Alluri Sitarama Raju District News
-
తప్పుల తడకగా సీనియారిటీ జాబితా
విశాఖ విద్య: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా లు ప్రకటించేందుకు విద్యాశాఖాధికారులు ఆపసోపా లు పడుతున్నారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టీఐఎస్)లో సమగ్ర వివరాలు నమోదు సమయంలో ఉపాధ్యాయుల అలసత్వం, డీడీవోల నిర్లక్ష్యంతో జాబితా లు తప్పులతడకగా మారాయి. వీటి ఆధారంగానే త్వరలోనే ప్రమోషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. దీంతో సీనియారిటీ జాబితాలో లోపాలను సవరించి, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉమ్మడి విశాఖ జిల్లాకు సర్వీసు విషయాల్లో నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ జిల్లా డీఈవోకు తమ మొర విన్నవించుకునేందుకు ఉపాధ్యాయులు క్యూ కట్టారు. అప్పీళ్లకు సోమవారం చివరి రోజు కావటంతో 250 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పీళ్ల పరిశీలనకు ప్రత్యేక కమిటీ :వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించే నిమిత్తం 12 మంది సీనియర్ ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు ఎంఈవోలతో జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతీ దరఖాస్తును వారు పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతనే టీఐఎస్ లాగిన్లో వాటిని సరిచేశారు. ఇలా 210 దరఖాస్తులను సోమవారం నాటికి ఒక కొలిక్కి తీసుకొచ్చి, ఉపాధ్యాయులు లేవనెత్తిన అంశాలను సరిచేశారు. మరో 40 వరకు దరఖాస్తులు అభ్యంతరాలతో కూడినవి కావటంతో మరోసారి నుంచి నివేదికలను తెప్పించుకున్న తరువాతనే వా టిని సీనియారిటీ జాబితాలోచోటు కల్పించేలా చర్యలు చేపట్టారు. జాబితాలపై ఉన్నత స్థాయి సమీక్ష: సీనియారిటీ జాబితాలు, సవరణల కోరుతూ వచ్చిన అప్పీళ్ల విషయమై సోమవారం విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి డీఈవో ప్రేమ్కుమార్, సర్వీసు వ్యవహరాలు చూసే అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ జ్యోతి, సంబంధిత సెక్షన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొని, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఆందోళన వద్దు సీనియారిటీ జాబితాల్లో తప్పిదాలపై ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవ సరం లేదు. ఉమ్మడి జిల్లాలో అన్ని క్యాడర్ల వారీగా పూర్తి స్థాయిలో సమగ్ర పరిశీలన చేసిన తరువాతనే తుది జాబితాలను వెల్లడిస్తాం. జాబితాల్లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. ఉపాధ్యాయులు నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. – ఎన్.ప్రేమ్కుమార్, నోడల్ అధికారి, ఉమ్మడి విశాఖ జిల్లా అప్పీళ్లకు ముగిసిన గడువు సవరణల కోసం 250 మంది దరఖాస్తు -
‘యువత పోరు’కు సిద్ధం కావాలి
● ఘనంగా వైఎస్సార్సీపీఆవిర్భావ దినోత్సం నిర్వహించాలి ● అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయటౌన్/అనంతగిరి(అరకులోయటౌన్): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యువత, అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కావాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు నిచ్చారు. సోమవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, అనంతగిరిలోని పర్యాటక శాఖ హరిత రిసార్ట్స్లో యువత పోరు పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహించే యువ త పోరుతో కూటమి ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నా రు. విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటమాడుతోందని విమర్శించారు. నిరుద్యోగుల ను కూటమి నేతలు నమ్మించి నట్టేట ముంచారని, నిరుద్యోగ భృతి పేరుతో వంచించారన్నారు. ఈనెల 12న వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో వాడవాడలా ఘనంగా నిర్వహించాలన్నారు. మండల స్థాయి కమిటీల ఏర్పాటుకు నియోజకవర్గం ఇన్చార్జీలు చర్యలు తీసుకోవాలన్నారు. అరకులోయలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ శెట్టి రోషిణి, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అశోక్, పార్టీ మండల అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, ఎంపీటీసీలు శతృఘ్న, స్వాభి రామచందర్, సర్పంచ్లు రమేష్, రాధిక, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సుక్రయ్య, జిల్లా కార్యదర్శి శెట్టి అప్పాలు, ముఖ్య నాయకులు ఎల్.బి. కిరణ్, నరసింహరావు,విజయ్కుమార్, సంపత్కుమార్, గాశి, గరం పూర్ణ, మాజీ సర్పంచ్ గుడివాడ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి మండలంలో జరిగిన కార్యక్రమంలో శెట్టి నీలవేణి, పార్టీ మండల అధ్యక్షుడు సూర్యనారాయణ, నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు రేగబోయిన స్వామి, అంగన్వాడీ సెల్ అధ్యక్షులు పాడి కవిత, సర్పంచ్ పాగి అప్పారావు,నాయకులు దూరు గంగన్నదొర, గంగూలి కృష్ణమూర్తి, పార్టీ అనుభంద విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వంరంపచోడవరం: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని యువతను అన్ని రకాలుగా మోసం చేసిందని రంప చోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. రంపచోడవరంలో సోమవారం యువ త పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 12న నిర్వహించే యు వతపోరు కార్యక్రమంలో పెద్దఎత్తున యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసి, విద్యారంగంలో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చింద న్నా రు. అందులో భాగంగా అమ్మ ఒడి, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, నాడు–నేడు వంటి పథకాలను అమలు చేసిందని చెప్పారు. ఆంగ్ల విద్య విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. విద్యతోనే పేదలు అభివృద్ధి చెందుతారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారని తెలిపారు. కానీ కూటమి పభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. వీధికో మద్యం దుకాణంతో ఆంధ్రాను మద్యాంధ్రప్రదేశ్గా మార్చేశారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్లేక, కాలేజీ ఫీజులు కట్టలేక విద్యార్థులు మధ్యలో చదువుమానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న కట్టించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని కోరారు. ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ బాలకృష్ణ, సర్పంచ్ మంగా బొజ్జయ్య, ఎంపీటీసీ నర్రి పాపారావు, సర్పంచ్ కోసు రమేష్బాబుదొర, నాయకులు బొబ్బా శేఖర్,కాపారపు రూతు, రాజన్నదొర, ఉప సర్పంచ్ వి.ఎం.కన్నబాబు, కొండ్రారాజు, పండు,కుంజం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స పాడేరురూరల్: సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మండలంలో మోదపల్లి,వంట్లమామిడి పంచాయతీల్లో సోమవారం ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ పీఎం జన్మన్ పథకం కింద రూ.10 లక్షలు మంజూరు చేయాలని, అటవీ శాఖ ఆంక్షలు ఎత్తివేసి పందిదూర్లు గ్రామానికి పక్కారోడ్డు నిర్మించాలని, గ్రామాల్లో తాగునీరు, రహదారులు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఈనెల 12న చలో వంట్లమామిడి సచివాలయం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే చలో కలెక్టరేట్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సుందరరావు, సీపీఎం నాయకులు పాలికి లక్కు,దాసు, నాగేశ్వరరావు, చిన్నారావు, చిన్నయ్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
పట్టు
అరకొర ఆదాయంసిల్క్ వస్త్రాల తయారీలో శిక్షణకు రంగం సిద్ధం శరవేగంగా షెడ్ల నిర్మాణం కూనవరం: చింతూరు డివిజన్లో ఇప్పటి వరకు పట్టు పురుగుల పెంపకం, పట్టు కాయల విక్రయం ద్వారా ఆదాయం పొందుతున్న కుటుంబాలకు సిల్కు దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చి, అదనపు ఆదాయం లభించే మార్గం చూపాలని ఐటీడీఏ అధికారులు భావిస్తున్నారు. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ టీం అమరావతి నుంచి చింతూరు డివిజన్ కేంద్రానికి వచ్చింది. చింతూరు ఐటీడీఏ పరిధిలో సాగవుతున్న టస్సర్ పట్టు పంటను పరిశీలించింది. సాగుచేస్తున్న రైతులతో సమావేశం నిర్వహించింది. పట్టు వస్త్రాల తయారీకి కావలసిన విధి విధానాలపై చర్చించింది. పట్టు దుస్తుల తయారీలో శిక్షణకు ఏర్పాట్లు చేయాలని సెరీకల్చర్ డిపార్ట్మెంటుకు సూచించింది. ఐటీడీఏ సహకారంతో పట్టు దుస్తుల తయారీ శిక్షణపై సెరీకల్చర్ డిపార్ట్మెంటు దృష్టి సారించింది. ఈక్రమంలోనే షెడ్లనిర్మాణం చకచకా జరుగుతున్నాయి. చింతూరు డివిజన్ వ్యాప్తంగా మూడు మండలాల్లో 800 కుటుంబాలకు చెందిన 1600 మంది గిరిజన రైతులు పట్టు పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. టస్సర్ (దసలి) పట్టు సాగుచేస్తున్న రైతులు ఇప్పటి వరకు పట్టు కాయల అమ్మకం, సిల్కు దారం తీయడం ద్వారా వచ్చే అరకొర ఆదాయంతో బతుకు బండిని లాగుతున్నారు.ఈ పనిలేనప్పుడు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఐటీడీఏ, సెరీకల్చర్ ఉన్నతాధికారులు సంయుక్తంగా శిక్షణపై దృష్టి సారించారు. దారం తీయడంతో సరిపెట్టడం కంటే పట్టు చీరలు, పట్టు వస్త్రాల తయారు చేస్తే రెట్టింపు ఆదాయ వస్తుందన్న ఆలోచనకు వచ్చారు. ఆ మేరకు పైదిగూడెం వేదికగా సిల్కు వస్త్రాల తయారీపై శిక్షణ ఇప్పించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. శిక్షణ పొందిన వారితో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇక్కడే పట్టు వస్త్రాలు తయారు చేసి, విక్రయించనున్నారు. ఇది ప్రారంభమైతే రాష్ట్రంలో చింతూరు డివిజన్ సిల్కు దుస్తుల తయారీకి మొదటి కేంద్రంగా నిలుస్తుంది. పైదిగూడెంలో త్వరలో ప్రారంభం800 కుటుంబాలకు మేలు -
పక్కగా భూముల రీసర్వే
కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు: భూముల రీసర్వేను గడువులోగా పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాడేరు డివిజన్కు చెందిన మండల సర్వేయర్లు, సర్వే డిప్యూటీ తహసీల్దార్లు, గ్రామ సర్వేయర్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించి, భూ సరిహద్దులను సక్రమంగా గుర్తించాలని చెప్పారు. సర్వే చేయడానికి ఎవరైన వసూళ్లకు పాల్పడితే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. 22ఎ ప్రకారం భూమి రిజిస్ట్రేషన్కు ఫారం కె, ఫారం ఎల్ లను ఆన్లైన్ చేస్తామన్నారు. సర్వే నిర్వహిస్తున్నట్టు గ్రామస్తులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని, సర్వేపై గిరిజనులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ భూముల రీసర్వేను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పాడేరు రెవెన్యూ డివిజన్లో మండలానికి రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సర్వే చేస్తున్నట్టు చెప్పారు. పాడేరు డివిజన్ పరిధిలోని 375 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారని, రికార్డు వర్క్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. విలేజ్ సర్వేయర్ లాగిన్లో 89, వీఆర్వో లాగిన్లో 141, డిప్యూటీ తహసీల్దార్ లాగిన్లో 78 గ్రామాలకు చెందిన వర్క్ పెండింగ్లో ఉన్నట్టు చెప్పారు. గ్రామ సభలను నిర్వహించి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. భూరికార్డుల క్రమబద్ధీకరణ త్వరితిగతిన పూర్తి చేయాలని చెప్పా రు. సక్రమంగా సర్వే చేయని సర్వేయర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వే సహాయక సంచాలకుడు కె.దేవేంద్రుడు పాల్గొన్నారు. -
సమస్యల సత్వర పరిష్కారానికి కృషి
రంపచోడవరం: అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. స్థానిక ఐటీడీఏ సమావేశం హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొన్ని సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. సబ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీ, ఏపీవో డి.ఎన్.వి.రమణలతో కలిసి ఐటీడీఏ పీవో 116 అర్జీలను స్వీకరించారు. రబ్బరు ప్రొసెసింగ్ యూనిట్లు మంజూరు చేయాలని కానివాడ పంచాయతీలో 83 మంది రైతులు కోరారు. వై.రామవ రం మండలం అప్పర్ పార్ట్లోని బొడ్డగండి పంచా యతీలో ఉన్న మంగంపాడు, డొంకరాయి, బొడ్డగండిలను మూడు పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల గిరిజనులు కోరారు. చింతలపూడి గ్రామంలో నిలిచిన రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆగ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. పందిరిమామిడికోట గ్రామంలో ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయాలని రేవుల జానకిరెడ్డి, రేవు ల కృష్ణారెడ్డి తదితరులు కోరారు. డీఎల్ఎస్సీలో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు గొర్లె చిన్న నారాయణరావు, గొర్లె రాజబాబు, నానిబాబు అర్జీలు అంద జేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని పోల వరం నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు పాల్గొన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం -
విద్యుత్ బిల్లుల దహనం
చింతపల్లి: విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని సీపీఎం మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్ ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ కార్యాలయం ఎదుట సోమవారం బిల్లులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయకపోగా.. విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం వేల కోట్లు బిల్లులు పెంచాలని ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో వ్యాపార, వాణిజ్య రంగాలతో పాటు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకుంటుందన్నారు. తక్షణం చార్జీలు తగ్గించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాగిన చిరంజీవి, రాంబాబు నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
చుక్కల జింకపై కుక్కల దాడి
అడ్డతీగల: మండలంలోని పాపంపేట పరిసరాల్లో సోమవారం కుక్కలు దాడి చేయడంతో ఓ చుక్కల జింక తీవ్రంగా గాయపడింది. కుక్కలు వెంటపడి గాయపరుస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు వాటి బారి నుంచి జింకను రక్షించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. పాపంపేట సెక్షన్ అధికారి అర్జునుడు పశుసంవర్ధకశాఖ సిబ్బందితో జింకకు చికిత్స చేయించారు.అనంతరం అడ్డతీగల అటవీ కార్యాలయానికి తరలించి సపర్యలు చేశారు. జింక గర్భందాల్చి ఉండడంతో ఆరోగ్యం కుదుటపడిన తరువాత అడవుల్లో వదిలివేస్తామని సెక్షన్ అధికారి అర్జునుడు చెప్పారు. -
అస్మదీయులకు అడ్డగోలుగా వ్యవసాయ పరికరాలు
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ పరిధిలోని ఉద్యానవన శాఖ పీహెచ్వో, కార్యాలయం ఉద్యోగులు రహస్యంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, పరికరాలను పంపిణీ చేస్తున్నారని రంపచోడవరం ఎంపీపీ బందం శ్రీదేవి సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. తమకు కావలసిన వ్యక్తులకు మాత్రమే రహస్యంగా సమాచారం ఇచ్చి, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిలో అంతర్యమేమిటో పీహెచ్వో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మండల ప్రథమ పౌరురాలైన తనకు కనీసం పథకాలు మంజూరు, పంపిణీ సమాచారం ఇవ్వకపోవడం, పరికరాలు పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం ప్రొటోకాల్కు విరుద్ధమని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.ఐటీడీఏ ఉద్యానవన శాఖలో జరుగుతున్న అక్రమాలపై నిగ్గుతేలుస్తామని పేర్కొన్నారు. రంపచోడవరం ఎంపీపీ బందం శ్రీదేవి -
పాఠశాలలో వేదిక నిర్మాణానికి విరాళం
అరకులోయటౌన్: అరకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం అరకులోయ సీఐ ఎల్.హిమగిరి సందర్శించారు. పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న వేదికను గమనించారు. ఇందుకు గల కారణాలను హెచ్ఎం టి.మోహన్రావును అడిగి తెలుసుకున్నారు. తక్షణం వేదిక నిర్మాణం పూర్తి చేయాలని రూ.10 వేల నగదును హెచ్ఎంకు సీఐ అందజేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై గుడ్ టచ్, బేడ్ టచ్పై అవగాహన కల్పించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల జోలి పోవద్దని, ఆన్లైన్ మోసాలకు గురికావద్దని సీఐ సూచించారు. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎరుకుల శ్రీనివాసరావు, రోజారాణి, మీనా, లోకేశ్వరి, ఆనందరావు, మత్స్యరాజు, మాణాక్యమ్మ, ట్రైనీ మహిళా ఎస్ఐలు శకుంతల, భావ్య, తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు
పాడేరు రూరల్: విద్యార్థులు ముందస్తు ప్రణాళికతోనే చది వితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టబ్బా యి అన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, మహిళా సాధికారత శాఖ, జాతీయ సేవా పథఽకం ఆధ్వర్యంలో విద్యార్థులకు లైఫ్ సేవియర్లో భాగంగా ఫైర్ స్టేఫ్టీ, హెల్త్ అండ్ హైజెనిక్, సెల్ఫ్ డిఫెన్స్ సీపీఆర్ అనే అంశాలపై మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో విద్యనభ్యసించాలన్నారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ రోహిణి, కళాశాల అధ్యాపకులు సుమిత్ర, నిర్మల, గౌరీశంకర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎల్ టోర్నీ విజేత వీఆర్పురం
చింతూరు: స్థానిక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చింతూరు ప్రీమియర్ లీగ్(సీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్లో వీఆర్పురం వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం చింతూరు క్రికెట్ అసోసియేషన్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో ఆ జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వీఆర్పురం వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. జట్టులో ఓపెనర్ గౌతమ్ 31 బంతుల్లో 58 పరుగులు చేయగా అభిరాం 45, సునీల్ 32 పరుగులు చేశారు. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చింతూరు క్రికెట్ అసోసియేషన్ 19.2 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ప్రవీణ్ప్రకాష్ 23 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 58 పరుగులు చేసి ధాటిగా ఆడినా మరోవైపు వరుసగా వికెట్లు కోల్పోవడంతో జట్టు పరాజయం పాలైంది. వీఆర్పురం జట్టులో నిఖిల్ మూడు, జయంత్, జయ్ రెండేసి వికెట్లు తీశారు. విజేత జట్టుకు రూ.30 వేలు, రన్నరప్కు రూ.20 వేల నగదు బహుమతిని నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మేడేపల్లి సుధాకర్, జనసేన మండల అధ్యక్షుడు మడివి రాజు, సీనియర్ క్రీడాకారులు షహిన్షా, నాగేశ్వరరావు, చిన్నబ్బి, అసోసియేషన్ సభ్యులు గణేష్, ప్రదీప్, రమేష్, సూరి, బుచ్చిరాజు, శంకర్, సురేష్, గంగరాజు, బిట్టు, అర్జున్, అంజు పాల్గొన్నారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
మాడుగుల రూరల్: తాటిపర్తి శివారు గరికబంద గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాడేరు గ్రామానికి చెందిన వేమగిరి రమేష్(47) మృతి చెందారు. ఎస్ఐ జి. నారాయణరావు సోమవారం విలేకరులకు తెలిపిన వివరాలివి. పాడేరు గ్రామానికి చెందిన వేమగిరి రమేష్ తన ద్విచక్రవాహనంపై మాడుగుల నుంచి పాడేరు వెవెళ్తుండగా, తాటిపర్తి శివారు గరికబంద సమీపంలో పాడేరు నుంచి మాడుగుల వైపు వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో రమేష్ తలకు బలమైన గాయాలు తగిలాయి. వెంటనే రమేష్ను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పుత్రికి తీసుకెళ్లగా, అప్పటికే రమేష్ చనిపోయాడు. ఘటనపై రమేష్ సోదరుడు వేమగిరి వెంకట సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
డ్రగ్స్, సారా రహిత సమాజం కోసం కృషి
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ సుర్జిత్ సింగ్ గంగవరం: డ్రగ్స్, సారాలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయిని, డ్రగ్స్, సారా రహిత సమాజం కోసం మహిళలు, యువత కృషి చేయాలని ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ సుర్జిత్ సింగ్ అన్నారు. సోమవారం నిర్వహించిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి ఆదేశాల మేరకు అనకాపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్స జ్ అసిస్టెంట్ కమిషనర్ సుర్జిత్ సింగ్ ఎకై ్సజ్ పోలీసు సిబ్బందితో కలిసి పాతరామవరం గ్రామాన్ని సందర్శించి గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సుర్జిత్ సింగ్ మాట్లాడుతూ సమాజం బాగుండాలంటే దురవ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్, గంజాయి, సారా వంటివి సమాజంపై చూపిస్తున్న దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. అనంతరం నాటుసారా వల్ల కలిగే నష్టాలు, డ్రగ్స్ వినియోగం, ఆ కేసుల్లో పడే శిక్షలు గురించి కళాకారులు కళాప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్, రంపచోడవరం ఎకై ్సజ్ సీఐ శ్రీధర్, ఎస్ఐ బి.వెంకటేష్, భయ్యనపల్లి సర్పంచ్ బూరుకట్ల పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం ఆందోళన
డుంబ్రిగుడ: రంగిలిసింగి పంచాయతీ వాకపల్లి గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామస్తులు సీపీఎం ఆధ్వర్యంలో గుంటసీమ సచివాలయం ఎదుట సోమవారం ఆందోళన చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల నాయకుడు పి.డొంబు మాట్లాడుతూ వాకపల్లి గ్రామానికి గతేడాది జల జీవన్ పథకం ద్వారా గ్రావిటీ పథకం మంజూరైనా నిర్మించడంలో అధికారుల నిర్లక్ష్యం వహించారన్నారు. తక్షణమే అధికారులు స్పందించి గ్రామంలో గ్రావిటీ పథకం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాందాస్, పొద్దు, జిన్ను కృష్ణారావు, బాలదేవ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ ఉద్యమాలపై నిర్బంధం తగదు
పాడేరు: అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని, సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని విజయవాడలో శాంతియుతంగా నిర్వహించిన మహాధర్నా కార్యక్రమాన్ని పోలీసులతో భగ్నం చేయాలని కూటమి ప్రభుత్వం చూడడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సమ్మె సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కూటమి నాయకులు హామీ ఇచ్చారన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైన వేతనం పెంపు ఊసే లేదని చెప్పారు. అందుకే చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి తరలివెళ్లిన అంగన్వాడీ యూనియన్ నాయకులను ఐసీడీఎస్ పీడీ బెదిరించడం సరికాదన్నారు. బెదిరింపులకు భయపడేది లేదని తెలిపారు. పాడేరు ఐసీడీఎస్ పీడీపై మహిళ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలపై పీడీ దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఆ విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ పీడీ తన వైఖరి మార్చుకోకపోతే ప్రాజెక్టు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాగ్యలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు కొండమ్మ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.పాడేరు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసన -
వలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి
చింతూరు: వలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ డిమాండ్ చేశారు సోమవారం చింతూరులో జరిగిన వలంటీర్ల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిష్కారం కోసం ఈనెల 17న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని, రూ.10 వేలు వేతనం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు. వలంటీర్లకు ఉద్యోగభద్రత కల్పించడంతో పాటు రాజీనామా చేసిన వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలలు గడుస్తున్నా వారి సమస్యలు పరిష్కారం కావడంలేదని, ప్రభుత్వ తీరుతో రెండున్నర లక్షల వలంటీర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇదే ధోరణి కొనసాగితే వలంటీర్లతో కలసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వలంటీర్ల యూనియన్ మండల కార్యదర్శి కలుముల మహేష్, భూక్యా కుమార్, గడ్డల వనరాజ్, రామిరెడ్డి, రాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
హిందువులపై దాడులను నిరసిస్తూ ర్యాలీ
పాడేరు: రాయచోటి వీరభద్ర స్వామి ఉత్సవంలో హిందువులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని విశ్వహిందు పరిషత్ జిల్లా అధ్యక్షుడు కూడా రామకృష్ణ పరమహంస డిమాండ్ చేశారు. హిందువులపై దాడులు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు నమోదు చేశారని నిరసిస్తూ సోమవారం పాడేరులో విశ్వహిందు పరిషత్ నాయకులు పాడేరులో ఆందోళన చేశారు. పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో హిందువులపై అక్రమ కేసులు బనాయించిన రాయచోటి ఎస్ఐను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ దినేష్కుమార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందు పరిషత్ నాయకులు కురుసా ఉమామహేశ్వరరావు, మఠం శాంతికుమారి, మినుముల గోపాలపాత్రుడు, సల్లా రామకృష్ణ, కుడుముల బాబురావు, తదితరులు పాల్గొన్నారు. -
సావిత్రిబాయి పూలే సేవలు ఆదర్శనీయం
పాడేరు రూరల్: సావిత్రిబాయి పూలే సేవలు అందరికీ ఆదర్శనీయమని గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ అన్నారు. గిరిజన సమాఖ్య, స్టార్ సొసైటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి అణగారిన వర్గాల మహిళల కోసం ఎంతో కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ సొసైటీ కన్వీనర్ భాను, నాయకులు వెంకి, జగదీష్, లక్ష్మి, ప్రసన్న, కుమారి, తదితరులు పాల్గొన్నారు. మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి ముంచంగిపుట్టు: మహిళా లోకానికి దిక్సూచి సావిత్రిబాయి పూలే అని హెచ్ఎం ఎం.ధర్మారావు అన్నారు. మండలంలోని జర్రెల పంచాయతీ సెల్లుంపుట్టు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ విద్య ద్వారానే సీ్త్ర విముక్తి సాధ్యమని నమ్మి, మహిళల్లో చైతన్యం తీసుకువచ్చి చదువుకునేలాగా సావిత్రిబాబు ప్రోత్సహించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఆర్.కామేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటి నుంచి కిలగాడ గంగమ్మ తల్లి ఉత్సవాలు
ముంచంగిపుట్టు: కిలగాడ పంచాయతీ కేంద్రంలో వెలసిన గంగమ్మతల్లి ఉత్సవాలను ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవాలు గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రతి రోజు భక్తులు అమ్మవారి పాదాల వద్ద ఘటాలను సమర్పిస్తారు. బుడియాలు విన్యాసాలు చేస్తూ ఉంటారు. 10, 11 తేదీల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో జాతర నిర్వహిస్తారు. మూడు రోజులు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారిని మనసారా దర్శించుకుని కోరికలు కోరుకుంటే తప్పకుండా తల్లి తీరుస్తుందని గిరిజనుల ప్రగాఢ నమ్మకం. కిలగాడ గ్రామానికి చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు గంగమ్మతల్లి ఉత్సవాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబసమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం పరిపాటి. ఉత్సవాల నిర్వహణకు అమ్మవారి ఆలయాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక సర్పంచ్ శివశంకర్, ఉత్సవ కమిటీ అధ్యక్షలు రాంప్రసాద్ ఆదివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారి జాతరకు ఘనంగా ఏర్పాట్లు -
12న ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
డుంబ్రిగుడ: ఈనెల 12వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆదివారం డుంబ్రిగుడలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆరు మండలాల పరిధిలో ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించి, పాడేరులో యువత పోరుతో హోరెత్తించాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి చెల్లించాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ప్రభుత్వంపై నిరసన గళం విప్పడానికి ఈ నెల 12వ తేదీన యువత పోరు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో జగన్ ముందుచూపుతో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించారని, మిగతా మెడికల్ కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కల్పించకుండా పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలా వైద్య విద్య చదవాలన్న పేద విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా అరకు నియోజకవర్గం పార్టీ సీనియర్ నాయకుడు కమ్మిడి అశోక్కుమార్, డుంబ్రిగుడ, అరకులోయ మండల అధ్యక్షులు పి.పరశురాం, స్వాభి రామ్మూర్తి, పోతంగి సర్పంచ్, వైస్ సర్పంచ్లు వెంకటరావు, జగ్గునాయుడు, మహిళ నాయకురాలు బబిత పాల్గొన్నారు. ఆ రోజే యువత పోరు బాట అరకులోయ ఎమ్మెల్యే మత్స్యలింగం -
ప్లాట్ఫాంపైకి రావడం అంత వీజీ కాదు
● రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు కొత్త వ్యూహాలు ● కన్ఫర్మ్ టికెట్స్ ఉంటేనే ప్లాట్ఫాంపైకి అనుమతి ● వెయిటింగ్ లిస్ట్ ఉంటే స్టేషన్ బయట ఉన్న హాల్లోనే.. ● త్వరలో విశాఖ రైల్వే స్టేషన్లో అమలుకు సన్నాహాలు విశాఖ రైల్వేస్టేషన్ సమాచారం స్టేషన్ కేటగిరీ నాన్ సబర్బన్ గ్రూప్ (ఎన్ఎస్జీ)1సాక్షి, విశాఖపట్నం: నేను టికెట్ తీసుకున్నాను. వెయిటింగ్లో ఉంది. ట్రైన్ ఎక్కిన తర్వాత ఎలాగైనా కన్ఫర్మ్ చేయించుకుని బెర్త్లో హాయిగా పడుకుంటానని అనుకుంటే.. ఇకపై ఆ పప్పులింక ఉడకవ్. ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ అయితేనే ప్లాట్ఫాంపైకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. లేదంటే కన్ఫర్మ్ టికెట్ ఉన్నవాళ్లు వెళ్లిన తర్వాత.. మీ టర్న్ వచ్చినప్పుడు మాత్రమే ట్రైన్ ఎక్కగలరు. ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన దురదృష్టకర ఘటన నేపథ్యంలో, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన ఒక అత్యున్నత సమావేశం జరిగింది. ప్లాట్ఫాంలపై ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలువురు నిపుణులు సూచనలు చేశారు. అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్లాట్ఫాంలపైకి ఒకేసారి ప్రయాణికులు గుంపులుగా రాకుండా నిరోధించడానికి అవసరమైన చర్యలను దేశవ్యాప్తంగా 60 ప్రధాన స్టేషన్లలో అమలు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టు కింద న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పాట్నా స్టేషన్లలో ఈ నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. రైలు వచ్చిన తర్వాత, ప్రయాణికులను ఒకరి తర్వాత ఒకరిగా, వివిధ మార్గాల ద్వారా రైలు దగ్గరకు అనుమతిస్తున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కూడా ఈ తరహా నిబంధనలు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏం చేస్తారంటే.? ● ప్లాట్ఫాంపై రద్దీని నియంత్రించేందుకు ఇకపై వెయిటింగ్ ప్రాంతాలను స్టేషన్ బయట ఏర్పాటు చేస్తారు. టికెట్ లేని ప్రయాణికులు కూడా స్టేషన్ వెలుపలే వేచి ఉండాలి. వెయిటింగ్ లిస్ట్లోని ప్రయాణికులను పంపిన తర్వాత, వారికి రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది. ● ముందుగా కన్ఫార్మ్ రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్ఫాంపైకి అనుమతిస్తారు. ● మరోవైపు స్టేషన్లలో మరింత వెడల్పుగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను(వంతెనలు) నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మహాకుంభమేళా సమయంలో ఇలాంటి వెడల్పాటి వంతెనలు సమర్థవంతంగా పనిచేశాయి. ఈ నేపథ్యంలోనే స్టేషన్లలో 6 మీటర్లు, 12 మీటర్ల వెడల్పు కలిగిన ఎఫ్వోబీలు రాబోతున్నాయి. ● రైల్వేస్టేషన్లలో రద్దీని ఎప్పటికప్పుడు గమనించేందుకు సీసీ టీవీ నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు. రైల్వేస్టేషన్ల పరిసర ప్రాంతాల్లో కూడా నిఘా ఏర్పాటు చేస్తారు. ● సమన్వయాన్ని మెరుగుపరచడానికి సిబ్బందికి వాకీ టాకీలు, అత్యాధునిక అనౌన్స్మెంట్ సిస్టమ్, కాలింగ్ సిస్టమ్లతో సహా ఆధునిక డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తారు. ● సంక్రాంతి, దసరా వంటి పండుగలు, సెలవుల సమయాల్లో రైల్వే స్టేషన్లలో వార్ రూమ్లను ఏర్పాటు చేస్తారు. స్టేషన్ పరిధిలోని అన్ని విభాగాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, రద్దీని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించి అమలు చేస్తారు. ● ప్రధాన స్టేషన్లలో ఆర్థికపరమైన విషయాలపై తక్షణమే నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన స్టేషన్ డైరెక్టర్ను నియమించనున్నారు. ఈ అధికారి స్టేషన్ సామర్థ్యం, రైలు లభ్యతను బట్టి టికెట్లను ఎంత వరకు విక్రయించాలనే విషయాలను నిర్ణయిస్తారు. ● ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత రైల్వేస్టేషన్ ప్రవేశంపై రైల్వే శాఖ పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది. స్టేషన్కు చేరుకోవడానికి ఉన్న అన్ని అనధికారిక ప్రవేశ మార్గాలను మూసివేస్తారు. ● విశాఖపట్నం ఇటీవలే ‘ఏ’గ్రేడ్ స్టేషన్గా గుర్తింపు పొందిన నేపథ్యంలో, ఈ తరహా నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. స్టేషన్కు అధికారికంగా, అనధికారికంగా ఎన్ని ప్రవేశ ద్వారాలు ఉన్నాయి? నిష్క్రమణ మార్గాలు ఎన్ని ఉన్నాయి? రోజువారీ రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేయాలని రైల్వే బోర్డు ఆదేశించినట్లు సమాచారం. ఏటా ప్రయాణికుల రాకపోకల ద్వారా ఆదాయం సుమారు రూ.560 కోట్లు ఏటా రాకపోకలు సాగించే ప్రయాణికులు సుమారు 2 కోట్లు -
ఘనంగా బౌద్ధ సమ్మేళనం
అనకాపల్లి టౌన్: ప్రపంచానికి మొట్టమొదటిసారిగా శాంతి, ధర్మం, అహింసా మార్గాలను బోధించిన మహానుభావుడు బుద్ధుడని రాష్ట్ర మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మండలంలోని శంకరం ప్రముఖ బౌద్ద పర్యాటక క్షేత్రం బొజ్జన్నకొండ వద్ద బౌద్ధ సమ్మేళనం ఘనంగా ఆదివారం జరిగింది. జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పల్లా బాబ్జీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా కొండ మెట్ల మార్గం గుండా బుద్ధుని విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బౌద్ధ సంఘాల సమాఖ్య ప్రతినిధులు, బౌద్ద ఉపాసకులు, బౌద్ద అభిమానులు, విదేశీ బౌద్ధ భిక్షువులు వెనరబుల్ పూజ్య బ్రరామో బాంతేజీ (కంబోడియా), రాజాభాంతేజీ(బర్మా)లు పాల్గొని ప్రార్థనలు నిర్వహించి ప్రపంచ శాంతి స్థాపనకు అందరూ దోహద పడాలని కోరారు. కార్యక్రమంలో బాగంగా బుద్దభూమి మాస పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర బుద్దిస్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వై హరిబాబు, విశాఖ బౌద్ద సంఘాల సమాఖ్య గౌరవఅధ్యక్షుడు డాక్టర్ మాటూరి శ్రీనివాస్, బౌద్ద సంఘాల ప్రతినిధులు బొడ్డు కళ్యాణరావు, పి.రాంబాబు, ఎన్.గంగాధర్, వి.వి.దుర్గారావు, బోర వేణు గోపాల్ బౌద్ద సంఘాల సమాఖ్య ప్రచార కమిటీ సభ్యులు బల్లా నాగభూషణం పాల్గొన్నారు. -
నేడే ఉపమాక వెంకన్న కల్యాణం
నక్కపల్లి: ఉత్తరాంధ్ర ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక గరుడాద్రి పర్వతంపై వెంకన్న వార్షిక తిరుకల్యాణోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పరిషత్, కంకణ ధారణ అంతరాలయ దేవతాపూజ, మత్స్యంగ్రహణ నిర్వహించారు. నిత్య సేవాకాలంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ గోష్టి ప్రసాద వినియోగం జరిపారు. అంకురార్పణ పూజా కార్యక్రమాల్లో భాగంగా హంసవాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. స్వామివారి కల్యాణ మండపంలో ఉభయదేవేరులను ఉంచి సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి పుట్టమన్ను తెచ్చేందుకు తీసుకెళ్లారు. దీన్నే అంకురార్పణ అంటారు. అనంతరం వాస్తు మండప పూజ, యోగీశ్వరపూజ, అగ్నిప్రతిష్టాపన, జయాది హోమాలు జరిగాయి. గరుడ ప్రాణప్రతిష్ట విశేషహోమాలు, నీరాజన మంత్ర పుష్ప కార్యక్రమం నిర్వహించి గరుడప్పాలు నివేదన చేశారు. అష్టదిక్పాలకులకు ఆవాహన కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారి పెళ్లికావిడిని ఉపమాక మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి పసుపు కుంకుమలు, కొబ్బరిబొండాలు కానుకలుగా సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమాలతో స్వామివారి కల్యాణోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యా యని ఆలయప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. పెళ్లికావిడె ఊరేగింపులో అర్చకులు కృష్ణమాచార్యులు, గోపాలాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. నేడే స్వామివారి కల్యాణం స్వామివారి కల్యాణం సోమవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. అదేరోజు సాయంత్రం కన్యావాద సంవాదం (ఉపమాక సింహద్రాచార్యులు ఇంటి వద్ద స్వామివారి అమ్మవార్ల పెండ్లిమాటలు, గుణగణాలను వివరించే తంతును నిర్వహిస్తారు) తరిగొండ వేంగమాంబ సాహితీ పీఠం వ్యవస్థాపకురాలు, అభినవ మొల్ల వేద పండితురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించి కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవం జరుతుంది. తదుపరి స్వామివారి కల్యాణం నిర్వహించేందుకు దేవస్థానం వారు ఏర్పాట్లు చేశారు. 12వ తేదీ పండిత సభ, 13వ తేదీన స్వామివారికి గజవాహనంపై తిరువీధి సేవ,14న పౌర్ణమినాడు రాజయ్యపేట సముద్రతీరంలో స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రికి డోలోత్సవం, అద్దపు సేవ జరుగుతుంది. 15 నుంచి 17 వరకు స్వామి వారి పుష్పయాగోత్సవాలు జరుగుతాయి. కల్యాణ తంతును నిర్వహించేందుకు తిరుచానూరు పద్మా వతి ఆలయానికి చెందిన ప్రముఖ వేదపండితులు, ఆగమశాస్త్రసలహాదారులను రప్పిస్తున్నారు. విస్తృత ఏర్పాట్లు కల్యాణోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంతోపాటు, గోపురాలు, బేడామండపం, ఆస్థాన మండపం, కల్యాణమండపాలకు రంగురంగుల విద్యుద్దీపాలను అలంకరించారు. టీటీడీ సిబ్బంది, పోలీసు సిబ్బంది సుమారు 300 మంది విధుల్లో పాల్గొంటున్నారు. భక్తుల కోసం ప్రత్యేక స్నానఘట్టాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఘనంగా అంకురార్పణ మాడవీధుల్లో పెళ్లి కావిడి ఊరేగింపు స్వర్ణాభరణాలతో దర్శనమిస్తున్న స్వామివారు విద్యుద్దీపకాంతులతో మెరుస్తున్న ఆలయం స్వర్ణాభరణాలతో దర్శనమివ్వనున్న స్వామివారు వజ్ర వైఢూర్యాలు, కెంపులు, పచ్చల హారం, కాసులపేర్లు, మరకత మాణిక్యాలు, బంగారంతో తయారు చేసిన శంఖు, చక్రం, హస్తాలు, వజ్రాలు పొదిగిన కిరీటాలు, హారాలు, చంద్రహారాలు, స్వర్ణ వజ్రకవచం ఇలా స్వామివారికి వెలకట్టలేనన్ని ఆభరణాలున్నాయి. వీటిని స్వామివారికి అలంకరించి ఐదురోజుల పాటు భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. -
కేశవరావు మరణానికి కూటమి ప్రభుత్వానిదే బాధ్యత
ముంచంగిపుట్టు: విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న బాబుశాల పంచాయతీ డముకులాడి గ్రామానికి చెందిన గోల్లోరి కేశవరావు (35) మరణానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని లక్ష్మీపురం సర్పంచ్ కె.త్రినాఽథ్, మృతుడి కుటుంబ సభ్యులు అన్నారు. పోలీసులు పెట్టిన చిత్రహింసలు వల్లనే తన భర్త మృతి చెందాడని కేశవరావు భార్య రంభో ఆరోపించారు. సర్పంచ్ త్రినాఽథ్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గంజాయి కేసులో అనుమానితుడిగా కేశవరావును నాలుగు నెలల క్రితం విశాఖ టాస్క్ఫోర్స్ పోలీసులు ఇంటిలోకి చొరబడి ఎత్తుకుపోయారని, విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టి, అనారోగ్యం బారిన పడేనట్లు చేశారని చెప్పారు. ఈ నెల 6వ తేదీన కేశవరావు తండ్రి, అన్నయ్యలు విశాఖ సెంట్రల్ జైల్కు వెళ్లగా కేశవరావు కేజీహెచ్లో ఉన్నాడని చెప్పి పంపించారని, కేజీహెచ్కు వెళ్లి చూస్తే మరణించి ఉన్నాడని ఆవేదనగా చెప్పారు. విచారణ పేరుతో కేశవరావుకు చిత్రహింసలు పెట్టారని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి నిగ్గు తేల్చి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. లక్ష్మీపురం సర్పంచ్ త్రినాఽథ్ మాట్లాడుతూ గత 9 నెలల్లో ఐదుగురు ఆదివాసీ ఖైదీలు జైలులో మృతి చెందారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం, హోంమంత్రి అనితలు బాధ్యత వహించాలని, ఖైదీ మృతిపై సమాచారం ఇవ్వని పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుడికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారని, కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం అందించాలని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్పర్సన్లు, మానవ హక్కుల సంఘాలు సుమోటోగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. బాబుశాల, లక్ష్మీపురం పీసా కమిటీ సభ్యులు దళపతి, నీలకంఠం, మల్లేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. కారకులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి కుటుంబ సభ్యులు, లక్ష్మీపురం సర్పంచ్ కె.త్రినాఽథ్ డిమాండ్ -
ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటుకు డిమాండ్
చింతూరు: ఆదివాసీల అభివృద్ధికి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక భవనంతోపాటు పరిపాలన యంత్రాంగం సమకూర్చాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు అన్నారు. ఆదివాసీ జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశం జిల్లా చైర్మన్ రామారావుదొర అధ్యక్షతన ఆదివారం చింతూరులో జరిగింది. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్కు ముందు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని, ఎల్టీఆర్ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజనేతరుల వలసలను నిరోధించాలని కోరారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే కుట్రలను అడ్డుకోవాలని, దొంగ ఎస్టీ సర్టిఫికెట్ల జారీ నిరోధానికి కృషి చేయాలని అన్నారు. 1986, 2022 నాటి వరద ముంపు ఆధారంగా పోలవరం ముంపు గ్రామాలను రీసర్వే చేసి ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేయాలన్నారు. ప్రస్తుత భూమి విలువ, పరిస్థితులను బట్టి పరిహారం చెల్లించాలని, ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే గ్రామాలను తరలించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల కోసం కాలనీలను నాణ్యతతో నిర్మించడంతో పాటు అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. పోలవరం ముంపు మండలాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని, ముఖ్యమంత్రి హామీ మేరకు ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని రాజబాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్కు చెందిన సోయం నగేష్, ఒడిశాకు చెందిన మొట్టం రమేష్, ఆదివాసీ జేఏసీ నాయకులు బంగారు వెంకటేశ్వర్లు, తెల్లం శేఖర్, మడివి నెహ్రు, కారం రామన్నదొర, మండల గిరిధర్రావు, సోడె మురళి, కుంజా అనిల్, జల్లి నరేష్, ఆత్రం నవీన్, జోగారావు, రాఘవయ్య, నారాయణ, శంకురమ్మ పాల్గొన్నారు. -
గురుకులం పిలుస్తోంది..
● ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ● ఈ నెల 13 వరకు గడువు యలమంచిలి రూరల్: పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యనందించే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలకు, కళాశాలల్లో 2025–26 సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7 గురుకులాల్లో రానున్న విద్యాసంవత్సరానికి సంబంధించి ఆంగ్ల మాధ్యమంలో ఐదో తరగతి,ఇంటర్ మొదటి సంవత్సరాల్లో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.5 బాలికలు,2 బాలురు పాఠశాలలు, కళాశాలల్లో ఐదో తరగతిలో 560, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 560 సీట్లు భర్తీ చేయనున్నారు.జిల్లాలో నక్కపల్లి, కొక్కిరాపల్లి, తాళ్లపాలెం,నర్సీపట్నం, కోనాంలలో బాలుకలు,దేవరాపల్లి మండలం తెనుగుపూడి, గొలుగొండల్లో బాలురకు గురుకులాలు ఉన్నాయి. ప్రవేశాల కోసం ఈ నెల 13వ తేదీ వరకు గడువు ఉంది. ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను గడువులోగా ఆన్లైన్లో పంపించాలి. ఈ గురుకులాల్లో 5వ తరగతిలో ఒకసారి ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. పరీక్ష ఇలా.. ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 6న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు,ఇంటర్లో చేరే వారికి అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఐచ్ఛిక విధానంలో ప్రవేశ పరీక్ష ఉటుంది.ప్రతి తప్పు జవాబునకు 1/4 మార్కు (నెగెటివ్) మార్కు తీసివేస్తారు.ఐదో తరగతికి సంబంధించి నాలుగో తరగతిలో తెలుగు 10,ఆంగ్లం 10,గణితం 15,సైన్స్ 15 కలిపి మొత్తం 50 ప్రశ్నలు(ఒక మార్కు) ఉంటాయి. ఇంటర్కు సంబంధించిన ప్రవేశ పరీక్షలో పదో తరగతిలో గణితం 15, భౌతికశాస్త్రం 15,సామాన్యశాస్త్రం(బయాలజీ) 15,ఆంగ్లం 15,సామాజిక అధ్యయనాలు 10,లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ 30 కలిపి మొత్తం 100 ప్రశ్నలు(ఒక మార్కు) ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి.. ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఒత్తిడి లేని నాణ్యమైన విద్యా బోధన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఉంటుంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం గురుకులాల్లో ప్రతి ఏటా ఐదు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరాల్లో ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహిస్తోంది. ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించి అర్హత కలిగిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాఠాలు బోధిస్తారు. నిర్ణీత సమయంలోగా ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో గురుకులంలో మొత్తం 80 సీట్లలో రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ కేటగిరీకి 60, బీసీ–సీ కి 10, ఎస్టీకి 05, బీసీ 04, ఓసీ 01 చొప్పున కేటాయిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలి. –మళ్ల మాణిక్యం, ప్రిన్సిపాల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం(బాలికలు), కొక్కిరాపల్లి అర్హతలు ఐదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 2012 సెప్టెంబరు 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య,ఓసీ,బీసీ,ఎస్సీ కన్వెర్టెడ్ క్రిస్టియన్లు 2014 సెప్టెంబరు 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి 2025 ఆగస్టు 31 నాటికి 17 ఏళ్ల వయసు మించకూడదు.ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న వారు మాత్రమే అర్హులు.అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష మించకూడదు.అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో htt pr://apbrafcet.apcfrr.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. దరఖాస్తులు చేసేటపుడు తప్పులు లేకుండా చూసుకోవాలి. నమోదు సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తెల్లరేషన్ కార్డు, ఇంతకు ముందు తరగతికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.మొబైల్ నెంబరు తప్పులేకుండా నమోదయ్యేలా చూసుకోవాలి. ప్రతిభ పరీక్షలో మెరిట్ ఆధారంగా నేరుగా ప్రవేశం కేటాయిస్తారు. వసతులు: ఉచిత వసతి, భోజన సౌకర్యంతో గురుకుల విధానంలో చదువుకునే అవకాశం ఉంది. పౌష్టికాహారం, మూడు జతల ఏకరూప దుస్తులు, దుప్పటి లేక జంకాన, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, రాత, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తారు. కాస్మోటిక్ ఛార్జీలు, రోజూ వేరుశనగ చిక్కీ, వారానికి ఆరు రోజులు గుడ్లు,రెండు రోజులు చికెన్తో భోజనం ఉంటుంది. -
స్టీల్ప్లాంట్ డైరెక్టర్గా సలీం బాధ్యతల స్వీకరణ
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ డైరెక్టర్ (ఆపరేషన్స్)గా డాక్టర్ జి.సలీం పురుషోత్తమన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన ఎ.కె.సక్సేనా మొయిల్కు ఎండీగా వెళ్లడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. మెకానికల్ ఇంజనీర్ అయిన సలీం 1988లో బొకారోలో మేనేజ్మెంట్ ట్రైనీగా తన కెరీర్ను ప్రారంభించారు. 1996లో విశాఖ స్టీల్ప్లాంట్లో చేరారు. సర్టిఫైడ్ ఎనర్జీ మేనేజర్గా స్టీల్ప్లాంట్ ఐఎస్ఓ 50001 సర్టిఫికేషన్ పొందడంలో ఆయన గణనీయంగా దోహదపడ్డారు. 2018లో ఆయన బ్రైత్ వైట్ అండ్ కంపెనీ లిమిటెడ్లో డైరెక్టర్ (ప్రొడక్షన్)గా చేరారు. అక్కడ ఒక ఏడాది పాటు డైరెక్టర్ (ఫైనాన్స్)గా బాధ్యతలు నిర్వహించారు. మూడు నెలల పాటు అక్కడ సీఎండీగా వ్యవహరించారు. 2024లో మలేషియాలోని లింకన్ యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ పొందారు. -
మే 11నుంచి మోదకొండమ్మ తల్లి జాతర
సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, గిరిజనుల దేవత పాడేరులోని మోదకొండమ్మతల్లి రాష్ట్ర గిరిజన ఉత్సవాలను ఈ ఏడాది మే 11, 12, 13 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అధ్యక్షతన ఆలయ కమిటీ ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, వర్తకులు, అన్ని వర్గాల భక్తులతో ఆదివారం మోదకొండమ్మతల్లి ఆలయంలో సమావేశం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉత్సవాల నిర్వహణకు ముహూ ర్తం నిర్ణయించడంతో మే నెల 11 నుంచి మూడు రోజులు ఉత్సవాలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తేదీలను ప్రకటించారు. అమ్మవారి రుణం తీర్చుకుంటా.. ఈ ఏడాది మోదకొండమ్మతల్లి ఉత్సవాలను తానే స్వయంగా ఘనంగా నిర్వహించి, అమ్మవారి రు ణం తీర్చుకుంటానని ఆలయ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రకటించారు. మోదకొండమ్మతల్లి 39వ ఉత్సవాలకు నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును అన్ని వర్గాల పెద్దలు స్వాగతించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ ఈ ఏడాది కూడా మోదమ్మ రాష్ట్ర గిరిజన జాతరను అ న్ని వర్గాల భక్తుల సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఉత్సవాలకు సహకరించాలన్నారు. ఉత్సవ కమిటీ పూర్తి కార్యవర్గాన్ని తొందరలోనే ప్రకటిస్తామన్నా రు. మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఉపాధ్యాయ సంఘం నేతలు పలాసి కృష్ణారావు, జంపరంగి ప్రసాద్, కిల్లు రామ్మూర్తినాయుడు, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ శివకుమార్, పలు రాజకీయ పార్టీల నేతలు సీదరి రాంబాబు, సీదరి మంగ్లన్నదొర, కురుసా పార్వతమ్మ, కూడా సురేష్కుమార్, లకే రామసత్యవతి, ఐశ్వర్యరాణి, సల్లా రామకృష్ణ, కేజీయారాణి, కూడి చిట్టిబాబు, కూడి వలసంనాయుడు, కూడా సుబ్రహ్మణ్యం, ఉత్సవ కమిటీ సభ్యులు ఉడా త్రినాథ్, లకే రత్నాలమ్మ, వెంకటరమణ, రాధాకృష్ణ, కొణతాల సతీష్, హరి, కొమ్మెజు రమణ, వర్తక సంఘం ప్రతినిధులు బూరె డ్డి రామునాయుడు, ఇమ్మిడిశెట్టి అనీల్, పూసర్ల గోపి, కొణతాల ప్రశాంత్, గోపినాయుడు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయులు, వర్తకులు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు -
దగాపడ్డ యువత పోరు బాట
పాడేరు: ఉన్నత విద్య చదువుతున్న పేద విద్యార్థుల కు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని చెల్లించకుండా వారి చదువులకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటంకం కలిగిస్తోందని, దీంతో పేద విద్యార్థులు మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 12న జిల్లా కేంద్రాల్లో నిర్వహించే యువత పోరు పోస్టర్లను ఆదివారం సాయంత్రం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు. కానీ నేటికి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 12న జిల్లా కేంద్రమైన పాడేరులో యువత పోరు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని నిరుద్యోగులు, విద్యార్థులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, జి.మాడుగుల వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ్లన్నదొర, వైఎస్సార్సీపీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, సర్పంచ్ వనుగు బసవన్నదొర, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు లకే రామసత్యవతి, పీసా ఉపాధ్యక్షుడు రమణ, పార్టీ సీనియర్ నాయకురాలు లకే రత్నాబాయి, తదితరులు పాల్గొన్నారు. 12న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాడేరులో ఆందోళన పోస్టర్ ఆవిష్కరించిన మత్స్యరాస, రేగం మత్స్యలింగం -
పకడ్బందీగా స్వమిత్వ సర్వే
పాడేరు: జిల్లాలో దేవీపట్నం మండలం మినహా మిగిలిన 21 మండలాల్లో చేపట్టనున్న స్వమిత్వ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి లవరాజు ఆదేశించారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి స్వమిత్వ సర్వే శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వమిత్ర సర్వేను పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఎంపిక చేసిన 21 గ్రామాల్లో గ్రామ కంఠం భూములను ముందుగా సర్వే చేయాలన్నారు. రంపచోడవరం, చింతూరు డివిజన్ పరిధిలో 10 మండలాలకు రంపచోడవరం ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ అందజేస్తామని చెప్పారు. అసిస్టెంట్ సర్వే ఇన్స్పెక్టర్ వెంకటరావు, గ్రామ సచివాలయల కో ఆర్డినేటర్ పీఎస్ కుమార్, ఈవోపీఆర్డీ రమేష్, డిజిటల్ అసిస్టెంట్లు, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో ఆమె..
డాక్టర్, టీచర్, ఆఫీసర్, పోలీస్.. ఇలా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఆర్మీలో కూడా చేరి దేశం కోసం పోరాడుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం వారికి కాస్తంత అవకాశం కల్పిస్తే అద్భుతాలు సాధిస్తారు. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు వక్తలు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. సాక్షి, పాడేరు: తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను చదువుతో పాటు అన్ని రంగాల్లోను ప్రోత్సహించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం స్థానిక వి.ఆర్.ఫంక్షన్హాల్లో నిర్వహించారు. కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలు సమాజంలో తలెత్తుకుని తిరిగేలా ప్రోత్సహించాలన్నారు. మహిళా సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలుజేస్తున్నాయని, మహిళలు చైతన్యవంతులు కావాలన్నా రు. ఆడపిల్లలకు బాల్యదశలోనే వివాహాలు చేసే చెడు సంప్రదాయాన్ని తల్లిదండ్రులు వీడాలన్నారు. పనిచేసే చోట మహిళలు ఇబ్బందులకు గురైతే మహిళా హెల్ప్లైన్ 181 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. సఖి, వన్స్టాప్ కేంద్రాలు కూడా బాలికలు, మహిళలకు రక్షణగా పనిచేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాల్య వివాహాలు పూర్తిగా మాయం కావాలి జిల్లాలోని అన్ని ప్రాంతాలలోను బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర కోరారు. బాలికలు, మహిళలను ఎప్పుడూ చిన్నచూపు చూడవద్దన్నారు. అన్ని రంగాలలోను మహిళలు, పురుషులకు దీటుగా పనిచేస్తున్నారని, వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ.. ఏజెన్సీలో మావోయిస్టుల కార్యకలాపాలను మహిళలు అధిగమించాలని, వారితో ఇబ్బందులు ఉంటే పోలీ సుశాఖను సంప్రదించాలని అన్నారు. అసాంఘిక కార్యకలపాలను ఎదిరించాలన్నారు. మహిళా ఉద్యోగులకు ఘన సన్మానం వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా అధికారులు, ఉద్యోగులను కలెక్టర్ దినేష్కుమార్ ఆధ్వర్యంలో ఘ నంగా సన్మానించారు. దుశ్శాలువా కప్పి, పుష్పగుచ్ఛా లు అందజేశారు. సత్కారాలు పొందిన వారిలో డీఆర్వో పద్మలత, పాడేరు ఐటీడీఏ ఏవో హేమలత, ఇన్చార్జి డీడీ రజని తదితర 90మంది ఉన్నారు. 790 మంది మహిళలకు సీ్త్రనిధి రుణాలు రూ.5 లక్షల 5 వేలు, 1644 సంఘాలలోని 18,084మంది రూ.57 కోట్ల 89 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు, 8 సంఘాల్లోని 13మంది సభ్యులకు రూ.39 లక్షల ఉన్నతి రుణాలు, ఐదుగురు మహిళలకు నారీ శక్తి కింద రూ.8 లక్షలు, పీఎంజీపీ కింద ఇద్దరు మహిళలకు రూ.5 లక్షల రుణాల చెక్లను కలెక్టర్ దినేష్కుమార్ ఇతర అధికారులు పంపిణీ చేశారు. జేసీ డాక్టర్ అభిషేక్ గౌడ, ఏఎస్పీ ధీరజ్, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, లీడ్ బ్యాంకు మేనేజర్ నూతినాయుడు పాల్గొన్నారు. పోలీస్ ఆధ్వర్యంలో ర్యాలీ పాడేరు: సృష్టికి మూలమైన మహిళలను ప్రతి ఒ క్కరు గౌరవించాలని, అమ్మాయిలను తల్లిదండ్రు లు బాగా చదివించాలని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నా రు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్ట ణంలో మహిళ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మహిళలతో ప్రదర్శన జరిపారు. లింగ వివక్ష వద్దు, ఆడపిల్లలను అవమానించవద్దు, ఆడ పిల్లల చదువు ఇంటికి వెలుగు అని నినాదాలు చేశారు. డీఎస్పీ ఎస్కే షెహబజ్ అహ్మద్, పాడేరు సీఐ దీనబంధు, ఎస్బీ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, దిశ ఎస్ఐ శకుంతల, పట్టణంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. అవకాశాలు కల్పిస్తే అతివలదే విజయం సమాజం, తల్లిదండ్రులు ప్రోత్సాహంఇవ్వాలికలెక్టర్ దినేష్ కుమార్ పిలుపు -
జీఆర్ఎంబీ బృందం సీలేరు కాంప్లెక్స్ సందర్శన
సీలేరు: సీలేరు కాంప్లెక్స్లో జలాశయాలను, జల విద్యుత్ కేంద్రాలను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) బృందం శనివారం విస్తృతంగా తనిఖీ చేసింది. బలిమెల నీటి పంపకాలు, వాడుకలపై ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించారు. అనంతరం గుంటవాడ (సీలేరు) రిజర్వాయర్ను సందర్శించారు. అనంతరం జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే రెగ్యులేటర్ డ్యాంను, గేట్ల పనితీరును పరిశీలించారు. అనంతరం పార్వతీనగర్ వద్ద నిర్మాణం చేపట్టిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు గురించి వివరాలను అడిగారు. ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి ప్రాజెక్టు విశేషాలు వివరించారు. అనంతరం పవర్ కెనాల్, డొంకరాయి, జలాశయాలను జీఆర్ఎంబీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జీఆర్ఎంబీ చైర్మన్ అజయ్కుమార్ ప్రధాన్ మాట్లాడుతూ గోదావరి నదికి సంబంధించి వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బోర్డును ఏర్పాటు చేసిందని చెప్పారు. ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల, జోలాపుట్ జలాశయాల నీటి వాడకాన్ని రెండు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా నిర్వహిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జీఆర్ఎంబీ సభ్యుడు టివీఎస్ కిరీటి, సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజనీరు వాసుదేవ్ పాల్గొన్నారు. -
మహిళలు సమాజానికి వెన్నెముక
హుకుంపేట: మహిళలు అన్ని విషయాల్లో ముందుండి మహారాణులుగా రాణించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సీడీపీవో బాలచంద్రమణి దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఐసీడీఎస్ సిబ్బందిని, మహిళా పోలీసులను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు సమాజానికి వెన్నెముక, వారిని భద్రంగా కాపాడుకోవాలన్నారు. వైస్ ఎంపీపీ ప్రియాంక, స్థానిక సర్పంచ్ సమిడ వెంకటపూర్ణిమ, సీఐ సన్యాసినాయుడు, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు రేగం శివరామ్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ దగ్గరకు వెళ్లిపోతున్నా..
విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరగాలి రంపచోడవరం: వాడపల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న డోరి అశ్విని (11) ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన తీవ్ర విషాదం నింపింది. అమ్మ దగ్గరకు వెళ్లిపోతున్నా.. అక్కా నన్ను క్షమించు.. అని లెటర్ రాసి ఆ చిన్నారి బలవన్మరణానికి పాల్పడింది. మహిళా దినోత్సవం రోజున బాలిక ప్రాణాలు తీసుకోవడం అందరి మనసులను కలచివేసింది. వివరాలు.. డోరి అశ్విని ఒకటో తరగతి నుంచి వాడపల్లి ఆశ్రమ పాఠశాలలోనే చదువుతోంది. తల్లి లేకపోవడంతో చిన్నతనం నుంచి మేనత్త, అమ్మమ్మ వద్దే పెరిగింది. శనివారం మధ్యాహ్నం పాఠశాల నుంచి పిల్లల అరుపులు వినిపించడంతో పక్కనే ఇంటికి తాటాకు నేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులు పరుగు పరుగున ప్రధాన గేటు వద్ద నుంచి పాఠశాల లోపలకు వెళ్లి చూశారు. పిల్లలు విషయం చెప్పడంతో తలుపులు పగలగొట్టి లోపలకి వెళ్లే సరికి అశ్విని ఫ్యాన్కు వేలాడుతోంది. కిందకు దింపి హుటాహుటిన పీహెచ్సీకి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మధ్యాహ్న భోజన సమయంలో.. మధ్యాహ్నం పిల్లలందరూ భోజనానికి వెళ్లిన తరువాత తరగతి గదిలో తలుపులు వేసుకుని రెండు చున్నీలను కలిపి కట్టి, బెంచీ ఎక్కి ఫ్యాన్కు బిగించి ఆత్మహత్య చేసుకుంది. అశ్విని భోజనానికి రాలేదని ఎనిమిదో తరగతి పిల్లలు కొంత మంది వెళ్లి గదిలో ఫ్యాన్కు వేలాడుతున్న బాలికను చూసి పెద్దగా అరిచారు. మృతురాలికి తల్లి లేదు. ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. వారిని ఉద్దేశించి ‘అక్కా.. క్షమించు. అమ్మ వద్దకు వెళ్లిపోతున్నా. చెల్లిని బాగా చూసుకో’ అని లేఖలో పేర్కొంది. ఆ లేఖలో ‘వీరి బాధలు పడలేకపోతున్నాను’ అని రాసి ఐదుగురు అమ్మాయిల పేర్లను అశ్విని ప్రస్తావించింది. అసలు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. పాఠశాలలో హెచ్ఎం, వార్డెన్లు ఇద్దరూ అందుబాటులో లేరు. పాఠశాల సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం పాఠశాలను సందర్శించి విచారణ చేశారు. రంపచోడవరం సీఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి 8లో.. అక్కని క్షమించమని కోరుతూసూసైడ్ నోట్ చెల్లిని బాగా చూసుకోమని చివరి మాట బాలిక బలన్మరణంతో వాడపల్లి ఆశ్రమ పాఠశాలలో విషాదం -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో..
పాడేరు: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడి సమాజంలో గౌరవంగా బతకాలని, మహిళల ముఖాల్లో చిరునవ్వు ఉండాలన్నదే జగనన్న అభిమతమని జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని శనివారం పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, జీకే వీధి జెడ్పీటీసీ సభ్యురాలు కిముడు శివరత్నం, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కిల్లో ఊర్వశీరాణి, మహిళ ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ మహిళా నాయకులు పాల్గొని కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళాలోకం బాగుంటేనే గ్రామం, రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన జగన్మోహన్రెడ్డి ఆయన ప్రభుత్వ హయాంలో మహిళలను ప్రోత్సహించేందుకు 32కు పైగా పథకాలను మహిళల పేరిట ఇచ్చారని, 50 శాతానికి పైగా పదవులు ఇచ్చారని, మహిళల రక్షణ కోసం దిశ వ్యవస్థను నెలకొల్పారన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రను పార్టీ నాయకులు, మహిళ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మంగ్లన్నదొర, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర పాల్గొన్నారు. -
కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ పట్టివేత
● ముగ్గురు పిల్లల అస్వస్థతతో బయటకు వచ్చిన వైనం ● తహసీల్దార్ కార్యాలయానికి స్టాక్ అప్పగింత ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో శనివారం జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ప్రసన్నకుమార్, వినియోగదారుల సేవా సంఘం, పీసా కమిటీ సభ్యులు కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ను పట్టుకున్నా రు. ఆయా కూల్ డ్రింక్స్ను తహసీల్దార్ కార్యాయానికి తరలించి, సిబ్బందికి అప్పగించారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలో గల జర్రెల పంచాయతీ దోనిపుట్టు గ్రామానికి చెందిన కోడా సుబ్బారావు ఈ నెల 1వ తేదీన మండల కేంద్రంలో ఆర్.రాందాసు దుకాణంలో కూల్ డ్రింక్స్ కొనుగోలు చేసి, గ్రామానికి తీసుకువెళ్లారు. 5వ తేదీన ఆ డ్రింక్లను గ్రామంలో ముగ్గురు పిల్లలు తాగారు. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. చిన్నారులను హుటాహుటిన ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించి, వైద్య సేవలు అందించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో పిల్లలకు ప్రాణాపాయం తప్పినట్టు పలువురు తెలిపారు. ఈ సంఘటనను దోనిపుట్టు గ్రామస్తులు శనివారం స్థానిక జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ప్రసన్నకుమార్, వినియోగదారుల సంఘం, పీసా కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వారంతా రాందాసు దుకాణంలో నిల్వ ఉంచిన కూల్ డ్రింక్స్ను పరిశీలించగా నాలుగు నెలల పాటు కాలం చెల్లించిన 230 కేసుల కూల్ డ్రింకులు, 21 వాటర్ బాటిళ్లను గుర్తించారు. దీంతో వాటిని స్థానిక తహసీల్దార్ కార్యాయానికి తరలించి, రెవెన్యూ సిబ్బందికి అప్పగించారు. కాలం చెల్లిన డ్రింక్స్ విక్రయిస్తున్న వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
అరకులోయ టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేశారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాల్లో వెనుకబడ్డారన్నారు. వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఎంపీపీ రంజపల్లి ఉషారాణి, వైస్ ఎంపీపీ కొర్రా సుమాంజలి, సర్పంచ్ పెట్టెలి సుశ్మిత, ఎంపీటీసీ మొర్దోన్ లలిత కుమారి, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కె.అశోక్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గెడ్డం నర్శింగరావు, అరకు నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు పెట్టెలి సుక్రయ్య, పార్టీ మండల అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
కలెక్టర్ సాయంతో క్యాన్సర్ రోగి విశాఖ తరలింపు
పెదబయలు: పెదబయలు పీహెచ్సీ పరిధిలోని అడుగులపుట్టు పంచాయతీ వడ్డేపుట్టు గ్రామానికి చెందిన క్యాన్సర్ రోగి కిల్లో శరభన్నను కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని గోమంగి పీహెచ్సీ వైద్యాధికారి చైతన్య తెలిపారు. కొన్ని నెలలుగా నోటి క్యాన్సర్కు చికిత్స పొందుతున్న శరభన్న ఆస్పత్రి ఖర్చులు భరించలేక స్వగ్రామానికి ఇటీవల తిరిగి వచ్చాడు. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ దినేష్కుమార్ ఆస్పత్రి ఖర్చులకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి, తనను పంపించారని డాక్టర్ చైతన్య చెప్పారు. రోగిని గోమంగి పీహెచ్సీ అంబులెన్స్లో విశాఖపట్నం తరలించామని, మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారని వైద్యాధికారి తెలిపారు. కలెక్టర్, డీఎంహెచ్వో ఈ కేసుకు సంబందించి ఆస్పత్రి వైద్య నిపుణులతో మాట్లాడారని తెలిపారు. -
భూముల ఆన్లైన్ రిజిస్ట్రేషన్నుసద్వినియోగం చేసుకోండి
సాక్షి, పాడేరు: ఆన్లైన్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను సద్వినియోగం చేసుకోవాలని,కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ గిరిజనులను కోరారు. స్థానిక కుమ్మరిపుట్టు రోడ్డులో మొదటి సారిగా జాయింట్ సబ్ రిజిష్టర్ కార్యాలయాన్ని శనివారం ఆయన ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో భూముల క్రయ, విక్రయాలన్నీ స్టాంప్ పేపర్స్పై రాసుకునేవారని, ఎల్టీఆర్ చట్టం ప్రకా రం తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ జరిగేదన్నారు. భూముల యాజమానులంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా రు. ఈ మేరకు ఫారం–కె, ఫారం–ఎల్ పై గిరిజన రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు. సబ్ రిజిష్టర్ కార్యాలయాలను పాడేరు, రంపచోడవరంలో ప్రారంభించడం శుభ పరిణామన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ సబ్ రిజిష్టర్ కార్యాలయాలు ప్రారంభం వలన గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై గిరిజనులకు సమగ్రంగా అవగాహన కల్పించాలన్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జి.బాలకృష్ణ మాట్లాడుతూ గిరిజన చట్టాలకు లోబడి భూముల రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా డాక్యుమెంట్లను నిరంతరం పొందవచ్చన్నారు. జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు పెరిగితే అరకు లోయ, ఇతర మండలాల్లోను సబ్ రిజిష్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇరు జంటలకు రిజిస్ట్రేషన్ పత్రాలను కలెక్టర్, దినేస్జడ్పీచైర్పర్సన్లు పంపిణీ చేశారు. జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, జిల్లా రిజిష్టర్ డి.ఉపేంద్రరావు, జాయింట్ సబ్ రిజిష్టర్ కె.రమేష్, సీనియర్ సహయకులు రమేష్, ,చింతలవీధి, లగిశపల్లి సర్పంచ్లు సీతమ్మ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ -
విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరగాలి
రంపచోడవరం: వాడపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని డోరి అశ్విని ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. వాడపల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి బాలిక మృతికి గల కారణాలను గ్రామస్తులు, విద్యార్థినులతో మాట్లాడి తెలుసుకున్నారు. బాలిక ఆత్మహత్య చేసుకున్న తరగతి గదిని ఆమె పరిశీలించారు. బెంచీ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడిన తీరుపై మాజీ ఎమ్మెల్యే అనుమానాలు వ్యక్తం చేశారు. అనంతరం వాడపల్లి పీహెచ్సీలోని బాలిక మృతదేహాన్ని పరిశీలించి కంటతడి పెట్టారు. మృతురాలి తండ్రి, సోదరిలను ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో విద్యాలయాల్లో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. రంపచోడవరం డైట్ కళాశాలలో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురి కావడం, రంపచోడవరం బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థినులను గుంజీలు తీయించడంతో కాళ్లు వాచిపోయి ఆసుపత్రి పాలయ్యారని గుర్తు చేశారు. బోదులూరు ఆశ్రమ పాఠశాలలో సస్పెండ్ అయిన వార్డెన్ నెల రోజులు తిరగకుండానే వాడపల్లి ఆశ్రమ పాఠశాలలో వార్డెన్గా విధుల్లో చేరారన్నారు. పాఠశాలలో వార్డెన్, హెచ్ఎం, ఉపాధ్యాయులు ఎవరూ అందుబాటులో లేకపోవడం దారుణమన్నారు. సాయంత్రం అయితే ఎవరూ హాస్టల్లో అందుబాటులో ఉండని పరిస్థితిలో మార్పు రావాలన్నారు. పాఠశాలలో సీసీ కెమెరాలు ఉన్నా పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వం బాలిక కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని మృతిపై ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంతో మాట్లాడారు. వార్డెన్, హెచ్ఎంలను సస్పెండ్ చేసినట్లు పీవో చెప్పారన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బృందం శ్రీదేవి, ఎంపీటీసీ బచ్చల మంగ, పార్టీ మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి డిమాండ్ -
పర్యాటకాభివృద్ధి పేరుతో గిరిజన చట్టాలకు తూట్లు
చింతపల్లి: ఏజెన్సీలో పర్యాటకాబివృద్ధి పేరుతో గిరిజన చట్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని దండకారణ్య విమోచన సమితి (డీఎల్వో) కేంద్ర కమిటీ సభ్యుడు మాణిక్యాలరావు అన్నారు. శనివారం చింతపల్లి ఆర్ఐటీఐ ప్రాంగణంలో డీఎల్వో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ షెడ్యూల్లోని భూభాగాలలో ఉన్న గిరిజన ప్రాంతాలను స్వయంపాలిత రాష్ట్రాలుగా ఏర్పాటు చేయా లని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నేటికీ గిరిజన చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. న్యాయస్థానాలు అడవులపై పూర్తి హక్కులు ఆదివాసీలదే అంటున్నా చొరబాటుదారులుగా ముద్ర వేసి దండకారణ్యం నుంచి తరిమివేసే కుట్ర లకు ప్రభుత్వాలు పూనుకొంటున్నాయన్నారు. మన్యం యువతను శిక్షణల పేరిట మైదాన ప్రాంతాలకు తరలించి ప్రణాళిక ప్రకారం ఈ ప్రాంతం నుండి ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అపారమైన సంపదల ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు. మన్య ప్రాంతంలో పర్యాటకం పేరుతో విష సంస్కృతికి ప్రభుత్వాలు నాంది పలుకుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుత కమిటీ కాలపరిమితి తీరిందని త్వరలోనే జిల్లా, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో డీఎల్వో సలహాదారు కేశవరావు, రాష్ట్ర అధ్యక్షుడు కోడా ఆనంద్, జిల్లా అధ్యక్షుడు కె.కాంతారావు, సతీష్కుమార్, మార్క్రాజ్, కృష్ణ,ప్రసాద్, కాసులమ్మ, వెంకయమ్మ తదితరులు పాల్గొన్నారు.డీఎల్వో కేంద్ర కమిటీ సభ్యుడు మాణిక్యాలరావు -
వెంకన్న పెళ్లికొడుకాయెనే..
● ఉపమాక వేంకటేశ్వరస్వామి కల్యాణానికి అంకురార్పణ నేడు ● ఉదయం పెండ్లి కావిడి ఊరేగింపు ● 10వ తేదీ రాత్రి కల్యాణం ● ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీవేసవి తాపాన్ని తట్టుకునేలా ఏర్పాట్లు.. నక్కపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణానికి నేడు అంకురార్పణ జరగనుంది. మార్చి 10వ తేదీ సోమవారం రాత్రి ఉపమాకలో గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో షడ్భుజాలతో స్వయం వ్యక్తమై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వార్షికల్యాణం ఘనంగా జరగనుంది. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి వార్షిక కల్యాణం అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వార్షిక కల్యాణానికి సంబంధించి 9వ తేదీ ఆదివారం ఉదయం స్వామివారి పెండ్లి కావిడను ఉపమాక మాడ వీధుల్లో ఊరేగిస్తారు. భక్తులు స్వామివారికి పసుపు కుంకుమలు, కొబ్బరికాయలు కానుకగా సమర్పిస్తారు. సాయంత్రం ఆలయంలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్వరుణ, కంకణధారణ, అంతరాలయ పూజ, నీరాజన మంత్రపుష్పాలు సమర్పిస్తారు. తదుపరి సాయంత్రం అంకురార్పణకు శ్రీకారం చుడతారు. సుదర్సన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి మత్సంగ్రహణం (పుట్టమన్ను) తీసుకు రావడానికి ఉత్తర ఈశాన్య దిక్కున గల ప్రాంతానికి తీసుకెళ్తారు. అనంతరం అశ్వవాహనంపై తిరువీధి సేవ జరుగుతుంది. స్వామి, అమ్మవార్లను అశ్వవాహనంలో ఉంచి మాడవీధుల్లో తిరువీధి సేవ నిర్వహిస్తారు. తర్వాత స్వామివారి కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను కొలువుదీరుస్తారు. అంకురార్పణ చతుస్టాన అర్చనలు గరుడప్పాల నివేదన నిర్వహిస్తారు. దీంతో స్వామివారి కల్యాణ ఉత్సవాలు ప్రారంభమైనట్లేనని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు.10వ తేదీ ఉదయం ఉభయ దేవేరులను పెద్దపల్లకిలో కొలువుదీర్చి ఆలయం, గ్రామంలో అష్టదిక్పాలకులను ఆవాహన చేసిన తర్వాత ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు రాత్రి వేంకటేశ్వర స్వామిని ఇత్తడి గరుడ వాహనంపై, ఉభయ దేవేరులను శేషవాహనంపై ఉంచి ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటి వద్ద కన్యావాద సంవాదం (ఎదురు సన్నాహ మహోత్సవం) నిర్వహిస్తారు. ప్రముఖ వేద పండితురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవం, కల్యాణం జరుగుతుంది. 300 మందితో పోలీసు బందోబస్తు.. జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా ఆదేశాల మేరకు కల్యాణోత్సవాలకు సుమారు 300 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఐ కుమారస్వామి తెలిపారు. ఆరుగురు సీఐలు, 20 మంది ఎస్ఐలతో పాటు, స్పెషల్ బ్రాంచి పోలీసులు, హెచ్సీలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మఫ్టీలో సిబ్బంది భద్రత కోసం పని చేస్తారన్నారు. 16 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, డ్రోన్ కెమెరాల సాయంతో భద్రత పర్యవేక్షిస్తామన్నారు. మనబానవానిపాలెం, నక్కపల్లిలో పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించామన్నారు. ఉపమాక వెళ్లే అన్ని మార్గాల్లోను చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 10వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతిస్తామన్నారు. -
క్షౌరవృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలి
రంపచోడవరం: ఏజెన్సీలో తరతరాలుగా క్షౌ ర వృత్తి చేసుకుంటూ జీవన సాగిస్తున్న నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని ఏజెన్సీ నాయీ బ్రహ్మణ సంఘం నాయకులు సూదికొండ వెంకటేశ్వరరావు, బండారు నాగేశ్వరరావు, ఎం కృష్ణ భగవాన్ అన్నారు. రంపలో శుక్రవారం క్షౌ రవృత్తిదారుల మా సంఘం మా అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు.ఏజెన్సీ 11 మండలాల్లోని క్షౌ రవృత్తిదారులు పాల్గొన్నారు. రంపచోడవరంలో ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు, భగత్సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రంపలో జరిగిన సదస్సులో పలు తీర్మానాలు చేశారు. ఏజెన్సీలో క్షౌ రవృత్తిదారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. అర్హులందరికీ ఆన్లైన్ చేసి రుణాలు మంజూరు చేయాలని కోరారు. రంపచోడవరం నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నరవ రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముమ్మిడివరపు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఆదివాసీల ఆత్మ గౌరవ దీక్షలు
పాడేరు : ఐదో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల పరిరక్షణ కోసం ఉన్న 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ ఇందుకోసం అసెంబ్లీలో తీర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఐటీడీఏ వద్ద అఖిలపక్ష, ప్రజా సంఘాల ఐక్య వేదిక నిర్వహించిన 48 గంటల ఆదివాసీల ఆత్మ గౌరవ దీక్షలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉద్యోగాల భర్తీ కొరకు జీవో నెం.3 పునరుద్దిస్తామని అలా కానీ పక్షంలో ప్రత్యామ్మయ జీఓ విడుదల చేసి శతశాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులకు చెందేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని కానీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా మరిచిపోయారన్నారు. దీంతో స్థానిక ఆదివాసీ నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఈ విషయంపై పునారాలోచించి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. 1/70 చట్టం సవరణపై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వాఖ్యలకు నిరసనగా తాము చేపట్టిన ఏజెన్సీ బంద్కు స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు అలాంటి ఆలోచన లేదని ట్విట్టర్ ద్వారా ప్రకటించారని అలా కాకుండా అసెంబ్లీలో, టీఏసీ తీర్మాణం చేసి చట్టాన్ని పటిష్టంగా అమలు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్దంగా చేపట్టనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేయాలన్నారు. వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు రాధాకృష్ణ, కిల్లో సురేంద్ర, పొద్దు బాల్దేవ్, కురుసా పార్వతమ్మ, సుబ్రమణ్యం, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు అధికారుల తీరుపై ధ్వజం
డుంబ్రిగుడ: కించుమండ స్టేట్ బ్యాంకు అధికారిపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కించుమండ గ్రామానికి చెందిన దుర్గమ్మ డ్వాక్రా సంఘం సభ్యులు శుక్రవారం ఆందోళన చేపట్టి అనంతరం పాడేరులో జరిగే మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ దినేష్కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు, కార్యదర్శి అమ్మి, సీతమ్మ మాట్లాడుతూ 2009లో బ్రిడ్జిలోన్ ద్వారా రూ. 1లక్ష, బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 50 వేలు సంఘ సభ్యులు రుణాన్ని పొందినట్టు తెలిపారు. పొదుపుతో పాటు తీసుకున్న రుణాన్ని దశల వారీగా చెల్లించే వారమని గుర్తు చేశారు. కరోనా సమయంలో రుణా న్ని చెల్లించలేకపోయామన్నారు. గతంలో పసుపు కుంకుమ, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆసరా పథకం ద్వారా సంఘ సభ్యుల ఖాతాలో రూ.2లక్షలు మేర జమ అయ్యిందన్నారు. వెలుగు అధికారులతో తీర్మాణం చేయించి జమ అయిన ఆయా నగదును తీసుకోవడానికి బ్యాంక్కు వెళ్లగా, రుణ బకాయి ఉన్నట్టు అధికారులు ప్రకటించారని పేర్కొన్నారు. ఏడాదిగా బ్యాంకు చుట్టూ తిప్పంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే బ్యాంకు అధికారుల తీరుపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వినతిలో పేర్కొన్నట్టు వారు చెప్పారు. -
శ్రమదానంతో తాత్కాలిక రహదారి నిర్మాణం
ముంచంగిపుట్టు: రహదారి సమస్య నిత్యం వేధిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో డోలీమోతలే దిక్కుగా మారాయి. డోలీలో తరలిస్తుండగా మార్గమధ్యలోనే రోగులు మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. రహదారి నిర్మాణానికి ప్రభుత్వం,అధికారులు చొరవ చూపుతారని నమ్మకం పోయింది.దీంతో మండలంలోని మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామానికి చెందిన గిరిజనులు గ్రామానికి రహదారి నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. బంగారం, భూములు,మేకలు,కోళ్లు,పాలిచే ఆవులు అన్నింటినీ అమ్మి రూ.10లక్షలు సమకూర్చుకుని, పొక్లెయిన్ యజమానితో ఒప్పందం కుదుర్చుకుని కొంత మేర కొండల మార్గంలో రహదారిని నిర్మాణం చేశారు. శ్రమదానంతో ద్విచక్రవాహనాలు వచ్చే విధంగా దొరగూడ నుంచి ఉబ్బెంగుల గ్రామం వరకు 8కిలో మీటర్ల మట్టి రోడ్డును మూడు నెలల పాటు శ్రమించి నిర్మించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు లక్ష్మణ్,లైకోన్,కాడి,బుద్ర,గస్సు,మంగ్లీలు మాట్లాడుతూ సరైన రహదారి లేక ఎన్నో ఏళ్ల నుంచి రవాణా కష్టాలు పడుతున్నామని చెప్పారు. గ్రామంలో 20కుటుంబాలకు చెందిన 75మందికి పైగా గిరిజనులం జీవిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రి తరలించాలన్న,నిత్యావసర సరకులు తీసుకురావాలన్న అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు జిల్లా,మండల స్థాయి అధికారులను కలిసి రహ దారి సమస్యను తెలిపినా స్పందించలేదని వాపోయారు. దీంతో ఇంటిలో ఉన్న బంగారం,మేకలు,ఆవులు,భూములు అమ్ముకొని రూ. 10 లక్షతో పొక్లెయిన్ ఏర్పాటు చేసి, కొంత మేర పనులు చేయించామని చెప్పారు. శ్రమదానంతో తీవ్రంగా కష్టపడి మరికొంత మేర తాత్కాలిక రహదారిని నిర్మించుకున్నామని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన రహదారి మంజూరు చేసి రవాణా కష్టాలు తీర్చాలని వారు కోరారు. మూడు నెలలు కష్టపడి.. 8కిలో మీటర్ల రహదారి పూర్తి ప్రభుత్వం స్పందించి, పక్కారోడ్డు మంజూరు చేయాలని గిరిజనుల విజ్ఞప్తి -
