breaking news
Alluri Sitarama Raju District Latest News
-
సురక్షిత ప్రాంతాల్లోనే ఉండండి
అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణిసాక్షి, పాడేరు: భారీ వర్షాలు, వరదల సమయంలో అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజరాణి కోరారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఎంపీ సోమవారం ప్రకటన విడుదల చేశారు. వర్షాలతో కొండవాగులు, గెడ్డలు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో ఆయా పరివాహక ప్రాంతాల ప్రజలంతా గెడ్డలు దాటి ప్రయాణాలను మానుకోవాలని, సురక్షిత ప్రాంతాలకే పరిమితమవ్వాలని ఆమె సూచించారు. ప్రమాదకరంగా వరద నీరు ప్రవహించే కల్వర్టులు, కాజ్వేలపై వాహనాల రాకపోకలను అధికారులు నియంత్రించాలని, వైద్యసేవలకు అంతరాయం లేకుండా వైద్యబృందాలు పనిచేయాలని, అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సహాయక కార్యక్రమాల కోసం అల్లూరి జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని, ఎలాంటి ఇబ్బందులున్నా ప్రజలు 08935293448 నంబర్కు ఫోన్ చేసి తగిన సాయం పొందాలన్నారు. ప్రజలు అత్యవసర సమయంలో 9966633304, 9494995333, 9494414619 నంబర్లకు ఫోన్ చేసి తన కార్యాలయం వారిని సంప్రదించవచ్చన్నారు. -
సంక్షేమ హాస్టళ్లలో ఉన్నత ప్రమాణాలు
కొమ్మాది: సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చేరుతున్న విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారం, విద్య అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. రుషికొండ దరి గీతం యూనివర్సిటీలో ఉమ్మడి ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, అధికారులతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. హాస్టళ్లలో సీట్ల భర్తీ, టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణత, హాస్టల్ భవనాల మరమ్మతులు, డైట్ బిల్లుల చెల్లింపు, పారిశుధ్య నిర్వహణ, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, వసతి తదితర అంశాలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి, కార్యదర్శి ఎం.ఎం.నాయక్లతో కలసి జిల్లాల వారీగా సమీక్షించారు. గత ఏడాది నీట్లో స్వల్ప తేడాతో సీట్లు పొందలేకపోయిన ఎస్సీ విద్యార్థులకోసం లాంగ్ టెర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. హాస్టల్లో విద్యార్థులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు చేయించాలన్నారు. హాస్టళ్ల అభివృద్ధిలో భాగంగా రూ.100 కోట్లతో 29 నూతన భవనాలు, రూ.58 కోట్లతో టాయిలెట్స్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. సమావేశంలో విశాఖ జిల్లా ఉపసంచాలకుడు కె.రామారావు, డీడీ లక్ష్మీసుధ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ తరగతులు ప్రారంభం పీఎంపాలెం: రాష్ట్ర ప్రభుత్వం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సోమవారం ప్రారంభించారు. పరదేశిపాలెం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 8 నెలల పాటు ఈ ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నెలకు రూ. 2.5లక్షల వేతనంతో జర్మనీలో నర్సింగ్ ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మొదటి దశలో 75 మందికి అవకాశం ఉండగా, ప్రాథమికంగా ఆసక్తి చూపిన 29 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్, డైరెక్టర్ లావణ్య వేణి, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి డోలా ఆదేశం -
మేధోసంపత్తి హక్కులపై అవగాహన
చింతపల్లి: విద్యార్థులు మేధొసంపత్తి హక్కులపై అవగాహన కలిగి ఉండాలని హైకోర్టు న్యాయవాది వై.బాబ్జి అన్నారు. డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయభారతి ఆధ్వర్యంలో సోమవారం మేథోసంపత్తి హక్కులు ఆవిష్కరణలపై రెండురోజులు జాతీయ సెమినార్ను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఆయన హాజరై ప్రసింగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో మేథోసంపత్తి అనేది మానవ మేథస్సు యొక్క కనిపించని సృష్టిని కలిగి ఉన్న ఆస్తి వర్గం అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్ డాక్టర్ పండుపడాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ మేథోసంపత్తి మెదడుతో సృష్టించబడిన వాటికి సంబంధించిదన్నారు. ఈ సందర్భంగా అతిథులను సన్మానించారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస పాత్రుడు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
గంజాయి సాగు నిర్మూలనపై దృష్టి
జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడపాడేరు: జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్మూలన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. ఐటీడీఏలోని తన చాంబర్లో సోమవారం అటవీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, డీఆర్డీఏ, ఐసీడీఎస్, ఎస్ఎంఐ అధికారులతో గంజాయి నిర్మూలన కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేసిన సాగు భూముల్లో గంజాయి సాగు చేయకుండా ఎలాంటి పర్యవేక్షణ చేపడుతున్నారని అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెక్పోస్టుల వద్ద గంజాయి రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గ్రామైక్య సంఘాల సమావేశాల్లో గంజాయి నిర్మూలనపై చర్చించాలన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలను పంపిణీ చేయాలన్నారు. గంజాయి సాగు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎన్బీఎస్ నంద్, డీఆర్డీఏ పీడీ మురళి, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీలక్ష్మి, ఎస్ఎంఐ డీఈ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి
ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంరంపచోడవరం/గంగవరం: వివిధ శాఖల అధికారులు, సిబ్బంది వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. గంగవరం మండలం నెల్లిపూడి ట్రామ సమీపంలోని మెయిన్ రోడ్డుపై ఉన్న కల్వర్టును సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్, డీఎస్పీ సాయిప్రశాంత్లతో కలి సి పీవో సోమవారం పరిశీలించారు. వర్షాల కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో వర్షాలు తగ్గే వరకు సందర్శకులను అనుమతించవద్దన్నారు. ముఖ్యమైన ప్రాంతాల బాధ్యతను అధికారులకు అప్పగించామన్నారు. -
నిత్యావసర సరకుల కోసం వెళ్లి..
హుకుంపేట: అడ్డుమండ గ్రామానికి చెందిన కంబిడి కుమారస్వామి (45) వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. హుకుంపేట–పాడేరు మండలాల సరిహద్దు మోదాపుట్టు–అడ్డుమండను కలిపే ప్రధాన వంతెనపై వరద ప్రవాహం పెరిగింది. ఆదివారం సాయంత్రం కుమారస్వామి మోదాపుట్టు గ్రామానికి నిత్యావసర సరకుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా కల్వర్టు దాటే ప్రయత్నంలో కాలు జారి ఉప్పొంగిన ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్తులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కుమారస్వామి ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. -
రూ.500 కోట్లతో ఆధునికీకరణ ఒప్పందాలు
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చుట్టూ ఎత్తయిన కొండలు, జాలు వారే జలపాతాలు, ఆకట్టుకునే ప్రకృతి సోయగాల మధ్య తళుక్కున మెరిసే విద్యుత్ కాంతి రేఖ.. మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రారంభమైన మొదటి విద్యుత్ కేంద్రం ఇది. 70 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు 1931లోనే బీజం పడింది. అప్పటి బ్రిటిషు శాస్త్రవేత్త హెన్రీ హెవర్టు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న సమయంలో మాచ్ఖండ్ జల విద్యుత్కేంద్రం నిర్మాణం కోసం రిపోర్టును తయారు చేయించారు. 1941 నుంచి 1943 వరకు సర్వేలు చేసి అనుకూలమైన ప్రదేశాన్ని గుర్తించారు. 1946లో విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను రూ.18 కోట్లతో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత ఈ విద్యుత్ కేంద్రం ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టుగా అమల్లోకి వచ్చింది. ఈ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో ఆంధ్రకు 70 శాతం, ఒడిశాకు 30 శాతం చొప్పున వినియోగించుకోవాలని రెండు రాష్టాలు నిర్ణయించుకున్నాయి. 7 సంవత్సరాల క్రితం 50ః50 చొప్పున ఇరు రాష్టాలు సమానంగా వినియోగించుకోవాలని ఒప్పందాన్ని సవరించారు. డుడుమ, జోలాపుట్టు జలాశయాల మీదే ఆధారం.. మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ, జోలాపుట్టు జలా శయాల పైన ఆధారపడి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. డుడుమ జలాశయ నీటి సామర్ధ్యం 2590 అడుగులు, జోలాపుట్టు జలాశయ నీటి సామర్ధ్యం 2750 అడుగులు. ఈ రెండు జలాశయాలకు మత్స్యగెడ్డ నీరే దిక్కు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటిని ఏడాది పొడవునా 2 జలాశయాల్లో నిలువ ఉంచుతారు. మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి ఘనమైన చరిత్ర స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ప్రారంభమైన మొదటి విద్యుత్ కేంద్రం ఆధునికీకరిస్తే మరింత ఉత్పత్తికి ఆస్కారం నేడు మాచ్ఖండ్ ప్రాజెక్టు ఆవిర్భావ దినోత్సవం ఈ ప్రాజెక్టును ఆధునికీకరించాలని ఇరు రాష్ట్రాలు 2012లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. రూ.500 కోట్లు వ్యయమయ్యే ఆధునికీకరణకు సంబంధించి నివేదిక తయారు చేసే బాధ్యతను టాటా కన్సల్టెన్సీ కంపెనీకి ఏపీ జెన్కో వర్గాలు అప్పగించాయి. ఈ కంపెనీ బృందం అధ్యయనం చేసి నివేదికను ఆంధ్ర–ఒడిశా ప్రభుత్వాలకు రెండేళ్ర క్రితం అందజేసింది. ఆధునికీకరణ జరిగితే ప్రస్తుతం 120 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 150 మెగావాట్లకు పెరిగే ఆస్కారం ఉంది. -
మన్యంలో ప్రమాద ఘంటికలు
రికార్డు స్థాయిలో కురిసిన వర్షంఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలు హుకుంపేట: బొడ్డాపుట్టులో ఖరీఫ్ పంట భూముల మీదుగా ప్రవహిస్తున్న వరద నీరుడుంబ్రిగుడ: ఎస్ఐ చొరవతో మృతదేహాన్ని గెడ్డ దాటించి స్వగ్రామం తరలిస్తున్న బంధువులుసాక్షి, పాడేరు: జిల్లావ్యాప్తంగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో జిల్లాలోని ప్రధాన గెడ్డలు, వాగుల్లో వరద ఉధృతి నెలకొంది. పాడేరు–హుకుంపేట సరిహద్దులోని దిగుమోదాపుట్టు గెడ్డను దాటుతూ అడ్డుమండ గ్రామానికి చెందిన కుమారస్వామి అనే గిరిజనుడు ఆదివారం సాయంత్రం గల్లంతయ్యాడు. జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో విస్తరించిన మత్స్యగెడ్డలో వరద నీరు అధికమై పరదానిపుట్టు కాజ్వే మీదుగా ప్రవహిస్తుంది. పాడేరు, పెదబయలు మండలాల్లోని సుమారు 100 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మారుమూల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. చింతూరు డివిజన్లో అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో సోకిలేరుతోపాటు అనేక గెడ్డలలో వరద ఉధృతి నెలకొంది. చింతూరు నుంచి వి.ఆర్.పురం, కూనవరం మండలాలకు రవాణా స్తంభించింది. అలాగే ఎగువ నుంచి వచ్చే వరద నీరుతో శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల పరిస్థితిపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలతో లోతట్టు వ్యవసాయ భూములు చెరువులుగా మారాయి. ఇటీవల వేసిన వరినాట్లు చాలా ప్రాంతాల్లో కొట్టుకుపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, జి.మాడుగుల, చింతపల్లి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. వర్షాలు, వరదల కారణంగా పర్యాటక కేంద్రం చాపరాయిని మూసివేశారు. చింతూరు డివిజన్లో నిలిచిన రాకపోకలు గోదావరి, శబరి నదుల్లోనూ వరద ఉధృతి ప్రమాదకరంగా మత్స్యగెడ్డ లోతట్టు భూముల్లో వరిపంట మునక దిగుమోదాపుట్టు గెడ్డ దాటుతూ గిరిజనుడు గల్లంతు పాడేరు మండలంలో అత్యధిక వర్షపాతం మృతదేహంతో గెడ్డ దాటలేక.. డుంబ్రిగుడ: అరకులోయ ఏరియా ఆస్పత్రిలో సోమవారం అనారోగ్యంతో మృతి చెందిన పోంతంగి పంచాయతీ చంపపట్టి గ్రామానికి చెందిన కిల్లో మల్లేష్ (18) మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు బంధువులు అష్టకష్టాలు పడ్డారు. స్వగ్రామానికి తీసుకువెళ్లాలంటే అడ్డంగా గెడ్డ పొంగి ప్రవహిస్తుండటంతో ఎస్ఐ కె.పాపినాయుడు చొరవ తీసుకొని పోలీసు సిబ్బందితో కుసుమగుడ, కితలంగి వెళ్లే వంతెన వద్ద మృతదేహాన్ని గెడ్డ దాటించి కుటుంబానికి అప్పగించారు. దిగువ కొల్లాపుట్టులో జలపాతం వద్ద గెడ్డ ఉధృతికి జెట్టి లక్షణ్ ఆటో కొట్టుకుపోవడాన్ని గమనించిన స్ధానికులు తాడు సహాయంతో ఒడ్డుకు లాగారు. సీలేరు: భారీ వర్షాలకు పెద్ద గంగవరం తురలు వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లాల్సిన బస్సులను దారి మళ్లించి, కేడీ పేట మీదుగా నడిపారు. గూడెం మండల కేంద్రం నుంచి సీలేరు మీదుగా పాలగెడ్డ వరకు ఉన్న 80 కిలోమీటర్ల రహదారి గోతుల్లో వర్షం నీరు చేరి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. డొంకరాయి రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. గుమ్మురేవులు పంచాయతీ మారుమూల కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిందని గిరిజనులు తెలిపారు. -
అసౌకర్యాలతో సతమతం
ముంచంగిపుట్టు: మండలంలో గల జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా ముంచంగిపుట్టు ఏకలవ్య పాఠశాల నిర్వహణ అంతా పెదబయలు మండల కేంద్రంలోని వైటీసీలో జరగుతూ వస్తుంది. ఐటీడీఏ పివో ఆదేశాల మేరకు సోమవారం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులకు లబ్బూరు పాఠశాలకు తరలించారు. రూ.12కోట్లతో నిర్మిస్తున్న లబ్బూరు పాఠశాల భవనాలు పూర్తికాకుండనే అధికారులు తరలించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రసుత్తం కురుస్తున్న వర్షాలకు కొన్ని గదుల్లోకి వర్షపు నీరు చేరి విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు. ఏకలవ్య పాఠశాల తరలింపుపై కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరి కొంతమంది సౌకర్యాల కల్పనపై మండిపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వచ్చిన ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ రాముడుతో విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ లబ్బూరు ఏకలవ్య పాఠశాలలో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని, వర్షాపు నీరు గదులలోకి వస్తుందని,రాకుండా చర్యలు తీసుకోవాలని,అన్ని భవనాలు వేగంగా పూర్తి చేయాలని తల్లిదండ్రులు కోరారు. -
వైఎస్సార్సీపీ మరింత బలోపేతమే లక్ష్యం
పాడేరు: నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీను మరింత బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందేలా పనిచేయాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇటీవల వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన చింతపల్లి జెడ్పీటీసీ పోరురాజు బాలయ్య పడాల్, వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన జీకే వీధికి చెందిన బొబ్బిలి లక్ష్మణ్, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చింతపల్లికి చెందిన జల్లి సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవులు ఇవ్వడంపై వారు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలో పార్టీని అన్ని వర్గాలతో కలుపుకుంటూ మరింత బలోపేతం చేయాలని, పార్టీ పిలునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు వారికి సూచించారు. -
25 నాటికి బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఈనెల 25వ తేదీ నాటికి బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రత్యేక శ్రద్ధతో బీఎల్ఏల నియామకం పూర్తి చేయాలన్నారు. ప్రతి బూత్ లెవెల్కు ఇద్దరు ఏజెంట్లను నియమించాలన్నారు. ఉన్నత చదువులు చదివిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టనున్న నేపఽథ్యంలో బీఎల్ఏల నియామకం త్వరితగతిన చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బీఎల్ఏలు వారి పోలింగ్ బూత్ పరిధిలో కొత్తగా ఓటర్లను చేర్పించుకునేందుకు, దొంగ ఓట్లు ఉన్నట్లయితే తొలగింపు కోసం అభ్యంతరాలు నమోదు చేసేందుకు, అలాగే వైఎస్సార్సీపీకి చెందిన వారి పేరు తొలగించినట్లయితే అటువంటి వివరాలను బూత్ లెవెల్ అధికారి దృష్టికి తీసుకువెళ్లి ఓటర్ల జాబితాలో తిరిగి నమోదు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇటీవల పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను వైఎస్సార్సీపీ నాయకులకు తెలియకుండానే కూటమి ప్రభుత్వ పెద్దలు మార్చేశారన్నారు. అందువల్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గం పరిధిలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. ఈ నెల 18, 19వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. గెడ్డలు, వాగులు దాటవద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు సేవలందించాలని పిలుపు నిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 108 నంబర్తో పాటు 93815 58327, 63042 34889 నంబర్లకు సంప్రదించాలన్నారు. -
వేగంగా వంతెనలు, రోడ్డు నిర్మించండి
ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాడేరు: వంతెనలు, రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేసి ప్రజల అసౌకర్యాన్ని తొలగించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. ఇరడాపల్లి పంచాయతీలోని పలు గ్రామాలలో సోమవారం ఆయన పర్యటించారు. పంట పొలాలను, బొక్కెళ్ళు సమీపంలో నిర్మిస్తున్న రాయిగెడ్డ వంతెనను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న వంతెన అప్రోచ్ కోతను గురైందని ఆ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కాంట్రాక్టర్లకు సూచించారు -
మారుమూల గ్రామాలకు నాణ్యమైన విద్యుత్
రంపచోడవరం: ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ను అందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. స్ధానిక ఏపీఈపీడీసీఎల్ కార్యాలయాన్ని పీవో సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని విద్యుత్ సర్వీసులు ఏ విధంగా ఉన్నాయో సర్వే చేయాలన్నారు. మారుమూల గ్రామాలకు లోవోల్టేజీ లేని విద్యుత్ను సరఫరా చేయాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అటవీ అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో అడవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు నిఘా పెట్టి పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామాల్లో వినియోగించిన విద్యుత్కు సరైన సమయంలో బిల్లులు ఇవ్వాలని, వాటిని చెల్లించే విధంగా చూడాలన్నారు. ఈఈ గాబ్రియల్, డీఈ మల్లికార్జునరావు, ఏఈలు దొరబాబు, సాలెం బాబు, అబ్బాయిదొర, గోపాలకృష్ణ పాల్గొన్నారు.రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం -
గ్రామాల్లో సమస్యలపై అర్జీలు
రంపచోడవరం: రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్ , డీఎస్పీ సాయిప్రశాంత్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గిరిజనుల నుంచి 27 అర్జీలు వచ్చాయి. రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం గ్రామంలో సుమారు 40 ఏళ్లుగా సాగులో ఉన్న నాలుగు ఎకరాల భూమికి పట్టా మంజూరు చేయాలని కారం జగ్గాయమ్మ వినతి అందజేశారు. అలాగే తాళ్లపాలెం గ్రామానికి చెందిన టెంకి సీత తన కుమారుడు మూగవాడని, దివ్యాంగ పింఛను మంజూరు చేయాలని కోరారు. మారేడుమిల్లి గ్రామంలో సర్వే 42/2 గల ఇంటి స్థల సమస్య పరిష్కరించాలని కారు మహాలక్ష్మి కోరారు. ఎస్డీసీ పి.అంబేడ్కర్, ఏపీఓ డీఎన్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
అత్యవసర వైద్యం.. అందనంత దూరం
జిల్లాలోని విలీన మండలాలతోపాటు పక్కరాష్ట్రాలకు పెద్ద దిక్కయిన చింతూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల అత్యవసర వైద్యానికి కాకినాడ, రాజమహేంద్రవరం ఆస్పత్రులకు గాని తెలంగాణలోని భద్రాచలం ఆస్పత్రికి రిఫర్ చేయడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు నెలలుగా ఈ సమస్య నెలకొన్నా పరిష్కారంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానరావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఒడిశాకు చెందిన ఇతని పేరు సరియం లక్ష్మ య్య. కాళ్లు, చేతులు వాపువచ్చి నడవలేని స్థితిలో చింతూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. ఇతనికి వైద్యం చేసేందుకు జనరల్ ఫిజీషియన్ అవసరముంది. అయితే ఆస్పత్రి సూపరింటెండెంట్ కోటిరెడ్డి మత్తు వైద్య నిపుణుడు కావడంతో జనరల్ ఫిజీషియన్ను సంప్రదించి ఆయన సూచనలమేరకు వైద్య అందించడంతో కోలుకున్నాడు. అతనికి అత్యవసర వైద్యం అవసరమైతే పరిస్థితి అగమ్య గోచరమే.చింతూరు మండలం కుయిగూరుకు చెందిన ఈ యువకుడి పేరు పూనెం సాయిప్రణీత్. రెండురోజులక్రితం పాఠశాలలో ఆడుకుంటూ కిందపడ్డాడు. దీంతో అతని కాలుకు తీవ్రగాయం కాగా చింతూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఎముకల వైద్యనిపుణుడు లేకపోవడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఇక్కడ ఎముకల వైద్యనిపుణుడు అందుబాటులో వుంటే రిఫర్ చేసే పరిస్థితి ఉండేది కాదు.చింతూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రధాన సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 50 పడకలుగా అప్గ్రేడ్ అయిన ఈ ఆస్పత్రికి చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాలతో పాటు పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి రోగులు వస్తుంటారు. ప్రతిరోజు 200 నుంచి 300 వరకు ఓపీ ఉంటుంది. సుమారు 60 నుంచి 80 మంది వరకు ఇన్పేషెంట్లు వైద్యసేవలు పొందుతున్నారు. ఇవికాకుండా డయాలసిస్, పిల్లల విభాగం, కాన్పు విభాగాలు అదనంగా ఉన్నాయి. ఏడుగురు వైద్య నిపుణులకుగాను ముగ్గురు మాత్రమే ఉన్నారు. సూపరింటెండెంట్ (మత్తు వైద్య నిపుణుడు) డాక్టర్ కోటిరెడ్డి, ఇద్దరు సీ్త్రల వైద్య నిపుణులు, ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులు పనిచేస్తున్నారు. జనరల్ ఫిజీషియన్, ఆర్ధోపెడిక్, పిడియాట్రిషియన్, ఈఎన్టీ నిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ● ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బిడ్డింగ్ ప్రాతిపదికన కాంట్రాక్టు విధానంలో వైద్య నిపుణులను నియమించింది. వారు కోరుకున్న వేతనానికి జనరల్ ఫిజీషియన్, ఆర్ధోపెడిక్, పిడియాట్రిషియన్, ఈఎన్టీ, గైనకాలజిస్టులను ఏర్పాటుచేసింది. వీరికి ఒకొక్కరికి రూ.2.50 లక్షల నుంచి రూ.3.75 లక్షల వరకు వేతనాలు పొందేవారు. కీలక పోస్టులు ఖాళీ.. ఈ ఆస్పత్రిలో వైద్యనిపుణులు ఒకొక్కరు వెళ్లిపోతున్నారు. దీనివల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ ఫిజీషియన్ ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లిపోగా పిడియాట్రీషియన్కు అడ్డతీగల బదిలీ అయింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఆర్ధోపెడిక్, ఈఎన్టీ వైద్యులకు ఇతర ఆస్పత్రుల్లో పర్మినెంట్ పోస్టులు రావడంతో వారుకూడా వెళ్లిపోయారు. ప్రస్తుతం వైద్యనిపుణుల్లో ఇద్దరు గైనకాలజిస్టులు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు తరచూ ఒకటి రెండు రోజులు ట్రైనింగ్ లేదా రంపచోడవరం ఆస్పత్రిలో విధులు నిర్వహించేందుకు వెళ్తున్నారు. దీంతో ఉన్న ఒకరిపై అదనపు భారం పడుతోంది. ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులుండగా రోజుకు ఒక్కరు చొప్పున ఓపీ రోగులను పరీక్షిస్తున్నారు. ఓపీకి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున మత్తు వైద్యనిపుణుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి కూడా ఓపీ బాధ్యతలు చూస్తున్నారు. ● వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులను తెలంగాణలోని భద్రాచలం ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్తే ఆంధ్రా కేసులు చూడమని అక్కడి వైద్యులు చెబుతున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఆస్పత్రిలో అంబులెన్సు లేకపోవడంతో 108 వాహనం మీద ఆధారపడాల్సి వస్తోందని, మేము అంతదూరం రాలేమని 108 సిబ్బంది చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. ప్రస్తుతం చింతూరు ఆస్పత్రిలో ప్రతిరోజూ ఏడు నుంచి 10 వరకు మలేరియా కేసులతో సహా 25 నుంచి 30 వరకు జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. ● గత ప్రభుత్వంలో బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్టు పద్ధతిన వైద్య నిపుణుల నియామకం చేపట్టగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే వైద్య నిపుణులు పనిచేసేందుకు ముందుకు రాకపోవడానికి కారణమని తెలుస్తోంది. వైద్య నిపుణుల్లేక ఇబ్బందులు వైద్య నిపుణులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా ఇతర ప్రాంతాలకు రిఫర్ చేయాల్సి వస్తోంది. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ఇన్పేషెంట్లు అధికంగా ఉన్నందున వంద పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయాలని కూడా నివేదిక పంపించాం. – డాక్టర్ ఎంవీ కోటిరెడ్డి, సూపరింటెండెంట్, చింతూరు ప్రభుత్వాస్పత్రి చింతూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య నిపుణుల కొరత భద్రాచలం, కాకినాడ, రాజమహేంద్రవరం ఆస్పత్రులకు రిఫర్ ఇబ్బందులు పడుతున్న రోగులు, బంధువులు గాలిలో దీపాల్లా గిరిజనుల ప్రాణాలు నాలుగు నెలలుగా సమస్య నెలకొన్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం -
సరిహద్దు రహదారులపై శీతకన్ను.!
సీలేరు: జిల్లాలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు రహదారులపై కూటమి ప్రభుత్వం శీతకన్ను వేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వంతెనకు అప్రోచ్ రోడ్డు వేయకపోవడం.. భారీ వర్షాలకు ఓ వంతెన కొట్టుకుపోయినా పట్టించుకపోవడంతో గిరిజన గ్రామాల మీదుగా సరిహద్దు రహదారిలో రాకపోకలు సక్రమంగా సాగడం లేదు. గత ఐదు నెలలుగా ఈ ప్రాంత ప్రజలు వంతెన నిర్మించాలని మొర పెట్టుకున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంబంధిత శాఖ అధికారులు అనుమతుల కోసం ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం ఉండడం లేదు. ఫలితంగా ఈ ప్రాంత ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ● ఆంధ్ర–ఒడిశా సరిహద్దు అయిన సీలేరు సమీప పిల్లిగెడ్డపై గత ప్రభుత్వం రూ.2.34 కోట్లు మంజూరు చేసి వంతెనను నిర్మించింది. అది పూర్తయినప్పటికీ రెండు వైపులా అప్రోచ్ రోడ్డు వేయడం కోసం రూ.30 లక్షలు మంజూరు చేయాలని ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధిత శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో వంతెన నిర్మాణం పూర్తయినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. ● దారకొండ నుంచి చిన్న గంగవరం గ్రామం మీదుగా ఒడిశా వెళ్లే ప్రధాన రహదారిలో గంగవరం వంతెనను 2014లో రూ.40 లక్షలతో నిర్మించారు. గత సెప్టెంబర్ నెలలో భారీ వర్షానికి ఈ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ వంతెనను నిర్మించాలని చుట్టుపక్కల గిరిజనులు మొరపెట్టుకుంటున్నా ఇప్పటికీ పట్టించుకోలేదు. 8 నెలలు కావస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. తాత్కాలికంగా నిర్మించిన వంతెన కూడా గత నెలలో కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు సరిహద్దు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వంతెన నిర్మాణం కోసం సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే రూ.2 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా అతీగతీలేదు. ● జిల్లా నుంచి దారకొండ మీదుగా తూర్పుగోదావరి, ఛత్తీస్గఢ్, ఒడిశా వెళ్లేందుకు గుమ్మురేవులు రోడ్డు అనువుగా ఉంటుంది. అయితే ఇటీవల వర్షానికి కొట్టుకుపోయిన గంగవరం వంతెన మార్గం మధ్యలో మాదిగ మల్లు వంతెన అప్రోచ్ రోడ్డును ఇప్పటికీ పూర్తి చేయలేదు. గతేడాది సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షానికి కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా నిర్మించి రాకపోకలు సాగించారు. అప్పటి నుంచి అసంపూర్తిగానే వంతెన ఉంది. తరచూ కురుస్తున్న వర్షాలకు అప్రోచ్ రోడ్డు సక్రమంగా లేకపోవడంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. చిన్నపాటి వర్షానికి వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. రెండు వైపులా అప్రోచ్ రోడ్డు వేసేందుకు రూ.1.80 కోట్లతో జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు ఎట్టకేలకు వచ్చాయి. దీంతో టెండర్లు పిలిచినట్టు అధికారులు చెబుతున్నారు. అయినా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. భారీ వర్షానికి కొట్టుకుపోయిన చిన్న అగ్రహారం తాత్కాలిక వంతెన అప్రోచ్ రోడ్డు లేక నిరుపయోగంగా పిల్లిగెడ్డ వంతెన ప్రజలు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం -
అడ్డతీగల ఆస్పత్రిలో అంధకారం
అడ్డతీగల: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కటిక చీకట్లో రోగులు, వారి బంధువులు అవస్థలు పడ్డారు. పిల్లల తల్లులు భయాందోళనకు గురయ్యారు. శిశువులను పొత్తిళ్లలో పెట్టుకుని సెల్ఫోన్ వెలుగులో గడిపారు. ఆస్పత్రికి జనరేటర్ సౌకర్యం ఉన్నా సిబ్బంది వినియోగించడం లేదని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆయిల్ లేదని.. ఆపరేటర్ లేరని సిబ్బంది, అధికారులు కుంటిసాకులు చెబుతున్నారన్నారు. మండలంలోని 99 గ్రామాలకు పెద్ద దిక్కయిన ఈ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా లేనప్పుడు అంధకారం రాజ్యమేలుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అక్రమ మద్యం, సారా స్వాధీనం.. నలుగురి అరెస్టు
చింతపల్లి: ఆంధ్రా– ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లు, నాటు సారాను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ జె.కూర్మారావు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులకు అందిన ముందుస్తు సమాచారం మేరకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కోరుకొండ గ్రామంలో దాడులు నిర్వహించామన్నారు. ఒడిశాకు చెందిన 40 లీటర్ల మద్యం సీసాలు, 409 లీటర్ల నాటు సారా, ఆంధ్రాకు చెందిన 25 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటికి సంబంధించిన వారా రాజు, ఒర్ల సూరిబాబు, షేక్ మహమ్మద్ రఫీ, వల్లంగి రమణబాబును అరెస్టు చేసినట్టు ఆయన వివరించారు. ఒడిశాలోని జనతాబై గ్రామానికి చెందిన రాఖేష్ కుమార్ సింగ్ (శివ) ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా గుర్తించి, అతనిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. త్వరలోనే అతనిని కూడా అరెస్టు చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు, ఎస్ఐలు గిరిబాబు, వీర్రాజు, సిబ్బంది సంతోష్, రమేష్ పాల్గొన్నారని ఆయన తెలిపారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
● రూ.9.80 లక్షల విలువైన సొత్తు స్వాధీనం ● పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు అన్నవరం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను కాకినాడ జిల్లా అన్నవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అన్నవరం పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆదివారం రాత్రి విలేకరులకు వివరాలు తెలిపారు. అన్నవరం, తుని పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల పలు దొంగతనాలు జరగడంతో, ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు పర్యవేక్షణలో అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు, అడిషనల్ ఎస్సై ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన అడపా జోగాఅమర్ గంగాధర్, అల్లూరి జిల్లా రంపచోడవరానికి చెందిన అడపా సూర్యచంద్రపై అనుమానంతో పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం ఉదయం వారిద్దరూ మండపాం సెంటర్లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసిన నేరాలను వారు అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసి, వారిచ్చిన సమాచారంతో రూ.9.80 లక్షల విలువైన 500 గ్రాముల వెండి వస్తువులు, అమ్మవారి గుడిలో అపహరించిన రోల్డ్గోల్డ్ హారం, మూడు బుల్లెట్లు, ఆరు మోటార్ బైకులు, నాలుగు స్కూటీలు, ఎల్ఈడీ టీవీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హైదరాబాద్ పోలీస్స్టేషన్లో రెండు, విశాఖపట్నం జిల్లా అరిలోవ పోలీస్స్టేషన్లో ఒకటి, అన్నవరం పోలీస్స్టేషన్లో ఎనిమిది, తుని రూరల్ పోలీస్స్టేషన్లో మూడు, ప్రత్తిపాడు, తుని టౌన్ పోలీస్స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదైనట్టు డీఎస్పీ వివరించారు. వీరిని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు చెప్పారు. సమావేశంలో ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు, ఎస్సై శ్రీహరిబాబు, అడిషనల్ ఎస్సై ప్రసాద్ పాల్గొన్నారు. -
చరిత్రను వక్రీకరించేందుకే పాఠ్యాంశాల తొలగింపు
● పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డాబాగార్డెన్స్: విశాఖపట్నం: చరిత్రను వక్రీకరించే ఉద్దేశంతోనే పాఠ్యాంశాలను తొలగిస్తున్నారని పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. పాఠ్యాంశాలు మార్చినంత మాత్రాన సత్యం మారిపోదన్న అంశంపై ఆదివారం విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్సీఈఆర్టీ సంస్థ 10, 11వ తరగతుల పుస్తకాల్లోని అనేక పాఠ్యాంశాలను తొలగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాఠ్యాంశంలో మౌలానా అబ్దుల్ కలాంకు సంబంధించిన పేరాను, సైన్స్ విభాగంలో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని, జీవశాస్త్రంలో పీరియాడిక్ టేబుల్ను తొలగించారని ఆయన చెప్పారు. ముఖ్యంగా 8వ తరగతి చరిత్ర పుస్తకంలో మొఘల్ చక్రవర్తులైన అక్బర్, బాబర్, షాజహాన్ తదితరుల చరిత్రను పూర్తిగా తొలగించారని లక్ష్మణరావు తెలిపారు. వారిని కేవలం క్రూరులుగా, దుర్మార్గులుగా చూపించే పేరాలను మాత్రమే ఉంచారని విమర్శించారు. ఎర్రకోట, తాజ్మహల్ వంటి నిర్మాణాలు వారి హయాంలో నిర్మించినవేనని గుర్తు చేశారు. సదస్సులో పాల్గొన్న ఏయూ హిస్టరీ విభాగం విశ్రాంత ఆచార్యుడు కె. సూర్యనారాయణ మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ స్థాయిలో చరిత్రలో మార్పులు చేయలేదని అన్నారు. మొఘలులపై ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. భారతదేశం హిందూ దేశం కాదని, ఇక్కడ కోట్లాది మంది ముస్లింలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. చరిత్రలోని మంచి చెడులను యథాతథంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. -
రక్త ‘పరీక్ష’లే..!
