొకరి పేరుతో రిజిస్టర్ చేశారని ఆవేదన ● పదేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపణ ● రెవెన్యూ అధికారుల హామీతో శాంతించిన శంకర్రావుఅచ్యుతాపురం రూరల్: కొంతమంది ప్రభుత్వ అధికారుల స్వార్థం వల్ల ఎన్నో నిండు జీవితాలు రోడ్డున పడుతున్నాయని లంక ధర్మవరం గ్రామానికి చెందిన లంక హరినాగ శంకర్రావు ఆవేదన చెందాడు. తరతరాలుగా అదే ఇంట్లో ఉంటూ.. తమ పొలాల్లో సాగు చేసుకుంటూ జీవనం గడిపే సమయంలో ఒక్కసారిగా.. ఇది మీ భూమి కాదు, మీరు నివసిస్తున్న ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి.. అనడంతో తనకు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితి నెలకొందని శంకర్రావు వాపోయాడు. తన స్థలం మరొకరి పేరిట రిజిస్టర్ చేశారు, న్యాయం చేయమని పది సంవత్సరాలుగా నాయకులు, అధికారుల వద్దకు తిరిగి అలసి విసుగు చెంది తనకు న్యాయం జరగదని భావించిన శంకర్రావు గురువారం ఉదయం అచ్యుతాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ పైకి ఎక్కి నిరసన తెలియజేశాడు. తనతోపాటు పెట్రోల్ బాటిల్, లైటర్ తీసుకువెళ్లి కాల్చుకొని మరణిస్తానని బెదిరించాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ ఫోన్ చేసి మాట్లాడగా అధికారులు ఇచ్చిన హామీ మేరకు సెల్ఫోన్ టవర్ దిగాడు. అనంతరం తహసీల్దార్ లంక ధర్మవరం గ్రామానికి చేరుకుని తగాదాల్లో ఉన్న భూములపై విచారణ చేపట్టారు. భూ రికార్డులు తారుమారు చేసిన అప్పటి తహసీల్దార్పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కన్వీనర్ రొంగలి రాము డిమాండ్ చేశారు. ఇటువంటి అనేక భూ సమస్యలు మండలంలో కోకొల్లలుగా ఉన్నా అధికారులెవరూ పట్టించుకోవట్లేదన్నారు. -
తీర్మానాలు లేకుండా ఏ పనులు చేయకూడదు
ఎమ్మెల్సీ అనంతబాబురంపచోడవరం: తీర్మానాలు లేకుండా ఏ విధమైన పనులు చేయకూడదని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు) అన్నారు. రంపచోడవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బందం శ్రీదేవి అధ్యక్షతన గురువారం జరిగింది. సమావేశంలో జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అన్ని శాఖల పనితీరుపై ఎమ్మెల్సీ సమీక్షించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రారంభోత్సవాల్లో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగితే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మూడు నెలలకు ఒకసారి జరిగే మండల పరిషత్ సమావేశానికి అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. ఈ సమవేశంలో చర్చించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ పండా కుమారి, ఎంపీటీసీలు ఉలవల లక్ష్మి, తుర్రం వెంకటేశ్వర్లుదొర, కుంజం వంశీ, నర్రి పాపారావు,కృష్ణకుమారి, ఖాజావలీ తదితరులు పాల్గొన్నారు. -
ఐజీ శ్రీనివాస్కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం
ఆరిలోవ: విశాలాక్షినగర్ కేంద్రంగా ఉన్న కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ) ఆరాధ్యుల శ్రీనివాస్ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ పతకం అందుకున్నారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన సీఆర్పీఎఫ్ 86వ వార్షికోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా చేతుల మీదుగా ఆయన ఈ పతకం స్వీకరించారు. 34 ఏళ్లుగా శ్రీనివాస్ అందిస్తున్న సేవలు, ఆయన నాయకత్వ పటిమ, నిబద్ధత, దేశ భద్రతకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. స్థానికుడైన ఐజీ శ్రీనివాస్కు ఈ పురస్కారం లభించడం పట్ల సీఆర్పీఎఫ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. -
