Alluri Sitarama Raju District Latest News
-
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
అభ్యర్థి వచ్చిన ఓట్లు కె.విజయ గౌరి 5,804 డాక్టర్ కె.రాధాకృష్ణ 30 గాదె శ్రీనివాసులు నాయుడు 7,210 దుర్గారావు 67 ఎన్.సూర్య ప్రకాష్ 85 ఎస్.ఎస్.పద్మావతి 15 పి.రఘువర్మ 6,845 పి.శివప్రసాద్ రావు 15 ఆర్.సత్యనారాయణ 31 డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు 33 మొత్తం 20,135 -
జీపుబోల్తా.. ఒకరి మృతి
● బ్రేకులు ఫెయిలై ప్రమాదం ● డీజిల్ లీకై మంటలు వ్యాపించి దగ్ధం గూడెంకొత్తవీఽధి: మండలంలోని ఎర్రగెడ్డ సాగులు ఘా ట్ రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఎర్రగెడ్డనుంచి ప్రయాణికులతో ఆర్వీనగర్ వారపు సంతకు వస్తున్న జీపు బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పి బోల్తాపడింది. దీనికి తోడు డీజిల్ లీకై పెద్దఎత్తున మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న వారిలో ఎర్రగెడ్డ గ్రామానికి చెందిన మర్రి వెంకటరావు(60) సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. కొర్రా పిడుగో అనే గిరిజనుడి కాళ్లు విరిగిపోగా, డ్రైవర్తో సహా మరో ఆరుగురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు హుటాహుటిన వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో గూడెంకొత్తవీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఆస్పత్రికి పంపా రు. వెంకటరావు మృతదేహాన్ని పోస్టుమార్టానికి చింతపల్లి ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ అప్పలసూరి తెలిపారు. -
బెత్తం దెబ్బ
కూటమికిఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి టీచర్లు ఝలక్ పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడికే అయ్యవార్లు పట్టం వర్మ ఓట్ల లెక్కింపుతో గాదెకు 12,035 ఓట్లు వచ్చినట్లుగా ప్రకటన ● కూటమి ప్రభుత్వం మద్దతిచ్చిన పాకలపాటి రఘువర్మకు షాక్ ● టీడీపీ, జనసేన నేతలు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగినా పట్టించుకోని ఉపాధ్యాయులు ● ఫలించని ప్రజాప్రతినిధుల ప్రలోభాల ఎర ● తొమ్మిది నెలల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం ఈ ఫలితం సాక్షి, విశాఖపట్నం/విశాఖ సిటీ : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి షాకిచ్చాయి. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే కూటమి పార్టీలకు ఉపాధ్యాయులు బెత్తం దెబ్బ రుచి చూపించారు. పాకలపాటి రఘువర్మను గెలిపించేందుకు టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు కాళ్లకు బలపాలు కట్టుకొని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలియతిరిగినా టీచర్లు కనికరించలేదు. ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.10 వేలు వరకు ఇచ్చి ప్రలోభాల ఎర వేసినా లొంగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడుకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులా పరిణమించాయి. ప్రలోభాల ఎర వేసినా.. ఏజెంట్ల అవతారమెత్తినా.. పాకలపాటి రఘువర్మ విజయానికి కూటమి నేతలు ఎన్ని ప్రలోభాల ఎర వేసినా.. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు ఎలక్షన్ ఏజెంట్ల అవతారమెత్తినా ఉపాధ్యాయులు కనికరించలేదు. వాస్తవానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఇటువంటి గౌరవప్రదమైన ఎన్నికలకు కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులిమింది. ఏపీటీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాకలపాటి రఘువర్మకు ముందు టీడీపీ, జనసేనలు మద్దతుగా నిలిచాయి. నామినేషన్ వేసిన దగ్గర నుంచి పోలింగ్ వరకు ఆ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రఘువర్మ విజయం నల్లెరుపై నడకే అన్న తరహాలో ప్రచారం చేసుకుంటూ పోయారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మద్దతు ఉన్న రఘువర్మను గెలిపిస్తేనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని వాట్సాప్ గ్రూపుల్లో విస్తృత ప్రచారం కల్పించారు. ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేర్వేరుగా ప్రత్యేక పార్టీలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.10 వేలు వరకు ముట్టజెప్పారు. పోలింగ్ రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేంద్రాల వద్ద టెంట్లలో ఎన్నికల ఏజెంట్ల తరహాల్లో ఓటర్ స్లిప్పులను సైతం అందించారు. ఇలా ఎన్ని చేసినా ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోలేదు. తొమ్మిది నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం, రాష్ట్ర ఖజానాను నింపుకోవడం కోసం విద్యుత్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వంపై అనతికాలంలోనే అన్ని వర్గాలకు ఆశలు సన్నగిల్లాయి. ప్రధానంగా ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు దృష్టి పెట్టకపోవడంతో పాటు పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ వంటి వాటి ప్రస్తావనే చేయకపోవడంపై కూడా ఉద్యోగ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ప్రభుత్వానికి తమ దెబ్బ రుచి చూపించారు. టీడీపీ, జనసేన మద్దతిచ్చిన పాకలపాటి రఘువర్మను ఓడించి గాదె శ్రీనివాసులునాయుడును గెలిపించారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇంతటి వ్యతిరేకతను మూట్టగట్టుకోవడంతో కూటమి శ్రేణులు డీలా పడ్డాయి. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు రంగంలోకి దిగినప్పటికీ ఓటమి చడిచూడడంతో జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈవీఎం కాదు.. బ్యాలెట్ విజయమిది.! గాదె విజయానంతరం పీఆర్టీయూ మద్దతుదారులతో కౌంటింగ్ కేంద్రం వద్ద కోలాహలం ఏర్పడింది. ఇది ఈవీఎం విజయం కాదనీ... బ్యాలెట్ బాక్సుల విజయమని కొందరు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించడం గమనార్హం. -
తొలి నుంచి గాదెకు ఆధిక్యం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 11.30 గంటలకు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను 20 టేబుల్స్కు సరిపడేలా కట్టలు కట్టారు. మొత్తం 20,971 ఓట్లు పోలవ్వగా 656 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. దీంతో 10,068 ఓట్లను మ్యాజిక్ ఫిగర్గా ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆది నుంచీ గాదె శ్రీనివాసులనాయుడు ఆధిక్యంలో కొనసాగారు. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి గాదె 365 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. గాదెకు మొదటి ప్రాధ్యాన్యత ఓట్లు 7,210 రాగా, రఘువర్మకి 6,845 ఓట్లు, విజయ గౌరికి 5,804 ఓట్లు వచ్చాయి. మధ్యాహ్నం విరామం అనంతరం ఎలిమినేషన్ రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగింది. ప్రతి దశలోనూ గాదె ఆధిక్యం కొనసాగింది. మూడో స్థానంలో ఉన్న విజయ గౌరికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత లెక్కింపు చేపట్టారు. 9వ రౌండ్లో గాదె 9,237 ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా.. వర్మకు 8,527 ఓట్లు వచ్చాయి. దీంతో తన ఓటమి ఖరారైందని భావించిన వర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి నిరాశగా వెనుదిరిగారు. అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఓట్లు సాధించేందుకు గాదె ఇంకా 831 ఓట్ల దూరంలో నిలిచారు. 1967 ఓట్ల మెజారిటీతో విజయం అప్పటికే వర్మ బయటికి వెళ్లిపోవడంతో వర్మకి చెందిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లని లెక్కించాలా.. గాదె విజయాన్ని ధృవీకరించాలా అనే అంశంపై రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్, ఎన్నికల అబ్జర్వర్ ఎం.ఎం.నాయక్ ఎలక్షన్ కమిషన్కి అభ్యర్థించారు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేంతవరకూ లెక్కించాలని చెప్పడంతో వర్మకి వచ్చిన ఓట్ల లెక్కింపును సాయంత్రం 6.45 గంటలకు ప్రారంభించారు. గాదె మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లకు చేరుకోగానే అధికారికంగా గాదె విజయం సాధించారు. మిగిలిన ఓట్ల లెక్కింపును కూడా పూర్తి చేశారు. చివరకు గాదెకు 12,035 ఓట్లు వచ్చాయి. రిటర్నింగ్ అధికారి గాదె విజయం సాధించినట్లు సంతకం చేసి ఎన్నికల కమిషన్ సంతకం కోసం విజయవాడ పంపించారు. -
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ జనరల్ విద్యార్థులకు 26 పరీక్ష కేంద్రాలు,ఒకేషనల్ విద్యార్థులకు ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.అన్ని కేంద్రాల వద్ద,గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నిఘానీడలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. విద్యార్థులు ఉదయం 8గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. మహిళా పోలీసులు,ఇతర సిబ్బంది తనిఖీలు జరిపిన తరువాతే విద్యార్థులను రూమ్ల్లోకి పంపారు. ఇంటర్ జనరల్ విద్యార్థులు 5,454 మందికి గాను 5,310 మంది పరీక్ష రాయగా, 144 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు 1,215మందికి గాను 1,135మంది పరీక్ష రాయగా 80మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపారు. తొలిరోజు ప్రశాంతం జనరల్ విద్యార్థులు 144 మంది, ఒకేషనల్ విద్యార్థులు 80 మంది గైర్హాజరు -
నాటకీయ పరిణామాలతో ఉద్రిక్తత
సోమవారం రాత్రి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ రహదారిపై ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులుగాదె విజయం 9 గంటలకు ఖరారైంది. ఆర్వో కూడా సంతకం చేసి వెళ్లిపోయినా అధికారికంగా ప్రకటించకపోవడం, ధృవీకరణ పత్రం జారీ చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు పీఆర్టీయూ ప్రతినిధులు గ్రహించారు. టీడీపీ నాయకులు గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్ రాత్రి 9.30 గంటల సమయంలో కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉపాధ్యాయుల్లో మరింత అనుమానాలు రేకెత్తాయి. గెలువు విషయంలో ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతుందేమోనని గ్రహించారు. వెంటనే అధికారికంగా ప్రకటించి.. ధృవీకరణ పత్రం జారీ చెయ్యాలంటూ పట్టుబట్టారు. కానీ.. కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గాదె మద్దతుదారులు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మెయిన్ ఎంట్రన్స్ రహదారిపై ధర్నాకు దిగారు. వెంటనే ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలంటూ నినదించారు. ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేపడుతున్నారని గ్రహించిన టీడీపీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. చివరికి పోలీసులు కౌంటింగ్ కేంద్రంలో ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడు మద్దతుదారులతో ఫోన్లో మాట్లాడి.. ఇక్కడ అంతా సవ్యంగానే ఉందని చెప్పడంతో నిరసన ఉపసంహరించుకున్నారు. -
కవలలు–ఒకే సారి డాక్టర్లయ్యారు
రాజవొమ్మంగి: మండలంలోని తంటికొండ గ్రామానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు ముర్ల సౌజన్య, శరణ్య ఒకే సారి ఎంబీబీఎస్ పట్టా తీసుకుని సోమవారం గ్రామానికి రావడంతో స్నేహితులు, బంధువులు వారిని అభినందనలతో ముంచెత్తారు. సౌజన్య, శరణ్య చిన్నప్పటి నుంచి కలిసే చదువుకొన్నారు. నీట్లో ర్యాంకు పొందడంతో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చాయి. వీరి ఐదేళ్ల చదువు పూర్తి కావడంతో ఈనెల 2న రంగరాయ మెడికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికెట్లు పొందారు. దీంతో తల్లిదండ్రులు రాము, సత్యవతిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మండలంలోని పలువురు ఆ పిల్లలను, వారి తల్లిదండ్రులను అభినందించారు. కాగా పిల్లల తండ్రి రాము కాకినాడలో రవాణాశాఖలో పని చేస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన గిరిజన యువతి కొయ్యూరు: నడింపాలెంకు చెందిన గిరిజన యువతి సుమర్ల మహేశ్వరి మానస కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల నుంచి సోమవారం ఎంబీబీఎస్ పట్టాను అందుకున్నారు. చిన్నతనంలోనే మానస తండ్రిని కోల్పోయింది.తల్లి సరస్వతి పట్టుదలతో మానసను చదివించారు. టెన్త్ వరకు భీమునిపట్నంలో చదివిన మానస ఇంటర్మీడియెట్ రాజమండ్రిలో పూర్తి చేశారు.నీట్తో ర్యాంకు రావడంతో కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించింది. ఆమె తల్లి సరస్వతి మాట్లాడుతూ తన కుమార్తె ఎంబీబీఎస్ పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
● పీహెచ్సీల్లో కాన్పుల సంఖ్య పెంచండి ● ఐటీడీఏ పీవో సింహాచలం రాజవొమ్మంగి: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు నమ్మకం కలిగేలా మెరుగైన వైద్య సేవలందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. ఆయన సోమవారం రాజవొమ్మంగి పీహెచ్సీను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. హాజరు రికార్డు పరిశీలించి, ఆ సమయంలో గైర్హాజరైన వారి వివరాలు పరిశీలించారు. రిజిష్టర్లు పరిశీలించి ఈ నెల కేవలం నాలుగు ప్రసవాలు మాత్రమే పీహెచ్సీలో జరగడంపై అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి గర్భిణుల సర్వే చేయాలన్నారు. రాజవొమ్మంగి 24 గంటల మాతా శిశు ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని మెడికల్ ఆఫీసర్ సుష్మను ఆదేశించారు. ఈ పీహెచ్సీలో పురుడుపోసేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నా ఎందుకు ప్రసవాల సంఖ్య పెరగడం లేదని ప్రశ్నించారు. అంతకు ముందు ఆయన స్థానిక బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు. జీసీసీ సూపర్ బజార్లో సరకుల విక్రయం, వాటి నిల్వలను పరిగణనలోకి తీసుకొన్నారు. స్థానిక బస్షెల్టర్లో ప్రయాణికులు నిలిచేందుకు నీడ లేదని, మరుగుదొడ్లు లేవని ఇటీవల ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినత పత్రానికి స్పందించిన ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ అంశంపై బస్షెల్టర్ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై స్థానిక తహసీల్దార్ సత్యనారాయణతో సంప్రదించారు. -
కొవ్వొత్తులతో మహిళల ర్యాలీ
సాక్షి, పాడేరు: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఉమెన్ ఎంపవర్మెంట్పై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్గౌడ,సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్లు సోమ వారం సంతకాలు చేసి దీనిని ప్రారంభించారు. ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి ఆధ్వర్యంలో కుమ్మరిపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి కలెక్టర్ కార్యాలయం జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాలికలు,మహిళల హక్కులు,చట్టాలపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు సీడీపీవో ఝాన్సీరాణి,ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఘనంగా మహిళా దినోత్సవ వారోత్సవాలు -
బడా యాత్ర... జనజాతర
● ఘనంగా మన్యం కొండ జాతర ● పొటెత్తిన భక్తులు ● వేలాదిగా తరలివచ్చిన ఒడిశా గిరిజనులు మోతుగూడెం: ఒడిశా గిరిజనుల ఆరాధ్య దైవం మన్యంకొండ జాతర (బడా యాత్ర) ఘనంగా జరిగింది. ఒడిశా రాష్ట్రం మన్యం కొండ గ్రామం నుంచి ఆదివారం సాయంత్రం ప్రారంభమైన బడా యాత్ర ఎనిమిది కిలోమీటర్లు సాగి రాత్రికి సీలేరు నది ఆవల ఒడ్డున ఉన్న పొల్లూరు(ఒడిశా రాష్ట్రం) గ్రామానికి చేరుకుంది. అక్కడ రాత్రి బస చేసిన అనంతరం సోమవారం తెల్లవారుజామున వన దేవతలైన అన్నమరాజు, బాలరాజు,పొతు రాజులకు పూజలు చేశారు. అనంతరం అప్పటికే తయారుచేసి ఉంచిన రెండు కొత్త పడవలను కలిపి కట్టి, వాటిపై విగ్రహాలను ఉంచి ఉదయం నదిని దాటించారు. వన దేవలతో పాటు వచ్చిన వేలాది మంది ఒడిశా భక్తులు ఫ్లోటింగ్ వంతెన పై నుంచి నదిని దాటి వచ్చారు. అనంతరం ఆంధ్రా అధికారులైనా చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్, ఏఎస్పీ పంకజ్ కుమార్మీనా పల్లకీలో వనదేవతలను ఊరేగింపుగా పొల్లూరు (ఆంధ్రప్రదేశ్) గ్రామానికి తీసుకువచ్చి, చలువ పందిరి కింద కొలువుతీర్చారు. మోతుగూడెం, పొల్లూరు తదితర గ్రామాలకు చెందిన వారంతా కలిసి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్న అనంతరం బడాయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర పొల్లూరు వాటర్ఫాల్స్ వరకూ సాగింది. అక్కడ గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, బంగారు చేప దర్శనమిచ్చినట్టు ప్రకటించిన అనంతరం వనదేవతలకు మంగళస్నానం చేయించారు. తరువాత భక్తులు కూడా ఆ పుణ్యజలాలలో స్నానాలు ఆచరించారు. అనంతరం బడా యాత్ర సీలేరు నదిని దాటి మళ్లీ ఒడిశాలోని మన్యం కొండగ్రామానికి బయలుదేరడంతో మనరాష్ట్రంలో ఈ ఉత్సవం విజయవంతంగా ముగిసింది. వేలాదిగా వచ్చిన భక్తులకు చింతూరు పీవో అపూర్వ భరత్, ఏఎస్పీ పంకజ్ కుమార్మీనా ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి సదుపాయం కల్పించారు. మోతుగూడెం, పొల్లూరు గ్రామస్తులు సహకారంతో సుమారు 20 వేల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించారు. మందులు అందుబాటులో ఉంచారు. సీలేరు నదిపై నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని భక్తులు దాటేటప్పడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒడిశా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సుమారు రెండు బోట్లతో పహారాకాశాయి. ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో 350 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి అప్రమత్తతో వ్యవహరించారు. మన్యం కొండ జాతర బడాయాత్రలో ఒడిశా రాష్ట్రం నుంచి నవరంగపూర్ ఎంపీ బాలభద్ర మజ్జి, మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడకామీ, మల్కన్గిరి ఐటీడీఏ పీవో దుర్యోధన బోయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పూర్తి సహాయ సహకారాలు అందించిన ఆంధ్రా అధికారులకు ఒడిశా ఎంపీ, ఎమ్మెల్యే, పీవో, ఇతర అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో అధికారులు, అటవీ, పంచాయతీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సమర్థంగా దీపం–2 పథకం అమలు
● అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ● కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: దీపం–2 పథకాన్ని జిల్లాలో సమర్థంగా అమలుజేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన జేసీ, ఐటీడీఏ పీవోలు,సబ్కలెక్టర్లు,పలుశాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ సరఫరాదారులు అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్న 48గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలని తెలిపారు. జేసీ అభిషేక్గౌడ మాట్లాడుతూ గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని,అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీ పరిధిలో 15 కిలోమీటర్ల వరకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని,15 కిలోమీటర్లు దాటితే రూ.30 రవాణా చార్జీలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ఉచిత గ్యాస్ నగదు 48గంటల్లో జమకాని పక్షంలో 14400 లేదా 1967 టోల్ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీపం–2 పథకం కింద జిల్లాకు 11,433 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని,వాటిలో వినియోగంలో లేని 61కనెక్షన్లకు ఈకేవైసీ చేయాలన్నారు.అదనపు వసూళ్లు చేసే గ్యాస్ ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో పాడేరు,రంపచోడవరం సబ్కలెక్టర్లు శౌర్యమన్పటేల్, కల్పశ్రీ, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి గణేష్,పలు గ్యాస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు సిగ్గుచేటు
పాడేరు రూరల్: వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దంటూ సీఎం చంద్రబాబునాయుడు దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని పాడేరు మాజీ ఎమ్మెల్యే, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి పనులు చేసినా సహించేది లేదని చెప్పడం సీఎం చంద్రబాబునాయుడు తగదన్నారు. జగనన్న ప్రభు త్వ హయాంలో పార్టీలకు, కులమతలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చి సుపరిపాలన చేశారని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం పిచ్చి చేష్టలు చేస్తు కాలం గడుపుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి గడ్డుకాలం మొదలైందని, ప్రజలందరూ చమరగీతం పాడతారని చెప్పారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి -
రోడ్డు పనులకు సహకరించండి
అటవీశాఖ అధికారులకు ఎస్టీ కమిషన్ చైర్మన్ సూచన విజయనగరం అర్బన్: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చిన్నకోనల గిరిశిఖర గ్రామ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అధికారులు సహకరించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డి.వి.జి. శంకరరావు కోరారు. రోడ్డు పనులను అటవీశాఖాధికారులు అడ్డుకుంటున్నారంటూ గిరిజనుల నిరసన తెలపడంపై ఆయన సోమవారం స్పందించారు. నాన్ షెడ్యూల్ ఏరియాలోని రొంపల్లి పంచాయతీ పరిధి కొండశిఖర గ్రామాలైన చిన్నకోనల, భూరిగా, వనిజతో పాటు ఎన్.ఆర్.పురం పంచాయతీ పరిధిలోని మరో ఐదు గ్రామాలను కలుపుతూ రోడ్డు నిర్మాణంపై అటవీశాఖ అభ్యంతరాలను నివేదిక రూపంలో అందజేయాలని సంబంధిత అధికారులను కోరారు. గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనపై అలసత్వం వహించరాదన్నారు. -
భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం
● నిమ్మలపాలెంలో రోడ్డు ప్రమాదం ● అదుపు తప్పిన ద్విచక్ర వాహనం ● భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు కొయ్యూరు: డౌనూరు పంచాయతీ నిమ్మలపాలెం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతపల్లి మండలం వేనంకు చెందిన పాంగి భానుచందర్ (45) మృతి చెందాడు. ఆయన తన స్వగ్రామం నుంచి డౌనూరు మీ సేవ కేంద్రానికి భార్య జ్యోతితో కలిసి బైక్పై వస్తున్నారు. అయితే నిమ్మలపాలెం గ్రామం వద్ద వాహనం అదుపుతప్పింది. దీంతో భానుచందర్ కిందపడడంతో తలకు తీవ్ర గాయమైంది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఘటన జరిగిన ప్రాంతంలోనే ఆయన మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. భార్య జ్యోతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికులు 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం చెందడంపై ఆమె గుండెలవిసేలా రోదించారు. ఆమెను చూసి స్థానికులు కంటతడిపట్టారు. ఈ సంఘటనపై కొయ్యూరు ఎస్ఐ కిషోర్వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉచిత వివాహాలకు దరఖాస్తులు
కొయ్యూరు: పేదలకు సామూహిక వివాహా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు దాన ధర్మ చారిటబుల్ సంస్థ సేవా ప్రతినిధి డి.ప్రసాద్, టీటీడీ ధర్మ ప్రచారక్ పద్మరాజు చెప్పారు. వారు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సామూహిక వివాహాది కార్యక్రమంలో భాగంగా వధూవరులకు నూతన వస్త్రాలు, కాలిమెట్టెలు, తలంబ్రా లు, కర్పూర, పూల దండలను సంస్థ సమకూరుస్తుందన్నారు. ఈ మేరకు అర్హలైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివాహాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు మహిళలు 18 సంవత్సరాలు దాటి, పురుషులు 21 సంవత్సరాలు నిండి ఉండాలని సూచించారు. చినజీయన్ స్వామి ఆశీస్సులతో ఏప్రిల్లో వివాహాలు నిర్వహిస్తా రని చెప్పారు. మరిన్ని వివరాలకు 73822 73833, 83670 82 887, 9014294500 లను సంప్రదించాలని కోరారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు పాడేరు: జిల్లాలో తాగునీటి సమస్యలు చేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధి కారి కె.ఎస్.జవహర్కుమార్ నాయుడు సోమవారం ఒక ప్ర కటనలో తెలిపారు. ప్రస్తుతం తాగునీటి ఎద్దడి లేదని, ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఎదురైతే 0893529 8900 అనేఫోన్ నంబర్కు కాల్చేసి ఫి ర్యాదు చేయాలని పేర్కొన్నారు. గత నెల 1న ప్రారంభమైన సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం కింద జి ల్లా వ్యాప్తంగా 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాల ను పరిశీలించినట్టు పేర్కొన్నారు. జిల్లా లో పీడబ్ల్యూఎస్ ప థకాలు, హ్యాండ్ పంపులు పరిశీలించి అవసరమైన వా టిని మరమ్మతులు చేపట్టినట్టు తెలిపారు. -
వన్యప్రాణుల సంరక్షణ ఎంతో అవసరం
చింతూరు డీఎఫ్వో బబితచింతూరు: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని చింతూరు డీఎఫ్వో బబిత అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ దితనోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో సోమవారం చింతూరులో ఆశాఖ ఉద్యోగులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అటవీ కార్యాలయంలో వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతపై డీఎఫ్వో బబిత విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడకుండా చూడాలని, అడవులను రక్షించడం ద్వారా పర్యావరణం కాపాడవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో రేంజర్లు ఆజాద్, అబ్బయదొర, డీఆర్వో శ్రీనివాస్, ఎఫ్ఎస్వోలు చిన్నభిక్షం, రాజమ్మ, వీరభద్రయ్య పాల్గొన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు విద్యార్థులే అంబాసిడర్లు కూనవరం: ప్రపంచంలో కొన్ని వన్యప్రాణులు అంతరించి పోతున్నాయని, అలా అంతరించి పోకుండా పరిరక్షించాల్సిన బాధ్యతను విద్యార్థి దశ నుంచే అలవర్చుకుని, వన్యప్రాణుల సంరక్షణకు అంబాసిడర్లుగా వ్యవహరించాలని స్థానిక రేంజ్ ఆఫీసర్ ఎం.కరుణాకర్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా రేంజ్ పరిధిలోని కోతులగుట్ట ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాల, కేజీబీవీ, నరసింహాపురంలోని ఏహెచ్ఎస్ బాలుర పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులుఅందజేశారు. ఈకార్యక్రమంలో గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ఏ హెచ్ఎస్ నరసింహాపురం ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, డీఆర్వో అనిల్కుమార్, ఎఫ్ఎస్వోలు సాయి వెంకటరమణ, విజయలక్ష్మి, దేశాయి, శంకర్రెడ్డి, ప్రసన్న కుమార్, ఎఫ్బివోలు నాగలక్ష్మి, జంపన్నరాజు, దుర్గాభవాని, బాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత వి.ఆర్.పురం: వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని సబ్ డివిజన్ ఫారెస్టు అధికారి కె.వి.ఎస్.రాఘవరావు అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా స్థానిక అటవీ శాఖాధికారులు స్థానిక కేజీబీవీ విద్యార్థులతో రేఖపల్లిలో ర్యాలీ నిర్వహించారు. వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ ఫారస్ట్ అధికారి రాఘవరావు మాట్లాడుతూ వన్యప్రాణులను సంరక్షించుకోవడంతో ప్రకృతి మనుగడ సాధ్యమవుతుందన్నారు.ఆటవీ శాఖ అధికారులు ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. -
చంద్రబాబు నిజ స్వరూపం బయటపడింది
ముంచంగిపుట్టు: వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన దిగజారుడు వ్యాఖ్యలతో ఆయన నిజ స్వరూపం బయటపడిందని, వెంటనే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని విశాఖ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు.ముంచంగిపుట్టులో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా అందరికీ సమన్యాయం చేస్తానని ప్రమాణం చేసి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి పనులు చేయకూడదని చంద్రబాబు మాట్లాడడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఉండే అర్హత లేదన్నారు.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులం,మతం,ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు, రాయితీలు అందించారని చెప్పారు. తక్షణమే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని,క్షమాపణ చెప్పాలని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర -
3,4,5 తరగతుల విలీనం తగదు
డుంబ్రిగుడ: జిల్లాలోని పలుగ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో గల 3,4,5 తరగతులను ఆశ్రమ పాఠశాలల్లో విలీనం చేసేందుకు చర్యలు తీసుకోవడం తగదని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ అన్నారు. మండలంలోని గుంటసీమ పంచాయతీ సరియావలసలో ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తరగతులను విలీనం చేయవద్దని డిమాండ్ చేస్తూ పాఠశాల వద్ద ఆందోళన చేశారు. అనంతరం సూర్య నారాయణ మాట్లాడుతూ 3,4,5 తరగతులను విలీనం చేస్తే జిల్లాలో పలు ప్రాథమిక పాఠశాలు మూతబడి,డ్రాప్అవుట్లు పెరుగుతాయని, దీంతో గిరిజన విద్యార్థులు విద్యకు దూరమవుతారని చెప్పారు. ఈవిషయమై విద్యాశాఖ అధికారులతో పాటు కలెక్టర్ స్పందించి విలీనం ఆదేశాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా కమిటీ చైర్మన్ కె.రాందాస్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ -
వన్యప్రాణులపైపోస్టర్ ప్రదర్శన పోటీలు
ఆరిలోవ(విశాఖ): ఇందిరాగాంధీ జూ పార్కులో ఆదివారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూ అధికారులు విద్యార్థులకు అవగాహన కోసం ఒకటో తరగతి నుంచి పీజీ వరకు వన్యప్రాణులపై పోస్టర్ ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వారికి కేటగిరీల వారిగా అప్పగించిన అంశాలపై ఇంటి వద్దే పోస్టర్లు సిద్ధం చేసుకొని జూ బయోస్కోప్లో జరిగిన పోటీలకు హాజరయ్యారు. విశాఖ నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభ చూపారు. పోస్టర్లను తోటి విద్యార్థులు, అతిథులు, జూ సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. ఉత్తమ పోస్టర్లు ప్రదర్శించిన విద్యార్థులకు ముఖ్య అతిథి ఏయూ జంతు శాస్త్ర విభాగం అధ్యాపకురాలు డాక్టర్ సి.మంజులత, జూ క్యూరేటర్ బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జూ అసిస్టెంట్ క్యూరేటర్లు గోపి, గోపాలరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
20 ఎకరాల్లో కాఫీ, మిరియాల తోటలు దగ్ధం
ముంచంగిపుట్టు: మండలంలోని దార్రెల పంచాయతీ తలింభ గ్రామ సమీపంలో 18 మంది రైతులకు చెందిన 20ఎకరాల్లోని కాఫీ, మిరియాల తోటలు ఆదివారం దగ్ధమయ్యాయి. దీంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయారు. తలింభ గ్రామానికి చెందిన బాధిత గిరిజన రైతులు దామోదరం, అర్జున్, రఘునాథ్, జగన్నాథం, బలరాంలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలోని కొండ ప్రాంతం నుంచి భారీగా మంటలు వస్తుండడంతో వెళ్లి చూడగా కాఫీ, మిరియాల తోటలు కాలిపోతూ కనిపించాయని, మంటలను ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. పంట చేతికి వచ్చే సమయంలో 14వేల కాఫీ మొక్కలు, నాలుగు వేల మిరియాల పాదులు ఆగ్నికి ఆహుతి అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆకతాయిలు చేసిన పని వల్ల రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని తెలిపారు. వీటిపైనే ఆధారపడి జీవించే మా కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కలెక్టర్ స్పందించి, తమను ఆదుకోవాలని వారు కోరారు. సర్పంచ్ పాండురంగస్వామి, పీసా కమిటీ కార్యదర్శి సాధూరాం, వీఆర్వో అజయ్పడాల్, వీఆర్ఏ లోహితాస్ తదితరులు... దగ్ధమైన కాఫీ, మిరియాలు తోటలను పరిశీలించారు. బాధిత రైతులను ఆదుకోవాలని వారు కోరారు. నిప్పు పెట్టిన ఆకతాయిలు తీవ్రంగా నష్ట పోయిన గిరిజన రైతులు -
రాష్ట్రస్థాయి పోటీలకుచీపురుగొంది విద్యార్థిని
● జిల్లా స్థాయిలో ఆంగ్ల పదాల ఉచ్చారణలో ప్రతిభ ముంచంగిపుట్టు: ఆంగ్ల పదాల ఉచ్చారణలో ప్రతిభ కనబరిచి కిల్లో దీపిక వరుసగా రెండో సారి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 1వ తేదీన పాడేరులో జిల్లా స్థాయి విభ లీఫ్ ఫార్వర్డ్ ఇంగ్లిష్ వర్డ్ పవర్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న మండలంలోని కుమడ పంచాయతీ చీపురుగొంది ఎంపీపీఎస్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న కిల్లో దీపిక తక్కువ వ్యవధిలోనే ఆంగ్లంలో ఇచ్చిన అంశాన్ని ధారాళంగా చదువుతూ పూర్తి చేసి, మొదటి స్థానంలో నిలిచింది. ఈ నెల 13న విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. దీపికను తీర్చి దిద్దిన ఉపాధ్యాయులు హనుమంతు,పీఈఎం ప్రశాంతిలకు చీపురుగొంది గ్రామ గిరిజనులు,మండల వాసులు అభినందనలు తెలిపారు. -
ఐఐఎంఆర్ శిక్షణకు మత్స్యదేవత ఎఫ్పీవో రైతులు
జి.మాడుగుల: భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం ఆడిటోరియంలో ఈ నెల 3,4 తేదీల్లో రెండు రోజుల పాటు గిరిజన రైతులకు చిరుధాన్యాల సాగు, వాటి ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు స్థానిక మత్స్యదేవత ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్(ఎఫ్పీవో)కు చెందిన 40 మంది గిరిజన రైతులు ప్రత్యేక బస్సులో ఆదివారం బయలుదేరారు. ఈ మేళాలో శాసీ్త్రయ సాగు, జీవవైవిధ్య పరిరక్షణ, పోషకాహార విలువలతో కూడిన చిరుధాన్యా ల ఉత్పత్తులు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ తదితర ఆంశాలపై అవగాహన కల్పించనున్నట్టు మత్స్యదేవత ఎఫ్పీవో సీఈవో ఐసరం హనుమంతరావు తెలిపారు. ఐఐఎంఆర్ ప్రమోట్ చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో పాటు జి.మాడుగుల మత్స్యదేవత ఎఫ్పీవో పాల్గొనడమేకాకుండా స్టాల్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ మేళలో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక,తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన రైతులు హాజరవుతారని ఆయన తెలిపారు. -
సమస్యలతో సతమతం
కొయ్యూరు: ఎందరు అధికారులు మారినా రేవళ్లుకు పాఠశాల యోగ్యం కలగడం లేదు. గత్యంతరం లేక స్థానిక విద్యార్థులు కొయ్యూరు, రాజేంద్రపాలెం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రేవళ్లు పేరిట పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదు. రేవళ్లులో ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. ఈ పాఠశాల భవనం అధ్వానంగా ఉందని, మరమ్మతు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ఏళ్ల తరబడి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. పాఠశాలకు ప్రహరీ లేదని, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు, సుమారు 35 చిన్నారులతో కొనసాగుతున్న పాఠశాలను ఎత్తివేయడం దారణమంటున్నారు. గత్యంతరం లేక తమ పిల్లలను రాజేంద్రపాలెం, కొయ్యూరు ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవళ్ల పాఠశాల సమస్యపై ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతు సమస్యను కలెక్టర్ దినేష్కుమార్ దృష్టిలో ఉంచామన్నారు. ఆయన స్పందించినట్టు చెప్పారు. ఈ విషయంపై ఎంఈవో ఎం.రాంబాబు మాట్లాడుతూ రేవళ్ల పాఠశాల సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. పాఠశాలకు డైస్ కోడ్ అవకాశం ఉందని, దీంతో రేవళ్లలోనే స్కూల్ కొనసాగే అవకాశముంటుందన్నారు. రేవళ్లులో మూడబడిన పాఠశాల కొయ్యూరు, రాజేంద్రపాలెం వెళ్తున్న విద్యార్థులు -
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అంకిత భావంతో పనిచేయాలని సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు అధికారులకు సూచించారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆదివారం ఆయన ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ అధికారులతో కలిసి సింహగిరిపై క్షేత్రస్థాయి పర్యటన చేశారు. గంగధార, రామాలయం, ప్రసాదం పథకం పనులు జరిగే ప్రదేశాలు, అన్నప్రసాద విభాగం, భక్తుల క్యూలైన్లు తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. సింహగిరికి వచ్చే భక్తులు దర్శన క్యూలకు ఎటు వెళ్లాలో క్షుణ్ణంగా తెలిపేలా ఎక్కడిడక్కడ సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం నాణ్యతపై భక్తులను ఆరా తీశారు. ఆఖరు పంక్తిలో కూర్చునే భక్తుడి వరకు అన్నప్రసాదం రుచిగా ఉండాలన్నారు. లడ్డు ప్రసాదం రుచిలో ఎలాంటి రాజీ పడవద్దని వైష్ణవ స్వాములకు సూచించారు. పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచాలన్నారు. సింహగిరి ఆనంద నిలయంలో ఇంజినీరింగ్ అధికారులు, విభాగాల ఏఈవోలు, సూపరింటెండ్లతో సమావేశమై రానున్న రెండు నెలల్లో జరిగే డోలోత్సవం, పెళ్లిరాట ఉత్సవం, వార్షిక కల్యాణోత్సవం, చందనోత్సవం తదితర కార్యక్రమాలను సమష్టి కృషితో, విజయవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, ఏఈవో ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు దేవస్థానం ఇన్చార్జి ఈవో సుబ్బారావు దిశానిర్దేశం -
కోర్కెలు తీర్చే కల్పవల్లి గంగమ్మతల్లి
ముంచంగిపుట్టు: మండలంలోని పాత సుజనకోట గ్రామంలో మత్స్యగెడ్డ ఒడ్డున వెలసిన గంగమ్మతల్లి ఉత్సవాలను ఈ నెల 3,4 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువైన గంగమ్మ తల్లికి ఏటా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.3వ తేదీ రాత్రి అమ్మవారికి సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు ఘటాలను సమర్పిస్తారు. ఈ సందర్భంగా బుడియాల విన్యాసాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో జాతరను నిర్వహిస్తారు. 4వ తేదీన తెల్లవారు జామునుంచే భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఈ గ్రామానికి చెందిన వారు ఎక్కువగా విశాఖ,ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.ఏటా జరిగే గంగమ్మతల్లి ఉత్సవాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబసమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చి దిద్దడంతో పాటు ఆకట్టుకునేలా విద్యుత్దీపాలతో అలంకరించారు. జాతర సందర్భంగా వైద్య శిబిరం,పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఆదివారం స్థానిక సర్పంచ్ వెంగడ రమేష్,ఉత్సవ కమిటీ అధ్యక్షకార్యదర్శులు,కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. బుడియా మాలతో గిరిజనుల సందడి గంగమ్మతల్లి మొక్కుబడుల్లో భాగంగా అధిక సంఖ్యలో గిరిజనులు బుడియా మాల ధరిస్తారు. శరీరం అంతా తెల్లటి సున్నంతో చారలుగా రాసుకొని కర్రలు పట్టుకొని,కేవలం ఫ్యాంట్ మాత్రమే వేసుకుంటారు. ఈ మాల ధరించిన వారు వారం రోజుల పాటు నూనె వంటకాలను తినరు. ఉన్నత స్థాయి ఉద్యోగుల మొదలు ఎంతో మంది ఈ మాల ధరించి,కర్ర పట్టుకొని విన్యాసాలు చేస్తూ పాటలు పాడుతూ గ్రామాల్లో తిరుగుతూ గంగమ్మతల్లి పండగపై ప్రచారం నిర్వహించడంతో పాటు నగదు,బియ్యం,కూరగాయలు సేకరిస్తారు.ఇలా సేకరించిన బియ్యం,కూరగాయలతో వంట చేసి సహపంక్తి భోజనాలు చేస్తారు.అన్ని ఏర్పాట్లు చేశాం గంగమ్మ తల్లి ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు,రెవెన్యూశాఖలతో పాటు పలు శాఖల అధికారులు సేవలందించనున్నారు. ఆలయానికి వెళ్లే కొండ ప్రాంతమంతా దారిపొడువునా విద్యుత్ సౌకర్యం కల్పించాం.గిరిజన సంస్కృతి,సంప్రదాయాల ప్రకారం గంగమ్మతల్లి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం.40వేల మందికి పైగా భక్తులు సరిహద్దు గ్రామాల నుంచి వస్తారని అంచనా వేస్తున్నాం.పార్కింగ్ సమస్య లేకుండా ప్రత్యేక స్థలం కేటాయించడం జరిగింది. – వెంగడ రమేష్, సర్పంచ్, సుజనకోట పంచాయతీ నేటి నుంచి సుజనకోటలో ఉత్సవాలు గిరిజన సంస్కృతి,సంప్రదాయాల ప్రకారం నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసిన ఉత్సవ కమిటీ -
23 తులాల బంగారం, రూ.లక్ష చోరీ
సీతమ్మధార: ఇంట్లో చొరబడి 23 తులాల బంగా బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీ ఘటన మధురానగర్లో చోటుచేసుకుంది. పోలీసులు మీడియాకు ఆదివారం తెలిపిన వివరాలు.. మధురానగర్ జీవీఎంసీ పాఠశాల దరి అనంతమాధవి టవర్స్, ఫ్లాట్ నెం.102లో మరకాని కృష్ణ(46) కుటుంబంతో కలిసి ఏడేళ్లుగా నివాసం ఉంటున్నారు. కృష్ణ నగరంలోని అశోక్ ఆటోమొబైల్స్లో పనిచేస్తున్నారు. శనివారం కుటుంబంతో కలిసి కాకినాడలో బంధువుల ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి వేసి ఉన్న తాళం కట్ చేసి ఉండటాన్ని గమనించారు. దీంతో కంగారుగా ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలో ఉన్న 23 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో బాధితులు ద్వారకా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో సంఘటనా స్థలికి చేరుకుని, ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజ్లో నిందితుడిని గుర్తించి, పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
లక్ష్యసాధనకు విద్యార్థులుకృషి చేయాలి
రంపచోడవరం: విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలని సీఐఎఫ్ డైరెక్టర్ రవిశంకర్ తెలిపారు.పందరిమామిడి కేవీకేలో మత్స్యకారులు, విద్యార్థులకు వేర్వేరుగా రెండు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పరంగా పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని, గిరిజన విద్యార్థులు వాటిపై దృష్టి సారించాలన్నారు. అనంతరం రైతులకు కోడి పిల్లలు, మేతను ఉచితంగా అందజేశారు. కేవీకే శాస్త్రవేత్తలు రాజేంద్రప్రసాద్, వీరాంజనేయులు, సీఐఎఫ్ శాస్త్రవేత్తలు డాక్టర్ మురళీధర్, శోభ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సాధనతో సజావుగా జీవిత పయనం
మద్దిలపాలెం: మానవ జీవితం సజావుగా సాగేందుకు సాధన ఎంతో అవసరమని పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి ప్రవచించారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సాధన రహస్యం అంశం మీద స్వామి వారి ప్రవచన కార్యక్రమం రెండో రోజు ఆదివారం ఆధ్యాత్మిక భావంతో సాగింది. స్వామీజీ మాట్లాడుతూ మనిషి జీవితం వివిధ తాపత్రయాలతో ముడిపడి ఉంటుందని, వాటికి తాత్కాలిక ఉపశమనం, శాశ్వత పరిష్కారం రెండు విధాలుగా లభిస్తుందని వివరించారు. ఉపశమనాల నుంచి పరిష్కారం దిశగా మారేందుకు ఆధ్యాత్మిక శక్తి మాత్రమే తోడ్పడగలదని చెప్పారు. వాహనాలు నడవడానికి ఇంధనం ఎంత అవసరమో.. జీవితం సజావుగా సాగేందుకు సాధన అంతే అవసరమని పేర్కొన్నారు. ఎంఎస్ఎన్ రాజు, డాక్టర్ రాంబాబు, డాక్టర్ చిట్టిపంతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్ని జ్యోతి ప్రజ్వలన చేశారు. -
హార్బర్కు హంగులు
ఏడాదిలోగా నిర్మించేలా కాంట్రాక్టు సంస్థతో ఒప్పందంసకలసౌకర్యాలహార్బర్ సాక్షి, విశాఖపట్నం: ఆశల తీరంలో బతుకు నావలో బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీసే గంగపుత్రుల జీవితాలకు దారి చూపించేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చొరవతో విశాఖపట్నం పోర్టు అథారిటీ హార్బర్ ఆధునికీకరణ పనులు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకంలో భాగంగా.. రూ.151.81 కోట్లతో పనులు జోరుగా సాగుతున్నాయి. దళారుల చేతిలో మోసపోతూ.. ఆర్థికంగా ఎదగలేకపోతున్న మత్స్యకారులకు లాభాలు అందించేలా ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ జరుగుతోంది. ఇప్పటికే పలు పనులు చివరి దశకు చేరుకోగా.. తాజాగా మరో రెండు ఫిషింగ్ జెట్టీల నిర్మాణానికి పోర్టు శ్రీకారం చుట్టింది. రూ.32.61 కోట్లతో జెట్టీల నిర్మాణ పనులను ఖరారు చేసింది. ఏడాదిలోగా నిర్మించి.. మత్స్యకారులకు లబ్ధి చేకూరేలా జెట్టీల ఏర్పాటుకు చకచకగా అడుగులు పడుతున్నాయి. రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం రూ.151.81 కోట్లు వెచ్చించేందుకు విశాఖపట్నం పోర్టు ముందుకువచ్చింది. అందులో రూ.50 కోట్లు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మంజూరు చేశారు. మరో రూ.50 కోట్లు సాగరమాల కింద కేంద్ర నౌకాయానశాఖ ఇచ్చింది. పీపీపీ ప్రాజెక్టుల ద్వారా రూ.27.55 కోట్లు సమకూర్చుకోనున్నారు. విశాఖపట్నం పోర్టు తొలుత రూ.24.26 కోట్లు ఇస్తామని ప్రకటించింది. అయితే మత్స్యకారులు వసతులు పెంచాలని, ఫింగర్ జెట్టీలు కావాలని, వలలు అల్లుకోవడానికి భవనం నిర్మించాలని డిమాండ్ చేయడంతో మరో రూ.26.7 కోట్లు సమకూర్చడానికి విశాఖపట్నం పోర్టు ముందుకువచ్చింది. దీంతో పోర్టు వాటా రూ.50.96 కోట్లకు చేరింది. మత్స్యకారులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేలా హార్బర్ అభివృద్ధి జరగాలంటూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించడంతో 2023లో డీపీఆర్లో స్వల్పమార్పులు చేపట్టారు. ముందుగా ప్రతిపాదించిన 3,4,5 జెట్టీలకు బదులు జీరో జెట్టీకి సమాంతరంగా ఫ్లోటింగ్ జెట్టీని నిర్మించాలని, అదేవిధంగా చేపల వేలం, ప్యాకింగ్ ప్రాంతాల్లో కట్టడాల్ని తొలగించి.. మరో జెట్టీని ఏర్పాటు చేసేలా డీపీఆర్లో మార్పులు చేపట్టారు. దానికనుగుణంగా తాజాగా నిర్మాణ ప్రక్రియకు అడుగులు పడుతున్నాయి. హార్బర్కు రాకపోకలు సులువయ్యేలా రహదారి నిర్మాణంఇక్కడే రెండు ఫిషింగ్ జెట్టీలు రాబోతున్నాయిడిమాండ్కు అనుగుణంగా వసతుల కల్పనే హార్బర్ ఆధునికీకరణ ప్రధాన ధ్యేయంగా పనులు సాగుతున్నాయి. వేలం హాళ్లు, ప్యాకింగ్ యూనిట్, పార్కింగ్ ఏరియా, ఆఫీసుకు ప్రత్యేక సదుపాయం, రెస్ట్ రూమ్, క్యాంటీన్, చేపలు ఎండబెట్టుకోవడానికి పరిశుభ్రమైన యార్డులు, చేపలు నిల్వ చేసుకునే సదుపాయం, ఫ్లోటింగ్ జెట్టీలు, వాటికి రిటైనింగ్ గోడలు, మురుగునీటిని శుద్ధిచేసే ప్లాంటు, అంతర్గత రహదారులు, అండర్ గ్రౌండ్ రిజర్వాయర్, ఓవర్ హెడ్ ట్యాంక్, సోలార్ విద్యుద్దీపాల ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నాయి. పనులన్నింటిని ఏడు దశలుగా విడదీసి వర్క్ ఆర్డర్లు అప్పగించారు. అదనంగా మరో వేలం హాలు నిర్మించనున్నారు. కొత్త వేలం హాలును ఏసీ సదుపాయంతో ఏర్పాటు చేసేలా నిర్మాణం సాగుతోంది. బోట్ల నుంచి దించిన చేపలు, రొయ్యలను వేలం హాళ్లకు కన్వేయరు బెల్టుల ద్వారా పంపే ఏర్పాట్లూ రానున్నాయి. దించి,ఎత్తడం వల్ల సముద్ర ఉత్పత్తులు పాడైపోకుండా ఈ సదుపాయం కల్పిస్తున్నారు. పోర్టుకు చెందిన 10 ఎకరాల స్థలంలో కోల్డ్ స్టోరేజ్ రాబోతోంది. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో.. నిర్ణీత ధరలతో నిర్వహించేలా నిర్మించాలని పోర్టు అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ వద్ద ప్రైవేట్ ప్రోసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ వ్యాపారులు నిర్ణయించిన ధరలకే అమ్ముకోవాల్సి వస్తోంది. అందుకే.. ప్రత్యేకంగా ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా రాబోతోంది. బోట్లు మరమ్మతులు చేసుకునేందుకు ప్రత్యేక రిపేరింగ్ సెంటర్ కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం 24 హెక్టార్లలో ఉన్న ఫిషింగ్ హార్బర్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తు ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మోడ్రన్ హార్బర్గా త్వరలోనే మారనుందని పోర్టు అధికారులు చెబుతున్నారు. -
‘వినదగునెవ్వరు చెప్పిన..’ పుస్తకావిష్కరణ
మధురవాడ: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు రచించిన వినదగునెవ్వరు చెప్పిన పుస్తకాన్ని గాయిత్రి విద్యాపరిషత్ కార్యదర్శి ఆచార్య సోమరాజు ఆదివారం సాయంత్రం మధురవాడ గాయత్రి విద్యాపరిషత్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచన వేదికపై ఆవిష్కరించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం కోసం ఆయన 116 సంచికలుగా రచించిన పుస్తకాన్ని విజయవాడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎమెస్కో సంస్థ ముద్రించింది. ప్రథమ ప్రతిని అష్టలక్ష్మి దేవాలయం ధర్మకర్త అన్నంరాజు సత్యనారాయణ కొనుగోలు చేశారు. కంచి కామకోటి 68వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా స్వామి మొదలు మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, దేవుల పల్లి కృష్ణశాస్త్రి, రవీంధ్రనాథ్ ఠాగూరు వంటి మహామహులు చెప్పిన పిల్లలకు ఉపయోగపడే అంశాలకు వారు వ్యాఖ్యానాలు చేస్తూ రచించారు. కార్యక్రమంలో ఎమెస్కో ప్రచురణ సంస్థ అధినేత విజయ్కుమార్ పాల్గొన్నారు. -
రూ.32.61కోట్లతో రెండు జెట్టీల నిర్మాణం
ఇటీవలే ఫిషింగ్ జెట్టీల నిర్మాణానికి విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను ఆర్కేఈసీ ప్రాజెక్టు లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. రూ.32,61,42,763తో రెండు ఫిషింగ్ జెట్టీల నిర్మాణంతో పాటు వార్ఫ్ కూడా నిర్మించేలా టెండర్లు ఖరారు చేశారు. ప్రస్తుతం ఉన్న ఫింగర్ జెట్టీల మధ్యలో అంటే.. నాలుగో నంబరు జెట్టీ నుంచి 11వ నంబరు జెట్టీ వరకు వార్ఫ్ నిర్మాణం జరగనుంది. చేపల లోడింగ్, అన్లోడింగ్కు అనుగుణంగా ఈ వార్ఫ్ ఏర్పాటు కానుంది. అదేవిధంగా ప్రస్తుతం హార్బర్లో 11 ఫిషింగ్ జెట్టీలున్నాయి. 10 జెట్టీలు మత్స్యకారులు వినియోగిస్తుండగా.. చివరిదైన 11వ జెట్టీని కోస్ట్గార్డ్తో పాటు మత్స్యకారులు సంయుక్తంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ జెట్టీ పక్కన మరో రెండు నిర్మాణం కానున్నాయి. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసేలా నిబంధనలు విధిస్తూ పనుల్ని ఆర్కేఈసీ సంస్థకు అప్పగించారు. ఈ రెండూ అందుబాటులోకి వస్తే.. 11వ జెట్టీని పూర్తిగా కోస్ట్గార్డ్ వినియోగించుకుంటుంది. మత్స్యకారులు మాత్రం 12 జెట్టీలను వాడుకునే అవకాశం లభిస్తుంది. ఫిషింగ్ హార్బర్ -
‘గ్రాండ్’తో గందరగోళం..!
● నేటి నుంచి టెన్త్ విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్లు ● ఈ నెల 17 నుంచి వార్షిక పరీక్షలు విశాఖ విద్య: పదో తరగతి వార్షిక పరీక్షలకు ముందు గ్రాండ్ టెస్ట్ల పేరుతో పాఠశాలల్లో చేస్తోన్న హడావుడి విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తోంది. సోమవారం నుంచి ఈ నెల 13 వరకు టెన్త్ విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్లు నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు షెడ్యూల్ జారీ చేశారు. ఈ నెల 17 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటీవలనే ప్రీ ఫైనల్ పరీక్షలు ముగిశాయి. అందులో విద్యార్థుల ప్రోగ్రస్పై స్కూళ్లలో ఎటువంటి సమీక్ష లేదు. ఇంతలోనే గ్రాండ్ టెస్ట్లు పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలివ్వటం విద్యార్థులను టెన్షన్కు గురిచేసినట్లేనని ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రిపరేషన్కు సమయమేదీ? సమ్మెటివ్–1, సమ్మెటివ్–2లో సాధించిన మార్కులను ప్రాతిపకదికగా తీసుకుని ఏ సబ్జెక్టులో విద్యార్థులు వెనుకబడ్డారనేది గుర్తించి, అందుకనుగుణంగా వారిని వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంది. కానీ సోమవారం నుంచి రోజుకో సబ్జెక్టు చొప్పున ఈ నెల 13 వరకు గ్రాండ్ టెస్ట్లను విద్యార్థులు రాయాల్సి ఉంది. దీంతో వెనుకబడిన సబ్జెక్టు ప్రిపరేషన్కు సమయం లేకుండా పోతుందని, ఇది విద్యార్థుల వార్షిక పరీక్షలపై ప్రభావం చూపే అవకాశం ఉందని టీచర్లు ఆక్షేపిస్తున్నారు. టెన్షన్లో విద్యార్థులు వార్షిక పరీక్షల మాదిరే, ప్రశ్నా పత్రాలను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఏ రోజుకారోజు వాటిని విద్యార్థులకు అందించి, గ్రాండ్ టెస్ట్లను నిర్వహించాలని అధికారులు సూచించారు. ఇందుకోసం మండల స్థాయిలో త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్లో భాగంగా ఈ నెల 13న సోషల్ స్టడీస్ పరీక్ష రాయాల్సి ఉంది. దానికి హాజరైన విద్యార్థి మూడు రోజుల వ్యవధిలో(17న) వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలి. వార్షిక పరీక్షల ముందు టెన్త్ విద్యార్థులను టెన్షన్కు గురిచేసేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
1/70 చట్టంపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలి
పాడేరు రూరల్: అసెంబ్లీ సమావేశాల్లో 1/70 చట్టంపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక డిమాండ్చేసింది. జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్టు అఖిల పక్షం నాయకులు పొద్దు బాలదేవ్,రాధాకృష్ణ విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని గతంలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 48 గంటల బంద్ నిర్వహించడంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. 1/70 చట్టాన్ని సవరించే ఆలోచన లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ సమయంలో ప్రకటించారని, అయితే అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్చేశారు. గిరిజనుల హక్కులు, చట్టాలను కాలరాస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఆదివాసీ గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో గిరిజన ప్రాంత ఖనిజ సంపద, అడవులను అంబానీ,అదానీలకు కట్టబెట్టే ఆలోచన విరమించుకోవాలన్నారు. ఆదివాసీల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని, గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు వంద శాతం ఆదివాసీలకు కల్పించాలని డిమాండ్చేశారు. ఎస్టీ ప్లాన్కు రూ.17 వేల కోట్లు కేటయించాలన్నారు. గిరిజన సలహామండలిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 6,7 తేదీల్లో పాడేరు ఐటీడీఏ వద్ద నిర్వహించే రిలే నిరాహార దీక్షలో ఆదివాసీ ఉద్యోగ,విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, మలమ్మ, అరుణ, శీలత,చిన్నారావు,రాజు,చంటిబాబు, లక్షమణ్రావు,సీత, చిన్నమి, అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నాయకుల డిమాండ్ -
నాణ్యమైన పరిశోధనలతోనే విశ్వవిద్యాలయానికి గుర్తింపు
విశాఖ విద్య: విశ్వవిద్యాలయంలో జరిగే పరిశోధనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వర్సిటీకి ఎనలేని గుర్తింపును తీసుకొస్తాయని ఆంధ్రా యూనివర్సిటీ నూతన వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. నాణ్యమైన పరిశోధనలతో విశ్వవిద్యాలయానికి మంచి పేరుప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తును, అవకాశాలను నిర్ణయించేది పరిశోధనలేనని, వాటి కోసం పూర్తి సమయాన్ని, మేధస్సును వినియోగించాలని సూచించారు. ఏయూ వీసీకి అభినందనలు వీసీ రాజశేఖర్ను పూర్వ విద్యార్థుల సంఘం అభినందించింది. ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కె.వి.వి.రావు, వైస్ చైర్మన్ డాక్టర్ కె.కుమార్ రాజా, జనరల్ సెక్రెటరీ ఆకుల చంద్రశేఖర్, ఈసీ మెంబర్ డాక్టర్ ఎస్.కె.ఇ.అప్పారావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి వీసీకి అభినందనలు తెలిపారు. గాయత్రీ విద్యా సంస్థల కార్యదర్శి ఆచార్య పి.సోమరాజు ఏయూ వీసీని కలిసి అభినందించారు. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధుల బృందం వీసీ రాజశేఖర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలువురు విశ్రాంత ఆచార్యులు ఆయనను అభినందించారు. -
38 మంది బైక్ రేసర్ల అరెస్ట్
● 38 బైక్లు సీజ్ చేసిన పోలీసులు బీచ్రోడ్డు: నగరంలో అర్ధరాత్రి బైక్ రేసులు నిర్వహించిన యువకులను పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా అర్ధరాత్రి బైక్ రేసింగ్లతో పాదచారుల్ని, వాహనదారుల్ని ఇబ్బంది పెడుతుండటంపై స్థానికులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టి, 38 మంది బైక్ రేసర్లను అదుపులోకి తీసుకున్నట్లు ట్రాఫిక్ విభాగం ఏడీసీపీ ప్రవీణ్కుమార్ తెలిపారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బీచ్రోడ్తో సహా, నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి రేసింగ్ల పేరిట, ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ పాదచారులు, వాహనదారుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. జోన్–1 ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవరావు పర్యవేక్షణలో త్రీటౌన్, ద్వారక, నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, 38 మంది బైక్ రేసర్లను అరెస్ట్ చేసి, 38 బైక్లను సీజ్ చేశామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. -
పట్టం ఎవరికి..!
మొత్తం బ్యాలెట్ బాక్సులు 123 లెక్కింపు ప్రారంభంఉదయం 8 గంటలకు నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ● ప్రథమ ప్రాధాన్యత ఓటుపైనేఅందరి ఆశలు ● గెలుపుపై ధీమాతో అభ్యర్థులు ● మొదటి ప్రాధాన్యత ఓటుతో తేలితే ఫలితం సాయంత్రం 5 గంటల్లోపే.. ● లేదంటే రాత్రి 9 గంటలు దాటే అవకాశం ● ఉత్కంఠలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు మొత్తం టేబుల్స్ 20 బరిలో ఉన్న అభ్యర్థులు 10 మంది మొత్తం ఓట్లు 22,493 సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు.. ఎన్నికల పరీక్షల్లో ‘ఫస్ట్’ మార్కు ఎవరికి ఇచ్చారో.. మరికొద్ది గంటల్లోనే తేలనుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ సిద్ధమైంది. 10 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఉపాధ్యాయులు గత నెల 27 బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. బాగా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలితే.. సాయంత్రం 5 గంటలకల్లా విజేతను ప్రకటించే అవకాశం ఉంది. లేదంటే.. రాత్రి 9 లేదా 10 గంటలకు ఫలితం డిక్లేర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ట్రిపుల్ఈ విభాగం భవనంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 3 దశల్లో ఈ ప్రక్రియ జరగనుంది. ఎన్నికల బరిలో ఉన్న 10 మంది అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సీల్స్ తొలగించి.. బ్యాలెట్ బాక్సుల్ని హాల్లోకి తీసుకొస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి మొత్తం 123 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. లెక్కింపు కోసం 20 బల్లలు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 22,493 మంది ఓటర్లున్నారు. వీరిలో 20,795 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడు దశల్లో ప్రక్రియ సాగుతుందిలా. సార్వత్రిక ఎన్నికల కంటే భిన్నంగా లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. మొత్తం మూడు దశల్లో జరగనుంది. మొదటి దశలో 123 బాక్సుల్లో ఉన్న ఓట్లను బయటికి తీస్తారు. మొత్తం ఆరు రౌండ్లుగా విభజించి ఓట్లను బయటికి తీసేనాటికి 11 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తర్వాత దశలో పోలైన ఓట్లను 25 చొప్పున ఒక కట్టగా కడతారు. ఇలా కట్టల్లో వెయ్యి ఓట్లు అయితే వాటిని ఒక డ్రమ్లో వేస్తారు. మొత్తం ఓట్లను వివిధ డ్రమ్ముల్లో వెయ్యి చొప్పున వేస్తారు. ఈప్రక్రియ ముగిసే నాటికి మధ్యాహ్నం 2 గంటలయ్యే సూచనలున్నాయి. భోజన విరామం తర్వాత చివరి దశలో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తొలిగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో విజేత ఎవరో తేలితే ప్రక్రియ ముగిసినట్లే. తొలి ప్రాధాన్యత ఓటుతో విజేత తేలితే.. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితం ప్రకటిస్తారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు వెళ్తే మాత్రం 9 గంటలు దాటే అవకాశం ఉంది. పోలైన ఓట్లు 20,795 సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తే విజేతే.. పోలైన ఓట్లలో చెల్లుబాటు అయిన ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటారు. అలా ఆ ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు మొత్తం పోలైన ఓట్లు 20,795 ఓట్లు కాగా.. చెల్లని ఓట్లు 795 ఉంటే.. 20,000 ఓట్లను చెల్లుబాటు ఓట్లుగా పరిగణిస్తారు. చెల్లుబాటు ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా వారిని విజేతగా ప్రకటిస్తారు. అంటే.. 20 వేల ఓట్లలో 10,001 ఓట్లు తొలి ప్రాధాన్యం ఎవరికి వస్తే.. వారినే విజేతగా నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి ఈ మార్క్ను చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. గెలుపు కోటాకు సరిపడినన్ని ఓట్లు ఎవరికై తే వస్తాయో అప్పటి వరకు మిగతా ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ విధంగా మొదటి ప్రాధాన్యత తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే పోటీ చేసిన అభ్యర్థుల్లో అందరికన్నా మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థి నుంచి ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు సాధించిన మొదటి ప్రాధాన్యత ఓట్ల జాబితాను ఎక్కువ నుంచి తక్కువకు తయారు చేస్తారు. ఇలా చివరి అభ్యర్థికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి వేశారనే ఓట్లను లెక్కించి ఆ ఓట్లను ఆయా అభ్యర్థులకు జమ చేస్తూ వస్తారు. ఇలా కింద నుంచి పై వరకు ఇదే తరహాలో లెక్కించి, ఈ ఓట్లను వారికి కలుపుతూ చివరి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వెళతారు. ఒకవేళ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ మెజార్టీ ఓట్ల మార్కుకు ఏ అభ్యర్థి చేరకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను గణించి ఆ అభ్యర్థులకు జమ చేస్తారు. అప్పటికీ కాకపోతే నాలుగో ప్రాధాన్యం ఇలా మెజారిటీ మార్కు సంఖ్యను ఏదో ఒక అభ్యర్థి చేరేవరకు ఎలిమినేషన్ ప్రక్రియ అనేది సాగుతుంది. అందుకే అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మొదటి ప్రాధాన్యంతో పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లు కూడా చాలా కీలకం అవుతాయి. గెలుపుపై ధీమా.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉపాధ్యాయుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మొత్తం 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. పోటీ మాత్రం ముగ్గురి మధ్యనే కొనసాగుతోంది. ఉపాధ్యాయులే ప్రధాన బలంగా.. పీ ఆర్టీయూ తరఫున గాదె శ్రీనివాసులునాయుడు విజయం సాధిస్తారనే ధీమా అందరిలో ఉంది. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన గాదె విజయం ఖాయమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే అధికార పార్టీలైన టీడీపీ, జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ విజయం కోసం ఆ రెండు పార్టీలూ పోలింగ్ రోజు వరకూ ప్రలోభాలకే ప్రథమ ప్రాధాన్యమిచ్చాయి. రఘువర్మ గెలుస్తారని కూటమి నేతలు భావిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలో దిగిన కోరెడ్ల విజయగౌరీ కూడా గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఉత్తరాంధ్ర టీచర్లు ఎవరికి పట్టం కట్టారన్నది సోమవారం సాయంత్రం లేదా రాత్రికి తేలిపోనుంది. -
ప్రశాంతంగా ఏకలవ్య ప్రవేశ పరీక్ష
పాడేరు : జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల్లో ఆరవ తరగతిలో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్ష కోసం పాడేరు డివిజన్లోని చింతపల్లి మండలంలో మూడు, జీకే వీధి మండలంలో ఒకటి, పాడేరు మండలంలో నాలుగు, అరకులోయ మండలంలో నాలుగు పరీక్ష కేంద్రాలు సహా మొత్తం 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం 4,194 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,939 మంది హాజరయ్యారు. 256 మంది గైర్హాజయ్యారు. పాడేరు డివిజన్లో 93.89 శాతం హాజరు నమోదైంది. రంపచోడవరం, చింతూరు డివిజన్లలో : రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,942 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,803 మంది పరీక్షకు హాజరయ్యారు. 139 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. శివరాత్రి ప్రత్యేక బస్సుల ద్వారా రూ. 2 కోట్ల ఆదాయం మధురవాడ(విశాఖ): మహాశివరాత్రి సందర్భంగా విశాఖ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపడం ద్వారా రూ.2 కోట్లు ఆదాయాన్ని ఆర్జించిందని జోన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.విజయ్కుమార్, రీజినల్ మేనేజర్ అప్పలనాయుడులు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే రూ.20 లక్షలు అధికంగా ఆదాయం సమకూరిందన్నారు. ఆదివారం మధురవాడ డిపోలో అన్ని విభాగాలను వీరు తనిఖీ చేశారు. నిర్వహణ, పరిశుభ్రత లోపాలు గుర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, బస్సులు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 5, 6 తేదీల్లో గీతం యూనివర్సిటీలో నిర్వహించే జాబ్మేళాకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్ రాజేశ్వరి, ట్రాఫిక్ సూపర్వైజర్ దుర్యోధనుడు పాల్గొన్నారు. -
3, 4 తేదీల్లో గంగమ్మతల్లి పండగ
ముంచంగిపుట్టు: మండలంలోని పాత, కొత్త సుజనకోట గ్రామాల్లో గంగమ్మ తల్లి పండగ ఈ నెల 3,4 తేదీల్లో జరగనుంది. ఈ మేరకు శనివారం ముంచంగిపుట్టు వారపు సంతలో బుడియాలు ప్రచారం చేశారు. ఈ పండగ సందర్భంగా మండలంలో అధిక సంఖ్యలో గిరిజనులు బుడియా మాల ధరించి కర్రలు పట్టుకొని విన్యాసాలు చేస్తూ పాటలు పడుతూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సుజనకోట సర్పంచ్ వి.రమేష్, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, ఉత్సవ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నేతలు శంకర్రావు, నీలకంఠం, బలరాం, తిరుపతిరావు, రుక్మంధర్, గాసిరావు, దామోదరం, సదానందం, రామమూర్తి, నానిబాబు, రాధాకృష్ణ, ధర్మారావు పాల్గొన్నారు. గంగమ్మతల్లీ పాకెట్ క్యాలెండర్ ఆవిష్కరణ పాత సుజనకోట గ్రామంలోని గంగమ్మతల్లీ పండగను పురస్కరించుకుని అమ్మవారి పేరిట పాకెట్ క్యాలెండర్ను శనివారం సుజనకోట సర్పంచ్ వి.రమేష్ ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన వైజాగ్ హిందుస్థాన్ షిప్యార్డు ఉద్యోగి, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సమరెడ్డి బాలగంగాధర్ తిలక్ ప్రతి ఏడాది అమ్మవారి పేరిట పాకెట్ క్యాలెండర్ను ముద్రించి పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా క్యాలెండర్ల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. -
పనసపల్లిలోమూగ జీవాల మృత్యువాత
పాడేరు : గబ్బంగి పంచాయతీ పనసపల్లి గ్రామంలో మూగజీవాలు అనారోగ్యం బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో సుమారు ఎనిమిది దుక్కిటెద్దులు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గొల్లోరి కృష్ణబాబుకు చెందిన ఒక దుక్కిటెద్దు, అల్లూరి చిట్టిబాబాబుకు చెందిన ఒక దుక్కిటెద్దు, చిన్నారావుకు చెందిన మూడు దుక్కిటెద్దులు, పాంగి మత్య్సరాజుకు చెందిన ఒక దుక్కిటెద్దు, గొల్లోరి లక్ష్మయ్యకు చెందిన ఒక దుక్కిటెద్దు ముక్కు, నోటి నుంచి రక్తం కారుతూ నురగలు కక్కుతూ మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు నష్ట పరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు. గ్రామంలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేసి, పశువులకు వైద్య పరీక్షలు చేయాలని కోరారు. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
సాక్షి,పాడేరు: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు జిల్లాలో శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8గంటల నుంచే విద్యార్థులు పాడేరుతో పాటు జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలకు తరలివచ్చారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపింది. పాడేరులోని ఏపీఆర్ కళాశాల,కేజీబీవీ విద్యార్థినులను బస్సుల్లో పరీక్ష కేంద్రాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల పరిధిలోని 26 కేంద్రాల్లో తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తొలిరోజు పరీక్షకు 1,301మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 1,093మంది హాజరుకాగా, 208 మంది గైర్హాజరయ్యారు.ఇంటర్ జనరల్కు సంబంధించి 6,350 మందికి గాను 5,892 మంది హాజరుకాగా, 458 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,తలారిసింగి ఏపీఆర్ సెంటర్లోను పరీక్షలు సజావుగా జరిగాయి.అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వీఆర్వోలు, మహిళా పోలీసులు విధుల్లో ఉన్నారు. సెల్ఫోన్లు,ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని పరీక్ష కేంద్రాల్లోకి తీసుకువెళ్లకుండా ప్రవేశ ద్వారాల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. సీసీ కెమెరాల నిఘా మధ్య ఇంటర్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది.అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బెంచీలు,విద్యుత్,తాగునీటి సౌకర్యాలు కల్పించారు. వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. 26 కేంద్రాల్లో పరీక్షలు ఒకేషనల్కు 208 మంది, జనరల్కు 458 మంది గైర్హాజరు 20 నిమిషాలు ఆలస్యంగా .. ముంచంగిపుట్టు: స్థానిక ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రంలో నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.శనివారం ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభం కావలసి ఉండగా 20 నిమిషాలు ఆలస్యంగా పేపర్ను విద్యార్థులకు అందజేశారు. పాడేరు డీఎస్పీ షాబాజ్ అహ్మద్ మధ్యాహ్నం 12.05 గంటలకు పరీక్ష కేంద్రం వైపు వెళ్లగా అప్పటికీ విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉన్నారు. సమయం దాటిపోయినా ఎలా అనుమతించారని ఆయన నిర్వాహకులను ప్రశ్నించారు.దీంతో 12.10 గంటలకు నిర్వాహకులు విద్యార్థుల నుంచి పేపర్లు తీసుకున్నారు. నిర్వాహకుల తీరుపై డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.సమయం ప్రకారం పరీక్షలు నిర్వహించాలని,విద్యార్థులను ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు.పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులతో మాట్లాడి,నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట జి.మాడుగుల సీఐ శ్రీనివాసు ఉన్నారు. ఈ కేంద్రంలో 281 మంది విద్యార్థులకు గాను 14 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు.267 మంది పరీక్షలు రాసారు. -
ఏయూపై చిన్నచూపు..!
● బడ్జెట్ కేటాయింపుల్లో అంకెల గారడీ ● వందేళ్ల ఉత్సవాలకు నిధులు ఊసేలేదు ● భారంగా మారనున్న వేతనాల చెల్లింపులు ● గత బకాయిలపై స్పష్టత కరువు విశాఖ విద్య : ఆంధ్ర యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయింపులు అంతా అంకెల గారడీలా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది లెక్కను ప్రాతిపదికగా.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.389.34 కోట్లు నిధులు కేటాయించారు. అయితే ఏప్రిల్లో ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మకమైన వందేళ్ల పండగను ఏడాదంతా జరుపుకునేలా వర్సిటీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా బడ్జెట్ కేటాయింపులు ఏ మూలకు సరిపోతాయని ఇక్కడి ఆచార్యులు ప్రశ్నిస్తున్నారు. ఏయూ విషయంలో కూటమి ప్రభుత్వం పైకి చెప్పేది ఒకటైతే, ఆచరణలో మరోలా ఉందని విద్యావేత్తలు బాహాటంగానే అంటున్నారు. నాన్ టీచింగ్కు టైం స్కేల్ ఇంకెప్పుడో.. వర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇస్తామని కూటమి నేతలు అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపులు ఇందుకు అనుగుణంగా లేకపోవడంతో.. ఇప్పట్లో ఆ హామీ అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ఏయూలో 1000 మంది వరకు నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా తమకు టైం స్కేల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకతప్పని పరిస్థితి. వేతనాలకు తప్పని ఎదురుచూపులు వర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కలిపి 2,010 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.16 కోట్లు జీతాల రూపేణా చెల్లిస్తున్నారు. పెన్షనర్స్ 3,500 మంది వరకు ఉన్నారు. వీరికి నెలకు రూ.17.5 కోట్లు అవసరం ఉంటుంది. యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ చేసిన వారికి రూ.43 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం సవ్యంగా నిధులు మంజూరు చేయకపోవడంతో.. వర్సిటీ సొంత నిధులతో వీరందరికీ అడ్వాన్స్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై వర్సిటీ ఆచార్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే సామాజిక మాధ్యమాల వేదికగా వర్సిటీ పాలనాధికారులపై బాణాలు రువ్వుతున్నారు. బకాయిల ఊసేది ఆచార్యులు, నాన్టీచింగ్ సిబ్బంది, పెన్షనర్స్కు అడ్వాన్స్ల రూపేణా చెల్లించిన రూ.68 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. దీనిని బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. జనవరి నెల వేతనాలు నేటికీ అందకపోగా, ఫిబ్రవరి వేతనాలు ఇంకెప్పుడు ఇస్తారో అని వర్సిటీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రూ.68 కోట్లు వస్తే గానీ వేతనాలు చెల్లించలేమని వర్సిటీ అధికారులు చెబుతుండడంపై ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘ఎయిడెడ్’ భారం ఏయూదే..? ఆంధ్ర యూనివర్సిటీలో 60 మంది వరకు ఎయిడెడ్ కాలేజీల నుంచి వచ్చిన వారు పనిచేస్తున్నారు. వీరికి నెలకు సుమారుగా రూ.1.2 కోట్లు వేతనాల రూపేణా ఏయూ చెల్లిస్తోంది. వీరందరికీ ప్రమోషన్లకు సంబంధించిన ప్రోత్సాహకాలను యూనివర్సిటీనే చెల్లించాలని తాజాగా ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇది వర్సిటీకి మరింత భారం కానుంది. వందేళ్ల ఉత్సవాలు ఎలా..? వర్సిటీ వందేళ్ల ఉత్సవాలకు బడ్జెట్లో అదనపు కేటాయింపులు ఉంటాయని అంతా భావించారు. కానీ కూటమి ప్రభుత్వం అటువంటి ఆలోచన చేయకపోవడంతో వందేళ్ల ఉత్సవాలకు నిధులు ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గత మూడేళ్లలో కేటాయింపులు సంవత్సరం రూ. కోట్లలో 2022-23 424.29 2023-24 402.40 2024-25 389.34 2025 - 26 389.34(ఏడాది పొడవునా వందేళ్ల ఉత్సవాలు నిధులు లేవు ప్రభుత్వం నుంచి రూ.68 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది) -
ఉష్ణగుండాలలో ఉత్కృష్ట యాగం
ఎటపాక: రాష్ట్ర సరిహద్దుల్లో అధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. లోకకల్యాణం కోసం ఉష్ణగుండాల గ్రామ సమీపంలో మిథిలానగరం, శ్రీఅష్టలక్ష్మి ఆశ్రమంలో 23వ అష్టలక్ష్మి యాగం నిర్వహించనున్నారు. శ్రీఅష్టలక్ష్మి పీఠం నేతృత్వంలో పీతాంబరం రఘునాథచార్యులు స్వామీజి పర్యవేక్షణలో ఈయాగాన్ని ఈనెల 12 నుంచి 23 వరకు జరపనున్నారు. కొండిశెట్టి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు పీఠానికి సమర్పించిన రెండు ఎకరాల స్థలంలో ఈయాగం నిర్వహించనున్నారు. ఇప్పటికి 22 చోట్ల శ్రీఅష్టలక్ష్మి యాగాన్ని వైభవంగా జరిపించారు. 23వ యాగాన్ని భద్రాద్రి పుణ్యక్షేత్రంలో జరపాలని నిర్ణయించారు. నేడు భూమి పూజ 30వ నంబరు జాతీయ రహదారి గుండాల గ్రామ సమీపంలోనే ఈయాగ స్థలం ఉంది. శ్రీఅష్టలక్ష్మి వైభవ దీపిక యాగ కమిటీ ఆధ్వర్యంలో యాగం చేయనున్న స్థలాన్ని ఇప్పటికే శుభ్రం చేశారు. ఈనెల 2న 108 మంది దంపతులతో ప్రత్యేక పూజలు నిర్వహించి నాగలితో నేలను కదిలించి భూమి పూజ చేయనున్నారు. నిత్యకార్యక్రమాలు ప్రతి రోజు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ,సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెరుమాళ్ ఆరాధన,అభిషేకం,అర్చనలు, భోగ నివేదన, మంగళాశాసనం,తీర్థప్రసాదగోష్టి, హోమాలు,భజనలు,కీర్తనలు,కోలాటాలు,పారాయణాలు,పెద్దల ప్రవచనాలు, గద్యలు,పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఉంటాయి. విశేష కార్యక్రమాలు 12వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు శ్రీఅష్టలక్ష్మి అమ్మవార్ల శోభాయాత్ర,13వ తేదీ సాయంత్రం 6.45గంటలకు అంకురార్పణ మహోత్సవం,14వ తేదీ ఉదయం 10 గంటలకు అగ్ని ప్రతిష్ట,ఉభయ వేదాంత పండిత సభలు, 15వ తేదీ ఉదయం 10.30గంటలకు పండితుల ప్రవచనాలు,16వ తేదీ రాత్రి 7.15 గంటలకు 108 జంటలతో సామూహిక శ్రీలక్ష్మీనారాయణ పూజ, 17వ తేదీ ఉదయం 10.11 గంటలకు విద్యార్థినీవిద్యార్థులకు హయగ్రీవ మంత్రోపదేశం, 18వ తేదీ మధ్యాహ్నం ఆంజనేయస్వామికి లక్ష తమలపాకులతో అర్చన,19వ తేదీ మధ్యాహ్నం శ్రీఅష్టలక్ష్మి సమేత శ్రీలక్ష్మీనారాయణ పెరుమాళ్కి 108 కలశాలతో అభిషేకం,20వ తేదీ ఉదయం 11.15 గంటలకు మంత్ర దీక్ష, సాయంత్రం 5.15గంటలకు లక్ష కుంకుమార్చన,21వ తేదీ మధ్యాహ్నం 1.15 గంటలకు కొట్నాల ఉత్సవం, రాత్రి 7.15గంటల దీపోత్సవం,22 వతేదీ మధ్యాహ్నం 1.18 గంటలకు మహాపూర్ణాహుతి,రాత్రి 7.18గంటలకు శ్రీలక్ష్మీనారాయణ కల్యాణం,రుత్వికులకు సన్మానం, 23వ తేదీ ఉదయం 9.35గంటలకు మహాకుంభ ప్రోక్షణ నిర్వహించనున్నారు. నేడు అష్టలక్ష్మి యాగానికి భూమి పూజ 12 నుంచి ఉష్ణగుండాలలో యాగం -
పశువులకు వ్యాధి నిరోధిక టీకాలు తప్పనిసరి
గంగవరం: పశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయాలని పశుసంవర్థక శాఖ రంపచోడవరం ఉప సంచాలకుడు షేక్ అహ్మద్ షరీఫ్ సూచించారు. గంగవరం మండలంలో గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ నెల 31 వరకూ టీకాల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పశు వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. కుసుమరాయి గ్రామంలో గోశాల షెడ్లను పరిశీలించారు. పాడి రైతులు పశుసంవర్థక శాఖ అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకోవాలన్నారు. నెల్లిపూడి గ్రామీణ పశువైద్యశాల జూనియర్ వెటర్నరీ అధికారి అప్పన్నబాబు, తదితరులు పాల్గొన్నారు. -
సంతలో గుట్కాలు, ప్లాస్టిక్ కవర్ల స్వాధీనం
ముంచంగిపుట్టు: మండల కేంద్రం ముంచంగిపుట్టులో శనివారం వారపు సంతలో నిషేధిత గుట్కాలు, ప్లాస్టిక్ కవర్లను ఒడిశా వ్యాపారుల నుంచి జిల్లా విజిలెన్స్ మెంబర్ ప్రసన్నకుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ స్వాధీనం చేసుకున్నారు. వారపు సంతలో గుట్కాలు, ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్నారని సమాచారం రావడంతో సంతలో తనిఖీలు నిర్వహించారు. మళ్లీ గుట్కాలు, ప్లాస్టిక్ కవర్లు అమ్మినట్టు తెలిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి, విడిచిపెట్టారు. స్వాధీనం చేసుకున్న గుట్కాలు, ప్లాస్టిక్ కవర్లను పంచాయితీ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబరు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ నిషేధిత గుట్కాలు, ప్లాస్టిక్ కవర్లు ఒడిశా నుంచి ఆంధ్రలోని వారపు సంతలకు తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారని చెప్పారు. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
లక్ష్య సాధనకుకఠోర శ్రమ అవసరం
● ఎస్పీ అమిత్ బర్దర్ పాడేరు : నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు కఠోర శ్రమ అవసరమని, చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో చదితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. మండలంలోని గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన సందర్శించి, టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ అభిరుచులను బట్టి లక్ష్యాలను నిర్దేశించుకుని, ఇష్టంతో కష్టపడి చదవాలన్నారు. ఉన్నత ఉద్యోగాల్లో, ఉన్నత రంగాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు, గిరిజన ప్రాంతానికి మంచిపేరు తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వాలు అందజేస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈనెల 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నందున విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ధీరజ్, పాడేరు సీఐ దీనబంధు తదితరులు పాల్గొన్నారు. -
మన్యం కొండ జాతరకు ఏర్పాట్లు పూర్తి
మోతుగూడెం: చింతూరు మండలం పొల్లూరలో ఈ నెల 3న జరిగే మన్యం కొండ జాతరకు ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. వనదేవతలను దాటించేందు సీలేరు నదిపై ఫ్లోటింగ్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ జాతరకు 40వేల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీలేరు నదిపై, వనదేవతలకు స్నానం చేయించే పొల్లూరు వాటర్ ఫాల్స్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి ఐటీడీఏ పీవో దుర్యోధన బోయ్ , మల్కన్గిరి,కలిమెల తహసీల్దార్లు మన రాష్ట్రంలో శనివారం పర్యటించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆంధ్రా నుంచి స్థానిక ఎస్ఐ శివన్నారాయణ, పంచాయతీ కార్యదర్శి సెక్రటరీ మోహన్, ఏపీ జెన్కో అధికారులు జాతర ఏర్పాట్లు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. -
వ్యక్తిగత విమర్శలు చేసిన కూటమి నేతలపై చర్యలెప్పుడు?
సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీ సాక్షిగా తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, తమ పార్టీ నేతలపై అత్యంత హీనంగా, బండ బూతులు మాట్లాడిన కూటమి పార్టీల నాయకులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. సినీనటుడు పోసాని కృష్ణమురళికి ఆరోగ్యం బాలేకపోయినా జైలులో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. లాసన్స్బేకాలనీలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు పోసాని అరెస్టు ద్వారా కూటమి ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర తీసిందని, తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా ఇదే ఆనవాయితీని అనుసరిస్తారనే విషయం మరిచిపోవద్దని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే జాలిపడే పరిస్థితి కలుగుతోందన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగమంతా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ను పొగడడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ‘వాస్తవ రూపంలో ఈ బడ్జెట్ అమలు కాదు.. ఇదంతా అంకెల గారడీ బడ్జెట్ మాత్రమే.. సంపద సృష్టి లేదు. రూ.80వేల కోట్లను ఎలా పూడ్చుతారు.. అంటే జనం మీద బాదేస్తారా..? ఈ బడ్జెట్ కేవలం ఎల్లో మీడియాలో రాసుకోవడానికే పరిమితం’అని కన్నబాబు అన్నారు. ఒకరేమో బాహుబలి బడ్జెట్ అని, మరొకరు పేదల బడ్జెట్ అని డబ్బా కొట్టడానికే సరిపోయిందన్నారు. తమ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పు చేసి కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల కోసం అప్పు చేస్తే రాష్ట్రాన్ని శ్రీలంకలా చేస్తున్నారని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రచారం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కాలంలో రూ.1.20 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారంటే.. పాత బకాయిలు చెల్లించామని చెబుతున్నారు. మరి 2014–19లో చేసిన బకాయిలను తమ ప్రభుత్వంలో చెల్లించలేదా..? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలు ఊసేలేదని.. రెండు పథకాలకు కూడా అరకొర నిధులే కేటాయించారని దుయ్యబట్టారు. పేదలకు వైద్యం అందించే ఆరోగ్యశ్రీ ఎత్తేస్తున్నారని ఈ బడ్జెట్ను చూస్తే స్పష్టంగా కనిపిస్తోందని కన్నబాబు అన్నారు. పార్టీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. పోసాని అరెస్ట్తో కొత్త సంస్కృతికి తెరతీశారు అంకెల గారడీతో రాష్ట్ర బడ్జెట్ ఎల్లో మీడియాలో రాతలకే ఈ బడ్జెట్ పరిమితం చంద్రబాబు రూ.1.20 లక్షలు అప్పు చేస్తే గొప్పగా రాతలా? వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కన్నబాబు ఫైర్ -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
రంపచోడవరం: వైఎస్సార్సీపీ రంపచోడవరం నియోజవకర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. రంపచోడవరం నియోజకవర్గం యూత్ వింగ్ అధ్యక్షుడిగా కొమలి రాజేంద్రప్రసాద్, మహిళ విభాగం అధ్యక్షురాలిగా దామెర్ల రేవతి(ఎటపాక మండలం), క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పీటర్ సింగయ్య (ఎటపాక మండలం), వైఎస్సార్ ట్రెడ్ యూనియన్ అధ్యక్షుడిగా మర్మం శంకర్(ఎటపాక మండలం)ను నియమించారు. మైనార్టీసెల్ అధ్యక్షుడిగా షేక్ కాజావల్లీ(అడ్డతీగల మండలం), బూత్ కమిటీ వింగ్ అధ్యక్షుడు తోట రాజేశ్వరరావు(అడ్డతీగల మండలం)ను నియమించారు. రాజవొమ్మంగి మండలానికి చెందిన కనిగిరి దుర్గప్రసాద్ను పంచాయతీ రాజ్ వింగ్ అధ్యక్షుడిగా, వీఆర్ పురం మండలానికి చెందిన ముత్యాల గౌతమ్ ప్రభాకర్ను ఐటీ వింగ్ అధ్యక్షుడిగా, గంగవరం మండలానికి చెందిన తాతపూడి ప్రకాష్ను ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా, సీహెచ్ దుర్గారాఘునాఽఽథ్ను సోషల్ మీడియా వింగ్ అధ్యక్షుడిగా నియమించారు. రంపచోడవరం మండలానికి చెందిన అన్నపరెడ్డి రవిరామ్ భగవాన్ను లీగల్ సెల్ అధ్యక్షుడిగా, పండా రామకృష్ణను ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా నియమించారు.యూత్ వింగ్ అధ్యక్షుడిగా కొమలి రాజేంద్రప్రసాద్, రైతు విభాగం అధ్యక్షుడిగా నోముల కొండలరావు, బీసీ సెల్ అధ్యక్షుడిగా బొడ్డేటి గంగరాజు, స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడిగా అడపా నాగసాయి,ఆర్టీసీ వింగ్కు గొర్లె అనిల్ ప్రసాద్, వలంటీర్ల వింగ్కు రొలుపల్లి ఆనంద్బాబు,గ్రీవెన్స్ సెల్కు ముత్యాల మురళీ, వాణిజ్య విభాగానికి కొత్త రమేష్, అంగన్వాడీ వింగ్కు కంచం సత్యవతి, పబ్లిసిటీ వింగ్కు కొమలి సీతారామప్రసాద్లను నియమించారు. -
బడ్జెట్లో పేదలకు అన్యాయం
సాక్షి,పాడేరు: ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో పేదలకు అన్యాయం చేసిందని వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ రూపకల్పనలో కనీసం సూపర్సిక్స్ హామీలను కూడా కూట మి ప్రభుత్వం న్యాయం చేయకపోవడం దారుణమని చెప్పారు.రాష్ట్రంలో అమ్మకు వందనం పొందేందుకు 97లక్షల మంది విద్యార్థులు అర్హులని, రూ.12,630కోట్లు అవసరం కాగా,బడ్జెట్లో కేవలం 8,278 కోట్లు కేటాయింపులు జరపడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రతి కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా రూ.15వేల చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించిన కూటమి నేతలు ఇప్పుడు చాలీచాలని నిధులు కేటాయించి కొంతమందికే అమలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.అన్నదాత సుఖీభవకు కూడా కేటాయింపులు తక్కువుగానే ఉన్నాయన్నారు.రూ.10,700కోట్ల నిధులు అవసరం కాగా,ఈ బడ్జెట్లో 6,300కోట్లు కేటాయించడం అన్యాయమని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజన ప్రాంతాల్లో రైతులంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి,ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన హామీని కూడా కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసి తీవ్ర అన్యాయం చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.48 శాతం మాత్రమే కేటాయింపులు పాడేరు: బడ్జెట్లో ఆదివాసీలకు తీవ్రఅన్యాయం చేశా రని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దామాషా పద్ధతి ప్రకారం 5.53 శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ కేవలం 2.48 శాతం మాత్రమే కేటాయింపులు చేసి వివక్ష చూపించారని పేర్కొన్నారు. ఆదివాసీల కోసం ఎనిమిది ఐటీడీఏల ద్వారా పాలన జరుగుతోందని, కానీ కేవలం రూ.100కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. పోలవరం నిర్వాసితుల కోసం రూ.18వేల కోట్లు కేటాయించాల్సి ఉన్నప్పటికీ కేవలం రూ.1,424 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఏ విధంగా వారి సమస్యలు పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. గిరిజనాభివృద్ధి, సంక్షేమం కోసం అదనంగా రూ.10వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి -
విద్యకే తొలి ప్రాధాన్యం
● గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య చేరువ కావాలి ● వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య రాజశేఖర్విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా ఆచార్య జి.పి.రాజశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వర్సిటీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, వర్సిటీ వ్యవస్థాపక ఉప కులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వైస్ చాన్సలర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాజశేఖర్ ఏయూలో అవినీతికి స్థానం లేదని ఇతర ఆచార్యుల సమక్షంలో విజిలెన్స్ ప్రతిజ్ఞ చేశారు. పరిశోధకులకు సంబంధించిన పలు దస్త్రాలపై ఆయన తొలి సంతకాలు చేశారు. అనంతరం ఏయూ కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీన్లు ఇతర అధికారులతో అకడమిక్ సెనేట్ మందిరంలో సమావేశమయ్యారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాజశేఖర్ను రిజిస్ట్రార్ ధనుంజయరావు పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వర్సిటీ విభాగాధిపతులు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఫ్రెండ్లీ వైస్ చాన్సలర్గా ఉంటా.. ఈ సందర్భంగా ఆచార్య రాజశేఖర్ విలేకరులతో మాట్లాడారు. పారదర్శకంగా, అవినీతి రహితంగా పనిచేస్తామన్నారు. విద్యా కార్యక్రమాలకే తాను తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా ముందుకెళ్తామన్నారు. విద్యార్థులతో ఫ్రెండ్లీ వైస్ చాన్సలర్గానే ఉంటానని, వారు ఎప్పుడైనా తనను కలవవచ్చన్నారు. వందేళ్ల ఉత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది సంవత్సరంలోకి వెళుతోందని, ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. వందేళ్ల ఉత్సవాల విజయవంతానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. వర్సిటీలో ఆచార్యుల కొరత ఉందని, అదే విధంగా నిధుల లేమి కూడా ఉందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ సమస్యను అధిగమించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పెద్ద పీట ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం చేస్తామని నూతన వీసీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉన్నత విద్య దిశగా నడిపించడానికి కృషి చేస్తామన్నారు. ఇందుకు బృహత్తరమైన కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పారు. ఏయూ ఉపకులపతి.. పదవిగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటానన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. ఏయూ జాతీయస్థాయిలో అభివృద్ధి సాధించడం, పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం తమ లక్ష్యమన్నారు. విద్యార్థుల కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయాల తరహాలో లీడర్షిప్ అకాడమీ ఏర్పాటు దిశగా పని చేస్తామన్నారు. విశ్వవిద్యాలయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేయడం, ఇండస్ట్రియల్ కాంక్లేవ్లు నిర్వహిస్తామని వివరించారు. -
చెలగాటం
పోలవరం ముంపు బాధితులతో అధికారులు చెలగాటమాడుతున్నారు. సర్వం కోల్పోయి ప్రతిఏటా నానా ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపుతో ఎన్నో గ్రామాల ప్రజలు పనులు లేక బతుకుదెరువు కోసం తలోదారి పోతుంటే, జాబితాలో వారి పేర్లు తొలగించి, పొట్టకొట్టాలని చూస్తున్నారు. పోలవరం నిర్వాసితులతో ఆర్ అండ్ ఆర్ జాబితా నుంచి పేర్ల తొలగింపు కొందరికేనా పరిహారం ? ఆందోళనలో ముంపు బాధితులు వి.ఆర్.పురం: మండలంలో రాజుపేట, వడ్డుగూడెం, చిన్నమట్టపల్లి పంచాయతీల ప్రజలు పోలవరం ముంపులో నష్టపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన నిర్వాసితుల జాబితాలో బాధితులందరి పేర్లు ఉండగా, కూటమి ప్రభుత్వంలో తాజాగా రూపొందించిన జాబితాలో పలువురి పేర్లు గల్లంతయ్యాయి. కొంత మందికి మాత్రమే పరిహారం ఇచ్చేలా జాబితా తయారు చేయడంపై నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. కొలమానమేంటి ? ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే 10వ తరగతి వరకు చదువుకొన్నవారు స్థానికులు అవుతారా ? ఎక్కడి నుంచో వచ్చి స్థిరపడిన వారు స్థానికులు అవుతారా ? అనేది లెక్క తేలాల్సిందేనని, ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్ అన్న దానిపై అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, ఎలాంటి కొలమానం తీసుకొన్నారో చెప్పాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ పుట్టడం తాము చేసిన తప్పా అని ముంపు బాధితులు వాపోతున్నారు. ఒక ప్రాంతం నుంచి విడిచి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు, ఎక్కడికో వెళ్లి బతకాలి. అంటే మళ్లీ జీవితాన్ని ప్రారంభించాలి. పనులు వెతుక్కోవాలి. ఇన్ని కష్టాలు పడే నిర్వాసితులకు పరిహారం ఇవ్వడానికి ఎందుకు తిరకాసు పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర పేర్లతో జాబితా ? పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల జాబితాలో కొందరి పేర్లు గల్లంతయ్యాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అరకొరగా జాబితాను ప్రచురించడంలో మతలబు ఏంటని మథనపడుతున్నారు. గత అన్ని సర్వేల్లో అందరి పేర్లు ఉన్నప్పడు చివరి గ్రామసభలో ఆర్అండ్ఆర్ జాబితాలో పేర్లు ఎందుకు తొలగించారంటూ నిర్వాసితులు మండిపడుతున్నారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే సరైన సమాధానం రావడం లేదు. అధికారులు ఒకరిమీద మరొకరు చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.గ్రామాల వారీగాగల్లంతైన పేర్ల సంఖ్యవడ్డుగూడెం పంచాయతీలో మూడు (వడ్డుగూడెం, వి.ఆర్.పురం, ధర్మతాళ్లగూడె) గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో 1,450 కటుంబాలున్నాయి. కొత్తగా వచ్చిన జాబితా లో వడ్డుగూడెంలో 150, వి.ఆర్.పురంలో 350, ధర్మతాళ్లగూడెంలో 25 పేర్లు గల్లంతయ్యాయి. రాజుపేట పంచాయతీలో రాజుపేట, తోటపల్లి, సీతంపేటగ్రామాలున్నాయి. వీటి లో సీతంపేటలో నిర్వాసితులకు పరిహారం చెల్లించేశారు. రాజుపేట, తోటపల్లి గ్రామాలు కలిపి 728 కుటుంబాలున్నాయి. వీటిలో అప్రూవల్ అయిన కుటుంబాల 265, పెండింగ్లో ఉన్నవి 380, గతంలో జాబితాలో ఉన్న వారిలో ఇప్పుడు 108 మంది పేర్లు గల్లంతయ్యాయి. చిన్నమట్టపల్లి పంచాయతీలో ప్రత్తిపాక, గుండుగూడెం, చింతరేగిపల్లి, కన్నాయిగూడెం గ్రామాలున్నాయి. ఈ పంచాయతీలో తుష్టివారి గూడెం నిర్వాసితులకు ఇప్పటికే పరిహారం చెల్లించారు. చింతరేగిపల్లిలో 404 కుటుంబాలున్నాయి. అప్రూవల్ అయినవవి 69 కుటుంబాలు, పెండింగ్లో ఉన్నవి 335 కుటుంబాలు. 13 మంది పేర్లు గల్లంతయ్యాయి. గుండుగూడెంలో 209 కుటుంబాలున్నాయి. అప్రూవల్ అయినవి 51, పెండింగ్లో 158 కుటుంబాలున్నాయి. కన్నాయి గూడెం, ప్రత్తిపాక గ్రామాలకు లిస్టులు ప్రకటించలేదు. పరిహారం కొందరికేనా ?పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలి జాబితాల్లో తప్పులు దొర్లాయి. అందువల్ల గ్రామ సభలు వాయిదా పడ్డాయి. ఆర్ అండ్ ఆర్ జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం. – సరస్వతి, తహసీల్దార్, వి.ఆర్.పురం పోలవరం ముంపులో వందల కుటుంబాలు నష్టపోతుంటే పరిహారం కొందరికే ఇచ్చేందుకు జాబితాలు రూపొందించడంలో ఆంతర్యం ఏమి టో తెలియడంలేదు. ముంపులోఉన్న అన్ని కు టుంబాల సభ్యులు నిర్వాసితులేనన్న విషయం అధికారులకు తెలియదా? తెలిస్తే ఎందుకు జాబితాలో పేర్లు గల్లంతు చేశారో అర్థంకాక పలువు రు ఆందోళన చెందుతున్నారు. స్థానిక అధికా రుల వల్లే ఈ పొరపాటు జరిగిందా ? లేక మరేమైనా కారణాలున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఎవరి హస్తం ఉంది, ఎందుకు తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. -
నేడు ‘ఏకలవ్య’ ప్రవేశ పరీక్ష
● విశాఖతో సహా 25 ప్రాంతాల్లోపరీక్ష కేంద్రాలు సాక్షి,పాడేరు: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న బాలబాలికలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు గురుకుల విద్యాలయాల కో–ఆర్డినేటర్ పి.ఎస్.ఎన్.మూర్తి తెలిపారు.శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయని, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను 6,239 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.ప్రతి పాఠశాలలో 30 మంది బాలురు,30 మంది బాలికలకు 6వ తరగతిలో సీట్లు ఉంటాయన్నారు. ఈసీట్ల భర్తీకి గాను ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. విశాఖలోని మారికవలస బాలుర గురుకుల పాఠశాలతో పాటు చింతపల్లి, పాడేరు, కొయ్యూరు, జీకే వీధి,అరకులోయ, రంపచోడవరం,చింతూరు,రాజవొమ్మంగి,అడ్డతీగల మండలాల్లోని పలు పాఠశాలల్లో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.ఆదివారం 11.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని,ఆన్లైన్లో దరఖాస్తు చేసిన బాలిబాలికలను తల్లిదండ్రులు నిర్ణీత సమయానికి సంబంధిత పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని ఆయన కోరారు. -
ఆదివాసీలకు అన్యాయం జరిగితే సహించం
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఒడిశాలోని ఆదివాసీలకు అన్యాయం జరిగితే సహించేదిలేదని, వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. అల్లూరి జిల్లా సరిహద్దు మల్కనగిరి జిల్లా మోటులో శుక్రవారం పోలవరం నిరసన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష బీజేడీతో పాటు వామపక్ష, ఆదివాసీ సంఘాలు తమ మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో లైవ్లో పాల్గొన్న నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ పోలవరం ముంపు కారణంగా అడవిబిడ్డలైన ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని, ఆదివాసీల ఉనికిని కాపాడుకునేందుకు చేసే అన్ని పోరాటాలకు ఎల్లప్పుడూ తమ మద్దతుంటుందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో కూడా ప్రాజెక్టు నిర్మాణంపై నిరసన తెలిపామని, మోటు, కలిమెల ప్రాంతాల్లో 200 వరకు ఆదివాసీ గ్రామాలు ముంపునకు గురవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రా, తెలంగాణకు చెందిన ఆదివాసీ నాయకులతో పాటు మల్కన్గిరి జిల్లాకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు ఆదివాసీల సమస్యలను నవీన్ పట్నాయక్ దృష్టికి తీసుకెళ్లి పోలవరం ముంపు విషయంలో బీజేడీ చేపట్టే కార్యక్రమాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పద్మినిధ్యాన్, రవినారాయణ, మాజీ ఎంపీ ప్రతిమాంఝీ, ఆంధ్రాకు చెందిన ఆదివాసీ నాయకులు చందా లింగయ్య, కుర్సం సుబ్బారావు, జేకేసీటీ చైర్మన్ జమాల్ఖాన్ పాల్గొన్నారు.ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ -
త్వరితగతిన ఇంజినీరింగ్ పనులు పూర్తి చేయాలి
● రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం రంపచోడవరం: ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. ఐటీడీఏ సమావేశం హాల్లో శుక్రవారం వివిధ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీవో మాట్లాడుతూ వచ్చే వర్ష కాలం నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, గృహనిర్మాణ శాఖ ద్వారా ప్రారంభించిన పనుల ప్రగతిపై సమీక్షించారు. ఏజెన్సీలో ఏకలవ్య మోడల్ స్కూల్స్, పాఠశాల భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భవనాల నిర్మాణ కోసం ఇసుక, ఇతర సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో ఈఈలు ఐ.శ్రీనివాసరావు,రవికుమార్, సుబ్బయ్య, డీఈలు పి.వెంకటరమణ, చైతన్య,నాగరాజు, గౌతమి, శివ తదితరులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యంపై శ్రద్ధేదీ.. ?
ఉత్తరాంధ్రలో ఉన్నత విద్యారంగానికి కేంద్రం ఆంధ్ర యూనివర్సిటీ. అటువంటి కీలకమైన యూనివర్సిటీకి నిధుల కేటాయింపులో ఒక్కపైసా అదనపు కేటాయింపులు కనిపించలేదు. గత ఏడాది బడ్జెట్ తరహాలోనే ఈ ఏడాది కూడా రూ. 389.34 కోట్లను మాత్రమే కేటాయించారు. విశాఖలోని ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్కు కేవలం రూ.27.91 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ఏడాది బడ్జెట్లో రూ. 59.48 కోట్ల మేర కేటాయించగా... ప్రస్తుత బడ్జెట్లో సగానికిపైగా కేటాయింపులు తగ్గించారు. మరోవైపు పాడేరు, నర్సీపట్నం మెడికల్ కాలేజీల అభివృద్ధి ప్రస్తావన కూడా చేయకపోవడం గమనార్హం. పాడేరు మెడికల్ కాలేజీతో పాటు అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజీల గురించి కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. -
మెడికల్ కళాశాలకు పైసా విదల్చకపోవడం అన్యాయం
జిల్లా వాసులకు ఉన్నత వైద్య సేవలు అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.500 కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. సగానికి పైగా పనులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు మందగించాయి. ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పాడేరు మెడికల్ కళాశాల అభివృద్ధి కోసం, సౌకర్యాల కల్పన కోసం పైసా కూడా కేటాయించకపోవడం సరికాదు. కేవలం గిరిజనులపై ఉన్న వివక్ష కారణంగానే నిధులు కేటాయించలేదు. – కూడా సుబ్రమణ్యం, గిరిజన నేత, పాడేరు -
బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు
● జిల్లా కార్మిక శాఖ అధికారి సుజాత పాడేరు : బాల కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కార్మిక శాఖ అధికారి టి.సుజాత హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పునరావాసంలో భాగంగా శుక్రవారం పాడేరు పట్టణంలోని పలు సంస్థలు, దుకాణాలు, హోటళ్లలో జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ తనిఖీలు చేపట్టింది. ఆయా చోట్ల నిర్వాహకులతో మాట్లాడి బాల కార్మిక వ్యవస్థపై అవగాహన కల్పించారు. జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి పి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.పోలవరం గ్రామసభలు వాయిదా చింతూరు: ఈనెల ఒకటి, మూడో తేదీల్లో చింతూరు, కూనవరం, వీఆర్పురం మండలాల్లో జరగాల్సిన పోలవరం ఆర్అండ్ఆర్ గ్రామసభలను వాయిదా వేస్తున్నట్లు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అభిషేక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తదుపరి గ్రామసభల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.స్పోర్ట్స్ స్టైఫండ్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం పాడేరు : ప్రతిభ చూపిన క్రీడాకారుల నుంచి 2025–26 సంవత్సరానికి స్పోర్ట్స్ స్టైఫండ్ అవార్డు కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎ.జగన్మోహన్రావు శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రామీణ/పట్టణ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫుట్బాల్, హాకీ, క్రికెట్ క్రీడల్లో యువకులు, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్లలో ప్రతిభ కనబరిచిన యువతు లు అర్హులు. అర్హులైనవారు www.fci.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మార్చి 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
పాడేరు : జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, బెంచీలు ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాలలు, విద్యార్థుల వివరాలు జిల్లాలో గల జూనియర్ కళాశాలల్లో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 17 గిరిజన గురుకుల కళాశాలలు, 19 కేజీబీవీ కళాశాలలు, 16 ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు, ఐదు హెచ్ఎస్ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 6,518 మంది, మొదటి సంవత్సరం ఒకేషనల్ పరీక్షలకు 1,545 మంది, రెండో సంవత్సరానికి 5,335 మంది, ఒకేషనల్ పరీక్షలకు 1,322 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో పాడేరు డివిజన్లో 4,672 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 3,352 మంది రెండో సంవత్సరం విద్యార్థులు, 919 మంది మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు, 703 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లలో 1,846 మంది మొదటి సంవత్సరం జనరల్, 1,983 మంది రెండో సంవత్సరం జనరల్, 626 మంది మొదటి సంవత్సరం ఒకేషనల్, 619 మంది రెండో సంవత్సరం ఒకేషనల్ పరీక్షలకు హాజరుకానున్నారు. 621 సీసీ కెమెరాలు రంపచోడవరం, చింతూరు డివిజన్లలోని పరీక్ష కేంద్రాల్లో 251 సీసీ కెమెరాలు, పాడేరు డివిజన్లో 370 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 784 మంది సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. పరీక్ష సమయం, కేంద్రాల వివరాలు ఇంటర్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలో ప్రవేశం లేదు. జిల్లా వ్యాప్తంగా పాడేరు డివిజన్లో పది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా రంపచోడవరం, చింతూరు డివిజన్లలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాజవొమ్మంగి, అడ్డతీగల, వీఆర్ పురం పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక పరీక్ష కేంద్రాలుగా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు 784 మంది ఇన్విజిలేటర్ల నియామకం పటిష్ట పోలీస్ బందోబస్తు పరీక్ష సమయాల్లో 144వ సెక్షన్ అమలు పరీక్షల నిర్వాహణ, సమాచార సేకరణ కోసం కంట్రోల్ రూం ఏర్పాటు పకడ్బందీగా ఏర్పాట్లు ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. కట్టుదిట్టమైన భద్రత నడుమ పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. పరీక్ష కేంద్రాలకు కిలోమీటర్ దూరంలో జెరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. పరీక్షల నిర్వహణ, సమాచార సేకరణ కోసం ప్రత్యేకంగా 7382638698 నంబర్తో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశాం. – దినేష్కుమార్, కలెక్టర్ -
కాన్పు కోసం బలవంతంగా గర్భిణి తరలింపు
గూడెంకొత్తవీధి: నెలలు నిండిన గర్భిణి ఆస్పత్రికి రాను అని మొండికేయడంతో పలు శాఖల సిబ్బంది ఆమెను బలవంతంగా అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. గూడెంకొత్తవీధి మండలంలోని పందిరాయి కొత్తగూడెం(పీకే గూడెం) గ్రామానికి చెందిన గర్భిణిని కాన్పుకోసం ఆస్పత్రికి తరలించేందుకు వైద్యసిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బంది నానా హైరానా పడ్డారు. ఈఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పీకే గూడెం గ్రామానికి చెందిన గెమ్మెలికొసాయి నిండు గర్భిణి. నెలలు నిండినా ఇంటి వద్దే ఉన్నట్టు గుర్తించిన వైద్యసిబ్బంది ఈమెను పరీక్షించి ప్రసవం కోసం ఆస్పత్రికి రావాలని సూచించారు. ఆమెను గురువారం గూడెంకొత్తవీధి పీహెచ్సీకి తరలించారు. ప్రసవ తేదీ ముగియడంతోపాటు ఉమ్మనీరు పోతుండటాన్ని గుర్తించిన వైద్యులు అక్కడి నుంచి చింతపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి పంపారు. అయితే అక్కడ ఉండకుండా, వైద్యసిబ్బందికి చెప్పకుండా భర్త కుసునోతో కలసి ఆమె ఇంటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న వైద్య, అంగన్వాడీ, సచివాలయ, పోలీసు సిబ్బంది శుక్రవారం గ్రామానికి వెళ్లారు. అంతా కలసి ఆమెకు నచ్చజెప్పి ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తుండగా భర్త వీరంగం సృష్టించాడు. నా భార్యను ఎక్కడికీ పంపేది లేదని, నన్ను కాదని ఆస్పత్రికి తీసుకువెళితే ఊరుకోబోనని దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగాడు. చివరకు వైద్యసిబ్బంది, అధికారులు గర్భిణిని బలవంతంగా అంబులెన్సులో చింతపల్లి ఆస్పత్రికి తరలించారు.ఈకార్యక్రమంలో వైద్యులు వినయ్, అచ్యుత్, రెవెన్యూ, ఐసీడీఎస్ సిబ్బంది, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించిన భర్త -
త్వరితగతిన ఇంజినీరింగ్ పనులు పూర్తి చేయాలి
● రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం రంపచోడవరం: ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. ఐటీడీఏ సమావేశం హాల్లో శుక్రవారం వివిధ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీవో మాట్లాడుతూ వచ్చే వర్ష కాలం నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, గృహనిర్మాణ శాఖ ద్వారా ప్రారంభించిన పనుల ప్రగతిపై సమీక్షించారు. ఏజెన్సీలో ఏకలవ్య మోడల్ స్కూల్స్, పాఠశాల భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భవనాల నిర్మాణ కోసం ఇసుక, ఇతర సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో ఈఈలు ఐ.శ్రీనివాసరావు,రవికుమార్, సుబ్బయ్య, డీఈలు పి.వెంకటరమణ, చైతన్య,నాగరాజు, గౌతమి, శివ తదితరులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యంపై శ్రద్ధేదీ.. ?
ఉత్తరాంధ్రలో ఉన్నత విద్యారంగానికి కేంద్రం ఆంధ్ర యూనివర్సిటీ. అటువంటి కీలకమైన యూనివర్సిటీకి నిధుల కేటాయింపులో ఒక్కపైసా అదనపు కేటాయింపులు కనిపించలేదు. గత ఏడాది బడ్జెట్ తరహాలోనే ఈ ఏడాది కూడా రూ. 389.34 కోట్లను మాత్రమే కేటాయించారు. విశాఖలోని ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్కు కేవలం రూ.27.91 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ఏడాది బడ్జెట్లో రూ. 59.48 కోట్ల మేర కేటాయించగా... ప్రస్తుత బడ్జెట్లో సగానికిపైగా కేటాయింపులు తగ్గించారు. మరోవైపు పాడేరు, నర్సీపట్నం మెడికల్ కాలేజీల అభివృద్ధి ప్రస్తావన కూడా చేయకపోవడం గమనార్హం. పాడేరు మెడికల్ కాలేజీతో పాటు అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజీల గురించి కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. -
మొండిచేయి
కొండకోనల్లో దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగించే గిరిజనులను చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం దగా చేసింది...తమతోనే గిరిజనాభివృద్ధి సాధ్యమని చెప్పుకునే కూటమి.. బడ్జెట్లో తీవ్ర వివక్ష చూపింది..జీసీసీకి కేవలం రూ.20 లక్షలు మాత్రమే విధులుస్తూ కేటాయించింది. పాడేరులోని మెడికల్ కళాశాలకు పైసా కూడా కేటాయించలేదు. పీవీటీజీల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఎటువంటి కేటాయింపులు జరపలేదు. గిరిజనులపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు స్పష్టంగా కనిపించింది. అడవి బిడ్డలకురాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి బాగా అవకాశం ఉన్న ప్రాంతం ఉమ్మడి విశాఖ జిల్లానే. అటు ఏజెన్సీతో పాటు ఇటు నగరంలోని సముద్ర తీరంలో అభివృద్ధి పనులు చేపడితే దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులను కూడా మరింత ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. బడ్జెట్లో పర్యాటక రంగానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. కొత్త బీచ్ల అభివృద్ధికి, ఏజెన్సీలో పర్యాటక రంగ అభివృద్ధికి బడ్జెట్లో ఏ మాత్రం శ్రద్ధ చూపించలేదు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ పరిధిలో కొత్త బీచ్లను అభివృద్ధి చేయడంతో పాటు టీడీసీకి చెందిన హోటల్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యాటకరంగ అభివృద్ధికి ఒక్క పైసా కూడా విదల్చకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేటాయింపులు సరే... ఖర్చేదీ? -
రేషన్డిపోల వారీగా ఆడిట్కు ఆదేశాలు
అడ్డతీగల: ఖాళీ కందిపప్పు కవర్ల వ్యవహారం నిగ్గుతేల్చే పనిలో అధికారులు పడ్డారు.ఈ మేరకు అడ్డతీగల జీసీసీ బ్రాంచి పరిధిలోని 32 రేషన్డిపోల వారీగా ఆడిట్ నిర్వహించి మార్చి 10వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని రంపచోడవరం సబ్కలెక్టర్ కల్పశ్రీ ఆదేశాలు జారీ చేశారు.‘కవర్లు ఇక్కడ–కందిపప్పు ఎక్కడ’ అనే శీర్షికన ఫిబ్రవరి 17 న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు స్పందించిన అధికార యంత్రాంగం కంది పప్పు ఏమైందో తెలుసుకునే చర్యలు చేపట్టారు. రేషన్కార్డుదారుల అభిప్రాయాలతో నివేదిక రూపొందించాలని ఆదేశించారు. దీనిలో భాగంగా జీసీసీ బ్రాంచి మేనేజర్,అడ్డతీగల డిప్యూటీ తహసీల్దార్, స్థానిక వీఆర్వోలు డిపోల వారీగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకూ వచ్చిన కందిపప్పు,వినియోగదారులకు పంపిణీ చేసినవి,మిగిలిన నిల్వలు వంటి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన చేయనున్నారు. డిపోలతోపాటు మండల స్టాక్ పాయింట్ గోడౌన్ రికార్డులను పరిశీలించనున్నారు. అడ్డతీగల మండలంలో 14 రేషన్డిపోలు,వై.రామవరం లోయర్పార్ట్లో ఆరు డిపోలు,గంగవరం మండలంలో 12 రేషన్డిపోల్లో ఆడిట్ జరగనుంది. ఉన్నతాధికారుల ఆదేశాల సంగతి తెలిసిన మండల లెవిల్ స్టాక్ పాయింట్ సిబ్బంది,రేషన్డిపోల డీలర్లు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రికార్డుల్లో లెక్కలు సరిచేసుకోవడానికి తలలు పట్టుకుంటున్నారు.ఈ అంశాలపై అడ్డతీగల జీసీసీ ఇన్చార్జ్ బ్రాంచి మేనేజర్ విజయలక్ష్మి వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ‘కవర్లు ఇక్కడ–కందిపప్పు ఎక్కడ’ కథనంపై సమగ్ర దర్యాప్తు త్రీమెన్ కమిటీ నియామకం మార్చి 10 లోగా నివేదిక సమర్పించాలి సబ్కలెక్టర్ కల్పశ్రీ ఉత్తర్వులు -
సాగునీటి ప్రాజెక్టులకు అంతంత మాత్రమే..!
ఉమ్మడి విశాఖ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు కూడా కనీస నిధులను కేటాయించలేదు. పెద్దేరు ప్రాజెక్టుకు రూ.2 కోట్లు,రైవాడకు రూ.75 లక్షలు, కోనాం ప్రాజెక్టుకు రూ.10 లక్షలు మాత్రమే కేటాయింపులు చేసింది. మరోవైపు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మాత్రం రూ. 605 కోట్ల మేర నిధులను కేటాయించారు. గత ఏడాది బడ్జెట్లో కేవలం రూ.79 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాదిలో కేటాయింపుల్లో ఏ మేరకు ఖర్చు చేయనుందనేది అనుమానమే. వాస్తవానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.670 కోట్లు కేటాయిస్తామని గత జూలైలో ఎస్.రాయవరం వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. కేటాయింపుల్లో మాత్రం కోత విధించారు. -
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తల్లిపాల స్టోరేజీ కేంద్రాలు
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో దశల వారీగా ఏర్పాటు ● మొదటి దశలో కాకినాడ, విజయవాడలో ప్రారంభం ● రెండో దశలో విశాఖ కేజీహెచ్, రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో స్థల సేకరణ ● రోటరీ జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు వెల్లడిఅనకాపల్లి : రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దశల వారీగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాలింతల తల్లిపాల స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రోటరీ జిల్లా గవర్నర్(3020) మళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం కాకినాడ, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో కేజీహెచ్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. స్థానిక న్యూకాలనీ పాలూరి చిదంబరం రోటరీ ఫంక్షన్ హాల్లో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తల్లిపాల స్టోరేజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.కోటి 25 లక్షలు ఖర్చు అవుతుందని, దీనికి రోటరీ క్లబ్ సభ్యులు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు 2వేల అడుగుల స్థలం అవసరమన్నారు. అనకాపల్లి జిల్లా ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తే రూ.50 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. రోటరీ క్లబ్బ్ను 1905లో ఏర్పాటు చేయగా ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నాటికి 120 ఏళ్లు పూర్తవుతుందని తెలిపారు. 220 దేశాల్లో పూర్తిగా పోలియో నిర్మూలనకు కృషి చేయడం జరిగిందని పేర్కొన్నారు. మన దేశంలో పూర్తిగా పోలియో నిర్మూలన జరిగిందని, పోలియో వ్యాధి రాకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యప్తంగా శాంతి స్థూపాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గర్భిణులకు సర్వేకల్ క్యాన్సర్ వ్యాధి సోకకుండా 10వేల మందికి ఉచితంగా వ్యాక్సిన్లు అందజేయడం జరుగుతుందని, అలాగే కంటి చూపు మందగించిన రోగులకు రూ.35వేలు విలువ చేసే కంటి అద్దాలను అందజేయడం జరిగిందని తెలిపారు. నేటి వరకూ క్లబ్ ఆధ్వర్యంలో 300 మందికి పంపిణీ చేసినట్టు చెప్పారు. పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్చిలో విద్యార్థులకు బెంచీలు అందజేస్తామని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకుందని, ప్రస్తుతం ఎక్కడైనా డిజిటల్ తరగతుల బోర్డులు లేకపోతే తమ దృష్టికి తీసుకువస్తే ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఇచ్ఛాపురం నుంచి విజయవాడ వరకూ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల వసతి గృహాలకు పరుపులు అందజేస్తామన్నారు. ప్రస్తుతం రూ.50లక్షల విలువ చేసే పరుపులు కొన్ని వసతి గృహాలకు అందించామని తెలిపారు. పలు ప్రాంతాల్లో శ్మశానాల్లో దహనవాటికలకు 19 మిషన్లు అందజేశామని తెలిపారు. ఒక్కో మిషన్ రూ.15లక్షలు ఖర్చు అవుతుందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎస్.రాజేష్కుమార్, కార్యదర్శి డి.అనిల్, కోశాధికారి జి.శతేంద్ర, అసిస్టెంట్ గవర్నర్ కె.మురళీకృష్ణ, క్లబ్ సభ్యులు బుద్ద రమణాజీ, కడిమిశెట్టి సతీష్, పి.జె.నాయుడు, కె.వి.గౌరీపతి పాల్గొన్నారు. -
యువకుడిని ఢీకొన్న స్కూల్ బస్సు
రోడ్డు దాటుతుండగా ఘటన మర్రిపాలెం(విశాఖ): రోడ్డు దాటు తున్న ఓ యువకుడిని అతి వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి.. సాక్షి దినపత్రికలో సీటీపీ స్కానింగ్ ఆపరేటర్ పనిచేస్తున్న పొట్నూర్ వెంకటేష్ కంచరపాలెం దరి కప్పరాడలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నెల 25న విధులు ముగించుకుని.. ఉదయం 8.15 గంటల ప్రాంతంలో కప్పరాడ వద్ద ఆటో దిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో అక్కయ్యపాలెం నుంచి ఎన్ఏడీ వైపు వెళ్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఏపీ39 యూడబ్ల్యూ 3237) నంబర్ గల బస్సు అతివేగంగా వస్తూ రోడ్డు దాటుతున్న వెంకటేష్ను ఢీకొంది. దీంతో యువకుడు సర్వీస్ రోడ్డులోని పోలీస్ స్టాపర్పై పడిపోవడంతో అతనికి ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి వైద్య సేవలందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తన కుమారుడికి ఇలా జరిగిందని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ సీఐ దాశరథి నేతృత్వంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శివరాత్రి రాత్రి ఆదాయం రూ.కోటి
● 300 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీడాబాగార్డెన్స్/ కూర్మన్నపాలెం: మహా శివరాత్రి పురస్కరించుకుని వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా ఆర్టీసీకి రూ.కోటి వరకు ఆదాయం సమకూ రిందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని శివాలయాలకు సర్వీసులు నడిపినట్లు చెప్పారు. కూర్మన్నపాలెం జంక్షన్లో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అంతకుముందు గాజువాక డిపో నుంచి అప్పికొండ, ఆర్కే బీచ్కు ప్రత్యేక బస్సులు ప్రారంభించారు. శివరాత్రి జాగరణ అనంతరం సముద్ర స్నానాలు ఆచరించే భక్తుల కోసం 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27 సాయంత్రం వరకు నగరంలోని అన్ని డిపోల నుంచి బస్సులు నడిపినట్లు చెప్పారు. గాజువాక, కూర్మన్నపాలెం, అగనంపూడి ప్రాంతాల నుంచి అప్పికొండకు, అలాగే తగరపువలస, భీమిలి, ఆరిలోవ కాలనీ, రవీంద్రనగర్, పెందుర్తి, కొత్తవలస, సింహాచలం, గాజువాక, కూర్మన్నపాలెం తదితర ప్రాంతాల నుంచి ఆర్కే బీచ్కు సూపర్వైజర్లు, సిబ్బంది పర్యవేక్షణలో సుమారు 300 ప్రత్యేక బస్సులను నడిపినట్టు అప్పలనాయుడు వివరించారు. భక్తుల సౌకర్యార్థం ముఖ్య కూడళ్ల వద్ద టెంట్లు వేసి.. ఒక్కో చోట నలుగురు సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. మంచి నీరు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పించినట్లు వివరించారు. ఒక్క అప్పికొండ తీర్థయాత్ర వల్ల ఆర్టీసీకి రూ.30 లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు చెప్పారు. గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు ఆదాయం లభించినట్లు వెల్లడించారు. పుణ్యగిరి, నర్సీపట్నం, కల్యాణపులోవ తదితర పుణ్యక్షేత్రాలకు కూడా నగరంలోని వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు పంపించామన్నారు. డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సత్యనారాయణ, సింహాచలం డిపో మేనేజర్ కె.రాజశేఖర్, వాల్తేర్ డిపో మేనేజర్ కె.సుధాకర్, స్టీల్ సిటీ డిపో మేనేజర్ గౌతమ్ చటర్జీ, గాజువాక డిపో మేనేజర్ వి.ప్రవీణ, పర్సనల్ ఆఫీసర్ జె.తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
రాజీపడదగ్గ కేసుల్నిపరిష్కరించండి
అల్లిపురం(విశాఖ): మోటారు ప్రమాద నష్టపరిహార కేసులు, చెక్ బౌన్సు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల్ని మార్చి 8న జరిగే జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వెంకట శేషమ్మ అధ్వర్యంలో గురువారం జిల్లాకోర్టులో జరిగిన సమావేశంలో ఆయన ఈ కేసులపై సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో వున్న కేసులు, ఎన్బీడబ్ల్యూ పెండింగ్ కేసులపై తగు చర్యలు తీసుకోవాలని, జాతీయ లోక్ అదాలత్లో వీటిని పరిష్కరించవచ్చన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ఎక్కువగా దృష్టిసారించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లవారీగా, కోర్టుల వారీగా లోక్ అదాలత్కు ఎన్ని కేసులు పంపించారో అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ప్రజా న్యాయపీఠం న్యాయమూర్తి వల్లభనాయుడు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకటరమణ, రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి పవన్కుమార్, స్పెషల్ కోర్టు మేజిస్ట్రేట్లు, పోలీసు అధికారులు, బీమా, చిట్ ఫండ్ కంపెనీల ప్రతినిధులు, బ్యాంకు ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ంత ఆచారం.. నూత్న వేడుక
భక్తి శ్రద్ధలతో రాజయ్యపేట నూకతాత పండుగ రోడ్డుపై పడుకుని మొక్కు చెల్లించుకున్న భక్తులు నక్కపల్లి: వింత ఆచారం, వినూత్న సంప్రదాయంతో చూడడానికి ఎంతో ఆసక్తి కలిగించడం అబ్బుర పరిచే విధంగా ఉండే నూకతాత పండగను గురువారం మత్య్సకారులు అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాలో కనీవినీ ఎరుగని వింత ఆచారంతో ఈ పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది మత్య్సకారులు అధికంగా ఉండే రాజయ్యపేటలో ఈ పండగను తరతరాలుగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా మహాశివరాత్రి మరుసటిరోజు రాజయ్యపేటలో నూకతాత పండగ జరుగుతుంది. నూకతాతను గంగపుత్రులు తమ కులదైవంగా, ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ సందర్భంగా గురువారం నూకతాత విగ్రహాలను సముద్రస్నానానికి తీసుకెళ్లారు. తిరిగి ఆలయానికి విగ్రహాలను తీసుకొచ్చే సమయంలో భక్తులు రోడ్డుపై పడుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా రోడ్డుపై పడుకున్న భక్తులపైనుంచి విగ్రహాలను చేతపట్టిన పూజారులు దాటుకుంటూ వెళ్లారు. ఇలా పడుకుని మొక్కులు చెల్లించుకోవడం ద్వారా తమ కోర్కెలు నెరవేరుతాయనేది మత్య్సకారుల నమ్మకం. గత ఏడాది కోరిన కోర్కెలు నెరవేరిన వారు ఈ ఏడాది కొత్తకోర్కెలు కోరుకునే వారు ఇలా రోడ్డుపై పడుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఇలా మొక్కు చెల్లించుకుంటే నూకతాత అనుగ్రహం తమపై ఎల్లవేళలా ఉంటుందనేది గంగపుత్రుల నమ్మకం. సందడిగా తిరునాళ్లు సాధారణంగా గ్రామాల్లో నిర్వహించే పండగలు జాతరల్లో కోళ్లను మేకలను బలి ఇస్తారు. నూకతాత పండుగలో మాత్రం బలి నిషేధం. రక్తం చిందించడాన్ని నూకతాత ఒప్పుకోడని మత్య్సకారులు చెబుతారు. నూకతాత పండగను పురస్కరించుకుని గ్రామంలో పెద్ద తిరునాళ్లు జరిగింది. భారీ సెట్టింగులు ఏర్పాటు చేశారు. బాణాసంచాల సంబరాలు మిన్నంటాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ కుమార స్వామి, ఎస్ఐ సన్నిబాబుల ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా నూకతాత పండక్కి రాజయ్యపేట చేరుకున్నారు. బంధువులు, స్నేహితుల రాకతో గంగపుత్రుల ఇళ్లన్నీ కళకళలాడాయి. నూకతాత ఆలయాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కాపు కార్పోరేషన్ మాజీ డెరెక్టర్ వీసం రామకృష్ణ, జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, వైస్ ఎంపీపీ వీసం నానాజీ, మండల పార్టీ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి దర్శించుకున్నారు. -
బాలికను రక్షించిన లైఫ్గార్డులు
ఆరిలోవ(విశాఖ): మహా శివరాత్రి పుణ్యస్నానాల కోసం గురువారం జోడుగుళ్లపాలెం బీచ్కు వచ్చిన ఓ బాలిక కెరటాల్లో చిక్కుకుంది. జీవీఎంసీ లైఫ్గార్డులు వెంటనే స్పందించి ఆమెను ప్రాణాలతో రక్షించారు. వివరాలివీ.. ద్వారకానగర్ ప్రాంతం నుంచి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు జోడుగుళ్లపాలెం బీచ్కు గురువారం మధ్యాహ్న సమయంలో సముద్ర స్నానాలకు వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తుండగా.. అతని కుమార్తె కెరటాలలో చిక్కుకుని లోపలకు వెళ్లిపోయింది. ఇది గమనించిన సుబ్రహ్మణ్యం, అతని కుటుంబ సభ్యులు బాలికను రక్షించడానికి లోపలకు వెళ్లగా.. వారు కూడా కెరటాల మధ్యలో చిక్కుకున్నారు. దీంతో వారంతా పెద్ద కేకలు పెట్టడంతో అక్కడే ఉన్న జీవీఎంసీ లైఫ్గార్డులు రమేష్, రాజు, లక్ష్మణ్, సాయి వెంటనే స్పందించి ఆ బాలికతో పాటు కుటుంబ సభ్యులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న ఆరిలోవ ఎస్ఐ కృష్ణ, కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని వారికి వైద్య పరీక్షలు చేయించారు. -
జీఎం వలస పంచాయతీ కార్యదర్శిపై విచారణ
మారేడుమిల్లి : జీఎం వలస గ్రామ పంచాయతీ కార్యదర్శి వి.కృష్ణప్రసాద్పై వచ్చిన ఆరోపణలపై గురువారం విచారణ నిర్వహించినట్లు ఎంపీడీవో శ్రీనివాసు విశ్వనాథ్ తెలిపారు. కృష్ణప్రసాద్ ప్రజలకు అందుబాటులో ఉండరని, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి స్థానిక ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని, పీసా గ్రామసభలు సక్రమంగా నిర్వహించడం లేదని, గ్రామ సచివాలయానికి వస్తున్న గిరిజనులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని వచ్చిన పలు ఆరోపణలపై గ్రామ సర్పంచ్ కారం లక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యదర్శి కృష్ణప్రసాద్పై ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరపమని డీపీవో డివిజినల్ అధికారి నరసింహరావును విచారణ అధికారిగా నియమించారు. గతంలో కృష్ణప్రసాద్ వై.రామవరం మండలం బొడ్డగంటి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం, విధుల పట్ల నిర్లక్ష్యం, సత్ప్రవర్తన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేశారని, జీఎంవలస కార్యదర్శిగా బదిలీ చేసినా ఆయన తీరు మారలేదని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. -
చింతపల్లి ఏకలవ్య పాఠశాలను సందర్శించిన సంక్షేమ శాఖ డీడీ
చింతపల్లి: ఏకలవ్య వంటి ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి విద్యార్థులు చక్కగా చదువుకునేందుకు అనుకూలంగా ఉండాలని, పాఠశాల యాజమాన్యాలు ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పాడేరు గిరిజన సంక్షేమశాఖ డీడీ రజని అన్నారు. ఇటీవల చింతపల్లి ఏకలవ్య పాఠశాలలో విద్యార్థుల మధ్య వివాదాలు, బాలికలను ఏడిపిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులతో విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడం, ఈ వ్యవహారంపై తల్లిదండ్రులు ఆందోళనలకు సిద్ధపడటం వంటి సంఘటనల నేపథ్యంలో ఇప్పటికే పలువురు అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా ఏకలవ్య పాఠశాలను డీడీ రజని సందర్శించి అక్కడ బాలబాలికలతో వేరువేరుగా మాట్లాడారు. పాఠశాల ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు. పాఠశాలలో వివాదాలు లేకుండా చక్కగా చదువులు సాగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి ఉన్నారు. -
14న ఉత్తరాంధ్ర పాడిపశువుల పాలపోటీలు
చీడికాడ : పశుసంవర్దకశాఖ , బోవైన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 14 న ఉత్తరాంధ్ర పాడి పశువుల పాల పోటీలు నిర్వహిస్తున్నట్టు పాడేరు డివిజన్ పశుసంవర్ధక శాఖ సంచాలకుడు సి.హెచ్. నర్సింహులు పేర్కొన్నారు. మండలంలో కొత్తపల్లి, అడవిల అగ్రహారం, వింటిపాలెంలో పర్యటించారు. అధిక దిగుబడినిచ్చే పశువులను గుర్తించి, పాడి రైతులు పాల పోటీల్లో పాల్గోవాలని సూచించా రు. విజయనగరం జిల్లా తోటపాలెంలో ఈ పోటీలు నిర్వహిస్తామని, పాడి రైతులు తమ వద్ద వున్న రోజుకు 20 లీటర్లు పాలిచ్చే హెచ్యఫ్ ఆవులు, రోజుకు 16 లీటర్లు పాలు ఇచ్చే జెర్సీ ఆవు, రెండు లీటర్లు పాలు ఇచ్చే ఒంగోలు, 8 లీటర్లు పాలిచ్చే గేదెలును ఈ పోటీలకు తీసుకుని రావచ్చునని తెలిపారు. మాడుగుల ఏరియా పశువైద్య సహాయ సంచాలకుడు చిట్టినాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
‘సుప్రీం’ ఆదేశాలు బేఖాతర్
● నిర్దిష్ట ఆదేశాలున్నా.. తేలని శాంతి ఆశ్రమం భూముల పంచాయితీ ● గురువారం 11 గంటల్లోపు అప్పగించాలని లీజుదారులకు సుప్రీం కోర్టు ఆదేశం ● సాయంత్రం 4 గంటల వరకు వేచి ఉన్నప్పటికీ.. స్వాధీనం చేయని లీజుదారులు ఎంవీపీకాలనీ(విశాఖ): లాసన్స్ బే కాలనీలోని శాంతి ఆశ్రమం భూముల విషయంలో లీజుదారులు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు లీజులో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడానికి గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఆశ్రమం యాజమాన్యానికి చెందిన పిటిషన్దారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు వేచి చూసినా.. ఫలితం లేకపోయింది. దీంతో లీజుదారులు కోర్టు ధిక్కరణకు పాల్పడిన అంశాన్ని మరోసారి సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆశ్రమానికి చెందిన పిటిషన్దారులు నిర్ణయించారు. పిటిషన్దారులు తెలిపిన వివరాలివీ.. దశాబ్దాల కిందట యోగా, మెడిటేషన్ సెంటర్ల నిర్వహణ పేరుతో ఉప్పలపాటి వివేకానంద కుటుంబం శాంతి ఆశ్రమం నిర్వాహకుడు యోగి రాఘవేంద్ర ద్వారా 6.4 ఎకరాల స్థలం లీజుకు తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఆ స్థలంలో పెట్రోల్ బంక్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, కార్ షెడ్లు, మల్టీ పార్కింగ్ ప్రాంతాలుగా అద్దెలకు ఇచ్చి.. ఆ స్థలాన్ని వివేకానంద కుటుంబ సభ్యులు కమర్షియల్గా వాడుకుంటున్నారు. లీజు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకుంటున్న స్థలాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ శాంతి ఆశ్రమ యాజమాన్యం కోర్టులను ఆశ్రయించింది. 25 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం సుప్రీం కోర్టు ఆ లీజు స్థలాలను వెనక్కి ఇచ్చేయాలంటూ తీర్పునిచ్చింది. అయితే వివేకానంద కుటుంబం అందుకు సమయం కోరగా.. రెండు సార్లు అవకాశం కల్పించింది. ఆ సమయంలో లీజుదారులు కోర్టులో సానుకూల ఆదేశాల కోసం ప్రయత్నించి పలు పిటిషన్లు దాఖలు చేశారు. అయినప్పటికీ కోర్టు వాటిని తోసిపుచ్చడంతో పాటు ఆ భూమిని ఆశ్రమానికి అప్పగించాల్సిందేనని తేల్చి చెప్పింది. కాగా..ఈ భూమిలో కొంత స్థలం వివిధ పార్టీ కార్యాలయాలకు వెళ్లినట్లు లీజుదారులు కోర్టుకు తెలిపారు. దీంతో నాలుగు ఎకరాల లీజు భూమిని స్వాధీనం చేయడానికి గతంలోనే అంగీకరించారు. అయితే అందుకు అనుగుణంగా అప్పగించకపోవడంతో కోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఆ 4 ఎకరాల భూమిని గురువారం(ఈ నెల 27) ఉదయం 11 గంటల్లోపు భూములను ఆశ్రమం యాజమాన్యానికి అప్పగించాలని స్పష్టం చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 4 గంటల వరకు వేచిచూసినా.! ఈ క్రమంలో ఆశ్రమ యాజమాన్యప్రతినిధులు, ఎంవీపీ సీఐ మురళీ తదితరులు గురువారం ఉదయం లీజు భూములను పరిశీలించారు. కోర్టు ఆదేశాల మేరకు లీజు భూమంతా అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు ప్రతివాదులకు సూచించారు. వివేకానంద కుటుంబ సభ్యులతో పలుమార్లు మాట్లాడారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ భూమిని అప్పగించాలని సూచించారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు. అయినప్పటికీ వివేకానంద కుటుంబ సభ్యులైన జి.గౌతమ్, కె.శ్రీదేవి ఆ భూములను అప్పగించలేదు. దీంతో కోర్టు నోటీసులను వారు అద్దెలకు(సబ్లీ జులకు) ఇచ్చిన పెట్రోల్ బంక్, డ్రైవ్ ఇన్ రెస్టారెంట్, బస్సుల పార్కింగ్, క్రికెట్ కోచింగ్ సెంటర్, కార్ వాష్ సెంటర్లకు అతికించినట్లు ఆశ్రమ యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. లీజుదారులు భూమిని స్వాధీనం చేయకపోతే 28వ తేదీ తమ దృష్టికి తీసుకురావాలని సుప్రీం కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో.. ఈ వ్యవహారాన్ని శుక్రవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లనునట్లు వెల్లడించారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్–2024పై అభిప్రాయ సేకరణ
డాబాగార్డెన్స్(విశాఖ): జీవీఎంసీ పరిధిలో 2024 ఏడాదికి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్పై అభిప్రాయ సేకరణ ప్రారంభమైందని, నగర ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశాల మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యర్థాల సేకరణ, తరలింపు, రోడ్లు, కాలువల శుభ్రత, మార్కెట్లు, బజార్లు, పార్కులు, ఉద్యానవనాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ కేంద్రాలు, వాటి వినియోగంపై ప్రజలకు అవగాహన తదితర అంశాలపై ప్రజల తమ అభిప్రాయాలు చెప్పాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం అడిగే ప్రశ్నలకు నేరుగా అభిప్రాయం చెప్పవచ్చన్నారు. అలాగే https://sbmurban.org/లో గానీ, ఠ్చీఛిజిజ్చ్ట్చి– కౌఏ్ఖఅ యాప్ ద్వారా గానీ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చని సూచించారు. -
దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ
చింతూరు: బ్రేకులు ఫెయిల్ కావడంతో రహదారి పక్కనే ఉన్న దుకాణంలోకి లారీ దూసుకెళ్లిన సంఘటన మండలంలోని పోతనపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తెలంగాణలోని కోదాడ నుంచి సిమెంటు లోడుతో సీలేరు వెళ్లిన లారీ తిరుగు ప్రయాణంలో పోతనపల్లి వద్దకు రాగానే బ్రేకుల ఫెయిలయ్యాయి. దీంతో రహదారి పక్కనేవున్న చిన్నపాటి కిరాణా దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లింగగూడేనికి చెందిన డ్రైవర్ నారుమల్లి రాఘవకు తీవ్రగాయాలై క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతనిని క్యాబిన్ నుంచి బయటకు తీశారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చింతూరు ఎస్ఐ రమేష్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోడ్ ఉల్లంఘన
● పసుపు కుర్చీలతో కూటమి నాయకుల ప్రచారం డుంబ్రిగుడ: ఒకపక్క పోలింగ్ జరుగుతుండగా.. బయట శిబిరం ఏర్పాటు చేసి కూటమి నాయకులు యథేచ్ఛగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉండగా.. ఉదయం 9 గంటలకు టీడీపీ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో పసుపు రంగు కుర్చీలతో టెంటును ఏర్పాటు చేశారు. పార్టీ అరకులోయ ఇన్చార్జి, విజయనగరం జిల్లా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సియారి దొన్నుదొర శిబిరంలో చేరి ఏపీటీఎఫ్, కూటమి అభ్యర్థి పి.రఘువర్మ తరపున ప్రచారం చేశారు. పీఆర్టీయూ, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘల నాయకులు వారి తీరుపై మండిపడ్డారు. -
గంజాయి కలిగి ఉన్న వ్యక్తికి 10 ఏళ్లు జైలు
విశాఖ లీగల్: గంజాయి కలిగి ఉన్న వ్యక్తికి 10 ఏళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయిలు జరిమానా విధిస్తూ నగరంలోని ప్రధాన మెట్రోపాలిటిన్ సెషన్ జడ్జి ఎం.వెంకటరమణ గురువారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో స్పష్టం చేశారు. ప్రథమ శ్రేణి ప్రత్యేక పబ్లిక్ ప్యాసిక్యూటర్ బి.ఎస్.ఎస్.ప్రసాద్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు గజ్జి సత్తిబాబు(40) అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చీడి గుమ్మల పంచాయతీ పోలవరం గ్రామ నివాసి, వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్. 2014 నవంబర్ 22వ తేదీన ముందస్తు సమాచారం మేరకు గొలుగొండ తహసీల్దార్, గొలుగొండ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా పాకలపాడు గ్రామం నుంచి చీడి గుమ్మల వైపు వస్తున్న ట్రాక్టర్లో 183 కేజీల గంజాయిని మైదాన ప్రాంతానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. అప్పటి ఎస్ఐ ఎన్.జోగారావు నిందితుడిపై కేసు నమోదు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు. -
బ్యాలెట్ బాక్సులుస్ట్రాంగ్ రూమ్లో భద్రం
సాక్షి, పాడేరు: పాడేరు డివిజన్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను ప్రత్యేక భద్రతతో గురువారం రాత్రికి పాడేరు రిసెప్షన్ సెంటర్కు తరలించారు. చింతపల్లి, కొయ్యూరు, అనంతగిరి, ముంచంగిపుట్టులోని నాలుగు రూట్లకు సంబంధించి 4 ఆర్టీసీ బస్సుల ద్వారా ఎన్నికల సిబ్బంది పాడేరు చేరుకున్నారు. తమ పోలింగ్ కేంద్రాలలో బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులకు అప్పగించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ, డీఆర్వో పద్మలతల సమక్షంలో అన్ని బ్యాలెట్ బాక్సులను ఇక్కడ తాత్కాలిక స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచారు. -
త్వరితగతిన తాజంగి మ్యూజియం నిర్మాణం
చింతపల్లి: తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను సత్వరమే పూర్తిచేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం చింతపల్లి మండలం తాజంగి, లంబసింగిలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణంలో జాప్యం కారణంగా పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ను ప్రభుత్వం తొలగించిందన్నారు. మళ్లీ టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశించిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున టెండర్ల ప్రక్రియకు అవరోధం కలిగిందని, కోడ్ ముగియగానే టెండర్లను పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. ఈ పనులన్నీ ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరు నెలనాటికి పూర్తి కావాలని జేసీ, ఇన్చార్జి ఐటీడీఏ పీఓ అభిషేక్ గౌడను ఆదేశించారు. ఇప్పటి వరకూ చేపట్టిన నిర్మాణాలు, చేపట్టాల్సిన పనులను గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ వివరించారు. ఈఈ డేవిడ్రాజ్, డీఈలు రఘు, వంశీకృష్ణ, ఏఈఈ యాదకిశోర్ పాల్గొన్నారు. కాఫీతోటల పరిశీలన గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నాయక్ లంబసింగి పంచాయతీ మారుమూల ఉన్న గాదిగొయ్యి గ్రామంలో కాఫీ తోటలను పరిశీలించారు. కాఫీలో అంతరపంటగా సాగు చేస్తున్న మిరియాల వల్ల గిరిజనులకు సమకూరుతున్న ఆదాయం గురించి తెలుసుకున్నారు. తమకు నిచ్చెనలు, టార్పాలిన్లు పంపిణీ చేయాలని గిరిజనులు కోరారు. కాఫీ ఏడీ అప్పలనాయుడు, ఏఈవో ధర్మారాయ్ పాల్గొన్నారు. టెండర్లు పూర్తిచేసి పనులు వేగవంతం చేయాలి గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నాయక్