Alluri Sitarama Raju District News
-
పనికెళ్లిన నాలుగు రోజులకే..
భీమునిపట్నం: భీమిలి సమీపంలోని రేఖవానిపాలెం పంచాయతీ మహాలక్ష్మీపురానికి చెందిన మెడిసి హేమంత్(24) ఇటీవల బాణసంచా తయారీ నేర్చుకున్నాడు. తెలిసిన వారి ద్వారా నాలుగు క్రితం కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని బాణసంచా కేంద్రంలో పనికి వెళ్లాడు. బాణసంచా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో అశువులుబాశాడు. అతని తండ్రి మెడిసి సత్యనారాయణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తల్లి లేరు. అక్క స్వర్ణకల ఉన్నారు. తన కొడుకు ఇంటికి ఆధారంగా ఉంటాడని భావించామని.. త్వరలో వివాహం కూడా చేయాలని అనుకున్నామని.. ఇంతలో ఘోరం జరిగిపోయిందని తండ్రి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. అందరితో సరదాగా ఉండే హేమంత్ ఇకలేడన్న విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు విషాదం మునిగిపోయారు. -
అప్పన్నకు శ్రీ పుష్పయాగం
● ముగిసిన వార్షిక కల్యాణోత్సవాలు సింహాచలం: సింహగిరిపై గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాయంత్రం నుంచి స్వామికి శ్రీ పుష్పయాగాన్ని నిర్వహించారు. స్వామి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవి అమ్మవార్లకు పూల అలంకరణ చేసి ఆలయ కల్యాణమండపంలో శేషతల్పంపై ఆళ్వారులతో సహా వేంజేపచేసి విష్వక్సేణపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. ద్వాదశి ఆరాధనలు, పలు రకాల పుష్పాలతో పుష్పాంజలి సేవ చేశారు. అనంతరం భోగమండపంలో ఉంజల్సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈ సేవ నిర్వహించారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పాడేరు ఘాట్రోడ్డులో వాహనం బోల్తా
మాడుగుల: పాడేరు రోడ్డులో ఏసు ప్రభువు విగ్రహం టర్నింగ్ పాయింట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే స్పందించి బోల్తా పడిన వాహనాన్ని తప్పించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణనష్టం జరగలేదు. స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి రాజేశ్వరరావు కథనం ప్రకారం.. వీరంతా ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా కొడవలస, సీతమామిడి గ్రామాల నుంచి తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట వలస వెళ్తున్నారు. వాహనం అదుపు తప్పడంతో వీరికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ నుంచి క్షతగాత్రులను తమ వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి తీవ్రంగా గాయాలైన ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. 15 మందికి గాయాలు ‘ఫైర్’ అధికారుల తక్షణ స్పందనతో తప్పిన ప్రాణాపాయం -
అంబరాన్ని తాకిన బడ్డు సంబరం
పాత పాడేరులో విభిన్నంగా ఇటుకల పండగ సాక్షి,పాడేరు: పాతపాడేరులో నిర్వహించిన బడ్డు సంబరం అంబరాన్ని తాకింది. ఈ ఉత్సవంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజనులు ఘనంగా జరుపుకొనే ఇటుకల పండగను పాత పాడేరులో విభిన్నంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సమీప అడవుల నుంచి సేకరించిన తీగలతో తాడులా పెద్ద బడ్డును తయారు చేసి, దానికి మహిళలు పూజలు చేస్తారు. తరువాత అక్కా చెల్లెళ్లు అయిన మహిళలు ఒక వైపు, వదినా మరదళ్లు మరో వైపు ఉంటూ ఆ బడ్డును లాగుతారు. దానిని ఎవరి వైపునకు లాక్కుంటే వాళ్లే విజయం సాధించినట్టుగా భావిస్తారు. అలా ఆదివారం స్థానిక పాత పాడేరులో జరిగిన బడ్డు ఉత్సవంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలంతా పాతపాడేరు గ్రామ నడిబొడ్డున థింసా నృత్యా లతో సందడి చేశారు. పలువురు మహిళలు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. విభిన్నమైన ఈ సంబరాన్ని తిలకించేందుకు పలు గ్రామాలు, మైదాన పాంతాల్లో ఉన్న గిరిజన మహిళలు తరలివచ్చారు. మధ్యాహ్నం గిరిజనుల ఆరాధ్య దైవం శంకులమ్మకు, ఇతర దేవతల విగ్రహాలకు గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి థింసా నృత్యాలు,పలు వేషధారణలతో అందరూ ఊరేగింపుగా గ్రామ చావడి వద్దకు చేరుకున్నారు. గ్రామ చావడిలో సాయంత్రం సుమారు గంట పాటు పోటాపోటీగా థింసా నృత్యాలతో హోరెత్తించారు. అనంతరం గొడుగుల సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత బడ్డు తాడు లాగే సంబరం ఉత్సాహంగా జరిగింది. ఈ సంబరాన్ని వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. పండగ సరదా.. వేటకు పదపద ఆకట్టుకున్న వివిధ వేషధారణలుథింసా నృత్యాలతో సందడి -
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా... మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’.. అని సింహగిరికి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించేసరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా... స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా’.. అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి’.. అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగడంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి. తాము ఉంగరం తీయలేదని ఎంతచెబుతున్నా వినకుండా మీరే దొంగ అని పదే పదే ప్రశ్నించడంతో వారంతా కోపోద్రేకాలతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని... దొంగిలించిన ఉంగరం ఇలాగే ఉంటుందంటూ స్థానాచార్యులు నిలదీయడంతో భక్తులు నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ.. సింహగిరిపై ఆదివారం సందడిగా జరిగిన స్వామి వినోదోత్సవం. సింహగిరిపై జరుగుతున్న స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన స్వామి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని ఆదివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఉత్సవం సాగిందిలా... ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టంపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాడుతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యంతం చెందారు. ఉత్సవం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. విశాఖలోని గాయత్రి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న లాస్య, తనుశ్రీ, సుమేధలను, కొత్తవలసకి చెందిన భార్గవి, మోహిత, శ్రావణ్ అనే విద్యార్థులను, విజయనగరానికి చెందిన ఎంబీఏ విద్యార్థినులు రూప, కుసుమ, పుష్ప, సౌమ్యలను, పలాసకి చెందిన ఫైనలియర్ లా విద్యార్థినులు శశిరేఖ, తమనశ్రీ, నరేణ్యలను, మర్రిపాలెంలోని ఓ గోల్డ్ షాపులో పనిచేస్తున్న వడ్డాదికి చెందిన వీర వెంకట సత్యనారాయణ అనే భక్తుడుని పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. అలాగే ఛత్తీస్గఢ్కి చెందిన భక్తులను, ఎకై ్సజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న యలమంచిలికి చెందిన సత్యనారాయణమూర్తి కుటుంబాన్ని, పెళ్లి చేసుకొని స్వామి దర్శనానికి వచ్చిన నూతన జంటలను తాళ్లతో బంధించారు. వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమానం వ్యక్తం చేయడంతో వారందతా వాదనకు దిగారు. ఆ తర్వాత నవ్వుతూ స్వామి ఆశీస్సులు తీసుకుని తిరుగుపయనం అయ్యారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు దొంగలుగా పట్టుబడ్డారు. తొలుత స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ని, ఆఖరులో పురోహిత్ అలంకారి సీతారామాచార్యులను తాడుతో బంధించి తీసుకురావడం విశేషం. భక్తులను బంధించిప్రశ్నించిన స్థానాచార్యులు కన్నీటి పర్యంతమైన యువత వినోదోత్సవమని తెలుసుకుని సంభ్రమాశ్చర్యం -
సరియా జలపాతంలో ఇద్దరు గల్లంతు
సాక్షి, పాడేరు: అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ సరియా జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విశాఖపట్నం పూర్ణామార్కెట్కు చెందిన ఆరుగురు యువకులు సరియా జలపాతం సందర్శనకు ఆదివారం మధ్యాహ్నం వచ్చారు. జలపాతంలో స్నానం కోసం దిగిన సమయంలో ప్రమాదవశాత్తు పూర్ణామార్కెట్ పండావీధికి చెందిన ఇల్లా వాసు(22), నర్సింహం జారిపడి గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం మిగిలిన నలుగురు, స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి. నలుగురు యువకులు అనంతగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు. గల్లంతైన ఇద్దరూ ఫిషింగ్ హార్బర్లోని చేపల దుకాణాల్లో పనిచేస్తున్నారు. -
చిన్నారిని పరామర్శించిన ఎమ్మెల్యే మత్స్యలింగం
మహారాణిపేట: అరకు నియోజకవర్గం, హుకుంపేట మండలం, మర్రిపుట్టు గ్రామానికి చెందిన చుంచు అనిల్ కుమార్ కుమార్తె చుంచు సమీర అనారోగ్యంతో శనివారం కేజీహెచ్లో చేరింది. విషయం తెలుసుకున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కేజీహెచ్ భావనగర్ వార్డులో ఉన్న చిన్నారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం చిన్నారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ వైద్యులు రేణుక తదితరులు పాల్గొన్నారు. సమీరను పరామర్శిస్తున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
ఆదివారం మిట్ట మధ్యాహ్నం 12:30 గంటల సమయం..ఒకవైపు మండుతున్న సూర్యుడి భగభగలు..మరోవైపు సెగలు కక్కుతున్న వాతావరణంలో పనిచేస్తున్న కార్మికులు...ఊపిరి సలపని పని...కడుపు ఆకలితో నకనకలాడుతోంది... కాసేపట్లో పని చాలించి ఓ ముద్ద తిని వద్దాం..అనుకుంటుండగా..ఒక్కసారిగా భూ
11 మంది పనిచేస్తున్నారు... ప్రతిరోజూ అక్కడ 20 నుంచి 30 మంది వరకు కార్మికులు పనిచేస్తారు. బాణసంచా కేంద్రంలో ప్రమాద ఘటన జరిగే సమయానికి 16 మంది మాత్రం ఉన్నారు. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. వచ్చే మంగళవారం కోటవురట్ల మండలంలో అన్నవరం, చౌడువాడ, పందూరు గ్రామాల్లో గ్రామ జాతర ఉత్సవాలు ఉండడంతో బాణసంచా ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. దీంతో గత వారం రోజులుగా పని ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఆదివారం కావడంతో అక్కడ పనిచేసే సామర్లకోటకు చెందిన ఒక కుటుంబం సంతకు వెళ్లేందుకు ఓనర్ నుంచి డబ్బులు తీసుకోవడానికి మాత్రమే వచ్చారు. దీంతో అక్కడ పనిచేసే 11 మందితో పాటు ఈ అయిదుగురూ ప్రమాదంలో గాయపడ్డారు. -
పొట్టకూటికి ప్రమాదకర పనిలో...
కోటవురట్ల: ప్రమాద ఘటనలో మృతులంతా రెక్కాడితే కాని డొక్కాడని వారే కావడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కై లాసపట్నానికి చెందిన సంగరాతి గోవిందుకు ఇద్దరు పిల్లలు కాగా పాప ఇంటర్, బాబు 9వ తరగతి చదువుతున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్ను ఇవ్వాలని ఆలోచనతో గోవిందు స్థానికంగా ఉన్న మందుగుండు తయారీ కేంద్రానికి నాలుగేళ్లుగా పనికెళుతున్నాడు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్యా పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో మృతురాలు పురం పాప మూడేళ్లుగా ఇందులో పనిచేస్తోంది. ప్రమాదమని తెలిసినా కుటుంబానికి వేరే ఆధారం లేక పని కెళ్లి అనంతలోకాలకు పోయింది. మరో మృతుడు గుంపిన వేణుబాబు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఇతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పనికి వెళ్లకపోతే ఆ రోజు పస్తులే. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో మృతుడు అప్పికొండ తాతబ్బాయి కాగా ఇతని పేరునే విజయలక్ష్మి ఫైర్ వర్ుక్స లైసెన్సు ఉంది. ఇతని తోడల్లుడు మడగల జానకీరాం ఈ ఫైర్ వర్ుక్సను నడుపుతుండగా తోడల్లుడికి సాయంగా ఇందులో పనిచేస్తున్నాడు. చౌడువాడకు చెందిన శానాపతి బాబూరావు ఫైర్ వర్క్స్ యజమాని మడగల జానకీరాంకు మావ అవుతారు. అల్లుడికి సాయంగా ఉండడం కోసం ప్రతి రోజు ఉదయాన్నే చౌడువాడ నుంచి వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రమాదంలో ఇతనితో పాటు ఇతని పెద్దల్లుడు, స్వయాన బావమరిది అయిన అప్పికొండ తాతబ్బాయి కూడా మృతి చెందడంతో ఈ కుటుంబంలో పెద్ద విషాదాన్ని నింపింది. మామా అల్లుళ్లు ఇద్దరూ మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మరో అల్లుడు ఫైర్ వర్క్స్ యజమాని అయిన మడగల జానికీరాం కూడా దాదాపు 40 శాతం కాలిపోవడంతో ప్రమాదస్థితిలో విశాఖలోని కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మామా, అల్లుడు ప్రాణపాయస్థితిలో మరో అల్లుడు -
ధాంగ్ టా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో బాలికల ప్రతిభ
పాడేరు : మణిపూర్ రాష్ట్రం ఇంపాల్లో జరుగుతున్న 68వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ చాంపియన్ షిప్లో మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రతిభ చూపారు. మణిపూర్ రాష్ట్రం ఇంపాల్లో ఈనెల 7నుంచి 12 వరకు ధాంగ్ టా మార్షల్ ఆర్ట్స్ పోటీలు జరిగాయి. అండర్–19 బాలికల కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 62 కేజీల విభాగంలో విజయవాడకు చెందిన భానుప్రియ, 70 కేజీల విభాగంలో అనకాపల్లికి చెందిన పి.దుర్గ కాంస్య పతకాలు సాధించారు. వీరికి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వండల కొండబాబు, ఫిజికల్ డైరెక్టర్లు పాంగి సూరిబాబు, మత్స్యరాస భూపతిరాజు, కమలకుమారి కోచ్లుగా వ్యవహరించారు. -
ఊపిరి తీసిన విద్యుత్ తీగలు
విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడి కూలీ మృతి మునగపాక: కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో విద్యుత్ పనులు నిర్వహించే కూలీ మృత్యువాతకు గురైన సంఘటన మునగపాకలో ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం దండిసురవరం గ్రామానికి చెందిన బూసాల శంకరరావు(33)కు అయిదు సంవత్సరాల క్రితం వివాహమైంది. అతడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మునగపాకలో ఈ నెల 12వ తేదీన సంభవించిన గాలివాన కారణంగా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కాంట్రాక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా స్తంభంపై పనులు చేపడుతున్నాడు. ఇదే సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ వైర్లకు తాకడంతో శంకరరావు కింద పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన అతడిని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి 108 వాహనంలో తరలించేలోపు మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న మునగపాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మృతుడు శంకరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పగిలిన గుండెలు...
బాణసంచా కేంద్రంలో బతుకులు బుగ్గి ● కై లాసపట్నంలో ఘోర విషాదం సాక్షి, అనకాపల్లి/కోటవురట్ల : పొట్టకూటి కోసం మందుగుండు సామగ్రి తయారు చేసేందుకు వెళ్లిన పలువురు కార్మికులు ఆ మందుగుండుకే ఆహుతయ్యారు. బాణసంచా కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం పేద కార్మిక కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరికొందరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోటవురట్ల మండలం కై లాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన విస్ఫోటనం ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలను మింగేసింది. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మిట్ట మధ్యాహ్నం కావడంతో గ్రామస్తులంతా ఇళ్లలో సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించి అగ్ని ప్రకంపనలు సృష్టించినట్టుగా చుట్టూ పొగ, మంటలు కనిపించాయి. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో గల బాణసంచా కేంద్రంలో సంభవించిన పేలుడు ధాటికి గ్రామస్తులు భీతావహులయ్యారు. మంటలు ఎగిసిపడుతుంటే ఆవైపు వెళ్లాలంటే భయం..మరో వైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దీంతో ఫైర్ ఇంజన్, 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిందిలా... కై లాసపట్నం గ్రామానికి చెందిన మడగల జానకీరాం తన తోడల్లుడు అప్పికొండ తాతబ్బాయి పేరున ‘విజయలక్ష్మి ఫైర్వర్క్స్’ మందుగుండు తయారీకి లైసెన్సు తీసుకుని 20 ఏళ్లుగా మందుగుండు తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. లైసెన్స్కు వచ్చే ఏడాది 2026 వరకూ గడువు ఉంది. దీపావళి పండగతో పాటు సమీప మండలాల్లో పల్లెల్లో జరిగే గ్రామ పండుగలకు వచ్చే ఆర్డర్లపై మందుగుండు సామగ్రిని తయారు చేస్తారు. కొత్త అమావాస్య నుంచి వరుసగా పల్లెల్లో పండగలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయి. వర్క్లోడ్ ఎక్కువగా ఉండడంతో కార్మికులు ఒత్తిడితో పనిచేస్తున్నారు. సరిగ్గా 12.30 గంటల సమయంలో ఓ కార్మికుడు మందును దంచుతుండగా ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. వారం రోజులుగా తయారు చేసిన మందుగుండు సామగ్రి మొత్తం అక్కడే ఉండడంతో ఒక్కొక్కటిగా క్షణాల్లో అంటుకుపోయాయి. పక్కనే ఉన్న పౌడర్పై అగ్గి రేణువులు తూలి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పనిచేస్తున్న కార్మికులు తేరుకుని తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో తీవ్రంగా కాలిపోయి 8 మంది కార్మికులు అక్కడికక్కడే మాడి మసైపోయారు. విస్ఫోటనం ధాటికి అక్కడ ఉన్న రేకుల షెడ్లు, రెండు చిన్న స్లాబ్ గదులు చెల్లా చెదురయ్యాయి. భూమి కంపించినట్టయి..పెద్దగా మంట రావడంతో గ్రామస్థులంతా అదిరిపడి ఒక్కసారిగా పరుగున వచ్చారు. వరహాలు అనే గ్రామస్తుడు ఫైర్ ఇంజిన్, 108కి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నర్సీపట్నం, నక్కపల్లి, కోటవురట్ల, ప్రభుత్వ ఆస్పత్రి 108 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.సమీప నక్కపల్లి, నర్సీపట్నం, యలమంచిలి నుంచి మూడు ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. మంటలు అదుపు చేయడానికి సుమారు 4 గంటల పాటు సమయం పట్టింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న వారిని విశాఖ కేజిహెచ్కు తరలించారు. మైనర్ గాయాలతో ఉన్న వారికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఘటనా స్థలానికి కలెక్టర్.. ప్రమాదం జరిగిన గంటన్నర వ్యవధిలోనే జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానిక కోటవురట్ల సీహెచ్సీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కోటవురట్ల ప్రభుత్వ ఆస్పత్రి చేరుకుని చికిత్స పొందుతున్న వారిని వెంటనే విశాఖపట్నం కేజీహెచ్, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేసి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రుల బంధువులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం కలెక్టర్ సంఘటన స్థలానికి చేరుకుని పేలుడుకు కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
సార్థకనామధేయుడు ‘వనజీవి’
అనకాపల్లి టౌన్: పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ క్లబ్ చేపడుతున్న సేవలు అభినందనీయమని పౌర్ణమి సేవా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ నారాయణరావు అన్నారు. పట్టణంలోని గవరపాలెం పార్కు సెంటర్లో ఆదివారం గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో మూగజీవాలకు గూళ్ళు, ధాన్యం కుంచెలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకుడు కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ మాట్లాడుతూ ఇంటి పేరునే వనజీవిగా మర్చుకొని మొక్కలు నాటడంలో దేశంలోనే సరికొత్త రికార్డును సృష్టించి 2015లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్న గొప్ప నేత అని కొనియా డారు. వేసవిలో పక్షులకు నీరు దొరకడం కష్టంగా ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు పక్షులకు నీరు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ, కర్రి సన్యాసినాయుడు, పెంటకోట సురేష్, యల్లపు సంతోష్ కుమార్, అధిక సంఖ్యలో గ్రీన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని బైక్ ర్యాలీ
రావికమతం: గిరిజన సమస్యలపై నర్సీపట్నం కేంద్రంగా ప్రత్యేక గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని కోరుతూ రావికమతం మండలం గిరిజనులు జెడ్.బెన్నవరం నుంచి అజేయపురం వరకు ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కల్యాణపులోవ గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగంలో గిరిజనుల రక్షణకు అనేక చట్టాలు రూపొందించారన్నారు. వీటిని నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలకు పాలకులు వర్తింపజేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం భూ సమస్యపై ప్రత్యేక గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవాధ్యక్షుడు కే గోవిందరావు, పీవీటీజీ గిరిజన సంఘం నాయకులు గేమిల వాసు, గేమిల రాజు తదితరులు పాల్గొన్నారు. -
10 కిలోల గంజాయి పట్టివేత
ఇద్దరు అరెస్టు, ఒకరు పరారీముంచంగిపుట్టు: మండలంలో జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు జంక్షన్ వద్ద శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ జె.రామకృష్ణ తెలిపారు.ముందస్తు సమాచారంతో లబ్బూరు జంక్షన్ వద్ద తనిఖీ నిర్వహించినట్టు చెప్పారు. ఒడిశా వైపు నుంచి బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోడానికి ప్రయత్నించగా వారిలో ఇద్దరిని పట్టుకున్నట్టు తెలిపారు. ఒకరు పరారయ్యారని, బైక్కు కట్టి ఉన్న మూటలో గల 10కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. నిందితులు ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా పట్న బ్లాక్ హుచ్చల పంచాయతీ గొంటిగూడ గ్రామానికి చెందిన హేమంత్ నాయక్,హుచ్చల గ్రామానికి చెందిన బైలోచన్ నాయక్లుగా గుర్తించినట్టు చెప్పారు. వీరిని శనివారం రిమాండ్కు పంపినట్టు తెలిపారు. ఒడిశా రాష్ట్రం పనసపుట్టు గ్రామానికి చెందిన దెబా హంతల్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.ఈ తనిఖీలలో ఏఎస్ఐ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఈదురు గాలులు.. వడగళ్ల వాన
గొర్రెలమెట్టలో ఎగిరిపోయిన పాఠశాల పై కప్పు కొయ్యూరు/డుంబ్రిగుడ/హుకుంపేట : జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. కొయ్యూరు మండలంలో విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు పడడంతో సుమారు గంట సేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పైడిపనుకుల, తుమ్మలబంధతోపాటు మరి కొన్ని గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు బూదరాళ్ల పంచాయతీ గొర్రెలమెట్ట పాఠశాల భవనం పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మామిడి కాయలు, జీడి పిక్కలు నేరాలాయి. కృష్ణదేవిపేట–బలిఘట్టం లైన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డుంబ్రిగుడ మండలంలోని గుంటసీమ, అరకు, కించుమండ, సొవ్వా తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. హుకుంపేట మండలంలోని తీగలవలస, తడిగిరి, మట్టుజోరు, శోభకోట పంచాయతీలతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా గాలులు,ఉరుములు మెరుపులు రావడంతో మండల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. -
జలవనరులను సద్వినియోగం చేసుకోవాలి
చింతపల్లి: ఏజెన్సీలో గిరిజన రైతాంగం దేశీయ విత్తన సంపత్తిని వారసత్వ సంపదగా కాపాడుకోవాలని జలబీరాద్రి సంస్థ జాతీయ కన్వీనర్ బోలిశెట్టి సత్యనారాయణ అన్నారు. లంబసింగి పంచాయతీ పరిధిలోని రావిమానుపాకలు గ్రామంలో సీఫా సంస్థ అద్వర్యంలో నిర్మించిన చెక్డ్యాంను ఆ సంస్థ సీఈవో శశిప్రభతో కలసి ప్రారంభించారు.ఈ సందర్బంగా సర్పంచ్ శాంతకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాడ్లాడారు. జలవనరులను సద్వినియోగం చేసుకుంటూ దేశీయ విత్తనాలను కాపాడుకోవాలన్నారు. కొండవాగులకు అడ్డకట్టలు వేసుకుని ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలన్నారు. ఈ సందర్భంగా సంస్థ సీఈవో శశిప్రభ మాట్లాడుతూ లంబసింగి పంచాయతీలోని 12 గ్రామాలను దేశీయ విత్తనాల గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ ప్రాంతంలో కూడా దేశీయ విత్తన పర్యాటక గ్రామాలు అభివృద్ధికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో చిరుధాన్యాలు, పప్పులు, పండ్లమొక్కలతో పాటు కందమూలాదులు వంటి మొక్కలను పెంచే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ సభ్యురాలు నాగమణి, సంస్థ ప్రతినిదులు నర్సింగ్, రామలక్ష్మి, భాస్కర్, శ్రీనివాస్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్ట
పాడేరు : మినుములూరు పంచాయతీ సంగోడి గ్రామంలో పార్వతీ సమేత సిద్ధి సంగమేశ్వర స్వామీ ఆలయంలో బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో జీవ ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా శనివారం జరిగింది. ఇందులో భాగంగా నవగ్రహాలు, కాల బైరవుడు, ఛండిశ్వరుడు, దక్షిణమూర్తి, జంట నాగులు తదితర విగ్రహా ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. వేదపండితుడు మామిళ్ళపల్లి వెంకటసుబ్బరాయ శర్మ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆలయంలో భారీ అన్నసమరాధన కార్యక్రమం నిర్వహించారు. ఏజెన్సీలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సంగోడి గ్రామంలో సందడి వాతవరణం నెలకొంది. కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, అల్లూరి సీతారామరాజు జిల్లాల బ్రహ్మాకుమారీస్ సేవా కేంద్రాల సబ్ జోనల్ ఇన్చార్జి రాజయోగిని రజనీ దీదీ, పూజ్యపాద సత్యానంద గిరి స్వామిజీ తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. వసంతోత్సవం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, చక్రస్నానం వైభవంగా జరిగాయి. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి, చక్రపెరుమాళ్లు, ఆళ్వారులను కల్యాణ మండపంలో అధిష్టింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. పసుపు కొమ్ములను దంచి కొట్నాలు సేవ చేశారు. వసంతాలను ఉత్సవమూర్తుల వద్ద ఉంచి పూజలు జరిపారు. ఆ వసంతాలతో అర్చకుల వేదమంత్రోచ్ఛరణలు, నాదస్వర వాయిద్యాల మధ్య ఆలయ బేడా ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలోని స్వామివారి మూల విరాట్కు, ఆలయంలో కొలువుదీరిన దేవతా మూర్తులకు వసంతాలను సమర్పించారు. అక్కడి నుంచి వసంతాలను మళ్లీ కల్యాణ మండపానికి ప్రదక్షిణగా తీసుకొచ్చి ఉత్సవమూర్తులకు సమర్పించారు. అనంతరం ఆ వసంతాలను అర్చకులు భక్తులపై చల్లారు. తదుపరి అర్చకులు, సిబ్బంది, భక్తులు వసంతాలను ఒకరిపై ఒకరు జల్లుకుని సందడి చేశారు. తర్వాత ఉత్సవమూర్తులను ఒక పల్లకీలో, చక్రపెరుమాళ్లు, ఆళ్వారులను మరొక పల్లకీలో గంగధార వద్దకు తిరువీధిగా తీసుకెళ్లారు. అక్కడ గంగధార, పంచామృతాలతో పంచ కలశ స్నపనాన్ని విశేషంగా జరిపారు. చక్రస్నాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చక్రపెరుమాళ్లను గంగధార నీటి ప్రవాహం వద్ద ఉంచి ఆ నీటిని భక్తులపై పడేలా చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్నానమాచరించారు. తదుపరి ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ చేసి ఆలయంలోకి తిరువీధిగా తీసుకెళ్లారు. అంతకుముందు ఆలయ యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేద పండితులు, పారాయణదారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు సతీసమేతంగా ఉత్సవంలో పాల్గొన్నారు. ఏఈవో ఆనంద్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రంగులమయమైన సింహగిరి పరవశించిన భక్తజనం -
యూత్ బాక్సింగ్ టోర్నీలో నింజాస్ క్రీడాకారులు
వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం ఎటపాక: నందిగామలో కొలువైన అలివేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారి తిరుకల్యాణం శనివారం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలివేలు మంగ, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేదమంత్రాల నడుమ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ వేడుకను వేదపండితుడు సుబ్రహ్మణ్యశర్మ ఘనంగా జరిపించారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన జరిగింది.నర్సీపట్నం : విశాఖ పోర్ట్ స్టేడియంలో ఈ నెల 12 నుండి 13వ తేదీ జరుగుతున్న యూత్ ఉమెన్ మెన్ బాక్సింగ్ టోర్నమెంట్ నర్సీపట్నం నింజాస్ అకాడమీ నుంచి ఆరుగురు బాక్సర్లు పాల్గొన్నారు. శాప్ కోచ్ అబ్బు, ఉమెన్ కోచ్ వేపాడ ప్రియాంక ఆధ్వర్యంలో రిషిత, ఆల్తీ శిరీష, కొంచాడ నందిని, బొండా హేమ, రాజరాజేశ్వరి, శశికుమార్ పాల్గొన్నారు. క్లుప్తంగా -
మాతా శిశు మరణాలనివారణకు చర్యలు
● డీఎంహెచ్వో జమాల్బాషా చింతపల్లి: మాతాశిశు మరణాల నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జమాల్ బాషా తెలిపారు.ఆయన శనివారం చింతపల్లి ఏరియా ఆస్పత్రిని,లోతుగడ్డ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా చింతపల్లి ఆస్పత్రిలో వార్డులను పరిశీలించారు.రోగులకు అందుతున్న వైద్యసేవలను సూపరింటెండెంట్ ఇందిరా ప్రియాంకను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ వ్యాప్తంగా మాతా శిశు మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పీహెచ్సీల వైద్యులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ప్రసవానికి 10 రోజుల ముందుగానే గర్భిణులు వసతి గృహంలో చేరి వైద్యసేవలు పొందాలన్నారు. ఏరియా ఆస్పత్రిలో జరుగుతున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్కు సంబంధించిన ఫారం–ఎఫ్ను ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి పంపాలని తెలిపారు.ఎపిడమిక్ సీజన్ ప్రారంభం కావడంతోగ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీహెచ్వో గుల్లేలి సింహాద్రి పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ పీఏసీసభ్యులుగా ఇద్దరికి చోటు
విశాఖ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ)ని పునర్వ్యవస్థీకరించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఎంపీ గొల్ల బాబూరావుతో పాటు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడులకు సభ్యులు గా స్థానం లభించింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ప్రకటించింది. అలాగే పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉండనున్నారు. రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కన్వీనర్గా వ్యవహరించనున్నారు. -
అందరి కృషితో బాల్య వివాహాల నిర్మూలన
● ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి పాడేరు రూరల్: బాల్యవివాహాల నిర్మూలనకు అందరి సహకారం అవసరమని ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి తెలిపారు. పాడేరు మండలం కందమామిడి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో శనివారం కిశోర వికాసం కార్యక్రమం ద్వారా బాల్య వివాహాలు, విద్యా, వైద్యం, వ్యక్తిగత పరిశుభ్రతలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. విద్యతో పాటు ఆరోగ్య, వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధచూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లక్ష్మి, సీడీపీవో ఝాన్సీరాణి పాల్గొన్నారు. -
ఇదే నిదర్శనం..