పైసా వసూల్
అటవీ శాఖ..మారేడుమిల్లి, తులసిపాకలులో ఫారెస్ట్ చెక్ పోస్టుల ఏర్పాటు వాహనాలు, పర్యాటకుల నుంచి ఇష్టానుసారంగా డబ్బుల వసూళ్లు చార్జీల వసూలు తగదంటున్న పర్యాటకులు రంపచోడవరం: పర్యావరణ పరిరక్షణ, ఆహ్లాదం మాటున అడ్డగోలు నిబంధనలతో చెక్పోస్టులు ఏర్పాటు చేసి మరీ వాహనచోదకులు, పర్యాటకుల నుంచి అటవీశాఖ రుసుం వసూలు చేస్తోంది. ఏజెన్సీ అందాలు చూసేందుకు వచ్చిన సందర్శకుల నుంచి నాలుగు నెలలుగా అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు స్థానిక గిరిజనులు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను వదలిపెడుతున్నారని, వాటిని తొలగించడం కోసమే చెక్పోస్టులు ఏర్పాటు చేసి, డబ్బులు వసూలు చేస్తున్నామని అటవీ అధికారులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాల నుంచీ రుసుం వసూలు పాపికొండలు అభయారణ్యం పరిధిలో ఎన్విరాన్మెంట్ మెంటైనెన్స్ చార్జీలుకు అటవీ శాఖ అధికారులు మారేడుమిల్లి, తులసిపాకలు వద్ద చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఏజెన్సీలో ప్రవేశించిన వారి నుంచి ఈ చెక్పోస్టుల ద్వారా నగదు వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల నుంచి రూ.20, భారీ వాహనాల నుంచి రూ.100, అతి భారీ వాహనాల నుంచి రూ.150 వసూలు చేస్తున్నారు. అలాగే పర్యాటకులు డిజిటల్, ప్రొఫెషనల్ కెమెరాలు వెంట తీసుకువెళితే రూ.500 చెల్లించాలి, ఎన్విరాన్మెంట్ మెంటైనెన్స్ చార్జీ జరిమానా కింద రూ.500 వసూలు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు తమకు నచ్చిన విధంగా చార్జీలు నిర్ణయించారని, ఏజెన్సీ ప్రాంతం నుంచి వెళ్లేందుకు మేం ఎందుకు డబ్బులు కట్టాలని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా మారేడుమిల్లి ఏజెన్సీలో అటవీశాఖ అధికారులు ఇలాంటి నిబంధనలు పెట్టడం తగదంటున్నారు. అన్నింటికీ అధిక ధరలు మారేడుమిల్లిలో అన్ని వస్తువులు బయట ప్రాంతం కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.వాటర్ బాటిళ్లు, సిగరెట్లు తదితర వస్తువులపై అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారు.ఇక పర్యాటక అతిథి గృహాలకు డిమాండ్ను బట్టి ధరలను నిర్ణయించి, సందర్శకులను అడ్డుగోలుగా దోచుకుంటున్నారని పర్యాటకులు వాపోతున్నారు. అటవీ శాఖ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం పేరుతో పర్యాటక అతిథి గృహాలను నిర్వహిస్తోంది. అయితే ఎంతో కాలంగా సీబీఈటీలో అడిట్ నిర్వహించలేదు. వచ్చిన డబ్బులు దేనికి ఖర్చు చేస్తున్నారు, పర్యాటక అభివృద్ధికి ఏం చేస్తున్నారు వంటి వివరాలు అటవీ శాఖ వద్ద లేవు. పర్యాటకుల నుంచి వివిధ చార్జీలు, సౌకర్యాల కల్పన రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న అటవీ శాఖ ఏజెన్సీ ప్రాంభం నుంచి మారేడుమిల్లి వరకు మహిళల కోసం పబ్లిక్ మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. గుడిసెకు వెళ్లే పర్యాటకుల నుంచి వసూలు చేసిన డబ్బులకు ఇప్పటికీ లెక్కాపత్రం లేదనే విమర్శలు ఉన్నాయి.డబ్బుల వసూలు అన్యాయం ఏజెన్సీప్రాంతానికి వచ్చిన పర్యాటకుల నుంచి ఎడపెడా డబ్బులు వసూలు చేస్తున్నారు. చెక్పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేయడం అన్యాయం. గుడిసె సందర్శ కులు, అతిథి గృహాల ద్వారా వచ్చిన డబ్బులకు నేటికీ సరైన లెక్కలు లేవు.