నేడు ఎమ్మెల్యే కార్యాలయంలో మహిళా దినోత్సవం
పాడేరు : అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని శనివారం పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్నట్టు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, పార్టీ మహిళ విభాగ జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాలతో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన మహిళ పార్లమెంట్ సభ్యులు, జెడ్పీ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మహిళ సర్పంచ్లు, ఎంపీటీసీ, పార్టీ శ్రేణులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. -
ఆశ్రమ పాఠశాలలకు బియ్యం పంపిణీ
పెదబయలు: పెదబయలు మండలంలోని అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు శుక్రవారం జీసీసీ అధికారులు ఎట్టకేలకు బియ్యం పంపిణీ చేశారు. మండలంలోని ఆశ్రమ పాఠశాలలతో పాటు, గిరిజన సంక్షేమ పాఠశాలలకు చాలా తక్కువగా బియ్యం సరఫరాపై ‘సాక్షి’లో ’వెతలు తీరేనా’ శీర్షికతో శుక్రవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు హూటాహూటిన శుక్రవారం ఉదయం నుంచి పెదబయలు మండలంలోని పెదబయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1, 2, ఆశ్రమ గిరిజన సంక్షేమ బాలూరు1, 2 పాఠశాలకు 50 బస్తాల చొప్పున బియ్యాన్ని లారీల్లో సరఫరా చేశారు. మిగిలిన సీకరి, అరడకోట, కొరవంగి, రూడకోట, పాఠశాలకు మాత్రమే పంపిణీ చేశారు. అయితే పంపిణీ చేసిన పాఠశాలలకు ఇండెంట్ ప్రకారం కాకుండా అరకొరగా బియ్యం సరఫరా చేశారు. పూర్తి స్థాయిలో బియ్యం అందించాలని వార్డెన్లు, నిర్వాహకులు కోరుతున్నారు. పూర్తి స్థాయిలో అందించకపోతే పది రోజుల తరువాత మరలా బియ్యం కొరత ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు.అరకొరగా పంపిణీ చేసిన జీసీసీ అధికారులు -
‘ఫ్రై’డే
సాక్షి,పాడేరు: ఎండలు దంచికొడుతున్నాయి... శుక్రవారం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఎండవేడిమిని భరించలేక జనం తల్లడిల్లిపోయారు. వేకువజామున ఉష్ణోగ్రతలు తగ్గి, చలిగాలుల ప్రభావం ఉంటున్నప్పటికీ ఉదయం 9గంటలు దాటిన తరువాత సూరీడు సుర్రుమంటున్నాడు. మైదాన ప్రాంతాల వలే ఏజెన్సీలో కూడా మధ్యాహ్నం అఽధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.జిల్లా కేంద్రం పాడేరుతో పాటు మండల కేంద్రాలు,ప్రధాన జంక్షన్లు మధ్యాహ్న సమయంలో జనసంచారం లేక బోసిపోతున్నాయి.ఎండ కారణంగా జనం లేక శుక్రవారం జరిగిన పాడేరు,అరకు వారపుసంతలు వెలవెలబోయయాయి. చిరువ్యాపారులు, పశువుల కాపర్లు అధిక ఎండతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత ఉంది. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతల వివరాలు రాజవొమ్మంగిలో 38.1 డిగ్రీలు,అడ్డతీగలలో 38, రంపచోడవరంలో 37.7, కొయ్యూరులో 37.4,కూనవరంలో 37,ఎటపాకలో 36, పాడేరులో 35.4, జీకే వీధిలో 34.4.చింతూరులో 33.2, చింతపల్లిలో 32.8, అరకులోయలో 32.7, పెదబయలులో 32.1 అనంతగిరిలో 31.2, జి.మాడుగులలో 31, హుకుంపేటలో 31.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి. -
శరభన్నపాలెం ఎంపీటీసీ సోమాగాంధీ మృతి
కొయ్యూరు: వైఎస్సార్ సీపీ నాయకుడు, శరభన్నపాలెం ఎంపీటీసీ సభ్యుడు లోకుల సోమాగాఽంధీ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. ఎంపీపీ బడుగు రమేష్, పాడేరు మాజీ ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు తెడబారికి సురేష్కుమార్, జల్లి సుధాకర్, టీడీపీ నాయకులు ప్రసాద్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ మేరకు శరభన్నపాలెంలో సోమాగాంధీ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ ఆవిర్బావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న సోమాగాంధీ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు కేజీహెచ్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, నలుగరు పిల్లలున్నారు. పరామర్శించిన వారిలో నాయకులు రవి, సుధాకర్, సర్పంచ్ కిముడు సత్యనారాయణ తదితరులున్నారు. కుటుంబానికి అండగా ఉంటాం కొయ్యూరులో పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన సోమాగాంధీ మరణం పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చెప్పారు. ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సురేష్ కుమార్, జల్లి సుధాకర్, నేతలు సోమాగాఽంధీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ నాయకులు -
స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ మళ్లీ మొదలైందని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం విధులకు వెళ్లిన కాంట్రాక్ట్ కార్మికులు ఆయా ప్రవేశ గేట్ల వద్ద బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. సుమారు 250 మంది కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు కాకపోవడంతో సాంకేతిక సమస్య అనుకున్నారు. తీరా కార్మిక సంఘాల నాయకులు వాకబు చేయగా వారిని బయోమెట్రిక్ నుంచి తొలగించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలియవచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం మేరకు తొలగింపు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరుగుతున్నట్టు సమాచారం. ఈ అంశంపై విభాగంలోని అధికారులను వివిధ సంఘాల నాయకులు ప్రశ్నించగా తమకు ఏం తెలియదంటూ దాట వేశారని ఆరోపించారు. ఈ అంశంపై పోరాటానికి సన్నద్ధమవుతున్నామని కార్మిక నాయకులు తెలిపారు. -
గిరిజన యువతులుడ్రైవింగ్లో శిక్షణ పొందాలి
రంపచోడవరం: గిరిజన యువతులు డ్రైవింగ్లో శిక్షణ పొంది, ఉపాధి అవకాశాలు పొందాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ అన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్లో సంకల్ప కార్యక్రమాన్ని శుక్రవారం సబ్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ డ్రైవింగ్ వృత్తి మగ వారు మాత్రమే చేసేది అనే భావన తొలగిపోవాలని, గిరిజన మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవాలన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రోహిణి మాట్లాడుతూ సంకల్ప కార్యక్రమం ద్వారా మల్టీ స్కిల్ ప్రోగ్రాంను కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రారంభించినట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వసుధ తదితరులు పాల్గొన్నారు. -
టాయిలెట్లను సద్వినియోగం చేసుకోవాలి
– కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు : కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కోల్కత్తాకు చెందిన విజువిస్ అనే సంస్థ నిర్మించిన బయో టాయిలెట్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. పట్టణంలోని తలార్సింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్మించిన రెండు బయో టాయిలెట్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీఎస్సార్ నిధుల కింద జిల్లాలో మరిన్ని పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంత్రి సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపాల్ గణేష్, ధనలక్ష్మి పాల్గొన్నారు. -
270 మందికి వైద్య పరీక్షలు
గూడెంకొత్తవీధి(సీలేరు): మండలంలోని దారకొండలో పోలీసు, వైద్యారోగ్యశాఖల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో దారకొండ పరిసర ప్రాంతాల నుంచి 270 మంది వైద్యపరీక్షలు చేయించుకున్నారు. వీరందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి విశాఖలోని శంకర్ ఫౌండేషన్ ద్వారా శస్త్రచికిత్సలు చేయించేందుకు ఏర్పాట్లు చేసినట్టు గూడెంకొత్తవీధి సీఐ వరప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా 32 మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించారన్నారు. ఈనెల 10న వారికి ఆపరేషన్లు చేస్తారన్నారు. వైద్యాధికారి మస్తాన్వలి, సీలేరు ఎస్ఐ రవీంద్ర, శంకర్ ఫౌండేషన్ ఆప్తాలమిస్ట్ రమేష్బాబు ఎంఎల్హెచ్పీలు నాగమణి, లోవకుమారి తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో చట్టంపై అవగాహన అవసరం
● చింతపల్లి ప్రథమశ్రేణి జ్యుడీషియల్మెజిస్ట్రేట్ కొయ్యూరు: పోక్సో చట్టంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని చింతపల్లి ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎం.రోహిత్ తెలిపారు.విద్యార్థి దశ నుంచి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. మర్రిపాలెం మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం మండల న్యాయ సేవాధికార సంస్థ అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మెజిస్ట్రేట్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని వాటిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధా, పారా లీగల్ వలంటీర్లు పనసల చిట్టిబాబు,కవడం కృష్ణ,కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
కాఫీ సాగు విస్తరణకు చర్యలు
పాడేరు : గిరిజనులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ పంటను మరింత విస్తరించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఎంజీ దినేష్ తెలిపారు. కేంద్ర కాఫీ బోర్డు బృందం శుక్రవారం పాడేరులో పర్యటించింది. స్థానిక మోదకొండమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ఆలయ కమిటీ ప్రతినిధులు కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్ దినేష్, సభ్యులకు అమ్మవారి చిత్రపటాలు అందజేసి దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దినేష్ మాట్లాడుతూ పాడేరు ఏజెన్సీలో ఐటీడీఏ, జీసీసీ, స్వచ్ఛంద సంస్థల ద్వారా గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ పంటను విస్తరించేందుకు, గిరిజనులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందజేసేందుకు , కాఫీ పల్పింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం కలెక్టర్ దినేష్కుమార్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్లను కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్, సభ్యులు కలిసి, కాఫీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పాడేరు మండలం గెడ్డంపుట్టు గ్రామంలో మన్య తోరణ రైతు ఉత్పత్తుదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాఫీ పొడి యూనిట్ను సందర్శించారు.ఈ కార్యక్రమంలో పాడేరు ఏజెన్సీకి చెందిన కేంద్ర కాఫీ బోర్డు సభ్యులు కురుసా మహేశ్వరరావు, జైతీ ప్రభాకర్, తాంగుల విశ్వనాథం సహా 15 మంది సభ్యులు పాల్గొన్నారు.కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్ దినేష్ -
చికిత్స పొందుతూ గిరిజనుడు మృతి
మారేడుమిల్లి : చెట్టుపై నుంచి జారిపడి గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ గిరిజన యువకుడు మృతి చెందాడు. మారేడుమిల్లి మండలం కుండాడ గ్రామానికి చెందిన కుండ్ల సురేష్ రెడ్డి గ్రామ సమీపంలోని చింతచెట్టు ఎక్కి చింతకాయలు కోస్తుండగా, ప్రమాదవశాతుత్త కింద జారి పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలైయ్యాయి. అతని మారేడుమిల్లి పీహెచ్సీకి తరలించగా, అక్కడ నుంచి రంపచోడవరం తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు బంధవులు తెలిపారు. -
అశ్వినీ ఈజ్ ద ‘బెస్ట్’
దేశంలోనే నాణ్యమైన కాఫీ గింజలు పండించిన గిరి మహిళ పెదబయలు: మనసు పెట్టి రంగంలోకి దిగితే విజయం దాసోహం కావాలసిందేనని గిరి మహిళలు నిరూపిస్తున్నారు. మండలంలోని లక్ష్మీపేట కప్పాడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ కిల్లో అశ్విని గత ఏడాది దేశంలోనే నాణ్యమైన కాఫీ గింజలు పండించి, పురస్కారం అందుకున్నారు. గత ఏడాది బెంగళూరులో జరిగిన ప్రపంచ కాఫీ సదస్సులో ప్లేయర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్ అవార్డు ఆమెకు లభించింది. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో తమకున్న ఎకరన్నర పోడు భూమిలో ఎలాంటి ఎరువులు వినియోగించకుండా ఆర్గానిక్ పద్ధతిలో కాఫీ సాగు చేస్తున్నట్టు చెప్పారు.నాణ్యమైన కాఫీగా గుర్తింపు రావడంతో చాలా మంది వ్యాపారవేత్తలు ఎంవోయూ కుదుర్చుకోవడానికి తమ గ్రామానికి వచ్చారని ఆమె తెలిపారు. ప్రతి ఏడాది తాము పండించిన కాఫీ శాంపిళ్లను భర్త గాసన్న సహకారంతో సదస్సులకు పంపుతున్నట్టు చెప్పారు. -
No Headline
డుంబ్రిగుడ: సమాజ శ్రేయస్సే ధ్యేయంగా...మానవత్వమే మార్గంగా నేరనిరోధక అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు కమ్మిడి కృష్ణకుమారి ముందుకుసాగుతున్నారు. కరోనా సమయంలో ఆమె గిరిజనులకు విశేష సేవలందించారు. మాస్క్లు పంపిణీ చేయడంతో పాటు నిత్యావసర సరకులు అందజేసి పలువురిని ఆదుకున్నారు. పేద గిరిజనులకు దుస్తులు, రగ్గులు ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అండగా నిలుస్తున్నారు. 2015 నుంచి సేవలందించడం ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు 20 వేల మంది గిరిజనులకు ఏదో ఒక రూపంలో సేవ చేసినట్టు ఆమె తెలిపారు. చేసిన సేవలకు గాను పలు అవార్డులు ఆమెను వరించాయి. ఢిల్లీలో జాతీయ సేవారత్న అవార్డును అందుకుంటున్న కృష్ణ కుమారి (ఫైల్) -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
రంపచోడవరం: గిరిజన మహిళలు, యువతులు అన్ని రంగాల్లో రాణించాలని రంపచోడవరం ఐటీడీ ఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పీవో మాట్లాడుతూ మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో బాల్య వివాహాలను అరికట్టాలని తెలిపారు. సబ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీ మాట్లాడుతూ గిరిజన యువతులు ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని వాటి సాధనకు కృషి చేయాలన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు వాలీబాల్, ఖోఖో తదితర పోటీలు నిర్వహించి, విజేతలకు పీవో, సబ్ కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం సబ్ కలెక్టర్, పీవోలను ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వసుధ, అధ్యాపకులు, విద్యార్థినులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు కల్యాణి, చంద్రిక, న్యాయవాది పద్మావతి, అధ్యాపకులు రవికుమార్, వెంటేష్, చక్రవర్తి, సునీత తదితరులు పాల్గొన్నారు. -
భర్త ప్రోత్సాహం.. ఆమె కల సాకారం
ఏయూ న్యాయకళాశాల ప్రిన్సిపాల్ సీతామాణిక్యం ఏయూక్యాంపస్: చదువుకు ఎక్కువగా ప్రాధాన్యత లేని రోజుల్లో 17 ఏళ్ల వయసులో పెళ్లిపీటలపై కూర్చున్నారు. పెళ్లిచూపుల సమయంలో పెళ్లికొడుకు చదువుకుంటావా అని అడిగిన ప్రశ్న ఆమెలో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. అలా భర్త సహకారంతో తన చదువును కొనసాగించారు. నేడు దేశంలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాలకు ప్రిన్సిపాల్గా బాధ్యతలను నిర్వహించే స్థాయికి ఎదిగారు ఆచార్య కె.సీతామాణిక్యం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక సీ్త్ర ఉంటుందంటారు. కానీ ఆచార్య సీతామాణిక్యం విజయం వెనుక ఆమె భర్త తమ్మిరెడ్డి ఉన్నారు. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా విద్యపై ఉన్న ఆసక్తితో ఆమెను ప్రోత్సహించారు. ప్రైవేటుగా డిగ్రీ పూర్తిచేసి అనంతరం ఎం.ఏ హిస్టరీ, బ్యాచ్లర్ ఆఫ్ లా, ఎం.ఏ ఇగ్లీషు, ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్లా(ఎల్ఎల్ఎం) పూర్తిచేశారు. ఒకవైపు కుటుంబం, పిల్లల బాధ్యతలను నిర్వహిస్తూ ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం నుంచి 2000 సంవత్సరంలో సైబర్ నేరాలపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. 2014లో పోస్ట్ డాక్టోరల్ ఇన్ లా(ఎల్ఎల్డీ)ని అందుకున్నారు. రాష్ట్రం నుంచి ఈ డిగ్రీ సాధించిన తొలి వ్యక్తి ఆచార్య సీతామాణిక్యం కావడం విశేషం. వివాహం, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తన ఆకాంక్షలను సాకారం చేసుకోవచ్చు అనడానికి ఆచార్య సీతామాణిక్యం జీవితం ఒక ఉదాహరణ మాత్రమే. అనంతరం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఏయూలో 2006లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. 2021లో ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టారు. 24 జూన్ 2024 నుంచి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నారు. -
పసుపు, పిప్పళ్లకు గిట్టుబాటు ధర కల్పించాలి
● గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర పెదబయలు: గిరిజన రైతులు పండించిన పసుపు, పిప్పళ్ల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో గిరిజనులు పండించిన పసుపు, పిప్పళ్ల పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని తెలిపారు. ప్రస్తుతం కిలో పసుపు ధర రూ.130 ఉందని, పిప్పళ్ల ధర రూ.340 ఉందని చెప్పారు. పసుపు రూ.300 , పిప్పళ్లు రూ.500 గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు బొండా సన్నిబాబు, పోరా త్రినాఽఽథ్, రాందాసు, బొండా గంగాధరం, బుజ్జిబాబు పాల్గొన్నారు. -
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
కలెక్టర్ దినేష్కుమార్సాక్షి, పాడేరు : జల్జీవన్ మిషన్ కింద మంజూరు చేసిన తాగునీటి పనులు అరకొరగా చేసి చేతులు దులుపుకొంటే సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్కుమార్ హెచ్చరించారు. జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీటి పథకాల కోసం ఇప్పటికే రూ.143 కోట్లు ఖర్చుచేసినట్టు చెప్పారు. ఐటీడీఏ పీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీవోలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ పనులు పూర్తి చేసిన గ్రామాలకు తాగునీరు అందడం లేదని ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. జల్జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించాల్సిన బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఉందని చెప్పారు. ఎంపీడీవోలు తాగునీటి పథకాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. పథకాల నిర్మాణాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవోలు అభిషేక్ గౌడ, కట్టా సింహాచలం, అపూర్వభరత్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహర్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి లోవరాజు పాల్గొన్నారు. నేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రారంభం జిల్లాలో రంపచోడవరం పీఎంఆర్సీ భవనం,పాడేరులోని ఏపీఆర్ స్కూల్ ఎదుట ఉన్న భవనంలోను స్టాంప్స్ అండ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను శనివారం ప్రారంభించనున్నట్టు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. ఆ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను జిల్లాలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈనెల 8వతేదీన తహసీల్దార్ కార్యాలయాల్లో భూముల రికార్డులను డిజిటిలేషన్ చేయాలన్నారు. మే 1వ తేదీ నుంచి సంబంధిత గ్రామ పంచాయతీల నుంచి లేఅవుట్, భవన నిర్మాణాలకు ఆన్లైన్లో ఆమోదం తీసుకోవాలన్నారు.జిల్లా వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను రిజిష్టర్ కార్యాలయం ఐజీఆర్ఎస్.ఏపీ.ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు కలెక్టర్ తెలిపారు. ఈకార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ,ఐటీడీఏ పీవోలు సింహాచలం, అపూర్వభరత్,సబ్కలెక్టర్లు సౌర్యమన్పటేల్,కల్పశ్రీ,జిల్లా రిజిష్టర్ ఉపేంద్రరావు,సబ్ రిజిస్ట్రార్ రమేష్,డీపీవో లవరాజు,డీఎల్పీవో కుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
రైలు ప్రయాణంలో తోడు.. మేరీ సహేలీ
మహిళా ప్రయాణికులకు రక్షణగా ప్రత్యేక బృందంసాక్షి, విశాఖపట్నం: రైల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా భారతీయ రైల్వే.. వినూత్న విధానాలను అవలంబిస్తోంది. ఎవరి తోడు లేకుండా ప్రయాణిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు అనుసరిస్తున్న సరికొత్త ఆలోచనే ‘మేరీ సహేలి’. అంటే.. నా స్నేహితురాలు అని అర్థం. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునేంత వరకూ ఆర్పీఎఫ్ ఏర్పాటు చేసిన మేరీ సహేలి బృంద సభ్యులు వారి స్నేహితులుగా తోడుంటారు. అంతేకాదు.. అసౌకర్యాలకు గురవుతున్న మహిళా ప్రయాణికులకు సహాయం చేయడంతో పాటు భద్రతను పెంచే లక్ష్యంతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిధిలో ‘సుభద్ర వాహిని’ పేరుతో ప్రత్యేక మహిళా రైల్వే సిబ్బంది బృందం సేవలందిస్తోంది. మేరీ సహేలి, సుభద్ర వాహినిలో మొత్తం 16 మంది మహిళా ఆర్పీఎఫ్ సిబ్బంది సేవలందిస్తున్నారు. మేరీ సహేలీ..: వాల్తేరు డివిజన్ పరిధిలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి నిత్యం రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. రైలు ప్రయాణికుల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలుంటారు. వీరి వివరాల్ని ఆర్పీఎఫ్ సేకరిస్తుంది. ఇందుకోసం రైలు ప్రయాణికుల రిజర్వేషన్ల ఆధారంగా ఇలాంటి మహిళల వివరాల్ని గుర్తించేందుకు రైల్వే శాఖ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (క్రిస్) యాప్ను వినియోగిస్తోంది. మేరీ సహేలీ బృంద సభ్యులు తమ ట్యాబ్ల ద్వారా వివరాలు సేకరించి.. వారి వద్దకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తారు. ఏదైనా అవసరం ఉంటే సమాచారం అందించాలంటూ ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. రైలుదిగేంత వరకూ వారితో టచ్లో ఉంటారు. మహిళల బోగీల్లో పురుషులు చొరబడినా వారిపై కేసులు నమోదు చేస్తుంటారు. ఇలా మహిళల భద్రతకు సంబంధించి విశాఖ స్టేషన్ పరిధిలో గత ఏడాది 1,151 మందిపై కేసులు నమోదు చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 89 కేసులు నమోదు చేసినట్లు ఆర్పీఎఫ్ సీఐ కిమిడి రామకృష్ణ తెలిపారు. సుభద్ర వాహిని : సుభద్ర వాహిని మహిళా ప్రయాణికులను అప్రమత్తం చేయడం, ప్లాట్ఫామ్లపై, రైళ్లలో మహిళలపై నేర కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. తక్షణ సహాయం కోరుకునేవారు ఎవరైనా ఉంటే సులభంగా గుర్తించడానికి సుభద్ర వాహిని సభ్యులకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. విశాఖపట్నం, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో ఈ బృందం విడతల వారీగా ప్రయాణిస్తూ మహిళలకు రక్షణ కవచంలా నిలుస్తున్నారు. హెల్ప్లైన్ నంబర్కు వచ్చిన ఫిర్యాదులపైనా స్పందించి.. వాటిని పరిష్కరించడంలో సుభద్రవాహిని బృందం దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రతి ఏటా దాదాపు 3500 మంది మహిళలకు రక్షణ కవచంలా సుభద్ర వాహిని బృందాలు వ్యవహరిస్తున్నాయని ఆర్పీఎఫ్ సీఐ రామకృష్ణ వివరించారు. మహిళలకు రైల్లో ఏ సమస్య తలెత్తినా కంట్రోల్ రూమ్ 8978080777 నంబర్కు గానీ.. రైల్వే టోల్ఫ్రీ నంబర్ 139లో సంప్రదించాలని ఆయన మహిళలకు సూచించారు.మేరీ సహేలీ ద్వారా ప్రతిరోజు 10 మంది మహిళలకు రక్షణ సుభద్ర వాహిని పేరుతో మరో రక్షణ బృందం -
విజయోస్తు సీ్త్రరస్తు..
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంటా బయట... అలుపని రవ్వంత అననే అనవంట... వెలుగులు పూస్తావు వెళ్లే దారంత... అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్న ‘ఆమె’కు వందనం అంటోంది జగతి. అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా.. ఆత్మీయతతో అనురాగాన్ని పంచే..అమృతమూర్తికి పాదాభివందనం చేస్తోంది. గిరిజన సేవే పరమావధిగా... సాక్షి,పాడేరు: గిరిజనులకు సేవ చేయడమే పరమావధిగా పాడేరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలతాదేవి తన కేరీర్ ప్రారంభం నుంచీ కృషి చేస్తూ తోటి గిరిజన వైద్యులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసేందుకు అవకాశం లభించినా ఆదివాసీలకు వైద్యసేవలందించేందుకే ఆమె మొగ్గు చూపుతూ జిల్లాలో పలు ప్రాంతాల్లో సేవలందించారు. చింతపల్లి మండలం లబ్బంగిలో 1963 సంవత్సరం జనవరి 11న గిరిజన దంపతులు నారాయణరావు,చంద్రవతిలకు జన్మించిన హేమలతాదేవి అనకాపల్లిలో టెన్త్,ఇంటర్ చదివారు.తండ్రి నారాయణరావు సివిల్ ఇంజనీర్గా పనిచేశారు.ఆమె భర్త తమర్భ బాబూరావునాయుడు రిటైర్డ్ గిరిజన ఐఏఎస్ అధికారి. ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి అయిన వెంటనే జి.కె.వీధి మండలంలో అప్పటిల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పెదవలస పీహెచ్సీలో ఏడాది పాటు కాంట్రాక్టు వైద్యురాలిగా పనిచేసి తోటి గిరిజనులు సేవలందించారు. పీజీ అనంతరం జి.మాడుగుల పీహెచ్సీలో 1992లో ప్రభుత్వ రెగ్యులర్ వైద్యురాలిగా తొలిపోస్టింగ్ లభించింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వివిధ హోదాల్లో పనిచేసినా గిరిజన రోగులకు వైద్యసేవలందించడంపైనే దృష్టిసారించారు. 2023 సెప్టెంబర్ నెలలో ఆమెకు అడిషనల్ డీఎంఈగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.అయితే కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పూర్తిస్థాయి సూపరింటెండెంట్గా విధుల్లో చేరాలని మిత్రులు,కుటుంబ సభ్యుల నుంచి వత్తిడి వచ్చినప్పటికీ గిరిజన ప్రాంతంలో పనిచేయాలనే ఆలోచనతో పాడేరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా రావాలని నిర్ణయించుకున్నారు.ఆమె ఆలోచన విధానానికి తగ్గట్టుగానే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాడేరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా సెప్టెంబర్ 2023లో నియమించింది. మెడికల్ కళాశాల ప్రారంభానికి ముందే ప్రిన్సిపాల్గా విధుల్లో చేరిన ఆమె పాడేరు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్గా 2024 జనవరి వరకు గిరిజనులకు వైద్యసేవలందించారు. ప్రస్తుతం పాడేరు మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉత్తమ సేవలు అందిస్తున్నారు.వైద్య వృత్తిని చేపట్టిన నాటి నుంచి వైద్య వృత్తిలో విశేష సేవలందించారు. ఆమె అనేక ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా... -
పీఎం ఇంటర్న్షిప్ నమోదుకు తుది గడువు ఈనెల 12
పాడేరు రూరల్: పీఎం ఇంటర్న్ షిప్ పథకానికి ఈ నెల 12వ తేదీలోగా నమోదు చేసుకోవాలని కార్మికశాఖ జిల్లా అధికారి టి.సుజాత శుక్రవారం తెలిపారు. 12 నెలల పాటు శిక్షణ ఇస్తూ నెలవారీ సహాయం కింద రూ.5వేల చొప్పున, మరో రూ. 6వేలు ఒకేసారి అందించనున్నట్టు పేర్కొన్నారు. పీఎం ఇంటర్న్ షిప్ స్కీం నమో దుకు అర్హులైన ప్రతి ఒక్కరూ pmintern rhipmca.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యావంతులు అర్హులని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. -
కొండకు నిప్పు
డుంబ్రిగుడ: కొంతమంది ఆకతాయిలు నిప్పుపెట్టడంతో మండల కేంద్రం డుంబ్రిగుకు సమీపంలో గల కొండపై మంటలు చెలరేగా యి. సంతవలస గ్రామ సమీపంలోని కొండపై చెట్లు, మొక్కలు దగ్ధమయ్యాయి. గురువారం చెలరేగిన మంటలు శుక్రవారం నాటికి కూడా అదుపులోకి రాలేదు. దీంతో సమీప గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జీడిమామిడి తోటలు దగ్ధం రాజవొమ్మంగి: మండలంలోని అప్పలరాజుపేట శివారు కొండపోడు భూముల్లో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు మూడు ఎకరాల్లోని జీడిమామిడి తోటలు దగ్ధమయ్యాయి. ఏసు, రాజు సాగు చేస్తున్న ఈ జీడిమామిడి తోటలు ప్రస్తుతం పూత, పిందెల దశలో ఉన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. -
‘మీ కోసం’లో143 అర్జీలు
పాడేరు : సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దినేష్కుమార్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో పద్మలత 143 వినతులు స్వీకరించారు. తాగునీటి సమస్య, భూ సమస్యలు, గృహాల మంజూరు, అటవీ హక్కుల పత్రాల మంజూరు కోరుతూ పలువురు అర్జీలను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ బాబు, డీఆర్డీఏ పీడీ మురళి, టీడబ్ల్యూ డీడీ రజనీ, డీఎంహెచ్వో డాక్టర్ జమల్బాషా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పలకజీడిలో బూడిదైన 20 సంతపాకలు
● కొండపై ఎండిన ఆకులకు నిప్పుపెట్టడంతో ప్రమాదం ● పాకలు కాలడంతో వ్యాపారులకు ఇబ్బందులు కొయ్యూరు: యు.చీడిపాలెం పంచాయతీ పలకజీడిలో గురువారం 20 సంతపాకలు బూడిదయ్యాయి. నాలుగు పాకలు దూరంగా ఉండడంతో అవి మిగిలిపోయాయి. ప్రతి శుక్రవారం పలకజీడిలో సంత నిర్వహిస్తారు. ఇక్కడ కొండను ఆనుకుని సంతపాకలను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం ఎవరో కొండపై ఎండిన ఆకులకు నిప్పుపెట్టారు. ఎండిన ఆకులు కాలుతూ వచ్చి సంతపాకలను అంటుకున్నాయి. అన్నీ తాటాకుల పాకలు కావడంతో మంటలను ఆర్పడం ఎవరికీ సాధ్యం కాలేదు. పైగా గ్రామానికి ఫర్లాంగు దూరంలో పాకలున్నాయి. నీటిని తరలించేందుకు అవకాశం లేకపోయింది. దాదాపుగా 20 గ్రామాలకు చెందిన గిరిజనులు ఈ సంతకు వస్తారు. అల్లూరి జిల్లా అడ్డతీగల, వై.రామవరం, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలాంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు సరకులను తీసుకువస్తారు. వాటిని పాకలలో ఉంచి విక్రయిస్తారు. ఇప్పు డు పాకలు కాలిపోవడంతో వ్యాపారులు సరకులను విక్రయించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిపై యు.చీడిపాలెం సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ మంటలను ఆర్పేందుకు అవకాశం లేకపోయిందన్నారు. పాకలు వేసుకోవాలంటే ప్రస్తుతం ఒక్కో దానికి రూ.పది వేలు ఖర్చవుతుందన్నారు. ఇలా కాకుండా ప్రభుత్వం రేకుల షెడ్లను ఏర్పాటు చేస్తే ప్రమాదాల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందన్నారు. అధికారులు ఆదుకోవాలని కోరారు. -
పార్టీ అధినేతను కలిసిన అరకు ఎంపీ
పాడేరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజారాణి, ఆమె భర్త వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్ గురువారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఆదివాసీల చట్టాలు, హక్కుల అమలుతోపాటు గిరిజన ప్రాంతాల్లో ప్రధాన సమస్యలను ప్రస్తావించిన తీరుపై ఎంపీ తనూజారాణిను అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, విధివిధానాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఏజెన్సీలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తమకు సూచించారని వారు తెలిపారు. -
భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు
కొమ్మాది: భారత దేశం పుణ్యభూమి అని, సనాతన ధర్మానికి పుట్టినిల్లు అని ఇస్కాన్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీల ప్రభుపాదుల శిష్యుడు, ఆధ్యాత్మిక గురువు హెచ్.జి. కలకాంత్ ప్రభూ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక అన్వేషనలకు మార్గ నిర్దేశం చేస్తున్న నేపథ్యంలో ఆయన భీమిలి బీచ్ రోడ్డు సాగర్నగర్ ఇస్కాన్ టెంపుల్లో గురువారం సాయంత్రం ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎంతో అదృష్టవంతులని, ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, శ్రీమధ్భాగవతం వంటివి ఎన్నో భారత దేశం నుంచి ఉద్భవించాయని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంలో ఇస్కాన్ ఎంతగానో ప్రయత్నిస్తోందని, హరినామ సంకీర్తన, సనాతన ధర్మం, భగవంతుని విశిష్టతను ప్రచారం చేయడంలో యువత ముందుకు రావాలని కోరారు. శ్రీకృష్ణుని లీలల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలను, అలాగే అర్జునికి యుద్ధసమయంలో చేసిన గీతోపదేశం ద్వారా మనిషి ఎలా ప్రవర్తించి భగవంతుని చేరుకోవాలనే అంశాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షుడు సాంబదాస్ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని, వంశీ కృష్ణ ప్రభు, భక్తులు పాల్గొన్నారు. -
ఉక్కును కాపాడుకోవడమే నా విధానం: అయోధ్యరామ్
స్టీల్ప్లాంట్ నోటీసులపై అయోధ్యరామ్ గట్టిగానే స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్ స్పందించారు. నోటీసులతో గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే.. వేల గొంతులు ఒక్కటై పిక్కటిల్లేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నోటీసుకు ప్రతిస్పందనగా యాజమాన్యానికి లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల హక్కుల గురించి పోరాడటమే తన విధానమనీ.. స్టీల్ప్లాంట్ని కాపాడుకునేంత వరకూ రోడ్డెక్కి ఉద్యమిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. సీఐటీయూ నాయకునిగా కార్మికుల సమస్యలపై పోరాడటం తమ బాధ్యత అన్నారు. నోటీసులో పేర్కొన్న సమస్యలపై తమ పోరాటం కొనసాగిస్తామే తప్ప భయపడేది లేదని తెగేసి చెప్పారు. -
సమానత్వంతోనే సమాజాభివృద్ధి
సీతమ్మధార: సమానత్వంతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని, మహిళా హక్కులను పోరాడి సాధించుకోవాలని సీఐటీయూ,ఐద్వా, డీవైఎఫ్ఐ ప్రతినిధులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆశీలుమెట్ట, లలితా జ్యుయలర్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, గురజాడ సెంటర్, సెంట్రల్ పార్కు మీదుగా గాంధీపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలకు అవకాశాలు ఇస్తే అన్ని రంగాల్లో ముందుకువెళతారన్నారు. నేటికీ చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం దానిని ఆదాయ వనరుగా చూడటం, అదనంగా మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వడం దుర్మార్గం అన్నారు. అంగన్వాడీ, ఆశా, ఆర్పీ, హాస్పిటల్, షాప్స్లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కుమార్, సీతాలక్ష్మి, వెంకటరెడ్డి, అప్పలరాజు, ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి, సంతోష్, వరలక్ష్మి, కె.మణి, వి.ప్రభావతి, లీలావతి, బొట్టా ఈశ్వరమ్మ, కె. కుమారి తదితరులు పాల్గొన్నారు. -
స్కూటీ అదుపు తప్పి.. మహిళా పోలీస్ దుర్మరణం
మల్కాపురం: స్కూటీ అదుపు తప్పిన ఘటనలో మహిళా పోలీసు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మల్కాపురం ఎస్ఐ శ్యామలరావు తెలిపిన వివరాలివి. అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను భూషణ్(46) కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త స్టీల్ప్లాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మీను భూషణ్ తన కుమార్తెతో కలిసి స్కూటీపై షీలానగర్ నుంచి పోర్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా నగరం వైపు వెళ్తున్నారు. బ్రిడ్జి ఎక్కుతుండగా, ఆమె వెళ్తున్న మార్గంలో ఇద్దరు వ్యక్తులు గడ్డి పట్టుకుని రోడ్డు దాటుతున్నారు. వారిని గుర్తించిన మీను భూషణ్ వెంటనే తన స్కూటీకి అకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో వాహనం అదుపు తప్పి పక్కనున్న డివైడర్ను ఆమె ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మీను భూషణ్కు తలకు, ఆమె కుమార్తెకు శరీరంపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మీను భూషణ్ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
ఉక్కుపాదం
ఉద్యమంపై షోకాజ్ ● నినదించే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న స్టీల్ప్లాంట్ యాజమాన్యం ● స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్కు షోకాజ్ నోటీసు ● యాజమాన్య వైఖరికి నిరసనగా నేడు స్టీల్ సీఐటీయూ ధర్నా సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా గాడిలో పెట్టాలన్నదానిపై ఆలోచనలు చేయకుండా.. ఉక్కు భవిష్యత్తు కోసం పోరాడుతున్న వారిపై జులుం ప్రదర్శించడంలో స్టీల్ప్లాంట్ యాజమాన్యం అత్యుత్సాహం చూపిస్తోంది. వైజాగ్ స్టీల్ప్లాంట్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుల్ని భయపెట్టేందుకు యాజమాన్యం షోకాజ్లు జారీ చేస్తోంది. ఆది నుంచి పోరుబాటలో ముందున్న స్టీల్ప్లాంట్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరంతర పోరాటాల వల్లే.. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నోట నుంచి వచ్చినప్పటి నుంచి ఉద్యమ జ్వాల ఎగసిపడింది. అప్పటి నుంచి విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అన్ని సంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, నిరంతరం రోడ్లపై ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాటం చేయడం వల్ల.. నాలుగేళ్లుగా విశాఖ స్టీల్ప్లాంట్ జోలికి కేంద్రం రాలేకపోయింది. తాజాగా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లుగా రూ.11 వేల కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. తాత్కాలిక ఉపశమనం కల్పించినా.. ఆర్ఐఎన్ఎల్కు ప్రైవేటీకరణ ముప్పు మాత్రం ఇంకా పొంచి ఉండటంతో ఉద్యమ నాయకులు పోరాటం ఆపలేదు. అయితే స్టీల్ప్లాంట్ గురించి ఎక్కడా మాట్లాడకూడదు.. వీఆర్ఎస్, హెచ్ఆర్ఏ, ఉద్యోగులు, కార్మికుల జీతాల కోసం ఎక్కడా నోరు మెదపకూడదంటూ యాజమాన్యం ఆంక్షలు విధించింది. అయినా.. కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు ఎక్కడా వెనకడుగు వేయకుండా హెచ్ఆర్ఏ, విద్యుత్ చార్జీలు, వీఆర్ఎస్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై నిరంతరం రోడ్డెక్కి పోరాడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టీల్ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్కు యాజమాన్యం గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా సీఐటీయూ గౌరవాధ్యక్షునిగా ప్రచారం చేశారంటూ మండిపడుతూ.. ఈ చర్యలపై ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్ డిసిప్లినరీ అథారిటీ డీజీఎం(ఎలక్ట్రికల్) ఉమాకాంత్ గుప్తా నోటీసులో పేర్కొన్నారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ.. స్టీల్ యాజమాన్యం అయోధ్యరామ్కు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై సీఐటీయూ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 8 నుంచి స్టీల్ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం వద్ద ధర్నా చేస్తామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి తెలిపారు. నోటీసులు వెనక్కు తీసుకునేంత వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. -
బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ విజేత విశాఖ ఉక్కు
ఉక్కునగరం: జాతీయ స్థాయి ఇంటర్ స్టీల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను విశాఖ స్టీల్ప్లాంట్ జట్టు కై వసం చేసుకుంది. స్టీల్ప్లాంట్స్ స్పోర్ట్స్ బోర్డు (ఎస్పీఎస్బీ) ఆధ్వర్యంలో దుర్గాపూర్లో మార్చి 3 నుంచి 5 వరకు ఇంటర్ స్టీల్ బ్యాడ్మింటర్ చాంపియన్షిప్ 2024–25 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విశాఖ స్టీల్ప్లాంట్, దుర్గాపూర్, బిలాయ్, భద్రావతి, బొకారో, సేలం, రూర్కెలా, ఐఎస్పీ బర్న్పూర్ తదితర 9 జట్లు పాల్గొన్నాయి. బుధవారం దుర్గాపూర్తో జరిగిన ఫైనల్స్ పోటీల్లో విశాఖ స్టీల్ప్లాంట్ జట్టు చాంపియన్షిప్ గెలుపొందింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో దుర్గాపూర్ స్టీల్ప్లాంట్ ఈడీ పి.మురుగేషన్ విశాఖ స్టీల్ప్లాంట్ జట్టుకు బంగారు పతకం, ట్రోపీ అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ప్లాంట్ ఇన్చార్జ్ సీఎండీ ఎ.కె.సక్సేనా విజేతలను అభినందించారు. -
నలుగురు నగర బహిష్కరణ
అల్లిపురం: నగరంలో ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ పలు తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులకు నగర బహిష్కరణ విధిస్తూ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి ఆర్.హెచ్.కాలనీకి చెందిన కొలగాని పవన్ రాజ్ కుమార్ అలియాస్ పవన్, దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి వడ్లపూడికి చెందిన కాండ్రేగుల లోకనాథ్ వీర సాయి శ్రీనివాస్ అలియాస్ లోకేష్, ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధి ఆర్ అండ్ బీ ప్రాంతానికి చెందిన రావాడ జగదీష్, ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి చినగదిలి ప్రాంతానికి చెందిన నక్కా లోకేష్ అలియాస్ కిట్టులపై ఈ చర్యలు చేపట్టారు. వీరు అక్రమ రవాణా, దోపిడీలు, మాదకద్రవ్యాల వ్యాపారం, గూండాయిజం, అనైతిక కార్యకలాపాలు, భూ కబ్జాలు వంటి అనేక నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వీరంతా అనేక నేరాల్లో శిక్షలు అనుభవించినప్పటికీ, వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెక్షన్–3(1) అండ్ (2) రెడ్ విత్ సెక్షన్ 2(ఎఫ్) అండ్ 2(జీ) కింద అక్రమ రవాణాదారులు, దోపిడీదారులు, మాదకద్రవ్యాల నేరస్తులు, గూండాలు, అనైతిక రవాణా నేరస్తులు, భూ కబ్జాదారుల చట్టం, 1986(చట్టం నం.1) కింద వీరిని ఏడాది పాటు నగరం నుంచి బహిష్కరిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది -
గ్రామీణ బ్యాంక్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ముంచంగిపుట్టు: డ్వాక్రా గ్రూపునకు తప్పుడు లెక్కలతో నోటీసులు జారీ చేసిన ముంచంగిపుట్టు గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్పై తగు చర్యలు తీసుకోవాలని లక్ష్మీపురం సర్పంచ్ కె.త్రినాథ్ అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మీపురం పంచాయతీ కర్లాపొధర్ గ్రామానికి చెందిన మదర్ థెరిసా ఎస్హెచ్జీ గ్రూపునకు గత ఏడాది రూ.లక్షా 60 వేల రుణం మంజూరు అయిందని, అప్పుడు బ్యాంక్ అధికారులు కేవలం 90 వేలు మాత్రమే గ్రూప్కు రుణం సొమ్ము అందించారని చెప్పారు. గ్రూప్ సభ్యులు ఇప్పటి వరకు సుమారు రూ.66 వేల రుణం సొమ్ము దశలా వారీగా చెల్లించారని, గ్రూప్ సభ్యులు కేవలం రూ.24 వేలు మాత్రమే రుణం బకాయి ఉన్నారన్నారు. తాజాగా గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ మదర్ థెరిసా గ్రూపు సభ్యులకు రూ.89,642 బకాయి ఉన్నారని, వెంటనే చెల్లించాలని నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు. దీంతో గ్రూప్ సభ్యులు భయాందోళన చెందుతున్నారని, ప్రతి నెల క్రమం తప్పకుండా బ్యాంక్లో తీసుకున్న రుణానికి సంబంధించిన సొమ్ము చెల్లిస్తున్నా నోటీసులు ఎలా జారీ చేశారని బ్యాంక్ మేనేజర్ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఆయన చెప్పారు. బ్యాంక్ ఉన్నతాధికారులు స్పందించి తప్పుడు నోటీసులు ఇచ్చిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే బ్యాంక్ ముందు గ్రూప్ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. -
చందనోత్సవ ఏర్పాట్లపై ముందస్తు సమీక్ష
● త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ● సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు సింహాచలం: వచ్చే నెల 8న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం, 30న జరిగే చందనోత్సవంలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామని సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. ఈ వేడుకల నిర్వహణపై దేవస్థానం విభాగాధిపతులతో గురువారం ముందస్తు సమీక్ష నిర్వహించారు. గత చందనోత్సవాల్లో చోటుచేసుకున్న లోటుపాట్లపై చర్చించారు. వాటిని పునరావృతం కానీయరాదన్నారు. వారం రోజులపాటు జరిగే వార్షిక కల్యాణోత్సవాల్లో వైదిక కార్యక్రమాలు, చందనోత్సవం రోజు జరిగే వైదిక కార్యక్రమాలపై ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసచార్యులతో చర్చించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. క్యూల ఏర్పాటు, శానిటేషన్, ఇంజినీరింగ్ పనులు, అన్నదానం తదితర పనులపై కూలంకషంగా చర్చించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్తో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో దేవస్థానం డిప్యూటీ ఈవో రాధ, ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, డీఈ హరి, ఏఈవో శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు నరసింగరావు, రాజ్యలక్ష్మి, త్రిమూర్తులు, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
గొలుగొండ డిపోలో వెదురు అమ్మకాలు
గొలుగొండ : ప్రభుత్వానికి టేకు, వెదురు అమ్మకాలు వల్ల ఆదాయం తీసుకురావడం జరుగుతుందని నర్సీపట్నం డీఎఫ్వో శ్యామ్యూల్ తెలిపారు. ఆయన గురువారం గొలుగొండ కలప డిపోను సందర్శించారు. ప్రతి నెల 6వ తేదీన గొలుగొండ కలప డిపోలో వెదురు, టేకు అమ్మకాలు జరుగుతున్న కారణంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం టేకు నిల్వలు తక్కువగా ఉన్నాయని వెదురు అమ్మకాలు జరుగుతున్నట్లు చెప్పారు. గొలుగొండ కలప డిపో ద్వారా ప్రతి ఏటా రూ.కోట్లలో టేకు అమ్మకాలు జరుగుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం వెదురు నిల్వలు అమ్మకాలు జరుగుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కృష్ణదేవిపేట, గొలుగొండ రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎఫ్సీఐలో సాయుధ దళాలకు ముగిసిన శిక్షణ కోర్సు
ఆరిలోవ: విశాఖ ఫుడ్క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్(ఎఫ్సీఐ)లో భారత సాయుధ దళాలకు చెందిన ఫ్రీ రిటైర్మెంట్ కోర్సు విద్యార్థులకు శిక్షణ నిర్వహించారు. డిప్లమో ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలటీ మేనేజ్మెంట్ కోర్సులో 24 వారాల పాటు ఇచ్చిన శిక్షణ గురువారంతో ముగిసింది. నగరంలో ఎన్సీసీ ప్రధాన కార్యాలయం అడ్మిన్ కల్నల్ అమితాబ్ కుమార్ ముఖ్యఅతిథిగా, గౌరవ అతిథులుగా ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, డిఫెన్స్ జాయింట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రాం విద్యా సలహాదారు డాక్టర్ ఉజ్వల కుమార్ ఘటక్ పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కోర్సుకు సంబంధించిన ఉపయోగాలు, నైపుణ్యం గురించి ఎఫ్సీఐ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ వివరించారు. పర్యాటక కార్యకలాపాలు, ఆతిథ్య నిర్వహణ, కస్టమర్ సేవలు, ఈవెంట్ ప్లానింగ్ తదితరవాటి గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఇన్స్ట్రక్టర్లు పార్ధసారథి, కుముదిని, లీలాప్రయదర్శిని, జాషువా, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉక్కుపాదం
ఉద్యమంపై షోకాజ్ ● నినదించే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న స్టీల్ప్లాంట్ యాజమాన్యం ● స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్కు షోకాజ్ నోటీసు ● యాజమాన్య వైఖరికి నిరసనగా నేడు స్టీల్ సీఐటీయూ ధర్నా సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా గాడిలో పెట్టాలన్నదానిపై ఆలోచనలు చేయకుండా.. ఉక్కు భవిష్యత్తు కోసం పోరాడుతున్న వారిపై జులుం ప్రదర్శించడంలో స్టీల్ప్లాంట్ యాజమాన్యం అత్యుత్సాహం చూపిస్తోంది. వైజాగ్ స్టీల్ప్లాంట్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుల్ని భయపెట్టేందుకు యాజమాన్యం షోకాజ్లు జారీ చేస్తోంది. ఆది నుంచి పోరుబాటలో ముందున్న స్టీల్ప్లాంట్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరంతర పోరాటాల వల్లే.. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నోట నుంచి వచ్చినప్పటి నుంచి ఉద్యమ జ్వాల ఎగసిపడింది. అప్పటి నుంచి విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అన్ని సంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, నిరంతరం రోడ్లపై ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాటం చేయడం వల్ల.. నాలుగేళ్లుగా విశాఖ స్టీల్ప్లాంట్ జోలికి కేంద్రం రాలేకపోయింది. తాజాగా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లుగా రూ.11 వేల కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. తాత్కాలిక ఉపశమనం కల్పించినా.. ఆర్ఐఎన్ఎల్కు ప్రైవేటీకరణ ముప్పు మాత్రం ఇంకా పొంచి ఉండటంతో ఉద్యమ నాయకులు పోరాటం ఆపలేదు. అయితే స్టీల్ప్లాంట్ గురించి ఎక్కడా మాట్లాడకూడదు.. వీఆర్ఎస్, హెచ్ఆర్ఏ, ఉద్యోగులు, కార్మికుల జీతాల కోసం ఎక్కడా నోరు మెదపకూడదంటూ యాజమాన్యం ఆంక్షలు విధించింది. అయినా.. కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు ఎక్కడా వెనకడుగు వేయకుండా హెచ్ఆర్ఏ, విద్యుత్ చార్జీలు, వీఆర్ఎస్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై నిరంతరం రోడ్డెక్కి పోరాడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టీల్ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్కు యాజమాన్యం గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా సీఐటీయూ గౌరవాధ్యక్షునిగా ప్రచారం చేశారంటూ మండిపడుతూ.. ఈ చర్యలపై ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్ డిసిప్లినరీ అథారిటీ డీజీఎం(ఎలక్ట్రికల్) ఉమాకాంత్ గుప్తా నోటీసులో పేర్కొన్నారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ.. స్టీల్ యాజమాన్యం అయోధ్యరామ్కు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై సీఐటీయూ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 8 నుంచి స్టీల్ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం వద్ద ధర్నా చేస్తామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి తెలిపారు. నోటీసులు వెనక్కు తీసుకునేంత వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. -
షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం
వి.ఆర్.పురం: రామవరంపాడు గ్రామంలో గురువారం కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక తాటాకు ఇల్లు దగ్ధమైంది. మిర్చి కోతలకు వెళ్లిన సమయంలో సోలా నరసింహారావు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంటలను అదుపు చేసే వారు లేకపోయారు. ఆ ఇంట్లో నరసింహారావు కుటుంబంతోపాటు ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలు 15 మంది ఉంటున్నారు. వారికి కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదు. వారి సామాన్లు, బట్టలు, రేషన్, కష్టపడి సంపాదించిన రూ.లక్షా 30 వేల సొమ్ము మొత్తం కాలిపోవడంతో బోరున విలపించారు. అగ్ని బాధితులకు తక్షణ సహాయం కింద వీఆర్వో ఎం.హైమవతి, ఆర్ఐ మడకం రామకృష్ణ పంచనామా నిర్వహించి 25 కేజీల బియ్యం అందజేశారు. రూ.5 లక్షల ఆస్తి నష్టం -
డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాలకు తుది మెరుగులు
● రానున్న విద్యా సంవత్సరంలో తీరనున్న విద్యార్థుల కష్టాలు ● నిర్మాణ పనులను పరిశీలించిన పీవో అభిషేక్ గౌడ డుంబ్రిగుడ: కొత్త భవనాలను త్వరగా సిద్ధం చేసి ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచి డుంబ్రిగుడలో నిర్వహిస్తామని ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ చెప్పారు. డుంబ్రిగుడలో విద్యాలయం ప్రాంగణ నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి వసతి, తరగతి, సిబ్బంది, ప్రిన్సిపాల్ గదుల నిర్మాణంతోపాటు ప్రహరీ పనులను క్షుణంగా పరిశీలించారు. డుంబ్రిగుడ పాఠశాలను అరకులోయలో చాలీచాలని గదులలో నిర్వహించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, డుంబ్రిగుడలో పాఠశాల భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణానికి భూములిచ్చిన గిరిజనులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించారు. పాఠశాల ప్రారంభానికి ముందే ఉపాధి కల్పిస్తామన్నారు. గిరిజన విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా మానవతా దృక్పథంతో ఆందోళన విరమించాలని కోరారు. తహసీల్దార్ నుంచి పూర్తి నివేదికను తెప్పించుకొని ఉపాఽ ది కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అంతకు ముందు కించుమండలో నిర్మి స్తున్న సంపంగి గెడ్డ వంతెనను పీవో పరిశీలించా రు. ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ జి.కోటి తదితరులు పాల్గొన్నారు. -
రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి అవార్డు
రంపచోడవరం: స్థానిక ఏరియా ఆస్పత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ప్రశంసించారు. ఏరియా ఆస్పత్రికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించిందన్నారు. ఈ ఏడాది జనవరిలో ఏరియా ఆస్పత్రిని నేషనల్ హెల్త్ టీమ్ సందర్శించిందని, ఢిల్లీ నుంచి వచ్చిన టీం సభ్యులు డా.గోపాల్, రియాజ్ వైద్య సేవలను పరిశీలించారని తెలిపారు. ఉత్తమ సేవలకు గాను ఏరియా ఆస్పత్రికి అవార్డు లభించిందన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శేశిరెడ్డి, ఇందిర, తదితరులు అవార్టు సర్టిఫికెట్ను పీవో చేతుల మీదుగా అందుకున్నారు. -
పీఎం ఇంటర్న్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం
సీతంపేట: పీఎం ఇంటర్న్షిప్ స్కీం–2025 నమోదు ఈనెల 12తో ముగియనుందని, అర్హులైన వారు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ లేబర్ కమిషనర్ ఎం.రామారావు తెలిపారు. అక్కయ్యపాలెం మెయిన్రోడ్లోని కార్మిక శాఖ కార్యాలయంలో గురువారం యూనియన్ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం ఇంటర్న్ షిప్ ఏడాది కాలం వ్యవధి ఉంటుందని, ప్రతి నెల రూ.5 వేలు ఆర్థిక సాయంతో పాటు, మరో రూ.6వేలు ఒకసారి ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పీఎం ఇంటర్న్షిప్ స్కీం నమోదు ప్రక్రియను ప్రారంభించిందని pminternship. mca.gov.in వెబ్ సైట్లో ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్న్ షిప్ దరఖాస్తు ద్వారా వివిధ రంగాల్లో అవకాశాలు పొందవచ్చన్నారు. 21 నుంచి 24 ఏళ్ల గల విద్యావంతులు అర్హులని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అనంతుడి పెళ్లిరాటోత్సవం
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవ స్వామి ఆలయంలో గురువారం అనంత పద్మనాభ స్వామి పెళ్లి రాటోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 9 నుంచి 15 వరకు అనంత పద్మనాభస్వామి కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. 10న శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభస్వామి ఉత్సవ విగ్రహాలకు కల్యాణం జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి రాట వేశారు. ముందుగా మహిళలు కుంతీ మాధవస్వామి ఆలయం నుంచి పెళ్లిరాటకు సంబంధించి పూజా సామగ్రిని గాలి గోపురం వద్దకు తీసుకొచ్చారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, భూమి పూజ నిర్వహించి, ఆలయ ప్రధాన అర్చకుడు పి.సీతారామాంజనేయ స్వామి, అర్చకుడు పవన్ ఆధ్వర్యంలో పెళ్లి రాట వేశారు. తదుపరి మహిళలు పసుపు దంచారు. కార్యక్రమంలో పద్మనాభం సర్పంచ్ తాలాడ పాప, కృష్ణాపురం ఎంపీటీసీ సభ్యులు కంటుబోతు లక్ష్మి, భక్త బృందం సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
జాతీయ సమైక్యత శిబిరంలో ఎన్ఎస్ఎస్ వలంటీర్ల ప్రతిభ
అభినందించిన ఏయూ వీసీ రాజశేఖర్ పాడేరు: ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ ఎస్వోఏ యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరంలో పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ప్రతిభ చూపారు. ఈ శిబిరానికి ఏయూ ఎన్ఎస్ఎస్ విభాగం తరపున పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి హాజరయ్యారు. ఏడు రోజులపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ చూపారు. గ్రూప్ డ్యాన్స్ (కూచిపూడి) విభాగంలో ఏయూ ఎన్ఎస్ఎస్ టీం ప్రథమ బహుమతి సాధించింది. ఈ బృందంలో పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి జి.గౌరీశంకర్ను గురువారం ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ రాజశేఖర్ అభినందించారు. -
వీఎంఆర్డీఏ తహసీల్దార్పై ఫిర్యాదులు
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏలో తహసీల్దార్ (భూసేకరణ)గా విధులు నిర్వర్తిస్తున్న కోరాడ వేణుగోపాల్పై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎస్.రాయవరం తహసీల్దార్గా పనిచేసిన సమయంలో చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చట్టపరంగానే కా కుండా సర్వీస్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకో వాలని సీఎం, డిప్యూటీ సీఎం, హెచ్ఆర్డీ మంత్రి, డీజీపీ, సీసీఎల్ఏ, ఇతర అధికారులతో పాటు వీఎంఆర్డీఏ చైర్పర్సన్కు కూడా రాతపూర్వకంగా ఫిర్యా దులు చేశారు. గతంలో తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఎంపీటీసీ, ఎంపీపీలుగా గెలిచినట్లు నిర్ధారణ అయినప్పటికీ.. ఎన్నికల్లో వారిని అనర్హులుగా ప్రకటించని వేణుగోపాల్పై విచారణ చేసి క్రిమినల్ చ ర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఇటువంటి ఆరోపణలు ఉన్న వేణుగోపాల్ను హోం మంత్రి అనిత పీఎస్గా నియమించాలని ప్రయత్నిస్తుండడం సరైన నిర్ణయం కాదని వారు లేఖలో పేర్కొన్నారు. -
పుట్టగొడుగుల సాగు.. లాభాలు బాగు
సేంద్రియ పద్ధతితో మష్రూమ్ పెంపకంమారుమూల బూసిపుట్టు యువతప్రత్యేకత గ్రీన్హౌస్లో ఏడాది పొడువునా పంటప్రయోజనాలు పుట్టగొడుగులో కొవ్వు రహితమైన కేలరీలు ఉంటాయి. రాగి, పొటాషియం, మెగ్నీషియం, జింక్, బి విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లతో కూడా నిండి ఉంటాయి. గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ను ఇవి తగ్గిస్తాయి. మాంసకృత్తులు అధికంగా ఉండి పెరుగుదలకు కావాల్సిన లైసిక్ అనే అమైనో ఆమ్లం వీటిలో ఉండటంతో అధిక జీర్ణశక్తిని కలిగి ఉంటాయి. ముంచంగిపుట్టు: పుట్టగొడుగులు మంచి రుచికరమైన ఆహారమే కాదు.. లాభాలు అందించే సాధనం కూడా. చిన్న గ్రీన్హౌస్ను ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తే మంచి ఫలితాలను అందిస్తుంది. 2015లో కేవలం మూడు వేల రూపాయలతో పుట్టగొడుగుల సాగు ప్రారంభించిన ఇద్దరు స్నేహితులు సాధురాం, హరిబాబు స్వయంకృషితో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం రూ.లక్షా 50 వేల వరకు లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంటిపట్టునే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించి, ఎంతో సులభంగా తెల్ల, లేత ఎరుపు పుట్టగొడుగులను పెంచుతూ ముందుకు సాగుతున్నారు. గత 9 సంవత్సరాలుగా పుట్టగొడుగుల సాగును ఇంటి వద్దనే చేస్తున్న సాధురాం, హరిబాబులు లాభాలు ఆర్జిస్తున్నారు. బూసిపుట్టు గ్రామం నుంచి ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో జరిగే 8 వారపు సంతలకు తీసుకువెళ్లి పుట్టగొడుగులను అమ్ముతున్నారు. దీంతోపాటు కిరాణా షాపులకు ఏడాది పొడవునా సరఫరా చేస్తున్నారు. వీరు సాగు చేసే పుట్టగొడుగులు మంచి రుచిగా ఉండడంతో డిమాండ్ నెలకొంది. దీంతో వీరి వ్యాపారం జోరుగా సాగుతుంది. కేవలం 1000 రూపాయలు పెట్టుబడి పెడితే 1500 వరకు లాభం వస్తుందని, రూ.3 వేలతో తమ సాగు మొదలై నేడు లక్షా 50 వేల వరకు లాభాలు వస్తున్నాయని, రానున్న రోజుల్లో సాగు విస్తరణ మరింత పెంచి, గిరిజన ప్రాంతం అంతా పుట్టగొడుగులు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రభుత్వం, ఐటీడీఏ ద్వారా ఆర్థికంగా రాయితీలు కల్పిస్తే గిరిజన యువతకు సాగుపై అవగాహన కల్పించి, మరింతమంది యువత పుట్టగొడుగుల సాగును చేపట్టే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఇంటిలో ఏర్పాటు చేసిన గడ్డి బ్యాగ్లతో సాధురాం ఇలా పెంచాలి.. లాభాలు -
రాష్ట్రపతి భవన్లో ‘మేటి’కొప్పాక
మన లక్కబొమ్మలకు అరుదైన గౌరవం ● హస్తకళాకారుడు శరత్కు చక్కని అవకాశం రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన లక్కబొమ్మల స్టాల్ యలమంచిలి రూరల్: ఖండాంతర ఖ్యాతినార్జించిన ఏటికొప్పాక హస్తకళకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్రపతి భవన్లో ఏటికొప్పాక లక్కబొమ్మల ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. ఈ నెల 9 వరకు ఈ ప్రదర్శన ఉంటుందని హస్తకళాకారుడు పెదపాటి సత్యనారాయణ శరత్ సాక్షికి తెలిపారు. ఇంతటి అరుదైన అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రదర్శన ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏటికొప్పాక లక్కబొమ్మల ప్రత్యేకతను ప్రస్తావించారని పేర్కొన్నారు. ప్రముఖ సింగర్ మంగ్లీ గురువారం లక్కబొమ్మలను చూసి అబ్బురపడ్డారని తెలిపారు. గతంలో మన్కీ బాత్లో ప్రధాని మోదీ మెప్పును పొందిన లక్కబొమ్మలు మరోసారి రాష్ట్రపతి ప్రశంసలు అందుకోవడం పట్ల ఏటికొప్పాక హస్తకళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సహజసిద్ధమైన రంగులతో కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటున్న లక్కబొమ్మలు చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. -
జీసీసీ గోదాము తనిఖీ
పెదబయలు: మండలంలోని గిరిజన సహకార సంస్థ (జీసిసి) గోదామును పాడేరు జీసీసీ డివిజినల్ మేనేజర్ డి. సింహాచలం గురువారం తనిఖీ చేశారు. జేసీ ఆదేశాల మేరకు గోదాము తనిఖీ చేసి విశాఖ సెంట్రల్ గోదాము నుంచి ఎంత సరకు వచ్చింది.. మండల గోదాములో ఉన్న స్టాక్ ఇక్కడ నుంచి డిపోలకు, ఆశ్రమ పాఠశాలలకు ఎలా సరఫరా అయిందీ పరిశీలించానని చెప్పారు. తనిఖీ నివేదిక జేసీకి అందజేస్తానని తెలిపారు. పౌరసరఫరాల సరకులకు డిపోల్లో సకాలంలో సక్రమంగా అందించాలన్నారు. అనంతరం జీసీసీ కార్యాలయం, ఇతర నిత్యావసర సరకుల గోదాములను తనిఖీ చేశారు. స్థానిక జీసీసీ మేనేజర్ గాసీ, గోదాము ఇన్చార్జి దీనాకుమారి డీఎం వెంట ఉన్నారు. -
ఆకాశమే హద్దు
పాడేరు: మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థినులు హాజరయ్యారు. పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచ్, డిస్ట్రిక్ట్ క్రైం రికార్డు బ్యూరో, క్లూస్ విభాగం, ఎన్డీపీఎస్, సైబర్ క్రైం, కమ్యూనికేషన్స్ తదితర విభాగాల పనితీరును విద్యార్థినులకు ఎస్పీ అమిత్ బర్దర్ వివరించారు. విద్యార్థులు ప్రాథమిక విద్య దశ నుంచే అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. బాలికలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేంత వరకు వివాహాలకు దూరంగా ఉండాలన్నారు. మంచి ఉద్యోగాలతో ఉన్నత రంగాల్లో స్థిరపడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ధీరాజ్, సీఐలు బి.అప్పలనాయుడు, సంజీవరావు, ప్రసాద్, ముక్తేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. పురుషులతో సమానంగా రాణించాలి అతివలు అద్భుతాలు సృష్టించాలి పోలీస్ ఓపెన్ హౌస్లో ఎస్పీ అమిత్ బర్దర్ -
రేపు జాతీయ లోక్ అదాలత్
విశాఖ లీగల్ : విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన జిల్లాలో అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటారు ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్, బ్యాంకు, మనీ రికవరి కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగదాలు(విడాకులు కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. -
మళ్లీ మన్యం గజగజ
జి.కె.వీధిలో అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత చింతపల్లి: జిల్లాలో మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం పలు మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయినట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. గూడెంకొత్తవీధిలో అత్యల్పంగా 7.4 డిగ్రీలు, అరకులోయలో 8, డుంబ్రిగుడ, హుకుంపేట 8.2, చింతపల్లి 8.5, జి.మాడుగుల 8.9, పాడేరు 9.2, పెదబయలు 9.6, ముంచంగిపుట్టు 9.9, కొయ్యూరు 13.7, అనంతగిరిలో 15.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్టు ఆయన తెలిపారు. -
గిరి రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి
రంపచోడవరం: గిరిజన రైతులకు శాసీ్త్రయతతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ముందుండాలని ఉద్యానవన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.గోవిందరాజులు తెలిపారు. పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన 13వ శాసీ్త్రయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు వ్యవసాయంలో మెరుగైన దిగుబడి సాధించేందుకు సరైన దిశానిర్దేశం చేయాలన్నారు. రైతుల కోసం ఏం చేయాడానికై నా కేవీకే సిద్ధంగా ఉందని చెప్పారు. హెచ్వో ముత్తయ్య మాట్లాడుతూ ఏజెన్సీలో కొంత భాగం జాఫ్రా సాగుకు అనుకూలంగా ఉందని, జాఫ్రా సాగు చేసే విధంగా రైతులను ప్రొహించాలన్నారు. కేవీకేలోనే రబ్బరు అంట్లు తయారు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఏడీ చౌదరి మాట్లాడుతూ జీడిమామిడి పంట ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతంలో జీడిపిక్కలను ప్రాసెసింగ్ చేసే యూనిట్లను అభివృద్ధి చేయాలని తెలిపారు. కొత్త సంవత్సరంలో చేపట్టవలసిన ప్రణాళికలను పవర్పాయింట్ ప్రెజెంటేషన్ద్వారా కేవీకే అధిపతి డాక్టర్ కె.రాజేంద్రప్రసాద్ వివరించారు. హెచ్ఆర్ఎస్ హెడ్ డాక్టర్ పి.సి.వెంగయ్య మాట్లాడుతూ నిపుణుల శిక్షణల ద్వారా గిరిజన యువతకు, రైతులకు మేలు జరుగుతుందన్నారు. జీలుగు రైతుల కోసం అవగాహన సదస్సు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, ప్రవీణ్కుమార్, వీరాజంనేయులు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.ఉద్యాన విశ్వవిద్యాలయ సంచాలకులు గోవిందరాజులు -
‘అచ్చెంన్నాయుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి’
డుంబ్రిగుడ: ఉత్తరాంధ్ర శాసన మండలి ఎన్నికల ఫలితాల సందర్భంగా రాష్ట్ర మంత్రి అచ్చెంన్నాయుడు యూటీఎఫ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల మద్దతుతో పోటీ చేసిన పాకలపాటి రఘువర్మను ఉపాధ్యాయులు ఓడించడాన్ని జీర్జించుకోలేక యూటీఎఫ్కు మంత్రి అచ్చెంనాయుడు పార్టీల రంగులు పులమండం తగదన్నారు. విద్యా రంగంలో ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలే రఘువర్మ ఓటమికి కారణమన్నారు. ఈసమావేశంలో జిల్లా కార్య దర్శి ఎస్.కన్నయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.బాలకృష్ణ, రాజారావు పాల్గొన్నారు.పలు రైళ్ల రద్దుతాటిచెట్లపాలెం(విశాఖ) : ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం పలు రైళ్లు ఆయా తేదీల్లో రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖపట్నం–బ్రహ్మపూర్(18526) ఎక్స్ప్రెస్ ఈ నెల 6,7వ తేదీల్లోను, బ్రహ్మపూర్–విశాఖపట్నం(18525) ఎక్స్ప్రెస్ ఈ నెల 7, 8వ తేదీల్లో రద్దయినట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం–పలాస గమ్యం కుదింపు విశాఖపట్నం–పలాస(67289) పాసింజర్ ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు(శుక్ర, ఆదివారం తప్ప) శ్రీకాకుళం రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో పలాసలో బయల్దేరాల్సిన పలాస–విశాఖపట్నం(67290) పాసింజర్ ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు (శుక్ర, ఆదివారం తప్ప) పలాస నుంచి కాకుండా శ్రీకాకుళం నుంచి బయల్దేరుతుంది. -
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడపాడేరు : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఈనెల 8న ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం పరిధిలో ప్రతి ఐటీడీఏతో పాటు మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా కేంద్రం పాడేరులో కనీసం మూడు వేలమందితో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన, ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలను గుర్తించి సత్కరించాలని, వివిధ పథకాల లబ్ధిదారులను గుర్తించి వారికి రుణాల మంజూరు చెక్కులకు అందజేయాలన్నారు. మండల స్థాయిలో మహిళాదినోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. మహిళా ప్రజాప్రతినిధులు, ఎస్హెచ్జీ మహిళలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేసే మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని తెలిపారు. మహిళల విజయ గాథలు అందరికీ తెలియజేయాలని చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వర్చువల్ విధానంలో మాట్లాడారు. రక్షణ, భద్రత, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మహిళలకు తెలియజేయాలన్నారు. మార్చి 8న పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న టైలరింగ్ శిక్షణ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మాలత, డీఆర్డీఏ పీడీ మురళి, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, టీడబ్ల్యూ డీడీ రజనీ, డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, ఎల్డీఎం మాతునాయుడు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి. రవిశంకర్, డీపీఆర్వో పి. గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ యువతకుఉచిత శిక్షణ
పాడేరు రూరల్: జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు విశాఖపట్నం పోర్టు ఆథారిటీ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్ మారిటైం షిప్ బిల్డింగ్ (సీఈఎంఎస్) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు ఆసంస్థ చీఫ్ ఆపరేటింగ్ అధికారి గోపీకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్,డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణులైన యువతీయువకులకు కొరియర్ సూపర్వైజర్,వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, సీఎన్సీ ఆపరేటర్, డిజైన్ ఇంజినీర్ తదితర కోర్సుల్లో 2నుంచి 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. అర్హులైన వారు విశాఖపట్నం సింథియా జంక్షన్లో గల సీఈఎంఎస్ కేంద్రంలో లేదా 7794840934, 8688411100 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
సింహగిరి మాస్టర్ప్లాన్ సవరణకు పరిశీలన
సింహాచలం: సింహగిరి మాస్టర్ప్లాన్ మార్పులు–చేర్పులపై దేవదాయశాఖ టెక్నికల్ అడ్వైజర్ కొండలరావు బుధవారం పరిశీలన జరిపారు. 2000 సంవత్సరం నుంచి సింహగిరి దివ్యక్షేత్రం అభివృద్ధి పనులు ప్రారంభమవగా, ఆరేళ్ల క్రితం వరకు జరిగిన అభివృద్ధి పనులతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆ తర్వాత సింహగిరిపై కొన్ని అభివృద్ధి పనుల్లో మార్పులు చేర్పులతోపాటు, ఏడాదిన్నర కిందట ప్రసాద్ పథకం పనులు ప్రారంభమయ్యాయి. దీంతో మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రసాద్ పథకం పనులతో పాటు ఇంకా దేవస్థానం తరఫున చేయాల్సిన అభివృద్ధి పనుల వివరాలను చేర్చి మాస్టర్ ప్లాన్ని పక్కాగా తయారుచేయాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ టెక్నికల్ అడ్వైజర్ తన బృందంతో వచ్చి ప్రసాద్ పథకం పనులను పరిశీలించారు. సింహగిరిపై గంగధార, అన్నప్రసాదం, బస్టాండ్, కొండదిగు వ పలు ప్రదేశాల్లో తిరిగారు. కొండపైనున్న ప్రాచీన రామాలయం, శివాలయాల అభివృద్ధిపై చర్చించారు. ఏయే అభివృద్ధి పనులు అవసర మో అధికారులు, వైదికులతో చర్చించి పక్కాగా మాస్టర్ ప్లాన్ని రూపకల్పనకు నివేదికలను దేవదాయశాఖ కమిషనర్కు పంపిస్తామన్నారు. ఆయన వెంట దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, రాంబాబు, టూరిజం ఈఈ రమణ తదితరులున్నారు. -
రోగులకు మెరుగైన వైద్య సేవలు
డీసీహెచ్ఎస్ లక్ష్మి ఆదేశంచింతపల్లి: ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కె.లక్ష్మి ఆదేశించారు.ఆమె డీసీహెచ్ఎస్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారిగా బుధవారం చింతపల్లి ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వార్డుల్లో రోగులతో మాట్లాడారు. రోగులకు అందజేస్తున్న వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ ఇందిరా ప్రియాంకను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ను, రక్త నమూనాలను సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ప్రత్యేక నవజాతి శిశు సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. వైద్యాధికారులు,సిబ్బందితో వేర్వేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.ఆస్పత్రిలో వైద్యుల కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. అనంతరం స్థానికంగా నిర్మాణంలో ఉన్న నూతన ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. ఎప్పటిలోగా పూర్తిఅవుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు భారతి,రుక్మిణి,లావణ్య,ప్రభావతి,చంద్రశేఖర్,సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం తగదు
● డీఎల్పీవో కుమార్ చింతపల్లి: ఇంటి పన్నుల వసూళ్లలో పంచాయ తీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, లక్ష్యాలకు అనుగుణంగా సకాలంలో వసూలు చేయాలని పాడేరు డీఎల్పీవో కుమార్ అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాడేరు డివిజన్ పరిధిలో గత ఏడాదితో పోల్చి చూస్తే ఈఏడాది ఇంటి పన్నుల వసూళ్లలో బాగా వెనుకబడినట్టు తెలిపారు. ఈనెలాఖరునాటికి పన్నులు శతశాతం వసూలు చేయాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా ముందుగానే కార్యాచరణ ప్రణాళికలను గ్రామస్థాయినుంచే అమలు చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఇసుకాసురుల అడ్డా
మత్స్యగెడ్డ మధ్యలో వ్యాన్లోలోడ్ చేస్తున్న కార్మికులుమత్స్యగెడ్డలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా అక్రమ తవ్వకాలు భారీగా వ్యాపారం టిప్పర్లతో యథేచ్ఛగా రవాణా పట్టించుకోని అధికార యంత్రాంగం సాక్షి,పాడేరు: జిల్లాలో హుకుంపేట నుంచి పెదబయలు మండలం వరకు విస్తరించిన మత్స్యగెడ్డ ఇసుకాసురులకు కాసులు కురిపిస్తోంది. అక్రమార్కులకు అడ్డాగా మారింది.గిరిజనుల ఇళ్ల నిర్మాణాల కోసమన్న నెపంతో పగలురాత్రీ తేడా లేకుండా మత్స్యగెడ్డ పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అధికారులు చోద్యం చూస్తుండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. హుకుంపేట మండలం కామయ్యపేట,పెదబయలు మండలం గంపరాయి,మంగబంద ప్రాంతంలో మత్స్యగెడ్డలో అక్రమ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కనీసం 100 టిప్పర్ల లోడ్ను ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఇసుక తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతుండడంతో మత్స్యగెడ్డలోని పలు ప్రాంతాల్లో భారీగా గోతులు ఏర్పడ్డాయి. ఏకంగా టిప్పర్లను మత్స్యగెడ్డలోకి దింపి ఇసుకను లోడ్ చేస్తున్నారు.సరిహద్దులోని ఒడిశా వ్యాన్ ఆపరేటర్లు కూడా ఇక్కడ ఇసుకనే సేకరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ,పోలీసు అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్అండ్బీ రోడ్డు నుంచే మత్స్యగెడ్డలో ఇసుక తవ్వకాల దృశ్యాలను ప్రజలంతా చూస్తున్నప్పటికీ అధికార యంత్రాంగానికి మాత్రం కనిపించడం లేదు. రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం మత్స్యగెడ్డ పరీవాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.అయితే వ్యాన్,ట్రాక్టర్ల ఆపరేటర్లు గెడ్డలో ఇసుక అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు.మత్స్యగెడ్డలో తవ్విన ఇసుకను పాడేరు,ముంచంగిపుట్టు, హుకుంపేట,జి.మాడుగుల మండలాలకు తరలిస్తూ రోజూ లక్షలాది రూపాయల ను జేబుల్లో వేసుకుంటున్నా రు.ఇసుకకు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో అనుమతులు లేకపోయినప్పటికీ భారీగా తవ్వేస్తుండడంతో మత్స్యగెడ్డ మరింత ప్రమాదకరంగా మారుతోంది.మత్స్యగెడ్డ.. -
తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
● జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మణరావు రంపచోడవరం: వేసవిలో గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో వి.వి.వి.ఎస్. లక్ష్మణరావు అన్నారు.రంపచోడవరంలో బుధవారం ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా తాగునీటి నాణ్యతను పరిశీలించి, పలు సూచనలు చేశారు.రంపచోడవరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో సుండం శ్రీనివాసదొరతో కార్యాలయానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. -
సెల్ఫోన్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి
చింతూరు: సెల్ఫోన్లు వినియోగించే విషయంలో మహిళలు తగిన జాగ్రత్తలు పాటించాలని చింతూరు సీఐ దుర్గాప్రసాద్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన మహిళా సాధికారత అవగాహనా సదస్సులో సీఐ మాట్లాడుతూ తమ సొంత విషయాలను సెల్ఫోన్ల ద్వారా ఇతరులకు పంపడం వల్ల సైబర్ నేరాల బారిన పడుతున్నారన్నారు. మాదక ద్రవ్యాల కారణంగా యువత తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని తెలిపారు. ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ మహిళలు తమ సెల్ఫోన్లలో పోలీసులకు సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాద సమయాల్లో ఉపయోగ పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థినులకు వారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం, అధ్యాపకులు వెంకటరావు, పద్మ, శకుంతల, శ్రీదేవి, హారతి పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమశాఖడీడీ బాధ్యతల స్వీకరణ
రంపచోడవరం: స్థానిక గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్గా ఎం.రుక్మాండయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో డీటీడబ్ల్యూవోగా, పార్వతీపురం ఐటీడీఏలో డీడీగా పనిచేసినట్టు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానన్నారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఐటీడీఏ పీవో సూచనల మేరకు పనిచేస్తానని తెలిపారు. విధుల్లో చేరిన డీడీని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. డీడీ కార్యాలయం సూపరింటెండెంట్ బి.కిషోర్, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, చక్రధర్, రాజన్న తదితరులు డీడీని మర్యాదపూర్వకంగా కలిశారు. -
సివిల్స్ పరీక్షకు ఉచిత శిక్షణ
● నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ పాడేరు: సివిల్ సర్వీస్ పరీక్షకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా వేపగుంట యూత్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన ఆసక్తి గల యువత ఈనెల 6నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు ఫారాలు ఐటీడీఏ కార్యాలయం వద్ద అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు. 14,15 తేదీల్లో హాల్ టికెట్లను జారీ చేస్తామని, 16న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. మొదటి స్క్రీనింగ్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 20 నుంచి 22 వరకు రెండో స్క్రీనింగ్ టెస్ట్ కోసం హాల్ టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో డిగ్రీ ఉత్తీర్ణులైన గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. -
నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు
చింతూరు: పోలవరం ముంపు బారిన పడుతున్న అర్హులైన ప్రతి నిర్వాసితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చింతూరు ఐటీడీఏ పీవో, ఆర్అండ్ఆర్ అధికారి అపూర్వభరత్ అన్నారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. 41.15 కాంటూరు పరిధి ఫేజ్–1బిలో ఉన్న 32 గ్రామాలకు సంబంధించిన భూసేకరణ, ఆర్అడ్ఆర్ ప్రక్రియపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఎస్ఈఎస్ సర్వేద్వారా ఇప్పటికే చింతూరు, కూనవరం, వీఆర్పురం మండలాల్లో 13,790 కుటుంబాలను గుర్తించినట్టు చెప్పారు. గతంలో చేసిన సర్వేలో జరిగిన పొరపాట్లను గుర్తించి తిరిగి మొత్తం నిర్వాసితుల డేటాను ప్రదర్శించాలని ఆదేశించారు. పరిహారం, పునరావాసం విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా గ్రామసభలు నిర్వహించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. వాయిదా పడిన గ్రామసభలను ఈనెల రెండు లేదా మూడో వారంలో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్టు పీవో తెలిపారు. 41.15 కాంటూరు పరిధి ఫేజ్–1ఎ కు సంబంధించిన 22 గ్రామాలను వచ్చే వరదల నాటికి కాలనీలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఈలోపుగా కాలనీల్లో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పీవో ఆదేశించారు. ఆయా గ్రామాల నిర్వాసితులకు సంబంధించిన ఆధార్, రేషన్, పింఛన్లు, ఉపాధి జాబ్కార్డులు మార్పు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సంబంధిత ఎంపీడీవోలను ఆదేశించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు వరద ముంపునకు గురవుతున్న కొన్ని గ్రామాలకు సంబంధించిన ప్రతిపాదనలను పోలవరం అడ్మినిస్ట్రేటివ్ అధికారికి పంపి వాటిని ముంపు జాబితాలో చేర్చి పరిహారం, పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. భూమికి భూమి ఇచ్చేందుకు, కాలనీల నిర్మాణాలకు కావాల్సిన స్థలాన్ని ఎటపాక మండలంలో త్వరితగతిన గుర్తించాలని, గతంలో ముంపునకు గురికాని 28 గ్రామాల్లో భూమిని గుర్తించడం జరిగిందని చెప్పారు. త్వరలో నిర్వహించబోయే గ్రామసభల షెడ్యూల్ను వెంటనే తయారు చేయాలని పీవో ఆదేశించారు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్ -
విస్తృతంగా వాహన తనిఖీలు
వై.రామవరం: మండల కేంద్రం వై.రామవరం నుంచి లోతట్టు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిలో బుధవారం స్థానిక ఎస్ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్టు ఎస్ఐ తెలిపారు. వాహనాల్లో ప్రయాణికులను, రవాణా చేస్తున్న సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించి, వాహన రికార్డులను తనిఖీ చేశారు. సీఐ బి.నరసింహమూర్తి ఆదేశాల మేరకు ఒకపక్క వాహన తనిఖీలు నిర్వహిస్తూ మరోపక్క నూతన వాహన చట్టాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఆ చట్టాల వివరాలకు సంబంధించిన కరపత్రాలను వాహనదారులకు పంపిణీ చేశారు. -
త్వరితగతిన సర్వేలు
పాడేరు : జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ పీవోలు, 22 మండలాల ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఎంఎస్ఎంఈ, మిస్సింగ్ సిటిజన్స్, ఆధార్ నమోదు, జనన, మరణాల నమోదు, పాఠశాలల టాయిలెట్ల తనిఖీలు, వర్క్ ఫ్రం హోం తదితర సర్వేలు వేగంగా పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆధార్ కార్డులేని పిల్లలు 68 వేల మంది ఉండగా, ఇప్పటి వరకు కేవలం 35 శాతం మాత్రమే నమోదు పూర్తి చేశారన్నారు. ప్రతి ఎంపీడీవో వారంలో కనీసం నాలుగు గ్రామ సచివాలయాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతి వారం రెండు సార్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు పాఠశాలల టాయిలెట్స్ తనిఖీ చేసి ఫొటోలను అప్లోడ్ చేయాలన్నారు. లేని పక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 సర్వే జిల్లాలో ఈనెల 8నుంచి 18 వరకు జరుగుతుందని, ఈనెల 21నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి మార్చి 27లోగా తుది నివేదిక ఇవ్వాలన్నారు. సర్వే పనుల్లో పురోగతి తక్కువగా ఉన్న మండల స్థాయి అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యుటేషన్ వేగవంతం చేయండి మ్యుటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ఫిర్యాదులు, భూ సమస్యల పరిష్కారం, రిజిస్ట్రేషన్, భూ సర్వే, మ్యుటేషన్ ప్రక్రియపై సమీక్షించారు. భూముల సర్వేకు సహకరించని సర్వేయర్లపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్లకు సూచించారు. తహసీల్దార్లు కార్యాలయాలకు హాజరు కావడం లేదని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. రైతు సదస్సులో స్వీకరించిన ఫిర్యాదులను తహసీల్దార్లు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్, సబ్ కలెక్టర్లు శౌర్యమాన్ పటేల్, కల్పనశ్రీ, డీఆర్వో పద్మాలత, సర్వే సహాయ సంచాలకులు దేవేంద్రుడు, 22 మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ -
వైపరీత్యం
మట్టితో గోడలు నిర్మిస్తున్న బాధిత కుటుంబం మోడల్ కాలనీ ప్రకటనలకే పరిమితం పాకల్లో ఉండలేక గిరిజనుల ఇబ్బందులు మట్టిగోడలతో సొంతంగా ఇళ్ల నిర్మాణాలు తుఫాన్ బాధితులకుగూడు కరువు ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించాలి భారీ వర్షాల కారణంగా మా ఇల్లు కొట్టుకుపోవడంతో పాటు మా అక్క కుమారి మృతిచెందింది. నాకు కాళ్లు విరిగిపోగా, మా నాన్నకు మెడ విరిగిపోయింది. నాన్న ఇప్పటికీ లేవలేని స్థితిలోనే ఉన్నాడు. ఇల్లు కొట్టుకుపోవడంతో గుడారంలోనే జీవిస్తున్నాం.ఇంత వరకు ఎవరికీ గృహాలు మంజూరు చేయలేదు. ఇచ్చిన హామీని నెరవేర్చి, పక్కా ఇళ్లు నిర్మించాలి. – కొర్రా సుమిత్ర,బాధిత మహిళ, చట్రాపల్లి గ్రామంసొంత స్థలంఉచితంగా ఇచ్చా తుపాను బీభత్సంతో ఆరు గిరిజన కుటుంబాల ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి.నా ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది.ప్రభుత్వం మోడల్ కాలనీ నిర్మాణం చేపట్టలేదు.తోటి గిరిజన కుటుంబాల కష్టం చూసి తన మెట్ట భూమిని ఉచితంగా ఇచ్చాను.వారితో పాటు నేను కూడా మట్టిగోడలతో ఇళ్లు నిర్మించుకుంటున్నాను. – కొర్రా బలరామమూర్తి,స్థలదాత, చట్రాపల్లి గ్రామం కనికరించని పాలకులు, అధికారులు -
మార్చిలోనే మండుతోంది
సాక్షి,పాడేరు: జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతున్నాయి.మార్చిలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం వేళల్లో 13 నుంచి 23 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా,మధ్యాహ్నం సమయంలో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో మంగళవారం అత్యధికంగా మారేడుమిల్లిలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వై.రామవరంలో 38.5, రాజవొమ్మంగిలో 37.8, కొయ్యూరులో 37.7, రంపచోడవరంలో 37, ఎటపాకలో 36.6, గంగవరంలో 36.4, అడ్డతీగలలో 36.2, పాడేరులో 36.1, చింతూరులో 35.7, జీకే వీధిలో 35.1,పెదబయలులో 34.6,అరకులోయలో 34.2, డుంబ్రిగుడలో 34.1, ముంచంగిపుట్టులో 33.8, చింతపల్లిలో 33.3, జి.మాడుగులలో 33, హుకుంపేటలో 32.7, అనంతగిరిలో 31.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత తగ్గింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మారేడుమిల్లిలో 39 డిగ్రీలు నమోదు -
కొలంబో చేరుకున్న ఐఎన్ఎస్ కుతార్
సింథియా (విశాఖ) : హిందూ మహా సముద్రంపై శ్రీలంక, భారత్ల సముద్ర సంబంధాలను బలోపేతం చేసే దిశగా.. తూర్పు నావికాదళానికి చెందిన ఈస్ట్రర్న్ ఫ్లీట్ షిప్ ఐఎన్ఎస్ కుతార్ కొలంబో చేరుకున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. దీంతో ఓడ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ నితిన్ శర్మ.. శ్రీలంక నేవీ వెస్ట్రన్ నేవల్ ఏరియా కమాండర్ రియర్ అడ్మిరల్ ఎంహెచ్సీజె శిల్వా నుంచి స్వాగతం అందుకున్నారు. అనంతరం ఇరుదేశాల నావికాదళాల మధ్య వృత్తిపరమైన, ఉమ్మడి కార్యాకలాపాలపై కార్యచరణను రూపొందించడంతోపాటు రెండు దేశాల మధ్య దీర్ఘకాల భాగస్వామ్యపంపై చర్చించినట్లు నేవీ అధికారులు తెలిపారు. -
వైపరీత్యం
మట్టితో గోడలు నిర్మిస్తున్న బాధిత కుటుంబం మోడల్ కాలనీ ప్రకటనలకే పరిమితం పాకల్లో ఉండలేక గిరిజనుల ఇబ్బందులు మట్టిగోడలతో సొంతంగా ఇళ్ల నిర్మాణాలు తుఫాన్ బాధితులకుగూడు కరువు ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించాలి భారీ వర్షాల కారణంగా మా ఇల్లు కొట్టుకుపోవడంతో పాటు మా అక్క కుమారి మృతిచెందింది. నాకు కాళ్లు విరిగిపోగా, మా నాన్నకు మెడ విరిగిపోయింది. నాన్న ఇప్పటికీ లేవలేని స్థితిలోనే ఉన్నాడు. ఇల్లు కొట్టుకుపోవడంతో గుడారంలోనే జీవిస్తున్నాం.ఇంత వరకు ఎవరికీ గృహాలు మంజూరు చేయలేదు. ఇచ్చిన హామీని నెరవేర్చి, పక్కా ఇళ్లు నిర్మించాలి. – కొర్రా సుమిత్ర,బాధిత మహిళ, చట్రాపల్లి గ్రామంసొంత స్థలంఉచితంగా ఇచ్చా తుపాను బీభత్సంతో ఆరు గిరిజన కుటుంబాల ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి.నా ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది.ప్రభుత్వం మోడల్ కాలనీ నిర్మాణం చేపట్టలేదు.తోటి గిరిజన కుటుంబాల కష్టం చూసి తన మెట్ట భూమిని ఉచితంగా ఇచ్చాను.వారితో పాటు నేను కూడా మట్టిగోడలతో ఇళ్లు నిర్మించుకుంటున్నాను. – కొర్రా బలరామమూర్తి,స్థలదాత, చట్రాపల్లి గ్రామం కనికరించని పాలకులు, అధికారులు -
కోలుకుంటున్న విద్యార్థినులు
సాక్షి,పాడేరు: కడుపు నొప్పి,వాంతులతో సోమ వారం అస్వస్థతకు గురైన పెదబయలు మండలం తురకలవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కోలుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత అస్వస్థతకు గురవడంతో పెదబయలు,గోమంగి పీహెచ్సీల వైద్యులు,వైద్యసిబ్బంది రాత్రంతా అక్కడే మకాం ఉండి వైద్యసేవలందించారు. మంగళవారం ఉదయం వైద్యపరీక్షలు జరిపి, మందులు ఇచ్చారు. విద్యార్థినుల ఆరోగ్యం మెరుగు పడుతుండడంతో వారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. జాయింట్ కలెక్టర్ విచారణ గిరిజన విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై స్పందించిన జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్గౌడ మంగళవారం తురకలవలస ఆశ్రమ పాఠశాలను సందర్శించి, విచారణజరిపారు. ఉదయం, మధ్యా హ్నం తిన్న ఆహారం వివరాలను జేసీ తెలుసుకున్నారు. అనంతరం స్టోర్ రూమ్ను తనిఖీ చేశారు. పెదబయలు ఎంఈవో పుష్పజోసెఫ్ కూడా ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. -
త్వరితగతిన సర్వేలు
పాడేరు : జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ పీవోలు, 22 మండలాల ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఎంఎస్ఎంఈ, మిస్సింగ్ సిటిజన్స్, ఆధార్ నమోదు, జనన, మరణాల నమోదు, పాఠశాలల టాయిలెట్ల తనిఖీలు, వర్క్ ఫ్రం హోం తదితర సర్వేలు వేగంగా పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆధార్ కార్డులేని పిల్లలు 68 వేల మంది ఉండగా, ఇప్పటి వరకు కేవలం 35 శాతం మాత్రమే నమోదు పూర్తి చేశారన్నారు. ప్రతి ఎంపీడీవో వారంలో కనీసం నాలుగు గ్రామ సచివాలయాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతి వారం రెండు సార్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు పాఠశాలల టాయిలెట్స్ తనిఖీ చేసి ఫొటోలను అప్లోడ్ చేయాలన్నారు. లేని పక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 సర్వే జిల్లాలో ఈనెల 8నుంచి 18 వరకు జరుగుతుందని, ఈనెల 21నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి మార్చి 27లోగా తుది నివేదిక ఇవ్వాలన్నారు. సర్వే పనుల్లో పురోగతి తక్కువగా ఉన్న మండల స్థాయి అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యుటేషన్ వేగవంతం చేయండి మ్యుటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ఫిర్యాదులు, భూ సమస్యల పరిష్కారం, రిజిస్ట్రేషన్, భూ సర్వే, మ్యుటేషన్ ప్రక్రియపై సమీక్షించారు. భూముల సర్వేకు సహకరించని సర్వేయర్లపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్లకు సూచించారు. తహసీల్దార్లు కార్యాలయాలకు హాజరు కావడం లేదని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. రైతు సదస్సులో స్వీకరించిన ఫిర్యాదులను తహసీల్దార్లు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్, సబ్ కలెక్టర్లు శౌర్యమాన్ పటేల్, కల్పనశ్రీ, డీఆర్వో పద్మాలత, సర్వే సహాయ సంచాలకులు దేవేంద్రుడు, 22 మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ -
వైభవంగా గంగమ్మతల్లి ఉత్సవాలు
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు ముంచంగిపుట్టు: మండలంలోని పాత,కొత్త సుజనకోట గ్రామాల్లో గంగమ్మతల్లి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి అఽధిక సంఖ్యలో భక్తులు శతకం పట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు ఘటాలను మోసుకొని వెళ్లి సమర్పించారు.రాత్రి గిరిజన ఆచార సంప్రదాయాల ప్రకారం బుడియాలు సందడి చేశారు.సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి ఆంధ్ర,ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి మంగళవారం తెల్లవారు జాము నుంచే అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సీఆర్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.ముంచంగిపుట్టు కిరాణా వ్యాపారులు గుడ్ల వెంకటరావు,శ్రీనివాసరావులు ఐదు వేల మందికి పైగా భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర,పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గంగమ్మ తల్లిని దర్శించుకుని, చీరలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. -
ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా
● హైవే అధికారులపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆగ్రహం జి.మాడుగుల: లంబసింగి నుంచి జి.మాడుగుల మీదుగా పాడేరు వరకు జరుగుతున్న ఎన్హెచ్ 516ఇ నిర్మాణ పనుల వల్ల ఎగురుతున్న దుమ్ము, ధూళి కారణంగా వాహనచోదకులకు రోడ్డు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా అని హైవే అధికారులపై పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధూళి వల్ల హైవే పక్కన గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికార్లు,కాంట్రాక్టర్లకు ఇప్పటికే చాలాసార్లు తెలియజేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. రోడ్డును నీటితో తడిపితే దుమ్మురేగకుండా ఉంటుందన్నారు. హైవే అథారిటీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ఈప్రాంత ప్రజలతో కలసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తా మని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎస్ఐ షణ్ముఖరావు, కుంబిడిసింగి సర్పంచ్ కృష్ణమూర్తి తదితరులున్నారు. -
చింతూరు ఉద్యోగికిఉత్తమ లైన్మన్ పురస్కారం
చింతూరు: స్థానిక విద్యుత్సంస్థలో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కణితి గణేష్కు ఉత్తమ లైన్మన్ అవార్డు లభించింది. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన లైన్మన్ దివస్ అవార్డుల కార్యక్రమంలో గణేష్కు లైన్మన్ అవార్డుతో పాటు హై పెర్ఫామింగ్ అవార్డును సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ ఘన్శ్యామ్ అందజేశారు. 2022 వరదల సమయంలో అందించిన ఉత్తమ సేవలకు గాను ఆయనకు ఈ అవార్డులు వరించాయి. అవార్డులు పొందిన గణేష్ను ఆశాఖకు చెందిన అధికారులతో పాటు ఉద్యోగులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు -
ఇది కూటమి..
ప్రకృతి వైపరీత్యం వారిపాలిట శాపంగా మారితే కూటమి సర్కార్ వైపరీత్యం మరింత కుంగదీసింది.. కొండచరియలు విరిగిపడడంతో ఇళ్లు కోల్పోయి ఐదు నెలలైనా చట్రాపల్లి బాధితుల వైపు అధికారులుగాని, కూటమి ప్రజాప్రతినిధులుగాని కన్నెత్తి చూడడం లేదు.. దీంతో చేసేది లేక గుడిసెల్లో దుర్భరజీవనం గడుపుతున్న బాధితులు స్వయంగా మట్టితో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.మట్టిగోడలతో రేకుల ఇల్లు నిర్మించుకుంటున్న గెమ్మెలి శ్రీనివాసరావు సాక్షి, పాడేరు: జిల్లాలో జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లి గ్రామాన్ని గత ఏడాది సెప్టెంబర్ 8వతేదీ అర్ధరాత్రి వరద ముంచెత్తింది. కొండ దిగువున ఉన్న ఈ గ్రామంపైకి కొండచరియలు,బురదతో కూడిన వరదనీరు దూసుకువచ్చి బీభత్సం సృష్టించాయి. ఆరు గిరిజన కుటుంబాల నివాసాలు కొట్టుకుపోయాయి.మరి కొంతమంది గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర విపత్తులో కొర్రా కుమారి అనే గిరిజన మహిళ బురదలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచింది.మరో ముగ్గురు గిరిజనులు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఇంత విషాదాన్ని ఎదుర్కొన్న చట్రాపల్లి బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గృహాలు కోల్పోయిన ఆరు గిరిజన కుటుంబాలతో పాటు పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి మోడల్ కాలనీ మంజూరు చేస్తామని ఆ సమయంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ దినేష్కుమార్ ప్రకటించారు. ఐదు నెలలైనా కాలనీ ఊసేలేదు.. చట్రాపల్లి ఘటన జరిగి ఐదు నెలలైనా పాలకులు మోడల్కాలనీ నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. ఆరు కుటుంబాలతో పాటు మరిన్ని కుటుంబాల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఆ మాటే మరచిపోయింది. ఇంత వరకు ఒక్క బాధిత కుటుంబానికి కూడా పక్కా ఇంటి సౌక ర్యం కల్పించలేదు.అప్పట్లో అన్ని విధాల ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా చట్రాపల్లిని మరిచిపోయారు. పూర్తిగా ఇళ్లు కొట్టుకుపోయిన ఆరు కుటుంబాలకు రూ.10వేలు,పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.4వేల చొప్పున మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి చేతులు దులిపేసుకుంది. దీంతో బాధితులు గుడిసెల్లో దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. మట్టి గోడలతో సొంతంగా ఇళ్ల నిర్మాణం కూటమి ప్రభుత్వం పక్కా ఇళ్లు,మోడల్ కాలనీని మంజూరు చేయకపోవడంతో ఇక చేసేదేమీ లేక బాధిత గిరిజనులు సొంతంగా మట్టిగోడలతో ఇళ్ల నిర్మాణాలను ఈవారంలోనే ప్రారంభించారు.ఈ గ్రామానికి చెందిన కొర్రా బలరామమూర్తి తన మెట్ట భూమిని ఉచితంగా తోటి గిరిజనులకు ఇవ్వడంతో వారంతా మట్టిగోడలతో రేకుల ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇంటిల్లపాదీ కష్టపడుతూ ఇల్లు నిర్మించుకుంటున్నారు. గ్రామంలో మట్టి కూడా అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతం నుంచి ట్రాక్టర్ మట్టిని రూ.700 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వర్షం కాలానికి ముందే మట్టిగోడలతో గూడు నిర్మాణం పూర్తి చేసేం లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం తమను విస్మరించడం అన్యాయమని గిరిజనులు వాపోతున్నారు. రెండు సార్లు మా గ్రామానికి వచ్చిన కలెక్టర్ కూడా తమకు న్యాయం చేయలేదని బాధిత గిరిజనులు వాపోతున్నారు. -
మాతాశిశు మరణాలు నివారించాలి
● జిల్లా వైద్యాధికారి జమాల్ బాషా పాడేరు రూరల్: మాతాశిశు మరణాల నివారణకు వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి జమాల్ బాషా తెలిపారు. మండలంలోని ఈదురుపాలెం పీహెచ్సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మాతాశిశు మరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఎవరికై నా టీబీ లక్షణాలుంటే గుర్తించి, పరీక్షలు చేయించాలని తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా పౌష్టికాహారానికి రూ.1,000 చొప్పున ఆరు నెలల పాటు ప్రభుత్వం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు,డాక్టర్లు శ్రీను,నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
భవిత పాఠశాలల అభివృద్ధి కృషి
రంపచోడవరం: భవిత పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఐటీడీఏ సమావేశం హాలులో మంగళవారం సబ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఒక్కో భవిత పాఠశాలలో ఉన్న పరికరాలు, మౌలిక సదుపాయాలు, పిల్లల సంఖ్య తదితర వివరాలను తెలుసుకున్నారు. మానసిక దివ్యాంగ పిల్లలతో పాటు ఇతర దివ్యాంగులను గుర్తించేందుకు ప్రతి గ్రామంలో సర్వే చేసి, నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సర్వేలో అంగన్వాడీ కార్యకర్తలు భాగస్వామ్యులు కావాలన్నారు. సర్వేను ఏజెన్సీ డీఈవో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మానసిక దివ్యాంగ చిన్నారికి ఐడీ క్రియేట్ చేయాలని తెలిపారు. భవిత పాఠశాలల నిర్వహణపై ఆరా తీశారు. ప్రతి గ్రామంలో పోలియోపై అవగహన కల్పించాలని ఆదేశించారు. ఆసక్తి ఉన్న దివ్యాంగులకు పెయింటింగ్, మోకానిజంలో శిక్షణ అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, సీడీపీవో సంధ్యారాణి, ఎస్ఏ అర్చన రమణి, భవిత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం -
చింతపల్లి, జీకే వీధిల్లోసీఐఐ బృందం పర్యటన
చింతపల్లి: జిల్లాలో కాఫీ సాగు, మార్కెటింగ్, ప్రభుత్వాల సహకారం వంటి అంశాలపై వివరాలు సేకరించేందుకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన సీఐఐ బృందం సభ్యులు మంగళవారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించారు. కాఫీతోటలను సందర్శించడంతోపాటు మాతో ట రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విజన్–2047 కార్యక్రమం కింద చేపడుతున్న డాక్యుమెంటేషన్లో భాగంగా కాఫీ సాగుపై ప్రత్యేకంగా వివరాలను సేకరిస్తున్నట్టు బృందంలోని ఎకనామికల్ ఎక్సర్ట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీవాస్తవ తెలిపారు. ఈకార్యక్రమంలో మాతోట సీఈవో చిన్నారావు, గిరిజన వికాస్సంస్థ సీఈవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఏఆర్ఎస్లో చెరకు విత్తనం సిద్ధం
అనకాపల్లి: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 2009ఎ 107, 2009ఎ 252, 2012 ఎ 319, 93 ఎ 145 రకాల చెరకు విత్తనం అందుబాటులో ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇన్చార్జి ఏడీఆర్ పీవీకే జగన్నాథరావు తెలిపారు. కావలసిన రైలులు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ వారిని సంప్రదించాలన్నారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. పిలక దశలో రబీ వరిపైరులో ఎకరాకు 35 కిలోల యూరియా వేసుకోవాలన్నారు. వరి నాటిన 30 రోజుల్లో ఫినోక్సప్రాప్ ఈథైల్ అనే కలుపు మందును ఎకరానికి 250 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితుల్లో వరిలో జింకు లోపం కనిపించే అవకాశం ఉందన్నారు. లోప సవరణకు 2 గ్రాముల జింకు సల్ఫేట్ 5 గ్రాముల యూరియాను ఒక లీటరు నీటితో కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలన్నారు. పొడి వాతావరణం ఉండడం వల్ల అపరాలు బెట్ట పరిస్థితులకు గురయినట్లతే తేలికపాటి తడి ఇవ్వాలని సూచించారు. నువ్వు పంట వేసిన 30 రోజులకు తేలికపాటి తడి ఇవ్వాలన్నారు. ఎకరాకు 20 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలన్నారు. చెరకు కార్శి తోటకు మోళ్లు చెక్కిన పిదప ఎకరాకు వంద కిలోల యూరియా, 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ 80 కిలోమ్యారేట్ ఆఫ్ పొటాష్ దుబ్బులకు దగ్గరగా గోతులు తీసి ఎరువు వేసి మట్టితో కప్పిన తర్వాత తేలికపాటి తడిని ఇవ్వాలన్నారు. చెరకు కార్శి చేసిన వెంటనే ప్రోపికొనజోల్ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. చెరకు మొక్కతోటలు నాటే ముందు ఎకరాకు కార్బొఫూరాన్ 3జి 13 కిలోలు లేదా ఫిప్రొని 0.3జి 10 కిలోలు క్లొరాంట్రినిలిఫ్రొల్ 0.4జి 9 కిలోలు చొప్పున చాళ్లలో 1.2 నిష్పత్తిలో ఇసుకతో కలిపి వేసినట్లయితే పీక పురుగు ఉధృతిని తగ్గించవచ్చని సూచించారు. మామిడి తేనే మంచు పురుగు ఆశిస్తే ఇమిడక్లోప్రిడ్ 0.4 మి.లీ బుప్రోఫెజిన్ 1.6 మి.లీ కర్బెండిజం 1 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. పూత మొదలయ్యే సమయం పిందెలు తయారయ్యే సమయంలో పూత ఆకులపైనే కాకుండా మొదళ్లపైన కొమ్మల పైనా పిచికారీ చేయాలన్నారు. సమావేశంలో డాక్టర్ కె.వి. రమణమూర్తి, డాక్టర్ వి. గౌరీ, డాక్టర్ బి. భవాని, డాక్టర్ చంద్రశేఖర్, పి.వి. పద్మావతి పాల్గొన్నారు. -
మరణించినా.. మరొకరికి కంటి వెలుగై...
గోపాలపట్నం(విశాఖ): మరణించినా మరొకరికి కంటి వెలుగయ్యాడు ఓ యువకుడు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం కప్పరాం గ్రామానికి చెందిన గోకా శివకృష్ణ(34).. జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీనగర్ ఈ–బ్లాక్లో తల్లిదండ్రులు సోమేష్, దమయంతితో కలిసి ఉంటున్నాడు. క్షణికావేశంలో సోమవారం ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తీరని దుఃఖంలో ఉన్నప్పటికీ, శివకృష్ణ తల్లిదండ్రులు సోమేష్, దమయంతి మానవత్వం చాటుకున్నారు. తమ కుమారుడు మరణించినా, మరొకరికి కంటి వెలుగు నింపాలని నిర్ణయించుకున్నారు. మోసిన్ ఐ బ్యాంక్ నిపుణులు శివకృష్ణ నేత్రాలను సేకరించి, కుటుంబ సభ్యులకు అంగీకార పత్రాన్ని అందజేశారు. శివకృష్ణ కుటుంబ సభ్యులకు డాక్టర్ వాణి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లిపాక లైన్మన్కుపురస్కారంఎటపాక: ఉత్తమసేవలందించినందుకు గాను నెల్లిపాక లైన్మన్ బానోత్ దేవేందర్నాయక్కు అవార్డు లభించింది. ప్రపంచ లైన్మన్ దినోత్సవం సందర్భంగా రంపచోడవరంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో విద్యుత్ శాఖ డివిజనల్ అధికారి గాబ్రియల్ చేతులమీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. దేవేందర్నాయక్ పురస్కారం రావడంతో పలువురు ఆయనను అభినందించారు. -
కందిపప్పు అడగొద్దు
● ఈ నెలలో కూడా ఎగనామం పెట్టిన కూటమి ప్రభుత్వం ● అసహనం వ్యక్తం చేస్తున్న కార్డుదారులుమహారాణిపేట(విశాఖ): కూటమి ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) అస్తవ్యస్థంగా మారింది. ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం కార్డుదారులకు అందించే కందిపప్పునకు ఈ నెల కూడా ఎగనామం పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరకుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. కేవలం బియ్యం, పంచదార మినహా మిగిలిన సరుకుల సరఫరా నోచుకోవడం లేదు. కందిపప్పు సరఫరా కూడా రెండు నెలల ముచ్చటగానే ముగిసింది. ఆ తర్వాత నుంచి కందిపప్పు జాడలేదు. ఈ నెల కూడా కంది పప్పును మాత్రం అడగొద్దని అంటున్నారు. కొన్ని నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోగా మార్చి నెలలోనైనా ఇస్తారని కార్డుదారులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ నెలలో కూడా పంపిణీ చేయలేమని కూటమి ప్రభుత్వం చేతులెత్తేయడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నాయకులు బియ్యం కార్డుదారులకు వరాల జల్లు కురిపించారు. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, నూనె, గోధుమ పిండి, రాగి పిండి తదితర సరుకులు అందజేస్తామని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై కనీసం దృష్టి సారించలేదు. చుక్కలు చూపిస్తున్న కందిపప్పు ధర విశాఖ జిల్లాలో 5,12,619 తెలుపు కార్డుదారులు ఉన్నాయి. వీరి కోసం 625 చౌకధరల డిపోలు ఉన్నాయి. దీని ప్రకారం జిల్లాలోని కార్డుదారుల అవసరాలకు అనుగుణంగా 700 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. అయితే గతేడాదిలో రెండు నెలలు మాత్రమే కందిపప్పులు సరఫరా చేశారు. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు కందిపప్పును రూ.67కు అందించేవారు. కొంత కాలంగా ప్రభుత్వం పంపిణీ చేయకపోవడం, బహిరంగ మార్కెట్లో కేజీ ధర రూ.160 వరకు పలుకుతుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు కందిపప్పు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో పప్పన్నానికి దూరం అవుతున్నారు. వచ్చే నెలలో అయినా కందిపప్పు అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. -
నకిలీ పోలీస్ అరెస్ట్
ఎంవీపీకాలనీ(విశాఖ): పోలీసు అధికారినని చెప్పి నగరంలో పలు మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంవీపీకాలనీ పోలీస్స్టేషన్లో మంగళవారం ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఈ కేసు వివరాలు వెల్లడించారు. నగరంలోని బాజీ జంక్షన్కు చెందిన చెల్లుబోయిన లోచన్కుమార్ పోలీసు అధికారినని చెప్పుకుంటూ.. ఫేక్ ఐడీ కార్డులు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రైఫిల్స్, వాకీటాకీలతో దిగిన ఫొటోలు చూపిస్తూ చాలా కాలంగా మోసాలకు పాల్పడుతున్నాడు. ఆయా మోసాలకు సంబంధించి ఇప్పటికే అతనిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతంలో ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్లో ఓ చీటింగ్ కేసు నమోదు కాగా గోపాలపట్నం పోలీసు స్టేషన్లో కొట్లాట కేసు నమోదైంది. తాజాగా నగరంలోని పలు పోలీసు స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలకు వేలం పాట జరుగుతుందని.. తక్కువ ధరకే వాటిని ఇప్పిస్తానని చెప్పి పలువురు దగ్గర నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మరికొందరిని మోసం చేశారు. ఎంవీపీ కాలనీ సెక్టార్–3కి చెందిన బలివాడ రామ్సాయి గోపాల్ అనే వ్యక్తి నుంచి రూ.61,900 వసూలు చేశాడు. గోపాలపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో గతంలో ఓ వ్యక్తి నుంచి ఇదే తరహాలో రూ.26 వేలు వసూలు చేశాడు. అయితే వాహనాలు ఇప్పించాలని రామ్సాయి గోపాల్ ఒత్తిడి చేయడంతో అతని ఫోన్, మేసేజ్లకు సమాధానం ఇవ్వకుండా కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చిన రామ్సాయి గోపాల్ ఇటీవల నగర పోలీసు కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎంవీపీ పోలీసులు లోచన్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. 318(4), 319(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఏసీపీ మూర్తి వెల్లడించారు. లోచన్కుమార్ 2018 నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. సమావేశంలో ఎంవీపీ సీఐ మురళీ, ఎస్ఐ ధనుంజయ్ నాయుడు పాల్గొన్నారు. -
దళారుల చేతుల్లో మోసపోకండి
రంపచోడవరం: దళారుల చేతిలో మోసపోవద్దని జీడిమామిడి రైతులకు రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం సూచించారు. ఐటీడీఏ సమావేశం హాలులో మంగళవారం రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులు, ఎన్జీవోలతో నిర్వహించిన సమావేశంలో పీవో మాట్లాడారు. ఐటీడీఏ ద్వారా గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఎక్కడికక్కడ జీడిపిక్కలు కొనుగోలు చేస్తామని తెలిపారు. జీడిమామిడి రైతులకు అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి వేధించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. జీడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2021–22 సంవత్స రంలో వన్ధన్ వికాస కేంద్రాల ద్వారా 70 మెట్రిక్ టన్నుల జీడిపిక్కలు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈఏడాది వంద మెట్రిక్టన్నుల జీడిపిక్కలు కొనుగోలు చేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. జీడిపిక్కల తూకంలో రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.గిరిజన రైతుల ఉత్పత్తులకు సంబంధించిన యాప్ను ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పురుగు మందులు, యంత్రాలను సరఫరా చేయాలని రైతులు పీవోను కోరారు. ఈ సమావేశంలో ఏపీవో డి.ఎ.వి. రమణ, పీహెచ్వో చిట్టిబాబు, రామరాజు, నవజీవన్ సంస్థ ప్రతినిధి పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వంద మెట్రిక్ టన్నుల జీడి పిక్కలు కొనుగోలు లక్ష్యం రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
జి.మాడుగుల: పాడేరు రోడ్డు మార్గంలో గన్నేరుపుట్టు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. జి.మాడుగుల నుంచి ఎన్హెచ్–516ఈ రోడ్డు మార్గంలో మంగళవారం రాత్రి 7:15గంటలకు సొలభం పంచాయతీ గొడుగురాయి గ్రామానికి చెందిన యువకుడుని తెలుస్తోంది. మోటర్ బైక్పై పాడేరు వైపు వెళుతుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు.ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రగాయాలై అపస్మారకస్థితిలో ఉన్నాడు. ప్రమాద సంఘటన సమాఛారం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు 108వాహనానికి ఫోన్ చేసి పంపించారు.వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై పోలీస్లకు ఫిర్యాదు అందాల్సింది. హైవే రోడ్డు నిర్మాణ పనుల వద్ద హెచ్చరిక బోర్డులు లేకనే ప్రమాదాలు....! ఈ విషయంపై పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ హైవే రోడ్డు మార్గంలో పెద్దపెద్ద గోతులు తవ్వి, అలాగే డైవర్షన్లు ఏర్పాటు చేసి వదిలి పెట్టటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.హైవే నిర్మాణం పనులు జరుగుతున్నా, కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి సమయాల్లో రాకపోకలు సాగించే వాహనదార్లుకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. హైవే ఆథారిటీ అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవటం విచారకరమన్నారు. తక్షణమే నిబంధనల మేరకు వాహన ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఐపీఎల్కు సరికొత్తగా వైఎస్సార్ స్టేడియం
విశాఖ స్పోర్ట్స్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడే తొలి రెండు మ్యాచ్లకు విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి మంగళవారం జిల్లా యంత్రాగం సమావేశమైంది. ముందుగా ఆంధ్ర క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్తో పాటు కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, మ్యాచ్ నిర్వాహక కమిటీ స్టేడియంను పరిశీలించింది. మ్యాచ్లు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. స్టేడియంలో ఆధునికీకరణ పనులు పర్యవేక్షించిన అనంతరం.. ఫ్లడ్లైట్ల పనితీరును పరిశీలించింది. ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా స్టేడియం, స్టేడియం బయట ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? ప్రవేశా మార్గాలు ఏర్పాటు తదితర అంశాలపై కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కాగా.. ఈ నెల 24న రాత్రి ఏడు గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నో సూపర్జెయింట్, 30న ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు డీసీతో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్లకు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో టికెట్లు విక్రయించనున్నారు. రూ.40 కోట్లతో స్టేడియం ఆధునికీకరణ సాంకేతికతను అనుసంధానిస్తూ విశాఖలోని వైఎస్సార్ స్టేడియంను ఆధునికీకరిస్తున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. సీపీ, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ క్యాపిటల్స్ సూచనల మేరకు స్టేడియంలో బాత్రూమ్లను పెంచి అభిమానులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సంక్రాంతి అనంతరం ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టి.. స్టేడియం స్వరూపమే మార్చినట్లు చెప్పారు. దాదాపు 40 కోట్ల వరకు వెచ్చించి, తొలి దశ పనులు పూర్తి చేశామన్నారు. ఫ్లడ్లైట్ల కోసం రూ.9.5 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. 34 వీఐపీ కార్పొరేట్ బాక్స్లతో పాటు రెండు టీమ్ బాక్స్లను సరికొత్తగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. దీంతో బీసీసీఐ సైతం ఈ ఏడాది మరిన్ని మ్యాచ్లను విశాఖ వేదికగా నిర్వహించేందుకు మాటిచ్చిందన్నారు. విశాఖలో మరో ఇంటిగ్రేటెడ్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఎటువంటి ఆలోచన లేదని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి సానా సతీష్బాబు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటుతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సీపీ మాట్లాడుతూ మరోసారి విశాఖ వేదికగా ఐపీఎల్ జరగడం శుభపరిణామన్నారు. ఆటగాళ్ల నుంచి అభిమానుల భద్రత వరకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
విద్యార్థినులను దండించిన వారిపై చర్యలు తీసుకోవాలి
చింతపల్లి: చింతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులను దండించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏకలవ్య పాఠశాలప్రధాన ద్వారం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థి తండ్రి కిల్లో పూర్ణచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన అకౌంటెంట్, ముగ్గురు ఉపాధ్యాయులపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సంఘటన జరిగి సుమారు 15 రోజులు కావస్తున్నా విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారే తప్పితే బాధ్యులపై ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. కలెక్టర్ దినేష్కుమార్, అధికారులు స్పందించి విద్యార్థులను దండించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమం విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటేశ్వరరావు, అదనపు ఎస్ఐ వెంకటరమణలు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్కుమార్ అమరావతి లోని అధికారులతో ఫోన్లో మాట్లాడి విషయాన్ని తెలియజేశారు. రెండు రోజుల్లో సంఘటన బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామన్నారని తెలియజేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. -
14 నుంచి ఉత్తరాంధ్ర స్థాయిలో మెగా పాల పోటీలు
నర్సీపట్నం : ఉత్తరాంధ్ర పాడి పశువుల మెగా పాల పోటీలను విజయవంతం చేయాలని పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్.నరసింహులు వైద్యులకు సూచించారు. నర్సీపట్నం ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు, పశువైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక పాల దిగుబడినిచ్చే మేలు జాతి పశువుల పెంపకంపై ఆసక్తి పెంచడానికి శాసీ్త్రయ పోషణ, యాజమాన్య పద్ధతుల ద్వారా రైతుల్లో పోటీతత్వం పెంపొందించడానికి ప్రభుత్వం ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఉత్తరాంధ్ర స్థాయి మెగా పాల పోటీలను విజయనగరం జిల్లా తోటపాలెంలో నిర్వహిస్తుందన్నారు. ముర్రాజాతి గేదెలు, స్వదేశీ ఆవులు, విదేశీ సంకరజాతి ఆవులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.40 వేలు, మూడో బహుమతి రూ.25 వేలుగా నిర్ణయించారన్నారు. అక్కడ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడడానికి రెండు రోజుల ముందు 12వ తేదీ నుంచి పశువులను అక్కడికి అనుమతిస్తారన్నారు. -
ఎమ్మెల్సీ ఫలితం కూటమికి చెంపపెట్టు
● కూటమి దుష్టపాలనకు టీచర్లు గట్టిగా బుద్ధి చెప్పారు ● గాదె శ్రీనివాసులునాయుడు గెలవడంతో ప్లేటు ఫిరాయించారు ● ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టుకోవద్దు ● మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టులాంటిదని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షకు నిరసనగా టీచర్లు గట్టి షాకిచ్చారని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి రఘువర్మ ఘోర పరాజయం తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులు మాట మార్చారని మండిపడ్డారు. గెలిచిన గాదె శ్రీనివాసులునాయుడు తమ అభ్యర్థే అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రఘువర్మను గెలిపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమావేశాలు నిర్వహించారని, తన ఎక్స్ ఖాతాలో రఘువర్మకు టీడీపీ శ్రేణులు ఓటెయ్యాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజులాంటి సీనియర్ నాయకులు బహిరంగంగానే పిలుపునిచ్చారని పేర్కొన్నారు. వీటితో పాటు రఘువర్మను గెలిపించాలని టీడీపీ నాయకుల పేరుతో పత్రికా ప్రకటనలు కూడా వచ్చాయన్నారు. జనసేన పార్టీ సైతం తన అధికారిక ఖాతాలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రఘువర్మను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గాదె శ్రీనివాసులునాయుడుకి మద్దతు ఇచ్చినట్టు కూటమి నాయకులు ఒక్క ఆధారమైనా చూపించగలరా? అని ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డకు మీ పేరు పెట్టుకోవద్దంటూ ఎద్దేవా చేశారు. ఇది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వచ్చిన వ్యతిరేకతకి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఉద్యోగుల్లో దాదాపు 35 శాతంగా ఉన్న టీచర్లు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ వైఫల్యం బయటపడిందన్నారు. విద్యాశాఖను నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్ టీచర్ల సమస్యలు తీర్చడంలో విఫలం కావడంతోనే వారు ప్రభుత్వానికి గట్టిగా షాకిచ్చారని తెలిపారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయలేదు.. ఐఆర్ ఇవ్వలేదు.. మూడు డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, ఉద్యోగుల పింఛన్ విధానంపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఉద్యోగులకు ఈ ప్రభుత్వం రూ.26 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. స్వయాన సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యాశాఖలోనే ఓటమి అంటే.. లోకేష్ అసమర్థ పాలనగానే చెప్పుకోవచ్చన్నారు. కూటమి పాలనలో ఉత్తరాంధ్రపై వివక్ష కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వివక్ష చూపుతోందని, అమరావతి అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించి, విశాఖకు రూపాయి కూడా కేటాయించలేదన్నారు. రుషికొండ బీచ్కి తమ హయాంలో 2020లో బ్లూఫ్లాగ్ హోదా వస్తే, కూటమి ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక ఆ హోదా పోయిందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకెళ్లిందన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మూలపేట పోర్టు, నర్సీపట్నం, పాడేరు, విజయనగరంలో మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్.. ఇవన్నీ తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులేనన్నారు. ఇప్పటికై నా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, ముఖ్యనాయకులు మొల్లి అప్పారావు, గండి రవికుమార్, జిల్లా అనుబంధ విభాగ, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
హోలీకి ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: హోలీ పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ● చర్లపల్లి–షాలిమర్(07703) హోలీ స్పెషల్ చర్లపల్లిలో ఈ నెల 9, 16వ తేదీల్లో (ఆదివారం) రాత్రి 7.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.02 గంటలకు బయల్దేరి మరుసటిరోజు (మంగళవారం) తెల్లవారు 2 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షాలిమర్–చర్లపల్లి(07704) హోలీ స్పెషల్ ఈ నెల 11, 18వ తేదీల్లో (మంగళవారంలో) ఉదయం 5 గంటలకు షాలిమర్లో బయల్దేరి అదేరోజు రాత్రి 7.50 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.52 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ● చర్లపల్లి –సంత్రగచ్చి(07705) హోలీ స్పెషల్ ఈ నెల 7, 21వ తేదీల్లో(శుక్రవారం) ఉదయం 7.15 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదేరోజు రాత్రి 7.45గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.47 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సంత్రగచ్చి–చర్లపల్లి(07706) హోలీ స్పెషల్ సంత్రగచ్చిలో ఈ నెల 8, 22వ తేదీల్లో (శనివారం) మధ్యాహ్నం 12.35 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 3.50 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.52 గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 4.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. -
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
అభ్యర్థి వచ్చిన ఓట్లు కె.విజయ గౌరి 5,804 డాక్టర్ కె.రాధాకృష్ణ 30 గాదె శ్రీనివాసులు నాయుడు 7,210 దుర్గారావు 67 ఎన్.సూర్య ప్రకాష్ 85 ఎస్.ఎస్.పద్మావతి 15 పి.రఘువర్మ 6,845 పి.శివప్రసాద్ రావు 15 ఆర్.సత్యనారాయణ 31 డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు 33 మొత్తం 20,135 -
నాటకీయ పరిణామాలతో ఉద్రిక్తత
సోమవారం రాత్రి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ రహదారిపై ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులుగాదె విజయం 9 గంటలకు ఖరారైంది. ఆర్వో కూడా సంతకం చేసి వెళ్లిపోయినా అధికారికంగా ప్రకటించకపోవడం, ధృవీకరణ పత్రం జారీ చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు పీఆర్టీయూ ప్రతినిధులు గ్రహించారు. టీడీపీ నాయకులు గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్ రాత్రి 9.30 గంటల సమయంలో కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉపాధ్యాయుల్లో మరింత అనుమానాలు రేకెత్తాయి. గెలువు విషయంలో ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతుందేమోనని గ్రహించారు. వెంటనే అధికారికంగా ప్రకటించి.. ధృవీకరణ పత్రం జారీ చెయ్యాలంటూ పట్టుబట్టారు. కానీ.. కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గాదె మద్దతుదారులు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మెయిన్ ఎంట్రన్స్ రహదారిపై ధర్నాకు దిగారు. వెంటనే ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలంటూ నినదించారు. ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేపడుతున్నారని గ్రహించిన టీడీపీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. చివరికి పోలీసులు కౌంటింగ్ కేంద్రంలో ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడు మద్దతుదారులతో ఫోన్లో మాట్లాడి.. ఇక్కడ అంతా సవ్యంగానే ఉందని చెప్పడంతో నిరసన ఉపసంహరించుకున్నారు. -
జీపుబోల్తా.. ఒకరి మృతి
● బ్రేకులు ఫెయిలై ప్రమాదం ● డీజిల్ లీకై మంటలు వ్యాపించి దగ్ధం గూడెంకొత్తవీఽధి: మండలంలోని ఎర్రగెడ్డ సాగులు ఘా ట్ రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఎర్రగెడ్డనుంచి ప్రయాణికులతో ఆర్వీనగర్ వారపు సంతకు వస్తున్న జీపు బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పి బోల్తాపడింది. దీనికి తోడు డీజిల్ లీకై పెద్దఎత్తున మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న వారిలో ఎర్రగెడ్డ గ్రామానికి చెందిన మర్రి వెంకటరావు(60) సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. కొర్రా పిడుగో అనే గిరిజనుడి కాళ్లు విరిగిపోగా, డ్రైవర్తో సహా మరో ఆరుగురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు హుటాహుటిన వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో గూడెంకొత్తవీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఆస్పత్రికి పంపా రు. వెంకటరావు మృతదేహాన్ని పోస్టుమార్టానికి చింతపల్లి ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ అప్పలసూరి తెలిపారు. -
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ జనరల్ విద్యార్థులకు 26 పరీక్ష కేంద్రాలు,ఒకేషనల్ విద్యార్థులకు ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.అన్ని కేంద్రాల వద్ద,గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నిఘానీడలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. విద్యార్థులు ఉదయం 8గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. మహిళా పోలీసులు,ఇతర సిబ్బంది తనిఖీలు జరిపిన తరువాతే విద్యార్థులను రూమ్ల్లోకి పంపారు. ఇంటర్ జనరల్ విద్యార్థులు 5,454 మందికి గాను 5,310 మంది పరీక్ష రాయగా, 144 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు 1,215మందికి గాను 1,135మంది పరీక్ష రాయగా 80మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపారు. తొలిరోజు ప్రశాంతం జనరల్ విద్యార్థులు 144 మంది, ఒకేషనల్ విద్యార్థులు 80 మంది గైర్హాజరు -
బెత్తం దెబ్బ
కూటమికిఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి టీచర్లు ఝలక్ పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడికే అయ్యవార్లు పట్టం వర్మ ఓట్ల లెక్కింపుతో గాదెకు 12,035 ఓట్లు వచ్చినట్లుగా ప్రకటన ● కూటమి ప్రభుత్వం మద్దతిచ్చిన పాకలపాటి రఘువర్మకు షాక్ ● టీడీపీ, జనసేన నేతలు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగినా పట్టించుకోని ఉపాధ్యాయులు ● ఫలించని ప్రజాప్రతినిధుల ప్రలోభాల ఎర ● తొమ్మిది నెలల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం ఈ ఫలితం సాక్షి, విశాఖపట్నం/విశాఖ సిటీ : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి షాకిచ్చాయి. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే కూటమి పార్టీలకు ఉపాధ్యాయులు బెత్తం దెబ్బ రుచి చూపించారు. పాకలపాటి రఘువర్మను గెలిపించేందుకు టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు కాళ్లకు బలపాలు కట్టుకొని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలియతిరిగినా టీచర్లు కనికరించలేదు. ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.10 వేలు వరకు ఇచ్చి ప్రలోభాల ఎర వేసినా లొంగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడుకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులా పరిణమించాయి. ప్రలోభాల ఎర వేసినా.. ఏజెంట్ల అవతారమెత్తినా.. పాకలపాటి రఘువర్మ విజయానికి కూటమి నేతలు ఎన్ని ప్రలోభాల ఎర వేసినా.. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు ఎలక్షన్ ఏజెంట్ల అవతారమెత్తినా ఉపాధ్యాయులు కనికరించలేదు. వాస్తవానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఇటువంటి గౌరవప్రదమైన ఎన్నికలకు కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులిమింది. ఏపీటీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాకలపాటి రఘువర్మకు ముందు టీడీపీ, జనసేనలు మద్దతుగా నిలిచాయి. నామినేషన్ వేసిన దగ్గర నుంచి పోలింగ్ వరకు ఆ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రఘువర్మ విజయం నల్లెరుపై నడకే అన్న తరహాలో ప్రచారం చేసుకుంటూ పోయారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మద్దతు ఉన్న రఘువర్మను గెలిపిస్తేనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని వాట్సాప్ గ్రూపుల్లో విస్తృత ప్రచారం కల్పించారు. ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేర్వేరుగా ప్రత్యేక పార్టీలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.10 వేలు వరకు ముట్టజెప్పారు. పోలింగ్ రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేంద్రాల వద్ద టెంట్లలో ఎన్నికల ఏజెంట్ల తరహాల్లో ఓటర్ స్లిప్పులను సైతం అందించారు. ఇలా ఎన్ని చేసినా ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోలేదు. తొమ్మిది నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం, రాష్ట్ర ఖజానాను నింపుకోవడం కోసం విద్యుత్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వంపై అనతికాలంలోనే అన్ని వర్గాలకు ఆశలు సన్నగిల్లాయి. ప్రధానంగా ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు దృష్టి పెట్టకపోవడంతో పాటు పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ వంటి వాటి ప్రస్తావనే చేయకపోవడంపై కూడా ఉద్యోగ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ప్రభుత్వానికి తమ దెబ్బ రుచి చూపించారు. టీడీపీ, జనసేన మద్దతిచ్చిన పాకలపాటి రఘువర్మను ఓడించి గాదె శ్రీనివాసులునాయుడును గెలిపించారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇంతటి వ్యతిరేకతను మూట్టగట్టుకోవడంతో కూటమి శ్రేణులు డీలా పడ్డాయి. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు రంగంలోకి దిగినప్పటికీ ఓటమి చడిచూడడంతో జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈవీఎం కాదు.. బ్యాలెట్ విజయమిది.! గాదె విజయానంతరం పీఆర్టీయూ మద్దతుదారులతో కౌంటింగ్ కేంద్రం వద్ద కోలాహలం ఏర్పడింది. ఇది ఈవీఎం విజయం కాదనీ... బ్యాలెట్ బాక్సుల విజయమని కొందరు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించడం గమనార్హం. -
తొలి నుంచి గాదెకు ఆధిక్యం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 11.30 గంటలకు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను 20 టేబుల్స్కు సరిపడేలా కట్టలు కట్టారు. మొత్తం 20,971 ఓట్లు పోలవ్వగా 656 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. దీంతో 10,068 ఓట్లను మ్యాజిక్ ఫిగర్గా ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆది నుంచీ గాదె శ్రీనివాసులనాయుడు ఆధిక్యంలో కొనసాగారు. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి గాదె 365 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. గాదెకు మొదటి ప్రాధ్యాన్యత ఓట్లు 7,210 రాగా, రఘువర్మకి 6,845 ఓట్లు, విజయ గౌరికి 5,804 ఓట్లు వచ్చాయి. మధ్యాహ్నం విరామం అనంతరం ఎలిమినేషన్ రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగింది. ప్రతి దశలోనూ గాదె ఆధిక్యం కొనసాగింది. మూడో స్థానంలో ఉన్న విజయ గౌరికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత లెక్కింపు చేపట్టారు. 9వ రౌండ్లో గాదె 9,237 ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా.. వర్మకు 8,527 ఓట్లు వచ్చాయి. దీంతో తన ఓటమి ఖరారైందని భావించిన వర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి నిరాశగా వెనుదిరిగారు. అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఓట్లు సాధించేందుకు గాదె ఇంకా 831 ఓట్ల దూరంలో నిలిచారు. 1967 ఓట్ల మెజారిటీతో విజయం అప్పటికే వర్మ బయటికి వెళ్లిపోవడంతో వర్మకి చెందిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లని లెక్కించాలా.. గాదె విజయాన్ని ధృవీకరించాలా అనే అంశంపై రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్, ఎన్నికల అబ్జర్వర్ ఎం.ఎం.నాయక్ ఎలక్షన్ కమిషన్కి అభ్యర్థించారు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేంతవరకూ లెక్కించాలని చెప్పడంతో వర్మకి వచ్చిన ఓట్ల లెక్కింపును సాయంత్రం 6.45 గంటలకు ప్రారంభించారు. గాదె మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లకు చేరుకోగానే అధికారికంగా గాదె విజయం సాధించారు. మిగిలిన ఓట్ల లెక్కింపును కూడా పూర్తి చేశారు. చివరకు గాదెకు 12,035 ఓట్లు వచ్చాయి. రిటర్నింగ్ అధికారి గాదె విజయం సాధించినట్లు సంతకం చేసి ఎన్నికల కమిషన్ సంతకం కోసం విజయవాడ పంపించారు. -
కవలలు–ఒకే సారి డాక్టర్లయ్యారు
రాజవొమ్మంగి: మండలంలోని తంటికొండ గ్రామానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు ముర్ల సౌజన్య, శరణ్య ఒకే సారి ఎంబీబీఎస్ పట్టా తీసుకుని సోమవారం గ్రామానికి రావడంతో స్నేహితులు, బంధువులు వారిని అభినందనలతో ముంచెత్తారు. సౌజన్య, శరణ్య చిన్నప్పటి నుంచి కలిసే చదువుకొన్నారు. నీట్లో ర్యాంకు పొందడంతో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చాయి. వీరి ఐదేళ్ల చదువు పూర్తి కావడంతో ఈనెల 2న రంగరాయ మెడికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికెట్లు పొందారు. దీంతో తల్లిదండ్రులు రాము, సత్యవతిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మండలంలోని పలువురు ఆ పిల్లలను, వారి తల్లిదండ్రులను అభినందించారు. కాగా పిల్లల తండ్రి రాము కాకినాడలో రవాణాశాఖలో పని చేస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన గిరిజన యువతి కొయ్యూరు: నడింపాలెంకు చెందిన గిరిజన యువతి సుమర్ల మహేశ్వరి మానస కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల నుంచి సోమవారం ఎంబీబీఎస్ పట్టాను అందుకున్నారు. చిన్నతనంలోనే మానస తండ్రిని కోల్పోయింది.తల్లి సరస్వతి పట్టుదలతో మానసను చదివించారు. టెన్త్ వరకు భీమునిపట్నంలో చదివిన మానస ఇంటర్మీడియెట్ రాజమండ్రిలో పూర్తి చేశారు.నీట్తో ర్యాంకు రావడంతో కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించింది. ఆమె తల్లి సరస్వతి మాట్లాడుతూ తన కుమార్తె ఎంబీబీఎస్ పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. -
భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం
● నిమ్మలపాలెంలో రోడ్డు ప్రమాదం ● అదుపు తప్పిన ద్విచక్ర వాహనం ● భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు కొయ్యూరు: డౌనూరు పంచాయతీ నిమ్మలపాలెం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతపల్లి మండలం వేనంకు చెందిన పాంగి భానుచందర్ (45) మృతి చెందాడు. ఆయన తన స్వగ్రామం నుంచి డౌనూరు మీ సేవ కేంద్రానికి భార్య జ్యోతితో కలిసి బైక్పై వస్తున్నారు. అయితే నిమ్మలపాలెం గ్రామం వద్ద వాహనం అదుపుతప్పింది. దీంతో భానుచందర్ కిందపడడంతో తలకు తీవ్ర గాయమైంది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఘటన జరిగిన ప్రాంతంలోనే ఆయన మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. భార్య జ్యోతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికులు 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం చెందడంపై ఆమె గుండెలవిసేలా రోదించారు. ఆమెను చూసి స్థానికులు కంటతడిపట్టారు. ఈ సంఘటనపై కొయ్యూరు ఎస్ఐ కిషోర్వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉచిత వివాహాలకు దరఖాస్తులు
కొయ్యూరు: పేదలకు సామూహిక వివాహా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు దాన ధర్మ చారిటబుల్ సంస్థ సేవా ప్రతినిధి డి.ప్రసాద్, టీటీడీ ధర్మ ప్రచారక్ పద్మరాజు చెప్పారు. వారు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సామూహిక వివాహాది కార్యక్రమంలో భాగంగా వధూవరులకు నూతన వస్త్రాలు, కాలిమెట్టెలు, తలంబ్రా లు, కర్పూర, పూల దండలను సంస్థ సమకూరుస్తుందన్నారు. ఈ మేరకు అర్హలైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివాహాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు మహిళలు 18 సంవత్సరాలు దాటి, పురుషులు 21 సంవత్సరాలు నిండి ఉండాలని సూచించారు. చినజీయన్ స్వామి ఆశీస్సులతో ఏప్రిల్లో వివాహాలు నిర్వహిస్తా రని చెప్పారు. మరిన్ని వివరాలకు 73822 73833, 83670 82 887, 9014294500 లను సంప్రదించాలని కోరారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు పాడేరు: జిల్లాలో తాగునీటి సమస్యలు చేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధి కారి కె.ఎస్.జవహర్కుమార్ నాయుడు సోమవారం ఒక ప్ర కటనలో తెలిపారు. ప్రస్తుతం తాగునీటి ఎద్దడి లేదని, ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఎదురైతే 0893529 8900 అనేఫోన్ నంబర్కు కాల్చేసి ఫి ర్యాదు చేయాలని పేర్కొన్నారు. గత నెల 1న ప్రారంభమైన సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం కింద జి ల్లా వ్యాప్తంగా 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాల ను పరిశీలించినట్టు పేర్కొన్నారు. జిల్లా లో పీడబ్ల్యూఎస్ ప థకాలు, హ్యాండ్ పంపులు పరిశీలించి అవసరమైన వా టిని మరమ్మతులు చేపట్టినట్టు తెలిపారు. -
చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు సిగ్గుచేటు
పాడేరు రూరల్: వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దంటూ సీఎం చంద్రబాబునాయుడు దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని పాడేరు మాజీ ఎమ్మెల్యే, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి పనులు చేసినా సహించేది లేదని చెప్పడం సీఎం చంద్రబాబునాయుడు తగదన్నారు. జగనన్న ప్రభు త్వ హయాంలో పార్టీలకు, కులమతలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చి సుపరిపాలన చేశారని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం పిచ్చి చేష్టలు చేస్తు కాలం గడుపుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి గడ్డుకాలం మొదలైందని, ప్రజలందరూ చమరగీతం పాడతారని చెప్పారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి -
వన్యప్రాణుల సంరక్షణ ఎంతో అవసరం
చింతూరు డీఎఫ్వో బబితచింతూరు: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని చింతూరు డీఎఫ్వో బబిత అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ దితనోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో సోమవారం చింతూరులో ఆశాఖ ఉద్యోగులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అటవీ కార్యాలయంలో వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతపై డీఎఫ్వో బబిత విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడకుండా చూడాలని, అడవులను రక్షించడం ద్వారా పర్యావరణం కాపాడవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో రేంజర్లు ఆజాద్, అబ్బయదొర, డీఆర్వో శ్రీనివాస్, ఎఫ్ఎస్వోలు చిన్నభిక్షం, రాజమ్మ, వీరభద్రయ్య పాల్గొన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు విద్యార్థులే అంబాసిడర్లు కూనవరం: ప్రపంచంలో కొన్ని వన్యప్రాణులు అంతరించి పోతున్నాయని, అలా అంతరించి పోకుండా పరిరక్షించాల్సిన బాధ్యతను విద్యార్థి దశ నుంచే అలవర్చుకుని, వన్యప్రాణుల సంరక్షణకు అంబాసిడర్లుగా వ్యవహరించాలని స్థానిక రేంజ్ ఆఫీసర్ ఎం.కరుణాకర్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా రేంజ్ పరిధిలోని కోతులగుట్ట ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాల, కేజీబీవీ, నరసింహాపురంలోని ఏహెచ్ఎస్ బాలుర పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులుఅందజేశారు. ఈకార్యక్రమంలో గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ఏ హెచ్ఎస్ నరసింహాపురం ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, డీఆర్వో అనిల్కుమార్, ఎఫ్ఎస్వోలు సాయి వెంకటరమణ, విజయలక్ష్మి, దేశాయి, శంకర్రెడ్డి, ప్రసన్న కుమార్, ఎఫ్బివోలు నాగలక్ష్మి, జంపన్నరాజు, దుర్గాభవాని, బాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత వి.ఆర్.పురం: వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని సబ్ డివిజన్ ఫారెస్టు అధికారి కె.వి.ఎస్.రాఘవరావు అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా స్థానిక అటవీ శాఖాధికారులు స్థానిక కేజీబీవీ విద్యార్థులతో రేఖపల్లిలో ర్యాలీ నిర్వహించారు. వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ ఫారస్ట్ అధికారి రాఘవరావు మాట్లాడుతూ వన్యప్రాణులను సంరక్షించుకోవడంతో ప్రకృతి మనుగడ సాధ్యమవుతుందన్నారు.ఆటవీ శాఖ అధికారులు ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. -
కొవ్వొత్తులతో మహిళల ర్యాలీ
సాక్షి, పాడేరు: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఉమెన్ ఎంపవర్మెంట్పై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్గౌడ,సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్లు సోమ వారం సంతకాలు చేసి దీనిని ప్రారంభించారు. ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి ఆధ్వర్యంలో కుమ్మరిపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి కలెక్టర్ కార్యాలయం జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాలికలు,మహిళల హక్కులు,చట్టాలపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు సీడీపీవో ఝాన్సీరాణి,ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఘనంగా మహిళా దినోత్సవ వారోత్సవాలు -
మెరుగైన వైద్య సేవలందించాలి
● పీహెచ్సీల్లో కాన్పుల సంఖ్య పెంచండి ● ఐటీడీఏ పీవో సింహాచలం రాజవొమ్మంగి: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు నమ్మకం కలిగేలా మెరుగైన వైద్య సేవలందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. ఆయన సోమవారం రాజవొమ్మంగి పీహెచ్సీను ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. హాజరు రికార్డు పరిశీలించి, ఆ సమయంలో గైర్హాజరైన వారి వివరాలు పరిశీలించారు. రిజిష్టర్లు పరిశీలించి ఈ నెల కేవలం నాలుగు ప్రసవాలు మాత్రమే పీహెచ్సీలో జరగడంపై అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి గర్భిణుల సర్వే చేయాలన్నారు. రాజవొమ్మంగి 24 గంటల మాతా శిశు ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని మెడికల్ ఆఫీసర్ సుష్మను ఆదేశించారు. ఈ పీహెచ్సీలో పురుడుపోసేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నా ఎందుకు ప్రసవాల సంఖ్య పెరగడం లేదని ప్రశ్నించారు. అంతకు ముందు ఆయన స్థానిక బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు. జీసీసీ సూపర్ బజార్లో సరకుల విక్రయం, వాటి నిల్వలను పరిగణనలోకి తీసుకొన్నారు. స్థానిక బస్షెల్టర్లో ప్రయాణికులు నిలిచేందుకు నీడ లేదని, మరుగుదొడ్లు లేవని ఇటీవల ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినత పత్రానికి స్పందించిన ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ అంశంపై బస్షెల్టర్ ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై స్థానిక తహసీల్దార్ సత్యనారాయణతో సంప్రదించారు. -
సమర్థంగా దీపం–2 పథకం అమలు
● అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ● కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: దీపం–2 పథకాన్ని జిల్లాలో సమర్థంగా అమలుజేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన జేసీ, ఐటీడీఏ పీవోలు,సబ్కలెక్టర్లు,పలుశాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ సరఫరాదారులు అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్న 48గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలని తెలిపారు. జేసీ అభిషేక్గౌడ మాట్లాడుతూ గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని,అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీ పరిధిలో 15 కిలోమీటర్ల వరకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని,15 కిలోమీటర్లు దాటితే రూ.30 రవాణా చార్జీలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ఉచిత గ్యాస్ నగదు 48గంటల్లో జమకాని పక్షంలో 14400 లేదా 1967 టోల్ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీపం–2 పథకం కింద జిల్లాకు 11,433 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని,వాటిలో వినియోగంలో లేని 61కనెక్షన్లకు ఈకేవైసీ చేయాలన్నారు.అదనపు వసూళ్లు చేసే గ్యాస్ ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో పాడేరు,రంపచోడవరం సబ్కలెక్టర్లు శౌర్యమన్పటేల్, కల్పశ్రీ, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి గణేష్,పలు గ్యాస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
చంద్రబాబు నిజ స్వరూపం బయటపడింది
ముంచంగిపుట్టు: వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన దిగజారుడు వ్యాఖ్యలతో ఆయన నిజ స్వరూపం బయటపడిందని, వెంటనే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని విశాఖ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు.ముంచంగిపుట్టులో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా అందరికీ సమన్యాయం చేస్తానని ప్రమాణం చేసి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి పనులు చేయకూడదని చంద్రబాబు మాట్లాడడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఉండే అర్హత లేదన్నారు.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కులం,మతం,ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు, రాయితీలు అందించారని చెప్పారు. తక్షణమే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని,క్షమాపణ చెప్పాలని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర