Amaravati
-
సాయం అందించే చేతులకు వేదిక పీ–4
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ–4 విధానం ద్వారా ప్లాట్ఫామ్ నిర్మిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ–పీ–4 విధానంపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ–4లో భాగస్వాములు కావొచ్చన్నారు. పీ–4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరువర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడమేనని, ప్రభుత్వం తరఫున ఎవరికీ అదనపు సాయం ఉండదన్నారు. ఉన్నతవర్గాల వాళ్లు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపాలని సూచించారు. లబ్ధి పొందేవారిని ‘బంగారు కుటుంబం’గా, సాయం చేసే వారిని ‘మార్గదర్శి’గా పిలవాలని సూచించారు. బంగారు కుటుంబం ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని, గ్రామసభ, వార్డు సభల ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందన్నారు. పీ–4 కార్యక్రమానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాల ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడండి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం వేసవి ప్రణాళిక, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధిత శాఖలతో సీఎం సమీక్ష నిర్వహించారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన రూ.39 కోట్లు విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు బయట ప్రాంతాల్లో పని అప్పగించొద్దన్నారు. ఆపరేషన్ మోడల్లో పోలవరం–బనకచర్ల పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్లో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి ఆర్థిక భారం తగ్గించవచ్చన్నారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
చంద్రబాబు కొత్త రాగం.. ఆత్మవంచన ఇంకెంత కాలం?
పూటకో రకంగా మాట్లాడటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రత్యేక లక్షణం. అసెంబ్లీలో కానీ.. మరో చోట కానీ.. నిన్న చేసిన ప్రసంగానికి, నేటికి అస్సలు సంబంధం ఉండకపోవచ్చు. ఎన్నికల ముందు చేసే ప్రసంగాలు ఒకలా ఉంటే.. ఆ తరువాత ఇంకోలా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాగ్దాన భంగాల గురించి ఆయన ఆచరించే పద్ధతులు ఒక పరిశోధన అంశం అవుతుందేమో!.కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ఆయన విజన్-2047 గురించి ప్రసంగించారు. అందులో ఆయన పెట్టిన అంకెలు చూస్తే అది ఎంత పెద్ద గారడీనో అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు ‘సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా’ అన్న ఆయన అధికారంలోకి రాగానే సంపద ఎలా సృష్టించాలో చెప్పండని ప్రజలను కోరారు. చెవిలో అయినా చెప్పాలని వ్యాఖ్యానించారు. తాజాగా సంపద సృష్టి నేర్పిస్తాం అంటున్నారు. చంద్రబాబు ఏది చేస్తారో తెలియదు కానీ, ఏపీని అప్పుల కుప్పగా మరుస్తుండటం మాత్రం స్పష్టం. అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై ఉన్నట్లు కనిపించదు. ఒక్క అమరావతి కోసమే రూ.ఏభై వేల కోట్లకుపైగా అప్పు తెచ్చి ఖర్చు పెట్డడానికి సిద్దం అవుతున్నారంటే ఈ ప్రభుత్వం సంపన్నులకు, బడా బాబులకు ఉపయోగపడుతున్నదా? లేక పేదలను ఉద్ధరించడానికా? అన్నది తెలిసిపోతుంది.అమరావతిలో భూములు కొన్నవారి ప్రయోజనాల కోసం ఇంత భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు మాత్రం పాతరేసింది. అమరావతిలో ధనికులు బాగుపడితే తామంతా బాగుపడినట్లు పేదలు అనుకోవాలన్నది కూటమి సర్కార్ భావన. కానీ, శాసనసభలో, బయట మాత్రం చంద్రబాబు నాయుడు పేదల కోసమే అంతా చేస్తున్నట్లు చెబుతూ వారిని మభ్యపెట్టేయత్నం చేస్తుంటారు. ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ జగన్ విశాఖలోని రుషికొండపై ప్రభుత్వానికి ఉపయోగపడేలా మంచి భవనాలు నిర్మిస్తే, అవేవో ఆయన సొంతమైనట్లు ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం చేశారు. అదే అమరావతిలో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బిల్డింగ్లను మాత్రం ఐకానిక్ భవనాలని ప్రచారం చేసుకుంటున్నారు.అమరావతి గ్రామాలలోనే ఇన్ని వేల కోట్ల వ్యయం చేస్తే అక్కడి వారికి సంపద సృష్టించినట్లు అవుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా సంపదవుతుంది?. ప్రభుత్వాన్ని సమతులంగా నడపవలసిన పెద్దలు మిగిలిన ప్రాంతాలను ఎండగట్టి అంతా అమరావతిలోనే ఉందన్న భ్రమ కల్పించే యత్నం చేస్తున్నారు. దానికి తోడు విజన్-2047 అని, పీ-4 అని ఏవో కొత్త డైలాగులు ప్రచారంలోకి తేవడం ద్వారా ప్రజలంతా కూటమి ఇచ్చిన అనేక హామీల ఊసెత్త కూడదన్నది వారి వ్యూహం. ఇది ప్రజస్వామ్య వ్యవస్థను కూడా మోసం చేస్తున్నట్లు అన్న సంగతి గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి తలసరి ఆదాయ లక్ష్యం 18వేల డాలర్లుగా ఉండాలని భావిస్తుంటే ఏపీలో అది 42వేల డాలర్లుగా పెట్టుకున్నారు. అంటే అప్పటికి ఒక డాలర్ విలువ వంద రూపాయలు ఉందనుకుంటే ఏపీ ప్రజలు ఏడాదికి నలభై రెండు లక్షల మేర తలసరి ఆదాయం కలిగి ఉంటారన్నమాట. నిజానికి ఇంకో పాతికేళ్ల తర్వాత డాలర్ విలువ ఇంకా ఎక్కువే కావచ్చు. అది వేరే సంగతి. అంటే ఇలాంటి అంకెల గురించి ప్రజలకు అంత తేలికగా అర్థం కావు. అందువల్ల వారిని భ్రమింప చేయడానికి ఈ అంకెల గందరగోళం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట.చంద్రబాబు 2004 వరకు సీఎంగా ఉన్న రోజుల్లో కూడా విజన్-2020 అంటూ ఒక కథ నడిపించారు. ఆ విజన్ పుస్తకం చదివిన వారంతా ఇవేమి లెక్కలు.. ఇవేమి లక్ష్యాలు.. అంటూ ఆశ్చర్యం చెందారు. అప్పట్లో ఒకసారి ఏపీకి వచ్చిన స్విస్ మంత్రి ఒకరికి జీడీపీపై, రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై ఇలాంటి లెక్కలు చెప్పబోతే, తమ దేశంలో అయితే ఇలా చెబితే వారిని మతి ఉండి మాట్లాడుతున్నారా అని అడుగుతారని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో ఒకట్రెండు పదాలు ఆయన వాడటం చంద్రబాబుకు అప్రతిష్టగా మారడంతో ఆ మాటలపై వివరణ ఇప్పించే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు తన వ్యూహాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. ఏవో లెక్కలు చెబితే ప్రజలు నమ్మకపోతారా అన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.సూపర్ సిక్స్ హామీలు కాని, ఎన్నికల ప్రణాళికలోని హామీలు కాని అమలు చేయడం అసాధ్యం వాటికి రూ.లక్షన్నర కోట్లు అవసరం అవుతాయని అప్పటి ముఖ్యమంత్రి జగన్ అంటే ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం తాము చేసి చూపిస్తామని అనేవారు. తనకు సంపద సృష్టించడం తెలుసు అని చంద్రబాబు బడాయి కబుర్లు చెబితే, అవునవును అని పవన్ కళ్యాణ్ బాజా వాయించే వారు. అప్పటికే జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందన్న అబద్ధాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. అంకెలతో జనాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా మోసం చేశారో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయి.నారా లోకేష్ అయితే అన్ని స్కీములకు తమ వద్ద లెక్కలు, ప్రణాళికలు ఉన్నాయని, అమలు చేయకపోతే తమ కాలర్ పట్టుకోవచ్చని అన్నారు. ఇప్పుడు కాలర్ ఎవరూ పట్టుకునే పరిస్థితి లేకుండా రెడ్ బుక్ పేరుతో జనాన్ని భయపెడుతున్నారు. అవసరమైన ప్రజలకు చేపలు అందిస్తారట. ప్రతిరోజూ చేపలు ఇస్తూనే వలవేసి వాటిని ఎలా పట్టుకోవాలో నేర్పుతానని అదే తమ విధానం అని చంద్రబాబు అన్నారు. మరి ఈ మాటే ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? పేదల తక్షణావసరాలు తీర్చడం అంటే ఒక ఏడాదిపాటు ఫ్రీ బస్, తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి వాటిని లేకుండా చేయడమా?. వలంటీర్లకు నెలకు పది వేలు ఇస్తామని చెప్పి అసలుకు మంగళం పాడడమా? ఇప్పటికీ 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవశాలి ఎంతమందికి సంపద సృష్టించారు? ఎంత మందికి నేర్పారు? ఇప్పుడు కొత్తగా నేర్పుతానని అంటే జనం చెవిలో పూలు పెట్టడం కాదా? ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట.అలాగే వ్యక్తి, కుటుంబం, సమాజం, రాష్ట్రం అన్ని స్థాయిలలో పురోగతికి ప్రణాళికలు రూపొందిస్తున్నారట. నియోజకవర్గాల విజన్ ఎజెండా పెట్టి స్వర్ణాంధ్ర సాకారం చేస్తారట. అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తొమ్మిది నెలలుగా తన నియోజకవర్గంలో ఒక్క పని చేయలేక పోయానని వాపోయారు. పది నెలల పాలన తర్వాత వీధులలో చెత్త ఎత్తడానికి సీఎం, మంత్రులు ఆయా చోట్ల తిరుగుతున్నారు. అలా ఉంటుందన్నమాట విజన్ అంటే!.పరిస్థితి ఇలా ఉంటే స్వర్ణాంధ్ర అని, మరొకటని కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేయడమేమిటో అర్థం కాదు. అదేమంటే పేదలను ధనికులు దత్తత తీసుకోవాలట. అప్పుడు వారికి సంపద సృష్టించడం నేర్పనక్కర్లేదా!. ఉగాది నాడు ఆ కార్యక్రమం ఆరంభిస్తారట. అది ఎంత చక్కదనంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ప్రతీ కుటుంబానికి కోరుకున్న చోట స్థలాలు ఇస్తారట. రాజధానిలో పేదలకు గత ప్రభుత్వం స్థలాలు ఇస్తే వాటిని రద్దు చేసిన చంద్రబాబు ఈ మాట చెబితే ఎవరైనా నమ్ముతారా?. వైఎస్ జగన్ టైమ్ లో నిర్మాణంలో ఉన్న పోర్టులను ప్రైవేటు పరం చేస్తూ సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తాం అని అంటున్నారు. తాను ఒక్కడినే పనిచేస్తే చాలదని, ఎమ్మెల్యేలంతా పని చేయాలని చెబుతున్నారు. అంటే వారిలో చాలా మంది పనిచేయడం లేదని చెప్పడమే అవుతుంది కదా! పనుల సంగతి దేవుడెరుగు! కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నారని ఎల్లో మీడియాలోనే కథనాలు వస్తున్నాయి.చంద్రబాబు సీఎం కాబట్టి ఆయన చేతిలో నిధులు ఉంటాయి కనుక, తన నియోజకవర్గంలో ఏదో పని చేసుకోవచ్చు. విచిత్రం ఏమిటంటే ఇంత విజన్ ఉన్న ఆయన నియోజకవర్గమైన కుప్పంలో సరైన బస్టాండ్ లేదు, కొన్ని వార్డులలో మట్టి రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో చెప్పలేం. కుప్పం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాలను జగన్ ప్రభుత్వం బాగు చేసింది. ఒక్క గెస్ట్ హౌస్ మాత్రం బాగానే ఉంటుంది. 2004, 2019లలో తనను ఎవరూ ఓడించలేదని, అభివృద్ది చేసే క్రమంలో ఎమ్మెల్యేలను, పార్టీని సమన్వయం చేయలేక పోయినందువల్ల ఓడిపోయామని అంటున్నారు. అంటే ఆయన నిజంగా అభివృద్ది చేసినా ప్రజలు ఓడించారని చెబుతున్నారా? అంతే తప్ప అప్పుడు కూడా ఆచరణ సాధ్యం కాని వందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత వాటిని అమలు చేయలేక ఓడిపోయామని అంగీకరించలేక పోతున్నారన్నమాట.జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడిన సంగతిని విస్మరిస్తున్నారు అన్నమాట. ఇది ఆత్మవంచన కాదా! పెద్ద వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అంకెల గారడీ, బురిడీ మాటలు కాకుండా చిత్తశుద్దితో పనిచేసి, ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది. కానీ ఆ దిశలో ఆయన ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ ఉన్నట్లు కనిపించడం లేదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘అమరావతి కేరాఫ్ అవినీతి’
సాక్షి,తాడేపల్లి : సీఎం చంద్రబాబుకు అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు ఉండడం లేదని మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అమరావతి నిర్మాణ పనుల్లో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తోపుతుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తుంగలో తొక్కారు. పోలవరం ఎత్తును తగ్గిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. దీని వలన 40టీఎంసీల నీరు రాయలసీమకు రాకుండా పోయింది. పోలవరాన్ని చివరికి బ్యారేజీగా మార్చేశారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు.పనులు ప్రారంభిస్తే వాటిని కూడా చంద్రబాబు ఆపేయించారు. 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇప్పుడు నీరులేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై రాయలసీమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. శ్రీశైలంలో హక్కుగా రావాల్సిన నీటిని వాడుకోవటానికి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు వైఎస్ జగన్ తెచ్చారు. ఆ పనులన్నిటినీ చంద్రబాబు తన పార్టీ వారితో కేసులు వేయించి ఆపారు.రాయలసీమ మీద చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపించటం సరికాదు. శిష్యుడైన రేవంత్రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారు. అందుకే రాయలసీమకు రావాల్సిన నీటిని కూడా తెలంగాణాకు వెళ్లేలా చేస్తున్నారు. రాయలసీమ రైతులు ప్రభుత్వంపై ఉద్యమం చేయటానికి రెడీ అవుతున్నారు. అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు లేదు?. అమరావతిలో జరిగే కాంట్రాక్టుల్లోనూ భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్ తెచ్చిన పారదర్శకత లేకుండా అడ్డుగోలుగా కాంట్రాక్టులను కట్టబెట్టేస్తున్నారు’అని ఆరోపించారు. -
బాబు చెప్పిన సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఇదేనా ?
-
అంకెల గారడీ చేస్తే ప్రజల ఆదాయం పెరిగిపోతుందా?
-
అమరావతిలో 58 అడుగుల అమరజీవి విగ్రహం
సాక్షి, అమరావతి: ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అమరజీవి స్వగ్రామం పడమటిపల్లిలోని ఆయన నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామని, గ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైసూ్కల్ భవనాన్ని నిర్మిస్తామన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు బకింగ్ హామ్ కెనాల్పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని 2047 నాటికి నంబర్వన్గా మార్చాలని పనిచేస్తున్నట్టు సీఎం తెలిపారు. నేటితో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లోకి అడుగుపెట్టడంతో వచ్చే ఏడాది మార్చి 16 వరకు ప్రతి నెలా ఒకటి చొప్పున 12 రకాల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు, ప్రతివ్యక్తి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉగాది నుంచి పీ4 విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. -
మరో రూ.11వేల కోట్లు.. అప్పు చేసిన కూటమి ప్రభుత్వం
సాక్షి,విజయవాడ : కూటమి ప్రభుత్వం అమరావతి కోసం రూ.11 వేల కోట్లు అప్పు చేసింది. ఈ అప్పు మొత్తాన్ని మొత్తం అప్పు అమరావతిలో నిర్మాణాలకు ఖర్చు పెట్టనుంది.ఇక,రూ.11 వేల కోట్ల అప్పు కోసం హాడ్కోతో సీఆర్డీఏ ఒప్పందం కుదర్చుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రపంచ బ్యాంకు ఋణానికి అదనంగా హడ్కో రుణం తీసుకుంది. రూ. 11 వేల కోట్లను అమరావతిలో పనులకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయనుంది. -
చెప్పిందేమిటి... చేసేదేమిటి?
అమరావతి దేవతల రాజధాని అంటారు. ఆ పేరుతో నిర్మించా లనుకుంటున్న రాజధాని నగరం మాత్రం శాపగ్రస్థ, వివాదాస్థ ప్రదేశంగా మారింది. విభజన చట్టం అమలు హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కేవలం రూ. 2,500 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజ్టెక్ట్ అని, దానిపై ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టక్కరలేదని చంద్రబాబు పదేపదే చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసింది. మరో రూ. 6 వేల కోట్లు ఖర్చు చేయడానికి తాజా బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. ఇవి కాకుండా అంతర్జాతీయ సంస్థల నుంచి రూ. 31 వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుంటోంది.కేంద్రంలోని మోదీ సర్కార్ తమ మద్దతుతోనే మన గలుగుతోంది అంటూ, ఈ 31 వేల కోట్ల రూపాయల రుణంతో రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్ర ప్రభు త్వమే ఆ భారాన్ని మోస్తుందని చంద్రబాబు అండ్ కో ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలను ఉద్యమం రూపంలో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తాజాగా మార్చి 10వ తేదీన తమ అధికారిక ఎక్స్ ఎక్కౌంట్లో ‘రాజధాని అమరావతికి అప్పులు అంటూ, వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది. వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే రుణాలు ఏపీ అప్పుల పరిధిలోకి రావని స్పష్టం చేసింది’ అని పేర్కొంది. అబద్ధాలు చెప్పడంలో రాటు దేలిన ఆ పార్టీ ఈ రుణాల బాధ్యత తమది కాదు, కేంద్రానిదే అని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రుణాలపై వివరణ ఇస్తూ ‘మల్టీ లేటరల్ లోన్ అసిస్టెన్స్’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులను ఆ ప్రభుత్వమే చెల్లించాలని చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మార్చి 10వ తేదీన మాట్లాడుతూ,‘అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్ట్, మెజార్టీ నిధులను సీఆర్డీఏనే సమకూర్చుకునే విధంగా ప్రాజె క్టును డిజైన్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా సపోర్ట్ ఇస్తున్నాం అంతే. అది కూడా బయటి సంస్థల ద్వారా రుణాల రూపంలో నిధులను సమకూర్చి ఇస్తున్నాం. అమరావతి భూములు అమ్మేసి ఈ అప్పు లన్నీ కట్టేసే విధంగా డిజైన్ చేస్తున్నాం’ అంటూ వివరణ ఇచ్చారు. కేంద్రం అమరావతికి ఏ రూపంలోనూ నిధులు సమకూర్చడం లేదని, దానిపై కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ కూడా లేదనడానికి ఇదే నిదర్శనం.అమరావతి నిర్మాణం, చంద్రబాబు ప్రభుత్వ చిత్త శుద్ధిపైనా సామాన్యులకే కాదు... అమరావతి ప్రాంత రైతులకు కూడా సందేహాలున్నాయి. అందుకే వారు భూ సమీకరణకు సీఆర్డీఏకి సహకరించడం లేదు. 38,581 ఎకరాల్లో రాజధానిని నిర్మించేందుకు 2015 జనవరిలో సీఆర్డీఏ ప్రారభించిన భూ సమీకరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనిలో 33 వేల ఎకరాల భూమి సమీకరించాం అంటున్న సీఆర్డీఏ రైతులకు బదులుగా 65 వేల కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వాలి. అయితే ఇప్పటి వరకూ 45 వేల ప్లాట్లను మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో పాటు ఇతర కారణాల దృష్ట్యా ఇప్పటికి 20 వేల ప్లాట్లను రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ భూ సమీకరణ పూర్తి కానంత వరకూ రాజధాని విస్తీర్ణం నిర్ణయించడం సాధ్యం కాదు. సీర్డీఏ మరో ఐదు వేల ఎకరాలు రైతుల నుంచి సమీకరించడానికి ఎప్పటి నుంచో విఫలయత్నం చేస్తోంది. అయితే వారు తమ భూములను ఇవ్వడానికి ఏ మాత్రం అంగీకరించడం లేదు. 29 గ్రామాలతో కూడిన ప్రదేశంలో రాజ ధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దానిలో భాగస్వామ్యం కావడానికి రెండు గ్రామాల ప్రజలు ఇప్పటికీ నిరాకరిస్తున్నారు. అమరావతి భూము లపై ప్రస్తుతం వందలాది కోర్టు కేసులున్నాయి. ఇన్ని అడ్డంకులున్నా ప్రభుత్వం మాత్రం 47 సంçస్థలకు భూములు కేటాయించింది. ఇప్పటికే రూ. 9 వేల కోట్లు అమరావతి నిర్మాణాలపై ఖర్చు చేసి మరో రూ. 48 వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది. అమరావతిలో భూ సమీకరణ ఒక విఫల ప్రయోగం. భూ సమీకరణ పేరుతో అమాయక రైతులు ఎలా నష్టపోయారో బెంగళూరుకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ప్రొఫెసర్ కరోల్ ఉపాధ్యాయ తన ‘అసెంబ్లింగ్ అమరావతి: స్పెక్యు లేటివ్ ఎక్యుమిలేషన్ ఇన్ ఏ న్యూ ఇడియన్ సిటీ’ అధ్యయన గ్రంథంలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. జపాన్కు చెందిన మాకీ అసోసియేట్స్ సంస్థ ‘అమరావతి’ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించింది. ‘హైటెక్ సిటీ’ పేరుతో హైదరాబాద్లో చంద్ర బాబు నాయుడు ఇన్సైడర్ ట్రేడింగ్కు ఎలా పాల్పడ్డారో ప్యారిస్ యూనివర్సిటీకి చెందిన ‘దలేల్ బెన్బబాలి’ కళ్ళకు కట్టినట్లు వివరించారు. అదే ప్రయోగాన్ని చంద్ర బాబు నాయుడు అమరావతిలో కూడా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అమరావతిలో దళితులకు అన్యాయం, బలహీన వర్గాల జీవనోపాధికి భంగం కలుగుతుందన్న వాదనలు ఉన్నాయి. శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి అమరావతి అనువైన ప్రదేశం కాదని అభిప్రాయపడిది. ఆ తరుణంలో అమరావతిలో రాజధాని పెట్టాలని చంద్రబాబు నాయుడికి వెంకయ్యనాయుడు సలహా ఇచ్చారంటూ అప్పట్లో ‘ఈనాడు’ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ ప్రదేశానికి అమరావతి అని నామకరణం చేసిన వ్యక్తి చెరుకూరి రామోజీరావు. దీనిని అమలు చేస్తోంది చంద్రబాబు నాయుడు. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పు లతో నిర్మిస్తున్న అమరావతి అందరి రాజధానిగా ఉంటుందా? కొందరి రాజధానిగా ఉంటుందా? అన్న అనుమానాలు సామాన్యులకు రావడం సహజమే.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్మొబైల్: 89859 41411 -
పోసాని కృష్ణమురళికి మరో ఊరట
అమరావతి, సాక్షి: ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో మరో ఊరట దక్కింది. కూటమి నేతలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే విజయవాడ సూర్యారావుపేట పీఎస్లో నమోదైన కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.తనపై నమోదు అయిన కేసులను కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టు(AP high Court)లో పోసాని క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం వాదనలు విన్న హైకోర్టు.. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదు అయిన కేసుల్లో తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది. సోమవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది. తాజాగా.. ఇవాళ పోసానిని అరెస్ట్ చేయొద్దంటూ విజయవాడ సూర్యారావు పేట పోలీసులను ఆదేశించింది. పోసాని తరఫున ఇవాళ వైఎస్సార్సీపీ లీగల్ కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.హైదరాబాద్ టు కర్నూల్ జైలు.. ఎప్పుడు.. ఏం జరిగిందంటే..ఫిబ్రవరి 24న.. పవన్ కల్యాణ్తో పాటు కూటమి నేతలను పోసాని గతంలో దూషించారంటూ జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పీఎస్లో కేసు నమోదుఫిబ్రవరి 27న.. హైదరాబాద్లోని తన నివాసంలో పోసానిని అరెస్ట్ చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా వినని పోలీసులు.. అదే రాత్రి తరలింపుఫిబ్రవరి 28న.. ఒబులవారిపల్లి పీఎస్కు తరలింపు.. సుదీర్ఘ విచారణ.. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మరోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన పోసానిఫిబ్రవరి 28న.. రైల్వే కోడూరులో పోసానిని ప్రవేశపెట్టిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్ విధింపుమార్చి1న.. ప్రిజనర్ ట్రాన్సిట్(PT) వారెంట్ కింద అదుపులోకి తీసుకున్న పల్నాడు నరసరావుపేట టూటౌన్ పోలీసులుమార్చి3న.. నరసరావుపేట కోర్టులో పోసానిని ప్రవేశపెట్టిన పోలీసులు. పోసానికి జ్యూడీషియల్ రిమాండ్ విధించిన జడ్జిమార్చి3న.. పీటీ వారెంట్ జారీ చేసిన కర్నూల్ జిల్లా ఆదోని త్రీటౌన్ పోలీసులు. మార్చి4న.. నరసరావుపేట నుంచి ఆదోని పీఎస్కు పోసాని తరలింపు మార్చి 5న.. మెజిస్ట్రేట్ నివాసంలో పోసానిని ప్రవేశపెట్టిన ఆదోని త్రీటౌన్ పోలీసులు.. రిమాండ్ మీద కర్నూల్ జైలుకు తరలించారుమార్చి6న.. ఆదోని కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ విచారణ.. కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్మార్చి7న.. కర్నూలు జస్టిస్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ విచారణకౌంటర్ వేయనున్న ఆదోని పోలీసులుఇవాళ సాయంత్రం కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై కర్నూలు కోర్టులో తీర్పు వెలువడే అవకాశం -
GVMC నిధులను అమరావతికి మళ్లిస్తున్న ఏపీ ప్రభుత్వం
-
ఆలీ ‘బాబు’.. అసైన్డ్ దొంగలు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ పెద్దలు మరో భారీ భూదోపిడీకి తెగబడ్డారు. భూసమీకరణ కింద ఇచ్చిన అసైన్డ్ భూములకు గాను ఎస్సీ, ఎస్టీ రైతులకు కేటాయించే రిటర్నబుల్ ప్లాట్లను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఆర్డీఏ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ఈ దందాను దర్జాగా నడిపిస్తున్నారు. బడుగు రైతుల ప్లాట్లను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే అక్రమంగా కొల్లగొట్టిన 1,300 ఎకరాల అసైన్డ్ భూములకుగాను రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి ప్లాట్లు కబ్జా చేసేందుకు బరితెగించిన ప్రభుత్వ పెద్దలు... తాజాగా పేద రైతుల రిటర్నబుల్ ప్లాట్లను సైతం స్వాహా చేస్తుండటంపై రాజధాని ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. ఇదీ అసైన్డ్ గూడుపుఠాణి... రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ కింద తమ అసైన్డ్ భూములు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు ప్రతిగా అభివృద్ధి చేసిన వాణిజ్య, నివాస ప్లాట్ల్లను సీఆర్డీఏ కేటాయించాలి. ఆ మేరకు అసైన్డ్ రైతుల పేర్లతో సీఆర్డీఏ వద్ద పెద్ద జాబితా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కొన్ని భవన నిర్మాణాలకు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తున్నందున టీడీపీ పెద్దల కన్ను ఆ ప్లాట్లపై పడింది. కానీ, రిటర్నబుల్ ప్లాట్లను నేరుగా టీడీపీ పెద్దలు, వారి బినామీల పేరిట రిజి్రస్టేషన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి తమ బెదిరింపులకు తలొగ్గి.. ప్లాట్లు తిరిగి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని సమ్మతించిన అసైన్డ్ రైతులకే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని కుట్ర పన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణలోనే ఈ భూదోపిడీ పర్వం సాగుతోంది. భూ దోపిడీ పర్వం ఇలా... ముందుగా రాజధాని పరిధిలోని అసైన్డ్ రైతులను తుళ్లూరు డీఎస్పీ కార్యాలయానికి పిలిపిస్తున్నారు. సీఆర్డీఏ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఆ ప్లాట్లను తాము సూచించిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఒకవేళ రాజధానిలో తమ ప్లాట్లను తామే అట్టిపెట్టుకుంటామని చెప్పిన రైతులను బెదిరిస్తున్నారు. ‘ప్లాట్లు పెట్టుకుని ఏం చేస్తారు.. వాటిలో మీరు ఏదైనా నిర్మాణం చేయాలంటే అనుమతులు ఇవ్వరు. తర్వాత మరొకరికి అమ్ముకోవాలన్నా రిజి్రస్టేషన్ చేయరు. పైగా లీగల్ లిటిగేషన్లు పెట్టి మీ ప్లాటుల మీకు ఎప్పటికీ దక్కకుండా చేస్తారు...’ అని హెచ్చరిస్తున్నారు. మేం చెప్పినవారికి వెంటనే అమ్మేస్తామని అంగీకరిస్తే ఇప్పుడు మీ ప్లాట్లు మీ పేరిట సీఆర్డీఏ ద్వారా రిజి్రస్టేషన్ చేయిస్తాం. లేకపోతే సీఆర్డీఏ మీ పేరిట అసలు ప్లాట్లే రిజిస్ట్రేషన్ చేయదు. ఏళ్లకు ఏళ్లు పెండింగులో ఉంచుతుంది’ అని బెదిరిస్తున్నారు. మరోవైపు కిందిస్థాయి పోలీసు అధికారులు, దళారులు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ తాము చెప్పినట్టు చేయకపోతే మొత్తానికే మోసం వస్తుందని భయపెడుతున్నారు. దీంతో పలువురు ఎస్సీ, ఎస్సీ, బీసీ, పేద రైతులు హడలిపోతున్నారు. పోలీసు బెదిరింపులకు లొంగి తమ ప్లాట్లను టీడీపీ పెద్దలు, బినామీలు చెప్పిన నామమాత్రపు రేటుకే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు సమ్మతిస్తున్నారు. సీఎంవో పచ్చజెండా ఊపితేనే.. సీఎం చంద్రబాబు కార్యదర్శి ఈ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. తమ ప్లాట్లు ఇచ్చేందుకు సమ్మతించిన రైతుల పేర్లను పోలీసు అధికారులు వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నట్లు తెలిసింది. వచి్చన జాబితాను పరిశీలించి అంతా తాము అనుకున్నట్టుగా సాగుతోందో లేదో అన్నది పోలీసు అధికారులతో సీఎం కార్యదర్శి మాట్లాడి నిర్ధారించుకుంటున్నట్లు సమాచారం. ఆ తర్వాతే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిన జాబితాను సీఆర్డీఏకు పంపుతున్నారు. ఈ చేత్తో ఇచ్చి... ఆ చేత్తో గుంజుకుంటున్నారు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదముద్ర వేసిన జాబితాలోని అసైన్డ్ రైతులకే రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్డీఏ రిజి్రస్టేషన్ చేస్తోంది. పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే అసైన్డ్ రైతుల పేరిట ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అనంతరం పోలీసు, సీఆర్డీఏ అధికారులు చెప్పినట్టుగా... అసైన్డ్ రైతులు ఆ ప్లాట్లను టీడీపీ పెద్దలు, వారి బినామీల పేరిట రిజి్రస్టేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం కోర్ క్యాపిటల్ ప్రాంతంలో చదరపు గజం భూమి మార్కెట్ ధర రూ.లక్షకు మించి పలుకుతోంది. కానీ సీఎంవో, సీఆర్డీఏ, పోలీసు అధికారులతో బెదిరించి అతి తక్కువ ధరకు కొల్లగొడుతున్నారు. అసైన్డ్ రైతుల నుంచి గజం కేవలం రూ.30వేల నుంచి రూ.40వేల చొప్పునే టీడీపీ పెద్దల బినామీలు, బంధువులు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు. అంటే ఈ చేత్తో అసైన్డ్ రైతులకు ఫ్లాట్లు ఇచ్చి... ఆ చేత్తో వెంటనే గుంజేసుకుంటున్నారు. 2014–19 మధ్య కాలంలో అమరావతిలో భూదోపిడీ సాగించిన చంద్రబాబు, నారాయణ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఇతర టీడీపీ పెద్దల సన్నిహితులు, బంధువులు, బినామీల పేరిటే ఈ అసైన్డ్ భూముల ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. ఈ విధంగా రాజధాని అమరావతి పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు ప్లాట్లు లేకుండా చేసి మొత్తం రాజధాని తమ సన్నిహితులు, బినామీల గుప్పిట్లోనే ఉండాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. బెదిరించి ప్లాట్లు తీసుకుంటున్నారు అమరావతి పరిధిలో ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్లాట్లు ఉండకూడదని ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అసైన్డ్ రైతులకు కేటాయించాల్సిన రిటర్నబుల్ ప్లాట్లపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. సీఆర్డీఏ కేటాయించే ఫ్లాట్లను ప్రభుత్వ పెద్దల సన్నిహితుల పేరిట రిజి్రస్టేషన్ చేయాలని పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు. అందుకు అంగీకరిస్తేనే వారి పేరిట సీఆర్డీఏ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఆ వెంటనే ఆ ప్లాట్లను ప్రభుత్వ పెద్దల సన్నిహితులు, బినామీల పేరిట అతి తక్కువ ధరకే రిజి్రస్టేషన్ చేసేసుకుంటున్నారు. సీఎంవో, సీఆర్డీఏ, పోలీసు పెద్దల పర్యవేక్షణలోనే ఇదంతా సాగుతోంది. దాంతో అసైన్డ్ రైతులు భయపడి వారు చెప్పినట్టుగా చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. – సందీప్, అసైన్డ్ రైతు, అమరావతి -
అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీకి రాజముద్ర!
-
‘అసైన్డ్’ దోపిడీకి రాజముద్ర!. అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చ ముఠాలకు ‘రిటర్నబుల్ ప్లాట్లు. సీఆర్డీఏకు చంద్రబాబు సర్కారు ఆదేశం
-
వేల కోట్ల అప్పులతో అమరావతి నిర్మిస్తున్న కూటమి సర్కారు
-
‘అందుకే జీబీఎస్ ఆందోళన ఎక్కువ అయ్యింది’
అమరావతి: మహారాష్ట్రలో ఎక్కువగా జీబీఎస్ (గులియన్ బారే సిండ్రోమ్) కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న కారణంగా ఇక్కడ కూడా ఆందోళన బాగా ఎక్కువగా ఉందన్నారు ఏపీ హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు. పుణే మున్సిపల్ కార్పొరేషన్లో నీటి సరఫరా సరిగ్గా లేని కారణంగా డయేరియా మొదలై జీబీఎస్ సోకిందన్నారు.దీంతో జీబీఎస్ పై భయం పెరిగిందన్నారు. అన్ని ఏరియాల నుంచి జీబీఎస్ వస్తోందని, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ ఒకే చోట ఎక్కువ కేసులు నమోదు కాలేదని, న్యూరో ఫిజిషయన్లు ఎక్కువగా ఉన్న చోట ట్రీట్ మెంట్ బాగా జరుగుతుందన్నారు.‘వెంటిలేటర్లు ఇతర ఐసీయూ సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నాం.ఏ ఇన్ఫెక్షన్ వచ్చిన వారికైనా జీబీఎస్ వచ్చే అవకాశం ఉంది.. సాధారణ జాగ్రత్తలు అంటే చేతులు కడుక్కోవడం.. శుభ్రంగా ఉండడం. పాటించాలి. కాళ్ళు తిమ్మిర్లు..చచ్చు బడినట్టు ఉండడం....లక్షణాలు. తినలేకపోవడం..మింగ లేకపోవడం.. శ్వాస అడకపోవడం. కూడా వ్యాధి లక్షణాలు. ప్రజలు ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి.జీబీఎస్ వచ్చిన 85 శాతం కేసులు ఒక్క రోజులోనే. సెట్ అవుతాయి..వెంటిలేషన్ అవసరం అయితే రికవరీ కష్టం అవుతుంది. మొదట చనిపోయిన చిన్న పిల్లవాడి కేస్ లో ఆసుపత్రి మార్చారు...మొదట శ్రీకాకుళం. తర్వాత విశాఖ కేజీహెచ్. దీంతో ఇబ్బంది వచ్చింది. ఎన్టీఆర్ వైద్య సేవలో చికిత్స అందుబాటులో ఉంది’ అని కృష్ణబాబు తెలిపారు. -
ఇంత మోసమా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు : అమరావతి రైల్వే ప్రాజెక్టు( Amaravati railway line) భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించ రైల్వే లైన్కు భూమి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. భూ సేకరణ కాకుండా సమీకరణ చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. బలవంతంగా భూసేకరణకు సిద్ధమైతే కోర్టును ఆశ్రయించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.అమరావతి రైల్వే లైన్ కోసం గుంటూరు జిల్లాలో 1,753 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.అమరావతి మండలం కర్లపూడి గ్రామంలోనే 232 ఎకరాలు సేకరించనున్నారు. ఇదే గ్రామంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం 153 ఎకరాలు, ఈ7, ఈ8, ఈ9 రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్డు కోసం 900 ఎకరాలు కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే లైన్కు భూమి ఇవ్వాలని, దీనికి కేంద్రం ఇచ్చే ప్యాకేజి సరిపోదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం కోసం ఎక్కడో ఉన్న గన్నవరంలో భూములిచ్చిన వారికి రాజ«దానిలో 1,450 గజాలు ల్యాండ్పూలింగ్ ప్యాకేజి కింద ఇచ్చారని, తమకు మాత్రం ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.పెగ్ మార్కింగ్ ఎలా చేస్తారు?ప్రభుత్వం రైతులతో సమావేశాలు పెట్టినా, వారి అభ్యంతరాలు స్వీకరించకుండానే రైల్వే లైన్ భూసేకరణకు పెగ్మార్కింగ్కు సిద్ధపడుతోంది. ఇలా ఇష్టానుసారం పెగ్ మార్కింగ్కు షెడ్యూల్ ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అమరావతి తహసీల్దార్తో జరిగిన సమావేశంలో కర్లపూడి రైతులు ఇదే విషయాన్ని చెప్పారు. పోలీసు బందోబస్తుతో పెగ్మార్కింగ్కు రావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.రాజధాని పరిసర ప్రాంతాల్లోని కంతేరు, కొప్పురావూరు, తాడికొండ, మోతడక గ్రామాల రైతులు రైల్వే లైన్ భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామసభల్లో తీర్మానాలు కూడా చేశారు. రైల్వేలైన్ వల్ల పక్కన ఉన్న భూముల ధరలు కూడా పడిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల పక్కనే 500 మీటర్ల వరకూ భూమిని సేకరించి, రైల్వే లైన్కు రెండువైపులా సర్వీస్రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇంత అన్యాయమా?ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భూముల ప్రభుత్వ విలువ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని, పరిసర ప్రాంతాల్లో మాత్రం పెంచలేదు. ఇదేమి అన్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల రైల్వే లైన్ భూ సేకరణలో తాము తీవ్రంగా నష్టపోతామని చెబుతునానరు. తమ గ్రామంలో భూమి ప్రభుత్వ విలువ రూ. 16 లక్షలు ఉంటే దాన్ని కేవలం రూ. 4 లక్షలు పెంచి రూ. 20 లక్షలు చేశారని, మిగిలిన చోట్ల అసలు పెంచలేదని కర్లపూడి రైతులు చెబుతున్నారు.బహిరంగ మార్కెట్లో తమ భూముల ఎకరా దాదాపు రూ. 4 కోట్లు ఉండగా, ఇప్పుడు రైల్వే నుంచి రూ. 50 లక్షలు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైల్వే ప్యాకేజికి అదనంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చే ప్యాకేజిలో 33 శాతం అంటే 410 గజాల స్థలం ఇప్పిస్తామని మంత్రి నారాయణ ఇటీవల రైతులకు సర్దిచెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 650 గజాల వరకు ఇప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే దీనికి కూడా రైతులు అంగీకరించడంలేదు. పూర్తిగా పూలింగ్ ప్యాకేజి ఇవ్వాలని కోరుతున్నారు.రాజధాని రైతులకు ఇచ్చినట్లుగా ఫారం.9.14 ఇవ్వాలని, అందులో ఎంత భూమి ఇస్తారు, ఇళ్ల స్థలం ఎంత, వాణిజ్య స్థలం ఎంత? కౌలు ఎన్ని సంవత్సరాలు ఇస్తారన్న విషయాలను స్పష్టం చేయకుండా భూములు ఇచ్చేది లేదని వారు చెబుతున్నారు. అసలు రైల్వే లైన్ అలైన్మెంటే తప్పు అని రైతులు అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ చేసిన గ్రామాల నుంచి కాకుండా బయట నుంచి రైల్వే లైన్ వెళ్లడం వల్ల 4 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని వాదిస్తున్నారు. గతంలో ఇచ్చిన మాస్టర్ ప్లాన్ను కదపకుండా బయట నుంచి అలైన్మెంట్ ఇచ్చామని మంత్రి నారాయణ చెబుతున్నారు. -
దొంగేడుపు బాబు.. బికారి మాటలు
-
అమరావతికి ఏపీఈఆర్సీ
-
మన నగరాల్లో కాలుష్యం తక్కువే
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం తక్కువగా ఉన్న 50 నగరాలను ఎంపిక చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్కు చెందినవి ఐదు ఉన్నాయి. అవి కడప–52 ఎంజీ (మిల్లీగ్రాములు/క్యూబిక్ మీటర్), అమరావతి 56 ఎంజీ, తిరుపతి 57 ఎంజీ, విజయవాడ 61 ఎంజీ, రాజమహేంద్రవరం 61 ఎంజీలుగా ఉన్నాయి. 2024 సంవత్సరానికి గాను సీఆర్ఈఏ (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్) సంస్థ అధ్యయనంలో ఈ విషయం తేలింది. అలాగే, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా కర్ణాటకలోని కొడగు జిల్లాలోని మడికేరి నగరం చోటు సంపాదించింది. ఇక్కడ వార్షిక సగటు కాలుష్యం కేవలం 32 ఎంజీ మాత్రమే. తమిళనాడులోని పాలలైపెరూర్, కర్ణాటకలోని కొప్పల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యంత క్లీనెస్ట్ జాబితాలో ఇంఫాల్, షిల్లాంగ్, అరియాలూర్, రామనగర, విజయపుర, రామనాథపురం ఉన్నాయి. ఇక అత్యంత కలుషిత నగరాల జాబితాలో రాజస్థాన్లోని శ్రీగంగానగర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వార్షిక సగటు 236 ఎంజీగా నమోదైంది. 226 ఎంజీతో నోయిడా, 211తో ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా 50 అత్యంత కలుషిత నగరాల్లో 15 నగరాలు రాజస్థాన్వే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో తొమ్మిది, బిహార్లో ఏడు ఉన్నాయి. ఇందులో ఏపీలోని ఏ నగరం కూడా లేనప్పటికీ విశాఖలో మాత్రం 108 ఎంజీగా నమోదైంది. గత ఏడాది గాలి నాణ్యతా ప్రమాణాల లెక్క వేసినప్పుడు విశాఖపట్నంలో 30 రోజుల వ్యవధిలో ఇలా ఆరుసార్లు కనిపించింది. గత ఏడాది సెప్టెంబరులో విజయవాడలో కూడా ఎక్కువగానే నమోదైంది. కానీ, ఆ తర్వాత గాలి నాణ్యత ప్రమాణాల్లో కాస్త మెరుగుపడింది.నిధుల వినియోగంలో ఏపీ వెరీపూర్..ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా కాలుష్య కారకాలను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్సీఏపీ (నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం) కింద నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను వినియోగించుకోవడంలో ఏపీ చాలా వెనుకబడినట్లు సీఆర్ఈఏ అధ్యయనంలో వెల్లడైంది. కేటాయించిన నిధుల్లో 35 శాతం మాత్రమే వినియోగించారు. అదే మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు 90 శాతం నిధులను వినియోగించాయి. -
Amaravati: సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ.. అది దా మ్యాటరు!