స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రోడ్లు,రవాణా సౌకర్యం కనీసస్థాయిలో అందుబాటులో లేవు. అనారోగ్యానికి గురైనవారిని ఆస్పత్రులకు తరలించడానికి డోలీమోతే శరణ్యం.మండల కేంద్రాలకు చేరుకునేందుకు గుర్రాలు, కాలినడకతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి. అలాంటి స్థితిలో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన గ్రామాలు ప్రగతిబాట పట్టాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా వ్యాప్తంగా రూ.51,626.96 లక్షల వ్యయంతో 295 పక్కా తారురోడ్లను నిర్మించి, సుమారు 1,000 గ్రామాలకు రవాణా వ్యవస్థను మెరుగుపరిచారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఇటీవల జిల్లా పర్యటనలో మాట్లాడుతూగత ప్రభుత్వ హయాంలో ఒక్కరోడ్డు కూడా నిర్మించలేదని విమర్శలు చేయడంపైఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు ప్రగతి పథం..సాక్షి,పాడేరు: రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గిరిజన ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కనీస స్థాయిలో కూడా దృష్టి సారించలేదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణంపైనే ప్రత్యేక దృష్టి సారించారు. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ఐదేళ్ల పాలనలో జిల్లాలోని రంపచోడవరం,చింతూరు,పాడేరు డివిజన్ల పరిధిలో మారుమూల గ్రామాల్లో తారు రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు వెచ్చించడమే కాకుండా రవాణా సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకున్నారు.మారుమూల గ్రామాల రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో నిధులు రప్పించడంలోను అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విజయం సాధించింది. రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరగడంతో గిరిజనులకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. దీంతో మారుమూల పల్లెలకు సైతం వాహనాలు రయ్ రయ్ మంటూ పరుగులు తీస్తున్నాయి. మావోయిస్టు ప్రభావిత గ్రామాలు సైతం అభివృద్ధి చెందాయి. 108,104 వాహనాలు,తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్,ఇతర అంబులెన్స్లు కూడా సకాలంలో మెరుగైన సేవలు అందిస్తున్నాయంటే అవన్నీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన రోడ్ల అభివృద్ధి వల్లేనని గిరిజనులు చెబుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పాడేరు డివిజన్ చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఎస్సీఏ నిధులతో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్శాఖ రోడ్లు నిర్మించింది. ఎస్సీఏ పథకానికి సంబంధించి వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనతో పాడేరు నియోజకవర్గంలో రూ.2,457లక్షల వ్యయంతో 36 రోడ్లు, అరకు నియోజకవర్గంలో రూ.2,721.50 లక్షలతో 23 రోడ్లు నిర్మించారు. ఇవన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని రోడ్లు కావడంతో గిరిజనులకు రవాణా పరంగా ఎంతో మేలు జరిగింది. 59 రోడ్ల నిర్మాణాలకు మొత్తం రూ.5,178.50 లక్షలను గత ప్రభుత్వం ఖర్చుపెట్టింది. పంచాయతీరాజ్ విభాగంలో.. పాడేరు, రంపచోడవరం,అరకులోయ నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా భారీ ఎత్తున రోడ్ల నిర్మాణాలు జరిగాయి. రూరల్ కనెక్టివిటీకి సంబంధించి ఆర్సీపీఎల్డబ్ల్యూఈ పథకంలో 74 రోడ్ల నిర్మాణాలకు రూ. 29,682.7 లక్షలు, పీఎంజీఎస్వై ప్రాజెక్టులో 61 రోడ్ల నిర్మాణాలకు రూ.3431.39లక్షలు,ఏఐఐబీ పథకంలో 101రోడ్ల నిర్మాణాలకు రూ.13,334.00 లక్షలను ఖర్చు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాలు జరిగితే ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తప్పుడు విమర్శలు చేయడం తగదని మెజార్టీ గిరిజనులు హితవు పలుకుతున్నారు. కారడవిలో రింగ్ రోడ్డు పెదబయలు మండలంలోని మారుమూల ఇంజరి పంచాయతీ కొండ్రుం గ్రామం ఒకప్పుడు అత్యంత మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో నిత్యం మావోయిస్టులు,పోలీసుల బూటుచప్పుళ్లే వినిపించేవి. ఈ గ్రామానికి కనీసం కాలిబాట కూడా సక్రమంగా లేకపోవడంతో గతంలో అనేకసార్లు ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు,ఎస్పీలు,ఇతర అధికారులు హెలికాప్టర్లో వెళ్లే పరిస్థితి.ఇంజరి పంచాయతీలోని గ్రామాలకు ఎలాగైనా రోడ్లు వేసి రవాణా సౌకర్యం కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జి.మాడుగుల మండలం మద్దిగరువు నుంచి కండ్రుం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1,245.58 లక్షలు,పెదబయలు మండలంలోని గుల్లెలు నుంచి ఇంజరి మీదుగా కండ్రుం వరకు రహదారి నిర్మాణానికి రూ.1,494 లక్షలు ఖర్చుపెట్టింది. ప్రమాదకర గెడ్డలపై వంతెనల నిర్మాణం చేపట్టడంతో ఈ మారుమూల మావోయిస్టు ప్రభావిత పల్లెల్లో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వెలుగులు నింపింది. ఇప్పుడు ఏకంగా అధునాతన వాహనాలు కూడా ఈ రింగ్రోడ్డులో ప్రయాణం చేస్తున్నాయి.ఈ జన్మకు రోడ్డు చూడలేం అనుకున్న ఇంజరి పంచాయతీలోని గిరిజనులకు రింగ్ రోడ్డు నిర్మాణంతో మేలు జరిగింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మేలు మరవబోమని గిరిజనులంతా అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మారుమూల గ్రామాల రోడ్లకు మోక్షంమావోయిస్టు ప్రభావితప్రాంతాలకు పక్కా రహదారులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే రోడ్డు కల నెరవేరింది వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత దశాబ్దాల నాటి రోడ్డు కల నెరవేరింది.మేము బతికుండగా మా గ్రామానికి రోడ్డు నిర్మి స్తారని అనుకోలేదు. గత ప్రభుత్వంలో గుల్లేలు నుంచి ఇంజరి,కోండ్రుం మీదుగా తారురోడ్డు, జి.మాడుగుల మండలం బొయితిల గ్రామం జక్కం మీదుగా కోండ్రుం వరకు రింగురోడ్డు నిర్మాణం జరిగింది.గతంలో ఎవరూ ఇంజరివైపు చూసిన దాఖలాలు లేవు. మావో యిస్టుల అడ్డగా పేరుపొందిన ఇంజరికి గత వై.ఎస్.జగన్ ప్రభుత్వంలో రవాణా సదుపా యం కల్పించారు. ఆయనకు మేం రుణపడి ఉంటాం.– వంతాల నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ, ఇంజరిసెగ్మెంట్, పెదబయలు మండలం రూ.51626.96 లక్షలతో 295 ప్రగతి బాటలు మారుమూల కొండ్రుంకు రింగ్ రోడ్డు నిర్మాణం అటవీ ప్రాంతంలో నేడు కార్లు రయ్రయ్ రోడ్డు నిర్మాణానికి ముందు మద్దిగరువు నుంచి కుండ్రుంకు వెళ్లే దారి (ఫైల్) ఉన్నతాధికారులుహెలికాప్టర్లోనే వచ్చే వారు.. రోడ్డు సదుపాయం లేకపోవడంతో గతంలో ఇంజరి,గిన్నెలకోట పంచా యతీలకు ఉన్నతాధికారు లు హెలికాప్టర్పై, అధికారులు, ఉపాధ్యాయులు గుర్రాలపై వచ్చేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రెండు గ్రామ పంచాయతీలను కలుపుతూ రహదారులు నిర్మించడంతో రవాణా కష్టాలు తీరాయి. – గడుతూరి రామన్న పడాల్, మాజీ సర్పంచ్ గిన్నెలకోట. పెదబయలు మండలం. నాడు గుర్రాలే ఆధారం.. గతంలో ఇంజరి, గిన్నెల కోట,జామిగుడ, కుంతు ర్ల గ్రామ పంచాయతీలకు రోడ్డు సదుపాయం లేదు. రేషన్ సరుకులు తీసుకోడానికి, పండించి న పంటలు అమ్ముకోడా నికి గుర్రాలపై రాకపోకలు సాగించేవారం. అత్యవసర పరిస్థితుల్లో గుర్రాలు, డోలీ సహాయంతో రోగులను ఆస్పత్రికి తరలించే పరిస్థితి ఉండేది. నేడు గ్రామాలకు ద్విచక్ర వా హనాలు,ఆటోలు,జీపులు ఇతర అన్నివాహ నాలు వస్తున్నాయి.– తెరవాడ అన్నమ్మ, సర్పంచ్ జామిగుడ, పెదబయలు మండలం -
ట్రాఫిక్ నిబంధనలుతప్పనిసరిగా పాటించాలి
● రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్ రంపచోడవరం: ట్రాఫిక్ నిబంధనలను అందరూ తప్పని సరిగా పాటించాలని రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్ తెలిపారు. ఐ.పోలవరం జంక్షన్ వద్ద శనివారం ట్రాఫిక్ నిబంధనలు, నూతన మోటార్ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అతి వేగం ప్రమాదాలకు కారణమవుతుందన్నారు. సీతపల్లి ఆర్అండ్ఆర్ కాలనీ మ లుపు వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోల్లో ఎక్కువ మందిని ఎక్కించుకుని ప్రయాణించవద్దని సూచించారు. సీఐ రవికుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
దిగజారిన ఉత్తీర్ణత
ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు డీలాపడ్డారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో గత ఏడాదితో పొల్చితే ఫలితాలు పడిపోయాయి. ఈ ఏడాది ఫస్టియర్లో 46 శాతం, సెకండ్ ఇయర్లో 63 ఉత్తీర్ణత నమోదైంది. నిరుడు ఫస్టియర్లో 48 శాతం, సెకండ్ ఇయర్లో 70శాతం ఉత్తీర్ణత నమోదైంది.సాక్షి,పాడేరు: ఇంటర్ పరీక్షల ఫలితాలలో జిల్లా తిరోగమనం వైపు పయనించింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత తగ్గింది. గత ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 48శాతం సాధించగా, ఈఏడాది 46శాతం మంది ఉత్తీర్ణలయ్యారు. గత ఏడాది కంటే 2శాతం తగ్గింది. ద్వితీయ సంవత్సరంలో గత ఏడాది 70శాతం సాధించగా, ఈసారి 63శాతం మాత్రమే వచ్చింది. ఏడు శాతం తగ్గింది. రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ సంవత్సరంలో 14వ స్థానం, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 23స్థానాలకు పరిమితమైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్,ఒకేషనల్ గ్రూప్ల్లో 4,988 మంది పరీక్షలు రాయగా, 3,681మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 5,662 మందికి గాను 4,409మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో... జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఉత్తీర్ణత గత ఏడాది కంటే తగ్గింది.ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 3,093 మందికి గాను 1,553 మంది ఉత్తీర్ణులయ్యారు. ముంచంగిపుట్టు జూనియర్ కళాశాలలో అత్యధికంగా 87శాతం మంది పాస్ అయ్యారు. ఇక్కడ 239 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 198 మంది ఉత్తీర్ణలయ్యారు. అత్యల్పంగా వి.ఆర్.పురంలో ఆరుశాతం మంది ఉత్తీర్ణలయ్యారు. ఇక్కడ 49 మంది పరీక్షలు రాయగా ముగ్గురు మాత్రమే పాస్ అయ్యారు. అడ్డతీగల కళాశాలలో 8 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.ఇక్కడ 142మంది పరీక్షలు రాయగా 11మంది మాత్రమే పాస్ అయ్యారు. గంగవరం కళాశాలలో 47మంది పరీక్షలు రాయగా, ఐదుగురు ఉత్తీర్ణులవడంతో 11శాతం ఫలితాలు వచ్చాయి. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 2,883 మంది పరీక్షలు రాయగా,1,956 మంది పాస్ అయ్యారు. జిల్లాలో అత్యధికంగా ముంచంగిపుట్టు జూనియర్ కళాశాల 95 శాతం ఉత్తీర్ణత సాధించింది. 222 మందికిగాను 210 మంది ఉత్తీర్ణులయ్యారు. అత్యల్పంగా జి.మాడుగుల జూనియర్ కళాశాలలో 280 మందికి గాను 105 మంది పాస్ అవ్వడంతో 38శాతం ఉత్తీర్ణత లభించింది. గురుకుల విద్యాలయాల్లో ... జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఫలితాలు కాస్త మెరుగుపడ్డాయి. 17 గురుకులాలకు సంబంధించి 2,220 మంది గిరిజన విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయగా, 1,689మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 530 మంది ఫెయిలయ్యారు.సెకండ్ ఇయర్కు సంబంధించి 2,224 మంది పరీక్షలు రాయగా, 1,984మంది ఉత్తీర్ణులయ్యారు. 236 మంది ఫెయిలయ్యారు. అడ్డతీగల హైస్కూల్ ప్లస్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఇద్దరు పరీక్షలు రాయగా, ఇద్దరు పాస్ అయ్యి 100శాతం ఫలితాలు సాధించారు. ఐదు కేజీబీవీల్లో 100 శాతం ఫలితాలు జిల్లాలో ఐదు కేజీబీవీలు వంద శాతం ఫలితాలు సాధించాయి. జిల్లాలోని 19 కస్తుర్బాంధీ విద్యాలయాలకు సంబంధించి 675 మంది బాలికలు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయగా, 439మంది పాస్ అయ్యి 65శాతం ఫలితాలు సాధించారు. వీరిలో 236 మంది ఫెయిలయ్యారు. అత్యధికంగా ముంచంగిపుట్టు(కిలగాడ)కేజీబీవీ 97శాతం ఫలితాలు సాధించింది.14శాతం ఫలితాలతో అరకులోయ కేజీబీవీ విద్యార్థులు అట్టడుగున నిలిచారు. ఇంటర్ సెకండ్ ఇయర్కు సంబంధించి 565 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా,469మంది ఉత్తీర్ణులై 83శాతం ఫలితాలు సాధించారు. 96మంది ఫెయిలయ్యారు. డుంబ్రిగుడ, జీకే వీధి,హుకుంపేట,కొయ్యూరు,ముంచంగిపుట్టు(కిలగాడ)విద్యాలయాలు 100శాతం ఫలితాలతో సత్తా చాటాయి. 25శాతం ఫలితాలతో అరకులోయ కేజీబీవీ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 46శాతం, సెకండ్ ఇయర్లో 63 శాతం పాస్ జిల్లాకు ప్రథమ సంవత్సరంలో 14, ద్వితీయ సంవత్సరంలో 23వ స్థానం -
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంఅరకులోయటౌన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నూతనంగా నియమితులైన పార్టీ మండల అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర నాయకులు పనిచేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లో నూతనంగా నియమితులైన పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం గ్రామ, మండల స్థాయిలో సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రతిగ్రామంలో తాగునీరు, డ్రైనేజీలు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు వైఎస్సార్సీపీదేనని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేను రెండు మండలాల నాయకులు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జి పాంగి విజయ్, పార్టీ మండల అధ్యక్షులు పాంగి పరశురామ్, కొర్రా సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు గణపతి, పొట్టంగి రాంప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ పాంగి నర్సింగరావు, కార్యదర్శులు కోటిబాబు, శంకర్రావు, హెచ్.బి.రామ్ నాయుడు, లీల, కిల్లో దొన్ను, మార్కెట్ కమిటీ చైర్మన్ కిల్లో రాజరమేష్ బోస్, మాజీ జెడ్పీటీసీ దూరు గంగన్న దొర, అనంతగిరి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
నిర్దిష్టమైన విధానంలోరహదారుల నిర్మాణం
● కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు : రహదారుల నిర్మాణంలో నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, పీఐయూ, ఆర్ అండ్ బీ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రహదారుల నిర్మాణానికి ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా సరైన విధానాన్ని అమలు చేయడం లేదన్నారు. గతంలో నిర్మించిన రహదారులకే మళ్లీ ఎందుకు ప్రతిపాదనలు పంపిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. వంద మీటర్ల రోడ్డు నిర్మాణానికి మండలానికో ఒక రేటు ఎందుకు చెల్లిస్తున్నారని అడిగారు. అనంతరం రహదారుల నిర్మాణం కోసం చెల్లిస్తున్న జీఎస్టీ గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, వర్చువల్గా రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సింహాచలం, అపూర్వ భరత్ తదితరులు పాల్గొన్నారు. జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరణ పాడేరు రూరల్: రాష్ట్ర నైపుణ్యాభివృధ్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి త్రైమాసిక జాబ్ మేళా క్యాలెండర్ను కలెక్టర్ దినేష్కుమార్,పాడేరు ఐటీడీఏ ఇన్చార్జీ పీవో అభిషేక్గౌడ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17న అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్టు చెప్పారు. పలు ప్రముఖ కంపెనీల్లో నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత,జిల్లా నైపుణ్య అధికారి రోహిణి తదితరులు పాల్గొన్నారు. -
మలేరియా నిర్మూలనకు చర్యలు
డీఎంవో తులసిరంపచోడవరం: జిల్లాలో పూర్తిస్థాయిలో మలేరియాను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీఎంవో తులసి తెలిపారు. స్థానిక ఐటీడీఏ సమావేశం హాలులో శుక్రవారం పీవో కట్టా సింహాచలంతో కలిసి పీహెచ్సీ వైద్యులు,ఎంపీడీవోలు, ఎంఈవోలు,సీడీపీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మలేరియా నిర్మూలనకు ప్రతి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్టు చెప్పారు.ఎక్కడైనా జర్వాలు ప్రబలితే ఆ ప్రాంత వాసులకు వెంటనే రక్తపరీక్షలు నిర్వహించాలన్నారు.దోమతెరల వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా మలేరియా మందు స్ప్రేయింగ్, పాగింగ్ వంటివి చేయాలన్నారు. -
పిల్లల పోషకాహారంపైదృష్టిసారించాలి
● ఐటీడీఏ పీవో అపూర్వభరత్ చింతూరు: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల పోషకాహారంపై సిబ్బంది దృష్టి సారించాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. పోషణ అభియాన్లో భాగంగా మండలంలోని చూటూరు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రీస్కూల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ పోషణ పక్వాడ–2025 ఏడవ ఎడిషన్లో ఉన్న నాలుగు అంశాలపై ప్రతి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహించి, అవగాహన కల్పించాలని సూచించారు. పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని పీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో విజయగౌరి, సంఘమిత్ర, రాజయ్య, బాబూరావు, రమణమ్మ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి
చింతపల్లి: గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోవాలని అరకు ఎంపీ తనూజారాణి అన్నారు. శుక్రవారం చింతపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అనూషాదేవి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్యసమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు మాట్లాడుతూ మండల కేంద్రం సహా మండలంలోని 17 పంచాయతీల్లోనూ పలు గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, పరిష్కరించాలని కోరారు. తాగునీటి సరఫరా విభాగం ఏఈఈ సర్ణలత మాట్లాడుతూ మండల కేంద్రానికి రూ.22 కోట్లతో తాగునీటి పథకం మంజూరైనట్టు చెప్పారు. త్వరలో ప్రాజెక్టు పనులు మొదలవుతాయన్నారు. ఎర్రబొమ్మలు, తమ్మంగుల, తాజంగి, కొమ్మంగి, పంచాయతీల్లో సమస్యల గురించి ఆయా సర్పంచ్లు, ఎంపీటీసీలు వివరించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు బోడంనాయుడు, లోకేష్కుమార్, వెంకటేష్, ఐసీడీఎస్ సీడీపీవో రమణి,గృహనిర్మాణశాఖ ఏఈ రమణబాబు,బాలకిషోర్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.చింతపల్లి మండల సర్వసభ్య సమావేశంలో అరకు ఎంపీ తనూజా రాణి -
ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా ‘స్వర్ణాంధ్ర 2047 విజన్’
బీచ్రోడ్డు(విశాఖ): క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలను పరిగణనలోకి తీసుకుని.. నియోజకవర్గ స్థాయి 2047 విజన్ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 15 నాటికి అన్ని పనులను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాల అధికారులకు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి అంశాలను అవగతం చేసుకుంటూ.. ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల పరిధిలో పనిచేయాల్సిన అధికారుల బృందాలను ప్రకటించారు. జిల్లాకు కలెక్టర్ చైర్మన్గా, నియోజకవర్గానికి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఇన్చార్జిగా, ఆయా జోనల్ లేదా మండల స్థాయిలో జోనల్ కమిషనర్, ఎంపీడీవోలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని, ఒక్కో కమిటీలో ఐదుగురు సచివాలయ సిబ్బంది ఉంటారని ఆయన వెల్లడించారు. వీరంతా కలిసి స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికకు అనుగుణంగా తాత్కాలిక వార్షిక ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రజల అవసరాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలని, భవిష్యత్ రూపురేఖలు మార్చే విధంగా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి, మూడు జిల్లాల ఉన్నత స్థాయి అధికారులు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, ప్రణాళిక విభాగం అధికారులు, సీపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం -
క్రీడాకారులకు కలెక్టర్, ఐటీడీఏ పీవో అభినందన
పాడేరు రూరల్: ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో విజయం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న 16 మంది క్రీడాకారులను శుక్రవారం కలెక్టర్, దినేష్కుమార్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో అభిషేక్ గౌడ అభినందించారు. రాష్ట్ర స్థాయి మాదిరిగానే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో కూడా విజేతలుగా నిలిచి, పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు నూకరాజు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. రాజస్థాన్ రాష్ట్రం కోటలో ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు జిల్లా నుంచి 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. -
మర్రిగూడెం గ్రామాన్ని ఫేజ్1బి లో కలపాలి
కూనవరం: మర్రిగూడెం గ్రామాన్ని ఫేజ్1బిలో కలపాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితులు ధవళేశ్వరంలో ఆర్అండ్ఆర్ అడ్మినిస్ట్రేటివి అధికారి అభిషేక్ను ధవళేశ్వరంలో శుక్రవారం కలసి వినతిపత్రం అందజేశారు. మా గ్రామాన్ని 2022లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముంపులో గుర్తించి అన్ని సర్వేలు చేశారని, అవార్డ్ ఎంక్వయిరీ గ్రామసభ మాత్రమే నిర్వహించాల్సి ఉందని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై అడ్మినిస్ట్రేటివ్ అధికారి సానుకూలంగా స్పందించారని, ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే ఆగ్రామానికి పరిహారం అందే విధంగా కృషిచేస్తానని చెప్పినట్లు వారు తెలిపారు. -
బంగారు వస్తువుల అపహరణ కేసులో నిందితురాలు అరెస్టు
రంపచోడవరం: అపహరణకు గురైన బంగారు వస్తువులను గంగవరం పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నట్టు రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంగవరం పీఎస్ పరిధిలో మార్చి నెలలో రోళ్లుపల్లి సూర్యకాంతం ఇంటి బయట మరిచిపోయిన హ్యాండ్బ్యాగ్లో బంగారు వస్తువులు పోయినట్టు ఫిర్యాదు అందినట్టు తెలిపారు. సదరు మహిళ తన సొంత గ్రామం పి.ఎర్రగొండ వెళ్లేందుకు గంగవరంలోని తన ఇంటి వద్ద బయలుదేరినట్టు పేర్కొన్నారు. హ్యాండ్ బ్యాగ్లో నల్లపూసలు–24 గ్రామలు, బంగారు చైను–16 గ్రాములు, మూడు ఉంగరాలు–11 గ్రాములు ఉన్నట్లు ఫిర్యాదులో పెర్కొన్నట్టు తెలిపారు. సెల్ఫోన్ తెచ్చుకునేందుకు ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి బ్యాగ్ జిప్ తీసి, మళ్లీ వేసినట్టు అనుమానం వచ్చి బ్యాగ్ను చూసేసరికి బంగారు వస్తువులు అందులో లేవన్నారు. దీనిపై ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. రెండు టీములుగా ఏర్పడి, సీసీ టీవీ పుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రోళ్లుపల్లి లక్ష్మి సౌజన్యను ముద్దాయిగా గుర్తించినట్టు తెలిపారు. మధ్యవర్తుల సమక్షంలో ఆమెను గంగవరం సెంటర్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.ముద్దాయి నుంచి అపహరణకు గురై బంగారు వస్తువులను రికవరీ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు విలువ రూ.2.04లక్షలు ఉంటుందన్నారు. బంగారు చోరీ కేసును త్వరితగతిన చేధించినందకు సీఐ బి.నరసింహమూర్తి, ఎస్ఐ వెంకటేష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.వివరాలు వెల్లడించిన డీఎస్పీ సాయిప్రశాంత్ -
ఆదివాసీల సంక్షేమమే లక్ష్యం
ఓఎస్డీ జగదీష్ అడహళ్లిరంపచోడవరం: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని ఓఎస్డీ జగదీష్ అడహళ్లి అన్నారు. వై.రామవరం మండలం గుర్తేడు గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్లో రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్తో కలిసి పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో మొదటి స్థానం సాధించిన గుర్తేడు టీమ్కు రూ. 10 వేలు, రెండో స్థానం సాధించిన పాతకోట –ఏ జట్టుకు రూ. 8 వేలు, మూడో స్థానం సాధించిన పోతవరం జట్టుకు రూ. 6వేలు నగదు బహుమతిగా అందజేశారు. ఓఎస్డీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వైద్యశిబిరం నిర్వహించి, సుమారు వెయ్యి మందికి వైద్య సేవ లు అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీఐలు గోపాలకృష్ణ, పార్థసారథి, ఎస్ఐలు రామకృష్ణ, శివకుమార్ పాల్గొన్నారు. బొడ్డగండి పంచాయతీ పరిధిలో ఉన్న బొడ్డగండి, కల్లెపుగొంది, నాగలోవ,అంటిలోవ, రాకోట గ్రామాల్లో ఓఎస్డీ జగదీష్ అడహళ్లి పర్యటించి, గ్రామస్తులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే అధికారులు రావాలని, అధికారులు రావాలంటే మావోయిస్టులు ఉండకూడదన్నారు. అప్పుడే అభివృద్ధి జరుగతుందని చెప్పారు. -
వచ్చే నెల 10న జాతీయ లోక్ అదాలత్
అరకులోయటౌన్: స్థానిక ప్రథమ శ్రేణి జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో వచ్చేనెల 10న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు ఇన్చార్జి జడ్జి జి.స్వర్ణ తెలిపారు. శుక్రవారం స్థానిక కోర్టులో న్యాయవాదులు, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల పోలీస్, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటర్ ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో న్యాయవాదులు మురళీమోహన్, బి.సింహాచలం, ప్రభాకర్, పోలీస్, ఎకై ్సజ్ అధికారులు పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు వచ్చేది మన ప్రభుత్వమే
వైఎస్సార్సీపీ కార్యకర్తలతో అరకు ఎంపీ తనూజారాణి చింతపల్లి: వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడవద్దని, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణి అన్నారు. శుక్రవారం చింతపల్లి వచ్చిన ఆమె పార్టీనాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాజన్నబిడ్డగా జగన్మోహన్రెడ్డిని మొదటినుంచి మన్యం వాసులు ఆదరిస్తున్నారని, ఇదే ఒరవడి రాబోవు ఎన్నికల్లోనూ కొనసాగుతుందని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మరోమారు పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తల ఽమధ్య చిన్న చిన్న విభేదాలున్నా వాటన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకుని, పార్టీ అభివృద్ధికి చిత్తఽశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కోరాబు అనూషాదేవి, జెడ్పీటీసీ బాలయ్య, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి గణబాబు, చింతపల్లి సర్పంచ్దురియా పుష్పలత, ఎంపీటీసీలు దారలక్ష్మి, జయలక్ష్మి, కోఆప్షన్ సభ్యుడు నాజర్వల్లీ తదితరులు పాల్గొన్నారు. -
బస్షెల్టర్ నిర్మాణానికి చర్యలు
రాజవొమ్మంగి: మండల కేంద్రంలోని బస్షెల్టర్ నిర్మాణానికి గ్రామస్తులు ముందుకొచ్చారు. బస్షెల్టర్ లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’లో ‘ప్రయాణికులకు తప్పని పాట్లు’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు యుద్ద ప్రాతిపదికన బస్ షెల్టర్ నిర్మాణం కోసం, టాయ్లెట్లు ఏర్పాటుకు చేయి చేయి కలిపారు. స్థానిక సీఐ సన్యాసినాయుడు అధ్యక్షతన శుక్రవారం అత్యవసర సమావేశం జరిగింది. సమావేశంలో పోలీసుస్టేషన్ ఎదురుగా అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం, బస్షెల్టర్ ఏర్పాటుపై చర్చించారు. జాతీయ రహదారి కాంట్రాక్టర్, స్థానిక వ్యాపారులు, నాయకుల సహాయ సహకారాలతో వీటిని వెంటనే నిర్మించేందుకు ముందుకు వచ్చారు. జాతీయ రహదారి నిర్మాణపనుల్లో భాగంగా ఆంజనేయస్వామి ఆలయాన్ని సగానికి పైగా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణానికి భక్తులు ముందుకు వచ్చారు. ఈ ఆలయప్రాంగణంలోనే బస్షెల్టర్ కూడా నిర్మిస్తున్నట్టు ప్రకచించారు. ఇప్పటికే ఆలయానికి దాదాపు రూ. 1.30 లక్షల విరాళం సమకూరిందని, ఈ సొమ్ముతో పాటు వ్యాపారులు చందాలు వేసి ఆలయాన్ని నిర్మించేందుకు కంకణం కట్టుకొన్నారు. అదే విధంగా రహదారికి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో టాయ్లెట్లు నిర్మించేందుకు స్థానిక వైఎస్సార్సీపీ నాయుకుడు చింతలపూడి వెంకట రమణ ముందుకు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. విరాళం అందజేస్తున్న వెంకటరమణను సీఐ సహ అందరు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో టాయ్లెట్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిస్తానని వెంకటరమణ ప్రకటించారు. రాజవొమ్మంగిలో ప్రయాణికుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ నరసింహామూర్తి, స్షెషల్ బ్రాంచ్ హెచ్సీ దుర్గారావు, సర్పంచ్ రమణి, ఎంపీటీసీ సభ్యుడు గొల్లపూడి పెద్దిరాజు, వ్యాపారులు, మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సాక్షిపై కేసుల్ని ఖండించిన పాత్రికేయులు
సీతమ్మధార: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని కోరుతూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాక్షి దినపత్రిక బ్యూరోచీఫ్ కేజీ రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ సాక్షి దినపత్రిక నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సాక్షి అనకాపల్లి, అల్లూరి జిల్లాల డెస్క్ ఇన్చార్జి బీబీ సాగర్ మాట్లాడుతూ సాక్షి ఎడిటర్తో సహా ఆరుగురు పాత్రికేయులపై కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువలకు విఘాతమన్నారు. ఒక హత్యకేసులో బాధితుల పక్షాన నిలిచి వాస్తవాలు వెలికితీయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. వార్తలో పేర్కొన్న విషయాల్లో నిజానిజాలను ఖరారు చేసుకుని నిందితులపై చర్యలు తీసుకోవడం మాని, పాత్రికేయులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు ఏటీ రామునాయుడు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో జరిగిన హత్యోదంతంలో దోషులను శిక్షించాల్సింది పోయి, వార్త కవర్చేసిన సాక్షి జర్నలిస్టులపైనా, మీడియాపైనా కేసులు నమోదుచేయడం సరికాదన్నారు. సాక్షి ఎడిటర్తో పాటు జర్నలిస్టులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకుడు డి.ఆనంద్కుమార్ మాట్లాడుతూ వార్త కవర్ చేసిన సాక్షి మీడియా జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. సీనియర్ జర్నలిస్టు పిల్లా విజయకుమార్ మాట్లాడుతూ యాజమాన్యాల మీద ఉన్న కోపాన్ని వృత్తి ధర్మం నిర్వహిస్తున్న పాత్రికేయులపై ప్రదర్శించడం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్.అనేష్కుమార్, ఏపీడబ్ల్యూజే అనుబంధ సామ్నా జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణకిశోర్, భీమిలి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రమణప్రసాద్, పలు ప్రెస్క్లబ్ల కార్యవర్గసభ్యులు, అధిక సంఖ్యలో పలు మీడియాలకు చెందిన పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. -
వెల్లువెత్తిన వినతులు
పాడేరు : మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశపడి ఎన్నో వ్యయప్రయాసాలు ఓర్చి సుదూర ప్రాంతాల నుంచి ఐటీడీఏకు తరలివస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. కాళ్లరిగేలా పదేపదే తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అధికారుల తీరుపై ఫిర్యాదుదారులు అసహానం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై పదేపదే అర్జీలిస్తున్నా అధికారులు ఎందుకు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్కు జిల్లా నలుమూలల నుంచి వందలాది సంఖ్యలో ఫిర్యాదుదారులు తరలివస్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఐటీడీఏ పీఓ, సబ్ కలెక్టర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీంతో తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశ పడుతున్న ప్రజలకు నిరాశ ఎదురవుతోంది. ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు వాటి పరిష్కారారానికి తగిన రీతిలో చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ దినేష్కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డీఆర్వో పద్మాలత ప్రజల నుంచి 110 వినతులను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా ఉమ్మడి సమస్యలపైనే ఫిర్యాదులు అందాయి. ● చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ కుట్టువీధి గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్ దినేష్కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ● పాడేరు మండలం బంట్రోత్పుట్టు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం అసంపూర్తిగా ఉందని తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రాన్ని అందజేశారు. ● జి.మాడుగుల మెయిన్ రోడ్డు నుంచి చుట్టుమెట్ట గ్రామం వరకు రింగ్ రోడ్డు నిర్మించాలని స్థానికులు వంతాల తిమోతి వినతిపత్రాన్ని అందజేశారు. ● హుకుంపేట మండలం కామయ్యపేట రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని తడిగిరి, తీగలవలస గ్రామస్తులు కలెక్టర్ దినేష్కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ● ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ బొడ్డగొంది గ్రామంలో పాఠశాల భవనం మంజూరు చేయాలని సర్పంచ్ భాగ్యవతి వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యలపై ప్రతి శుక్రవారం అర్జీలు అందజేస్తున్న అధికారులు పరిష్కారానికి ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. అపరిష్కృతంగా సమస్యలు గ్రామాల్లో సమస్యలపై ఫిర్యాదుకు క్యూ కడుతున్న ప్రజలు మీ కోసంకు 110 వినతులు -
సూర్యప్రభ వాహనంపై సింహాచలేశుడు
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా 5వరోజు శుక్రవారం స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. స్వామి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను శోభాయమానంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం సింహగిరి మాడ వీధిలో తిరువీధి నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు రాజీవ్లోచన్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి మృగయోత్సవం నిర్వహించనున్నారు. -
విస్తృతంగా వాహన తనిఖీలు
వై.రామవరం: మండలంలోని పి.యర్రగొండ గ్రామ సమీపంలో సీఐ బి.నరసింహమూర్తి ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో ప్రధాన రహదారిలో వాహనాలను, వాటిలో సామగ్రిని తనిఖీచేశారు. అపరిచితులు, అనుమానితులపై నిఘా పెట్టారు. వాహన రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లు సక్రమంగా లేనివారిపై కేసులు నమోదు చేశారు. సీఆర్పీఎఫ్ జి 42 బెటాలియన్ అదనపు పోలీసు బలగాల సహాయంతో అనుమానాస్పద ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. -
పూలే సేవలు మరువలేనివి
పాడేరు : అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతీరావు పూలే ఎనలేని కృషి చేశారని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్లో పూలే చిత్రపటానికి కలెక్టర్ దినేష్కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళల అభ్యున్నతి కోసం కృషి తన జీవితాన్ని ధారాపోసిన మహానుభావుడు పూలే అని చెప్పారు. ఆయన సేవలు మరువలేనివని చెప్పారు. పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే మహిళలందరికీ మార్గదర్శకులన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఐటీడీఏ అధికారులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డీఆర్వో పద్మాలత, ఐటీడీఏ ఏపీవోలు ప్రభాకర్రావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
21 నుంచి గ్రామసభలు
ఐటీడీఏ పీవో అపూర్వభరత్చింతూరు: పోలవరం ప్రాజెక్టు ముంపులో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన 32 గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు 18 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించామని, మిగతా గ్రామాల్లో ఈనెల 21 నుంచి నిర్వహిస్తామని ఐటీడీఏ పీవో, ఆర్అండ్ఆర్ అధికారి అపూర్వభరత్ తెలిపారు. ఉలుమూరు, చూటూరులలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో ఆయన మాట్లాడారు. గ్రామసభలు ముగిసిన తరువాత డ్రాఫ్ట్ ఆర్అండ్ఆర్ నిర్వహించి తుది డేటాను సేకరిస్తామని, అనంతరం నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం సొమ్ము జమవుతుందని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. చూటూరు గ్రామసభలో ఆయన నిర్వాసితులతో మాట్లాడుతూ అనర్హుల జాబితాలో పేర్లు వచ్చిన వారితో పాటు పేర్లు రానివారు తగిన ఆధారాలు సమర్పిస్తే వాటిని పరిశీలించి అర్హుల జాబితాలో చేర్చుతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సవలం అమల, ఎస్డీసీ చంద్రశేఖర్, తహసీల్దార్ చిరంజీవి, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు. -
బుడ్డపనసలో ప్రత్యేక వైద్య శిబిరం
ముంచంగిపుట్టు: మండలంలోని రంగబయలు పంచాయతీ బుడ్డపనస గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జమాల్బాషా ఆదేశాల మేరకు శుక్రవారం లబ్బూరు వైద్యాధికారి శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. కాలినడకన అతి కష్టం మీద కొండలు, గుట్టలు ఎక్కి వైద్యాధికారి, వైద్య సిబ్బంది, 104 సిబ్బంది బుడ్డపనస చేరుకొని వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలో జ్వరం, జలుబు, దగ్గు,చర్మ వ్యాధులతో బాధపడుతున్న 45 మందికి వైద్య సేవలు అందించారు. మందులు పంపిణీ చేశారు. తీవ్రమైన జ్వరంతో పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురు చిన్నారులను మెరుగైన వైద్య సేవల నిమిత్తం ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించారు. వైద్య శిబిరాన్ని వైస్ ఎంపీపీ భాగ్యవతి పరిశీలించారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.అనారోగ్య బారిన పడిన వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి, వైద్యం పోందాలని, ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, నిల్వ ఉండే ఆహారం తినకూడదని, చిన్నారులకు ఎప్పటికప్పుడు వండిన ఆహారాన్ని మాత్రమే పెట్టాలని వైద్యాధికారి శ్యాంప్రసాద్ గ్రామస్తులకు సూచించారు. హెచ్వి భాగ్యవతి, లబ్బూరు వైద్య సిబ్బంది, 104 వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 45 మందికి వైద్య సేవలు అయిదుగురు చిన్నారులకు ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలింపు -
జీడిపిక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంగంగవరం: వన్ధన్ వికాస కేంద్రాల ఆధ్వర్యంలో జీడిపక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా జీడిపిక్కలు కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. మండల కేంద్రమైన గంగవరంలో ఆయన శుక్రవారం పర్యటించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న జీడిపిక్కల కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని , జీడి పిక్కలు భద్ర పరిచేందుకు వీలుగా ఉన్న గోదామును ఆయన పరిశీలించారు. మండల కేంద్రమైన గంగవరంలో డ్వాక్రా సంఘాలు వన్ధన్ వికాస కేంద్రాలు ద్వారా జీడిపిక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక డ్వాక్రా సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. రైతులు పండించిన జీడిపిక్కలను దళారీ వ్యాపారులకు అమ్మి మోసపోతున్నారని, దీనిని నివారించేందుకు వన్ధన్ వికాస కేంద్రాలు డ్వాక్రా సంఘాల ద్వారా జీడి పిక్కలు కొనుగోలు చేసి ఆ లబ్ధిని మీరే పొందవచ్చని వారికి సూచించారు. గంగవరంలో ఏర్పాటు చేయనున్న జీడిపిక్కల కొనుగోలు కేంద్రం ద్వారా త్వరలోనే పిక్కలు కొనుగోలు చేసేందుకు సిద్ధపడాలన్నారు. ఐటీడీఏ ద్వారా వన్ధన్ వికాస కేంద్రాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. జీడిమామిడి పిక్కలకు మంచి గిట్టుబాటు ధరను కల్పించి గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి ఐటిడిఎ చర్యలు తీసుకుంటుందన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో లక్ష్మణరావు, వెలుగు డీపీఎం పరమేష్, ఏపీఎం షణ్ముఖరావు, ఆర్ఐ లక్ష్మణరావు, వ్యవసాయాధికారి విశ్వనాఽథ్, ఉపాధి ఏపీఓ ప్రకాశ్, వీడీవీకే నాయకులు చిలకమ్మ, పద్మ, మార్కెటింగ్ టీమ్ ఉదయ్, శ్రీనివాస్, సీసీలు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో మూడోస్థానంలో సీలేరు జెన్కో జట్టు
సీలేరు: విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సీలేరు జెన్కో జట్టు మూడవ స్థానంలో నిలిచింది. మూడు రోజుల పాటు వీటీపీఎస్ (విజయవాడలో) నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో మూడవ స్థానం కోసం సీలేరు, రాజమహేంద్రవరం జట్లు తలపడగా సీలేరు జట్టు 42–17 స్కోర్తో రాజమహేంద్రవరం జట్టుపై విజయం సాధించింది. సీలేరు జట్టులో ఏడీఈ శ్రీనివాసులు బెస్ట్ రైడర్గా ఎంపికయ్యారు. గెలుపొందిన సీలేరు జట్టుకు ట్రోఫీ, నగదు బహుమతిని అందజేశారు.సీలేరు జట్టుకు మూడవ స్థానం రావడంతో ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ సూపరింటెండింగ్ ఇంజినీరు చంద్రశేఖర్ రెడ్డి ,ఈఈ శ్రీనివాసరెడ్డి ,పలువురు ఇంజనీర్లు ,సిబ్బంది అభినందించారు. -
మోదకొండమ్మతల్లి ఉత్సవాలకు శ్రీకారం
సాక్షి, పాడేరు: వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాలకు సంబంధించి అన్ని వర్గాల భక్తుల సహకారం తీసుకుంటున్నామన్నారు. పందిరి రాట ప్రతిష్ట కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించి, ఉత్సవ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, వైస్ ఎంపీపీ గంగపూజారి శివ, కేంద్ర కాఫీ బోర్డు డైరెక్టర్ కురుసా ఉమామహేశ్వరరావు, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, ఉప సర్పంచ్ బూరెడ్డి రామునాయుడు, మోదకొండమ్మతల్లి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు పలాసి కృష్ణారావు, కిల్లు గంగన్నపడాల్, కొట్టగుళ్లి సుబ్బారావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
రైతుల ఆకలి కేకలు వినిపించడం లేదా?
● చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు పేమెంట్లు లేవు ● ఉపాధి కూలీలకు 75 రోజులుగా వేతనాలు చెల్లించడం లేదు ● శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజం సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులన్నా.. పేదలన్నా చులకన భావమని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నెలల పాలనలో రైతుల ఆకలి కేకలు వినిపించడంలేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. చోడవరం షుగర్స్ రైతుల సమస్యలు, ఉపాధి కూలీల వేతనాల సమస్యలను గాలికొదిలేసి.. వైఎస్సార్ సీపీ నేతలపై దూషణలకు, వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే పనిగా పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు. లాసన్స్బేకాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పది నెలల పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో లక్ష టన్నులకు పైగా క్రషింగ్ నిలిచిపోయిందని, రైతులకు నేటికీ డబ్బు చెల్లించలేదన్నారు. రైతులకు డబ్బులు ఇవ్వకపోగా.. క్రషింగ్ను కూడా నిలిపివేస్తుంటే కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా అంటూ మండిపడ్డారు. తక్షణమే కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 75 రోజులుగా ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం బకాయి పెట్టిందని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా 75 రోజుల ఉపాధి వేతనాలను ఆపిన సందర్భాలు లేవన్నారు. కష్టపడ్డ వారికి కూలి డబ్బులు ఇవ్వకుండా నిలిపివేస్తే.. రాష్ట్రంలో పేదలు ఎలా బతకాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ.700 కోట్లు ఇవ్వాల్సి ఉందని, వేతనాలు ఇవ్వాలని ఉపాధి కూలీలు కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. తక్షణమే వారి వేతనాల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేస్తే సరిపోదని, ఏ హామీలైతే ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని బొత్స డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. -
ప్రయాణికులకు తప్పని పాట్లు
రాజవొమ్మంగి: రాజవొమ్మంగిలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో తమ పిల్లలతో బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ బస్షెల్టర్ లేకపోయినా గతంలో ప్రయాణికులు రహదారి పక్కన ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో వేచి ఉండేవారు. ఈ గ్రామం మీదుగా ప్రస్తుతం ఎన్హెచ్–516ఈ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయాన్ని తొలగించారు. దీంతో వేచి ఉండేందుకు నిలువ నీడ కరువైందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా రాజవొమ్మంగి సెంటర్లో ప్రయాణికుల కోసం బస్షెల్టర్ ఏర్పాటుచేయాలని, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని, చలివేంద్రం ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. రాజవొమ్మంగిలో కానరాని బస్షెల్టర్లు మండుటెండలో బస్సుల కోసం పడిగాపులు -
రేపటి నుంచి రాష్ట్ర స్థాయినాటకోత్సవాలు
మద్దిలపాలెం(విశాఖ): విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, కళాభారతి ఆధ్వర్యంలో ఏటా జరిపే రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలను ఈ నెల 12 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు వీఎండీఏ ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఎంఎస్ఎన్ రాజు, డాక్టర్ గుమ్మూలూరి రాంబాబులు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కళాభారతి ఆడిటోరియంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి పైడి కౌశిక్ నాటకోత్సవాలు పేరిట ఐదు రోజులపాటు ప్రదర్శనలు ఉంటాయన్నారు. 28 ఎంట్రీల్లో 9 నాటకాలను ఎంపిక చేశామన్నారు. పైడా కృష్ణ్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ నాటకోత్సవాలకు మహారాజపోషకులుగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. నాటకోత్సవాలకు ప్రవేశం ఉచితమన్నారు. కార్యక్రమంలో న్యాయనిర్ణేత బాబీవర్ధన్, జగత్ రావు, నాంచారయ్యలతో పాటు ఇతర కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. -
మన్యంలో భారీ వర్షం
సాక్షి, పాడేరు: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి 7 గంటల నుంచి పాడేరు ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు కురిసిన వర్షంతో పాడేరు పట్టణంలో రహదారులు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో పలు చోట్ల పిడుగులు పడడంతో ముందస్తుగానే పాడేరు ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వర్షం తగ్గిన తరువాత పునరుద్ధరించారు. ముంచంగిపుట్టులో పిడుగు పాటు ముంచంగిపుట్టు: పనసపుట్టు పంచాయతీ కడుతుల గ్రామంలో భారీ వర్షం పడిండి. ఓ కొబ్బరి చెట్టుపై పిడు గు పడింది. పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. విద్యుత్ సరఫరాకు కూడా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. -
గిరిజన చట్టాలకు కూటమి ప్రభుత్వం తూట్లు
రంపచోడవరం: కూటమి ప్రభుత్వం టూరిజం అభివృద్ధి ముసుగులో 1/70 చట్టానికి నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని, ఇందుకు గతంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు, అసెంబ్లీలో రంపచోడవరం ఎమ్మెల్యే మాట్లాడిన తీరు చెప్పకనే తెలుస్తుందని ఆదివాసీ సంఘాల కూటమి నాయకులు ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు వెదుళ్ల లచ్చిరెడ్డి , ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తీగల బాబూరావు అన్నారు. వారు గురువారం విలేకరులతో మాట్లాడుతూ 1/70 చట్టం ప్రకారం ప్రభుత్వం నేరుగా ఏజెన్సీలో పరిపాలించడానికి గాని, అధికారం చెలాయించటానికి గాని హక్కులేదని, ఇక్కడి వనరులపై పూర్తి హక్కులు ఆదివాసీలకే ఉన్నాయన్నారు. ఈ కారణంగానే కూటమి ప్రభుత్వం ఆదివాసీ ప్రజాప్రతినిధులతో గిరిజన చట్టాలు, హక్కులను తొలగించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీన్ని ఆదివాసీలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.రామన్నదొర పాల్గొన్నారు. అరకులోయ టౌన్: టూరిజం అభివృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో గల సహజవనరులను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర చెప్పారు. మండల కేంద్రంలోని గిరిజన సంఘం నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులైన మైనింగ్ వనరులు, అటవీ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, అటవి భూములు టూరిజం అభివృద్ధి పేరుతో ప్రైవేట సంస్థలకు దారాదత్తం చేయడానికి కూటమి ప్రభుత్వం యోచిస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ అరకులోయ పర్యటనలో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చేసిన ప్రకటన వెనుక 1/70 చట్టం నిర్వీర్యం చేయడానికి పెద్ద కుట్ర జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రను వ్యతిరేకించి, ఆదివాసీ చట్టాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు రామన్న, మగ్గన్నా, రాము తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు మేలు
కొయ్యూరు: ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఏఈవో సత్యనారాయణ చెప్పారు. మండలంలోని సింగవరంలోని రైతు సేవా కేంద్రంలో గురువారం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ ఎరువులనే వినియోగించాలని సూచించారు. గూడెంకొత్తవీధి: మానవాళి ఆరోగ్యానికి మేలు చేకూర్చేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని గూడెంకొత్తవీధి ఎంపీపీ బోయినకుమారి అన్నారు. ఏపీసీఎన్ఎఫ్ పథకంలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం విస్తరణపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఎంపీడీవో ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రకృతి వ్యవసాయం ఆచరణ వల్ల ప్రయోజనాలను వ్యవసాయాధికారి మధుసూదనరావు వివరించారు. తహసీల్దార్ రామకృష్ణ, ఉపాధి పథకం ఏపీవో రాంప్రసాద్, జలవనరులశాఖ ఏఈ నాగరాణి, సర్పంచ్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు. అడ్డతీగల: ప్రకృతి సాగు అమలుకు సంయుక్త కార్యాచరణ ప్రణాళిక తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఏవో ఎం.సువర్ణకుమారి అన్నారు. వెలుగు భవనంలో గురువారం ప్రకృతి సాగుపై అవగాహన కల్పించారు. సేంద్రియ పంటల సాగుతో ఆరోగ్యం పరిరక్షించుకోవచ్చని ఎంఈవో పి.శ్రీనివాసరావు అన్నారు. ప్రతి గ్రామంలో పంటలు, విస్తీర్ణం ఆధారంగా సర్వే నిర్వహిస్తామని ప్రకృతి వ్యవసాయ విభాగ అధికారులు తెలిపారు. ఏపీఎం నాయుడు, ఏపీవో అరవాలు, సహాయకులు పాల్గొన్నారు. -
నిర్వాసితుల అభీష్టం మేరకు పునరావాసం
చింతూరు: నిర్వాసితుల అభీష్టం మేరకు పునరావాసం, పరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ పీవో, ఆర్అండ్ఆర్ అధికారి అపూర్వభరత్ తెలిపారు. పోలవరం ముంపులో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన 32 గ్రామాలకు చెందిన పీసా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో గురువారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. గ్రామాల వారీగా పునరావాసం ఎక్కడ కావాలి? భూమికి భూమి వంటి అంశాలపై ఆయన నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కాలనీలకు తరలివెళ్లిన అనంతరం జీవనోపాధికి చేపట్టాల్సిన చర్యలు, వ్యవసాయ రాయితీలు, పరికరాలు, స్వయం ఉపాధికి రుణాలు వంటి అంశాల గురించి వారితో చర్చించారు. 18 ఏళ్లు దాటిన యువతకు ఎలాంటి నైపుణ్య శిక్షణ అవసరమో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ పరిహారం జాబితాల్లో పేర్లు లేనివారు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, సరైన ఆధారాలు చూపిస్తే పరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించామని, మిగతా గ్రామాల్లో కూడా ఈ నెల 20 తరువాత గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను పరిశీలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ● ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ -
మంచం పట్టిన బుడ్డపనస
ముంచంగిపుట్టు: మండలంలోని మారుమూల రంగబయలు పంచాయతీ బుడ్డపనస గ్రామం వ్యాధులతో అల్లాడుతుంది. ముఖ్యంగా మూడు సంవత్సరాల లోపు చిన్నారులు జ్వరం, దగ్గు, జలుబుతో మంచం పట్టారు. జ్వరాలతో సతమతమవుతున్నారు. కింద స్థాయి వైద్య సిబ్బంది వచ్చి వైద్య సేవలు అందిస్తున్నా జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామంలో సీసా జ్యోతిక, సీసా దామిని, మండి విశాల్, సీసా భాస్కర్, సీసా చందు, సీసా తులమ్మ, మండి లక్ష్మీ, మండి మోహన్, వంతాల బసంతి, మండి పార్వతి, మండి పూర్ణిమ, కిల్లో డొబ్రు, మండి దివ్య, వంతాల ఇలియన, మండి ఆనంద్, పాంగి ఆవంతికలతో పాటు మరి కొంతమంది జ్వరాలు, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి వ్యాధులతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల్లో పార్వతి పరిస్థితి ఆందోళనగా ఉందని భయపడుతున్నారు. తక్షణమే వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి బుడ్డపనస గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వ్యాధులు తగ్గుముఖం పట్టెలా చర్యలు తీసుకోవాలని గ్రామ గిరిజనులు కోరుతున్నారు. 20 మంచి చిన్నారులకు జ్వరాలు దగ్గు, జలుబుతో సతమతం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్న గ్రామస్తులు పట్టించుకోని అధికారులు -
ప్రిన్సిపాల్ తీరుపై ధ్వజం
ముంచంగిపుట్టు: స్థానిక నేతాజీ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఫీజు చెల్లించలేదని విద్యార్థులకు పరీక్షలు రాయకుండా చేసిన ప్రిన్సిపాల్ విజయదాస్ తీరు సరికాదని వైస్ ఎంపీపీ పి.సత్యనారాయణ, గిరిజన సంఘం మండల నేతలు అన్నారు. నేతాజీ స్కూల్ ఘటనపై గురువారం గిరిజన సంఘం నేతలు సమావేశం నిర్వహించి ఖండించారు. వైస్ ఎంపీపీ సత్యనారాయణ మాట్లాడుతూ ఫీజుతో ముడిపెట్టి విద్యార్థుల పరీక్షలు రాయకుండా అడ్డుకున్న ప్రిన్సిపాల్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రిన్సిపాల్పై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు శ్రీను, నర్సయ్య, గాసిరాందొర, బాలన్న తదితరులు పాల్గొన్నారు. -
దళారులకు పక్షపాత వైఖరి తగదు
వి.ఆర్.పురం: లంక పొగాకు కొనుగోలులో దళారులు పక్షపాత వైఖరి వీడాలని జెడ్పీటీసీ సభ్యుడు వి.రంగారెడ్డి, నాయకులు బి.నరసింహారావు, ఎం.సిద్ధూ, ఎం.శంకర్ తదితరులు కోరారు. మండల కేంద్రంలోని పొగాకు గొడౌన్లను వారు గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళారులు పొగాకు కోతకు ముందు కిలో పొగాకు రూ.183 ఇస్తామని ప్రకటించి, పంట చేతికొచ్చిన తరువాత మోడు తీసిన పొగాకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, ధరలు కూడా తగ్గిస్తున్నారన్నారు. దీంతో రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు మంచి డిమాండ్ ఉందని, ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. -
లక్ష్యానికి మించి ఉత్పత్తి
సీలేరు జల విద్యుత్ కేంద్రం ప్రతి ఏటా లోడిస్పాస్ అధికారులు ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమిస్తోంది. ఈ ఏడాది మూడు సార్లు ఆల్ టైం రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘనత రాష్ట్రంలో ఏ జల విద్యుత్ కేంద్రానికీ దక్కలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ కేంద్రాలకు మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఫిబ్రవరి 26న 4.949 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి మొదటి ఆల్ టైం రికార్డును చేసుకుంది. గత నెల 24వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 5.126 మిలియన్లు విద్యుత్ ఉత్పత్తి చేసి రెండో రికార్డును నెలకొల్పింది. అదే నెలలో ఒక రోజు వ్యవధిలో 5.325 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి మరింత ఘనత సాధించింది. -
గుదిబండ..!
సామాన్యులకుసాక్షి, పాడేరు: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ.50 పెంచడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పాడడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లోనూ గ్యాస్ వినియోగం అధికంగా ఉంది. ఓ వైపు ఆదాయం పెరగక పోగా.. మరోవైపు ఖర్చులు మాత్రం అధికమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్యాస్ ధరను పెంచడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 2.98 లక్షల కుటుంబాలకు గాను 1.80 లక్షల కుటుంబాలు గ్యాస్ను వినియోగిస్తున్నాయి. కిరోసిన్ పంపిణీ రద్దయిన తరువాత మధ్య తరగతి కుటుంబాలు గ్యాస్ వినియోగానికి అలవాటు పడ్డాయి. 85 శాతం జనాభా ఉన్న గిరిజనుల్లో 60 శాతం మంది గ్యాస్ను వినియోగిస్తున్నారు. ప్రతి నెలా ఒక సిలిండర్ను పూర్తి చేసే వినియోగదారులు అధికంగా ఉన్నారు. ఈ లెక్కన ప్రతి వినియోగదారుడికి నెలకు రూ.50 అదనంగా ఖర్చవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ను ఏడాదికి మూడు సిలెండర్ల చొప్పున పంపిణీ చేసినా మరో 7 నుంచి 9 సిలిండర్లు అవసరమవుతాయి. ప్రస్తుతం పెంచిన గ్యాస్ ధరల ప్రకారం ఏడాదికి రూ.350 నుంచి రూ.450 వరకు వినియోగదారులపై భారం పడుతుంది. ఏడాదికి వినియోగదారులపై రూ. 8.10కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.811. తాజాగా రూ.50 పెంచడంతో రూ.861కు చేరింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని మెజార్టీ గిరిజన కుటుంబాలు పేదలేనని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ ధర విషయంలో తగిన న్యాయం చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. రూ.50 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరఏడాదికి రూ.8.10 కోట్ల భారం జిల్లాలో కనెక్షన్లు 1,80,000గ్యాస్ ధర పెంపుతో అదనపు భారం గ్యాస్ సిలిండర్పై కేంద్ర ప్రభుత్వం రూ.50 పెంచడంతో అదనపు భారం పడింది. గ్యాస్ ధరలు తగ్గించాల్సిన ప్రభుత్వాలు ఇలా తరచూ పెంచుకుపోతున్నాయి. గ్యాస్ వినియోగం పెరిగిన నేపధ్యంలో ధరలు పెంచడం బాధాకరం. – జి.రమేష్, గ్యాస్ వినియోగదారుడు, పాడేరు అదనపు భారం మోయలేం.. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలతో అవస్థలు పడుతున్నాం. ఈ సమ యంలో ఉన్నట్టుండి గ్యాస్ బండ ధరను అదనంగా రూ.50 పెంచడం తగదు. ఈ భారాన్ని పేదలు మోయలేరు. ప్రభుత్వం దీనిని భరించాలి. పాత ధరకే గ్యాస్ను విక్రయించాలి. – సుమర్ల బంగారమ్మ, బూదరాళ్ల రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ఆ మొత్తాన్ని భరించాలి. ప్రతి నెలా గ్యాస్ బుక్ చేసుకునే సమయంలో రూ.50ను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి పేదలకు న్యాయం చేయాలి. – ఈశ్వరమ్మ, చింతపల్లి -
హోమ్స్టేలతో గిరిజనులకు ఉపాధి
సాక్షి, పాడేరు: పర్యాటకుల కోసం గిరిజన గ్రామాల్లో హోమ్స్టేలు ఏర్పాటు చేస్తే గిరిజనుల అభివృద్ధికి దోహదపడుతుందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అన్నారు. గురువారం ఆయన జిల్లాలోని పలు శాఖల అధికారులు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హోమ్స్టేల వల్ల గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునే గిరిజనులు పాత ఇళ్లను కూల్చకుండా హోమ్స్టేలుగా ఉపయోగించాలన్నారు. డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామంలో 15 హోమ్స్టేలను నిర్మించాలన్నారు. తాజంగి, లంబసింగిలో ఎన్ని హోమ్స్టేలు గుర్తించారని ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శిల్పారామం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, పాడేరు, హుకుంపేట మండలాల్లో అవసరమైన భూములను పరిశీలన చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలు కలుషితం కాకుండా ప్లాస్టిక్ సంచుల అమ్మకాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్లాస్టిక్ సంచుల విక్రయాలు చేపడుతున్న దుకాణాలను గుర్తించి సీజ్ చేయాలన్నారు. అరకులోయ, పాడేరు, అడ్డతీగల, రాజవొమ్మంగి మండల కేంద్రాలలో రహదారులను ఆక్రమించి రవాణాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ చట్టాలను సమర్థవంతంగా అమలుచేయాలని, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఆక్రమణలపై తనిఖీలు చేపట్టి, నోటీసులు జారీ చేయాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, జెడ్పీ నిధుల మంజూరుపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ్, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, సబ్ కలెక్టర్లు కల్పశ్రీ, సౌర్యమన్పటేల్, డీఎఫ్వో సందీప్రెడ్డి, డీఆర్డీఏ పీడీ మురళీ, సీపీవో పట్నాయక్, డీటీవో దాసు, అరకులోయ మ్యూజియం క్యూరేటర్ మురళీ, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. గిరిజన గ్రామాల్లో ఏర్పాటుకు చర్యలు జిల్లాలో శిల్పారామం కోసం భూముల పరిశీలన ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తే దుకాణాల సీజ్ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ దినేష్కుమార్ -
బలిమెల నీటి వినియోగంపై సమీక్ష
సీలేరు: B…{«§é, JyìlÔ> EÐ]l$Ãyìl °Æý‡Ó-çßæ-×æÌZ E¯]l² ºÍ-Ððl$ÌS fÌê-ÔèæĶæ$… ±sìæ Ñ°-Äñæ*VýS…Oò³ VýS$Æý‡$-ÐéÆý‡… CÆý‡$ Æ>[ÚëtÌS A«¨M>-Æý‡$Ë$ çÜÒ$„ýS °Æý‡Ó-íßæ…-^éÆý‡$. H Æ>çÙ‰… ™èlÐ]l$ ÐésêV> G°² sîæG…ïÜË$ Ñ°-Äñæ*W…^èl$MýS$-¯é²Æø ÌñæMýSPË$ ™ólÌêaÆý‡$. 2024 þOÌñæ ¯]l$…_ 2025 Ð]l*Ça ¯ðlÌê-QÆý‡$ ¯ésìæMìS B…{«§é ™èl¯]l ÐésêV> 69.8369 sîæG…ïÜ-ÌS¯]l$ Ñ°Äñæ*-W…-^èl$MøV>.. JyìlÔ> ™èl¯]l ÐésêV> 73.5147 sîæG…-ïÜ-ÌS¯]l$ Ñ°Äñæ*-W…-^èl$-MýS$¯]l²r$t °Æ>®-Ç…-^éÆý‡$. D çÜÒ$-„ýSÌZ B…{«§é ÐésêV> 24.2254 sîæG…-ïÜË$, JyìlÔ> ÐésêV> 20.5476 sîæG…-ïÜË$ V>¯]l$ CÆý‡$ Æ>[ÚëtÌS A«¨-M>-Æý‡$ÌS Ð]l$«§ýlÅ Jç³µ…§ýl… MýS$¨-Ç…-¨. CÇ-VóS-çÙ¯ŒS AÐ]l-çÜ-Æ>ÌS °Ñ$™èl¢… B…{«§éMýS$ 3 ÐólË$ MýS*ÅòÜ-MýS$PË$, JyìlÔ>MýS$ 3 ÐólË$ MýS*ÅòÜMýS$PÌS ±sìæ° H{í³ÌŒæ ¯ðlÌê-QÆý‡$ Ð]lÆý‡MýS$ Ñ°Äñæ*-W…-^èl$MøÐ]l-yé-°MìS CÆý‡$ Æ>[ÚëtÌS A«¨-M>Æý‡$Ë$ A…X-MýSÇ…-^éÆý‡$. D M>Æý‡Å{MýS-Ð]l$…ÌZ JyìlÔ> A«¨-M>-Æý‡$Ë$, ïÜÌôæÆý‡$ M>…ò³ÏMýS$Þ gñ毌S-Mø çÜ*ç³-Ç…-sñæ…-yðl…sŒæ C…h-±ÆŠ‡ ¼.^èl…-{§ýlÔóæ-Q-ÆŠ‡-ె , DDË$ G….}-°-ÐéçÜ-Æð‡yìlz, yîlDD MðS.§ýl$Æ>Y }°-Ðé-çÜ-Æ>Ð]l# ´ëÌŸY-¯é²Æý‡$. -
బడిఈడు పిల్లలనుపాఠశాలల్లో చేర్చాలి
జి.మాడుగుల: ఐదేళ్లు నిండిన బడిఈడు పిల్లలను ఉపాధ్యాయులు గుర్తించి పాఠశాలలో చేర్చుకోవాలని ఏఎస్సార్ జిల్లా విద్యాశాఖాధికారి బి.బ్రహ్మాజీరావు ఆదేశించారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా జి.మాడుగుల మండలం గాంధీనగరంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాల, వైబి గొందూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యాలు, హాజరు పట్టీలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ గ్రామాల్లో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను గుర్తించి పాఠశాలలో ప్రవేశాల కల్పించే విధానంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సిహెచ్.బాబూరావుపడాల్, తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకే క్వారీల నిర్వహణ
రంపచోడవరం: ఏజెన్సీలోని పలు మండలాల్లో క్వారీలు లీజుకు తీసుకున్న నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పక్కాగా పాటించాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం ఆదేశించారు. గురువారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో క్వారీల నిర్వాహాకుల ప్రతినిధులు, మైనింగ్ అధికారులతో రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీతో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని 11 మండలాల్లో మొత్తం 33 క్వారీలు ఉన్నాయన్నారు. ఇందులో 14 క్వారీలు పని చేస్తున్నాయని, మిగతా 19 క్వారీలు ప్రభుత్వం నుంచి అనుమతులు లేని కారణంగా ఆపి వేశామన్నారు. వై.రామవరం, రాజవొమ్మంగి, ఏటపాక, వీఆర్ పురం, కూనవరం మండలాల్లో ఏవిధమైన క్వారీలు లేవని ఆయన తెలిపారు. క్వారీ నిర్వాహకులు క్వారీల సమీపంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలు చేయాలన్నారు. క్వారీల్లో ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పీవో ఆదేశించారు. సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సొసైటీ ఏర్పాటు చేసుకొని క్వారీ నిర్వహణకు అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం క్వారీలు నిర్వహిస్తున్న యాజమానులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి యం.ఆనంద్, సర్వేయర్ కాళిదాసు, క్వారీ నిర్వహణ యాజమాన్యం కోసూరి సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీవో సింహాచలం ఆదేశం -
జనావాసంలోకి చుక్కల జింక
రాజవొమ్మంగి: సుమారు 4 సంవత్సరాల వయస్సు గల చుక్కల జింక గురువారం మండలంలోని సూరంపాలెం గ్రామంలోకి వచ్చింది. పరుగుపరుగున వచ్చిన ఆ జింక జనాలను చూసి భయంతో ఓ ఇంట్లోకి చొరబడింది. ఇంటి యజమాని రాజేశ్వరి తలుపులు మూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ క్షేత్రాధికారి ఉషారాణి వచ్చి జింకను పరిశీలించారు. ఎటువంటి గాయాలు లేవని నిర్ధారించుకొని ఆ జింక తిరిగి సమీప అడవిలోకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నారు. అడవులు అంతరించి పోతుండడం, నీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో వన్యప్రాణులు ఇలా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయని స్థాని కులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు
ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరలేదు. అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతు న్నాయి. సరైన వసతులు లేక అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. రంపచోడవరం: నియోజకవర్గ కేంద్రం రంపచోడవరంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. దీంతో అరకొర వసతులతో ఏళ్ల తరబడి ప్రభుత్వ క్వార్టర్స్లో నిర్వహిస్తున్నారు. సొంత భవనాల నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో ఐటీడీఏ క్వార్టర్స్కు అద్దె చెల్లిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కార్యాలయాలకు చెల్లించే అద్దెతో భవన నిర్మాణాలు పూర్తయ్యేమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎకై ్సజ్ శాఖ నుంచి ట్రెజరీ వరకు.. రంపచోడవరంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయాన్ని ఏళ్ల తరబడి రంపచోడవరం ఐటీడీఏ క్వార్టర్స్ నిర్వహిస్తున్నారు. సొంత భవనం నిర్మాణం కోసం ఆ శాఖ నుంచి ఇప్పటి ఎటువంటి ప్రతిపాదనలు లేవు. ఐటీడీఏ ఉద్యోగులు నివాసం ఉండాల్సిన క్వార్టర్స్లో కార్యాలయాల నిర్వహణతో ఉద్యోగులకు క్వార్టర్స్ లేని పరిస్థితి ఏర్పడింది. ఎకై ్సజ్ శాఖ పలు కేసుల్లో పట్టుకున్న వాహనాలను నిలిపిఉంచేందుకు సరైన ఖాళీ స్థలం కూడా లేదు. రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి మండలాల ప్రభుత్వ ఉద్యోగులు రంపచోడవరం ట్రెజరీ ద్వారా సేవలు పొందుతున్నారు. సొంత భవనం లేకపోవడంతో ఐటీడీఏ బి క్వార్టర్స్లో ట్రెజరీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్వార్టర్స్ భవనం పాతదైపోవడంతో వర్షాకాలం శ్లాబ్ లీక్ అవుతోంది. దీంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. 2014–19 మధ్య కాలంలో ట్రెజరీకి సొంత భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారుగాని, భవన నిర్మాణ పనులు ప్రారంభించ లేదు. ● కేంద్ర సిల్క్ బోర్డు కార్యాలయాన్ని పందిరిమామిడిలోని ఒక అద్దె ఇంటిలో నిర్వహిస్తున్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అక్కడ భవనాన్ని ఖాళీ చేసి పీఎంఆర్సీలో ఏర్పాటు చేశారు. ఒక పెద్ద హాల్లో నిర్వహిస్తున్నారు. ప్రత్యేక గదులు లేకపోవడంతో అధికారులు, ఉద్యోగులు సిబ్బందులకు గురవుతున్నారు. ● వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయానిదీ ఇదే పరిస్థితి. దీనిని అగ్రి ల్యాబ్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతమంతటినీ ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటుచేసిన తరువాత కొత్తగా ఏర్పాటు చేసిన సబ్రిజిస్ట్రార్ ఆఫీసుకు ప్రత్యేకంగా భవనాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది. పోలవరం ముంపుతో దేవీపట్నం ఖాళీ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా మండల కేంద్రమైన దేవీపట్నం గ్రామం కనుమరుగైంది. పోలవరం ముంపులో భాగంగా అప్పట్లోనే ప్రభు త్వ కార్యాలయాలను ఇందుకూరు పేటకు తరలించారు. అక్కడ కొన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ప్రైవేట్,అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.తహసీల్దార్ కార్యాలయాన్ని ఖాళీ చేసిన పాత సోషల్ వెల్ఫేర్ భవనంలో నిర్వహిస్తున్నారు. అక్క డ అరకొర వసతులతోనే కొనసాగిస్తున్నారు. కొత్త భవన నిర్మాణానికి అసలు పునాది రాయి కూడా పడలేదు.పోలీస్స్టేషన్ను పరగసనిపాడు కాలనీలో ఒక ఇంటిలో ఏర్పాటు చేశారు. ఎంపీడీవో కార్యాలయాన్ని సచివాలయం భవనంలో నిర్వహిస్తున్నా రు. పోలవరం ముంపునకు గురైన కార్యాలయాలను తరలించినా... కొత్త భవనాలు ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించలేదు. దేవీ పట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల ముంపునకు గురైంది. దీనిని ఇందుకూరుపేటలోని జెడ్పీ పాఠశాల భవనంలో నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు నిర్మించాలి ఇందుకూరుపేటలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలి. కొన్ని కార్యాలయాలను అరకొర వసతుల మధ్య నిర్వహిస్తున్నారు.పనులు కోసం కార్యాలయానికి వెళ్లిన వారు కూర్చునేందుకు కూడా సరైన వసతులు లేవు. సొంత భవనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – కుంజం మురళీ, ఎంపీపీ దేవీపట్నం అరకొర వసతులతో ఉద్యోగులకు ఇక్కట్లు -
గాంధారి ఆకులు తినిరెండు పశువుల మృతి
పెదబయలు: మండలంలోని గోమంగి పంచాయతీ సరియాపల్లి సమీపంలో కొండలపై మొలకెత్తిన గాంధారి ఆకులు తిని రెండు దుక్కి టెద్దులు మృతి చెందినట్టు గ్రామానికి చెందిన పాడి రైతు కుంబిడి వెంకటరమణ తెలిపారు. ప్రతి ఏటా వేసవిలో కురిసిన వర్షాలకు ఈ కొండలపై గాంధారి మొక్కలు మొలకెత్తుతాయి. వేసవిలో పశుగ్రాసం కొరత వల్ల పశువులు ఈ ఆకులు, పువ్వులు తిన్న కొద్ది గంటల వ్యవధిలోనే మృతి చెందుతున్నాయని రైతులు తెలిపారు. గత ఏడాది ఇదే సీజన్లో వారం రోజుల వ్యవధిలో గాంధారి ఆకులు తిని 13 పశువులు మృతి చెందాయని చెప్పారు. ప్రతి ఏడాది తీవ్రంగా నష్టపోతున్నామని, పశువులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని పాడి రైతులు కోరుతున్నారు. మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు. -
సంపూర్ణ పోషణతోనే మాతాశిశు మరణాల నివారణ
చింతపల్లి: సంపూర్ణ పోషణ అమలు ద్వారా మాతాశిశుమరణాలను అరికట్టవచ్చని సీ్త్ర,శిశుసంక్షేమశాఖ పీడీ సూర్యలక్ష్మి తెలిపారు. పౌష్టికాహార పక్షోత్సవాల సందర్భంగా తాజంగిలో బుధవారం గర్భిణులకు సీమంతాలు నిర్వహించి, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీడీ మాట్లాడుతూ గర్భిణులు తప్పని సరిగా పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. సీడీపీవో రమణి, ఏసీడీపీవో రామలక్ష్మి, వైద్యాధికారి భవాని, మాజీ సర్పంచ్లు కాంతమ్మ, రామస్వామి, సూపర్వైజర్లు విజయకుమారి, గౌరి, అప్పలనర్స, గౌర్నిషా తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు చెల్లించలేదని పరీక్షలకు నిరాకరణ
● 40 మంది విద్యార్థులను అడ్డుకున్న ప్రిన్సిపాల్ ● ముంచంగిపుట్టు ప్రైవేట్ స్కూల్లో ఘటన ● విచారణ జరిపించి, హెచ్చరించిన ఎంఈవో ● గురువారం పరీక్ష రాయించేందుకు అంగీకారం ● అమ్మఒడి లేకపోవడం వల్లే ఇబ్బందులంటున్న తల్లిదండ్రులు ముంచంగిపుట్టు: పాఠశాల ఫీజు చెల్లించలేదన్న కారణంతో 40 మంది విద్యార్థులు పరీక్ష రాయకుండా ప్రిన్సిపాల్ అడ్డుకున్నారు. దీంతో ఆ చిన్నారులు చిన్నబుచ్చుకుని ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు తెలియజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నేతాజీ ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాఠశాల ఫీజును పూర్తిగా చెల్లించ లేదని, అందువల్ల ఎల్కేజీ నుంచి 6వ తరగతి వరకు తరగతి వరకు మొత్తం 40మంది విద్యార్థులతో ఇంగ్లిష్ పరీక్ష రాయించవద్దని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ విజయదాసు పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించారు. దీంతో తోటి విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే 40మంది విద్యార్థులు మాత్రం పరీక్షలు రాకుండా నిరీక్షించి,మధ్యాహ్నం ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపారు. ఫీజు చెల్లించేందుకు కొంత సమయం కావాలని, ముందుగా పిల్లలతో పరీక్షలు రాయించాలని తల్లిదండ్రులు ఫోన్లో కోరినా ప్రిన్సిపాల్ నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన వారు ఎంఈవో కె.కృష్ణమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎంఈవో సీఆర్పీలు అనిల్,సురేష్,గౌరిశంకర్,హరిలతో కలిసి విచారణ జరిపారు. విద్యార్థులతో పరీక్షలు రాయించకపోవడంతో ప్రిన్సిపాల్పై మండిపడ్డారు.ఫీజుల వ్యవహారం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలని,విద్యార్థులతో పరీక్షలు రాయించకుండా చేస్తే సహించేది లేదని,శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దిగివచ్చిన ప్రిన్సిపాల్ తన తప్పును అంగీకరించి, ఆ 40 మందితో గురువారం పరీక్ష రాయించేందుకు అంగీకరించారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం నగదు ఠంచన్గా జమ అవడంతో ఫీజుల చెల్లింపులో ఇబ్బందులుండేవి కావని పలువురు తల్లిదండ్రులు తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంతో ఫీజులు చెల్లించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆశలు గల్లంతు?
జాబితాలు చూసి బెంబేలు కూనవరం: విలీన మండలాల్లో జరుగుతున్న గ్రామ సభలు నిర్వాసితులకు భరోసా కల్పించకపోగా వారిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి స్పష్టత ఇవ్వకుండా మళ్లీ, మళ్లీ దరఖాస్తులు ఇవ్వండని అధికారులు చెబుతుండడంతో నిర్వాసితుల గుండెల్లో రైళ్లు పరిగెడుత్తున్నాయి. గ్రామ సభ నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వస్తుందని ఎదురుచూసిన నిర్వాసితులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితిని చూసి నిరాశనిస్పృహలకు గురవుతున్నారు. ఆరేడు దశాబ్దాల నుంచి స్థానికంగా ఉంటున్నా తమ పేర్లు పీడీఎఫ్ (ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్) జాబితాలో గల్లంతు అయ్యాయని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. భూములు, ఇంటి స్థలం, స్థిరాస్తులు కోల్పోయి, ఎక్కడికి వెళ్లి బతకాలో తెలియని దుస్థితిలో ఉన్న తమకు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆర్అండ్ఆర్ పరిహారం అందని ద్రాక్ష అన్న చందంగా మారుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు. అసలేం జరుగుతోందంటే... పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో 41.15 కంటూకు స్థాయికి ముందే ముంపునకు గురవుతున్న 32 గ్రామాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం లాడర్ సర్వే ద్వారా గుర్తించి ఆయా గ్రామాల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దాన్ని కేంద్రం ఆమోదించించింది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో పునరావాస ప్రక్రియ ఊపు అందుకుంది. ఈ క్రమంలో ఫేజ్ 1బి కింద విలీన మండలాల్లో 32 గ్రామాలను చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముంపు పరిధిలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామసభలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో పోలవరం నిర్వాసితుల ఆర్అండ్ఆర్ జాబితాను సంబంధిత గ్రామ పంచాయతీల్లో ప్రకటించారు. చట్టానికి భిన్నంగా... క్షేత్రస్థాయిలో ప్రజల ప్రయోజనం కోసం నిర్మించే కట్టడాల మూలంగా పోలవరం నిర్వాసితులు భూమి, ఇళ్లు, ఆస్తి తదితరవి కోల్పొతే 2013 భూసేకర్ణ చట్టం విభాగం యొక్క3(సీ) (1) ప్రకారం ప్రభావిత కుటుంబం, ప్రభావిత ప్రాంతంలో నివసించకపోయినా ఆ కుటుంబాన్ని ప్రాజెక్ట్ ఎఫెక్ట్టెడ్ కుటుంబం (పీఏఎఫ్)గా పరిగణించవచ్చు. అంతేగాక ఈచట్టంలో రెండవ షెడ్యూల్ ప్రకారం ప్రభావిత కుటుంబాలు దారిద్య్రరేఖకు పైనఉన్నా లేదా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నా సంబంధం లేకుండా పునరావాస, పునరస్థాపన హక్కులను పొందేందుకు అర్హులు. అయితే బతుకుతెరువుకోసం పొరుగుమండలాల్లో పనులకు వెళ్లి వారానికి, నెలకొకసారో వచ్చి పోతున్న వారిని అధికారులు అనర్హులుగా గుర్తించడం తీవ్ర అన్యాయమని నిర్వాసితులు మండి పడుతున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క నిర్వాసితున్ని నష్టపోనీయం అని పదేపదే చెబుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.టేకులబోరు ఆర్అండ్ఆర్ గ్రామసభలో నిర్వాసితుల పేర్లు చదువుతున్న కార్యదర్శి (ఫైల్)ఆర్ అండ్ ఆర్... మొత్తం గ్రామాలు 32 13,817అనర్హులు327పోలవరం ముంపు ప్రియార్టీ మండలాలుకూనవరం, వీఆర్పురం, చింతూరు దరఖాస్తులు పెట్టుకున్నా సరికాని వైనం అనర్హులు అంటూ తిరస్కరణ తాజాగా సంబంధిత గ్రామపంచాయతీల నోటీసు బోర్డుల్లో పెట్టిన జాబితాల్లో కొందరి పేర్లు అనర్హులుగా, మరి కొందరి పేర్లు అర్హులని, కొన్ని కుటుంబాల పేర్లు ఏకంగా పీడీఎఫ్ జాబితాలోనే లేవని పేర్కొనడంతో నిర్వాసితులు భయాందోళనలకు గురవుతున్నారు. 60, 70 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉంటున్నా తమ పేర్లు పీడీఎఫ్ జాబితాలోనే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూనవరం, వి.ఆర్.పురం, చింతూరు మండలాల్లో జరుగుతున్న ఆర్అండ్ఆర్ గ్రామ సభల్లో అర్హులు, అనర్హులు, జాబితాలు చదివి వినిపిస్తుంటే ఆందోళన కలుగుతోందని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం నిర్వాసితులుఆర్అండ్ఆర్గ్రామసభలు జరిగిన గ్రామాలు 1414 గ్రామాల్లో మొత్తం నిర్వాసితులు3,837అధికారులు అర్హులుగా పేర్కొన్నవారు 3,510పీడీఎఫ్ జాబితాలోనా పేరు లేదు పీడీఎఫ్ జాబితాలో నాపేరు లేకపోవడంతో విస్తుపోయాను. మెయిన్ రోడ్డులోనే నా ఇల్లు ఉంది. భవనం వ్యాల్యూలో పరిహారం కూడా ప్రకటించా రు. నేను గ్రామం వదిలి పెట్టి ఎక్కడికీ వెళ్లిన దాఖలాలు లేవు. 20 ఎకరాల భూమిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం కారు చౌకగా ఎకరం కేవలం రూ.1.15 లక్షలకు ప్రభుత్వానికి స్వాధీనపరిచి త్యాగం చేశాం. అలాంటిది ఆర్అండ్ఆర్ పీడీఎఫ్లో నాకు తీవ్ర అన్యాయం చేశారు. – కల్లం వీరాంజనేయులు, నిర్వాసిత రైతు టేకులబోరు. పనులులేక పక్క ఊరెళితే అర్హుడు కాదంటున్నారు పోలవరం ముంపు గ్రామాల్లో దశాబ్దం నుంచి అభివృద్ధి పనులు ఆపేశారు. బతుకు దెరువు కోసం పొరుగు మండలం వెళ్లి పనులు చేసుకుంటుంటే స్థానికంగా లేవంటూ నా పేరు అనర్హుల జాబితాలో పెట్టారు. రేషన్కార్డు, ఆధార్కార్డు, ఓటర్ఐడీ కార్డు, ఇంటిపన్ను రశీదు, బ్యాంకు అకౌంటు, కరెంటుబిల్ల్, పాన్కార్డుమ కులం సర్టిపికెట్తో సహా అన్ని ప్రూఫ్లు ఉన్నా నాపేరు ఇన్ఎలిజిబుల్ జాబితాలో చూపించారు. – పుట్టి అంజన్రావు,నిర్వాసితుడు, కూనవరం -
21న పాడేరు ఐటీడీఏపాలకవర్గ సమావేశం
పాడేరు : ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని ఈనెల 21వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్టు పాడేరు ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షు లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మండల పరిష త్ అధ్యక్షులు, జెడ్పీటీసీలకు సమాచారం పంపించినట్టు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లాఅధికారులు, డివిజన్ స్థాయి అధికారులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు.పోషకాహార లోపంనివారించేందుకు చర్యలు ● ఐటీడీఏ పీవో అపూర్వభరత్ చింతూరు: పిల్లల్లో పోషకాహార లోపంతో పాటు ఊబకాయ నిర్మూలనకు తగిన చర్యలు చేపట్టాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ పక్షోత్సవ పోస్టర్ను బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ లబ్ధిదారులు స్వయంగా పోషణ ట్రాకర్లో నమోదు చేసుకునే విధానంపట్ల ప్రచారం నిర్వహించి, అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకునేలా చేయాలని, పక్షోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని పీవో ఆదేశించారు. వడగాడ్పుల నుంచి కాపాడుకోవాలి: ఎండవేడిమి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడగాడ్పుల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తల పా టించాలని ఐటీడీఏ పీవో అపూర్వభరత్ సూచించారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పోస్టర్ను బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడదెబ్బ నుంచి రక్షణకు ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలని, ఎండ కాసే సమయంలో ఇంటివద్దే ఉండేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏపీవో జగన్నాథరావు, ఈఈ మురళి, డిప్యూటీ డీఎంహెచ్వో పుల్లయ్య, సీడీపీవో విజయగౌరి పాల్గొన్నారు. -
పర్యాటక అభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు
రంపచోడవరం: జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తే గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు) అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశం హాలులో బుధవారం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అధ్యక్షతన ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధి, మినీ పరిశ్రమల ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, పలువురు జెడ్పీటీసీలు,ఎంపీపీలు, సర్పంచ్లు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఏజెన్సీలో జీడిపిక్కల కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో మోసాలు లేకుండా చూడాలన్నారు. గిరిజన యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి జరగాలని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో యువత వ్యాపారాలు నిర్వహించుకునేందుకు రుణాలు అందజేయాలన్నారు. పర్యా టక ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టి పర్యాటకులసంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాల ని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యాటకాభివృద్ధి కోసం మంత్రితో చర్చించినట్లు తెలిపారు. రంపచోడవరంలో జీడిపిక్కల పరిశ్రమ ఏర్పాటుకు చర్య లు చేపట్టనున్నట్టు చెప్పారు. పర్యాటక శాఖకు చెందిన భవనాలకు 30 సంవత్సరాల లీజు రద్దు చేసి గిరిజనులతో నడింపిచాలన్నారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ ఏజెన్సీలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలిపారు. మారేడుమిల్లి జెడ్పీటీసీ గొర్లె బాలాజీబాబు మాట్లాడుతూ రబ్బరు పరిశ్రమ ఏర్పా టు చేయాలని, దావవాడ, దుంపవలస, పూతిగుంట వాటర్ ఫాల్స్ను అభివృద్ధి చేయాలని కోరారు. పోలవరం ముంపు గ్రామాల్లోని యువతకు సబ్సిడీపై బో ట్లు ఇవ్వాలని ఎంపీపీ కుంజం మురళీ కోరారు. ఐ పోలవరం వద్ద సీతపల్లి వాగుపైరోప్ వే వంతెన నిర్మించాలని, భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టుల్లో బోట్ పాయింట్ ఏర్పాటు చేయాలని ఎంపీపీ బందంశ్రీదేవి కోరారు. రంపచోడవరంలో డివైడర్కు లైట్లు ఏర్పాటు చేయాలని సర్పంచ్ బొజ్జయ్య కోరారు.పర్యాటకాభివృద్ధి, మినీ పరిశ్రమల ఏర్పాటు సమావేశంలో ఎమ్మెల్సీ అనంతబాబు -
తీర ప్రాంతాల్లో ‘సాగర్ కవచ్’
కొమ్మాది: సాగర తీర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సాగర్ కవచ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం భీమిలి, మంగమారిపేట, రుషికొండ, సాగర్నగర్ బీచ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రుషికొండ బీచ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ పి.మనోజ్ కుమార్ తీర ప్రాంతాల అప్రమత్తతపై మత్స్యకారులకు, పర్యాటకులకు వివరించారు. తీర ప్రాంతాల వెంబడి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే ఎలా ఎదుర్కొని పోలీసులకు సమాచారం ఇవ్వాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి, గూఢచారి వ్యవస్థలను ఎలా కనుగొనాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. డీఐజీ పర్యటన : సాగర్కవచ్లో భాగంగా రుషికొండ బీచ్లో బుధవారం రాత్రి మైరెన్ డీఐజీ గోపినాథ్ జెట్టీ పర్యటించారు. ఇక్కడ బీచ్లోని పర్యాటకులతో కాసేపు మాట్లాడి, మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆయన వెంట మైరెన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు మురళీకృష్ణ, పి. మనోజ్కుమార్ తదితరులు ఉన్నారు. స్టీల్ప్లాంట్లో ఉత్కంఠగా సాగర్ కవచ్ ఉక్కునగరం: స్టీల్ప్లాంట్లో సాగర్ కవచ్ ఆపరేషన్ మొదటి రోజు ఉత్కంఠగా సాగింది. సీఐఎస్ఎఫ్ క్రైం అండ్ ఇంటిలిజెన్స్ వింగ్ (సీఐడబ్ల్యూ) సిబ్బంది నలుగురు అగంతకులను పట్టుకున్నారు. ముంబై దాడులు అనంతరం దేశంలోని అన్ని సెక్యూరిటీ దళాలు కలిసి ఏటా రెండుసార్లు సాగర్ కవచ్ నిర్వహిస్తుంటారు. పరిశ్రమలు, సంస్థల్లో సెక్యూరిటీను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొంత మంది వ్యక్తులు సముద్ర జలాలు, రహదారుల మీదుగా పరిశ్రమల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. వారిని ఆయా పరిశ్రమల సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బుధ, గురువారాలు రెండు రోజులు సాగర్ కవచ్ ఆపరేషన్గా నిర్ణయించారు. బుధవారం స్టీల్ప్లాంట్ సీఐఎస్ఎఫ్ సిబ్బంది, సిఐడబ్ల్యూ సిబ్బంది తనిఖీల్లో భాగంగా ఇద్దరిని ప్లాంట్ ప్లాజా గేటు వద్ద, ఇద్దరిని వాచ్ టవర్ 30 గోడ వద్ద పట్టుకున్నారు. మొదటి రోజు విజయవంతంగా జరిగిన ఈ ఆపరేషన్ గురువారం కూడా కొనసాగనుంది. -
శేష వాహనంపై అప్పన్న తిరువీధి
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మూడవరోజు బుధవారం స్వామికి శేషవాహనంపై తిరువీధి నిర్వహించారు. స్వామివారి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను విశేషంగా అలంకరించి శేషవవాహనంపై కొలువుంచారు. సింహగిరి మాడ వీధుల్లో నిర్వహించిన తిరువీధిలో భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ఆకట్టుకుంది. నేడు వైదిక సదస్యం, పండిత సదస్సు కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7.30 నుంచి వైదిక సదస్యం, మధ్యాహ్నం 3 నుంచి పండిత సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుంచి సర్వజన మనోరంజని వాహనంపై స్వామికి తిరువీధి నిర్వహిస్తారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. -
జాతీయ క్రీడాకారుడు లోహిత్కు అరకు ఎంపీ అభినందనలు
డుంబ్రిగుడ: ఇటీవల విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటి, వివిధ పతకాలను సాధించిన శెట్టి లోహిత్ను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి అభినందించారు. మండల కేంద్రంలో బుధవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని అనంతరం లోహిత్ గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ తనూజారాణి మాట్లాడుతూ జాతీయస్థాయిలో వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబర్చి, పతకాలు సాధించిన లోహిత్ను అభినందించారు. మరిన్ని పోటీల్లో విజయం సాధించి మన్య ప్రాంత ఖ్యాతిని చాటాలని, గిరిజన క్రీడాకారులకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. క్రీడారంగంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, జెడ్పీటీసీ సభ్యురాలు చటారి జానకమ్మ, వైస్ ఎంపీపీల లలిత, బబిత తదితరులున్నారు. -
షిప్యార్డ్లో నిచ్చెన పైనుంచి పడి కార్మికుడి మృతి
మల్కాపురం: షిప్యార్డ్లో నిచ్చెనపై నుంచి కింద పడిన సొసైటీ కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలివి.. గాజువాక ఆర్టీసీ డిపో సమీపంలోని పాత చెక్పోస్ట్ ఏరియాలో పిలక అప్పారావు(56) అలియాస్ అప్పారావు రెడ్డి తన భార్య, కుమారుడు, కుమార్తెతో నివాసం ఉంటున్నాడు. పిలక అప్పారావు షిప్యార్డ్లో మాజీ సొసైటీ కార్మికుడిగా 30 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు. షిప్యార్డ్ హాల్షాప్ డిపార్ట్మెంట్ వద్ద బుధవారం ఉదయం 8.30గంటల సమయంలో ఈవోటీ క్రేన్పైకి వెళ్లేందుకు నిచ్చెన ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడి నుంచి అదుపు తప్పి కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని తోటి కార్మికులు సంస్థ ఆవరణలోని ఆసుపత్రి వద్దకు తొలుత తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా మారడంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పారావు మృతి చెందారు. కాగా.. తమకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. పోలీసులు, యూనియన్ ప్రతినిధులు కలుగజేసుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. -
బాలికల విద్యకు బాసట
● కేజీబీవీల్లో 6 నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య ● ప్రవేశాలకు ఈ నెల 11 తుది గడువు విశాఖ విద్య: బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)లు మెరుగైన ఫలితాలిస్తున్నాయి. కార్పొరేట్కు దీటుగా అత్యుత్తమ విద్యా బోధన అందిస్తూ బాలికల భవితకు భరోసా కల్పిస్తున్నాయి. 11 నుంచి 17 ఏళ్ల వయస్సున్న బాలికలకు ఇక్కడ 6 నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య అందిస్తున్నారు. అనాథ బాలికలు, దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు చెందిన బాలికలకు కేజీబీవీ ప్రవేశాల్లో ప్రాధాన్యత ఇస్తారు. నాడు–నేడుతో సకల హంగులు అనాథలు, నిరుపేద వర్గాలకు చెందిన బాలికల కోసం ప్రత్యేకంగా కేజీబీవీలను ఏర్పాటు చేశారు. వీటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా కేజీబీవీల్లో సకల హంగులు కల్పించారు. టోఫెల్ కంటెంట్తో డిజిటిల్ విద్యాబోధన, ట్యాబుల వినియోగంతో ఇక్కడి విద్యార్థినులు చదువులతో పాటు, వివిధ పోటీ పరీక్షల్లో సత్తా చాటేలా గత ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. బోధనలో ‘స్మార్ట్’ వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యత నేపథ్యంలో పాఠశాల స్థాయిలోనే సాంకేతిక విప్లవం మొదలైంది. స్మార్ట్ పాఠాల బోధనతో కేజీబీవీల్లో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సైన్స్ ప్రాజెక్టుల రూపకల్పనలో కేజీబీవీ విద్యార్థినులు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 42 కేజీబీవీలు విశాఖ జిల్లాలో 3, అనకాపల్లి జిల్లాలో 20, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 19 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల బాలికలు ఈ నెల 11లోగా http:/apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో విద్యాలయంలో 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 7, 8, 9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లలో కూడా ప్రవేశం పొందవచ్చు. సద్వినియోగం చేసుకోవాలి కేజీబీవీల్లో ప్రవేశాలపై దృష్టి సారించాం. విద్యార్థినుల బంగారు భవిష్యత్ కోసం శతథా కృషి చేస్తున్నాం. అర్హులైన విద్యార్థినులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్ లేదా కేజీబీవీల ప్రిన్సిపాళ్లను సంపద్రించవచ్చు. – డాక్టర్ జోగ చంద్రశేఖర్రావు, ఏపీసీ, సమగ్ర శిక్ష, విశాఖ జిల్లా -
అక్రమ నిర్మాణాలకు సహకరించొద్దు
అరకులోయటౌన్: అరకులోయలో రోజురోజుకు అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, దీనిపై గిరిజనేతరుల పెత్తనం పెరుగుతోందని, అటువంటి వారిని ఎవరూ ప్రోత్సహించొద్దని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెవెన్యూ అధికారులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీపీ రంజపల్లి ఉషారాణి అధ్యక్షతన బుధవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మత్స్యలింగం పాల్గొని మాట్లాడారు. పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతున్న అరకులో గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రోత్సహించొద్దన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలని, అక్రమ నిర్మాణాల అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి ఫారెస్టు శాఖ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయని, సమస్య పరిష్కారానికి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్కు కోరామన్నారు. ఫుట్పాత్లో వ్యాపారాలు చేయడం వల్ల పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, వ్యాపారాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. జల్జీవన్ మిష్న్ నిధుల దుర్వినియోగంపై ధ్వజం మండలంలోని గిరి గ్రామాలల్లో తాగునీటి కల్పనకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జల్జీవన్ పథకం నిధుల దుర్వినియోగంపై ఎంపీటీసీ సభ్యులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నిలదీశారు. ఏ గ్రామంలో కూడా పూర్తిస్థాయి పనులు జరగలేదని, పాత నిర్మాణాలను చూపి బిల్లులు మార్చుకున్నారని ఆరోపించారు. అరకులోయ పట్టణంలో గత నెల రోజులుగా కొళాయిల ద్వారా నీటి సరఫరా చేయడం లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభాలు, సంక్షేమ పథకాల ప్రారంభానికి తమకు సమాచారం ఇవ్వకుండా టీడీపీ నేతల చేత భూమి పూజలు చేయిస్తూ, తమను అవమానపరుస్తున్నారని ఎంపీటీసీలు దురియా ఆనంద్కుమార్, ఎల్.బి.భీమరాజు, శత్రుఘ్న, స్వాభి రామ్మూర్తి, సర్పంచ్ రమేష్, చినబాబు, దురియా భాస్కర్రావు, బుటికి, ఎం. జ్యోతి, సుశ్మిత, భూర్జ బొజ్జ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశాారు. దీనిపై అధికారులను నిలదీశారు. దీనిపై ఎంపీపీ రంజపల్లి ఉషారాణి స్పందించి మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో రహదారులను త్వరితగతిన నిర్మించాలని సూచించారు. ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా వైద్య సేవలందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైస్ ఎంపీపీ కిల్లో రామన్న చెప్పారు. తహసీల్దార్ ఎం.వి.వి. ప్రసాద్ మాట్లాడుతూ పంచాయతీ అధికారులు గిరిజనేతరులకు ఎన్వోసీలు ఇవ్వవద్దని, ఇంటి పన్ను కట్టించుకోవద్దన్నారు. అరకులోయలో చొంపి రహదారిలో అక్రమ నిర్మాణదారుడిపై ఎల్టీఆర్ కేసు నమోదు చేశామన్నారు. అదే విధంగా తహసీల్దార్ క్వార్టర్స్ పక్కన అక్రమంగా షాపు నిర్మాణదారుడిపై ఎల్టీఆర్ కేసు నమోదు చేస్తామన్నారు. ఎంపీడీవో అడపా లవరాజు, ఎంఈఓ త్రినాథరావు, వెలుగు ఏపీఎం కృష్ణారావు, సిడీపీవో శారద, ఎకై ్సజ్ సీఐ సంతోష్, ఇంజినీరింగ్ ఏఈఈలు అభిషేక్, గోపికృష్ణ, క్రాంతి, మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
గిరి గ్రామాల్లో ఇటుకల పండుగ సందడి
అరకులోయటౌన్: గిరి గ్రామాల్లో ఇటుకల పండుగ సందడి ప్రారంభమైంది. గ్రామాల్లో నిర్వహిస్తున ఈ పండుగలో మహిళలదే ఆధిపత్యం. వ్యవసాయ పనులకు ముందు జరపుకునే ప్రత్యేకమైనది ఇటుకల పండుగ. ఈ పండుగ చివరి రోజు గ్రామ నాయుడు, తలయారి, పూజారులు వారం రోజుల పాటు పూజలు చేసిన విత్తనాలు గ్రామంలోని రైతులకు అందిస్తారు. ఈ విత్తనాన్ని తమ భూముల్లో మొట్టమొదటి సారి చల్లిన తరువాతే వ్యవసాయ పనులు చేపడుతారు. ఇటుకల పండగ నేపథ్యంలో గ్రామంలోని మహిళలు రోడ్డుపైకి వచ్చి వాహనాలను ఆపి పజోర్(డబ్బులు) వసూలు చేస్తారు. గ్రామంలోని పురుషులందరూ అడవిలో వేటకు వెళ్తారు... ఎవరైనా వేటకు వెళ్లని పక్షంలో వారికి మహిళలు జరిమానా విధిస్తారు. వేటకు వెళ్లి ఏదైనా జంతువును వేటాడి చంపితే అతనికి పూల మాలలు వేసి, డప్పు వాయిద్యాల నడుమ థింసా నృత్యాలతో గ్రామానికి తీసుకువచ్చి సన్మానిస్తారు. హోలిని తలపించే విధంగా రంగులు పూసుకొని వారం రోజులు సరదాగా గడుపుతారు. పండుగ చివరి రోజు పజోరు ద్వారా వసూలు చేసిన డబ్బులతో పిండి వంటలు చేసుకొని గ్రామస్తులంతా వింధు భోజనాలు చేసి పండుగ ముగిస్తారు. గ్రామ దేవత వద్ద పూజలు చేసిన విత్తనాన్ని పొలాల్లో జల్లడంతో అధిక దిగుబడులు వస్తాయనే గిరిరైతుల నమ్మకం. ఈ పండుగ ముగిసిన మరుసటి రోజు నుంచి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. -
యుద్ధప్రాతిపదికనవించ్కు మరమ్మతులు
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో గల వించ్కు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు జరుగుతున్నాయి.1948లో మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి అవసరమైన సామగ్రిని,యంత్రాలను తరలించేందుకు రూ.60 లక్షల వ్యయంతో దీనిని ఏర్పాటు చేశారు. వించ్ స్టీల్ రోప్కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మరమ్మతులు చేస్తూ ఉంటారు.ప్రసుత్తం వించ్కు చెందిన ట్రాక్ చక్రాలు సక్రమంగా లేకపోవడంతో ప్రమాదమని భావించిన అధికారులు వించ్ ప్రయాణం నిలుపుదల చేశారు. మాచ్ఖండ్ ప్రాజెక్టు అధికారులు.. ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల జెన్కో అధికారులకు తెలియజేసి రూ. ఏడు లక్షలు మంజూరు చేయించారు. ట్రాక్ చక్రాలతో పాటు వించ్ ప్రయాణంలో ముఖ్యంగా వినియోగించే స్టీల్ రోప్ను సైతం పరిశీలించి,మరమ్మతులు చేస్తున్నారు.వించ్ మరమ్మతులతో ప్రాజెక్టులో విధులు నిర్వహించే అధికారులు,కార్మికులు ఘాట్రోడ్డులో 12కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నారు.దాదాపు రెండు వారాల పాటు వించ్ ప్రయాణం నిలిపివేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. రెండు వారాల పాటు వించ్ ప్రయాణానికి బ్రేక్ రూ.7లక్షల వ్యయంతో పనులు వించ్ మార్గంలో మరమ్మతు పనులు చేస్తున్న సిబ్బంది -
కాలనుగుణ మార్పుల అధ్యయనంతోవృత్తిలో రాణింపు
● డీఎస్ఎన్ఎల్యూ విద్యార్థులతో హైకోర్టు న్యాయమూర్తి వీఆర్కే కృపాసాగర్సబ్బవరం: న్యాయ విద్యార్థులు కాలానుగుణంగా వస్తున్న మార్పులను అధ్యయనం చేస్తూ, విశ్వవిద్యాలయ వనరులను వినియోగించుకుని వృత్తిలో రాణించాలని హైకోర్టు న్యాయమూర్తి వీఆర్కే కృపాసాగర్ అన్నారు. స్థానిక దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్ఎన్ఎల్యూ)లో బుధవారం నిర్వహించిన ‘న్యాయ విద్య–న్యాయవాద వృత్తి’సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. వర్సిటీలో విద్యాభ్యాసం పూర్తిచేసుకుని బయట ప్రపంచంలో అడుగుపెట్టిన తరువాత పట్టించుకునేవారెవరూ ఉండరని, మనకు మనమే ఎదగాలన్నారు. అందుకే విశ్వవిద్యాలయంలోని వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని కాలాన్ని వృథా చేసుకోకుండా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. మిత్రులతో సబ్జెక్టు అంశాలపై చర్చిస్తూ, అధ్యాపకులతో సందేహ నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మన దగ్గరకు వచ్చే ప్రతి కేసును అంగీకరించి, వాదించే నైపుణ్యం కలిగి ఉండాలని సూచించారు. వర్సిటీలో బోధిస్తున్న సబ్జెక్టులతో పాటు దేశంలోని అన్ని హైకోర్టులు, సుప్రీం కోర్టుల్లో వెలువడే తీర్పులను అధ్యయనం చేస్తూ, అవగాహన పెంచుకున్నప్పుడే వృత్తిలో రాణించగలరన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి.సూర్యప్రకాశరావు, రిజిస్ట్రార్ డాక్టర్ విశ్వచంద్రనాఽథ్ మదాసు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మరింతగా ఎకో టూరిజం అభివృద్ధి
అరకులోయటౌన్: ఎకో టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన ప్రాజెక్టులు మరిన్ని రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. మండలంలోని సుంకరమెట్ట కాఫీ తోట ల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం ప్రాజెక్టు కింద రూ.19 లక్షలతో నిర్మించిన చెక్క వంతెనను ఆయన మంగళవారం ప్రారంభించారు. అరకులో య పర్యటనలో భాగంగా రెండో రోజు చెక్క వంతెనను ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరే షన్ చైర్మన్ ఆర్.పి.సుజయకృష్ణ రంగారావుతో కలిసి కాఫీ తోటల్లో మొక్కలు నాటిన పవన్ కల్యాణ్, అనంతరం కాఫీ తోటల్లో ఆ వంతెనపై కెనోఫీ వాక్ ప్రారంభించారు. వంతెనపై ఏర్పాటు చేసిన బర్డ్ నెస్ట్లను, ఏపీ అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని తిలకించారు. ఈ సందర్బంగా అరకుడీలైట్ కాఫీ బ్రాండ్ ప్రమోషన్తోపాటు సుంకరమెట్ట ఎకో టూరిజం పోస్టర్లు, బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ కజూరియా, విశాఖ రిజన్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ జ్యోతి తుల్లిమెల్లి, కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్, సర్పంచ్ గెమ్మెలి చినబాబు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంకు వినతి పత్రం సమర్పించిన వలంటీర్లు అరకులోయ పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్ను కలిసి వినతిపత్రం సమర్పించేందుకు ఆయన బస చేసిన అరకులోయ రైల్వే అతిథి గృహం వద్దకు సోమవారం రాత్రి వెళ్లిన వలంటీర్లను పోలీసులు అనుమతించలేదు. మంగళవారం ఉదయం వలంటీర్లు మళ్లీ ప్రయత్నించి, పవన్ కల్యాణ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. దీంతో స్పందించిన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మీ ఉద్యోగంపై ప్రభుత్వం ఎటువంటి జీవో జారీ చేయలేదని, ఎటువంటి జీవోలు లేకుండా గత ప్రభుత్వం మిమ్మల్ని నియమించిందన్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తానని పవన్ చెప్పారు. -
అప్పన్న కల్యాణోత్సవం
నేత్రపర్వంగాకమనీయం.. రమణీయం సింహగిరిపై ఉత్తరరాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో రాత్రి 10.30 గంటల నుంచి వార్షిక కల్యాణోత్సవం నిర్వహించారు. స్వామిని, అమ్మవార్లను కల్యాణ ప్రాంగణంలోకి తీసుకొచ్చి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తదుపరి భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం అందజేశారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేదపండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. రథోత్సవం, కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో విశేషంగా ఏర్పాట్లు చేశారు. గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ సీఐ గొలగాని అప్పారావు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులుసింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం మంగళవారం రాత్రి కనులపండువగా జరిగింది. భూదేవి, శ్రీదేవి సమేత అప్పన్న స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చిన భక్తుల హరి నామస్మరణలతో సింహగిరి మార్మోగింది. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కల్యాణోత్సవ ఘట్టాలను ఆలయ అర్చకులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. తొలుత ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువులు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానాన్ని పలుకుతూ అలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు గరుడాళ్వార్ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందడిగా ఎదురు సన్నాహం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారురంగు పల్లకీలో, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకీలో వేంజేపచేశారు. అమ్మవార్ల పల్లకీని, అయ్యవారి పల్లకీని సింహగిరి మాడవీధిల్లో చెరొకవైపు తీసుకెళ్లి పశ్చిమ మాడ వీధిలో జోడుభద్రాల వద్ద ఎదురెదురుగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచారు. అక్కడ ఎదురు సన్నాహోత్సవం వాద, సంవాదాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తుల ఆనందోత్సాహాల మధ్య వేడుకగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఎదురు సన్నాహోత్సవాన్ని రక్తి కట్టించారు. వ్యాఖ్యాతలుగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిచారకుడు కె.ఇ.లక్ష్మీనరసింహన్, నరసాపురానికి చెందిన ఆధ్యాత్మికవేత్త వంగల వెంకటాచార్యస్వామి వ్యవహరించారు. హోరెత్తిన రథోత్సవం సింహగిరి మాడ వీధిలో పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తులను రథంలో వేంజేపచేశారు. జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథసారధిగా నిలిచి రథ కదలికలను సూచిస్తుండగా, లక్ష్మీదేవి అమ్మవారి బంధువులుగా విశాఖ నగరం నలుమూలల నుంచి వచ్చిన జాలర్లు రథం నడిపే బాధ్యతలు చేపట్టారు. అశేష భక్తజనం స్వామి రథాన్ని తాళ్లతో లాగి పరవశించారు. -
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
ఏలూరు రేంజ్ ట్రైనీ ఎస్ఐలకు ఎస్పీ సూచన పాడేరు: ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వచ్చే వారితో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని, కేసుల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎస్పీ అమిత్ బర్దర్ సూచించారు. నెలరోజుల శిక్షణ కోసం జిల్లాకు వచ్చిన ఏలూరు రేంజ్కు చెందిన 37 మంది ట్రైనీ ఎస్ఐలు మంగళవారం ఎస్పీని కలిశారు. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో వారితో ఎస్పీ సమావేశమయ్యారు. వివిధ కేసులను చేధించే పద్ధతులను ఎస్పీ తెలియజేశారు. పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, సైబర్ నేరాలు, శక్తి యాప్ తదితర అంశాలపై వారికి వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. అనంతరం శిక్షణ కోసం వచ్చిన వారికి పోలీస్ స్టేషన్లను కేటాయించారు. -
వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి
● ఆవేదన కలిగించేలా ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలు ● కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగింది : సంఘం నేతలు డుంబ్రిగుడ: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లుగా పనిచేసిన తమను విధుల నుంచి తొలగించడం అన్యాయమని డుంబ్రిగుడ, అరకులోయ వలంటీర్ల సంఘం నేతలు దివ్యభారతి, ఎస్. కృష్ణవేణి, బి.విజయ్కుమార్, సరస్వతి, ఉదయ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు కురిడిలో మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ను కోరారు. అయితే వలంటీర్ల నియామకానికి సంబంధించి ఎలాంటి జీవోలు లేవని, ఇచ్చేది జీతం కాదు, గౌరవ వేతనం మాత్రమేనని పవన్కల్యాణ్ చెప్పారని వారు వాపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తమను తొలగించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తమను ఆదుకోవాలని వారు కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రకారం రూ. పదివేల వేతనం చెల్లించి, తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి నేతలు విస్మరించడం సరికాదన్నారు. ఇప్పటికై న రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. -
సంపూర్ణ గిరిజనాభివృద్ధే లక్ష్యం
సాక్షి, పాడేరు: సంపూర్ణ గిరిజనాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుజేయాలని దిశ కమిటీ అధ్యక్షురాలు,అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ,పర్యవేక్షణ కమిటీ(దిశ)సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. గత మూడు నెలల వ్యవధిలో 27శాఖల ద్వారా అమలైన అఽభివృద్ధి పనులపై సమీక్షించారు.ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజనులకు మౌలిక సదుపాయాలు సమకూర్చాలన్నారు. చిరుధాన్యాలతో ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. నాబార్డు ద్వారా అమలవుతున్న పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు.జాతీయ రహదారి నిర్మాణంతో ధ్వంసమైన చెక్డ్యామ్లు,తాగునీటి పైపులైన్ వ్యవస్థలను వెంటనే పునరుద్ధరించాలని, గిరిజన రైతులకు వ్యవసా య పరికరాలను పంపిణీ చేయాలని తెలిపారు. మొదటి విడతలో 10 అంబులెన్స్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల వివరాలను సమర్పించాలన్నారు. 108 సూర్యనమస్కారాలను విజయవంతంగా నిర్వహించి వరల్డ్ రికార్డ్ సాధించడంపై కలెక్టర్,ఇతర అధికారులను ఆమె అభినందించారు ఆర్గానిక్ జిల్లా లక్ష్యంగా కృషి : కలెక్టర్ కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ ఆర్గానిక్ జిల్లా లక్ష్యంగా అధికారులంతా కృషి చేయాలన్నారు. వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేసే సమయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో చర్చించాలని సూచించారు.జాతీయ రహదారి పనులు వేగవంతంగా జరగాలని, లక్ష ఎకరాల్లో కాఫీతోటల పెంపకానికి అవసరమైన నీడనిచ్చే మొక్కల నర్సరీలను నిర్వహించాలని తెలిపారు. రూ.20నుంచి రూ.25కోట్లతో కడియం నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతుల సంక్షేమానికి కృషి చేయాలి: అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి అధికారులు కృషిచేయాలని, సకాలంలో విత్తనాలు,వ్యవసాయ పరికరాలు పంపిణీ చే యాలని తెలిపారు. గిట్టుబాటు ధరతో గిరిజన వ్యవసాయ,వాణిజ్య ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, జాతీయ రహదారి నిర్మాణ పనులు సకాలంలో పూర్తిచేయాలన్నారు. జిల్లాలో అన్ని గిరిజన కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ అభిషేక్గౌడ, చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ పీవోలు అపూర్వభరత్, సింహాచలం, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీఎంహెచ్వో డాక్టర్ నారాయణమూర్తి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. వాల్పోస్టర్ల ఆవిష్కరణ దిశ సమావేశంలో సీ్త్ర శిశుసంక్షేమశాఖ, నాబార్డుకు సంబంధించిన వాల్ పోస్టర్లు,బుక్లెట్లను కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్,అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మంగళవారం ఆవిష్కరించారు. దిశ కమిటీ అధ్యక్షురాలు, అరకు ఎంపీ తనూజరాణి -
ప్రాథమిక వైద్యం..అందని ౖదెన్యం
గిరిజన విద్యాలయాల్లో విద్యార్థులకు ప్రాథమిక వైద్య సేవలు సకాలంలో అందడం లేదు. అనారోగ్యం బారిన పడిన వారిని దూరంగా ఉన్న పీహెచ్సీలకు తరలించే సరికి వైద్య సేవలందడంలో జాప్యం జరుగుతుండడంతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. విద్యార్థులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ప్రాథమిక వైద్యసేవలందించడానికి వీలుగాహెల్త్ వలంటీర్లను నియమించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో హెల్త్ వలంటీర్లను నియమిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానిని విస్మరించారు. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. నియామకం హామీ విస్మరించిన చంద్రబాబు విద్యా సంవత్సరం ముగుస్తున్నా పట్టని పాలకులు సాక్షి, పాడేరు: ఎన్నికలకు ముందు అరకులోయలో వేలాది మంది గిరిజనుల సాక్షిగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్ల నియమిస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. దీంతో 2024–25 విద్యా సంవత్సరం నుంచే హెల్త్ వలంటీర్ల సేవలు అందుబాటులోకి వస్తాయని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు భావించారు. అయితే సూపర్ సిక్స్ హామీల వలే హెల్త్ వలంటీర్ల నియామకాలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు ఇచ్చిన హామీ ఊసే ఎత్తడం లేదు.విద్యాసంవత్సరం మరో 20రోజుల్లో ముగియనున్నా హెల్త్ వలంటీర్ల కోసం పాలకులెవరూ మాట్లాడడం లేదు.గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. సకాలంలో అందని ప్రాథమిక వైద్యం జిల్లాలోని 206 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 70వేల మంది గిరిజన విద్యార్థులు వసతితో కూడిన విద్యను పొందుతున్నారు. ప్రతి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోను 3నుంచి 10వ తరగతి చదివే గిరిజన విద్యార్థులు 500 మంది వరకు ఉన్నారు. విద్యార్థులకు జ్వరం, ఇతర వ్యాధులు వచ్చినప్పుడు వెంటనే ప్రాథమిక వైద్యం చేయాలి.హెల్త్ వలంటీర్లు లేకపోవడంతో సకాలంలో ప్రాథమిక చికిత్స అందడం లేదు. దూరంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు హెచ్ఎంలు,ఉపాధ్యాయులు,వార్డెన్లు విద్యార్థులను తరలించి వైద్యసేవలు అందజేస్తున్నారు. మండల కేంద్రాల్లోని ఆశ్రమ పాఠశాలలకు ఆస్పత్రులు దగ్గరగా ఉంటున్నప్పటికీ మారుమూల ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులను ఆస్పత్రులకు తరలించడం ఉపాధ్యాయ వర్గాలకు కష్టంగా మారుతోంది.దీంతో సకాలంలో వైద్యసేవలు అందక గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం సోకితే కొద్ది రోజులు మాత్రమే విద్యార్థులు ప్రభుత్వ వైద్యశాలల్లో ఉంటున్నారు.ఆ తరువాత తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకుపోతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో సిక్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నా విద్యార్థులు బస చేయడానికే పరిమితమవుతున్నాయి. సిక్ రూమ్లో గిరిజన విద్యార్థుల వైద్యసేవల పర్యవేక్షణకు హెల్త్ వలంటీర్లే కీలకం. కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ప్రాథమిక వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు కొన్ని సంఘటనలు గత ఏడాది ఆగస్టు 30వ తేదీ రాత్రి డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 90మంది గిరిజన బాలికలకు వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి అంబులెన్స్ల ద్వారా తరలించారు. మూడు రోజుల పాటు కిల్లోగుడ పీహెచ్సీ వైద్య సిబ్బంది పాఠశాలలో మకాం వేసి వైద్యసేవలందించారు. ఈ ఏడాది మార్చి 3వ తేదీ రాత్రి పెదబయలు మండలంలోని తురకలవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కడుపునొప్పి,వాంతులతో 35మంది గిరిజన బాలికలకు అస్వస్థతకు గురయ్యారు. పెదబయలు,గోమంగి ఆస్పత్రుల వైద్యబృందాలతో పాఠశాలలోనే రెండు రోజుల పాటు వైద్యశిబిరాలు నిర్వహించారు. ఇలా పాఠశాలల్లో విద్యార్థులు తరచూ అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. -
రెజ్లింగ్ పోటీల్లో గిరిజన విద్యార్థుల సత్తా
స్వర్ణ పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక రంపచోడవరం: ముసురుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, ఎర్రంపాలెం గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రెజ్లింగ్లో సత్తా చాటారు. రాజమహేంద్రవరంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో అండర్ – 15లో సీహెచ్ భువన్ కుమార్ 41 కిలోలు, కె.కిరణ్దొర 48 కిలోలు, పి.జె.ప్రకాష్ 38 కిలోల విభాగంలో బంగారు పతకాలు సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎర్రంపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చోడి భవిత స్వర్ణ పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇదే పాఠశాలకు చెందిన రేపల్లి కీర్తన, వీరా ఆనందిత 62 కిలోల విభాగంలోను, పండా సంజన 58 కిలోల విభాగంలో మూడో స్థానం నిలిచారు.హెచ్ఎం ఎస్. ఆదివిష్ణు, పీడీ సుగంధి ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ రుక్మాండయ్యను కలిశారు. డీడీ వారిని అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి ఏజెన్సీ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. -
‘కృష్ణ’ను కుంకీ శిక్షణకు పంపించండి
● జూ క్యూరేటర్కు పీసీసీఎఫ్ ఆదేశం ● అదనపు పీసీసీఎఫ్లతో జూ పరిశీలన ఆరిలోవ: ఇందిరా గాంధీ జూ పార్కులో కృష్ణ అనే మగ ఏనుగును కుంకీ శిక్షణకు పంపించేందుకు చర్యలు చేపట్టాలని జూ క్యూరేటర్ జి.మంగమ్మను ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) అజయ్ కుమార్ నాయక్ ఆదేశించారు. జూ పార్కులో కృష్ణ కొన్ని దశాబ్దాలుగా సందర్శకులకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం కె.పవన్ కల్యాణ్ జూ పర్యటన నేపథ్యంలో అదనపు పీసీసీఎఫ్లు శాంతిప్రియ పాండే, రాహుల్ పాండేలతో కలసి మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ పర్యటన రద్దవడంతో, ఆయన జూ పార్కు ఎదురుగా ఉన్న ఎకో టూరిజం పార్కు కంబాలకొండను సందర్శించారు. అలాగే జూలో వన్యప్రాణులు, వాటి ఎన్క్లోజర్లు, ఆస్పత్రి, అభివృద్ధి పనులు, సిద్ధమైన పలు ఎన్క్లోజర్లు, సందర్శకులకు కల్పిస్తున్న సౌకర్యాలు పరిశీలించారు. వన్యప్రాణులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు. జూలో అడవి కుక్కల పునరుత్పత్తి కేంద్రం అభివృద్ధిని పరిశీలించి జూ అధికారులను అభినందించారు. వన్యప్రాణుల ఎన్క్లోజర్ల వద్ద ఫొటోలు దిగారు. కంబాలకొండలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి, వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం జూ లవర్స్ డే పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ నాయక్ మాట్లాడుతూ వన్యప్రాణులకు అందించే వైద్య సేవలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కృష్ణను ఏనుగుల క్యాంప్లో కుంకీ శిక్షణకు పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు. అడవుల నుంచి వచ్చి జనావాసాలు, పొలాల్లోకి చొరబడి పంటలు నాశనం చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న ఏనుగుల గుంపులను తిరిగి అడవుల్లో తరలించే విధంగా దీనికి శిక్షణ ఇస్తారన్నారు. విశాఖ సీఎఫ్ బి.ఎం.మైదీన్, పలువురు డీఎఫ్వోలు పాల్గొన్నారు. -
తాండవ రిజర్వాయరులో తగ్గుతున్న నీటి నిల్వలు
● ప్రస్తుతం 364.8 అడుగులకు చేరిన నీటి నిల్వలు ● గేట్ల లీకేజీ ద్వారా వృథా అవుతున్న నీరు నాతవరం : ఉమ్మడి జిల్లాలోనే ఏకై క మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు నీటి మట్టం క్రమేపీ తగ్గిపోతుంది. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేసి డిసెంబరు నెలలో ప్రాజెక్టు నుంచి నీటిని నిలుపుదల చేశారు. తాండవ రిజర్వాయరు గేట్లు దించే సమయానికి ప్రాజెక్టులో నీటి మట్టం 369.6 అడుగులు నీరు ఉండేది. ప్రాజెక్టు ప్రధాన గేట్ల ద్వారా నిత్యం నీరు లీకేజీతో పోవడంతో రోజు రోజుకు నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతోంది. తాండవలో మంగళవారం సాయంత్రానికి నీటి మట్టం 364.8 అడుగులకు చేరింది. ఆయకట్టుకు నీటిని నిలుపుదల చేసిన దగ్గర్నుంచి నేటి వరకు గేట్ల లీకేజీ ద్వారా సుమారుగా అయిదు అడుగుల నీరు వృధాగా పోయింది, తాండవ రిజర్వాయరు ప్రమాద స్థాయి నీటి మట్టం 380.0అడుగులు కాగా డేడ్ స్టోరేజీ నీటి మట్టం (అంటే బయటకు ప్రవహించదు) 345.0 అడుగులుగా అధికారులు పరిగణిస్తారు. తాండవ రిజర్వాయరు గేట్ల మరమ్మతుల ద్వారా లీకేజీలను ఆరికట్టేందుకు ప్రభుత్వం రూ.19.70 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో గత నెలలో ప్రధాన గేట్ల మరమ్మతు పనులను ఇరిగేషన్ ఈఈ బాలసూర్యం తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ ఆధ్వర్యంలో ప్రారంభించారు. మేజరు ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు కావడంతో అనుభవం ఉన్న మెకానికల్ ఇంజినీరింగ్ అధికారులతో పనులు చేస్తున్నారు. ఆ పనులు సకాలంలో పూర్తి అయితే నిత్యం వృథాగా పోతున్న ప్రాజెక్టులో నీటిని అడ్డుకట్ట వేయవచ్చు. ఈ విషయంపై ప్రాజెక్టు డీఈ ఆనురాధ మాట్లాడుతూ ప్రస్తుతం తాండవ గేట్ల మరమ్మతు పనులు చేస్తున్నామన్నారు. లీకేజీ నీరు ప్రవహం బాగా తగ్గిందన్నారు. గేట్ల మరమ్మతులు పూర్తి చేసేందుకు మరికొంత మెటీరియల్ రావలసి ఉందన్నారు. అవి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేసి లీకేజీలు లేకుండా చేస్తామన్నారు. తాండవ ప్రాజెక్టులో తగ్గిన నీటి నిల్వలు -
112 కిలోల గంజాయి స్వాధీనం
ముగ్గురి అరెస్ట్ కూర్మన్నపాలెం: అగనంపూడి టోల్గేటు వద్ద సోమవారం రాత్రి దువ్వాడ పోలీసుల తనిఖీల్లో 112 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. మాడుగుల ప్రాంతం నుంచి బెంగళూరుకు తరలించడానికి ఆటోలో గంజాయి తీసుకొస్తుండగా.. ముందస్తు సమాచారం మేరకు అగనంపూడి టోల్గేటు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో కిముడు అనుమాన్, బురరిపాల్ దినకర్, ఒక బాలికను అరెస్ట్ చేశారు. ఆటో, బైక్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మాడుగులలో అఖిల్ అనే వ్యక్తి వద్ద ఈ గంజాయిని కొనుగోలు చేశారు. 100 ప్యాకెట్లుగా తయారు చేసి బెంగళూరుకు తరలించడానికి విశాఖ తీసుకొస్తున్నారు. ఒక వ్యక్తి బైక్పై పైలట్గా వస్తుండగా, వెనుక ఆటోలో గంజాయిని తీసుకువస్తున్న వారిని వల పన్ని పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అఖిల్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పాడేరులోయువకుడి ఆత్మహత్య
పాడేరు: పాడేరు పట్టణంలో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన కెల్లా మణికంఠ(27) బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పట్టణంలోని చాకలిపేట వీధిలోని తన ఇంట్లో గదిలో ఫ్యాన్కు ఆయన ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు అతడిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. మృతుడి పక్కనే ఫోన్ పగిలిపోయి ఉంది. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఫైనల్ సెటిల్మెంట్ కోసం వీఆర్ఎస్ ఉద్యోగుల నిరీక్షణ ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ(విఆర్ఎస్) పొందిన ఉద్యోగులు ఫైనల్ సెటిల్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. వీఆర్ఎస్ ప్యాకేజీ పదవీ విరమణ రోజే అందుకున్న ఉద్యోగులకు, మిగతా వాటి కోసం ఎదురు చూపులు తప్పట్లేదు. స్టీల్ప్లాంట్ యాజమాన్యం ప్రకటించిన వీఆర్ఎస్కు స్పందించి 1,126 మంది మార్చి నెలాఖరున పదవీ విరమణ చేయగా, 60 ఏళ్లు నిండిన 89 మంది రెగ్యులర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. యాజమాన్యం సర్క్యులర్లో చెప్పిన మాట ప్రకారం వీఆర్ఎస్ ప్యాకేజీను చివరి రోజు రాత్రి వారి అకౌంట్లకు పంపేశారు. అదే మాదిరి ప్రతీ నెలా రెగ్యులర్ రిటైర్మెంట్ పొందే ఉద్యోగులకు ఇచ్చేలా గ్రాట్యుటీ 7వ తేదీలోగా, పీఎఫ్ 20వ తేదీ నాటికి అందుతుందని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గ్రాట్యుటీ కోసం ఎదురు చూడక తప్పదని తెలుస్తోంది. పీఎఫ్ అయితే మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. యాజమాన్యం పీఎఫ్ ట్రస్ట్కు ఇటీవల ఇచ్చిన రూ.380 కోట్లు ఉద్యోగుల హయ్యర్ పెన్షన్కు మాత్రమే సరిపోయేలా ఉంది. దీంతో వీఆర్ఎస్ ఉద్యోగులకు పీఎఫ్ చెల్లింపుల ఇప్పట్లో జరిగేలా కనిపించట్లేదు. ఇక లీవ్ ఎన్క్యాష్మెంట్ కోసం మరింత ఎదురు చూపులు తప్పేలా లేవని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం స్పందించి ఇంతకు ముందు రెగ్యులర్ రిటైర్మెంట్ల వలే వీఆర్ఎస్ ఉద్యోగులకు సత్వరంగా సెటిల్మెంట్ చేయాలని కోరుతున్నారు. -
ఇంటెలిజెచర్స్తో నియంత్రణ సోల్సెన్స్తో బాడీ ట్రాకింగ్
విశాఖ విద్య: ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే ఎలాంటి అసాధ్యాలనైనా సుసాధ్యం చేయవచ్చునని నిరూపిస్తున్నారు ఆంధ్రా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థినులు. సరికొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలవైపు దూసుకెళుతున్నారు. తమ మేథథస్సుకు పదునుపెట్టి, సమాజానికి ఉపయోగకరమైన ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు.ఇంటెలిజెచర్స్ అంటే... సులభమైన చేతి సంజ్ఞలతో బల్బులు, ఫ్యాన్లు వంటి విద్యుత్ పరికరాలను నియంత్రించగల గృహ ఆటోమేషన్ వ్యవస్థ. దీనికి వాయిస్ కమాండ్లు, స్విచ్ల అవసరం ఉండదు. మీడియా పైప్ ద్వారా సంజ్ఞలను గుర్తించి, ఆర్డుయినో, రిలే బోర్డు ద్వారా పరికరాలను నియంత్రిస్తుంది. ఎవరికి ఉపయోగం? ఈ వ్యవస్థ వల్ల ముఖ్యంగా వృద్ధులకు, కదలికల్లో ఇబ్బందులున్న వారికి ఉపయోగం. ఈ ప్రాజెక్టును ప్రదీప్తి, నవ్య, కృపారాణి, చందన కేవలం రూ.3వేల లోపే పూర్తి చేశారు. ఇవీ ప్రాజెక్టులు.. యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ (ఏయూసీఈడబ్ల్యూ) కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన నాలుగో సంవత్సరం విద్యార్థులు ‘ఇంటెలిజెచర్స్...సోల్సైన్స్’ అనే రెండు కొత్త ప్రాజెక్టులను రూపొందించారు. ఏయూసీఈడబ్ల్యూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.పద్మశ్రీ ప్రోత్సాహంతో విభాగాధిపతులు డాక్టర్ బి.ప్రజ్ఞ, డాక్టర్ బి.ఎస్తేర్ సునంద మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టులను రూపొందించారు. సైగలతో నియంత్రణకు వినియోగించే పరికరం● ఏయూసీఈడబ్ల్యూ విద్యార్థినుల కొత్త ఆవిష్కరణలు మరిన్ని ప్రయోగాలవైపు అడుగులు ఆంధ్ర వర్సిటీ ఆచార్యుల తోడ్పాటు -
ఎమ్మెల్సీ గాదె దృష్టికి ఉపాధ్యాయుల సమస్యలు
డుంబ్రిగుడ: మండలంలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ఏడీ, ఐఆర్ ప్రకటించే విధంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ బకాయి ఉన్న పీఆర్సీ విడుదల చేసే విధంగా కృషి చేయాలని నూతన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్నాయుడు పీఆర్టీయు జిల్లా కార్యదర్శి శెట్టి. అప్పలరాజు, మండల అధ్యక్షుడు లక్ష్మయ్యలు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం వారు ఎమ్మెల్సీని మర్యాద పూర్వకంగా కలిసి ఉపాధ్యాయుల సమస్యలు వివరించారు. అందుకు స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని ఉపాధాయులు పడుతున్నా కష్టాలను శాసనమండలిలో ప్రస్తవిస్తానని, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ మండల కార్యదర్శి మండ్యాగురు. శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడుకు సత్కారం సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు మంగళవారం పాడేరులో పర్యటించారు. మోదకొండమ్మతల్లితో పాటు ఉమానీలకంఠేశ్వరస్వామిలను ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీతో పాటు వర్తకులు, ఉపాధ్యాయ సంఘాల నేతలంతా ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. మోదకొండమ్మతల్లి, ఉమానీలకంఠేశ్వరస్వామి చిత్ర పటాలతో పాటు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, పీఆర్టీయూ నేతలు దేముళ్లనాయుడు, హేమలత, ఉప సర్పంచ్ రామునాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
రాజవొమ్మంగి ఎంపీపీకి అరకు ఎంపీ సత్కారం
రాజవొమ్మంగి: రాజవొమ్మంగి ఎంపీపీ గోము వెంకటలక్ష్మిని అరకు ఎంపీ తనూజారాణి మంగళవారం ఘనంగా సత్కరించారు. పాడేరులో జరిగిన దిశ సమావేశానికి హాజరైన ఎంపీపీ మండలంలోని పలు సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. మండలం మీదుగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్హెచ్ 516ఈ నిర్మాణ పనుల్లో అనేక మంది ఇళ్ల స్థలాలు కోల్పోయి, నష్టపరిహారం అందక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దినేష్కుమార్. ఐటీడీఏ పీవో సింహాచలం దృష్టికి తీసుకెళ్లారు. మండలంలో ఇటీవల కురిసిన వడగళ్ళ వానకు లాగరాయి, కొత్త కిండ్ర, దమనపాలెం, కిర్రాబు, తాళ్ళపాలెం గ్రామాల్లో జీడిమామిడి తోటలు ధ్వంసమయ్యాయని అధికారులకు తెలియజేశారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రంపచోడవరం డివిజన్, రాజవొమ్మంగి మండలంలోని అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను సభ దృష్టికి ఎంపీపీ తీసుకెళ్లారు. ఈ నేపధ్యంలో ఎంపీపీ వెంకటలక్ష్మిని అధికారులు అభినందించారు. -
ఈకోర్సా అంతర విభాగాల క్రీడా మేళా ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: వాల్తేర్ డివిజన్ అంతర విభాగాల క్రీడా మేళాను రైల్వే క్రికెట్ స్టేడియంలో డీఆర్ఎం లలిత్ బోహ్రా మంగళవారం క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ధ్యాన్చంద్ అవార్డీ ఎన్.ఉషతో సహా అంతర్జాతీయ క్రీడాకారులు జ్యోతిని వెలిగించి డీఆర్ఎంకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిపరమైన పనితో పాటు క్రీడాస్ఫూర్తి మేళవింపుగా ఉత్సాహాన్ని నింపేందుకే నెల రోజుల పాటు ఈ క్రీడామేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఆర్ఎం సతీమణి లలిత్బోహ్రా, ఏడీఆర్ఎంలు మనోజ్కుమార్, ఇ.శాంతారామ్, క్రీడాధికారి ప్రవీణ్బాటి, సంయుక్త క్రీడాధికారి అవినాష్, బ్రాంచ్ అధికారులు, కార్యనిర్వాహక సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాల్తేర్ తూర్పు కోస్తా రైల్వే స్పోర్ట్స్ సంఘం(ఈకోర్సా) ఆధ్వర్యంలో 13 విభాగాల ఉద్యోగుల జట్లు మెన్, వుమెన్ కేటగిరీల్లో పోటీపడనున్నాయి. ఆర్పీఎఫ్–కమర్షియల్ విభాగాల మధ్య క్రికెట్ మ్యాచ్ను డీఆర్ఎం టాస్ వేసి ప్రారంభించారు. ఈ మ్యాచ్లో కమర్షియల్ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించగా, మరో మ్యాచ్లో ఎలక్ట్రికల్ ఈఎల్ఎస్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ జట్టుపై గెలుపొందింది. మహిళల క్యారమ్స్ పోటీల్లో ఈఎల్ఎస్, ఈఎల్ఈ(జనరల్) జట్లు ఎ–పూల్లోనూ, డీఎల్ఎస్, స్టోర్స్, అకౌంట్స్, ఆపరేషన్స్ జట్లు బి–పూల్లోనూ తొలిరోజు పోటీల్లో విజయం సాధించాయి. -
ఘనంగా ఇటుకల పండగ ప్రారంభం
హుకుంపేట: మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఇటుకల పండగ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. గిరిజనులు నిర్వహించే అత్యంత పెద్ద పండగలో ఇటుకల పండగ ఒకటి. ఈ పండగను ఆచారం మేరకు వారం రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు గ్రామంలో ఉన్న సంకుదేవతకు పూజలు చేశారు. రెండో రోజు గ్రామంలోని మహిళ పురుషులకు స్నానం చేసేందుకు నీరు దించి, భోజనాలు పెడతారు. అనంతరం కొంత మంది గ్రామ పెద్దలు చెట్టుపైకి ఎక్కి మహిళలకు ఊయలలు కడతారు. ఆ రోజు నుంచి మహిళలంతా కలిసి గిరిజన ఆచార పాటలు పాడుతూ ఊయలలు ఊగుతు సందడి చేస్తారు. మూడో రోజు పెద వేట పేరుతో గ్రామ సమీపంలో థింసా నృత్యాల ప్రదర్శనలతో సందడి చేస్తారు. గ్రామస్తులకు చెందిన కత్తులు, గొడ్డళ్లు, ఈటెలు అన్ని ఒకే చోట పెట్టి గ్రామ పూజారి పూజలు చేసిన అనంతరం కోడి గుడ్డును కొట్టి వేటను ప్రారంభిస్తారు. ఆ తరువాత మూడు రోజుల పాటు గ్రామంలో యువకులు, చిన్నా,పెద్దా తేడ లేకుండా కొండపైకి వేటకు వెళ్తారు. మహిళలంతా కలిసి గ్రామ సమీప ప్రధాన రహదారుల్లో పాజోరి పేరుతో వాహనాలను అడ్డుకుని పాటలు పాడుతూ వాహన చోదకులకు సరదాగా నీరు పోస్తూ చందాలు వసులు చేయనున్నారు. చివరి రోజున సాయంత్రం సంకుదేవ ప్రాంగణంలో పూజారి పూజలు చేసిన తరువాత విత్తనాలు వేస్తారు. -
అరకు లోయలో అద్భుతం.. ప్రపంచ రికార్డు
సాక్షి, పాడేరు: అందాల అరకులోయలో అద్భుతం ఆవిష్కృతమయింది. మహా సూర్యవందనాల్లో స్థానిక గిరిజన విద్యార్థులు సత్తాచాటారు. ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్నారు. అరకు లోయ డిగ్రీ కళాశాల మైదానం ఈ ఘట్టానికి వేదికగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju district) అధికారులు, శిక్షకుల మూడు నెలల కష్టానికి ఫలితం లభించింది. ఐదు మండలాల పరిధిలోని గిరిజన విద్యాలయాలకు చెందిన 21,850 మంది విద్యార్థులు ఉత్సాహంగా 108 సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు. పతంజలి శ్రీనివాస్ శంఖం పూరించి యోగాసనాలను (Yoga Asanas) ప్రారంభించారు. ఒకే వేదికపై విద్యార్థులు 2 గంటల పాటు 108 సూర్య నమస్కారాలు చేయడంతో మైదానంలో ఆధ్యాత్మిక వాతావరణం శోభిల్లింది. ఈ యోగాసనాలను 200 మంది పీడీలు, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.లండన్కు చెందిన ప్రపంచ రికార్డుల యూనియన్ మేనేజర్ అలిస్ రేనాడ్, ఇతర ప్రతినిధులంతా 108 సూర్య నమస్కారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దృశ్యాలను తమ కెమెరాలలో బంధించారు. ఫ్లడ్లైట్ల వెలుగులో రాత్రి వరకు సూర్య నమస్కారాలు (surya namaskars) విజయవంతంగా కొనసాగాయి. అలిస్ రేనాడ్ సూర్య నమస్కారాల ప్రక్రియకు వరల్డ్ రికార్డును ప్రకటించారు. ఈ మేరకు ధ్రువపత్రాన్ని కలెక్టర్, జేసీలకు అందించారు. చదవండి: ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి లవ్స్టోరీ -
రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి
రంపచోడవరం: వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీలోని పాలగెడ్డ నుంచి బొడ్డగండి వరకు 15 కిలోమీటర్ల మేర మెటల్ రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారని, రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని గిరిజనులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పీవో కట్టా సింహాచలానికి అర్జీ అందజేశారు. ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో, సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీలు సోమవారం ప్రజా సమస్య పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు 49 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. రాజవొమ్మంగి మండలంలో దోనెలపాడులో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని సర్పంచ్ ఎస్.చంద్రుడు, గుర్రమామిడి గ్రామంలో అక్రమంగా రేకుల షెడ్ నిర్మించారని, దానిని తొలగించాలని పీసా ఉపాధ్యక్షుడు బలిజే చిన్నారెడ్డి , ఇర్ల సన్యాసిరెడ్డి అర్జీలు అందజేశారు. పాతకోట పంచాయతీలోని గుడ్లవాడ నుంచి పాతకోట వరకు ఏడు కిలోమీటర్ల మెటల్ రోడ్డుకు ఒక కిలోమీటరుకు అటవీ క్లియరెన్స్ మంజూరు చేయాలని సర్పంచ్ గొర్లె రేవతి, వంతల మహేంద్ర, కిలో సీతారాం, బొడ్డ నాయక్ వినతిపత్రం అందజేశారు. రంపచోడవరం మండలం బి.వెలమకోట గ్రామంలో భూ సమస్య పరిష్కారించాలని కోరుతూ కారం బాపనమ్మ అర్జీ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీవో డి.ఎన్.వి. రమణ, ఎస్డీసీ అంబేడ్కర్, డీడీ రుక్మాండయ్య తదితరులు పాల్గొన్నారు.గ్రీవెన్స్లో పాలగెడ్డ గిరిజనుల విజ్ఞప్తి -
గూడెం కొత్తవీధిలో భారీ వర్షం
గూడెంకొత్తవీధి: మండల కేంద్రం గూడెంకొత్తవీధి లో సోమవారం మధ్యాహ్నం నుంచి కుండపోతగా వర్షం కురిసింది. దీంతో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆర్వీనగర్లో వారపుసంతకు వచ్చిన చిరువ్యాపారులు వర్షం కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ తీగలపై పలు చోట్ల చెట్లకొమ్మలు విరిగిపడటంతోపాటు మరికొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.రాజవొమ్మంగి: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. రబీ సీజన్లో సాగుచేస్తున్న పొగాకు పంటకు ఈ వర్షం మేలు చేస్తుందని రైతులు తెలిపారు. వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. ద్విచక్రవాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. చింతపల్లిలో చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో సోమవారం మధ్యాహ్నం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం 8గంటల వరకూ మంచు కురిసి, చలి వాతావరణం ఉండగా మధ్యాహ్నం రెండు గంటల వరకూ విపరీతమైన ఎండ కాసింది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడి గంటపాటు వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. -
నల్లబెల్లం విక్రయాలపై నిబంధనలు పాటించాలి
అడ్డతీగల: ఐదు కిలోలకు మించి నల్లబెల్లం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగరాహుల్ అన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా అడ్డతీగలలో కిరాణా వ్యాపారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక మొత్తంలో నల్లబెల్లం అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా సారా తయారీ, విక్రయాలపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. బెల్లం డీలర్లు అనుమతి పత్రం కలిగి ఉండాలన్నారు. అనుమతి పత్రాలు లేకుండా బెల్లం కొనుగోళ్లు, విక్రయాలు చేయవద్దన్నారు. బెల్లం నిల్వ ఉంచినా చర్యలు తీసుకుంటామన్నారు.నల్లబెల్లం ఎక్కువ మోతాదులో రవాణా చేస్తున్నా లేక నిల్వ చేసినా విక్రయించినా అటువంటి సమాచారం ఇవ్వాలని ఎకై ్సజ్ సిఐ శ్రీధర్ అన్నారు. -
పోలీసుల వేధింపులు ఆపాలి
● ఐటీడీఏ ఎదుట గిరిజనుల నిరసన రంపచోడవరం: మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో పోలీసులు అమాయక ఆదివాసీలను తీవ్రంగా వేధిస్తున్నారని, వేధింపులను ఆపాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గిరిజనులు సోమవారం ప్రదర్శన నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, పీవో కట్టా సింహాచలానికి వినతిపత్రాన్ని అందజేశారు. సీపీఐ (ఎంఎల్) నాయకుడు పల్లాల లచ్చిరెడ్డి మాట్లాడుతూ అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవుల్లోకి వెళ్లే ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. తమ అవసరాల కోసం అడవుల్లోకి వెళ్లిన గిరిజనులను పోలీసులు నిర్బంధిస్తున్నారని చెప్పారు. మారేడుమిల్లి మండలం పుల్లంగి, గుడిసె పాములమామిడి, బంద, బొడ్లంక, చట్లవాడ, వై.రామవరం మండలంలోని కానివాడ, చెరువూరు, వేజువాడ, చింతలపూడి, పుట్టగండి, రచ్చవలస, భీమునిగడ్డ, చింతకొయ్య, బులసిపాలెం తదితర అటవీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేస్తూ ఆదివాసీలను భయాందోళనలకు గురి చేస్తున్నారని తెలిపారు. పీవో, సబ్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి పోలీసుల వేధింపుల నుంచి గిరిజనులను కాపాడాలని కోరారు. -
గిరిజనుల అభ్యున్నతే లక్ష్యం
డుంబ్రిగుడ: అడవినే నమ్ముకున్న గిరిపుత్రుల సంపూర్ణ అభివృద్ధే ముఖ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తెలిపారు. సోమవారం ఆయన డుంబ్రిగుడ మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అడవితల్లి బాట కార్యక్ర మాన్ని ప్రారంభించామని చెప్పారు. అడవితల్లికి ఏదో చేయాలనే ఆలోచనలతో ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిధుల ఖర్చు విషయంలో బాధ్యతగా ఉంటున్నామని చెప్పారు. మండల పర్యటన సందర్భంగా పీవీటీజీ గిరిజన మహిళలు సంప్రదాయ కూవీ భాషలో పాటలు పాడుతూ ఆయనకు స్వాగతం పలికారు. అడ్డాకులతో తయారు చేసిన గిడుగులను బహూకరించారు. అనంతరం ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులకు బాలామృతం తినిపించి, గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు డుంబ్రిగుడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.విద్యార్థులకు అవస్థలు డుంబ్రిగుడలో నిర్వహించిన బహిరంగ సభ లో విద్యార్థులు అవస్థలకు గురయ్యారు. జనం లేకపోవడంతో డుంబ్రిగుడ ప్రభుత్వ సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థినులను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వారికి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు. సభా ప్రాంగణంలో ఆహార పొట్లాలు కూడా అరకొరగా అందించారు. అవికూడా సరిగా ఉడకకపోవ డంతో తీసుకున్నవారు తినకుండా పడేశా రు. కూటమి నాయకులు జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అయితే ఉపముఖ్యమంత్రి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్కల్యాణ్ పర్యటనతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పోతంగి పంచాయతీ చాపరాయి వద్దకు చేరుకున్న సమయంలో రోడ్డుకుఇరువైపులా పోలీసు లు ప్రయాణికుల జీపులు, ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు అడ్డుకోవడంతో పాడేరు –అరకు రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ -
ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం
పాడేరు : ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జమాల్బాషా అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు, ఏఎన్ఎం శిక్షణ కేంద్రం విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజల ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచటానికి ర్యాలీలు, మానవహారాలు నిర్వహిస్తామన్నారు. తల్లీ, నవజాత శిశువుల ఆరోగ్యంపై వైద్యారోగ్య శాఖ సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు అయ్యేటట్టు గ్రామాల్లో గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో మాతా, శిశు మరణాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. వైద్యారోగ్యంపై ప్రజలకు అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాడేరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, ఆసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ యర్రయ్య, ఏఎన్ఎం శిక్షణ కేంద్రం విద్యార్థులు, జిల్లా ఆస్పత్రి, సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా -
ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
రంపచోడవరం: ఆర్థిక సమస్యలతో మండలంలోని పెదగెద్దాడలో ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఓయువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పల్నాడు జిల్లా గణపవరానికి చెందిన అకారపు రాజేష్కుమార్ (36) అనే వ్యక్తి ఆదివారం రిసార్ట్కు వచ్చాడు. రాత్రి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది రూమ్ లోకి చూసి, ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరి యా ఆస్పత్రికి తరలించారు. మృతుడు తలకు ప్లాసిక్ట్ కవర్ చుట్టి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బండరాయిని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
ముంచంగిపుట్టు: మండలంలోని దొడిపుట్టు వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిద్రమత్తులో మితిమీరిన వేగంతో బైక్ను నడపడం వల్ల అదుపు తప్పి పెద్దబండరాయిని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. స్థానిక ఎస్ఐ జె.రామకృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అరకులోయ మండలం బొండం పంచాయతీ రంగినిగూడ గ్రామానికి చెందిన కిల్లో గోవింద్,సిరగం రాంబాబు,సువాభి గణేష్ మండలంలోని దొడిపుట్టు పంచాయతీ కేంద్రంలో జరిగిన శుభకార్యానికి వచ్చారు. ఆదివారం రాత్రి శ్రీరామనవమి జాతరను తిలకించిన అనంతరం సోమవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ద్విచక్రవాహనంపై స్వగ్రామం రంగినిగూడకు బయలుదేరారు.దొడిపుట్టు నుంచి కిలో మీటరు దూరం వచ్చేసరికి నిద్రమత్తులో ఉండడంతోపాటు అతివేగంగా బైక్ను నడపడంతో అదుపు తప్పింది. రోడ్డు పక్కన గల పెద్దబండ రాయిని బైక్ ఢీకొనడంతో వెనుక కూర్చున్న సువాభి గణేష్(36) తలకు బలమైన గాయమై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న సిరగం రాంబాబు,వెనుక ఉన్న కిల్లో గోవింద్లు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ప్రైవేట్ వాహనంలో హూటాహూటిన వారిని ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించారు.వైద్యాధికారి గీతాంజలి క్షతగాత్రులకు వైద్య సేవలందించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు పంపారు. మృతుడు గణేష్ తండ్రి సువాభి సింహా చలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఇద్దరికి తీవ్రగాయాలు నిద్రమత్తు, అతివేగం వల్ల ప్రమాదం -
గిరిజన విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం
అరకులోయ టౌన్: గిరిజన విద్యార్థులు ఎందులోను తీసుపోరని, ఐదు నెలల పాటు సాధన చేసి, వరల్డ్ రికార్డు కోసం సూర్యనమస్కారాలు ప్రదర్శించడం అద్భుతమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో గిరిజన విద్యార్థులతో నిర్వహించిన మహా సూర్యవందన్ కార్యక్రమాన్ని సోమవారం జ్యోతిప్రజ్వలనతో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఐదు నెలలుగా 21 వేల మంది విద్యార్థులు 108 సూర్యనమస్కారాలను సాధనం చేసి ప్రపంచ రికార్డు లక్ష్యంగా కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. 21,850 మంది విద్యార్థులు ఇందులో పాల్గొనగా వారిలో 13 వేల మంది బాలికలు ఉండడం విశేషమన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ గత ఐదు నెలల నుంచి ఉదయం 4 గంటలకు నిద్రలేపి విద్యార్థులతో సాధన చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి శ్రీనివాస్తో పాటు అన్ని పాఠశాల పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. ప్రపంచ రికార్డు నమోదు: పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 108 సూర్యనమస్కారాల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. 21,850 మంది విద్యార్థులు ఈ మహా సూర్యవందన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. లండన్కు చెందిన ప్రపంచ రికార్డు యూనియన్ మేనేజర్ అలిస్ రేనాడ్ ఈ ప్రదర్శనను క్షుణ్ణంగా పరిశీలించి హర్షం వ్యక్తం చేసి, వరల్డ్ రికార్డు సాధించినట్లు ప్రకటించారు. అనంతరం కలెక్టర్ దినేష్కుమార్కు, అధికారులకు ఈవరల్డ్ రికార్డు ప్రతిని ఆమె అందజేశారు. ఈ సందర్భంగా అలిస్ రేనాడ్తో పాటు పతంజలి శ్రీనివాస్లను కలెక్టర్ దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి -
అభిప్రాయ సేకరణకు అనుగుణంగా పునరావాసం
చింతూరు: నిర్వాసితుల అభిప్రాయాలకు అనుగుణంగా వారు కోరుకున్న ప్రాంతంలో పునరావాసం కల్పించాలని చింతూరుకు చెందిన పోలవరం నిర్వాసితుల పీడీఎఫ్ కమిటీ ఐటీడీఏ పీవో, ఆర్అండ్ఆర్ అధికారి అపూర్వ భరత్కు విజ్ఞప్తి చేసింది. సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీడీఎఫ్ కమిటీ సభ్యులు పీవోను కలసి అభిప్రాయ సేకరణ వివరాలను అందచేశారు. ఈ సందర్భంగా పీడీఎఫ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపులో భాగంగా చింతూరులో నిర్వాసితులవుతున్న గిరిజనేతర కుటుంబాల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించినట్లు తెలిపారు. 1,411 కుటుంబాల నుంచి అభిప్రాయాలను సేకరించగా 1,015 కుటుంబాలు తూర్పు గోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కృష్ణునిపాలెంలో పునరావాసం కల్పించాలని, 384 కుటుంబాలు ఏలూరు జిల్లా తాడువాయిలో పునరావాసం కల్పించాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు. దీనిపై స్పందించిన పీవో అపూర్వభరత్ మాట్లాడుతూ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళతానని, గ్రామసభల నిర్వహణ అనంతరం నిర్వాసితులను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి పునరావాస ప్రాంతాలను చూపించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రతిఒక్కరికీ పరిహారం అందేలా చర్యలు డివిజన్లో నిర్వాసితులవుతున్న ప్రతిఒక్కరికీ పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్టు పీవో అపూర్వభరత్ తెలిపారు. ప్రతి గ్రామసభలో అర్హులైన నిర్వాసితుల జాబితా వెల్లడి చేస్తున్నామని, జాబితాలో పేర్లు లేకపోయినా, పెండింగ్లో ఉన్నా 15 రోజులు లోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హులైన వారి పేర్లను పరిహారం జాబితాలో చేర్చు తామని పీవో తెలిపారు. ఈ కార్యక్రమలలో పీడీఎఫ్ కమిటీ సభ్యులు బొజ్జా పోతురాజు, పయ్యాల నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి శ్రీనివా సరావు, సయ్యద్ ఆసిఫ్, నామాల శ్రీనివాసరావు, ఎస్కే రంజాన్, చంద్రశేఖర్, అహ్మద్అలీ, శ్రీనివాసాచారి, జిక్రియా, చంద్రశేఖర్, జీవన్, అయ్యూబ్అలీ, ఈశ్వరాచారి, షాజహాన్ పాల్గొన్నారు.ఐటీడీఏ పీవోకు పీడీఎఫ్ కమిటీ విజ్ఞప్తి -
సారా నిర్మూలన అందరి బాధ్యత
రంపచోడవరం: సారా నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ద్వారా నిర్వహిస్తున్న నవోదయం పోస్టర్లను ఐటీడీఏ సమావేశం హాలులో సోమ వారం పీవో, సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవో మట్లాడుతూ సారా వల్ల కలిగే నష్టాలను గ్రామాల్లో గిరిజనులకు వివరించి, చైతన్య పరచాలని సూచించారు. సారా విక్రయించినా, తయారు చేసినా, రవాణా చేసినా శిక్ష తప్పదన్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడు తూ సారా వల్ల కలిగే అనర్థాలను గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డి.ఎన్.వి.రమణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పి.నాగరాజు, ఎస్డీసీ అంబేడ్కర్, ఎకై ్సజ్ సీఐ శ్రీధర్ , తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో ఎస్.శ్రీనివాసదొర, ఏడీఎంహెచ్వో జి.శిరీష, డీడీ రుక్మాండయ్య, డీఎల్పీవో కోటేశ్వరరావు,సీడీపీవో సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించాలి
● రంపచోడవరం డివిజనల్ పంచాయతీ అధికారి నరసింగరావుఅడ్డతీగల: ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి సంపద కేంద్రానికి తరలించాలని రంపచోడవరం డివిజనల్ పంచాయతీ అధికారి నరసింగరావు అన్నారు. స్థానిక డొక్కపాలెం జంక్షన్లోని సంపద కేంద్రం వద్ద సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లు,వీధుల్లో సేకరించిన తడి,పొడి చెత్తను వేరుచేసి సంపద కేంద్రానికి తరలించాలని ఆదేశించారు.ప్రతి పంచాయతీలో ఉన్న సంపద కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు ఈ కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల, వై.రామవరం, రాజవొమ్మంగి మండలాల్లోని పంచాయతీ కార్యదర్శులు,హరిత రాయబారులు పాల్గొన్నారు. -
అప్పన్న కల్యాణం చూతము రారండి
రాత్రి 8.15 నుంచి రథోత్సవం.. 10.30 నుంచి కల్యాణమహోత్సవం సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని సింహగిరిపై వేంజేసిన శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణమహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరగనుంది. సోమవారం రాత్రి నుంచే కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద అర్చకులంతా రుత్విగ్వరణం, ఉత్సవాంగీకారం జరిపి, చక్రపెరుమాళ్లను పల్లకీలో ఉంచి మాడవీధిలో తిరువీధి నిర్వహించారు. తదుపరి పుట్టబంగారు మండపంలో చక్రపెరుమాళ్లను వేంజేపచేశారు. పుట్టమన్ను ఉంచి మృత్సంగ్రహణాన్ని జరిపారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ పుట్టమన్నుని శిరస్సుపై పెట్టుకుని వేదమంత్రోశ్చరణలు, నాదస్వర వాయిద్యాల మద్య ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. తదుపరి కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన పాలికల్లో పుట్టమన్నుని వేసి అంకురార్పణను విశేషంగా నిర్వహించారు. నేటి మధ్యాహ్నం నుంచి కల్యాణ ఘట్టాలు స్వామివారి కల్యాణోత్సవ ఘట్టాలను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కొట్నాలు ఉత్సవంతో ప్రారంభిస్తారు. సాయంత్రం 6.30 నుంచి ఎదురుసన్నాహోత్సవం జరుపుతారు. అనంతరం స్వామిని, అమ్మవార్లను రథంపై వేంజేపచేసి రాత్రి 8.15గంటల నుంచి సింహగిరి మాడ వీధుల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 10.30 నుంచి ఆలయ ఉత్తరరాజగోపురం ఎదురుగా ఏర్పాటుచేసిన భారీ వేదికపై వార్షిక కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవానికి సన్నద్ధం రథోత్సవానికి సంబంధించి సోమవారం రథాన్ని సిద్ధం చేశారు. తొలుత జాలారి పెద్ద, రథసారథి కదిరి లక్ష్మణరావు, దేవస్థానం వైదికులు రథానికి పూజలు నిర్వహించారు. అనంతంం ఎస్బీటీ గేటు దగ్గర నుంచి రాజగోపురం వద్దకు రథాన్ని తెచ్చారు. దర్శనాలపై ఆంక్షలు వార్షిక కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు మాత్రమే అప్పన్న మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి. తిరిగి రాత్రి 8.30 నుంచి 10 వరకు దర్శనాలకు అనుమతిస్తారు. కార్యక్రమాల్లో దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు, ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, ఈఈ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ త్రిమూర్తులు, మాజీ ట్రస్ట్బోర్డు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు, పలువురు మత్స్యకారులు, భక్తులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేపలు
కంచరపాలెం: ఏసీబీ అధికారుల వలలో అవినీతి చేపలు చిక్కాయి. జ్ఞానాపురం జోన్–5 జీవీఎంసీ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పబ్లిక్ హెల్త్ విభాగం జనన, మరణ ధ్రువీకరణ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఉద్యోగి దండి సత్యసూర్య నాగపూర్ణ చంద్రశేఖర్, ఔట్సోర్సింగ్ సూపర్వైజర్ బరకాల వెంకటరమణలు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా జలిజపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన భాను ప్రకాష్ తండ్రి మర్రిపాలెం రైల్వే ట్రాక్ వద్ద జనవరిలో మృతి చెందాడు. అతని మరణ ధ్రువీకరణ పత్రం కోసం జ్ఞానాపురం జోన్–5 పబ్లిక్ హెల్త్ విభాగంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న ఉద్యోగి చంద్రశేఖర్, ఔట్సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణలు రూ.40 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.20వేలుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే బాధితుడు భానుప్రకాష్కు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఇద్దరు పొరుగు సేవల ఉద్యోగులు లంచం డబ్బులను బాధితుని వద్ద నుంచి తీసుకుంటుండగా జోనల్ కార్యాలయంలో అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. అవినీతి నిరోధక (సవరణ) చట్టం–2018 సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసి మంగళవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచం ఇవ్వాలని వేధించినట్లయితే సంబంధిత ఏసీబీ అధికారులకు, టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా 9440440057కు తెలియజేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డీఎస్పీ రమ్య, ఇన్స్పెక్టర్లు కృష్ణకిషోర్, వెంకట్రావ్, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, సుప్రియ పాల్గొన్నారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జోన్–5 ఉద్యోగులు -
13 రైల్వే స్టేషన్లలో 28 లిఫ్ట్లు
● టెండర్లు ఆహ్వానించిన వాల్తేర్ డివిజన్ ● అమృత్ భారత్తో 15 స్టేషన్లకు కొత్త శోభ సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ పథకం ద్వారా వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో 15 రైల్వేస్టేషన్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సౌకర్యాల కల్పనలో భాగంగా స్టేషన్లలో లిఫ్ట్లు ఏర్పాటు చేసేందుకు తాజాగా టెండర్లు ఆహ్వానించారు. 13 స్టేషన్ల పరిధిలో రూ.13.67 కోట్లతో 28 లిఫ్ట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాల్తేరు డివిజన్ పరిధిలో మొత్తం 15 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సింహాచలం, దువ్వాడ, అరకు, బొబ్బిలి, చీపురుపల్లి, కొత్తవలస, నౌపడ, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం స్టేషన్లు, ఛత్తీస్గఢ్ పరిధిలో జగదల్పూర్, ఒడిశా పరిధిలో దమన్జోడీ, జైపూర్, కోరాఫుట్, పర్లాఖిముండి రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ఈ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లలో కొత్త భవనాలు నిర్మించడంతో పాటు ఎస్కలేటర్లు, లిఫ్టులు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక ఆహార శాలలు, వాణిజ్య సముదాయాలు నిర్మించనున్నారు. అలాగే అత్యాధునిక సౌకర్యాలతో మరుగుదొడ్లు, సామగ్రి భద్రపరుచుకునే గదులు, తాగు నీరు, ఏటీఎం సౌకర్యాలు కల్పించనున్నారు. వసతి గదులు, ప్లాట్ఫాంలపై డిజిటల్ డిస్ప్లే బోర్డులు అందుబాటులోకి రానున్నాయి. రైల్వేస్టేషన్ మొత్తం సీసీ టీవీ పరిధిలో నిఘా ఉంచడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 13 స్టేషన్లలో లిఫ్టుల ఏర్పాటుకు టెండర్లు తాజాగా 13 స్టేషన్లలో లిఫ్ట్లు ఏర్పాటుకు రెండు ప్యాకేజీల కింద రూ.13.67 కోట్లతో వాల్తేరు డివిజన్ టెండర్లు ఆహ్వానించింది. ఒక లిఫ్ట్ 13 మంది ప్రయాణికులకు సరిపడేలా, మరో లిఫ్ట్ 20 మందికి సరిపడేలా.. మొత్తం 28 లిఫ్ట్లు ఏర్పాటు చేయనున్నారు. చిన్న స్టేషన్లలో ఒకే లిఫ్ట్ ఉండాలని నిబంధన విధించారు. టెండర్లు ఖరారు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చిన ఏడాదిలోపు అన్ని స్టేషన్లలోనూ లిఫ్ట్లు ఏర్పాటు చేయాలని నిబంధనల్లో స్పష్టం చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సింహాచలం, పర్లాఖిముండి స్టేషన్లలో లిఫ్ట్లు, ఎస్కలేటర్ల పనులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఈ టెండర్లలో మినహాయించారు. -
ఇదీ సార్.. వైజాగ్ స్టీల్ బ్రాండ్
● నాణ్యమైన ఉక్కు ఉత్పత్తులు స్టీల్ప్లాంట్కే సొంతం ● 6 నుంచి 36 మి.మీ వరకు రీబార్స్, చానల్స్, ఐబీమ్స్కు రోల్స్ తయారీ ఇక్కడే.. ● ప్రతి ఉత్పత్తిపై వైజాగ్ స్టీల్ టీఎంటీ ముద్ర ● 2002 నుంచి బ్రాండ్ మార్క్తో మార్కెట్లోకి ఉత్పత్తులు స్టీల్ప్లాంట్లో వైర్ రాడ్ కాయిల్స్ తయారీ లోగో ఎలా ముద్రిస్తారంటే.? రోల్స్ను సీఎన్సీ లేత్ మిషన్ మీద కావాల్సిన పరిమాణంలో గాడి(గ్రూవ్స్) చేసి, గ్రూవ్స్లో రీబార్ నాచ్ చేసి అనంతరం స్పార్కోనిక్స్ బ్రాండింగ్ మిషన్ మీదకు రోల్ను ఎక్కిస్తారు. స్పార్కోనిక్స్ బ్రాండింగ్ మిషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (పుణే) సరఫరా చేసిన ఈ మిషన్ను కంప్యూటర్ ద్వారా అనుసంధానం చేస్తారు. తద్వారా రోల్ మీద సుమారు 1.3 ఎం.ఎం నుంచి 1.9 ఎం.ఎం లోతులో అక్షరం ముద్ర పడుతుంది. అలా ఒక్కో అక్షరం ముద్రిస్తారు. కొన్ని సందర్భాల్లో నాలుగైదు అక్షరాలను ముద్రించే అవకాశం ఉన్నట్లు మిషన్ ఆపరేటర్ తెలిపారు. ఇక్కడ 16 ఎం.ఎం రీబార్ నుంచి 36 ఎం.ఎం రీబార్ వరకు బ్రాండింగ్ చేస్తారు. ఒక్కో రోల్కు సుమారు 5 గంటల సమయం, ఇటీవల మార్చిన లోగోకు 6–7 గంటలు పడుతోందని ఉద్యోగులు తెలిపారు. అదే విధంగా చానల్స్, యాంగిల్స్ మీద కూడా ముద్రిస్తారు. ఉత్పత్తుల మార్కెటింగ్లో ప్రధాన భూమిక వహించేది బ్రాండ్ ఇమేజ్. బ్రాండ్ను చూసే వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేస్తారనేది విశ్వజనీనం. అందుకే ప్రతీ సంస్థ తమ ఉత్పత్తుల నాణ్యతతో పాటు బ్రాండ్ ఇమేజ్కు అధిక ప్రాధాన్యమిస్తాయి. దేశీయ ఉక్కు పరిశ్రమలో తమ బ్రాండ్ను ముద్రించడంలో విశాఖ ఉక్కు కర్మాగారం తనదైన ప్రత్యేకత కలిగి ఉంది. అలాగే మార్కెట్లో ప్రతిష్ట కలిగి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. సీ్టల్ప్లాంట్ తుది ఉత్పత్తులు రోలింగ్ మిల్స్ విభాగాలైన లైట్ అండ్ మీడియం మర్చంట్ మిల్(ఎల్.ఎం.ఎం.ఎం), మీడియం మర్చంట్ అండ్ స్ట్రక్చరల్ మిల్(ఎం.ఎం.ఎస్.ఎం), వైర్ రాడ్ మిల్స్(డబ్ల్యూ.ఆర్.ఎం), స్పెషల్ బార్ మిల్(ఎస్.బి.ఎం), వైర్ రాడ్ మిల్(డబ్ల్యూఆర్ఎం)–2, స్ట్రక్చరల్ మిల్ (ఎస్టీఎం)లలో తయారవుతాయి. ఆయా విభాగాల్లో రీబార్స్, రౌండ్స్, యాంగిల్స్, చానల్స్, బీమ్స్ తదితర వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఆ ఉత్పత్తుల తయారీకి అవసరమైన గైడ్ల తయారీని రోల్ షాప్ అండ్ రిపేర్ షాప్(ఆర్ఎస్ అండ్ ఆర్ఎస్) విభాగం చేపడుతుంది. 6 మిల్లీమీటర్ల వ్యాసం నుంచి 36 మిల్లీమీటర్ల వరకు ఉన్న రీబార్లు, చానల్స్, ఐబీమ్స్లకు రోలింగ్ అవసరమైన రోల్స్ను ఇక్కడే తయారు చేస్తారు. నిర్ణీత పరిమాణంలో ఆ రోల్స్ను సిద్ధం చేసిన తర్వాత, దానిపై విశాఖ ఉక్కుకు ప్రతిష్టగా నిలిచే వైజాగ్ స్టీల్ టీఎంటీ(థర్మో మెకానికల్ ట్రీట్మెంట్) ముద్రను ముద్రిస్తారు. కీలక విభాగాలకు రోల్స్ తరలింపు కర్మాగారంలో తయారయ్యే ఉత్పత్తులపై ముద్ర వేసేందుకు సిద్ధం చేసిన రోల్స్ను ఆర్ఎస్ అండ్ ఆర్ఎస్–1, 2 విభాగాల నుంచి ఉత్పత్తులు తయారయ్యే మిల్స్ విభాగాలకు సరఫరా చేస్తారు. అక్కడ తయారవుతున్న ఉత్పత్తులపై విశాఖ ఉక్కు లోగో అయిన వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు వంటి లోగోలను ముద్రిస్తారు. నకిలీకు ఆస్కారం లేకుండా.. జాతీయ, అంతర్జాతీయ విపణిలో విశాఖ ఉక్కు ఉత్పత్తులకు ఉన్న గిరాకీని బట్టి తరచూ నకిలీ ఉత్పత్తులు తయారవుతున్నట్టు యాజమాన్యం గుర్తించింది. దీంతో ఎక్కడా డూప్లికేటింగ్ జరగకుండా బ్రాండింగ్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇప్పుడు ఉత్పత్తి గ్రేడును కూడా తెలిపే విధంగా ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రాండింగ్ చేస్తున్నారు. వైజాగ్ టీఎంటీ 500డి, వైజాగ్ టీఎంటీ హెచ్సీఆర్డీ అనేవి ఇప్పటి వరకు ముద్రిస్తూ వచ్చారు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వైజాగ్ టీఎంటీ ఎఫ్ఈ 550డి, 500డి 6686 59, 8568 66 అనే బ్రాండ్ నంబర్లు ముద్రించడం ఇటీవల ప్రారంభించారు. 16ఎంఎం నుంచి 36 ఎంఎం వరకు ఉన్న సైజు ఊచలపై, రైల్వే సంస్థకు పంపే ఉత్పత్తులపై హెచ్సీఆర్డీ(హై కరోజన్ రెసిస్టెంట్ డకై ్టల్)ను ముద్రిస్తున్నారు. రోలింగ్ మిల్స్లో ఆయా ఉత్పత్తులపై బ్రాండింగ్ చేయడంలో ఉక్కు ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయం. బ్రాండింగ్ ఎలా ప్రారంభమైంది? విశాఖ ఉక్కు ఉత్పత్తులను మొదట్లో ఇతర కంపెనీల ఉత్పత్తుల్లాగే మార్కెట్లో అమ్మేవారు. ఇతర ఉత్పత్తుల్లో విశాఖ ఉక్కు ఉత్పత్తులను వినియోగదారులు గుర్తించడం కష్టంగా ఉండేది. దీంతో అప్పటి సీఎండీ శివసాగర్రావు ఏదైనా గుర్తు ఉంటే బాగుంటుందని ఆలోచించి.. రీబార్స్ మధ్యలో ఆంగ్ల అక్షరం ‘వి’ఉండేలా చేశారు. అది ఎంతో కష్టపడితే తప్ప స్పష్టంగా కనిపించేది కాదు. ఆ తర్వాత, ఉత్పత్తులపై ప్రారంభంలో బ్రాండింగ్ కోసం పెద్ద సైజు నంబర్ పంచ్ అనే సాధనంతో ‘వైజాగ్ స్టీల్’అని కొట్టేవారు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అన్ని ఉత్పత్తుల మీద ముద్రించాలంటే ఎక్కువ శ్రమ, సమయం పట్టేది. 2002 తర్వాత నేరుగా ఉత్పత్తి మీద ముద్రపడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. -
సీతారామ్
జై శ్రీరామ్.. జై శ్రీరామ్పట్టువస్త్రాలను సమర్పిస్తున్న చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్సీతమ్మవారి విగ్రహాన్ని భక్తులకు చూపుతున్న అర్చకుడుమంగళసూత్రాన్ని భక్తులకు చూపుతున్న ప్రధాన అర్చకులు పురుషోత్తమాచార్యులువీఆర్పురం: పుణ్య గోదావరి, శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపాన గల రామగిరి జనసందోహంతో నిండిపోయింది. మాతంగ మహర్షి నిర్మించిన శ్రీసుందర సీతారామచంద్ర స్వామి ఆలయంలో అంగరంగవైభవంగా సాగిన సీతారాముల కల్యాణమహోత్సవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. భక్తుల జయ జయ ధ్వానాలు.. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ.. దేవదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం అభిజిత్ లగ్నంలో శ్రీ సుందర సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కొండపైగల అంతరాలయంలో స్వామి మూలమూర్తులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా ఊరేగింపు కల్యాణోత్సవం సందర్భంగా రామయ్యను, సీతమ్మను భారీ ఎత్తున ఊరేగించారు. గిరిజన సంప్రదాయ నృత్యం డోలుకొయ్యలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సమూర్తులను కొండ మీద నుంచి ఊరేగింపుగా పల్లకీలో కొండదిగువన ఉన్న మండపానికి తీసుకొచ్చారు. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి ప్రధాన అర్చకులు పురుషోత్తమాచార్యులు ఆధ్వర్యంలో కల్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టు వస్త్రాల సమర్పణ చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ , ఆలయకమిటీ చైర్మన్ సుదర్శనరావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలు సమర్పించారు. ఏఎస్డీఎస్ డైరెక్టర్ ఉండవల్లి గాంధీ బాబు మంగళసూత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి, జెడ్పీటీసీ వాళ్ల రంగారెడ్డి, స్థానిక సర్పంచ్ పులిసంతోష్ కుమార్, ఓఎస్డీ జగదీష్, సీఐ దుర్గాప్రసాద్, కూనవరం, వీఆర్ పురం ఎస్ఐలు సంతోష్కుమార్, లతశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో సుమారు 40 వేల మంది భక్తులు పాల్గొన్నట్టు అంచనా. భక్తుల కోసం ప్రత్యేక లాంచీలు ఏలూరు జిల్లా నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తుల కోసం గోదావరి ఆవల ఒడ్డున రేపాక గొమ్ము నుంచి లాంచీలను ఏర్పాటు చేశారు. భక్తుల సేవలో..కల్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తుల కోసం పలువురు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లు, బెల్లం పానకం పంపిణీ చేశారు. బోటు యూనియన్ సభ్యులు మజ్జిగ పంపిణీ చేశారు. భద్రాచలం కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు 10 వేల మందికి అన్నసమారాధ నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. రమణీయం రాములోరి కల్యాణం జై శ్రీరామ్ నినాదాలతో శ్రీరామగిరి మార్మోగింది.. శ్రీరామ నవమి సందర్భంగా మరో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీరామగిరిలో అశేష భక్తజనం నడుమ శ్రీ సుందర సీతారాచంద్రస్వామి కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. తనివి తీరా వీక్షించిన భక్తులు తమ కనులదే భాగ్యమంటూ ఉప్పొంగిపోయారు. జై శ్రీరామ్...జై శ్రీరామ్.. సీతారాం అన్న నామస్మరణలతో రామగిరి ప్రతిధ్వనించింది. రామగిరికి భారీగా తరలివచ్చిన జనం కల్యాణ ఘట్టాలను తిలకించి పులకించిన భక్తులు -
పారదర్శకంగా టెన్త్ మూల్యాంకనం
● కలెక్టర్ దినేష్ కుమార్ సాక్షి, పాడేరు: టెన్త్ మూల్యాంకనాన్ని పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ సూచించారు. స్థానిక తలారిసింగి పాఠశాలలోని టెన్త్ మూల్యాంకన కేంద్రాన్ని ఆయన ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేసి, మూల్యాంకనం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా మూల్యాంకనాన్ని కూడా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కేంద్రంలోని గదుల్లో లైటింగ్, తాగు నీరు, ఇతర సదుపాయాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. విత్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఏర్పాటు చేసిన జనరేటర్ పరిశీలించారు. సుమారు 650 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొన్నారని, రేపటితో ఓపెన్ స్కూల్ పరీక్షల మూల్యాంకనం పూర్తవుతుందని, రెగ్యులర్ పదవ తరగతి మూల్యాంకనం మరో మూడు రోజుల పాటు జరుగుతుందని కలెక్టర్కు డీఈవో వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో పి.బ్రహ్మాజీ రావు, పరీక్షల సహాయ కమిషనర్ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు -
ఏయూలో గాడితప్పిన బిజినెస్
● ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్’పై ప్రభుత్వ నిర్లక్ష్యం ● రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక చదువులు తిరోగమనం ● రిటైర్ అయిన ఆచార్యుడికి డైరెక్టర్ పగ్గాలు ● ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి అందలం ● వీసీ నిర్ణయాలపై విస్మయం విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలోని ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్’ గాడి తప్పుతోంది. కూటమి ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలకు మేలు చేసేలా తీసుకుంటున్న నిర్ణయాలతో ఏయూలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చిన ప్రాధాన్యతతో అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని 2021–22 విద్యా సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హాస్పటాలిటీ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్తో బీబీఏతో పాటు ఎంబీఏ కూడా పూర్తి చేసుకునేలా ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందుబాటులోకి తీసుకురావటంతో విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభించింది. చదువులు తిరోగమనం సెల్ఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ కింద రూసా నిధులతో ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్’ను ఏయూలో ప్రారంభించారు. తరగతుల నిర్వహణలో భాగంగా కాంట్రాక్టు పద్ధతిన సీనియర్ ఆచార్యులు, అవసరమైన మేరకు అతిథి అధ్యాపకులను నియమించారు. ప్రభుత్వ ఆమోదంతో రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ప్రయత్నాలు చేశారు. ఈలోగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, ప్రసాద్రెడ్డిని వీసీ పదవి నుంచి తప్పించటం జరిగిపోయాయి. కానీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలపై ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించడం లేదు. అంతా అతిథి అధ్యాపకులే కావటంతో ఇక్కడ చదువులు సవ్యంగా సాగటం లేదు. ఈ కారణంగానే స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ చదువుల స్టాండర్డ్ తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. బాధ్యతాయుతంగా పాఠాలు చెప్పేవారు లేకపోతే, పరిస్థితి ఇలానే ఉంటుందని ఇక్కడి ఆచార్యులు సైతం అంగీకరిస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఆచార్యుడికి కీలక బాధ్యత ఉద్యోగ విరమణ చేసిన వారికి కీలక బాధ్యతలు అప్పగించకూడదనేది యూజీసీ నిబంధన. తాము అధికారంలోకి వస్తే, రిటైర్ అయిన వారందరినీ యూనివర్సిటీ నుంచి సాగనంపుతామని కూటమి పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. కానీ ఏయూకు బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తున్న స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ పగ్గాలు రిటైర్ అయిన ఆచార్యుడికి అప్పగించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇన్చార్జ్ వీసీ శశిభూషణ రావు హయాంలో కూటమి పెద్దల సిఫార్సుతోనే నియామకం జరిగినట్లు ప్రచారం సాగింది. ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్ హయాంలోనూ అదే వ్యక్తికి డైరెక్టర్గా కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడంపై వర్సిటీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉద్యోగ విరమణ చేసిన ఓ ఆచార్యుడు సైతం ఇక్కడ ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రసాద్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం, ఆయన హయాంలో ఏర్పాటు చేసిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ను నిర్వీర్యం చేయనుందా..? అనే అనుమానాలు సైతం ఆచార్యులు వ్యక్తం చేస్తున్నారు. విదేశీ విద్యార్థులతో క్రేజ్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ‘ఆంధ్ర యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్’గా మారింది. ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో డిగ్రీ, పీజీ చేసే అవకాశం ఉండటంతో ఇక్కడ చదివేందుకు విదేశీ విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. విదేశీ ఎంబసీ ఆమోదంతో ఇంటర్నేషనల్ వ్యవహారాలు చూసే విభాగం ద్వారా ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్లో చేరే వారిలో 40 శాతం మంది విద్యార్థులు ఆఫ్రికా దేశాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. అన్ని కోర్సులు కలుపుకొని 350 మందితో ప్రారంభమైన కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఈ మూడేళ్ల కాలంలో 586కు చేరింది. చైన్నెకి చెందిన లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ మేనేజ్మెంట్తో ఎంవోయూ చేసుకోవడంతో ఇక్కడ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లభిస్తున్నాయి. -
మంచు.. ఎండ.. వాన
మూడు పూటలా భిన్నమైన వాతావరణంసాక్షి,పాడేరు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో వింత వాతావరణం నెలకొంటొంది. ఉదయం దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో 8గంటల తరువాత సూర్యోదయం అవుతోంది.ఆ తరువాత సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. మధ్యాహ్నం 3గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురుస్తోంది. పాడేరుతో పాటు పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకూ తీవ్రంగా ఎండకాసి, అనంతరం వర్షం కురుస్తుండడతో ప్రజలు ఇబ్బందులకు పడుతున్నారు. జిల్లాలో పాడేరుతో పాటు పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం పడింది. భారీగా ఈదురు గాలులు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
ఈదురుగాలులు... భారీ వర్షం
రంపచోడవరం: మండల కేంద్రం రంపచోడవరంలో గాలిదూమరంతో భారీ ఎత్తున వడగళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులు వీయడంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి విద్యుత్ సరఫరాను నిలిచిపోయింది. ఆదివారం జరిగిన సంతకు వచ్చిన పలువురు ఇబ్బందులకు గురయ్యారు. సుమారు రెండు గంటల పాటు వర్షం కురవడంతో రంపచోడవరం వీధులు నీటితో నిండిపోయాయి. జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలతో కుండపోతగా వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. పాడేరు,చింతపల్లి,సొలభం, గడుతూరు, నుర్ముతి,మద్దిగరువు, బొయితిలి, లువ్వాసింగి, వంజరి, గెమ్మెలి కుంబిడిసింగి రోడ్లలో రాకపోకలు సాగించే ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భీకర శబ్దాలతో పిడుగులు పడడంతో భయాందోళనలకు గురయ్యారు. రాజవొమ్మంగి : మండలంలో ఆదివారం భారీగా ఈదురు గాలులు వీచాయి. ఆకాశం మేఘావృతమై పెద్ద శబ్దాలతో ఉరుములు మెరుపులు రావడంతో స్థానికులను భయాందోళనలకు గురయ్యారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మండలంలోని కొన్ని లోతట్టు గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కొయ్యూరు: మండలంలో రోజూ సాయంత్రం ఈదురు గాలులు వీస్తుండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోంది. వారం నుంచి మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఆదివారం సాయంత్రం కూడా ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అటు కృష్ణదేవిపేట లైన్తో పాటు ఇటు రంపచోడవరం నుంచి వచ్చే విద్యుత్లైన్లో సాంకేతిక సమస్య వల్ల సరఫరా నిలిచిపోయింది.కొమ్మికలో శనివారం ఈదురుగాలులు మూలంగా పడిపోయిన స్తంభాలను ఆదివారం మధ్యాహ్నం పునరుద్ధరించారు. -
అన్నను కడతేర్చిన తమ్ముడు
పెదబయలు: మండలంలో అరడకోట పంచాయతీ పురుగుడిపుట్టు గ్రామంలో దారుణం జరిగింది. భూ వివాదం నేపథ్యంలో అనుబంధాన్ని, ఆత్మీయతలను మరిచి, విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి వరుసకు అన్నను పొట్టన పెట్టుకున్నాడు. కర్రతో కొట్టడంతో రెండు రోజుల తరువాత మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి కుమారుడు, స్థానిక ఎస్ఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పురుగుడిపుట్టు గ్రామానికి చెందిన కిల్లో సూరిబాబు, కిలో గణపతి వరుసకు అన్నదమ్ములు. వీరి మధ్య భూ వివాదం నడుస్తోంది. పాతకక్షల నేపథ్యంలో ఈ నెల 3 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న కిల్లో సూరిబాబు(అన్న)పై గణపతి కర్రతో దాడి చేసి తల,ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టాడు. దీంతో సూరిబాబు స్పృహ కోల్పోయి పడిపోయాడు. గ్రామస్తులు ఆయన భార్యకు సమాచారం అందించడంతో ఆమె పెదబయలు పీహెచ్సీ తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన చికిత్స కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి రిఫరల్ చేశారు.అయితే అదే రోజు పాడేరు తీసుకువెళ్లకుండా స్వగ్రామం పురుగుడిపుట్టు తీసుకువచ్చేశారు. ఈ నెల 5 తేదీన గుండెలో నొప్పి వస్తోందని సూరిబాబు చెప్పడంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్కు సమాచారం ఇచ్చే లోపు మృతి చెందాడు. ఈ రెండు కుటుంబాల మధ్య ఏడేళ్ల నుంచి భూ, ఇతర వివాదాలు ఉన్నాయి. మృతుడు కిల్లో సూరిబాబుకు భార్య కాసులమ్మ, కుమారుడు లోకేష్, కుమార్తె నందిని ఉన్నారు. సూరిబాబు మృతితో భార్యాపిల్లలు గుండెలవిసేలా రోదించారు. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితుడు కిల్లో గణపతిని అరెస్టు చేసి, హత్య కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్టు పెదబయలు ఎస్ఐ రమణ ఎస్ఐ తెలిపారు. ఏడేళ్ల నుంచి ఇద్దరి మధ్య భూ వివాదం ఈ నెల 3వ తేదీన కర్రతో దాడి పురుగుడిపుట్టలో ఘటన నిందితుడి గణపతి అరెస్టు, రిమాండ్కు తరలింపు -
గిరిజనుల చేతికి చిక్కిన బైక్ దొంగలు
ముంచంగిపుట్టు: మండలంలోని దొడిపుట్టు పంచాయతీ కేంద్రం సమీపంలో నలుగురు బైక్ దొంగలను స్థానిక గిరిజనులు శనివారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంత మంది అనుమానా స్పదంగా దొడిపుట్టు గ్రామ సమీపంలో సంచరిస్తూ ఉండడంతో స్థానికులు వారిని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకుండా వారు తప్పించుకొని కొండ ప్రాంతం వైపు పరుగు తీశారు. దీంతో దొడిపుట్టు, దొరగూడ, పనస, సిందిపుట్టు గ్రామాల గిరిజనులు కొండ ప్రాంతాన్ని చుట్టుముట్టి వారిని పట్టుకున్నారు. పట్టుబడిన ఆ నలుగురు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన వారుగా గుర్తించారు. బైకులను దొంగతనాలు చేయడంతో పాటు ఈ ప్రాంతంలో చోరీ చేసిన వాహనాలను విక్రయించేందుకు వచ్చినట్టు తెలుసుకున్నారు. దీంతో ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్కు సమాచారం అందించి, వారిని పోలీసులకు అప్పగించారు. స్థానిక ఎస్ఐ జె.రామకృష్ణ విచారణ జరిపారు. బైకులు దొంగతనం చేసి, వేరే జిల్లాకు వెళ్లి, అక్కడ అమ్ముకాలు చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఇటీవల తుని రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనం దొంగతనం చేసి, ఏవోబీ సరిహద్దులో విక్రయించేందుకు వచ్చినట్టు నిందితులు తెలిపారని ఎస్ఐ చెప్పారు. తుని రూరల్ పోలీసు స్టేషన్లో ద్విచక్రవాహనం దొంగతనంపై కేసు నమోదు కావడంతో నిందితులను అక్కడికి పంపుతామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.పోలీసు స్టేషన్లో అప్పగింత -
చిత్రలేఖనంలో రాజవొమ్మంగి హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ
● నాలుగు బంగారు, నాలుగు వెండి పతకాలు కై వసం రాజవొమ్మంగి : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చిత్రలేఖనంలో ప్రతిభ చూపారు. 12వ ఆల్ఇండియా యూత్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ కాంపిటీషన్లో నాలుగు బంగారు, నాలుగు వెండి పతకాలు సాధించారు. ఇస్సాక్ అహ్మద్, హిమశ్రీ, హారిక, మణికంఠ బంగారు పతకాలు సాధించగా, బి.జీవన్దుర్గేంద్ర, డి. శ్రుతి, అమృత, మల్లిక వెండి పతకాలు పొందారు. విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో శనివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేసినట్టు హెచ్ఎం గోపాలకృష్ణ, డ్రాయింగ్ టీచర్ కొండబాబు తెలిపారు. డ్రాయింగ్ టీచర్ కొండబాబును ఈ సందర్భంగా నిర్వాహకులు గజమాలతో సత్కరించినట్టు హెచ్ఎం చెప్పారు. ఈ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ, చైన్నె రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నట్టు హెచ్ఎం తెలిపారు. -
ఖైదీ..జే జైలు
జైలు కాలం...నవ జీవన రాగం ● ఖైదీల్లో ఆర్థిక స్వావలంబన పలు కర్మాగారాలతో ఉపాధి కల్పిస్తున్న విశాఖ కేంద్ర కారాగారం సంవత్సరం ఆదాయం (రూ. లలో) 2006 20లక్షలు 2015 40లక్షలు 2016 1.30 కోట్లు 2017 1.40 కోట్లు 2020 1.60 కోట్లు 2024 2.01 కోట్లు ఆదాయార్జనలో అంతకుమించి.. పలు రంగాల ఉత్పత్తుల ద్వారా ఆదాయార్జనలో ఏటికేడు కేంద్ర కారాగారం తనదైన శైలిలో ముందడుగు వేస్తోంది. 2006 నాటి ఆదాయంతో పోల్చి చూస్తే 19 ఏళ్ల కాలంలో పదిరెట్ల పురోగతితో దూసుకుపోతోందిఈ విభాగాల్లో అత్యధిక ఉత్పత్తి విశాఖ కారాగారంలో ఉన్న యూనిట్లలో అత్యధిక ఉత్పత్తిలో స్టీల్ పరికరాల యూనిట్ మొదటి వరసలో ఉంది. తర్వాతి స్థానాల్లో బేకరీ, చేనేత, వ్యవసాయ క్షేత్రాలున్నాయి. ఈ నాలుగు యూనిట్ల ద్వారా 2024–25 సంవత్సరంలో రూ 1.71 కోట్ల విలువైన ఉత్పత్తులు వచ్చాయి. విభాగం ఉత్పత్తుల విలువ జైలుకు (రూ.లలో) సమకూరిన ఆదాయం లక్షల్లో స్టీల్ పరికరాలు 1.35 కోట్లు 17 బేకరీ 15.30 లక్షలు 2 చేనేత 15 లక్షలు 1.60 వ్యవసాయం 5.80 లక్షలు 1.20 ఇతరములు 28.90 లక్షలు 5.70 8లోఖైదీలతో వివిధ ఉత్పత్తి విభాగాల నిర్వహణ ఏడాదిలో కారాగారం నుంచి రూ. రెండు కోట్ల విలువైన ఉత్పత్తులు -
126 కిలోల గంజాయి స్వాధీనం
అల్లిపురం(విశాఖ): ఏజెన్సీ ప్రాంతం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న వ్యక్తిని దువ్వాడ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరి పరారవగా, 126 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్ సమావేశమందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర శాంతిభద్రతల డీసీపీ–2, డి.మేరీ ప్రశాంతి వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో దువ్వాడ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గంజాయి బీట్ సిబ్బంది కూర్మన్నపాలెం, స్టీల్సిటీ ఆర్టీసీ డిపోవద్ద నిఘా వేశారు. దీంట్లో భాగంగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గమనించారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 6 బ్యాగులలో 126.940 కేజీల గంజాయి, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ ఢిల్లీకి చెందిన భరత్ సింగ్, రాజ్సింగ్లు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దుస్తుల వ్యాపారం చేస్తుంటారు. రాజ్సింగ్ స్నేహితుడు అమిత్ కుమార్ సింగ్ ముందుగా విశాఖ చేరుకున్నాడు. ఇక్కడ రూం అద్దెకు తీసుకుని దుస్తుల వ్యాపారం చేస్తున్నట్టు నటిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి కొనుగోలు చేశాడు. పని పూర్తయిన తరువాత తన మిత్రులైన భరత్సింగ్, రాజ్సింగ్ను విశాఖ రమ్మన్నాడు. వీరు ముగ్గరూ గంజాయితో ఢిల్లీ వెళ్లేందుకు కూర్మన్నపాలెంలో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కేందుకు ఆటోలో వేచి ఉండగా పోలీసులు వారిని చుట్టుముట్టారు. అయితే వారిలో అమిత్సింగ్, రాజ్సింగ్ పరారవగా..భరత్సింగ్ మాత్రం పోలీసులకు దొరికిపోయాడు. అతని నుంచి 126.940 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
హెచ్ఎస్ఎల్లో నేషనల్మారిటైమ్ డే వేడుకలు
సింథియా(విశాఖ): హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్ సంస్థలో నేషనల్ మారిటైమ్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక షిప్యార్డ్, మొదటి విమాన కర్మాగారం, మొదటి కార్ ఫ్యాక్టరీని స్థాపించిన సేథ్ వాల్చంద్ హీరాచంద్ దోషిని గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. నేషనల్ మారిటైమ్ డేను పురస్కరించుకుని హైదరాబాద్కు చెందిన సీఐఐ–యంగ్ ఇండియన్స్ సభ్యులతో కూడిన 25 మంది షిప్యార్డ్ను సందర్శించగా, వారికి సంస్థకు చెందిన అధికారులు పలు అంశాలను వివరించారు. 1919వ సంవత్సరం ఏప్రిల్ 5న సింథియా స్టీమ్ నావిగేషన్ మొదటి భారతీయ ఓడ ఎస్ఎస్ లాయల్టీ ముంబై నుంచి లండన్ వరకు ప్రయాణించిందని, నాటి స్ఫూర్తితో ఆత్మ నిర్భర్ భారత్కు అనుగుణంగా ఆధునిక నౌకలను నిర్మించడం ద్వారా సేథ్ వాల్చంద్ హీరాచంద్ దోషి కలలకు కట్టుబడి ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి
జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రముంచంగిపుట్టు: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు దృష్టి పెట్టాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తెలిపారు. మండల కేంద్రం ముంచంగిపుట్టులోని చైర్పర్సన్ నివాసంలో వైఎస్సార్సీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నేతలు, కార్యకర్తలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందుగా పంచాయతీల వారీగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం గ్రామాల్లో పర్యటించి, ప్రజలకు అండగా ఉంటూ మౌలిక సదుపాయాలు కల్పనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలుపుకొని పోతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని చెప్పారు. తాగునీటి పథకాలు, రహదారుల ప్రారంభోత్స కార్యక్రమాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలను భాగస్వామం చేసే విధంగా అధికారులను సూచించినట్టు తెలిపారు. అఽధికారులు ప్రొటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వైఎస్సార్సీపీని నమ్ముకున్న క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె చెప్పారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు, అరకు నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గల్లెల అర్జున్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంగడ రమేష్, వైస్ఎంపీపీ సిరగం భాగ్యవతి, మండల ప్రధాన కార్యదర్శి ఎం.రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
రాములోరి కల్యాణానికిసాక్షి,పాడేరు: రాములోరి పెళ్లికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లో సీతారాముల కల్యాణాన్ని ఆదివారం నిర్వహించేందుకు అందరూ సమాయత్తమయ్యారు. అన్ని గ్రామాల్లో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. వీఆర్ పురం మండలం శ్రీరామగిరి సుందర సీతారామచంద్ర స్వామి ఆలయం, మండల కేంద్రం ఎటపాకలోని జటాయువు మండపంతో పాటు అన్ని దేవాలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు పలు గ్రామాల్లో పురాతన రామాలయాలు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దేవదాయశాఖ పలు గ్రామాల్లో సీతారాముల ఆలయాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. విశ్వహిందు పరిషత్,విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలోను రామాలయాలను నిర్మించారు.జిల్లాలోని 22 మండలాల పరిధిలో ఊరూరా రామాలయాలు ఉండడంతో గిరిజన పూజారులు నిత్యం పూజలు చేస్తున్నారు. ప్రతి ఏడాది శ్రీరామనవమిని గిరి గ్రామాల్లో భారీ ఎత్తున నిర్వహిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పాడేరు మండలంలో సుండ్రుపుట్టు, డోకులూరు, రాయిగెడ్డ, కిండంగి, పాతపాడేరు, పి.గొందూరు, జి.ముంచంగిపుట్టు, గెడ్డంపుట్టు, కుజ్జెలి తదితర గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. పంచాయతీ కేంద్రం గొండెలిలో నూతనంగా నిర్మించిన రామాలయంలో తొలిసారిగా శ్రీరామనవమి ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభించారు. పోలీస్ బందోబస్తు జిల్లా కేంద్రం పాడేరుతో పాటు రామాలయాలు ఉన్న అన్ని చోట్ల భద్రతా చర్యలపై పోలీసుశాఖ దృష్టి సారించింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీరామగిరిపై ఏర్పాట్లు పూర్తి వీఆర్పురం: మండలంలోని శ్రీరామగిరిపై సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ శనివారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించి, సూచనలు చేశారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. సీతారాముల కల్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 20 వేలమంది భక్తులు రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ పెందుర్తి సుందర్శనరావు, ఆలయప్రధాన అర్చకులు పురుషోత్తమాచార్యులు తెలిపారు. సుమారు వంద మంది పోలీసులు, ఏడుగురు ఎస్ఐలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం గ్రామగ్రామాన రామ నవమికి ఏర్పాట్లు -
బాబూ జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకం
సాక్షి,పాడేరు: స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, దివగంత మాజీ ఉప ప్రధానికి బాబూ జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో బాబూ జగజ్జీవన్రామ్ 118వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి కలెక్టర్తో పాటు పలువురు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాబూ జగజ్జీవన్రామ్ సమాజానికి, దళితుల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆయన జీవితాన్ని యువతీయువకులు ఆదర్శంగా తీసుకుని సమాజ హితానికి పనిచేయాలన్నారు. ఈకార్యక్రమంలో డీఆర్వో కె.పద్మలత, సాంఘిక సంక్షేమ అధికారి జనార్దనరావు, డీఆర్డీఏ, డ్వామా పీడీలు మురళీ, విద్యాసాఽగర్, డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాష, ఉద్యానవన శాఖ అధికారి రమేష్కుమార్రావు, సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు, డీపీఆర్వో గోవిందరాజులు, డివిజనల్ పీఆర్వో పండు రాములు, జిల్లా క్రీడాశాఖాధికారి జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
ఏయూను సందర్శించినవిదేశీ ప్రతినిధులు
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రిపబ్లిక్ ఆఫ్ అంగోలా రాయబారి ఎక్స్లెన్సీ క్లెమెంటే కామెన్హా శనివారం సందర్శించారు. వీసీ ఆచార్య రాజశేఖర్ను కార్యాలయంలో కలుసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో చదువుతున్న అంగోలాకు చెందిన 46 మంది విద్యార్థులకు అద్భుతమైన విద్యా సౌకర్యాలు కల్పించినందుకు క్లెమెంటే కామెన్హా సతీమణి మరియా, మినిస్టర్ కౌన్సిలర్ అబెల్ మావుంగో ఏయూ వీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున జ్ఞాపిక అందజేసి సత్కరించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందజేస్తామని ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులు తెలిపారు. -
నరసింగబిల్లిలో బాలిక ఆత్మహత్య
కశింకోట : నరసింగబిల్లిలో ఒక బాలిక ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకొంది. సీఐ అల్లు స్వామినాయుడు శనివారం అందించిన వివరాల ప్రకారం..నరసింగబిల్లిలోని జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పిల్లిబోయిన బ్యూల (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరిపోసుకొని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై ఫిర్యాదు అందడంతో ఎస్ఐ లక్ష్మణరావు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి శనివారం పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలు ఇటీవల టెన్త్ పరీక్షలు రాసింది. నూతలగుంటపాలెం శివారు త్రిపురవానిపాలెం గ్రామానికి చెందిన ఆమె తల్లి దుర్గ, తండ్రి కూలి పని చేసుకుంటూ నరసింగబిల్లిలో పదేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరు ఎప్పటిలాగే కూలి పనికి వెళ్లిపోయాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్యూల ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఇందుకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే ఇంటి పక్కన ఉన్న ఓ యువకుడు ప్రేమ పేరుతో కొంత కాలంగా వేధిస్తుండడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఆ యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ కోణంలో ఆత్మహత్య సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఒక సోదరుడు ఉన్నారు. తండ్రి వరహాలబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నిధుల దుర్వినియోగం ఆరోపణపై విచారణ
పెదబయలు: మండలంలోని లక్ష్మీపేట గ్రామ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగాయని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్కు అర్జీ అందజేయడంతో శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపినట్టు స్థానిక మండల పంచాయతీ విస్తరణాధికారి(ఈవోపీఆర్డీ) నర్సింగరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో సందర్శించారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆరా తీశారు. పనులు సక్రమంగా నిర్వహించకుండా 15 ఆర్థిక సంఘం నిధులు డ్రా చేశారని, ఎలాంటి వీఎల్సీదారులు లేకుండా నేరుగా సర్పంచ్ పేరుతో డ్రా చేశారని ఫిర్యాదుదారుడు బొండా సన్నిబాబు విచారణాధికారి దృష్టికి తీసుకొచ్చారు. ఎంత వరకు పనులు చేశారో తేల్చేందుకు ఇంజినీరింగ్ అధికారులతో కూడిన నిఫుణుల కమిటీ వేయాలని కోరారు. పనులు గతంలో కంటే బాగానే జరిగాయని కొంతమంది, తీర్మానాలు చేయకుండా నిధులు ఖర్చు చేస్తున్నారని మరికొంతమంది విచారణాధికారికి తెలియజేశారు. విచారణ వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించి, ఆదేశాలు వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని ఈవోఆర్డీ నర్సింగరావు తెలిపారు. విచారణకు గ్రామ పంచాయతీ కార్యదర్శి హాజరు కాలేదు, నిధుల ఖర్చులకు సంబంధించి ఎలాంటి రికార్డులు విచారణ సమయంలో చూపకపోవడం గమనార్హం. సర్పంచ్ లకే అశోక్కుమార్, గిరిజన సంఘం నాయకుడు బొండా సన్నిబాబు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్ తగిలి రైతు సజీవదహనం
నక్కపల్లి : మండలంలోని జానకయ్యపేటలో విద్యుత్ షాక్ తగిలి ఈగల తాతబ్బాయి(80) అనే రైతు సజీవ దహనమయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఈగల తాతబ్బాయి శనివారం ఉదయం తన కొబ్బరి తోటకు వెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన దేవర కృష్ణ తోటలో తాటిచెట్టు కరెంటు తీగలపై పడడంతో తోటలోకి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్లు తెగి కాలిబాటలో పడ్డాయి. వీటిని గమనించకుండా వెళ్లిన తాతబ్బాయి తెగి పడిన వైర్లను కాలితో తొక్కడంతో విద్యుత్షాక్కు గురయ్యాడు. తీగలనుంచి మంటలు వ్యాపించి తాతబ్బాయి శరీరం పూర్తిగా కాలిపోయింది, దీంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ సింహాచలం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కురందాసు నూకరాజు, ఎస్ఐ సన్నిబాబులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద విషయాన్ని తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగల వల్ల మృత్యువాత పడిన తాతబాబ్బయి కుటుంబాన్ని ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
నియోజకవర్గ ప్రజలకుశ్రీరామనవమి శుభాకాంక్షలు ● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డుంబ్రిగుడ: నియోజకవర్గ ప్రజలకు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ముందస్తుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పండగ పూజలు జరుపుకోవాలని కోరారు. శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, అటువంటి శ్రీరాముని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.వన్ధన్ వికాస కేంద్రాలఅభివృద్ధికి కృషి రంపచోడవరం: ఏజెన్సీలో వన్ధన్ వికాస కేంద్రాలకు సరఫరా చేసే జీడిపిక్కలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై సందేహాలు ఉంటే ఐటీడీఏలో సంప్రదించాలని పీవో కట్టా సింహాచలం తెలిపారు. వీడీవీకేలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వన్ధన్ వికాస కేంద్రాలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా టోల్ ఫ్రీ నెంబర్ 08864–2421135, 944801435కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. ● ఆశ్రమ పాఠశాల, కేజీబీవీని సందర్శించిన జేసీ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్డుంబ్రిగుడ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ పరిశీలించారు. డుంబ్రిగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల మైదానాన్ని శనివారం సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. అనంతరం అరకులోయ మండల కేంద్రంలో ఏడో తేదిన నిర్వహించనున్న మహా యోగాసనాల ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లారు. గిరిజన సంక్షేమ శాఖ ఈఈ కె.వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు తదితరులున్నారు. -
పార్ధసారథి హత్య కేసులో మరొకరి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : శనిగపురం శివారు బోరింగ్ తండా సమీపంలో దారుణహత్యకు గురైన దంతాలపల్లి ఎంజేపీ గురుకులం హెల్త్ సూపర్ వైజర్ తాటి పార్ధసారథి హత్య కేసులో మరొకరిని అరెస్ట్ చేశామని రూరల్ సీఐ పి.సర్వయ్య, ఎస్ఐ వి.దీపిక తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మృతుడి భార్య స్వప్న, ఆమె ప్రియుడు వెంకట విద్యాసాగర్, తెలగరి వినయ్ కుమార్, బోగ శివకుమార్, మోతుకూరి వంశీని అరెస్ట్ చేశామన్నారు. ఈ క్రమంలో శనివారం మరొకరి అరెస్ట్ చేశామన్నారు. పార్ధసారథిని హత్య చేయడానికి నిర్వహించిన రెక్కీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా రాజావొమ్మంగి మండలం జెడ్డంగి గ్రామానికి చెందిన కూసం లవరాజు పాల్గొన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో అతడిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ, ఎస్ఐ పేర్కొన్నారు. -
ఈదురు గాలులు.. భారీ వర్షం
సాక్షి,పాడేరు/కొయ్యూరు/రాజవొమ్మంగి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పాడేరులో రాత్రి ఏడు గంటల తరువాత ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో గంటపాటు జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.రోజూ వర్షాలు కురుస్తుండడంతో మామిడిపంటకు నష్టం ఏర్పడుతుందని గిరిజన రైతులు వాపోతున్నారు. కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెంతో పాటు పది గ్రామాల్లో సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. పెద్ద శబ్దాలతో పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రాజవొమ్మంగి మండల వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో మండల వాసులు ఆందోళన చెందారు. వర్షం కారణంగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. -
నిర్వాసితులు అధైర్యపడవద్దు
చింతూరు ఐటీడీఏ పీవోఅపూర్వ భరత్ కూనవరం: పోలవరం నిర్వాసితులెవరూ అధైర్య పడవద్దని, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ తెలిపారు. మండల పరిధిలో పోలవరం ముంపునకు గురవుతున్న టేకులబోరు, శబరికొత్తగూడెం, టేకుబాక, పెదార్కూరు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఆర్అండ్ఆర్ గ్రామసభలను ఆయన పరిశీలించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన అర్హులు, అనర్హుల వివరాలను గ్రామసభలో చదివి వినిపించారు. నాలుగు గ్రామాల్లో మొత్తం పీడీఎఫ్లు 3,179కి గాను 2,953 మందిని అర్హులుగా గుర్తించినట్టు పీవో తెలిపారు. అనర్హుల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆధారాలను తహసీల్దార్ లేదా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు గాని, తనకు గాని సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ నసరయ్య, తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, సర్పంచ్ హేమంత్, కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్పురం: పోలవరం ముంపునకు గురవుతున్న కొప్పిలి, ధర్మతాల్లగూడెం, కన్నయ్యగూడెం, శబరిరాయిగూడెం, రాజుపేట కాలనీల్లో గ్రామ సభల్లో ఆర్అండ్ఆర్ అర్హులు, అనర్హుల జాబితాను శుక్రవారం ప్రకటించారు ఈ సభలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్, ఎస్డీసీలు పాల్గొని నిర్వాసితుల సందేహాలను నివృత్తి చేశారు. -
స్టాఫ్ నర్సు రిక్రూట్మెంటులో నకిలీ సర్టిఫికెట్లు వాస్తవమే
● ఆర్టీ రాధారాణి మహారాణిపేట: స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియలో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు తేలింది. ఈ నెల 1వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘నర్సుల పోస్టులకు నకిలీ పత్రాలు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలలో నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఉన్నట్లు సాక్షి కథనంలో పేర్కొంది. దీనిపై ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి (ఆర్డీ) డాక్టర్ రాధారాణి విచారణ చేపట్టారు. కరోనా సమయంలో పనిచేసినట్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాల గురించి ఆర్డీ డాక్టర్ రాధారాణి సంబంధిత వ్యక్తులకు లేఖలు రాశారు. ముఖ్యంగా కేజీహెచ్ (కింగ్ జార్జ్ హాస్పిటల్) నుంచి అత్యధిక సంఖ్యలో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు రావడంతో, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. శివానంద్కు ఆర్డీ డాక్టర్ రాధారాణి లేఖ రాశారు. ఈ సర్టిఫికెట్లు నకిలీవని కేజీహెచ్ నుంచి సమాధానం రావడంతో, ఆ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోలేదని ఆర్డీ డాక్టర్ రాధారాణి తెలిపారు. మొత్తం నకిలీ సర్టిఫికెట్లను పక్కన పెట్టామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్డీ వివరించారు. -
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ఫైనల్ జాబితా విడుదల
మహారాణిపేట: స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల ఫైనల్ జాబితాను శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి విడుదల చేశారు. ఈ జాబితాను https@//cfw.ap.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ ఫైనల్ జాబితాపై కూడా అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను రేసపువానిపాలెంలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయంలో అందజేయాలని ఆర్డీ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఎంపిక జాబితాను విడుదల చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 27న ప్రాథమిక (ప్రొవిజనల్) జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాపై మూడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించారు. అయితే, ఇంతలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమలులోకి రావడంతో జాబితా పరిశీలన కార్యక్రమం నిలిచిపోయింది. ఎన్నికల కోడ్ ముగియడంతో మళ్లీ జాబితాల పరిశీలన ప్రారంభించారు. దరఖాస్తుల వివరాలు: మొత్తం 6 జిల్లాల్లోని 106 స్టాఫ్ నర్సు పోస్టుల కోసం డీఎంహెచ్వో కార్యాలయంలోని వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. ఆ తరువాత పోస్టులు మరో 264 పెరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి ఆన్లైన్ , ఆఫ్లైన్లో కలిపి మొత్తం 8300 దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు తెలుపుతూ ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి 1,570 దరఖాస్తులు చేరుకున్నాయి.దళారులను నమ్మవద్దు పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. దళారులను ఎవరూ నమ్మవద్దు. అర్హత ప్రమాణాలు, మెరిట్, రోస్టర్ ప్రకారం ఫైనల్ జాబితా రూపొందించాం. అభ్యర్థులు ఎవరితోనూ సిఫార్సు చేయించవద్దు. – డాక్టర్ పి. రాధారాణి, ఆర్డీ -
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామ శివారు బోరింగ్ తండా సమీపంలో దారుణహత్యకు గురైన దంతాలపల్లి ఎంజేపీ గురుకులం హెల్త్ సూపర్ వైజర్ తాటి పార్థసారథి హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. మహబూబాబాద్ సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతిరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్థసారథి హత్య జరిగిన రోజున మృతుడి సోదరి హేమవరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామన్నారు. ఈ క్రమంలో మృతుడు పార్థసారథి భార్య స్వప్న, ఆమె ప్రియుడు వెంకట విద్యాసాగర్ను గురువారం అరెస్టు చేసినట్టు తెలిపారు. కేసు విచారణలో భాగంగా ముగ్గురు నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరం ఒప్పుకున్నారని చెప్పారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గంగహుస్సేన్ బస్తీకి చెందిన తెలగరి వినయ్ కుమార్, బోగ శివకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక గ్రామానికి చెందిన మోతుకూరి వంశీ ఉన్నట్టు గుర్తించామన్నారు. వారిని అరెస్టు చేసి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలిస్తామని పేర్కొన్నారు. గతంలో పార్థసారథిని హత్య చేయాలని జరిగిన రెక్కీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన కూసం లవరాజు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో రూరల్, సీసీఎస్ సీఐలు సర్వయ్య, హత్తిరాం, రూరల్, కేసముద్రం ఎస్ఐలు దీపిక, మురళీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ఎటపాకకు చెందిన వంశీ తదితరులు పరారీలో రాజవొమ్మంగికి చెందిన లవరాజు వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు -
సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయులు
రంపచోడవరం: ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచులని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉందని డీడీ రుక్మాండయ్య అన్నారు. స్ధానిక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో శుక్రవారం ఆర్ట్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కళలను మెరుగుపర్చుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ ఎం.చినబాబు మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞానం, నైపుణ్యాలు అందించడమే కాకుండా వారిలో నైతిక విలువలు ఆలోచన విధానాలు పెంపొందిస్తూ సమాజంలో మంచి పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక పాత్ర పోషిస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన 60 రకాల నమూనాలను ప్రదర్శంచారు. ఆర్ట్స్ మేళాను తిలకించడానికి వివిధ విద్యాలయాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, తరలివచ్చారు.ఉత్తమ చిత్రాలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నమూనాల్లో ప్రథమ బహుమతి బి.అనిత, ద్వితీయ బహుమతి కె.చరణ్, తృతీయ బహుమతి ఎం.ఉదయ్, యు.లచ్చిరెడ్డి, ఏ.నాగరాజు, ఎ.తనూషలు సాధించారు. వైస్ ప్రిన్సిపాల్ ఎస్.సూర్యనారాయణ, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రముంచంగిపుట్టు: సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న క్లస్టర్ విధానం అత్యంత దుర్మార్గమైనదని చెప్పారు. సచివాలయాల కుదింపు వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని, సచివాలయ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని కోరుతూ ఉద్యోగులు చైర్పర్సన్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మండల కేంద్రం ముంచంగిపుట్టులో శుక్రవారం గ్రామ సచివాలయాల ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నాశనం చేసేందుకు పూనుకుంటోందన్నారు.ప్రజలకు సుపరిపాలన అందించాలని,సంక్షేమ పథకాలు మరింత చేరువ చేయాలనే మంచి ఆలోచనతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని, ఈ విధానానికి దేశమంతటా ప్రశంసలు లభిస్తుంటే దానిని చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేక క్లస్టర్ విధానాన్ని తీసుకువస్తోందన్నారు.రెండు సచివాలయాలను ఒక క్లస్టర్గా మార్చే ఆలోచన చేస్తోందని,దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. -
వైఎస్సార్సీపీ నేతకు బెయిల్
నర్సీపట్నం: వైఎస్సార్సీపీ నేత, బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు కండిషన్ బెయిల్పై విడుదలయ్యారు. శ్రీనివాసరావును నంద్యాల జిల్లా, జలదుర్గం పోలీసులు ఈ నెల 2వ తేదీన అరెస్టు చేసి డోన్ కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారంలో మూడు రోజులు పోలీసుల ఎదుట హాజరు కావాలని, 60 రోజులపాటు నంద్యాల పరిధి దాటి వెళ్లవద్దంటూ శ్రీనివాసరావుకు కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. జలదుర్గం పోలీసు స్టేషన్ నుంచి శ్రీనివాసరావు సాక్షితో మాట్లాడుతూ రాజకీయ కక్షలతో తన ఆస్తులను ధ్వంసం చేస్తున్న సమయంలో ఆవేశంతో మాట్లాడితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంతోపాటు రాష్ట్రంలో పలు చోట్ల కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తనకు పార్టీ అండగా నిలిచిందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సారథ్యంలోనే పని చేస్తానన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన స్థాయికి తగిన వారితో రాజకీయాలు చేస్తే బాగుంటుందన్నారు. సామాన్య నాయకుడైన తనపై కేసులు పెట్టించి వేధించటం స్పీకర్కు భావ్యం కాదని ఆవేదన వెలిబుచ్చారు. -
మందుబాబులకు అడ్డాగా బస్ షెల్టర్
పెదబయలు: మండల కేంద్రం పెదబయలు కూడలిలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్షెల్టర్ మందుబాబులకు అడ్డాగా మారింది. స్థానికంగా రెండు వైన్షాప్లున్నాయి.వాటిలో మద్యం కొనుగోలుచేసి సమీపంలో గల బస్ షెల్టర్లో రాత్రీపగలు తేడాలేకుండా తాగుతూ అక్కడే మద్యం సీసాలను చెల్లాచెదరుగా పడేస్తున్నారు. మద్యం బాటిళ్లు, చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలతో ఆ ప్రాంతం నిండిపోయింది. అక్కడ బస్సులను నిలపకపోవడంతో నిరుపయోగంగా మారింది. బస్ షెల్టర్కు ఆనుకుని నివాస గృహాలున్నాయి. స్థానికంగా ఉన్న మహిళలు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు భయాందోళనలు చెందుతున్నారు. ప్రజాధనంతో నిర్మించిన బస్షెల్టర్ నిరుపయోగంగా మారిందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పోలీసులు స్పందించి బస్షెల్టర్ను శుభ్రం చేయడంతో పాటు మందుబాబుల ఆగడాలను అరికట్టాలని, బస్ షెల్టర్ను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన చేస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు. -
సైనికుల వైద్య సేవలకు యూఎస్–భారత్ ఎంవోయూ
సాక్షి, విశాఖపట్నం : తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం (ఈఎన్సీ) విశాఖపట్నంలో భారత్, యూఎస్ దేశాల మధ్య ప్రారంభమైన టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు కొనసాగుతున్నాయి. తొలి దశలో హార్బర్ ఫేజ్లో భాగంగా.. ఇరు దేశాల త్రివిధ దళాల ప్రతినిధుల మధ్య సమీక్షలు, చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మారీటైమ్ వార్ఫేర్ సెంటర్లో రెండు రోజుల పాటు ఇండియన్ నేవీ, యూఎస్ నేవీ వైద్య బృందాల మధ్య సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సెయిలర్స్, సోల్జర్స్ ఆరోగ్య సంరక్షణ, ఆపరేషనల్ మెడిసన్, వైద్య సంసిద్ధతలో ఉత్తమ సేవలు తదితర అంశాలపై పరస్పర సహకారం అందించుకునేందుకు ఇరు దేశాల మధ్య సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎక్స్ఛేంజ్(ఎస్ఎంఈఈ) ఒప్పందం జరిగింది. యుద్ధ సమయంలోనూ, విపత్తుల సమయంలోనూ వైద్య సంరక్షణ, ఏరో మెడికల్, క్యాజువాలిటీ మేనేజ్మెంట్ మొదలైన విభాగాలపై దృష్టి సారించినట్లు భారత్, యూఎస్ నౌకాదళ ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు.. యుద్ధ నౌకల్లో సహాయ సహకారాలపైనా ఎస్ఎంఈఈ ఇరుదేశాల మధ్య జరిగింది. కొనసాగుతున్న టైగర్ ట్రయాంఫ్–25 విన్యాసాలు -
పేదింట ఉడకని కందిపప్పు
ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. పేదలకు సబ్సిడీపై అందించాల్సిన నిత్యావసరాలపై నిర్లక్ష్యధోరణి పెరుగుతోంది. రేషన్ తీసుకుంటే తప్ప పూటగడవని గిరిజన కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కార్డుదారులకు అందించే కందిపప్పునకు ఈ నెల కూడా ఎగనామం పెట్టారు. సాక్షి,పాడేరు: రేషన్కార్డుదారులకు ప్రతి నెలా పంపిణీ చేయవలసిన కందిపప్పు సరఫరాలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. పేదలకు ఆహారభద్రత కార్యక్రమంలో భాగంగా సబ్సిడీపై రూ.67కి కిలో కందిపప్పు అందజేయాలి. గత రెండు నెలల నుంచి బియ్యం,పంచదార మాత్రమే రేషన్కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. మారుమూల గ్రామాల కార్డుదారులకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తిస్థాయిలో కంది పప్పు అందని పరిస్థితి నెలకొంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో జిల్లాలో పంపిణీ కాలేదు.ఈనెలలో కందిపప్పు సరఫరా జరుగుతుందని పేదలంతా ఆశపడినప్పటికీ పంచదార,బియ్యంతోనే సరిపెట్టారు. 290 టన్నులు అవసరం జిల్లాలోని 22 మండలాల్లో 671 డీఆర్ డిపోలు, 221 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నారు. 2,98,092 రేషన్కార్డులున్నాయి.వీరికి రాయితీపై పంపిణీ చేసేందుకు ప్రతినెలా సుమా రు 290 టన్నుల కందిపప్పు అవసరం. జిల్లాలో 83 శాతం రేషన్కార్డులు గిరిజన కుటుంబాలవే. ఒక వైపు పౌష్టికాహార వినియోగంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తూ, మరోవైపు కంది పప్పు ఇవ్వకపోవడంతోనిరుత్సాహంచెందుతున్నారు. ప్రైవేట్ మార్కెట్లో కిలో రూ.130 కందిపప్పు ధర ప్రైవేట్ మార్కెట్లో కిలో రూ.130 ఉంది.మార్కెట్లో ధర పెరగడంతో ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేసే కందిపప్పు కోసం కార్డుదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే రాయితీపై కందిపప్పు పంపిణీని పౌరసరఫరాల శాఖ పూర్తిగా విస్మరించింది. అడిగితే స్టాక్ లేదనే సమాధానంతో సరిపుచ్చుతున్నారు. ప్రైవేట్ మార్కెట్లో అధిక ధరతో కందిపప్పును కొనుగోలు చేయలేక పేదప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు సబ్సిడీపై కందిపప్పును ప్రతినెలా పంపిణీ చేయాల్సిన పాలకులు ఇంత నిర్లక్ష్యం చేయడం దారుణమంటూ రేషన్కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బియ్యం,కందిపప్పు,పంచదారను ప్రతి నెల రేషన్కార్డుదారులకు పంపిణీ చేసేవారు. ఈనెల కూడా బియ్యం, పంచదారకే పరిమితం రెండు నెలలుగా రేషన్కార్డుదారులకు అందని కందిపప్పు ప్రైవేట్ మార్కెట్లో కిలో రూ.130 ఈ నెలా కందిపప్పు ఇవ్వలేదు గత నెలలో కందిపప్పు పంపిణీ చేయలేదు.ఈనెల కూడా బియ్యం,పంచదార మాత్రమే ఇస్తున్నారు.ప్రభుత్వం నుంచి కందిపప్పు సరఫరా లేదంటూ ఎండీయూ వాహనాల సిబ్బంది చెబుతున్నారు.ప్రైవేట్ షాపుల్లో అధిక ధరకు కందిపప్పును కొనుగోలు చేయలేకపోతున్నాం – పాంగి రాజారావు, రేషన్కార్డుదారుడు, పాడేరు అధిక ధరకుకొనలేకపోతున్నాం ప్రతి నెలా బియ్యం,పంచదారను పంపిణీ చేస్తున్నప్పటికీ రెండు నెలల నుంచి కందిపప్పు ప్యాకెట్లు ఇవ్వడం లేదు.కందిపప్పు పంపిణీ లేక ఇబ్బందులు పడుతున్నాం.సంతల్లో అధిక ధరకు కొనుగోలు చేయలేకపోతున్నాం. – పాంగి సనాతి, వాకపల్లి, పాడేరు మండలం -
యువత క్రీడల్లో రాణించాలి
● పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు గూడెంకొత్తవీధి: గిరిజన యువత క్రీడల్లో రాణించాలని పాడేరు ఎమ్మెల్యే ఎం. విశ్వేశ్వరరాజు అన్నారు. రింతాడ పంచాయతీ ఏబులంలో జాతర సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలను ఆయన శుక్రవారం ప్రారంభించి, కొద్దిసేపు ఆడారు. అనంతరం మాట్లా డుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్, జిల్లా శాఖ కోశాధికారి కుందేరి రామకృష్ణ,పార్టీ నాయకులు నారాయణ,రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు కినుక
● కరెంట్ ఇష్యూ కోర్టు ఆదేశించినాసాక్షి, విశాఖపట్నం : ఏ సంస్థలోనైనా చేసిన సర్వీస్ ప్రకారం సీనియారిటీని పరిగణిస్తుంటారు. కానీ.. విద్యుత్ పంపిణీ సంస్థల్లో మాత్రం విచిత్రంగా పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకున్నారు. ఉద్యోగి వయసు 40 సంవత్సరాలై సర్వీసు 15 ఏళ్లున్నప్పటికీ.. యాభై ఏళ్ల ఉద్యోగికి ఐదేళ్ల సర్వీసు ఉంటే.. సదరు ఉద్యోగినే సీనియర్గా పరిగణించారు. ఇలా 2008లో డిస్కం అధికారులు అడ్డగోలుగా పదోన్నతుల జాబితా తయారుచేశారు. దీనిపై కొందరు అప్పట్లోనే హైకోర్టుని ఆశ్రయించారు. సర్వీసు ప్రకారం పదోన్నతుల జాబితా సిద్ధంచెయ్యాలంటూ 2024 జూన్లో న్యాయస్థానం ఆదేశించినా.. టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనిపై సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు. నిజానికి 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చే ముందు కరెంట్ పోతే ఫ్యూజులు బిగించేందుకు రైతులే వెళ్లి మృత్యువాత పడేవారు. దీంతో డిస్కంలలో లైన్మెన్ల కొరత వేధిస్తోందని తెలుసుకున్న వైఎస్సార్.. ఉమ్మడి రాష్ట్రంలో వెంటనే 7,114 పోస్టుల్ని భర్తీచేశారు. ఈ సమయంలో ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు ఉమ్మడి సర్కిల్స్ పరిధిలో 1,220 పోస్టులు భర్తీఅయ్యాయి. సీనియారిటీ లిస్టుల్లో అధికారుల నిర్లక్ష్యం.. 2008లో కొత్తగా రిక్రూట్ చేసిన లైన్మెన్ల గత అనుభవాన్ని అనుసరించి.. సీనియారిటీ లిస్టులు తయారుచెయ్యాలని అప్పటి ప్రభుత్వం డిస్కంలని ఆదేశించింది. అయితే.. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా జాబితా సిద్ధంచేసేశారు. పనిచేసిన అనుభవం బట్టి కాకుండా.. వయసు బట్టి జాబితా తయారుచేశారు. దీనిపై అప్పట్లోనే అధికారులపై నాటి సీఎం వైఎస్ మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన మృతిచెందడం.. తర్వాత ప్రభుత్వాలు విస్మరించడంతో నేటికి కూడా సీనియర్లు జూనియర్లుగానే మిగిలిపోయారు. జూనియర్లు మాత్రం ప్రమోషన్లు తీసుకుని సీనియర్లుగా చలామణి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బాధిత లైన్మెన్లు హైకోర్టుని ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రయత్నించినా.. సీనియారిటీ జాబితా విషయంలో అన్యాయం జరిగిందంటూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి బాధిత లైన్మెన్లు తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే కోర్టులో కేసు నడుస్తుండటంతో ఫలితం దక్కలేదు. చివరి నిమిషం వరకూ సీనియారిటీ జాబితాలో మార్పులు చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో.. గతేడాది జూన్ 21న హైకోర్టు తీర్పు వెలువరించింది. పనిదినాల ఆధారంగా మాత్రమే కొత్తగా సీనియారిటీ జాబితా తయారుచేయాలని.. వయసు ఆధారంగా చేసిన జాబితాని వెంటనే రద్దుచేసి.. కొత్తగా తయారుచేయాలని డిస్కంలని ఆదేశించింది. అయినా, కూటమి ప్రభుత్వం న్యాయస్థానం తీర్పుని పెడచెవిన పెట్టింది. 10 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడంలేదు. పలుమార్లు అధికారులకు, ప్రభుత్వ ప్రతినిధులకు లైన్మెన్లు వినతులు సమర్పించినా.. సీనియారిటీ లిస్టుని మార్చడంలేదు. ఇటీవల ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్లో ప్రక్రియ ప్రారంభించారు. అయితే.. ఈపీడీసీఎల్ అధికారులు మాత్రం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే, 2007లో జూనియర్ లైన్మెన్లుగా ఎంపికై న 138 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈపీడీసీఎల్ అధికారులు అడ్డుపుల్ల వేశారు. దీనిపై వారు కోర్టుకు వెళ్లగా.. 138 మందికి ఉద్యోగాలివ్వాలని 2011లో న్యాయస్థానం ఆదేశించింది. వీరు విధుల్లో చేరినా సీనియారిటీని కోల్పోయారు. ఇలా.. ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం సర్కిల్లో 118 మంది, విజయనగరం సర్కిల్లో 136, విశాఖపట్నంలో 198, రాజమండ్రిలో 549, ఏలూరులో 353 మంది కలిపి మొత్తం 1,354 జూనియర్ లైన్మెన్లు పదోన్నతులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టు తీర్పుని తక్షణమే అమలుచేస్తే.. ఈపీడీసీఎల్ సహా మూడు డిస్కంల పరిధిలో సుమారు 3,500 మంది ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఏపీఈపీడీసీఎల్లో 1,354 మంది జూనియర్ లైన్మెన్ పదోన్నతుల్లో విచిత్రం 18 ఏళ్ల సర్వీస్ను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరాలు ఫలితంగా సీనియర్లు సైతం జూనియర్లుగా మిగిలిపోయిన పరిస్థితి హైకోర్టు ఆదేశించినా అమలుచేయని డిస్కంలు కోర్టు కేసుల కారణంగా క్రమబద్ధీకరించలేకపోయిన గత ప్రభుత్వం సీనియార్టీ ప్రకారం జాబితా సిద్ధంచేయాలని 10 నెలల క్రితం హైకోర్టు ఆదేశాలు అయినా పాత జాబితానే కొనసాగిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం -
శబరి, జటాయువులకు మోక్షం సిద్ధించిన ప్రాంతం.. శ్రీరాముడు, హనుమంతుడు కలుసుకున్న స్థలం.. పురుషోత్తముడు నడయాడిన దివ్య ప్రదేశం... భద్రాచల రామాలయంలో జరిగే కై ంకర్యాలన్నీ ఈ క్షేత్రం నుంచే ప్రారంభమవుతాయి. ఎక్కడా లేనివిధంగా శ్రీరామచంద్రుడు దక్షిణ ముఖంగా దర్శనమిచ్చ
వీఆర్పురం: మండలంలోని శ్రీరామగిరి ఆలయం... రామదాసు భద్రాచల దేవాలయాన్ని నిర్మించడాని ముందునుంచే ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది. భద్రాచలం పట్టణానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, గోదావరి నదికి ఉపనది అయిన శబరి ఒడ్డున ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ స్వామి సుందర రాముడిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని మాతంగ ముని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీరామగిరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. ఇక్కడ స్వామి ధ్యానం చేస్తున్న సమయంలో ముఖంలో తేజస్సు వెలువడి ఎంతో సుందరంగా కనిపించాడట అందుకే ఇక్కడ వెలసిన శ్రీరాముడిని సుందర రాముడిగా, ధ్యానం చేసినందన యోగ రాముడిగా పిలుస్తారు. శ్రీరాముడు ధ్యానం చేసిన గిరి కాబట్టి ఆప్రాంతానికి శ్రీరామగిరి అనే పేరు వచ్చింది. కల్యాణ ఉత్సవాలకు ఇక్కడే శ్రీకారం... దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి శ్రీకారం చుట్టేది శ్రీరామగిరిలోనే... శ్రీరామగిరిలో జరిగే కల్యాణోత్సవాల్లో తలంబ్రాల ప్రక్రియ ముగిస్తే కానీ భద్రాచలం రాములవారి పెళ్లి తంతు ప్రారంభం కాదు. ఇక్కడ నుంచే భద్రాచలం ఆలయానికి తలంబ్రాలు పంపుతారు. ఏటా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. పోలవరం ప్రాజెక్టుతో కనుమరుగు కానుందా.. సుమారు 80 అడుగుల ఎత్తులో కొండపై ఉన్న ఈ ఆలయానికి చేరుకోడానికి భక్తులు 170 మెట్లు ఎక్కి వెళతారు. అంత ఎత్తులో ఉన్న ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి పూర్తిగా కనుమరుగు కానున్నట్టు నివేదికలు వెల్లడించాయి. అదే జరిగితే ఒక గొప్ప పర్యాటక ప్రదేశాన్ని, రాముడు నడయాడిన పుణ్యభూమిని, పురాతన కట్టడాన్ని మనం కోల్పోయినట్టే.ఏర్పాట్లు పూర్తి చేశాం శ్రీరామనవమి సందర్భంగా కల్యాణమహోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, దేవదాయశాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు చలువ పందిళ్లు, మంచినీటి వసతి, అన్న సమారాధన కార్యక్రమాలు చేపడుతున్నాం. – పెందుర్తి సుదర్శన రావు, ఆలయ కమిటీ చైర్మన్ అందరి సహకారంతో .. శ్రీరామగిరిలో సీతారాముల కల్యాణమహోత్సవాన్ని అందరి సహకారంతో ఏటా మాదిరిగా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. శనివారం నుంచి 10 తేదీ వరకూ కల్యాణమహోత్సవాలు జరుగుతాయి. – పురుషోత్తమాచార్యులు,ఆలయ ప్రధాన అర్చకులు -
మార్కెట్ మురిపెం
కాఫీ తోటల్లో అంతరపంటగా సాగు చేస్తున్న మిరియాలు ఈ ఏడాది గిరిజన రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. దిగుబడులు భారీగా పెరగడంతో పాటు మార్కెట్లో ధరలు కూడా అనుకూలంగా ఉండడంతో వ్యాపారం పోటాపోటీగా జరుగుతోంది. తొలిసారిగా స్పైసెస్ బోర్డు కూడా రంగంలోకి దిగడంతో రైతులకు మరింత మేలు జరగనుంది. లాభాల మిరియం..పాడేరు మండలం మోదాపల్లిప్రాంతంలో విరగ్గాసిన మిరియాలుసాక్షి, పాడేరు: మిరియాలు పండిస్తున్న గిరి రైతులకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఏజెన్సీవ్యాప్తంగా లక్షా 52 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫలసాయం ఇచ్చే కాఫీ తోటలు ఉండగా, వాటిలో సుమారు 90 వేల ఎకరాల్లో గిరిజనులు అంతరపంటగా మిరియాలు సాగుచేస్తున్నారు. ఎకరానికి 300 కిలోల వరకు పచ్చిమిరియాలు కాస్తాయి. బాగా ఎండితే సగం బరువు తగ్గిపోతాయి. గత ఏడాది ఎకరానికి 120 కిలోల వరకు దిగుబడి రాగా, ఈసారి 150 కిలోలకు పైగానే దిగుబడి పెరిగింది. ప్రతి గిరిజన రైతు ఎకరానికి 150 కిలోల మిరియాలను మార్కెటింగ్ చేస్తుండడంతో మంచి లాభాలు పొందుతున్నారు. మన్యం మిరియాలకు మంచి డిమాండ్ జాతీయ స్థాయిలో ఏజెన్సీ మిరియాలకు పూర్వం నుంచి మంచి డిమాండ్ ఉండడంతోపాటు నాణ్యతలోను నంబర్–1గా నిలుస్తున్నాయి. రైతులంతా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది 100 కోట్లకు పైగానే మిరియాల వ్యాపారం జరుగుతుంది. ఈ ఏడాది దిగుబడులు, ధరలు పెరగడంతో సుమారు రూ.150 కోట్ల వరకు మిరియాల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. కిలో ధర రూ.600 ఏజెన్సీవ్యాప్తంగా మిరియాల వ్యాపారం భారీగా జరుగుతోంది. గత నెల సీజన్ కిలో రూ.550తో వ్యాపారం ప్రారంభమవ్వగా, ప్రస్తుతం కిలో రూ.600తో వ్యాపారులు పోటాపోటీగా మిరియాలను కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కన్నా కిలోకు రూ.70 పెరిగింది. ఎకరం పంట ఉన్న రైతు మిరియాల అమ్మకాల ద్వారా రు.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నాడు. స్పైసెస్ బోర్డు మార్కెట్లోకి... కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని స్పైసెస్ బోర్డు తొలిసారిగా మిరియాల మార్కెట్ను ప్రారంభించింది. కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ జాతీయ స్థాయిలో మిరియాల వ్యాపారస్థులు, స్పైసెస్ బోర్డు అధికారులతో పలుమార్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇటీవల చింతపల్లి ప్రాంతంలో మిరియాల గింజలను కిలో రూ.610తో స్పైసెస్ బోర్డు కొనుగోళ్లను ప్రారంభించింది. హుకుంపేట మండలం బాకూరు రోడ్డులో పాదుల నుంచి మిరియాలు సేకరిస్తున్న గిరిజనులుదిగుబడులు పెరిగాయి గత ఏడాది కన్నా మిరియాల దిగుబడులు పెరగడంతోపాటు సంతల్లో వ్యాపారులు కిలో రూ.600తో కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కిలో రూ.520తోనే అమ్ముకున్నాను. నాకు 3 ఎకరాల కాఫీ తోటల్లో మిరియాల పంట ద్వారా ఇప్పటికి రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. – వంతాల వరహాలమ్మ, ఎస్.గొందూరు గ్రామం, హుకుంపేట మండలం స్పైసెస్ బోర్డు ద్వారా మిరియాల మార్కెటింగ్ ఎకరం పంటకు 150 కిలోల దిగుబడి.. రూ.90 వేల ఆదాయం స్పైసెస్ బోర్డు ద్వారా మిరియాల పంట సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులకు సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఏజెన్సీలో గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తున్న మిరియాలకు గిట్టుబాటు ధరల కల్పన లక్ష్యంగా స్పైసెస్ బోర్డును మార్కెట్లోకి దింపాం. వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయిలో మిరియాల కొనుగోళ్లను విస్తరిస్తాం. – ఎ.ఎస్.దినేష్కుమార్, కలెక్టర్