పబ్లిక్ అడిట్ పెట్టి లెక్కలు తేల్చాలి. అటవీ శాఖ నిర్వహిస్తున్న అతిథి గృహాలను తక్కు వ ధరకు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలి. – దూడ స్మిత్, మారేడుమిల్లి ప్లాస్టిక్ ఏరివేతకుఉపయోగిస్తున్నాం పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ సీసాలు, కవర్లు ఏరివేసేందుకు చెక్పోస్టులు ద్వారా వచ్చిన డబ్బులు వినియోగిస్తున్నాం.సేకరించిన ప్లాస్టిక్ను రంపచోడవరంలోని ప్లాస్టిక్ కోనుగోలు చేసే వారికి పంపుతున్నాం. – ఏడుకొండలు, రేంజర్, మారేడుమిల్లి -
కార్యకర్తలకు ఏ కష్టం రానివ్వం
రంపచోడవరం: నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తమదని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు), మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. రంపచోడవరం మండలం వెలమలకోటలో గురువారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేయాలన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మిర్చీకి గిట్టుధర కల్పించి, క్వింటాకు రూ.23 వేలు చెల్లిస్తే, కూటమి ప్రభుత్వం రూ.11వేలు నిర్ణయించిందని, దీంతో విలీన మండలాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు అవస్థలకు గురవుతున్నారని, కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఏజెన్సీలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి,వైస్ఎంపీపీ పండా కుమారి, నాయకులు జల్లేపల్లి రామన్నదొర, పండా రామకృష్ణదొర,రాపాక సుదీర్కుమార్, ఎంపీటీసీలు ఉలవల లక్ష్మి, సర్పంచ్లు మంగా బొజ్జయ్య, వడగల ప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి -
కిశోర బాలికలు క్రమశిక్షణతో మెలగాలి
గంగవరం : కిశోర బాలికలు క్రమ శిక్షణతో మెలగాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో పీవో కట్టా సింహాచలం అన్నారు. సీడీపీవో సీహెచ్.లక్ష్మి ఆధ్వర్యంలో కొత్తాడ కేజీబీవీలో కిషోర బాలికలకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పీవో మాట్లాడుతూ టీనేజ్లో గర్భం ధరించడం వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ సందర్భంగా కస్తూర్భా గాంధీబాలికా విద్యాలయంలో ఉన్న సమస్యల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. సీడీపీవో లక్ష్మి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మల్లేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ సత్యవతి, ఇన్చార్జి హెచ్ఎం భారతి, మహిళా సంరక్షణ కార్యదర్శులు వెంకటలక్ష్మి, భద్రమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలి అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన బాలబాలికలను సమీప ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. గురువారం కొత్తాడ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీడీపీవో సీహెచ్.లక్ష్మి ఆధ్వర్యంలో కొత్తాడ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమంలో పాల్గొన్న పీవో ప్రీస్కూల్ పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం గర్భిణులు, తల్లులతో మాట్లాడి పోషకాహారం సక్రమంగా అందుతుందో, లేదో అడిగి తెలుసుకున్నారు. బాలసంజీవని, బాలామృతం కిట్లను పరిశీలించారు. సంతృప్తికరంగా సేలందిస్తున్న కొత్తాడ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త శిరీష పీవో అభినందించారు. సీడీపీవో లక్ష్మి, ఎంఈవో మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సూపర్ వైజర్ సత్యవతి, అంగన్వాడీ కార్యకర్తలు శిరీష, జ్యోతి, సీతారామలక్ష్మి, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
భూ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం
పాడేరు: జిల్లాలో భూ సమస్యలను ప్రణాళికబద్ధంగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సమస్యలపై గురువారం నిర్వహించిన వర్క్షాపులో ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అందిన ఫిర్యాదులు ఇప్పటికీ పూరిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు. రెవెన్యూ శాఖలో పెండింగ్ సమస్యలపై సీఎం దృష్టి సారించారని చెప్పారు. రెవెన్యూ అధికారులు గుర్తించిన సమస్యలను కేటగిరీల వారీగా విభజించి, నిబంధనల మేరకు సత్వర పరిష్కారం చూపాలన్నారు. ఆర్వోఆర్, ఇనాం భూముల భూ స్థిరీకరణ, రీ సర్వే తదితర సమస్యలపై ఆన్లైన్, ఆఫ్లైన్లలో తేడాలను సరిచేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో పద్మాలత, ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం పెరగాలి పాడేరు : జిల్లా అభివృద్ధిలో లాభాపేక్షలేని సంస్థల భాగస్వామ్యం మరింత పెరగాలని కలెక్టర్, జిల్లా లాభాపేక్షలేని సంస్థల ఫోరం చైర్మన్ దినేష్కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లా లాభాపేక్ష లేని సంస్థల ఫోరం మొదటి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం లాభాపేక్ష లేని సంస్థల సహకారం పెరగాలన్నారు. జిల్లా స్థాయి ఫోరంతో పాటు ఎంపీడీవో నోడల్ అధికారిగా వివిధ సంస్థల సహకారంతో మండల స్థాయి ఫోరాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఆయన లాభాపేక్ష లేని సంస్థల ప్రజెంటేషన్ను వీక్షించారు. సుమారు పది సంస్థలు చేస్తున్న, చేయబోతున్న కార్యకలాపాలను ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎస్ డబ్ల్యూ ఇన్చార్జి పీఎస్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డీఈవో బ్రహ్మాజీరావు, డీడబ్ల్యూ డీడీ రజనీ, స్కిల్ డెవలెప్మెంట్ అధికారి రోహిణి, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, డ్వామా పీడీ విద్యసాగర్, నీతి ఆయోగ్ ప్రతినిధులు నారాయణరెడ్డి, చైతన్యరెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
అనంతగిరి పీహెచ్సీకి జాతీయ స్థాయి గుర్తింపు
అనంతగిరి(అరకులోయటౌన్): అనంతగిరి పీహెచ్సీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను ఈ గుర్తింపు లభించినట్టు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వరి తెలిపారు. గత నెల 24న నేషనల్ క్యాలిటీ అస్యూరెన్స్ స్టాండర్ట్స్ బృందం పీహెచ్సీని సందర్శించినట్టు ఆమె చెప్పారు.గత ప్రభు త్వ హయాంలో నాడు– నేడు పథకం ద్వారా పీహెచ్సీని ఆధునికీకరించగా, ఆస్పత్రి డెవలప్మెంట్ ఫండ్తోపాటు మండల పరిషత్ నిధులు కేటాయించి ఎన్క్యూఏఎస్ ప్రమాణాలకు అనుగుణంగా పీహెచ్సీని తీర్చిదిద్దడంతో ఈ గుర్తిపు లభించినట్టు ఆమె తెలిపారు. ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని, తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎంపీపీ శెట్టి నీలవేణి తెలిపారు. -
చికెన్తో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ
అడ్డతీగల: చికెన్తో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గిరిజన మహిళలకు హీపర్ ఇంటర్నేషనల్,నవజీవన్ సంస్థలు సంయుక్తంగా శిక్షణ ఇచ్చాయి. అడ్డతీగల మండలం రేగులపాడులో సోమన్నపాలెం,రేగులపాడు గ్రామాలకు చెందిన గిరిజన మహిళలకు హీపర్ ఇంటర్నేషనల్ రంపచోడవరం డివిజన్ ప్రాజెక్ట్ అధికారి సునీత గురువారం శిక్షణ ఇచ్చారు. చికెన్ పచ్చడి తయారీ,మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.చికెన్ పచ్చడి తయారు చేసిన తరువాత మూడు నెలల పాటు నిల్వ ఉంటుందన్నారు. సంఘంగా ఏర్పడి బయట ప్రాంతాల్లో మార్కెటింగ్ చేస్తే వ్యాపారం బాగా సాగుతుందన్నారు. -
28 నుంచి ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె
పెదబయలు: తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్టు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సహాయకుల (ఫీల్డ్ అసిస్టెంట్ల) సంఘం నాయకులు కూడ రాజారావు, కొండలరావు తెలిపారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఈవోపీఆర్డీ నర్సింగరావుకు వారు సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2016 నుంచి 2025 సంవత్సరం వరకు 9 ఏళ్ల పాటు ఒక్క వేతనం రూపాయి కూడా పెంచలేదని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిజన ప్రాంతంలో పర్యటించడంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కనీస వేతనాల పెంపు విషయం ప్రస్తావిస్తారని భావించామని, నిరాశే ఎదురైందని వారు చెప్పారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, భౌతికదాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, మండల యూనిట్గా అంతర్గత బదిలీలు చేయడం ద్వారా స్థానిక ఒత్తిడులను అధిగమించి సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని, మరణ పరిహారం రూ.10 లక్షలు ఇవ్వాలని, విద్యార్హత ఆధారంగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పది రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని తెలిపారు. ఈ నెల 21న పెన్ డౌన్ చేస్తామని, 28వ తేదీ నుంచి పూర్తిగా విధులను బహిష్కరిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో చింతా కొండలరావు, ప్రసాదరావు, సుశీల, పార్వతి, బాలన్న, తదితరులు పాల్గొన్నారు. ఈవోపీఆర్డీకి నోటీసు అందజేత వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ -
362 కిలోల గంజాయి స్వాధీనం
● జీపు సీజ్, ఒకరి అరెస్ట్ పాడేరు : గుత్తులపుట్టు–పెదబయలు మార్గంలో పాడేరు ఎకై ్సజ్ సిబ్బంది ఓ జీపులోంచి 362 కిలోల ఎండు గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పాడేరు ఎకై ్సజ్ సీఐ టి.వి.వి.ఎస్.ఎన్. ఆచారి తెలిపిన వివరాలిలా ఉన్నాయి...ముందస్తు సమాచారం మేరకు గుత్తులపుట్టు–పెదబయలు మార్గంలో ఎకై ్సజ్ సిబ్బంది పెట్రోలింగ్ చేశారు. ఆ సమయంలో వచ్చిన జీపును ఆపగా, అందులో ఉన్న ఇద్దరిలో ఓ వ్యక్తి పరారయ్యాడు. జీపులో ఉన్న కిముడు దివాకర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, విచారించినట్టు ఎకై ్సజ్ సీఐ చెప్పారు. పరారైన వ్యక్తి పెదబయలు మండలం అరడకోట గ్రామానికి చెందిన కిముడు అనిల్ అని తెలిసిందన్నారు. భోగంపుట్టు గ్రామానికి చెందిన అల్లంగి భగవాన్ అనే వ్యక్తి నుంచి గంజాయి తీసుకొని వస్తుండగా కిముడు అనిల్ పారిపోయాడన్నారు. గంజాయి తరలించేందుకు వినియోగించిన జీపు వంతాల ప్రభాకర్దిగా తేలిందన్నారు. 362 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని జీపును సీజ్ చేశామన్నారు. ఈ గంజాయి రవాణాలో ప్రమేయం ఉన్న, పరారీలో ఉన్న వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ టాస్క్పోర్స్ సీఐలు బాల నరసింహ, భాను సత్యనారాయణ, సిబ్బంది తాతయ్య, రాజ్కుమార్, పూర్ణ చంద్రరావు, బాలమురళి పాల్గొన్నారు.