అమరావతికి కొత్త కళ! ఇక అమరావతి రయ్, రయ్..!! ఇవి ఎల్లో మీడియాలో తరచూ వచ్చే శీర్షికలు కొన్ని. అమరావతిలో అది జరగబోతోంది..ఇది జరగబోతోంది అంటూ రియల్ ఎస్టేట్ హైప్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ జాకీ మీడియా ఊదరగొట్టేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడితే ఎవరూ కాదనరు. కాని అది ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తేనే అభ్యంతరం అవుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన పెద్దలు.. దీనికోసం వేల కోట్ల అప్పులు తెస్తున్న వైనం ఆయా వర్గాలను కలవరపరుస్తోంది. అమరావతి కోసం ప్రస్తుతానికి రూ. 50వేల కోట్ల అప్పు చేయాలని తలపెట్టి.. రూ. 31 వేల కోట్ల అప్పును సమీకరించడం.. అందులో రూ.11,467 కోట్ల పనులను చేపట్టే యత్నం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభంలో ఉందని చెబుతున్నారు. 'తనకు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని ఉన్నా, ఖజానా చూస్తే భయం వేస్తోందని’ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. ప్రజలు ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని.. సూపర్ సిక్స్ అమలులో ఉన్న కష్టాలను గమనించాలని ఆయన పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. కాని అప్పుచేసి అమరావతి మాత్రం నిర్మిస్తామని అంటున్నారు. తద్వరా కొన్నేళ్ల తర్వాత వచ్చే ఆదాయంతో ప్రజలకు స్కీములు అమలు చేస్తారట..! ఇది చెబితే నమ్మడానికి జనం మరీ అంత వెర్రివాళ్లా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫీజు రీయింబర్స్మెంట్కు నిధుల్లేవని, రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని అంటున్నారు. అదే టైంలో ఏకంగా విద్యుత్ చార్జీలు.. పదిహేనువేల కోట్ల రూపాయల మేర పెంచుకున్నారు. గ్రామీన రోడ్లకు కూడా టోల్ గేట్లు పెడతామని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువలు పెంచారు. ఆర్దికంగా ఇంత క్లిష్ట పరిస్థితి ఉంటే.. కేవలం అమరావతిలో అంత భారీ ఎత్తున వ్యయం చేయడం ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి.. ఏకంగా కొత్త నగరం నిర్మిస్తామంటూ 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించారు. అదికాకుండా ప్రభుత్వ అటవీ భూమి మరో ఇరవై వేల ఎకరాలు ఉంది. దీనిని అభివృద్ది చేయడానికి, కేవలం మౌలిక వసతులు కల్పించడానికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబే గతంలో చెప్పేవారు. తొలి దశకుగాను లక్షాతొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు కావాలని గత టరమ్ లోనే చంద్రబాబు కోరారు. ఈ విడత అధికారంలోకి వచ్చాక అమరావతిలో సుమారు 48 వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్,రిజర్వాయర్ల తదితర నిర్మాణాల కోసమే వేల కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. ఇక భవనాల సంగతి సరేసరి. రకరకాల గ్రాఫిక్స్లో భవనాలను, డిజైన్ లను గతంలో ప్రచారం చేశారు. ఆ రకంగా వాటిని నిర్మించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో తెలియదు!. ఈ ఖర్చుల నిమిత్తం కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు నుంచి 15వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారు. ఇది కాకుండా ఇతర మార్గాల ద్వారా మరో పదహారువేల కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు విపక్షనేతగా ఉన్న సమయంలో పలుమార్లు ఈ ప్రాంతంలో పర్యటించి.. రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరం లేదని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడానికి సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే ఎన్నివేల కోట్లు అయినా ఖర్చు చేయవచ్చు. ఈ స్థాయిలో డబ్బును కేవలం 29 గ్రామాలలోనే వ్యయం చేయడం ద్వారా కొన్నివేల మందికి మాత్రం ప్రయోజనం కలగవచ్చు. తనవర్గంవారికి, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరికి లాభం రావొచ్చు. మరి ఏపీలో ఉన్న మిగిలిన కోట్ల మంది ప్రజల సంగతేమిటి?.అమరావతి ప్రాంత గ్రామాల రైతులకు ఇప్పటికే ప్రతి ఏటా కౌలు చెల్లిస్తున్నారు. వారికి పూలింగ్లో భాగంగా ప్యాకేజీ కూడా ఇచ్చారు. నిజానికి ఈ రకంగా ప్రభుత్వ డబ్బు భారీగా వినియోగించవలసిన అవసరం లేదని, రాజధానికి నాగార్జున యూనివర్శిటీ సమీపంలో అందుబాటులో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలను వాడుకుంటే సరిపోతుందని చాలామంది సూచించారు. అయినా చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్లారు. అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుందని టీడీపీ వర్గాలు భావించాయి. తొలుత కొంత హైప్ వచ్చినా, ఆ తర్వాత కాలంలో అది అంతగా కనిపించడం లేదని అంటున్నారు. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టి భూములు కొన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ మందగించిందన్న భావన ఏర్పడింది. హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొంత తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. పైగా ఈసారి చంద్రబాబు ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మి భూములు కొంటే ఉపయోగం ఉంటుందో, ఉండదో అనే సంశయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. అయితే.. ఇది సాధారణ పద్దతిలో అయితే అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నులను ఇక్కడ ఖర్చు చేయడంపై ఇతర ప్రాంతాలలో సంశయాలు వస్తాయి. అప్పులు తెచ్చినా , ఆ రుణభారం రాష్ట్ర ప్రజలందరిపై పడుతుంది. ఒక్కచోటే కేంద్రీకృత అభివృద్ది జరిగితే ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానికి తోడు ఇతరప్రాంతాలలో ఉన్న కార్యాలయాలను తరలిస్తున్న తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే టైంలో సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడడం లేదు.టీడీపీ, జనసేనలు ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో సూపర్ సిక్స్ గురించి ప్రముఖంగా ప్రకటించారు. ఆ సూపర్ సిక్స్ లోని అంశాలలో అమరావతి పాయింట్ లేదు. ఎన్నికల ప్రణాళికలో అమరావతిని అభివృద్ది చేస్తామని చెప్పినప్పటికీ.. సూపర్ సిక్స్లో లేకపోవడం గమనార్హమే. అలాంటప్పుడు చంద్రబాబు,పవన్లు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి. సూపర్ సిక్స్లోని నిరుద్యోగ భృతి కింద రూ.3,000, మహిళా శక్తిలో ప్రతి మహిళకు రూ.1,500, తల్లికి వందనం పేరిట బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15,000, రైతు భరోసా కింద రూ.20,000 ఇవ్వాల్సి ఉంది. ఆడవారికి ఉచిత బస్ ఊసే లేదు. గ్యాస్ సిలిండర్ల స్కీమ్ను అరకొరగానే అమలుచేశారు. వృద్దుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు. సూపర్ సిక్స్ కాకుండా ఎన్నికల ప్రణాళికలో సుమారు 175 వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. తదితర హామీలు ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే అమరావతికి ఎలా వస్తుందని ప్రజలు నిలదీయరంటారా?. ఇప్పటికే ఏడు నెలల్లో రూ.70,000 కోట్ల అప్పులు చేశారు. తొలుత సూపర్ సిక్స్ ,తదితర హామీలను నెరవేర్చిన తదుపరి ఎన్నివేల కోట్ల నిధులను అమరావతిలో ఖర్చు చేసినా ఎవరూ కాదనరు. ఒకవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు బాదుడు బాదుతూ, ఇంకో వైపు హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, పైగా తగ్గిస్తామని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు చెప్పేవారు. ఇప్పుడేమో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు.అయితే వైఎస్ జగన్ మాత్రం తన పాలనలో ప్రకటించిన ప్రకారం దాదాపు అన్ని హామీలు నేరవేర్చారు. ఆ పథకాల అమలుతో.. ప్రజల వద్ద డబ్బు ఉండేది. ఫలితంగా వ్యాపారాలు కూడా సాగేవి. కానీ అవన్నీ నిలిచిపోవడంతో మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా బాగా తగ్గింది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగడం లేదు. దాని ఫలితంగానే జీఎస్టీ నెలసరి ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమరావతిలో పనులు ప్రారంబిస్తే, ఆ ప్రాంతం వరకు కొంత ఆర్ధిక లావాదేవీలు జరగవచ్చు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఏమీ చేయకుండా రాజదానిలో మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించితే సరిపోతుందా?. జగన్ విశాఖలో రూ.400 కోట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే.. వృధా అని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు వేలు.. లక్షల కోట్లతో అమరావతిలో భవనాలు నిర్మిస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా అమరావతికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తే ఇచ్చుకోవచ్చు. కాని సూపర్ సిక్స్ను త్యాగం చేసి ఆ డబ్బంతటిని అమరావతి ప్రాంతానికి మళ్లీస్తే.. మిగిలిన ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరగవచ్చు. ఒకప్పుడు అమరావతిని ఒక్క రూపాయి ప్రభుత్వ ధనం వెచ్చించకుండా నిర్మించవచ్చని గ్యాస్ కొట్టిన కూటమి పెద్దలు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం వేల కోట్ల ప్రజా ధనాన్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేయడానికి సిద్దం అవుతున్నారు. అమరావతిలో పలు స్కాములు జరిగాయని గత ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటి పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కొత్తగా ఎన్ని స్కాములు జరుగుతాయో అనే సందేహం ఉంది. దానికి తగినట్లుగానే అమరావతిలో ఆయా నిర్మాణాల అంచనాలను సుమారు 30 శాతం వరకు పెంచారని వార్తలు వచ్చాయి. ఇది కూడా భవిష్యత్తులో పెను భారం కావచ్చు. ప్రజలు నిజంగా అధికారం కట్టబెట్టారో లేదంటే ఈవీఎంల మేనేజ్ మెంట్ జరిగిందో తెలియదుగాని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పొచ్చు. దానికి అమరావతి నిర్మాణ తీరు తెన్నులు, అందుకు పెడుతున్న వేల కోట్ల వ్యయమే నిదర్శనం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అసలు సమస్య ముంపే!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించడానికి తొలి దశలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నిధులతో కొండవీటి వాగుపై ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా ఎత్తిపోతలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించేలా నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.83 కిలోమీటర్ల పొడవున తవ్వే గ్రావిటీ కెనాల్పై నాలుగు చోట్ల పది క్యూసెక్కులను ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా ఈ ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేసింది. షెడ్యూళ్ల దాఖలుకు ఫిబ్రవరి 14ను తుది గడువుగా నిర్దేశించింది. రాజధానిని ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు 2018లో ఉండవల్లి వద్ద కొండవీటి వాగుపై 5 వేల క్యూసెక్కులను ఎత్తిపోసేలా రూ.260.48 కోట్లతో ఎత్తిపోతలను పూర్తి చేసింది. దీంతో పాటు ఇప్పుడు శాఖమూరు వద్ద 0.03, కృష్ణాయపాలెం వద్ద 0.10, నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం.. కొండవీటి వాగు, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా వెడల్పు చేయడం, కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించడానికి నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.83 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వే పనులకు రూ.1,404.14 కోట్ల వ్యయంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండో దశలో లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వి.. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద మూడు రిజర్వాయర్లు, వైకుంఠపురం వద్ద మరో ఎత్తిపోతలను నిర్మించాలని ప్రపంచ బ్యాంకు–ఏడీబీ ప్రతినిధులు సూచించారని ప్రభుత్వం చెబుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించే పనుల వ్యయమే తడిసి మోపేడయ్యేలా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.222 మి.మీ వర్షం కురిసినా ముప్పు ఉండకూడదురాజధాని అమరావతి ప్రాంతంలో వందేళ్లలో నమోదైన వర్షపాతం గణాంకాలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం విశ్లేషించింది. వందేళ్లలో ఒకసారి అమరావతి ప్రాంతంలో గరిష్టంగా 222 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ స్థాయిలో వర్షం కురిసినా రాజధాని అమరావతిని వరద ముప్పు నుంచి తప్పించేలా ముంపు నివారణ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల ప్రణాళిక మేరకు రాజధాని ముంపు నివారణ ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ ప్రణాళికలో ప్రధానాంశాలిలా ఉన్నాయి.» రాజధాని ప్రాంతంలో ప్రవహించే వాగుల్లో ప్రధానమైనవి కొండవీటి వాగు, పాలవాగు. కొండవీటి కొండల్లో పేరిచెర్ల వద్ద జన్మించే కొండవీటి వాగు అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉండవల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. కొండవీటి వాగు పరివాహక ప్రాంతం 421 చదరపు కిలోమీటర్లు. కొండవీటి కొండల నుంచి ప్రవాహించే ఈ వాగు 31.15 కిలోమీటర్ల ప్రయాణం తరువాత నీరుకొండ వద్ద రాజధానిలోకి ప్రవేశిస్తుంది. » రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు 23.85 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ వాగు కనిష్టంగా 6 మీటర్ల నుంచి గరిష్టంగా 20 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. కృష్ణా నది, కొండవీటి వాగుకు ఒకేసారి వరదలు వస్తే.. కృష్ణా వరద కొండవీటి వాగులోకి 23.85 కిలోమీటర్ల పొడవున ఎగదన్నే ప్రమాదం ఉంది. ఇది రాజధాని ముంపునకు దారితీస్తుంది. » రాజధానికి కొండవీటి వాగు ముంపు ముప్పు నివారించడానికి ఆ వాగు ప్రవాహ సామర్థ్యాన్ని అనంతవరం నుంచి శాఖమూరు మీదుగా నీరుకొండ వరకు (11.6 కి.మీ నుంచి 23.6 కి.మీ వరకు) 2,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. కృష్ణాయపాలెం నుంచి నీరుకొండ వరకు(4.6 కి.మీ నుంచి 11.6 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా లోతు, వెడల్పు చేయాలి. కృష్ణాయపాలెం నుంచి ఉండవల్లి వరకు (4.6 కి.మీ నుంచి 0 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. » నీరుకొండ వద్ద 0.4, కృష్ణాయపాలెం వద్ద 0.1, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలి. » ఉండవల్లి వద్ద కొండవీటి వాగు నుంచి 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్లోకి.. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలోకి ఎత్తిపోసేలా ఇప్పటికే ఎత్తిపోతలను నిర్మించారు. దానికి అనుబంధంగా 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల నిర్మించాలి. » పాల వాగు సామర్థ్యాన్ని కృష్ణాయపాలెం నుంచి దొండపాడు వరకు 16.7 కి.మీల పొడవున 8,830 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి.» నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.843 కి.మీల పొడవున 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో గ్రావిటీ కెనాల్ తవ్వాలి. ఈ కెనాల్పై నాలుగు చోట్ల పది క్యూసెక్కుల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలి. ఈ పనులన్నీ తొలి దశలో పూర్తి చేయాలి.» రెండో దశలో రాజధాని అమరావతి ఆవల ప్రాంతం నుంచి కొండవీటి వాగు వరద ప్రవాహం 12,500 క్యూసెక్కులకు మళ్లించేలా లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వాలి. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్లు నిర్మించాలి. కొండవీటి వాగు వరద ప్రవాహం 5,650 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల నిర్మించాలి. » రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే రిజర్వాయర్లను ఖాళీ చేయాలి. వరద నియంత్రణను పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. -
పోలవరం, అమరావతికి నిధులు కేటాయించండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. వచ్చేనెలలో జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం తరఫున ఆయన పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బడ్జెట్లో నిధులు కేటాయించండి..ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో పోలవరం, అమరావతి నిర్మాణాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహకారంపై చంద్రబాబు చర్చించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినందుకు నిర్మలా సీతారామన్కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రామ్నాథ్ కోవింద్తో భేటీమాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఆయన నివాసంలో చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాబు వెంటకేంద్ర ఉక్కు, పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఉన్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఇండోనేషియా ఆరోగ్య శాఖమంత్రి బుది జి సాదికిన్తో భేటీ అయినట్లు చంద్రబాబు ‘ఎక్స్’లో తెలిపారు. పరిటాల రవి 20 వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించినట్లు కూడా పేర్కొన్నారు. అలాగే.. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ఆడపిల్లల భద్రత, భవిష్యత్తు తమ ప్రధాన ప్రాధాన్యతలని పోస్ట్ చేశారు. త్వరలో దిగ్గజ సంస్థల సీఈవోలు వస్తారు దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పెట్టుబడులపై జరిగిన చర్చలకు కొనసాగింపుగా పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ సంస్థల సీఈవోలు, ప్రతినిధులు త్వరలో రాష్ట్రానికి వస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు.దావోస్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సీఎస్ విజయానంద్, సీఎంవో అధికారులతో తన నివాసంలోనే సమావేశమై దావోస్ పర్యటనపై చర్చించారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు వచ్చే నాటికి తగిన ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. -
దావోస్.. అంతా తుస్
సాక్షి,విజయవాడ : పెట్టుబడులు తేకుండానే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఏపీకి భారీగా పెట్టుబడులు తెస్తామని బయలు దేరిన చంద్రబాబు, లోకేష్..కానీ మూడు రోజుల దావోస్ సమావేశాల్లో ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు. అదే సమయంలో దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో జాతీయ,అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 9.3 లక్షల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.56,300 కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు చేసుకున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వంతో మాత్రం ఎంవోయూ కుదుర్చుకునేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రాలేదు. దీంతో ఎంవోయూలు లేకుండా పబ్లిసిటీకే చంద్రబాబు దావోస్ పర్యటన పరిమితమైంది.అదే సమయంలో తన దావోస్ పర్యటన కోసం చంద్రబాబు, తనయుడు నారా లోకేష్లు రూ.3కోట్లకు పైగా ఖర్చు చేసి జాతీయ మీడియా ఇంటర్వ్యూ ఇచ్చారు. దావోస్ పర్యటనలో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి పారిశ్రామిక వేత్తలకు నారా లోకేష్ చెడు సందేశం పంపారు. దావోస్ పర్యటనలో లోకేష్ సీఎం కావాలంటూ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ భజన చేశారు. బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ పబ్లిసిటీకే పరిమితమైంది. ఏపీలో ఎటువంటి కొత్త ప్రాజెక్టుకు ఎంవోయూ చేసుకోని మైక్రోసాఫ్ట్. దావోస్ నుండి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఏపీ అధికారులు తిరుగుముఖం పట్టారు. -
అమరావతిపై కపట ప్రేమ చూపిస్తున్న కూటమి నేతలు
-
మూడు ప్యాకేజీల కాంట్రాక్ట్ విలువ రూ.1,404.14 కోట్లుగా నిర్ధారణ
-
అమరావతి ‘ముంపు టెండర్ల’లో అక్రమాల వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కొండవీటి వాగు, పాల వాగు వరద ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు చేపట్టే పనుల టెండర్లలో అక్రమాలు వరదెత్తాయి. పనుల అంచనా వ్యయాన్ని 100 నుంచి 250 శాతం పెంచేసి.. మూడు ప్యాకేజీలుగా విభజించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారుల ద్వారా ముఖ్యనేతలు మూడు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వీటి కాంట్రాక్ట్ విలువ (అన్ని పన్నులతో కలిపి) రూ.1,404.13 కోట్లుగా నిర్దేశించారు. పనుల విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్ట్ సంస్థలకు పనులు అప్పగించి.. పెంచిన అంచనా వ్యయం రూ.702.33 కోట్లను కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. మూడు ప్యాకేజీల పనులు ఇవీ ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంగా ఇస్తున్న నిధులతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ చేపట్టింది. ఒకటో ప్యాకేజీ కింద కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి, లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎల్ఎస్ (లంప్సమ్) విధానంలో 24 నెలల్లో పూర్తి చేయడంతోపాటు మరో రెండేళ్లు నిర్వహించాలని నిబంధనతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.462.26 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా రూ.60.53 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.522.79 కోట్లు. రెండో ప్యాకేజీ ఇదీ రెండో ప్యాకేజీ కింద నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడం.. కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో రెండేళ్లలో పూర్తి చేసి, మరో రెండేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.303.73 కోట్లుగా నిర్దేశించింది.దీనికి అదనంగా రూ.38.57 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా విలువ రూ.342.3 కోట్లు. ఒకటో, రెండో ప్యాకేజీ పనులకు షెడ్యూళ్లు దాఖలు చేయడానికి ఈనెల 31 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి.. అర్హత ఉన్న కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన ఆరి్థక బిడ్లను ఫిబ్రవరి 5న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనున్నారు. మూడో ప్యాకేజీ కింద.. మూడో ప్యాకేజీ కింద మంగళగిరి మండలం నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.470.74 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా వ్యయం రూ.539.04 కోట్లు. ఈ పనుల టెండర్లలో షెడ్యూళ్ల దాఖలుకు ఈ నెల 22 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్, ఈనెల 25న ఆర్థిక బిడ్ తెరిచి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టనున్నారు. అంచనాల్లో పొంగిపొర్లిన అక్రమాలు రాజధాని ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు వంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించడమే.. కొత్తగా 7.843 కిమీల పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు.ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, 10 నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ. రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ వంటి పన్నులతో కలిపి)కు మించదని జలవనరుల శాఖలో అనేక ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజినీర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక అధికారి తేల్చిచెప్పారు.ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను జీఎస్టీ వంటి పన్నులతో కలిపి రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. కొండవీటి వాగు, పాల వాగు లోతు, వెడల్పు పెంచే పనులకు కి.మీ. రూ.5 కోట్లు చొప్పున వేసుకున్నా రూ.201.75 కోట్లు అవుతుంది. శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.వంద కోట్లు లోపే అవుతుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే..జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉండి ఉంటే టెండర్ ముసాయిదా షెడ్యూల్ దశలోనే ఈ అక్రమాలు బహిర్గతమయ్యేవని.. అందుకే ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు స్పష్టం చేశారు. జాయింట్ వెంచర్గా ఏర్పడి టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి వీల్లేదని నిబంధన పెట్టడం ద్వారా ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థకే పనులు అప్పగించేందుకు ముఖ్యనేతలు ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. అదే టెండర్ నోటిఫికేషన్లో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే వెసులుబాటును కల్పించడాన్ని బట్టి చూస్తే ముఖ్యనేతల దోపిడీ పన్నాగం బట్టబయలవుతుందని రిటైర్డ్ ఎస్ఈ ఒకరు స్పష్టం చేశారు.రాష్ట్రంలో 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి, ప్రతిపాదన దశలోనే పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి.. వాటిని కమీషన్ల రూపంలో వసూలు చేసుకుని జేబులో వేసుకోవడానికి ముఖ్య నేతలు మరిగారు. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని చేసి.. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని రద్దు చేశారు. రూ.100 కోట్లు.. అంతకంటే వ్యయం ఎక్కువగా ఉన్న పనులకు సంబంధించి టెండర్ ముసాయిదా షెడ్యూల్ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలి.దీన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. ఇంజనీర్లు, మేధావులు, ప్రజలు, కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఆన్లైన్లో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి అభిప్రాయాలను తీసుకుంటారు. వాటి ఆధారంగా ముసాయిదా షెడ్యూల్లో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసిన ముసాయిదా షెడ్యూల్ను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదిస్తారు. దాంతోనే సంబంధిత శాఖ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని పునరుద్ధరించింది. ఇది జరిగాకే రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన రెండు ప్యాకేజీల్లోనూ ఇదే తీరురెండో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.197.05 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం పన్నులతో కలిపి రూ.342.3 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే అంచనా వ్యయం రూ.145.25 కోట్ల మేర పెంచేసినట్టు స్పష్టమవుతోంది. 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడానికి.. కిలోమీటర్కు రూ.6 కోట్ల చొప్పున రూ.47.05 కోట్లు అవుతుంది.కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.150 కోట్లకు మించదు. మూడో ప్యాకేజీ కింద నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.200 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.339.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టు తేటతెల్లమవుతోంది. -
అమరావతిని అక్రమాలపురంగా మారుస్తున్న కూటమి సర్కార్
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అడుగడుగునా కమీషన్లు... సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ టెండర్లలో విచ్చలవిడిగా అక్రమాలు
-
ఏం.. తమాషాలు చేస్తున్నారా?.. పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: గుంటూరు పట్టాభిపురం పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేశాం. అయినా ఎందుకు తలదూరుస్తున్నారు’ అంటూ మండిపడింది. మంగళవారం హైకోర్టులో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సోదరి వజ్ర కుమారి, వసంత ఇంటి వ్యవహార కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించినా.. సివిల్ వ్యవహారంలో పట్టాభిపురం పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ వజ్రకుమారి, వసంతల తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ వ్యతిరేక వర్గానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని చెప్పారు. అనంతరం, తమ ఆదేశాలను ధిక్కరించిన పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు న్యాయమూర్తి పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆదేశాలను కచ్చితంగా అమలు అయ్యేటట్లు చూడాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించారు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. -
డిప్యూటీ సీఎం పవన్తో దిల్ రాజు భేటీ.. ఈ అంశాలపైనే చర్చ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమరావతిలో భేటీ అయ్యారు. తాను నిర్మించిన 'గేమ్ ఛేంజర్' సినిమా త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో వారిద్దరి భేటీ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపుతో పాటు విజయవాడలో సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమం ఏర్పాటు గురించి పవన్తో దిల్ రాజు చర్చించనున్నారు.తెలంగాణలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో బెనిఫిట్షోలు, టికెట్ ధరల పెంపు వంటి అంశాలు ఉండవని ఆయన క్లియర్గా చెప్పేశారు. దీంతో సంక్రాంతి సినిమాలపై భారీగా ప్రభావం పడింది. ఈ క్రమంలో దిల్ రాజు- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్' జనవరి 10న విడుదల కానుంది. తెలంగాణలో ఈ చిత్రానికి ఎలాంటి బెనిఫిట్షోలు, టికెట్ ధరల పెంపు ఉండదు. దీంతో కనీసం ఏపీలో అయినా ఈ సౌలభ్యం పొందాలని చిత్ర యూనిట్ భావించింది. ఈమేరకు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. ఏపీలో టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్షోలకు అనుమతి ఇవ్వాలని ఆయన్ను కోరనున్నట్లు సమాచారం. జనవరి 4,5 తేదీలలో విజయవాడలో గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్ను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చేలా చూడాలని పవన్ను కోరనున్నారు. ఈ భేటీ అనంతరం దిల్ రాజు పూర్తి విషయాలు ప్రకటించే అవకాశం ఉంది. -
అమరావతికి అప్పుల వరద.. బాబు సూపర్ షాక్..
-
హ్యాపీనెస్ట్ నిర్మాణానికి టెండర్లు
సాక్షి, అమరావతి: అమరావతిలోని నేలపాడులో నిర్మించనున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం అమల్లో ఉన్న సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టెండర్ డాక్యుమెంట్ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. కానీ అప్పటి నుంచి టెండర్లను ఆహ్వానించకుండా.. జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు చేసిన తర్వాత ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా టెండర్లను ఆహ్వానించడం గమనార్హం. అలాగే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.720 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా ఈ ప్రాజెక్టుకు రూ.818.03 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు పూర్తికి 24 నెలల గడువుఈ ప్రాజెక్టులో భాగంగా జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 అపార్ట్మెంట్ యూనిట్లు నిర్మించాలని టెండర్ డాక్యుమెంట్లో సీఆర్డీఏ పేర్కొంది. షేర్ వాల్ టెక్నాలజీ వినియోగం ద్వారా హ్యాపీనెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. అంతర్గత–బాహ్య విద్యుత్ పనులు, ప్లంబింగ్, శానిటరీ, అగ్నిమాపక పనులు, లిఫ్ట్లు, ల్యాండ్ స్కేపింగ్ తదితర పనులు చేపట్టాలని పేర్కొంది. ఓపెన్ టెండర్ విధానంలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు సీఆర్డీఏ తెలిపింది. టెండర్ దక్కించుకున్న సమయం నుంచి 24 నెలల్లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్లంబింగ్, శానిటరీ, ల్యాండ్స్కేప్, ఫైర్ ఫైటింగ్, లిఫ్ట్లు, సెక్యూరిటీ వ్యవస్థ, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ తదితరాలను అంశాల వారీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే పనులు పూర్తి చేసినప్పటి నుంచి మూడేళ్ల సమయాన్ని డిఫెక్ట్ లయబిలిటీగా సీఆర్డీఏ పేర్కొంది.10% మొబిలైజేషన్ అడ్వాన్స్..కాంట్రాక్టు వ్యయంలో 10శాతం మేర మొబిౖలెజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పనులు దక్కించుకున్న సంస్థలకు ముందుగానే పనుల విలువలో పది శాతం మేర మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు టెండర్లో పేర్కొంది. అంచనావ్యయానికి ఐదు శాతంలోపు కోట్ చేసిన టెండర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అంతకన్నా ఎక్కువ కోట్ చేసిన టెండర్లను తిరస్కరించనున్నట్లు వెల్లడించింది. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 8 వరకు గడువు ఇచ్చింది. 8వ తేదీ సాయంత్రం సాంకేతిక బిడ్ను తెరవనున్నట్లు ప్రకటించింది. జనవరి 10న ఆర్థిక బిడ్ను తెరవనున్నట్లు తెలిపింది. -
పుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ
పుణే: ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్పాత్పై వీరంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా?
సాక్షి, విశాఖపట్నం: రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోనే నిధులను ఖర్చు చేసి... ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడం సరికాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా? అని ఆయన ప్రశి్నంచారు. రాజధాని పేరుతో ఉత్తరాం«ధ్ర, రాయలసీమలను పట్టించుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈఏఎస్ శర్మ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘గుంటూరు జిల్లా అమరావతిలో రానున్న మూడేళ్లలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాలు, ఇతర నిధులన్నీ దాదాపు రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం. ఈ రుణభారం భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలపైనా పడుతుంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల నుంచి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. అమరావతి రాజధాని వల్ల మిగిలిన ప్రాంతాలకు ఎంత లాభం ఉందో తెలీదు కానీ... అన్యాయం మాత్రం తీవ్రంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తిగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుంటే దాన్ని ఆపకుండా... పక్కనే నక్కపల్లిలో ప్రైవేట్ కంపెనీ ఆర్సెల్లరీ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను స్థాపించేందుకు మొగ్గు చూపడం ఎంతవరకు సమంజసం? ఈ ఒక్క నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వానికి ఉత్తరాంధ్రపై ఉన్న ఉదాసీనత బట్టబయలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం విభజన చట్టంలో ఉన్న హామీలపై ఇంతవరకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించకపోవడం కూడా మీ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ వ్యవహారంపై మీరు చూపించిన చొరవపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. రాజధాని పేరుతో బిల్డింగులు, హంగులపై ప్రజల నిధులు ఖర్చు చేసే బదులుగా.. ప్రభుత్వ విధానాల్లో వికేంద్రీకరణ, ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావడం, ప్రజాస్వామ్య విధానాలపై దృష్టి సారిస్తే మంచిది. వెనుకబడిన ప్రాంతాలను విస్మరించి వేల కోట్ల రూపాయలను రాజధానికి ఖర్చు చేస్తే రాష్ట్ర ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తించాలి..’అని లేఖలో శర్మ పేర్కొన్నారు. -
అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పే
-
అప్పులతోనే అమరావతి.. పెండింగ్ పనులకు 30వేల కోట్లు!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ అప్పులు చేయడంలో ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులతోనే అమరావతిలో నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం అప్పులు ఇప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి కోసం బాబు సర్కార్ 30వేల కోట్ల అప్పులు చేస్తోంది.అప్పులతోనే అమరావతి చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు నుండి రూ.6,800 కోట్ల అప్పు తీసుకునేందుకు నిన్న బోర్డు మీటింగ్లో ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఏడీబీ ద్వారా అమరావతి కోసం ప్రభుత్వం రూ.6700 కోట్లు అప్పు తెస్తోంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ అప్పులు కలుపుకుంటే అమరావతి కోసమే బాబు సర్కార్ రూ.13,500 కోట్లు అప్పులు చేస్తోంది.ఈ నేపథ్యంలో అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పు మాత్రమేనని మరోసారి తేలింది. కేంద్రం నిధులు ఇస్తోందంటూ ఇన్నాళ్లూ చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. కానీ, కేంద్రం కేవలం.. ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు మాత్రమే ఇప్పిస్తోంది. ఈ అప్పులన్నింటీనీ కూటమి సర్కార్.. అమరావతి కోసం మళ్లిస్తోంది. మరోవైపు.. హడ్కో ద్వారా 11వేల కోట్లు, కేఎఫ్డబ్ల్యూ ద్వారా 5 వేల కోట్లను బాబు సర్కార్ అప్పుగా తీసుకుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అమరావతి కోసం సుమారు 30 వేల కోట్ల అప్పు చేస్తోంది. అమరావతిలో పెండింగ్ భవనాల కోసం అప్పులు చేస్తూ.. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అభివృద్ధి పనులను నిలిపి వేసింది. ప్రస్తుతం అప్పులన్నీ అమరావతికే కేటాయిస్తోంది. -
ఇది ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం
తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం...ఈ విషయంలో తక్షణమే పెంచిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజల తరుపున వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంరాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా ఏఈ లేదా డీఈ కార్యాలయంకు వెళ్ళి, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలని సూచించారు.‘ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడయింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ రెండో కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.ఇందుకు సంబంధించి వైఎస్సార్ సిపి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. ఈ కార్యక్రమాన్ని ముందు జిల్లా స్ధాయిలో నిర్వహించాలని భావించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నియోజకవర్గ స్ధాయిలో చేయాలని మన అధినేత జగన్ అందుబాటులో ఉన్న నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్ధాయిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్లు అందరూ తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. నియోజకవర్గ ఇంఛార్జ్లంతా కూడా తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ దోపిడినీ ఎండగట్టాలని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి..ఈ నెల 21 న మన అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, జగన్గారిపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి, పార్టీ క్యాడర్ అంతా ఉత్సాహంగా పాల్గొని జగన్గారిపై ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలి, ఈ వేడుకలను అందరం విజయవంతం చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు.సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉందాంసోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్దంగా ఉంది, ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి. ఇటీవల సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులకు తెలియజేసి, దానిని అతిక్రమిస్తే వచ్చే ఇబ్బందులను పోలీసులకు తెలియజేయాలి. సోషల్ మీడియా యాక్టివిస్ట్లకు అవసరమైన సహాయం చేసేందుకు పార్టీ నాయకులు కూడా వెంటనే అందుబాటులో ఉండాలి’ అని సజ్జల హితవు పలికారు. -
అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంతలు తొక్కుతుందని ఎల్లోమీడియాలో కథనాలు
-
అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయమవుతోంది
సాక్షి, హైదరాబాద్: అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోందన్నారు. సెప్టెంబర్తో పోలిస్తే నవంబర్లో, నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తోందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. పెట్టుబడులు ఆంధ్రకు వెళ్లే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... పెట్టుబడిదారులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారని, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. ‘అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయింది. వాళ్లు ఎంత బూస్టప్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో హైడ్రా పట్ల భయం పోయిందని, మొదట్లో తప్పుడు ప్రచారం వల్ల కొంత వేరే అభిప్రాయం ఉన్నా.. ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా ఇస్తామని చెప్పిన పొంగులేటి.. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు రూ.12వేలను రెండు దఫాల్లో ఇస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని, ఇందుకోసం విడతకు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు వాస్తవమని, ఈ విషయంలో చర్చ నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ గొడవ చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు లెక్కలోకి రావా అని ప్రశ్నించారు. అసలు కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి అయినా ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలందరూ తమకు సమానమేనని అన్నారు. శాసనసభలో ఎవరి పాత్ర వారు పోషించాల్సిందేనని, భట్టిపై ప్రివిలేజ్ తీర్మానం ఇవ్వడం బీఆర్ఎస్ హక్కు అని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో చర్చలో మాట్లాడాలని తనకు కూడా కోరికగా ఉందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆదానీ విషయంలో ఏఐసీసీ విధానమే తమ విధానమని స్పష్టంచేశారు. -
‘అమరావతి’కి ఇచ్చేది అప్పే!
సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన రూ.15 వేల కోట్లు రుణమని తేలిపోయింది. ఈ మొత్తం కేంద్రం నుంచి గ్రాంట్గా ఇస్తున్నట్లు ఇప్పటికే శాసనసభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు.. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సభలో ధన్యవాదాలు సైతం తెలిపారు. ఇక ప్రకటించిన మొత్తంలో రూ.13,500 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి కేంద్రం రుణం తీసుకుని ఏపీ రాజధాని నిర్మాణానికి గ్రాంట్గా ఇస్తున్నట్లు కూటమి నేతలు ప్రచారం చేశారు. కానీ, ఇవన్నీ అబద్ధమని.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఇచ్చేది పూర్తిగా షరతులతో కూడిన రుణమని తాజాగా బహిర్గతమైంది. ఈ మేరకు గురువారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సమావేశమైన ఆసియా అభివృద్ధి బ్యాంకు బోర్డు అధికారులు ‘అమరావతి ఇన్క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’కి 788.8 మిలియన్ డాలర్ల రుణాన్ని (సుమారు రూ.6,694.36 కోట్లు) ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఈ రుణం మొత్తం థీ121.97 బిలియన్ల జపనీస్ యెన్లో అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తంతో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పథకం కింద వాటాదారులుగా ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ కాంప్లెక్స్, మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చుచేయాలని సూచించారు. ఈ మొత్తాన్ని ఇతర బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్) సహకారంతో ప్రోగ్రామ్కు మద్దతు ఉంటుందని ఏడీబీ భారతదేశ కంట్రీ డైరెక్టర్ మియో ఓకా తెలిపారు. ఇక రుణంగా ఇచ్చే మొత్తానికి వడ్డీ ఉండదని, కానీ 20 ఏళ్ల తర్వాత వాయిదాలుగా ఆనాటికి ఉన్న డాలర్ల విలువకు సమానంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, అప్పటికి డాలర్ విలువ 20 రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమరావతికి వచ్చే రూ.15,000 కోట్లలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకులు ఇచ్చే రూ.13,500 కోట్ల రుణం కాగా, మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది. -
నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ
-
నేడు సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధాని అని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని తెలిపింది. కేసు విచారణను ముగించాలని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. చదవండి : ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు! -
అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్న కూటమి సర్కారు
-
న్యాయ సాయం కోరే హక్కు నిందితునికి ఉంది
సాక్షి, అమరావతి : ఏదైనా కేసులో నిందితుడిని పోలీసులు పీటీ వారెంట్ మీద మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినప్పుడు, అతను పోలీసు లేదా జ్యూడిషియల్ కస్టడీని వ్యతిరేకిస్తూ తనకు న్యాయ సాయం అందించాలని మేజిస్ట్రేట్ను కోరవచ్చని హైకోర్టు తెలిపింది. అలా కోరే హక్కు నిందితుడికి ఉందని స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్లు నిందితుడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడింది. సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్కు హైకోర్టు ఈ వెసులుబాటుని ఇచ్చింది. రవికిరణ్కు సంబంధించి వివరాలేమీ పోలీసులు తమకు తెలియజేయడంలేదని, దీంతో న్యాయ సాయం పొందే అవకాశం లేకుండా పోతోందన్న అతని తరఫు న్యాయవాది వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే రవికిరణ్పై నమోదైన కేసుల వివరాలును తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పీటీ వారెంట్ల వివరాలను పోలీసులు నిందితునికి తెలియచేయాల్సిన పని లేదని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. తన భర్త రవికిరణ్పై ఉన్న కేసుల వివరాలు, పీటీ వారెంట్లపై పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదంటూ ఇంటూరి సుజన హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సుజన తరఫున న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి, పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది (హోం) ఎ.జయంతి వాదనలు వినిపించారు. -
మళ్లీ వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు అప్పు రూ.4,237 కోట్లు
సాక్షి, అమరావతి : సంపద సృష్టించడం అంటే ప్రజలపై ఆర్థిక భారం మోపడం, అప్పులు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ రూ.4,237 కోట్లు అప్పు చేయనుంది. పదేళ్ల వ్యవధిలో రూ.1,237 కోట్లు, 14 సంవత్సరాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 15 సంవత్సరాల వ్యవధిలో రూ.1,500 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. వచ్చే మంగళవారం సెక్యురిటీల వేలం ద్వారా ఆర్బీఐ ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది. గత మంగళవారమే 7.18 శాతం వడ్డీకి రూ.2000 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే.. దీంతో చంద్రబాబు ప్రబుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులు రూ.67,237 కోట్లకు చేరనున్నాయి. -
ఉద్యోగ భద్రత కోసం చంటి బిడ్డలతో టీచర్ల ధర్నా
అమరావతి: ‘డీఎస్సీ నుంచి మినహాయించి.. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏడాది మూడు నెలల చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని ధర్నా చేస్తున్న ఈమె పేరు పి.పర్శిక. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూనవరం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సైన్స్ టీజీటీగా పనిచేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో తమ పోస్టులు కూడా ఉండడంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తన ఉద్యోగం పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.దాదాపు 237 కిలోమీటర్ల దూరంలోని కూనవరం నుంచి విజయవాడకు వచ్చి తన ఉద్యోగానికి భరోసా కల్పించేలా కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేయాలని రోజుల తరబడి ధర్నా చేస్తోంది’.పర్శిక టీచర్తోపాటు వందలాది మంది తమ ఊరు, వాడ, గూడు వదిలి వచ్చి విజయవాడ ధర్నా చౌక్లో గత 13 రోజులుగా శాంతియుత నిరసన కొనసాగిస్తున్నా సర్కార్ కనికరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని లోకేశ్ ఓఎస్డీ చెప్పిన గడువు శుక్రవారంతో ముగుస్తుందని, తమ డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గిరిజన గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ గురువారం నాటి కార్యక్రమంలో తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. – సాక్షి, అమరావతి -
'ఆర్జీవీ' పరారీలో ఉన్నారనుకునే వారికి బ్యాడ్ న్యూస్
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేసులకు భయపడి పరారీలో ఉన్నారని అనుకునే వారి కోసం ఆయన సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో తనపై పెట్టిన కేసులు వాటి సెక్షన్ల వివరాలను పొందుపరిచారు. తాను చేసిన తప్పేంటి..? పోలీసులు నమోదు చేసిన కేసు ఏంటి..? అనేది అందరికీ అర్థం అయ్యేలా తెలుపుతూ.. తన సోషల్ మీడియాలో భారీ ట్వీట్ చేశారు.వర్మ భయపడి పరారీలో ఉన్నారనుకునే వారికి ఆయన పెద్ద షాకిచ్చారని చెప్పవచ్చు. అలాంటి ప్రచారాలతో ఆనందపడి సెలబ్రేట్ చేసుకునే వారికి బ్యాడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నారో తెలుపుతూ.. సుమారు 20కి పైగా పాయింట్లతో ఒక ట్వీట చేశారు.వర్మ తన ట్విటర్లో ఇలా షేర్ చేశారు..1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప.2. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు..?3. నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారట.4.ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే నలుగురు వేర్వేరు వ్యక్తులు , ఆంధ్ర ప్రదేశ్లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదు అయ్యాయి, అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదు అయ్యాయి.5.నాకు నోటీసు అందిన వెంటనే , నా సినిమా పనుల వల్ల, సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది . కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం , లేకపోతే విడియో ద్వారా హాజరు అవుతాను అని తెలియజేయడం జరిగింది. .. అదే టైమ్లో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు ,నా వాళ్లకు అనుమానం కలిగింది.6. నేను సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్గా ఉంటాను, చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని, ఒక సంవత్సర కాలంలో కొన్ని వేళ పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించినవి, ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగిపోయింది.7. నేను పెట్టాను అంటున్న పోస్టులు , వేటి వల్ల ఐతే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది.8. ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి.9. BNS 336(4) ఏం చెబుతుందంటే.. ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్టును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. అయితే, నేను చేసిన పోస్టుల చూస్తే , అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి? 10. BNS 353(2)తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం . అయితే, నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు.11. BNS 356. (1)ఎవరైనా మాటల ద్వారా గానీ , రాతల ద్వారా గానీ , సంకేతాల ద్వారా గానీ , చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం. ఇలాంటి మీమ్స్లపై పరువు నష్టం కేసులేస్తే రోజుకి లక్ష కేసులు కూడా దాటుతాయి.12. BNS 61(2)ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక: మోసపూరిత విధానంలో చద్దబద్దమైన ఫలితం పొందడం. అయితే, దీనితో నాపై ఉన్న కేసుకు లింక్ కెంటి..?13. BNS 196 వేర్వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మ స్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం.14. SECTION 67 IT act ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడిన లేదా ప్రసారం చేసిన లేదా ప్రసారం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా, కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించటం. Section 67 కేవలం అసభ్యకర విషయాల్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం. అయితే, ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది.. ?15. నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం , భారత రాజ్యాంగం ARTICLE 19(1)a ప్రకారం న్యాయబద్దమైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్చగా తెలియజేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు.16. ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూలస్తంభం వాక్ స్వాతంత్రం. దాని ప్రథమ లక్షణం, ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్గా మాట్లాడగలగడం.. అదే విధంగా ఇతరుల నుంచి ఏ విధంగానైనా వచ్చే వాటినీ స్వీకరించటం. ఇది స్వేచ్చ ప్రధాన హక్కు, ఈ హక్కు ను నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం.17. ఈ మీమ్ అనే భావప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను,భావాలను, ఉద్దేశాలను, శైలీని,ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్లొ ముఖ్య భాగం అయ్యింది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే.18. మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ,బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తుంటారు… ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసు పెట్టాలి.19. ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే.. నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకు హాజరు కావటానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనటానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు నా ఆఫీసుకు వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీసులోపలకి రాలేదు, నన్ను అరెస్టు చేయటానికి వచ్చాం అని కూడా చెప్పలేదు.20. ఇప్పుడూ మీడియాలో వస్తున్న కథనాలు… నన్ను పట్టుకోవటానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు, వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు, నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు.. కానీ ఈ మీడియా ప్రతిసారి మాదిరే హై డ్రామా క్రియేట్ చేసింది.21. నేను నా మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రధాన కారణం, లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి. ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైమ్కి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నామీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదవటం అనేది ఏదో కుట్ర జరుగుతుంది అనిపించింది. అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తీనీ లేక ఒక గ్రూప్నీ నిందించటం లేదు. కానీ, వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థం అవుతోంది.22. నేను చట్టాన్ని గౌరవిస్తాను. అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలును కచ్చితంగా పాటిస్తాను. కాని దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను.ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ కేరక్టర్గా చేసి ఒక సినిమా తీసింది. నాకు కూడా వాళ్ళకున్నత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో?నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews 1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ…— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024 -
'సారీ' చెప్తారా అనే ప్రశ్నకు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చిన వర్మ
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన నివాసానికి వచ్చిన సమయం నుంచి ఏపీలో పెద్ద చర్చనీయాంశం అయింది. అయితే, తాజాగా వర్మ పాల్గొన్న ఇంటర్వ్యూలో తన కేసుల విషయంపై పలు సంచలన విషయాలను వెళ్లడించారు. ఇంతకీ వర్మను అరెస్ట్ చేసేందుకే పోలీసులు ఆయన డెన్కు వెళ్లారా..? కేసుల భయంతో వర్మ తప్పించుకున్నారా..? పారిపోయారా..? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.'సంవత్సర క్రితం నేను చేసిన పోస్ట్కు నాలుగు జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విషయంలో నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రాలేదు. వర్మను అరెస్ట్ చేస్తున్నామని వారు కూడా ఇంతవరకు తెలపలేదు. నేను తప్పించుకుని తిరుగుతున్నానని ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడా చెప్పలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు గేటు బయటే ఎందుకున్నారు. అరెస్ట్ చేయాలనుకున్నవారు లోపలికి రావచ్చు కదా.. కానీ, వాళ్లు రాలేదు. ఈ కేసుల వెనక ఎవరున్నారని తెలుసుకునేందుకే నేను కోర్టుకు వెళ్లాను. నేను బాగానే ఉన్నాను. అయితే, ఎలా ఉన్నానంటూ నా సన్నిహితులు చూపుతున్న సానుభూతి భరించలేకున్నా.' అని తనదైన స్టైల్లో ఆయన చెప్పారు.నేను ఎప్పుడో చేసిన పోస్ట్లపై ఇప్పుడు కేసులు పెడుతున్నారు. నాపై కేసులు పెట్టిన ఆ తొమ్మిది మంది నా పోస్టులను ఇప్పుడే చూశారట. అందుకే కేసులు పెట్టారట. ఇది నమ్మే విషయమా..? నేను కేసులకు భయపడను ఐ డోంట్ కేర్. న్యాయవ్యవస్థ అంటే నాకు గౌరవం ఉంది.పోలీసుల మీదా నమ్మకం ఉంది. చట్ట ప్రకారం వారు ఎలాంటి చర్యలు తీసుకున్నా అంగీకరిస్తా.' అని ఆయన అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా కేసులు విషయంలో సారీ ఏమైనా చెప్తారా..? అనే ప్రశ్నకు వర్మ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. కేసులు, ఏపీ రాజకీయ అంశాలపై వర్మ చెప్పిన సంచలన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. -
ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్వర్మ మరో పిటిషన్
కేసుల నేపథ్యంలో ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రామ్ గోపాల్వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్పై ఆంధ్రప్రదేశ్లో అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషనల్లో వర్మ పేర్కొన్నారు. ఒకే విషయంపై ఇన్ని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేయడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. ఇకపై ఇదే పోస్ట్ విషయంలో కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోర్టును ఆర్జీవీ కోరారు. ఆపై ఇప్పటి వరకు తన మీద నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషనల్లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారించనుంది.ఆంధ్రప్రదేశ్లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని రాంగోపాల్వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం తాను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఆయన అన్నారు. సంబంధంలేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు. -
నీటిలో తేలియాడే రాజధానా?
వెనుకబడిన ప్రాంతాల ఆకాంక్షలు నెరవేరినప్పుడే సమగ్ర అభివృద్ధి జరిగినట్లు. అలా కాకుంటే ప్రాంతాల మధ్య అసమా నతలు పెరిగిపోతాయి. అంటే పేదరికం, నిరుద్యోగం ప్రబలడం, పెత్తందారులు, బలవంతులు పేట్రేగిపోవడంజరుగు తుంది. దాని ఫలితంగా తీవ్రవాదం వైపు పీడితులు ఆకర్షితులు అవుతారు. అత్యంత వెనుకబడిన 1.59 కోట్ల జనాభా కలిగిన రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇచ్చి సమా నాభివృద్ధి సాధించామని శాసనసభలో చెప్పడం సరికాదు. విభజన చట్టంలో పొందుపరచిన ఎయిమ్స్, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ,బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, హార్టికల్చర్ హబ్, హైకోర్టు, లా యూనివర్సిటీ, లా అకాడమీ, కియా లాంటి పరిశ్రమల ఏర్పాటుతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడం వల్లనే రాయ లసీమ అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం తదితర చర్యల ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికీ కృషి చేయాలి.అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఉమ్మడి సంప దను అన్ని ప్రాంతాలవారికీ సమానంగా పంచడం. అది భిక్ష కాదు. అభివృద్ధి ఫలాలు పొందడం ప్రతి పౌరుని హక్కు. ఇప్పటికే ఏడాదికి మూడు పంటలు పండుతూ అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన అమరావతి నిర్మాణానికి ఐదేళ్లలో 50 వేల కోట్లు ఖర్చు పెట్ట పూను కోవడం ఏ పాటి వికేంద్రీకరణో, ఎటువంటి న్యాయమో పాలకులే చెప్పాలి. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని మేధావులు చెప్పినా వినకుండా ఒక వర్గం, కేవలం 29 గ్రామాల ప్రాంత ప్రయో జనాల కోసమే లక్ష కోట్లు ఖర్చు పెడతామని టీడీపీ ప్రభుత్వం అనడం సమంజసమేనా? 2014 నుండి 2019 వరకు 5,000 కోట్లు తాత్కాలిక నిర్మా ణాల కోసం చేసిన ఖర్చు నీటిపాలు అయ్యింది. నేడు మరలా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)ల నుంచి 15 వేల కోట్లు, హడ్కో నుంచి 12 వేల కోట్లు, ఇతర సంస్థల నుండి రుణాలు, బాండ్ల ద్వారా 23 వేల కోట్లు... మొత్తం 50 వేల కోట్లు అప్పులు చేసి, ఐదేళ్లలో ఖర్చు పెట్టాలని ప్రభుత్వం పూనుకుంది. 2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు అనగా ఐదు నెలల కాలంలోనే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి బడ్జెట్లో నిధులు కేటా యించింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ష్యూరిటీతో ఏడీబీ ద్వారా తీసుకుంటున్న 15 వేల కోట్ల రూపాయలలో కేవలం అమరావతి రక్షణ చర్య లకే... అంటే కొండవీటి వాగు, బుడమేరు వంక నీటి మళ్లింపు కాలువలు; కృష్ణా నది కరకట్ట, వివిధ రిజర్వాయర్ల నిర్మాణం, డైవర్షన్, డ్రైనేజీ కెనాల్స్, లిఫ్ట్ స్కీములకే రూ. 8000 కోట్లు ఖర్చు చేయాలని... అప్పు ఇచ్చే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నిర్మాణ ప్రాంతాన్ని పడవలలో ప్రయాణం చేసి తనిఖీ చేసిన తర్వాత నిర్ణయించడాన్ని బట్టి అది ‘నేల మీద నిర్మించే రాజధాని కాదు, నీటి మీద నిర్మించే తేలియాడే (ఫ్లోటింగ్) రాజధాని’ అని అర్థమయిపోతుంది. రాష్ట్రంలో సువిశా లమైన భూములు ఉండి కూడా తేలి యాడే రాజధాని నగరాన్ని నిర్మించడం వెర్రితనం.కాబట్టి టెక్నాలజీకి మేమే ఆదిగురువులమని చెప్పుకునే కూటమి నాయకులు శాస్త్రీయ పద్ధతులలో ఆలో చన చేసి అమరావతిలో శాసనసభ,సచి వాలయం నిర్మాణాలకు పరిమిత మైతే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. రాష్ట్రంలో ఉండే విశాఖపట్నం, తిరుపతి, కర్నూల్, అనంతపురం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలను పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్ది, ఆదాయ వనరులుగా మార్చుకోవాలి. అప్పుడే సంపద సృష్టికి వీలుంటుంది. లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు చెబుతున్న 2047 విజన్ సాకారం కాక పోగా, రాష్ట్రం అప్పులపాలై తాకట్టు పెట్టే పరిస్థి తులు తప్పవు, తస్మాత్ జాగ్రత్త!– కె.వి. రమణ ‘ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
అమరావతికి తరలించడం సమంజసమేనా?
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వ చర్యలూ, దాని ప్రాధాన్యతలపై సహజంగానే ప్రజలకు ఆసక్తి ఉంటుంది. కర్నూలు నుంచి న్యాయ సంస్థలు– ‘లోకాయుక్త’ మానవ హక్కుల కమిషన్, సీబీఐ కోర్టు, ఉన్నత ‘లా’ విద్యాసంస్థలు వంటి వాటిని అక్కడ నుంచి ‘అమరావతి’కి తరలిస్తున్నట్టు, స్థానికులు ఆందోళన చేస్తున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో... గత పదేళ్ల పరిణామాల సమీక్ష తప్పడం లేదు.ఈ విషయంలో మొదట ఒకమాట అనుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం బాగుంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఎందుకు రెండుగా విభజించబడింది అనే విషయంలో పదేళ్ళ తర్వాత అయినా మనకు స్పష్టత అవసరం. ఇక్కడ రాష్ట్రాల్లో అయినా అక్కడ ఢిల్లీలో అయినా ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వంలోకి ప్రవేశించే ‘లెజిస్లేచర్’ కాకుండా, శాశ్వతమైన ‘ఎగ్జిక్యూటివ్’ అనే శక్తిమంతమైన వ్యవస్థ మరొకటి ఉంది. ఈ రెండింటిపై ‘జ్యుడిషియరీ’ ఉంది. ప్రభుత్వాలు ఉనికిలో లేని విరామాల మధ్య కూడా వాళ్ళు అధికారంలో ఉంటారు. అప్పటి ముఖ్యమంత్రి కె. కిరణ్కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే, 2014 ఫిబ్రవరి 20 నుంచి జూన్ 8 వరకు రాష్ట్రం ‘గవర్నర్ పాలన’లో ఉంది. దేశ ప్రాదేశిక భద్రత విషయమై గురుతరమైన బాధ్యత ఈ వ్యవస్థలకు ఉంటుంది. పరిపాలనలో కేంద్ర– రాష్ట్ర సంబంధాలు ఢిల్లీలో ‘హోమ్’శాఖ వద్ద ఎందుకు ఉంటాయో మనకు అర్థం కావాలి. అలాగే, 2014 మొదట్లో ‘యూపీఏ–2’ ప్రభుత్వంలో ఢిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయినప్పుడు; అధికారుల కమిటీ కాకుండా, ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎందుకు అధ్యక్షుడుగా ఉన్నారో మనకు అర్థం కావాలి. అటువంటి గ్రహింపుతో మొత్తంగా భారత ప్రభుత్వం సమగ్రమైన తూర్పు దృష్టి (లుక్ ఈస్ట్) ‘డ్రైవ్’ అంతా కేవలం ఆగ్నేయ ఆసియా వైపు ఎందుకు ఉందో కూడా మనకు తెలియాలి. కీలకమైన కేంద్ర మంత్రిత్వశాఖలు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఎందుకు తమ కార్యకలాపాల వేగాన్ని పెంచుతున్నాయో మనకు తెలియాలి. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణం రాష్ట్ర రాజధాని ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అది రాష్ట్ర పరిధిలోని అంశం. దానితో పనిలేకుండా కేంద్రం 2022 అక్టోబర్ నాటికి కాకినాడ వద్ద ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్’ సౌత్ ఇండియా కేంపస్ తెచ్చింది. మార్చి 2024 నాటికి బాపట్ల సమీపాన ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ దళాల కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పడింది. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గ నైజేషన్’ (డీఆర్డీఓ) రూ. 100 కోట్లతో ‘మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్’ మచిలీ పట్టణం సమీపాన నాగాయలంక దగ్గరలోని గుల్లలమోద వద్ద నిర్మి స్తున్నది. గత ప్రభుత్వంలో జరిగిన పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా బాపట్ల–బందరు రెండూ కూడా విజయవాడ, గుంటూరు నగరాలతో సంబంధం లేని సొంత కలెక్టరేట్లతో జిల్లా కేంద్రాలుగా మారాయి.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!కేంద్ర ఆర్థికశాఖ అనంతపురం జిల్లాలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్’ వంటి దేశంలోనే అత్యున్నత స్థాయి శిక్షణా సంస్థను 2022 నాటికి బెంగళూరు సమీపాన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించింది. అదే కాలానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి ప్రాంతాన్ని వేరుచేసి; సత్యసాయి జిల్లా పేరుతో కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ సంస్థ ఆ కొత్త జిల్లాలో ఉంది. మరి వీటిలో దేన్నైనా ఇది ఇక్కడ కాదు, అని మరొకచోటికి తరలించే ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ; లేదా ‘కూటమి’లో భాగస్వామి అయిన బీజేపీ నడుపుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు అనడం లేదనే సందేహం మనకు రావాలి. అప్పుడు ఐదేళ్ళ ప్రభుత్వాల అవసరాల కంటే, విస్తృతమైన దేశప్రయోజనాల కోసం కేంద్రంలో – రక్షణ, వాణిజ్యం, ఉపరితల రవాణా, రైల్వే, స్పేస్ సైన్స్, వంటి కొన్ని మంత్రిత్వశాఖల్లో– ‘ఏపీ’ కోసం ఒక ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది? అనే ప్రశ్న వైపుకు అవి మనల్ని మన రాష్ట్రం ‘జాగ్రఫీ’ వైపుకు తీసుకువెళతాయి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?అయితే, జరిగినవి ఏవీ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం మనపట్ల ప్రేమతో చేయలేదు. ‘మెతుకు ముట్టుకుంటే అన్నం సోకు తెలుస్తుంది’ అన్నట్టుగా, రాష్ట్ర విభజన జరిగి ఆ ‘షాక్’ నుంచి ఇంకా మనం కోలుకోక ముందే 2014 మధ్యలోనే బందరు వద్ద భూమి కూడా ఎంపిక చేసిన ‘మెరైన్ పోలీస్ అకాడమీ’ని ఇక్కణ్ణించి ఉత్తరాదికి వారు తరలించారు. అదే ఏడాది డిసెంబరులో ‘ఏపీ’కి కూడా మరొక ‘అకాడమీ’ ఇస్తున్నాం అన్నారు. ఇప్పటికి అటువంటిది ఏమీ లేదు. జరుగుతున్నవి అన్నీ ఇటీవల కొత్తగా వాడుకలోకి వచ్చిన ‘జియో – పాలి టిక్స్’లో భాగంగా దేశ ప్రాదేశిక అవసరాల మేరకు ‘బ్యురోక్రసీ’ స్థాయిలో జరుగుతున్న విధాన నిర్ణయాలు. ఇంతటి సమగ్రమైన వైశాల్యంతో మారిన కొత్త ‘మ్యాప్’లోని రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడగలిగినప్పుడే, ఇక్కడ అది అమలు చేయాల్సిన స్వల్పకాలిక – దీర్ఘకాలిక ‘ప్లానింగ్’ ఎలా ఉండాల్సిందీ దానికి అర్థమవుతుంది. అప్పుడు ఈ మొత్తంలో – ‘రాజధాని’ అనే అంశానికి ఉన్న జాగా ఎంతో కూడా మనకు అర్థమవుతుంది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
AP: అలా చేస్తే ప్రాంతీయ విద్వేషాలు రాజుకోవా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రాయలసీమకు మోసం చేసే పనులు చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనూహ్య విజయాలు అందించిన రాయలసీమ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తే పరిణామాలు ఎదుర్కోక తప్పదు. కర్నూలు నుంచి న్యాయవ్యవస్థకు చెందిన పలు కార్యాలయాలు, కడప నుంచి కేంద్ర ప్రబుత్వానికి చెందిన చిన్న, మధ్యతరహా పారిశ్రామిక కేంద్రాన్ని అమరావతికి తరలించేందుకు చర్యలు చేపట్టడం ఆ ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేసినట్లే. సీమ ప్రజల మనసులను గాయపరిచినట్లే. కర్నూలులో హైకోర్టుతో పాటు 43 ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలపెట్టింది. జ్యుడిషియల్ సిటీ నిర్మాణానికి సుమారు 273 ఎకరాల స్థలమూ కేటాయించింది. నేషనల్ లా యూనివర్శిటీ కోసం వంద ఎకరాలు ఇవ్వడమే కాకుండా రూ.వెయ్యి కోట్లు మంజూరు కూడా చేశారు. అయితే ఇప్పుడు వివిధ ఆఫీసులతోపాటు లా యూనివర్శిటీని కూడా తరలించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అన్న సందేహం వస్తోంది. 201419 మధ్యకాలంలోనే అనంతపురానికి కేటాయించిన ఎయిమ్స్ను చంద్రబాబు అండ్ కో మంగళగిరి తరలించింది. తాజాగా పులివెందులలోని ప్రభుత్వ వైద్యకళాశాలకు మంజూరైన యాభై ఎంబీబీఎస్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం వదులుకుంది. ఇవన్నీ ఆయన రాయలసీమకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నట్లుగానే చూడాలి. రాయలసీమ, ప్రత్యేకంగా కర్నూలు అన్నది ఒక సెంటిమెంట్. మద్రాస్ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతం అంతా భాగంగా ఉండేది. ఆ రోజులలో తెలుగు వారిని కూడా ఢిల్లీలో మదరాసీలు అనేవారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న ఆకాంక్షతో కోస్తా ప్రాంత నాయకులు ఇందుకోసం ప్రజలను సమీకరించడం ఆరంభించి పలు చోట్ల సభలను పెట్టేవారు. ఈ క్రమంలో రాయలసీమకు చెందిన రాజకీయ పార్టీల నేతలను కూడా కలుపుకుని వెళ్లాలని తలపెట్టారు. కానీ అప్పటికే కృష్ణా, గోదావరి నదులపై కొన్ని ప్రాజెక్టులు కోస్తాలో ఉండడం, తద్వారా రైతులు ఆర్థికంగా ముందంజలో ఉండటం తదితర కారణాలను చూపుతూ రాయలసీమ నేతలు పలు సందేహాలను లేవనెత్తారు. ఆ దశలో ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు దేశోద్దారక నాగేశ్వరరావు పంతులు తన శ్రీబాగ్ నివాసంలో ఇరు ప్రాంతాల నేతలతో సమావేశం జరిపి ఒక అవగాహన కుదిరేందుకు కృషి చేశారు. అప్పుడు వివిధ అంశాలతో ఇరుప్రాంత నేతలు చేసుకున్న ఒప్పందమే శ్రీ బాగ్ ఒప్పందం. దాని ప్రకారం రాజధాని ఒక చోట ఉంటే, హైకోర్టు మరో చోట ఉండాలి. తదుపరి రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో ఆంధ్ర ఉద్యమం ఉదృతం అయింది. చివరికి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో జవహర్ లాల్ ప్రభుత్వం దిగివచ్చి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించింది. ఆ సమయంలో ఎక్కడ రాజధాని చేయాలన్న చర్చ మళ్లీ ఏర్పడింది. గుంటూరువిజయవాడతో పాటు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు వంటి నగరాలపై ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. అప్పటికే తెలుగు వారంతా ఒక్కటి కావాలన్న భావన ఉండడంతో, భవిష్యత్తులో తెలంగాణతో కూడిన ఉమ్మడి ఏపీ ఏర్పాటైతే హైదరాబాద్ రాజధాని అవుతుందన్న అభిప్రాయం ఏర్పడింది. ఆ దశలో సీమాంధ్రకు కర్నూలును రాజధాని చేయాలని, గుంటూరు వద్ద హైకోర్టు పెట్టాలని నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రకారం కర్నూలులో శాసనసభను ఏర్పాటు చేసుకున్నారు. గుంటూరులో హైకోర్టు నిర్వహించారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత రాజధాని, హైకోర్టు రెండూ హైదరాబాద్ లోనే స్థాపితమయ్యాయి. అదృష్టమో, దురదృష్టమో అప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి సాగుతూ వచ్చింది. అయినా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను ఆరంభించారు. దానికి రాజకీయ కారణాల కూడా తోడయ్యాయి.1969లో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో నడిచింది.తదుపరి 1973 ప్రాంతంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడే రాష్ట్రం విడిపోయి ఉంటే ఎలా ఉండేదో కాని, అప్పట్లో ఆరుసూత్రాల పథకాన్ని కేంద్రం ప్రకటించింది. విశేషం ఏమిటంటే దానివల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆరు జోన్ లు ఏర్పాడడం మినహా, మళ్లీ అభివృద్ది అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది. సెంట్రల్ యూనివర్శిటీతో సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ చుట్టూరానే ఏర్పాటయ్యాయి. అంతకుముందు వచ్చిన ఉక్కు ఉద్యమం కారణంగా విశాఖపట్నంలో స్టీల్ ప్యాక్టరీ మాత్రం వచ్చింది. ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ కు వలస వెళ్లడం ఆరంభం అయింది. 2001నుంచి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం రకరకాల రూపాలు దాల్చుతూ 2014 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యత వరకు వెళ్లింది. కాంగ్రెస్, బీజేపీలతోపాటు చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ విభజనకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంతో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్ర విభజన వల్ల అధిక నష్టం జరిగింది సీమాంధ్ర ప్రాంతానికే అని అంతా అంగీకరిస్తుంటారు. అప్పుడు మళ్లీ రాజధాని సమస్య మొదటికి వచ్చింది. ఉమ్మడి హైదరాబాద్ పదేళ్లు రాజధానిగా ఉండాల్సి ఉన్నా, ఓటుకు నోటు కేసు కారణంగా చంద్రబాబు ప్రభుత్వం ఆకస్మికంగా ఏపీకి తరలివెళ్లాలని నిర్ణయించుకుంది. శ్రీబాగ్ ఒడంబడిక అంశం తిరిగి తెరపైకి వచ్చింది. విజయవాడగుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నందున కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఆ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. అయినా అప్పట్లో ప్రభుత్వం అంగీకరించలేదు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరుతో రాజధాని ఏర్పాటు చేయడం, అక్కడే అన్ని ఆఫీస్ లు నెలకొల్పాలని నిర్ణయించుకోవడం జరిగింది. తదుపరి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ,కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్న లక్ష్యంతో మూడు రాజధానుల విధానానికి శ్రీకారం చుట్టింది. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తే అంతర్జాతీయంగా కూడా రాష్ట్రానికి గుర్తింపు తేవచ్చని అప్పటి ముఖ్యమంత్రి జగన్ భావించారు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. ఆ విషయంలో చట్టం కూడా చేయడానికి సంకల్పించినా తెలుగుదేశం పార్టీ పలు చిక్కులు కల్పించగలిగింది. దాంతో ఆ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని, 2024 ఎన్నికల తర్వాత ఆ ప్రణాళిక అమలు చేయవచ్చని భావించింది. కానీ వైఎస్సార్సీపీ ఓటమిపాలై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విశాఖలో కార్యనిర్వవహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మంగళం పలికినట్లయింది. అమరావతి రాజధానికి ఏభైవేల ఎకరాలకు పైగా సేకరించాలని తలపెట్టడం, తదితర అంశాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు తొలుత వ్యతిరేకించినా, ఆ తర్వాత కాలంలో అవి తమ వైఖరి మార్చుకున్నాయి. బీజేపీ అయితే రాయలసీమలో హైకోర్టుతోపాటు, సచివాలయం కూడా ఏర్పాటు చేయాలని ప్రత్యేక డిక్లరేషన్ కూడా ప్రకటించి, తదుపరి ప్లేట్ మార్చేసింది. జగన్ మాత్రం కర్నూలులో న్యాయ రాజధానిలో భాగంగా లోకాయుక్త, హెచ్ఆర్సీ, సీబై కోర్టు, లా యూనివర్శిటీ వంటివి కొన్నింటిని స్థాపించే ప్రయత్నం చేశారు. అమరావతిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కొన్ని ఆఫీసుల ఏర్పాటుపై టీడీపీతోపాటు ఈనాడు, జ్యోతి వంటి మీడియా వ్యతిరేక ప్రచారం చేశాయి. ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే అమరావతితోపాటు విశాఖ, కర్నూలు లకు జగన్ ప్రాధాన్యత ఇస్తే, మూడు ప్రాంతాలలో వైఎస్సార్సీపీ పరాజయం చవిచూసింది. ఈవీఎంల మహిమో, ప్రజల ఓట్లో కారణం తెలియదు కాని టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, కర్నూలు నుంచి వివిధ ఆఫీసులకు రంగం సిద్ధమవుతూండటం జరిగిపోయింది. ఇప్పుడు రాయలసీమ ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమలోని అధికార టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు దీనిపై బహిరంగంగా తమ అభిప్రాయాలను చెప్పలేకపోతున్నా, వారికి భయం పట్టుకుంటుంది. వైఎస్సార్సీపీ నేతలైతే కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆఫీసుల తరలింపుపై మండి పడుతున్నారు. లాయర్లు కూడా తమకు అన్యాయం జరుగుతోందని ప్రకటించి వారం రోజుల పాటు కోర్టుల బహిష్కరణ పాటించారు కూడా. ఈ ఆందోళనలు కాస్తా ఉద్యమరూపం దాల్చితే, మళ్లీ ప్రాంతాల మధ్య వివాదాలు చెలరేగే అవకాశం ఉంటుంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర వాసులు ఆగ్రహంగా ఉన్నారు. విశాఖ స్టీల్ను రక్షిస్తామని చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు స్వరం మార్చుతున్నారు. గతంలో టీడీపీ హయాంలోనే ఒకసారి విశాఖ నుంచి ఒక రైల్వే ఆఫీస్ ను విజయవాడకు తరలించాలని ప్రతిపాదనలు వస్తే ఆ ప్రాంత ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు. దాంతో అది ఆగింది. మరి ఇప్పుడు కర్నూలు నుంచి ఆఫీస్ లను తరలిస్తుంటే ప్రజలు ఏ స్థాయిలో స్పందిస్తారో అప్పుడే చెప్పలేం. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్దికి కేంద్రం రూ.250 కోట్లతో మంజూరు చేసిన కార్యాలయాన్ని కూడా తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టింది. ఇది కూడా రాయలసీమ వ్యతిరేక సెంటిమెంట్ కు దారి తీయవచ్చు. జగన్ కొప్పర్తి వద్ద పారిశ్రామికవాడను అభివృద్ది చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు దానికి విఘాతం కలుగుతుందా అన్నది కొందరి అనుమానం. అమరావతిలో కొత్త సంస్థలను తీసుకు రాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని కార్యాలయాలను అక్కడకు తీసుకువెళ్లడం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న కూడా ఉంది. హైదరాబాద్ లో మాదిరి అన్నీ అమరావతిలోనే కేంద్రీకరిస్తే నష్టం జరుగుతుందేమోనన్న భయం కూడా లేకపోలేదు. అయినప్పటికి టీడీపీ ప్రభుత్వం కేంద్రీకరణవైపే మొగ్గు చూపుతోంది. పేరుకు విశాఖను ఆర్థిక రాజధానిని చేస్తామని అంటున్నా అదెలాగో ప్రభుత్వం వివరించలేకపోతోంది.కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా, ఈలోగా లోకాయుక్త తదితర ఆఫీసులను తీసుకుపోవడం ఏమిటన్నది పలువురి ప్రశ్నగా ఉంది. అసాధారణ మాండేట్ వచ్చినందున తాము ఏమి చేసినా ఎదురు ఉండదని, రాయలసీమ ప్రజలు ఆందోళనలకు సిద్దమయ్యే పరిస్థితి లేదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. అలా ఆ ప్రాంత ప్రజలు ఎదిరించకపోతే కూటమికి ఇబ్బంది ఉండదు. కాని రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత చేతులు కాల్చుకోవడం కన్నా, ముందుగానే చంద్రబాబు నాయుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకుని దీనిపై నిర్ణయం చేస్తే మంచిదని చెప్పాలి. లేకుంటే ప్రాంతీయ విద్వేషాలు రాజుకునే ప్రమాదం ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విజయవాడ : ఉల్లాసంగా.. ఉత్సాహంగా..7వ అమరావతి బాలోత్సవం (ఫొటోలు)
-
Big Question: ఏపీకి శాపంగా అమరావతి.. కోస్తా, రాయలసీమకు ద్రోహం
-
అంతులేని.. అన్యాయం..!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. చట్టసవరణ చేసి కర్నూలు నుంచి తరలించనున్నట్లు హైకోర్టుకు నివేదించి రాయలసీమకు మరోసారి అన్యాయం తలపెట్టింది. ఏడు దశాబ్దాల నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పెద్దమనుషులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని దశాబ్దాలుగా అమలు చేయకుండా ప్రభుత్వాలు తాత్సారం చేశాయి. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు.అందులో భాగంగానే లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. ఆపై ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును కర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీఈఆర్సీకి శాశ్వత భవనాలు నిర్మించారు. ఈ క్రమంలో ‘న్యాయ రాజధాని’ కల సాకారం అవుతోందని అంతా భావించారు. అయితే ఇప్పటికే ఏర్పాటు చేసిన న్యాయ సంస్థలను సైతం అమరావతికి తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీబాగ్ ఒప్పందం బుట్టదాఖలు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పాటైంది. ఆపై హైదరాబాద్ విలీనం తర్వాత ‘ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భావం సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో ‘శ్రీబాగ్ ఒడంబడిక’ కుదిరింది. దీని ప్రకారం పరిపాలన రాజధాని, హైకోర్టు ఏర్పాటులో ‘సీమ’కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన రాజధాని హైదరాబాద్లో నెలకొల్పేలా నిర్ణయించారు. ఈ క్రమంలో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు కావాల్సి ఉండగా ఒప్పందాన్ని వీడి అది కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనను న్యాయవాదులు తిరస్కరించారు. లా వర్సిటీపై సందిగ్ధం.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. వైజాగ్లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉండగా గత ప్రభుత్వ కృషితో కర్నూలుకు మరో యూనివర్సిటీ మంజూరైంది. ఈ ఏడాది ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ఏర్పాటు కానున్నట్లు సీఎం తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. మరి కర్నూలులో ఇప్పటికే యూనివర్సిటీని నిలిపివేస్తారా? లేదా రెండు చోట్లా నిరి్మస్తారా? అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అమరావతి తెరపైకి వచి్చనందువల్ల కర్నూలులో యూనివర్సిటీ ఏర్పాటుకు శుభం కార్డు పడినట్లేనని న్యాయవాదులు చర్చించుకుంటున్నారు. సీమ టీడీపీ నేతల మౌనవ్రతం.. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన కూటమి పారీ్టలకు చెందిన ప్రజాప్రతినిధులు సీమకు పదేపదే జరుగుతున్న అన్యాయంపై గళం విప్పకపోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటైన సంస్థలను తరలిస్తున్నట్లు హైకోర్టుకు సర్కారు తేల్చి చెప్పినా ఏ ఒక్క టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు స్పందించకపోవడంపై మండిపడుతున్నారు. అందరూ హైకోర్టు కావాలన్నవారేకర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ, జనసేన సైతం గతంలో మద్దతు పలికాయి. మంత్రి టీజీ భరత్ తండ్రి, బీజేపీ నేత, రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘సీమ’లో హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు వంద రోజులకుపైగా రిలే దీక్షలు, ఆందోళనలు నిర్వహించారు. ‘సీమ’ జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ‘రాయలసీమ గర్జన’ పేరుతో కర్నూలులో పెద్ద ఎత్తున ఉద్యమించారు.కొప్పర్తి కడుపుకొట్టి..వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని సైతం అమరావతికి తరలిస్తున్నట్లు కూటమి సర్కారు ఇప్పటికే ఉత్తర్వులిచి్చంది. ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన రాయలసీమలోని కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కొప్పర్తిలోని మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ హయాంలో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే దీన్ని అమరావతికి తరలిస్తున్నట్లు సెపె్టంబర్లో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరటానికి బదులుగా ఇప్పటికే మంజూరైన దాన్ని తరలించడం సమంజసం కాదన్న పారిశ్రామిక, అధికార వర్గాల సూచనను పెడచెవిన పెట్టింది.న్యాయ రాజధాని దిశగా వైఎస్ జగన్ అడుగులు2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘సీమ’కు న్యాయం చేయాలని సంకల్పించారు. అనివార్య కారణాలతో ఇందులో జాప్యం జరగడంతో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టు ఏర్పాటైతే అనుబంధంగా ఏపీ అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్, క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్), రైల్వే అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, ఏసీబీ కోర్టు, కో ఆపరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్, ఎండోమెంట్ ట్రిబ్యునల్తో పాటు 43 అనుబంధ కోర్టులు ఏర్పాటయ్యేవి. ఇందుకోసం కర్నూలులోజగన్నాథగట్టుపై జ్యుడీషియల్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 273 ఎకరాలను సైతం కేటాయించింది. ఇందులో 100 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం న్యాయ సంస్థలను అమరావతికి తరలిస్తుండటంతో ‘సీమ’ వాసుల ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. -
బాబు మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరుపై మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సీఎం చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే.. అని కామెంట్స్ చేశారు. చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు.వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!. విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది.. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అమరావతి మీద ఉన్న ప్రేమ.. ఆదాయాలు తెచ్చిపెట్టే మిగిలిన నగరాలపై లేకపోవడం చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటాలు ఉత్త డాబు అని తెలిపోయింది.. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అమరావతి మీద ఉన్న ప్రేమ... ఆదాయాలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 13, 2024 -
బడ్జెట్లో మహిళలకు షాకిచ్చిన బాబు ప్రభుత్వం
అమరావతి, సాక్షి: మహిళకు బడ్జెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇవాళ ఆసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహాశక్తి పథకం కానరాకుండాపోయింది. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో బాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే తాజాగా బాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు ఏడాదికి రూ. 18,000 ఆర్థిక సాయం ఉసేత్తకపోవటం గమనార్హం.తల్లికి వందనం పథకానికి షాక్బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కేవలం రూ.2,491 కోట్లు కేటాయించారు. సూపర్ సిక్స్ హామీల్లో.. స్కూల్కి వెళ్లిన ప్రతి పిల్లాడికి రూ.15,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రు. 10 వేల కోట్లకు పైగా అవసరం ఉన్నా.. కేవలం రూ.2,491 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించారు. ఇక.. ఇంటర్ విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం లేనట్టే. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలు జరిగింది. ప్రతి ఏటా రూ. 6,400 కోట్లుకి పైగా అమ్మ ఒడి నిధులు గత వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. అమ్మ ఒడి ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.చదవండి: వ్యవసాయ బడ్జెట్: రైతుల్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు!చదవండి: ఏపీలో ఆగని తప్పుడు కేసులు, వేధింపులు.. అక్రమ అరెస్టులు -
AP Budget 2024: కోతల బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్
AP Assembly Budget Sessions 2024మోసం.. దారుణ మోసంసూపర్ 6 తొలి హామీ కి నిధులు కేటాయించని చంద్రబాబు ప్రభుత్వంనిరుద్యోగులకు బడ్జెట్ లో షాక్ ఇచ్చిన ప్రభుత్వంబడ్జెట్ లో ప్రస్తావన లేని రూ. 3 వేలు నిరుద్యోగ భృతి20 లక్షల ఉద్యోగాలు లేదంటే ప్రతీ నిరుద్యోగికి 3 వేలు భృతి ఇస్తానని ఎన్నికల ప్రచారం హామీ ఇచ్చిన చంద్రబాబుబడ్జెట్ లో కానరాని మహిళలకు ఉచిత బస్ హామీఎన్నికల్లో గెలవగానే మహిళలకు ఉచిత బస్ హామీ అమలు చేస్తామన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వ కోతల బడ్జెట్ఇటు వార్షిక, అటు వ్యవసాయ బడ్జెట్లో అన్నీ కోతలేవైఎస్ జగన్ హయాంలో అన్ని రంగాలకు ప్రోత్సాహం ఇప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మోసంబడ్జెట్ ప్రసంగాల్లోనూ వైఎస్సార్సీపీ పాలనపై అక్కసు వెల్లగక్కిన మంత్రులుఎన్నికల హామీల అమలు పేరుతో భారీగా లబ్ధిదారులకు కోత పెట్టే ప్రయత్నంఅందుకే పలు రంగాలకు సగం కంటే తక్కువ కేటాయింపులు!బడ్జెట్లో రైతులు, ఆడపడుచులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా తల్లికి వందనం పథకానికి షాక్బడ్జెట్ లో తల్లికి వందనం కి కేవలం 2,491 కోట్లు కేటాయింపుసూపర్ సిక్స్ హామీల్లో స్కూల్ కి వెళ్లిన ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తాం అన్న చంద్రబాబు10 వేల కోట్లకు పైగా అవసరం ఉన్న..2,491 కోట్లు మాత్రమే కేటాయింపుఇంటర్ విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం లేనట్టే!గతంలో వై ఎస్ జగన్ ప్రభుత్వం లో ఇంటర్ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలుప్రతి ఏటా 6,400 కోట్లుకి పైగా అమ్మ ఒడి నిధులు జమ చేసిన వై ఎస్ జగన్ ప్రభుత్వంఅమ్మ ఒడి ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా స్పష్టత ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం మహిళకు బడ్జెట్ లో షాక్ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంబడ్జెట్ లో కానరాని మహాశక్తి పథకం19 నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో హామీప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబుబడ్జెట్ లో మహిళల కు ఏడాదికి 18,000 ఆర్థిక సాయం ఉసేత్తని ప్రభుత్వంఏపీ బడ్జెట్: వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులిలాప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ..ఉద్యానశాఖకు రూ.3469.47 కోట్లు..అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్లు.వ్యవసాయ మార్కెటింగ్కు రూ.314.88 కోట్లు..పంటల బీమాకు రూ.1023 కోట్లు. -మంత్రి అచ్చెన్నాయుడు.ఏపీ బడ్జెట్: వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులిలారాయితీ విత్తనాలకు - రూ.240 కోట్లుభూసార పరీక్షలకు - రూ.38.88 కోట్లు విత్తనాల పంపిణీ - రూ.240 కోట్లు ఎరువుల సరఫరా - రూ.40 కోట్లు పొలం పిలుస్తోంది - రూ.11.31 కోట్లు. ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లురైతులకు బడ్జెట్ లో షాక్ ఇచ్చిన ప్రభుత్వంరైతుల పెట్టుబడి సహాయం హామిపై చంద్రబాబు ప్రభుత్వం పల్టీలుకేంద్రం ఇచ్చే 6 వేలు తో కలిపి ఇస్తామంటూ మెలికటీడీపీ మేనిఫెస్టోలో రైతులకు 20 వేలు చొప్పున ఇస్తామని ప్రకటనకేవలం 4,500 కోట్లు మాత్రమే అన్నదాత సుఖీభవ కి కేటాయించిన ప్రభుత్వంఏపీలో పెట్టుబడి సహాయం కి 52 లక్షల మంది 10 వేల కోట్లకు పైగా అవసరంకేవలం 4,500 కోట్లు మాత్రమే కేటాయించి షాక్ ఇచ్చిన ప్రభుత్వంభారీగా లబ్ధిదారులకు కోత పెట్టనున్న ప్రభుత్వం👉 వ్యవసాయ బడ్జెట్ పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండిఅచ్చెన్న నోట అబద్ధాలువ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడురూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్జగన్ హయాంలో సాఫీగా సాగిన రైతు బీమాబడ్జెట్ టైంలో అచ్చెన్న నోట అబద్ధాలుగత ప్రభుత్వం రైతుల పంటలకు బీమా అందించలేదు: అచ్చెన్నవడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తాం: అచ్చెన్నమిగతా వాటిల్లో..ఏపీ రహదారులు రంగానికి రూ.9,554 కోట్ల కేటాయింపుపర్యాటక రంగానికి 322 కోట్ల కేటాయింపుపవన్ శాఖలకు భారీగా..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలకు బడ్జెట్లో భారీగా కేటాయింపులుపంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ 16.739 కోట్లుఅటవీ పర్యావరణ శాఖకు 687 కోట్లు👉: ఏపీ బడ్జెట్ 2024 పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండిబడ్జెట్లో అప్పు ఇలా..ఈ ఏడాది 91,443 కోట్లు ప్రజా అప్పులు చెయ్యాలని నిర్ణయంబడ్జెట్ లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం2 లక్షల 1 వెయ్యి కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా24,498 కోట్లు అప్పులు చెల్లింపులు చేయనున్నట్టు పేర్కొన్న ప్రభుత్వంఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు..ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లుజలవనరులు రూ.16,705 కోట్లు..ఉన్నత విద్య రూ.2326 కోట్లు..పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు..పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు..ఇంధన రంగం రూ.8,207 కోట్లు..పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు..బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు..ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు..అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.ఊహించినట్లే సాగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలువార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్2, 94, 427 కోట్ల తో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్రెవెన్యూ లోటు 34,743 కోట్లుద్రవ్య లోటు 68,742 కోట్లుగత ప్రభుత్వంపై ఆరోపణలతోనే ప్రసంగం మొదలుపెట్టిన పయ్యావులపతనం అంచున ఆర్థిక వ్యవస్థ : మంత్రి పయ్యావులవిభజన నాటి విషయాల ప్రస్తావన కూడాసమాచార విప్లవాన్ని వినియోగించుకోవాలి : మంత్రి పయ్యావులశాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగింది : మంత్రి పయ్యావులరాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది : మంత్రి పయ్యావులగత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది.. గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదు : మంత్రి పయ్యావులగత ప్రభుత్వం ఉత్పాదక మూలధనాన్ని నిలిపివేసింది.. తద్వారా ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగింది: మంత్రి పయ్యావులరాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది : మంత్రి పయ్యావుల93 శాతం ప్రజల ఆమోదాన్ని కూటమి ప్రభుత్వం పొందగలిగింది : మంత్రి పయ్యావుల 2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు10 నుంచి 15 రోజులపాటు సమావేశాలు సాగించే యోచనలో కూటమి ప్రభుత్వంసమావేశాలకు దూరంగా వైఎస్సార్సీపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టేది ఎక్సైజ్ అండ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రఅసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టేది మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుమండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టేది మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ -
ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు..
సాక్షి, విజయవాడ: ఏపీలో మరోసారి పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రాస్ బదిలీ కాగా.. వ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి. హరిత బదిలీ అయ్యారు.తాజాగా బదిలీల ప్రకారం..ఆర్థిక శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్.పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలుస్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్ కుమార్ రెడ్డికార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడువ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరిత -
ఏపీ రాజధాని అమరావతికి తప్పని వరద ముప్పు
-
రాజధాని అమరావతికి ముంపు తప్పదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతమంతా ముంపునకు గురవుతుందని పేర్కొంది. వరద నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ.. కొండవీటి వాగుతోపాటు, పాలవాగు నుంచి వచ్చే వరద నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చింది. ఈ నేపథ్యంలో ముంపు నివారణకు భారీ వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.వరద నివారణ పనులు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏకంగా రూ.8,014.61 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్టు ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం వరద నియంత్రణ పేరుతో కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్ను రూ.450 కోట్లతో నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మొత్తం 20 ప్యాకేజీలలో వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్టు ప్రపంచ బ్యాంకు డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. విస్తుపోతున్న అధికారులు, నిపుణులువరద నివారణకు రూ.8,014.61 కోట్లు ఖర్చవుతుందని తెలిసి.. ఆ పనులు ప్రతిపాదించడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. వరద ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనే లోపభూయిష్టంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వరద నియంత్రణకు వెచ్చించే నిధుల్లో సగం ఖర్చుతోనే వరద ముంపులేని ప్రాంతంలో పరిపాలన భవనాలను నిర్మించవచ్చని అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని పేరుతో అమరావతిలోనే రూ.వేల కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం చూస్తుంటే.. మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.వరద నివారణ ప్రతిపాదనలు ఇలా..ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు అమరావతి ప్రాంతంలో వరద ముంపును నివారించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ.⇒ కొండవీటి వాగును (23.60 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒పాల వాగు (16.70 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒ శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ కొండవీటి వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ (7.82 కి.మీ,) నిర్మాణం ద్వారా కృష్ణా నదికి మళ్లించాలి.⇒ వర్షాకాలంలో అదనపు నీటిని డ్రెయినేజీలకు మళ్లించేందుకు కరకట్ట వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి. ⇒ ఉండవల్లి వద్ద 7,500 క్యూసెక్యుల సామర్థ్యంతో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి.⇒ వరద నీటిని నిలుపుదల చేసేందుకు కృష్ణాయపాలెంలో 1.7 మీటర్ల ఎత్తు కట్టతో 90 ఎకరాల్లో 0.1 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో రిటెన్షన్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ శాఖమూరు వద్ద 50 ఎకరాల్లో 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ నీరుకొండలో 400 ఎకరాల్లో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. -
20 మంది డీఎస్పీలను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు 20 మంది పేర్లతో కూడిన బదిలీల ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమల రావు పేరిట శుక్రవారం విడుదలయ్యింది. బదిలీ అయిన ప్రాంతాల్లో తక్షణమే రిపోర్టు చేయాలని ఆ డీఎస్పీలను ఆర్డర్ కాపీల్లో ఆదేశించారు.ఇదీ చదవండి: విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఓవరాక్షన్ -
చంద్రబాబూ.. ఇది మీరిచ్చిన వాగ్దానమే: వైఎస్ జగన్
అమరావతి: ఏపీలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక విద్యుత్ చార్జీలు పెంచడమేనా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రశ్నించారు. వచ్చే ఐదేళ్లు కరెంట్ చార్జీలు పెంచమంటూ ఎన్నిలక ముందు ఇచ్చిన హామీ ఏమైందంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు వైఎస్ జగన్. ‘ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తుచేస్తున్నా’ అంటూ చంద్రబాబు 2024 ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వీడియోను వైఎస్ జగన్ షేర్ చేశారు.తాము అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించేవాళ్లం అని గతంలో చెప్పిన మీరు.. ఇప్పుడు ప్రజలు ఎంతగా వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా? అని వైఎస్ జగన్ నిలదీశారు. ఇదే విషయంపై నిన్న(ఆదివారం) చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్ జగన్.. తాజాగా వీడియోను పోస్ట్ చేసి మరీ చంద్రబాబు మోసపూరిత విధానాన్ని బయటపెట్టారు. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తుచేస్తున్నా @ncbn pic.twitter.com/CriUf6Or4L— YS Jagan Mohan Reddy (@ysjagan) October 28, 2024కరెంట్ చార్జీల పెంపు దీపావళి కానుకా?: వైఎస్ జగన్ -
అమరావతి రైల్వే లైన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం వరకు 57 కిలోమీటర్ల మేర నిర్మాణం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమరావతి రైల్వేలైన్కు కేంద్రం ఆమోదం..
-
అమరావతి రైల్వేలైన్కు కేంద్రం ఆమోదం
సాక్షి, ఢిల్లీ: అమరావతి రైల్వే లైన్కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కృష్ణానదిపై 3.2 కిమీ మేర రైల్వే వంతెన నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. రూ. 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ నిర్మాణం జరగనుంది. రాజధాని అమరావతికి హైదరాబాద్, చైన్నె, కోల్కోత్తాకు అనుసంధానిస్తూ కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేయనున్నారు.ఐదేళ్లలో రైల్వే లైన్ పూర్తిచేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో రెండు నూతన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 6798 కోట్ల రూపాయలతో రైల్వే లైన్ల నిర్మాణం చేయనుంది. నర్కతీయ గంజ్-రాక్సౌల్-సీతా మరి-దర్భంగా-సీతా మరి-ముజఫర్పూర్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ చేపట్టనున్నారు.ఇదీ చదవండి: బాబుపై కేసుల సంగతి ఇక అంతేనా? -
29లోగా రఘురామను అరెస్టు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: అంబేడ్కర్ ఫ్లెక్సీని చించి దళితులను అవమానించడంతోపాటు ఎస్సీలను దూషించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై కేసు నమోదు చేసి ఈ నెల 29లోగా అరెస్ట్ చేయాలని మాల సంఘాల జేఏసీ, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆయనను అరెస్ట్ చేయకపోతే ఈ నెల 30న రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.రఘురామకృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం వద్ద మాల సంఘాల జేఏసీ, దళిత సంఘాల నేతలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. మాల మహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు, రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లి రాజే‹Ù తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: పత్రికా స్వేచ్ఛపై ‘రెడ్బుక్’ పడగ -
అమరావతి మునగలేదన్నారు..! మరి వరద సాయమేంటి బాబూ?
సాక్షి, అమరావతి: ‘ప్రపంచంలో అద్భుతమైన రాజధాని అమరావతి వరదల్లో మునగలేదు. ఒక్క ఇల్లూ దెబ్బతినలేదు. గిట్టనివారు దు్రష్పచారం చేస్తున్నారు. రాజధాని మునిగిందని ఎవరైనా ప్రచారం చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ అని ఇటీవల ఓ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన బహిరంగ ప్రకటన. కానీ, ఇదే చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో ఏకంగా 1,039 మందికి రూ. 80.88 లక్షల పరిహారం అందించింది. మరి ఇదేమిటి? రాజధాని మునగలేదన్న చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ ప్రాంతంలోని వారికి సాయం చేయడమంటే మునిగిందనేది సుస్పష్టం. దాచుకున్నా దాగని పచ్చి నిజం. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలోని 11 గ్రామాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు ఇళ్లు రెండు రోజులకు పైగా నీట మునిగాయని, ప్రజలు దుస్తులు, గృహోపకరణాలు కోల్పోయారని చెబుతూ ఈ ప్రాంత ప్రజలకు ఇటీవల ప్రభుత్వం పరిహారం అందించింది. వరద పరిహారం అందుకున్న గ్రామాల్లో ప్రస్తుతం శాసన సభ, సచివాలయం ఉన్న వెలగపూడి, కొత్త రాజధాని నిర్మాణం కోసం ప్రకటించిన రాయపూడి కూడా ఉన్నాయి. తుళ్లూరు మండలంలో వరద నష్టాన్ని బట్టి ఒకొక్కరి ఖాతాలో రూ.5 వేల నుంచి రూ.19 వేల వరకు జమచేశారు. దాంతోపాటు బియ్యం, నిత్యావసరాలను కూడా అందించారు. వెలగపూడి, రాయపూడిల్లో తీవ్ర వరద నష్టం ఆగస్టు నెల చివరి వారం, సెపె్టంబర్లో కురిసిన వరుస వర్షాలు రాష్టంలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా బుడమేరు గేట్లు ఎత్తేయడంతో వరద అంతా విజయవాడ నగరంపై పడింది. దాదాపు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పది రోజులకు పైగా ఇళ్లు నీటిలోనే ఉండిపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతోపాటు రాజధానిగా ప్రకటించిన తుళ్లూరు మండలంలోని 11 గ్రామాలు కూడా మునిగిపోయినట్టు అధికారులు గుర్తించారు.ప్రస్తుతం అసెంబ్లీ ఉన్న వెలగపూడి, కొత్త రాజధాని నిర్మిస్తామని ప్రకటించిన రాయపూడి గ్రామాలు సైతం ఉన్నాయి. అమరావతిలో కీలకమైన ప్రాంతాలైన వెలగపూడి, రాయపూడి గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని, 219 మంది నిరాశ్రయులయ్యారని అధికారులే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వీటితోపాటు మందడం, పెదపరిమి, తుళ్లూరు, మల్కాపురం, వెంకటాయపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, హరిశ్చంద్రపురం, ఉద్దరాయనిపాలెం తదితర 11 గ్రామాలూ ఉన్నాయని చెప్పారు. ఆ గ్రామాల్లో పక్కా ఇళ్లు, కచ్చా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రౌండ్ ఫ్లోర్లు రెండు రోజులకు మించి నీటిలోనే మునిగిపోయాయని నివేదికలో పేర్కొన్నారు. చుట్టూ నీరు చేరడంతో ప్రజల జీవనోపాధి సైతం కోల్పోయారని నివేదికలో వివరించారు. కానీ, సీఎం చంద్రబాబు మాత్రం రాజధానికి అసలు వరదే రాలేదని చెప్పారు. లంక ప్రజలకు అందని వరద సాయం తుళ్లూరు మండలంలో బుడమేరు, కృష్ణానదిని ఆనుకుని కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్దండరాయునిపాలెం లంక, రాయపూడి పెదలంక, హరిశ్చంద్రాపురం, బోరుపాలెంలోని కొన్ని నివాసాలు, లింగాయపాలెం, తాళ్లాయపాలెంలోనూ లంక గ్రామాలు ఉన్నాయి. వరద ఎక్కువగా రావడంతో ఈ లంకల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కానీ పరిహారం మాత్రం చాలా తక్కువ మందికి ఇచ్చారు. అమరావతికి మధ్యలో ఉన్న వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి, మందడం, మల్కాపురం, వెంకటాయపాలెం పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇక్కడి ప్రజల వార్షిక ఆదాయం రూ.10 వేలు, అంతకంటే తక్కువని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వం లంక గ్రామాలను పక్కనపెట్టి, రాజధాని ప్రాంతం మధ్యలో ఉన్న గ్రామాల్లోని ప్రజల ఖాతాల్లో వరద నష్ట పరిహారం సొమ్ము జమ చేసింది. దుస్తులు, ఇంట్లో సామగ్రి పాడైపోయినందుకు రూ.5 వేలు, 10 రోజులు ఉపాధి కోల్పోయినందుకు రోజుకు రూ.300 చొప్పున ఇంట్లో ఇద్దరికి కలిపి రూ.6 వేలు, ఇల్లు నీటిలో మునిగిపోయినందుకు నష్ట తీవ్రతను బట్టి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించారు. విడ్డూరం ఏంటంటే పరిహారం పొందిన వారిలో ఏడేళ్ల పిల్లలు, దశాబ్దం క్రితం గ్రామం వదిలి వెళ్లిపోయినవారు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నవారు సైతం ఉన్నారు. -
నాడు ఇంటింటికీ వలంటీర్లు.. నేడు పేదల బతుకులు నడిరోడ్డు పాలు
గత ఐదేళ్లు ఏ విపత్తు వచ్చినా... బాధితులు కాలు బయట పెట్టకుండానే ప్రభుత్వ సాయం అందింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ... వలంటీర్లు వెంటనే వచ్చి భరోసా కల్పించేవారు. కానీ... నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘రెడ్బుక్’ పాలనలో కనీసం బాధితుల నుంచి అర్జీలు కూడా స్వీకరించే నాథుడే కరువయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుడమేరు వరద బాధితులు పరిహారం కోసం వార్డు సచివాలయం... తహసీల్దార్ కార్యాలయం... కలెక్టరేట్ చుట్టూ మండుటెండలో కాళ్లరిగేలా తిరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. చివరికి గురువారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు ఇచ్చేందుకు కూడా అనుమతించలేదు. ఏకంగా కలెక్టరేట్ గేట్లు మూసేశారు. గేటు బయటే బాధితుల నుంచి సిబ్బంది, పోలీసులు అర్జీలు స్వీకరించారు. వృద్ధులు, గర్భిణులు, చంటి పిల్లలతో వచి్చన బాధితులు విధిలేక మురుగు కాలువల పక్కన, ఫుట్పాత్లపైన కూర్చుని నరకయాతన అనుభవించారు. పనులు మానుకుని పరిహారం కోసం తిరుగుతున్నాం.. దయచేసి మా గోడు వినండి.. అంటూ బాధితులు వాపోతున్నారు. గత ఐదేళ్లు కాలు కదపకుండానే వలంటీర్లు తమ ఇంటికి వచ్చి ప్రభుత్వ సేవలు అందించారని గుర్తు చేసుకుంటూ... కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కొరివిలా మారి అల్లాడిస్తోందని విచారం వ్యక్తంచేస్తున్నారు. – గాందీనగర్ (విజయవాడ సెంట్రల్) -
దెందులూరు కూటమిలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి,ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు రూరల్ మండలం కొల్లేరు లంక గ్రామం పైడి చింత పాడులో పెన్షన్ పంపిణిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.జనసేన గ్రామ సర్పంచ్ ముంగర తిమోతిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. గ్రామ సర్పంచిని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలు లేదంటూ సచివాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గ్రామంలో తాము చెప్పింది జరగాలంటూ జనసేన సర్పంచిని బండబూతులు తిడుతూ పిడిగుద్దులు గుద్దారు. ఇరు పార్టీల నేతలు బాహబాహికి దిగటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొత్తులో ఉంటూ తమపై దాడి చేయడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అమరావతి రైతులకు ప్లాట్లు ఎలా?
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం అమరావతి రైతుల నుంచి తీసుకున్న భూములకు తిరిగి వారికి ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్లాట్ల అభివృద్ధికి రూ. వేల కోట్ల నిధులు అవసరం కావడం, ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం ఖర్చు చేసే పరిస్థితి లేకపోవడంతో హామీ అమలుపై కూటమి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. రాజధాని నిర్మాణం కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 29 వేల మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలకు పైగా భూములు సేకరించారు. తీసుకున్న ఎకరాకు 1,450 గజాల చొప్పున ప్లాట్లను అన్ని వసతులతో అభివృద్ధి చేసి ఇస్తామని గత టీడీపీ ప్రభుత్వం రైతులకు ఒప్పంద పత్రాలు ఇచ్చి0ది. ప్రస్తుతం మరో 4 వేల ఎకరాలు సేకరించాలన్న ఆలోచనతో రైతుల నుంచి సీఆర్డీఏ భూములు తీసుకుంటోంది. ఇటీవల అమరావతి పరిధిలోని 29 వేల ఎకరాల్లో రూ. 34 కోట్లతో సీఆర్డీఏ కంప చెట్ల తొలగింపు పనులు చేపట్టింది. అయితే, ఈ పనులు పూర్తయ్యాక ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాల్సి ఉంది. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధికి దాదాపు రూ. 12 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని గతంలోనే అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు ఇంత మొత్తం నిధులు ఎలా సేకరించాలో.. పనులు ఎలా చేపట్టాలోనని సీఆర్డీఏ ఆందోళన చెందుతోంది. సీఆర్డీఏ అభివృద్ధి చేసే ప్లాట్లలో నివాస, కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. మాస్టర్ప్లాన్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లు అభివృద్ధి చేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, ఎస్టీపీలు, తాగునీరు సదుపాయాలు వంటివి కల్పించాలి. ప్లాట్లు పొందే రైతులకు ఇచ్చిన హామీ మేరకు వీటిని కల్పించాకే రైతులకు అప్పగించాలి. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక అవసరం.మునిగే ప్లాట్లు రైతులు తీసుకుంటారా? ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ వర్షం, వరద నీరు ఈప్రాంతంలో నిలిచిపోయింది. ఇప్పుడున్నట్టుగా ప్లాట్లు వేస్తే భవిష్యత్లో ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ప్లాట్లన్నీ నీట మునగడం ఖాయం. ఇలా చేసినట్టయితే వాటిని రైతులు తీసుకునే పరిస్థితి లేదు. ఆయా ప్లాట్ల ప్రాంతాలను పూర్తిగా మట్టితో ఎత్తు చేయాల్సి ఉంది. కానీ ఈ పనులన్నీ చేయడం ఇప్పుట్లో సాధ్యమయ్యే పని కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గతంలో సీఆర్డీఏ వేసిన అంచనా వ్యయమే రూ. 12 వేల కోట్లు దాటుతుండగా, ప్లాట్లు నీట మునగకుండా ఎత్తు చేయాలంటే రెట్టింపు నిధులు ఖర్చు చేయాల్సిందే. కానీ ప్రభుత్వం అంత మొత్తం ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. -
ఏపీలో 16 మంది ఐపీఎస్ల బదిలీ
విజయవాడ, సాక్షి: 16 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్పీ&ఎల్ ఐజీగా రవిప్రకాష్ఇంటిలిజెన్స్ ఐజీగా పీహెచ్.డి.రామకృష్ణఇంటిలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్పఅడ్మినిస్ట్రేషన్ డీఐజీగా అమ్మిరెడ్డిరోడ్ సేఫ్టీ డీఐజీగా సీహెచ్.విజయరావుడీజీపీ ఆఫీస్ ఏఐజీగా సిద్ధార్ధ్ కౌశల్విశాఖ సిటీ డీసీపీగా మేరీ ప్రశాంతిఅనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హాకాకినాడ మూడవ బెటాలియన్ కమాండెంట్గా ఎం.దీపికఒంగోలు పీటీసీ ప్రిన్సిపల్గా జి.ఆర్.రాధికఇంటిలిజెన్స్ సెక్యూరిటీ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్పీటీవో ఎస్పీగా కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డివిజయవాడ క్రైమ్ డీసీపీగా తిరుమలేశ్వర్ రెడ్డిడీజీపీ హెడ్ క్వార్టర్స్ కు అట్టాడ బాపూజీ ,కె.వి.శ్రీనివాసరావు అటాచ్ మెంట్👉చదవండి : 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్ -
వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మరోమారు కక్ష సాధింపు
వైఎస్సార్ కడప, సాక్షి: వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మరో మారు కక్షసాధింపుకు దిగారు. జిల్లాలోని కొప్పర్తి సెజ్లో కేంద్రం కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతికి తీసుకెళ్లారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొప్పర్తి నార్త్ బ్లాక్లో 19.5 ఎకరాల్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ప్రభుత్వం మారగానే కొప్పర్తికి మంజూరైన టెక్నాలజీ సెంటర్ను సీఆర్డీఏ పరిధిలోకి తీసుకెళ్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది. టెక్నాలజీ పార్క్ వల్ల యువతకు స్కిల్ ట్రైనింగ్, ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యాలు అందాల్సి ఉంది. కానీ చంద్రబాబు కడప యువత అవకాశాలను దెబ్బతీస్తూ జీవో నంబర్ 56ను విడుదల చేశారు. చదవండి : తిరుమల లడ్డు వివాదం : సిట్తో నిజాలు నిగ్గు తేల్చలేం -
100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన అంతా మోసమేనని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదంటూ విమర్శించారు వైఎస్ జగన్. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయన్నారు. గోరు ముద్దు గాలికి ఎగిరిపోయిందని, ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటివరకూ వసతి దీవెన, విద్యా దీవెను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 108, 104 ఉద్యోగులకు ఇప్పటివరకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ప్రజల జీవితాలతో ఆటలాడరని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. శుక్రవారం( సెప్టెంబర్ 20) తాడేపల్లిలో ప్రెస్మీట్ నిర్వహించిన వైఎస్ జగన్.. చంద్రబాబు 100 రోజుల పాలనను తూర్పారబట్టారు. ఇదీ చదవండి : చంద్రబాబు ‘లడ్డూ’ పాలిటిక్స్పై .. వైఎస్ జగన్ రియాక్షన్ప్రెస్మీట్లో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. స్టిక్కర్లు వేస్తారట! ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలు, ఆ తర్వాత చేసిన మోసం. తన 100 రోజుల పరిపాలన మీద తనది మంచి ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.ప్రతి ఇంటికి సచివాలయాల సిబ్బంది వెళ్లి ఆ స్టిక్కర్లు అతికించాలంట.సూపర్ సిక్స్ లేదు. సెవెన్ లేదు నిజానికి ఈ 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవెన్ లేదు. ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ అబద్ధాల మూటలు. దీంతో ఆయన ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు.ఎన్నికల ముందు చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఎలా ప్రచారం చేశారు? ఇంటింటికి వెళ్లి పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, మహిళలు కనిపిస్తే నీకు ఏటా రూ.18 వేలు అని, రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అంటూ.. ప్రతి ఇంటికి వెళ్లి, దుర్మార్గంగా ప్రచారం చేసి నమ్మించారు.ఈ 100 రోజుల్లో చంద్రబాబు చేసింది ఏమిటంటే.. మోసం మోసం.మొత్తం తిరోగమనం ఒకవైపున దారుణ పరిపాలన. మరోవైపు అన్ని రంగాల్లో తిరోగమనం. పిల్లలకు మూడు క్వార్టర్ల నుంచి విద్యాదీవెన అందడం లేదు. వసతి దీవెన కూడా లేదు.పిల్లలు ఫీజులు కట్టలేకపోతున్నారు. వారికి కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు.బడులన్నీ నిర్వీర్యం అయ్యాయి. గోరుముద్ద పోయింది. టోఫెల్ శిక్షణ లేదు. ఇంగ్లిష్ మీడియమ్నూ నీరు గారుస్తున్నారు.వైద్య రంగం కూడా నాశనమై పోతోంది. ఆరోగ్యశ్రీలో దాదాపు రూ.2 వేల కోట్ల బిల్లులు పెండింగ్. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి 108, 104 సర్వీసుల సిబ్బందికి జీతాలు లేవు.ప్రభుత్వం కడుతున్న కొత్త మెడికల్ కాలేజీలను, స్కామ్లు చేస్తూ, ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి.చంద్రబాబు హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు. పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తానని మోసం చేశాడు. చివరకు మా హయాంలో ఇచ్చిన రూ.13,500 కూడా లేకుండా పోయాయి.ఉచిత పంటల బీమా లేదు. సున్నా వడ్డీ పంట రుణాలు లేవు. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయింది. ఎరువులు, విత్తనాల కోసం రైతుల క్యూలు కనిపిస్తున్నాయి.ఏ రంగం చూసినా తిరోగమనమే.మా హయాంలో అన్నీ డోర్ డెలివరీ. ఇప్పుడన్నీ పోయాయి. ఎక్కడా పారదర్శకత లేదు.జన్మభూమి కమిటీలు వస్తున్నాయి. పెన్షన్ కోసం కూడా వారి ఇంటికే వెళ్లాలట.రెడ్ బుక్ పాలన. శాంతి భద్రతలు క్షీణించాయి.న్యాయానికి పాతర వేశారు. ధర్మానికి రక్షణ లేదు. ఆస్తులకు రక్షణ లేదు. దొంగ కేసులు పెడుతున్నారు. వేధిస్తున్నారు.అన్నింటా ౖడైవర్షన్ పాలిటిక్స్రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన మీద మేము ఢిల్లీలో ధర్నా చేస్తే, అదే రోజు మదనపల్లెలో ఏదో అగ్ని ప్రమాదం జరిగితే, దాన్ని సెన్సేషన్ చేసి, ఉన్నతాధికారులను ఛాపర్లో పంపించారు. ఆ ఘటన వెనక మా కుట్ర ఉందని దుష్ప్రచారం చేశారు.స్కూళ్లు, కాలేజీలు, గురుకుల విద్యా సంస్థల్లో ఆహారం బాగాలేదని విద్యార్థులు ఆందోళనకు దిగితే.. దాన్ని డైవర్ట్ చేసే విధంగా చంద్రబాబు తొలిసారి సీఎం అయి, 30 ఏళ్లు అయిందంటూ వేడుకలు.స్కిల్ స్కామ్లో తనను అరెస్టు చేశారని, తనకు బాగా దగ్గర, తనకు బంధుత్వం ఉన్న ఈనాడు గ్రూప్వాళ్ల, మార్గదర్శి నేరాలు బయట పెట్టడంతో.. ముంబై సినీ నటి జత్వానీని తీసుకొచ్చారు.ఆమెతో తప్పుడు ఫిర్యాదు చేయించి, అధికారులను వేధిస్తున్నారు.ఇక విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని, తుపాన్ వస్తుందని తెలిసినా, బుడమేరు గేట్లు ఎత్తుతారని ముందుగా తెలిసినా, కనీసం రివ్యూ చేయలేదు. ప్రజలను అప్రమత్తం చేయలేదు. ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయలేదు. కానీ చంద్రబాబు అవేవీ చేయకపోవడం వల్ల విజయవాడ మునిగింది. అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు కాల్వ కూడా వరద కూడా గ్రామాలను ముంచెత్తింది.ఇలా అన్నింటా చంద్రబాబు ఫెయిల్ కావడంతో, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చాలని కుట్ర చేసినట్లు ఆరోపణలు, దారుణ విమర్శలు చేశారు.నిజానికి ఆ బోట్లు చంద్రబాబు పార్టీ వారివి. నది నుంచి ఇసుక అక్రమంగా తరలించడం కోసం ఏర్పాటు చేసినవి. అవి వరదకు కొట్టుకొచ్చాయి.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే చర్యలు ముమ్మరం కావడంతో, డైవర్షన్ కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు.మరో దారుణ డైవర్షన్ కుట్ర..కోట్లాది భక్తుల మనోభావాలతో ఆటఇప్పుడు చంద్రబాబు 100 రోజుల పాలన. వైఫల్యం అన్నీ వెలుగులోకి రావడంతో.. మరో డైవర్షన్.తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడుతున్నారంటూ, మాపై ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు.ప్రజలు సూçపర్సిక్స్ హామీలపై నిలదీస్తారన్న భయంతో, దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు. రాజకీయాల కోసం చివరకు దేవుణ్ని కూడా చంద్రబాబు వదలడం లేదు.చంద్రబాబు ఎంత దారుణ విమర్శ చేశారంటే.. తిరుపతి లడ్డూ తయారీలో నాసి రకం నెయ్యి, జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యిని వాడారని అన్నారు.సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది మనో భావాలతో ఆడుకోవడం ధర్మమేనా?నెయ్యి, సరుకుల సేకరణలో పక్కా వ్యవస్థనిజానికి నెయ్యి సేకరణ ఎలా జరుగుతుంది? దాని విధివిధానాలు ఏమిటి? అందరూ తెలుసుకోవాలి.తిరుమలలో నెయ్యి సేకరణ రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి ఆరు నెలలకు టెండర్లు పిలుస్తారు. కంపెనీలు కోట్ చేస్తాయి. ఎల్–1గా ఎవరు ఉంటే, బోర్డు దాన్ని ఆమోదిస్తుంది.ఇది రొటీన్గా జరిగే కార్యక్రమం. కొత్తగా నియమాలు ఎవరూ మార్చలేదు.ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూకి ఎంత ప్రాశస్త్యం ఉందో అందరికీ తెలుసు. దాని కోసం వస్తువుల సేకరణ ఎప్పుడూ రొటీన్గా, పక్కా పద్ధతిలో జరుగుతుంది.మెటేరియల్ ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్తో పాటు, వారు ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్) సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకురావాలి.అలా దాంతో వచ్చిన ట్యాంకర్ నుంచి మూడు శాంపిల్స్ తీసి, మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే, ఆ ఇంగ్రేడియంట్స్ కానీ, నెయ్యిని కానీ వాడడానికి ఆ ట్యాంకర్ను, వాహనాన్ని ముందుకు పంపిస్తారు. మూడు శాంపిల్స్లో పక్కాగా క్వాలిటీ తేలితేనే వాడుతారు. లేకపోతే వెనక్కు పంపిస్తారు.మరి అలాంటప్పుడు కల్తీ నెయ్యి వాడారని, నాసి రకం సరుకులు వాడారని చెప్పడం అబద్ధం కాదా? అది ధర్మమేనా? న్యాయమేనా?టీటీడీలో మూడు టెస్టులునెయ్యి, ఇతర సరుకులు సరఫరా చేసేవాళ్లు ఎన్ఏబీఎల్ నుంచి సర్టిఫికెట్ తేవడంతో పాటు, టీటీడీలో చేసే మూడు టెస్టులు పాస్ అయితేనే.. వాటిని టీటీడీ వాడుతుంది.ఇది కొత్తగా వచ్చిన నియమం కాదు.2014–19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు ఇలా నెయ్యి, ఇతర సరుకులను వెనక్కు పంపారు.ఆ తర్వాత 2019–24 మధ్య కూడా 18 సార్లు ట్యాంకర్లను వెనక్కు పంపారు. ఎందుకంటే క్వాలిటీ టెస్టులో మంచి రిపోర్టు రాలేదు.అంటే తిరుమలలో ఇలా ఒక గొప్ప వ్యవస్థ, పద్ధతి, సంప్రదాయం ఉందన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాల్సింది పోయి, ఇలా పచ్చి అబద్ధాలు చెప్పడం దారుణం.అంత పచ్చిగా మాట్లాడడం ధర్మమేనా?తిరుమలలో కల్తీ నెయ్యి వాడారని, దాంతో లడ్డూలు తయారు చేశారని, ఆ లడ్డూలు ప్రజలు తిన్నారని చెప్పడం ఎంత దారుణం.ఈ రిపోర్టులు ఎవరి హయాంలోనివి?ఇక్కడ మరో విషయం చెప్పాలి.ఇప్పుడు రిపోర్టు వచ్చిన శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? చంద్రబాబు సీఎంగా జూన్ 12న ప్రమాణస్వీకారం చేస్తే.. ఒక ట్యాంకర్ వస్తే, జూలై 12న శాంపిల్స్ తీసుకున్నారు.మూడు టెస్టుల తర్వాత, రిపోర్టులు బాగా రాలేదు కాబట్టి, ఆ శాంపిల్స్ను జూలై 17న ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)కి పంపిస్తే.. వారు జూలై 23న నివేదిక ఇచ్చారు.ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు?మరి ఆరోజు నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారు? 2 నెలల నుంచి ఏం చేశారు? ఆ నివేదిక ఎందుకు దాచి పెట్టారు?.చంద్రబాబు 100 రోజుల పాలన తర్వాత, సూపర్సిక్స్ గురించి ప్రజలు నిలదీస్తుండడంతో, ప్రజల దృష్టి మరల్చేందుకు, రెండు నెలల తర్వాత, ఆ రిపోర్టులోని అంశాలు ప్రస్తావించి.. దాన్ని వక్రభాష్యం చేస్తూ.. నోటికొచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు. ఇది ధర్మమేనా?ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..– ఈ రిపోర్టులో ఏం కనిపిస్తోంది? స్టాండర్డ్ (ఎస్) వాల్యూ ఉండాలి. కానీ డీవియేషన్ ఉంది. అలా ఉంటే శాంపిల్ కంటెయిన్ ఫారిన్ ఫ్యాట్.. అంటే ఏమేం ఉండే వీలుందన్న అవకాశాలతో ఉన్న నివేదికను చదివి వినిపించారు.– ఏదైనా కానీ, ఒక రొబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉన్నందుకు గర్వపడాలి. అక్కడి ప్రాక్టీసెస్ ఎంత గొప్పవో చెప్పాలి. అందరికీ వివరించాలి.– కానీ, మనం ఏం చేస్తున్నాం? అక్కడ పక్కాగా ఒక వ్యవస్థ ఉన్నా.. ఇలా పచ్చిగా అబద్ధాలు చెప్పడం దారుణం.స్వామివారిని అభాసు పాల్జేస్తున్నారు– నెయ్యిలో నాణ్యత ఉంటేనే ట్యాంకర్ను అనుమతించే ఒక పక్కా వ్యవస్థ ఉన్నప్పుడు, మనమేం చేస్తున్నాం.. అబద్ధాలకు రెక్కలు కడుతున్నాం.కల్తీ నెయ్యి వాడారు. లడ్డూలు తయారు చేశారు. భక్తులకు ఇచ్చారు. వారు వాటిని తిన్నారని ప్రచారం చేస్తున్నారు.– అంటే మన గుడి, మన వెంకటేశ్వరస్వామిని అభాసుపాలు చేస్తున్నారు.– ఇంతకంటే దారుణ పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ప్రజలు ఆలోచించాలి.మరి వారెందుకు ఇవ్వలేదు?– వారు చేస్తున్న మరో ఆరోపణ. కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కెఎంఎఫ్)కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యికి కాంట్రాక్ట్ ఇవ్వలేదంటున్నారు.– ఎవరైనా టెండర్ వేయొచ్చు. ఎల్–1 కు కాంట్రాక్ట్ ఇస్తారు. ఇది పద్ధతి.– సరే, మరి ఇప్పుడు ఆ బ్రాండ్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు కదా.. మరి వారి పాలనలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కెఎంఎఫ్కు కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వలేదు?టీడీపీ ఆఫీస్లో ఎలా రిలీజ్ చేస్తారు?– మరో ఆశ్చర్యకరమైన విషయం. ఎన్డీడీబీ రిపోర్టును టీటీడీ ఆఫీస్లో ఎలా రిలీజ్ చేస్తారు. – అది కూడా చంద్రబాబు 100 రోజుల పాలన మంచి అంటూ ప్రకటనలు ఇచ్చిన రోజున. ఈ పద్ధతి ఎక్కడైనా ఉందా?నిజానికి మా ప్రభుత్వ హయాంలో టీటీడీలో చాలా మార్పులు తీసుకొచ్చాం.– టీటీడీలో ఉన్న ల్యాబ్ను సీఎఫ్టీఆర్ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్సి్టట్యూట్) సహకారంతో ఆధునీకరించాం. అక్కడి నుంచి నిపుణులను కూడా తీసుకొచ్చాం.– మాకు మంత్రివర్గం కూర్పు చాలా ఈజీ. కానీ టీటీడీ బోర్డులో పదవి కోసం కేంద్ర మంత్రులు మొదలు, పొరుగు రాష్ట్రాల సీఎంలు కూడా సిఫార్సు చేస్తారు. ఆ స్థాయిలో ప్రసిద్ధులను బోర్డులో నియమిస్తారు.– అలాంటి వారు ఈ కాంట్రాక్ట్లను ఆమోదిస్తారు.– అంత మంచి విధానం, వ్యవస్థ, దేవుడికి సేవ చేయాలన్న తపన ఉన్న వాళ్లు బోర్డులో ఉంటారు.– బోర్డు ఛైర్మన్గా పని చేసిన వారి గురించి చెప్పాలంటే.. వైవీ సుబ్బారెడ్డిగారు ఏకంగా 45 సార్లు అయ్యప్పమాల వేసుకున్నారు. అంత భక్తి ఆయనది.– అదే విధంగా కరుణాకర్రెడ్డిగారు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా విలువలు ఉన్న వారు.– తిరుపతి తిరుమలలో అంత మంచి వ్యవస్థ ఉంటే.. అక్కడా బురద చల్లుతూ దేవుణ్ని కూడా రాజకీయం చేయడం కేవలం చంద్రబాబుకే సాధ్యం.– అది మన దౌర్భాగ్యం.మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో అనేక మంచి కార్యక్రమాలు, పనులు జరిగాయి.– నవనీత సేవలు మొదలుపెట్టాం. అంటే కొండమీద గోశాల ఏర్పాటు చేసి, సొంతంగా పాలు, వెన్న తయారీ మొదలుపెట్టాం.– ప్రసాదాలు తయారు చేసే పోటులో కార్మికుల సర్వీస్ క్రమబద్థీకరించాం. వారి జీతాలు రెట్టింపు చేశాం.– దేశవ్యాప్తంగా అనేకచోట్ల జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించాం.– హైదరాబాద్తో సహా, దేశంలోని పలు చోట్ల, చివరకు అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయాలు కట్టింది వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే.– టీటీడీలో 9 వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా మా ప్రభుత్వ హయాంలోనే. చంద్రబాబు తన పాలనలో కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదు.– మఠాధిపతులతో మూడు విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మా హయాంలోనే. రెండుసార్లు నాన్నగారి హయాంలో జరిగితే, ఒకసారి మా హయాంలో నిర్వహించాం.– టీటీడీలో ఏదైనా మంచి జరిగింది అంటే.. ఆనాడు వైయస్సార్గారి హయాంలో, ఆ తర్వాత మా ప్రభుత్వ హయాంలోనే. ఇది వాస్తవం.ప్రధానికి, సీజేఐకి లేఖలు రాస్తాం– మన రాష్ట్ర పరువును, శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయ పరువును బజారుకీడుస్తున్న చంద్రబాబు వైఖరిని అందరూ గుర్తించాలి.– చంద్రబాబు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం, దురుద్దేశంతో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయడం ధర్మమేనా?– అందుకే దానికి చంద్రబాబుకు అక్షింతలు వేయాలని చెప్పి.. ప్రధానమంత్రితో పాటు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు కూడా లేఖలు రాస్తాను.నిజమా? కాదా? బేరీజు వేసుకొండి– ఎంత దారుణం. మంచి చేసి ప్రజల మన్ననలు పొందాలి.– కానీ ఇదెంత వరకు ధర్మం?. ఒక అబద్ధాన్ని సృష్టించడం, ఆ అబద్దాన్ని అమ్మడం. ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద చల్లడం? ఎంత వరకు న్యాయం?.– నేను ఇప్పటి వరకు చెప్పినవి నిజమా? అబద్ధమా? అని మీరే వెరిఫై చేసుకొండి. – నా ప్రతి మాట నిజం. వాస్తవం. ప్రతిదీ లాజిక్గా చెబుతున్నాను. ఇవన్నీ నేను చెప్పక ముందు, వారు చేసిన దుష్ప్రచారం. చెప్పిన అబద్ధాలు.. అన్నీ బేరీజు వేసుకొండి. తేడా మీరే గమనించండి.– రాజకీయాల కోసం ఇంతగా దిగజారడం ధర్మమేనా? న్యాయమేనా? రాజకీయాలు చేయాలంటే నేరుగా చేద్దాం.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం– మెడికల్ కాలేజీలపై ఇప్పటికే రూ.2400 కోట్లకు పైగా ఖర్చు చేశాం. 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరో 5 కాలేజీలు ఈ ఏడాది ప్రారంభమై ఉండేది. మనం కట్టిన బిల్డింగ్లు వారికి చూపెడితే సరిపోయేది.– అన్ని పనులు జరిగిన కాలేజీలను ఏకంగా ప్రైవేటుపరం చేయాలనుకోవడం ఎంత వరకు సబబు? అది ధర్మమేనా? న్యాయమేనా?– ఒక మెడికల్ కాలేజీ వస్తే, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా వస్తుంది. దాని వల్ల ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి.– అంతే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ సేవలు అందుబాటులోకి వస్తే, పోటీ తత్వం ఏర్పడి, ప్రైవేటు ఆస్పత్రులు కూడా రేట్లు తగ్గిస్తాయి.– మరోవైపు మెడికల్ సీట్లు పెరుగుతాయి. పిల్లలు ఇచ్చే ఫీజు, అక్కడే ఖర్చు చేస్తారు.బీజేపీ కూడా గుర్తించాలి– మన ఖర్మ ఏమిటంటే.. బీజేపీ నాయకులకు పూర్తి సమాచారం లేకపోవచ్చు. వాస్తవాలు తెలియకపోవచ్చు.– చంద్రబాబు పచ్చి అబద్ధాలు, మోసాల వ్యక్తి.– టీటీడీ బోర్డులో బీజేపీకి చెందిన వారు కూడా ఉన్నారు కదా? వారిని ఈ ప్రొసీజర్ గురించి తెలుసుకోమనండి. అప్పుడు వారు చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టాలి. – వారిలో సిన్సియారిటీ ఉంటే, చంద్రబాబుకు అక్షింతలు వేయాలి. ఇది ధర్మమేనా? అని అడగాలి.భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు– విషయం తెలియని వారికి భావోద్వేగాలు పెరుగుతాయి. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.– భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? మీరే చెప్పండి.– చంద్రబాబు అనే వ్యక్తికి దేవుడి మీద భక్తి ఉండదు. దేవుణ్ని కూడా రాజకీయాల కోసం వినియోగించుకునే అత్యంత హీనమైన మనసున్న వ్యక్తి. – ఆ మనిషికి ఏనాడూ భక్తి ఉండదు. ఎక్కడైనా చెడు జరిగితే, కేవలం ఆయన హయాంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు దేవుడంటే భయం, భక్తి లేదు. -
రాజధాని ఏర్పాటుపై బాబు వ్యూహాత్మకంగా లింకులు
-
శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా .. చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సవాల్
-
రాజధాని ఏర్పాటుపై బాబు వ్యూహాత్మకంగా లింకులు
-
మంత్రి, మాజీ ఐఏఎస్, ప్రపంచ బ్యాంకులకూ బుద్ధీ జ్ఞానం లేవా బాబూ?
‘అమరావతి మునిగిపోతోందని చెబుతున్న వాళ్లు బుద్ధి, జ్ఞానం లేని వాళ్లు’’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఆగ్రహంతో రగిలిపోతూ అన్నమాటలివి. చంద్రబాబు మనసులో తాను వైఎస్సార్సీపీని విమర్శిస్తున్నానని అనుకుని ఉంటారేమోగానీ.. వాస్తవానికి ఈ విమర్శ నేరుగా తగిలేది ఆయన మంత్రివర్గ సహచరుడు పి.నారాయణకే. ఎందుకంటే.. వరదొస్తే అమరావతి మునిగిపోతుందని, రాజధాని నగర నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది ఈ నారాయణ గారే. ఈ విషయాన్ని బుద్ధీ, జ్ఞానం లేకుండా మంత్రి బయటపట్టేశాడన్న కోపం బాబుకు ఉండి ఉండవచ్చు. కానీ నారాయణతో తనకున్న ఆర్థిక సంబంధాలు, ఇతర కారణాల రీత్యా నేరుగా ఏమీ అనలేక నెపాన్ని వైఎస్సార్సీపీపైకి నెట్టినట్టు కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి పాపం చంద్రబాబు బాధ అర్థం చేసుకోదగ్గదే. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్గా రాజధాని నిర్మాణాన్ని మార్చేసి తన వారికి మేలు చేయాలన్న ‘విజన్’కు గండి పడేలా ఎవరు మాట్లాడినా కోపం రాకపోతుందా మరి! వరదలొస్తే అమరావతి ప్రాంతం మొత్తం నీట మునుగుతుందన్నది బాబు ఆత్మకూ తెలిసిన విషయమే. కానీ మనసు చెప్పినట్లు నడుచుకునే నైజం బాబుది కాదు కాబట్టి... అమరావతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒంటికాలిపై లేస్తూంటారు. ‘‘నాలుకలు కత్తిరించాలి’’ అనబోయి తమాయించుకుని తాళాలు వేయాలని సెలవిచ్చారు. అయితే నోళ్లకు తాళాలు వేయాలన్నది నానుడి. నాలుకలకు కాదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసన భారీ వర్షాలకు అమరావతిలోని అనేక ప్రాంతాలు మునిగిపోయినట్లు స్పష్టంగా ఫొటోలూ, కథనాలు వచ్చాయి. అంతెందుకు.. చంద్రబాబు కరకట్టపై అక్రమంగా కట్టిన ఇంట్లోకి నీరు వచ్చిన సంగతి ఆయనకు తెలియకుండానైతే ఉండదు. కరకట్ట నివాసానికి దగ్గర్లోనే ఉండే ప్రకృతి చికిత్స కేంద్రంలోకి పెద్ద ఎత్తున కృష్ణా నది వరద నీరు చేరడం కూడా అందరి కళ్లెదుట జరిగిన ఘటనే. బుడమేరు రెగ్యులేటర్ షట్టర్లు అకస్మాత్తుగా ఎత్తేసి నీరంతా వదిలేయడంతో విజయవాడ మునిగింది కానీ లేదంటే బుడమేరు వరద నీరు మొత్తం కృష్ణలోకి చేరి అమరావతి ప్రాంతంలో వరదనీటి మట్టం మరింత ఎక్కువగా ఉండేది. అయినా... ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థ కూడా ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదని విస్పష్టంగా చెప్పినా... వాళ్లక్కూడా బుద్ధీ, జ్ఞానం లేదని చంద్రబాబు చెప్పదలిచారా? 201419 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్ కృష్ణ రావు వంటి ఐఏఎస్ అధికారి కూడా ఒక ఇంటర్వ్యూలో అమరావతిలోని పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయని స్పష్టంగా చెప్పారు. ఎగువన భారీ వర్షాలు కురవలేదు కనుక గుంటూరు జిల్లాలో కొండవీటి వాగు, ఇతర వాగుల నుంచి వరద ఎక్కువగా లేదని, కృష్ణకు వచ్చిన 11 లక్షల క్యూసెక్కుల వరదకు తోడు కొండవీటి వాగుకూ వరద వచ్చి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని ఆయన వివరించారు కూడా. నిజంగా అలాంటి పరిస్థితే వచ్చి ఉంటే వరదను కృష్ణా నదిలోకి మళ్లించడమూ సాధ్యమయ్యేది కాదని.. ఫలితంగా అమరావతి ప్రాంతం మరింత జలమయమయ్యేదని కృష్ణారావు ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి అన్న విషయంపై ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరముందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో అమరావతి ప్రాంతంలో సింగపూర్ కంపెనీకి కట్టబెట్టాలని యోచించిన భూమికి కూడా వరద ముప్పు ఉందని ఆయన తెలిపారు. ఇలా చెప్పినందుకు ఐవైఆర్ కృష్ణారావుకు కూడా బుద్ది లేదని అంటే ధర్మంగా ఉంటుందా? అమరావతిపై అనేక కోణాలలో అవగాహన కలిగిన కృష్ణారావు వంటివారు ఏపీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాట్లాడతారే తప్ప రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను ఆశించి కాదని అందరికి తెలుసు. ‘‘తా వలచింది రంభ.. తా మునిగింది గంగ’’ అన్నట్లు, చంద్రబాబుకు ఇష్టమైనది కనుక అమరావతి గురించి అంతా ఆహా, ఓహో అని పొగడాలని ఆయన కోరుకుంటు ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నోళ్లకు తాళాలు వేయడం చంద్రబాబుకు సాధ్యం కాకపోవచ్చు. ‘‘నీళ్లు కిందకు ప్రవహిస్తాయని ఆకాశంలో కట్టుకుంటామా!’’ అని బాబు వ్యాఖ్యానించడమే కాకుండా... ఏ మహా నగరం మునగలేదో చెప్పాలని విచిత్ర, వితండ వాదానికి దిగడం ఆయనకే చెల్లింది. అమరావతికి మల్లే కర్నూలు, బెంగళూరు, ముంబై వంటి నగరాలను లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టలేదు. కాలక్రమంలో అవి ఎదుగుతూ మహా నగరాలయ్యాయి. కొన్ని సమస్యలూ వచ్చి ఉండవచ్చు. కాదనలేము. కానీ లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి ముంపు ప్రాంతంలో రాజధానిని కట్టాలన్న బాబు మంకుపట్టుతోనే వస్తోంది సమస్య మొత్తం! మూడు పంటలు పండే ప్రదేశాన్ని ధ్వంసం చేయవద్దని గతంలోనే శివరామకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పినా వినకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది చంద్రబాబు కాదా? పోనీ నాగార్జున యూనివర్శిటి సమీపంలో జాతీయ రహాదారికి రెండో వైపులా అందుబాటులో ఉన్న రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి కావాల్సిన భవనాలను నిర్మించినా ఈ రచ్చ ఈ స్థాయికి చేరేది కాదు. అమరావతి సంక్షోభానికి చంద్రబాబే కారణం కనుక, ఆ విషయం బయటపడకుండా ఎదుటివారిపై ,ముఖ్యంగా వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తూ డబాయిస్తుంటారు. తెలుగుదేశంతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి పత్రికలు అమరావతి మునగలేదని అబద్దపు ప్రచారం చేసినా, ప్రజలకు అక్కడ ఏమి జరిగిందో సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాలు మునిగాయి కనుక అమరావతి మునిగినా ఫర్వాలేదని ముఖ్యమంత్రి స్థాయిలోని వారు చెప్పవచ్చా? అక్కడ భూమి స్వతహాగా భారీ నిర్మాణాలకు అనువు కాదని 201419 హయాంలోనే తెలిసినా మొండిగా ముందుకు వెళ్లడం వల్ల ఏపీకి ఎంత ప్రయోజనమో తెలియదు. ఒక వైపు తాము ఇచ్చిన హామీల అమలుకు అసలు డబ్బులు లేవని, ఖజానా ఖాళీగా ఉందని చెబుతూ, మరో వైపు వేల కోట్లు అమరావతిలో వెచ్చిస్తామని అనడంలో తర్కమూ కనిపించదు. తొలి దశలో రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ ఇప్పటికే వెల్లడించారు. అంత డబ్బు ఎలా సమకూరుతుందో ఇంతవరకు క్లారిటీ రాలేదు. అసలు ఇదంతా సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని, పైసా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయవలసిన అవసరం లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు వేల కోట్ల అప్పులు తెచ్చి ఒక చిన్న ప్రాంతంలో ఖర్చు చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా రూ.10 15 వేల కోట్ల అప్పు ఆర్ధిక సంస్థల ద్వారా సమకూర్చడానికి కేంద్రం అంగీకరించింది. కానీ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ భిన్నమైన నివేదికను ఇచ్చింది. అయినా ఎక్కడో చోట మేనేజ్ చేసి అప్పులు తెస్తారేమో తెలియదు. దీనివల్ల రాష్ట్రంలో మళ్లీ అసమానతలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు. అనేక విద్యా సంస్థలను అమరావతిలోనే ఏర్పాటు చేస్తామని, లక్ష మంది విద్యార్ధులు చదివే అవకాశం ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడిందట. వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలియడంలా? వాటిలో ఎన్ని వస్తాయో, రావో కాని, నిజంగా వస్తే వికేంద్రీకకరించకుండా అన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తామనడం అన్యాయం అవుతుంది. కర్నూలులో ఏర్పాటు కావల్సిన లా యూనివర్శిటీని కూడా అమరావతిలోనే నెలకొల్పుతారట. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. కృష్ణా నది వరదలలో కొట్టుకు వచ్చి ప్రకాశం బారేజీని ఢికొట్టిన ఉదంతంలో వైఎస్సార్సీపీ కుట్ర ఉందని చంద్రబాబు ముందుగా డిటెక్టివ్ మాదిరి కనిపెట్టి ప్రకటించారు. దాంతో టీడీపీ మంత్రులు కూడా అదే పల్లవి అందుకుని ప్రచారం చేశారు. ఇంత నీచంగా టీడీపీ నేతలు ఇలా కుట్ర స్కీమ్ అమలు చేస్తున్నారేమిటా అని ఆలోచిస్తే అసలు విషయం బోదపడింది. కృష్ణానది వెంబడి ప్రకాశం బారేజీ ఎగువన భారీ గోడ నిర్మిస్తామని, తద్వారా అమరావతి వైపు వరద రాకుండా పరిరక్షిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అదన్నమాట అసలు సంగతి. నేరుగా ఆ గోడ కడతామని అంటే నది వరద జోన్ లో కరకట్టలోపల ఉన్న చంద్రబాబు, మరికొందరు ప్రముఖుల భవనాలు నీట మునగకుండా ఈ రిటైనింగ్ వాల్ కట్టబోతున్నారని ప్రజలు భావించి విమర్శించవచ్చు. దానికి ముందుగా ఈ బోట్ల కుట్ర ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ ఏదో చేసిందన్న తప్పుడు వాదనలు వినిపించాక ఈ గోడ ప్రతిపాదన తెస్తే పెద్దగా వ్యతిరేకత రాదని అనుకుని ఉండవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం బారేజీకి దిగువన ఉన్న విజయవాడలోని కృష్ణలంక తదితర ప్రాంతాలు మునగకుండా భారీ వాల్ నిర్మించారు. దాంతో గత వరదలలో అనూహ్యమైన రీతిలో నీటి ప్రవాహం ఉన్నా ఈ ప్రాంతం సేఫ్ అయింది. కాని ప్రకాశం బారేజీ ఎగువన ఇలా గోడ కట్టడం శాస్త్రీయంగా కరెక్టా, కాదా?అన్నది ప్రభుత్వం పరిశీలించాలి.తొందరపడి, తమ ఇళ్లు కాపాడుకోవడానికి ఇలాంటి నిర్మాణం చేస్తే ప్రవాహ వేగం పెరిగి ,అప్పుడు నిజంగానే బారేజీకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో అధ్యయనం చేసిన తర్వాతే సరైన నిర్ణయం చేయాలని చెప్పక తప్పదు. ఏది ఏమైనా అమరావతో, భ్రమరావతో,గ్రాఫిక్స్ మోజులో పడి చంద్రబాబు అక్కడ ముంపే లేదని,ముప్పు లేదని తనను తాను సంతృప్తి పరచుకునే యత్నం చేసుకుంటే,ఆత్మ వంచనే అవుతుంది. అది ఆయననే కాదు ..రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసినట్లు అవుతుంది. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని చంద్రబాబు హేతుబద్దంగా వ్యవహరించాలి.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Big Question: అమరావతితో యాపారం... నోరు జారి చంద్రబాబును ఇరికించిన నారాయణ
-
జనాలకు వాస్తవాలు తెలుస్తున్నాయని బాబుకు ప్రస్టేషన్: కాకాణి
సాక్షి, తాడేపల్లి: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయనందున చంద్రబాబును గాడిదల మీద ఊరేగించాలని అన్నారు. అమరావతి మీద మాట్లాడితే నోటికి తాళాలు వేస్తారా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రస్టేషన్ ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. అమరావతి మునగదని చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదని నిలదీశారు.జనం నోళ్లకు తాళం వేయటం కాదని, వరదలు రాకుండా కృష్ణానదికి తాళం వేయాలని చురకలంటించారు. వర్షాలు కురవకుండా ఆకాశానికి తాళం వేయాలని సెటైర్లు వేశారు. జనాలకు వాస్తవాలు తెలుస్తున్నాయని బాబు ప్రస్టేషన్లోకి వెళ్లిపోయారని విమర్శించారు. అమరావతిలోకి నీళ్లు వస్తున్నాయంటే కోపం ఎందుకని ప్రశ్నించారు.‘మెడికల్ కాలేజీలను ప్రయివేటుపరం చేయటంతో విద్యార్థులకు తీరని అన్యాయం. రైతులు అల్లాడిపోతున్నా పట్టింపులేదు. విద్యారంగం పూర్తిగా తిరోగమనం పట్టింది. ఇంగ్లీషు మీడియం రద్దు చేశారు. టోఫెల్, ఐబీ, సీబిఎస్ఈలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు. ప్రజారోగ్యానికి ఉరి వేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కు మంగళం పాడారు. విలేజ్ క్లినిక్ లకు గ్రహణం పట్టించారు’అని కాకాని మండిపడ్డారు. -
అమరావతిపై వాస్తవాల్ని తట్టుకోలేకపోతున్న సీఎం చంద్రబాబు
-
మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు
-
ప్రపంచ బ్యాంక్ వద్దన్నది.. అయినా అమరావతే రాజధాని
అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పింది. అయినా ఇక్కడే రాజధాని నిరి్మస్తాం. నవంబర్లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షాకాలానికల్లా వాగులు, కాలువలను విస్తరిస్తాం. నెదర్లాండ్స్ టెక్నాలజీ వినియోగించి అమరావతిలోని వాగులు, కాలువలపై రిజర్వాయర్లు నిరి్మస్తాం. – రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణసాక్షి, అమరావతి/తాడికొండ: అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని ప్రపంచ బ్యాంకు చెప్పిందని, అయినప్పటికీ ఇక్కడే రాజధాని నిర్మిస్తామని, నవంబర్లో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గతంలో అమరావతి ప్రాంతాన్ని పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, నిపుణులు ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని నివేదిక ఇచ్చినట్టు మంత్రి గుర్తు చేశారు. ఇటీవలి వరదల్లో దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా 2,017 చదరపు కిలోమీటర్ల అమరావతి ప్రాంతానికి ఏమీ కాలేదని చెప్పారు. మంత్రి సోమవారం విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, గుంటూరు జిల్లా తాడికొండలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసిందన్నారు. 2014–19 మధ్య 30 వేల మంది అమరావతిలో పనిచేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కృష్ణానది, బుడమేరు వరదలు విజయవాడలోని 32 డివిజన్లు, కొన్ని గ్రామాలను ముంచేసినా అమరావతికి ఏమీ కాలేదని చెప్పారు. గత ప్రభుత్వం అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేసిందని, కానీ కృష్ణా నది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బందీ లేదని అన్నారు. ఇక్కడ ముంపు భయం లేకుండా వచ్చే వర్షా కాలానికల్లా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ను విస్తరిస్తామని తెలిపారు. అమరావతి సేఫ్ జోన్లో ఉందని, రాజధాని డిజైన్ సమయంలోనే వరద సమస్య లేకుండా కాల్వలు, రిజర్వాయర్లకు ప్రతిపాదనలు చేశామని అన్నారు. -
మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే రాష్ట్రంలో ఉద్యమమే : జూపూడి
సాక్షి,అమరావతి : రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేస్తుందంటూ వైఎస్సార్సీపీ నేత జూపుడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీల్ని ఎలా ప్రైవేట్ పరం చేస్తారని మండిపడ్డారు.17 మెడికల్ కాలేజీల ద్వారా 5వేల మంది డాక్టర్లు తయారవుతారు. పేదలకు వైద్యాన్ని అందిస్తారు. అలాంటి వైద్యవిద్యను అందించే మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తే పేదలకు వైద్యం ఎవరందిస్తారని ప్రశ్నించారు. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడం మీకు ఇష్టం ఉండదా చంద్రబాబు అని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం పవన్ సమాధానం చెప్పాలని సూచించారు.5వేల మెడికల్ సీట్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పేదల తరుఫున తమ పార్టీ పోరాటం చేస్తుందని, అవసరమైతే విద్యార్ధి ఉద్యమం నడుపుతామని చంద్రబాబును హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నందింగ సురేష్ను పరామర్శకు వచ్చిన వైఎస్ జగన్ను కలిసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. జనానికి బుద్ధిలేదని విమర్శించే వ్యక్తిని చంద్రబాబునే చూస్తున్నాం. ఊసరవెల్లి లాంటి చంద్రబాబుతో రాజకీయం చేయాలంటే సమాజమే సిగ్గుపడుతోంది. వైఎస్ జగన్ ఛరిష్మా ఉన్న నాయకుడు. రెడ్ బుక్ పేరు చెబితే భయపడేవాళ్లు ఇక్కడెవరు లేరు. గోదావరి పుష్కరాల్లో ప్రజల ప్రాణాలను బలితీసుకున్న నేరస్తుడు చంద్రబాబు అని జూపుడి ప్రభాకర్ విమర్శలు గుప్పించారువందేళ్ల చరిత్రలో తొలిసారిగా..వైఎస్ జగన్ హయాంలో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించింది. 1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. -
చంద్రబాబు మరో మాయ.. ముందే లీకులు కూడా!
ఆంధ్రప్రదేశ్ ప్రగతికి రోడ్ మ్యాప్ తయారు చేస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక వార్త. ఇది నిజమే అయితే సంతోషించాల్సిన విషయమే. ఆ మొత్తం కథనం చదివితే ఎక్కడా సూపర్ సిక్స్ కానీ.. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు కనిపించలేదు. వాటికి రోడ్ మ్యాప్ ఎందుకు తయారు చేయడం లేదో చెప్పలేదు.కొత్త రోడ్ మ్యాప్లో ప్రధానంగా జనాభా మేనేజ్మెంట్(డెమోగ్రాఫ్ మేనేజ్మెంట్) గురించి ప్రస్తావించడం ఒక విశేషమైతే.. పీ-4(పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్) పాలసీ మీద కేంద్రీకరించారు. చంద్రబాబు గత కొంతకాలంగా చేస్తున్న ప్రచారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. రాష్ట్ర అభివృద్దికి ఇంతకు మించి మార్గం లేదని చంద్రబాబు నాయుడు అన్నారని ఈ ప్రతిక వెల్లడించింది. ఈ ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో ప్రయోజనాలు సాధించి తద్వారా సంపాదించే డబ్బును సంక్షేమానికి ఖర్చు పెట్టవచ్చని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హమీలు ఇప్పట్లో అయ్యేవికావని చెప్పడమేనా?.ప్రతీ మహిళకు నెలకు 15 వందలు, స్కూల్కు వెళ్లే ప్రతీ విద్యార్ధికి ఏడాదికి 15వేలు, ప్రతీ ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా మూడు వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వీటికి బాబు సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రచురించారు. దీనికి బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ అని టైటిల్ పెట్టారు. ఇందులో ఎక్కడా పీ-4 విధానాన్ని అమలు చేసి.. అంటే ప్రైవేటు రంగంతో కలిసి వ్యాపారాలు చేసి లేదా అభివృద్ది సాధించి అటు పిమ్మట వచ్చే డబ్బుతో ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తామని ఎక్కడా రాయలేదు.ఇవి కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అనేక హమీలు ఉన్నాయి. ఉదాహరణకు వాలంటీర్లను కొనసాగిస్తానని, వారికి గౌరవ వేతనం ఐదు వేల నుంచి 10వేలకు పెంచుతామని అప్పట్లో ప్రకటించారు. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. ఈ ష్యూరిటీలు.. భవిష్యత్ గ్యారంటీలు ఏమై పోయాయో కానీ ఇప్పుడు తాజాగా పీ-4 విజయవంతం అయితేనే సంక్షేమం మీద అధిక డబ్బులు ఖర్చు పెట్టగలుగుతామని సెలవిస్తున్నారు. సో.. మీడియా మేనేజ్మెంట్లో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు ఇదే ఏపీ గ్రోత్ అని.. దీనికి ఒక రోడ్ మ్యాప్ అని కథనాలు ఇప్పిస్తున్నారు.పరిశ్రమల అభివృద్ది, ఉపాధి, అమరావతి, పోలవరం, ఇంధన రంగం మొదలైన వాటి మీద ఫోకస్ చేస్తారట. అందులోనూ నైపుణ్య గణన వచ్చే రోజుల్లో గేమ్ చేంజర్ అవుతుందట. అన్న క్యాంటీన్లు, మౌళిక వసతులు అభివృద్ది, పోలవరం ప్రభుత్వ ప్రధాన ఎజెండా అట. వాటిపై డాక్యుమెంట్ తయారు చేయడానికి సీనియర్ అధికారులతో చర్చ జరిపారట. ఈ ఫలితాలు సాధించడానికి చంద్రబాబు.. అధికారులకు సలహాలు ఇచ్చారట. ఈ మొత్తం వార్త చూస్తే ఏమనిపిస్తుంది. సూపర్ సిక్స్లోని అంశాలు ఏవీ ప్రధాన ఎజెండాలో లేవని కొంత ప్రత్యక్షంగా.. కొంత పరోక్షంగా చెప్పేస్తున్నట్టే కదా?. ఆ సూపర్ సిక్స్ రాష్ట్ర భవిష్యత్కు గ్యారంటీ అని కదా ఎన్నికలకు ముందు చెప్పింది. చంద్రబాబు ష్యూరిటీ ఇచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చి ఏదేదో మాట్లాడుతున్నారు.పరిశ్రమల అభివృద్ది, పోలవరం నిర్మాణాన్ని ఎవరు వద్దు అంటారు?. అది నిరంతర ప్రక్రియ. పోలవరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసేది ఏమి లేదు. ఈయన టైంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ముందుగా పునరుద్దరణ జరగాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయ అంచనాలను ఆమోదించాలి. ఆ తర్వాత డబ్బు కూడా కేంద్రమే ఇస్తుంది. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును తాను చేపట్టి దానిని గందరగోళంలోకి నెట్టిన ఘనత చంద్రబాబుదే. అయినా ఇప్పుడు ఆ నెపాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇరవై లక్షల ఉద్యోగాలు ఏలా ఇచ్చేది ఈ రోడ్ మ్యాప్లో చెప్పలేదు. తన స్పీచ్లలో కూడా చంద్రబాబు ఎక్కడా ఇది చెప్పడం లేదు. వైఎస్ జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమలను మరోసారి ప్రారంభించి అది తన ఘనత అని ప్రచారం చేసుకుంటున్నారు.ఇక అమరావతి చూస్తే ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, సెల్ఫ్ ఫైనాన్స్గా తనే సమకూర్చుకుంటుందని ఇంత కాలం చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 15వేల కోట్ల రూపాయల అప్పును తీసుకువచ్చి అది ఏదో ఒక గొప్ప విషయంగా ఊదరగొడుతున్నారు. ఇక అక్కడే నాలుగేళ్లలో రూ. 60వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహరంలో ‘అన్న క్యాంటీన్లు’ పెట్టడం పెద్ద సంక్షేమ కార్యక్రమంగా చెప్పుకుంటున్నారు. సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచారు. ఇవి తప్ప మిగతా వాటిన్నింటికీ ఆయన పీ-4 విధానం కింద సంపాదించడం ద్వారానే అధిక ఖర్చు చేయగలుగుతామని జనానికి చెబుతున్నట్టుగా ఉంది. 2014-2019 మధ్య ఇలాంటి డాక్యుమెంట్లు తయారు చేయలేకపోలేదు. ప్రతీ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రోచర్ వేసి ప్రచారం చేసుకున్నట్టుగా ప్రభుత్వం అది చేస్తుంది.. ఇది చేస్తుంది అంటూ విమానాశ్రయాలు మొదలు అనేక హమీలు గుప్పించారు. కానీ, ఆచరణలో ఒక్కటి కూడా చేయలేకపోయారు.రుణ మాఫీ తదితర హామీలు సైతం అరకొరగా అమలు చేసి హుష్ కాకి అన్నారు. ఇప్పుడు ఏపాటి చేస్తారో కానీ.. పీ-4 విజన్ డాక్యుమెంట్, రోడ్ మ్యాప్ అంటూ జనాన్ని మాయ చేయడానికి వీలుగా మీడియాకు లీక్లు ఇస్తున్నారు. వీటికి తోడుగా ఇప్పుడు ఏపీలో జనాభాను పెంచుతారట. ఇప్పటికే జనాభా అధికమై దేశం అనేక సమస్యలు ఎదుర్కుంటుంటే ఆంధ్రప్రదేశ్లో పిల్లలను అధికంగా కనమని చంద్రబాబు సలహా ఇస్తున్నారు. తన కుటుంబంలో అమలు చేయని విధానాన్ని ఇతరులు అంతా చేయాలని చెప్పడమే హైలెట్. పిల్లలను ఎంత మందిని కంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని ప్రచారం చేసిన ఈయన ఇంతవరకు ఆ స్కీమ్ అమలు గురించే మాట్లాడడం లేదు. ఈ ఏడాది దానిని అమలుచేయడం లేదని ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అంటే చంద్రబాబును నమ్మి పిల్లలను కనేపనిలో ఉంటే ఏమవుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాదా!.పంచాయతీ, మున్సిపాలిటీ పదవుల కోసం ఆశపడి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కంటారని చంద్రబాబు ప్రభుత్వం కనిపెట్టడం మరో విడ్డూరం. గతంలో ఇద్దరు పిల్లలను మించి పిల్లలను కంటే స్థానిక ఎన్నికల్లో అనర్హులు అవుతారని తెచ్చిన చట్టాన్ని ఈయన తీసేశారు. ఒక పక్క జనాభా పెంచాలని అంటారు. ఇంకో పక్క భవిష్యత్ గ్యారంటీ అన్నారు. మరి వీటికి డబ్బులు ఎక్కడివీ అంటే పీ-4 అంటారు. ధనికులు పేదలను దత్తత తీసుకోవాలంట. ప్రభుత్వం, ప్రైవేట్ కలిసి వ్యాపారాలు చేయాలట. తద్వారా లాభాలు సంపాదించాలట. తదుపరి ఆ డబ్బును సంక్షేమంపై ఖర్చు చేయాలట. ఇది అంతా ఆయన విజన్ అంట. ఏం చేస్తాం అధికారంలో ఉన్న వాళ్లు ఏం చెప్పిన గొప్ప విషయంగా జనం తీసుకోవాలి. లేదంటే ఏలిన వారికి కోపం రావచ్చు. ఇదే క్రమంలో ఇప్పటికే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగు మీడియా చంద్రబాబుకు భజన చేసే పనిలో ఉంటే.. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియా కూడా తన పాత్రను పోషిస్తున్నట్టుగా ఉంది. ఏం చేసినా, చేయకపోయినా ఇలా బిల్డప్ ఇచ్చుకోవడంలో చంద్రబాబును మించిన మొనగాడు లేడేమో!.- కొమ్మినేని శ్రీనివాస రావు.సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వరదలపై చంద్రబాబు విచిత్ర వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: వాతావరణ శాఖ హెచ్చరికలను పట్టించుకోకుండా ముంపు పరిస్థితికి కారణమైన చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు సహాయక చర్యల విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నాలుగు రోజులు గడిచినా.. ఇంకా విజయవాడ జలదిగ్బంధంలోనే ఉండిపోయింది.అయితే స్వయంగా తానే గ్రౌండ్లెవల్లో ఉన్నానంటూ ఫొటోలకు ఫోజులు, బిల్డప్లు ఇచ్చుకుంటున్న చంద్రబాబు.. తాజాగా వరదలపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో.. సాక్షి రిపోర్టర్ కరకట్టలోని చంద్రబాబు నివాసం మునిగిన విషయాన్ని ప్రస్తావించారు. అంతటితో ఆగకుండా.. ఆ విజువల్స్, ఫొటోలు చూపించారు. అయితే.. అదంతా అబద్ధం అంటూ సాక్షి విలేఖరికి అంతెత్తు ఎగిరిపడ్డారు సీఎం చంద్రబాబు. విజయవాడలో చాలా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. అందరి ఇళ్లలాగే మా ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏంటి?.. అంటూ అసహనం ప్రదర్శించారాయన. -
అమరావతి.. వరదావతే..
విజయవాడను వరద ముంచెత్తడం కంటే రాజధాని అమరావతి వరదలో చిక్కుకుందన్నదే సీఎం చంద్రబాబును ఎక్కువ కలవరపెడుతోంది. తన రియల్ ఎస్టేట్ మాఫియా సామ్రాజ్యంగా ఎంపిక చేసుకున్న అమరావతి ప్రకృతి విపత్తుల నుంచి సురక్షితం కాదన్న అసలు వాస్తవం బట్టబయలు కావడంతో ఆయనకు కంటి మీద కునుకు లేదు. అబ్బే అమరావతికి వరదే రాలేదంటూ చంద్రబాబు అండ్ కో తిమ్మిని బమ్మిని చేసేందుకు నానా తంటాలు పడుతోంది. వరదే లేదన్నట్టుగా భ్రమింపజేయాలన్న టీడీపీ కూటమి పెద్దల యత్నాలు బెడిసికొట్టాయి. వరద ముంపులో చిక్కుకున్న అమరావతి ఫొటోలు అటూ ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి. ఎక్కడో ఉన్న బుడమేరుకు వరదొస్తేనే ఇటు అమరావతి మునిగిపోతుంటే... ఇక పక్కనే ఉన్న కృష్ణా నదికి వరద పోటెత్తితే అమరావతి గతేమిటన్నది యావత్ రాష్ట్రాన్ని తీవ్ర ఆందోళనకుగురి చేస్తోంది. – సాక్షి, అమరావతిచంద్రబాబు బుకాయింపు ఇదీ..అమరావతిని వరద ముంచెత్తడంతో ఆ అక్కసునంతా చంద్రబాబు మీడియాపై చూపిస్తున్నాటరు. మీడియా ప్రతినిధులపై ఆయన మంగళవారం చిందులు తొక్కారు. అసలు అమరావతికి వరద ఎక్కడ వచ్చిందని దబాయించేశారు. ‘రాజధాని నిర్మాణానికి అమరావతి అత్యంత సురక్షితమైన ప్రదేశం. అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు అమరావతి పరిధిలోని గ్రామాల్లోకి వరద నీరే రాలేదు. నీటి చుక్కే లేదు’.. ఇలా సాగింది చంద్రబాబు కవరింగ్ డ్రామా. చంద్రబాబు ఎంతగా బుకాయిస్తున్నా రాజధాని అమరావతిని వరద ముంచెత్తిందన్నది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఆ విషయాన్ని అంగీకరిస్తూ హైకోర్టుకు లేఖ కూడా రాసింది. మరోవైపు మూడు రోజులుగా అమరావతిలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు వరద భయంతో బిక్కుబిక్కుముంటున్నారు. అమరావతిలో పొంచి ఉన్న వరద ముప్పును వెల్లడిస్తున్న ఉదంతాలు ఇలా ఉన్నాయి..29 గ్రామాలకు నష్టంభారీ వర్షాలకు రాజధానిలో 31.15 కిలోమీటర్లు ప్రవహిస్తున్న కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్లోని ఉండవల్లి అవుట్పాల్ స్లూయిజ్ల ద్వారా కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్నింది. అమరావతిని కొండవీటి వాగు వరద చుట్టుముట్టింది. ఉద్దండరాయునిపాలెం, పెద్దలంక, హరిశ్చంద్రాపురం, రాయపూడి లంక, మత్స్యకార కాలనీ తదితర గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది. ఆ గ్రామాల పరిధిలో 2 వేల మందికిపైగా ప్రజలు ఉన్నా ప్రభుత్వం కేవలం 50 మందినే పునరావాస కేంద్రాలకు తరలించింది. ఏ క్షణంలోనైనా కృష్ణా కరకట్ట తెగవచ్చని అధికార యంత్రాంగం గుర్తించినా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. కృష్ణా కరకట్ట తెగితే 29 గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయం. దాంతో ఆ గ్రామాల ప్రజలు కరకట్ట వెంబడి పహారా కాశారు. కానీ అమరావతి గ్రామాలకు వరద ముప్పే లేదంటూ చంద్రబాబు దబాయిస్తుండటం విడ్డూరమే.ఐఐటీ నిపుణుల కమిటీదీ ఇదే అభిప్రాయం?కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతిలో నిర్మాణాలను పరిశీలించేందుకు మద్రాస్ ఐఐటీ నిపుణులను రప్పించింది. వారు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యేల నివాస భవనాలు మొదలైనవాటిని పరిశీలించారు. ఏకంగా కృష్ణా నదిలో బోట్లలో ప్రయాణిస్తూ మరీ చంద్రబాబు కరకట్ట బంగ్లా, తదితర భవనాలను కూడా çపరిశీలించింది. కృష్ణా నది కరకట్ట మీద చంద్రబాబు బంగ్లాతోపాటు పలు నిర్మాణాలు అక్రమంగా నిర్మించిన విషయాన్ని ఆ బృందం గుర్తించింది. ఆ అక్రమ నిర్మాణాల వల్ల నది కరకట్ట దెబ్బతింటోందని కూడా కమిటీ సభ్యులు గుర్తించినట్టు సమాచారం. ఇక అమరావతిలో నేల స్వభావం భారీ భవనాల నిర్మాణానికి సరిపోదని ఆ నిపుణులు ఆంతరంగిక చర్చల్లో అభిప్రాయపడ్డారు. అమరావతిలో నిర్మాణాలపై నివేదిక సమర్పిస్తామని చెప్పారు. ఆ తరువాత ఈ విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కమిటీని పక్కనపెట్టేసినట్టు సమాచారం.సచివాలయం హుటాహుటిన ఖాళీఅమరావతిని వరద ముంచెత్తుతుండటంతో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని అధికారులు, ఉద్యోగులు బెంబేలెత్తారు. ముప్పును గుర్తించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సచివాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. దాంతో అధికారులు, ఉద్యోగులు హుటాహుటిన సచివాలయాన్ని వీడి విజయవాడ, గుంటూరుకు తరలివచ్చేశారు. మూడు రోజులుగా రాష్ట్ర సచివాలయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అంటే.. సచివాలయానికి తాత్కాలికంగా తాళాలు వేశారు. ఎమ్మెల్యే క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు, పలు ప్రభుత్వ భవనాల వద్ద ఇంకా వరద నీరు నిలిచే ఉంది. అయినా అమరావతికి వరదే లేదని దబాయించడం చంద్రబాబుకే చెల్లింది.స్తంభించిన హైకోర్టు కార్యకలాపాలురాజధానికి వరద ముంచెత్తుతుండటంతో హైకోర్టులో రెండు రోజులుగా కార్యకలాపాలు స్తంభించాయి. సోమవారం కేసుల విచారణ ప్రారంభమైన కాసేపటికే కరకట్ట వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రిజిస్ట్రార్లు న్యాయమూర్తులకు నివేదించారు. దాంతో కేసుల విచారణను వాయిదా వేసి న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు, సిబ్బంది వెనక్కి వెళ్లిపోయారు. మరోవైపు వరదముప్పు ముంచుకొస్తున్నందున హైకోర్టు కార్యకలాపాలు రెండు రోజులు నిలిపివేయాలని ప్రభుత్వమే అధికారికంగా హైకోర్టుకు సూచించింది. ఈమేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ హైకోర్టు రిజిస్ట్రార్కు లేఖ రాశారు.కరకట్ట బంగ్లా ఖాళీస్వయంగా చంద్రబాబు నివాసముంటున్న అక్రమ నిర్మాణం కరకట్ట బంగ్లాలోకి వరద నీరు ముంచెత్తిన వాస్తవాన్ని కూడా కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి దూరం నుంచి కూడా ఆ బంగ్లాను ఎవరూ ఫొటోలు, వీడియోలు తీయకుండా కాపలా కాస్తున్నారు. కరకట్ట బంగ్లాలోకి వరద నీరు రాకుండా వేల సంఖ్యలో ఇసుక బస్తాలు అడ్డుకట్టగా వేస్తున్నారు. ఆ పక్కనే ఉన్న మంతెన ఆశ్రమంలోకి భారీగా వరద నీరు వచ్చింది. చంద్రబాబు నివాసంతో పాటు కరకట్ట దిగువన ఉన్న 34 భవనాలూ నీట మునిగాయి. అయినా అమరావతికి వరద ముప్పు లేదనడం చంద్రబాబు వితండవాదానికి నిదర్శనం.రాజధానిగా ఈ ప్రాంతం పనికిరాదని విస్పష్టంగా చెప్పిన శివరామకృష్ణన్ కమిటీఅమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి ఏమాత్రం పనికిరాదని శివరామకృష్ణన్ కమిటీ ఆనాడే తేల్చి చెప్పిన విషయం ఈ సందర్భంగా నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని ప్రాంతం ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. దేశంలోనే అత్యుత్తమ నిపుణులతో కూడిన ఆ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అధ్యయనం చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములు ఉండటం, లోతట్టు ప్రాంతం, నేల స్వభావం దృష్ట్యా అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించవద్దని స్పష్టంగా చెప్పింది. ఇక్కడి నేలలో భారీ భవనాల నిర్మాణం ప్రమాదకరమని కూడా వెల్లడించింది. ఏటా వరద ముప్పు ఉంటుందని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయవద్దని నివేదించింది. అయినా చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ మాఫియా కోసం అమరావతిని ఏకపక్షంగా రాజధాని ప్రాంతంగా ఎంపిక చేశారు. -
‘జల’జీవన పోరాటం!
చుట్టూ వరద.. బయటకు వెళ్లలేని స్థితి. రెండు రోజులుగా ఆకలి దప్పులు. ప్రభుత్వం రాదు.. ఆహారం ఇవ్వదు. కుటుంబం కోసమైనా కష్టాలను ఎదురీదాలి. ఎంతటి ముంపునైనా ఎదురించాలి. ఇదీ సింగ్నగర్లో సగటు జీవి బతుకుపోరు గాథ. సోమవారం సింగ్నగర్ ఫ్లైఓవర్ కింద కాలనీల్లో పీకల్లోతు నీళ్లు నిలిచే ఉన్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు ఒక్క పడవ కూడా వెళ్లలేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కుటుంబాలకు.. కుటుంబాలు కట్టుబట్టలతో మేడలు, మిద్దెలపై కాలం వెళ్లదీస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు ఆకలికి అలమటిస్తుంటే చూడలేక కుటుంబ సభ్యులు కర్రలు, ట్యూబులు, థర్మాకోల్ పెట్టెలు, నీటిలో తేలియాడే వస్తువుల సాయంతో ఫ్లైఓవర్పైకి చేరుకోవడానికి ప్రాణాలను సైతం లెక్కచేయక సాహసం చేస్తున్నారు.– సాక్షి బృందం, విజయవాడనాగాయలంకలో పడవ బోల్తాకృష్ణా జిల్లా నాగాయలంక వద్ద తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీరామ పాదక్షేత్రం పుష్కరఘాట్ ఎదురుగా ఉన్న నది మధ్యలో సోమవారం ఉదయం పడవ బోల్తా పడి నలుగురు మత్స్యకారులు కృష్ణా నదిలో పడిపోయారు. వారిని వెంటనే తోటి మత్స్యకారులు రక్షించారు. వరద ఉధృతి తీవ్రం కావడంతో నదికి అవతలి వైపున్న లంక ప్రాంతంలో ఉన్న పడవను, మరో చిన్న బోట్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు నలుగురు మత్స్యకారులు మరో పడవలో బయలుదేరారు. ఈ క్రమంలో మత్స్యకారుల పడవ బోల్తాపడింది. దీంతో మత్స్యకారులు నది ప్రవాహ ఉధృతికి దిగువకు కొట్టుకెళ్లారు. ఘాట్ వద్ద ఉన్న మత్స్యకారులు ఇది గమనించి.. వెంటనే మూడు మోటారు బోట్లలో వెళ్లి నలుగురు మత్స్యకారులను రక్షించారు. –నాగాయలంక(అవనిగడ్డ) -
ప్రకాశం బ్యారేజ్ చరిత్రలోరెండో గరిష్ట వరద
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : కృష్ణా నది మహోగ్ర రూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో రెండో గరిష్ట వరద ప్రవాహం నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు 11,43,201 క్యూసెక్కుల ప్రవాహం వచి్చంది. 1903 అక్టోబర్ 7న 11.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది.ఆ తర్వాత ఇదే గరిష్టస్థాయి వరద. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి 9 గంటల సమయానికి బ్యారేజ్ వద్ద 11,14,326 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీనిలో 11,13,826 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. 500 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. సెల్ఫ్ క్యాచ్మెంట్ వర్షాలతో పాటు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీరు వస్తుండడంతో స్పిల్వే ద్వారా కూడా నాగార్జునసాగర్కు నీటిని వదులుతున్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు ఎగువ నుంచి శ్రీశైలానికి 5,16,179 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సోమవారం సాయంత్రానికి 3,25,284 క్యూసెక్కులు శ్రీశైలానికి వస్తోంది. 10 రేడియల్ క్రస్ట్గేట్లను 20 అడుగులకు తెరచి స్పిల్ వే ద్వారా 4,71,730 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 210.51 టీఎంసీలు నిల్వ ఉండగా.. నీటి మట్టం 884.10 అడుగులుగా నమోదైంది. నాగార్జున సాగర్ జలాశయంలోకి 5,40,503 క్యూసెక్కులు వస్తుండగా స్పిల్వే మీదుగా 5,03,268 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 28,582 క్యూసెక్కులు మొత్తం 5,31,850 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జలాశయంలో ప్రస్తుతం 586.80 అడుగుల వద్ద 304.46 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి సోమవారం సాయంత్రానికి 5,43,617 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజ్కి వదులుతున్నారు.నిలకడగా గోదావరి వరద పోలవరం రూరల్: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో గోదావరి వరద నిలకడగా ఉంది. నదీ పరీవాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉప నదుల నీరు, శబరి నీరు కూడా నదిలోకి స్వల్పంగా చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 30.04 మీటర్లకు చేరుకుంది. స్పిల్వే నుంచి 4.91 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. -
అమరావతిలో వరద బీభత్సం నిలిచిపోయిన హైకోర్టు కార్యకలాపాలు
-
ప్రమాదకరంగా చంద్రబాబు కరకట్ట నివాసం
సాక్షి,అమరావతి : ప్రకాశం బ్యారేజ్కు రికార్డ్ స్థాయిలో వరద నీరు చేరింది. వరద ఇన్ఫ్లో,ఔట్ ఫ్లో 11.43 లక్షల క్యూసెక్కులు దాటింది. దీంతో కరకట్ట మీదగా నీరు ప్రవహించడంతో.. ఆ వరద చంద్రబాబు నివాసంలోపలకి వెళ్లింది. నీరు లోపలికి రాకుండా సిబ్బంది ఆదివారం లారీలతో ఇసుక తరలించి అడ్డుపెట్టారు. అయినప్పటికీ వరద తీవ్రతతో నీరు చంద్రబాబు ఇంటి లోపలికి చేరింది. దీంతో సిబ్బంది ఆరుకు పైగా మోటర్లను ఉపయోగించి వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబు నివాసాన్ని చుట్టుముట్టిన వరదఆదివారం రాత్రి 7గంటలకు ప్రకాశం బ్యారేజ్లోకి చేరుతున్న ప్రవాహం 9,17,976 క్యూసెక్కులకు చేరడంతో కృష్ణా నది కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నివాసాన్ని వరద చుట్టుముట్టింది. ఇందులో నారా లోకేష్ గెస్ట్ హౌస్గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉంది. అయితే ఇసుక బస్తాలు వేసి వరద నీరు లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. కలెక్టర్ కార్యాలయంలో బాబు బసఆదివారం రాత్రికి కృష్ణా వరద ఉధృతి మరింత పెరుగుతుందని, రాత్రికి ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదమని సీఎం చంద్రబాబుకు జనవనరుల శాఖ అధికారులు వివరించారు. దీంతో ఆదివారం రాత్రికి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేశారు. -
బెజవాడలో ఇదే అతి భారీ వర్షం
సాక్షి, అమరావతి: విజయవాడ పరిసరాల్లో రికార్డు స్థాయిలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. శనివారం అమరావతిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంతటి భారీ వర్షం ఇంతకుముందెన్నడూ ఈ ప్రాంతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ శాఖ రికార్డుల ప్రకారం 1989లో గన్నవరంలో 21.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 20 సెం.మీ. దాటితే అతి భారీ వర్షం కింద లెక్క. సమీప కాలంలో ఈ స్థాయి వర్షం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కురిసిన దాఖలాలు లేవు. శనివారం ఆ స్థాయిలో వర్షం కురిసింది. అమరావతి కంటే ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 32.3 సెం.మీ. వర్షం కురిసింది.తిరువూరులోనూ 26 సెం.మీ. వర్షం కురిసింది. 14 మండలాల్లో సగటున 24 గంటల వ్యవధిలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 62 ప్రాంతాల్లో 11.2 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 14 జిల్లాల పరిధిలోని 94 స్టేషన్లలో 7 నుంచి 12 సెం.మీ. వర్షం పడింది. మొత్తంగా రాష్ట్రమంతటా వర్షపాతాన్ని లెక్కించే యంత్రాలున్న ప్రాంతాల్లోని 75 శాతం ఏరియాల్లో వర్షపాతాలు నమోదయ్యాయి. ఒకేరోజు ఇంత ఏరియాలో వర్షం కురవడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల తీవ్రత ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉంది. 12 నుంచి 24 గంటల వ్యవధిలోనే క్లౌడ్ బరస్ట్ (మేఘాలు బద్ధలైనట్టు) అయినట్టు కుండపోత వర్షం పడింది.ఈ వాన నీరంతా సమీపంలోని వాగులు గుండా కృష్ణా నదిలోకి ప్రవహిస్తోంది. ఖమ్మం పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో మున్నేరు, కట్టలేరు, రామిలేరు వాగులన్నీ పొంగి బుడమేరులో కలిశాయి. బుడమేరు కృష్ణా నదిలో కలిసే పరిస్థితి లేకపోవడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి ఈ నీరంతా వచ్చి చేరుతోంది. సాధారణంగా ఈ వర్షమంతా 48 గంటల్లో కురిస్తే అది నెమ్మదిగా వచ్చి డ్రెయిన్ల ద్వారా కృష్ణా నదిలో కలవాలి. కానీ.. 12 నుంచి 24 గంటల్లోనే అతి భారీ వర్షాలు కురవడంతో బుడమేరు ఒక్కసారిగా పొంగింది.కొండవీడు ఘాట్ రోడ్డులో కూలిన కొండచరియలు సాక్షి, అమరావతి: కొండవీడు ఘాట్ రోడ్డులో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండవీడు నగరవనాన్ని సోమ, మంగళవారాలు మూసివేస్తున్నట్లు పల్నాడు జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు తెలిపారు. ఘాట్ రోడ్డుపై పడిన బండరాళ్లను ఆర్అండ్బీ శాఖ సహకారంతో తొలగిస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని కోరారు. -
కూటమి ప్రభుత్వంలో రోజుకో ‘చిత్రం’! పుత్రరత్నం కోసం..
విజయవాడ, సాక్షి: రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువా?. తన తనయుడు, మంత్రి నారా లోకేష్ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలపై అధికార వర్గాల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెడ్ బుక్ పాలనతో రెచ్చిపోమ్మని చినబాబుకు హక్కులు కట్టబెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు పాలనాపరమైన వ్యవహారాలను సైతం తనయుడి కోసం వాయిదా వేస్తుండడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. నారా లోకేష్ పర్యటనల వివరాలు టీడీపీ వర్గాలకే తెలియకుండా రహస్యంగా ఉంచుతుంటారు చంద్రబాబు. తాజాగానూ ఆయన అలాంటి పర్యటనలోనే ఉన్నారట. ఈ క్రమంలో ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం.. రేపటికి వాయిదా పడింది. ఇందుకు లోకేషే కారణం. తొలుత ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట ఆదేశాలు వెలువడ్డాయి. అయితే.. లోకేష్ విహార యాత్ర ఉందని తెలియక ఆ ఆదేశాలు పంపిన సీఎస్.. ఆ వెంటనే తేదీని మార్చేసి మరోసారి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదేం కొత్త కాదు. ఈ నెలలోనే ఇలా జరగడం రెండోసారి. ఈ నెల రెండో తేదీ జరగాల్సిన కేబినెట్ భేటీని లోకేష్ విహారయాత్ర నేపథ్యంలోనే.. 7వ తేదీకి మార్చారు. ఇప్పుడు కూడా రహస్య పర్యటన నేపథ్యంలోనే మరోసారి మార్చారు. ఒక మంత్రి లేకుండా కేబినెట్ సమావేశం వాయిదా వేసిన దాఖలాలు గత ప్రభుత్వాల్లో ఏనాడూ లేదని, లోకేష్ సీఎం చంద్రబాబు కొడుకు కాబట్టే ఇలా నడుస్తోందని అధికార వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇంకెన్ని చిత్రాలు చూడాలో?!.ఇదీ చదవండి: కాల్చుకు తింటున్న కూటమి సర్కార్! -
అమరావతిపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రూ. 60 వేల కోట్లతో అమరావతిలో నిర్మాణాలు చేపడతామంటూ మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే ప్రాంతంలో భారీ వ్యయం చేయాలని చంద్రబాబు నిర్ణయించారని నారాయణ తెలిపారు. విజయవాడలో క్రెడాయ్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం సీడ్ క్యాపిటల్కే రూ.60 వేల కోట్లు పెట్టాలనే ఆలోచన ఉందన్నారు. అమరావతిలో పాత టెండర్లను క్లోజ్ చేస్తున్నామని 3 నెలల అధ్యయనం చేసి.. తర్వాత టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ అన్నారు. ‘‘ఐఐటీ రిపోర్టులు వచ్చాక కమిటీ చర్చిస్తుంది. కమిటీలో చర్చించాక ముందుకు పోతాం. డిసెంబర్ నెలలో పనులు ప్రారంభిస్తాం’’ అని నారాయణ తెలిపారు. -
ఏపీలో 10 మంది ఐపీఎస్ల బదిలీ
విజయవాడ, సాక్షి: పది మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ పేరిట శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం ఎస్పీగా జగదీష్, విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్గా మురళికృష్ణ, విజయవాడ డీసీపీగా మహేశ్వరరాజు, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా సునీల్, గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఏఎస్పీగా పంకజ్కుమార్ మీనా, పార్వతీపురం ఎస్డీపీవోగా సురానా అంకిత్లను బదిలీ చేశారు. అలాగే.. ఐపీఎస్ అధికారి సత్య ఏసుబాబును డీజీపీ ఆఫీస్కు బదిలీ చేసింది ప్రభుత్వం. -
ధరల దాడి
సాక్షి, అమరావతి: నిత్యావసరాలు వంటింటిని హడలెత్తిస్తున్నాయి. పొయ్యి వెలిగించకుండానే భగభగమంటున్నాయి. కందిపప్పు పట్టుకుంటే చేతులు కాలుతున్నాయి. ఉప్పు, పప్పు, చింతపండు, ఎండుమిర్చితో పాటు కూరగాయల వరకు రేట్లు మండిపోతున్నాయి. నిత్యావసరాల ధరల్లో జాతీయ సగటుతో పాటు దక్షిణాది సగటుతో పోలి్చనా ఆంధ్రప్రదేశ్లోనే ధరలు అధికంగా ఉండటం గమనార్హం. రెండేళ్ల క్రితంతో పోలిస్తే నిత్యావసరాల రేట్లు బాగా పెరిగాయి. బియ్యం (కామన్ రకం) 12 శాతం, పెసరపప్పు 54 శాతం, ఆటా 67%, కందిపప్పు 61 శాతం, పంచదార 15 శాతం, బంగాళదుంప 21 శాతం, ఉల్లిపాయాలు 87 శాతం, టమాటాలు 50 శాతం, పాలు 6 శాతం, ఉప్పు ధరలు 30 శాతానికిపైగా పెరగడంతో జనం జేబులు గుల్లవుతున్నాయి. ప్రతి నెలా బడ్జెట్ గాడి తప్పుతోంది.నాడు ఫోరి్టఫైడ్ గోధుమపిండిగోధుమ పిండి సగటున కిలో రూ.48 నుంచి రూ.70కిపైగా పలుకుతోంది. దేశ వ్యాప్తంగా తమిళనాడు తర్వాత ఏపీలోనే గోధుమ పిండి రేటు ఎక్కువగా ఉంది. గత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫోరి్టఫైడ్ గోధుమ పిండిని కిలో ప్యాకెట్ల రూపంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూ.11కే అందించింది. బియ్యం బాబోయ్! గత కొన్నేళ్లుగా బియ్యం ధరలు వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. 2019లో సాధారణ బియ్యం కిలో రూ.36 చొప్పున ఉండగా ఇప్పుడు కిలో రూ.55కిపైగా పలుకుతోంది. సూపర్ ఫైన్ బియ్యం రూ.65 – రూ.70కిపైగా ఎగబాకింది. బాస్మతి, దావత్ బియ్యం ఏకంగా కిలో రూ.230కిపైగా ఉంది. తాజాగా బియ్యం రేట్లు తొమ్మిది రాష్ట్రాల్లో కిలో రూ.50 దాటింది. అత్యధిక బియ్యం రేట్లలో ఏపీ 5వ స్థానంలో ఉంది. బియ్యం నిల్వలను నల్ల బజారుకు తరలించడంతో రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఈ ఖరీఫ్లో నాట్లు వేసిన తర్వాత కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో బియ్యాన్ని బ్లాక్ చేసి రేట్లు పెంచే ఆలోచనలో వ్యాపారులున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా బియ్యం నిల్వలపై పరిమితులు విధించకుండా అక్రమార్కులకు కొమ్ముకాస్తూ నామమాత్రంగా రూ.1, రూ.2 తగ్గించి వినియోగదారులుకు ఇస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటోంది. వరి అధికంగా పండే పంజాబ్లో కిలో బియ్యం రూ.39.58 మాత్రమే ఉండగా అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి.ఉడకని కందిపప్పు! రాష్ట్రంలో గత ఫిబ్రవరిలో కిలో రూ.163 చొప్పున ఉన్న కందిపప్పు ప్రస్తుతం రూ.180కిపైగా చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా పీడీఎస్లో కందిపప్పు ఇవ్వకపోవడంతో బయట మార్కెట్లో వ్యాపారులు ధరలు పెంచేశారు. గోవా, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే కందిపప్పు రేటు అధికంగా ఉంది. ధరల పెరుగుదలను నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది.తాజాగా రిటైల్ దుకాణాలు, రైతు బజార్లలో రూ.150కే ఇస్తామంటున్నా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. ‘‘కిలో రూ.160 ఉన్నప్పుడు కొన్న కందిపప్పును రెండు సార్లు కుక్కర్లో ఉడికించి మిక్సీలో తిప్పినా మెత్తగా కావడం లేదు. చేసేది లేక ప్యాకెట్ కందిపప్పు రూ.224 పెట్టి కొనుక్కెళ్లా. ఉడకని పప్పులు తక్కువ రేటుకు ఇచ్చినా ఏం చేసుకోవాలి? ఇది వినియోగదారులకు నష్టం కాదా?’’ అంటూ విజయవాడలోని ఓ సూపర్ మార్కెట్లో వినియోగదారుడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయల కల్లోలం..రాష్ట్రంలో రెండు నెలల క్రితం అధిక వేడి కారణంగా కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో వాటి ధరలు 40 నుంచి 60 శాతం పెరిగాయి. రైతు బజార్లలో అన్నీ కిలో రూ.50 నుంచి రూ.80కి చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ అధిక వర్షాలు, వరదల కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో నిత్యావసరాలకు తోడు కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. మార్కెట్లో కాకరకాయల ధర కిలో ఏకంగా రూ.70, క్యారెట్ ధర రూ.90 వరకు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల కారణంగా టమాటా, ఉల్లి, పచి్చమిర్చి, కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికం, అల్లం ధరలు పెరుగుతున్నాయి.ఏపీలోనే ద్రవ్యోల్బణం ఎక్కువ.. ధరల పెరుగుదల కొంతవరకు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకున్నా ఏపీలో ద్రవ్యోల్బణం అమాంతం పెరుగుతోంది. జాతీయ సగటు 5.08 శాతంతో పోలిస్తే ఏపీలో ధరల పెరుగుదల సూచీ 5.87 శాతంతో భయపెడుతోంది. ధరల పెరుగుదల సూచీ ఒడిశాలో అత్యధికంగా 7.22 శాతం, దాద్రానగర్ హవేలీలో 6.49 శాతం, బిహార్లో 6.37 శాతం, కర్నాటకలో 5.98 శాతం తర్వాత ఏపీ ఐదో స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణలో 5.49 శాతం, తమిళనాడులో 4.75 శాతం. కేరళలో 5.83 శాతం ద్రవ్యోల్బణం రేటు ఉంది. నిన్నటి రేట్లు ఇవాళ ఉండట్లేదు.. నిత్యావసరాల ధరలు చూస్తుంటే భయం వేస్తోంది. ఒకరోజు ఉన్న రేటు మరుసటి రోజు ఉండటం లేదు. ఊహించని విధంగా మారిపోతున్నాయి. కందిపప్పు కొనలేని పరిస్థితి. పోనీ కూరగాయలైనా వండుకుందామంటే ఏది చూసినా కిలో రూ.50, రూ.100 పలుకుతున్నాయి. ఆదాయానికి, ఖర్చులకు సంబంధం లేకుండా పోయింది. చివరకు చింతపండు రసం చేసుకోవాలన్నా రేట్లు చూస్తే కొనేలా లేవు. – అద్దంకి మౌనిక, పెదరావూరు, తెనాలి మండలంనలుగురికి సంతోషంగా వడ్డించలేం.. పప్పులు, ఉప్పుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వంటగదిలో కూర్చుని నలుగురికి ఆనందంగా వండిపెట్టే రోజులు ఇప్పట్లో రావేమో. ఏది కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి. సంపాదించే కొద్ది మొత్తంలో నిత్యావసరాలకే సగం ఖర్చయితే సామాన్యులు ఎలా బతకాలి? బియ్యం రేట్లు కూడా విపరీతంగా పెరుగుతుంటే ఇంకేం తినాలి? – యాదల అన్నపూర్ణ, తెనాలి -
చందాల చంద్రం
-
డ్వాక్రా మహిళలపై ‘అమరావతి ట్యాక్స్’
సాక్షి, అమరావతి: ‘రాజధాని అమరావతి కడతాం.. సంపద సృష్టిస్తాం’ అంటూ గొప్పలు చెప్పుకొంటున్న బాబు కూటమి ప్రభుత్వం.. కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయింది. గతంలో ఇటుకలమ్మి సేకరించిన విరాళాలు మరుగున పడ్డాయి. ఇప్పుడు రాజధాని భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తోంది. వివిధ వర్గాల ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు తెగబడుతోంది. చివరికి రూపాయి రూపాయి పొదుపు చేసుకొని, కుటుంబానికి అండగా నిలుస్తున్న స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) అక్కచెల్లెమ్మలనూ వదలడంలేదు. ప్రతి మహిళా వందేసి రూపాయలు అమరావతి కోసం ఇవ్వాల్సిందేనంటూ కొందరు అధికారుల ద్వారా హుకుం జారీ చేయిస్తోంది.ఇదే విధంగా ఓ మధ్యస్థాయి అధికారి డ్వాక్రా మహిళలను ఆదేశిస్తున్న వీడియో టేప్ ఒకటి బయటపడింది. ఈ టేపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘అమరావతి రాజధాని కోసం ఒక్కొక్క సభ్యురాలు రూ. వంద చొప్పున కలెక్షన్ చేయాలి. ప్రతి ఒక్కరూ.. గ్రూపు లీడర్ కూడా సంఘ సభ్యురాలు దగ్గర... సంఘంలో ఎంత మంది ఉన్నారో, అంతమంది మనిషికి వంద రూపాయల చొప్పున కలెక్టన్ చేయండి. నేను చాలా వరకు గ్రూపు లీడర్లకు ఫోన్లు చేశాను. ప్రతి గ్రూపు లీడరు ఫాలోఅప్ చేయండి.రేపు సాయంత్రంకల్లా కలెక్షన్ చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని సంఘాలు ఇచ్చారన్నది మేం సీవో (మెప్మా విభాగంలో పట్టణ ప్రాంతాల్లో పనిచేసే కమ్యూనిటీ ఆర్గనైజర్)కు అప్పజెప్పాలి. ప్రతి సభ్యురాలు ఎందుకు.. ఏమిటి అని అడగొద్దు. ప్రతి సంఘ సభ్యురాలు వంద రూపాయలు ఇవ్వాలి’ అంటూ ఓ పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించే ఓ మధ్య స్థాయి అధికారి ఆయన పరిధిలోని సంఘాల సభ్యులకు జారీ చేసిన ఆదేశాలు ఆ ఆడియో టేపులో ఉన్నాయి. ఈ ఆడియో టేపులో మాట్లాడిన మాటల ప్రకారం.. ఇప్పటికే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పొదుపు సంఘాల సభ్యుల నుంచి రూ. వంద చొప్పున వసూళ్లు పూర్తయ్యాయి. సెర్ప్, మెప్మా ఉద్యోగుల చర్చల్లోనూ ఈ విషయం బయటపడింది.బహిరంగంగానే చెప్పిన చిత్తూరు ‘మెప్మా’ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం చంద్రబాబు తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు చిత్తూరు జిల్లాలో మెప్మా అధికారులు ఆ ప్రాంత పొదుపు సంఘాల తరపున అమరావతి నిర్మాణానికి రూ.4.50 కోట్ల విరాళం ప్రకటించారు. ఆ డబ్బు సేకరణ కోసమే అధికారులు, సంఘాల లీడర్లు డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చి ఒక్కొక్కరి నుంచి రూ.100 చొప్పున ఇప్పటికే వసూళ్లు చేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇది చిత్తూరు, తిరుపతి జిల్లాలకే పరిమితమవలేదని, మిగతా జిల్లాల్లోనూ వసూళ్లు జరుగుతున్నాయని సమాచారం. -
అమరావతిలో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష
-
ఆయువు తీస్తున్న వాయువు
ప్రపంచవ్యాప్తంగా నిత్యం 2వేల మంది చిన్నారుల మృత్యువాత కలుషిత గాలిని పీల్చడంతోనే బలి 2021లో గాలి కాలుష్యంతో 80 లక్షల మంది మృతి పొగాకు వినియోగం, అధిక రక్తపోటు తర్వాత కాలుష్య మరణాలే ఎక్కువహెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నివేదికలో వెల్లడిసాక్షి, అమరావతి: ఇప్పటి దాకా ఐదేళ్ల లోపు చిన్నారుల్లో మరణానికి పోషకాహార లోపం ప్రధాన పాత్ర వహిస్తుంటే... తాజాగా ఈ జాబితాలోకి వాయు కాలుష్యం కూడా చేరింది. ప్రపంచ వ్యాప్తంగా రోజూ దాదాపు 2వేల మంది చిన్నారులు కలుషిత గాలిని పీల్చడం వల్ల మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అపరిశుభ్రత, కలుషిత నీరు కంటే గాలి కాలుష్యంతోనే ఆరోగ్యంప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హెల్త్ ఎఫెక్టŠస్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఈఐ) విడుదల చేసిన కొత్త అధ్యయనం ప్రకారం..2021లో 80లక్షల మందికిపైగా కలుíÙత గాలి కారణంగా మృతి చెందారు. వీరిలో చిన్నారులతో పాటు వయోజనులు ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే... ఇంట్లో కూడా కాలుష్యం పెరుగుతుండటంతో గాలి నాణ్యత మరింత క్షీణించి అనారోగ్య సమస్యలు విజృంభిస్తున్నాయి. పొగాకు, రక్తపోటు తర్వాత ఇదే..ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం, అధిక రక్తపోటు తర్వాత మనిషి ప్రాణాలకు వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా తయారైంది. అధిక ఆదాయ దేశాల్లో కంటే ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో 500 రెట్లు చిన్నారుల మరణాల రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం. పీఎం 2.5గా పిలిచే చిన్న కణాలు.. అంటే 2.5 మైక్రోమీటర్ల వ్యాసం కంటే చిన్నవిగా గాల్లో కలిసిపోయి ఉండే వివిధ రకాల ధూళి కణాలు ప్రపంచ వాయు కాలుష్య మరణాల్లో 90 శాతం కంటే ఎక్కువగా కారణం అవుతున్నాయని నివేదిక పేర్కొంది.వాయు కాలుష్యంతో నష్టాలు.. ⇒ శ్వాస తీసుకున్నప్పుడు గాలి ద్వారా ధూళి కణాలు రక్తంలోకి ప్రవేశించి శరీరంలోని అవయవాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ⇒ ఊపిరితిత్తుల వ్యాధులు సంభవిస్తున్నాయి. ⇒ గుండెజబ్బులు, మధుమేహం, చిత్త వైకల్యం తలెత్తుతున్నాయి ⇒ మహిళల్లో గర్భస్రావాలువాయు కాలుష్యానికి కారణాలు.. ⇒ చెట్ల నరికివేత, అడవుల్లో కార్చిచ్చు ⇒ తీవ్రమైన కరువులు, భూములు ఎండిపోవడం ⇒తీవ్ర గాలులు, తుపానులు ⇒ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ⇒ వాయు మార్గంలో ప్రయాణాలతో నైట్రోజన్ ఆక్సైడ్ల విడుదలవాతావరణ సంక్షోభమే కారణమా? వాతావరణ సంక్షోభం కూడా గాలి నాణ్యతను దిగజార్చుతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాలుష్య కారకాలు ఓజోన్లోకి ప్రవేశించడం ద్వారా 2021లో ఐదు లక్షల మందికిపైగా మరణాలకు కారణమైనట్టు నివేదిక తెలిపింది. ప్రధానంగా బయోమాస్, బొగ్గు, పారాఫిన్, ముడి ఇంధనాలతో వంట చేయడంతోనూ కాలుష్యం పెరిగి చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గుర్తించింది. సోలార్ స్టవ్ల వినియోగం అందుబాటులోకి వస్తే పీఎం 2.5 ఉద్గారాలు, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను చాలా వరకు తగ్గించవచ్చని స్పష్టం చేస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 230 కోట్ల మందికి శుభ్రమైన వంట ఇంధనాలు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు..
-
అమరావతి మళ్లీ సింగపూర్ కంపెనీలకే
-
అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు
సాక్షి, గుంటూరు: అమరావతిలో ఐఐటీ బృందాలకు వరద కష్టాలు ఎదుర్యయాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఐఐటీ హైదరాబాద్, మద్రాస్ బృందాలు.. నిర్మాణాల నాణ్యతను పరిశీలించాయి. రాజధానిలో వరద చేరడంతో బృందాలు.. పడవలో వెళ్లి పనులు పరిశీలించాయి.ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో వరద నీటిలో బృందాలు పర్యటించాయి. జీఏడీ టవర్లు, హైకోర్టు పునాదులు, ర్యాప్ట్ ఫౌండేషన్ పనులను బృంద సభ్యులు పరిశీలించారు. వరద నీటిలో ఉన్న జీఏడీ టవర్లు, హైకోర్టు పునాదులను కూడా ఐఐటీ బృందం పడవలో వెళ్లి పరిశీలించింది. వరద నీటిని చూసి షాక్ తిన్న ఐఐటీ బృందం.. చిన్నపాటి వర్షాలకే ఇలా వరద చేరడంపై ఆశ్చర్యపోయింది. -
AP: ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆర్డినెన్స్ జారీ
సాక్షి, విజయవాడ: ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది. రూ.1.29 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. నవంబర్ 30వ తేదీ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం తీసుకొచ్చింది.కాగా, ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ప్రజలకిచ్చిన హామీల అమలును ఎగ్గొట్టేందుకే ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. అంతకుముందు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి సభ అనుమతి తీసుకుంది. ఈ గడువు నేటితో (జూలై 31తో) ముగిసింది.సాధారణంగా అయితే.. ఎన్నికల ఫలితాలు అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ఈనెల 23న లోక్సభలో ప్రవేశపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. -
కేంద్రంలో చంద్రబాబు తిప్పేది అప్పుల చక్రమే
-
15 వేల కోట్లు అప్పే.. కుండబద్దలుగొట్టిన జీవీఎల్
-
ఏపీకి కేంద్ర నిధులపై బీజేపీ నేత జీవీఎల్ క్లారిటీ
సాక్షి, విశాఖపట్నం: అమరావతికి ఇచ్చిన 15 వేల కోట్లపై బీజేపీ నేత జివీల్ నరసింహారావు స్పష్టతనిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15 వేల కోట్లు రూపాయలు అప్పేనని తేల్చి చెప్పేశారు. ఈ అప్పు చెల్లించడానికి 30 ఏళ్ల సమయం పడుతుందని.. అప్పు కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా? అనే దానిపై మీద స్పష్టత రావాలన్నారు.కాగా, ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి రూ.15 వేల కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సాయమా లేక అప్పా అనేది చెప్పకుండా సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదారి పట్టించిన సంగతి తెలిసిందే. రుణమా లేక గ్రాంటా అనేది స్పష్టంగా ప్రకటించకుండా బీజేపీ నాయకత్వం పదాల గారడీతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. మన రాష్ట్రం విషయంలో ఉత్తి మాటలు చెప్పిన కేంద్రం.. బీహార్కి మాత్రం భారీగా నిధులను కేటాయించింది. అధికార పార్టీ ఎంపీలు ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారని, ఏం సాధించారని పలువురు నిలదీస్తున్నారు. -
Nara Lokesh: బాబుకి గట్టి పోటీ ఇస్తున్న తనయుడు!
సాక్షి, అమరావతి: ప్రజలకు సుపరిపాలన, సంక్షేమాన్ని అందించడంలో ఫార్టీ ఇయర్స్ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఫెయిలే. కేవలం మేనేజ్ చేస్తూ ఐదేళ్లూ గడిపేయడంలో ఆయనకు ఆయనే సాటి అని ఇంతకాలం ఓ పేరుండేది. అలాంటిది ఆ లోటును ఆయన తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ భర్తీ చేయడానికి ముందుకు వచ్చాడు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబు ఏనాడూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చింది లేదు. విజనరీనంటూ.. గప్పాలు కొట్టుకుంటూ కాలయాపన చేస్తారే తప్ప.. అభివృద్ధి, సంక్షేమం అనేది మచ్చుకైనా కనిపించదు. ఇప్పుడు.. ఈ దఫా పాలనను, సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు జగన్ హయాంపై విమర్శలతోనే నెట్టుకొచ్చేలా కనిపిస్తున్నారాయన. అయితే తాను చేసిందేం లేకపోగా.. అవతలివాళ్లు చేసింది తన ఘనతగానే చెప్పుకోవడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. అయితే.. లోకేష్ అదే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది.చంద్రబాబు నాయుడు ‘కష్టం ఎవరిదైనా.. క్రెడిట్ కొట్టేయడంలో మీ తండ్రి చంద్రబాబును మించిపోయావ్ లోకేశ్’ అంటూ వైఎస్సార్సీపీ ఆదివారం సామాజిక మాధ్యమం(ఎక్స్)లో పోస్టు చేసింది. ‘ఎట్టెట్టా.. కువైట్లో శివను మీరు కాపాడారా? మీ సాయం ఇసుమంత కూడా లేకపోయినా గత కొన్ని రోజులుగా ఎల్లో మీడియాతో కలిసి మీరు వేసిన పీఆర్ స్టంట్లు అన్నీ ఇన్నీ కావుగదా? నిజం నిలకడ మీద తెలుస్తుందంటే ఇదే. బయటికి రాదులే అనుకున్నారు. .. ఇప్పుడు శివకు సాయం చేసింది మీరు కాదని సాక్ష్యాలతో సహా వీడియోలు బయటికి వచ్చాయి. ఇప్పుడేం చెప్తావ్ నారా లోకేశ్?’ అంటూ ప్రశ్నించింది. కువైట్లో శివను కాపాడింది లోకేశ్ కాదు.. సాక్ష్యమిదిగో అంటూ ఒక వీడియోను వైఎస్సార్సీపీ పోస్టు చేసింది. దీంతో.. అబద్ధాలు, మోసపూరిత హామీల విషయంలో లోకేష్ చంద్రబాబునే మించిపోయేందుకు ఎక్కువ టైం పట్టకపోవచ్చనే కామెంట్లు కనిపిస్తున్నాయి.కష్టం ఎవరిదైనా.. క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడంలో మీ తండ్రి @ncbnని మించిపోయావ్ @naralokesh!ఎట్టెట్టా.. కువైట్లో శివను మీరు కాపాడారా? మీ సాయం ఇసుమంత కూడా లేకపోయినా గత కొన్ని రోజులుగా ఎల్లో మీడియాతో కలిసి మీరు వేసిన పీఆర్ స్టంట్లు అన్నీఇన్నీ కావుగదా? నిజం నిలకడమీద… pic.twitter.com/56XqKcNTuv— YSR Congress Party (@YSRCParty) July 28, 2024 -
అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్లో రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ నిధులను బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఇస్తామని తెలిపారు. ‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తిస్తూ వివిధ అభివృద్ధి సంస్థల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయాన్ని సమకూరుస్తాం. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.15 వేల కోట్లు, రానున్న రోజుల్లో అదనపు మొత్తాలను అందచేస్తాం’ అని ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. మంగళవారం 2024–25 వార్షిక బడ్జెట్లో భాగంగా ఆమె తన ప్రసంగంలో ఏపీ పునర్విభజన చట్టం, అందులో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని, అందుకోసం ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. భారత ఆహార భద్రతకు పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకం అని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి అదనపు నిధులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీతో పాటు బీహార్కు కూడా రూ.11,500 కోట్ల నిధులు కేటాయించామన్నారు. వారణాసిలోని విశ్వనాథుని ఆలయం తరహాలో బీహార్లోని బుద్దగయాలో ఒకటి ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీహార్లో పారిశ్రామిక కారిడర్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అందులో భాగంగా రాష్ట్రంలోని వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. విభజన చట్టం ప్రకారం.. పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తాం అన్నారు. హైదరాబాద్–బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేకంగా సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, రైల్వేలు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని చెప్పారు. తూర్పు తీర ప్రాంతాలైన ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. విద్య, మౌలిక వసతులు, ఆర్థిక అవకాశాలు కల్పించి వికసిత్ భారత్కు ఈ ప్రాంతాలు గ్రోత్ ఇంజన్ అయ్యేలా కృషి చేస్తామన్నారు. దీనికి పూర్వోదయ అనే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. ఆ నిధులు ప్రపంచ బ్యాంకు నుంచి.. ‘బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్లుగా అమరావతి కోసం రూ.15 వేల కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా అప్పుగా (రుణాలు) తీసుకుంటాం. ఏడీబీ లేక ఏఐబీ లేక ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకుంటాం’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరింత స్పష్టత ఇచ్చారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ప్రసంగంలో చెప్పినట్లుగా భవిష్యత్లోనూ సాయాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అయితే ఆ మొత్తం ఎంత అన్నది చెప్పలేమని, పునర్విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రమే సాయం చేయాలన్నారు. దానికి కేంద్రం కట్టుబడి ఉంది అని చెప్పారు. దేశంలోని జాతీయ ప్రాజెక్టులను కేంద్రం నిర్మిస్తుండగా.. పోలవరం మాత్రం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు తాము గతంలోనే ఒప్పుకున్నామని గుర్తు చేశారు. పోలవరం, రాజధాని నిర్మాణంపై మీడియా అడిగిన పలు ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ తెలుగులో జవాబు ఇచ్చారు. కేబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయ్యిందో దానిమేరకు ఇప్పటి వరకు నిధులను ఇస్తూనే ఉన్నామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఒప్పందానికి లోబడి నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. అయితే ఇటీవల కొన్ని కొత్త సమస్యలు వచ్చాయని, ప్రసుత్తం వాటి జోలికి వెళ్లడం లేదన్నారు. -
పోలీసుల జులుం ఎల్లకాలం సాగదు: వైఎస్ జగన్
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు ఓవరాక్షన్కి దిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి చేరుకున్నారు వైఎస్సార్సీపీ చట్ట సభ్యులు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో ‘‘సేవ్ డెమోక్రసీ’’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అయితే..వైఎస్సార్సీపీ చట్ట సభ్యుల్ని గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఫ్లకార్డులు ప్రదర్శించొద్దంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ప్లకార్డుల్ని లాగేసి చించేశారు. దీంతో వైఎస్ జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్లకార్డులు ఆపాలని ఎవరు చెప్పారు?. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగదు. పోలీసులు ఉన్నది ప్రజాస్వామాన్ని ఖూనీ చేయడానికి కాదు. ప్రజా స్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పోలీసులు వైఖరి అత్యంత దారుణంగా ఉంది. చట్ట ప్రకారం పోలీసులు పని చేయాలి’’ అంటూ అన్నారాయన. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే జగన్ నిలదీత, ఈలోపు సభ ప్రారంభం అవుతుండడంతో కాసేపటికికే నల్ల కండువాలతోనే వైఎస్సార్సీపీ సభ్యుల్ని పోలీసులు లోపలికి అనుమతించారు. -
అసెంబ్లీలో నేడు వైఎస్సార్సీపీ నిరసనలు
అమరావతి, సాక్షి: ఏపీలో కొనసాగుతున్న అరాచకాలపై, హింసాత్మక ఘటనలపై నిరసనలు తెలిపేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను అందుకు వేదికగా ఎంచుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్నారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో.. హత్యా రాజకీయాలపై వైఎస్సార్సీపీ నిరసన తెలిపే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. దీంతో శాంతి భద్రతల అంశంపై వైఎస్సార్సీపీ అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టనుంది. వినుకొండ వైస్సార్సీపీ యువకార్యకర్త రషీద్ హత్యా ఘటనతో పాటు వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన హత్యాయత్నాలను ప్రధానంగా ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రస్తావించాలని భావిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల అమలు జాప్యాన్ని కూడా నిలదీసే అవకాశం లేకపోలేదు. ఇంకోవైపు..సాధారణంగా.. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంటాయి ప్రభుత్వాలు. ఇందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మూడు-నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గుచూపిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. జగన్ పాలనను బద్నాం చేసే కుట్రలో భాగంగా సంక్షేమాన్ని స్కామ్లుగా తప్పుడు లెక్కలు చూపిస్తూ సచివాలయంలో శ్వేత పత్రాలు విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆ వ్యవహారం కొనసాగించాలనుకోవడం.. హామీల జాప్యానికే అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అంశంపైనా వైఎస్సార్సీపీ నిలదీసే అవకాశం ఉంది. ఇక.. ఇదీ చదవండి: ‘రెడ్బుక్’తో అరాచకం.. అదే రాజ్యాంగం అనే రీతిలో పాలనరషీద్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో.. ఏపీలో చంద్రబాబు ఆటవిక పాలనపై ఢిల్లీలో 24వ తేదీన ధర్నా చేస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోపక్క అసెంబ్లీలోనూ తమ నిరసన కొనసాగుతుందని ఆ సమయంలోనే ప్రకటించారాయన. అలాగే.. పార్లమెంట్ సమావేశాల్లోనూ ఏపీ పరిస్థితిని వివరించాలని ఎంపీలకు వైఎస్సార్సీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశాల్లోనూ దిశానిర్దేశం చేశారు కూడా.ఏపీలో సామాన్యులపై జరుగుతున్న అకృత్యాలతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి వైఎస్ జగన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఎంపీల నుంచి సామాన్యుల దాకా ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా వైఎస్సార్సీపీని అణచివేసే కుట్ర జరుగుతోందని గవర్నర్కు నివేదించారు. ఇప్పటిదాకా జరిగిన ఘటనలను వివరాలను ఆధారాలతో సహా గవర్నర్కు సమర్పించిన జగన్.. వాటన్నింటిపైనా దర్యాప్తు చేయించాలని కోరారు. కళ్లెదుటే ఘోరాలు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం వాటిని నిలువరించే సాహసం చేయలేకపోతోందని జగన్ ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆ మంత్రులిద్దరికీ చంద్రబాబు వార్నింగ్?!
అమరావతి, సాక్షి: సచివాలయంలో ఇవాళ కేబినెట్ భేటీ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ‘నెల్లూరు పంచాయితీ’ జరిగింది. ఆ జిల్లా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలపై ఆయన క్లాస్ తీసుకున్నారు.నెల్లూరు మంత్రులిద్దరూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యవహారాల్లో పూర్తిగా ఆయన్ని పక్కన పెడుతూ వస్తున్నారు. తాజాగా మంత్రి ఆనం నిర్వహించిన సమీక్షకు ఆయన్ని పిలవలేదు. దీంతో అసంతృప్తితో రగిలిపోయిన బీద రవిచంద్ర.. అధినేత చంద్రబాబుని కలిసి ఆ ఇద్దరు మంత్రులపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆనం తన కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చూపిస్తుండడంపైనా గరం అయ్యారని, ఇక నుంచైనా బీద రవిచంద్రతో కలిసి పని చేయాలని మంత్రులిద్దరికీ చంద్రబాబు గట్టిగా చెప్పినట్లు సమాచారం.ఇంకా భేటీలో మంత్రులతో చంద్రబాబు ఏమన్నారంటే.. నెల రోజుల పని తీరుపై చర్చ జరిపాం. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్టులో ఉందని గ్రహించి మసలుకోవాలి. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందే. అధికారాన్ని తలకెక్కించుకోవద్దు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో వెళ్లాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. -
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
అమరావతి, సాక్షి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. మంగళవారం సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా చర్చించినట్లు సమాచారం.నేటి మంత్రి మండలి భేటీలో కొత్త ఇసుక విధానానికి అమోదం తెలిపిన కేబినెట్.. ఇసుక పాలసీ విధివిధానాల రూపకల్పనపై మాత్రం ఎటూ తేల్చలేకపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. పౌర సరఫరాల శాఖ ద్వారా 2 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.ఇక.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైనా కేబినెట్లో చర్చ జరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుందని, అలాగే సీఎం చంద్రబాబు ఇటీవల ప్రవేశపెట్టిన శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చించాలనే కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం. -
అదే టెక్నిక్ ఉపయోగిస్తున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం మీడియాలో ఉంటారు. ఆ విషయంలో ఆయన చాకచక్యాన్ని ఒప్పుకోక తప్పదు. 2024 ఎన్నికలలో గెలవడానికి ముందు ఆయన ఏ కబుర్లు చెప్పారు?.. ఇప్పుడు ఏమి చేస్తున్నారు?.. అనేది తరచి చూస్తే గమ్మత్తుగా ఉంటుంది. విపక్షంలో ఉన్నప్పుడు రోజూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ మీడియా సమావేశాలు పెట్టేవారు. ఏదో ప్రజెంటేషన్ అంటూ తనదైన శైలిలో విమర్శలు చేసేవారు. అధికారంలోకి వచ్చినా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. అందుకే అసలు పని మానేసి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూ శ్వేతపత్రాల పేరుతో కధ నడిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విద్యుత్ శ్వేత పత్రం విడుదల చేశారు. అసలు ఇక్కడ ఒక విషయం ప్రశ్నించాలి. గత ప్రభుత్వాన్ని ప్రజలు కాదని టీడీపీని ఎన్నుకున్న తర్వాత ఈ పత్రాల గోల దేనికి?. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలు, ఆరోపణలనే మళ్లీ గుప్పిస్తూ శ్వేతపత్రాలు ఇస్తే చంద్రబాబు సాధించేదేమి ఉంటుంది?. పోనీ అవన్నీ సత్యమైన విషయాలా అంటే అదేమీ కాదు.తన ప్రభుత్వం విద్యుత్ చార్జీలు తగ్గిస్తుందనికాని, గతంలో తాను వ్యతిరేకించిన ట్రూ అప్ చార్జీలను తొలగిస్తామని, రద్దు చేస్తామని కాని చెప్పడం లేదు. పైగా తన గత హయాంలోని అప్పులు,నష్టాలు అన్నింటిని కలిపి జగన్ ఖాతాలో వేసి బదనాం చేస్తున్నారు. జగన్ కొన్ని పీపీఏలను సమీక్షించాలని ప్రయత్నించినప్పుడు ఇంకేముంది.. అంతర్జాతీయంగా ఏపీకి నష్టం జరిగిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయా విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తానని అంటున్నారు. జగన్ ప్రభుత్వం పేదలపై వేసిన విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గిస్తారా ? అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఆ జర్నలిస్టు కూడా తెలుగుదేశం మద్దతుదారులాగానే అడిగారు. ఫర్వాలేదు. అయినా ఏదైనా పాజిటివ్ సమాధానం వస్తుందని అనుకున్నవారు ఆశ్చర్యపోయే జవాబును చంద్రబాబు ఇచ్చారు. 'పేదలపై ఇప్పటికే భారం పడిపోయింది. కొత్త టారిఫ్ వచ్చే మార్చికి అమలులోకి వస్తుంది. అప్పటికి ఏమి చేయాలో ఆలోచిస్తాం. ప్రభుత్వం ముందు చాలా సవాళ్లు, ఆర్దిక ఇబ్బందులు ఉన్నాయి..." అని చంద్రబాబు సెలవిచ్చారు. ఇది తెలివిగా చెప్పారని అనుకోవచ్చు. కాని అంతిమంగా అర్ధం అవుతున్నది ఏమిటంటే వచ్చే మార్చిలో విద్యుత్ చార్జీలు పెంచే అవకాశం ఉందనే కదా! ట్రూఆప్ చార్జీలను రద్దు చేయబోమని చెబుతున్నట్లే కదా!ప్రభుత్వం విష వలయంలో ఉందని ఆయన అంటున్నారు. ఆదాయం లేకపోతే బొగ్గు కూడా కొనలేని పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. మరి జగన్ టైమ్ లో మాత్రం డబ్బు అక్కర్లేకుండానే అన్ని జరిగిపోవాలన్నట్లు ప్రచారం చేశారు. ఆ రోజుల్లో ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేయాలనే కదా టిడిపి, దానికి మద్దతు ఇచ్చే మీడియా అదనపు చార్జీలకు వ్యతిరేకంగా రచ్చ,రచ్చ చేసి ప్రజలలో విష బీజాలు నాటిందని అంటే కాదనగలరా!స్మార్ట్ మీటర్లను వ్యవసాయ మోటార్లకు జగన్ ప్రభుత్వం అమర్చితే రైతులకు ఉరి తాళ్లు వేస్తున్నారని చంద్రబాబు నానా యాగీ చేశారా?లేదా?. ఈనాడు మీడియా ఆ మీటర్లకు వ్యతిరేకంగా పచ్చి అబద్దాలు రాసిందా?లేదా?. ఇప్పుడు ఆ మీటర్లను తీసేస్తారా అని అడిగితే మాత్రం దానిపై పరిశీలన చేసి ముందుకు వెళ్లాలని అంటున్నారు. ఇప్పటికే మీటర్లు ఏర్పాటైనందున అవి వృధా కాకుండా ,ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పానెళ్లు అందచేసి రైతులు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే చూస్తాం! అని దాటవేత సమాధానం ఇచ్చారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల పేరుతో జగన్ ప్రభుత్వం అడ్డగోలుగాఆ భూములు ఇచ్చిందని మరో జర్నలిస్టు తన టిడిపి ఎజెండా ప్రకారం ప్రశ్న వేసినా, చంద్రబాబు మాత్రం ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా జవాబు ఇచ్చారినిపిస్తుంది. పీఎస్పి ప్రాజెక్టులలో విద్యుత్ బయటకు వెళ్లినా నష్టం లేదని ,మన వినియోగదారులపై భారం పడకపోతే చాలని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఆయన చెప్పడం విశేషం. అంటే ఈ మేరకు జగన్ కృషిని ఒప్పుకున్నట్లే కదా!గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాకపోయినా విద్యుత్ వినియోగం పెరిగిందని చంద్రబాబు అనడం విశేషం. ఏ రాష్ట్రంలో అయినా ప్రజల ఆర్ధిక స్థితిగతులు అంచనా వేయడానికి, అభివృద్దిని నమోదు చేయడానికి,పరిశ్రమల ప్రగతి తెలుసుకోవడానికి విద్యుత్ సగటు వినియోగం కూడా ఒక కొలమానం అవుతుంది.ఆ రకంగా చూస్తే జగన్ టైమ్ లో ఈ విషయంలో మంచి ప్రగతి సాధించినట్లే అవుతుంది కదా!కాకపోతే చంద్రబాబు ఆ మాట ఒప్పుకోలేరు. గతంలో అదానీ తదితర బడా కంపెనీలకు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిమిత్తం పెద్ద ఎత్తున భూములను జగన్ కేటాయించారంటూ తెలుగుదేశం మీడియా తప్పుడు ప్రచారం చేసేది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కనుక ఆయన ఆ ప్రాజెక్టులను రద్దు చేస్తారా?.. అంటే అదేమీ చేయరన్న సంకేతాలే వస్తున్నాయి. అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా యూనిట్ 2.49 రూపాయలకు విద్యుత్ సరఫరా చేయడానికి జగన్ ప్రభుత్వం ఒప్పందం అయితే దానిపై ఎంతగా దారుణ అబద్దాలను టీడీపీ మీడియా ప్రచారం చేసింది తెలిసిందే. ఆ మీడియా మరి ఇంత దిగజారి రాస్తుందేమిటా అన్న బాధ కలిగినా ఏమి చేయలేని పరిస్థితి. ఆ విషయంలో కూడా చంద్రబాబు ఎక్కడా ఆ ఒప్పందాలను రద్దు చేయడానికి కమిట్ అవకపోవడం విశేషం. ఆంద్రజ్యోతి మీడియా మాత్రం చంద్రబాబు కన్నా అతిగా స్పందిస్తూ జగన్ పాలనలో ఇంధన రంగం చిధ్రమైపోయిందని అసత్యాలను ప్రచారం చేసింది. ఒకపక్క కొత్తగా విద్యుత్ రాలేదని చెబుతారు. మరో పక్క సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా ఏడువేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు జగన్ ప్రభుత్వం ఒప్పందం అయిందని అంగీకరిస్తారు. ఈ మీడియా ఎంత నీచంగా రాసిందంటే జగన్ ప్రభుత్వం వల్ల 1.28 లక్షల కోట్ల భారం పడిందట. వాస్తవం ఏమిటంటే అందులో రాష్ట్ర విభజన టైమ్ కు డిస్కంలపై ఉన్న అప్పులు, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులు అన్ని కలిపి 86వేల కోట్ల రూపాయలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మరో 36వేల కోట్ల అప్పులు తీసుకుంది. కానీ, మొత్తం అప్పు అంతటిని జగన్ ప్రభుత్వంపై నెట్టేసి తాము అక్షర సత్యాలు రాశామని నిస్సిగ్గుగా టీడీపీ మీడియా రాసుకుంది. తెలంగాణ విద్యుత్ బకాయిలను కూడా గత ప్రభుత్వంపై నెట్టడానికి మొహమాట పడలేదు.ప్రస్తుతం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉన్నందున , వెంటనే బకాయిలు వసూలు చేయవచ్చు కదా.. ఆ మాట మాత్రం రాలేదు. తెలంగాణ ప్రభుత్వం వారే తమకే ఏపీ 24వేల కోట్ల బకాయి ఉందని కొత్త వాదన తెచ్చినా చంద్రబాబు కిమ్మనలేదు. అసలు ఇంతకీ విద్యుత్ రంగానికి సంబంధించి తన ప్రణాళిక ఏమిటో చెప్పకుండా ,ఉన్నవి,లేనివి కలిపి శ్వేతపత్రం పేరుతో జగన్ ప్రభుత్వంపై బురద చల్లడం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. బహుశా ప్రజలపై భారం వేయడానికి ముందు జగన్ తప్పుల వల్లే ఈ పరిస్టితి ఏర్పడిందని అసత్య ప్రచారం చేయడమే లక్ష్యం అయి ఉంటుందని అంతా ఊహిస్తున్నారు. ఆ తర్వాత తానేదో ఉద్దరిస్తున్నట్లు, బాగు చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తుంటారు. అంతే తప్ప తాను ఎన్నికలకు ముందు చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటీ అన్న విషయం గురించి మాత్రం ప్రస్తావించరు. అదే ఆయన గొప్పదనం. జనం ఓట్లు వేశారు కనుక ఇప్పుడు చంద్రబాబు ఏమి చేసినా భరించవలసిందే. ఆయన ఏమి చెప్పినా వినాల్సిందే. ఆ క్రమంలోనే ఈ నెల కూడా యధా ప్రకారం ట్రూ అప్ చార్జెస్ ను విద్యుత్ సంస్థలు బిల్లుల్లో వేసి వినియోగదారులకు పంపించాయని వార్తలు వచ్చాయి. వాటిని చచ్చినట్లు జనం కట్టక తప్పదు. దీనిపై టీడీపీ నేతలు మాట్లాడరు. జగన్ ప్రభుత్వం టైమ్ లో నానా యాగీ చేసిన టీడీపీ మీడియా కిక్కురుమనదు. ఇలాంటి టెక్నిక్స్ విషయంలో చంద్రబాబును మించినవారు ఎవరూ లేరన్నది వాస్తవం అని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఇంగ్లిష్ యాదవ్ చాచా
ఆంగ్లంలో మాట్లాడితే ఆశ్చర్యపోయి, అబ్బురపడే రోజులు కావు ఇవి.. ఇంగ్లిష్లో మాట్లాడడం ఈరోజుల్లో చాలా సహజం. అయితే ఒక ఆటో డ్రైవర్ ఇంగ్లిష్లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. మూడు మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతిలో యాదవ్ చాచా అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఇతడిని ‘ఆటోడ్రైవర్ యాదవ్ చాచా’ అని పిలిచే వారు చాలా తక్కువ. ‘ఇంగ్లిష్ యాదవ్ చాచా’ అనే పిలిచేవారే ఎక్కువ. దీనికి కారణం యాదవ్ ఇంగ్లిష్ బాగా మాట్లాడుతాడు. తాజా వైరల్ వీడియోలో భూషణ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ యాదవ్తో ఇంగ్లిష్లో మాట్లాడించాడు. ‘ఇంగ్లిష్ తెలిస్తే ఇంగ్లాండ్, అమెరికాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు. ఇంగ్లిష్ నేర్చుకోండి. ఇది అంతర్జాతీయ భాష’ అంటూ మాట్లాడాడు యాదవ్. -
ఏపీలో మరో తప్పుడు శ్వేత పత్రం రెడీ!
అమరావతి, సాక్షి: ‘‘అవునా.. అలా కనిపించడం లేదా?. అయినాసరే రూ. 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్లు ఎలాగైనా లెక్కలు చూపించండి’’.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులకు జారీ చేసిన ఆదేశాలివి!. శ్వేత పత్రాల పేరిట జగన్ పాలనను ఏదో ఒకరకంగా తప్పుబట్టాలని చూస్తున్న చంద్రబాబు.. ఈ క్రమంలోనే ఈ ఆదేశాలిచ్చారని స్పష్టమవుతోంది. గత ఐదేళ్ల పాలనకు సంబంధించి అన్ని రంగాలపై వరుసగా చంద్రబాబు ప్రభుత్వం వైట్ పేపర్లు విడుదల చేస్తోంది. అమరావతి, ఆ వెంటనే విద్యుత్ శాఖపై లేనిపోని లెక్కలు చెబుతూ స్వయంగా చంద్రబాబు ఆ పత్రాలు విడదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై అధికారులతో సమీకక్షించారు. ఆపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికున్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. అయితే.. ఇదీ చదవండి: అన్నన్న చంద్రన్నా.. పచ్చి అబద్ధాలతో విద్యుత్ శ్వేత పత్రం!ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో ఉన్న ఆయన.. ఎలాగైనా 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు చూపాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశించినట్టు సమాచారం. ఈ సమావేశం కంటే ముందే.. అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా రూ. 14 లక్షలు కోట్లు ఉన్నాయంటూ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వ లెక్కలు, రిజర్వ్ బ్యాంకు గణాంకాలకు విరుద్ధంగా అప్పుల లెక్క చూపలేక అధికారులు అవస్థలు పడుతోంది. ఇదీ చదవండి: శ్వేత పత్రం కాదది.. ‘పచ్చ’ పత్రం -
KSR Comments: మరోసారి అమరావతి గ్రాఫిక్స్
-
‘అమరావతి’ సాక్షిగా.. ఇంకెన్ని దారుణాలు వినాలో!
ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ అబద్దాల మబ్బులు కమ్ముకుంటున్నాయి. అమరావతి పేరుతో అందమైన గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్య పెట్టడానికి సన్నాహాలు సాగుతున్నట్లు కనిపిస్తుంది. రాజధానికి సంబంధించి కొన్ని భవనాలు నిర్మిస్తే అభ్యంతరం లేదు. కానీ, అమరావతి అంటూ పాత పాటే పాడి ఏపీని మరోసారి ముంచుతారా? అనే సందేహం వస్తోంది. ప్రజలను ఊహలలో ముంచెత్తుతూ.. గాలి మేడలు కట్టేస్తారా? అనే భావన ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన అమరావతి శ్వేతపత్రం చూస్తే అత్యధిక భాగం అసత్యాలు, అర్ద సత్యాలే కనిపిస్తాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫలానా,ఫలానా పనులు చేసి ఉంటే బాగుండేదని చెబితే మర్యాదగా ఉండేది. తాను వచ్చే ఐదేళ్లలో ఏమి చేస్తానో చెప్పి ఉంటే పద్దతిగా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు యధావిధిగా విధ్వంసపు భాష వాడారు. అక్రమంగా ప్రభుత్వమే నిర్మించిన ప్రజావేదికను తొలగిస్తే అది విధ్వంసమట. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చితే , వందలాది ఆ పార్టీ నేతలు, అభిమానుల ఇళ్లను టిడిపి వారు నాశనం చేస్తే, ప్రభుత్వ భవనాలను పాడు చేస్తే, చివరికి ఇండోర్ స్టేడియంను కూల్చితే, అనేకమందిపై దాడులు చేస్తే అదంతా గొప్ప నిర్మాణాత్మక కార్యక్రమమని చంద్రబాబు కొత్త నిర్వచనం చెబుతున్నారు. శ్వేతపత్రం లో ఎక్కడా అమరావతిలో గత ప్రభుత్వం దర్యాప్తు చేయించిన కుంభకోణాల గురించి ప్రస్తావించకపోవడం కూడా విశేషంగానే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని అనుకున్నారు. తప్పు లేదు. దానిని ఏ విధంగా తాను అభివృద్ది చేయదలిచింది!. అందుకు అవసరం అయ్యే వ్యయం ఎంత? ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలని భావిస్తున్నది!. గతంలో మాదిరి నవనగరాలు ఇక్కడే నిర్మిస్తామని చెబుతున్నారా?. ఏపీ ప్రజలందరి నుంచి వచ్చే పన్నుల ఆదాయం అంతా అమరావతిలోనే పెట్టి కొన్ని భవంతులు నిర్మించి ఇదే సింగపూర్ అని అనుకోండని చెబుతారా?. ఇలా అనేక సంశయాలు ప్రజలలో వస్తున్నాయి. వీటిమీద శ్వేతపత్రంలో వివరణ ఇచ్చి ఉంటే ప్రజలకు క్లారిటీ వచ్చేది. కాని ఎవరికి ఏమీ అర్ధం కాని రీతిలో,అసలు ఏమీ చేస్తారో చెప్పకుండా, మాజీ సీఎం జగన్ ను తిట్టడానికే మాత్రమే ఈ శ్వేతపత్రాల తంతు నడుపుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం అమరావతి రాజధాని సమస్య వల్ల వచ్చింది కాదు. అలా అనుకుంటే అది భ్రమే అవుతుంది. వారి గెలుపునకు పలు ఇతర కారణాలు ఉన్నాయి. ఈవీఎంల వల్ల గెలిచారా? లేదంటే వైఎస్సార్సీపీ అతి విశ్వాసంతో నష్టపోయిందా? అనేదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అమరావతి అంశం ఆధారంగా కృష్ణా,గుంటూరు జిల్లాలలో ప్రజలలో కొంత వ్యతిరేకత తీసుకురావడానికి టీడీపీ కూటమి ప్రయత్నించి ఉండవచ్చు. కానీ ఆ కారణంతోనే తాము రాష్ట్రం అంతటా గెలిచామని అనుకుని,మళ్లీ రెచ్చిపోతే నష్టం వారికే జరుగుతుంది. 2014-2019 మధ్య నడిచిన అమరావతి డ్రామా వల్ల టీడీపీపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అదొక్కటే కాకుండా చంద్రబాబు నాయుడు అప్పట్లో చేసిన పలు వాగ్దానాలను అమలు చేయడం లో విఫలం అవడంపై ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. సరిగ్గా ఇప్పుడు కూడా టీడీపీ కూటమి అదే బాటలో వెళ్లే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. అన్ని అబద్దపు వాగ్దానాలు చేశారు. వాటిని నెరవేర్చితే గొప్ప విషయమే. కాని అందుకు బహుశా రెండు,మూడు రాష్ట్రాల బడ్జెట్ అవసరం అవుతుంది. ఇప్పటికే ఒక హామీ అమలుకు ఏడువేల కోట్ల రూపాయల అప్పు చేశారు. ఈ సంగతి పక్కనబెడితే.. అమరావతి కోసం గతంలోనే వేల కోట్ల అప్పులు చేశారు. అయినా అది ఒకరూపానికి రాలేదు. తాత్కాలిక ప్రాతిపదికన అసెంబ్లీ, సచివాలయం వంటివాటిని నిర్మించారు. ఈ తరుణంలో ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఏదైనా చేద్దామని అనుకున్నా.. నిత్యం కోర్టు కేసులు వేసి అడుగు పడనివ్వలేదు. ఆయన ఈ ప్రాంతాన్ని శాసన రాజధాని చేద్దామని అనుకున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆ నగరానికి ఒక గుర్తింపు తీసుకు రావాలని తలపోశారు. కర్నూలుకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి అక్కడ న్యాయ రాజధాని ఏర్పాటుకు సన్నద్దం అయ్యారు. టీడీపీ దీనిని గందరగోళం చేయడంలో విజయవంతం అయింది. జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఒక కొత్త అసెంబ్లీ నిర్మించి ఉంటే ఎలా ఉండేదో కాని.. ఆ అవకాశమే ఇవ్వకుండా టీడీపీ నిత్యం ఒక వర్గం ప్రజలను రెచ్చగొడుతూ వచ్చింది. ఇక శ్వేతపత్రంలో ఇచ్చిన అంశాలను పరిశీలిస్తే చంద్రబాబు తన ఒరిజినల్ స్టైల్ లో నిరాఘాటంగా అవాస్తవాలు చెప్పినట్లు కనిపిస్తుంది. అవేమిటో చూద్దాం. ➤ విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆయన అన్నారు. అది ఎంతవరకు కరెక్టు!. ఓటుకు నోటు కేసు లో ఇరుక్కునే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదేళ్లు ఉంటుందని ఆయన చెప్పేవారా?లేదా?దానిని వదలుకుని ఎందుకు విజయవాడకు వెళ్లారు. ఆ తర్వాత రాజధాని పేరుతో ఎన్ని ఊహాగానాలు చేశారు!. తత్ఫలితంగా వేలాది మంది నూజివీడు ప్రాంతంలో భూములు కొని ఎంత నష్టపోయారు!. అవేమీ శ్వేతపత్రంలో కనిపించలేదే!. రామోజీరావు కోరిక మేరకు అమరావతి పేరుతో రాజధాని ప్రకటన చేశారు కదా!➤ సచివాలయం, అసెంబ్లీ మొదలైనవాటిని అక్కడ తాత్కాలికమైనవే అయినా నిర్మించారు కదా! ఆ తర్వాత జగన్ కూడా అక్కడ నుంచే పాలన చేశారు కదా!ఆయన అనుకున్న మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు కదా!అలాంటప్పుడు అమరావతి రాజధాని కాకుండా ఎలా పోతుంది!రాజధాని లేదని చెప్పడం పచ్చి అబద్దం అనే సంగతి రుజువు అవుతుంది. ➤ ఉపాధి కల్పించే నగరం లేక యువత వలస పోతున్నారట!. ఎంత పెద్ద నగరం ఉన్నా ఎవరి అవకాశాలను బట్టి వారు వలస వెళుతుంటారు. మరి అంత గొప్ప దార్శనికుడు అయితే ఐదు కోట్ల జనాభా ఉన్న కోస్తా, రాయలసీమలలో ఎందుకు పరిశ్రమలను చంద్రబాబు తన పద్నాలుగేళ్ల సీఎం పదవీకాలంలో తేలకపోయారు!. విశాఖ అయితే సత్వరమే ఉపాధి కేంద్రం అవుతుందనే కదా జగన్ దానికి ప్రాముఖ్యత ఇచ్చింది. పోర్టులు మొదలైనవాటిని నిర్మించడం ఆరంభించింది. సింగపూర్ కన్సార్టియం కు చంద్రబాబు వేల కోట్ల రాయితీలు ఇచ్చింది అక్కడ ఏవైనా పరిశ్రమల ఏర్పాటు కోసమా!లేక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసమా?మొత్తం అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చింది చంద్రబాబా?కాదా?. ➤ అభివృద్ది అంటే రియల్ ఎస్టేటేనా? కృత్రిమంగా ధరలు పెరిగేలా చేసి,ఇన్ సైడ్ ట్రేడింగ్, అస్సైన్ మెంట్ భూముల కుంభకోణం వంటివాటికి అవకాశం కల్పించి అదేదో గొప్ప విషయంగా ప్రచారం చేసుకుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది. యాభైవేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేలాతన గత టరమ్ లో ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు అన్నారు. ప్రణాళిక సరే! ఆ డబ్బు ఎందుకు సమకూర్చుకోలేకపోయారు?. ➤ 2018 నాటికే ఒక దశ నిర్మాణం అయిపోతుందని గాలి మాటలు అప్పట్లో చెప్పారా?లేదా?. మరి ఎందుకు పదిశాతం కూడా చేయలేకపోయారు?. ఏభైవేల కోట్ల వ్యయం చేస్తే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఇరవైవేల కోట్ల నుంచి ముప్పైవేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదట. ఎవరి చెవిలో పువ్వు పెట్టడానికి ఇలాంటి మాటలు చెబుతున్నారు!➤ రాజధానిలో ఏర్పాటైన రెండు యూనివర్శిటీలలో చదుకున్న పేద పిల్లలకు ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తున్నాయట. అసలు పిల్లలు ఎందరికి ఉద్యోగాలు వస్తాయి. అందులో ఎంతమందికి కోటి రూపాయల జీతం వస్తుంది?ఎవరిని మోసం చేస్తున్నారు!. ➤ భూమి విలువ ఎకరా ఇరవై కోట్లకు పెరిగేదని, తద్వారా లక్షాఅరవై వేల కోట్ల సంపద ప్రభుత్వానికి వచ్చేదని ఆయన కాకి లెక్కలు చెబుతున్నారు. అంటే ఇక్కడ పేద,మద్య తరగతివారెవ్వరికి జీవించే అవకాశం లేనట్లు ఒప్పుకున్నట్లే కదా!. సంపద సృష్టిం సంగతి దేవుడెరుగు!ముందుగా లక్షన్నర కోట్ల రూపాయలు వ్యయం చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి కదా?ఇదంతా దేనికి !ప్రైవేటు ఆసాముల భూముల విలువలు పెంచడానికే కదా!అదే ప్రభుత్వ భూమి తీసుకుని రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేసుకుంటే మహా అయితే ఐదువేల నుంచి పదివేల కోట్ల వ్యయంతో అయిపోయేవి కదా!ఆ తర్వాత ప్రైవేటు వారు తమకు కావల్సిన రీతిలో వారి భూములను అభివృద్ది చేసుకునే వారు కదా!ఆ ఖర్చంతా ప్రభుత్వానికి ఉండేది కాదు కదా!. ➤ కృష్ణా నది పరివాహంలో రాజధాని నిర్మించవద్దని శివరామకృష్ణన్ కమిటీ చెబితే.. ఆ కమిటీ రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలని సిఫారస్ చేసిందని ప్రచారం చేయడం చంద్రబాబుకు తగునా?. అక్కడ భూములు భారీ భవంతుల నిర్మాణానికి తగవని,పునాదులకే చాలా వ్యయం చేయవలసి ఉంటుందని నిపుణులు చెప్పారా?..లేదా?. ➤ విశాఖలో రిషికొండలో అప్పటికే ఉన్న కొన్ని భవంతులు తొలగించి ఆధునికమైన రీతిలో భవనాలు నిర్మిస్తే.. పర్యావరణం దెబ్బతిందని దుర్మార్గపు ప్రచారం చేసినవారు అమరావతిలో మూడు పంటలు పండే ముప్పైమూడు వేల ఎకరాల భూమిని విధ్వసం చేస్తే పర్యావరణం నాశనం కాదట. పవన్ కల్యాణ్.. అమరావతి అన్నది ఒక వర్గం రాజధాని అని, రాయలసీమ,ఉత్తరాంధ్రవారికి ఇక్కడ అవకాశం ఏమి ఉంటుందని గతంలో ప్రశ్నించిన మాటేమిటి?. ఇప్పుడు ఎందుకు మాట మార్చారు?వరదలు వస్తే మునిగిపోయే ప్రదేశంలో రాజధాని నిర్మాణం చేపట్టారన్న విమర్శలకు ఈనాటికి సమాధానం దొరికిందా!. కొండవీటివాగు మళ్లింపునకు లిఫ్ట్ ప్రాజెక్టులు పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది!. ➤ జగన్ ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు చెల్లించిన మాట వాస్తవం కాదా!అలాగే వ్యవసాయ కూలీలకు పరిహారం ఇచ్చింది నిజం కాదా!అయినా రైతులకు ఏదో అన్యాయం జరిగిందని ప్రచారం చేశారు. రైతులు తమ భూములకు గాను ప్లాట్లతో పాటు కౌలు పొందుతున్నా,వారందరిని త్యాగజీవులుగా ప్రొజెక్టు చేయడంలోని సెంటిమెంట్ రాజకీయం ఎవరికి తెలియనిది!. ఆరు లక్షల మందికి నిర్మాణ పనులలో అవకాశం వచ్చేదని చంద్రబాబు అంటున్నారు. కొంతకాలం పాటు కొన్నివేల మందికి అవకాశం ఉండవచ్చు. అది విశాఖలో అయినా ,కర్నూలులో అయినా వస్తుంది. ➤ అమరావతి గ్రామాలలో తప్ప ,చుట్టుపక్కల గుంటూరు,కృష్ణా జిల్లాలలో భూముల రేట్లు చంద్రబాబు టైమ్ లో ఎందుకు దెబ్బతిన్నాయి?ఇంత భారీగా ప్లాట్లు వేయడం వల్ల అవన్ని అమ్ముడు పోయేవరకు మిగిలిన ప్రాంతాలవారు నష్టపోవలసిందేనా?గతంలో మాదిరి నవ నగరాలు ఇక్కడే చేపడతారా?లేదా?అన్నది ఎందుకు చెప్పడం లేదు?. తాజాగా అమరావతి నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనా గురించి, ఆ మొత్తం ఎక్కడ నుంచి తెచ్చేది చెప్పకుండా కధలు వినిపించి జనాన్ని మభ్య పెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారా?. ఇకపై ఇలాంటి ఎన్ని అబద్దాలు వినాల్సి ఉంటుందో!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, విజయవాడ: ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం. 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు చర్చించే అంశాలు శాఖల వారీగా ఇవ్వాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. -
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్! గతంలోలాగా గ్రాఫిక్స్ చేస్తేపోలా!
-
KSR Live Show: అమరావతి పేరుతో గాల్లో మేడలు.. బాబుగారి లక్ష కోట్ల దందా..!
-
అమరావతిలో టీడీపీ అసైన్డ్ దందా
-
చంద్రబాబు శ్వేత పత్రంకు ఆదిమూలపు సురేష్ స్ట్రాంగ్ కౌంటర్
-
Big Question: ఒక అమరావతి వంద అబద్ధాలు
-
విరాళాలు, ఆస్తుల అమ్మకం.. ఆ విజన్కు ప్రపంచ స్థాయి అట!
సాక్షి, అమరావతి: ‘అమరావతి రాజధానిని విధ్వంసం చేసి తెలుగు జాతికి జగన్ తీరని అన్యాయం చేశారు. దేశ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తప్ప ఇంకెవరూ రాజధాని మార్పు నిర్ణయాన్ని తీసుకోరు. విధ్వంసానికి జగన్ ఒక కేస్ స్టడీ. మాకు రాజధాని లేదు అని చెప్పుకునేంత పాపం రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? రాష్ట్రంలో పుష్కలంగా వనరులు ఉన్నాయి. తెలివి గల మానవ వనరులు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు విధ్వంసంతో నాశనం చేశారు’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి ఒక టైమ్ బాండ్ అంటూ పెట్టుకోలేదని, పాత ప్లాన్ ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళతామని స్పష్టం చేయడం చూస్తుంటే.. గత ప్రభుత్వం చెప్పిందే నిజమని స్పష్టమవుతోంది. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరుగుతుందని, ఇక్కడ రాజధాని కట్టాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదని, రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు రామోజీరావు అమరావతి పేరును సూచించారన్నారు. రాజధాని శంకుస్థాపనకు ప్రతి గ్రామం నుంచి.. దేశంలోని అన్ని పవిత్ర ప్రదేశాల నుంచి నీరు, మట్టిని కూడా తీసుకొచ్చామన్నారు. కుప్పం వారికైనా, ఇచ్ఛాపురం వారికైనా అమరావతి సమదూరంగా ఉంటుందని, అందువల్లే ఇక్కడ రాజధాని నిర్ణయించినట్టు చెప్పారు. బుద్ధి ఉన్న ఏ వ్యక్తీ అమరావతి రాజధానిని వ్యతిరేకించరని, రాజధానికి రెండు వైపులా 12 చొప్పున ఎంపీ స్థానాలు ఉన్నాయని, విభజన అనంతరం శివరామృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటించి కృష్ణా, గుంటూరు లేదా ఆ 2 జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు చెప్పిందన్నారు. ఏటా 3 పంటలు పండే మంచి భూమిని రాజధాని కోసం తీసుకోవడం సరికాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని ఇక్కడ ఆయన వక్రీకరించి అనుకూలంగా మార్చుకున్నారు.హైదరాబాద్కు కరెంట్, నీళ్లు.. బాబు ఘనతేనటగతంలో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.15 వేల కోట్లు ఆర్థిక లోటు ఉన్నా, సైబరాబాద్ నిర్మాణ అనుభవంతో అమరావతిని నిర్మించాలని ఆలోచించామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్కు నాడు సరిగా కరెంట్, నీళ్లు లేవని.. రానురాను అన్నీ కలిసొచ్చాయన్నారు. ఎంత మంది ప్రయత్నించినా వీలుపడని కృష్ణా జలాలను హైదరాబాద్కు తీసుకొచ్చామని, 14 రోజుల పాటు అమెరికాలో తిరిగి ఐటీ పరిశ్రమలను కూడా సైబరాబాద్కు తీసుకొచ్చినట్టు సీఎం వివరించారు. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చామని, తన హయాంలో సాగు నీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఎయిర్ పోర్టులకు భూములు ఇచ్చిన వారు సంతృప్తిగా ఉండేలా చేశానని బాబు గొప్పలు చెప్పుకున్నారు. తొలుత అమరావతికి ల్యాండ్ పూలింగ్ సాధ్యమవుతుందా.. అని అనుమాన పడినా, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 34,400 ఎకరాలను 29,966 మంది రైతులు ఇచ్చారన్నారు. ఈ రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వాలని నిర్ణయించామని, వ్యయసాయ కూలీలకు నెలకు రూ.2,500 పెన్షన్ అందిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 1నే దాన్ని రూ.5 వేలకు పెంచి అందించామన్నారు. వాస్తవంగా పెన్షన్ను పెంచింది గత ప్రభుత్వమనే విషయాన్ని మరచి తన ఖాతాలోకి వేసుకోవడం బాబుకే చెల్లింది.గత ప్రభుత్వంపై ఏడుపువైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రాగానే విధ్వంసం ప్రారంభించారని, కనీసం నిబంధనలు కూడా పాటించకుండా ప్రజా వేదికను కూల్చేశారని, తర్వాత మూడు రాజధానులు ప్రకటించారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘జీఎన్.రావు, బోస్టన్ కమిటీ అంటూ ఎన్ని విన్యాసాలు చేయాలో అన్నీ చేశారు. ప్రజావేదిక శిథిలాలను తొలగించవద్దని ఇప్పుడు అంతా చెబుతున్నారు. అది చూస్తే ప్రతి ఒక్కరిలో గత ప్రభుత్వ విధ్వంసం గుర్తుకు రావాలి. జగన్ నిర్ణయంతో రైతులు రోడ్డున పడ్డారు. తిరుపతి యాత్రకు వెళితే ఉండటానికి మండపాలు ఇవ్వకుండా వేధించారు. అరసవెల్లి యాత్రకు వెళితే దాడులు చేసి మధ్యలోనే నిలిపేయించారు’ అని సీఎం చంద్రబాబు మొసలి కన్నీళ్లు కార్చారు. గత పాలకులు అధికారంలోకి రాగానే రాజధానిలో అన్ని నిర్మాణాలను మధ్యలోనే నిలిపేశారని, వ్యవసాయ కూలీలకు అందించాల్సిన పెన్షన్లు, రైతులకు ఇవ్వాల్సిన కౌలు నిలిపేశారని, మాస్టర్ ప్లాన్ రద్దు చేశారని, రూ.1000 కోట్లు గ్రాంట్ రాకుండా కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేశారని.. ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు. సింగపూర్ కన్సార్టియంపైనా ఆరోపణలు చేశారని, 14 ఎకరాల్లో 12 టవర్లతో నిర్మాణం తలపెట్టిన హ్యాపీ నెస్ట్ను నాశనం చేశారని, అది పూర్తయితే ప్రభుత్వానికి రూ.57.37 కోట్లు ఆదాయం వచ్చేదని, మున్ముందు రూ.885 కోట్లకు పెరిగేదన్నారు. కానీ దాన్ని కూడా నాశనం చేయడంతో ఇప్పుడు రూ.164.5 కోట్ల నష్టంతో పాటు రాజధాని పరిధిలోని రోడ్లు, భవనాలు దెబ్బ తిన్నాయన్నారు.నిర్మాణ ఖర్చు పెంచడానికే ఈ మాటలు..గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంసంతోనే రాజధాని నిర్మాణం ఖర్చు పెరిగిందని సీఎం చంద్రబాబు చెప్పడం చూస్తుంటే మళ్లీ ఎస్టిమేషన్లు పెంచుకోవడం కోసమేనని తెలుస్తోంది. ‘రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది. పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లింది. సంపద ఉత్పత్తి పెరగలేదు. అన్ని రంగాలు రివర్స్ అయ్యాయి. నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలో ఉన్న పనులు పూర్తవలేదు. రెవెన్యూ ఆదాయం తగ్గిపోయింది. ఏపీలో భూముల విలువ కూడా తగ్గిపోయింది. హైకోర్టు, హెచ్వోడీ, సచివాలయాల భవనాల ఐకానిక్ పునాదులన్నింటినీ నీళ్లలో ముంచేశారు. గెజిటెడ్ అధికారులు, మంత్రులు, జడ్జీల కోసం నిర్మించ తలపెట్టిన వాటిని కూడా అర్ధంతరంగా నిలిపేశారు. నేను పడ్డ కష్టం వృధా అయింది. అది చూస్తే మనసు నిగ్రహం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి రాజధాని కాలం కూడా అయిపోంది. పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోయారు. సింగపూర్ ప్రతినిధులు వస్తారో రారో తెలీదు. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం మనది. వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? నన్ను ఇబ్బందులు పెట్టారని నేను మాట్లాడడం లేదు. జగన్ విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోకూడదు. బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతా’ అని అన్నారు.ఉద్యోగ కల్పనకు నిలయంగా రాజధాని రూపకల్పనరాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారికి ఉద్యోగాల కల్పన అమరావతిలో జరుగుతుందని సీఎం చంద్రబాబు మరోసారి చుక్కలు చూపారు. ప్రతి పంచాయతీ సంక్షేమానికి ఇది నిక్షేపంలా ఉంటుందన్నారు. అమరావతి నాది అని చెప్పుకునేలా ప్రణాళిక రూపొందించామని, మాస్టర్ ప్లాన్లో మార్పులు లేవని తెలిపారు. గతంలో రూపొందించిన అదే మాస్టర్ ప్లాన్ను కొనసాగిస్తామన్నారు. ఇన్ని చెప్పిన బాబు.. అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామని, కొన్ని ఆస్తులు అమ్మి సంపద సృష్టిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పడం ఎన్నో సందేహాలకు తెర లేపింది. ఇక్కడ భూములమ్మిన వారు ఇతర ప్రాంతాల్లో భూములు కొంటే అక్కడ కూడా విలువ పెరుగుతుందని, ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరిగి ఉంటే ప్రభుత్వానికి కూడా పన్నులు, జీఎస్టీ రూపంలో రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చేదన్నారు. విట్, ఎస్ఆర్, అమృత్ లాంటి యూనివర్సిటీల్లో పేద పిల్లలు చదువుకుంటే కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తాయని యువతను మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. రాజధాని పునర్నిర్మానంపై కేంద్రంతో కూడా మాట్లాడతామని చెప్పారు. రాజధాని పనులు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే పనులు ప్రారంభిస్తామే తప్ప వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి సెంటు పట్టాలని డ్రామాలాడారని, ఇల్లు లేని వారికి వారి ప్రాంతాల్లోనే ఇల్లు కట్టిస్తామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ లెక్కన అమరావతిలో పేదలకు స్థానం లేదని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఎయిమ్స్కు కూడా నీళ్లివ్వకుండా గత ప్రభుత్వం వేధించిందని, తద్వారా పడకల పెరుగుదలకు అవరోధం ఏర్పడి ఆసుపత్రిలో ఓపీలు కూడా తగ్గాయని చెప్పారు. ఏ లెక్కన చంద్రబాబు ఈ మాట చెప్పారో అర్థం కావడం లేదు. వాస్తవానికి ఎయిమ్స్లో ఓపీలు పెరగడం గమనార్హం. గతంలో అనుమతులు పొందిన 132 సంస్థలకు గాను 122 సంస్థలు అమరావతికి రాలేదని చెప్పుకొచ్చారు. ఆ విజన్కు ప్రపంచ స్థాయి అట!అమరావతిలో 53,748 ఎకరాలు సేకరించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రోడ్లు, ఇతర నిర్మాణాలకు 27,885 ఎకరాలు, రిటర్నబుల్ ప్లాట్ల కింద 11,826, ఇతర అవసరాలకు 14,037 ఎకరాలు పోను ప్రభుత్వం వద్ద 8,274 ఎకరాలు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వద్దనున్న భూమిని విక్రయించి రాజధాని నిర్మాణం చేయొచ్చని ఆలోచించామని, కేంద్ర ప్రభుత్వం కేపిటెల్ గెయిన్ మినహాయింపునిచ్చి రూ.2,500 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుని రూ.1,500 కోట్లు కూడా అందించిందన్నారు. నాడు రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ, జేఐసీఏ వంటి సంస్థలు ఆర్థిక తోడ్పాటుకు ముందుకు వచ్చాయని, సింగపూర్తో ఎంఓయూ కుదుర్చుకున్నామని తెలిపారు. మొదట సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, తర్వాత రాజధాని మాస్టర్ ప్లాన్ను సింగపూర్ సంస్థ అందించిందన్నారు. దేశంలోనే స్మార్ట్ సిటీగా, ప్రపంచ స్థాయి ఆర్థిక రాజధానిగా అమరావతి విజన్ రూపొందించినట్టు చెప్పారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్తో పాటు అన్ని విభాగాలు ఒకేచోట ఉండాలని మాస్టర్ ప్లాన్లో నిర్ణయించామన్నారు. దేశంలో ఏ సిటీకి లేనంత మేర నదీ ప్రాంతం అమరావతికి ఉందని, రెండు నదులను అనుసంధానం చేసే కాన్సెప్ట్తో నగరానికి రూపకల్పన చేశామన్నారు. రూ.51,687 కోట్లతో రాజధాని పనులకు అంచనా వేసి, రూ.41,170 కోట్లకు టెండర్లు పిలిచామని, అప్పటికే జరిగిన నిర్మాణాలకు గాను రూ.4,318 కోట్లు బిల్లులు చెల్లించామని, రూ.1,268 కోట్లు ఇప్పటికీ పెండింగులో ఉందన్నారు. -
శ్వేత పత్రం కాదది.. ‘పచ్చ’ పత్రం: ఆదిమూలపు సురేష్
సాక్షి, తాడేపల్లి: అమరావతిపై చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని.. పచ్చ పత్రం అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో శ్వేతపత్రం ఉందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టాం. రోడ్లు, భవనాల నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లాం. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అమరావతి నిర్మాణాలు చేపట్టాం.’’ అని ఆదిమూలపు చెప్పారు.అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదు?‘‘తనది విజన్ అని చెప్పుకునే చంద్రబాబు.. అమరావతిని ఎందుకు పూర్తి చేయలేదంటూ ఆదిమూలపు ప్రశ్నించారు. ‘‘సంపద సృష్టిస్తానని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. సంపద సృష్టించి ఎవరికి ఇస్తారు? రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలి. అమరావతిలో అన్ని వర్గాలు ఉండాలని ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అమరావతిలో పేదలకు భూములు ఎందుకు ఇవ్వలేకపోయారో చంద్రబాబు చెప్పాలి. రాజధాని ప్రకటనకు ముందే ప్రభుత్వ సమాచారంతో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి.’’ అని ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు.అమరావతి కోసం చంద్రబాబు చేసిన ఖర్చు ఎంత?‘‘ వైఎస్ జగన్ పాలనపై ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశారు. అమరావతి స్మార్ట్ సిటీ, కోర్ కేపిటల్ అభివృద్ధి వంటివన్నీ ముందుకు తీసుకెళ్లాం. చంద్రబాబు చేసిన అప్పులన్నీ తీర్చాం. అసలు అమరావతి కోసం చంద్రబాబు చేసిన ఖర్చు ఎంత?. చేసిన అప్పులు ఎన్నో కూడా చంద్రబాబు తన శ్వేతపత్రంలో చెప్తే బాగుండేది. సంపద సృష్టిస్తానని పదేపదే చంద్రబాబు ఆ సంపద ఎవరి కోసం సృష్టిస్తారో చెప్పాలి. తన వారికే సంపద సృష్టిస్తారా? ప్రజలందరికీ చేస్తారా?. రాజధాని ప్రాంతంలో భూమిలేని కూలీలకు కూడా జగనే పెన్షన్ పెంచారు. 9 సిటీల పేరుతో లక్షల కోట్లతో నిర్మిస్తామనటం మీదే మేము వ్యతిరేకించాం. అన్ని లక్షలు ఒకేచోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాం’’ అని ఆదిమూలపు పేర్కొన్నారు.వేలాది ఎకరాలు చేతులు మారాయి..‘‘రాజధాని కడతానన్న చంద్రబాబు కనీసం రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను కూడా ఎందుకు ఇవ్వలేదు?. రాజధాని ప్రకటన జరిగే లోపు అమరావతిలో పెద్ద ఎత్తున భూకుంభకోణం జరిగింది. 2014 జూన్ నుండి డిసెంబర్ మధ్యలో వేలాది ఎకరాలు చేతులు మారాయి. ఇది ఎలా జరిగిందో చంద్రబాబు ప్రజలకు చెప్పాలి. రాజధానిలో ఇవ్వాల్టి పరిస్థితికి టీడీపీదే బాధ్యత. సీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఎందుకు పూర్తి చేయలేదు?. ఆ రోడ్ మీద వెలుగుతున్న లైట్లు కూడా మా హయాంలో వేసినవే. దాన్ని కూడా తామే వేసినట్టు చంద్రబాబు చెప్పుకోవటం హాస్యాస్పదం. రాజధానిలో 14 వందల ఎకరాలను 52 వేల మందికి పట్టాలు ఇచ్చాం. దానిపై చంద్రబాబు తన శ్వేతపత్రంలో ఎందుకు ప్రస్తావించలేదు?’’ అంటూ ఆదిమూలపు ప్రశ్నించారు.దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటలేదు?‘‘అమరావతిలో 17 అంగన్ వాడీ సెంటర్లు, 14 స్కూళ్ల నిర్మాణం చేశాం. చంద్రబాబు లాగా గ్రాఫిక్స్ చేయలేదు, నిర్మాణాలు పూర్తి చేసి చూపించాం. అమరావతి మీదుగా వేసిన వెస్ట్ బైపాస్ నిర్మాణం మా హయాంలోనే చేశాం. దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటలేదు?. చంద్రబాబు ఐకానిక్ బ్రిడ్జి అంటూ గ్రాఫిక్స్లో చూపిస్తే.. జగన్ వాస్తవరూపంలో నిర్మించి చూపారు. రూ.841 కోట్లు రైతులకు కౌలు కింద అందించాం. కూలీలకు పెన్షన్ కింద రూ.580 కోట్లు అందించాం. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కేంద్రం నుండి మట్టి, నీళ్లు తప్ప ఏం సాధించారు?. ఇప్పుడైనా నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలి. ప్రజలకు చేస్తామన్న సంక్షేమ మేలును పూర్తి చేయాలి. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను త్వరగా ఇవ్వాలి’’ అని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. -
AP Pension: రూ.500 ఇస్తేనే పెన్షన్ ఇస్తా!
అమరావతి, సాక్షి: ఎండనక, వాననక.. సుదూర ప్రాంతాల్ని సైతం లెక్కచేయక.. ఆఖరికి కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి పని చేసిన వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడాలనే చంద్రబాబు ప్రభుత్వం నిశ్చయించుకుంది. మరోవైపు పెన్షన్ల పంపిణీ మొదలై గంటలు గడవక ముందే.. కష్టాలు ఒక్కొక్కటిగా వెలుగు బయటకు వస్తున్నాయి. (గమనిక: పైన ఫొటోలో పెన్షన్ పంపిణీ చేస్తున్న షేక్ కరిష్మా విజయనగరంలో వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రంగానే ఆ ఫొటోను వాడటం జరిగింది. కింది ప్రచురితమైన పల్నాడు వార్తకు.. ఈ ఫొటోకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం)పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగి ఒకరు చేతివాటం ప్రదర్శించారు. మాచర్ల 9వ వార్డు సచివాలయం వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడావత్ వాలు నాయక్ పెన్షన్దారుల వద్ద నుంచి కమిషన్ పేరుతో రూ.500 మేరకు వసూలు చేశాడు. కొందరు లబ్ధిదారులు ఈ విషయం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆ ఆరోపణలపై నాయక్ను సస్పెండ్ చేశారు. ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రంఇంకోవైపు.. పెన్షన్ ఇస్తున్నట్లు ఫొటో దిగిన సచివాలయ సిబ్బంది, సర్వర్ సమస్యలున్నాయని, సచివాలయం వద్దకు వచ్చి తీసుకోవాలని చెప్పి వెళ్లిపోతున్నారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ సచివాలయం వద్దకే క్యూ కడుతున్నారు. చాలా చోట్ల వర్షంలో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రంరాజకీయ జోక్యాలుఏపీ వ్యాప్తంగా ఈ ఉదయం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే చాలా చోట్ల సచివాలయ సిబ్బంది స్థానంలో టీడీపీ నేతలు కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు ఇస్తూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగేది. ఇప్పుడు టీడీపీ నేతల జోక్యంతో ఇది పార్టీ ఈవెంట్గా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏపీలో పెన్షన్ పంపిణీ.. ప్రతీకాత్మక చిత్రంసంబంధిత వార్త: టీడీపీ ఈవెంట్గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం?!పింఛన్ నగదు చోరీ?వైఎస్సార్: ప్రొద్దుటూరు 7వ వార్డు సచివాలయంలో పింఛన్ పంపిణీ కోసం తెచ్చిన నాలుగు లక్షలు చోరీకి గురయ్యాయి. సచివాలయం సిబ్బంది మురళీ మోహన్ ఆ సొమ్మును తీసుకెళ్తుండగా.. కనిపించకుండా పోయింది. తాను డబ్బు తీసుకెళ్తున్న క్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ వద్ద బైక్ మీద నుంచి కళ్లు తిరిగి పడిపోయానని, ఆ టైంలో ఎవరో డబ్బు తీసుకెళ్లారని మురళీ మోహన్ అంటున్నారు. అయితే పింఛను డబ్బు మాయం కావడంపై పోలీసులు, అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కమిషనర్ రఘునాథరెడ్డి, సీఐ వెంకట రమణ ఆరా తీసి.. దర్యాప్తునకు ఆదేశించారు. -
పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. గత ప్రభుత్వ పెన్షన్ పథకం పేరు మార్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల హామీ మేరకు ఇవాళ్టి నుంచి పెంచిన సొమ్ముతో లబ్ధిదారులకు అందజేయాల్సి ఉందన్నది తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఉదయమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించారు. మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్లోని పెనుమాకలో సోమవారం(జులై 1) వేకువజామునే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్థానిక ఎస్టీ కాలనీలో నివాసం ఉండే బానావత్ పాములునాయక్ అనే వృద్ధుడికి తొలుత పెన్షన్ అందజేశారు. ఆపై లబ్ధిదారులు ఇస్లావత్ సాయి, బానవత్ సీతలకు స్వయంగా పెన్షన్ అందజేసి, వాళ్లతో కాసేపు ఆయన మాట్లాడారు. చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు.అనంతరం ప్రజలతో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యా. లోకేష్ మంగళగిరి ప్రజల అభిమానం చురగొన్నారు. భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారు. మంగళగిరిలోనే పెన్షన్ల పంపిణీ ప్రారంభించడం ఆనందంగా ఉంది అని అన్నారు. గత ప్రభుత్వంలో ఒకటవ తేదీ ఉదయమే వెళ్లి వలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వంలో దానికి బ్రేకులు పడ్డాయి. ఇక ఇవాళ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం 65,18,496 మంది పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం రూ.4,399.89 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసింది. పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటుగా.. గత 3 నెలల బకాయిలు మూడు వేలు కలిపి జులై 1 వ తేదీన లబ్ధిదారులకు రూ.7 వేలు అందాల్సి ఉంది. -
వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతపై విచారణ.. తీర్పు రిజర్వ్
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగేలా ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. తీర్పు రిజర్వ్ చేసింది.ఏపీ ప్రభుత్వంతో న్యాయపోరాటం కొనసాగించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాలకు అక్రమ కట్టడాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులపై పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బుధవారం లంచ్ మోషన్ వేయడంతో.. అధికారులకు కోర్టు బ్రేకులు వేసింది. ఇవాళ్టి వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే మరికొన్ని కార్యాలయాలకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. ఏపీ హైకోర్టులో ఇవాళ మరో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది వైఎస్సార్సీపీ. -
అమరావతిని అమ్మేద్దాం సంపద సృష్టిద్దాం.. ఇదీ బాబు గారి విజన్
-
భూములమ్మి రాజధాని నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: అమరావతిలో రైతులిచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను కూడా రాజధాని నుంచి వచ్చే సంపదతోనే అమలు చేస్తామన్నారు. గురువారం రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక శిథిలాల నుంచి ప్రారంభించి ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి భూమి పూజ చేసిన ప్రాంతం, ప్రజా ప్రతినిధులు, అధికారుల కోసం నిర్మించ తలపెట్టిన భవనాల సముదాయాలను పరిశీలించారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డులోని సీఆర్డీఏ భవనం వద్ద సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి, పోలవరాన్ని సంపద సృష్టించే కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దక్షిణాదిలో గోదావరి భారీ జల నిధి లాంటిదన్నారు. పోలవరం పూర్తయితే నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకూ నీళ్లివ్వచ్చన్నారు. విభజన అనంతరం రాజధాని నిర్మాణం కోసం ఆర్థిక తోడ్పాటు, పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించిందన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా అమరావతికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. ప్రజారాజధానిగా అమరావతి ఐదు కోట్ల మందికి దశ, దిశను నిర్దేశిస్తుందన్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే గర్వంగా పనులు చేసుకోవచ్చన్నారు. రాజధానిని వైఎస్ జగన్ అతలాకుతలం చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. రాజధానిపై శ్వేతపత్రం.. రాజధానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 16 వేల గ్రామాలు, దేశవ్యాప్తంగా పవిత్రమైన ప్రాంతాల నుంచి మట్టి, నీళ్లు తెచ్చి అందరు దేవుళ్ల ఆశీర్వాదాలతో శంకుస్థాపన చేశాం. ఆ మహిమే నేడు రాజధానిని కాపాడింది. ఎవరైనా సీఎం అయితే మంచి కార్యక్రమంతో ప్రజలను మెప్పిస్తారు. కానీ జగన్ ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించారు. రాజధానిలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇష్టానుసారంగా విధ్వంసం చేశారు. పైపులు, ఇసుక దొంగతనం చేయడంతో పాటు రోడ్లను కూడా తవ్వుకుపోయారు. ఒక్క బిల్డింగ్ను కూడా పూర్తి చేయలేదు. రోడ్ల నిర్మాణాలన్నీ సగంలో ఆగిపోయాయి. ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, మంత్రులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల భవన నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపేశారు. రాజధాని ప్రస్తుత పరిస్థితపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉంది. కన్సార్టియంపైనా విషం చిమ్మారు.. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకు తిరిగే రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలనుకున్నాం. రాజధానిపై బురద జల్లి బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్, స్విస్ ఛాలెంజ్లో మోసం అన్నారు. సింగపూర్ కన్సార్టియంపైనా విషం చిమ్మి తరిమేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉండేలా ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో చెప్పింది. దానికి అనుగుణంగానే గుంటూరు కేంద్రంగా అమరావతిని రాజధానిగా గుర్తించాం. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. రైతులు ఇచ్చిన భూములే కాకుండా ప్రభుత్వ భూములు కలిపి 55 వేల ఎకరాలను సేకరించాం. 29 వేల మంది రైతుల్లో ఒక్కరు కూడా కోర్టుకు వెళ్లకుండా ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములిచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్లో ‘ఏ’ అంటే అమరావతి.. ‘పీ’ అంటే పోలవరంగా గుర్తుంటుంది. నదులు అనుసంధానిస్తాం.. ప్రజలు కూటమికి ఏకపక్షంగా ఓట్లు వేయడంతో రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద విజయం లభించింది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి పనికిరాడని తీర్పు ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, అర్హతలేని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఎంత నష్టపోతుందో గత ఐదేళ్లలో చూశాం. పోలవరం, అమరావతి వ్యక్తిగత అంశానికి సంబంధించినవి కాదు. వ్యక్తికి, వర్గానికి, ప్రాంతానికి పరిమితమైనవి కావు. వాటి ద్వారా సంపద సృష్టి జరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తయితే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. గత ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఖర్చు కూడా రెట్టింపు అయ్యింది.అప్పులెంతో తెలియదు..ప్రభుత్వ విధానాలతోనే ప్రజల జీవితాలు మారుతాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి చేస్తాం. దీర్ఘకాలంలో ప్రజల జీవితాలకు వెలుగునిచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఐదేళ్ల విధ్వంసాన్ని భరించలేకే ప్రజలు ముందుకు వచ్చి ఓట్లు వేశారు. ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి పనిని ప్రజల ముందు ఉంచుతాం. తప్పుడు పనులు చేసిన వారిని క్షమించం. రౌడీయిజాన్నిఅణచివేస్తాం. రాజధానిలో నిర్మాణాలను ఉన్మాది బారి నుంచి దేవుడే కాపాడాడు. రుషికొండను చదును చేసి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. పర్యావరణానికి విరుద్ధంగా ప్రవర్తించారు. జగన్ లాంటి వ్యకు్తలకు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా? అనేది ప్రజల్లో చర్చ జరగాలి. అప్పులు ఎంత చేశారో తెలియదు. అడ్డదిడ్డంగా సంతకాలు పెట్టిన అధికారులు ఎక్కడున్నారో తెలియదు. ఇవన్నీ సరిదిద్దాలి. రాజధాని భూములను కూడా తాకట్టు పెట్టారేమో చూడాలి. లాలూచీ పడే అధికారుల ప్రవర్తన మార్చుకోవాలి. -
చంద్రబాబు కేబినెట్ తొలి భేటీ ముహూర్తం ఖరారు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో కొలువు దీరిన కొత్త మంత్రి వర్గ తొలి సమావేశానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 24వ తేదీన ఉదయం సచివాలయం మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అన్ని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.ఇక కొత్త మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు స్వీకరిస్తూ వస్తున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన శాసన సభ సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్-డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. బుధవారం శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.ఇదీ చదవండి: డిప్యూటీ సీఎంగా పవన్, తొలి సంతకం దేని మీద అంటే.. -
Polavaram: పోలవరం వద్ద సీఎం చంద్రబాబు
అమరావతి/ఏలూరు, సాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు వద్ద పనుల్ని గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారాయన.ఆపై ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో ప్రత్యేకంగా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం విలేకర్లతో మాట్లాడతారని తెలుస్తోంది. గతంలో.. 2014-19 మధ్య మూడో సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనకు శ్రీకారం చుట్టారు. -
అమరావతికి రూ.లక్ష కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధి పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పాత మాస్లర్ ప్లాన్ ప్రకారమే రాజధానిలో నిర్మాణాలు చేపడతామన్నారు.మూడు దశల్లో రాజధాని పనులు పూర్తి చేసేందుకు రూ.లక్ష కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆదివారం ఉదయం వెలగపూడిలోని సచివాలయం రెండో బ్లాక్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రపంచంలో ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమరావతి నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. అత్యుత్తమ డిజైన్ రూపొందించి సింగపూర్, చైనా, జపాన్, రష్యా, మలేసియా తదితర దేశాలను సందర్శించామన్నారు. అమరావతి నిర్మాణాన్ని మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించామని, తొలిదశలో భాగంగా రూ.48 వేల కోట్లతో మంత్రులు, కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామన్నారు.తొలిదశ పనులకు గతంలోనే టెండర్లు పిలిచి దాదాపు రూ.9 వేల కోట్ల చెల్లింపులు కూడా చేసినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలు దాదాపు 90 శాతం పూర్తైనట్లు పేర్కొన్నారు. తొలి దశలో సిటీ నిర్మాణం పూర్తి చేసి రెండో దశలో మెట్రో రైల్ నిర్మాణ పనులు చేపడతామని ప్రకటించారు. రాజధాని విషయంలో గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్నే ఇప్పుడూ అమలు చేస్తామని, అయితే అంచనా వ్యయాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించాల్సి ఉందన్నారు. 217 చ.కి.మీ మేర అమరావతి నిర్మాణం రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం 2015 జనవరి 1న నోటిఫికేషన్ ఇవ్వగా అదే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఎలాంటి వివాదాలు లేకుండా 34 వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. మొత్తం 217 చ.కి.మీ విస్తీర్ణంలో అమరావతి నిర్మాణాన్ని చేపడతామని, సుమారు 3,600 కి.మీ మేర రోడ్లు నిరి్మస్తామని వివరించారు.రూ.48 వేల కోట్లతో చేపట్టిన ఈ తొలిదశ పనులు పూర్తవగానే రెండో దశలో గన్నవరం విమానాశ్రయాన్ని అమరావతితో కలుపుతూ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ ఖర్చు గత మాస్టర్ ప్లాన్ ప్రకారం అంచనా వేశామని, మరోసారి టెండర్లు పిలిచి సవరించే అవకాశం ఉందన్నారు. అధికారులతో సమీక్షించి 15 రోజుల్లో దీనిపై పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియ చేస్తామన్నారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్షి్మ, సీడీఎంఏ శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్ కట్టా సింహాచలం, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, సీఆర్డీఏ చీఫ్ ఇంజనీర్లు ఎన్వీఆర్కే ప్రసాద్, సీహెచ్ ధనుంజయ్ తదితరులు శుభాకాంక్షలు తెలియచేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై అంచనాలకు ఆదేశం అన్న క్యాంటీన్లను మూడు వారాల్లోగా వంద చోట్ల పునరుద్ధరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు తొలి ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా ఉందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించగా 184 చోట్ల ప్రారంభించినట్లు చెప్పారు. వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు రెండు మూడు రోజుల్లో అంచనాలు అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. -
అత్యుత్తమ రాజధానిగా అమరావతి
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేసి, ఐదు అత్యుత్తమ రాజధానుల సరసన నిలిపేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల ఆవరణలోని తన స్వగృహంలో మంత్రి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2015 జనవరిలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూములను రైతులు అందజేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే తమ భూములను రాజధాని ఏర్పాటుకు కేటాయించారని మంత్రి గుర్తుచేశారు. వివిధ దశల్లోనే నిలిచిపోయిన భవనాలను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. సుమారు రెండున్నరేళ్లలోనే అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు కృషిచేస్తామన్నారు. సీఎం చంద్రబాబు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను తనపై ఉంచారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాజధాని అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట..ఇక 2014 నుంచి 2019 వరకు తమ పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలోని 114 మున్సిపాల్టీల్లో పెద్దఎత్తున పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు, డివైడర్లు, పాఠశాలల్లో మౌలిక వసతులు మొదలైన అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి నారాయణ చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన క్షణాల్లోనే ప్లాన్ అప్రూవల్ ఇచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. ఎటువంటి చార్జీలు కూడా ప్రజల నుంచి వసూలుచేయలేదన్నారు. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని, చెత్త పన్నుతో ప్రజలు బాగా ఇబ్బందులుపడ్డారని మంత్రి చెప్పారు. అధికారులతో సమీక్షించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో టిడ్కో ఇళ్ల పూర్తిపై దృష్టిసారిస్తామని.. అలాగే, అధికారులతో సమావేశమై మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై చర్చిస్తామన్నారు. -
పిన్నెల్లికి ముందస్తు బెయిల్ 20 వరకు పొడిగింపు..
సాక్షి, అమరావతి: పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఆ మధ్యంతర ముందస్తు బెయిల్ను ఈ నెల 20 తేదీ వరకు పొడిగిస్తూ.. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులు సహా మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు పోలీసులు నమోదు చేసిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.తరువాత ఈ వ్యాజ్యాలు గత వారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యాల్లో వాదనలు రాత్రి 10.30 గంటల వరకు సాగడంతో అదే రోజు ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానానికి సమయం దొరకలేదు. దీంతో న్యాయస్థానం గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పిన్నెల్లి వ్యాజ్యాలు విచారణకు రాగా న్యాయమూర్తి జస్టిస్ విజయ్ స్పందిస్తూ.. పూర్తిస్థాయిలో వాదనలు విన్నప్పటికీ, నిర్ణయం వెలువరించేందుకు కొంత సమయం పడుతుందన్నారు.ఈలోగా కోర్టుకు వేసవి సెలవులు ముగుస్తాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలను రెగ్యులర్ బెంచ్ ముందు వచ్చేలా విచారణను వాయిదా వేస్తానని ప్రతిపాదించారు. ఈ విషయంపై ఇరుపక్షాల తరఫు న్యాయవాదుల అభిప్రాయాన్ని కోరారు. ఇందుకు ఇరుపక్షాల న్యాయవాదులు అంగీకరించడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. -
YS Jagan: కేంద్రంలోనూ జీపీఎస్..
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ స్కీం (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం–సీపీఎస్) విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానం వైపే కేంద్ర ప్రభుత్వం కూడా అడుగుల వేస్తోంది. 2004 నుంచి అమల్లోకి వచి్చన జాతీయ పెన్షన్ స్కీం ద్వారా ఉద్యోగులు రిటైరయ్యాక వారికి పెన్షన్ చాలా తక్కువగా వస్తోందని, పాత పెన్షన్ స్కీంను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.నిజానికి.. 2004లో తీసుకొచి్చన సీపీఎస్ ప్రకారం.. ఉద్యోగులు పది శాతం, ప్రభుత్వాలు పది శాతం పెన్షన్ నిధికి జమచేస్తాయి. మార్కెట్ అధారిత రిటర్న్ల ప్రకారం ఆ నిధి నుంచి ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పెన్షన్ వస్తుంది. మార్కెట్లపై ఆధారపడటంతో ఇంత పెన్షన్ వస్తుందనే గ్యారెంటీ లేదు. కొందరు ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం బేసిక్ వేతనంలో కనీసం 20 శాతం కూడా పెన్షన్ వచ్చే పరిస్థితిలేదు. ఈ నేపథ్యంలో.. 2019 ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల డిమాండ్ మేరకు సీపీఎస్ను రద్దుచేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.అయితే, సీపీఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినందున దీనిపై జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుదీర్ఘ కసరత్తు చేశారు. 2004కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానంలో పదవీ విరమణ తర్వాత ఎక్కువ పెన్షన్ రావడం.. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి చాలా తక్కువ పెన్షన్ రావడం వంటి అసమానతలు నెలకొన్నాయి. అలాగని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విదానంలోకి వెళ్తే రాష్ట్రాల ఆరి్థక వ్యవస్థలపై భవిష్యత్తులో పెనుభారం పడటమే కాకుండా జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంటుందని ఆర్బీఐ వంటి సంస్థల అధ్యయనాలు పేర్కొన్నాయి.ఈ నేపథ్యంలో.. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేయాలనే తపనతో జగన్ సర్కారు సుదీర్ఘ కసరత్తు చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేలా గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్ను)ను రూపొందించింది. దీని ప్రకారం.. బేసిక్ జీతంలో 50 శాతం అంటే రూ.1 లక్ష జీతం ఉంటే రిటైరైన తర్వాత రూ.50 వేలు పెన్షన్గా వస్తుంది. 62 ఏళ్లకు రిటైరైతే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలన్న ఆలోచనతో ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్లో పొందుపరిచారు.సీపీఎస్లో మార్పులకు కేంద్రం కమిటీ.. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వోద్యోగుల డిమాండ్ నేపథ్యంలో జాతీయ పెన్షన్ స్కీం విధానంలో మార్పులు చేయడానికి కేంద్ర ఆరి్థక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీనీ ఏర్పాటుచేసింది. ఉద్యోగులు, ప్రభుత్వం తమతమ కంట్రిబ్యూషన్ను కొనసాగిస్తూనే 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ వచ్చేలా మార్గాలను కేంద్ర కమిటీ అన్వేíÙంచింది. ఇందుకు సంబంధించిన సిఫార్సులతో ఇటీవల కేంద్రానికి ఆ కమిటీ నివేదిక సమరి్పంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ కూడా జగన్ సర్కారు తీసుకొచ్చిన జీపీఎస్లోని అంశాలనే సిఫార్సు చేసిందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఇక అప్పట్లో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో దేశమే ఈ పెన్షన్ స్కీంను అమలుచేసే పరిస్థితి రాబోతుందని చెప్పారు. ఇప్పుడు అక్షరాలా అదే నిజమవుతోంది. జగన్ సర్కార్ చేసిన మార్పులివే.. 2004 పెన్షన్ సంస్కరణలను కాపాడుతూనే వైఎస్ జగన్ సర్కార్ జాతీయ పెన్షన్ స్కీంలో మార్పులు చేస్తూ జీపీఎస్ను తీసుకొచ్చింది. – ఇటు రాష్ట్రంపై ఆర్థిక భారం పెద్దగా పడకుండా ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం చివరి నెల బేసిక్ వేతనంలో 50 శాతం పెన్షన్ గ్యారెంటీని జగన్ సర్కారు ఇచ్చింది. – తద్వారా ఏపీజీపీఎస్లో ఉద్యోగులు రిటైరయ్యాక చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పెన్షన్కు గ్యారెంటీ ఇస్తోంది. – అలాగే, ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి హమీ ఇచ్చిన పెన్షన్లో 60 శాతం పెన్షన్ వస్తుంది.– ద్రవ్యోల్బణం ప్రకారం డీఆర్ వస్తుంది. – అంతేకాక.. ఉద్యోగులకు హెల్త్ స్కీం వర్తిస్తుంది. -
వాసుదేవరెడ్డి కేసులో పూర్తి వివరాలివ్వండి..
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్)కు చెందిన ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను తరలించారంటూ ఆ సంస్థ మాజీ ఎండీ డి. వాసుదేవరెడ్డిపై నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.అప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న వాసుదేవరెడ్డి అభ్యర్థనపట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. మధ్యంతర ముందస్తు బెయిల్ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. అందువల్ల ఇప్పటికిప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంటూ విచారణను 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం పిటిషన్.. ఏపీఎస్బీసీఎల్ కార్యాలయం నుంచి ఆ సంస్థకు చెందిన ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలను వాసుదేవరెడ్డి తీసుకెళ్లారని, ఇవన్నీ ఆయన తన కారులో తరలిస్తుండగా చూశానంటూ కంచికచర్లకు చెందిన గద్దె శివకృష్ణ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సీఐడీ అధికారులు ఈనెల 6న వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. అనంతరం హైదరాబాద్లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డి సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతాం.. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్ విచారణ జరిపారు. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. ఈ కేసులో తాను సీఐడీ తరఫున హాజరవుతున్నానని తెలిపారు. ఈ కేసు మొదటిసారి విచారణకు వస్తోందని, అందువల్ల వివరాల సమర్పణకు గడువునివ్వాలని కోర్టును కోరారు. ఈ సమయంలో వాసుదేవరెడ్డి తరఫు న్యాయవాది ఎస్. నగే‹Ùరెడ్డి వాదనలు వినిపిస్తూ.. తాము మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం అనుబంధ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఈ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.చంద్రబాబుపై ఫిర్యాదు చేసినందుకే కేసు.. నిజానికి.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిటిషనర్పై కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబుపై పిటిషనర్ వాసుదేవరెడ్డి గతంలో ఫిర్యాదు చేశారని, ఈ కక్షతోనే అతనిపై ఇప్పుడు ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. కార్యాలయం నుంచి ఫైళ్లు తీసుకెళ్తున్నట్లు ఫిర్యాదు అందగా, రాత్రి 11.30కి సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. ఆ మరుసటి రోజు 200 మంది పోలీసులు వాసుదేవరెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేశారని.. పోలీసులకు ఏమీ దొరకలేదని, ఆయన పిల్లల ల్యాప్టాప్లను జప్తు చేశారని వివరించారు. పిటిషనర్పై ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసులే ఉన్నాయని, అందువల్ల ఆయన విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41ఏను అనుసరించి నడుచుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. పోసాని జోక్యం చేసుకుంటూ, పిటిషనర్పై మరిన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఐపీసీ సెక్షన్లు 409, 467, 471 కింద కూడా కేసు నమోదు చేశామని, ఇవన్నీ ఏడేళ్లు అంతకు మించి శిక్షపడే కేసులేనన్నారు. అందువల్ల 41ఏ ప్రకారం నడుచుకోవడం సాధ్యంకాదన్నారు.ఫిర్యాదులో గుర్తుతెలియని వ్యక్తి అని ఉంది.. నగేష్ రెడ్డి స్పందిస్తూ.. ఫిర్యాదులో ఎక్కడా వాసుదేవరెడ్డి కారు నెంబర్ లేదని, ఎఫ్ఐఆర్లో చేర్చారన్నారు. ఫిర్యాదులో గుర్తు తెలియని వ్యక్తులు అని ఉంటే, ఎఫ్ఐఆర్లో పిటిషనర్ పేరును చేర్చారన్నారు. ఇది పూర్తిగా తప్పుడు కేసన్నారు. సోదాలు జరిగిన రోజు పిటిషనర్ ఢిల్లీలో ఉన్నారన్నారు. పోసాని స్పందిస్తూ.. వాసుదేవరెడ్డి మామ, బావమరిది ఇళ్లలో సోదాలు నిర్వహించామని, వాసుదేవరెడ్డి కారులో కీలక పత్రాలు స్వా«దీనం చేసుకుని సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశామన్నారు. సోదా చేసిన కారులో రూ.4 కోట్ల విలువచేసే 6 కేజీల బంగారం కొనుగోలు తాలుకు బిల్లులు, వాసుదేవరెడ్డి ఐడీ కార్డు దొరికాయన్నారు. ఈ వివరాలను మేజి్రస్టేట్ ముందుంచామన్నారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారు..ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పూర్తి వివరాల సమర్పణ నిమిత్తం ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణను 18కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నగేష్ రెడ్డి జోక్యం చేసుకుంటూ, అప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అభ్యరి్థంచారు. లేకుంటే ఈలోపు పిటిషనర్ను అరెస్టుచేసే అవకాశం ఉందన్నారు. ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామన్నారు. కావాలంటే పాస్పోర్ట్ స్వా«దీనం చేస్తామన్నారు. అయితే, మధ్యంతర ముందస్తు బెయిల్ అభ్యర్థనను పోసాని తీవ్రంగా వ్యతిరేకించారు. వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని, బేవరేజస్ కార్పొరేషన్లో అతని సహచరులు ఇంకా ఉన్నారని, వారి ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. దీంతో.. మధ్యంతర ముందస్తు బెయిల్ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యంకాదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. -
అమరావతిపై చంద్రబాబుకే అనుమానాలున్నాయా?
ఏపీ రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన,బీజేపీ సభ్యులంతా కలిసి ఆయనను తమ నేతగా ఎన్నుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే విశాఖను ఆర్దిక రాజధానిగా అభివృద్ది చేస్తామని, కర్నూలును కూడా ప్రగతి పధంలోకి తీసుకు వెళతామని అన్నారు. ఆయన తాను ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల గురించి కాకుండా అమరావతిపైనే ప్రసంగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు పెట్టడం ద్వారా ఏపీ అభివృద్దికి ప్రయోజనం జరుగుతుందని భావించారు. విశాఖ పట్నం అయితే రాష్ట్రం అంతటికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆశించారు. అమరావతి మాదిరి లక్షల కోట్లు ఖర్చుపెట్టవలసిన అవసరం ఉండదని అనుకున్నారు. కాని దానిని తెలుగుదేశం,ఇతర విపక్షాలు ముందుకు సాగకుండా అడ్డుపడ్డాయి. దాంతో జగన్ ఇందుకు సంబంధించిన చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. కాకపోతే తమ విధానం మూడు రాజధానులు అని ఆయన అన్నారు. కాని ఆయన తిరిగి అదికారంలోకి రాలేకపోయారు.విశాఖ, కర్నూలులకు అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ అక్కడి వారిని మోసం చేశారని అంటున్నారు. చంద్రబాబుతో వచ్చిన చిక్కే ఇది. ఎక్కడ ఏది అవసరమైతే అది మాట్లాడుతుంటారు. ఇందులో జగన్ మోసం చేసింది ఏముంది? ఆయన ఎన్నికల ప్రచారం సమయంలో గెలిచిన తర్వాత విశాఖ నుంచే పాలన చేస్తామని ప్రకటించారు. విశాఖను సుందరంగా తీర్చి దిద్దారు. రిషికొండపై ఆకర్షణీయమైన భవంతిని నిర్మించారు. అలాగే కర్నూలులో పలు న్యాయ రంగానికి సంబంధించిన పలు ఆఫీస్ లు ఏర్పాటు చేశారు. లోకాయుక్త ఆఫీస్ ను కూడా అక్కడే నెలకొల్పారు. హైకోర్టు ఏర్పాటు పూర్తిగా ఆయన చేతిలో లేనిది కనుక దానిపై ముందుకు వెళ్లలేకపోయారు. ఈ విషయాలలో జగన్ చిత్తశుద్దిని శంకించనవసరం లేదు.జగన్ ఒకటి తలిస్తే, ప్రజా తీర్పు మరో రకంగా రావడంతో చంద్రబాబుకు అది అడ్బాంటేజ్ అయింది. విశాఖ ప్రజలు కూడా తమకు రాజధాని వద్దని అనుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు తప్పు లేదు. ఎందుకంటే జగన్ ఆ ప్రాంతానికి అంత పెద్ద వరం ఇస్తే ,దానిని వారు ఆదరించలేదు.కర్నూలులో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావవల్సి ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యంగా వైఎస్సార్సీపీకి వ్యతిరేక తీర్పు వచ్చింది. తాజాగా చంద్రబాబు అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం లేదు. ఈ నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన విధానాన్ని మార్చుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. వచ్చే ఐదేళ్లు టీడీపీ కూటమి అధికారంలో ఉంటుంది కనుక వారు చేయదలచుకున్నది అంతా అమరావతిలోనే చేస్తారు. ఆ తర్వాత ఎన్నికలలో వైసిపి గెలిచినా, ఇందులో మార్పులు చేయడం కష్టం అవుతుంది. అప్పుడు మళ్లీ మూడు రాజధానులు అన్నా ఉపయోగం ఉండదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అమరావతిపై ఇక వివాదాన్ని ముగించడం మంచిది. వైఎస్సార్సీపీ దీనిపై ఎలా ముందుకు వెళుతుందో చూడాలి. అమరావతికి సంబంధించి కొన్ని చిక్కుముళ్లను చంద్రబాబు విడదీయవలసి ఉంటుంది. 2014 టరమ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కేవలం ప్రాధామిక సదుపాయాల కోసం లక్షతొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని , ఈ నిదులను మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ వ్యయం ఇంకా భారీగా పెరిగి ఉంటుంది.అంత మొత్తాన్ని ఎలా వెచ్చిస్తారో చెప్పగలగాలి. కేంద్రం ఇప్పుడు ఏమైనా ఆ ప్రకారం ఇస్తే ఇబ్బంది లేదు. అలా ఇవ్వకపోతే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. అప్పట్లో ప్రధాని మోదీ మట్టి,నీళ్లు ఇచ్చి వెళ్లారని చంద్రబాబు విమర్శించేవారు. ఈ విడత టీడీపీపై కేంద్రంలోని ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉంది కనుక లక్ష కోట్లను రాజధాని కోసం సాధించగలిగితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది. గత ప్లాన్ ప్రకారం నవ నగరాలన్నింటిని ఇక్కడే నిర్మిస్తారా?లేక వాటిని వాయిదా వేస్తారా? అనేది చూడాలి. అంతేకాదు. అమరావతి భూముల విషయంలో పలు వివాదాలు ఉన్నాయి. కొంతమంది రైతులు తమ భూములను రాజధానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. వారిపై అప్పట్లో కేసులు కూడా పెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని తొలగించింది. ఆ రోజుల్లో పంటలను దగ్దం చేసి భూములు లాక్కునే యత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. అలాంటి చోట్ల ఏ రకంగా ముందుకు వెళతారో తెలియదు. ప్లాట్ల కేటాయింపుపై కూడా రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకోవల్సి ఉంటుంది. వారికి రోడ్లు,డ్రైనేజ్, రక్షిత నీరు మొదలైనవాటిని సమకూర్చుకోవాలి. అమరావతిలో పది డిగ్రీల ఉష్ణాగ్రత తగ్గించాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇంటింటికి ఏసీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇవన్ని చేయగలిగితే తెలుగుదేశంకి ఖ్యాతి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల వసతుల కోసం ఏభై అంతస్తుల టవర్ లు నిర్మించాలని తలపెట్టారు. అదే ఆలోచనను మళ్లీ చేస్తారో?లేదో తెలియవలసి ఉంది. కృష్ణానది పక్కన ఉండడంతో నేల స్వభావం భారీ భవంతులకు అనువైనది కాదని నిపుణులు చెబుతారు. అందువల్లే రాఫ్ట్ టెక్నాలజీకి వెళుతున్నామని అనేవారు. అది బాగా ఖరీదైనది. అయినా ఖర్చు భరించక తప్పదు. మరో కీలక అంశం సింగపూర్ కంపెనీలకు గతంలో మాదిరే మళ్లీ భూములు కేటాయిస్తారా? లేదా ?అన్నదానిపై నిర్ణయం చేయవలసి ఉంటుంది. వారికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం పక్షాన భూమి ఇవ్వడమే కాకుండా,అవసరమైన రోడ్లు తదితర సదుపాయాలను సమకూర్చడానికి 5,500 కోట్లు వ్యయం చేయడానికి సిద్దపడ్డారు. ఇప్పుడు ఖర్చు కూడా పెరుగుతుంది. సింగపూర్ కంపెనీల నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం బాగా తక్కువగా ఉందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. పైగా వారితో ఏ వివాదం వచ్చినా లండన్ కోర్టులో తేల్చుకోవాలని రాసుకున్నారు. 2019 లో తమ ప్రాజెక్టు వయబుల్ కాదని భావించి సింగపూర్ సంస్థలు దానిని వదలుకున్నాయి. సింగపూర్ సంస్థలకు స్విస్ చాలెంజ్ పద్దతిన భూములు ఇవ్వడం పై ఆనాడు కోర్టులలో వివాదాలు నడిచాయి. కోర్టు సంబంధిత చట్టంలోని కొన్ని క్లాజులను కొట్టివేయగా,వాటిని మార్చి మళ్లీ చట్టాన్ని ఆమోదించారు. నిజానికి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి ముప్పైమూడు వేల ఎకరాల భూమి సమీకరించకుండా ,ప్రభుత్వానికి అవసరమైన వెయ్యి నుంచి ఐదువేల ఎకరాల భూమి తీసుకుని , అందులో భవనాల నిర్మాణం చేపట్టి ఉంటే ఇంత రాద్దాంతం అయ్యేది కాదు. ఆయన ఓవర్ యాంబిషస్ గా దీనిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారన్న అభిప్రాయం వ్యక్తం అయ్యేది. ఇతర జిల్లాలప్రజలు మొత్తం డబ్బంతా అమరావతిలోనే పెడితే ఎలా అని ప్రశ్నించేవారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతోంది. అయితే దాదాపు అన్ని జిల్లాల ప్రజలు అమరావతిని ఆమోదించినట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి కనుక చంద్రబాబు తన ఇష్టానుసారం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. చంద్రబాబు రాగానే అధికారులు అక్కడ హడావుడి ఆరంభించారు. బహుశా కొన్ని పూర్తి కాని భవనాలకు ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత మిగిలిన నిర్మాణ పనులు చేపట్టవచ్చు. అమరావతి రాజధాని పూర్తి కావడానికి చాలాకాలం పట్టవచ్చు. నిధుల సమస్య, సాంకేతిక అంశాలు, భూ సేకరణ వంటి వ్యవహారాలు సజావుగా పూర్తి చేసుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం కృష్ణానదికి ఆవల వైపున ఉన్న అమరావతిలోనే జరుగుతుందని తొలుత ప్రకటించారు. కాని ఏ సెంటిమెంట్ అయినా అడ్డం వచ్చిందేమో తెలియదు కాని, ఈసారి కృష్ణా నదికి ఈవల వైపు అంటే విమానాశ్రయం ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంటే 2014లో అమరావతి వైపు ప్రమాణ స్వీకారం చేయడం అచ్చి రాలేదని భావించి వాస్తు పండితులు ఈ మార్పు చేశారా?అన్న సందేహం వస్తుంది. అమరావతి వాస్తుపైనే అనుమానాలు ఉన్న నేతలు దానిని ఏ రీతిన ముందుకు తీసుకువెళతారన్నది ఆసక్తికరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. కూటమి నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ రాజధాని అంశం మీద మాట్లాడారు. "14 ఏళ్లుగా సీఎంగా ఉన్నాను, 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. అలాగే విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం. అమరావతిని అభివృద్ధి చేస్తాం. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేస్తాం. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ప్రజాహితం కోసం ముందుకెళ్తాం. మూడు ప్రాంతాల అభివృద్ధి చేయడమే మా అజెండా అని అన్నారు.""ఎన్డీయే శాసనాసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. ప్రజల తీర్పును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందరూ కలిసి పని చేయడం వల్ల కూటమికి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ తీర్పు వల్ల మనకు ఢిల్లీలో ప్రతిష్ట పెరిగింది. నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ నన్ను పరామర్శించి పొత్తు పెట్టుకుందామని చెప్పారు. బీజేపీతో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పని చేయడం వల్ల సీట్లు, ఓట్లు వచ్చాయి"అలాగే తన కోసం రాష్ట్రంలో ఎక్కడా ట్రాఫిక్ ఆపొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేను, పవన్ సామాన్యులమే. ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తాం అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు.. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆమోదం తెలిపారు. ఆ వెంటనే టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా చంద్రబాబును తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. -
గ్యాంగ్ ఆఫ్ పెత్తందార్స్
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ. సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్ కథలు వల్లె వేశారు. సీఎం జగన్ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు.అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ముసుగులో మురళీమోహన్ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. అంతర్జాతీయ కుంభకోణం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్ ఆఫ్ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారు.మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.కానీ.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్ పొందుపరిచారు. -
ఒక వైపే చూడకు.. పచ్చిగా అబద్ధాలాడకు!
సాక్షి, అమరావతి: ఒకసారి తప్పు చేస్తే పొరపాటు...పదే పదే ఆ తప్పులనే పునరుక్తం చేస్తుంటే అది అలవాటు...గ్రహపాటు...దురలవాటు..అలాంటి దురలవాటును ఈనాడు ఆనవాయితీగా మార్చుకుంది..అబద్ధాలనే రాయడానికే కంకణం కట్టుకున్నానన్నట్లుగా ఉంది ఆ పత్రిక వక్రీకరణల ధోరణి...గతంలో కౌలురైతుల సాయంపై అడ్డగోలుగా వక్రీకరిస్తే అది తప్పని ...వాస్తవమేంటని గణాంకాలతో రుజువు చేసినా... మూర్ఖపు రాతలతో మళ్లీ రాసిన తప్పులనే రాస్తూ... తన అజ్ఞానాన్ని, తానేం చేసినా చెల్లిపోతుందన్న అహంకారాన్ని రామోజీ నిరూపించుకుంటున్నట్లుగా ఉంది.. ఇప్పటికే ఈనాడు దుష్టరాతల తలంపును పాఠకులు అర్థం చేసుకున్నారు..ఒక నిజాన్ని ఎన్నిసార్లు అబద్ధంగా చూపాలనుకున్నా అది అవాస్తవంగా మారదన్న వాస్తవం రామోజీకి బోధపడినట్లు లేదు... రైతులకు ఆపన్నహస్తమందిస్తున్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం... ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు కొండంత ఊతంగా నిలుస్తూ... వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తున్నదే జగన్ ప్రభుత్వం... రైతులే కాదు...వారితో సమానంగా కౌలు రైతుల భుజంపైనా భరోసా చెయ్యేసి... వారిని అక్కున చేర్చుకుంటున్నదే ఈ ప్రభుత్వం...ఆ నిజాన్ని అబద్ధం చేయాలని రామోజీ తహతహలాడిపోతూ.. గురువారం ఈనాడులో ..‘ధీమా లేదు...బీమా రాదు’... శీర్షికన ప్రచురించిన కథనం ఒక బోగస్. నిజాలేమిటో సవివరంగా గణాంక సహితంగా చెప్పడానికే ఈ ఫ్యాక్ట్చెక్...గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలు రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వాలు ఆలోచనే చేయని పంట సాగు హక్కు దారుల చట్టం–2019ను తీసుకురావడమే కాదు..సీసీఆర్సీల ఆధారంగా భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకూ సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇస్తోంది. పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా రైతులు మద్దతు ధరకు సులువుగా అమ్ముకోగలుగుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారంతో పాటు దురదృష్టవశాత్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ఈ ప్రభుత్వం అందిస్తోంది.అబద్ధం: పెట్టుబడి సాయానికి అర్హులు కారట..వాస్తవం: బాబు హయాంలో కౌలురైతులకు కాదు కదా అటవీ, దేవదాయ భూ సాగుదారులకు పైసా విదల్చ లేదు. తద్భిన్నంగా ...నేడు దేశంలోనే తొలిసారిగా ఏపీలో మాత్రమే కౌలు రైతులకు జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకూ రూ.13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది.మెజార్టీ కౌలుదారులు సొంత భూమినీ కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డులు పొందిన సెంటు భూమిలేని కౌలు రైతులకు భూ యజమానులతో సమానంగా పెట్టుబడి సాయాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోంది. ఇలా గత ఐదేళ్లలో 5.57 లక్షల మంది కౌలు రైతులకు రూ.751.42 కోట్లు, 4.01 లక్షల అటవీ భూములు (ఆర్వో ఎఫ్ఆర్) సాగు చేసే గిరిజనులకు రూ.541.58 కోట్లు కలిపి మొత్తం 9.58 లక్షల మందికి రూ.1293 కోట్ల మొత్తాన్ని పెట్టుబడి సహాయంగా అందించింది. అంటే ఏటా సగటున 1.92 లక్షల మందికి రూ.259 కోట్ల చొప్పున పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇచ్చింది. అయినా ఈనాడుకు మాత్రం 1.07 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించినట్టుగా కని్పంచింది.అబద్ధం: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు..వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపచేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకూ ఈ ప్రభుత్వం వర్తింప చేస్తోంది. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా ఈ సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈనాడుకు మాత్రం సున్నా వడ్డీ రాయితీ పొందిన వారే కని్పంచలేదు. ఈ ఐదేళ్లలో 3,54,878 మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 3,67,903 మందికి రూ.424 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్పుట్సబ్సిడీ) పంపిణీ చేస్తే, ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో పెట్టుబడి రాయితీ పొందిన వారు 48,290 మంది, పంటల బీమా పరిహారం పొందిన వారు 88,619 మంది మాత్రమే కని్పస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేసిన సాయాన్ని తక్కువ చేయాలన్న దుష్టతలంపేనని ఇట్టే అర్థమవుతోంది.అబద్ధం: కౌలు రైతులకు పంట రుణాల్లేవు..వడ్డీ రాయితీకి సున్నా..వాస్తవం: వాస్తవ సాగు దారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్లను ఆర్బీకేలతో ప్రభుత్వం అనుసంధానం చేసింది. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ పొందలేని కౌలు రైతులను గుర్తించి, వారితో జాయింట్ లయబలిటీ గ్రూపు (జేఎల్జీ)లను ఏర్పాటు చేస్తోంది. ఈ గ్రూపుల ద్వారా కౌలుదారులకు పెద్ద ఎత్తున రుణాలు అందేలా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 14.75 లక్షల మంది కౌలుదారులకు రూ.8,642.40 కోట్ల రుణాలను ఈ ప్రభుత్వం అందించింది. ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో రుణాలు పొందిన వారు 1.68 లక్షల మందే కని్పంచారు. ఈ –క్రాప్ ఆధారంగా లక్ష లోపు పంట రుణాలు పొందిన 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని జగన్ ప్రభుత్వం అందించింది. -
బాబు–మోదీ ఇద్దరూ తోడు దొంగలే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాని మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని స్పష్టమైంది. ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో టీడీపీ, బీజేపీలు జట్టుకట్టి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల్ని మోసగించారు. హోదాను అటకెక్కించారు. హోదా వస్తే రాయలసీమ భవిత బంగారం అవుతుందనుకున్న ఆ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్త రాగం అందుకున్న చంద్రబాబు హోదాను మోదీకి తాకట్టు పెట్టారు. 2019 ఎన్నికల ముందు కేంద్రం మోసం చేసిందంటూ దొంగ ఏడుపులు ఏడ్చారు.ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమిగా జట్టుకట్టిన ఆ రెండు పారీ్టలు మళ్లీ రాయలసీమ ప్రజల్ని మోసగిస్తున్నాయి. ప్రధాని బుధవారం రాయలసీమలో ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఆ ప్రాంత అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. ప్రత్యేక హోదాపై, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీపై మోదీని చంద్రబాబు కనీసం ప్రశ్నించలేదు. హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని అప్పుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీతో కలిసి ప్రచారానికి ఎలా వచ్చారని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. గుండెకాయ లాంటి రాజధాని పోయింది. హైదరాబాద్ను కోల్పోవడంతో కనీసం ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపన వేగం పుంజుకుని రాష్ట్రం గాడిన పడుతుందని రాష్ట్ర ప్రజలు భావించారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయంపై మొరపెట్టుకుంటే ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీనిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే.. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే రాష్ట్ర ప్రజల ఆశల్ని చంద్రబాబు.. కేంద్రం వద్ద తాకట్టుపెట్టి తన స్వార్థం చూసుకున్నాడు. చివరికి ప్రత్యేక ప్యాకేజీ కూడా లేకుండా చేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించారు. ‘ప్రత్యేక హోదా సంజీవని కాదు. హోదాతో ఏం మేలు జరుగుతుంది. అంతకంటే ప్యాకేజీతోనే మేలు.. అవగాహన లేనివాళ్లే హోదా గురించి మాట్లాడుతున్నారు’ అని 2017లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు వ్యాఖ్యానించడం అందరికీ గుర్తుండే ఉంటుంది.2014లో కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉండడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అంతా ఆశపడ్డారు. ఆ సమయంలో కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు పూర్తిగా కేంద్రానికి లొంగిపోయారు. హోదాతో ఒరిగేదేమీ లేదని, ప్యాకేజితో అంతకంటే మేలు చేస్తుందని కొత్తపల్లవి ఆలపించారు. ఆ ప్రకటనతో ఏపీ ప్రజలు అవాక్కయ్యారు. అతన్ని వ్యతిరేకించిన వారిని జైల్లో పెడతానని బెదిరించారు.సీమకు తీరని అన్యాయం.. రాయలసీమలో 69 శాతం భూమి సాగు ప్రాంతం కాగా.. మిగతా 31 శాతం భూమి పరిశ్రమలు స్థాపనకు అనుకూలం.1. పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరలో భూములు అందుబాటులో ఉన్నాయి. 2. సమీపంలో బెంగళూరు, కర్నూలు, కడప, తిరుపతి ఎయిర్పోర్టులు ఉన్నాయి. 3. ఎగుమతులు, దిగుమతులకు చెన్నై, గోవా, కృష్ణపట్నం పోర్టులు అందుబాటులో ఉన్నాయి. 4. కృష్ణా, తుంగభద్ర నదుల్లో పుష్కలంగా నీరు ఉంది. హంద్రీ–నీవాతో వైఎస్సార్ రిజర్వాయర్లు నిర్మించారు.పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ‘హోదా’ వచ్చుంటే ‘సీమ’ రూపరేఖలే మారిపోయేవి. ‘సీమ’ అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేవి. నిజానికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు, గరుడ స్టీల్స్, కియా మినహా పరిశ్రమల జాడ లేదు. ఇవి మినహా 2019 వరకూ వెయ్యి మంది ఉద్యోగులు పనిచేసే ఒక్క పరిశ్రమ కూడా లేదు. ప్రస్తుత ప్రభుత్వం చొరవతో గ్రీన్కో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంటు నిర్మిస్తోంది. దీంతో 25 వేల ఉద్యోగాలు రానున్నాయి.ప్రత్యేక హోదా వచ్చుంటే..1. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల్లో పూర్తి మినహాయింపు ఇస్తారు. 2. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్80(సి) కింద కార్పొరేట్ ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు ఉంటుంది. కేంద్రం కూడా 25–30 శాతం రాయితీ ఇస్తుంది. 3. పరిశ్రమల కోసం తీసుకునే వర్కింగ్ కేపిటల్పై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 4. 20 ఏళ్లకు తగ్గకుండా విద్యుత్చార్జీలపై 50 శా>తం రాయితీ ఇస్తారు. 5. పరిశ్రమలకు రవాణా సబ్సిడీ లభిస్తుంది. ముడిసరుకు తీసుకెళ్లేందుకు, తయారీ వస్తువుల ఎగుమతి ఖర్చును కేంద్రం భరిస్తుంది.పరిశ్రమల ప్లాంట్లు, యంత్రాలపై పెట్టుబడిలో 30 శాతం రాయితీ వస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న పాత పరిశ్రమలకు ఇది వర్తిస్తుంది. పరిశ్రమలు స్థాపించినవారికి 25–55 శాతం వెసులుబాటు ప్రత్యేక హోదాతో లభిస్తుంది. ఇలాంటి అవకాశాలతోనే ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ వంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. హోదా ప్రకటిస్తే భూములు, పారిశ్రామికీకరణకు యోగ్యంగా ఉన్న ‘‘సీమ’లో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడతాయి. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కూడా అభివృద్ధి చెందేవి. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలోనూ మోసమే.. విభజన చట్టంలో రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజి ఇస్తామని విభజన చట్టంలో 46(ఏ), 46(బి)లో పేర్కొన్నారు. ఈ లెక్కన రూ.22,400 కోట్లు ఈ ప్రాంతాలకు 2014–2019లో మంజూరు చేయాలి. సెక్షన్ 46లో బుందేల్ఖండ్ అనే మాట తీసేసి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి పేరుతో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మనకు హక్కుగా రావల్సిన బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తే ప్రత్యేక ప్యాకేజితో పనిలేకుండా సీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాట పట్టేవి. ఈ విషయంలో కూడా చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారు. అపారమైన ఖనిజం ‘సీమ’ సొంతం!రాయలసీమలో డోలమైట్, ఐరన్ఓర్, గ్రానైట్, యురేనియం, సిలికా, బైరెటీసీ, లైమ్స్టోన్, క్వారŠట్జ్తో పాటు ఎన్నో విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. రామగిరి, జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్స్, వజ్రకరూరల్, తుగ్గలి మండలాల్లో వజ్ర నిక్షేపాలున్నాయి. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే సీమలో ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటయ్యేవి. తాడిపత్రి, బేతంచెర్ల, కొలిమిగుండ్లలో నాపరాయి గనులు ఉండడంతో సిమెంట్ పరిశ్రమల స్థాపన పెరిగేది. హోదాతో వ్యవసాయాధారిత పరిశ్రమలకూ ఊతం..‘సీమ’కు హంద్రీ–నీవాతో ఏటా 40 టీఎంసీల జలాలు వస్తాయి. దీంతో వ్యవసాయాధారిత పరిశ్రమలు ఎక్కువ స్థాపించే అవకాశం ఉంది. వేరుశెనగ, పత్తి, పొద్దుతిరుగుడుతో పాటు హారి్టకల్చర్ అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఆపిల్ మినహా అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. దీంతో ప్రాసెసింగ్ ప్లాంటు, కాటన్ పరిశ్రమలు, చీనీ జ్యూస్ తయారీ పరిశ్రమ, వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు వ్యవసాయ, ఉద్యానపంటల ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా స్థాపించే అవకాశం ఉంది. దీంతో రైతులు పండించే పంట సులభంగా మార్కెట్కు చేరుతుంది. ధర్మవరం, హిందూపురం, పెనుగొండ, నగరి, ఎమ్మిగనూరు, ఉరవకొండ, మాధవరం ప్రాంతాల్లో నేత కారి్మకులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్కులు నిరి్మస్తే, చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హోదా వస్తే సంబంధిత పరిశ్రమలకు ఎక్కువగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మానవ వనరులు పుష్కలం!రాయలసీమలో జేఎన్టీయూతో పాటు ఎస్కేయూ, ఎస్వీ, రాయలసీమ, యోగి వేమన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు పుట్టపర్తి సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ ఉంది. ఈ వర్సిటీల ద్వారా ఏటా వేలాదిమంది విద్యార్థులు ఉద్యోగాల వేటలో ఉంటున్నారు. వీరికి వృతినైపుణ్య శిక్షణ ఇస్తే పరిశ్రమలకు అవసరమైన మానవవనరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.రాయలసీమకు బాబు ద్రోహం!2014–19 మధ్య కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఆ ఐదేళ్లలో ప్రత్యేక హోదా వాణి విని్పంచలేదు. చంద్రబాబు ఏం చెబితే దానికి సీమకు చెందిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తలూపారు. ‘సీమ’ భవిష్యత్తును బలిపెట్టారు. హోదా వస్తే పరిశ్రమలు స్థాపించిన వారికి మేలు జరుగుతుంది, నిధుల స్వాహాకు అవకాశం తక్కువ! ప్యాకేజీ వస్తే అంతా స్వాహా చేయొచ్చు! ఇదే సూత్రాన్ని చంద్రబాబు నమ్మి హోదాను కేంద్రం ముందు తాకట్టుపెట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. -
విశాఖపై టీడీపీ కొత్తరాగం
-
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి అమరావతి రాజధాని నిర్మాణాన్నిచేపడతానని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు.. సంపద సృష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని బీరాలు పలికారు. కానీ.. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే చంద్రబాబు లెక్క ప్రకారం రూ.లక్ష కోట్లు అవసరం. జాప్యం జరిగితే ఆ వ్యయం మరింత అధికం కావచ్చు. రాష్ట్ర బడ్జెట్ను పరిగణనలోకి తీసుకుంటే మౌలిక సదుపాయాల కల్పనకే 20 ఏళ్లు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల ప్రజల నోట్లో మట్టి కొట్టి, అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రానికి సంపద పెరగదు.చంద్రబాబు, బినామీలు, వందిమాగధుల భూముల ధరలే పెరుగుతాయి. వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ. సాక్షి, అమరావతి : నోరు తెరిస్తే చాలు సంపద సృష్టిస్తానని బీరాలు పలుకుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అది తన బినామీల కోసమేనని ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా చాటిచెబుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగితే.. ఇప్పుడు పడిపోయాయని గుంటూరులో బుధవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 185 కి.మీల పొడవున నిర్మించడానికి ప్రణాళిక రచించానని చెబుతూ రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రపంచ స్థాయి నగరం కళ్ల ముందుకు వచ్చేదని గ్రాఫిక్స్ కథలు వల్లె వేశారు. సీఎం జగన్ తన కలలను వమ్ము చేశారని.. అధికారంలోకి రాగానే అమరాతి నిర్మాణం చేపట్టడమే తన సంకల్పమని పునరుద్ఘాటించారు. అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్ష కోట్లను వెదజల్లి అమరావతిలో మౌలిక సదుపాయాలను కల్పించి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తాను, తన బినామీలు, వందిమాగధులు కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టడానికి కట్టుబడి ఉన్నట్లుగా చంద్రబాబు తేటతెల్లం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ ముసుగులో మురళీమోహన్ వంటి బినామీలతో కలిసి కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.వేలాది కోట్లు నొక్కేసిన తరహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. రహాలోనే ఇప్పుడూ అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. అంతర్జాతీయ కుంభకోణం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని కేంద్రం సంక్షోభంలోకి నెట్టిందని.. దాన్ని అవకాశంగా మల్చుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం మాటేమోగానీ ఆ ముసుగులో అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. ఓత్ ఆఫ్ సీక్రసీకి తుట్లూ పొడిచి, రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై బినామీలు, వందిమాగధులకు లీకులు ఇచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి తక్కువ ధరలకే తన గ్యాంగ్ ద్వారా భారీ ఎత్తున భూములు కాజేశాక రాజధానిని ప్రకటించారు.ఆ ప్రాంతానికి కనీసం రహదారి సౌకర్యం కల్పించకుండానే.. భూముల ధరలు పెంచడం కోసం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టి కమీషన్లు దండుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానానికి తూట్లు పొడుస్తూ 1691 ఎకరాల్లో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు నిర్మాణ పనులను సింగపూర్ ప్రైవేటు సంస్థల కన్సార్షియంకు కట్టబెట్టి.. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.లక్ష కోట్లు కాజేయడానికి స్కెచ్ వేశారు.మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి భూ సమీకరణలో రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు, అటవీ భూములు సహా మొత్తం 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని గత టీడీపీ సర్కార్ నిర్ణయించింది. నల్లరేగడి భూములతో కూడిన ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేయడానికి ఎకరాకు రూ.2 కోట్లు వ్యయం అవుతుందని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే అమరావతిలో కేవలం కనీస మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరం.కానీ.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఆ మేరకు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ సీఎం జగన్ పొందుపరిచారు. -
Voting urgent than marriage: ఓటుకు సుముహూర్తం!
మధ్యాహ్నం 2 గంటలకు వివాహ సుముహూర్తం. వధువు నుదుటిపై జీలకర్ర బెల్లం పెట్టాల్సిన వరుడు కంగారుగా పోలింగ్ స్టేషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతడిని కొందరు అనుసరిస్తున్నారు. అక్కడున్న వారికి అతడు కొత్త పెళ్లి కొడుకు అని తెలుస్తోంది. అయినా కానీ, ఏంటా! అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి ఎవరికైనా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ విషయం అతడికీ తెలుసు. కానీ, పెళ్లితోపాటు, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని భావించడమే ఈ వరుడి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో వదార్పుర ప్రాంతంలో కనిపించింది ఈ దృశ్యం. రెండో దశలో భాగంగా మహారాష్ట్రలోని ఎనిమిది లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. షేర్వాణీ, తలపాగా ధరించిన నవ వరుడు ఆకాశ్ను పోలింగ్ స్టేషన్ ముందు ఏఎన్ఐ వార్తా సంస్థ పలకరించింది. అతడు తన ఓటింగ్ కార్డు చూపిస్తూ, ఓటు వేసేందుకు వచి్చనట్టు చెప్పాడు. తల్లితోపాటు, మామయ్య అతడి వెంట ఉన్నాడు.‘‘పెళ్లి వేడుక ముఖ్యమే. మరి ఓటు?. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి’’అని ఆకాశ్ చెప్పడంతో తోటి ఓటర్లు శభాష్ అని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరగా, యూజర్లు ఎవరికి తోచిన తీరులో వారు స్పందిస్తున్నారు. ఓటు విలువను గుర్తు చేసిన ఆకాశ్ను అభినందిస్తున్నారు. మరొకరు అయితే.. కాబోయే వధువుఆలోచనల్లో తేలిపోతూ ఓటును విస్మరించేవారేమో! – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజధాని కేసుల్లో..బాబుకు జైలే..
సాక్షి, అమరావతి: చట్టాల్ని ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకొని.. సచ్చిలుడని విర్రవీగిన చంద్రబాబు అవినీతి పుట్ట పగిలింది. మేకవన్నె పులికి మారుపేరైన ఆయన అసలు రూపం కోర్టుల సాక్షిగా సాక్షాత్కారమైంది. ఎంతో నేర్పుగా చేసిన స్కిల్ స్కామ్.. అమరావతి అసైన్డ్ భూ దోపిడీ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం.. ఇలా అవినీతి దందాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అవినీతి చేశాను.. అయితే నాకు చట్టాలు వర్తించవనే జిత్తులమారి తెలివితేటలతో సెక్షన్ 17–ఏను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామన్న పన్నాగం బెడిసికొట్టింది. చంద్రబాబుపై కేసుల్లో నేరం నిరూపితమైతే రాజధాని కుంభకోణం కేసుల్లో యావజ్జీవ ఖైదు తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక్కో కేసులో భారీ అవినీతి స్కిల్ స్కామ్: జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరిట ఆ కంపెనీకే తెలియకుండా ప్రాజెక్ట్ను సృష్టించి స్కిల్ స్కామ్కు పాల్పడ్డారు. ఈ కేసులోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతోపాటు న్యాయస్థానం రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజలపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసైన్డ్ భూదోపిడీ:అమరావతిలో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్రోడ్డు స్కామ్: అలైన్మెంట్లో అక్రమాల ద్వారా క్విడ్ ప్రోకోతో రూ.2,500 కోట్ల మేర అవినీతి.. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే జీవోలు జారీ. నోట్ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి అక్రమాల కథ నడిపించారు. అనంతరం నోట్ ఫైళ్లను గల్లంతు చేశారు. సీఐడీ ఆ అవినీతిని వెలికి తీయడంతో అతని బాగోతం బట్టబయలైంది. ఈ కుంభకోణాలన్నిటికీ సూత్రధారి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్నారని డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసాధ్యమని న్యాయ నిపుణుల అభిప్రాయం. కేబినెట్కు తెలియకుండా చీకటి జీవోలు చంద్రబాబు అవినీతి విశ్వరూపాన్ని ఛేదించడం అంత తేలిక కాదు. కొన్ని సార్లు తప్పించుకోవచ్చు.. అన్నిసార్లూ తప్పించుకోలేరు.. చివరకు పక్కా ఆధారాలతో దొంగ దొరికాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సర్వం తానై కుంభకోణాలకు పాల్పడ్డారు. 2014 నుంచి 2019 వరకు బరితెగించి సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేలి్చంది. కేబినెట్కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేసి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టేశారు. ప్రభుత్వ నిధులు అస్మదీయులకు మళ్లించి.. షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా ఆ డబ్బును విదేశాలకు తరలించారు. అవి హవాలా మార్గంలో తన బంగ్లాకే చేరేలా పక్కా వ్యూహం అమలుచేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదు: సుప్రీంకోర్టు స్కిల్ స్కామ్లో సీఐడీ దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేశాక విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరుపర్చింది. దాదాపు 10 గంటలు ఇరుపక్షాల వాదనల అనంతరం ఆయనకు న్యాయమూర్తిజ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. సీఐడీ అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 17–ఏ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వం తానై.. కుట్రదారు, లబ్ధిదారుగా సర్వం తానై చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో నిగ్గు తేల్చింది. సిŠక్ల్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ఏ1గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిïÙట్లు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు. నేరం నిరూపితమై శిక్షలు పడితే యావజ్జీవం తప్పదు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఈ కేసుల్లో ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సిందే అత్యంత కీలకమైన సెక్షన్ 409 కింద నేరం నిరూపితమైతే యావజ్జీవం విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష.. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఇతర సెక్షన్ల కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్ష పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాలి. -
AP High Court: ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు నేడు ప్రమాణం చేశారు. జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇరువురు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. కాగా, వీరిద్దరూ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తూ న్యాయమూర్తులుగా నియమించబడ్డారు. ఈ ప్రమాణ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి, రిజిష్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బడుగుల భూచోరుడు చంద్రబాబే..
రాజధాని పేరిట అమరావతిలో చోటుచేసుకున్న భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబు ముఠానేనని సీఐడీ తేల్చింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం చార్్జషీట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్విత్ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల అసైన్డ్ భూములను చంద్రబాబు బ్యాచ్ కొల్లగొట్టిందన్నది ఆధారాలతో సహా సీఐడీ వెలుగులోకి తీసుకొచి్చన విషయం తెలిసిందే. కేంద్ర అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మరీ సాగించిన ఈ భూబాగోతం యావత్ దేశాన్ని విస్మయపరిచింది. ఏకంగా రూ.4,400 కోట్లు విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు, నారాయణ తమ బినావీులు, సన్నిహితుల పేరిట గుప్పెట పట్టారన్నది సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో తేలింది. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో భూదోపిడీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని కోసం భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జీఓ–1ను జారీచేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం.. చంద్రబాబు, నారాయణ తమ బినావీులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి భయపెట్టారు. తమకు ఆ భూములు విక్రయిస్తే కొంతైనా డబ్బులు వస్తాయని చెప్పారు. తీవ్ర ఆందోళనకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినావీులకు అసైన్డ్ భూములను సేల్డీడ్ల ద్వారా విక్రయించేలా చేశారు. చంద్రబాబు, నారాయణ తమ బినావీులైన కేపీవీ అంజనీకుమార్ (రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్), గుమ్మడి సురేశ్, కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కొల్లి శివరామ్లతోపాటు నారాయణ కుటుంబ సభ్యుల పేరిట ఆ అసైన్డ్ భూములు బదలాయించారు. అనంతరం.. మంగళగిరి తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులపై ఒత్తిడి తెచ్చి వాటిని అక్రమంగా బదలాయిస్తూ ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించారు. అసైన్డ్ భూములను అలా జీపీఏ పేరిటగానీ ఇతరత్రా విధాలుగాగానీ బదిలీ చేయడం చట్టవిరుద్ధం. ఆ తర్వాత ఆ భూములకు కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. తద్వారా తాము బినామీల పేరిట హస్తగతం చేసుకున్న అసైన్డ్ భూములకు సీఆర్డీఏ భారీ ప్యాకేజీ దక్కేలా చేశారు. ప్రభుత్వ ఒత్తిడితోనే అంటూ అధికారుల వాంగ్మూలం నిజానికి.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. వాటికి భూసమీకరణ కింద ప్యాకేజీ ప్రకటించడానికి వీల్లేదు. అదే విషయాన్ని స్పష్టంచేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులతోపాటు అడ్వకేట్ జనరల్ కూడా అసైన్డ్ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. కానీ.. చంద్రబాబు, నారాయణ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసి తాము చెప్పినట్లు చేయమని హుకుం జారీచేశారు. నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అసైన్డ్ భూముల బదలాయింపు చేశామని నాటి రెవెన్యూ ఉన్నతాధికారులు న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తనను అప్రూవర్గా పరిగణించమని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 1,100 ఎకరాలు.. 1,336 మంది బినామీలు నారాయణ కుటుంబసభ్యుల పేరిటే 162 ఎకరాలు ► అసైన్డ్ భూదోపిడీ కోసం చంద్రబాబు ముఠా రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్కు తెగబడింది. రెవెన్యూ రికార్డులు, సీఆర్డీఏ భూసమీకరణ రికార్డులను సీఐడీ అధికారులు పరిశీలించగా మొత్తం వ్యవహారం బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లకు విరుద్ధంగా సీఆర్డీఏ భూసమీకరణ ప్యాకేజీ ఇచ్చిన వాటిలో 1,336 మంది బినామీల పేర్లు ఉండటం గమనార్హం. ► నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల నుంచే రూ.16.5 కోట్ల నిధులను రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం ఆ నిధులను నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి వారి పేరున అసైన్డ్ భూములను అక్రమంగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించారు. ► నారాయణ కుటుంబ సభ్యుల పేరిటే అక్రమంగా 162 ఎకరాల అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేశారు. వీటి విలువ రూ.650కోట్లు. నారాయణ 16.5 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.650కోట్ల భూములు కొల్లగొట్టారు. ► అంతేకాక.. దాదాపు రూ.4వేల కోట్ల విలువైన మరో 1,000 ఎకరాల వరకు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట అక్రమంగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించారు. -
మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్ లో నే ప్రమాణ స్వీకారం చేస్తా