మహారాణిపేట: ఉత్తరాంధ్రతో పాటు పలు రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో ముఖ్యమైన రక్త పరీక్షలు నిలిచిపోయాయి. దీనివల్ల పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కిడ్నీ, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులను నిర్ధారించే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ (ఏబీజీ) పరీక్షలు గత కొన్ని రోజులుగా జరగడం లేదు. ఈ పరీక్షలకు అవసరమైన ‘రీజెంట్స్ లిక్విడ్’ సరఫరా లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. గతంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ నుంచి ఈ లిక్విడ్ సరఫరా అయ్యేది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. బయట నుంచి కొనుగోలు చేయడానికి కేజీహెచ్లోని కొంతమంది వైద్యాధికారులు ఇష్టపడకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందులు ఏబీజీ పరీక్షలో రక్తంలో ఆక్సిజన్, కార్బన్ డయాకై ్సడ్ శాతాలను విశ్లేషిస్తారు. కిడ్నీ వైఫల్యం, గుండె లోపాలు, డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను నిర్ధారించడానికి ఈ పరీక్షలు అత్యంత కీలకం. గతంలో కేజీహెచ్లో రోజుకు 40 నుంచి 80 మంది రోగులకు ఈ పరీక్షలు చేసేవారు. బయట ల్యాబరేటరీలలో ఈ పరీక్షకు రూ. 900 నుంచి రూ. 1,300 వరకు ఖర్చవుతుంది. ఆర్థిక స్తోమత లేని పేద రోగులు ఈ పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. యంత్రాలకు మరమ్మతులే కారణం ఈ విషయంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి మాట్లాడుతూ, ఏబీజీ పరీక్షలకు స్వల్ప అంతరాయం కలిగిందని తెలిపారు. యంత్రాలకు మరమ్మతులు జరుగుతున్నాయని, రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే ‘రీజెంట్స్ లిక్విడ్’ లేకపోవడం గురించి మాత్రం ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. -
ఇంజక్షన్ సక్రమంగా చేయక ఇన్ఫెక్షన్
● బాధితురాలి భర్త నాయకం శంకర్రావు ఆవేదన ● ముంచంగిపుట్టు వైద్య సిబ్బందిపై ఆరోపణ ముంచంగిపుట్టు: వైద్య సిబ్బంది ఇంజక్షన్ సక్రమంగా చేయకపోవడంతో తన భార్యకు సెప్టిక్ అయిందని ముంచంగిపుట్టుకు చెందిన నాయకం శంకర్రావు ఆరోపించాడు. దీనివల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువై కేజీహెచ్లో నరకం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలను అక్కడినుంచి ఫోన్లో స్థానిక విలేకరులకు తెలిపాడు. భార్య నాయకం దొసుద(45)కు ఆరోగ్యం బాగులేకపోవడంతో ఈనెల 31న ముంచంగిపుట్టు సీహెచ్సీకి తీసుకువెళ్లామన్నారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు సూచన మేరకు స్టాఫ్ నర్స్ (మెయిల్) రాంబాబు ఆమెకు ఇంజక్షన్ చేశారన్నారు. మూడు రోజుల తరువాత ఆమె చెయ్యికి వాపు, నొప్పి రావడంతో మళ్లీ ఈనెల 4న సీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యసేవలు అందించారన్నారు. వారం రోజులు అవుతున్నా తగ్గకపోవడంతో ఈనెల 12న పాడేరులోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించామన్నారు. అక్కడి వైద్యులు పరీక్షించిన అనంతరం చేతికి సెప్టిక్ అయిందని, ఆపరేషన్ చేయాలని చెబుతూ కేజీహెచ్కు రిఫర్ చేశారన్నారు. అక్కడ ప్రస్తుతం ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నందున పరిస్థితి విషమంగా ఉందని, ఇంజక్షన్ సక్రమంగా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై స్థానిక సీహెచ్సీ సూపరింటెండెంట్ గీతాంజలిని వివరణ కోరగా దొసుదకు సిబ్బంది ఇంజక్షన్ చేశారని, సెప్టిక్ దేనివల్ల అనేది తెలియాల్సి ఉందన్నారు. దీనికి సబంధించి కొన్ని పరీక్షలు చేసేలోగా దొసుదను కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా తీసుకు వెళ్లిపోయారని ఆమె పేర్కొన్నారు. -
పెరుగుతున్న గోదావరి, శబరి నీటిమట్టాలు
చింతూరు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విలీన మండలాల్లో గోదావరి, శబరి నదుల నీటిమట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం ఆదివారం రాత్రికి 33.7 అడుగులకు చేరుకుంది. కూనవరం మండలంలో గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని కొండ్రాజుపేట వాగు ఎగపోటుకు గురై వరదనీరు కాజ్వే పైకి చేరడంతో కూనవరం, టేకులబోరు నుంచి కొండ్రాజుపేట, వాల్ఫర్డ్పేట, శబరికొత్తగూడెం, ఆంబోతులగూడెం, వెంకన్నగూడెం, శ్రీరాంపురం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శబరి, గోదావరి సంగమం వద్ద గోదావరి నీటిమట్టం 27.8 అడుగులకు చేరుకుంది. ● వీఆర్పురం మండలం అన్నవరం వాగు పైనున్న కాజ్వే కొట్టుకుపోగా తాత్కాలికంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నేటీకీ చింతూరు, వీఆర్పురం మండలాల మధ్య, వీఆర్పురం మండలంలో 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతి తక్కువైనప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు ప్రాణాలకు తెగించి దాటుతున్నారు. కాజ్వే కూలిపోవడంతో చింతూరు మీదుగా వీఆర్పురం వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు చట్టి మీదుగా కూనవరం చేరుకుంటున్నాయి. దీనివల్ల ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ● ఎగువనుంచి వస్తున్న వరదనీటి వల్ల చింతూరు మండలంలో కూడా శబరినది క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకున్నా గోదావరి మరింత పెరిగితే శబరినది ఎగపోటుకు గురై మండలంలో పలు వాగులు పొంగే అవకాశముందని నదీ పరివాహక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ ఆదేశం గోదావరి, శబరి నదుల నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో నాలుగు మండలాలకు చెందిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నాలుగు మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. సెప్టెంబరు నెలకు సబంధించిన రేషన్ బియ్యాన్ని ఆయా దుకాణాలకు తరలించినట్టు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. నాలుగు మండలాల్లో 440 హైరిస్క్ గర్భిణులను గుర్తించడం జరిగిందని, వరద పెరిగితే వారిని సమీప ఆస్పత్రులకు తరలించేలా ఏర్పాట్లు చేశామన్నారు. వరద పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 10 లాంచీలు, నాటు పడవలను సిద్ధం చేశామన్నారు. మంగళవారం వరకు గోదావరి వరద పెరిగే అవకాశముందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టండి కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం పాడేరు : అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేసి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. ఆదివారం తన కార్యాలయం నుంచి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో ప్రత్యేకంగా దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ముందస్తుగా ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు, జనరేటర్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నారులు, వృద్ధులను ప్రత్యేకశ్రద్ధతో పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. జేసీ అభిషేక్ గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు కట్టా సింహాచలం, అపూర్వ భరత్, డీఆర్వో పద్మలత, ఎస్డీసీలు, రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. అపమ్రత్తమైన అధికార యంత్రాంగం తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు హైరిస్క్ గర్భిణులను ఆస్పత్రికి తరలించేలా ముందస్తు ఏర్పాట్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో 10 లాంచీలు, పడవలు సిద్ధం -
కొట్టుకుపోయిన అప్రోచ్ బ్రిడ్జి
చింతపల్లి: జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మండలంలోని రాజుపాకలు వద్ద ఏర్పాటుచేసిన అప్రోచ్ బ్రిడ్జి ఆదవారం కొండవాగు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఇరువైపులా వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వా హన చోదకులు ఇబ్బందులు పడ్డారు. ఈ మార్గంలో నడిచే విశాఖపట్నం–హైదరాబాద్, విశాఖపట్నం –భద్రాచలం, విజయనగరం–భద్రాచలం ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లే ఘాట్ మార్గంలో తురబాడ వద్ద కొండగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. -
నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలం
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ విమర్శించారు. పార్టీ రాజ్యసభ ఫ్లోర్లీడర్ జాన్బ్రిట్టాస్తో కలసి పోలవరం ముంపు మండలాల పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం చింతూరులో విలేకర్లతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన పునరావాసానికి రూ.33 వేల కోట్ల నిధులు మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు లేక నిర్వాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, తమ పర్యటనల్లో గుర్తించిన సమస్యలపై లోక్సభ, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో గిరిజనులను సంఘటితం చేసి ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. పోలవరం నిర్వాసిత కాలనీల్లో ఎక్కడచూసినా నాసిరకం నిర్మాణాలు కనిపిస్తున్నాయన్నారు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, ఉపాధి వంటి అవసరాలు లేక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారని జాన్బ్రిట్టాస్ అన్నారు. వీఆర్పురం: రూ.వేలకోట్లతో రాజధాని నిర్మాణ పనులు చేపడుతున్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితులగోడు పట్టించుకోవడం లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, రాజ్యసభ సభ్యులు ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిట్టాస్ ఆరోపించారు. రామవరంలో జరిగిన పార్టీ బహిరంగ సభలో వారు మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల కాలనీ ఇళ్లు నిర్మించి నాలుగేళ్లు కాకముందే శ్లాబ్లు కారిపోతున్నందున బరకాలు వేసుకోవాల్సి వస్తోందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు కేటాయించిన రైతులకు ఎకరాకు రూ.25 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బొంప్పెన కిరణ్ ఎం వాణిశ్రీ, రాష్ట్ర నాయకులు తులసీదాసు, బలరాం తదితరులు పాల్గొన్నారు. ఎటపాక: పోలవరం నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ల్యక్షం చేస్తున్నాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం విమర్శించారు. మండలంలోని నర్సింగపేట పోలవరం నిర్వాసిత కాలనీలో ఆదివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కావడంతో నిర్వాసితుల సమస్యలు కూడా జాతీయ సమస్యగా గుర్తించాలని సూచించారు. కాంటూరు లెక్కలు కాకి లెక్కలని, నిర్వాసితులందరికీ న్యాయం చేసిన తరువాతనే ప్రాజెక్టు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కాలనీల్లో నిర్వాసితులు బతుకులు దుర్భరంగా మారాయని, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే సరైన మార్గమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిల్లో సురేంద్ర, బొప్పెన కిరణ్, మర్లపాటి నాగేశ్వరరావు, లోతా రామారావు, మట్ల శ్రీవాణి, ఐవీ, మేకల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ -
మద్దిగడ్డ నుంచి నీరు విడుదల
అడ్డతీగల: ఎడతెరిపి లేని వర్షాలకు అడ్డతీగలలోని మద్దిగడ్డ జలాశయానికి వరద తాకిడి నెలకొంది. దీంతో అప్రమత్తమైన అధికారులు జలాశయానికి చెందిన రెండు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎఫ్ఆర్ఎల్ 188 మీటర్లు కాగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 186.95 మీటర్లుకు చేరుకుంది. దీంతో జలాశయం 2, 3 నంబర్ల గేట్లను ఐదు సెంటీమీటర్ల మేర పైకి ఎత్తి విడుదల చేస్తున్న వరదనీరు ఏలేరు వాగులో చేరుతోంది. దీనివల్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరివాహక గ్రామాలైన పింజరికొండ, కొత్తపాలెం, గడిచిన్నంపాలెం, డి.కృష్ణవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగుపై రాకపోకలు సాగించవద్దని ఇంజినీరింగ్ అధికారులు సూచించారు. -
గంజాయి తరలిస్తున్న కారు డ్రైవర్ అరెస్ట్
● ఏడాదిన్నర బాలుడి మృతికి ఇతనే కారణం మర్రిపాలెం: ఊర్వశి జంక్షన్ సమీపంలో ఈ నెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఏడాదిన్నర వయసున్న వర్షిత్ అనే బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నెల 16న కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు కారును తనిఖీ చేయగా.. అందులో 21 కిలోల గంజాయి లభించింది. దీంతో పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలివి. తమిళనాడుకు చెందిన అర్జునన్ జెమినీ అధ్ముఘం ఈ నెల 12న విజయవాడలో ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ఆన్లైన్ ద్వారా కారును అద్దెకు తీసుకుని అరకుకు వెళ్లి సుమారు 21 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. గంజాయితో ఎన్ఏడీ కొత్తరోడ్డు మీదుగా విశాఖ రైల్వే స్టేషన్ వైపు వస్తున్న క్రమంలో.. ఊర్వశి జంక్షన్ బీఆర్టీఎస్ రహదారిపై రోడ్డు దాటుతున్న దంపతులను కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు వర్షిత్ మృతి చెందాడు. అప్పట్లో కారు తాళాలు కనిపించకపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు డూప్లికేట్ తాళాలను తెప్పించి చూడగా డిక్కీలో 21 కిలోల గంజాయిని గుర్తించారు. దీంతో పోలీసులు అర్జునన్ను విచారణ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. -
సొంత గూటికి ముంచంగిపుట్టు ఏకలవ్య పాఠశాల
పెదబయలు: ముంచంగిపుట్టు మండల ఏకలవ్య రెసిడెన్సియల్ పాఠశాలకు ఎట్టకేలకు సొంత గూటికి చేరింది. సొంత భవనం లేక 8 ఏళ్లుగా పెదబయలు వైటీసీ భవనంలో ఈ పాఠశాల నడుస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలకు మంజూరైన సొంత భవన నిర్మాణ పనులను ముంచంగిపుట్టు మండలం లబ్బూరులో రూ.12 కోట్లలో ప్రారంభించారు. రెండు అంతస్తులతో నిర్మాణం చేయాల్సిన పాఠశాల భవనాన్ని కూటమి ప్రభుత్వం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే నిర్మించి వదిలేసింది. అయినా ఐటీడీఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం ప్రత్యేక బస్సుల్లో విద్యార్థులను అసంపూర్తి భవనంలోకి తరలించారు. విద్యార్థినీ, విద్యార్థులకు పాఠశాల వసతి గృహంలో 48 గదులు మాత్రమే ఉన్నాయి. ఒక్కో గదిలో 8 మంది చొప్పున విద్యార్థులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం పది నుంచి 12 మందిని ఉంచారు. భారీ వర్షానికి గదుల్లో నీరు చేరడంతో అవస్థలు పడ్డారు. పాఠశాలను త్వరితగతిన పూర్తి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఊరికి దూరంగా కొండ ప్రాంతంలో నిర్మించిన పాఠశాలకు ప్రహరీ లేదని, ఉన్నతాధికారులు స్పందించి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు సరిపడా తరగతి గదులు కూడా లేవని చెబుతున్నారు. అసంపూర్తిగా భవనాల్లోకి తమ పిల్లలకు తరలించి ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోమని, పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లబ్బూరులో రూ.12 కోట్లతో భవన నిర్మాణం వైఎస్సార్సీపీ హయాంలో నిధుల మంజూరు మొదటి అంతస్తుతో సరిపెట్టిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తప్పని అవస్థలు -
ముగిసిన సీపీఐజిల్లా మహాసభలు
రంపచోడవరం: స్థానికంగా చేపట్టిన సీపీఐ జిల్లా మహాసభలు ఆదివారం రెండో రోజు ముగిశాయి. నీ సందర్భంగా పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాటు పడాలన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఏమాత్రం తగ్గేది లేదని స్పష్టం చేశారు.ఘాట్లో విరిగిపడినబండరాళ్లు ● గిరిజనులకు త్రుటిలో తప్పిన ప్రమాదం ముంచంగిపుట్టు: మండలంలోని అత్యంత మారుమూల రంగబయలు పంచాయతీ కోసంపుట్టు ఘాట్ మార్గంలో వర్షానికి పెద్ద బండరాళ్లు ఆదివారం సాయంత్రం రోడ్డుకడ్డంగా జారిపడ్డాయి. సాయంత్రం 5గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జోలాపుట్టు వారపు సంతనుంచి గ్రామాలకు బయలేదరిన కోసంపుట్టు, జోడిగుమ్మ, పట్నపడాల్పుట్టు గ్రామాల గిరిజనులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వాహనదారులు భయంతో పరుగులు పెట్టారు. కొంచెం ఆలస్యంగా వచ్చి ఉంటే బండరాళ్లు తమపై పడి ప్రమాదానికి గురయ్యేవారమని వారు వాపోయారు. ప్రమాదభరితంగా మార్గం మట్టిగూడ నుంచి జోడిగుమ్మ వరకు ఆరు కిలో మీటర్ల ఘాట్ రోడ్డు మార్గం ప్రమాదభరితంగా ఉంది. పలు ప్రదేశాల్లో పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లు, మట్టి దిబ్బలు పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. తక్షణమే పంచాయతీరాజ్ అధికారులు స్పందించి ఘాట్ మార్గంలో రక్షణ గోడలు నిర్మించాలని ఆయా ప్రాంతాల గిరిజనులు కోరుతున్నారు. -
తల్లిదండ్రులకు చిన్నారుల అప్పగింత
వర్షం కారణంగా ఏపీఎల్ మ్యాచ్లు రద్దు విశాఖ స్పోర్ట్స్ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో భాగంగా వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరగాల్సిన రెండు మ్యాచ్లు వర్షం ఆటంకం ఏర్పడింది. రాయలసీమ రాయల్స్, కాకినాడ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ను ఐదు ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఓపెనర్ భరత్ డకౌట్గా వెనుదిరిగినా, లేఖజ్రెడ్డి (33), రవికిరణ్ (10) పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించారు. రాయల్స్ బౌలర్లలో గిరినాథ్, సాకేత్రామ్ చెరో రెండు వికెట్లు తీశారు. సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం బుల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ పూర్తిగా వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఏలేరు కాలువలో లభ్యమైన మృతదేహం గుర్తింపు కశింకోట : తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట గ్రామం వద్ద ఏలేరు కాలువలో లభ్యమైన మృతదేహం కేడీ పేటకు చెందిన లోకవరపు బుచ్చియ్యనాయుడు(32)గా గుర్తించినట్టు ఎస్ఐ మనోజ్కుమార్ ఆదివారం తెలిపారు. శనివారం మృతదేహాన్ని కనుగొన్నామన్నారు. సుమారు పది రోజుల క్రితం నాయుడు విశాఖ నుంచి తమ గ్రామానికి బైక్పై వెళుతూ మాకవరపాలెం మండలం చెట్టుపాలెం వద్ద ఏ కారణంగానో ఏలేరు కాలువలో గల్లంతయ్యాడన్నారు. కేడీ పేటలో మిస్సింగ్ కేసు నమోదైందన్నారు. చెట్టుపాలెం నుంచి ఏలేరు కాలువలో ప్రవాహ వేగానికి కొట్టుకు రావడంతో మృతదేహాన్ని పడవలో గాలించి బంగారయ్యపేట వద్ద శనివారం వెలికితీసి గుర్తించినట్టు తెలిపారు. కొమ్మాది: పీఎంపాలేనికి చెందిన ఐదుగురు చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పకుండా ఆదివారం రుషికొండ బీచ్కు వచ్చారు. వర్షం పడుతున్నప్పటికీ ఐదుగురు చిన్నారులు ఆ ప్రాంతంలో తిరుగుతుండటం చూసి మైరెన్ పోలీసులు వారిని ప్రశ్నించారు. తాము పీఎంపాలెం నుంచి తల్లిదండ్రులకు చెప్పకుండా ఇక్కడకు వచ్చామని కె.హర్షిన్, ఎ.హశ్వంత్, పి.కల్యాణి, ఎ.హర్షిత, ఎ.వంశీ తెలిపారు. వెంటనే పోలీసులు వారి నుంచి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని.. వారికి సమాచారం అందించారు. రుషికొండకు చేరుకున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను సురక్షితంగా అప్పగించారు. -
ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
చింతపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) చింతపల్లి తాలూకా యూనిట్ అధ్యక్షుడు సంజయ్కుమార్ తెలిపారు. ఆ సంఘ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పిలుపు మేరకు శనివారం స్థానిక గిరిజన్ భవన్లో కేక్ కట్చేసి టీ తాగుదాం–ఉద్యోగులు సమస్యలపై చర్చిద్దాం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వోద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీఈఏ అసోసియేట్ అధ్యక్షుడు గసాడి పద్మనాభం, ఉపాధ్యక్షుడు తుచ్చా మదుసూధనరావు, కార్యవర్గ సభ్యులు శోభభన్బాబు, కన్నబాబు, పవన్కుమార్ పాల్గొన్నారు. -
కాలువలోపడి వ్యక్తి మృతి
● వరంగల్ జిల్లా వాసిగా గుర్తింపు సీలేరు: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన ముత్తయ్య (42) అనే వ్యక్తి సీలేరులో ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతి చెందాడు. కూలిపనుల నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చాడు. మెయిన్రోడ్డులోని బజారు సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న కాలువలో శనివారం కాలుజారి పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. అతని దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం వరంగల్ జిల్లా వాసిగా సీలేరు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మృతుని బంధువులకు సమాచారం ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు, మోదీ విఫలం
రంపచోడవరం: పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చూపడంలో సీఎం చంద్రబాబు, పీఎం మోదీ ఇద్దరూ విఫలం చెందారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. రంపచోడవరంలో సీపీఐ జిల్లా మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ముందుగా పార్టీ శ్రేణులు అటవీశాఖ చెక్ పోస్ట్ నుంచి భారీ ర్యాలీ గా అంబేద్కర్ సెంటర్ మీదుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం స్టేట్ బ్యాంకు వద్ద జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం విధానాలను ఎండ గట్టారు. త్వరలోనే తమ పార్టీ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం తానే స్వయంగా ఈ ప్రాంతంలో పోరాటం చేస్తామని ప్రకటించారు. గిరిజన ప్రజల సమస్యలు అంటే ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదని, ఎంత సేపు మోదీ కార్పొరేట్ల సేవలోనే తరిస్తూ అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచి పెడుతున్నారన్నారు. ఒంగోలులో లక్షలాది మందితో రాష్ట్ర మహా సభలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్య నారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి ఎప్పుడు మావోయిస్టులను అంతం చేయడమే మా ఎజెండా అంటూ వరుస ఎన్కౌంటర్లు చేయిస్తున్నారని, గిరిజన ప్రజల సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల బాగోగులు కోసం పోరాటం చేసే ఏకై క పార్టీ సీపీఐ అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగ ప్రభాకర్ , జాతీయ సమితి సభ్యులు తాటిపాక మధు , జిల్లా కార్యదర్శి పొట్టిక సత్య నారాయణ మాట్లాడారు. రంపచోడవరం డివిజన్ కార్యదర్శి జుత్తుక కుమార్ , మహిళా నాయకురాలు దుర్గ, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జిల్లావ్యాప్తంగా 187.8 ఎంఎం వర్షపాతం నమోదు
సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరుతోపాటు సమీప గ్రామాల్లో రాత్రి 7గంటల నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన గెడ్డలు, వాగులకు వరద ఉధృతి నెలకొంది. మత్స్యగెడ్డలో వరద ప్రవాహం అధికంగా ఉండడంతో జోలాపుట్టు జలాశయంలోకి ఇన్ఫ్లో పెరిగింది. జిల్లావ్యాప్తంగా శనివారం 187.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దేవిపట్నంలో 39.4,అనంతగిరిలో 36.8,కూనవరంలో 29, వీఆర్పురంలో 15.6, రంపచోడవరంలో 13.8, ఎటపాకలో 12.4, మారేడుమిల్లిలో 5.8, రాజవొమ్మంగిలో 4.2, గంగవరంలో 3.6, డుంబ్రిగుడలో 3.6, వై.రామవరంలో 3.2, ముంచంగిపుట్టులో 2.8, పెదబయలులో 2, కొయ్యూరులో 2, అడ్డతీగలలో 1.8, జి.మాడుగులలో 1.2, అరకులోయలో 1, జీకేవీధిలో 0.6, పాడేరు 0.4 ఎంఎం వర్షపాతం నమోదైందని అధికారవర్గాలు తెలిపాయి. -
కరాటేతో ఆత్మరక్షణ
● పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పాడేరు : విద్యార్థులు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు సూచించారు. ఇంటర్నేషనల్ కోపుకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో నెలకొల్పిన పాండు కరాటే క్లబ్ లోగోను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు.నీ సందర్భంగా అకాడమీలో తర్ఫీదు పొందుతున్న పలువురు విద్యార్ధులు, చిన్నారులు కరాటే విన్యాసాలను ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యేను కరాటే క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో కరాటే క్లబ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు, వైఎస్సార్సీపీ నేత తెడబారికి సురేష్కుమార్ పాల్గొన్నారు. -
పెద్దేరుకు వరద తాకిడి
300 క్యూసెక్కుల విడుదలమాడుగుల రూరల్: బంగాళాఖాతంలో ఎర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు పెద్దేరు జలాశయంలో నీటి మట్టం పెరుగుతుంది. ఈ నేపధ్యంలో జలాయాశం గేట్ల ద్వారా శనివారం రాత్రి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పరిసరాల్లో 6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. కురుస్తున్న వర్షాలకు జలాశయం నీటిమట్టం 136.40 మీటర్లకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు, వర్షాలకు జలాశయంలోకి 550 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుందని జలాశయం జేఈ సుధాకర్రెడ్డి తెలిపారు. జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టంను దృష్టిలో పెట్టుకుని, నీటిని విడుదల చేస్తున్నట్టు, జలాశయం పరివాహక గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన ప్రజలకు విజ్జప్తి చేశారు. -
రాయితీ రుణాలు ఎప్పుడిస్తారో...!
కె.కోటపాడు : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మంజూరు చేస్తామని ప్రకటించిన బీసీ కార్పొరేషన్ రుణాలకు లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ రుణంతో యూనిట్ ఏర్పాటుతో ఆర్థిక భరోసాను పొందవచ్చునని ఆశపడ్డ లబ్ధిదారులు కార్పొరేషన్ రుణాలు ఎప్పుడు మంజూరవుతాయో తెలియక అయోమయంలో ఉన్నారు. 2024–25 ఏడాదికి బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు ఈ ఏడాది మార్చి 10 నుండి 25 మార్చి వరకూ ఆన్లైన్లో దర్ఖాస్తులు స్వీకరించారు. వీరికి ఏప్రిల్ 4న ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారుల ఎంపిక జాబితాను బ్యాంక్ అధికారులకు మండల పరిషత్ అధికారులు పంపించారు. దీంతో దరఖాస్తుదారులు బ్యాంకులను సంప్రదిస్తే యూనిట్ మంజూరు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ నగదు ఇంకా విడుదల కాలేదని సంబంధిత బ్యాంక్ అధికారులు తెలుపుతున్నట్టు సమాచారం. దీంతో అసలు బీసీ కార్పొరేషణ్ రుణాలు ఈ ఏడాది మంజూరవుతాయా అన్నా అనుమానాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. కూటమి నేతల సిఫార్సులకే పెద్ద పీట..? కె.కోటపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఏప్రిల్లో ఇంటర్వ్యూలు బీసీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు జరిపారు. వాస్తవానికి బ్యాంకులు దరఖాస్తుదారుల్లో బ్యాంక్కు రుణాలను సకాలంలో చెల్లించే పరిస్థితి గల వారిని, అర్హులను గుర్తించి మాత్రమే ఎంపిక చేస్తారు. కానీ మండలంలో బీసీ కార్పొరేషన్ రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికి రుణాలు మంజూరు చేయాలో కూటమి నాయకులు అధికారులతో జాబితాలను సిద్ధం చేసి బ్యాంకులకు చేరవేసినట్టు పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో కూటమి నాయకుల పెత్తనం ఉన్నట్టు తెలియడంతో దరఖాస్తులు చేసిన 645 మందిలో కేవలం 528 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. గ్రామాల్లో గల కూటమి నాయకుల సిఫారసులకే అధికారుల పెద్దపీటను వేయనున్న కారణంగానే వీరు గైర్హాజరయ్యారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఈ కార్పొరేషణ్ రుణాల మంజూరు సమయంలో జన్మభూమి కమిటీలదే పెత్తనం ఉండేది. కాగా ఇప్పటికే బ్యాంకులకు వచ్చిన జాబితాలో లబ్ధిదారులకూ ఇంకా రాయితీ రుణాలు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురు చూపులు చూస్తున్నారు. నమ్మకం లేదు... బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యాను. బ్యాంక్కు వెళ్లి నా పేరు వచ్చిందో లేదో అని ఆరా తీయగా, ఎంపీడీవో కార్యాలయ అధికారులు లబ్ధిదారుల పేర్లు పంపించాలని చెబుతున్నారు. రాజకీయ సిఫారసుల ఉన్న వారికే రుణాలు అందిస్తే నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుంది. బ్యాంక్లకు వచ్చిన పేర్లు గల వారికి కూడా రుణాలు ఇంకా మంజూరు కాలేదు. – ఎల్.నర్సింగరావు, బీసీ కార్పొరేషన్ దరఖాస్తుదారు -
అటవీశాఖకు టేకు సిరులు
గొలుగొండ : గొలుగొండ కలప డిపో వల్ల అటవీశాఖకు మంచి ఆదాయం వస్తుంది. ప్రతి నెలా 6న జరిగే వేలం పాటలో టేకు అమ్మకాలు ఎక్కవగా జరుగుతుంటాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడా లేని విధంగా అమ్మకాలతో అటవీశాఖకు ఆదాయం సమకూరుతుంది. నాణ్యమైన టేకు చెట్లు ఇక్కడ ఉండడంతో వీటిని వేలం పాటలో దిక్కించుకోవడం కోసం వ్యాపారులు, ఇంటి అవసరా లకు వాడే యజమాను లు జిల్లా నుండే కాకుండా ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు నుంచి రావడం జరుగుతుంది. నాణ్యమైన టేకు చెట్లు రాష్ట్రంలో ఎక్కడా లేని టేకు చెట్లు గొలుగొండ కలప డిపోలో లభ్యమవుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నల్లకొండ ప్లాంటేషన్లో ఉన్న టేకు చెట్లను అటవీశాఖ నరికించి ఇక్కడ డిపోకు తరలిస్తోంది. 1963 సంతవ్సరంలో టేకు ప్లాంటేషన్ను అప్పట్లో అటవీశాఖ వేయడం జరిగింది. సుమారుగా 300 ఎకరాల వరకు టేకు ప్లాంటేషన్ వేయగా గడిచిన 5 సంవత్సరాల నుంచి వీటిలో పెద్ద చెట్లను కటింగ్ చేయించి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ప్రతి నెలా 6న వేలం : నల్లకొండ ప్లాంటేషన్ నుంచి నరికించిన టేకు చెట్లను వాహనాలపై ఇక్కడికి తీసుకువచ్చి వేలంలో అమ్మకాలకు ఉంచుతారు. చెట్లు లాటు నెంబర్, ఎన్ని అడుగులు అనే విషయం ముందుగా పాటదార్లకు చెబుతారు. వేలం పాటకు జిల్లా అటవీశాఖ అధికారి తప్పకుండా హాజరు కావడం డీఎఫ్వో ఆధ్వర్యంలో అమ్మకాలు చేస్తుంటారు. అటవీశాఖ అధికారి నిర్ణయించిన ధర కంటే ఎవరు ఎక్కువగా పాట పాడితే వారికి లాటులు అమ్మకాలు చేస్తుంటారు. ప్రతి నెలా 6న జరిగే కార్యక్రమంలో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తెలంగాణ ప్రాంతాల నుంచి ఎక్కువగా పాటదారులు హాజరవుతున్నారు. రూ.కోటి వరకు ఆదాయం : గడిచిన ఏడాదిలో గొలుగొండ కలప డిపో పరిధిలో కోటి రూపాయల వరకూ టేకు అమ్మకాల ద్వారా అటవీశాఖకు ఆదాయం వచ్చింది. సుమారుగా 60 సంవత్సరాల వయస్సు గల చెట్లు వల్ల చెట్లు అంత్యంత సేవ తీరి ఉండడంతో ఈ చెట్లతో తయారు చేసే గృహోపకరణాలు ఎంతో నాణ్యతగా ఉంటాయి. అందుకే ఈ డిపోలో కలపకు అంత డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు తగ్గితే ప్లాంటేషన్లో చెట్లు నరికించే ఏర్పాట్లులో అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ అడుగు చెట్లు వెయ్యి నుంచి 5వేల వరకు ఉంటుంది. మన్యం అల్లూరి జిల్లాలో నల్లకొండ ప్లాంటేషన్ ఉన్నప్పటికీ మొదటి నుంచి ఈ కలప అనకాపల్లి జిల్లా గొలుగొండ కలప డిపోకు తరలిస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా రికార్డు స్థాయిలో గొలుగొండ కలప డిపో నుండి టేకు, వెదురు అమ్మకాలతో ఈ శాఖకు మంచి ఆదాయం వస్తోంది. -
కుమడ బస్సు బూసిపుట్టు వరకు పొడిగింపు
ముంచంగిపుట్టు: మండలంలోని అత్యంత మారుమూల పంచాయతీ కేంద్రమైన బూసిపుట్టు వరకు కుమడ బస్సు సర్వీసును ఆర్టీసీ అధికారులు పొడిగించారు. దీంతో నాలుగు పంచాయతీలకు చెందిన సుమారు 90 గ్రామాల గిరిజనులకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో పాడేరు నుంచి ముంచంగిపుట్టు మీదుగా కుమడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సు వెళ్లేది. అక్కడి నుంచి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పరిసర ప్రాంతాల గిరిజనులు బస్సు సౌకర్యానికి దూరమయ్యారు. వీరి సమస్యను గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డును నిర్మించింది. దీంతో బస్సు సర్వీసు అందుబాటులోకి తేవాలని గిరిజనులు పలు సందర్భాల్లో జిల్లా అధికారులకు విన్నవించారు. ఈ విధంగా ఎస్పీ అమిత్ బర్దర్ను వారు కోరారు. దీంతో ఆయన చొరవ మేరకు బూసిపుట్టు వరకు బస్సు సర్వీసును ఆర్టీసీ అధికారులు పొడిగించారు. దీనివల్ల ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని కుమడ, భూసిపుట్టు, జమిగూడ, గిన్నెలకోట పంచాయతీలకు చెందిన 90 గ్రామాల గిరిజనులకు బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోడ్డు నిర్మించడం వల్లే బస్సు తమ గ్రామానికి వచ్చిందని బూసిపుట్టు వాసులు ఆనందం వ్యక్తం చేశారు.శనివారం వచ్చిన బస్సుకు గ్రామ మహిళలు, పెద్దలు హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రోజుక రెండు సార్లు బస్సు సర్వీసు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 90 గ్రామాల గిరిజనులకు అందుబాటులోకి వచ్చిన సౌకర్యం ఎస్పీ అమిత్ బర్దర్ చొరవతో సమస్య పరిష్కారం హర్షం వ్యక్తం చేసిన మారుమూల గ్రామాల గిరిజనులు -
ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
మోతుగూడెం: మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి పది గంటలకు మోతుగూడెం ఏపీ జెన్కో ఆస్పత్రిలో పనిచేస్తున్న గోసాలి అప్పారావు అనారోగ్య కారణాలతో మానసికంగా కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అప్పారావు గతంలో బైపాస్ సర్జరీ చేయించుకొని తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్నట్లు తెలిపారు. దీంతో కలత చెందిన అతను ఇంట్లో ఐరన్ రాడ్కి ఉరి వేసుకొని మృతి చెందినట్టు చెప్పారు. దీనిపై మోతుగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు నిర్మించాలని యువత ఆందోళన
అడ్డతీగల: అధ్వానంగా మారిన రోడ్డును వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ నాలుగు గ్రామాలకు చెందిన యువకులు ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. అడ్డతీగల–ఏలేశ్వరం రోడ్డులో సుమారు 11 కిలోమీటర్ల రోడ్డు కాలు పెట్టలేని విధంగా దారుణంగా మారింది. దీనిని మెరుగుపరిచేందుకు అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడంతో ఈమార్గంలో వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం, అధికారుల తీరును నిరసిస్తూ తూర్పు లక్ష్మీపురం, కిమ్మూరు,జెడ్డంగి అన్నవరం, గొంటువానిపాలెంకు చెందిన యువకులు శనివారం రమణయ్యపేట వద్ద సుమారు నాలుగు గంటలపాటు ధర్నా చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధ్వానంగా మారిన ఈ రోడ్డుకు కనీసం మరమ్మతులు కూడా చేయకపోవడం వల్ల గత 20 ఏళ్లుగా నరకం చూస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, గంగవరం మండలాల ప్రజలతోపాటు నర్సీపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లేవారు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రోడ్డు నిర్మాణానికి రూ.కోట్లు కేటాయించినట్టు హడావుడి చేసి భూమి పూజలు చేస్తున్నా పనులు మాత్రం అంగుళమైనా ముందుకు కదలలేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు తీసుకువెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.అధికారుల తీరుపై నిరసన -
భారీ వర్షాలకు పొంగిన వాగులు
● గోదావరికి క్రమేపీ పెరుగుతున్న వరద ● కన్నాపురం అలుగువాగుకు వరద తాకిడి ఎటపాక: తుపాను ప్రభావంతో నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మండలంలోని కన్నాపురం అలుగువాగుకు వరద ఉధృతి నెలకొంది. ప్రాజెక్టు నిండి పోవడంతో పొంగి పొర్లుతోంది. మురుమూరు, నందిగామ, తోటపల్లి, నెల్లిపాక, రాయనపేట, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి నదికి వరద పెరుగుతుండటంతో విలీన వాసులు ఆందోళన చెందుతున్నారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు వారిలో గుబులు రేపుతున్నాయి. మిర్చి నారు తయారు చేసుకుంటున్న రైతులు వర్షాలు కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. -
పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువు
● సీపీఎం ఆలిండియా సెక్రటరీ ఎంఏ బేబీ ఆవేదన ● ప్రభుత్వం పట్టించుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక రంపచోడవరం: పోలవరం ముంపు ప్రజల కోసం నిర్మించిన పునరావాస కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని సీఎం ఆలిండియా సెక్రటరీ ఎంఏ బేబీ హెచ్చరించారు. తాళ్లూరు, నాగులపల్లి పునరావాస కాలనీలో పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడారు. వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు కారణంగా మునిగిపోతున్నాయన్నారు. నిర్వాసితుల్లో 85 శాతం మంది ఆదివాసీలు ఉన్నారని వివరించారు. పోలవరం నిర్వాసితులందరికీ గౌరవప్రదమైన పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ సుదీర్ఘకాలంగా పూర్తి నిర్లక్ష్యం జరిగినట్టు పరిస్థితులను బట్టి స్పష్టమవుతుందని అన్నారు. నిర్మాణాల్లో నాణ్యత లోపం కారణంగా వర్షాలకు శ్లాబ్లు కారిపోతున్నాయని, మరుగుదొడ్లు కూడా సక్రమంగా నిర్మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉపాధి కోసం ప్రతి రోజు 30 నుంచి 40 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేదన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాస గృహాలకు అర్హులు సైతం దూరమయ్యారని వివరించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఇప్పటికే ఆందోళన రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందన్నారు. ఇప్పటికై నా తక్షణమే బాధ్యతాయుతంగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం అమలు చేయడంలో రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55 వేల కోట్లు కాగా, ప్రజల పునరావాసానికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేయాల్సింది ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులతో కూడిన పునరావాసం కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తరువాత ఆ హామీని బుట్ట దాఖలు చేసిందన్నారు. ప్రజల సమస్యలు విన్నవించుకునేందుకు నోడల్ అధికారి సైతం అందుబాటులో లేరని వివరించారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్వాసితులు జీవచ్ఛవాల్లా బతుకుతున్నారని అన్నారు. పాలక ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, జిల్లాకార్యదర్శి బి కిరణ్, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సభ్యులు లోతా రామారావు, మట్ల వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
బర్లీ సాగుపై పెరుగుతున్న ఆసక్తి
● ప్రోత్సహిస్తున్న ఐటీసీ కంపెనీ ● గతేడాది రూ.25కోట్ల విలువైన 17 లక్షల కిలోలు కొనుగోలు ● కిలోకు రూ.155 చొప్పున ధర చెల్లింపు రాజవొమ్మంగి: గిరిజన రైతులు వైట్ బర్లీ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రాజవొమ్మంగి కేంద్రంగా కొయ్యూరు, అడ్డతీగల మండలాల్లో సుమారు 3వేల ఎకరాల్లో సాగు చేపట్టేలా గిరిజన రైతులను ప్రముఖ ఐటీసీ కంపెనీ ప్రోత్సహిస్తోంది. ఈ ప్రాంత రైతులు రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి బర్లీ పొగాకు నారు తీసుకువచ్చి నాట్లు మొదలుపెట్టారు. రాజవొమ్మంగి, వట్టిగెడ్డ, సూరంపాలెం, లబ్బర్తి, జడ్డంగి–అన్నవరం, అమీనాబాద్, కంఠారం, బాలారం తదితర గ్రామాల్లో కూడా ఐటీసీ కంపెనీ నారు పెంచి రైతులకు సరఫరా చేస్తోంది. గతేడాది రైతుల నుంచి రూ.25 కోట్ల విలువైన 17 లక్షల కిలోల బర్లీ పొగాకును ఐటీసీ కంపెనీ కొనుగోలు చేసింది. ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. కిలోకు రూ.155 చొప్పున ధర చెల్లించింది. దీంతో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నందున సాగు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. -
చాపరాయికి పోటెత్తిన పర్యాటకులు
● గెడ్డ పొంగే అవకాశం ఉన్నందున అనుమతించని నిర్వాహకులు ● ముఖ ద్వారం వద్ద కళాకారులతో థింసా నృత్యం చేస్తూ సందడి డుంబ్రిగుడ: వీకెండ్ కావడంతో సందర్శకులు పోటెత్తారు. చాపరాయి జలవిహారి సందర్శనకు శనివారం భారీగా తరలివచ్చారు. అయితే భారీ వర్షాలకు చాపరాయి గెడ్డ పొంగే అవకాశం ఉన్నందున కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు రెండు రోజులుగా సందర్శకులను నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో వారంతా నిరాశకు గురయ్యారు. చాపరాయి జలవిహారి ప్రాంతంలో ప్రకృతి అందాలను తిలకిస్తూ ఫొటోలు దిగారు. ముఖద్వారం వద్ద స్థానిక థింసా కళాకారులతో కలిసి సందడి చేశారు. కొంత మంది పర్యాటకులు గిరిజన వస్త్రధారణలో ముస్తాబై ఫొటోలు తీసుకున్నారు. -
సీ్త్రశక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
పాడేరు : సీ్త్ర శక్తి పథకం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసును మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొరతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వ్లును కచ్చితంగా అమలుచేసి పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో అన్ని మార్గాల్లో మహిళలకు ఉచిత సేవలు అందించాలన్నారు. ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర మాట్లాడుతూ విజయనగరం రీజియన్లో 1779 బస్సులు ఉండగా 1352 బస్సులను మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేటాయించామన్నారు. మహిళలు ఆధార్ లేదా ఓటర్ కార్డు చూపించి ప్రయాణం చేయవచ్చన్నారు. అనంతరం పాడేరు నుంచి ముంచంగిపుట్టు మండలం కుమడ మీదుగా బూసిపుట్టు బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్బర్దర్, జీసీసీ చైర్మన్ శ్రావణ్కుమార్, రాష్ట్ర సృజనాత్మకత, జానపద కళల చైర్మన్ గంగులయ్య, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, ఆర్టీసీ ఎండీ మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
ప్రమాదస్థాయికి జోలాపుట్టు, డుడుమ
● పెరుగుతున్న నీటిమట్టాలు ● అప్రమత్తమైన ప్రాజెక్ట్ అధికారులు ● 1300 క్యూసెక్కులు బలిమెలకు విడుదల ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు జలాశయాల నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. గత వారం రోజులుగా సరిహద్దులో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డుడుమ జలాశయ నీటి సామర్థ్యం 2590 అడుగులు కాగా శుక్రవారం నాటికి 2581.60 అడుగులుగా నమోదయింది. డుడుమ జలశయ ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయ నీటి మట్టం సైతం క్రమేపి పెరుగుతూ వస్తోంది. జోలాపుట్టు జలాశయ నీటి సామర్థ్యం 2750 అడుగులు కాగా శుక్రవారం నాటికి 2741.15 అడుగులు నీటి నిల్వ ఉంది. నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరడడంతో అప్రమత్తమైన జలాశయ సిబ్బంది నిరంతరం నీటి నిల్వలను అంచనా వేస్తున్నారు.డుడుమ జలాశయం ఒకటో నెంబర్ గేటును ఎత్తి 1300 క్యూస్కెలు దిగువనున్న బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు. ప్రమా దస్థాయి నుంచి సాధారణ స్థాయికి తెచ్చేందుకు ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. -
రాజవొమ్మంగి సర్పంచ్ ఉత్తమ సేవలకు గుర్తింపు
● కేంద్రమంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్న రమణి రాజవొమ్మంగి: ఢిల్లీలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్రదిన వేడుకల్లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి వివేక్ భరద్వాజ్ చేతులమీదుగా స్థానిక సర్పంచ్ గొల్లపూడి రమణి ఉత్తమ అవార్డు అందుకున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆమె వేడుకలకు హాజరయ్యారు. పంచాయతీలో ఆమె చేపడుతున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.ఏకలవ్య పాఠశాల భవనాలను త్వరలో ప్రారంభిస్తాం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్స్కూళ్ల ఓఎస్డీ మూర్తి ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు సమీపంలో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నూతన భవనాలను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఓఎస్డీ మూర్తి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన నిర్మాణ దశలో ఉన్న ఏకలవ్య పాఠశాల భవనాలను పరిశీలించారు. పాఠశాల నిర్వహణకు అవసరమైన వసతులపై పరిశీలించారు. ముంచంగిపుట్టు ఏకలవ్య పాఠశాలకు చెందిన ఎస్ఎంసీ కమిటీ సభ్యులు ఆయనను కలిసి ఏకలవ్య పాఠశాలను లబ్బూరులోకి మార్చి తరగతులు నిర్వహించి వసతులు కల్పించాలని కోరారు.పెదబయలు వైటీసీలో కనీస సౌకర్యాలు లేక తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు లబ్బూరులో ఏకలవ్య పాఠశాలను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవనాలు,సౌకర్యాల పరిస్థితులను తెలుసుకునేందుకు వచ్చినట్టు ఆయన వివరించారు. ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ సుమన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆస్పత్రికి రానంటూ గర్భిణి ముప్పుతిప్పలు
కొయ్యూరు: ఆస్పత్రికి రానంటూ ఆరు నెలల గర్భిణి అటు పోలీసులను ఇటు వైద్య సిబ్బందిని మప్పుతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు ఆమెకు వారు నచ్చచెప్పి శుక్రవారం సాయంత్రం రాజేంద్రపాలెం ఆస్పత్రికి తీసుకువచ్చారు. వివరాలిలా ఉన్నాయి. బూదరాళ్ల పంచాయతీ కునుకూరుకు చెందిన తాంబేలు చిన్ని ఆరు నెలల గర్భిణి. ఈమెకు బాలరేవుల సబ్సెంటర్ పరిధిలో కునుకూరులో రెండు రోజుల క్రితం రక్త పరీక్ష నిర్వహించారు. హెచ్బీ శాతం బాగా తక్కువగా ఉన్నట్టు ఎంఎల్హెచ్పీ జ్యోత్స్న నిర్థారించారు. వెంటనే ఆమె సూచన మేరకు ఈనెల 13 ఉదయం రాజేంద్రపాలెం పీహెచ్సీకి వైద్యసిబ్బంది తీసుకువచ్చారు. వెంటనే ఆమెను అక్కడి నుంచి అదేరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి 108లో తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె గురువారం సాయంత్రం ఎవరికి చెప్పకుండా స్వగ్రామం కునుకూరు వచ్చేసింది. గర్భిణి చిన్ని ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఎంఎల్హెచ్పీ జ్యోత్స్న గురువారం సాయంత్రం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. గర్భిణి చిన్ని లేకపోవడంతో అక్కడి వైద్య సిబ్బందిని అడిగారు. ఆమెను డిశ్చార్జి చేయలేదని, సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిందని వారు ఎంఎల్హెచ్పీకి వివరించారు.దీంతో శుక్రవారం ఉదయం ఎంఎల్హెచ్పీ హెచ్వీతో కలిసి కునుకూరులో గర్భిణి వద్దకు వెళ్లారు. ఆస్పత్రికి వచ్చేందుకు ఆమె నిరాకరించడంతో మంప పోలీసులకు వైద్య సిబ్బంది పరిస్థితిని వివరించారు. పోలీసులు నేరుగా కునుకూరు వెళ్లి గర్భిణి బంధువులకు నచ్చ చెప్పి అక్కడి నుంచి గర్భిణిని తీసుకువచ్చి రాజేంద్రపాలెం పీహెచ్సీలో చేర్పించారు. ఆమెకు తక్షణం రక్తం ఎక్కించాల్సి ఉన్నందున శనివారం నర్సీపట్నం ఆస్పత్రికి తరలిస్తామని వైద్యసిబ్బంది తెలిపారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి నుంచి పరారీ ఆమెను తీసుకువచ్చేందుకు వైద్య సిబ్బంది నానా హైరానా ఎట్టకేలకు పోలీసుల సాయంతో రాజేంద్రపాలెం పీహెచ్సీకి తరలింపు -
వీరుల త్యాగాలు చిరస్మరణీయం
ఫైర్ జంప్ చేస్తున్న పోలీసు జాగిలంకొయ్యూరు విద్యార్థుల మల్లకంబ విన్యాసాలుసాక్షి,పాడేరు: దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలు చిరస్మరణీయమని,కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అన్నారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో 79వ స్వాతంత్య్ర దిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోలీసుల కవాతు నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం జాతీ య జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎస్పీ అమిత్బర్దర్, జేసీ అభిషేక్గౌడ తదితర అధికారులు గౌరవవందనం సమర్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులకు ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి ఆయన సందేశాన్నిచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, వారి అనుచరులు గాం గంటందొర, మర్రి కామయ్య, గాం మల్లుదొర, పండుపడాల్, పనసలపెద్ది పడా ల్, తగ్గి వీరయ్య తదితర పోరాట యోధుల తాగ్యాలను స్మరించుకుంటూ జిల్లా ప్రగతి సాధిస్తామన్నారు. జిల్లాలో విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా స్థాయిలో ఒకటి, అరకులోయ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలలో మూడు విజన్ మానిటరింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. రానున్న ఐదేళ్లలో ఏటా 15 శాతం వృద్ధిరేటు సాధనకు కృషి చేస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలనకు జిల్లాలో 91,214 అత్యంత పేద కుటుంబాలను గుర్తించి పి–4 కార్యక్రమం అమలుజేస్తున్నామన్నారు. ఇప్పటికి జిల్లాలో 21,613 కుటుంబాలను 769మంది దత్తత తీసుకున్నారన్నారు. గిరిజన విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, జిల్లా లో అర్హులైన 1,01,170 విద్యార్థుల తల్లుల ఖాతా ల్లో రూ.212.21కోట్ల తల్లికి వందనం నగదు జమ చేశామన్నారు. జిల్లాలోని 64 పీహెచ్సీలు, 297 విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణం ,చింతపల్లిలో రూ.25 కోట్లతో సీహెచ్సీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయం,అనుబంధ రంగాలకు సంబంధించి 1,44,222 మంది రైతులకు రూ.7వేలు చొప్పున అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులలు రూ.101.84 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు ఎకో టూరిజం ప్రాజెక్ట్లను అభివృద్ధి చేయగా, వీటిలో 81మంది ఉపాఽధి పొందుతున్నారన్నారు. రూ.10కోట్లతో మరో నాలుగు ప్రాజెక్ట్లకు ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో 248 రహదారులు లేని గ్రామాలను గుర్తించి రూ.618.89 కోట్లతో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. పీఎం జన్మన్ పథకంలో 146 రోడ్ల పనులకు రూ.393.42 కోట్లు మంజూరు కాగా వీటిలో రెండు పూర్తయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయ న్నారు. రూ.115.56 కోట్లతో 51 రహదారులు, రూ.79.98 కోట్లతో 22 వంతెనల నిర్మాణానికి డీపీఆర్కు పంపామన్నారు. పీఎంజీఎస్వై పథకంలో 2024–25లో మంజూరైన రూ.179.70 కోట్ల రోడ్డు పనుల్లో ఆరు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 14 రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కాఫీ ప్రాజెక్టు అమలుతో పాటు పసుపు సాగు చేసే గిరిజన రైతులకు 922 మినీ బాయిలర్లు,432 మినీ పాలిసర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. పీఎం జన్మన్ పీఎం ఆవాస యోజన గృహ నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. అన్ని ప్రభుత్వశాఖల ద్వారా గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామ న్నారు. ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల అధికారు లు, అన్నివర్గాల ప్రజలు, పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, డీఎఫ్వో సందీప్రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్,పలుశాఖల జిల్లా అధికారులు పాల్గొ న్నారు. కలెక్టరేట్, స్థానిక ఐటీడీఏ కార్యాలయాల్లో జేసీ, ఇన్చార్జి పీవో డాక్టర్ అభిషేక్గౌడ, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అమిత్బర్దర్, అటవీశాఖ డివిజనల్ కార్యాలయంలో డీఎఫ్వో సందీప్రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి, మలేరియా శాఖ జిల్లా కార్యాలయంలో డీఎంవో తులసీ, విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో బ్రహ్మజీరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అలరించిన నృత్యాలు స్థానిక తలారిసింగి క్రీడా మైదానంలో నిర్వహించిన వేడుకల్లో నృత్య రూపకాలు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తలారిసింగి గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన కుంగుప్ విన్యాసాలకు ప్రథమ, పాడేరు కేజీబీవీ విద్యార్థినుల నృత్య రూపకానికి ద్వితీయ, లోచలిపుట్టు పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు తృతీయ స్థానం లభించాయి. కొయ్యూరు విద్యార్థుల మల్లకంబ విన్యాసాలు, నృత్యాంజలి డ్యాన్స్ అకాడమి చిన్నారుల దేశభక్తి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శకటాల ప్రదర్శన పలు ప్రభుత్వశాఖలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై శకటాలను ప్రదర్శించాయి. వ్యవసాయం, ఉద్యానవన శకటానికి ప్రథమ, గృహ నిర్మాణం, విద్యుత్ పంపిణీ సంస్థల శకటానికి ద్వితీయ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శకటానికి తృతీయ స్థానం లభించాయి. స్టాళ్లకు సంబంధించి అటవీశాఖకు ప్రథమ, కాఫీ బోర్డుకు ద్వితీయ స్థానం, డీఆర్డీఏ, వెలుగు సంస్థలకు తృతీయ స్థానం లభించాయి. మార్చ్పాస్ట్లో తలారిసింగి పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం, హుకుంపేట కేజీబీవీ విద్యార్థులు ద్వితీయ స్థానం, పాడేరు ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు తృతీయస్థానం సాధించారు.పోలీసు జాగిలాల ప్రదర్శన అందరినీ అబ్బురపరిచింది. అన్ని విభాగాలకు కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ అమిత్బర్దర్, జేసీ అభిషేకగౌడ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. గిరిజనాభివృద్ధికి పాటుపడతాం : చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ చింతూరు: గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఐటీడీఏ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని స్థానిక ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కార్యాలయంలో ఆయన జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ కూనవరం మండలం పైడిగూడెంలో టస్సార్ సిల్క్ ప్రాజెక్టు అభివృద్ధి నిమిత్తం రూ.5 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. ఆధునిక యంత్రాల ద్వారా నాణ్యమైన దారాన్ని తీసి నేయడం ద్వారా ఈ ప్రాంతానికి మంచిపేరు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామల వెంకటరామయ్యను శాలువా కప్పి సత్కరించారు. అనంతరం వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పంకజ్కుమార్ మీనా, ఏపీవో జగన్నాథరావు, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ పుల్లయ్య పాల్గొన్నారు. చింతపల్లి: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జాతీయ జెండాను ఏడీఆర్ అప్పలస్వామి ఎగురవేశారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను ఆయన అందజేశారు. అమరవీరుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం : పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సాక్షి,పాడేరు: అమరవీరుల త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందిని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులంతా బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయనను ప్రిన్సి పాల్ శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. సీనియర్ లెక్చరర్ రమాదేవి,సీనియర్ అసిస్టెంట్ మహేష్, వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు రంపచోడవరం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే శిరీషాదేవి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి, పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్, డీఎఫ్వో రవీంద్రథామ, డీఎస్పీ సాయిప్రశాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో జరిగిన అభివృద్ధిని పీవో వివరించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
మొరాయిస్తున్న వాహనాలు
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు జిల్లాలో 23 ఉండగా.. ఇందులో 8 వాహనాలు మూలకు చేరాయి. 5 వాహనాలు చిన్న చిన్న రిపేర్లతో నగరంలో ఒక ప్రైవేటు షోరూమ్లో ఉన్నాయి. కేజీహెచ్లో ఉన్న వాహనాలకు టైర్లు పేలిపోవడం, ఇంజిన్ మరమ్మతులు, ఇతర చిన్న చిన్న సమస్యలతో పక్కన పెట్టారు. రిపేర్లు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వాహనానికి ఒకరు చొప్పున 56 మంది డ్రైవర్లు (కెప్లెన్లు) పనిచేస్తున్నారు. కేజీహెచ్లో 9 వాహనాలు ఉన్నాయి. 3 వాహనాలను మరమ్మతు పేరిట మూలన పెట్టారు. 2 వాహనాలు షోరూమ్లో ఉంచారు. ఇప్పుడు నాలుగు వాహనాలు మాత్రమే బాలింతలను తరలించడానికి అందుబాటులో ఉన్నాయి. ఇలా అరకొర వాహనాలే ఉండడంతో బాలింతలు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు వెళ్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
మునగపాక: మండలంలోని చూచుకొండ గ్రామానికి చెందిన వివాహిత సుశీల (35)శుక్రవారం ఆత్యహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. చూచుకొండ గ్రామానికి చెందిన ఆడారి సూరి నాగేశ్వరరావు,సుశీల దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుశీల మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు తరచూ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తున్నారు. కాగా తన కుమారుడితో కలిసి సుశీల పొలం పనులకు వెళ్లింది. పని పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం కొంతసేపటి తరువాత కుమారుడు ఇంటికి వెళ్లేసరికి సుశీల ఫ్యాన్కు ఉరివేసుకుని ఉంది. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించిన కుమారుడు, మునగపాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని అనకాపల్లి వందపడకల ఆస్పత్రి తరలించారు. -
ఉత్తమ సేవలకు పురస్కారాలు
సాక్షి,పాడేరు: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ సేవా పురస్కారాలు అందజేశారు. మొత్తం 238మంది ఆయన చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు. తలారిసింగి క్రీడా మైదానంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.ముంచంగిపుట్టు: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా ముంచంగిపుట్టు మండలానికి చెందిన ఇద్దరు లైన్మెన్లు చెట్టి భాస్కరరావు, శెట్టి బాలన్నలు విద్యుత్శాఖ ఎస్ఈ జి.వి.ప్రసాద్, ఈఈ వేణుగోపాల్రావుల చేతుల మీదగా అవార్డులతో పాటు ప్రశంసపత్రాలను అందుకున్నారు. వారికి అభినందనలు తెలిపారు. గూడెంకొత్తవీఽధి: మండల హార్టీకల్చర్ అధికారి(కాఫీ) కోరాబు అరుణ కుమారి కలెక్టర్ దినేష్కుమార్ నుంచి శుక్రవారం అవార్డు అందుకున్నారు. హార్టీకల్చర్ అధికారిగా కుమారి చురుకై న పాత్ర పోషించారు. ఆమె ఉత్తమ సేవలను గుర్తించి ఆమెకు అవార్డును అందజేశారు. ఎటపాక: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మండలంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అందజేసిన ఉత్తమ సేవలకు పురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా ఐటీడీఏలో జరిగిన వేడుకల్లో పీవో అపూర్వభరత్ చేతుల మీదుగా ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ కన్నపరాజు, కేఎన్ పురం ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గుంపెనపల్లి అచ్చమ్మలకు ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు. గంగవరం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో పాడేరులో జరిగిన వేడుకలో గంగవరం పోలీస్స్టేషన్ హెచ్సీ పుండరీనాఽథ్, పీసీ కనిగిరి శ్రీనివాసులు కలెక్టర్ దినేష్కుమార్ చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు. డివిజన్ స్థాయిలో ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ నోఖ్వాల్, ఎమ్మెల్యే శిరీష చేతుల మీదుగా తహసీల్దార్ సీహెచ్.శ్రీనివాసరావు, ఉపాధి ఏపీవో ప్రకాశ్, మండల వ్యవసాయాధికారి లక్ష్మణరావు, విద్యుత్శాఖ ఏఈ దొరబాబు, పిడతమామిడి పీహెచ్సీ ఎంపీహెచ్ఎస్ ప్రసాదరావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ కె.కుమారి, ఎంపీడీవో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సత్యవతి, మొల్లేరు పంచాయతీ కార్యదర్శి వీరభద్రరావు తదితరులు అవార్డులు అందుకున్నారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు బేబీరత్నం, వైస్ ఎంపీపీ గంగాదేవి, రామతులసి, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, సర్పంచ్ అక్కమ్మ అభినందనలు తెలిపారు. -
చింతపల్లిలోనే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేయాలి
చింతపల్లి: కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ను చింతపల్లిలోనే ఏర్పాటు చేయాలని ఎంపీపీ కోరాబూ అనూష, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్యపడాల్ డిమాండ్ చేశారు. వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అల్లూరి జిల్లాలోనే అత్యధిక కాఫీ పంట దిగుబడులు చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు, జి.మాడుగులు మండలాల్లో పండుతుందని, కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ చింతపల్లి ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన ఎంతో ప్రభుత్వ భూమి స్థానికంగా అందుబాటులో ఉందన్నారు. అన్ని విధాలుగా అవకాశాలున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కాకుండా మైదాన ప్రాంతమైన మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో ఈ కాఫీ ప్రాసెసింగ్ యూని ట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు. అంతర్జాతీయంగా పేరు గాంచిన కాఫీ దిగుబడులు మన్యంలో అయితే.. ఉపాధి అవకాశాలు మైదాన ప్రాంత వాసులకా అని ప్రశ్నించారు.ఇప్పటికే జీవో నెం–3 రద్దుతోపాటు ఎంతో ప్రాదాన్యత కలిగినటువంటి డైరీ ఫారం, మల్బరీ ఫారం, ఎత్తివేతతో ఎన్నో విధాలుగా గిరిజన నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విదంగా గిరిజన యూనివర్సిటీని తరలించకుపోవడంతో పాటు నవోదయ పాఠశాలకు 22 ఎకరాలు స్థల సేకరణ చేసి కూడా పట్టించుకోలేదన్నారు.ఇటీవల ఎత్తివేతకు సిద్ధమైన సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ను కూడా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పోరాటం చేసి నిలుపుకోగా గలిగామన్నారు. ఈ ప్రాంతంలో వస్తునటువంటి ఉపాధి అవకాశాలకు గండి కొట్టడం వలనే ఎంతోమంది గిరిజన నిరుద్యోగ యవత ఉపాధి లేక వారి జీవనం దుర్భరంగా మారుతుందన్నారు. కాఫీ ప్రాసిసెంట్ యూనిట్ను చింతపల్లిలో ఏర్పాటు చేస్తే ఎంతో మంది గిరిజన నిరుద్యోగులకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి దొరుకుతుందన్నారు. గిరిజన రైతాంగానికి, నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ను చింతపల్లిలోనే ఏర్పాటు చేసే విధంగా మన్య ప్రాంత మేధావులు, రైతాంగం, ఉద్యోగ ఉపాధ్యాయ, యువత, అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. -
కళ్లెదుట మృత్యువు.. పరిమళించిన దాతృత్వం
పెందుర్తి: అతని దాతృత్వం ముందు మృత్యువు కూడా చిన్నబోయింది. కళ్లెదుటే మరణం కనిపిస్తున్నా అతని మనసు మాత్రం మరో ఇద్దరికి వెలుగునిచ్చేందుకే పరితపించింది. కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు చెబుతూనే తాను మరణించిన వెంటనే కళ్లను దానం చేయాలని సూచించారు. పెందుర్తిలో నివాసం ఉంటున్న మద్దాల శివాజీ(65) అనారోగ్యానికి గురయ్యారు. కొద్ది రోజులుగా శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో తన మరణం తప్పనిసరని మానసికంగా సిద్ధమయ్యారు. దీంతో పది రోజులుగా ‘నేను చనిపోయాక నా కళ్లు దానం ఇవ్వండి.. సాయి హెల్పింగ్ హ్యాండ్స్ శ్రీనుకు కబురు పెట్టండి’అంటూ నిత్యం కుమార్తెలు రమ్య, దీపిక, భార్య అచ్యుతాంబకు సూచించేవారు. శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి శివాజీ కన్నుమూశారు. తండ్రి చివరి కోరిక మేరకు కుమార్తెలు పెందుర్తికి చెందిన సాయి హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్కు సమాచారం ఇచ్చి తండ్రి నేత్రాలను దానం చేసేందుకు అంగీకారం తెలిపారు. మొహిషిన్ నేత్రనిధి ప్రతినిధులు శివాజీ నేత్రాలను సేకరించి సురక్షితంగా ఐ బ్యాంక్కు తరలించారు. కొద్దిరోజుల్లో మరణిస్తానని తెలిసి ఓ వ్యక్తి నేత్రదానం -
అరిగిన చక్రాలు.. ఆగిన సేవలు
బాలింత ఆటోలో ఇంటికి.. ఈ నెల 6న వెంకటలక్ష్మి అనే మహిళ డెలివరీ కోసం కేజీహెచ్ గైనిక్ వార్డులో చేరింది. ఈ నెల 7వ తేదీన పాప జన్మించింది. ఆమెను 11వ తేదీన డిశ్చార్జి చేశారు. ఆమె కుటుంబ సభ్యులు తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీసుకు ఫోన్ చేయగా.. వాహనాలు నడపడం లేదని.. డీజిల్ లేదని.. మరమ్మతులకు గురయ్యాయని డ్రైవర్లు సమాధానం ఇచ్చారు. దీంతో వెంకటలక్ష్మి పాపతో ఆటోలో గాజువాకలోని ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల ఇద్దరు బాలింతలు ఇదే విధంగా ఆటోలో ఇంటికి వెళ్లడం ఆస్పత్రిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈనెల 12వ తేదీన కూడా ఓ బాలింతకు ఇదే పరిస్థితి ఎదురైంది. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల నిర్వహణకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో డ్రైవర్లు వాహనాలు నడపలేక పక్కన పెట్టేస్తున్నారు. మహారాణిపేట: గర్భిణులు, బాలింతలు, శిశువులను ఆస్పత్రులు, ఇళ్లకు చేర్చిన తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు నేడు దయనీయంగా మారాయి. ఈ వాహనాల నిర్వహణ దారుణంగా ఉంది. బ్యాటరీలు పని చేయక, టైర్లు అరిగిపోయి కదలడం లేదు. సరిపడే ఆయిల్ ఇవ్వకపోవడంతో వాహనాలను నడిపేందుకు డ్రైవర్లు వెనుకంజ వేస్తున్నారు. గత మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వాహనాల కెప్టెన్లు అవస్థలు పడుతున్నారు. వాహనాలు రాకపోవడంతో కేజీహెచ్ గైనిక్ వార్డులో డిశ్చార్జి అయిన బాలింతలు, వారి కుటుంబ సభ్యులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో బాలింతలను ఉచితంగా ఇళ్లకు క్షేమంగా పంపేవారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తల్లీబిడ్డ వాహనాలను గాలికి వదిలేశారు. వాహనాలు రిపేర్లు అయినా పట్టించుకోవడం లేదు. ఒకే వాహనంలో ఇద్దరు వాహనాల కృత్రిమ కొరత వల్ల ఇటీవల కేజీహెచ్ నుంచి ఒకే వాహనంలో ఇద్దరు బిడ్డలతో బాలింతలను తల్లీబిడ్డ వాహనాలు తరలించడంపై చర్చ సాగుతోంది. ఒకే వాహనంలో ఇలా తరలించడం వల్ల తల్లులు అవస్థలు పడుతున్నారు. ఒకే రూటు కనుక అలా తీసుకెళ్లామని డ్రైవర్లు చెప్పకొస్తున్నారు. గతంలో అయితే ఎప్పుడైనా బాలింతలను తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉండేవి. ఇప్పుడు వాహనాలు లేక.. డ్రైవర్లు కానరాక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డ్రైవర్లకు ఆంక్షలు : తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లపై గతంలో కన్నా ఆంక్షలు ఎక్కువగా విధించారు. గతంలో నెలకు రూ.30 వేలు ఆయిల్ కోసం ఇచ్చేవారు. ఇప్పుడు నెలకు రూ.8 వేలతో సరిపెట్టుకోవాలని సూచిస్తున్నారు. యాజమాన్యం వల్ల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది. ఆయిల్ ఇవ్వడం లేదని, ఇచ్చిన ఆయిల్తోనే పనిచేయాలని డ్రైవర్లపై ఒత్తిడి చేస్తున్నారు. పనిచేయకపోతే వేధింపులకు గురి చేస్తున్నారని పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. -
నేవీ నిఘా వ్యవస్థలో ఏఐ వినియోగం
● ఫిబ్రవరిలో అంతర్జాతీయ నౌకాదళ కార్యక్రమాలు ● తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఏడాది ఫిబ్రవరి.. భారత నౌకాదళానికి పండగలా మారనుందని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ అన్నారు. తూర్పు నౌకాదళ ప్ర ధాన స్థావరంలో ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీ సర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్లాటూన్లు, నౌకాదళ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్స్, వివిధ నౌకల సిబ్బంది మార్చ్పాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ నగరం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలన్–2026 విన్యాసాలు, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన మిలన్ విన్యాసాల్లో ఇది అతి పెద్దదిగా నిలవనుందని.. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ప్రయోజనాలను కాపాడే దేశాల్లో భారత్ ముందుందని వెల్లడించారు. ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంలో భాగంగా.. దేశీయ షిప్యార్డుల్లో 60కి పైగా యుద్ధ నౌకలు, సబ్మైరెన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ నెల 26న విశాఖలో ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి యుద్ధ నౌకలను నేవీ అమ్ములపొదిలో చేరనున్నాయని వివరించారు. అలాగే ఈ ఏడాది చివరలో మరో రెండు యాంటీ సబ్మైరెన్ వార్షిప్లు జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. నేవల్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణ కోసం ఐఎన్హెచ్ఎస్ కల్యాణి ఆసుపత్రిని పూర్తిస్థాయి కమాండ్ ఆసుపత్రిగా ఆధునికీకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సముద్ర భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి నిఘా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుతున్నామని ఈఎన్సీ చీఫ్ తెలిపారు. మానవరహిత ఉపరితల, నీటి అడుగున పోరాడే వ్యవస్థలతో పాటు, అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్, నెక్స్ట్–జెన్ మిస్సైల్స్తో నేవీ అప్గ్రేడ్ అయిందన్నారు. ఈ వేడుకల్లో ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.గుర్తు తెలియని మృతదేహం లభ్యం సబ్బవరం: చిన్నయ్యపాలెం సమీపంలో అనకాపల్లి–ఆనందపురం హైవేను ఆనుకుని బోర్రమ్మగెడ్డ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమయ్యింది. పొదల్లో పడివున్న మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి సబ్బవరం పరిధి కావడంతో సబ్బవరం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ జి.రామచంద్రరావు, ఎస్ఐ దివ్య, సిబ్బందితో కలిసి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుర్తించి వెలికి తీయించారు. శరీరం బాగా ఉబ్బిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. సుమారు 40–45 ఏళ్ల వయసున్న మృతుడి శరీరంపై నిక్కరు, బని యన్, చేతికి రాగి కడియం ఉంది. మరణించి నాలుగైదు రోజులై ఉంటుందని సీఐ తెలిపారు. ఒక బిచ్చగాడు ఈ ప్రాంతంలో సంచరించేవాడని, ప్రస్తుతం కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. మృతుడు ఆ బిచ్చగాడేనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించినట్లు సీఐ తెలిపారు. నాణ్యతతో నిరంతర విద్యుత్ సరఫరా సీతంపేట: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి జాతీయ జెండాను ఎగురవేశారు. సంస్థ పరిధిలో 73 లక్షల వినియోగదారులకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిరంతరాయ విద్యుత్ సేవలందిస్తూ.. ప్రసార పంపిణీ నష్టాలను 5.8శాతం కంటే తక్కువకు తగ్గించినట్లు తెలిపారు. పీవీటీజీ గిరిజన ఆవాసాల్లో 23,024 ఇళ్లకు, డీఏ–జేజీయూఏ పథకంలో 1979 ఇళ్లకు, అలాగే 13 వేలు ఇళ్లకు నాన్ పీవీటీజీ విద్యుత్ సదుపాయం కల్పించామన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద 19,385 గృహాలపై 63,522 మెగావాట్ల సోలార్ రూఫ్టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా 3004 కోట్లతో గ్రామీణ ప్రాంతాలకు నిరంతర త్రీ ఫేజ్ సరఫరా కోసం కొత్త ఫీడర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 97 మంది ఉద్యోగులకు సీఎండీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సంస్థ డైరెక్టర్లు డి.చంద్రం, టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, సీజీఎంలు డి.సుమన్ కల్యాణి, వి. విజయలలిత, అచ్చి రవికుమార్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, పాడేరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు, దారుణాలు జరిగినా ఎన్నికల కమిషన్కు పట్టకపోవడం అన్యాయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసిందన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ‘కూటమి’ నాలుగు పార్టీలతో జత కట్టినా పులివెందులలో గెలవలేకపోయిందన్నారు. 65 వేల మెజార్టీతో వైఎస్సార్సీపీ విజేతగా నిలిచిన నియోజకవర్గంలోని జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ గెలుచుకుందంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగాయని, వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కంచుకోటలో పోలీసులను అడ్డం పెట్టుకుని గుండాలతో వైఎస్సార్సీపీ నాయకులు, ఏజెంట్లపై దాడి జరిపించడం దారుణమన్నారు. దౌర్జన్యంతో విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయించి పులివెందులలో గెలవడం సిగ్గు చేటన్నారు. సంబరాలు చేసుకోవడానికి సీఎం చంద్రబాబుకు సిగ్గుండాలని మండిపడ్డారు. చేతనైతే ఈ ఉప ఎన్నికలను రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపాలని, అప్పుడు టీడీపీ గెలిస్తే పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. టీడీపీ ఓడిపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అంటూ చంద్రబాబుకు సవాల్ చేశారు. ఎన్నికల కమిషన్ కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ఎన్నికల కమిషన్ ఇంతగా దిగజారడం అన్యాయమన్నారు. -
పాఠశాలలో ఏఎంవో తనిఖీ
డుంబ్రిగుడ: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలను జిల్లా ఏఎంవో కె.భాస్కర్రావు గురువారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రాథమిక విద్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మండలంలోని ప్రతి పాఠశాలను సందర్శించి విద్యా బోధనతో పాటు ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీయాలని ఎంఈవో శెట్టి సుందర్రావుకు ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ఉన్న భవిత సెంటర్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంఈవో–2 బి.బి. నాగేశ్వరరావు, ఐఈఆర్టీ కిరణ్, సీఆర్పీలు, ఎంఐఎస్లు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
రంపచోడవరం: మండలంలోని తామరపల్లి పంచాయతీ ఈతలపాడు గ్రామంలో పారిశుధ్య పనులను ముసురుమిల్లి ఎంపీటీసీ కుంజం వంశీ గురువారం పరిశీలించారు. డ్రైనేజీల్లో పూడిక లేకుండా చూడాలని సూచించారు. అనంతరం జీపీఎస్ పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పిల్లలకు గోరువెచ్చని నీటి ఇవ్వాలన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే పీహెచ్సీ, రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి వెళ్లాలన్నారు. పంచాయతీ కార్యదర్శి పండు, వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీను, మహిళా పోలీసు కృష్ణవేణి, ఏఎన్ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు. -
సక్రమంగా రేషన్ అందేలా చర్యలు
పెదబయలు: పెదబయలు డీఆర్ డిపో పరిధిలో ప్రతీ కార్డుదారుడికి రేషన్ సరకులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకున్నట్టు పాడేరు సివిల్ సప్లై డీప్యూటీ తహసీల్దార్ కె.అప్పలస్వామి అన్నారు. కార్డుదారులకు బియ్యం, రేషన్ అందలేదని పలు పార్టీల నాయకులు, లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో ఆయన గురువారం డిపోను తనిఖీ చేశారు. ఈ పాస్ మిషన్ సాంకేతిక లోపం కారణంగా జాప్యం జరిగిందని, డిపోల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు. కార్డుదారులకు బియ్యం అందించాలని సేల్స్మన్కు ఆదేశించామన్నారు. రేషన్ పంపిణీలో జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సెల్స్మాన్లను కోరారు. మేనేజన్ అప్పన్న. జీసీసీ సిబ్బంది ఉన్నారు. -
పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి, పాడేరు: తలారిసింగి క్రీడా మైదానంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ గురువారం మైదానాన్ని సందర్శించారు. అన్ని శాఖల అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరిస్తారని చెప్పారు. అన్ని శాఖల శకటాల ప్రదర్శనతోపాటు, పోలీసులు, విద్యార్థుల మార్చ్పాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పథఽకాల ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, డీఈవో బ్రహ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు. -
అవార్డు గ్రహీతలకు అభినందనలు
గంగవరం: మండలంలో నీతి ఆయోగ కార్యక్రమాల విజయవంతంగా నిర్వహించడంలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ దినేష్కుమార్ అవార్డులు అందజేశారు. ఆయా ఉద్యోగులను పలువురు అభినందనలు తెలిపారు. నీతి ఆయోగ కార్యక్రమాలు విసృత్తంగా అమలకు కృషి చేసిన ఎంపీడీవో వై.లక్ష్మణరావు, నీతి ఆయోగ మండల ప్రతినిధి హేమమాధురితో పాటు ఎఎన్ఎంలు తాము అనూష, అంగన్వాడీ వర్కర్ సుజాత, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ గ్రేస్, వెలుగు శాఖకు చెందిన నాగమణి తదితరులు అవార్డులు అందుకున్నారు. వారికి తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు బేబిరత్నం, వైస్ ఎంపీపీ గంగాదేవి, రామలక్ష్మి, మాజీ ఎంపిపి తీగల ప్రభ, సర్పంచ్లు అక్కమ్మ, వైఎస్సార్సీపీ మండలఅధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. వై.రామవరం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని ఎంపీడీఓ కె బాపన్నదొరకు పాడేరులో ్లకలెక్టర్ దినేష్కుమార్ చేతుల మీదుగా ఉత్తమ సేవ ఆవార్డును అందుకున్నారు. నీతి ఆయోగ్ సర్వేలో మెరుగైన సేవలు అందించిన కారణంగా ఎంపీడీవోతోపాటు, సర్వే బృందానికి ఈ ఆవార్డులు అందజేశారు. -
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
చింతపల్లి: రైతులు యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యానవన పరశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శెట్టి బిందు చెప్పారు. స్థానక ఉద్యానవన పరిశోధన స్థానంలో పాడేరు స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ అధికారి బి.కళ్యాణి ఆధ్వర్యంలో గిరిజన రైతులు పండించే పసుపు, అల్లం, మిరియాలు పంటలలో అధిక దిగుబడులు సాధించేందుకు చేపట్టవలసిన అంశాలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో మంచి దిగుబడులు సాధించలేకపోతున్నారన్నారు. పసుపు విత్తన శుద్ధి చేసుకొని, ఎత్తైన మడులతో నాటుకోవడంతో తెగుళ్లను నివారించుకోవచ్చన్నారు. మిరియాలు పంటలో నీడ నియంత్రణ పాటించాలని, రసాయన ఎరువులను వినియోగించొద్దన్నారు. జీవ, ఘనామృతం కషాయాలతో సాగు చేయాలని సూచించారు. స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ అదికారి కళ్యాణి మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై పసుపు ఉడకబెట్టే, పాలిష్ చేసే యంత్రాలను, మిరియాలు వలిచి, శుభ్రపరిచే యంత్రాలను అందజేస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8919475787 నంబరును సంప్రదించాలన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం సేంద్రియ విభాగపు శాస్త్రవేత్త సందీప్నాయక్ వరి పంటలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు, మెలకువలను వివరించారు. వి.వి.ఎస్.టాటా ట్రస్టు నిపుణుడు డాక్టర్ అప్పలరాజు, ఎర్రబొమ్మలు, పెద్దూరు, కొండవంచుల గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు కోసం వినూత్న నిరసన
డుంబ్రిగుడ: కొర్రాయి పంచాయతీ గత్తరజిల్లెడ గ్రామానికి వెళ్లే రహదారిలోని బురదలో స్థానిక యువకులు వరి నారును నాటారు. కొన్నేళ్లుగా ఈ రహదారి అధ్వానంగా ఉందని, పలుమార్లు అధికారులకు విన్న వించినా పట్టించుకోవడం లేదన్నారు. రాకపోకల కు నానా అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలకు రహదారులు ఏర్పాటుచేస్తామని ప్రగల్భాలు పలికిన ఉప ముఖ్యమంత్రి అధ్వానంగా ఉన్న రోడ్ల గురించి కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ బురద దారిపై స్థానిక యువత గురువారం నాట్లు వేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతా అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. -
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆరాధ్య
పరవాడ: భర్నికం శివారులోని బాపడుపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఒకటో తరగతి విద్యార్థిని ఆరాధ్య బెహ్ర .. తన అసాధారణ జ్ఞాపకశక్తితో అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయుడు కొరుపోలు గంగాధరరావు తెలిపారు. యాదృచ్ఛికంగా ఇచ్చిన ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాలను కేవలం 1 నిమిషం 30 సెకన్లలో సరైన క్రమంలో పేర్చడం ద్వారా ఆరాధ్య ఈ రికార్డును సాధించిందని ఆయన వివరించారు. ఎటువంటి సహాయం లేకుండా, కేవలం తన జ్ఞాపకశక్తిని ఉపయోగించి ఈ ఘనతను సాధించిందన్నారు. పాఠశాలలో జూలై 30న జరిగిన కార్యక్రమంలో ఆరాధ్య ఈ ప్రతిభను ప్రదర్శించిందని.. ఆమె ప్రతిభను గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆరాధ్య పేరును నమోదు చేసినట్లు తెలిపారు. పాఠశాలలో గురువారం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఎంఈవోలు ఎం.దివాకర్, జి. సాయిశైలజ విద్యార్థినితో పాటు ఉపాధ్యాయుడు గంగాధరరావును అభినందించారు. కార్యక్రమంలో సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్సార్ విభాగం సీనియర్ మేనేజర్ కె. ప్రకాశరావు, శివం తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే పరామర్శ
సాక్షి, పాడేరు: వైఎస్సార్సీపీ నాయకుడు శెట్టి రవి గుండెపోటుతో తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు.పాడేరులో నివాసం ఉంటున్న రవికి ఒక్కసారిగా చాతినొప్పి రావడంతో హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఈ సమాచారం తెలుసుకున్న అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ జిల్లా ఆస్పత్రికి చేరుకుని రవిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఇక్కడ వైద్యులను ఆయన కోరారు. ఈ మేరకు రవిని కేజీహెచ్కు రిఫర్ చేశారు.పెదబయలు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కాతారి సురేష్కుమార్ కూడా రవిని పరామర్శించారు. -
ఎర్రవరం జలపాతానికి రాకపోకలు బంద్
చింతపల్లి: మండలంలో గల ఎర్రవరం జలపాతానికి పర్యాటకులు రాకపోకలు సాగించకుండా రెవెన్యూ అధికారులు రహదారిని బంద్ చేశారు. గొందిపాకలు పంచాయతీ పరిధిలో గల ఈ జలపాతానికి వర్షాలు తగ్గేంతవరకూ పర్యాటకులు సందర్శనకు వెళ్లరాదని మండల తహసీల్దారు జి.ఆనందరావు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదకర జలపాతాలలో ప్రాణనష్టం సంభవించకుండా జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో ప్రమాదకర పర్యాటక ప్రాంతాలలో సందర్శకుల రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు. గురువారం తమ సిబ్బందిని పంపించి ఎర్రవరం జలపాతానికి వెళ్లే రహదారికి అడ్డుగా కంచె ఏర్పాటు చేశారు. -
ఎమ్మెల్యే శిరీష అవినీతిని నిరూపిస్తా..
అడ్డతీగల: రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవిపై మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఫైరయ్యారు. అవినీతిని నిరూపిస్తా.. రాజీనామాకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సోమవారం అడ్డతీగలలో ఎమ్మెల్యే శిరీష చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి అడ్డతీగలలో బుధవారం రాత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. శిరీష చెప్పిన ప్రాంతానికి ఆధారాలతో వస్తానని, స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రంతో రావాలన్నారు. ఇటీవల ఎల్లవరంలో జరిగిన ‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమం విజయవంతం కావడంతో దేశం నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారి ఎమ్మెల్యే శిరీషదేవి తనను విమర్శించడమే పనిగా పెట్టుకొని మీడియా సమావేశాలు పెడుతున్నారు తప్ప అభివృద్ధిపై చర్చించడం లేదన్నారు. తన పదవీ కాలంలో చేసిన అభివృద్ధి పనులు లెక్కలతో సహా సజీవంగా ఉన్నాయని పేర్కొన్నారు. శిరీషదేవి స్వగ్రామమైన గింజర్తి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, ఆమె అత్తగారి ఊరైన అనంతగిరిలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన కూడా వ్యక్తం చేశారన్నారు. ముందు వాటిని ఎమ్మెల్యే శిరీష చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని, దానికి సమయం వేదిక ఎమ్మెల్యే నిర్ణయించుకోవాలని సవాల్ విసిరారు. ఎటువంటి అవినీతికి పాల్పడకుండా సంవత్సర కాలంలో ప్రస్తుతం అనుభవిస్తున్న విలాసాలకు ఎక్కడి నుంచి నిధులు వచ్చాయని ప్రశ్నించారు. తన స్వగ్రామంలో జరిగిన ప్రభుత్వ పనుల్లో తన తల్లి, ప్రస్తుత సర్పంచ్ నాగులపల్లి రాఘవ అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆరోపించడం సరికాదని, ఆ గ్రామంలో పాఠశాలలకు అవసరమైన స్థలాన్ని కూడా తామే దానం చేశామని, అది తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. -
అదనంగా అంబులెన్స్ను కేటాయించాలి
ముంచంగిపుట్టు: స్థానిక సీహెచ్సీలో అదనంగా 108 అంబులెన్స్ కేటాయించాలని సీపీఎం మండల కార్యదర్శి కె.త్రినాథ్ డిమాండ్ చేశారు. సీహెచ్సీని వారు గురువారం సందర్శించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం పంచాయతీ సంగంవలస గ్రామానికి చెందిన గురుమూర్తి(50) అనే గిరిజనుడు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో ఉదయం 10.30 గంటలకు ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3గంటలకు వాహనం రావడంతో ఆస్పత్రికి తరలించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఒక అంబులెన్స్తో మండలవాసులు ఇబ్బందులు పడుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి మరో 108 కేటాయించాలని కోరారు. లక్ష్మీపురం ఉపసర్పంచ్ సత్యం, నాయకుడు గాసిరాం దొర పాల్గొన్నారు. -
మధుర ఫలాలు.. చేదు ఫలితాలు
సాక్షి, పాడేరు: మన్యంలో గిరిజన రైతులు సాగు చేస్తున్న ఆర్గానిక్ మధుర ఫలాలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు కరువయ్యాయి. ఇక్కడ పండే పైనాపిల్, పనస, సీతాఫలాలకు మైదాన ప్రాంతాల్లో ఎంతో డిమాండ్ ఉంది. నాణ్యత, రుచిలో నంబర్ 1గా ఆదరణ ఉన్నప్పటికీ ఈ మధుర ఫలాలకు మాత్రం సీజన్ ప్రారంభం నుంచి ఆశించినంత ధరలు లేకపోవడంతో గిరిజన రైతులు నష్టపోయారు. ప్రస్తుతం పైనాపిల్, పనస పండ్ల సీజన్ చివరి దశలో ఉంది. మైదాన ప్రాంతాలలో డిమాండ్ తగ్గడంతో విజయవాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం ప్రాంతాలకు చెందిన పెద్ద వ్యాపారులు కూడా గత 2 వారాల నుంచి ఏజెన్సీకి రావడం లేదు. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన దళారీ వ్యాపారుల మాటే వేదంలా చలామణీ అవుతోంది. డుంబ్రిగుడ, జి.మాడుగుల, పాడేరు మండలాల్లో 700 ఎకరాల్లో పైనాపిల్ తోటలను గిరి రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వంట్లమామిడి, అరకు, చిట్రాలగుప్ప ప్రాంతాలలో ఒక పండు రూ.10 నుంచి రూ.12 ధరకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం రూ.10కి మించి పైనాపిల్ అమ్ముడుపోకపోవడంతో గిరిజన రైతులు ఉసూరుమంటున్నారు. దక్కని గిట్టుబాటు ధర సీజన్ చివరిలోనూ పెరగని ధరలు పైనాపిల్, పనస పండ్లకు తగ్గిన గిరాకీ సీతాఫలాల ధరలు పతనం వర్షాలతో ముందుకురాని మైదాన ప్రాంత వ్యాపారులు నష్టపోతున్న గిరిజన రైతులు -
పలు రైళ్లకు తాత్కాలిక హాల్ట్ల కొనసాగింపు
తాటిచెట్లపాలెం (విశాఖ): ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా ఆయా స్టేషన్లలో కొనసాగుతున్న హాల్ట్లను మరికొంతకాలం పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి భువనేశ్వర్–సికింద్రాబాద్(17015) విశాఖ ఎక్స్ప్రెస్ సత్తెనపల్లె, పిడుగురాళ్లు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ల్లోను, సెప్టెంబరు 20వ తేదీ నుంచి పూరీ–తిరుపతి (17479) ఎక్స్ప్రెస్, సెప్టెంబరు 22వ తేదీ నుంచి తిరుపతి–పూరీ (17480) ఎక్స్ప్రెస్లకు కొవ్వూరు స్టేషన్లోను, సెప్టెంబరు 20వ తేదీ నుంచి బిలాస్పూర్–తిరుపతి(17481) ఎక్స్ప్రెస్, సెప్టెంబరు 18వ తేదీ నుంచి తిరుపతి–బిలాస్పూర్(17482) ఎక్స్ప్రెస్లకు కొవ్వూరు స్టేషన్లో హాల్ట్లు కొనసాగుతాయి. భువనేశ్వర్–రామేశ్వరం(20896)(కొత్త నెంబర్20849) ఎక్స్ప్రెస్కు సెప్టెంబరు 26వ తేదీ నుంచి రాజమండ్రి స్టేషన్లో, రామేశ్వరం–భువనేశ్వర్(20895) కొత్త నెంబర్ 20850) ఎక్స్ప్రెస్కు సెప్టెంబరు 28వ తేదీ నుంచి రాజమండి స్టేషన్లో, హౌరా–పుదుచ్చేరి(12867) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు సెప్టెంబరు 28వ తేదీ నుంచి రాజమండ్రి స్టేషన్లో, పుదుచ్చేరి–హౌరా(12868)సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు సెప్టెంబరు 24వ తేదీ నుంచి రాజమండ్రి స్టేషన్ల్లో హాల్ట్లు కొనసాగుతాయి. -
సెల్టవర్ ఏర్పాటుకు వినతి
గంగవరం: గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ నెట్ వర్క్ సిగ్నల్ సమ స్య పరిష్కరించాల ని కోరుతూ ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కమిటీ అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు తదితరులు రాజమండ్రిలోని బీఎస్ఎన్ఎల్ జీఎం రాజును కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. మండలంలోని పిడతమామిడి పరిసర గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ నెట్వర్క్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. దీనిపై ఆయన స్పందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారన్నారు. -
మన్యంలో చోడి నాట్లు ఆలస్యమే
సాక్షి, పాడేరు: ఖరీఫ్లో గిరిజన రైతులు సాగు చేసే చోడి (రాగులు) పంటకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పూర్తి కావాల్సిన చోడి నాట్లు ఆలస్యమవుతున్నాయి. అన్ని చోట్ల వర్షాలు కురవకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల చోడి నారు ఎదుగుదల ఆశాజనకంగా లేదు. ప్రతి ఏడాది ఆగస్టు 2వ వారానికే ఏజెన్సీవ్యాప్తంగా నూరుశాతం చోడిపంట నాట్లు పూర్తి చేయాల్సిన పరిస్థితి. అయితే ఈసారి మాత్రం ఇప్పటికి అతికష్టం మీద 40 శాతం నాట్లు పూర్తయ్యాయని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఏజెన్సీలో వరిపంట తరువాత అత్యధికంగా 17 వేల హెక్టార్ల మెట్ట, కొండపోడు భూముల్లో గిరిజన రైతులు చోడిపంటను సాగు చేస్తారు. ఇంటి అవసరాలతోపాటు వాణిజ్య అమ్మకాలకు చోడిపంటకు మన్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో కూడా సుమారు 3 వేల హెక్టార్లలో చోడిపంట సాగవుతుంది. అయితే ఈ ఏడాది సకాలంలో వర్షాలు విస్తారంగా కురవకపోవడంతో అన్ని పంటల వ్యవసాయం ఆలస్యమైంది. చోడి నాట్లు ఆలస్యం ఏజెన్సీవ్యాప్తంగా చోడి పంట నాట్లు ఆలస్యమవుతుండడంపై గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోడినారు అనేక ప్రాంతాలలో ఎండిపోతున్న పరిస్థితిలో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో గిరిజన రైతులు మళ్లీ చోడినాట్లను ప్రారంభించారు. చోడినారు తీత, పంట భూములకు తరలింపు, వరినాట్ల పనులను చేపడుతున్నారు. అయితే ఇప్పటికే నాట్లు ఆలస్యమవ్వడంతో పంట ఎదుగుదలపై రైతుల్లో ఆందోళన నెలకొంది. నాట్లు వేసిన తరువాత వర్షాలు కురవని పక్షంలో చోడినాట్లు ఎండిపోయే ప్రమాదాన్ని రైతులు తలచుకుని ఆవేదన చెందుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఖరీఫ్లో వ్యవసాయానికి వర్షాభావ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. వ్యవసాయ పనులు మెల్లమెల్లగా జరుగుతుండడంతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గిరిజన ప్రాంతాలలో వ్యవసాయమంతా వర్షాలపైన ఆధారపడి ఉంది. వర్షాలు మాత్రం అన్ని చోట్ల కురవకపోవడంతో మరింత ఇబ్బందిగా మారింది. పంటల ఎదుగుదలపై ఆందోళన వరితోపాటు చోడిపంట ఎదుగుదలపై ఆందోళన నెలకొంది. వ్యవసాయ సీజన్ ప్రారంభం నుంచి పూర్తిస్థాయిలో వర్షాలు కురవలేదు. చోడి పంట నాట్లు కూడా ఆలస్యమవుతున్నాయి. అన్ని చోట్ల వర్షాలు కూడా కురవకపోవడంతో మరింత ఇబ్బందిగా మారింది. దిగుబడులు కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి. –కొర్రా వెంకటరావు, గిరిజన రైతు, పోతంగి, డుంబ్రిగుడ మండలంఈ నెలాఖరుకు పూర్తి చేసే లక్ష్యం ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఈనెలాఖరు నాటికి చోడి నాట్లు పూర్తి చేసే లక్ష్యంతో రైతులను సమయత్తపరుస్తున్నాం. వర్షాలు ఆలస్యమవ్వడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. మోస్తరు వర్షాలు కురిసే సమయంలో రైతులు ఆలస్యం చేయకుండా చోడి నాట్లు వేసుకోవాలి. –ఎస్.బి.ఎస్.నందు, జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు -
ఏజెన్సీ డీఈవో పనసలపాలెం హాస్టల్ తనిఖీ
వై.రామవరం: మండలంలోని పనసలపాలెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను గురువారం ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువు సామర్ాధ్యలను పరీక్షించారు. రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు వండిన ఆహార పదార్థాల రుచి చూశారు. 10వ తరగతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని హెచ్ఎం, ఉపాధ్యాయులకు సూచించారు. హాస్టల్లో జ్వర పీడిత విద్యార్థులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందించడానికి తగు చర్యలు తీసుకోమని హెచ్ఎం, వార్డెన్లకు సూచించారు. ఎంఈవో కె.తాతబ్బాయిదొర, హెచ్ఎం అప్పలనాయుడు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అధ్వానంగా జాతీయ రహదారి
ఎటపాక: ఇసుక లారీల హోరుతో ప్రధాన రహదారి చిద్రమైంది. జాతీయ రహదారిపై గోతుల్లో వాహనాలు వెళ్లాలంటే సాహసమే. ఆంధ్రా– తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఎటపాక వద్ద జాతీయ రహదారి వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతం నుంచి నిత్యం వందలాది ఇసుకలారీలు ఆంధ్రా సరిహద్దు ప్రాంతం ఎటపాక మీదుగా భద్రాచలం వైపు వెళ్తుంటాయి. అయితే అధిక లోడు, భారీ వాహనాల కారణంగా ఎటపాక పోలీస్టేషన్ సమీపంలో రహదారిపై పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలకు గోతుల్లో నీరు నిలవడంతో ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోల ప్రయాణానికి సంకటంగా మారింది. ఈక్రమంలో వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోతుండడంతో తరచూ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. గురువారం మధ్యాహ్నం సమయంలో కూడా ఇదే రీతిలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. భద్రాచలం పట్టణానికి వచ్చే ఓ అంబులెన్స్ కూడా సుమారు 30 నిమిషాల ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. రహదారి దుస్ధితి కారణంగా వాహనదారులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే వారే లేరు. ఇసుక లారీలను నియంత్రించక పోవడంతోనే సమస్య తలెత్తిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఇదే పరిస్థితి నెలకొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు. నిత్యం ఇబ్బందులు మండల కేంద్రంలోని జాతీయ రహదారి అధ్వానంగా ఉంది.చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. గోతుల రహదారి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. అధికారులకు విన్నించినా పట్టించుకోవడం లేదు.ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. –రాము, ఎటపాక -
పంచాయతీలకు పన్ను నొప్పి
● ఏళ్ల తరబడి వసూలు కాని బకాయిలు ● కుంటుపడుతున్న అభివృద్ధి రంపచోడవరం పంచాయతీ కార్యాలయం రంపచోడవరం: జిల్లాలో పాడేరు డివిజన్లో 244, రంపచోడవరం డివిజన్లో 120, చింతూరు డివిజన్లో 66 గ్రామపంచాతీలుండగా, వీటిలో అత్యధిక పంచాయతీల్లో సకాలంలో పన్నులు వసూలు కాకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దీనికి తోడు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీల్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. రంపచోడవరం డివిజన్లో మేజర్ పంచాయతీ అయిన రంపచోడవరానికి రూ.53 లక్షల పన్ను బకాయిలు పెండింగ్లో ఉండిపోయాయి. రంపచోడవరం పంచాయతీకి ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ గృహాల నుంచి ఇప్పటి వరకు రూ. 53,74,241 పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉంది. వీటిలో ప్రభుత్వ శాఖల నుంచి రూ. 14,11,315 వసూలు కావలసి ఉంది. నియోజకవర్గం కేంద్రం కావడంతో ఇక్కడ పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ క్వార్టర్లు ఎక్కువగా ఉన్నాయి. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఎ, బి , సి అనే మూడు రకాల క్వార్టర్లు ఉన్నాయి. ఐటీడీఏ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు నివాసం ఉండేందుకు వీటిని నిర్మించారు. ఐటీడీఏ నుంచి సరైన నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో రాను రాను ఎవరు పడితే వారు ఈ క్వార్టర్లలో నివాసముంటున్నారు. ఐటీడీఏ క్వార్టర్ల నుంచి రూ.4,80,124 పన్ను వసూలు కావలసి ఉంది. టెలికాం భవనానికి సంబంధించి రూ.30,336, ఐటీడీఏ కార్యాలయ సముదాయం నుంచి రూ.14,321, సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి రూ.23,863, పీఎంఆర్సీ నుంచి రూ.2,52,818, పీఎంఆర్సీ నూతన క్వార్టర్స్ నుంచి రూ.1,80,860, పన్ను వసూలు కావాల్సి ఉంది. గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలు, పాఠశాలల క్వార్టర్లకు సంబంధించి రూ.53,006 పన్ను బకాయిలు వసూలు కావలసి ఉంది. రంపచోడవరంలోని పోలీస్శాఖకు చెందిన క్వార్టర్స్, అటవీ శాఖకు చెందిన భవనాలు, ఎంపీడీవో కార్యాలయం భవనాలకు పన్నులు చెల్లించాల్సి ఉంది. పాడేరు విడిజన్లో రూ.1.30 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఈ మొత్తం ప్రభుత్వ కార్యాలయాల నుంచి వసూలు కావాల్సి ఉంది.పది శాతం పెంచి పన్నులు వసూలు చేస్తాం పన్ను బకాయిలు ఎక్కువగానే ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి పన్నులు వసూలుకు చర్యలు చేపడతాం. పదిశాతం పెంచి పన్ను వసూలు చేస్తాం. రోడ్ల ఆక్రమణల కారణంగా రంపచోడవరంలో చాలా వరకు షాపులను తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఏరియాను బట్టి పన్ను విధించాల్సి ఉంటుంది. పన్ను వసూళ్లపై దృష్టి సారించి పంచాయతీలకు నిధులను సమకూర్చేందుకు కృషి చేస్తాం. –కోటేశ్వరరావు, డీఎల్పీవో,రంపచోడవరం చింతూరు డివిజన్లో... చింతూరు డివిజన్లో 66 పంచాయతీలున్నాయి. చింతూరు పంచాయతీ పరిధిలో ఉన్న 69 ప్రభుత్వ శాఖలు తొమ్మిదేళ్ల కాలంలో రూ. 39,10,932 పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా చింతూరు ఐటీడీఏ పీవో బంగ్లా పన్ను బకాయి రూ.79,821, ఉపఖజానా కార్యాలయం రూ.37,242, చింతూరు తహసీల్దార్ కార్యాలయం రూ.1,01,502, ఐటీడీఏ కార్యాలయం రూ.2,69,865 పన్ను బకాయి చెల్లించాల్సి ఉంది. వివిధ రకాలైన క్వార్టర్లకు పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. పంచాయతీలకు పన్ను బకాయిలు సక్రమంగా చెల్లించకపోవడంతో పంచాయతీల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిధుల కొరత ఏర్పడుతోంది. పలు ప్రైవేట్ అతిఽథి గృహాల నుంచి పన్నులు సక్రమంగా వసూలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
స్టీల్ మెల్ట్ షాప్–2లో 72 హీట్లతో కొత్త రికార్డు
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ మరో అద్భుతమైన ఘనతను సాధించింది. స్టీల్ మెల్ట్ షాప్–2 (ఎస్ఎంఎస్–2)విభాగంలో మంగళవారం అత్యధికంగా 72 హీట్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో 2021 జనవరి 30న సాధించిన 68 హీట్ల రికార్డును ఇది అధిగమించింది. ఈ రికార్డు సాధనలో భాగంగా మూడు షిఫ్టుల్లోనూ 24 చొప్పున మొత్తం 72 హీట్లు ఉత్పత్తి అయ్యాయి. దీంతో రెండు స్టీల్ మెల్ట్ షాపులలో కలిపి మొత్తం 133 హీట్లు ఉత్పత్తి అయ్యాయి. అంతేకాకుండా మూడు బ్లాస్ట్ ఫర్నేస్లలో కలిపి 19,037 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి కావడం విశేషం. ఈ రికార్డు సాధనలో కృషి చేసిన ఉద్యోగులను స్టీల్ప్లాంట్ ఉన్నతాధికారులు అభినందించారు. -
హుకుంపేట వైస్ ఎంపీపీగా సుశీల
హుకుంపేట: హుకుంపేట మండల పరిషత్తు ఉపా ధ్యక్ష ఉపఎన్నికల్లో సంతారి ఎంపీటీసీ సభ్యురాలు, వైఎస్సార్సీపీ అభ్యర్థి సుశీల విజయం సాధించా రు. ఇక్కడ వైస్ ఎంపీపీగా ఉన్న ఒంటుబు ప్రియాంక వ్యక్తి గత కారణాల వల్ల ఇటీవల పదవికి రాజీనామా చేయడంతో బుధవారం ఉప ఎన్నిక నిర్వహించారు. మండలంలోని మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 10 ఓట్లతో బీజేపీ అభ్యర్థి బాలకృష్ణపై వైఎస్సార్సీపీ అభ్యర్థి సుశీల విజయం సాధించారు. ఎన్నికల అధికారి కె.పి.చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని ఆమెకు అందజేశారు. వైస్ ఎంపీపీకి అభినందనలునూతనంగా ఎన్నికై న వైస్ ఎంపీపీ సుశీలకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,ఎంపీపీ కూడా రాజుబాబు, ఇతర నాయకులతో కలిసి పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి,ఏవో సన్యాసిరావు,వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి అనిల్,పార్టీ గౌరవ అధ్యక్షుడు గండేరు చినసత్యం,స్థానిక సర్పంచ్ సమిడ వెంకటపూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. -
చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
● ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు గంగవరం: చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు ఉపాధ్యాయులకు సూచించారు. నెల్లిపూడి జెడ్పీ పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని, ఉపాధ్యాయులు డైరీలు, లెసెన్ప్లాన్ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఉధృతంగా గెడ్డలు
రాజవొమ్మంగి: గడిచిన రెండు రోజులుకు కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజవొమ్మంగిలో ఉదయం 8 గంటలకు 38.8 ఎంఎం వర్షపాతం నమోదైనట్టు జిల్లా గణాంకాధికారి మురళీకృష్ణ తెలిపారు. మధ్యాహ్నం కూడా భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు నాగులకొండ ప్రాంతం నుంచి కొండవాగులు పొంగి ప్రవహిస్తు వట్టిగెడ్డ వాగులో కలుస్తున్నాయి. ఈ కారణంగా రాజవొమ్మంగి శివారు శాంతినగర్, శ్రీరాంనగర్, వట్టిగెడ్డ వద్ద ఎర్రంపాగు గ్రామానికి వెళ్లే మార్గంలోని చప్టాలమీదుగా వట్టిగెడ్డ వాగు ప్రమాద స్థాయిలో పరవళ్లు తొక్కుతోంది. వాగు ఉధృతి కారణంగా వయ్యేడు, బూరుగపల్లి, ముర్లవానిపాలెం, శాంతినగరం. గింజర్తి, ఎర్రంపాడు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆయా ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరేందుకు ఉధృత వాగులు అడ్డంకిగా మారాయి. వాగుల వద్ద పరిస్థితిని రాజవొమ్మంగి ఎస్ఐ నరనింహమూర్తి పర్యవేక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో వాగులు, గెడ్డలు దాటవద్దని హెచ్చరించారు. పోలీసు సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు. ప్రమాదకర వాగులపై వంతెనలు నిర్మించాలని ఆయా గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారీ వర్షాల కారణంగా రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేటలోని వట్టిగెడ్డ రిజర్వాయర్ పంటకాలువకు వరద ఉధృతి కారణంగా మంగళవారం రాత్రి గండి పడింది. సమస్య పెరగకుండా, గండ్లు విస్తరించకుండా మైనర్ ఇరిగేషన్ శాఖ సిబ్బంది కాలువ కట్టేశారు. వట్టిగెడ్డ రిజర్వాయర్ పంట కాలువ పండూరు వారి పొలాల వద్ద వరద ఉధృతి పెరిగి గట్లపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో పంట కాలువకు ఏటా గండి పడడం, ఆయకట్టు శివారు రైతులకు సాగునీరు అందకపోవడం పరిపాటిగా మారింది. గతంలో ఈ విధంగా గండ్లు పడగా రైతులు ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక చర్యలు తీసుకున్నారు. కొయ్యూరు: ఏకధాటిగా గంటల తరబడి కురిసింది. కుండపోత మాదిరిగా కుమ్మరించింది.దీని మూలంగా రోడ్లన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. పంట పొలాలు పూర్తిగా నీరు చేరింది.కాలువలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.బుధవారం 11 గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఏకదాటిగా కురిసింది. విరామం లేకుండా నాలుగు గంటల పాటు కురవడంతో కాకరపాడు, కొయ్యూరు, వట్టిగెడ్డ కాలువల ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం కురిసిన వర్షం మెట్ట పంటలకు మేటు చేస్తుందని రైతులు చెబుతున్నారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం నిలిచిన రాకపోకలు గెడ్డల వద్ద పోలీసుల పహారా -
ఎన్నాళ్లీ నడకయాతన!
ముంచంగిపుట్టు: మండలంలోని దొరగూడ గ్రామ గిరిజనులు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మంజూరైనా పనులు జరగకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షకాలంలో వారి అవస్థలు వర్ణనాతీతం. ఉధృతంగా ప్రవాహిస్తున్న వాగులు దాటితే గాని నిత్యావసర సరుకులు పొందలేని పరిస్థితి వారిది. సరుకుల కోసం బుధవారం పలువురు గ్రామస్తులు ఆరు కిలో మీటర్లు కాలినడకన కొండ ఎక్కి దిగి,అటవీ ప్రాంతాల్లో ప్రయాణించి,ఉధృతంగా ప్రవహిస్తున్న బిరిగూడ,ఉబ్బెంగుల వాగులు దాటుకుని లక్ష్మీపురం పంచా యతీ కేంద్రానికి వెళ్లవలసి వచ్చింది. రేషన్ డిపోలో సరుకులు పొందడంతో పాటు ఇంటికి కావాల్సిన సరుకులను సంతలో కొనుక్కుని తిరిగి అవే కష్టాలు పడుతూ గ్రామానికి చేరుకున్నారు. రహదారి పూర్తి చేసి,కల్వర్టులు నిర్మించి కష్టాలు తీర్చాలని వారు వేడుకుంటున్నారు. -
జిల్లాకు రూ.27 కోట్ల నీతి ఆయోగ్ నిధులు
సాక్షి,పాడేరు: జిల్లాలో రైతుల ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నామని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు.స్థానిక కాఫీ హౌస్లో రైతు ఉత్పత్తుల ఆకాంక్ష హాట్ ఎగ్జిబిషన్ను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ సమారో కార్యక్రమాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయని,గంగవరం,మారేడుమిల్లి,వై.రామవరం మండలాల్లో అమలుజేస్తున్నామన్నారు. జిల్లాకు రూ.27కోట్ల నీతి ఆయోగ్ నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.గిరిజన రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు పంపిణీ చేయడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిచవచ్చని తెలిపారు. మారేడుమిల్లి,గంగవరం,వై.రామవరం మండలాల్లో అభివృద్ధిపై విద్యా,వైద్యశాఖలతో పాటు ఐసీడీఎస్,డీఆర్డీఏ అధికారులు,ఎంపీడీవోలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.అనంతరం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశిత సూచికలను విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేసిన డీఈవో పి.బ్రహ్మాజీరావు,జిల్లా వ్యవసాయాధికారి నందు,డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు,డీఆర్డీఏ పీడీ మురళీ,ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, గంగవరం, మారేడుమిల్లి, వై.రామవరం మండలాల ఎంపీడీవోలు,పలుశాఖల ఉద్యోగులకు కలెక్టర్ దినేష్కుమార్,జేసీ డాక్టర్ అభిషేక్గౌడ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ప్రోగ్రాం అధికారి నారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
సమావేశంలో వెల్లువెత్తిన సమస్యలు
పెదబయలు: మండలంలో పాఠశాలలు తెరిచి రెండు నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయులను భర్తీ చేయడం లేదని దీంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని మండలంలోని ఎంపిటీసీ సభ్యులు, సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బొండా వరహాలమ్మ అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీడీవో పూర్ణయ్య సభాధ్యక్షుడిగా వ్యవహారించారు. పలు శాఖలపై అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పెదబయలు మండలంలోని ఇంజరి. గిన్నెలకోట, జామిగుడ, బొంగరం పంచాయతీల పరిధిలోని పాఠశాలకు ఉపాధ్యాయులు లేదని, జూన్ 12న పాఠశాలలు తెరిచిన నేటి వరకు పాఠశాలలకు ఉపాధ్యాయులు లేదని దీంతో చిన్నారులకు విద్యకు దూరమవుతున్నారని ఉపాధ్యాయులకు భర్తీ చేసి పాఠశాలలు తెరువాలని సభ్యులు ధ్వజమెత్తారు. ఈ నెల 16 మంది ఉపాధ్యాయులను పాఠశాలలు తెరువాలని డిప్యూటేషన్ ఆదేశాల జారీ చేసినా పాఠశాలలు తెరువాలేదన్నారు. గిరిజన విద్యపై కూటమి ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పైబడినా మండలంలోని ఎక్కడా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదని సీతగుంట ఎంపీటీసీ సభ్యుడు కిమంకరి బొంజుబాబు, సర్పంచ్ పలాసి మాధవరావు చెప్పారు. ఉపాధి పథకం ద్వారా పంపిణీ చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి తీసుకొచ్చిన సిల్వర్ ఓక్ ఇతరత్రా మొక్కలు ఎండిపోతున్నాయని, మండలంలోనే నర్సరీలు ఏర్పాటుచేసి గిరిజన రైతులను ఆదుకోవాలన్నారు.మండలంలో చాలా మందికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకం సుమారు 2200 మందికి మంజూరు కాలేదన్నారు. గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అందరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. రాజ్మా విత్తనాలు సకాలంలో అందించాలన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాన్ని అటవీశాఖాధికారులు అడ్డుకుంటున్నారన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా జీవాలకు వ్యాధులు ప్రబలే అవకాశముందని చెప్పారు. ఈ కారణంగా గ్రామల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించాలని పలువురు సర్పంచ్లు కోరారు. డీఆర్ డిపో ద్వారా సరకులు సక్రమంగా పంపిణీ జరగడం లేదన్నారు. యంత్రాంగం స్పందించి రేషన్ సరకులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పలు శాఖల ప్రగతిపై సమీక్షించారు.అధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. బంగారుమెట్ట నుంచి సంపంగిపుట్టు వరకు ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ పనులు చేయాలని అధికారులను కోరారు. వైస్ ఎంపీపీ సోనే రాజుబాబు, తహసీల్దార్ త్రినాథరావునాయుడు,మండల స్థాయి అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచ్లు పాల్గొన్నారు. వాడీవేడిగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశం -
కాఫీ శుద్ధి కర్మాగారాన్ని తరలించొద్దని వినతి
చింతపల్లి: కాఫీ శుద్ది కర్మాగారాన్ని మైదాన ప్రాంతానికి తరలించకుండా చింతపల్లిలోనే కొనసాగించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ కోరారు. మండలంలోని గొందిపాకలు గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుడు బోనంగి పండుపడాల్ జయంతి కార్యక్రమానికి అధికారికంగా వచ్చిన కలక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజన రైతులు కాఫీ పంటను వాణిజ్య పంటగా సాగుచేపడుతున్నారన్నారు. ముఖ్యంగా చింతపల్లి, జీకే వీధి మండలాల్లో అత్యదికంగా ఈ పంట సాగువుతుందన్నారు.ఈ పంటపైనే ఆధారపడి అనేక కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో చింతపల్లిలో నెలకొల్పిన కాఫీ యూనిట్ను మైదాన ప్రాంతానికి తరలిస్తున్నట్టు ప్రచారం జరుగుతుందన్నారు.ఇప్పటికే జీఓ నెం3 ఎత్తివేతలో గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలను కోల్పోయారని, హైడ్రో పవర్ ప్రాజెక్టులు ద్వారా నీటిని కూడా గిరజనులు దక్కకుండా ప్రభుత్వం కుటిల ప్రయత్రాలు చేపడుతుందని విమర్శించారు.చింతపల్లిలో ఉన్నటువంటి కాఫీ యూనిట్ను మైదాన ప్రాంతానికి తరలించే ఆలోచన విరమించుకోకుంటే చింతపల్లిని అష్టదిగ్బందం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాద్యక్షులు పాంగి దనుంజయ్,కాపీ రైతు సంఘం ప్రతినిది బౌడు కుశలవుడు,జిల్లా ప్రతినిది జనకాని కనకారావు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య అందేలా చర్యలు
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హుకుంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. బుధవారం స్థానిక విదాశాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించి, మండలంలో పాఠశాలల వివరాలు తెలుసుకున్నారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ మండలంలోని మారుమూల గ్రామాల్లో సైతం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూడా రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. -
400 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ
మద్దిలపాలెం (విశాఖ): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఏయూ పరిపాలన భవనం వద్ద నుంచి 400 అడుగుల జాతీయ పతాకంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏయూ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యువతను భాగస్వామ్యం చేస్తూ వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం ఈ ర్యాలీ సిరిపురం కూడలి, ఏయూ ఇన్ గేట్ మీదుగా మళ్లీ పరిపాలన భవనం వద్ద చేరుకోవడంతో ముగిసింది. రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు, డీన్ కె.రమా సుధ, ఎస్.హరినాథ్, ఎన్.ఎం.యుగంధర్, డి.సింహాచలం, తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ గ్రామంగా గొందిపాకలు
చింతపల్లి: స్వాతంత్య్ర సమరయోధులు జన్మించిన గొందిపాకులు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. గొందిపాకలులో తొలిసారిగా అధికారికంగా బుధవారం నిర్వహించిన స్వాతంత్య్ర సమరమోధుడు బోనంగి పండుపడాల్ 135 జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పండుపడల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి పొందుతున్న ఈ ప్రాంతంలో హోం స్టేలు ఏర్పాటుకు ముందుకు వస్తే వారికి అన్నివిధాలుగా ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఎర్రవరం జలపాతాన్ని అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ సందర్భంగా గ్రామంలో పలువురు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వివరాలను సేకరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం గ్రామంలో పండుపడాల్ కుటుంబ సభ్యలను దుశ్శాలువాలతో సన్మానించారు.గ్రామంలో కొంతసేపు పర్యటించి అవకాడో మొక్కలను పరిశీలించి, పాఠశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. గిరిజన రైతులు పండించి, సేకరించిన వ్యవసాయ,ఉద్యానవన పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర, ఎంపీపీ కోరాబు అనూషదేవి,ఎంపీడీవో సీతామహాలక్ష్మి,ఎంఈవో ప్రసాద్, డీఈ రఘు, ఏవో మధుసూదన్రావు.ఎంపీటీసీ మోహనరావు, స్వాతంత్య్ర సమరయోధుడు పండు పడాల్ కుటుంబ సభ్యులు కుశలవుడు,కనకారావు,రామారావు,వెంకటేశ్వర్లు,గంగరాజు,అబ్బాయినాయుడు తదితరులు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి సాక్షి,పాడేరు: యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ పిలుపునిచ్చారు.ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు రెండు వారాల పాటు ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలన్నారు.పరిసరాలు,నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యతని చెప్పారు. అనంతరం ర్యాలీ పాడేరు వీధుల్లో సాగింది.ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్గౌడ,సహాయ కలెక్టర్ కె.సాహిత్,డీఈవో బ్రహ్మాజీరావు,జిల్లా వ్యవసాయాధికారి నందు,డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, డీఆర్డీఏ పీడీ మురళీ,ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి తదితరులు పాల్గొన్నారు. మ్యూజియం ఏర్పాటుకు చర్యలు కలెక్టర్ దినేష్కుమార్ -
మహాప్రసాదం నిత్యాన్నదానం
సింహగిరిపై నిత్యాన్నదాన పథకంలో సింహాచలం దేవస్థానం అందించే అన్నప్రసాదాన్ని భక్తులు మహాప్రసాదంగా భావిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం అన్నప్రసాదం స్వీకరించే తిరుగుపయనం అవ్వాలని చాలా మంది భక్తులు తపిస్తుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన అప్పన్న నిత్యాన్నదాన పథకం అమల్లోకి వచ్చి నేటి(ఆగస్టు 14)తో 36 వసంతాలు పూర్తిచేసుకుని 37వ వసంతంలోకి అడుగుపెడుతోంది. అన్నప్రసాదాన్ని భక్తులకు వడ్డిస్తున్న సిబ్బందినేటితో 36 వసంతాలు పూర్తిచేసుకున్న సింహాచల దేవస్థానం నిత్యాన్నదాన పథకంసింహాచలం: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సింహాచలం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు రోజూ దేశ విదేశాలకు చెందిన భక్తులు వస్తుంటారు. వీరిలో ఒడిశా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భక్తులే ఎక్కువ. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందించాలని 1989 ఆగస్టు 14న నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో దేవస్థానంలో పనిచేసిన ఉద్యోగులే ఈ పథకానికి రూ.50 వేలు తొలి విరాళం అందించారు. అప్పటి నుంచి ఈ పథకానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రూ.38 కోట్లకు పైగా విరాళాలు 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి నిత్యాన్నదాన డిపాజిట్లు 36 కోట్ల 45 లక్షల 41 వేల 720 రూపాయలకు చేరుకున్నాయంటే అది భక్తులకు సింహాచలేశుడిపై ఉన్న అచంచల విశ్వాసమే..! ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మరో రూ.2.20 కోట్ల డిపాజిట్లు వచ్చాయి. ఈ విరాళాలను బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, వాటిపై వచ్చే వడ్డీతో భక్తులకు నిత్యం దేవస్థానం అన్నప్రసాదం అందిస్తోంది. దాతలకు ప్రత్యేక ప్రాధాన్యత నిత్యాన్నదాన పథకానికి విరాళాలందించే దాతలకు ప్రత్యేక గుర్తింపు ఉటుంది. రూ.10,116 ఆపై విరాళం అందించే దాతలకు దేవస్థానం బాండ్లు అందిస్తుంది. ఆ రోజు పరిస్థితి ఆధారంగా స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. దీంతోపాటు ఏడాదిలో వారు కోరుకున్న రోజున వారి పేరు మీద భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు. ఆ వివరాలను ఆ రోజు అన్నప్రసాద భవనం బోర్డులో పేర్కొంటారు. రూ.10,116 లోపు వచ్చే విరాళాలను స్వల్ప విరాళాలుగా పరిగణిస్తారు. వాటిని ప్రోవిజన్స్, ఇతర ఖర్చులకు వెచ్చిస్తారు. రోజువారీ అన్నప్రసాదం సింహగిరిపై ఉన్న అన్నప్రసాద భవనంలో రోజూ ఉదయం 11.30కు వడ్డన ప్రారంభమవుతుంది. సోమ నుంచి శుక్రవారం వరకు రోజూ 2 వేలు నుంచి 3,500 మందికి, శనివారాలు 5–7 వేలు, ఆదివారం రోజుల్లో 4–6 వేల మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డిస్తారు. రోజూ రాత్రి పూట 200–500 మంది భక్తులకు కదంబం(ముక్కల పులుసు అన్నం) అందిస్తారు. మార్చి 31 నాటికి రూ.36.45 కోట్లకు చేరిన డిపాజిట్లు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మరో రూ.2.20 కోట్లుభక్తులకు నాణ్యమైన భోజనం అన్నప్రసాదాన్ని భక్తులకు రుచిగా అందించేందుకు ఎప్పటికప్పుడు నాణ్యత పరిశీలిస్తాం. దీనిపై అధికారులకు ప్రత్యేక సూచనలిస్తాం. ఆఖరి పంక్తి వరకు భక్తులందరికీ ఒకే రకమైన నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. దాతల ప్రోత్సాహం చాలా ఎక్కువ. – వి.త్రినాథరావు, ఈవో, సింహాచలం దేవస్థానం రుచి చాలా బాగుంది శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి దర్శనం బాగా జరిగింది. కుటుంబ సభ్యుల కోరికతో తొలిసారి అన్నప్రసాదం స్వీకరించా. రుచి బాగుంది. సాంబారు ఎంతో నచ్చింది. అన్నప్రసాదం రుచి ఎలా ఉందో భక్తుల అభిప్రాయాలు తీసుకోవడం బాగుంది. – ఆర్.రావు, భిలాయ్ మహా ప్రసాదంగా భావిస్తా.. సింహాచలేశుడి దర్శనానికి తరచూ వస్తుంటాను. అన్నదాన భవనంలో భోజనం తప్పకుండా చేస్తాను. మహాప్రసాదంగా అనుకుంటాం. దాతల సహకారంతో సింహాచలం దేవస్థానం చేస్తున్న అన్నదానం ఎంతో గొప్ప కార్యక్రమంగా భావిస్తాను. – మణి, విజయనగరం -
ట్రాఫిక్ రూల్స్తో ప్రమాదాల నివారణ
వాహనాదారులకు ఆర్టీవో సూచన గంగవరం: రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే వాహనదారులు పక్కాగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రోడ్డు రవాణా శాఖాధికారి రాజేష్ అన్నారు. మంగళవారం స్థానిక వై.జంక్షన్లో ఎస్సై బి.వెంకటేష్తో కలసి వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించి ఏ రికార్డు లేకపోయినా కేసులు రాసి జరినామా వసూలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు తరచూ నిర్వహిస్తామన్నారు. -
మదిమదిలో జెండా
స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఊరూరా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పెదబయలులో 198 సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసు స్టేషన్ నుంచి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వరకు జాతీయ పతాకాలు చేతపట్టి ర్యాలీ చేశారు. పెదబయలు అంబేడ్కర్ కూడలిలో భారత్ మాతకు జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఆర్పీఎఫ్ పోలీసులు, స్థానిక సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎటపాకలో 212 సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారీ జెండాలతో ఎటపాక నుంచి భద్రాచలం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారు. కమాండెంట్ దీపక్కుమార్ శ్రీవాస్తవ, సెకండ్ కమాండ్ ఆఫీసర్ దినేష్కుమార్, డిప్యూటీ కమాండెంట్ అజయ్ ప్రతాప్సింగ్, డిప్యూటీ కమాండెంట్ గౌరవ శర్మ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ విక్రాంత్కుమార్, 141 బెటాలియన్ సిబ్బంది, సివిల్, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జి.మాడుగులలో పోలీసుల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్థానిక సర్కిల్ పోలీస్స్టేషన్ నుంచి ర్యాలీ జరిపారు. అనంతరం మానవహారం నిర్వహించారు. సీఐ బి.శ్రీనివాస్రావు, ఎస్ఐ ఎస్.షణ్ముఖరావు, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కామాండెంట్ వినయ్గన్ పాల్గొన్నారు. –పెదబయలు/ఎటపాక/జి.మాడుగుల మువ్వన్నెల జి.మాడుగులలో విద్యార్థులతో మానవహారం నిర్వహిస్తున్న సీఐ శ్రీనివాస్రావు -
హుళక్కి
ఉచిత ప్రయాణంఘాట్రోడ్డు నెపం చెప్పవద్దుచింతపల్లి నుంచి నర్సీపట్నం, విశాఖలకు అధికంగా ప్రయాణం చేస్తుంటాం. లంబసింగి ఘాట్ మీదుగానే బస్సులు నడుస్తాయి. ఘాట్ రోడ్డు నెపంతో ప్రయాణానికి ఇబ్బందులు పెట్టవద్దు. ప్రస్తుతం ఘాట్లో ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కొత్త బస్సులను అందుబాటులోకి తేవాలి. –వై.వెంకటేశ్వరమ్మ, ప్రయాణికురాలు, చింతపల్లిసాక్షి, పాడేరు: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై జిల్లాలోని మహిళల ఆశలు సన్నగిల్లుతున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, శ్రీశైలం, పాడేరు ఘాట్ ప్రాంతాల్లో భద్రత పరంగా ఉచిత బస్ సర్వీసులు నడపలేమంటూ ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన తరుణంలో జిల్లావ్యాప్తంగా మహిళల ఉచిత ప్రయాణంపై సందిగ్ధత నెలకొంది. జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలో ఘాట్రోడ్లు అధికంగా ఉన్నాయి. పాడేరు నుంచి అరకులోయ మినహా మిగిలిన అన్ని రూట్లలో ఘాట్ భాగం అధికంగా ఉంది. జిల్లా నుంచి మైదాన ప్రాంతాలకు పోయే విశాఖపట్నం, ఎస్.కోట, నర్సీపట్నం రూట్లలో ఘాట్రోడ్డు ఉంది. అలాగే ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, పాడేరు–చింతపల్లి రోడ్డులో కొక్కిరాపల్లి ఘాట్, జి.మాడుగుల నుంచి మద్దిగరువు, చింతపల్లి నుంచి సీలేరు రోడ్డు, చింతపల్లి నుంచి రంపచోడవరం రోడ్డు, రంపచోడవరం నుంచి చింతూరు పోయే రోడ్డు, సీలేరు నుంచి చింతూరు పోయే ప్రధాన రోడ్లలో ఘాట్ అధికంగా ఉంది. జిల్లాలో 2 వేల కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఈ రూట్లలో ప్రస్తుతం ప్రతి ఆర్టీసీ బస్సులో 40 మంది దాటే ప్రయాణం చేస్తున్నారు. ఉచితం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కిటకిటలాడే బస్సుల్లో భద్రత ఏమేరకు ఉంటుందోనని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఘాట్ ఎక్కుతుండగా ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఇంతవరకు చోటుచేసుకోలేదు. పాడేరు ఆర్టీసీ డిపోలో బస్సులుమన్యం మహిళలకు ప్రయాణికుల భద్రత పేరిట ఘాట్రోడ్లలో నిలిపివేత జిల్లాలో అధిక రూట్లు ఘాట్ ప్రాంతాలే రోజువారీ 5 వేల కి.మీ. సర్వీసు అందులో 2 వేల కి.మీ. ఘాటీయే.. అదనపు బస్సులు వస్తేనే ఉచితానికి అవకాశం పాడేరు డిపోలో 47 బస్సులే జిల్లాలో ఒక్క పాడేరు డిపో మాత్రమే ఉండగా, 47 బస్సులు సర్వీస్ చేస్తున్నాయి. జిల్లాకు సంబంధించి 22 రూట్లు ఉండగా, ఒక్క అరకు రూట్ మినహా మిగిలిన అన్ని రూట్లలో ఘాట్రోడ్డు ఉందని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపారు. 40మందికి మించి ప్రయాణికులతో బస్సులు నడపలేమని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈలెక్కన అదనంగా బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంది. ఎస్.కోట, విశాఖపట్నం, అనకాపల్లి, తుని, నర్సీపట్నం, ఏలేశ్వరం, గోకవరం, రాజమండ్రి డిపోల నుంచి మరో 20 బస్సులు జిల్లాలో తిప్పుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఘాట్ ప్రాంతం అధికంగా ఉండడంతో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడం ద్వారానే ఉచిత ప్రయాణం సురక్షితమవుతుంది. అయితే ఆ దిశలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పట్లో కొత్త బస్సులు పాడేరు డిపోకు వచ్చే పరిస్థితి కూడా లేదని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పాడేరు డిపోలో ఉన్న 47 బస్సుల్లో 45 బస్సులు రోజువారీ సర్వీసు చేస్తుండగా, వాటిలో 15 బస్సులు వరకు పాతవే ఉన్నాయి. ఆ బస్సులు కూడా తరచూ మరమ్మతులకు గురవుతున్న పరిస్థితి. అన్ని రూట్లలో అదనంగా బస్సులు ఏర్పాటు చేసి ఉచిత ప్రయాణాన్ని సురక్షితం చేయాలని జిల్లా మహిళలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. -
జల ప్రవాహంలో బిక్కుబిక్కుమని..
● సరియా వద్ద చిక్కుకున్న 32 మంది పర్యాటకులు ● భారీ వర్షానికి జలపాతం దారిలో గెడ్డ ఉధృతి ● గెడ్డ ఆవల చిక్కుకుపోయిన సందర్శకులు ● అప్రమత్తం చేసిన అనకాపల్లి ఎస్పీ ● రోప్ సహాయంతో రక్షించిన పోలీసు, ఫైర్, రెవెన్యూ సిబ్బంది దేవరాపల్లి: సుందర సరియా జలపాతం కొన్ని గంటలపాటు వారి వెన్నులో వణుకు పుట్టించింది. ఈ పర్యాటక ప్రాంతాన్ని చూద్దామని విశాఖ, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన 32మంది సందర్శకులు ప్రాణాలు అర చేత పెట్టుకొని బిక్కుబిక్కుమని గడిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల పరిధిలోని సరియా జలపాతం సందర్శనకు మంగళవారం ఉదయం వీరు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం రావడంతో జలపాతానికి ముందు ఉన్న గెడ్డ ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించడంతో పర్యాటకులంతా అవతలి వైపు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. దేవరాపల్లి, చీడికాడ ఎస్లు వి.సత్యనారాయణ, బి.సతీష్, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులతో కలిసి సుమారు మూడు గంటలపాటు శ్రమించారు. గెడ్డ ఉధృతి తగ్గిన తర్వాత రోప్ సహాయంతో ఒక్కొక్కరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రాత్రి 10 గంటల సమయంలో దేవరాపల్లి ప్రాంతానికి తీసుకువచ్చారు. వీరిని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, సీఐ పైడపునాయుడు, చీడికాడ ఎస్ఐ బి.సతీష్, అనంతగిరి, దేవరాపల్లి తహసీల్దార్లు వీరభద్రచారి, పి.లక్ష్మీదేవి, జీనబాడు పంచాయతీ కార్యదర్శి రమ్య తదితరులు కలిసి వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ వర్షాకాలంలో జలపాతాల సందర్శనలను రద్దు చేసుకోవాలని సూచించారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన దేవరాపల్లి ఎస్ఐ సత్యనారాయణతోపాటు అగ్నిమాపక, రెవెన్యూ అధికారులను, స్థానికులను డీఎస్పీ అభినందించారు. సురక్షితంగా దేవరాపల్లి చేరుకున్న పర్యాటకులకు స్థానికంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పించారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక
● సమస్యల వివరాలను ప్రొఫార్మాలో అందించండి ● సర్పంచ్లకు ఐటీడీఏ పీవో సింహాచలం సూచన రంపచోడవరం: గ్రామాలకు కావలసిన మౌలిక సదుపాయాలు, సమస్యల వివరాలను ఒక ప్రొఫా ర్మాలో అందిస్తే ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చర్య లు తీసుకోవడానికి వీలవుతుందని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాల్లో సర్పంచ్లు, కార్యదర్శులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ వివరాలను పరిశీలించి సాధ్యమైనంత వరకు అమలు చేసేందుకు కృషి చేస్తామ ని చెప్పారు. ఆస్పత్రిలో ప్రసవమైన పిల్లలకు ముందుగా పేర్లు పెడితే 21 రోజుల్లో ఇంటి వద్దకే బర్త్ సర్టిఫికెట్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. మారుమూల గ్రామాల్లోని గిరిజన బాలలు ఆధార్ కార్డు నమోదు చేసుకునే విధంగా ప్రత్యేక ఆధార్ కార్డు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అటవీ క్లియరెన్స్ ఇవ్వాలని, లింకు రోడ్లు, ప్రధాన రోడ్లు నిర్మించాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, అంగన్వాడీ సెంటర్లకు పక్కా భవనాలు, విద్యుత్ స్తంభాలు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని వివిధ గ్రామాల సర్పంచ్లు కోరారు. పీవో స్పందించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. డీఎల్పీవో నరసింహారావు, పీఎంయూ అధికారి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకోండి ఏజెన్సీలో నిరుపేద కుటుంబాలను పీ4 ద్వారా దత్తత తీసుకొని, బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలని పీవో కట్టా సింహాచలం కోరారు. స్ధానిక వైటీసీ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీడీవోలు, సచివాలయ సిబ్బందితో పీ4పై సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్యాల్తో కలిసి సమావేశమయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. -
నులి పురుగులతో ఎదుగుదలకు అవరోధం
● ఆల్బెండజోల్ మాత్రలతోనే ఈ సమస్యకు పరిష్కారం ● విద్యార్థులతో మాత్రలు మింగించిన కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు: పిల్లల్లో నులి పురుగుల వలన రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి మానసిక, శారీరక అభివృద్ధి దెబ్బతింటుందని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. ఈ సమస్యను నివారించటానికి 2 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు వయసున్న పిల్లలందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన పట్టణంలోని శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో నులిపురుగుల మాత్రలను మింగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నులిపురుగులు దీర్ఘకాలంలో మానవ ఆరోగ్యానికి హానికరమని, నిరంతరం ఇన్ఫెక్షన్ వలన పిల్లల అభ్యాసం, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 3214 అంగన్వాడీ కేంద్రాలు, 3124 ప్రభుత్వ పాఠశాలలు, 82 ప్రైవేటు పాఠశాలలు, 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 16 ఐటీఐ, పాలిటెక్నిక్, నర్శింగ్ కళాశాలల్లో రెండేళ్ల నుంచి 19 ఏళ్లలోపు వయసున్న 3,16,754 మంది అర్హులైన విద్యార్థులుండగా 95.6 శాతంమందితో ఆల్బెండజోల్ మాత్రలను మింగించామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 4321 టీంలను ఏర్పాటు చేసి, 336 మంది పర్యవేక్షణ సిబ్బందిని నియమించామన్నారు. ఆల్బెండజోల్ మాత్రల వల్ల ఏమైనా దుష్ప్రభావం తలెత్తితే సమీపంలో ఉన్న వైద్య సిబ్బందిను సంప్రదించాలన్నారు. ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి, ఏడీఎంహెచ్వో డాక్టర్ టి.ప్రతాప్, ప్రోగ్రామ్ మేనేజర్ ఏగిరెడ్డి కిశోర్కుమార్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
దుఃఖంలోనూ ఆదర్శం
తల్లి నేత్రాలు దానం కంచరపాలెం (విశాఖ): పు ట్టెడు దుఃఖంలోనూ మానవత్వాన్ని చాటుకున్న ఘట న విశాఖలో జరిగింది. త మ తల్లి మరణంతో తీవ్ర శోకంలో ఉన్నప్పటికీ ఆమె కళ్లను దానం చేసి ఆ కుటుంబం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గండిబోయిన ఈశ్వరమ్మ (75) ఆదివారం అర్ధ రాత్రి గుండెపోటుతో కేజీహెచ్లో మృతి చెందారు. అంత దుఃఖంలోనూ ఈశ్వరమ్మ భర్త అ ప్పారావు, కుమారులు అప్పలరాజు, సూ ర్యచంద్రరావు, కుమార్తె లక్ష్మి ఆమె కళ్లను దానం చేయా లని నిర్ణయించుకున్నారు. మొహిసిన్ ఐ బ్యాంక్ వారు వచ్చి కంటి రెటీనాను సేకరించారు. -
అప్పుల పాలవుతున్న ఆదివాసీలు
పెదబయలు మండలం పోయిపల్లిలో పీఎం జన్మన్ ఇంటికి స్లాబు నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యంరాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తామని జీవో జారీ చేయడంతో పీఎం జన్మన్ పథకంలో ఇల్లు మంజూరైన ఆదివాసీ కుటుంబాలు ఎంతో ఆనందించాయి. ఇంటి నిర్మాణం ఉత్సాహంగా ప్రారంభించాయి. ఇప్పుడు ఆ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కానీ కూటమి సర్కారు మాట నిలుపుకోకపోవడంతో గిరిజనులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిర్మాణ సామగ్రి, కూలీల ఖర్చులు అధికంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులు ఎటూ చాలని పరిస్థితి ఉంది. ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోకుండా వ్యవసాయ, వాణిజ్య పంటల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం వెచ్చించడంతో పాటు పశువులను కూడా అమ్ముకుంటున్నారు. ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష సాయం అందిస్తే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం ఇంతవరకు రూ.356.55 కోట్లను లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహం అందించకపోవడంతో ఆదివాసీలంతా ఆగ్రహంతో ఉన్నారు. అనేక గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు గోడలు, స్లాబ్ల స్థాయిలో నిలిచిపోయాయి. అయితే ఇప్పటికే పూర్తయి గృహ ప్రవేశాలు జరిగిన 2,133 పీఎం జన్మన్ ఇళ్లకు కూడా రాష్ట్రం ఇవ్వాల్సిన రూ.లక్ష సాయం అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అదనపు సాయమేదంటూ గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సిబ్బందిని ఆదివాసీలు నిలదీస్తున్నారు. -
విద్యార్థికి పాముకాటు
రాజవొమ్మంగి: రాజవొమ్మంగి శివారు ఎస్సీ కాలనీలో వాలీబాల్ ఆడుతున్న బోడపాటి విశాల్ను సోమవారం సాయంకాలం పాము కాటు వేసింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు బాలుడిని హుటాహుటిన రాజవొమ్మంగి పీహెచ్సీకు తరలించగా స్టాఫ్నర్స్ భవాని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. విశాల్ రాజవొమ్మంగి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుంచి వచ్చిన తరువాత సహచర పిల్లలతో ఆటలాడుతుండగా ఈ సంఘటన జరిగింది. తనను కరచిన పాము గోదుమ రంగులో ఉన్నట్టు విశాల్ చెప్పాడు. -
గోవుల్ని అక్రమంగా తరలిస్తున్న లారీ ఢీకొని వ్యక్తి మృతి
● రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయిన మూగజీవాలు ఆరిలోవ(విశాఖ): అక్రమంగా పశువుల్ని తరలిస్తున్న లారీ ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓల్డ్ డైరీ ఫారం వద్ద జాతీయ రహదారిపై బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, లారీలో ఉన్న ఆవులు, దూడలు గాయపడ్డాయి. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రాంతంలోని సంతలో కొనుగోలు చేసిన 18 ఆవులు, దూడలను ఓ వ్యక్తి లారీలో కిక్కిరిసినట్లు ఎక్కించి విశాఖకు ఆదివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్నాడు. హైవేపై విమ్స్ వైపు నుంచి విశాలాక్షినగర్ స్టేట్ బ్యాంక్ వైపు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అర్ధరాత్రి ఆ లారీ ఢీకొట్టి బోల్తాపడింది. వ్యక్తి తలకు తీవ్రగాయాలై, రక్తస్రావంతో రోడ్డుపై ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. లారీలో ఆవులు, దూడలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడి సొమ్మసిల్లిపోయాయి. కొన్నింటికి గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళుతున్న వాహనచోదకులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఆరిలోవ పోలీసులు ఘటనాస్థలికి వచ్చి కొనఊపిరితో ఉన్న వ్యక్తిని కేజీహెచ్కు తరలించారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేసరికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పారు. లారీతోపాటు, పశువుల్ని, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా ఓ కేసు, అక్రమంగా గోవుల తరలింపుపై మరో కేసు నమోదు చేసినట్లు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. -
కుదిపేసిన కుండపోత వర్షం
● నీట మునిగిన పెదబయలు ● ఇళ్లలోకి ప్రవేశించిన నీరు పెదబయలు: మండలంలో సోమవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత జనాన్ని వేధించింది. మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. పెదబయలు ప్రభుత్వ గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రం–2 నీట మునిగాయి. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం సమీపంలో డ్రైనేజీ మూసుకుపోవడంతో వర్షం నీరు రోడ్డుపైకి వచ్చి ఐటీడీఏ రెంటల్ హౌసింగ్ కాలనీలో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. నివాసం ఉంటున్న వారు అవస్థలు పడ్డారు. కేంద్రానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు మోకాళ్లలోతు వర్షం నీటిలో దిగి వెళ్లారు. ఈ వీధికి సీసీ రోడ్డు ఉన్నా డ్రైనేజీ లేకపోవడంతో వర్షం పడితే నీరు నిల్వ అవుతుందని, దీంతో వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటోందని, అధికారులు స్పందించి డ్రైనేజీ మంజూరు చేయాలని కాలనీ వాసులు, పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. డుంబ్రిగుడ మండలంలో విభిన్న వాతావరణం డుంబ్రిగుడ: ఉదయం మంచు, మధాహ్నం వర్షం కురవడంతో మండలంలో విభిన్న వాతావణం కనిపిస్తోంది. వారం రోజుల నుంచి ప్రతి రోజు మంచు కురుస్తుండటంతో చలికాలమో లేక వర్షకాలమో తెలియడం లేదని గిరిజనులు అంటున్నారు. ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం మంచుతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. -
వారియర్స్పై రాయల్స్ విజయం
విశాఖ స్పోర్ట్స్ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ20లో భాగంగా సోమవారం జరిగిన తొలిమ్యాచ్లో తుంగభద్ర వారియర్స్పై అమరావతి రాయల్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. కెప్టెన్ మహీప్ కుమార్(28), ప్రశాంత్(59), ఆనంద్(32), శశికాంత్(36) బ్యాటింగ్లో రాణించారు. కార్తీక్, మల్లికార్జున రెండేసి వికెట్లు తీయగా అయ్యప్ప, వినయ్ చెరో వికెట్ తీశారు. రాయల్స్ కెప్టెన్ హనుమవిహారీ(9) తక్కువ స్కోర్కే వెనుదిరగ్గా.. రాహుల్(61) సందీప్ (33), ప్రసాద్ (42 నాటౌట్), పాండురంగ(39 నాటౌట్) రాణించారు. శశికాంత్ రెండు వికెట్లు తీయగా స్టీఫెన్, తోషిత్, సౌరబ్ ఒక్కో వికెట్ తీశారు. -
డిమాండ్లు నెరవేర్చాకే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణం
● లేదంటే సీలేరు ప్రాజెక్ట్ను అడ్డుకుంటాం ● దండకారణ్య విమోచన సమితి హెచ్చరిక సీలేరు: పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రజాభిప్రాయ సేకరణ సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చాకే ప్రాజెక్టు నిర్మించాలని, లేనిపక్షంలో జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో గిరిజన పక్షాన నిలబడి ప్రాజెక్టు పనులను అడ్డుకుంటామని దండకారణ్య విమోచన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మార్క్ రాజు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మించే పార్వతీనగర్ సాండ్ కోరి, బూసుకొండ గ్రామాల ప్రజలతో జేఏసీ నాయకులు సోమవారం సమావేశం నిర్వహించారు. గత ఏడాది ప్రాజెక్టు నిర్మాణం కోసం సీలేరులో ప్రజాభిప్రాయ సేకరణ చేశారని, ఇందులో ఇంటికొక ఉద్యోగం, భూమి, ఇల్లు కోల్పోయిన వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని, అదేమీ ఇవ్వకుండా రహస్యంగా పనులు జరపడం మోసం అని అన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుంకర విష్ణుమూర్తి మాట్లాడుతూ ప్రాజెక్టుకు అటవీ అనుమతులు రాకుండానే గోప్యంగా పనులు ప్రారంభించడం అనుమానంగా ఉందన్నారు. సీపీఎం మండల సహాయ కార్యదర్శి బుజ్జి బాబు మాట్లాడుతూ గిరిజనులకు వేరే చోట స్థలం ఇవ్వకుండా ఇళ్లు ఖాళీ చేయించడం దారుణమన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఈ ప్రాంత గిరిజనులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, అవసరమైతే జైలుకై నా వెళ్తామని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందాకే గ్రామాన్ని ఖాళీ చేస్తామని, అప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దండకారణ్య విమోచన సమితి జిల్లా అధ్యక్షుడు మనోజ్కుమార్, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు బలు, మండల గిరిజన సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకుడు బుజ్జి, జనసేన మండల ఉపాధ్యక్షుడు సిద్దార్థ్ మార్క్, స్థానిక సర్పంచ్ పి.దుర్జో, డీసీసీ కార్యదర్శి కారే శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వినతి
రంపచోడవరం: వై.రామవరం మండలం దాలిపాడు పంచాయతీ పరిధిలోని మునగపూడి గ్రామంలో మధ్యలో నిలిచిపోయిన అంగన్వాడీ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని, పులుసుమామిడి గ్రామం నుంచి బూరుగుపాలెం గ్రామం వరకు మూడు కిలోమీటర్లు రోడ్డు ఏర్పాటు చేయాలని గిరిజనులు సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్ అర్జీలు స్వీకరించారు. పులుపుమామిడి– బూరుగుపాలెం గ్రామాల మధ్య మూడు కిలోమీటర్ల రోడ్డు ఏర్పాటు చేయాలని, అలాగే బూరుగుపాలెం–రేగడిపాలెం గ్రామం వరకు తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలని గిరిజనులు పల్లాల పండురెడ్డి, పల్లాల ఎర్రంరెడ్డి తదితరులు పీవోకు అర్జీ అందజేశారు. రంపచోడవరం మండలం సోకులగూడెం గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ నర్రి పాపారావు, చుంట్రూ అన్నవరం వినతి పత్రం ఇచ్చారు. వై.రామవరం మండలం వలస గ్రామంలో జీపీఎస్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని సోమిరెడ్డి, చంద్రమ్మలు అర్జీలు అందజేశారు. చింతలపూడి పంచాయతీ పరిధిలో కన్నేరు వాగుపై వంతెన ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరారు. ఇంటి వద్ద జన్మించిన పిల్లలకు ఆధార్ కార్డులు మంజూరు చేయాలని సర్పంచ్ పల్లాల సన్యాసమ్మ, ఎంపీటీసీ జోగిరెడ్డి, మంగిరెడ్డి, ఆదిరెడ్డి అర్జీ అందజేశారు. ఈ వారం 47 అర్జీలు వచ్చినట్లు పీవో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 47 అర్జీలు -
కదంతొక్కిన గోవాడ రైతులు
● సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆదుకోవాలి ● కార్మికులు, రైతుల బకాయిలు చెల్లించాలి ● లేదంటే ఉద్యమం ఉధృతం ● కలెక్టరేట్ వద్ద ఆందోళనతుమ్మపాల : గోవాడ చెరకు కర్మాగారం దినదిన గండంగా నడుస్తోందని, వచ్చే సీజన్లో ఫ్యాక్టరీ నడుపుతారో లేదోననీ రైతులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు, కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయు, రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని, రైతులు, కార్మికులకు గత సీజన్లో బకాయి పడ్డ రూ.30 కోట్లు వెంటనే చెల్లించాలని, ఆధునికీకరణకు రూ.100 కోట్లు మంజూరు చేసి రాష్ట్రంలో ఉన్న ఏకై క సహకార షుగర్ ఫ్యాక్టరీ కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేసిన రైతుల దశల వారి పోరాటంలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో రైతు సంఘ నాయకులు తాతారావు, రమణ, ఏరువాక శ్రీనివాసరావు, ఫ్యాక్టరీ కార్మిక రామునాయుడు, సీఐటీయు నాయకులు వి.వి. శ్రీనివాసరావు, గంట శ్రీరామ్, కర్రి అప్పారావు, నాయుడు, గండి నాయనబాబు, రైతులు పాల్గొన్నారు. -
మిట్టల్పై మోహం.. ప్రైవేటు దాహం
● విశాఖ ఉక్కును ఉద్ధరిస్తామంటూనే.. ప్రైవేటు జపం చేస్తున్న కూటమి సర్కారు ● రాయితీల కోసం దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న మిట్టల్ స్టీల్స్ ● రాయితీలు ఇవ్వకపోతే ప్లాంట్ మూసివేస్తామంటూ హెచ్చరికలు ● ఇక్కడా అదే తరహా బెదిరింపులుంటాయని విమర్శలు ● ఇప్పటికే మిట్టల్ ప్లాంట్కు రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలిచ్చిన కూటమి ● స్టీల్ప్లాంట్కు తక్షణమే రూ.30 వేల కోట్ల సాయం కోరుతున్న ప్రజాసంఘాలు మిట్టల్పై ఎందుకంత మోజు? మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం ఇప్పటికే వేల ఎకరాల భూముల్ని ధారాదత్తం చేసి.. ప్రజల జీవనోపాధి, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దశాబ్దాల చరిత్ర గల విశాఖ ఉక్కుని పరిరక్షించాలన్న ధ్యాస రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సొంత గనులు కేటాయించాలని పదేపదే కోరినా పట్టించుకోని ఎంపీలు.. ఇప్పుడు మిట్టల్కు సొంత గనులు కేటాయించాలని కోరడం దుర్మార్గం. ప్రభుత్వ తీరు చూస్తే విశాఖ స్టీల్ప్లాంట్ని పూర్తిగా బలహీనపరచడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మిట్టల్ సంస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఎందుకంత మోజు చూపిస్తోందో అర్థం కావడం లేదు. –ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమను ఉద్ధరిస్తామంటూ ఊదరగొడుతున్న చంద్రబాబు సర్కారు.. ఆ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రానికి పరోక్షంగా సహకరిస్తోంది. స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెబుతుండగా.. మరోవైపు ప్లాంట్కు కొద్ది దూరంలోనే మిట్టల్ స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిశ్రమను నిలబెట్టేందుకు రూపాయి కూడా విదల్చని చంద్రబాబు.. మిట్టల్ స్టీల్స్పై వ్యామోహంతో ఏకంగా రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించడం విస్మయానికి గురి చేస్తోంది. మొదట్లో కొద్దోగొప్పో రాయితీలు అడిగి ఆ తర్వాత ప్రభుత్వం నెత్తినెక్కి కూర్చుంటుంది మిట్టల్ సంస్థ. దక్షిణాఫ్రికాలో ప్లాంట్ ఏర్పాటు చేసి ఇప్పుడు గొంతెమ్మ కోర్కెలు మిట్టల్ సంస్థ కోరుతోంది. భవిష్యత్తులో ఏపీ పరిస్థితి కూడా ఇలా మారకముందే మేల్కొనాలని ప్రజాసంఘాలు సూచిస్తున్నాయి. నాడు ప్రగల్భాలు పలికి.. ఎన్నికల ముందువరకూ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ, జనసేన నేతలు కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత విశాఖ ఉక్కును ముక్కలు చేసేందుకు ఏం చెయ్యాలో అన్నీ చేస్తోంది. ఓ వైపు కేంద్ర గనుల శాఖ మంత్రిత్వ శాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరతామని మరోసారి కుండబద్దలుగొట్టింది. అయినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరిస్తున్న కూటమి ప్రభుత్వం ప్లాంట్ మూసివేసేందుకు పూర్తిగా సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ ఉక్కుకు కొద్ది దూరంలో అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తోంది. స్టేజ్–1లో మిట్టల్ పరిశ్రమ ఏర్పాటుకు ఏకంగా రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ సంస్థకు కావల్సిన సమస్త సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. మిట్టల్ బెదిరింపులు మామూలుగా ఉండవు మిట్టల్ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేశాక ప్రభుత్వాన్నే బెదిరించే స్థాయికి చేరుకుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. దక్షిణాఫ్రికాలో ఇదే మిట్ట ల్ సంస్థ అక్కడి ప్రభుత్వాన్ని బెదిరిస్తోంది. ఇప్పుడిస్తున్న రాయితీలు సరిపోవడం లేదనీ.. తాము కోరినంత రాయితీ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే ప్లాంట్ మూసేస్తామంటూ హెచ్చరిస్తోంది. దీంతో భయాందోళనలకు గురైన దక్షిణాఫ్రికా ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో 92 మిలియన్ డాలర్ల భారీ రాయితీలు కల్పించేందుకు అంగీకారం తెలిపింది. మిట్టల్ని పెంచి పోషిస్తే భవిష్యత్తులో రా ష్ట్ర ప్రభుత్వంపైనా ఇలాంటి బెదిరింపులు తప్పవని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కా గా.. కూటమి ఎంపీల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ప్లాంట్ను కాపాడేందుకు ఒక్క సారి కూడా కూటమి ఎంపీలు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ వద్దకు వెళ్లలేదు. కానీ.. మిట్టల్ స్టీల్ప్లాంట్కు సకల సదుపాయాలు కల్పించాలని కోరేందుకు మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, విశాఖ ఎంపీ భరత్ నేతృత్వంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వద్ద సాగిలపడ్డారు. -
దూసుకొచ్చిన మృత్యువు
డాబాగార్డెన్స్: ఆ కుటుంబం ఆదివారం ఎంతో సంతోషంగా గడిపింది. మనుమడి అన్నప్రాసన వేడుకను సంబరంగా జరుపుకుంది. మరుసటి రోజు ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి ప్రయాణమైన ఆమెను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం ద్వారకా బస్టాండ్లో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, పోతనాపల్లి గ్రామానికి చెందిన గేదెల ముత్యాలమ్మ (47), తన పెద్ద కుమార్తె కుమారుడి అన్నప్రాసన కోసం గాజువాకలో ఉన్న ఇంటికి వచ్చింది. ఆదివారం కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణమై, ద్వారకా బస్టాండ్కు చేరుకుంది. సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో తన చిన్న కుమార్తెను బొబ్బిలి బస్సు ఎక్కించి, తాను ఎస్.కోట వెళ్లే బస్సు కోసం ప్లాట్ఫాం నంబర్ 25 వద్ద వేచి ఉంది. సరిగ్గా అదే సమయంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే పల్లె వెలుగు బస్సు అతి వేగంగా ప్లాట్ఫాంపైకి దూసుకువచ్చింది. ఆ బస్సు ఢీకొనడంతో ముత్యాలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆ తల్లి, మనుమడిని చూసుకున్న సంతోషం మనసులో మెదులుతుండగానే, విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. ముత్యాలమ్మ మృతితో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ముత్యాలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. బస్సు స్పీడ్గా వచ్చేసింది.. నేను అరకు వెళ్లాలి. బస్సు కోసం ఎస్.కోట ప్లాట్ఫాం వద్ద సమీపాన కూర్చున్నా... పదడుగుల దూరంలో ఆ మహిళ బ్యాగ్ పట్టుకుని నిల్చున్నారు. ఇంతలో ఆర్టీసీ బస్సు స్పీడ్గా ఆమెను ఢీకొని లోపలికి వచ్చేసింది. చూస్తుండుగానే ఆ మహిళ బస్సుకు అక్కడున్న స్తంభానికి మధ్యలో నలిగిపోయింది. ఇంకో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. – కమిడి గురు, అరకు, ప్రత్యక్ష సాక్షి ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఢీకొని మహిళ మృతి మరొకరికి గాయాలుడ్రైవర్ నిర్లక్ష్యమే కారణం బస్టాండ్లోని ప్లాట్ఫాంపైకి బస్సు తీసుకొచ్చేటప్పుడు గంటకు 5 కిలోమీటర్ల వేగం మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, వేగంగా వచ్చిన బస్సు ప్రమాదానికి కారణమైందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ తర్వాత ఈ విషయం స్పష్టమైంది. దీనిపై డ్రైవర్ చంద్రరావును ప్రశ్నించగా, బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
సీలేరు: సీలేరు పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనం బోల్తా పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దుప్పులవాడ పంచాయతీ గొందిపాలెం గ్రామానికి చెందిన బురిడీ జయ సోమవారం 48 సీలేరు బైక్ పై వస్తుండగా ప్రమాదవశాత్తు పడి తీవ్రంగా గాయపడ్డాడు. పెట్రోల్ సిబ్బంది ఫీడర్ అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో వెంటనే టెక్నీషియన్ వెంకటేష్ స్పందించి సీలేరు పీహెచ్సీకి డాక్టర్ మస్తాన్ వైద్యం అందించి చింతపల్లి ఏరియా హాస్పిటల్ కి తరలించారు గూడెంకొత్తవీధి: మండలంలోని కడుగుల వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో దామణాపల్లి పంచాయతీ సిగ్నపల్లి రాం నగర్ కాలనీకి చెందిన కాకరి దారబాబుకు తీవ్ర గాయాలయ్యాయి.తక్షణమే అతడిని ఆస్పత్రికి తరలించారు. -
దమ్ము ట్రాక్టర్లు తిరగకుండా చర్యలు తీసుకోవాలని వినతి
రాజవొమ్మంగి: పక్కా రహదారులపై దమ్ము ట్రాక్టర్ల తిరగుకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, లోదోడ్డి సర్పంచ్ లోతా రామారావు , నేతలు ఎస్ఐ చినబాబుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ దమ్ము ట్రాక్టర్లుకు ఉండే ఇనుప చక్రాల వల్ల రహదారులు చిధ్రమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దమ్ము ట్రాక్టర్లు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. ఉద్యమాలు చేసి మా గ్రామాలకు బీటీ రోడ్లు వేయించుకొన్నామని, ఆ రోడ్లపై ట్రాక్టర్లు తిరిగి పాడు చేస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరమని చెప్పారు. పోలీసు అధికారులు కూడా ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ కనపరచి రోడ్లపై తిరుగుతున్న ట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేయాలని కోరారు. -
విద్యార్థికి పాముకాటు
రాజవొమ్మంగి: రాజవొమ్మంగి శివారు ఎస్సీ కాలనీలో వాలీబాల్ ఆడుతున్న బోడపాటి విశాల్ను సోమవారం సాయంకాలం పాము కాటు వేసింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు బాలుడిని హుటాహుటిన రాజవొమ్మంగి పీహెచ్సీకు తరలించగా స్టాఫ్నర్స్ భవాని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. విశాల్ రాజవొమ్మంగి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుంచి వచ్చిన తరువాత సహచర పిల్లలతో ఆటలాడుతుండగా ఈ సంఘటన జరిగింది. తనను కరచిన పాము గోదుమ రంగులో ఉన్నట్టు విశాల్ చెప్పాడు. -
సారూ.. పట్టించుకోరూ!
● నిరుపయోగంగా ప్రభుత్వ భనవాలు ● దెబ్బతింటున్న కార్యాలయాలు ● ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని వైనం ● అధికారుల నిర్లక్ష్యం రంపచోడవరం: రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా గిరిజనుల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన సొమ్ములు వృథా చేస్తున్నారు. రంపచోడవరంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చేపటి ్టన భవన నిర్మాణ పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశారు. ఆ భవన నిర్మాణ పనులు పూర్తి చేయకుండా వదిపెట్టడంతో ఎవరికి ఉపయోగపడకుండా ఉండిపోయాయి. ప్రస్తుతం నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా రంపచోడవరం పాల కేంద్రం వద్ద నిర్మించిన భవన పూర్తి కాలేదు. అలాగే పీఎంఆర్సీని ఆనుకుని సిరిగిందలపాడు వెళ్లే దారిలో జీడిపిక్కల యూనిట్ ఏర్పాటు నిర్మించిన భవనం పూర్తి కాలేదు. భూపతిపాలెం ప్రాజెక్టు వద్ద కొండపై నిర్మించిన అధికారుల అతిథి గృహం పనులు ఏళ్లు కావస్తున్నా పూర్తి కాలేదు. ఏళ్లు గడుస్తున్నా భవనాల అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆయా భవనాలను త్వరితగతిన నిర్మించి, వినియోగంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. -
సారా బట్టీలపై దాడులు
అడ్డతీగల: రంపచోడవరం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గల వివిధ పాత నేరాల్లో కేసుల్లో పాత నేరస్తులను స్పెషల్ డ్రైవ్ ద్వారా అరెస్టు చేసి రంపచోడవరం కోర్టు నందు హాజరు పరిచి రిమాండ్ కు పంపించినట్టు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. అడ్డతీగల మండలం వీరవరం గ్రామంలో సోమవారం జరిపిన ఆకస్మిక దాడుల్లో 50 లీటర్ల సారాను స్వాధీన పరుచుకుని, 1400 లీటర్ల బెల్లపు పులుపును ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. సారా తయారికి వినియోగించే ముడి సరుకు బెల్లాన్ని సంతలు ద్వారా సరఫరా చేస్తున్న ఏలేశ్వరం మండలానికి చెందిన ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్ పైడేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ నాయుడు, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
పారిశ్రామికవేత్తలకు నిరాదరణ
● పరిశ్రమలు, ఎగుమతి కమిటీ సమావేశంలో కలెక్టర్ సీరియస్ ● రాయితీలు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం సాక్షి, పాడేరు: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పరిశ్రమలు, సేవారంగ సంస్థలను నెలకొల్పిన 150మందికి రాయితీలు అందించలేదన్నారు. రాయితీలు విడుదల చేయడానికి చర్యలు తీసుకోలేదని, 10 క్లెయింలు కూడా పరిష్కరించలేదని పరిశ్రమలశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రాయితీలు అందించాలన్నారు. ప్రతి మండలంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారులుగా నియమించి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. పరిశ్రమలు, క్రషర్ల నుంచి వస్తున్న కాలుష్యంపై ఫిర్యాదులు అందుతున్నాయని, నివారణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు క్రషర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్ గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి.రవిశంకర్, ఏడీ రమణారావు, డీఆర్డీఏ పీడీ వి.మురళి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారం
● అదే నా తొలి ప్రాధాన్యం ● నిత్యావసరాల సరఫరాపై ప్రత్యేక దృష్టి ● రంపచోడవరం నూతన సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్ రంపచోడవరం: నూతన సబ్ కలెక్టర్గా శుభమ్ నొఖ్వాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2023 ఐఏఎస్ బ్యాచ్కి చెందినవారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో రెవెన్యూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందే విధంగా కృషి చేస్తానన్నారు. నిత్యావసరాలను సకాలంలో సరఫరా చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. తాను ఇదివరకు ఎన్టీఆర్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసినట్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన సబ్ కలెక్టర్ను డీటీలు సరిత, శివ, త్రిమూర్తులు, సీహెచ్ చంటి, ఇతర సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
కంబోడియాలో చిక్కుకున్న ఆంధ్రుల్ని కాపాడండి
డాబాగార్డెన్స్: కంబోడియాలో చిక్కుకున్న ఆంధ్రా కార్మికులను కాపాడాలని సీఎం చంద్రబాబును విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. వీరిని మోసగించిన ఏజెంట్ బొంగు మురళీరెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్ సమీపంలోని సిటు కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులు ఆదివారం మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన ఏజెంట్ మురళీరెడ్డి డేటా ప్రాసెసింగ్ జాబ్ల పేరిట మాయమాటలు చెప్పి ఏడుగురి నుంచి చెరో రూ.1.70 లక్షలు తీసుకుని కంబోడియా పంపించారని పేర్కొన్నారు. అక్కడ వారికి ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా, కంబోడియా ఏజెంట్లకు అప్పజెప్పి ఒక్కొక్కరితో మరో మూడు వేల డాలర్లు కట్టించుకున్నారని తెలిపారు. అక్కడి నుంచి వారిని చైనీస్ సైబర్ మోసగాళ్లకు అప్పజెప్పి, వారిచే చట్ట వ్యతిరేక పనులు చేయించడానికి బలవంతం పెట్టారన్నారు. అందుకు అంగీకరించకపోవడంతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. వీరిలో విశాఖకు చెందిన వారు ఒకరు, శ్రీకాకుళానికి చెందిన నలుగురు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. తక్షణమే సంబంధిత మంత్రులు, అధికారులు స్పందించి, వారిని కాపాడి, రాష్ట్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కనకారావు, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి
కూనవరం: ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని, జీవో నంబరు 3 పునరుద్ధరించాలని యూటీఎఫ్ ఆడిట్ కమిటీ జిల్లా సభ్యుడు యు. వెంకటనారాయణ అన్నారు. యూటీఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం టేకులబోరు విద్యావనరుల కేంద్రంలో ఆ సంఘ సభ్యురాలు కట్టం కుమారి జెండా ఆవిష్కరించారు. అనంతరం వెంకట నారాయణ మాట్లాడుతూ అరకు సభలో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏజెన్సీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందని, దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి జీవో నంబరు 3కు అనుబంధంగా ఉండే జీవోను అమలు చేసి విద్యారంగాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఏ. నాగేశ్వరరావు, పాయం కన్నారావు, ఎం. ప్రమీల, మహాతి పీ. కుమారి, నాగదుర్గ, రాంబాబు, రాజారావు, వెంకటాచారి, రాధాకుమారి, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ ఆడిట్ కమిటీ జిల్లా సభ్యుడు వెంకటనారాయణ డిమాండ్ -
పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలన
సీలేరు: పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మించే ప్రాంతాలను ఆదివారం విజయవాడకు చెందిన ఏపీ జెన్కో ఉన్నతాధికారులు పరిశీలించారు. గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ శాండీకొరి నుంచి చింతపల్లి క్యాంపు వరకు గల ప్రాంతాన్ని వారు సందర్శించారు. జలవిద్యుత్ కేంద్రం నిర్మించే పార్వతీనగర్, డైవర్షన్ డ్యాం నిర్మించే శాండికొరి, భూగర్భ టన్నెల్ కోసం సూచించిన పాయింట్లను వారు పరిశీలించారు. అటవీశాఖ అనుమతులు తుది దశకు చేరుకున్న సమయంలో ఆశాఖ నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు మరోసారి క్షుణ్ణంగా క్షేత్ర పరిశీలన చేశారు. భూగర్భ పైపులైన్ నిర్మాణ సందర్భంలో వచ్చే మట్టిని నిల్వ చేసేందుకు ప్రతిపాదించిన డంపింగ్ యార్డులు విషయంపై మరోసారి మరికొన్ని ప్రతిపాదనలు చేయనున్నారు. దీనిలో భాగంగా చింతపల్లి క్యాంపు లైక్ పూర్ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలను కూడా వారు పరిశీలించారు. అయితే డంపింగ్ యార్డుకు చింతపల్లి క్యాంపు పరిసరాల్లో స్థలాన్ని కూడా ప్రతిపాదించే అవకాశమున్నట్లు జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. ఈ పరిశీలనలో చీఫ్ ఇంజినీర్లు (సివిల్) రవీంద్ర రెడ్డి, (ఓఎండ్ఎం) కేవీ రాజారావు, ఈఈ (సివిల్) రత్నకుమార్, డీఈఈ అప్పలనాయుడు పాల్గొన్నారు. -
సరిలేరు
పొల్లూరు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ముందుచూపు ఫలితంవచ్చే మార్చి నాటికి పూర్తిచేసేలా శరవేగంగా పనులుతెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదిగా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం గుర్తింపు పొందనుంది. 460 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ కేంద్రంలో రెండో దశలో చేపట్టిన రెండు యూనిట్ల నిర్మాణ పనులు వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేసే లక్ష్యంతో ఏపీ జెన్కో అధికారులు వేగవంతం చేశారు. ఇవి పూర్తయితే ఉత్పాదన సామర్థ్యం 690 మెగావాట్లకు పెరగనుంది. 460 మెగావాట్ల నుంచి 690 మెగావాట్ల ఉత్పాదన లక్ష్యంగా జలవిద్యుత్ కేంద్రం అడుగులుమోతుగూడెం: లోయర్ సీలేరు కాంప్లెక్స్లోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం ఆధునికీకరణ పనులు వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తి చేసే లక్ష్యంతో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్లో ఇప్పటివరకు 115 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల నాలుగు యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు మరో రెండు యూనిట్ల నిర్మాణానికి ప్రాజెక్ట్ ప్రారంభం (1977)లోనే గ్రౌండ్ లెవెల్, స్ట్రక్చర్ సివిల్ పనులు పూర్తి చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.536 కోట్ల్ల కేటాయింపు రాష్ట్ర విభజన తరువాత డిమాండ్కు తగినంత విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో అధిక ధరలకు ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుచూపుతో ఇదే ప్రాజెక్ట్లో ఉత్పత్తి సామర్థ్యం పెంచే లక్ష్యంతో ప్రణాళికపరంగా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అదనంగా అదే సామర్థ్యంతో 5,6 యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇందుకు రూ.536 కోట్లు వెచ్చించింది. రెండేళ్ల క్రితమే టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖల నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరిగింది. దీనిపై ప్రత్యేకదృష్టి సారించిన గత ప్రభుత్వం నిర్మాణ పనులను వేగవంతం చేసింది. రెండు యూనిట్లకు సంబంధించి ఇప్పటివరకు సివిల్, పెన్స్టాక్ పనులు 60 శాతం మేర పూర్తయ్యాయి. ● ఐదో యూనిట్కు సంబంధించి సివిల్ పనులు ఫ్లోర్ శ్లాబ్ వరకు జరిగాయి. కీలకమైన స్పారల్ కేసింగ్, స్టీరింగ్ ఎరెక్షన్ పనులు పూర్తయినట్టు జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. ● ఆరో యూనిట్కు సంబంధించి సివిల్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వాల్వు హౌస్ నుంచి టెర్మినల్ యాంకర్ వరకు పెన్స్టాక్ పైపులైను నిర్మాణం పూర్తయింది. జనరేటర్ అసెంబ్లింగ్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. బీహెచ్ఈఎల్ అధికారుల నిరంతర పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ● ఐదు, ఆరు యూనిట్లకు సంబంధించి కీలకమైన విడి భాగాలు కంపెనీ నుంచి పవర్ హౌస్కు అనుకున్న సమయానికి వచ్చేలా ఏపీ జెన్కో అధికారులు ఏర్పాట్లు చేశారు. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వచ్చే మార్చినాటికి పనులు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రాజెక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్ బాలకృష్ణ తెలిపారు. పనులకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా జరిగేలా బీహెచ్ఈఎల్, పీఎస్ కంపెనీ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయం: రూ.536 కోట్లు ప్రస్తుత యూనిట్లు: 4 ఉత్పత్తి సామర్థ్యం: 460 మెగావాట్లు నిర్మిస్తున్న యూనిట్లు: 5,6 అదనంగా పెరగనున్న ఉత్పత్తి: 230 మెగావాట్లు చురుగ్గా జరుగుతున్న ఐదు, ఆరు యూనిట్ల పెన్స్టాక్ పైపులైన్ నిర్మాణ పనులుమార్చి నాటికి పూర్తి చేస్తాం పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో రెండో దశలో చేపట్టిన ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణ పనులు మార్చినాటికి పూర్తికానున్నాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు యూనిట్ల ద్వారా 460 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రెండు యూనిట్లు పూర్తయితే 690 మెగావాట్లకు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. – సీహెచ్వీ రాజారావు, చీఫ్ ఇంజినీర్, లోయర్ సీలేరు జల విద్యుత్ కేంద్రం -
నాలుగు పుస్తకాల ఆవిష్కరణ
సీతంపేట: విశాఖ సంస్కృతి ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆదివారం ఒకేసారి నాలుగు పుస్తకాలు ఆవిష్కరించారు. విశాఖ సంస్కృతి 13వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో అతిథుల చేతుల మీదుగా నాలుగు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. రచయిత మోణంగి ప్రవీణ రచించిన తొలి అడుగులు కథా సంపుటి, గన్నవరపు నరసింహమూర్తి రచించిన మిథునం, గన్నవరపు నరసింహమూర్తి కథలు, మంచి సినిమాల పుస్తకాలను అతిథులు పూర్వ ఎంపీ డి.వి.జి.శంకరరావు, గరివిడి పశు వైద్యశాల డీన్ డాక్టర్ మక్కెన శ్రీను, అఖిల భారత ధర్మకర్త చెరువు రామకోటయ్య, సత్య విద్యా సంస్థల డైరక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు ఆవిష్కరించారు. అనంతరం విశాఖ సంస్కృతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ తెలుగు సాహిత్యం, తెలుగు భాష ఉన్నతికి 13 ఏళ్లుగా పాటుపడుతున్న విశాఖ సంస్కృతి మాస పత్రిక సంపాదకుడు శిరేల సన్యాసిరావు నిస్వార్థ కృషిని అభినందించారు. మంచి ఇతివృత్తం ఉన్న కథలు, సాహిత్యం, చారిత్రక అంశాలు, కవితలు ప్రతి నెలా అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన హాస్య కథలు, కవితల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రచయిత మేడా మస్తాన్రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
మోసపూరిత హామీలతో చంద్రబాబు అరాచక పాలన
అడ్డతీగల: అబద్ధపు హామీలిచ్చి మోసంతో గద్దెనెక్కి ప్రజలని నిలువునా చంద్రబాబు ముంచారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. మండలంలోని ఎల్లవరంలో ఆదివారం బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాల నుంచి భారీగా పాల్గొన్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగనన్న పేదవాడి సంక్షేమం కోసం పరితపించి అనేక పఽథకాలు అమలుచేశారని గుర్తు చేశారు.అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పేదవాడి ఉసురు తీస్తోందన్నారు. నవరత్న పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతి నిబద్దత ముందు మోసాలకే గురువుగా మారిన చంద్రబాబు ప్రజలను వంచించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. భవిష్యత్లో ప్రజాహితమైన వైఎస్సార్సీపీనే గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జీవో నెంబర్–3 కనిపించకుండా చేసింది చంద్రబాబే: ఎంపీ తనూజారాణి గిరిజనులకు ఎంతో ప్రయోజనకరమైన జీవో నెంబర్–3ని కనిపించకుండా చేసింది చంద్రబాబేనని అరకు ఎంపీ తనూజారాణి అన్నారు. 48 వేల ఎకరాలు కొండపోడు భూములకు గిరిజనులకు హక్కుపత్రాలను ఇచ్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కిందన్నారు.విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అనేక మౌలిక వసతులు కల్పించారన్నారు. 2 లక్షల 76 వేల కోట్లు సంక్షేమ పథకాల రూపేణా పేదలకు అందించారన్నారు. సూపర్సిక్స్ పేరుతో అరచేతిలో వైకుంఠం: వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా సూపర్సిక్స్ పేరిట అరచేతిలో వైకుంఠం చూపిన ఘనత మోసాల చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. నవరత్నాల పథకాలను ప్రకటించి అన్ని వర్గాలకు వాటి ద్వారా మేలు చేసి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రజల పట్ల తన నిబద్దను చాటుకుంటే సూపర్సిక్స్ అంటూ చెప్పి నేడు పి–4 అంటూ మరో మోసానికి తెరతీసారన్నారు. నాయకులపై దాడులు చేస్తూ తప్పుడు కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందం పొందడం మినహా సాధించింది శూన్యం అన్నారు. ప్రజాపాలనలో కూటమి ప్రభుత్వం విఫలం: మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పరిపాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. హామీలిచ్చి అమలు చేయలేక నోటికొచ్చిన మాటలను కూటమి నేతలు చెబుతున్నారన్నారు. జగనన్న రోడ్డెక్కితే తల్లిక వందనం అమలుచేశారన్నారు. అది కూడా పూర్తిస్ధాయిలో చేయలేకపోయారన్నారు. స్ధానిక ఎమ్మెల్యే ప్రజలకు మేలు చేయడం మాని విచ్చలవిడి అవినీతిలో మాత్రం అందవేసిన చేయిగా మారారన్నారు. ప్రజా సంక్షేమం అమలుకు వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలి: అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేటి ప్రసాద్ ప్రజాసంక్షేమం అమలు కావాలంటే వైఎస్సార్సీపీనే గెలిపించుకోవాలని అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేటి ప్రసాద్ అన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి పేదల జీవితాల్లో వెలుగులను నింపారన్నార . చంద్రబాబు మోసపు వాగ్ధానాలు వివరిస్తూ ఉన్న క్యూర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్లవరంలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వ పాలనపై అరకు ఎంపీ తనూజారాణి, పార్టీ యవజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అరకు పార్లమొంట్ పరిశీలకులు బొడ్డేటి ప్రసాద్ తదితరుల ధ్వజం -
యువకుడిని కాపాడిన లైఫ్గార్డ్స్
కొమ్మాది: రుషికొండ బీచ్లో అలల తాకిడికి కొట్టుకుపోతున్న ఓ యువకుడిని లైఫ్గార్డ్స్ రక్షించారు. గోపాలపట్నానికి చెందిన సంతోష్, హేమంత్, గణేష్, లోకేష్ అనే నలుగురు యువకులు ఆదివారం మధ్యాహ్నం సరదాగా గడపడానికి బీచ్కు వచ్చారు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా, అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారిలో ఒకరైన లోకేష్ కొట్టుకుపోయాడు. అది గమనించిన లైఫ్గార్డ్స్ ఎస్.నూకరాజు, ఎం.అమ్మోరు, గురుమూర్తి, చిన్నప్పన్న, వెంకటేష్, దేవ వెంటనే స్పందించి ఆ యువకుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మైరెన్ పోలీసులు యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. పర్యాటకుడి ప్రాణాలు కాపాడిన లైఫ్గార్డ్స్ను మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు. యారాడ తీరంలో.. పెదగంట్యాడ: యారాడ తీరంలో సరదాగా గడిపేందుకు వచ్చిన యువకుడు సముద్రంలో దిగి కెరటాల ఉధృతికి కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న బీచ్ లైఫ్ గార్డ్స్ రక్షించారు. వివరాలివి. గంగవరానికి చెందిన యవకులు ఆదివారం యారాడ తీరానికి వెళ్లారు. కాసేపు ఇసుక తిన్నెల్లో గడిపిన యువకులు స్నానానికి సముద్రంలో దిగారు. ఒక్కసారిగా అలల తాకిడి పెరగడంతో గరికిన మహేష్(30) సముద్రంలోకి కొట్టుపోతుండగా, అక్కడే ఉన్న లైఫ్ గార్డ్స్ కదిరి లోవేష్కుమార్, కదిరి వెంకటేష్, శ్రీనివాస్, కె.వెంకటేష్ గమనించారు. వెంటనే వారు సముద్రంలోకి దిగి, కొట్టుకుపోతున్న మహేష్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో యువకుడికి ప్రాణపాయం తప్పింది. -
చంద్రబాబు పర్యటనతో ప్రజాధనం దుర్వినియోగం
పాడేరు : ీసఎం చంద్రబాబు పాడేరు పర్యటన వల్ల రూ.కోట్లమేర ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని, గిరిజనులకు ఒరిగింది శూన్యమని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివాీసీలపై చంద్రబాబు ఏమాత్రం కూడా ప్రేమ లేదన్నారు. నిజంగా ఆదివాసీలపై ప్రేమ ఉంటే జీవో నంబరు 3, 1/70 చట్టంపై స్పష్టత ఇచ్చేవారన్నారు. గిరిజన, సంక్షేమం అభివృద్ధిపై ఒక్క హామీ, ప్రకటన కూడా చేయలేదన్నారు. గిరిజన ప్రాంతంలో స్థానిక గిరిజన అభ్యర్థులకు చెందాల్సిన సుమారు 3వేల ఉపాధ్యాయ పోస్టులను మెగా డీఎస్సీలో కలిపి గిరిజన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఆదివాసీలపై నిజంగా ప్రేమ ఉంటే శతశాతం ఉద్యోగ రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు. జీవో నంబరు 3ను వైఎస్సార్సీపీ రద్దు చేసిందనడం ఆయన అవివేకానికి నిదర్శమన్నారు. ఆ జీవోను సుప్రీంకోర్టు కొట్టివేస్తే ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే గిరిజనుల పక్షాన ఆలోచించి టీఏసీలో తీర్మానం చేసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. సుమారు 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏనాడు కూడా పాడేరులాంటి ఆదివాసీ ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనే కనీస ఆలోచన ఎందుకు చేయలేదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాడేరు వచ్చి స్థానిక ఆదివాసీల ఆరోగ్య కష్టాలు కళ్లారా చూసి ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణకు రూ.500కోట్లతో వైద్య కళాశాల ఏర్పాటు చేశారన్నారు. ఆదివాసీల ప్రగతి కోసం చంద్రబాబు ఏనాడు పాటుపడలేదన్నారు. సుమారు ఏడాది కాలంలో పాడేరు ఐటీడీఏలో పూర్తి స్థాయి ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. ఇంచార్జీల పానలతో గిరిజన సంక్షేమం పూర్తిగా కుంటుపడిందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఏనాడూ ఐటీడీఏకు వచ్చి సమీక్ష చేయలేదన్నారు. కేవలం చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారని చెప్పారు. ఈ నెలాఖరున రిటైర్డ్ కానున్న గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ ఇటీవల భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీ అడ్డంగా దొరికిపోయారని, ఇటువంటి వ్యక్తిని ఇంకొంతకాలం ఆ పదవిలో కొనసాగించేందుకు ప్రయత్నం చేసింది ఎవరో మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రాంతంలో పీసా కమిటీలకు కనీస గౌరవం లేకుండా ఎటువంటి తీర్మానాలు చేయకుండా కార్పొరేట్ కంపెనీలకు వారి ప్రాజెక్టులకు అనుమతులను ఇస్తుంది ఎవరని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఎన్ని మోసపూరిత వాఖ్యలు చేసిన ఆదివాసీలు నమ్మే స్థితిలో లేరన్నారు. సీఎం పర్యటన పూర్తిగా నిరాశ పరిచిందని ఆయన పేర్కొన్నారు. జీవో నంబరు 3, 1/70 చట్టంపై స్పష్టత శూన్యం ఆదివాసీల ఆరోగ్య కష్టాలపై చలించిన జగన్ పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాల ఏర్పాటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజం -
ఏజెన్సీలోనే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్
పాడేరు : అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి సమీపంలోని శెట్టివానిపాలెంలో ఏర్పాటు చేయనున్న కాఫీ ప్రొసెసింగ్ యూనిట్ను అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి తరలించాలని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక జీఎస్యూ భవనంలో ఆదివాసీ జేఏసీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 2లక్షల ఎకరాల్లో కాఫీ గిరిజన రైతులు సాగు చేస్తున్నారన్నారు. వీరికి స్థానికంగా అందుబాటులో ఉండేలా కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ను ఏజెన్సీలో ఏర్పాటు చేయాల్సింది పోయి మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఏమిటన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. స్థానికంగా కాఫీ ప్రాసెసింగ్ ఏర్పాటు చేస్తే నిరుద్యోగ గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గిరిజనులు పండిస్తున్న అన్ని సేంద్రియ అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఆదివాసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టపులి శ్రీనివాస పడాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ సొమెలి సింహాచలం, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖీ శేషాద్రి, నాయకులు ఈశ్వరరావు, కేశవరావు, వరకిశోర్ పాల్గొన్నారు. ఆదివాసీ జేఏసీ చైర్మన్ రామారావు దొర డిమాండ్ -
ఎరువు.. మరింత బరువు!
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ● రెండోసారి పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు ● రకాన్ని బట్టి బస్తాకు రూ.50 నుంచి రూ.330 వరకు పెరుగుదల ● సగం పెట్టుబడి ఎరువులకే వెచ్చించాల్సి వస్తోందంటున్న రైతన్నలు ● జిల్లాలో రెండు సీజన్లలో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు ● ఆందోళన చెందుతున్న రైతులు ● మొత్తం 51వేల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువుల వినియోగం ● ఇందులో 22 వేల మెట్రిక్ వరకు కాంప్లెక్స్ ఎరువుల వాడకం ● జిల్లా రైతాంగంపై ఏడాదికి రూ.2.20 కోట్ల అదనపు భారం పాత, కొత్త ధరలు ... రూ.ల్లో(50 కిలోల బస్తా) ఎరువు రకం పాత ధర కొత్త ధర పొటాష్ 1535 1800 20–20–013(ప్యాక్డ్) 1300 1425 20–20–013(గ్రోమోర్) 1300 1350 20–20–013(పీపీఎల్) 1300 1400 డీఏపీ 1350 1350 10–26–26 1470 1800 14–35–14(గ్రోమోర్) 1700 1800 28–28–0 1700 1700 12–32–169(ఇఫ్కో) 1470 1720 16–16–16 1450 1600 15–15–15–0–9 1450 1600 16–20–0–13 1250 1300 24–24–0(మహాధన్) 1700 1800 20–20–013(మహాధన్) 1350 1450 సింగిల్ సూపర్ ఫాస్పేట్ 580 640 యలమంచిలి రూరల్ : రాష్ట్రంలో కూటమి పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులపై ఎరువుల ధరలు దరువు వేస్తున్నాయి. ఇప్పటికే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక పంటల సాగుపై నీలినీడలు కమ్ముకున్న సమయంలో కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఎదురవుతోందని అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఓవైపు సాగు ఖర్చులతో పాటు పెరిగిన ఎరువుల ధరలతో రైతులు సతమతమవుతున్నారు. బస్తాకు రూ.50 నుంచి రూ.330 వరకూ... జిల్లాలో ఖరీఫ్,రబీ సీజన్లలో రైతులు 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తారు. వీటి కోసం సుమారుగా 51,277 మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగిస్తారు. వీటిలో సుమారుగా 22,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను పంటల సాగులో వినియోగిస్తుంటారు. ఇందులో యూరియా, డీఏపీ, 28–28–0 రకం ఎరువుల ధరలు మినహాయిస్తే మిగతా వాటి ధరలు బస్తాకు రూ.50 నుంచి రూ.330 వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. రైతులపై అదనపు భారం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సుమారు 64,101 హెక్టార్లు, రబీలో 16,011 హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. దీనిలో సింహభాగం వరి సాగవుతోంది. ఈ పంటల సాగుకోసం సుమారుగా 51,277 మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగిస్తారని వ్యవసాయాధికారుల అంచనా. వీటిలో సుమారు 22 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఉంటుంది. ఒక యూరియా బస్తా 50 కేజీలు బరువు ఉంటుంది. సరాసరిన బస్తాకు రూ.100 చొప్పున పెరిగిన ధరను లెక్కిస్తే జిల్లా రైతాంగంపై ఏడాదికి రూ.2.20 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. అమాంతం పెరిగిన ధరలతో ఆశించిన దిగుబడులు రాక,సాగు వ్యయం తడిసిమోపెడవడంతో ఆశించిన లాభం రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. వారికి అప్పులే మిగులుతున్నాయి. నియంత్రణ లేని ధరలు యూరియాపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉంది. కాంప్లెక్స్ ఎరువుల విషయంలో నియంత్రణ లేకపోవడంతో ఆయా కంపెనీలు తయారీ ఖర్చుల ఆధారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఫాస్ఫరస్, పొటాష్ ధరల పెరుగుదలతో కాంప్లెక్స్(మిశ్రమ) ఎరువుల తయారీ ధరలు పెరిగాయి. ఎరువుల ఉత్పత్తికి వినియోగించే ముడి పదార్థాల ధరలు పెరిగిపోవడంతో ఎరువుల ధరలు పెరిగినట్టు డీలర్లు చెబుతున్నారు. దీంతో పంటల సాగు ఖర్చు ఎకరాకు రూ.2 వేల వరకు పెరుగుతుందని రైతులు వాపోతున్నారు. సాగుకయ్యే ఖర్చులో సగం పెట్టుబడి ఎరువులకే వెచ్చించాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. అన్నదాతలకు పిడుగులాంటి వార్త. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో వరుసగా రెండోసారి ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే కష్టాలు, నష్టాలు మోస్తూ ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు ఎరువుల రూపంలో మరోసారి అదనపు భారం పడుతోంది. పెరిగిన ధరలతో జిల్లా రైతాంగంపై ఏడాదికి రూ.2.20 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఇంత ఖర్చుతో సాగు ఎలా..? పెట్టుబడి ఖర్చులతో వ్యవసాయం భారంగా మారిన తరుణంలో ప్రభుత్వాలు ఇలా ఎరువుల ధరలు పెంచడం దారుణం. ధరల పెరుగుదల గుదిబండగా మారింది. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల మేం వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో మా ప్రాంతంలో రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోతే అప్పుల పాలుకాక తప్పదు. – కాళ్ల శ్రీనివాసరావు, రైతు, పోతురెడ్డిపాలెం, యలమంచిలి మండలం మోయలేని భారం అసలే సాగు పెట్టుబడులు పెరిగి వ్యవసాయం అంటేనే భయపడుతున్న తరుణంలో ఎరువుల ధరలు పెంచడం దారుణం. వీటిని నియంత్రించాలి. పెరిగిన ధరలతో సాగు చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితి వచ్చింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే పెరిగిన ఎరువుల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. – కర్రి అప్పారావు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు -
13న ‘క్విట్ కార్పొరేట్స్‘నిరసన బైక్ర్యాలీ
అనకాపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకిస్తూ ఈనెల 13న క్విట్ కార్పొరేట్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రైతు సంఘాల నాయకులు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో పలు రైతు సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా అమెరికా, బ్రిటన్ దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను చేపడుతుందని, రైతులకు నష్టదాయకంగా జాతీయ వ్యవసాయ మార్కెట్ చట్టా న్ని సవరించే ముసాయిదాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. కార్మిక చట్టాలను కాలరాసే 4 లేబర్ కోడ్ల అమలు, ప్రజలపై విద్యుత్ భారం మోపేలా అదానీ స్మార్ట్ మీటర్లను బిగించేందుకు చర్యలు చేపడుతున్నదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల కోసం వేలాది ఎకరాల భూ సేకరణ చేపడుతూ, సన్న చిన్న కారు రైతులను, దేశ ప్రజలను నిర్వాసితులను చేస్తోందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ‘క్విట్ ఇండియా‘ ఉద్యమస్ఫూర్తితో ‘క్విట్ కార్పొరేట్స్‘ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కన్వీ నర్ కర్రి అప్పారావు, రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు, రైతు స్వరాజ్య వేదిక నాయకులు గాడి బాలు, సీఐటీయు జిల్లా నాయకులు ఆర్.శంకర్ రావు, శ్రీనివాసరావు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ సురేష్ బాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతోనే వృత్తిలో రాణింపు
● జస్టిస్ లక్ష్మణరావు సబ్బవరం: క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యం దిశగా కృషి చేసినప్పుడే ఎంచుకున్న వృత్తిలోనైనా, చదువులోనైనా రాణించగలరని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు అన్నారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన మూడు, ఐదేళ్ల కోర్సుల విద్యార్థులకు శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘న్యాయవిద్య: సమకాలీన పరిస్థితుల్లో దాని ఆవశ్యకత’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. గురువులను పూజిస్తూ, క్రమశిక్షణతో ముందున్న లక్ష్యాలను చేరుకోవడానికి దీక్షతో కృషి చేయాలన్నారు. సత్యం, ధర్మం ప్రాముఖ్యతను మహాభారతంలోని ఉదాహరణలతో వివరించారు. సత్యాన్ని అనుసరించాల్సిన ప్రాముఖ్యతను మహాత్మా గాంధీ అనేక సందర్భాలలో తెలియజేశారని, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. తాము చదువుకునే రోజుల్లో జాతీయ విశ్వవిద్యాలయాలు లేవని.. చిన్న చిన్న న్యాయ కళాశాలల్లో చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. నేటి తరానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశరావు, వ్యాట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆలపాటి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణరావును వర్సిటీ తరపున ఘనంగా సత్కరించారు. -
అప్పన్న ఆభరణాల తనిఖీలు ప్రారంభం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి చెందిన బంగారు, వెండి, ఇతర విలువైన వస్తువులు, ఆభరణాల తనిఖీలను దేవదాయశాఖ, రాజమహేంద్రవరం ఆర్జేసీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ శనివారం ప్రారంభించింది. ఈ తనిఖీలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. కడప జిల్లాకు చెందిన కె.ప్రభాకరాచారి అనే వ్యక్తి గతేడాది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రికార్డుల్లో పేర్కొన్న వివరాలకు, వాస్తవంగా ఉన్న ఆభరణాలకు తేడాలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై దేవదాయశాఖ జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు ఈ ఏడాది జనవరి 17 నుంచి నెలరోజుల పాటు రికార్డులను పరిశీలించి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా మరింత లోతుగా తనిఖీలు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించారు. ఆ తర్వాత ఆ విషయం మరుగున పడింది. ప్రస్తుతం రాజమండ్రి ఆర్జేసీగా కూడా విధులు నిర్వహిస్తున్న సింహాచలం ఇన్చార్జి ఈవో త్రినాథరావు చొరవతో ఈ తనిఖీలు మళ్లీ మొదలయ్యాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఆలయానికి చేరుకున్న కమిటీ సభ్యులు.. ముందుగా బండాగారంలోని ఆభరణాలు, వస్తువులను వాటి రికార్డులతో సరిపోల్చి బరువులు తనిఖీ చేశారు. ఈ కమిటీలో విజయనగరం డిప్యూటీ కమిషనర్ కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు, అంతర్వేది ఈవో ఎం.కె.టి.ఎన్.ప్రసాద్, తూర్పుగోదావరి డిప్యూటీ ఈవో ఇ.వి.సుబ్బారావు, ఆర్జేసీ కార్యాలయం సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఈ కమిటీకి దేవస్థానం డిప్యూటీ ఈవో రాధ సహకరించారు. ఈ తనిఖీలు పారదర్శకంగా జరుగుతున్నాయని, పూర్తి నివేదికను సమర్పిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. రాబోయే రోజుల్లో అర్చకుల ఆధీనంలో ఉన్న వస్తువులు, మ్యూజియం, బ్యాంకుల్లో ఉన్న వస్తువులను కూడా పరిశీలిస్తామని వారు పేర్కొన్నారు. -
ఏజెన్సీని ప్రైవేటుకు అప్పగించడమే చంద్రబాబు ధ్యేయమా?
అనంతగిరి (డుంబ్రిగుడ) :ఏజెన్సీని ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి ఆరోపించారు. ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా పాడేరు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజన అభివృద్ధికి పలు కంపెనీలతో ఎంవోయూలు చేస్తున్నట్లు అట్టహాసంగా చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వివిధ కంపెనీలతో ఎంవోయూలు చేసినట్లు బహిరంగ ప్రకటించారని అందులో భాగంగా హోం స్టే టూరిజంను ఓయోతో ఒప్పందం చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే గిరిజన ప్రాంతంలోని గిరిజనుల ఇళ్లను గిరిజనేతరులైన ప్రైవేటు కంపెనీలతో ఏ విధంగా వ్యాపారం చేస్తారని ఆమె ప్రశ్నించారు. గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు చట్టాలకు లోబడి ఉండాలన్నారు. 1/ 70 చట్టం అమలులో ఉన్న ఏజెన్సీలో ప్రైవేటు కంపెనీలను ఎలా ప్రోత్సహిస్తారు అని ప్రశ్నించారు. గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వం గిరిజన సొసైటీలను ఏర్పాటు చేసి వారికి వివిధ ప్రాజెక్టులను అప్పగించవచ్చునని ఆమె పేర్కొన్నారు.ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించడం సరికాదని ఆమె పునరుద్ఘాటించారు. ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టులను అదాని, నవయుగ కంపెనీలకు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నా, కనీసం ఆ విషయాన్ని ముఖ్యమంత్రి తన పర్యటనలో ఎందుకు ప్రస్తావించలేదని ఆమె ప్రశ్నించారు. ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయకపోగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజునే గిరిజన చట్టాలకు అతీతంగా గిరిజనేతరులైన ప్రైవేట్ కంపెనీలతో ఎంవోయూలు చేసుకోవడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. ప్రతి ఇంటి మీద సోలార్ రూఫ్లను ఏర్పాటు చేసి వచ్చే కరెంటుతో ఎలక్ట్రికల్ బైక్లు, కార్లు తిప్పుకోవచ్చని చంద్రబాబునాయుడు చెప్పడాన్ని ఆమె తప్పు పట్టారు. గిరిజనులకు కార్లు తదితర వాహనాలు కొనుగోలు చేసుకునే స్తోమత ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. గిరిజన గ్రామాలకు రహదారులు, ఆర్టీసీ బస్సు సదుపాయం వంటి కల్పించాలని తప్ప లేనిపోని ఆశలు చూపి గిరిజనులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను చంద్రబాబు మానుకోవాలని ఆమె హితువు పలికారు. -
అడ్డంకులు.. నిర్బంధం..అవమానం
ముఖ్యమంత్రి చంద్రబాబు పాడేరు పర్యటనలో అలవి కాని ఆంక్షలు.. అడుగడుగునా అడ్డంకులు.. పోలీసుల ఓవరాక్షన్తో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గిరిజనుల సమస్యలు చెప్పేందుకు వచ్చిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులను సీఎంను కలిసేందుకు అవకాశం కల్పించకుండా అగౌరవ పరిచారు. ఎమ్మెల్యేతోపాటు పార్టీ శ్రేణులను పోలీసులు నెట్టేశారు. సీఎంను కలిసేందుకు ప్రయత్నించిన ఆదివాసీ జేఏసీ, గిరిజన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు అవకాశం ఇవ్వలేదు. హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లోని గిరిజనులకు నిర్బంధం విధించారు. కొంతమందిని ఇళ్లు ఖాళీచేయించగా.. మిగతా వారిని ఇళ్లల్లోంచి బయటకు రాకుండా ఇబ్బందులు పాల్జేశారు.సీఎం చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా ఆంక్షలు పోలీసుల ఓవరాక్షన్పాడేరు : ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఏజెన్సీలో ప్రధాన సమస్యలను తీసుకువెళ్లేందుకు వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రయత్నించిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డగించి నెట్టేయడం విమర్శలకు దారితీసింది. ఆహ్వానం మేరకు ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి అవమానపరిచారు. ఆదివాసీ ప్రాంతంలో సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను అధిక సంఖ్యలో మోహరించిన పోలీసులు నెట్టేశారు. దీంతో వారి మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా పాడేరు సెయింటాన్స్ స్కూల్ జంక్షన్ ప్రధాన రహదారి వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, పార్టీ శ్రేణులు సుమారు మూడు గంటల పాటు బైఠాయించారు. వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కుంటుపడిన గిరిజనాభివృద్ధి కూటమి ప్రభుత్వం హయాంలో గిరిజన ప్రాంత అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు ఎన్నికల సభకు వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వస్తే జీవో నంబరు 3ను పునరుద్ధరిస్తామని, స్పెషల్ డీఎస్సీతో భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారన్నారు. 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో చట్ట సవరణ కోసం మాట్లాడించి గిరిజనుల్లో భయాందోళనలకు గురి చేశారన్నారు. ఇంటింటికి రేషన్ వ్యవస్థ రద్దు చేయడంతో గిరిజనులు రేషన్ సరుకుల కోసం అష్టకష్టాలు పడుతున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో డోలీ మోతలు ఎక్కువై గిరిజనులు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావన్నారు. వీటితోపాటు స్థానికంగా ఉన్న గిరిజన ప్రాంత సమస్యలపై తాను సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని ధ్వజమెత్తారు. ఆదివాసీ దినోత్సవంలో తాను హాజరై సమస్యలపై మాట్లాడితే గిరిజన ప్రాంతంపై కూటమి ప్రభుత్వం అసలు రంగు బయటపడుతుందనే ఉద్దేశపూర్వకంగా పోలీసులతో అడ్డుకుని అవమాన పరిచారన్నారు. తాను ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని, గిరిజనులతో కలిసి మరింత ఉధృతంగా పోరాటాలు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆదివాసీల సంక్షేమం పక్కనబెట్టి.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో ఆదివాసీలకు ఏ మాత్రం సంబంధం లేని ఎక్కడో జరిగిన ఘటనలు, హత్యా రాజకీయాలపై మాట్లాడటంతో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, చట్టాలు, హక్కులు, వారికి అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన మాట్లాడకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఆయన పర్యటన సందర్భంగా మండలంలోని లగిసపల్లి వద్ద అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడకు సీఎం వచ్చి వెళ్లేంత వరకు ఆ ప్రాంతానికి కిలోమీటరు వరకు ఇళ్ల వద్ద ఎవ్వరూ ఉండకూడదని ముందుగానే హుకుం జారీ చేశారు. దీంతో కొంతమంది ఇళ్లు ఖాళీ చేయగా మిగతా వారు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండిపోయారు. హెలిప్యాడ్ నుంచి వంజంగి గ్రామం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర అడుగడుగునా పోలీసులు మోహరించారు. దీంతో దారిపొడవునా నివాసం ఉన్న ఆదివాసీ కుటుంబాలు చంద్రబాబు వచ్చి వెళ్లేంత వరకు భయంభయంగా గడిపాయి. ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు తమకు అవకాశం ఇవ్వకుండా టీడీపీ నేతలకు అధిక ప్రాధాన్యమిచ్చి ప్రజావేదిక వద్దకు పోలీసులు అనుమతించారని ఆదివాసీలు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికోసం సీఎం పర్యటన? ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర ఆవేదన పార్టీ శ్రేణులతో రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే నిరసన కూటమి ప్రభుత్వ చర్యలపై మండిపాటు ఆదివాసీ జేఏసీ ప్రతినిధులను అడ్డుకున్న బలగాలు గిరిజనుల సమస్యలు చెప్పేందుకు ప్రయత్నించిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు అవమానం పోలీసులు నెట్టేయడంతో ఉద్రిక్తత పాడేరు రూరల్: ముఖ్యమంత్రి చందబాబు పర్యటన ఎవరి కోసమని.. మరోసారి మోసపోవడానికి తాము సిద్ధంగా లేమని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర విమర్శించారు. చంద్రబాబుకు ఆదివాసీల సమస్యలు తెలియజేసేందుకు వెళ్తున్న ఆదివాసీ జేఏసీ, గిరిజన ఉద్యోగ సంఘాల నేతలను గొందూరు జంక్షన్ వద్ద పోలీసులు అడుకుని నిర్బంధించారు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, చట్టాలు, సమస్యలపై సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకున్న తమను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకోవడం ప్రజాస్వామ్యబద్ధంగా విరుద్ధమన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంపై నిలదీస్తారన్న భయంతోనే పోలీసులతో ఆదివాసీల ప్రతినిధులను అడ్డుకుని కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. ఇంకా ఎన్నాళ్లు ఆదివాసీలను మోసం చేస్తారని.. మేము మోసపోవడానికి సిద్ధంగా లేమన్నారు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఆదివాసీ నాయకులను రానీయకుండా చేయడం అన్యాయమన్నారు. చంద్రబాబు పర్యటన వల్ల ఆదివాసీలకు ఒరిగిందేమి లేదన్నారు. సొంత పార్టీ నేతలకు కూడా కార్యక్రమానికి రాకుండా ఆంక్షలు విధించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమన్నారు. భవిష్యత్తులో చంద్రబాబుకు ఆదివాసీల నుంచి తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధులు చిట్టపుల్లి క్షనివాస్పడాల్ తదితరులు పాల్గొన్నారు. అన్నివర్గాల్లో నిరుత్సాహం సీఎం పర్యటన గిరిజన సంఘాలతో పాటు సొంత పార్టీ నేతలను నిరుత్సాహపరిచింది. ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబుకు పలు సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ఆదివాసీ విద్యార్థి, ఉద్యోగ, ప్రజాసంఘాలు, మహిళలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులకు అవకాశం లేకుండా పోయింది. సభా ప్రాంగణంలోకి సొంత పార్టీ నేతలను సైతం రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా పోలీసుల ఆంక్షలతో ఇబ్బందులు పడ్డారు. చాలామంది నిరుత్సాహంతో వెనుదిరిగారు. -
రంపచోడవరంను రాజమహేంద్రవరంలో కలపొద్దు
రాజవొమ్మంగి: రంపచోడవరంను అల్లూరి జిల్లా నుంచి వేరు చేస్తే ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి తప్ప, రాజమహేంద్రవరంలో కలపవద్దని రాజవొమ్మంగి ఎంపీపీ గోము వెంకటలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాజవొమ్మంగిలో ఏర్పాటు చేసిన ఆదివాసీల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదివాసీ ప్రాంతంలోని సంపద ఆదివాసీలకే చెందాలన్నారు. రంపచోడవరంను రాజమహేంద్రవరంలో కలిపితే ఏజెన్సీలోని వనరులు మైదానప్రాంతాలకు తరలిపోతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలని ఆమె కోరారు. -
మరణించి మరో ఇద్దరికి వెలుగునిచ్చి..
పెందుర్తి : అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధురాలి నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకుంది ఓ కుటుంబం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తాడివానిపాలెం అంబేడ్కర్కాలనీకి చెందిన రాజాన అచ్చియ్యమ్మ(90) ఆరోగ్యం క్షీణించి శనివారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో పెందుర్తికి చెందిన సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీనివాస్, స్థానిక పెద్ద ఎం.సింహాచలం మృతురాలి కుటుంబ సభ్యులను నేత్రదానానికి ఒప్పించారు. కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వెంటనే అక్కడకు చేరుకున్న ఎల్వీ ప్రసాద్ సారధ్యంలోని మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు అచ్చియ్యమ్మ నేత్రాలను సేకరించి సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. -
చంద్రబాబు పర్యటన వల్ల ఒరిగింది శూన్యం
అరకులోయ టౌన్/డుంబ్రిగుడ: ఆదివాసీ దినోత్సవం నాడు ఏజెన్సీ ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన వల్ల గిరిజనులకు ఒరిగిందేమీ లేదని.. మెరుగైన విద్య, వైద్యం, ఉద్యోగం కల్పిస్తే ఆదివాసీల జీవితాలు బాగుపడతాయని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మితో గిరిజన ఉద్యమ నేతలకు పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు. అనంతరం వారు అక్కడి ఫోన్లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. గిరిజనులకు కావల్సింది పింఛన్ కాదని, వారికి మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం అందించాలని కోరారు. దేశంలో పింఛన్లు కేవలం మన రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం మాత్రమే ఇస్తున్నట్లు ఆభూత కల్పనలు, కల్లబొల్లి మాటలతో గిరిజనులను చంద్రబాబు మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం చెప్పే అబద్దపు మాటలు నమ్మే పరిస్థితుల్లో గిరిజనులు లేరని అన్నారు. పాడేరు పర్యటనలో అర్థపర్థం లేకుండా నిండు సభలో మాట్లాడారన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అందరికీ పడిందా లేదా అని అందరికీ పడే ఉంటుందిలే అని చెప్పి ఖాతాలో డబ్బులు జమ అయిన వారు చెయ్యి పైకెత్తాలనడం ఎంతవరకు సబబు అన్ని ప్రశ్నించారు. గిరిజనులకు కావల్సింది జీవో నంబరు 3పై స్పష్టత, 1/70 చట్టాం పటిష్టంగా అమలు, గిరిజనులు పండించే కాఫీ, మిరియం పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆయన అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ జిల్లాలో అరకొరగా జమ అయ్యాయని, పూర్తిస్థాయిలో పథకాలు వర్తించలేదని అన్నారు. ఇదే పాడేరులో అనేకసార్లు పర్యటించిన చంద్రబాబు గిరిజనులకు చెప్పకోదగ్గ ఏంమేలు చేశారని ప్రశ్నించారు. ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ గిరిజనుల కొరకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలనే తపనతో పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టడాన్ని వారు గుర్తు చేశారు. దేశ చరిత్రలో గిరిజనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినది జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వారు పేర్కొన్నారు. గిరిజనులకు అవసరమైనది మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ధ్వజం -
ఉత్సాహంగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు
పాయకరావుపేట : క్లస్టర్ – 7 సీబీఎస్ఈ పాఠశాలలకు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ఖో ఖో పోటీలు శ్రీప్రకాష్ విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అండర్ –14,17,19 బాలురు, బాలికల విభాగంలో సుమారు 180 జట్లు 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలు 3 రోజుల పాటు జరగనున్నాయి. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత నరసింహారావు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, సీబీఎస్ఈ అబ్జర్వర్, ఖో ఖో ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సన్ షైనర్స్ ఘన విజయం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నాలుగో సీజన్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో విజయవాడ సన్ షైనర్స్.. రాయలసీమ రాయల్స్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రెండు జట్ల నుంచి ఆటగాళ్లు అశ్విన్ హెబ్బర్, అవినాష్ సెంచరీలు చేసే అవకాశాలను త్రుటిలో కోల్పోయారు. సన్ షైనర్స్ టాస్ గెలిచి లక్ష్య ఛేదనకు మెగ్గు చూపడంతో రాయలసీమ రాయల్స్ బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ.. అవినాష్ (96 పరుగులు) అద్భుతంగా ఆడి జట్టు స్కోరును పెంచాడు. అతను 39 బంతుల్లో 4 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. సెంచరీకి కేవలం నాలుగు పరుగుల దూరంలో అవుటవ్వడం అభిమానులను నిరాశపరిచింది. గిరినాథ్ 49 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. విజయవాడ బౌలర్లలో లలిత్ మోహన్, రాజు రెండేసి వికెట్లు పడగొట్టారు. 197 పరుగుల లక్ష్య ఛేదనలో విజయవాడ సన్ షైనర్స్ కెప్టెన్ అశ్విన్ హెబ్బర్ (98 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించాడు. 6 ఫోర్లు, 9 సిక్సర్లతో అశ్విన్ సెంచరీకి చేరువలో అవుటయ్యాడు. అతనితో పాటు తేజ(77 పరుగులు) కూడా దూకుడుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సన్ షైనర్స్ 16.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాయలసీమ బౌలర్ సాకేత్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. వారియర్స్ జోరు.. లయన్స్ బేజారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) నాలుగో సీజన్లో తుంగభద్ర వారియర్స్ బోణీ కొట్టింది. వైఎస్సార్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో శనివారం రాత్రి ఫ్లడ్లైట్ల వెలుతురులో జరిగిన మ్యాచ్లో సింహాద్రి వైజాగ్ లయన్స్పై 7 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ మహీప్ కుమార్ (57) అర్ధశతకంతో జట్టును ముందుండి నడిపించగా, బౌలర్లు సమష్టిగా రాణించి లయన్స్ పతనాన్ని శాసించారు. అంతకుముందు, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ (40) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, అతనికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. జట్టు 48 పరుగులకే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ రికీ భుయ్ (2) సహా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. సందీప్ (11), చివర్లో ధీరజ్ లక్ష్మణ్ (22) మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. వారియర్స్ బౌలర్లలో మీడియం పేసర్ తోషిత్ మూడు, సిద్ధార్థ్, స్టీఫెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 110 పరుగుల లక్ష్య ఛేదనలో తుంగభద్ర వారియర్స్కు కూడా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శ్రీ సామాన్యు (3) త్వరగానే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహీప్ కుమార్తో జతకట్టిన మరో ఓపెనర్ జ్ఞానేశ్వర్ (40) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ పవర్ప్లేలోనే స్కోరు బోర్డును 62 పరుగులకు చేర్చి మ్యాచ్పై పట్టు సాధించారు. కెప్టెన్ మహీప్ కుమార్ 57 పరుగులతో అద్భుత అర్ధశతకాన్ని నమోదు చేశాడు. దీంతో తుంగభద్ర వారియర్స్ 12.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసి విజయం సాధించింది. అశ్విన్, అవినాష్ సెంచరీలు మిస్ ఉత్కంఠగా ఏపీఎల్ -
పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్కు గోప్యంగా భూమిపూజ
సీలేరు: ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధి పార్వతీ నగర్ వద్ద 1350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే (పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్) జలవిద్యుత్ కేంద్ర నిర్మాణానికి సంబంధించి అధికారులు, మెగా కంపెనీ సిబ్బంది కలిసి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంప్డ్ స్టోరేజీ ఏడీఈ టి. అప్పలనాయుడు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, స్థానిక నేతలు, నిర్వాసితులకు మెగా కంపెనీ, జెన్కో అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. భూమి పూజ కార్యక్రమ సమాచారం తెలుసుకున్న సర్పంచ్ దుర్జో, కూటమి నేతలు, ఆదివాసీ సంఘాలు అక్కడికి చేరుకున్నారు. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇతర వసతులు, ఉపాధి కల్పించకుండా భూమి పూజ గోప్యంగా ఎలా నిర్వహిస్తారని ఏడీఈ అప్పలనాయుడు, మెగా కంపెనీ ఏజీఎం రవిబాబును వారు నిలదీశారు. ఈ సందర్భంగా ఏడీఈ మాట్లాడుతూ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు వచ్చిన తరువాత అధికారికంగా ప్రొటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులు, స్థానికులు, సంబంధిత మంత్రులు, జెన్కో ఉన్నతాధికారులు హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని మెగా కంపెనీ మాత్రమే నిర్వహించిందని ఆయన చెప్పారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాతనే భూమి పూజ నిర్వహించాలని, అప్పటివరకు నిలిపివేయాలని వారు పట్టుబట్టారు. ఇకపై ఏంచేసినా మీకు తెలిజేస్తామని మెగా కంపెనీ ఏజీఎం రవిబాబు చెప్పడంతో వారు శాంతించారు. నిర్వాసితులకు న్యాయం చేయకుంటే ప్రాజెక్ట్ పనులు అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయకుండా ఎలా చేస్తారని ప్రశ్నించిన సర్పంచ్, ఆదివాసీ సంఘాలు -
విద్యార్థులకు సామాజిక దృక్పథం అవసరం
ఎంవీపీకాలనీ: విద్యార్థులకు జ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత, విలువల పెంపొందించడంలో గురుకులాల పాత్ర కీలకమని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సత్యనారాయణ అన్నారు. విద్య ఒక్కటే వారి భవిష్యత్కు కొలమానం కాకూడదని ఆయన సూచించారు. ఆ దిశగా ప్రభుత్వ ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు యువతను ప్రోత్సహించాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జోన్–1 జిల్లాల అధికారులు, ప్రిన్సిపాళ్లు, వార్డెన్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక విలువలు తగ్గుముఖం పట్టడం వల్ల యువతలో నేర ప్రవృత్తి, బాధ్యతారాహిత్యం, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీసీ సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లలో అవగాహన పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు సామాజిక దృక్పథం పెంచడం వల్ల విద్యార్థుల్లో విలువలతో కూడిన జీవితం అలవడుతుందన్నారు. ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు రెసిడెన్షియల్ విద్యార్థులను తమ సొంత పిల్లల్లాగా చూసుకోవాలని, రోజంతా వారితో మమేకం కావాలని సూచించారు. బయటి సమాజంతో పోలిస్తే రెసిడెన్షియల్ విద్యార్థుల అభివృద్ధిలో సవాళ్లు ఎక్కువ, సౌకర్యాలు తక్కువ ఉన్న మాట వాస్తవమే అయినా.. ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు తమ విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును అందించవచ్చన్నారు. అవసరమైన మేరకు సీఎస్సార్ నిధులను కూడా సేకరించుకోవచ్చన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు మాట్లాడుతూ యువతకు చదువు ప్రాముఖ్యత, అవకాశాలు, లక్ష్యాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, మానసిక నిపుణుడు ఆచార్య ఎం.వి.ఆర్.రాజు మాట్లాడుతూ వసతిగృహాలు, కళాశాలల్లో కల్పించే ప్రశాంతమైన వాతావరణమే విద్యార్థుల మంచి భవిష్యత్కు బాటలు వేస్తుందన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ డి.చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ బీసీ రెసిడెన్షియల్ వసతిగృహాల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 77శాతంగా ఉందని, ఇందులో 17శాతం మంది ఫస్ట్ క్లాస్ సాధించినట్లు తెలిపారు. ఈ శాతాన్ని మరింత పెంచడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పి.మాధవీలత, కె.రామారావు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సత్యనారాయణ -
పలు రైళ్ల రద్దు, మరికొన్ని గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం (విశాఖ): వాల్తేర్ డివిజన్ పరిధి పార్వతీపురం–సీతానగరం– బొబ్బిలి–డొంకినవలస సెక్షన్ల్లో జరుగుతున్న మూడో లైన్ సంబంధిత భద్రతా పనుల నిమ్తితం ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. రద్దయిన రైళ్లు విశాఖపట్నం–రాయ్పూర్(58528) పాసింజర్ ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు, రాయ్పూర్–విశాఖపట్నం(58527) పాసింజర్ ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు, విశాఖపట్నం–కోరాపుట్(58537) పాసింజర్ ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు, కోరాపుట్–విశాఖపట్నం(58537) పాసింజర్ ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు, విశాఖపట్నం–భవానిపట్న(58504) పాసింజర్ ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు, భవానిపట్న–విశాఖపట్నం(58503) పాసింజర్ ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు రద్దయ్యాయి. గమ్యం కుదించిన రైళ్లు ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు గుంటూరు–రాయగడ (17243) ఎక్స్ప్రెస్ విజయనగరం వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు రాయగడ–గుంటూరు(17244) ఎక్స్ప్రెస్ రాయగడ నుంచి కాకుండా విజయనగరం నుంచి బయల్దేరుతుంది. సమయం మార్చిన రైళ్లు ●దుర్గ్లో ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన దుర్గ్–విశాఖపట్నం (20829) వందేభారత్ ఎక్స్ప్రెస్ ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు 3 గంటలు ఆలస్యంగా ఉదయం 8.45 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే తేదీల్లో విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.50గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం–దుర్గ్ (20830) వందేభారత్ ఎక్స్ప్రెస్ 2.30 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.20 గంటలు ఆలస్యంగా బయల్దేరుతుంది. ●ఈ నెల 24, 26వ తేదీల్లో నాందేడ్లో సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరాల్సిన నాందేడ్–సంబల్పూర్(20810) నాగావళి ఎక్స్ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా రాత్రి 8.30 గంటలకు బయల్దేరుతుంది. ●ఈ నెల 20, 21, 23, 24, 26వ తేదీల్లో విశాఖపట్నంలో ఉదయం 9.20 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం–నిజాముద్దీన్(12807) సమతా ఎక్స్ప్రెస్ 5 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరుతుంది. -
జోరుగా సాగు
● పొలం బాట పట్టిన గిరి మహిళలు ● చివరి దశలో వరి నాట్లు ● చోడి నూర్పుల్లో రైతులు నిమగ్నం వాతావరణం అనుకూలం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు అనుకూలించాయి. దీంతో మెట్టు పంటలతో పాటు వరినాట్లు తొందరగా వేసుకున్నాం. సామ, అల్లం పంట చేతికందివచ్చింది. సామతో పాటు అల్లంకు మంచి ధర లభించింది. చోడి పంట ఆశాజనకంగా ఉంది. మరో రెండు నెలలు వర్షాలు అనుకూలిస్తే వరి పంటతోపాటు కూరగాయలు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. – బురిడి పాపారావు, రైతు, లంతంపాడు, అరకులోయఅరకులోయటౌన్: మండలంలో పలు ప్రాంతాల్లో గిరిజన మహిళలు పొలంబాట పట్టారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఓ పక్క ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లతో దమ్ము చేస్తుంటే మరో పక్క వరి నాట్లు వేస్తున్నారు. మరో వైపు వరి నారు తీసి కట్టలు కడుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వరినాట్లు, చోడి నూర్పిడి, ఇతర వ్యవసాయ పనుల్లో గిరిరైతులు నిమగ్నమై ఉన్నారు. అరకులోయ వ్యవసాయశాఖ సబ్ డివిజన్ పరిధిలో వరినాట్లు చివరి దశకు చేరగా, సామలు పంట చేతికందడంతో కోతకోసి నూర్పిళ్లు చేపడుతున్నారు. ఈ ఏడాది సబ్ డివిజన్ పరిధిలో సుమారు 16వేల హెక్టార్లు వరి సాగులో ఉండగా, 9,300 హెక్టార్లలో రాగులు, సాగులో ఉండగా, అల్లం, మిరప, ఇతర కూరగాయలు మరో 535 హెక్టార్లలో పండిస్తున్నట్టు వ్యవసాయ శాఖ ఏడీ వంగవీటి మోహాన్రావు తెలిపారు. అల్లం విక్రయాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం కురుస్తున వర్షాలు వరి పంటతోపాటు చోడి ఇతర మెట్టు పంటలైన మిరప, కూరగాయలు, అల్లం పంటలకు ఎంతో ఉపయోగకరమని రైతులు చెబుతున్నారు. -
పాఠశాల స్థల దాతలకు న్యాయం చేస్తాం
డుంబ్రిగుడ: మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాల కోసం భూమి ఇచ్చిన మోసపోయిన భూ బాధితులు ముగ్గురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తు, అదనంగా భూమిని రెవెన్యూ శాఖ ద్వారా సర్వే జరిపి బాధితులకు అప్పగిస్తామని నెస్ట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గౌతమి హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాలను ఆమె శుక్రవారం సందర్శించారు. ప్రిన్సిపాల్ సుమన్కుమార్ సింగ్ను కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం పాఠశాల భూదాత బాధితులతో మాట్లాడారు. పాఠశాల నిర్మాణం కోసం భూములిచ్చి ఆరు సంవత్సరాలుగా ఉద్యోగాలకు, వ్యవసాయనికి నోచుకోని బాధితులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అరకులోయలో నిర్మిస్తున్న డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాలను త్వరలో డుంబ్రిగుడ తరలించేందుకు సిద్ధం చేస్తున్నమన్నారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయ్యయని రెండవ ఫ్లోర్ పనులతో పాటు ప్రహరీ నిర్మిస్తున్నామన్నారు. ఈసందర్భంగా ప్రిన్సిసాల్ సెక్రటరీని కలిసిన వారిలో భూ బాధితులు లైకోన్, డొంబు, రామ్చందర్, వైఎస్సార్సీపీ నాయకులు తాంగుల రాందాస్, ఏకలవ్య వైస్ ప్రిన్సిపాల్ మురుగేష్ ఉన్నారు. -
ఆదివాసీ హక్కుల సాధన కోసం ఉద్యమం ఉధృతం
అడ్డతీగల : ఆదివాసీ హక్కుల సాధన కోసం ఉద్యమం ఉధృతం చేస్తామని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు ఒకటి నుంచి ఆదివాసీ సంక్షేమ పరిషత్ నిర్వహిస్తున్న ఆదివాసీ నవోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుంజ శ్రీను మాట్లాడుతూ ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కుల సాధన కోసం విస్తృత ప్రచారం చేస్తోందన్నార. బాబూరావు, నూకరాజు, ప్రసాదు, అరుణకుమారి, చిన్నారెడ్డి, రమణ, సత్తిబాబు, కాసులమ్మ, అరుణ కుమారి తదతరులు పాల్గొన్నారు. -
సమాచార హక్కు చట్టం అమలులో అధికారుల నిర్లక్ష్యం తగదు
ముంచంగిపుట్టు: సమాచార హక్కు చట్టం అమలులో అధికారుల నిర్లక్ష్యం తగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ వైస్ చైర్మన్ వెంగడ నీలకంఠం అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మండల పరిషత్ అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల అభివృద్ధి నిమిత్తం మంజూరు చేసిన నిధులు, ఖర్చులపై సమాచార హక్కు చట్టం ప్రకారంలో ఆర్జీ పెట్టుకుంటే సమాచారం సకాలంలో అందించకపోవడం, కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు పెట్టుకున్న 30రోజుల్లో సమాచారం ఇవ్వాల్సి ఉండగా రెండు నెలలు తరువాత సమాచారం అందించారన్నారు. తాను అర్జీద్వారా కోరిన సమాచారంలో పలు తప్పులున్నాయని, సుజనకోట పంచాయతీ నిధులు, ఖర్చుల వివరాలు సక్రమంగా అందించలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై ఎంపీడీవో సూర్యనారాయణమూర్తికి వివరణ కోరగా నీలకంఠం అనే వ్యక్తికి సమాచారం అందించడంలో కొంత అలస్యం అవడం నిజమేనని, పూర్తి స్థాయి సమాచారం అందించి, అతనికి సహకారం అందిస్తామని, సమాచార హక్కు చట్టం అమలులో కచ్చితత్వం పాటిస్తామని ఆయన వివరణ ఇచ్చారు. -
రహదారులు జలమయం
చింతపల్లి: చింతపల్లి మండలంలో పలుచోట్ల శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై గాలి వాన మొదలైంది. మధ్యాహ్నం రెండు ఒంటి గంటకు మొదలైన వర్షం సాయంత్రం వరకూ కురుస్తూనే ఉంది. వీధులన్నీ జలమలమయ్యాయి. కుమ్మరివీధిలో డ్రైనేజీలు చెత్త చెదారంతో నిండిపోయి వర్షపు నీరు పోవడానికి అవకాశం లేక స్థానిక నివాసాల్లోకి ప్రవహించింది. లోతట్టు గ్రామాల్లో భారీ వర్షం రాజవొమ్మంగి: మండలంలోని అమ్మిరేఖల, కిమ్మిలిగెడ్డ, లోదొడ్డి తదితర లోతట్టు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి నాగులకొండ పరీవాహక ప్రాంతంలోని కబర్మతి, పులిగొమ్ము, కిమ్మిలిగెడ్డ చిన్న పెద్ద వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నాట్లు వేసేందుకు ఎదురు చూసిన రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేయనున్నారు. -
ఘాట్రోడ్డులో ఆర్టీసు బస్సు– లారీ ఢీ
పాడేరు : పాడేరు –చోడవరం ప్రధాన రహదారి ఘాట్లోని డైమండ్ పార్క్ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు– లారీ ఢీకొన్న సంఘటనలో పలువురుకి స్వల్ప గాయాలయ్యాయి. మైదాన ప్రాంతం నుంచి పాడేరు వస్తున్న లారీ జోలాపుట్టు నుంచి మధురవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం 8.30గంటలకు ఎదురురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వ్యాన్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక జిల్లా ఆస్పత్రిలో చేర్పించి, వైద్యసేవలందించారు. మలుపు వద్ద రెండు వాహనాలు నిలిచిపోవడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. సీఎం పర్యటన కోసం తెస్తున్న సామగ్రితో పాటు బందోబస్తు కోసం వస్తున్న పోలీసులు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. గంట తర్వాత వాహనాలను పక్కకు తీయడంతో రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. ప్రయాణికులకు స్వల్పగాయాలు గంటపాటు ట్రాఫిక్ జాం -
ఆదివాసీ చట్టాలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
రంపచోడవరం:ఆదివాసీ హక్కుల చట్టాలను తుంగలో తొక్కి, స్వదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు అడవులను, ఖనిజ సంపదను ధారాదత్తం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర నాయకురాలు పీ టాన్యా పిలుపునిచ్చారు. రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఐదు, ఆరు మాడ్యుల్స్ ప్రకారం ఆదివాసీలకు భూమి, అటవీ, ఉద్యోగాలు కల్పించిన నేటి అమలు కావడం లేదన్నారు. ఆదివాసీల హక్కులను, చట్టాలను కాలరాస్తూ దోపిడికి గురి చేస్తూ ప్రశ్నించిన ఆదివాసీలపై ఆపరేషన్ కగర్ పేరుతో హత్యలు చేస్తున్నారన్నారు. గిరిజనులు పోరాడి సాధించుకున్న ఆదివాసీ చట్టాలను రద్దు చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఆదివాసీలను అడవీ నుంచి గెంటివేయడానికి నేషనల్ పార్కులు, అభయరణ్యాలు, టూరిస్టు కేంద్రాలు భారీ సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీల జీవించే హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. రంపచోడవరం, చింతూరు ప్రాంతాల్లోని 22 గ్రామాలను నేషన్ పార్క్ని నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. నాయకులు లచ్చిరెడ్డి, అశోక్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
అసత్య ఆరోపణలు మానుకోవాలి
● గిడ్డి ఈశ్వరికి వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం ● మాటతీరు మార్చుకోవాలని హెచ్చరిక పాడేరు : గిరిజనుల విశ్వాసాన్ని నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయి వార్డు మెంబర్గా కూడా గెలవలేని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ప్రజాబలంతో 20వేల మేజార్టీతో గెలిచిన తమ పార్టీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజుపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ మహిళ విభాగ జిల్లా అద్యక్షురాలు కురుసా పార్వతమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, నాయకులు హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. టీచర్ ఉద్యోగంలో సక్రమంగా విధులు నిర్వర్తించక విధులు ఎగ్గొట్టి సస్పెండైన గిడ్డి ఈశ్వరిను ఆనాడు వైఎస్సార్సీపీ అక్కున చేర్చుకుందన్నారు. కానీ ఎమ్మెల్యేఅయ్యాక తన స్వప్రయోజనాల కోసం కోట్లాది రూపాయాలకు కక్కుర్తి పడి టీడీపీకు అమ్ముడుపోయిన గిడ్డి ఈశ్వరి చరిత్ర ఏమిటో అందరికి తెలుసునన్నారు. ఏనాడు కూడా గిరిజనుల ప్రయోజనాల కోసం ఆమె పని చేయలేదని స్పష్టం చేశారు. తన స్వలాభం కోసం గిరిజనేతరులకు దాసోహమై వారికి తొత్తుగా మారి గిరిజన చట్టాలు, హక్కులను తుంగలోకి తొక్కుతుందన్నారు. 2024 ఎన్నికల్లో గిడ్డి ఈశ్వరిని నియోజకర్గ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించిన ఇంకా బుద్ది రాలేదా అని వారు ప్రశ్నించారు. స్పష్టమైన ప్రకటన తర్వాతే సీఎం పర్యటించాలి గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీను నేరవేర్చిన తర్వాతే సీఎం చంద్రబాబు పాడేరులో పర్యటించాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో నిరుద్యోగుల కోసం షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఇంటింటికీ రేషన్ వ్యవస్థను పునరుద్ధరించాలని, డోలీ మోతలు లేని ఏజెన్సీగా మార్చేందుకు రోడ్డు, రవాణ సౌకర్యాలు కల్పించాలని జీవో నెంబర్–3ను పునరుద్ధరించి ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుండా సీఎం చంద్రబాబు ఏజెన్సీలో పర్యటించే హక్కు లేదని పర్యటనను తామంతా ఏకమై అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. అధిక సంఖ్యలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
ప్రత్యేక జీవనం.. బోండా జాతి సొంతం
ముంచంగిపుట్టు: ఈ ఆధునిక ప్రపంచంలో కేవలం పూసల్నే దుస్తులుగా ధరిస్తూ జీవిస్తున్న ఆదివా సీలైన బోండా జాతి గిరిజనం ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నివాసమున్నారు. కాలం మారుతున్నప్పటికి వీరి జీవన విధానం, ఆచార సంప్రదాయ సంస్కృతిని పాటిస్తూ జీవన మనుగడ సాగిస్తున్నారు. ప్రకృతితో మమేకమై స్వచ్చమైన మనస్సుతో జీవించే మనషులు బోండా జాతి ఆదివాసిలు. ఏవోబీ సరిహద్దు ప్రాంతమైన ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లాకు చెందినా అండ్రహల్, ఒనమనాల్ గిరిజన గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో బోండా జాతి గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని నాలుగు పంచాయతీల్లో 32 గ్రామాల్లో బోండా జాతీ గిరిజనులు నివసిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల మాటునా ఈ గ్రామాలున్నాయి. వీరి జీవన విధానం ప్రత్యేకం..కుటుంబంలో మహిళలదే పెత్తనం. కుటుంబం కోసం కష్ట పడేది కూడా మహిళలే. బోండా జాతి మహిళలు కేవలం పూసల్నే దుస్తులుగా ధరించి నేటికి జీవిస్తున్నారు. అటవీ ప్రాంతంలో దొరికే కొండచీపుళ్లు, తేనె, అడ్డాకులు, దుంపలు, వెదురు కొమ్ములు, జీలుగుకల్లు వంటివి సేకరించి వాసపు సంతకు వచ్చి అమ్మకాలు చేపడతారు. ఆ గ్రామాల గిరిజనులకు సరిహద్దులో జరిగే ఒనకడిల్లీ వారపు సంతే దిక్కు. ప్రతి గురువారం ఇక్కడ జరిగే వారపు సంతలో మాత్రమే బోండా జాతి గిరిజనులు కనిపిస్తారు. వీరిని చూసేందుకు పర్యాటకులు వస్తుండడం విశేషం. ఫొటోలు తీసుకునేందుకు బొండాజాతీయులు వ్యతిరేకిస్తుంటారు. దీంతో ఆయుష్ష తగ్గుతుందని వారి నమ్మకం.వారి అనుమతి లేకుండా ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తే దాడికి దిగుతారు. కొంతమంది బొండా ఆదివాసీలు ఒక్కో ఫొటో తీసుకునేందుకు రూ.500ల వరకు తీసుకుంటారు. బోండా జాతి ఆదివాసీలను చూసెందుకు ఏటా అక్టోబర్ నుంచి జనవరి నెల వరకు అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఆయా సీజన్లలో ఎక్కువగా పండించే, లభించే అటవీ ఉత్పత్తులను ఒనకడిల్లీ వారపు సంతకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. వారు తీసుకొచ్చే తేనె, పసుపు, వెదురు, జీలుగుకల్లుకు ఎక్కువగా డిమాండ్ ఉంది. సంతంతా బోండా జాతి మహిళలతో సందడిగా కనిపిస్తాది. అభివృద్ధి పథంలో... ఆధునీకరణకు దూరంగా జీవనం సాగిస్తున్న బోండా జాతి ఆదివాసీలను జీవన విధానంల మార్పు తీసుకొచ్చేందుకు ఒడిశాకు చెందినా ఆశా కిరాణ్ అనే స్వచ్ఛంద సంస్థ నడుంబిగించింది. మొదటిగా గ్రామంలోని చిన్నారులకు విద్యను అందించాలని ఉద్దేశ్యంతో పాఠశాలలను ఒడిశా ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసింది. బోండాజాతి చిన్నారులను పాఠశాలలకు తీసుకొచ్చి విద్యావంతులుగా తీర్చి దిద్దింది. సుమారు పదేళ్లు తరువాత వారికి పూర్తిస్థాయిలో విద్యాబుద్ధులు నేర్పగలిగింది. ప్రస్తుత బొండాజాతి ఆదివాసీల్లో మార్పు వచ్చింది. పలువురు పట్టణాల్లో నర్సులుగా, హోమ్గార్డులుగా పలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్తున్నారు. ప్రస్తుతం మారిన బోండా జాతి తరం పిల్లలు వారి తల్లిదండ్రులు, పెద్దలకు నేటి నాగరికతను తెలియాజేస్తు వారి జీవన విధానంలో మార్పులు తీసుకువస్తున్నారు. వీరికి కుల, ఆదాయ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడం, చిన్నారులకు పాఠశాలల్లో రాయితీలు కల్పించడంలోనూ ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వారి గ్రామాల్లో పక్కా రహదారులు సైతం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. మారుతున్న ఆదివాసీల మనుగుడ మారుతున్న జీవన శైలి -
నూరుశాతం ఉద్యోగాల జీవో బాధ్యత చంద్రబాబుదే
● అరకు ఎంపీ తనూజరాణి సాక్షి,పాడేరు: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హమీ మేరకు గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల జీవోను తెచ్చే బాధ్యత అయనదేనని అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి అన్నారు. శుక్రవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ అరకు సభలో సీఎం చంద్రబాబు జీవో నంబరు 3ను పునరుద్ధరించి, గిరిజన అభ్యర్థులకు నూరుశాతం ఉద్యోగాలు కల్పిస్తానని హమీ ఇచ్చారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు గిరిజనులకు న్యాయం చేయకపోవడం అన్యాయమన్నారు. ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించకుండా కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు. జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యేక డీఎస్సీ కోసం ఆదివాసీ ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు పోరాటాలు చేస్తున్నా సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనందుకు పాడేరు వస్తున్న చంద్రబాబు జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యేక డీఎస్సీపై ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
గంజాయి స్మగ్లర్ల ఆస్తులు కూడా జప్తు చేస్తాం
ఆరిలోవ (విశాఖ): పోలీసులకు పట్టబడిన గంజాయి స్మగ్లర్ల ఆస్తులను కూడా జప్తు చేస్తామని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్(ఈగల్) క్లబ్ చీఫ్, ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఆయన అధ్యక్షతన ఈగల్ క్లబ్ శుక్రవారం సందర్శించింది. కారాగారం సూపరింటెండెంట్ ఎం.మహేష్బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్లు ఎన్.సాయిప్రవీణ్, సీహెచ్ సూర్యనారాయణ, జైలర్లు, ఈగల్ బృందంతో కలసి గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడి ఎన్డీపీఎస్ చట్టంపై అవగాహన కల్పించారు. ఏయే కేసుల్లో జైలుకు వచ్చారు, ఏ పరిస్థితిలో ఎన్డీపీఎస్ కేసుల్లో ఇరుకున్నారు, తదితర వాటి గురించి ఆరా తీశారు. ఎన్డీపీఎస్ చట్టం కఠినంగా ఉందని, జైల్ నుంచి బయటకు వెళ్లిన అనంతరం మళ్లీ అలాంటి తప్పులు చేయవద్దని హెచ్చరించారు. అనంతరం జైల్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసేవారి వెనుక ఉన్నవారిని కూడా గుర్తించి చర్యలు చేపడతామన్నారు. రెండుసార్లు కంటే ఎక్కువ గంజాయి కేసులు నమోదైతే అలాంటివారిపై సస్పెక్టడ్ షీట్ తెరుస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 3,700 మందిపై సస్పెక్టడ్ షీట్ నమోదు చేసినట్లు తెలిపారు. అల్లూరి సీతరామరాజు జిల్లాలో డ్రోన్ల ద్వారా గంజాయి సాగును గుర్తించి నాశనం చేశామన్నారు. ఒడిశా నుంచి దిగుమతి అవుతున్న గంజాయిని సరఫరా చేస్తూ రాష్ట్రంలో పోలీసులకు పలువురు పట్టుబడుతున్నట్లు తెలిపారు. దానివల్ల రాష్ట్రంలో గంజాయి కేసుల్లో పట్టుబడినవారి సంఖ్య పెరుగుతోందన్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో 1,800 మంది ఖైదీలు ఉంటే వారిలో 1,008 మంది గంజాయి కేసుల్లో వచ్చినవారేనని వెల్లడించారు. ఈగల్ క్లబ్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో యువతకు గంజాయి, డ్రగ్స్, పొగాకు ఉత్పత్తులపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిపై ఈగల్ క్లబ్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫోన్ చేసి, సమాచారం అందించవచ్చని సూచించారు. -
ఉపాధి కోసం వెళ్లి..
ముంచంగిపుట్టు: ఉపాధి కోసం వెళ్లిన యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. పక్షులను కాల్చే తుపాకీ మిస్ ఫైర్ కావడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కుమడ పంచాయతీ బూరుగుమెట్ట గ్రామానికి చెందిన వంతాల బాలరాజు అనే గిరిజన యువకుడు ఉపాధి నిమిత్తం చేపల చెరువులో పనికి మేస్త్రి బన్నీ అనే వ్యక్తితో ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నిర్మలూరు వెళ్లాడు. చెరువులో పక్షులను గన్నుతో కాల్చి, తరిమే పనిలో చేరాడు. అతనికి తుపాకీ కాల్చే అనుభవం లేకపోవడం గురువారం మిస్ ఫైర్ అయింది. దీంతో బాలరాజు శరీరం తీవ్రంగా కాలిపోయింది. దీంతో అతనిని తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వాస్పత్రిలో మేస్త్రి చేర్పించి వెళ్లిపోయాడు. అక్కడ చేపల చెరువుల యాజమాన్యం, మేస్త్రి పట్టించుకోకపోవడంతో నరకం చూస్తున్నానని అతను ఫోన్లో స్థానిక విలేకరులకు తెలిపాడు. ఎవరి సహాయం లేక ఇబ్బంది పడుతున్నానని, తనను ఆదుకోవాలని కన్నీటిపర్యంతమవుతూ సెల్ నంబరు (80746 51560) తెలిపాడు. ప్రమాదానికి గురైన గిరిజన యువకుడు పక్షులను కాల్చే తుపాకీ మిస్ ఫైర్తో తీవ్ర గాయాలు పశ్చిమగోదావరి జిల్లా నిర్మలూరులో ఘటన ఆదుకోవాలని మొర -
హామీలు ఎగ్గొట్టిన చంద్రబాబు
ఎన్నికల సమయంలో అరకులో ఇచ్చిన హామీలను చంద్రబాబు సీఎం అయ్యాక అమలుచేయకుండా ఎగ్గొట్టారు. జీవో నంబరు 3 పునరుద్ధరణ, 1/70 చట్టం పటిష్టంగా అమలు చేస్తామన్న ఆయన వీటిని గాలికొదిలేశారు. హామీలు నెరవేర్చిన తరువాతనే పాడేరు పర్యటనకు రావాలి. లేదంటే ఆయన పర్యటనను గిరిజనులు, ఆదివాసీ, గిరిజన, ప్రజా, విద్యార్థి సంఘాలతో కలిసి అడ్డుకుంటాం. – మత్య్సరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
మహిళల ఉన్నతికి..
గిరిజనులకు నూరుశాతం పనులతోపాటు ఉద్యోగాలు, పదవుల్లోను రిజర్వేషన్ కల్పిస్తూ గత ప్రభుత్వంవలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంచలనమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు చట్టాన్ని తీసుకువచ్చారు. దీని వల్ల 50 శాతం మహిళలకు పలు పదవుల్లో అవకాశాలు లభించాయి. సాక్షి,పాడేరు: తెల్లవారితే కొండపోడు వ్యవసాయం.అటవీ ఫలసాయం,ఉత్పత్తుల సేకరణతోనే ఆదివాసీల జీవన విధానం ప్రారంభమవుతుంది.అడవులలో అష్టకష్టాలు పడి సేకరించే అటవీ ఉత్పత్తులను వారపుసంతలకు తీసుకువచ్చి వాటిని విక్రయించి తద్వారా వచ్చే ఆదాయంతో వారానికి కుటుంబ పోషణకు సరపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుని గ్రామాలకు తీసుకువెళ్తుంటారు.గిరిజనుల జీవన విధానమంతా అనేక కష్టాలతో కూడుకున్నదే. ఇలా సాగుతున్న జీవన విధానంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ● గిరిశిఖర గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసీలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడంతో ఆజాతి గిరిజనుల సంక్షేమానికి గత ఐదేళ్లలో అఽధిక ప్రాధాన్యం ఇచ్చి మౌళిక వసతులు కల్పించారు. ● గిరిజనుల సంక్షేమానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 352 సచివాలయాలను ఏర్పాటు చేసి, పరిపాలనను చేరువ చేసింది. విద్య, వైద్యం, రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ● అటవీ హక్కుల చట్టంలో భూమి పట్టాలు పొందిన సన్న, చిన్నకారు రైతులకు, మైదాన ప్రాంత రైతులతో సమానంగా హక్కులతో పాటు ప్రభుత్వ పథకాలు పొందేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అటవీ భూములు సాగు చేస్తున్న 1,40,407మంది గిరిజనులకు 1.50లక్షల ఎకరాలను అటవీ భూములను పలు విడతలుగా పంపిణీ చేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్వహక్కులు కల్పించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఒక్క పట్టాకూడా ఇవ్వలేదు. అర్హులంతా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నత్తనడకన పనులు : జిల్లా కేంద్రమైన పాడేరులో రూ.500కోట్లతో వైద్య కళాశాలను ఏర్పాటు చేసి వైద్యవిద్యను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా సర్వజన ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో రిఫరల్ కేసుల సంఖ్య తగ్గింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రత్యేకంగా తీసుకున్న చర్యలు లేవు. వైద్యాధికారుల పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదు. వైద్యకళాశాలకు అనుబంధంగా ఏర్పాటుచేస్తున్న 500 పడకల ఆస్పత్రి పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. ● రంపచోడవరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టగా, దీనిపట్ల ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు 146 పడకలతో నిర్మించే ఈ ఆస్పత్రికి రూ. 49.26 కోట్లు గత ప్రభుత్వం వెచ్చించింది. 2022 ఫిబ్రవరిలో ● నాడు–నేడు పథకంలో జిల్లాలోని 47 ఆరోగ్య కేంద్రాలను రూ.22.69 కోట్లతో అభివృద్ధి చేసింది. ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. 12 పీహెచ్సీలకు రూ.18.74 కోట్లతో కొత్త ఽభవనాలను నిర్మించింది. ● జిల్లా వ్యాప్తంగా నాడు–నేడు మొదట విడతలో రూ.165.27 కోట్లతో 581 పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసింది. రెండవ విడతలో 967 పాఠశాలల అభివృద్ధికి రూ.108.96 కోట్లను వెచ్చించి అభివృద్ధికి బాటలు వేసింది. ● జిల్లాలోని 1.68 లక్షల మంది గిరిజన రైతులకు ఏటా రూ.127 కోట్ల రైతు భరోసా పథకంలో సాయం అందజేసింది. కూటమి ప్రభుత్వంలో అర్హత ఉన్నప్పటికీ వీరిలో సుమారు 25 వేల మందికి అన్నదాత సుఖీభవ సాయం కోత విధించింది. ● అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఇంటింటికి తాగునీరు అందించే లక్ష్యంగా రూ.629.72కోట్లతో పనులు చేపట్టింది ● జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గిరిజనులకు 5జీ నెనెట్వర్క్ సేవలు అందించే లక్ష్యంగా రూ.400 కోట్లతో 2,061 సెల్ టవర్లను మంజూరు చేసింది. సుమారు 700 గ్రామాలకు నెట్వర్క్ను గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ● రాజమహేంద్రవరం నుంచి జిల్లా మీదుగా విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి మన్యానికి వరంలా మారింది.టూరిజం కారిడార్లో భాగంగా 251.12 కిలోమీటర్ల రోడ్డును రూ.2,109,14 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టింది. ఐ.పోలవరం, గంగవరం, రాజవొమ్మంగి, అడ్డతీగల, కొయ్యూరు, కృష్ణదేవిపేట, పెదవలస, రంపుల ఘాట్, లంబసింగి, జి.మాడుగుల, పాడేరు, అరకు, అనంతగిరి మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి త్వరలో అందుబాటులోకి రానుంది. గిరిజనుల గుండెల్లో జగన్..ప్రత్యేక జిల్లాతో పాలన చేరువ..ఆదివాసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంనాడు ప్రగతి.. నేడు అధోగతి మన్యంలో విలక్షణ జీవనశైలి ఆదివాసీలది. వీరి అభ్యున్నతికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. అల్లూరి సీతారామరాజు పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేసి అభివృద్ధి, పాలన చేరువ చేసింది. ఆధునికత దిశగా అడుగులు వేసేలా తీర్చిదిద్దితే.. ఆ తరువాత అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. పాలన చేపట్టి సుమారు ఏడాదిన్నరకు చేరువ అవుతున్నా వీరి సంక్షేమానికి తీసుకున్న చర్యలు కానరావడం లేదు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా..