Anantapur District News
-
యువ కౌలు రైతు ఆత్మహత్య
నార్పల: కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు... స్థానిక సుల్తాన్పేటకు చెందిన నాగభూషణం కుమారుడు కురువ చరణ్ (23) మామిడి తోటలను కౌలుకు తీసుకొనేవాడు. అలా ఈ ఏడాది తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకుని దాదాపు 15 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. పంట బాగా వచ్చేందుకు పురుగు మందులు కొట్టడంతో పాటు కూలీలతో ఇతర పనులు చేయించాడు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో పంట సరిగా రాలేదు. దీనికితోడు దళారుల మోసంతో మామిడికి సరైన ధరలు కూడా దక్కలేదు. దీంతో దాదాపు రూ.20 లక్షల నష్టం వచ్చింది. ఈ క్రమంలో అప్పులు కట్టే దారి కానరాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చరణ్ జంగంరెడ్డిపల్లి వద్ద తాను కౌలుకు తీసుకున్న మామిడితోటలో సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల రైతుల వారు వెంటనే అతడిని జల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స ఫలించక ప్రాణాలు విడిచాడు. చరణ్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. -
స్ఫూర్తిప్రదాత అంబేడ్కర్
అనంతపురం సిటీ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిప్రదాత అని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పరిషత్ క్యాంపస్లో గల డీపీఆర్సీ భవన్లో ఆదివారం అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ వినోద్కుమార్, ఉభయ జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత సంఘాల ప్రతినిధులు అనేక సమస్యలను తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. శ్మశాన వాటికల ఏర్పాటుపై దృష్టి పెట్టామన్నారు. బదిలీలు, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తామని వెల్లడించారు. సబ్ ప్లాన్కు సంబంధించి మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహిస్తామని, సివిల్ రైట్స్ డేని ఏప్రిల్ నుంచి ప్రతి తహసీల్దార్, ఎస్హెచ్ఓ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లు లేని వారిని గుర్తించి న్యాయం చేస్తామన్నారు. బడుగు, బలహీన వర్గాలు రాజకీయంగా ఎదుగుతున్నారంటే అంబేడ్కర్ భిక్షేనని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. అనంతపురంలోని అంబేడ్కర్ భవనానికి రూ.12 లక్షలు ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరు చేస్తున్నట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. కస్తూర్బాగాంధీ గురుకులాలతో పాటు మోడల్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం సీట్లను పెంచేలా చూస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. అంతకుముందు సందర్భంగా జెడ్పీ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కమలమ్మ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ క్యాంపస్లోని డీపీఆర్సీ భవన్లో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు స్వయం ఉపాధి పథకం రుణాలు, ఉపకరణాల పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 12 మంది విభిన్న ప్రతిభావంతులకు ఎన్డీఎఫ్డీసీ కింద రూ.27.55 లక్షల రుణాలు మంజూరైనట్లు తెలిపారు. డిగ్రీ, ఇతర వృత్తి విద్య కోర్సులు అభ్యసిస్తున్న 25 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.9.50 లక్షల విలువ చేసే ల్యాప్ ట్యాప్లు, నలుగురు బధిరులకు రూ.58 వేల విలువ చేసే టచ్ ఫోన్లు, మరో ఐదుగురికి రూ.56 వేల విలువ చేసే వీల్ చైర్లను పంపిణీ చేసినట్లు వివరించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ -
మందకొడిగా రైతు రిజిస్ట్రేషన్లు
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ చేపట్టిన రైతు రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోంది. ఆధార్కార్డు మాదిరిగా ప్రతి రైతుకూ 11 నంబర్లతో కూడిన ప్రత్యేక విశిష్ట సంఖ్య (ఫార్మర్ రిజిష్ట్రీ ఐడీ) కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే, ఇందులో భాగంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ (ఏపీఎఫ్ఆర్) అగ్రీ స్టాక్ యాప్ నెల రోజులుగా సక్రమంగా పని చేయడం లేదని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలంటూ వ్యవసాయశాఖ అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో ఆర్ఎస్కే సిబ్బంది సతమతమవుతున్నారు. రైతు పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు, వాటికి అనుసంధానం అయిన మొబైల్ నెంబరు ద్వారా రిజిస్టరేషన్ చేసిన తర్వాత రైతుకు 11 నంబర్లతో కూడిన ఐడీ నంబరు కేటాయిస్తున్నారు. ఇందుకు మూడు సార్లు ఓటీపీ సక్సెస్ కావాల్సివుంటుంది. చాలా వరకు రెండు ఓటీపీలు సక్సెస్ అవుతున్నా మూడోసారి ఓటీపీ కావడం లేదని తెలిసింది. దీంతో అంతరాయం ఏర్పడుతోందని సిబ్బంది వాపోతున్నారు. భవిష్యత్తులో ఇన్పుట్సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, పావలావడ్డీ, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, యాంత్రీకరణ, రాయితీ విత్తనాలు, పంట ఉత్పత్తుల అమ్మకాలు తదితర వ్యవసాయ అనుబంధ శాఖల పరిధిలో ప్రభుత్వ ఫలాలు వర్తించాలంటే రైతుకు విశిష్ట సంఖ్య తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు. రెండు నెలల్లో 60 శాతమే.. జిల్లా వ్యాప్తంగా 3,42,666 మందికి విశిష్ట సంఖ్య కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1.97 లక్షల మందికి కేటాయించారు. అంటే గత రెండు నెలలుగా చేస్తున్నా 60 శాతం పూర్తీ చేశారు. ఇంకా 40 శాతం పెండింగ్ ఉండటంతో ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఆ లోపు కూడా ప్రక్రియ పూర్తి కావడం కష్టమేనని చెబుతున్నారు. ఇప్పటివరకూ పెద్దవడుగూరు మండలంలో 94 శాతం పూర్తి కావడంతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. పెద్దపప్పూరులో 90 శాతం, గుత్తి 88, రాయదుర్గం 83, యాడికి 83, తాడిపత్రి 79, గుంతకల్లు 78 శాతం ఇలా కొన్ని మండలాల్లో రిజిస్ట్రేషన్లు బాగానే జరిగాయి. అయితే గుమ్మఘట్ట 33 శాతం, కుందుర్పి 36, వజ్రకరూరు 37, బుక్కరాయసముద్రం 38, బెళుగుప్ప 39, కళ్యాణదుర్గం 40 శాతం... ఇలా కొన్ని మండలాల్లో మందకొడిగా కొనసాగుతోంది. యాప్ సరిగా పనిచేయక సిబ్బంది సతమతం ఇప్పటి వరకు 60 శాతం పూర్తయినట్లు వెల్లడి -
కొల్లగొట్టు కాంతారావ్!
ప్రకృతిని చెరబట్టాడు. కొండలను కరిగించేశాడు. ప్రజలపై దుమ్ము కొట్టాడు. అందిన కాడికి వెనకేసుకున్నాడు. అతని విశృంఖలత్వాన్ని చూసి అధికారులే విస్తుబోయారు. ఏకంగా రూ. 13 కోట్లకు పైగా ఫైన్ విధించారు. సదరు వ్యక్తి నుంచి ముక్కు పిండి ఆ మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉండగా.. కూటమి సర్కారు మాత్రం కరుణ చూపుతోంది. మన వాడే కదా.. అని ఏకంగా జరిమానాను రద్దు చేసేలా పావులు కదుపుతోంది.సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో మైనింగ్ మాఫియా డాన్గా పేరుగాంచిన టీవీఎస్ కాంతారావుకు కూటమి సర్కారు దన్నుగా నిలుస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన టీవీఎస్ కాంతారావు గతంలో బొమ్మనహాళ్ మండలం నేమకల్లు కేంద్రంగా భారీ దోపిడీ సాగించారు. కొండలను కొల్లగొట్టి రూ. కోట్లు కూడగట్టారు. అక్రమంగా కంకర, గ్రావెల్ను ఓబులాపురం మీదుగా కర్ణాటకకు తరలించారు. ఇతనిపై ఫిర్యాదుల నేపథ్యంలో 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మైనింగ్ అధికారులు నేమకల్లు వద్ద తనిఖీలు నిర్వహించారు. కాంతారావు అక్రమాలు చూసి ఆశ్చర్యపోయారు.పూర్తిస్థాయి విచారణ అనంతరం రూ.13.19 కోట్ల జరిమానా విధించారు. కానీ ఇప్పటికీ పైసా కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు.జరిమానాపై పునఃపరిశీలన..కూటమి సర్కారు కొలువుదీరిన మూడు నెలలకే అంటే 2024 సెప్టెంబర్ 7న గతంలో కాంతారావుకు విధించిన జరిమానాను మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం జిల్లా గనుల శాఖను ఆదేశించింది. 2019లో గనులశాఖ అధికారులు స్వయంగా వారం రోజులు పరిశీలించి.. భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని నిర్ధారించి... ఆ మేరకు నివేదిక ఇచ్చిన తర్వాత వేసిన జరిమానాపై పునఃపరిశీలించాలని ఆదేశాలు జారీ చేయడం చూస్తే... దాన్ని పూర్తిగా మాఫీ చేసే తలంపులో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికితోడు అప్పట్లో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తులు కూడా జప్తు చేయాలని, ఆ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఇచ్చిన నివేదికను కాదని ఇప్పుడు మళ్లీ పరిశీలించమన్నారంటే ఏ స్థాయిలో మైనింగ్ డాన్కు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందో ఊహించుకోవచ్చు.కూటమి సర్కారు రాగానే స్టార్ట్..కాంతారావుకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అండగా నిలుస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వుల వెనుక ఆయన పాత్ర ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి కాంతారావు నిధులు సమకూర్చారని, అందుకే ‘రివిజన్’ చేస్తున్నారని టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు వద్ద కొండలు, గుట్టల్ని పిండి చేసి ఏళ్ల తరబడి రూ.కోట్లు దోచుకున్న కాంతారావు.. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రాగానే అనుమతులు లేకున్నా యథేచ్ఛగా ప్రకృతి వనరులను కొల్లగొట్టడం ప్రారంభించడం గమనార్హం. సర్కారు కొలువుదీరిన మరుసటి రోజే నేమకల్లు పరిసరాల్లో జేసీబీలు, క్రషర్లు గద్దల్లా వాలినట్లు తెలిసింది. -
మట్టి తోలితే.. మనల్నెవడ్రా ఆపేది..?!
సాక్షి టాస్క్ఫోర్స్: ‘మేమేం చేసినా మమ్మల్ని అడిగేవారు లేరు.. ఆపేవారు అంతకన్నా లేరు.. అంతా మా ఇష్టం’ అన్న తరహాలో ఆత్మకూరు మండలంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడికై నా మట్టి తోలాలంటే ముందుగా రెవెన్యూ అధికారులు, మైనింగ్ శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి నిబంధనలేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా మట్టిని అక్రమంగా తరలిస్తూ ఓ తెలుగు తమ్ముడు జేబులు నింపుకుంటున్నాడు. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి సమీపంలో టీడీపీ నాయకుడు కృష్ణమోహన్ నెల రోజుల నుంచి మట్టిని కొల్లగొడుతున్నాడు. ఇప్పటివరకూ దాదాపు 500 టిప్పర్ల వరకు అక్రమంగా మట్టి తరలించినట్లు తెలి సింది. ఒక టిప్పర్ రూ.7 వేల వరకు విక్రయిస్తూ రూ. లక్షలు వెనకేసుకుంటున్నాడు. గత వైఎస్సార్సీపీ హయాంలో గ్రామంలో శ్రీ కృష్ణుని గుడి నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి భూమి పూజ చేయగా.. అప్పట్లో సదరు కృష్ణమోహన్ వేరే వారితో ఫోన్లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం వస్తే గుడి కట్టినా, బడి కట్టినా కూల్చేస్తాం అన్న మాటలు పెద్ద దుమారమే లేపాయి. చోద్యం చూస్తున్న అధికారులు.. నిత్యం వందల మట్టి టిప్పర్లు అనుమతి లేకుండా హైవేపైనే వెళ్తున్నా.. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు మండల రెవెన్యూ అధికారు లకు విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వడ్డుపల్లి సమీపంలో టిప్పరుతో అక్రమంగా మట్టి తరలిస్తున్న దృశ్యం -
అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం
అనంతపురం: విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ అన్నారు. సోమవారం నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో అగ్ని మాపక వారోత్సవాల ప్రారంభోత్సవంలో జిల్లా జడ్జి పాల్గొన్నారు. వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. 2024లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఫైర్ ఫైటింగ్ చేస్తూ అమరులైన సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ప్లకార్డులు చేతబట్టి నగరంలో ర్యాలీ నిర్వహించి, కరపత్రాలు పంచారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఫైర్ సర్వీస్ సిబ్బంది, అధికారులు, విశ్రాంత అధికారులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఎఫ్ఓ లింగమయ్య, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం. భూపాల్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి వి. శ్రీనివాస రెడ్డి, ఎస్ఆర్ఐటీ, బాలాజీ విద్యా సంస్థలు, ట్రెల్లీస్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎం పదోన్నతుల సీనియార్టీ జాబితా సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, అనంతపురం కార్పొరేషన్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ జాబితాను తయారు చేశారు. deoanantha puramu.blogspot.com వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ ప్రసాద్బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో ఈనెల 19లోపు ఫిర్యాదు చేయాలని డీఈఓ సూచించారు. కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు అనంతపురం రూరల్: విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. సోమవారం నగరంలోని సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహం–1, 2లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలని, దీంతో శారీరక, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థినులతో కలసి వసతి గృహంలోనే భోజనం చేశారు. కార్యక్రమంలో జేసీ శివ్నారాయణశర్మ, ఆర్డీఓ కేశవనాయుడు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ (ఇన్చార్జ్) రాధిక తదితరులు పాల్గొన్నారు. -
ఆగని ‘కూటమి’ కక్ష సాధింపులు
● ఉరవకొండలో మరికొందరు వైఎస్సార్సీపీ నేతలకు పోలీసు నోటీసులు ఉరవకొండ: వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి సర్కారు కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ గత ఏడాది డిసెంబర్ 27న ఉరవకొండలో పోరుబాట పేరుతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలు కూడా కదం తొక్కడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ క్రమంలో దీన్ని ఓర్వలేని స్థానిక టీడీపీ నేతలు విద్యుత్ అధికారిపై ఒత్తిడి చేసి కేసు పెట్టించారు. ర్యాలీతో ట్రాఫిక్కు ఇబ్బంది కలిగిందంటూ ఓ ‘పచ్చ’ నాయకుడి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. దీనిపై ఫిబ్రవరి 2న కొంతమంది వైఎస్సార్సీపీ నాయ కులను పిలిచి విచారణ చేపట్టిన పోలీసులు తిరిగి సోమవారం మరో 10 మంది పార్టీ ముఖ్య నాయకులకు నోటీసులు అందించడం గమనార్హం. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న వైఎస్సార్సీపీ నాయకులు బసవరాజు, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్ మాట్లాడుతూ అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరు కొనసాగిస్తామన్నారు. ఉరవకొండలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, మంత్రి కేశవ్ అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. నోటీసులు అందుకున్న వారిలో ఉరవకొండ రూరల్, మండల కన్వీనర్లు ఎర్రిస్వామిరెడ్డి, మూలగిరిపల్లి ఓబన్న, నాయకులు శింగనమల్ల ఉస్మాన్, సుద్దాల వెంకటేష్, వడ్డే ఆంజినేయులు, వెలిగొండ నాగన్న, అనిల్, బూదగవి ధనంజయలు తదితరులు ఉన్నారు. -
అల్ట్రాసౌండ్కు గంటలు... 2డీ ఎకోకు చుక్కలు
అనంతపురం మెడికల్: కూటమి ప్రభుత్వంలో సర్వజనాస్పత్రిలో రోజు రోజుకు వైద్య ప్రమాణాలు సన్నగిల్లుతున్నాయి. పబ్లిక్ హాలీడే పేరుతో సోమవారం వైద్యులు, సిబ్బంది జాలీగా బయటకు వెళ్లిపోవడంతో రోగులు నరకయాతన అనుభవించారు. వేచి ఉన్న సహాయకులకు చుక్కలు కనిపించాయి. ఆస్పత్రిలోని 2డీ ఎకో, అల్ట్రాసౌండ్ స్కాన్లు తీవ్ర జాప్యమయ్యాయి. ‘2డీ ఎకో’ టెక్నీషియన్ గంటల తరబడి పత్తా లేకుండా పోవడంతో రోగులు వేచి ఉండాల్సి వచ్చింది. వాస్తవంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు, అత్యవసర సర్జరీ కేసులకు 2డీ ఎకో తప్పనిసరి. అటువంటి కేసులను సకాలంలో చేయాల్సి ఉన్నా ఆ పరిస్థితి లేకుండా పోయింది. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గంటల తరబడి గదుల ముందు ఉంచేశారు. 2డీ ఎకో కోసం రెండు సార్లు వార్డు నుంచి రావాల్సి వచ్చిందని శెట్టూరు మండలం మాకొడికి గ్రామానికి చెందిన చంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. పీజీలే దిక్కు.. సర్వజనాస్పత్రి అల్ట్రాసౌండ్ స్కాన్లో పీజీలే దిక్కుగా మారారు. రేడియాలజిస్టు డాక్టర్ కల్యాణ్ కానరాకపోవడంతో అల్ట్రాసౌండ్ స్కాన్లు నెమ్మదిగా సాగాయి. 50 మందికిపైగా రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. విద్యార్థి దశలో ఉన్న వారి దగ్గరుండి స్కాన్లు ఏ విధంగా తీయాలో నేర్పించాల్సిన రేడియాలజిస్టులు విధులను నిర్లక్ష్యం చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఇక.. డాప్లర్ స్కాన్కు గత మూడు రోజులుగా తిప్పుతున్నారని పూలకుంటకు చెందిన లత వాపోయింది. తీరు మార్చుకోని సర్వజనాస్పత్రి వైద్యులు రోగులకు తప్పని కష్టాలు -
ప్రాణం పోసిన మెడిసిన్ వైద్యులు
అనంతపురం మెడికల్: ప్రాణాపాయ స్థితిలో చికిత్స ఆస్పత్రికి చేరుకున్న రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా అతని ప్రాణాలను ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని మెడిసిన్ విభాగం వైద్యులు కాపాడారు. కంబదూరు మండలం ఒంటిరెడ్డిపల్లికి చెందిన 34 ఏళ్ల వయసున్న నాగేంద్ర.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఉన్నఫళంగా కాళ్లు చేతులు పడిపోయి, మాట రాకపోవడంతో ఈ నెల 7న కుటుంబసభ్యులు సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అక్యూట్ మెడికల్ కేర్లో అడ్మిట్ చేసుకుని మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ భీమసేనాచార్ నేతృత్వంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పావని తదితరులు చికిత్స మొదలు పెట్టారు. గులియన్ బరీ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ అయిన తర్వాత పీజీ వైద్యులు, స్టాఫ్నర్సులు నాగేంద్రకు రౌండ్ ద క్లాక్ సేవలందించారు. రూ.7వేలు విలువ చేసే ఇంజెక్షన్లను క్రమం తప్పకుండా 20కి పైగా అందించాల్సి వచ్చింది. వెంటిలేటర్పై ఉన్న నాగేంద్ర కోలుకోవడంతో వార్డుకు షిప్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. తమకు ముగ్గురు పిల్లలున్నారని, ఆస్పత్రి వైద్యులు తన భర్తకు ఊపిరి పోశారని, వారి మేలును ఎన్నడూ మరవనంటూ వైద్యులు, స్టాఫ్నర్సులు, తదితర సిబ్బందికి భార్య సుకన్య కృతజ్ఞతలు తెలిపింది. ప్రైవేట్గా ఈ తరహా వైద్యం పొందాలంటే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆస్పత్రి వైద్యులంటున్నారు. -
90
జేఎన్టీయూ (ఏ) పరిధిలో అనుబంధ కళాశాలలుఅనంతపురం: ఇంజినీరింగ్ కష్టమనే అపోహను విద్యార్థుల్లో తొలగిపోయేలా మానసికంగా సంసిద్ధం చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా, ఐఐటీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో చోటు చేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలను పరిగణనలోకి తీసుకుని గత రెండేళ్లుగా ఏఐసీటీఈ జరిపిన అధ్యయనాల్లో బోధనా ప్రణాళికతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న విషయం వెల్లడైంది. జాతీయ విద్యా విధానంలో వస్తున్న మార్పులపై తొలి దశలోనే అవగాహన కల్పించకపోవడమే ఇందుకు కారణంగా గుర్తించి ప్రాక్టికల్ నాలెడ్జ్తో కూడిన విధానం అందుబాటులోకి తెచ్చేలా మార్గదర్శకాలను జారీ చేశారు. ఇంజినీరింగ్ రెండో ఏడాది నుంచే పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో పాఠ్య ప్రణాళికలో మార్పు చేశారు. దీంతో ఇంజినీరింగ్ విద్యార్థులు మూస విధానం నుంచి బయటపడి స్వతహాగా ఆలోచించే విద్యా విధానంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే ఇది కూడా మానసిక ఒత్తిళ్లకు కారణమవుతోందని ఏఐసీటీఈ జరిపిన మరో అధ్యయనంలో తేలింది. దీంతో తరగతుల ప్రారంభానికి ముందే అన్ని విధాలుగా విద్యార్థులను సంసిద్ధులను చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. బ్యాక్లాగ్స్ భారమై.. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కేవలం 18 నుంచి 20 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. సింహభాగం విద్యార్థులు మొదటి సంవత్సరంలోనే ఫెయిల్ అవుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యా ప్రణాళిక, బీటెక్ విద్యా ప్రణాళిక విభిన్నంగా ఉండడమే ఇందుకు కారణం. ఇంటర్మీడియట్ వరకు బట్టీ పద్ధతిలో చదువుతున్నారు. ఇంజినీరింగ్లో బట్టీ విధానం ఉండదు. కంప్యూటర్ సైన్స్లో గణితం ఒక్కసారిగా మారిపోతుంది. రెండో ఏడాదికి వచ్చే సరికి అనేక కంప్యూటర్ లాంగ్వేజ్లను విద్యార్థులు నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ప్రయోగాత్మకంగా ఫలితాలూ సాధించాల్సి ఉంటుంది. సివిల్, మెకానికల్లోనూ ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగతంగా స్కిల్ పెంచుకుంటే తప్ప ముందుకెళ్లని పరిస్థితి. ఈ కారణంగా బీటెక్ మొదటి, రెండో సంవత్సరాల విద్యార్థులకు బ్యాక్లాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే వారి మానసిక ఒత్తిళ్లకు కారణమవుతోంది. అధునాతన కోర్సులకు అధ్యాపకుల కొరత.. పోటీ ప్రపంచానికి దీటుగా కంప్యూటర్ సైన్సెస్ కోర్సు, దాని అనుబంధ కోర్సులకు విపరీతమైన క్రేజీ ఏర్పడింది. గత మూడేళ్లుగా డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ కోర్సులు భోదించే అధ్యాపకుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఈ అంతరాన్ని పూడ్చడానికి రెండో ఏడాది నుంచే సంబంధిత రంగాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా ప్రాజెక్ట్లు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. దీంతో ఏటా మార్కెట్లోకి వస్తున్న విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యత కలిగి ఉంటున్నారని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ప్రతి ఆరు నెలలకోసారి విద్యార్థి మానసిక ధోరణిని పరిశీలించాలని ఏఐసీటీఈ సూచించింది. విద్యార్థుల శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ విద్యా ప్రణాళికపై తరగతుల ప్రారంభానికి ముందే వారిలో అవగాహన పెంచేలా చర్యలు తీసుకున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అన్ని విధాలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతాం. – హెచ్.సుదర్శనరావు, వీసీ, జేఎన్టీయూ(ఏ) ఇంటర్, బీటెక్ విద్యా ప్రణాళికలు విభిన్నం దీంతో ఇంజినీరింగ్ కష్టమనే అపోహ అపోహలు తొలగిపోయేలా విద్యార్థులకు ముందస్తుగా కౌన్సెలింగ్ క్యాంపస్ కళాశాలలో సీట్ల పెంపుదలకు కసరత్తు జేఎన్టీయూ(ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రస్తుతం ఒక్కో బ్రాంచ్కు 60 సీట్లు ఉండగా, వీటిని 120కు పెంచేలా పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. సోమవారం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ హెచ్ .సుదర్శనరావు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. అలాగే స్నాతకోత్సవం నిర్వహణపై కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. పులివెందుల కళాశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు వర్సిటీనే నిధులు అందించేలా చర్యలు తీసుకున్నారు. -
అంబేడ్కర్ కాలనీ నేమ్బోర్డు ఏర్పాటుపై ఉద్రిక్తత
రాయదుర్గం టౌన్: మండలంలోని రాయంపల్లి ఎస్సీ కాలనీ ప్రవేశ మార్గంలో ‘అంబేడ్కర్ కాలనీ’ నేమ్ బోర్డు ఏర్పాటుపై సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన కొందరు కూటమి నాయకులు నేమ్బోర్డును దౌర్జన్యంగా పెకలించారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. జిల్లా కలెక్టర్గా గంధం చంద్రుడు పనిచేసిన సమయంలో దళిత, ఎస్సీ కాలనీలను ఆ పేర్లతో పిలవకూడదన్న ఉద్దేశంతో జాతీయ నాయకుల పేర్లతో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయించారు. ఈ నేపథ్యంలోనే రాయంపల్లి ఎస్సీ కాలనీకి ‘అంబేడ్కర్ కాలనీ’గా నామకరణం చేసి నేమ్బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు బోర్డు పడిపోవడంతో కొందరు యువకులు మరమ్మతు చేయించి.. అంబేడ్కర్ జయంతి రోజున అదే స్థలంలో మళ్లీ ఏర్పాటు చేశారు. దీనిని జీర్ణించుకోలేని గ్రామానికి చెందిన కొందరు కూటమి నాయకులు దళితులతో ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గొడవను సద్దుమణిగించారు. కాగా, ‘అంబేడ్కర్ కాలనీ’ నేమ్బోర్డు ఏర్పాటు చేస్తే అంతు చూస్తామంటూ కులం పేరుతో దూషించి న కూటమి పార్టీల నాయకులు శీనప్ప, మద్దానప్ప, హనుమంతప్ప, జయన్న, ఆంజనేయులు, బోయ దొడ్డపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు దళితులు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తిప్పేరుద్ర, వన్నూరుస్వామి, కిష్టప్ప, రుద్రన్నతో పాటు మరో 12 మంది డిమాండ్ చేశారు. -
మహిళా కమిషన్ సభ్యురాలిని పరామర్శించిన వైఎస్ జగన్
గుత్తి: ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు, గుత్తి పట్టణానికి చెందిన రుఖియాబేగం ఆదివారం శ్రీకాళహస్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తిరుపతిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను సోమవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. రుఖియా బేగంకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మద్యం అడిగితే ఇవ్వలేదని వ్యక్తిపై దాడి యాడికి: తాగేందుకు మందు ఇవ్వలేదన్న అక్కసుతో ఖాళీ మద్యం బాటిళ్లతో వ్యక్తిపై దాడి చేసిన ఘటన యాడికిలో సంచలనం రేకెత్తించింది. బాధితుడు తెలిపిన మేరకు.. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన మంగల గంగాధర్ సోమవారం వ్యక్తిగత పనిపై మండల కేంద్రానికి వచ్చాడు. మధ్యాహ్నం కుంటకు వెళ్లే మార్గంలో ఉన్న బ్రాందీ షాపులో మద్యం బాటిల్ కొనుగోలు చేసి, ఆ పక్కనే మిగిలిన వారితో కలసి తాగుతూ కూర్చొన్నాడు. అదే సమయంలో గంగాధర్తో ఎలాంటి ముఖపరిచయం లేని యాడికి గ్రామానికి చెందిన మహేష్ అక్కడకు చేరుకుని తనకూ తాగేందుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు గంగాధర్ నిరాకరించడంతో మహేష్ వాగ్వాదానికి దిగాడు. దుర్భాషలాడుతూ ఆ పక్కనే పడి ఉన్న ఖాళీ మద్యం గాజు బాటిల్ తీసుకుని గంగాధర్ తలపై బలంగా బాదాడు. దీంతో గంగాధర్ తలకు తీవ్ర రక్తగాయమైంది. సమాచారం అందుకున్న గంగాధర్ సమీప బంధువు అక్కడకు చేరుకుని వెంటనే క్షతగాత్రుడిని స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. విషయం తెలుసుకున్న యాడికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేష్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పేలుడు పదార్థం తిని గొర్రె మృతి ఎన్పీ కుంట: అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన పేలుడు పదార్థం తిని ఓ గొర్రె మృతి చెందింది. ఎన్పీ కుంటకు చెందిన గొర్రెల కాపరి భాస్కర్ సోమవారం ఉదయం తన గొర్రెలను రోడ్డుకు సమీపంలోని చవట గుంతల వద్ద మేపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై గొర్రెల కాపరులు ఆందోళన వ్యక్తం చేశారు. జీవాలు మేపు సమయంలో నల్లమందు ఉంటలపై కాలు పెట్టినా పేలుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నారు. -
జాతీయ హోమియో వైద్యుల సంఘంలో జిల్లా వాసులకు చోటు
అనంతపురం మెడికల్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులకు చోటు దక్కింది. ఈ నెల 13న గుంటూరులో అఖిల భారత హోమియో వైద్యుల సంఘం 18వ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియర్ హోమియోపతి వైద్యుడు డాక్టర్ పోగుల కుమారయ్య, రాష్ట్ర విభాగం కో ఆర్డినేటర్గా డాక్టర్ ఎం.శాంతిప్రియకు అవకాశం దక్కింది. డాక్టర్ పోగుల కుమారయ్య మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో హోమియో వైద్యం ప్రాముఖ్యత, నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నగదు అపహరణ కేసులో నిందితుడి అరెస్ట్ నార్పల: నగదు అపహరణ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్పల పీఎస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్ వెల్లడించారు. గతేడాది అక్టోబర్లో వెంకటాంపల్లికి చెందిన శ్రీనివాసులు, తన భార్యతో కలసి నార్పలలోని స్టేట్బ్యాంకులో ఉన్న తన ఖాతా నుంచి రూ.3 లక్షలు డ్రా చేసి ద్విచక్ర వాహనంలోని బ్యాగ్లో ఉంచుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో నార్పల సంతలో నిత్యావస సరుకులు తీసుకునేందుకు వాహనాన్ని ఆపాడు. ఆ సమయంలో చిన్నా అనే యువకుడు నగదు అపహరించాడు. ఘటనపై అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి సంచరిస్తున్న చిన్నాను.. సోమవారం నార్పల క్రాస్ సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. -
19న వివాహం... యువతి బలవన్మరణం
రాప్తాడు రూరల్: పెళ్లి భజంత్రీ మోగాల్సిన ఇంట కాబోయే పెళ్లికూతురు బలవన్మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం రూరల్ మండలం పూలకుంటలో సోమవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన మేరకు... పూలకుంట గ్రామానికి చెందిన కురుబ నారాయణస్వామికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయికి వివాహమైంది. రెండో అమ్మాయి రేణుక (24) ఆకుతోటపల్లి–1 సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పని చేస్తోంది. ఈమెకు ఓ ప్రభుత్వ ఉద్యోగితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 19న పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. కుటుంబసభ్యులు ఓవైపు పెళ్లి పత్రికల పంపిణీ చేస్తూనే మరోవైపు పెళ్లికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటికి బంధువుల రాక కూడా మొదలైంది. పెళ్లంటే ఇష్టం లేక.... అయితే రేణుకకు పెళ్లంటే ఇష్టం లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు సచివాలయంలో సహచర ఉద్యోగులతో చెప్పేది. ‘పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుందో...అత్త మామలు ఎలా ఉంటారో....ఇప్పుడున్నట్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఉండేందుకు ఉండదు... కొత్తగా పెళ్లి చేసుకున్న వారి కాపురాలు చాలా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు చేసుకోవాలో?’ అని చర్చించేది. మరోవైపు పెళ్లి తేదీ దగ్గరకు వస్తుండడంతో హడావుడి పెరిగిపోయింది. ఇక పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని, తల్లిదండ్రులకు చెప్పుకోలేక తీవ్ర ఆందోళనకు గురైన ఆమె సోమవారం ఉదయం మేడపై ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఎంతసేపటికీ కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పైకి వెళ్లి చూడగా ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తె కనిపించింది. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి ఎస్ఐ విజయ్కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పెళ్లి భజంత్రీ మోగాల్సిన ఇంట విషాదం మృతురాలు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ -
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం
అనంతపురం కార్పొరేషన్: ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం కాలరాస్తూ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ వసీం ధ్వజమెత్తారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సోమవారం పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కక్ష సాధింపులు, దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించారన్నారు. అన్నివర్గాల అభ్యున్నతికి వైఎస్ జగన్ పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. రూ.2.75 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా పేదరికం నిర్మూలనకు కృషి చేశారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ మాట్లాడుతూ.. పారదర్శకత, అవినీతిరహిత పాలనను జగనన్న అందిస్తే.. ఇందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కూటమి సర్కార్ పాలన సాగుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం అనంతరం జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, అనుబంధ విభాగాల రాష్ట్ర నాయకులు కాగజ్ఘర్ రిజ్వాన్, పెన్నోబులేసు, కృష్ణవేణి, వేముల నదీం, అనుబంధ సంఘాల అధ్యక్షులు మల్లెమీద నరసింహులు, వైపీ బాబు, శ్రీదేవి, సైఫుల్లాబేగ్, అమర్నాథ్ రెడ్డి, చంద్రలేఖ, నాయకులు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, మీసాల రంగన్న, పసులూరు ఓబులేసు, దాదు, తలారి వెంకటేష్, మారుతీనాయుడు, తనీష, మాల్యవంతం మంజుల, ఫయాజ్, సతీష్, లక్ష్మణ్, శోభారాణి , శోభాబాయి, కార్పొరేటర్లు కమల్భూషణ్, దుర్గాదేవి, రహంతుల్లా, రాజేశ్వరి పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయాలను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి -
టీడీపీ నేతపై హత్యాయత్నం
బొమ్మనహాళ్: మహిళ పరువు తీశాడన్న కక్షతో టీడీపీ నేతపై బాధితురాలి సంబంధీకులు కత్తితో దాడి చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం కల్లుహోళ గ్రామానికి చెందిన టీడీపీ నేత సోమన్నగౌడ్... అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో గుట్టుగా వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయం వెలుగు చూడడంతో కొన్నేళ్ల క్రితం పెద్ద మనుషుల పంచాయితీ నిర్వహించి ఇద్దరినీ మందలించారు. ఇటీవల సోమన్నగౌడ్ మళ్లీ ఆమెతో మాట్లాడుతుండడం సదరు మహిళ మేనల్లుడు గోవిందు గమనించాడు. దీంతో గ్రామంలో తమ మేనత్త పరువు తీయడమే కాక మళ్లీ ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తుండడాన్ని జీర్ణించుకోలేక అదే గ్రామానికి చెందిన బి.వన్నప్పతో కలసి ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత తన ఇంటి ఎదుట నిద్రిస్తున్న సోమన్నగౌడ్పై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో సోమన్నగౌడ్ దాడిని ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు మేల్కొనడంతో గోవిందు, వన్నప్ప అక్కడి నుంచి పారిపోయారు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే బళ్లారిలోని విమ్స్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. అంబేడ్కర్ జయంతి వేడుకల్లో అపశ్రుతి ఉరవకొండ: పట్టణంలో సోమవారం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో దళిత సంఘం నాయకుడు, పెద్ద ముష్టూరు గ్రామానికి చెందిన నాగరాజు (49) గుండెపోటుతో మృతి చెందాడు. ముందుగా ర్యాలీలో పాల్గొన్న ఆయన అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తుండగా ఒక్క సారిగా ఛాతి పట్టుకుని కుప్పకూలాడు. గమనించిన నాయకులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్దారించారు. నాగరాజు మృతిపై దళిత సంఘం నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు సంతాపం తెలిపారు. పెనుగాలుల బీభత్సం గార్లదిన్నె: మండల కేంద్రం గార్లదిన్నెతో పాటు కల్లూరులో సోమవారం సాయంత్రం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. కల్లూరులో 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హోర్డింగ్ కూలి రోడ్డు మీద పడింది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అలాగే గార్లదిన్నెలోని డ్యాం రోడ్డు రైల్వే గేట్ వద్ద పురాతన వేపవృక్షం విరిగి పడింది. గ్రామాల్లోని పలు తోటల్లో చెట్లు విరిగి పడినట్లు రైతులు తెలిపారు. పామిడిలో గాలీవాన పామిడి: మండల కేంద్రం పామిడిలో సోమవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో ఇళ్ల రేకులు, పీఓపీ సీట్లు ఎగిసి పడ్డాయి. రేకుల షెడ్లు నేల కొరిగాయి. -
సజావుగా ఫ్లాగ్షిప్ పరీక్ష
అనంతపురం అర్బన్:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం ఫ్లాగ్షిప్ పరీక్షలు సజావుగా జరిగాయి. సీడీఏ పరీక్షకు అభ్యర్థుల హాజరు శాతం 45.07, ఎన్డీఏ పరీక్షకు 65.42 శాతం నమోదైంది. అనంతపురం కేఎస్ఎన్ పీజీ మహిళా కళాశాలలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), నావెల్ అకాడమీ (ఎన్ఏ), ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (సీడీఏ) పరీక్షలు నిర్వహించారు. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు. సీడీఏ పరీక్షకు 94 మంది హాజరవ్వాల్సి ఉండగా పేపర్–1కు 41 మంది,పేపర్–2 కు 48 మంది హాజరయ్యారు. పేపర్–3 పరీక్షకు 37 మందికి 15 మంది హాజరయ్యారు. ఎన్డీఏ, ఎన్ఏ పరీక్షకు 269 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. పేపర్–1కు 178, పేపర్–2కు 174 మంది హాజరయ్యారు.ఎం.రామ్మోహన్,డి.తిప్పేనాయక్లు పరీక్షలను పర్యవేక్షించారు. ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఆదివారం రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 5వ తరగతి ప్రవేశానికి 7,595 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 6,972 మంది హాజరయ్యారు. 625 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు 4,945 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 4,099 మంది హాజరయ్యారు. 847 మంది గైర్హాజరయ్యారు. బి.పప్పూరు, కొర్రపాడు, కురుగుంట స్కూళ్లలో కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు క్లారెన్స్ రాజు పరిశీలించారు. కురుగుంట కళాశాల కేంద్రంతో పాటు తిమ్మాపురం, అమరాపురం, నల్లమాడ పాఠశాలల కేంద్రాలను అంబేడ్కర్ గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా సమన్వయకర్త జయలక్ష్మీ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు ఫిర్యాదుల స్వీకరణ ఉండదు అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుల స్వీకరణ ఈ సోమవారం ఉండదని కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని, ఈ నేపథ్యంలో కలెక్టరేట్లో జరగాల్సిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు. వృద్ధ దంపతుల ఆత్మహత్య ● అనారోగ్యంతో మనస్తాపం చెంది బలవన్మరణం అనంతపురం: అనారోగ్యంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం త్రీటౌన్ సీఐ కే.శాంతిలాల్ తెలిపిన మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వీవర్స్ కాలనీ చెందిన దేవా శివానంద (70), దేవా శాంతమ్మ (60) దంపతులు. వీరికి దేవా గోపాల్, దేవా చంద్రశేఖర్ సంతానం కాగా, హిందూపురంలో కుమారులు ఒక చోట, తల్లిదండ్రులు మరో చోట నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన శివానందకు ఇటీవల షుగర్ ఎక్కువైంది.కిడ్నీ కూడా దెబ్బతినడంతో అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. శాంతమ్మ కూడా షుగర్ వ్యాధితో బాధపడేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న దంపతులిద్దరూ ఇంటికి తాళం వేసి అనంత పురం చేరుకున్నారు. నగర సమీపంలోని నేషనల్ పార్కు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. గుర్తించిన స్థానికులు వెంటనే ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా, చికిత్స ఫలించక శివానంద అదే రోజు ప్రాణాలు విడిచారు. శాంతమ్మ ఆదివారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
పరిస్థితి దారుణంగా ఉంది
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చీనీ తోటలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 93 వేల ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 37,250 ఎకరాల భారీ విస్తీర్ణంలో చీనీ పంట సాగవుతోంది. వాటి ద్వారా ఏటా 7.20 లక్షల టన్నుల మేర దిగుబడి వస్తోంది. ఏటా సరాసరి రూ.2,000 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల టర్నోవర్ ఉన్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలో 18 వేల ఎకరాలు, యల్లనూరు 11,296, కూడేరు 9,300, పామిడి 5,300, నార్పల 5,200, పుట్లూరు 5 వేలు, ఆత్మకూరు 4,200, అనంతపురం 3,900, పెద్దపప్పూరు 3,500 ఎకరాల్లో చీనీ తోటలు ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల్లో చీనీ అత్యధికంగా సాగులో ఉంది. ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి.. ఉమ్మడి జిల్లాలో పండించే చీనీలో 70 నుంచి 80 శాతం వరకు ఢిల్లీలో ఉన్న అజాద్పూర్ మార్కెట్కు, ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఈ సారి మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఎక్కువ దిగుబడి రావడంతో వ్యాపారులు అక్కడికి వెళుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల మార్కెట్లకు సరుకు విపరీతంగా వెళుతుండటంతో సమస్య ఉత్పన్నమవుతోందని మార్కెట్యార్డు ఉన్నతశ్రేణి సెక్రటరీ కె.గోవిందు తెలిపారు. ఇటీవల జిల్లా నుంచి అక్కడకు వెళ్లిన 50 నుంచి 70 లారీల సరుకు ఇంకా అన్లోడ్ కాలేదని, దీంతో ధరలు పెరగడం లేదని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట ధరలు పలికేవి. కానీ, ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ధరలు పెరగడం అటుంచి తగ్గుదల కనిపిస్తుండటంతో అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. ఏప్రిల్లో టన్ను రూ.40 వేలకు పైగా పలకాల్సివుండగా... గత రెండు నెలలుగా టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు మించి పలకడం లేదు. అనంతపురం వ్యవసాయ మార్కెట్యార్డుకు ఇటీవల నిత్యం 1,000 నుంచి 1,500 టన్నుల సరుకు వస్తోంది. ఈ క్రమంలో శనివారం టన్ను గరిష్ట ధర రూ.20 వేల లోపే పలికింది. సరాసరి ధర రూ.13 వేలు మాత్రమే పలకడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. దీనికి తోడు శనివారం మార్కెట్యార్డులో జీవాల సంత ఉండటంతో చీనీ అమ్మకాలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. చాలా వాహనాల్లోని సరుకును కిందికి దించి అమ్మకాలు చేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఇలా రోజురోజుకు కష్టాలు ఎక్కువ అవుతుండటంతో చీనీ రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ‘అనంత’ రైతులకు ఒకప్పుడు లాభాల తీపి పంచిన చీనీ ఇప్పుడు చేదెక్కింది. మంచి ధర కోసం వారాలు, నెలల తరబడి కాయలు కోయకుండా ఎదురుచూసినా ఫలితం కానరాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మార్కెటింగ్ పరిస్థితి దారుణంగా ఉన్నా కూటమి సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ధరలు మరింత పతనం గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణ పరిస్థితులు రైతుల్లో తీవ్ర ఆందోళన గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి చీనీ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. రంజాన్, ఉగాది, హోలీ పండుగలు అన్నీ వెళ్లినా... ధరలు మాత్రం పెరగడం లేదు. తోటల్లోనే టన్ను రూ.25 వేలకు మించి అడగడం లేదు. దానికి డబుల్ సూట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే నెల పాటు కాయలు కోయకుండా ధరల కోసం ఎదురుచూసినా ఫలితం కానరాలేదు. నాకు ఏడెకరాల చీనీ తోట ఉంది. దిగుబడి బాగానే ఉన్నా ధరలు చూస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. టన్ను రూ.40 వేలు అటుఇటుగా పలికితే తప్ప గిట్టుబాటు కాదు. గతంలో కన్నా ఈ సారి చీడపీడల తాకిడి ఎక్కువ కావడంతో పురుగుల మందుల ఖర్చు బాగా పెరిగింది. – కుళ్లాయిరెడ్డి, చీనీ రైతు, కునుకుంట్ల గ్రామం, తాడిమర్రి మండలం -
వక్ఫ్ యాక్ట్ వాపస్ లేలో..
అనంతపురం కార్పొరేషన్: ‘వక్ఫ్ యాక్ట్ వాపస్ లేలో.. హమ్ కిసీకో డర్తా నహీ (వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించుకోండి.. మేం దేనికీ భయపడేది లేదు)’ అంటూ ముస్లింలు నినదించారు. అనంతపురం నగరంలో ఆదివారం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ విజయ వంతమైంది. ర్యాలీలో వేలాదిగా ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ప్రజా, కుల సంఘాలు వీరికి మద్దతు తెలిపాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి క్లాక్టవర్, రఘువీరా కాంప్లెక్స్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వక్ఫ్ చట్టం తీసుకొచ్చిందన్నారు. 11 ఏళ్లుగా ముస్లిం మైనార్టీలను బీజేపీ ఇబ్బంది పెడుతోందని, తమ పూర్వీకుల ఆస్తులను కాజేసేందుకు తాజాగా కుట్ర చేస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతోంది అదానీ, అంబానీలని, రానున్న రోజుల్లో ‘వక్ఫ్’ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పచెబుతారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా వక్ఫ్ చట్టాన్ని తెచ్చారన్నారు. ఉర్దూ అకాడమీ రాష్ట్ర మాజీ చైర్మన్ నదీం అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముస్లింలకు న్యాయం చేయాలని ఉంటే రంగనాథ్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ ‘వక్ఫ్’ చట్టం ఉపసంహరించుకునే వరకు ముస్లింలకు అండగా ఉంటామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ ప్రధాని మోదీకి రాబోయే రోజుల్లో తప్పక బుద్ధి చెబుతామన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, తబ్లిక్ జమాత్, సున్ని జమాత్ మతపెద్దలు, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు నియాజ్, వేమల నదీం, ఏకేఎస్ ఫయాజ్, ఖాజా, తనీష, పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల నాయకులు సాకే హరి, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, నాయకులు తాజుద్దీన్, హారూన్ రషీద్, సూఫీ ఖాజా, జావెద్, జక్రియా, షమీ, అలీ, అల్లీపీరా, ఐఎంఎం బాషా, చామలూరు రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షోభంలో రవాణా రంగం
హిందూపురం అర్బన్: లారీ రవాణా రంగం ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. రాష్ట్రంలో విజయవాడ తరువాత పదేళ్ల క్రితం వరకూ హిందూపురం రవాణా రంగంలో రెండో స్థానంలో ఉండేది. డీజిల్ ధరలు పెరగడం.. టోల్ గేట్ల మోత.. లోడింగ్– అన్లోడింగ్ల ఖర్చు, జీఎస్టీల భారంతో కనీస ఖర్చులు కూడా చేతికి అందడం లేదని లారీ యజమానులు వాపోతున్నారు. ఉన్నవి నడపడమే గగనం గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 12వేలకు పైగా లారీలు ఉండేవి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, నాగపూర్, కొలకత్తా, చైన్నె, కొచ్చికి ఇక్కడి నుంచి సరుకు ఎగుమతి, దిగుమతులు ఎక్కువగా జరిగేవి. దీంతో పదేళ్ల క్రితం వరకు లారీల నిర్వాహకులకు ఆదాయం బాగుండేది. ఈ క్రమంలో చాలా మంది ఫైనాన్స్ కింద లారీలు కొనుగోలు చేసి సరుకు రవాణా రంగంలో స్థిరపడ్డారు. కాలక్రమేణా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరుల కారణంగా సరుకు రవాణా వ్యవస్థ కుదేలవుతోంది. కొత్తగా లారీలు కొనుగోలు చేసేవారి సంగతి పక్కన ఉంచితే... ఉన్నవాటిని నడపడమే గగనంగా మారుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 వేల వరకు లారీలు ఉన్నాయి. కాలం మారినా అవే బాడుగలు రవాణా రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా ఐదారేళ్ల క్రితం ఉన్న కిరాయినే ఇప్పటికీ ఉంది. లోడింగ్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. సీజన్లో కాస్త మెరుగనిపించినా ఆ తర్వాత లారీలన్నీ ట్రాన్స్పోర్టు కార్యాలయం ఎదుటే ఉంటున్నాయి. సరుకు రవాణాకు ఇప్పుడు రైళ్లను ఎక్కువగా ఎంచుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పెరిగిన ఇన్సూరెన్స్, పన్నులు లారీ విలువను బట్టి రెండేళ్ల క్రితం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు బీమా ప్రీమియంను యజమానులు చెల్లించేవారు. ఇప్పుడు ఇదే ప్రీమియం రూ.40 వేల నుంచి రూ.75 వేల వరకు చేరింది. 22 చక్రాల కొత్త లారీకి ఇన్సూరెన్స్ కింద రూ.1.25 లక్షల ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. అలాగే లారీని బట్టి మూడు నెలలకు ఒకసారి స్టేట్ పర్మిట్ కింద పన్ను రూ.8 వేల నుంచి 13 వేల వరకు చెల్లించాలి. నేషనల్ పర్మిట్ అయితే మరింత ఎక్కువవుతుంది. ఇక ఏడేళ్లు దాటిన లారీలకు పన్నులకు అదనంగా గ్రీన్ ట్యాక్స్ తప్పక చెల్లించాల్సి వస్తోంది. పెరిగిన ఇంధనం, టైర్లు, విడి పరికరాల ధరలు కూలీలతో లోడింగ్, అన్లోడింగ్ కష్టాలు ఈఎంఐలు కట్టలేక రోడ్డు మీద పడే దుస్థితి రేపటి నుంచి కర్ణాటకకు నో ఎంట్రీ పెరిగిన విడిభాగాల ధరలు ఇంజన్ ఆయిల్తో పాటు లారీల విడిభాగాల ధరలు దాదాపు 22 శాతం మేర పెంచారు. దీంతో లారీ సామర్థ్యాన్ని బట్టి నెలవారీ నిర్వహణ ఖర్చు రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు వస్తోంది. టైర్ల ధరలు మూడేళ్ల క్రితం రూ.16,500 ఉంటే ఇప్పుడు అవే టైర్లు రూ.21,500కు చేరుకున్నాయి. రేడియల్ టైర్లయితే రూ.26వేలు ఖర్చవుతోంది. రోడ్డుపై లారీ తీసిన ప్రతిసారీ పోలీస్, రవాణా అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోంది. మోయలేని ఆర్థిక భారం రవాణా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న నాలుగు శాతం వ్యాట్ తగ్గించాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే దీని ధర ఎక్కువ. విడి భాగాల ధరలు సైతం అందుబాటులో లేవు. అంతేకాక కొందరిని నమ్మి లారీలు అప్పజెప్పే కాలమూ పోయింది. ఓనర్లే తిప్పడమో లేదా డ్రైవర్తో పాటు వెళ్లడం చేస్తున్నారు. జీఎస్టీతో యజమానులపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది. వీటిని తగ్తిస్తే ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. – షేక్ ఇందాద్, హిందూపురం లారీ అసోసియేషన్ అధ్యక్షుడు గ్రీన్ ట్యాక్స్ పేరుతో బాదుడు 10 ఏళ్ల క్రితం లీటర్ డీజిల్ ధర రూ.68 ఉండేది. అప్పట్లో విజయవాడకు టన్ను సరకు రవాణాకు రూ.1,600 ఇచ్చేవారు. అంటే లారీకి 15 టన్నులు వేసినా రూ.24 వేలు వచ్చేది. రానూపోను రూ.48 వేలు దక్కితే ఖర్చులు పోను రూ.15వేలు మిగిలేది. ఇప్పుడు లీటరు డీజిల్ రూ.100కు చేరువలో ఉంది. విజయవాడకు కిరాయి టన్నుకు రూ.14 వేలు ఇస్తున్నారు. ఈ లెక్కన రానూపోను రూ.42 వేలు వస్తుంది. ఖర్చులన్నీ పోనూ యజమానికి మిగిలిదే ఏదీ ఉండదు. దీనికి తోడు గ్రీన్ట్యాక్స్ను అమాంతం పెంచేశారు. – షౌకత్ అలీఖాన్, లారీ ఓనర్, హిందూపురంప్రజా జీవితంలో రవాణా రంగం కీలక భూమిక పోషిస్తోంది. ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా సంక్షోభంలో కూరుకుపోతోంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. రకరకాల పన్నుల పేరుతో అధిక మొత్తంలో నగదు వసూళ్లతో రవాణా రంగం కుదేలవుతోంది.15 నుంచి కర్ణాటకకు లారీల బంద్ రవాణా రంగాన్ని కలవర పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు నిరసనగా ఈ నెల 14న అర్ధరాత్రి నుంచి రవాణా కార్యకలాపాలు విరమించాలని ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ లారీ ఓనర్స్, ఏజెంట్స్ అసోషియేషన్ నిర్ణయించింది. ఇందుకు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. లీటర్ డీజల్పై రూ. 5 అదనంగా పెంచడం, టోల్గేట్ల వద్ద బలవంతపు వసూళ్లు, బెంగళూరులో అశాసీ్త్రయమైన నో ఎంట్రీ నిబంధనలు, అప్పు కింద కొనుగోలు చేసిన లారీ యజమానులపై ఫైనాన్స్ వారి వేధింపులు.. తదితరాలను నిరసిస్తూ కర్ణాటక లారీ అసోసియేషన్ ఈ మేరకు ఉద్యమానికి పిలుపునిచ్చింది. దీంతో ఈ నెల 15 నుంచి కర్ణాటకకు లారీల రాకపోకలు నిలిపివేయనున్నారు. -
విద్యా విధానంలో.. గందరగోళ నిర్ణయాలు తగదు
● రాష్ట్రోపాధ్యాయ సంఘం అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని విద్యా విధానంలో రోజురోజుకూ గందరగోళ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇలాంటి నిర్ణయాలు సముచితం కాదని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు మండిపడ్డారు. ఆదివారం విజయవాడ వేదికగా జరిగిన ఎస్టీయూ రాష్ట్ర కార్య వర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు కాబోతున్న విద్యా విధానంలో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగేలా అధికారిక నిర్ణయాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 117 జీఓను రద్దు చేస్తామని, ప్రతి పంచాయతీకి ఓ మోడల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. మరోసారి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా ప్రతి పంచాయతీకి మోడల్ పాఠశాల ఏర్పాటు చేయలేమని, ఆ గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం చాలా దుర్మార్గమన్నారు. ఈ విధానాలతో ఉపాధ్యాయుల మీద ఒత్తిళ్లు పెరిగిపోతాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా పునరాలోచించి జీఓ 117ను రద్దు చేసి విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉంచి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. రామాంజనేయులు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి జి. సూర్యుడు, రాష్ట్ర కార్యదర్శి కె. చంద్రశేఖర్ పాల్గొన్నారు. రైతు ఆత్మహత్య పెద్దవడుగూరు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు (49)కు భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమకున్న ఐదు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో పంట పెట్టుబడులు, కుమార్తెల పెళ్లిళ్లు, అనారోగ్యంతో బాధపడుతున్న భార్య చికిత్సకు తెలిసిన వారి వద్ద రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. గ్రామంలో వ్యవసాయ పనులు సక్రమంగా లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన ఆయన శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. అపస్మారకంగా పడి ఉన్న ఆయనను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
48 ఏళ్ల తర్వాత...
● అ‘పూర్వ’ సమ్మేళనంపెద్దవడుగూరు: స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 1992లో పదో తరగతి చదివిన వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సరస్వతీ దేవి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ పంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాలకు చేరుకుని తమతో పాటు చదువుకుని అకాల మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. రూ.40 వేలతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పూర్వ విద్యాఉ్థలు అనిల్, రాజేశ్వరమ్మ ముందుకు వచ్చారు. అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని శ్రీపొట్టి శ్రీరాములు నగర పాలకోన్నత పాఠశాలలో 1976–1977లో 10వ తరగతి చదివిన వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ జీవితంలో స్థిరపడిన వారు 48 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. చాలామంది విద్య, వైద్యం, న్యాయ శాఖ, రెవెన్యూ, ఆడిట్, అటవీ శాఖ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ తదితర రంగాల్లో సేవలందించి ఉద్యోగ విరమణ సైతం పొందారు. తమ చిన్ననాటి అల్లర్లను, గురువులతో వారికున్న సత్సంబంధాలను గుర్తు చేసుకున్నారు. గురువులు సూర్యనారాయణ శాస్త్రి, రంగప్ప, కృష్ణమూర్తి, గంగాచారిని ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి శ్యామసుందర్, అటవీ శాఖ అధికారి ఆంజనేయులు, వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షకులు మనోహర్, పోస్టల్ శాఖ వన్నప్ప, ఆడిటర్ హరినాథ్, విశ్రాంత తహసీల్దార్ సిరాజుద్దీన్, విద్యా శాఖ షేక్ మహబూబ్బాషా, రియాజుద్దీన్, రక్షణ శాఖ లక్ష్మీకాంత రెడ్డి, వ్యాపారవేత్త అబ్దుల్ ఖయూమ్తో పాటు మరో 50 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గురువులు పుల్లన్న, పద్మనాభ శాస్త్రి, చిన్నకేశవులు ఇళ్ల వద్దకు వెళ్లి ఘనంగా సత్కరించారు. -
●వైభవం.. చిక్కణ్ణేశ్వరుడి రథోత్సవం
కణేకల్లు మండల కేంద్రంలో ఆదివారం చిక్కణ్ణేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది. రథోత్సవాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్తులతో కణేకల్లులో సందడి నెలకొంది. ‘చిక్కణ్ణేశ్వరా.. శరణు’ అంటూ భక్తులు చేసిన ఘోషతో పురవీధులు మార్మోగాయి. స్వామి వారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఆశీనులు గావించి ఉత్సవం ప్రారంభించారు. రథోత్సవం సాగుతున్నంత సేపూ శివన్నామస్మరణ చేసుకుంటూ భక్తులు తన్మయత్వం చెందారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. – కణేకల్లు: -
టీడీపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం
● కుమారుడి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని తొలగించారని అఘాయిత్యం ● డబ్బు ముట్టజెప్పినా.. మరొకరితో మళ్లీ వసూలు చేసి అన్యాయం చేశారు: బాధిత కుటుంబీకుల ఆరోపణ గుత్తి రూరల్: డబ్బు ముట్టజెప్పి కుమారుడికి ఇప్పించిన ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని.. వేరొకరితో మళ్లీ వసూళ్లకు పాల్పడి తొలగించారని మనస్తాపం చెందిన ఓ టీడీపీ నాయకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని మాముడూరు గ్రామంలో కలకలం రేపింది. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు..మామడూరుకు చెందిన బోలే ఎల్లప్ప టీడీపీలో చాలాకాలంగా చురుగ్గా పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎల్లప్ప కుమారుడు బోలే గిరిష్ని ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించారు. ఇందుకోసం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, అప్పటి గుత్తి పార్టీ ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ రూ.4 లక్షలు తీసుకొన్నారు. ఇటీవల నారాయణ స్థానంలో గుత్తి ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్.. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి బోలే గిరిష్ని తొలగించి అదే గ్రామానికి చెందిన మరొకరిని నియమించారు. ఇందుకు ఆయన రూ.8 లక్షలు తీసుకొన్నారు. తన కుమారుడిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఎల్లప్ప అవమానంగా భావించాడు. ఆదివారం తన భార్య లక్ష్మిదేవి, గ్రామంలోని సన్నిహితులు, ఇతర పార్టీ నాయకులకు ఫోన్ చేసి మాట్లాడిన అనంతరం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొన్నాడు. ఈ క్రమంలోనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు కొన ఊపిరితో ఉన్న ఎల్లప్పను కిందికి దించి వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
నెట్టికంటుడికి కిలో వెండి వితరణ
గుంతకల్లు రూరల్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మౌనిక, రాకేష్ దంపతులు ఆదివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి కిలో బరువున్న వెండిని అందజేశారు. అంతకు ముందు దాతల కుటుంబసభ్యుల పేరున ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. లైంగిక వేధింపులపై కేసు నమోదు గార్లదిన్నె: మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను లైంగికంగా వేధిస్తున్న పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు భాస్కర్పై కేసు నమోదు చేసినట్లు గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్ మహమ్మద్బాషా తెలిపారు. భాస్కర్ యర్రగుంట్ల గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలసి బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్తో ఉపాధ్యాయుడి మృతి గుత్తి రూరల్: మండలంలోని బాచుపల్లి జంగాల కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎన్.కాంతారావు (58) ఆదివారం కన్నుమూశారు. మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండే వారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం కుటుంబసభ్యులు చేర్పించారు. పరిస్ధితి విషమించడంతో ఆదివారం ఉదయం 6.30 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్తో ఆయన మృతి చెందారు. ఆయన మృతిపై వైఎస్సార్టీఏ జిల్లా కార్యదర్శి శ్రీధర్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓబులేసు, వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. -
తీర్థయాత్రలో విషాదం
పుంగనూరు: నూతనంగా కొనుగోలు చేసిన కారులో తీర్థయాత్రకు వెళ్లి వస్తున్న ఉపాధ్యాయ దంపతులు ప్రమాదానికి గురయ్యారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా... విషమ పరిస్థితుల్లో భర్త, కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు... అన్నమయ్య జిల్లా కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లికి చెందిన వెంకటరమణ, శారద (45) దంపతులకు కుమార్తె కీర్తన, కుమారుడు శ్రీకర్ ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నివాసముంటూ అదే మండలం బాలప్పగారిపల్లిలో ఉపాధ్యాయురాలిగా శారద, అన్నమయ్య జిల్లా సోంపల్లిలో స్కూల్ అసిస్టెంట్గా వెంకట రమణ పనిచేస్తున్నారు. కీర్తన ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. శ్రీకర్ గుడివాడలోని ఓ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఉపాధ్యాయ దంపతులు నూతనంగా ఓ కారును కొనుగోలు చేశారు. తమిళనాడులోని తిరువణ్ణామలైకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ లోపు శనివారం ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. కుమార్తె కీర్తన అత్యధిక మార్కలతో ఉత్తీర్ణత సాధించడంతో ఎంతో సంతోషపడిన ఉపాధ్యాయ దంపతులు తిరువణ్ణామలైకు వెళ్లి పూజదికాలు ముగించుకుని ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో పుంగనూరు మండలం సుగాలీమిట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. శారద అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ, కుమారై కీర్తనను స్థానికులు గమనించి మదనపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, శారద అంత్యక్రియలను వెంకటరమణ స్వగ్రామం కలకడలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. మహిళా ఉపాధ్యాయురాలు మృతి భర్త, కుమార్తె పరిస్థితి విషమం -
ఘనంగా కదిరప్పస్వామి రథోత్సవం
గుంతకల్లు రూరల్: మండలంలోని నాగసముద్రం గ్రామంలో వెలసిన కదిరప్పస్వామి రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. వేకువజామునే ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహ మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి కల్యాణం జరిపించారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజల అనంతరం గోవింద నామస్మరణతో భక్తులు ముందుకు లాగారు. జీఓ 77ను రద్దు చేయాలి : పీడీఎస్యూ అనంతపురం ఎడ్యుకేషన్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి పీజీ విద్యార్థులను దూరం చేసే జీఓ 77ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురంలోని జార్జిరెడ్డి కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కె.భాస్కర్తో పాటు పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,600 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేస్తామన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో జీఓ 77 రద్దు చేస్తామంటూ ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినా ఇంతవరకూ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకుండా పాలకులు కాలయాపన చేస్తున్నారన్నారు. వీసీ నియామకాలపై యూజీసీ నూతన ప్రతిపాదనలను వ్యతిరేకించి, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని, జీఓలు 107, 108ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం పథకాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. సమావేశంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్, కోశాధికారి బండారి శంకర్, నాయకులు తేజ, ఉదయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణ పాల్గొన్నారు. ఏడుగురిపై కేసు నమోదు తాడిపత్రి టౌన్: ఈ నెల 11న తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట బంగారం వర్తకుడు గౌసుల్లా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సాయిప్రసాద్ ఆదివారం తెలిపారు. నిందితుల్లో తాడిపత్రికి చెందిన జిలాన్, రఫీ, హజీ, రసీద్, గౌస్, ఇంతియాజ్, రబ్బాన్నీ ఉన్నారని పేర్కొన్నారు. -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
తాడిమర్రి: మండల కేంద్రం తాడిమర్రిలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎనిమిది జతల వృషభాలు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో అనంతపురం జిల్లా యాడికి మండలం యంగన్నగారిపల్లి వాసుదేవరెడ్డి వృషభాలు నిర్ణీత 20 నిమిషాల్లో 1,550 అడుగులు లాగి ప్రఽథమ స్థానంలో నిలిచాయి. సోమలదొడ్డి గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి వృషభాలు 1,500 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన నాగరాజు యాదవ్ వృషభాలు 1,250 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. అనంతరం విజేత వృషభాల యజమానులకు ప్రథమ బహుమతి కింద రూ.70వేలు, ద్వితీయ బహుమతి కింద రూ.50 వేలు, తృతీయ బహుమతి కింద రూ.30 వేలుతో పాటు నాలుగో బహుమతి కింద రూ.20వేలు, ఊదో బహుమతి కింద రూ.10 వేలు చొప్పున అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువ నాయకులు తాడిమర్రి మనోజ్రెడ్డి, చెన్నారెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి, వైటీ చంద్రశేఖర్రెడ్డి, సాయినాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. నిందితుడి అరెస్ట్ నార్పల: బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నార్పల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్తో కలిసి మీడియాకు వెల్లడించారు. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన మహేష్ శుక్రవారం నార్పలలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి నిందితుడు మహేష్ను నార్పల శివారులో పోలీసులు అరెస్టు చేశారు. -
రమణీయం.. రంగనాథుడి కల్యాణం
తాడిపత్రి: జయ జయ రంగనాథస్వామి నామ సంకీర్తనలు.. వేదపండితుల వేదోక్త మంత్రాల నడుమ రంగనాథుడి పరిణయ వేడుక రమణీయంగా జరిగింది. ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, చైత్ర శుద్ధ పౌర్ణమి శనివారం ఉదయం మీన లగ్నంలో వేకువజామున 4.45 గంటలకు వజ్రవైఢూర్యాలు, బంగారు నగలు ధరించి రంగనాథుడు, నవ వధువుగా శ్రీదేవి, భూదేవిలు ముస్తాబయ్యారు. పండితులు వేద మంత్రాలు పఠిస్తుండగా, ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారికి యజ్ఞోపవీతం చేశారు. వెంటనే సకల దేవతల ఆశీస్సులతో వేద మంత్ర పఠనంతో శ్రీ వారు అమ్మవారికి, అమ్మవార్లు శ్రీ వారికి జీలకర్ర బెల్లం పెట్టిన తంతును కనులపండువగా జరిపించారు. మంగళ వాయిద్యాలు, సన్నాయి మేళాలు మోగుతుండగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల మెడలో మాంగల్యధారణ గావించారు. రంగనాథస్వామి, అమ్మవార్లకు తలంబ్రాల వేడుకను నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సాయంత్రం స్వామి వారి రథోత్సవం ఘనంగా జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలను తీసుకున్నారు. రూరల్ సీఐ లక్ష్మికాంతరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు -
మెరిసిన మట్టిలో మాణిక్యాలు
అనంతపురం ఎడ్యుకేషన్: వారు లక్షలాది రూపాయల ఫీజులు కట్టలేదు. అంతా కూలినాలి చేసుకుని కుటుంబాలను పోషించుకునే వారే. చాలామంది తల్లిదండ్రులు నిర్లక్షరాస్యులే. వారికి చదువులు లేవు కానీ పిల్లలపై గంపెడాశలైతే ఉన్నాయి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో చదివిస్తున్నారు. తమ కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చుకానీ తమ చదువుకు ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం ఆటంకం కావని నిరూపించారు ఆ విద్యార్థులు. శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాను కాదని ఎక్కడో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, కర్నూలు లాంటి నగరాల్లో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ విద్యార్థులు మార్కులు సాధించారు. వారితో పోటీపడీ మార్కులు సాధించి పలువురితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ విద్యార్థులకు వచ్చిన మార్కులు చూసి వారికి చదువులు చెప్పిన అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.... తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు. పైసా ఖర్చు లేకుండా తమ విద్యార్థులు సత్తా చాటారంటూ ప్రిన్సిపాళ్లు ధీమాగా చెబుతున్నారు. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్, ప్రైవేట్తో పోటీ ఇంటర్లో రాణించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు -
పోలీసులు వేధిస్తున్నారు!
తాడిపత్రిటౌన్: ‘పంచాయితీ’ పేరుతో పోలీసులు వేధింపులకు గురి చేయడంతో బంగారు వ్యాపారి గౌసుల్లా శుక్రవారం స్టేషన్ ఎదుటే సైనేడ్ తాగి బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. అయితే పోలీసులు తనను వేధిస్తున్న తీరు, తన కటుంబ పరిస్థి తి గురించి గౌసుల్లా కన్నీరుపెట్టుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి శనివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూ బతుకుతున్నానని, పుట్టిన పిల్లల్లోనే సంతోషం చూసుకుంటూ వారి కోసం బతుకుతున్నాని, అయితే పోలీసుల తీరు కలచివేస్తోందని చెప్పుకొచ్చాడు. ‘సార్ (పోలీసులను ఉదేశించి) మీరు ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి. వాడు మంచివాడా చెడ్డావాడా.. వాడు ఎలా బతుకుతున్నాడు తెలుసుకొని విచారించాలి. డబ్బులు తీసుకురా.. అది దొంగ బంగారు అంటే ఎలా సార్. తెలిసినవ్యక్తి బ్యాంకులో వేలంలో బంగారు పోతుంది అంటే.. వారికి సాయం చేసినట్లు ఉంటుందని ఆరోజు డబ్బులు ఇచ్చి కొన్నాను. అదే నా తప్పు అయ్యింది. అది దొంగ బంగారు అని ఎలా తెలుస్తుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తప్పక న్యాయం చేస్తాం పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న గౌసుల్లా కుటుంబానికి తప్పక న్యాయం చేస్తామని సీఐ సాయిప్రసాద్ తెలిపారు. శనివారం పట్టణంలోని పెద్దబజార్లో ఉన్న గౌసుల్లా ఇంటి వద్దకు సీఐ వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. వీఆర్కు హెడ్కానిస్టేబుల్ బంగారు వ్యాపారిని పంచాయితీ పేరుతో వేధించిన తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్ హెడ్కానిస్టేబుల్ రెహమాన్ను ఎస్పీ ఆదేశాల మేరకు వీఆర్కు పంపారు. విచారణ చేసి వాస్తవాలు తెలుసుకోండి ఆత్మహత్యకు ముందు బంగారు వ్యాపారి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ -
ఉద్యాన రైతులూ అప్రమత్తంగా ఉండండి
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, పెను గాలులు, వడగండ్లు, అకాల వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఉద్యాన తోటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని రెండు జిల్లాల ఉద్యానశాఖ అధికారులు జి.చంద్రశేఖర్, జి.ఫిరోజ్ఖాన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా పంట చేతికివచ్చే సమయం కావడంతో చీనీ, మామిడి, అరటి, బొప్పాయి, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అరటి, బొప్పాయి పంటలు నేలవాలకుండా సరైన పోట్లు ఏర్పాటు చేసుకుంటే నష్ట తీవ్రత బాగా తగ్గుతుందని తెలిపారు. తోట చుట్టూ వెలుపలి ప్రాంతంలో నీటి తడి ఇస్తే సుడిగాలి తీవ్రత బాగా తగ్గిపోతుందన్నారు. పెను గాలులకు దెబ్బతిన్న తోటల్లో వెంటనే కాయలు, గెలలు తొలగించి, కొమ్మలను బయట పడేయాలన్నారు. చీడపీడల బారి నుంచి రక్షించుకునేందుకు లీటర్ నీటికి 2.5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలన్నారు. నిల్వ ఉన్న వర్షపు నీరు ఆవిరైన తర్వాత పైపాటుగా ఎకరాకు 10 కిలోల యూరియా చల్లుకోవాలన్నారు. తోటల చుట్టూ అవిశె, సుబాబుల్ లాంటి రక్షణ పంటలు వేసుకుంటే పెనుగాలుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చన్నారు. అవకాశం ఉన్న రైతులు కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వేసవి సమస్యల నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. -
జగన్ను విమర్శించే స్థాయి నీకెక్కడది?
ఉరవకొండ: జనంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్కు లేదని శాసనమండలి ప్రివిలైజ్ కమిటీ చైర్మెన్/ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీకి తొత్తులుగా మారిన కొందరు పోలీసులను ఉద్దేశించి తప్పు చేసిన పోలీసులైన చట్టం ముందు సమానమేనని, వారి యూనిఫాం తీసేయిస్తామని వైఎస్ జగన్ వ్యాఖ్యానిస్తే... దానిని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలుగా చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్కు పటిష్ట భద్రతను అప్పటి సీఎం వైఎస్ జగన్ కల్పించారని గుర్తు చేశారు. ఈ అంశంపై అప్పట్లో ఒక్క ఆరోపణ కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా భద్రతా వైపల్యం కనిపిస్తోందన్నారు. వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనలో 1,100 మంది పోలీసులను, 200 మందిని హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంటూ భద్రతా వైపల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేవలం అభిమానులను, కార్యకర్తలను ఆపడానికి పోలీసులను మోహరించారు కానీ, మాజీ సీఎం భద్రతకు కాదనే విషయం క్షేత్ర స్థాయిలో బట్టబయలైందన్నారు. వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏ పార్టీలోనైనా మహిళల వ్యక్తిత్వాన్ని తప్పు పట్టేలావ్యాఖ్యలు చేయడం తగదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్పై ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మండిపాటు తప్పు చేస్తే పోలీసులైనా చట్టం ముందు సమానమే నేర నిరూపణ అయితే యూనిఫాం తీసేసి శిక్ష అనుభవించాల్సింది -
‘అనంత’లో జోయాలుక్కాస్ షోరూం ప్రారంభం
● ప్రదర్శనలో 150 కేజీల బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలు అనంతపురం కార్పొరేషన్: బంగారు, వజ్రాభరణాల అతి పెద్ద షోరూంల్లో ఒక్కటైన జోయాలూక్కాస్... అనంతపురంలోని రాజు రోడ్డులో తన నూతన బ్రాంచ్ను శుక్రవారం ప్రారంభించింది. జోయాలుక్కాస్ గ్రూప్ ఆఫ్ ఛైర్మన్, ఎండీ జాయ్ అలూక్కాస్తో కలసి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూరరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన జోయాలుక్కాస్ షోరూంను జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జోయాలుక్కాస్ ఎండీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 175 షోరూంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తక్కువ బరువుతో ఉన్న ప్రపంచ స్థాయి మోడల్స్తో డైమండ్, గోల్డ్, సిల్వర్ జ్యువెలరీను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అనుగ్రహ టెంపుల్ జ్యువెలరీ, ప్రైడ్ డైమండ్స్, ఎలిగంజా పోల్కి డైమండ్స్, యవ ఎన్విరిడే జ్యువెలరీ, అపూర్వ యాంటిక్ కలెక్షన్, రత్న ప్రెషన్ స్టోన్ జ్యూవెలరీ తదితర 150 కిలోల ఆభరణాలను ప్రదర్శనలో ఉంచామన్నారు. తమ ఉత్పత్తులకు రిటర్న్ విలువ ఉంటుందన్నారు. -
కలల సాకారానికి ఈ–సెట్
అనంతపురం: ఉన్నత కలలకు ఏపీ ఈ–సెట్ తొలిమెట్టుగా నిలుస్తోంది. పేరెన్నికగల కళాశాలల్లో బీటెక్, బీఈ పూర్తి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అదే ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) ద్వారా గణనీయమైన ర్యాంకు సాధిస్తే ఈ కలను సాకారం చేసుకోవచ్చు. అయితే ఈఏపీసెట్కు పోటీ అధికంగా ఉంటుంది. కానీ, మంచి కళాశాలల్లో ఇంజినీరింగ్ సీటు దక్కించుకునేందుకు ఏపీ ఈ–సెట్ మరో చక్కటి మార్గం. ఏపీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈ–సెట్)లో సత్తా చాటితే నేరుగా బీటెక్ సెకండియర్లో అడ్మిషన్ పొందవచ్చు. డిప్లొమా పూర్తి చేసిన వారు, బీఎస్సీ(మేథమేటిక్స్) పూర్తి చేసినవారు ఇందుకు అర్హులు. ఫార్మసీ కోర్సుల్లో సైతం అడ్మిషన్లు పొందడానికి ఈ–సెట్ దోహదపడుతుంది. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లోనూ సీట్లు దక్కించుకోవచ్చు. మొత్తం సీట్లలో 10 శాతం ఈ–సెట్ ర్యాంకర్లకు కేటాయిస్తున్నారు. దీంతో ఈ–సెట్ అనేది డిప్లొమా విద్యార్థులకు వరంలా మారింది. లేటరల్ ఎంట్రీ ద్వారా అవకాశం ఇంజినీరింగ్ కోర్సులో లేటర్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలోకి అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తూ నిర్వహిస్తున్న ఏపీ ఈ–సెట్–2025కు భారీగా దరఖాస్తులు అందాయి. ఈ ఏడాది మొత్తం 33,454 మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగానికి–143, బీఎస్సీ(మేథమేటిక్స్) –41, సిరామిక్ టెక్నాలజీ–3, కెమికల్ ఇంజినీరింగ్ –290, సివిల్ ఇంజినీరింగ్ –2,874, కంప్యూటర్ సైన్సెస్–10,639, ఈఈఈ–5492, ఈసీఈ–9,024, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ –54, మెకానికల్ ఇంజినీరింగ్ –4,424, మెటలార్జీ –97, మైనింగ్–66, ఫార్మసీ విభాగానికి –307 చొప్పున మొత్తం 33,454 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకునేందుకు గడువును మరింత పెంచడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ నెల 12వ తేదీ వరకు రూ.వెయ్యి అపరాధ రుసంతో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 17వ తేదీ వరకు రూ.2వేలు, 24వ తేదీ వరకు రూ.4వేలు, 28వ తేదీ వరకు రూ.10 వేల అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి మే 6వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయూకు అవకాశం ఏపీ ఈ–సెట్ను ఇప్పటి వరకూ 8 దఫాలుగా నిర్వహించే అవకాశం జేఎన్టీయూ (ఏ)కు దక్కింది. 2015 నుంచి 2020 వరకు ఏపీ ఈసెట్ను రాష్ట్ర కన్వీనర్గా ప్రొఫెసర్ పీఆర్ భానుమర్తి , 2021లో ప్రొఫెసర్ సి. శశిధర్, 2024లో ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి విజయవంతంగా నిర్వహించారు. తాజాగా ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ను ఈసెట్ కన్వీనర్గా నియమించారు. క్రేజీ కంప్యూటర్ సైన్సెస్ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్సెస్కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే ఏపీఈఏపీ సెట్లో గణనీయమైన ర్యాంక్ను సాధించాల్సి ఉంటుంది. అదే డిప్లొమో కంప్యూటర్ సైన్సెస్ పూర్తి చేసిన వారు ఈ–సెట్ ద్వారా మంచి కళాశాలల్లో కంప్యూటర్ సైన్సెస్ కోర్సు దక్కించుకోవచ్చు. గతేడాది కంటే ఈ ఏడాది ఈ–సెట్ కంప్యూటర్ సైన్సెస్ బ్రాంచ్కు దరఖాస్తులు పెరగడమే ఇందుకు కారణం. ఇంజినీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్లోకి అడ్మిషన్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు సువర్ణ అవకాశం జేఎన్టీయూ(ఏ) ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ నిర్వహణ -
బాల కార్మికులకు పునరావాసం కల్పించాలి
అనంతపురం సిటీ: జిల్లాలో బాల కార్మికులకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించి, వారికి పునరావాసం కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అంశంపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్శర్మతో కలసి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి బాల కార్మికుని ప్రొఫైల్, ట్రాక్ రికార్డు మెయింటెన్ చేయాలన్నారు. ప్రాసిక్యూషన్, మినిమం వేజెస్, బాల కార్మికులకు అందజేసిన సహాయక చర్యలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలన్నారు. ప్రతి బాల కార్మికుడిని పునరావాసం కల్పించి, తిరిగి పని ప్రదేశానికి వెళ్లకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ–శ్రమ్ పోర్టల్ ద్వారా అర్హత కలిగిన అసంఘటిత రంగ కార్మికులందరి వివరాలు నమోదు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, మున్సిపల్, ప్లాన్ అప్రూవల్ అథారిటీలందరూ ప్రతి నిర్మాణంపై మొత్తం వ్యయంలో ఒక శాతం సెస్ను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు జమ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ లలిత, డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, కార్మిక శాఖ అధికారులు లక్ష్మీ,నర్సయ్య, రాధా రమాదేవి, సుజాత, ప్రతాప్ నాయుడు, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, డీఈఓ ప్రసాద్, చేనేత శాఖ ఏడీ శ్రీనివాసరెడ్డి, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా పీడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్ట
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట్ర కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. గ్రామంలో 3 రోజుల పాటు ఆగమ శాస్త్ర సంప్రదాయాలతో పూజలు జరిగాయి. ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి రూ.30 లక్షల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆలయంలో మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరి సాంబశివారెడ్డి, ఆలూరి రమణారెడ్డి ప్రత్యేక పూజల అనంతరం నేత్రపర్వంగా సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రోటరీపురంలో ఎంతో సుందరంగా సీతారామాలయం రూపుదిద్దుకోవడం అభినందనీయమన్నారు. గ్రామంలో శనివారం రథోత్సవం నిర్వహించన్నట్లు తెలిపారు. -
ఈదురుగాలులకు రూ.8.83 కోట్ల పంట నష్టం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో వారం రోజులుగా ఈదురుగాలుల తాకిడితో వ్యవసాయ పంటలకు రూ.8.83 కోట్లు మేర నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శెట్టూరు, నార్పల, గార్లదిన్నె, అనంతపురం, శింగనమల, కంబదూరు, కణేకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, బొమ్మనహాళ్, బెలుగుప్ప, డీ.హీరేహాళ్ తదితర మండలాల పరిధిలో 51 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశామన్నారు. మొత్తంగా 881 మంది రైతులకు చెందిన 1,136 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో 659 హెక్టార్లలో మొక్కజొన్న నేలవాలడంతో 603 మంది రైతులకు రూ.5.60 కోట్లు మేర నష్టం జరిగిందన్నారు. 239 మంది రైతులకు చెందిన 383 హెక్టార్లలో వరి దెబ్బతినడంతో రూ.275 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. 39 మంది రైతులకు చెందిన 94 హెక్టార్లలో పత్తి దెబ్బతినడంతో రూ.47 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా వేశామని పేర్కొన్నారు. కుప్పకూలిన గాలిమర పుట్లూరు: ఎ.కొండాపురం వద్ద కొండలపై ఏర్పాటు చేసిన గాలిమర కుప్పకూలింది. వివరాలు ఇలా ఉన్నాయి. 1999లో బీహెచ్ఈఎల్కు చెందిన 16 గాలిమరలను కొండలపై ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులుకు ఒక గాలిమర కుప్పకూలిపోయింది. ఆ సమయంలో సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం వల్ల రూ.50 లక్షల మేర నష్టం చేకూరినట్లు సిబ్బంది చెబుతున్నారు. -
రైతులకు పరిహారం అందించాలి
రాయదుర్గం నియోజకవర్గంలో కురిసిన వడగండ్ల వర్షం, ఈదురుగాలుల బీభత్సానికి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరిహారం అందించి ఆదుకోవాలి. బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలపాలు కావడం బాధాకరం. రాయదుర్గం, గుమ్మఘట్ట, డీ హీరేహాళ్ మండలాల్లోనూ మొక్కజొన్న, ఉద్యాన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రతి రైతుకూ న్యాయం చేకూర్చేలా కలెక్టర్కు విజ్ఞప్తి చేశాం. – మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం -
11 మండలాల్లో నీటిమట్టం తగ్గుముఖం
అనంతపురం అగ్రికల్చర్: భూగర్భజలాల పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తున్నా.. 11 మండలాల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. భూగర్భజలశాఖ తాజాగా 97 ఫిజోమీటర్ల నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం జిల్లా సగటు నీటిమట్టం 11.86 మీటర్లుగా నమోదైంది. సగటు నీటి మట్టం కన్నా 11 మండలాల్లో భూగర్భజలాలు కాస్తంత తగ్గుముఖం పట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ వర్షపు సంవత్సరంలో ఇప్పటి వరకు 463.1 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉడగా 30.3 శాతం అధికంగా అంటే 603.6 మి.మీ నమోదైంది. దీంతో పాతాళగంగ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా అంతటా 40.94 టీఎంసీలు అందుబాటులో ఉండగా అందులో 14.45 టీఎంసీలు వినియోగిస్తున్నారు. ఇంకా 26.49 టీఎంసీల భూగర్భజలాలు మిగులు కింద ఉన్నట్లు ఆ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. డేంజర్ జోన్లో నార్పల అత్యధిక నీటివినియోగం కలిగిన నార్పల మండలం పూర్తి డేంజర్ జోన్లో ఉంది. అలాగే బ్రహ్మసముద్రం, డీ.హీరేహాళ్, కళ్యాణదుర్గం, కూడేరు, కుందుర్పి, పామిడి, పుట్లూరు, శెట్టూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లో కూడా నీటి వినియోగం అధికంగా ఉండటంతో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. 20 మండలాల్లో ఫిజోమీటర్ల ద్వారా 8 నుంచి 20 మీటర్లలో నీటిమట్టం కనిపిస్తోందని చెబుతున్నారు. ● జిల్లా వ్యాప్తంగా బోరుబావులు 1,87,610 వినియోగిస్తుండగా, భూమి, నీరు, చెట్టు చట్టం (వాల్టా) కింద 13 గ్రామ పంచాయతీల్లో బోరుబావుల తవ్వకాన్ని నిషేధించారు. వేసవి కావడం వల్ల ఏప్రిల్, మే నెలల్లో మరింత తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నందున జూన్ నుంచి తిరిగి భూగర్భజలాలు పెరగవచ్చని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 13 గ్రామపంచాయతీల్లోబోరుబావుల తవ్వకం నిషేధం జూన్లో భూగర్భజలాలు పెరిగే చాన్స్ -
వడగండ్ల వాన.. ఈదురుగాలులు
● దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలు ● అన్నదాతలకు కోలుకోలేని దెబ్బ ● విరిగి పడిన భారీ వృక్షాలు ● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలుయర్రగుంట గ్రామం వద్ద నేలకొరిగిన వరి పంట రాయదుర్గం/కణేకల్లు/ బొమ్మనహాళ్/ బెళుగుప్ప/ కూడేరు/ బ్రహ్మసముద్రం/ శింగనమల: జిల్లా వ్యాప్తంగా గాలీవాన బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం, శుక్రవారం వడగండ్ల వాన, ఈదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. కణేకల్లు మండలంలోని యర్రగుంట, గెనిగెర, కణేకల్లు, గంగలాపురం, బ్రహ్మసముద్రం గ్రామాల్లో గురువారం రాత్రి వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. వడగండ్లు, ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు సుమారు రూ.13.97 కోట్ల మేర నష్టం వాటిల్లింది. యర్రగుంటలో తెల్లారితే వరికోత చేసేందుకు సిద్ధం కాగా... రాత్రికి రాత్రే వడగండ్ల వాన కురిసి పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని రైతులు జగన్నాథం, లింగారెడ్డి, వాల్మీకి వండ్రప్ప, కురుబ తిప్పేస్వామి, కె.ఎర్రిస్వామి, కురుబ ఆదెప్ప, బోయ వండ్రప్ప ఆందోళన వ్యక్తం చేశారు. గోపులాపురంలో బసవరాజుకు చెందిన 6 ఎకరాల్లో అరటితోట, బి.నవీన్ 8, రామక్రిష్ణకు చెందిన 6 ఎకరాల్లో అరటితోట దెబ్బతింది. బొమ్మనహాళ్ మండలం శ్రీధరఘట్ట, గోనేహాళ్, లింగదహాళ్, ఉద్దేహాళ్, ఉప్పరహాళ్, దేవగిరి, ఉంతకల్లు, బండూరు, లింగదహాళ్ తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో కోత దశకు వచ్చిన వరితో పాటు మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, అక్కడక్కడ చెట్లు కూడా నేలకొరిగాయి. రాయదుర్గం మండలంలోనూ పంటలు దెబ్బతిన్నాయి. బెళుగుప్ప మండలంలోని బెళుగుప్ప, బెళుగుప్ప తండా, నక్కలపల్లి, గుండ్లపల్లి, రమనేపల్లి, బ్రాహ్మణపల్లి, యలగలవంక, శీర్పి, గంగవరం, దుద్దేకుంట, అంకంపల్లి, ఆవులెన్న, రామసాగరం, రమనేపల్లి తదితర గ్రామాల్లో 650 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 50 ఎకరాల్లో అరటి తదితర పంటలు ఈదురుగాలులకు నేలవాలాయి. ఇంకా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు పడిపోయాయి. ఇదిలా ఉండగా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టం అంచనా వేశారు. బొమ్మనహాళ్ మండలం గోనేహాళ్ వద్ద దెబ్బతిన్న వరి పంట పొలాలను ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ, నాగిరెడ్డిపల్లి, గుండిగానిపల్లి, ఎర్రకొండాపురం తదితర గ్రామాల్లో బొప్పాయి, అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. కూడేరు మండలం కడదరగుంట, పి.నారాయణపురం, ఎంఎం హళ్లి, మరుట్ల–1, 2, 3 కాలనీలు, చోళసముద్రం, ముద్దలాపురం, మరికొన్ని గ్రామాల్లో పెనుగాలులకు అరటి, మొక్కజొన్న, బ్యాడిగి మిర్చి తదితర పంటలు దెబ్బతిన్నాయి. శింగనమల మండలంలో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. తరిమెలలో శుక్రవారం సాయంత్రం గాలీవానకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్లపై అడ్డంగా పడిపోయాయి. -
పూలే ఆశయాలు కొనసాగించాలి
అనంతపురం సిటీ: మహాత్మ జ్యోతిబా పూలే ఆశయలు కొనసాగించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా పరిషత్ క్యాంపస్లో గల ఆయన విగ్రహానికి శుక్రవారం మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కలెక్టర్ వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఆర్డీఓ గుత్తా కేశవనాయుడు, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, డీటీడబ్ల్యూఓ బోయ రామాంజనేయులు పాల్గొన్నారు. అనంతపురం అర్బన్: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూభవన్లో నిర్వహించిన జ్యోతిబా పూలే జయంతిలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ వినోద్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై నివాళులర్పించారు. -
బీసీల ప్రయోజనాలకు కూటమి విఘాతం
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం బీసీల ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలు చేపడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి అనంత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావ్ పూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. దురాచారాలను రూపుమాపేందుకు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. పూలే స్ఫూర్తితో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. బడుగు, బలహీనల వర్గాలు అన్ని విధాలా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నారన్నారు. విద్యలో నూతన సంస్కరణలు తీసుకువచ్చి, పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేలా చూశారన్నారు. మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పించి, స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో 50 శాతంకుపైగా రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం బడుగులను నట్టేట ముంచుతోందన్నారు. ఎన్నికలకు ముందు అలివిగాని హామీలను ప్రకటించి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్తో కాలయాపన చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా బడుగులకు మేలు చేసేలా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. పూలే ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, విజయభాస్కర్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, అనుబంధ సంఘాల అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, శ్రీదేవి, వైపీ బాబు, అమర్నాథ్రెడ్డి, నేతలు ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, పెన్నోబులేసు, మాల్యవంతం మంజుల, మీసాల రంగన్న, పామిడి వీరాంజనేయులు, కేశవరెడ్డి, తలారి వెంకటేష్, చింతకుంట మధు, అనిల్కుమార్ గౌడ్, ఆసిఫ్, రాధాకృష్ణ, సాదిక్, కార్పొరేటర్లు రహంతుల్లా, రాజేశ్వరి, దుర్గాదేవి, సుమతి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
నేరాల నియంత్రణలో డ్రోన్ కెమెరాలను వినియోగించండి
అనంతపురం: నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలను విస్త్రృతంగా వినియోగించాలని సిబ్బందిని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. జిల్లాలో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్తి సంబంధిత నేరాలు, ఇతర కేసుల నమోదు, ఛేదనలపై సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. సీడీ ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం పామిడి సీఐగా పనిచేస్తున్న యుగంధర్ 2022లో రాయదుర్గం సీఐగా పనిచేశారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గ్యాంగ్ల నుంచి 24 తుపాకులు సీజ్ చేశారు. ఇందుకు గాను సీఐ యుగంధర్కు మంజూరైన డీజీపీ డిస్క్ అవార్డును ఎస్పీ అందజేసి, అభినందించారు.పెనుకొండ డీఎస్పీగా నరసింగప్పపెనుకొండ: పెనుకొండ డీఎస్పీగా నరసింగప్ప నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు పోలీస్ హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా డీఎస్పీగా నియమితులైన నరసింగప్పకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది.‘ఈ–శ్రమ్’లో నమోదు చేసుకోండిఅనంతపురం సిటీ: జొమాటో, అమేజాన్, ఫ్లిప్కార్ట్, బ్లూడాట్, ఈ–కార్ట్ తదితర ఈ కామర్స్ సంస్థల్లో పని చేసే కార్మికులు ఈ–శ్రమ్లో సభ్యత్వం కోసం వివరాలు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ సహాయ కార్మిక కమిషనర్ ఎస్ఎన్ లావణ్య సూచించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై ఈ నెల 17వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా అన్ని కార్మిక శాఖ కార్యాలయాల్లోనూ అవగాహన కల్పిస్తామన్నారు. సందేహాల నివృత్తి కోసం 94925 55188 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఐ–టీడీపీ కార్యకర్త కిరణ్పై కఠిన చర్యలకు డిమాండ్
అనంతపురం: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబసభ్యుల ప్రతిష్టకు భంగం కలిగేలా అత్యంత హేయకరమైన వ్యాఖ్యలు చేసిన ఐ–టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా, మహిళా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం టూ టౌన్ పోలీస్స్టేషన్ సీఐ శ్రీకాంత్ యాదవ్కు సోషల్ మీడియా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ షేక్ బాబా సలామ్, సంయుక్త కార్యదర్శి మన్ప్రీత్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు నరేంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, అధికార ప్రతినిధి కృష్ణవేణి గురువారం ఫిర్యాదు చేశారు. పాయింట్బ్లాక్ టీవీ(పీబీ టీవీ) అనే యూట్యూబ్ ఛానల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఆత్మాభిమానం దెబ్బతీనేలా చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ చర్యల వల్ల దేశ, విదేశాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న కోట్లాది మంది అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఉద్ధేశ్యపూర్వకంగానే హైదరాబాద్లో ఈ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని, సదరు యూట్యూబ్ ఛానల్ ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకున్న పెయిడ్ ప్రిపరేషన్ లేబరేటీల ద్వారా ఇలాంటి నీచమైన వీడియోలు తయారు చేసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఆధ్వర్యంలోనే ఐ–టీడీపీ లాంటి సంస్థలు ఈ పోస్టింగ్లను తయారు చేసి, వాటిని మార్ఫింగ్ చేసి, తప్పుడు సమాచారంతో ప్రజలను పెడదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారన్నారు. తమ నాయకుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారితో పాటు వారిని ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కులమతాలు, వర్గాల మధ్య వైషమ్యాలు, విభేదాలు పెంచి రాష్ట్రంలో అశాంతిని, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ఐ–టీడీపీ సభ్యుల పోస్టింగ్లపై సమగ్రంగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐ–టీడీపీ సభ్యుడు చేబ్రోలు కిరణ్కుమార్, అతన్ని ఇంటర్వ్యూ చేసిన యాంకర్, పాయింట్బ్లాక్ ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు -
పాలిటెక్నిక్ కళాశాలకు ఉపకరణాల వితరణ
అనంతపురం: ఉరవకొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు రూ.40 లక్షల పరికరాలను కియా కంపెనీ సమకూర్చింది. ఈ మేరకు ఉరవకొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆష్రఫ్ఆలీ, కియా ఇండియా కంపెనీ ఉన్నత సలహాదారు యోన్గిల్మా సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (కంపెనీ సామాజిక బాధ్యత) కింద ఈ పరికరాలను అందజేయనున్నారు. దీంతో అనంతపురం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పయ్యావుల కేశవ్ను ప్రిన్సిపాల్ ఆష్రఫ్ ఆలీ, ఈఈఈ విభాగాధిపతి వై. సురేష్ బాబు తదితరులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పీసీ ప్యాపిలిలో చిరుత సంచారం ● భయాందోళనలో గ్రామస్తులు వజ్రకరూరు: మండల పరిధిలోని పీసీ.ప్యాపిలి పరిసర ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామ సమీపంలోని ‘తురాత్ కొండ’ను అవాసంగా చేసుకుని చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రెండు, మూడురోజులుగా చిరుత ఉదయం, సాయంత్రం వేళల్లో అటూ ఇటూ తిరుగుతోంది. అటువైపు వెళ్లిన కొందరు చిరుత సంచారాన్ని సెల్ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీంతో ‘తురాత్ కొండ’ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఏ సమయంలో ఎవరిపై దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ దగ్గర పడటంతో రైతులు పొలాలను చదును చేసేకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో చిరుత సంచారం రైతులు, గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. అటవీశాఖ అధికారులు తక్షణం స్పందించి తగుచర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలు
నిషేధిత పొగాకు ఉత్పత్తుల గురించి సమాచారం వచ్చిన వెంటనే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. ప్రత్యక్షంగా.. పరోక్షంగా గుట్కా అక్రమ వ్యాపారానికి సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. గుట్కా వ్యాపారుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఇప్పటివరకు గుట్కా విక్రయిస్తూ పట్టుబడిన వారందరిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాం. గుట్కా విక్రయాలపై పోలీసులతో ప్రజలు సహకరించాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – వి.రత్న, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ -
కూలీల సంఖ్య పెంచాలి
బొమ్మనహాళ్: ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని డ్వామా పీడీ సలీంబాషా సూచించారు. మండలంలోని నేమకల్లు, లింగదహాళ్, కొలగానహళ్లి గ్రామాల్లో ఉపాధి హామీ కింద జరుగుతున్న సీసీ రోడ్లు, గోకులంషెడ్లు, అవని ఫ్లాంటేషన్ పండ్ల మొక్కల పెంపకం, పశువుల తొట్టె నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. పీడీ మాట్లాడుతూ నేమకల్లులో సీసీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యత ఉండాలని ఆదేశించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు, ఎంపీడీఓ విజయభాస్కర్, పీఆర్ రాజ్ జేఈఈ జగదీష్, ఏపీఓ భాగ్యలక్ష్మి, టెక్నికల్ అసిస్టెంట్లు బ్రహ్మయ్య, నాగేంద్ర పాల్గొన్నారు. పిడుగుపాటుకు గొర్రెలు, మేకల మృతి గార్లదిన్నె: పెనకచెర్ల గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగుపడి గొర్రెలు, మేకలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన రైతు చితంబరప్ప తమ గొర్రెలు, మేకలను పొలాల్లో మేపుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో గాలీవాన, ఉరుములు, మెరుపులు అధికమయ్యాయి. దీంతో వాటిని సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద చెట్టు కిందకు వదిలాడు. చితంబరప్ప గుడి వద్ద నిల్చున్నాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో 8 గొర్రెలు, 2 మేకలు మృతి చెందాయి. దాదాపు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. -
జగన్కు భద్రత కల్పించడంలో ఘోర వైఫల్యం
వజ్రకరూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన వజ్రకరూరులో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరి, అధికార పార్టీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్ అని, ఆయన పర్యటనకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారని తెలిపారు. మూడు రోజల క్రితం శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో జరిగిన వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. జగన్కు భద్రత కల్పించడం కంటే పర్యటనకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాకుండా పోలీసుల చేత అడ్డుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. 400 కేవీ లైన్ల మధ్యలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడంపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. వీటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన తీరు, ఎంపిక చేసిన స్థలాన్ని బట్టి చూస్తే అక్కడ ప్రజలను నియంత్రించడం సాధ్యం కాదని తెలుస్తుందని, హెలిప్యాడ్ సురక్షితమైన ప్రదేశంలో కాకుండా బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయడం అనేక సందేహాలను లేవదీస్తోందని పేర్కొన్నారు. పాపిరెడ్డిపల్లి సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని పరిశీలిస్తే జగన్కు అసాంఘిక శక్తులు హాని తలపెట్టే ప్రమాదం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. హెలిప్యాడ్ వద్ద ఇన్చార్జ్గా ఉన్న సీనియర్ డీఎస్పీ ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరించి ప్రజలను నియంత్రించలేక చేతులెత్తెశారని ఆరోపించారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగా పోలీస్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించలేకపోయారని వెల్లడించారు. వైఎస్ జగన్ పర్యటనలో జరిగిన తప్పిదాలు, భద్రత గురించి మాట్లాడకుండా అధికార పార్టీ నాయకులు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు. పోలీస్ అధికారులు మాజీ సీఎం పట్ల పరిధి దాటి రాజకీయ నాయకుల్లా మాట్లాడటం సరికాదన్నారు. మంత్రి పయ్యావుల వ్యాఖ్యలు హాస్యాస్పదం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాజీ సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగాను, ఒకింత ఆశ్చర్యకరంగాను ఉన్నాయని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గతంలో పోలీసుల పట్ల, పోలీస్ అధికారుల పట్ల నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేసిన అనుచిత వాఖ్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం చాలామంది పోలీస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని, అనేక మంది పోలీస్ అధికారులపై కేసులు పెట్టి ఇళ్ల వద్దనే ఉండేలా చేస్తున్న విషయం మరిచారా అని మంత్రి పయ్యావులను ప్రశ్నించారు. ఉరవకొండ నియోజకవర్గంలో కూడా పోలీసుల చేత పాలన సాగించాలని చూస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఏదైనా వ్యా పారం చేసుకోవాలంటే మంత్రి సోదరుడు పయ్యావుల శ్రీనివాసులును కలవాలంటూ పోలీసుల చేత చెప్పిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఇలాంటి పనులు చేయడం వల్ల సమాజంలో వారికున్న గౌరవం తగ్గుతుందన్నారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందు, ఉరవకొండ మండల కోఆర్డినేటర్ ఓబన్న, మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు ఉస్మాన్, యువజన నాయకుడు శశాంక్రెడ్డి, సర్పంచులు మోనాలిసా, మల్లెల జగదీష్, వజ్రకరూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు రవికాంతరెడ్డి, సీనియర్ నాయకులు ప్యాపిలి కిష్ట, రాకెట్ల బాబు, భరత్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ప్రభుదాస్, భీమా, పట్టా ఖాజాపీరా తదితరులు పాల్గొన్నారు. ప్రజలను రాకుండా అడ్డుకోవడానికే పోలీసుల ప్రాధాన్యత అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే విధుల్లో అలసత్వం హెలిప్యాడ్కు ఎంపిక చేసిన స్థలంపై ప్రజల్లో సందేహాలు భద్రతను గాలికొదిలేసి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు పోలీస్ అధికారులు రాజకీయనాయకుల్లా మాట్లాడటం సరికాదు మంత్రి పయ్యావుల మాట్లాడినతీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి -
బాబు ద్వంద్వ వైఖరిని ఎవ్వరూ నమ్మరు
అనంతపురం కల్చరల్: ముస్లిం మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎవ్వరూ నమ్మబోరని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా యూజేఏసీ (యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు రిలే నిరాహారదీక్షలు చేశారు. గురువారం నగరంలోని టవర్క్లాక్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన దీక్షలకు అనంత సంఘీభావం తెలియజేసిన అనంతరం మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ వైఎస్సార్సీపీ వ్యతిరేకంగా ఓటు వేసిందని, తమ పార్టీ లౌకికవాదానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బిల్లును సమర్థించిన టీడీపీ నాయకులు.. పార్లమెంటులో బీజేపీకి అనుకూలంగా ఉంటూ పైకి మాత్రం ముస్లింలను నమ్మించడానికి వైఎస్సార్సీపీ వైఖరిని తప్పుపడడ్డం వారి దిగుజారుడుతనానికి నిదర్శనమన్నారు. మతోన్మాద రాజకీయాలకు దేశంలో చోటు ఉండకూడదని, టీడీపీ, జనసేన చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వక్ఫ్ సవరణ బిల్లు దేశానికి ప్రమాదకరమని, ఒక వర్గం వారిని టార్గెట్ చేసినట్లుండే బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. మేయర్ వసీం మాట్లాడుతూ ముస్లింలతో చర్చలు జరపకుండానే బిల్లును ఏకపక్షంగా తీసుకువచ్చారని, సవరణ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశం ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, కాంగ్రెస్ నాయకుడు దాదా గాంధీ, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీం అహ్మద్, వక్ఫ్బోర్డు జిల్లా మాజీ అధ్యక్షులు కాగజ్ఘర్ రిజ్వాన్, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ ఏకేఎస్ ఫయాజ్, జేఏసీ నాయకులు కేవీ రమణ, సాకే హరి తదితరులు వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మత రాజకీయాలను ఖండించారు. రిలే నిరాహార దీక్షలకు కార్పొరేటర్లు ఇషాక్, రహంతుల్లా, వైఎస్సార్సీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి అబూజర్ నదీం, దాదు, జావీద్, ఖాజా హుస్సేన్, మునీరా, గ్రీవెన్స్ అధ్యక్షులు బాకే హబీబుల్లా, అడ్వొకేట్ రసూల్, మునిసిపల్ మాజీ చైర్మన్ నూర్మహ్మద్, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, నాయకులు గోల్డ్బాషా, ఐఎంఎం మహబూబ్ బాషా, తాజ్, కాంగ్రెస్ నాయకులు ఇమామ్, ఎమ్మార్పీఎస్ సామ్రాట్, డాక్టర్ చంద్రశేఖర్, మధు సంఘీభావం ప్రకటించారు. నిరసన దీక్షల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
నాణ్యమైన మద్యంతో ప్రజారోగ్యానికి పెద్దపీట
అనంతపురం: నాణ్యమైన మద్యాన్ని అందిస్తూ ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనంతపురం సమీపంలోని సోములదొడ్డి గ్రామంలో రూ.11.10 కోట్లతో నూతనంగా నిర్మించిన ఐఎంఎఫ్ఎల్ డిపో గోడౌన్ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మద్యం పాలసీని పరిశీలించి ఏపీలో నూతన పాలసీ తీసుకొచ్చామన్నారు. మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు నుంచే ప్రభుత్వానికి సుమారు రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రాష్ట్ర సాధారణ పరిపాలన, పొలిటికల్, రెవెన్యూ(ఎకై ్సజ్) శాఖల ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్మీనా మాట్లాడుతూ 2016లో ఇక్కడ బాట్లింగ్ ప్లాంట్ కాలిపోయి సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.9 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఘటన తర్వాత ఇన్సూరెన్స్ క్లైం చేశామన్నారు. అనంతరం అధునాతన గోడౌన్ నిర్మించేలా మంత్రి ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, బండారు శ్రావణిశ్రీ, దగ్గుపాటి ప్రసాద్, జాయింట్ కమిషనర్ అనసూయదేవి, ఏపీఎస్బీసీ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రవణ్కుమార్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.రామ్మోహన్రెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు పాల్గొన్నారు. -
రౌడీషీటర్ బరితెగింపు
● రస్తా విషయంలో తప్పుడు ఫిర్యాదు ● దళితుడిని స్టేషన్కు పిలిపించిన పోలీసులు ● నిన్ను నరికితే దిక్కెవడంటూ ఖాకీల సమక్షంలోనే బెదిరింపు ● బాధితుడి ఫిర్యాదుతో 20 రోజుల తర్వాత రౌడీషీటర్పై కేసు నమోదు తాడిపత్రిటౌన్(యాడికి): అధికారం మాది.. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికితే దిక్కెవడంటూ ఓ దళితుడిని స్టేషన్లోనే బెదిరించిన టీడీపీకి చెందిన రౌడీషీటర్పై ఫిర్యాదు చేసిన 20 రోజుల తర్వాత యాడికి పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. యాడికి మండలం పచ్చారుమేకలపల్లికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదినారాయణపై టీడీపీకి చెందిన రౌడీషీటర్ పరిమి చరణ్ రస్తా విషయంలో గత మార్చి 19న పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పోలీసులు విచారణ నిమిత్తం ఆదినారాయణను స్టేషన్కు పిలిపించారు. పోలీసుల ఎదుటే రౌడీషీటర్ రెచ్చిపోయాడు. కులం పేరుతో దూషిస్తూ ‘అధికారం మాదే.. నిన్ను ఇక్కడే (పోలీస్స్టేషన్ ముందే) ముక్కలు ముక్కలుగా నరికితే నీకు దిక్కెవడు’ అంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయమై బాధితుడు ఆదినారాయణ పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశాడు. అయితే ఆ రౌడీషీటర్పై కేసు మాత్రం నమోదు చేయలేదు. ఇదే విషయంపై ఈ నెల 4న రెండోసారి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తనకు న్యాయం చేయాలని తాడిపత్రిలో ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరికి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు యాడికి పోలీసుల తీరునూ విన్నవించాడు. ఏఎస్పీ స్పందిస్తూ కేసు నమోదు చేయాలని యాడికి పోలీసులను ఆదేశించారు. అయితే సీఐ ఈరన్న, ఎస్ఐ రమణలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ వచ్చారని బాధితుడు ఆదినారాయణ వాపోయాడు. 20 రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో రౌడీషీటర్కు సహకరించే ధోరణి వీడకుంటే స్టేషన్ ఎదుట ఆందోళనకు సిద్ధమవుతానని సీఐకి తెలిపారు. దీంతో బాధితుడి నుంచి బుధవారం రాత్రి మరోసారి ఫిర్యాదు తీసుకుని రౌడీషీటర్ పరిమి చరణ్పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారు. -
కమ్మూరు వెల్నెస్ సెంటర్కు జాతీయస్థాయి గుర్తింపు
కూడేరు: మెరుగైన వైద్య సేవలందించిన కమ్మూరు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గత ఏడాది జూలై 16న జాతీయస్థాయి అధికారులు కమ్మూరు హెల్త్ సెంటర్ను పరిశీలించారు. సెంటర్లో అందుతున్న వైద్య సేవలపై ప్రజలతో ఆరా తీశారు. సేవలు బాగా అందిస్తుండడంతో జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపునకు ఎంపిక చేశారు. గురువారం డీఎంహెచ్ఓ భ్రమరాంబదేవి చేతుల మీదుగా హెల్త్ సెంటర్ సీహెచ్ఓ జయ జాతీయస్థాయి సర్టిఫికెట్ అందుకున్నారు. సెంటర్కు గుర్తింపు తెచ్చినందుకు మండల వైద్యాధికారి సౌమ్యారెడ్డి, సీహెచ్ఓ జయ, ఏఎన్ఎం మాధవి, ఆశా వర్కర్లు శ్రీదేవి, ఆదెమ్మ, మీనాక్షి, చంద్రకళను అభినందించారు. భర్తను కడతేర్చిన భార్యకు జీవిత ఖైదు అనంతపురం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చిన కేసులో భార్యకు జీవితఖైదు విధిస్తూ అనంతపురం 7వ సెషన్స్ అడిషనల్ జడ్జి కోర్టు తీర్పు వెలువరించింది. అనంతపురంలోని అశోక్నగర్కు చెందిన రాజేంద్రప్రసాద్, యల్లనూరు మండలం శింగవరం గ్రామానికి చెందిన బత్తిని సుమకుమారికి 17 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరి కాపురం కొన్ని రోజులు సవ్యంగా జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి భర్త మందలించాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించేందుకు 2021 నవంబర్ రెండో తేదీ రాత్రి 7 గంటల సమయంలో రోకలి బండతో కొట్టింది. దీంతో రాజేంద్రప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు. హతుని అన్న విజయకుమార్ ఫిర్యాదు మేరకు అప్పటి వన్టౌన్ సీఐ డి.ప్రతాప్రెడ్డి కేసు నమోదు చేశారు. అనంతపురం అడిషనల్ 7వ సెషన్స్ జడ్జి కోర్టులో చార్జ్షీటు దాఖలు చేశారు. జడ్జి హరిత గురువారం 15 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో సుమకుమారికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. పీపీ నాగరాజ బాబు ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. అప్పటి వన్టౌన్ సీఐ ప్రతాప్రెడ్డి, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ సీఐ వెంకటేష్ నాయక్, వన్టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, కోర్టు లైజన్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఎస్ఐ సునీల్కుమార్లు సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టి ముద్దాయికి శిక్షపడేలా తమ వంతు కృషి చేశారు. వీరందరినీ ఎస్పీ అభినందించారు. పనులు వేగవంతం చేయాలి అనంతపురం అర్బన్: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన్, పీఎంశ్రీ ఫేజ్–1 ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ సెక్టార్కు సంబంధించిన పనులపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఈలు, ఈఈలు, డీఈఈలు, ఇతర అధికారులతో సమీక్షించారు. ప్రధాన మంత్రి సడక్ యోజన కింద గ్రామాలకు రహదారులు నిర్మించే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తయిన పనుల ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలన్నారు. పీఎంశ్రీ ఫేజ్–1 పనులకు సంబంధించి ఆటస్థలాలు, గ్రంథాలయలు, కంప్యూటర్ గదులు, కిచెన్ గార్డెన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్ఓ ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ పనులకు సంబంధించి నివేదికలు సిద్ధం చేస్తే త్వరితగతిన నిధుల మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో పీఆర్ ఎస్ఈ జహీర్ అస్లాం, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మురళీధర్ శర్మ, ఏపీఎస్ఎంఐడీసీ ఈఈ శ్రీనివాసనాయుడు, ఏఎంసీ ఎస్ఈ చంద్రశేఖర్, పీహెచ్ ఈఈ ఆదినారాయణ, ఎస్ఎస్ఏ ఈఈ శంరయ్య, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు. -
బెళుగుప్పలో అర్జీల కుప్ప
● ‘ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వినతుల వెల్లువ ● అన్నింటినీ పరిష్కరిస్తాం: మంత్రి కేశవ్ బెళుగుప్ప: మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ‘ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు అర్జీలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ వినోద్కుమార్ తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో ఏకంగా 713 వినతులు అందడం గమనార్హం. రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, ఇళ్ల మంజూరు, భూ సమస్యలతో పాటు రహదారుల నిర్మాణాలు, గ్రామాభి వృద్ధికి సంబంధించిన వినతులే ఎక్కువగా ఉన్నాయి.అర్జీల స్వీకరణ అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామన్నారు. హంద్రీ–నీవా కాలువ వెడల్పుకు రూ.3,800 కోట్ల నిధులను కేటాయించి 70 రోజుల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. ఒకే సారి హంద్రీ–నీవా కాలువలోకి 12 మోటార్లు పంపింగ్ చేయవచ్చన్నారు. అంతకుముందు రూ.1.75 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని, రూ.50 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కేంద్రాన్ని, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.16.7 లక్షలతో నిర్మించిన రహదారిని మంత్రి ప్రారంభించారు. బెళుగుప్ప కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ వసంతబాబు, డీఎంహెచ్ఓ ఈబీ దేవి, తహసీల్దార్ షర్మిళ, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, వైద్యాధికారులు కార్తీక్రెడ్డి, ప్రియాంక, ఎంఈఓ మల్లారెడ్డి, కేజీబీవీ ఎస్ఓ నాగరత్న, ఎంపీపీ పెద్దన్న, సర్పంచ్ సాలీబాయి, వైస్ ఎంపీపీ పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. -
వావ్.. చాలా బాగుంది!
ఫుట్పాత్ పొడవునా తాటిముంజల విక్రయాలు చేపట్టిన దృశ్యంఐస్ ఆపిల్గా పిలిచే తాటిముంజలను నోట్లో పెట్టుకోగానే.. ’వావ్.. చాలా బాగుంది’ అని మనకు తెలియకుండానే మాట జారిపోతుంటుంది. వేసవిలో మాత్రమే లభించే ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య శాస్త్రవేత్తలు అంటుంటారు. ఇంతటి అమృత ఫలాన్ని గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు అనంతపురంలోని వైద్య కళాశాల ఎదురుగా ఫుట్పాత్పై పెట్టుకుని విక్రయిస్తున్నారు. కొనుగోలుదారుల సమక్షంలోనే తాటికాయ గెలల నుంచి తాజా ముంజలను వేరు చేసి ఇవ్వడం వీరి ప్రత్యేకత. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
డీఎస్సీ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం రూరల్: డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా అందజేస్తున్న ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ ఉప సంచాలకులు సుమన జయంతి కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాల కోసం 08554– 275575లో సంప్రదించవచ్చు. మహిళపై దేవర దున్నపోతు దాడి గుత్తి: మండల పరిధిలోని శ్రీపురం (కొజ్జేపల్లి) గ్రామానికి చెందిన అనంతమ్మపై మంగళవారం రాత్రి దేవర దున్నపోతు దాడి చేసింది. ఇంటి బయట నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన అనంతమ్మను కుటుంబ సభ్యులు తొలుత గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వివాహితపై అత్యాచార యత్నం పుట్టపర్తి టౌన్: కొత్తచెరువు మండలం ఎర్రపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన యువకుడు చంద్ర అత్యాచారయత్నం చేశాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వరి కల్లాల వద్ద ఉన్న ఒంటరిగా వివాహితను గమనించిన చంద్ర అత్యాచారం చేయబోతే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ సమయంలో ఆమె గొంతు, మెడపై దాడి చేసి యువకుడు పరారయ్యాడు. బుధవారం ఉదయం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
జెడ్పీలో 10 మందికి పదోన్నతి
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న పది మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరికి ఉత్తర్వులను బుధవారం తన చాంబర్లో జెడ్పీసీఈఓ రామచంద్రారెడ్డితో కలసి చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అందజేశారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న డి.మాధవి చౌదరికి పదోన్నతి కల్పిస్తూ తిరిగి జెడ్పీనే కేటాయించారు. ఇదే కార్యాలయంలో పని చేసే బి.సుశీలాదేవిని పెనుకొండలోని పీఆర్ క్యూసీ సబ్ డివిజన్కు, కె.రమాదేవిని చిలమత్తూరు మండల పరిషత్ కార్యాలయానికి, విజయవాడలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఎం.అరుణశ్రీని యల్లనూరు మండల పరిషత్ కార్యాలయానికి కేటాయించారు. తగరకుంట హైస్కూల్లో పని చేస్తున్న పి.షాహీనా బేగంను రొద్దం మండల పరిషత్ కార్యాలయానికి, పుట్టపర్తి మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే జి.రవీంద్రను పుట్టపర్తి పీఆర్ అనుబంధ పీఐయూ సబ్ డివిజన్కు, సిద్ధరాంపురం జెడ్పీహెచ్ఎస్లో పని చేసే జె.సుబ్రహ్మణ్యంను లేపాక్షి మండల పరిషత్ కార్యాలయానికి పోస్టింగ్ ఇచ్చారు. ఎద్దులపల్లి జెడ్పీహెచ్ఎస్లో పని చేసే పి.ఉమామహేశ్వరరెడ్డిని గుత్తిలోని ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్కు, నాగసముద్రం జెడ్పీహెచ్ఎస్లో పని చేసే వి.విశ్వనాథ్ను మడకశిర పీఆర్ఐ సబ్ డివిజన్కు, రాయదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే పి.మహేష్ను కణేకల్లు మండల పరిషత్ కార్యాలయానికి పదోన్నతిపై బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందజేశారు. -
రైల్వే సమస్యలను పరిష్కరించాలి
గుంతకల్లు: రైల్వేలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చేయూతనివ్వాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక డీఆర్ఎం కార్యాలయంలోని మీటింగ్ హాల్లో 66వ డివిజినల్ యూజర్స్ కన్సలేటివ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్త అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతోపాటు డివిజన్ పరిధిలోని డీఆర్యూసీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో రైల్వే పరమైన అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ముద్దనూరు–ముదిగుబ్బ మధ్య 65 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ మార్గం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. తద్వారా కడపలోని పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులకు, రైతులు పండించిన పంటలు ఇతర ప్రాంతాలకు తరలించడానికి రవాణామార్గం ఎంతగానో ఉపయోగపడుతుందన్నా రు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ నిరంతరాయంగా రిజర్వేషన్ కౌంటర్లు ఉండేలా చూడాలన్నారు. కరోనా సమయంలో రద్దయిన విజయవాడ–బెంగుళూరు, తిరుపతి–హుబ్లీ ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరించాలని కోరారు. అలాగే కరోనా కారణంగా స్టాపింగ్లు నిలిపి వేసిన స్టేషన్లను తిరిగి పునరుద్దరించాలన్నారు. ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి అవరోధంగా మారిన ధర్మవరం రైల్వే ఎల్సీ గేట్ స్థానంలో ఆర్యూబీ నిర్మాణ పనులు చేపట్టాలని, కసాపురం రైల్వే మోరీ విస్తీరణ పనులు చేపట్టాలని సూచించారు. సమస్యలను రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్త అన్నారు. సమావేశంలో సీనియర్ డీసీఎం మనోజ్, డీఆర్యూసీసీ సభ్యులు పాల్గొన్నారు. డీఆర్యూసీసీ సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల విజ్ఞప్తి -
నీటి సరఫరాలో సమస్యలౖపై నేడు కలెక్టర్ ‘ఫోన్ఇన్’
అనంతపురం అర్బన్: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకునేందుకు కలెక్టర్ వి.వినోద్ కుమార్ గురువారం ఆకాశవాణి కేంద్రం నుంచి ‘అనంత మిత్ర ఫోన్ఇన్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరిస్తారు. ప్రజలు 08554–225533, 296890 నంబర్లకు ఫోన్ చేసి తాగునీటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. 100 శాతం సబ్సిడీతో డ్రిప్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఎస్సీ, ఎస్టీలు, చిన్న, సన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీతో బిందు సేద్యానికి ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ ప్రాథమిక రంగ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఐదెకరాల విస్తీర్ణానికి సబ్సిడీ మొత్తం రూ.2.18 లక్షలుగా ఉంటుందని, ఐదు నుంచి 10 ఎకరాలు ఉన్న రైతు (ఎస్సీ, ఎస్టీలతో సహా) 90 శాతం సబ్సిడీ, పెద్ద రైతులకు (12.5 ఎకరాలు) 50 శాతం సబ్సిడీతో డ్రిప్ అందిస్తామన్నారు. తపాలా ఎస్పీపై ఉన్నతాధికారుల సీరియస్ ● తక్షణం రిలీవ్ కావాలని ఆదేశం ● కడప ఎస్పీ రాజేష్కు ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు అనంతపురం సిటీ: అనంతపురం తపాలా శాఖ సూపరింటెండెంట్ (ఎస్పీ) బి.గుంపస్వామిపై ఆ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. తెలంగాణ సర్కిల్లోని ఆదిలాబాద్ డివిజన్కు ఆయన్ను బదిలీ చేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రిలీవ్ కాకుండా అనంతపురంలోనే కొనసాగాలని నిర్ణయించుకుని, బదిలీ రద్దు కోరుతూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విన్నపాన్ని ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో బదిలీ రద్దు కోసం ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు పెంచారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు ఈ నెల 9వ తేదీలోపు విధుల నుంచి తప్పనిసరిగా రిలీవ్ కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. లేకపోతే ఈ నెల 16 నుంచి జీతం నిలిపివేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కడప తపాలా ఎస్పీగా పనిచేస్తున్న రాజేష్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 16న అనంతపురం డివిజన్ ఎస్పీగా అదనపు బాధ్యతలను రాజేష్ స్వీకరించనున్నట్లు సమాచారం. హనుమద్ వాహనంపై శ్రీవారు తాడిపత్రి: మండలంలోని ఆలూరు కోనలో వెలసిన శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం హనుమద్ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథుడు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలోని మూలవిరాట్కు విశేష పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరి శాయి. రాత్రి హనుమద్ వాహన సేవలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
కఠిన చర్యలు తీసుకోవాలి
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో త్వరలో బీటెక్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపునకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయా కళాశాలల్లోనే నేరుగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి వెళ్తే సిబ్బంది ససేమిరా అంటున్నారు. అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాల, పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలల్లో కోర్సు ఫీజు ముందస్తుగా చెల్లిస్తేనే పరీక్ష ఫీజు కట్టించుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించగా... అప్పు చేసి వారు ఫీజులు చెల్లిస్తున్నట్లు సమాచారం. మంత్రి ఆదేశాలు బేఖాతర్.. కోర్సు ఫీజులతో సంబంధం లేకుండా పరీక్షలకు అనుమతించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ మేరకు జిల్లా కలెక్టర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయినా మాజీ మంత్రి, టీడీపీ నేత పల్లె రఘునాథ రెడ్డికి చెందిన పీవీకేకే కళాశాలతో పాటు అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలు పట్టించుకోకపోవడం గమనార్హం. ఫీజు వసూలే తమ లక్ష్యమనేలా వ్యవహరిస్తూ విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్కసారిగా తలకిందులు.. వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్మెంట్, ‘వసతి దీవెన’ నిధులు గతేడాది జూన్లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లి దండ్రుల ఖాతాల్లో జమయ్యేవి. కానీ, కూటమి ప్రభుత్వం రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పాత విద్యా సంవత్సరంలో రెండు త్రైమాసికాల బకాయిలు, ఈ విద్యా సంవత్సరంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ. 90 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. పథకాల పేర్లు మార్చారే కానీ.. నిధుల ఊసే ఎత్తడం లేదు. మరో వైపు ఇళ్లకు దూరంగా హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘వసతి దీవెన’ అందించి ఆదుకోగా.. నేడు ఆ పథకాన్నే పూర్తిగా నిలిపేయడంతో అప్పుల భారం పడింది. వైఎస్సార్ సీపీ పోరుబాటతో.. రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఇటీవల వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువత పోరుబాట’తో కూటమి సర్కారు ఉలిక్కిపడింది. అప్పటికప్పుడు తేరుకుని ఒక త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అందులోనూ పాక్షిక చెల్లింపులే జరిగాయి. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయడం ప్రారంభించాయి. ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఫీజుల వేధింపులకు పాల్పడుతున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జేఎన్టీయూ (ఏ) పాలక భవనం వద్ద బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నయాపైసా బకాయి పెట్టకుండా మొత్తం ఫీజు చెల్లిస్తామని మంత్రి లోకేష్ చెప్పారని, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే కళాశాల గుర్తింపు కూడా రద్దు చేస్తామని ఆయన ప్రకటించినా ఖాతరు చేయకపోవడంలో ఆంతర్యమేమిటో తెలియడం లేదన్నారు. వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు మాట్లాడుతూ.. రెండు వారాల క్రితమే అన్ని కళాశాలలకు సర్క్యులర్ జారీ చేశామని, తాజాగా మరో సర్క్యులర్ జారీ చేస్తామని పేర్కొన్నారు. ఫీజులు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరు పరమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు తరిమెల గిరి, నగర ఉపాధ్యక్షుడు సోము, విజయ్, సాయి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘పది’ మూల్యాంకనం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్) బుధవారం ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షలు, స్పాట్ విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ డీఈఓ ఎం.ప్రసాద్బాబు ధన్యవాదాలు తెలిపారు. కాగా మూల్యాంకనం ముగిసిన సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిల్లా విద్యశాఖాధికారి డీఈఓ ప్రసాద్ బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ను సన్మానించారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కరణం హరి కృష్ణ, బాల సుబ్రహ్మణ్యం, మహబూబ్ ఖాన్, ఖలందర్, ఎస్ఎల్టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్లపర్తి శివానందరెడ్డి, ఆదిశేషయ్య, తిమ్మప్ప, గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డేగావత్ రవీంద్రనాథ్, హెచ్ఎం పురుషోత్తం బాబు, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. హిందీ టీచరుకు సన్మానం ఏటా మాదిరిగానే రిటైర్డ్ అయిన హిందీ టీచర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిటైర్డ్ టీచరు అల్లు సుబ్బ కృష్ణమనాయుడుని డీవైఈఓ శ్రీనివాసరావు, ఏసీ గోవిందనాయక్ చేతులమీదుగా ఏసీఓ, హెచ్ఎంలు పి.ఫయాజుద్దీన్,అజ్మతుల్లా, చంద్రమౌళి ఆధ్వర్యంలో సన్మానించారు. సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు -
అందని సలహాలు సూచనలు
అనంతపురం అగ్రికల్చర్: ‘పేరు గొప్ప... ఊరు దిబ్బ’ అనే చందంగా మారింది జిల్లా ఉద్యానశాఖ పరిస్థితి. పదేళ్ల కిందటే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా పేరు పొంది... ప్రస్తుతం ఉద్యానహబ్గా పిలవబడుతున్న ‘అనంత’లో ఆ శాఖకు జిల్లా స్థాయి అధికారి లేక ఏడాదవుతోంది. డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) స్థాయి అధికారి డిప్యుటేషన్లో ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి అధికారి నెల రోజుల పాటు సెలవులో వెళ్లారు. కనీసం ఇన్చార్జి అధికారిని కూడా నియమించలేదు. దీంతో పాలన గాడితప్పి హెచ్ఓ స్థాయి అధికారులే అతి కష్టమ్మీద నెట్టుకొస్తున్నారు. పథకాల అమలు, పంటల సస్యరక్షణ సలహాలు అందక ఉద్యాన రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వంలో కాసింత కూడా చలనం లేకుండా పోయింది. విస్తీర్ణంలో నంబర్ వన్ జిల్లాల విభజన జరిగిన తర్వాత కూడా ఉద్యాన తోటల విస్తీర్ణంలో ‘అనంత’ మొదటి స్థానంలో ఉంది. యాపిల్ లాంటి నాలుగైదు రకాలు మినహా మిగిలిన అన్ని రకాల ఉద్యాన తోటలకు నిలయంగా మారింది. జిల్లా నుంచి చీనీ, అరటి, దానిమ్మ, టమాట, గులాబీ తదితర ఉత్పత్తులు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీలో పేరున్న అజాద్పూర్ మండీలో ‘అనంత’ ఉద్యాన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. వేలాది మంది ఉద్యాన రైతుల శ్రమ ఫలితంగా లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు, రూ.వేల కోట్ల టర్నోవర్తో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల హార్టికల్చర్ కాంక్లేవ్ పేరుతో జాతీయ స్థాయి సదస్సు సైతం అనంతపురంలోనే నిర్వహించారు. అరటి, చీనీ, మిరప, మామిడి, టమాట పంటలను ఐదు గ్రోత్ ఇంజన్లుగా గుర్తించి కొన్ని కార్పొరేట్ కంపెనీలతో ఎంఓయూలు కూడా చేసుకున్నారు. ఇవన్నీ సక్రమంగా అమలు చేసి వాటి ఫలాలు రైతులకు అందించే సరైన అధికారులు లేరు. అతి తక్కువ ఉద్యానతోటల విస్తీర్ణం కలిగిన కొన్ని జిల్లాల్లో డీడీ స్థాయి అధికారులను నియమించిన ప్రభుత్వం... ఉద్యానహబ్గా పేరున్న ‘అనంత’ను నిర్లక్ష్యం చేయడం గమనార్హం. 72 రకాల ఉద్యాన తోటలు జిల్లా వ్యాప్తంగా 31 మండలాల్లోనూ పండ్ల తోటలు పెద్ద ఎత్తున విస్తరించాయి. వేలాది మంది రైతులు వ్యవసాయ పంటలను తగ్గించి అంతో ఇంతో నీటి వనరుల కింద పండ్లు, పూలు, కూరగాయలు ఇతర ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. తాజా నివేదిక ప్రకారం 3 లక్షల ఎకరాల్లో ఉద్యాన తోటలు ఉండగా... అందులో 1.80 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 55 వేల ఎకరాల్లో కూరగాయ పంటలు, 40 వేల ఎకరాల్లో సుగంధం, ఔషధ పంటలు, పూలతోటలు సాగులో ఉన్నాయి. ఒకట్రెండు కాదు... ఏకంగా 72 రకాల ఉద్యాన తోటలు సాగులో ఉన్నట్లు ఈ–క్రాప్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటి ద్వారా ఏటా 38 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫలసాయం వస్తోంది. రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు టర్నోవర్ ఉన్నట్లు గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారి లేక గాడితప్పిన పాలన జిల్లాలో 3 లక్షల ఎకరాలకు పైగా ఉద్యానతోటలు 72 రకాల ఉద్యాన పంటల సాగు పంట సస్యరక్షణ సలహాలు అందక రైతుల అవస్థలు తరచూ వర్షాభావ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పు కారణంగా చీడపీడలు, తెగుళ్ల బెడద కూడా అధికంగా ఉంటోంది. అకాల వర్షాలు, ఈదురుగాలులు కూడా ఏటా దెబ్బతీస్తున్నాయి. అలాగే మార్కెటింగ్ సమస్య సైతం రైతులను వేధిస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యాన తోటలు సాగు చేస్తున్న ‘అనంత’లో ఖచ్ఛితంగా జిల్లా స్థాయి (డీడీ) అధికారి ఉండాల్సిన చోట... ఏడీ స్థాయి అధికారితో నెట్టుకొస్తున్నారు. ఆయన కూడా ఇటీవల సెలవు పెట్టారు. ఇన్చార్జి అఽధికారినీ నియమించలేదు. గతంలో ఇక్కడకు రెగ్యులర్ డీడీని నియమించినా... బాధ్యత తీసుకున్న రోజే డిప్యుటేషన్ కింద కమిషనరేట్లో పనిచేస్తున్నారు. దీంతో ఏడీ బీఎంవీ నరిసింహారావుకే ఇన్చార్జి డీడీ బాధ్యతలు అప్పజెప్పారు. ఆయనకు టెలీ కాన్ఫరెన్స్లు, జూమ్ మీటింగ్, కమిషనరేట్ రివ్యూలు, కలెక్టరేట్ సమీక్షలకు హాజరయ్యేందుకే సమయం చాలడం లేదంటున్నారు. ఇపుడు ఆయన కూడా సెలవు పెట్టడంతో ఉద్యానశాఖకు దిక్కులేకుండా పోయింది. సస్యరక్షణ సిఫారసులు, సాంకేతిక సలహాలు, పథకాల సమచారం ఇచ్చేవారు లేకపోవడంతో రైతులకు పెద్ద సమస్యగా మారింది. -
13న యూపీఎస్సీ ఫ్లాగ్షిప్ పరీక్ష
అనంతపురం అర్బన్: ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఈనెల 13న ఫ్లాగ్షిప్ పరీక్ష జరగనుంది. రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 363 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. యూపీఎస్సీ నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా జరుగుతాయన్నారు. అధికారులు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రానికి ఇన్స్పెక్టింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎ.రామ్మోహన్, రూట్ ఆఫీసర్గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు, కేఎస్ఎస్ డిగ్రీ, పీజీ కళాశాల పరీక్ష కేంద్రా నికి ఇన్స్పెక్టింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, రూట్ అధికారిగా వి.మల్లికార్జునరెడ్డిని నియమించామన్నారు. కేంద్రం వద్ద ఒక ఎస్ఐ, ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించే సమయంలో నలుగురు ఆర్మ్డ్ పోలీసులను ఎస్కార్ట్గా నియమించాలని చెప్పారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష వేళలకు అనుకూలంగా బస్సులు నడపాలని ఆదేశించారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరీక్ష సమయం ఇలా... ● ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేపర్–2, 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్–3 పరీక్ష జరుగుతుంది. ● కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల పరీక్ష కేంద్రంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ పరీక్షకు సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1, 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్–2 జరుగుతుంది. ● అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ● ఈ–అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు, సెల్ఫ్ ఫొటోలు, పెన్, పెన్సిల్ తీసుకురావాల్సి ఉంటుంది. ● మొబైల్ ఫోన్లు, డిజిటల్, స్మార్ట్ గడియారాలు, బ్లూటూత్ తదితర వస్తువులను అనుమతించరు. నిషేధిత భూములపై శిక్షణ అనంతపురం అర్బన్: నిషేధిత భూములు (22ఏ), చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాసుపుస్తకాన్ని ఆధార్తో అనుసంధించాలని చెప్పారు.రెవెన్యూ సెక్టార్పై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోలతో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ‘అనంత అభ్యాసం’ కింద ఈనెల 11న డివిజన్, మండలస్థాయి రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో తాను, జేసీ పాల్గొంటామని చెప్పారు. పట్టాదారు పాసు పుస్తకాన్ని ఆధార్తో అనుసంధానించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీల పరిశీలన చేపట్టాలని, నివేదికలు ఈ–ఆఫీసులో సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
బూటు కాలితో తన్ని.. గొంతు నులిమి
అనంతపురం: బిడ్డను అక్కున చేర్చుకుని ప్రేమను పంచాల్సిన ఓ తండ్రి కర్కశత్వం ప్రదర్శించాడు. రాక్షసుడిలా మారి అభంశుభం తెలియని చిన్నారిని చిత్రహింసలకు గురి చేశాడు. అనంతపురం వన్టౌన్ సీఐ వి. రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన శివ, మౌనికలు కులాంతర వివాహం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం అనంతపురానికి వచ్చి జేఎన్టీయూ (ఏ) ఎదురుగా ఉన్న ఓ బాయ్స్ హాస్టల్లో వంట మనుషులుగా చేరారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి హాస్టల్లో ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తోందన్న కోపంతో తండ్రి శివ మంగళవారం విచక్షణారహితంగా కొట్టాడు. బూటు కాలితో తన్నాడు. చెంప పగులకొట్టడమే కాకుండా బుగ్గలు గట్టిగా కొరికాడు. గొంతు నులిమి చిత్రహింసలు పెట్టాడు. దెబ్బలు తాళలేక చిన్నారి ఆర్తనాదాలు పెడుతున్నా కనికరం చూపలేదు. సొమ్మసిల్లిపడిపోయినా ఆపకుండా మరీ చితకబాదాడు. ఈ విషయాన్ని హాస్టల్లో ఉంటున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో ఐసీడీఎస్ అధికారులు హాస్టల్ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మూడేళ్ల చిన్నారిపై కసాయి తండ్రి కర్కశత్వం కేసు నమోదు చేసిన పోలీసులు -
జిల్లాకు వర్షసూచన
బుక్కరాయసముద్రం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజుల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 39.4–42.2, రాత్రి ఉష్ణోగ్రతలు 22.6–24.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 60–68 శాతం, మధ్యాహ్నం 18–21 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
మద్దతు ధర చట్టం అమలుకు మరో ఉద్యమం
అనంతపురం సిటీ: మద్దతు ధర చట్టం అమలకు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని రైతులకు రైతు సంఘం రాష్ట్ర క్యాదర్శి కేవీవీ ప్రసాద్ పిలుపునిచ్చారు. వ్యవసాయ పథకాలకు 90 శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమిళనాడులోని నాగపట్నంలో అఖిల భారత కిసాన్ సభ 30వ జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో అనంతపురంలోని డీపీఆర్సీ భవన్లో ఉద్యాన రైతుల రాష్ట్ర సదస్సు మంగళవారం నిర్వహించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చిరుతల మల్లికార్జున అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా కేవీవీ ప్రసాద్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీస్, జిల్లా కార్యదర్శి జాఫర్, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య, రాష్ట్ర రైతు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కాటమయ్య, పండ్ల తోటల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అనంత రాముడు హాజరయ్యారు. కేవీవీ ప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. దేశ వ్యాప్తంగా 600 రకాల పండ్లను రైతులు ఉత్పత్తి చేస్తున్నా.. కేవలం 24 రకాల పండ్ల ఉత్పత్తులకు మాత్రమే కేంద్రంలోని కూటమి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం బాధాకరమన్నారు. రెతులు పండించిన పంట ఉత్పత్తులపై శ్రమ, ఖర్చులతో పాటు 50 శాతం అదనంగా కలిపి ధర నిర్ణయిస్తేనే రైతుకు గిట్టుబాటవుతుందన్నారు. అప్పుడే రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడుకోగలమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అనంతపురం జిల్లా ఫ్రూట్ బోల్గా ఎదగాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. అప్పటి వరకూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ.. ఎకరాకు రూ.30 వేలు ఇస్తూ 30 ఏళ్లకు రైతుల నుంచి భూములు అగ్రిమెంట్ చేసుకున్న గాలిమరల నిర్వాహకులు ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం దారుణమన్నారు. కాటమయ్య మాట్లాడుతూ.. కార్పొరేట్ అప్పులను రద్దు చేస్తున్న తరహాలోనే రైతుల అప్పులనూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యు డు లింగమయ్య, ఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేశ్, నిర్మల, ఇంకా వివిధ స్థాయిల నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ -
అధికారుల నిర్లక్ష్యం.. దివ్యాంగులకు శాపం
తాడిపత్రి రూరల్: దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దక్కాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అయింది. దీంతో సదరం క్యాంప్లో వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో స్లాట్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికి తేదీ, సదరం క్యాంప్ నిర్వహించే ఆస్పత్రి ఖరారు చేసి సమాచారాన్ని అందజేస్తారు. ఈ విధానం దివ్యాంగులకు ఎంతో సౌలభ్యంగా మారింది. అయితే ఇటీవల ఆర్థో, కంటి పరీక్షలకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకున్న వారికి తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిని కేటాయిస్తూ మంగళవారం సదరం క్యాంప్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో జిల్లాతో పాటు వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి వందలాది మంది దివ్యాంగులు వారి సహాయకులతో కలసి వచ్చారు. అయితే వైద్య పరీక్షలు చేసేందుకు ఎలాంటి పరికరాలు లేవని తెలియడంతో దివ్యాంగులు అయోమయంలో పడ్డారు. పరికరాల్లేవు.. పరీక్షలు చేయలేం ఆర్థో, కంటి వైద్య పరీక్షలు చేసేందుకు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిలో ఎలాంటి వైద్య పరికరాలు లేవు. అర్థోకు అరకొరగా పరికరాలు ఉన్నా కంటి పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరమూ లేదు. తమకందిన సమాచారంతో మంగళవారం ఉదయం 8 గంటలకే వందలాది మంది దివ్యాంగులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 11గంటలైన పరీక్షలు మొదలు పెట్టకపోవడంతో విసుగెత్తి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ను నిలదీశారు. దీంతో కంటి డాక్టర్ వసంత, ఆర్థో వైద్యుడు హరిప్రసాద్ను డాక్టర్ డేవిడ్ పిలిపించుకుని మాట్లాడారు. సదరం క్యాంప్కు హాజరైన దివ్యాంగులకు అన్ని రకాల పరీక్షలు చేయడానికి అవసరమైన పరికరాలు లేవని వారు చేతులేత్తేయడంతో విషయాన్ని వెంటనే డీసీహెచ్ డాక్టర్ పాల్ రవికుమార్ దృష్టికి సూపరింటెండెంట్ తీసుకెళ్లారు. బయటి నుంచి పరికరాలు తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించాలంటూ ఆయన సలహా ఇచ్చి ఫోన్ పెట్టేశారు. వెంటనే మరోసారి డీసీహెచ్కు డాక్టర్ డేవిడ్ ఫోన్ చేయడంతో ఆయన మంత్రి సత్యకుమార్ పర్యటనలో ఉన్నారంటూ కింది స్థాయి ఉద్యోగి తెలిపి ఫోన్ పెట్టేశారు. ఈ విసయం తెలియగానే దివ్యాంగులు మండిపడుతూ సూపరింటెండెంట్తో వాగ్వాదానికి దిగారు. రాప్తాడుకు చెందిన దివ్యాంగుడు విషయాన్ని వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయనకే నేరుగా ఫోన్ చేశారు. అయితే మంత్రి మీటింగ్లో ఉన్నారని పీఏ హర్ష తెలిపి, ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడారు. చివరకు పరికరాలే లేనప్పుడు వైద్య పరీక్షలు చేయడం సాధ్యం కాదంటూ చేతులెత్తేయడంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పరీక్షల కోసం పిల్లాపాపలు, వృద్దులతో కలసి వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. వైద్య పరీక్ష పరికరాలు లేకున్నా తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి సదరం స్లాట్ ఖరారు జిల్లాతో పాటు వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి తరలివచ్చిన దివ్యాంగులు -
అభిమాన నేతను చూశాం.. అదే చాలు
ఎంతో ఆనందం కలిగింది మాది వ్యవసాయ కుటుంబం. పొలంలో వేరుశనగ, మొక్కజొన్న సాగు చేస్తాం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఏటా ఠంచనుగా ‘రైతు భరోసా’ అందించడంతో సాఫీగా పంటలు సాగు చేశాం. వరుణుడు కరుణించి పంటలు బాగా పండటంతో నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాం. అలా మమ్మల్ని ఎంతగానో ఆదుకున్న అభిమాన నేత మా ప్రాంతాన్ని రావడంతో ఎలాగైనా చూడాలని వచ్చాం. ఆయన్ను చూశాక ఎంతో ఆనందం కలిగింది. – చెన్నకేశవ దంపతులు, కుంటిమద్ది గ్రామం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి నాకు పది ఎకరాల పొలం ఉంది. చంద్రబాబు రైతులకు ఏమీ చేయడం లేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు మా కష్టాలు తెలియడం లేదు. జగన్ ప్రభుత్వంలో అన్నదాతలకు అడుగడుగునా చేయూతనిచ్చారు. ఆయన ఉంటే మాకు ఈ బాధలు ఉండేవే కావు. రాష్ట్రానికి తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నాం. – రంగయ్య, ఆర్. కొట్టాల, పెనుకొండ మండలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామగిరి మండల పర్యటనలో జన తరంగం ఎగిసి పడింది. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. జనం తాకిడికి ముదిగుబ్బకు చెందిన శోభారాణి చెప్పులు తెగిపోగా.. జగన్ను చూడాలనే సంకల్పంతో ఆమె తన వద్ద ఉన్న టవల్ను చింపి కాళ్లకు చుట్టుకుని మరీ ఎర్రటి ఎండలో ముందుకు నడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి కొందరు తలపై టవల్స్ ధరించి, కానుగ ఆకులు కట్టుకొని వచ్చారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ రాష్ట్రానికి శని పట్టింది.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రానికి శని పట్టింది. మాకు కుమార్తె, ఒక కుమారుడు సంతానం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం జగనన్న అమ్మఒడి ఇచ్చేవారు. ఇప్పుడేమో చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు. జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటే.. చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారు. – వెంకట్రామ్ దంపతులు, పోలేపల్లి గ్రామం -
జిల్లాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
● ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పయ్యావుల విడపనకల్లు: జిల్లాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జిల్లా అధికారులతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించి, మాట్లాడారు. 70 రోజుల్లో హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికారులు పని చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో మలోలా, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేస్వామి, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డీఏఓ ఉమామహేశ్వరమ్మ, ఎల్డీఎం నర్సింగరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, సివిల్ సప్లయీస్ డీఎం రమేష్రెడ్డి, డీపీఓ నాగరాజునాయుడు, బీసీ సంక్షేమ శాఖ డీడీ కుష్బూ కొఠారి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్రెడ్డి, ఇన్చార్జ్ తహసీల్దారు చంద్రశేఖర్రెడ్డి, ఎంపీడీఓ షకీలాబేగం, తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీకి జాతీయ స్థాయి సర్టిఫికెట్ రాప్తాడు: స్థానిక పీహెచ్సీకి జాతీయ స్థాయి సర్టిఫికెట్ దక్కింది. మంగళవారం అనంతపురంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా సర్టిపికెట్ను పీహెచ్సీ వైద్యాధికారి ఎం.శివకృష్ణ అందుకున్నారు. అలాగే చిన్మయనగర్ ఆయుష్మన్ ఆరోగ్య కేంద్రం కూడా జాతీయ నాణ్యత ప్రమాణాలకు ఎంపిక కావడంతో ఎంఎల్హెచ్పీ ప్రసన్న, ఏఎంఎం చంద్రకళకు సర్టిఫికెట్లను అందజేశారు. ఏపీ ఈసెట్కు 33 వేల దరఖాస్తులు అనంతపురం: ఇంజినీరింగ్ కోర్సులో లేటరల్ ఎంట్రీ కింద రెండో సంవత్సరంలోకి అడ్మిషన్లు పొందడానికి నిర్వహించే ఏపీఈసెట్–2025కు మొత్తం 33,454 దరఖాస్తులు అందినట్లు ఈసెట్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ బి.దుర్గాప్రసాద్ తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈ నెల 12 వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో 17వ తేదీ వరకు, రూ.4 వేల అపరాధ రుసుముతో ఈ నెల 24వ తేదీ వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. మాజీ జవాన్ మృతి గుత్తి: స్థానిక 21వ వార్డులో నివాసముంటున్న మాజీ జవాన్ అల్లాబకాష్ (80) మంగళవారం తుది శ్వాస విడిచారు. 1971లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఆయన తన కాలును పోగొట్టుకున్నారు. ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, మాజీ సైనిక ఉద్యోగులు కృష్ణయ్య, రామ్మూర్తి తదితరులు అల్లాబకాష్ భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. -
ప్రభుత్వ లాంఛనాలతో రమాదేవి అంత్యక్రియలు
కంబదూరు: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల సమీపంలో సోమవారం ఉదయం రెండు కార్లు బలంగా ఢీకొన్న ప్రమాదంలో ఓ కారులో ఉన్న హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె భౌతిక కాయాన్ని స్వగ్రామమైన కంబదూరు మండలం తిమ్మాపురానికి మంగళవారం తీసుకొచ్చారు. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల డీఆర్ఓలు మలోల, విశ్వేశ్వర నాయుడు, కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంత బాబు, కంబదూరు తహసీల్దార్ బాలకిషన్ తదితరులు రమాదేవి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. యువకుడి ఆత్మహత్య కణేకల్లు: మండలంలోని యర్రగుంట గ్రామానికి చెందిన గొల్ల గంగాధర్ (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య సిద్దమ్మ, ఇద్దరు కుమార్తెలు, తల్లి లక్ష్మి ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడిన గంగాధర్ రోజూ సంపాదన మొత్తాం తాగుడుకే ఖర్చు పెడుతూ అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చేందుకు ఉన్న ఇంటిని అమ్మేసి, అద్దె గదికి మకాం మార్చారు. అయినా మద్యం తాగడాన్ని మానుకోలేదు. దీంతో తాగుడు మానేస్తే కుటుంబం బాగుపడుతుందని మంగళవారం ఇంట్లో అందరూ మందలించారు. అనంతరం కుటుంబసభ్యులందరూ యణ్ణేరంగస్వామి ఉత్సవాలకు వెళ్లారు. సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న గంగాధర్.. చిన్నారికి వేసిన ఊయల చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 7 గంటలకు ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసుల అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఉద్యానశాఖ డీడీగా ఫిరోజ్ఖాన్ అనంతపురం సెంట్రల్: ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్గా ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్ఖాన్ మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ పనిచేస్తున్న బీఎంవీ నరసింహారావు మెడికల్ లీవ్లో వెళ్లడంతో ఆయన స్థానంలో ఫిరోజ్ఖాన్కు ఎఫ్ఏసీ డీడీగా బాధ్యతలు అప్పగిస్తూ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
పరికరాలు లేవంటున్నారు
నేను కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా. సదరం స్లాట్ బుక్ చేసుకోవడమంటే ఓ యుద్ధం చేసినట్లవుతోంది. ఆన్లైన్లో సైట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా అర్థం కావడం లేదు. అష్టకష్టాలు పడి ఎప్పుడో బుక్ చేసుకుంటే ఇప్పుడు పరీక్షలకు అవకాశం వచ్చింది. ఇక్కడకు వస్తే కంటి వైద్య పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరం కూడా లేదంటున్నారు. పరికరాలు లేనప్పుడు సదరం క్యాంప్ నిర్వహణకు ఎలా అనుమతిచ్చారు. మాకెలా సమాచారం ఇచ్చారు. దివ్యాంగులంటే ఇంత చులకనా? – శ్రీనివాసులు, రాప్తాడు -
15 వరకు మద్దతు ధరతో కందుల కొనుగోళ్లు
అనంతపురం అగ్రికల్చర్: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటా రూ.7,550 ప్రకారం కందుల కొనుగోళ్ల కార్యక్రమం ఈ నెల 15న ముగుస్తుందని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి తెలిపారు. ఈ మేకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకూ 7,900 మంది రైతుల నుంచి 10,687 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేయగా, ఇందులో 6,886 మంది రైతులకు రూ.59 కోట్ల మేర చెల్లింపులు చేశామన్నారు. -
మళ్లీ బుక్ చేసుకునే అవకాశం కోల్పోయాం
నా కుమార్తె జోషికకు పుట్టుకతోనే కుడి కన్ను లేదు. చిన్నారికి ఎలాంటి పరీక్షలు చేయకుండానే కన్ను లేదని నిర్ధారించవచ్చు. ఆమె చదువులకు, ఉద్యోగ అవకాశాలకు పనికి వస్తుందని సదరం స్లాట్ బుక్ చేసుకుంటే ఇప్పుడు పరీక్షలకు అవకాశం వచ్చింది. దీంతో ముదిగుబ్బ నుంచి తెల్లవారుజామునే బయలుదేరి వచ్చాను. ఇక్కడకు వచ్చిన తర్వాత కంటి వైద్య పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరం కూడా లేదని అంటున్నారు. పోతే పోయిందేలే అనుకుని మళ్లీ స్లాట్ బుక్ చేద్దామనుకుంటే రూల్స్ ఒప్పుకోవంటా. ఎందుకు పరీక్షలు చేయించుకోలేదో వైద్యులు రాతపూర్వకంగా ఇచ్చిన వివరణను జతపరచాలంటా. అంతేకాక మరో మూడు నెలల వరకూ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం లేదు. – రమాదేవి, ముదిగుబ్బ, శ్రీసత్యసాయి జిల్లా -
వైఎస్సార్సీపీ నేత తోటకు నిప్పు
ఉరవకొండ: మండలంలోని కోనాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ రైతు విభాగం మండల సహాయ కార్యదర్శి నెట్టెం రామకృష్ణప్ప దానిమ్మ తోటకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. బాధితుడు తెలిపిన మేరకు.. తనకున్న నాలుగు ఎకరాల్లో 1,300 దానిమ్మ మొక్కలతో సాగు చేపట్టాడు. మరో నెలలో పంట చేతికొస్తుంది. ఈ క్రమంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. చుట్టు పక్కల పొలాల రైతులు గమనించి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. దాదాపు 80 చెట్లు కాలిపోయాయి. ఘటనతో రూ.1.50 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు మేకల సిద్దార్థ్, రాకెట్ల సర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపీటీసీలు శీనానాయక్, శ్రీనివాసులు తదితరులు తోటను పరిశీలించి, బాధితుడిని ఓదార్చారు. -
వైభవంగా ‘వేమన’ ఉత్సవాలు
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో రెండో రోజు సోమవారం రాత్రి విశ్వకవి యోగి వేమన ఉత్సవాలు వైభవంగా సాగాయి. పీఠాధిపతి నందవేమారెడ్డి ఆధ్వర్యంలో వేమన సమాధిని ప్రత్యేకంగా ఆలంకరించి విశేష పూజలు చేశారు. కదిరి పరిసర మండలాల నుంచే కాక వైఎస్సార్ జిల్లా, కర్నూలు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వేమన ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. భక్తులకు పీఠాధిపతి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. రాత్రి చిన్నారుల శాసీ్త్రయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాటల కచేరీ అలరించింది. -
సైనిక లాంఛనాలతో జవాన్కు అంత్యక్రియలు
పామిడి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆర్మీ జవాన్ కొండేటి అనిల్కుమార్(36)కు సైనిక లాంఛనాలతో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు... పామిడి మండలం ఎదురూరుకు చెందిన అనిల్కుమార్ అహమ్మదాబాద్ రెజిమెంట్లో హవల్దార్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రమావత్ పార్వతి, 12 ఏళ్ల వయసున్న సాయితేజ, తొమ్మిదేళ్ల వయసున్న మోక్షిత్ అనే కుమారులు ఉన్నారు. పిల్లల చదువుల కోసమని అనంతపురంలో కాపురం పెట్టిన ఆయన గత నెల సెలవుపై ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి 19న ద్విచక్ర వాహనంపై వెళుతూ అనంతపురంలోని రుద్రంపేట సమీపంలో స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహనం అదుపు తప్పి కిందపడడంతో తలకు తీవ్ర గాయమై కోమాలోకి పోయారు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు బెంగుళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి ఆయన మృత్యుఒడికి చేరుకున్నారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రం స్వగ్రామం ఎదురూరుకు సైనికులు తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో అహమ్మదాబాద్ రెజిమెంట్ అధికారుల సమక్షంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి తిమ్మప్ప, తహసీల్దార్ ఎన్. శ్రీధరమూర్తి, సీఐ వి.యుగంధర్, మాజీ సైనికోద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా రథోత్సవం
కణేకల్లు: మండలంలోని యర్రగుంట గ్రామంలో వెలసిన యణ్ణేరంగస్వామి రథోత్సవం సోమవారం నేత్రపర్వంగా సాగింది. రాయదుర్గం, బొమ్మనహళ్, బెళుగుప్ప, డి.హిరేహళ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకూ విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంకాలం 5 గంటలకు స్వామి ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగిస్తూ రథంపైకి చేర్చారు. మేళాతాళాలు, తపెట్లతో రథాన్ని ముందుకు లాగారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ యండ్రకాయల వన్నూరప్ప, మాజీ వైస్ ఎంపీపీ పి.సంజీవరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కెనిగుంట రామిరెడ్డి, పాటిల్ వెంకటరెడ్డి, కె.జె.ఈరన్న, కేజీ వన్నూరుస్వామి, హనుమంతప్ప పాల్గొన్నారు. కాగా, రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన యణ్ణేరంగస్వామి ఉత్సవాలు సోమవారం నాటి రథోత్సవంతో ముగిసాయి. -
‘పీపీపీ’తో పేదలకు వైద్య సేవలు దూరం
అనంతపురం కార్పొరేషన్: పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానం ద్వారా పేదలకు వైద్య సేవలు శాశ్వతంగా దూరమవుతాయని, ఈ విధానం కింద ప్రభుత్వ ఆస్పత్రులను చేర్చే ఆలోచనను మానుకోకపోతే ఉద్యమిస్తామంటూ కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ హెచ్చరించారు. పీపీపీ పద్ధతిని వ్యతిరేకిస్తూ ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధికంగా పేదలకు సర్వజనాస్పత్రినే దిక్కుగా మారిందన్నారు. ప్రైవేట్ కంపెనీలను భాగస్వామ్యం చేసుకుంటే పేదలకు నాణ్యమైన వైద్యం అందదన్నారు. హెల్త్ కేర్ సెక్టార్కు సంబంధించి బడ్జెట్లో 5 శాతం నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రసూన, డాక్టర్ వీరభద్రయ్య, నాయకులు రాజు, తిరుపాల్, చంద్రశేఖర్, సురేంద్ర, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.సింహ వాహనంపై రంగనాథుడుతాడిపత్రి: ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి సింహ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. రంగనాథస్వామిని ప్రత్యేక పూలు, ఆభరణాలతో అర్చకులు అలంకరించారు. రాత్రి సింహ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. -
తప్పుడు కేసులతో ప్రాణాలు తీస్తున్నారు
కళ్యాణదుర్గం: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారని పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య విమర్శించారు. టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసు బనాయించడంతో ఆవేదనకు గురై గుండెపోటుతో కళ్యాణదుర్గం మండలం శీబావికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త చాకలి రామాంజనేయులు ప్రాణాలు విడిచాడు. ఈ క్రమంలో రామాంజనేయులు మృతదేహానికి సోమవారం పార్టీ నేతలతో కలిసి రంగయ్య నివాళులర్పించారు. అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు నేడు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. పోలీసులు ఏకపక్షంగా అక్రమ కేసు బనాయించడంతోనే చాకలి రామాంజనేయులు మృతి చెందాడన్నారు. వీటిపై జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఎమ్మెల్సీ బోయ మంగమ్మ మాట్లాడుతూ శీబావిలో ఎన్నడూ లేని సంస్కృతి తీసుకువచ్చారన్నారు.ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేసేవాళ్లమని, కానీ నేడు కక్షలు పెంచుకుని అమాయకుల ప్రాణాలతో టీడీపీ నాయకులు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. రామాంజనేయులు కుటుంబాన్ని వీధి పాలు చేశారని, ఆయన భార్య, పిల్లలకు ఎవరు దిక్కని వాపోయారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నేత మాదినేని ఉమా మహేశ్వర నాయుడు మాట్లాడుతూ చాకలి రామాంజనేయులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. కళ్యాణదుర్గం రూరల్ సీఐ వంశీకృష్ణ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, నాయకులు నారాయణపురం వెంకటేశులు, నరేంద్రరెడ్డి, మండల కన్వీనర్ గోళ్ల సూరి, చంద్రశేఖర్రెడ్డి, సర్వోత్తమ, గోపాల్, సూరప్ప, ఆంజనేయులు, పాతలింగ, మల్లి, మురళి తదితరులు పాల్గొన్నారు. -
మారణహోమాన్ని ఆపేందుకే జగనన్న రాక
రాప్తాడురూరల్: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ సభలో పాల్గొనేందుకు రావడం లేదు. చీమకు కూడా హాని తలపెట్టని పేద రైతు కురుబ లింగమయ్యను హత్య చేస్తే ఆ కుటుంబానికి అండగా నిలవడానికి, మారణ హోమాన్ని ఆపేందుకు, జిల్లాలో మరో రాజకీయ హత్య జరగకూడదనే సందేశం ఇవ్వడానికి వస్తున్నారు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాపిరెడ్డిపల్లికి వస్తున్న నేపథ్యంలో సోమవారం తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి కుంటిమద్ది మీదుగా పాపిరెడ్డిపల్లి చేరుకుంటారన్నారు. ఇటీవల హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడతారని తెలిపారు. తిరిగి అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారని వెల్లడించారు. ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొడదాం జిల్లాలో ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొట్టాలనుకునే విజ్ఞులు, భవిష్యత్తు బాగుండాలని కోరుకునే యువత, రాప్తాడు నియోజకవర్గ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు మేల్కోవాలని ప్రకాష్ రెడ్డి కోరారు. కుట్ర, హత్యా రాజకీయాలు కలగలిసి ప్రభుత్వ మద్దతుతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ‘నడుచు కుంటూ వస్తారో... సైకిల్, బైకు, ట్రాక్టర్, ఆటోల్లో వస్తారో మీ ఇష్టం. మీరు రావాలి. వస్తేనే జిల్లా నుంచి ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొట్టగలం అనే విషయం గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో శాంతి కుసుమాలు మనందరం అభివృద్ధిని కాంక్షిస్తున్నామని, గత ఐదేళ్లూ జగనన్న సంక్షేమాన్ని చూశామని ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న హయాంలో శాంతి కుసుమాలు ఎలా వికసించాయో అందరూ చూశారన్నారు. ఒక గొడవ కాని, హత్యకాని జరగకుండా ఐదేళ్లు పరిపాలన సాగించారన్నారు. ‘కూటమి’ అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి మారణకాండను ఆపుదామా.. ఆపుదామంటే అందరూ వచ్చి జగనన్నకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ‘ఎవరో కాకమ్మ కథలు చెబుతుంటారు, కుట్రలతో సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని, ‘పచ్చ’ మీడియాను ఉపయోగించుకుని జగన్మోహన్రెడ్డిపైనా, నాపైనా దుష్ప్రచారం చేస్తుంటారు. కానీ ఇక్కడ బతకాల్సింది నువ్వు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడుకోవాల్సింది నువ్వు. అది నీ బాధ్యత. ఆ బాధ్యతను నిలబెట్టుకోవడానికి మంగళవారం ఉదయం 9 గంటలకు కుంటిమద్ది గ్రామానికి రావాలి’ అని ఆయన పేర్కొన్నారు. శాంతిస్థాపనకు జగనన్నతో కలిసి కవాతు చేద్దామన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు, దుర్మార్గాలను జిల్లా ఓర్చదనే సందేశం ఇద్దామని, జిల్లాను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు. చీమకు కూడా హాని తలపెట్టని కురుబ లింగమయ్యను హత్య చేశారు శాంతిస్థాపనకు జగనన్నతో కలిసి కవాతు చేద్దాం ప్రజలకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపు -
దయనీయం.. దౌర్భాగ్యం
● సర్వజనాస్పత్రిలో దిగజారిన సేవలు ● గంటల తరబడి ఎమర్జెన్సీలోనే రోగులు ● ప్రత్యక్ష నరకం చూస్తున్న బాధితులు ● పట్టించుకోని ఉన్నతాధికారులు అనంతపురం మెడికల్: అనంతపురం సర్వజనాస్పత్రిలో రోజురోజుకూ సేవలు దిగజారుతు న్నాయి. ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెడుతున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి.ఆస్పత్రికొచ్చే రోగులు ఆర్తనాదాలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే కానరావడం లేదు. అత్యవసర కేసులు ఉదయం ఎమర్జెన్సీకి వస్తే సాయంత్రమైనా వార్డులకు తరలించడం లేదు. ఉరవకొండ మండలం గడేహొతూరుకు చెందిన తులసి తలకు గాయంతో సోమవారం ఉదయం 11.30 గంటలకు సర్వజనాస్పత్రికి రాగా, ఇక్కడ ఆమెను సర్జరీ వైద్యులు చూడడానికి దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఇదొక్కటే కాదు..ఆస్పత్రిలో తగినన్ని పడకలు లేకపోవడం, వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యం వెరసి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. రోజులో ఒక్కసారైనా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు, ఏడీ మల్లికార్జున రెడ్డి, ఆర్ఎంఓలు ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి రోగులను సకాలంలో వార్డులకు పంపేలా చూస్తే సగం కష్టాలు తీరుతాయి. కానీ ఆస్పత్రిలో అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అమాత్యా.. ఆలకించండి.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఎమర్జెన్సీ వార్డును పది నిమిషాలు పరిశీలిస్తే.. ఇక్కడ రోగులు నిత్యం ఎంత నరకం అనుభవిస్తారో తెలుస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆస్పత్రిలో వివిధ విభాగాధిపతులు, అధికారుల మధ్య ఏపాటి సమన్వయం ఉందో, సూపరింటెండెంట్, ఏడీ, ఆర్ఎంఓలకు పరిపాలనపై పట్టు ఏమాత్రం ఉందో ఇట్టే తెలిసి పోతుందంటున్నారు. ● వైద్యం కోసం సర్వజనాస్పత్రికి వచ్చిన కూడేరుకు చెందిన సంగప్ప, శెట్టూరుకు చెందిన హనుమంతులను ఒకే మంచంపై ఉంచిన దృశ్యమిది. గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్న తరుణంలోనూ చాలీచాలని మంచంపై పడుకోబెట్టడం.. చాలా సేపు వైద్యులు పట్టించుకోకపోవడంతో సంగప్ప నరకయాతన అనుభవించాడు. దయచేసి వార్డుకు పంపండంటూ బోరున విలపించినా సిబ్బంది కనికరం చూపలేదు. ● కురుకుంటకు చెందిన సురేష్ సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు అతడిని వెంటనే సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అతడిని సిటీ స్కాన్ రూముకు తీసుకెళ్లేందుకు ఎంఎన్ఓలు అందుబాటులో లేరు. దీంతో కుటుంబీకులు, మిత్రులే సురేష్ను తరలించాల్సి వచ్చింది.పైగా స్ట్రెచర్కు చక్రం లేకపోవడంతో ఎత్తుకుని తీసుకెళ్లారు. -
పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అనుగుణంగా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్ – డెమో ప్యాసింజర్) రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. వీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే డెమో రైళ్లలో ఎలాంటి మౌలిక
●డెమో ప్యాసింజర్ రైళ్లతో ప్రయాణికుల బేజారు ●మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ●జనరల్ బోగీలతో నడపాలని ప్రయాణికుల డిమాండ్ డెమో రైలులో ప్రయాణిస్తున్న దృశ్యం గుంతకల్లు: డివిజన్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న డెమో ప్యాసింజర్ రైళ్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గుంతకల్లు–హిందూపురం (77213/14), గుంతకల్లు–రాయచూర్ (77201/02), గుంతకల్లు–డోన్ (77203/04), డోన్–గుత్తి (77205/06), నంద్యాల–రేణిగుంట (77212/11), కర్నూలు సిటీ–నంద్యాల (77209/10) మధ్య నడుస్తున్న డెమో ప్యాసింజర్ రైళ్లలో రాయలసీమ జిల్లా వాసులు తక్కువ ధరతో ప్రయాణం చేయాడానికి ఎంతో అనువుగా ఉన్నాయి. దీంతో మధ్య తరగతి, గ్రామీణ ప్రాంతా ప్రయాణికులు ఈ రైళ్ల వైపు మెగ్గు చూపారు. మౌలిక వసతులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వసతులు కరువు హైదరాబాదు, బెంగుళూరు తదితర నగరాల్లో నడుతుపున్న ఎంఎంటీఎస్ రైళ్ల (డెమో)ను రైల్వేశాఖ సాధారణ ప్రయాణికుల కోసం గుంతకల్లు డివిజన్లోపి పలు ప్రాంతాల నుంచి నడుపుతోంది. ట్రాఫిక్ సమస్య తలెత్తకపోవడంతో పాటు సమయానికి నిర్దేశించిన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీంతో సిటీ ప్రజలు ఎక్కువగా ఈ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ వెళ్లడానికి 5 నిమిషాల సమయం కూడ పట్టదు. 700ల మంది కూర్చొని, మరో వెయ్యి మందికి పైగా నిల్చోని ప్రయాణం చేసే వెసులుబాటు ఉంది. దీంతో ఈ రైళ్లలోని బోగీల్లో టాయిలెట్లు, నీటి వసతి అనేవి ఉండవు. గుంతకల్లు–హిందూపురం మధ్య నడస్తున్న డెమో ప్యాసింజర్ రైలు దాదాపు 200 కి.మీ.లు ప్రయాణించాల్సి ఉంది. గుంతకల్లు నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరిన రైలు హిందూపురానికి రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులు టాయిలెట్కు వెళ్లాలంటే వీలుపడదు. బోగీల్లో టాయిలెట్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో గంటల తరబడి వృద్దులు, మహిళలు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో నిలబడిన వెంటనే రైలు దిగి టాయిలెట్ల వైపు పరుగు తీస్తున్నారు. ఈ లోపు రైలు వెళ్లిపోవడంతో సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైలు మిస్ అయిన ప్రయాణికులు స్టేషన్ మాస్టర్లతో గొడవకు దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్యాసింజర్లు అంటే చులకన... పేదోడి రైళ్లు (ప్యాసింజర్) అంటే రైల్వేశాఖకు చులకనై పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడ్స్ రైళ్లపై ఉన్న శ్రధ్ద ప్యాసింజర్ రైళ్లపై లేదని విమర్శిస్తున్నారు. గుంతకల్లు–గుత్తి. గుత్తి–ధర్మవరం మధ్య డబుల్లైన్ పూర్తయింది. ఈ మార్గంలో ఒకేసారి రెండు రైళ్ల పరుగులు పెడుతాయి. అయితే గూడ్స్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్న సమయంలో డెమో రైళ్లను ఎక్కడ పడితే అక్కడ నిలిపి వేస్తున్నారు. దీంతో ఈ రైళ్లు సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవి ఎండలకు రైళ్లలో ఉక్కపోతకు చిన్నారులు, వృద్దులు తాళలేకపోతున్నారు. -
పొలాల్లో రేషన్ బియ్యం డంప్
పామిడి: మండలంలోని తంబళ్లపల్లి గ్రామ పొలాల్లో కొందరు అక్రమార్కులు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని డంప్ చేశారు. పేదల ఆకలి తీర్చాల్సిన బియ్యాన్ని కొందరు యథేచ్ఛగా నల్లబజారులో అధిక ధరతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లి గ్రామంలోని పాత గంగమ్మ గుడి సమీపంలోని పొలాల్లో సోమవారం నాటికి 70 బస్తాల బియ్యాన్ని కొందరు గుట్టు చప్పుడు కాకుండా డంప్ చేశారు. కొన్ని రోజులుగా ఆటోలో బియ్యాన్ని తీసుకువచ్చి అక్కడ డంప్ చేస్తున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
‘స్టార్’ తిరగబడింది!
● తాడిపత్రిలో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ ● రూ.6 లక్షలతో ఉడాయించిన సంస్థ ఇన్చార్జ్ భాస్కర్ ● సంస్థ సిబ్బందిని నిలదీస్తున్న బాధితులు ● పోలీసులను ఆశ్రయించిన సిబ్బంది, బాధితులు తాడిపత్రి టౌన్: ‘బిజినెస్ చేయాలనుకున్నారా?. సొంత ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు లేక ఆగిపోయారా? ఇప్పుడు మీ కలలను సాకారం చేసేందుకు స్టార్ ఫైనాన్స్ మీ ముందుకు వచ్చింది. సిబిల్ స్కోర్ లేకున్నా మీకు రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఊరించి నెల రోజులు తిరగకుండానే బాధితులకు రూ.6 లక్షల కుచ్చుటోపీ పెట్టి తాడిపత్రిలో ఓ ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. వివరాలు... తాడిపత్రి మండలం కొండేపల్లికి చెందని సాగిబండ భాస్కర్... స్థానిక నంద్యాల రోడ్డులో ఓ గదిని అద్దెకు తీసుకుని స్టార్ పైనాన్స్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. సిబిల్ స్కోర్ లేకపోయినా వ్యక్తిగత రుణాలు, బిజినెస్ లోన్లు, హౌస్.. ప్లాట్ లోన్లు ఇస్తామంటూ ఆకర్షణీయమైన ఫ్లెక్సీలో విస్తృత ప్రచారం చేశాడు. నెలకు రూ.10వేల వేతనంతో దాదాపు 20 మంది సిబ్బందిని నియమించుకుని ఆర్థిక ఇబ్బందులతో బాదపడుతున్న వారిపై ఉసిగొల్పాడు. ఎదుటి వ్యక్తి అవసరాలను బట్టి రుణం మంజూరుకు సంబంధించి రూ.లక్షకు 6 శాతం చొప్పున ప్రాసెసింగ్ పీజును ముందుగానే రాబట్టుకున్నాడు. ఇలా దాదాపు 35 మందితో రూ.6 లక్షలు వసూలు చేసుకుని 30 రోజుల్లోపు రుణం మొత్తం వారి బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుందని నమ్మబలికాడు. దాదాపు నెల రోజలకు పైగా గడుస్తున్నా బ్యాంక్ ఖాతాలకు రుణం మొత్తం జమ కాకపోవడంతో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన పలువురు నేరుగా కార్యాలయానికి చేరుకుని అక్కడున్న సిబ్బందిని నిలదీశారు. దీంతో రేపోమాపో వస్తుందని చెబుతూ వచ్చిన సిబ్బంది సైతం ఫైనాన్స్ సంస్థ నిర్వాహకుడు భాస్కర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో లబోదిబో మంటూ బాధితులతో కలసి సోమవారం ఏఎస్సీ రోహిత్కుమార్కు సమస్య విన్నవించారు. ఘటనపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు
ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, అప్పులు చేస్తే తప్ప ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సోమవారం ఆయన ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీ–నీవా కాలువ విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందని, శుక్రవారం వస్తే ఏ బ్యాంకు నుంచి ఏ ఫోన్ వస్తోందోనన్న భయం వేస్తోందని అన్నారు. బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి మీ డ్యూ డేట్ వచ్చింది.. సోమవారంలోగా వడ్డీ కట్టాలని ఎక్కడ అడు గుతారోనన్న భయం వెంటాడుతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో అతి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడానికి నిధులు వెచ్చిస్తున్నామన్నారు. జిల్లాకు ముఖ్యమైన హంద్రీ–నీవా కాలువను ఈ ఏడాది జూన్ 10 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యం పెంచాలని 2014–19 మధ్యకాలంలో 40 శాతం పనులు పూర్తి చేశామన్నారు. హంద్రీ–నీవా విస్తరణకు రూ.3,800 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.నూతన జిల్లా జడ్జిగా భీమా రావు● నెల్లూరుకు శ్రీనివాస్ బదిలీఅనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఈ. భీమా రావు నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయనను జిల్లాకు బదిలీ చేశారు. ఇక్కడ ఉన్న జి. శ్రీనివాస్ నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అలాగే, అనంతపురం నాలుగో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి (గుత్తి)గా విధులు నిర్వహిస్తున్న శ్రీహరిని పిఠాపురం అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా, అదనపు జిల్లా జడ్జి ఎం. శోభారాణిని సీబీఐ స్పెషల్ జడ్జి (కర్నూలు)గా బదిలీ చేశారు.● ఈ.భీమారావు 1972లో పిఠాపురంలో జన్మించారు.బీఎస్సీ, ఎల్ఎల్బీ కాకినాడలో పూర్తి చేశారు. పిఠాపురంలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. 2013లో అదనపు జిల్లా జడ్జిగా విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. 2017లో ఫ్యామిలీ కోర్టుకు బదిలీ అయ్యారు. అదే సంవత్సరంలోనే విజయనగరం ఫ్యామిలీ కోర్టు కమ్– నాలుగో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొదటిసారి 2020లో పదోన్నతిపై పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.● నెల్లూరుకు బదిలీపై వెళ్తున్న జడ్జి జి. శ్రీనివాస్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సంచలన తీర్పులు వెలువరించారు. కందుకూరు శివారెడ్డి హత్య కేసులో నిందితులకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధించారు. జిల్లా కోర్టు చరిత్రలోనే మొత్తం 12 కేసుల్లో ముద్దాయిలకు జీవిత ఖైదు విధించిన తొలి ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ కావడం గమనార్హం. -
ఆశతో వచ్చాం.. ఆదుకోండి
అనంతపురం అర్బన్: ‘ఎంతో ఆశతో మీ వద్దకు వచ్చాం. కరుణించి ఆదుకోండి’ అంటూ కలెక్టర్, ఇతర అధికారులను ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వి.వినోద్కుమార్తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రమేష్రెడ్డి, తిప్పేనాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 492 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కార క్రమంలో ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదన్నారు. అర్జీదారునితో మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని వారు సంతృప్తి చెందేలా నాణ్యతగా పరిష్కరించడంతో పాటు ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని.... ● చీనీ మార్కెట్ యార్డులో ఈనామ్ వ్యవస్థను రద్దు చేసి వేలం ద్వారా అమ్మకాలు జరపాలని రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్రెడ్డి, బీహెచ్రాయుడు, రాజారాంరెడ్డి విన్నవించారు. నిబంధనలకు విరుద్ధంగా కమీషన్ 10 శాతం వసూలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సూట్ విధానం అరికట్టాలన్నారు. ● తమ తాత పేరున ఉన్న భూమిని వేరొకరు వారి పేరున ఆన్లైన్లో ఎక్కించుకున్నారని అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన తిరుపతయ్య ఫిర్యాదు చేశాడు. బుక్కరాయసముద్రం సిద్ధరాంపురం సర్వే నంబరు 336–1లో 5.08 ఎకరాలు తమ తాత పేరున ఉందని చెప్పాడు. అయితే ముగ్గురు వ్యక్తులు భూమిని తమ పేరున ఎక్కించుకున్నారని, విచారణ చేసి న్యాయం చేయాలని కోరాడు. ● గ్రామకంఠం స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి ప్రహరీ నిర్మిస్తున్నాడని గార్లదిన్నె మండలం కమలా పురానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ప్రహరీ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పాడు. ● వితంతు పింఛను మంజూరు చేయించాలని యాడికికి చెందిన కందికుంట రుక్మిణిదేవి విన్నవించింది. తన భర్తకు వృద్ధాప్య పింఛను వచ్చేదని, ఆయన గత ఏడాది జూన్ 12న చనిపోయాడని చెప్పింది. వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల వేడుకోలు వివిధ సమస్యలపై 492 వినతులు ఈ వృద్ధురాలి పేరు లక్ష్మమ్మ. ఆత్మకూరు మండల కేంద్రంలో నివాసముంటోంది. ఈమెకు నలుగురు కుమారులు సంతానం. భర్త 2016లో చనిపోయాడు. వీరికి సర్వే నంబరు 547–7లో 4.24 ఎకరాల భూమి ఉంది. భూమికి డీ పట్టా, పట్టా నంబరు 3072 పాసుపుస్తకం ఉంది. అయితే, సాగులో ఉన్న తమను భూమిలోకి వెళ్లకుండా కొందరు దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని ఆవేదన చెందింది. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఇబ్బందికి గురిచేస్తున్నారని చెప్పింది. -
రేపు జగన్ పర్యటన
● పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య కుటుంబానికి పరామర్శ రామగిరి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మంగళవారం నాటి జిల్లా పర్యటన ఖరారైంది. రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులైన టీడీపీ నాయకుల చేతిలో దారుణహత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన రానున్నారు. పర్యటన షెడ్యూల్ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం మీడియాకు విడుదల చేసింది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గాన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.40 గంటలకు చెన్నేకొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు వస్తారు. అక్కడ వైఎస్సార్సీపీ నాయకులతో కలసి 10.50 గంటలకు రోడ్డు మార్గాన ఎన్ఎస్ గేట్ మీదుగా బయల్దేరి 11.05 గంటలకు పాపిరెడ్డిపల్లికి చేరుకుంటారు. 12.05 గంటల వరకు లింగమయ్య కుటుంబ సభ్యులను పరామ ర్శించి, ధైర్యం చెప్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి కాన్వాయ్లో చెన్నేకొత్తపల్లి హెలిప్యాడ్కు చేరుకుంటారు. 12.30 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయల్దేరుతారు. ఆలూరు కోనలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం తాడిపత్రి: మండలంలోని ఆలూరు కోనలో వెలసిన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు భూనీల సమేత శేష తల్ప రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనము, అంకురార్పణ, ధ్వజారోహణము, కలశస్థాపన, దీక్షా హోమంతో ఉత్సవాలను ప్రారంభించారు. పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సింహవాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు. -
నేత్రపల్లి బీపీఎంపై వేటు
గుమ్మఘట్ట: మండలంలోని నేత్రపల్లి గ్రామ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (బీపీఎం)గా పని చేస్తున్న సి.కె.జనార్దనరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు గుంతకల్లు పోస్టల్ అసి స్టెంట్ సూపరింటెండెంట్ విజయ్భాస్కర్ ఆదివారం వెల్లడించారు. కాగా, గ్రామంలోని తపాలశాఖ పరిధిలో రికరింగ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాల్లో పలు అవకతవకలకు పాల్పడినట్లుగా జనార్దనరావుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును వారి ఖాతాల్లోకి జమ చేయని అంశంపై ఇటీవల రాయదుర్గం మండలం 74ఉడేగోళం సబ్ పోస్టుమాస్టార్ నాగాబింక ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమికంగా చేపట్టిన విచారణలో అక్రమాలు బహిర్గతం కావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జనార్దనరావు అక్రమాలపై లోతైన విచారణకు పోస్టల్ ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం.చేతిలోని మొబైల్ లాక్కెళ్లిన దొంగరాప్తాడు రూరల్: చేతిలో మొబైల్ పట్టుకుని చూస్తుండగా ఓ యువకుడు లాక్కొని ఉడాయించిన ఘటన ఆదివారం సాయంత్రం అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాలు... అనంతపురం రూరల్ మండలం కొడిమి పంచాయతీ దర్గాకొట్టాలుకు చెందిన జాఫర్ పెయింటింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనిపై ఆదివారం నగరానికి వచ్చిన ఆయన సాయంత్రం బళ్లారి రోడ్డు కూడలిలో ఆటో కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో ఫోన్ రింగ్ కావడంతో జేబులో నుంచి తీసి చూస్తుండగా రెప్పపాటులో ఓ యువకుడు లాక్కొని కళ్యాణదుర్గం రోడ్డు వైపుగా పరుగుతీశాడు. జాఫర్ తేరుకుని గట్టిగా కేకలు వేసినా లాభం లేకపోయింది. చీకట్లు ముసురుకుంటుండడంతో సెకన్లలోనే ఆ యువకుడు కనిపించకుండా పోయాడు. ఇటీవలే రూ. 20 వేలు పెట్టి మొబైల్ కొనుగోలు చేశానని, ఇంతలో ఇలా జరిగిందంటూ బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.హోరాహోరీగా రాతిదూలం పోటీలుపుట్లూరు: శ్రీరామనవమి సందర్భంగా పుట్లూరు మండలం రంగమనాయునిపల్లిలో ఆదివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉదయం ఆలయంలో సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రాతిదూలం లాగుడు పోటీలను నిర్వహించారు. పోటీలను చూసేందుకు పుట్లూరు, యల్లనూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.విచ్చలవిడిగా మద్యం అమ్మకాలుబ్రహ్మసముద్రం : మండల వ్యాప్తంగా గ్రామాల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. వేపులపర్తి గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. అయితే మండల వ్యాప్తంగా టీడీపీ నాయకులు 30 గ్రామాలకు ప్రత్యేక వాహనాల్లో మద్యం సరఫరా చేస్తూ.. 50కి పైగా బెల్టు షాప్లు నడుపుతున్నారు. ఒక్కో బాటిల్పై రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. మండల కేంద్రంలో అయితే ఏకంగా పాత తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే మద్యం విక్రయాలు చేపట్టి, అక్కడే తాగేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణం ఓ బార్లా మారింది. ఎటుచూసిన తాగి పడేసిన మద్యం బాటిళ్లే కనిపిస్తున్నాయి. అదే తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్యూరిఫైడ్ వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చి నీటిని తీసుకెళ్లేందుకు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నామమాత్రంగా గ్రామాల్లో తనిఖీలు చేపట్టి చేతులు తడుపుకునే అధికారులు.. పాత తహసీల్దార్ కార్యాలయం వైపుగా కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. -
రామయ్య చల్లని దీవెనలతో జిల్లా సుభిక్షం
● కలెక్టర్ వినోద్కుమార్ అనంతపురం అర్బన్: రామయ్య చల్లని దీవెనలతో జిల్లా సుభిక్షంగా ఉండాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆకాంక్షించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక కృష్ణకళామందిర్లోని శ్రీ సీతారాముల దేవాలయంలో రెవెన్యూ సొసైటీ, రెవెన్యూ అసోసియేషన్, రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ దంపతులు పాల్గొని సీతారాముల కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారాముల కృపాకటాక్షాలతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, తహసీల్దారు హరికుమార్, సంఘాల నాయకులు దివాకర్రావు, కుళ్లాయప్ప, సంజీవరెడ్డి, హరిప్రసాద్రెడ్డి, భరత్, సంజీవరాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు హెడ్క్వార్టర్స్లో.. అనంతపురం: జిల్లా పోలీసు హెడ్క్వార్టర్స్లోని కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు. సీతారాముల వారి కల్యాణం అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు, సీఐలు ధరణి కిశోర్, హేమంత్ కుమార్, శేఖర్, జయపాల్ రెడ్డి, ఆర్ఐలు మధు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ రవిరాం నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
జగన్కు మద్దతుగా నిలుద్దాం
● కురుబ యువత రాష్ట్ర అధ్యక్షుడుబిల్లే మంజునాథ్ పిలుపుఅనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో కురుబలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లి అన్ని విధాలుగా అండగా నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుబలు మద్దతుగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందని, వైఎస్ జగన్కు అండగా నిలవాలని కురుబ యువత రాష్ట్ర అధ్యక్షుడు బిల్లే మంజునాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ నాయకులు ఇటీవల హత్య చేశారన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని హతుడి కుమారుడు మీడియా ముందు బహిర్గతం చేశారని గుర్తు చేశారు. ఆ కుటుంబానికి కురుబలందరూ అండగా నిలవాలన్నారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 8న వైఎస్ జగన్ రానున్నారని, కురుబలు పెద్ద ఎత్తున పాపిరెడ్డిపల్లికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కురుబల మీద ఎలాంటి దాడులు జరగకుండా అందరూ ఐక్యంగా నిలవాలని కోరారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కురుబలు వైఎస్సార్సీపీకి పూర్తిస్థాయిలో మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకూడేరు: ఉత్తీర్ణతపై అనుమానంతో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం జయపురం గ్రామానికి చెందిన మదన్మోహన్, సునీత దంపతులకు కుమార్తె అర్చన (16), ఓ కుమారుడు ఉన్నారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న అర్చన ఇటీవల మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి చేరుకుంది. పరీక్షలు సక్రమంగా రాయలేకపోయానని, ఫెయిల్ అవుతానంటూ తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడేది. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన అర్చన... ఆదివారం వేకువజామున ఇంట్లోనే బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.యువకుడి దుర్మరణంగుత్తి: ట్రాక్టర్ ట్రాలీ కింద చిక్కుకుని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రమణ, సుజాత దంపతుల చిన్న కుమారుడు విజయ్ రాఘవేంద్రగౌడ్ (19) ఆదివారం ఉదయం చెర్లోపల్లి గ్రామ సమీపంలో నుంచి ఎరువును తరలించేందుకు ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. ట్రాలీలోకి ఎరువు లోడు చేస్తుండగా హైడ్రాలిక్ లిఫ్ట్ పనితీరును పరిశీలించాడు. లిఫ్ట్ సక్రమంగా పనిచేయకపోవడంతో కిందకు సరి చేస్తుండగా ఉన్నఫళంగా ట్రాలీ కిందకు దిగింది. దీంతో ట్రాలీ కింద చిక్కుకున్న విజయ్రాఘవేంద్రను స్థానికులు గమనించి వెలికి తీసేలోపు మృతిచెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
13 నుంచి రత్నగిరిలో బ్రహ్మోత్సవాలు
రొళ్ల: మండలంలోని రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాజవంశీకుడు రంగప్పరాజు (దొర), ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఈ ఆలయానికి దాదాపు 628 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. రాజవంశీకులతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారు, సమీపంలోని కర్ణాటక వాసులు తమ ఇలవేల్పుగా అమ్మవారిని కొలుస్తుంటారు. 13న జలధి ఉత్సవం, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 14న బ్రహ్మరథోత్సవం, ధూళోత్సవం, 15న జలధి, కలశ ఉత్సవం, గంగ పూజ, 16 నుంచి 19వ తేదీ వరకు అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలు, 20న అమ్మవారికి పుష్పాలంకారణ, పోతులరాజుల విశేష పూజ, 21న పోతురాజు బండార కార్యక్రమం, తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా పశువుల జాతరను నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవాలకు వచ్చి వెళ్లే భక్తుల సౌకర్యార్థం మడకశిర డిపోతో పాటు కర్నాటకలోని మధుగిరి, శిర, పావగడ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. -
మచ్చుకు కొన్ని....
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ ఆదేశాలను ఎమ్మెల్యేలు కనీసంగానూ లెక్క చేయడం లేదు. ‘సర్కారుది ఒకదారైతే... మాది మరోదారి’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా వారికి పట్టడం లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థలో వెలుగుచూసిన ఓ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ఒక వైపు ప్రభుత్వమేమో రేషన్ బండ్ల (ఎండీయూ) ద్వారా బియ్యం, సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశిస్తుంటే.. మరోవైపు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో ఎండీయూలు తిరగకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. భయంతో కొందరు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తప్పడు లెక్కలతో నివేదిక.. ఎండీయూలు కదలకుండా ఉంటున్నా.. ప్రతి నెలావాటి ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వానికి అధికారులు తప్పుడు లెక్కలతో నివేదికలు పంపిస్తున్నట్లు తెలిసింది.జిల్లావ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 405 ఎండీయూలు ఉన్నాయి. వీటిలో 297 వాహనాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు, 27 తాత్కాలికంగా పనిచేస్తున్నట్లు, 81 వాహనాలు పనిచేయడం లేదంటూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ క్రమంలో ఒక్కో వాహనానికి రూ.21 వేల లెక్కన 324 వాహనాలకు ప్రతి నెలా రూ.68.04 లక్షలు వేతనం కింద విడుదలవుతుండటం గమనార్హం. వాస్తవంగా 405 వాహనాలకు గానూ క్షేత్రస్థాయిలో 30 ఎండీయూలకు మించి పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. దీన్ని బట్టి తిరగని వాహనాలకూ వేతనం చెల్లిస్తుండడం అవినీతిలో మరో కోణం! ● అనంతపురం అర్బన్లో 39 ఎండీయూలు ఉంటే 35 పూర్తిస్థాయిలో, ఒకటి తాత్కాలికంగా పనిచేస్తున్నాయని, మూడు పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా అనంతపురం అర్బన్ పరిధిలో రెండు, మూడు తప్ప మిగిలినవి తిరగడం లేదు. వాటిని కూడా ఒకట్రెండు రోజులు మాత్రమే తిప్పుతున్నారు. ● అనంతపురం రూరల్ పరిధిలో 20 ఎండీయూలు ఉంటే 18 పూర్తిస్థాయిలో, ఒకటి తాత్కాలికంగా పనిచేస్తుండగా, ఒకటి పనిచేయడం లేదు. అయితే అధికారుల ఒత్తిడితో రెండు, మూడు వాహనాలు ఒకట్రెండు రోజులు మొక్కుబడిగా తిప్పుతున్నారు. ● గుత్తిలో 16 ఎండీయూలు ఉండగా అన్ని వాహనాలు తిరుగుతున్నట్లు అధికారిక నివేదిక చెబుతోంది. అదే విధంగా పామిడి మండలంలో 11 ఎండీయూలు ఉంటే అన్నీ తిరుగుతున్నట్లు చూపిస్తున్నారు. ● కణేకల్లు మండలంలో 11 వాహనాలు ఉంటే 11 తిరుగుతున్నట్లు, గుమ్మఘట్టలో 10 ఎండీయూలు ఉంటే 10 తిరుగుతున్నట్లు, డి.హీరేహాళ్లో 9 ఉంటే అన్నింటి ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కావాల్సినంత నొక్కడానికే... ‘కూటమి’ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేలు పాత డీలర్లను తొలగించి తమ పార్టీ వారిని నియమించారు. ఈ క్రమంలో ఎండీయూల ద్వారా అయితే రేషన్ సరుకుల నొక్కుడుకు అవకాశం ఉండదనే ఆలోచనతో డీలర్లు అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాహనం ద్వారా పంపిణీ చేస్తే బియ్యం, కందిపప్పు, చక్కెర నొక్కేసేందుకు వీలుండదు. కోటా మేరకు వాహన నిర్వాహకుడికి సరుకులు అప్పగించాలి. అదే స్టోర్ ద్వారా అయితే తూకంలో మోసం చేసి రెండుమూడు కిలోల బియ్యం తక్కువగా, ఇక మిగతా సరుకులు ఇవ్వకుండా మిగుల్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నొక్కుడు కోసమే ఎండీయూల ద్వారా రేషన్ పంపిణీ చేయకుండా ఎమ్మెల్యేల ద్వారా అధికారులపై డీలర్లు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ అంశంపై డీఎస్ఓ (జిల్లా పౌర సరఫరాల అధికారి) జగన్మోహన్ వివరణ తీసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
కమనీయం.. సీతారాముల కల్యాణం
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేలాదిమంది భక్తుల రామనామస్మరణ మధ్య సీతారాముల కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం వేకువజామునే ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అర్చకులు అనంతరం ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సీతారాముల ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. ఆలయ ఈఓ వాణి, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో స్వామివార్లను, కల్యాణోత్సవ సామగ్రిని, పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుముహూర్తాన మాంగల్య ధారణ గావించారు. మహామంగళ హారతితో ఘట్టాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. రెండు గంటల పాటు సాగిన ఉత్సవంలో భక్తులు రామనామస్మరణ చేస్తూ తన్మయత్వం పొందారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను గజవాహనంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. కసాపురంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు -
సాంకేతిక విద్య.. ఉజ్వల భవిత
అనంతపురం: డిప్లొమా కోర్సులకు డిమాండ్ భారీగా నెలకొంది. ఈ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాలీసెట్ రాయాల్సి ఉంటుంది. ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ పాలీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులకు ఆసక్తి ఉన్న ఏ కోర్సులోనైనా చేరి ఇష్టంగా చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. చిరుప్రాయంలోనే ఐదు అంకెల వేతనం.. పూర్తిగా ప్రాక్టికల్ ఓరియంటేడ్ సిలబస్ ఉన్న పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. దీంతో 19 సంవత్సరాల్లోపే రూ.20 వేల నుంచి రూ.25 వేల వేతనం అందుకునే అవకాశముంది. తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య పూర్తి చేసే అవకాశం కేవలం డిప్లొమా కోర్సులతోనే సాధ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. సింహభాగం కంపెనీలు సైతం ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారి కంటే డిప్లొమా పూర్తి చేసిన వారినే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిప్లొమా కోర్సుల్లో విద్యార్థులను తీర్చిదిద్దడమే ఇందుకు కారణం. ఇంటర్మీడియట్ తరువాత ఇంజినీరింగ్ కోర్సు చదివితే ఆరు సంవత్సరాల కాల వ్యవధి అనివార్యం. ఇలా కాకుండా కేవలం పదో తరగతి ఉత్తీర్ణత అనంతరం మూడేళ్లలో డిప్లొమా కోర్సు పూర్తి చేస్తే కొలువు దక్కడం ఖాయమని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. కోర్ బ్రాంచ్లే అధికం.. ఇంజినీరింగ్లో కోర్ బ్రాంచ్ల్లో గణనీయంగా అడ్మిషన్లు పడిపోయి కొత్త బ్రాంచ్ల వైపు విద్యార్థులు చూస్తున్నాయి. కానీ డిప్లొమోలో కోర్ బ్రాంచ్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి కోర్ బ్రాంచ్లతో పాటు కంప్యూటర్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులువుగా దక్కుతాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కళాశాలల్లో తరచూ ఉద్యోగమేళాలు నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమో కోర్సు పూర్తి చేయడానికి మూడేళ్లకు కలిపి కేవలం రూ.13 వేలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ కింద) నేరుగా చేరవచ్చు. లేదా ఉద్యోగంలో చేరవచ్చు. పాలీసెట్ ఎంట్రెన్స్ ఇలా.. పాలీసెట్ను 120 మార్కులకు నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ నెల 30న పాలీసెట్ నిర్వహించనున్నారు. డిప్లొమా కోర్సులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ నెల 30న పాలీసెట్ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఉచిత శిక్షణ పాలీసెట్కు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత కోచింగ్ ఇస్తున్నాం. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైనా ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవచ్చు. – సి.జయచంద్రారెడ్డి, పాలీసెట్ జిల్లా కో–ఆర్డినేటర్, అనంతపురం -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
గార్లదిన్నె: శ్రీరామనవమి సందర్భంగా గార్లదిన్నె మండలం కల్లూరులో నిర్వహించిన గ్రామీణ క్రీడాపోటీలు ఉత్సాహంగా... ఉల్లాసంగా సాగాయి. అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఆదివారం ఈ పోటీలను నిర్వహించారు. పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. 151 కిలోల ఇసుక మూట ఎత్తే పోటీల్లో పాల్తూరు రాజు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానంలో కల్లూరు సుధాకర్ నిలిచాడు. 146 కిలోల బరువున్న గుండును ఎత్తే పోటీల్లో మాధవరం రాజశేఖర్ మొదటి స్థానం, ప్యాపిలి మండలానికి చెందిన ఈశ్వరరెడ్డి రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. 60 కిలోల బరువున బండను ఒక్క చేతితో పైకి ఎత్తే పోటీల్లో మొదటి స్థానాన్ని హుస్సేన్ దక్కించుకోగా, రెండో స్థానంలో ఈశ్వరరెడ్డి నిలిచాడు. కర్ర సాము పోటీల్లో మొదటి స్థానంలో రాజేష్, రెండో స్థానంలో యాడికి నాగార్జున గెలుపొందారు.ఇరుసు పోటీల్లో మొదటి స్థానంలో నాగులాపురం వనేంద్ర, రెండవ స్థానంలో వంకరాజుకాలువ నరేష్ నిలిచారు. విజేతలను గ్రామస్తులు అభినందించి, నగదు పురస్కారాలతో సత్కరించారు. -
వేమన ఉత్సవాలు ప్రారంభం
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో వెలసిన విశ్వకవి యోగి వేమన ఆలయంలో ఉత్సవాలు ఆదివారం రాత్రి ఆలయ పీఠాధిపతి నందవేమారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేమన సమాధిని ప్రత్యేకంగా ఆలంకరించి పూజలు చేశారు. కదిరి లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్థరాత్రి ఆలయ ప్రధాన ద్వారం ఎదుట ఉడికించిన జొన్నలను భం పోసి పసుపు కుంకుమ కలిపి ఆదిశక్తి పూజలు నిర్వహించారు. అనంతరం జొన్న ధాన్యాన్ని ప్రసాదంగా భక్తులు స్వీకరించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా సోమవారం బండ్ల మెరవణి, ఆర్కెస్ట్రా (పాటల కచేరి) ఉంటుంది. మొక్కుబడి ఉన్న భక్తులు ఎడ్ల బండ్లను అలంకరించి ఆలయం ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు చేయిస్తారు. -
అశాసీ్త్రయ సంస్కరణలపై ఉద్యమిద్దాం
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాల విద్యలో జీఓ 117 రద్దుకు సంబంధించిన అశాసీ్త్రయమైన సంస్కరణలపై ఉద్యమించి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసనాయక్, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె.కులశేఖరరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ మాట్లాడారు. ఉపాధ్యాయ సీనియార్టీ జాబితాలో ఉన్న తప్పిదాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అప్ గ్రేడ్ కానీ ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. జిల్లా నాయకత్వం పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమంలోనూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఫెడరేషన్ సబ్ కమిటీ సభ్యులు వజీర్ బాషా, అశోక్ నాయక్, కమిటీ సభ్యులు నరసింహులు, రమేష్ రెడ్డి, సూరి, నాగిరెడ్డి నారాయణ నాయక్, హుస్సేన్ ఖాన్, ఆదినారాయణ, ఫక్రుద్దీన్, హుస్సేన్ పీరా, వెంకటేశ్వర రెడ్డి, రహంతుల్లా, నారాయణరెడ్డి, గురప్ప పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) నాయకుల పిలుపు -
సమ్మెలో ‘శ్రీరామరెడ్డి’ కార్మికులు
కళ్యాణదుర్గం రూరల్/కూడేరు: బకాయి వేతనాలు, పీఎఫ్తోపాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మికులు శనివారం అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. కూడేరు మండలం పీఏబీఆర్ వద్ద ఉన్న శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్లోని మోటార్లను బంద్ చేశారు. దీంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం పీఏబీఆర్ వద్ద ఉన్న తాగునీటి ప్రాజెక్ట్, కళ్యాణదుర్గంలోని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పంప్ హౌస్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ఉపాధ్యక్షుడు రామాంజి, సహాయ కార్యదర్శి అచ్యుత్ప్రసాద్ మాట్లాడారు. శ్రీరామరెడ్డి నీటి సరఫరా కార్మికులపై కూటమి ప్రభుత్వం నిర్యక్షంగా వ్యవహరిస్తోందన్నారు. కూటమి నాయకుల మాటలు నమ్మి గతంలో కార్మికులు చేపట్టిన సమ్మెను విరమించారని, నాడు ఇచ్చిన హామీ మేరకు నేటికీ సమస్యలు పరిష్కరించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి 600 మంది కార్మికులు దసరా, సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి వంటి పండగల పూట పస్తులుండాల్సి వచ్చిందన్నారు. గతంలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సైతం స్పష్టమైన హామీనిచ్చారని గుర్తు చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రీరామరెడ్డి వాటర్ వర్క్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి, మాజీ అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండారెడ్డి, కార్మికులు వన్నూరుస్వామి, ఈశ్వరయ్య, మల్లికార్జున, రమేష్, కాసీం, శ్రీనివాసులు, శ్రీనివాసులు రెడ్డి, రవి, గణేష్, తదితరులు పాల్గొన్నారు. -
●జిల్లాలో 44 వేల ఎకరాల్లో సాగు ●ఎకరాకు రూ.30 వేలకుపైగా పెట్టుబడి ●వ్యవసాయ బోర్లు, బావుల కింద సాగు ●అదునులో వేస్తేనే ప్రయోజనం
బొమ్మనహాళ్: ఈ వేసవిలో రైతులు పత్తి పంట వైపు దృష్టి సారించారు. సాధారణంగా ఏప్రిల్ మొదటి వారంలో పత్తి సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది మార్చి చివరి వారం నుంచే వ్యవసాయ బోర్లు, బావుల కింద పత్తి సాగు చేస్తున్నారు. వేసవిలో వరి, మిరప, పత్తి మాత్రమే సాగు చేయవచ్చు. జిల్లాలోని బొమ్మనహాళ్, కణేకల్లు, డి.హీరేహాళ్, విడపకల్లు, పెద్దవడూగూరు, యాడికి, పామిడి, శింగనమల, పాల్తూరు, పెద్దపప్పూరు, గుత్తి, తాడిపత్రి, వజ్రకరూరు, ఉరవకొండ తదితర మండలాల్లో 44 వేల ఎకరాల్లో నాయక్, ఆర్మీ, సూపర్ బంటు, నందిని, తేజ తదితర రకాల పత్తి వేశారు. సాగు చేసినప్పటి నుంచి దిగుబడులు వచ్చే వరకు నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ముంగారు వర్షాలు రాకపోతే ఎక్కువ తడులు ఇవ్వాల్సి ఉంటుంది. కాపు దశలో వర్షాలు పడితే పంట ఏపుగా పెరుగుతుంది. వేసవిలో మొలకెత్తాక ఉష్ణోత్రగలకు పత్తి దెబ్బతినకుండా తట్టుకుంటుందనే సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.30 వేలకుపైగా పెట్టుబడులు పెడుతున్నారు. సాగు చేసిన నాలుగు నెలలకే దిగుబడులు అందుతాయి. దిగుబడులు ప్రారంభమైన 40 రోజులకు పూర్తిగా చేతికి వస్తాయి. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దాకా దిగుబడులు వస్తాయని రైతులు అంచనా వేస్తున్నారు. ధరలు ఉంటే మంచి ఆదాయమే పత్తికి మార్కెట్లో ధరలు బాగుంటే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. గత ఏడాది క్వింటా రూ.7,300 నుంచి రూ.8,200 వరకు ధర పలికింది. ఈ ఏడాది మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
ఆదర్శప్రాయుడు జగ్జీవన్రామ్
అనంతపురం కార్పొరేషన్: స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయవేత్త, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రామ్ ఆదర్శప్రాయుడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత మాట్లాడుతూ జగ్జీవన్రామ్ సేవలను కొనియాడారు. ఆయన పోరాటాలను స్మరించుకోవడంతో పాటు స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగ్జీవన్ ఆశయాలను పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్రామ్ స్వాతంత్య్రోద్యమంలో ఎంతో కీలకంగా పని చేశారన్నారు. అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు రావాలని పోరాడారన్నారు. మేయర్ వసీం మాట్లాడుతూ జగ్జీవన్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, అనుబంధ సంఘాల అధ్యక్షులు మల్లెమీద నరసింహులు, అమర్నాథ్రెడ్డి, నాయకులు పెన్నోబులేసు, మాల్యవంతం మంజుల, చామలూరు రాజగోపాల్, ఎగ్గుల శ్రీనివాసులు, చింతకుంట మధు, రాధాకృష్ణ, పసులూరు ఓబులేసు, కొర్రపాడు హుస్సేన్ పీరా, వనారస బలరాం, లక్ష్మణ్, తలారి వెంకటేష్, అనిల్కుమార్ గౌడ్, కార్పొరేటర్లు రహంతుల్లా, కమల్భూషణ్, సాకే చంద్రలేఖ, రాజేశ్వరి, శేఖర్బాబు, ఇసాక్, తదితరులు పాల్గొన్నారు. బీసీ కులాలపై పరిటాల కుటుంబం కక్ష కట్టింది వైఎస్సార్సీపీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివ ధ్వజం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
బుగ్గ రామలింగేశ్వరుడిని తాకిన సూర్యకిరణాలు
తాడిపత్రి రూరల్: పట్టణంలోని పార్వతీ సమేత బుగ్గరామలింగేశ్వరస్వామి మూల విరాట్ను శనివారం సూర్య కిరణాలు తాకాయి. పెన్నానది ఉత్తర, దక్షిణంగా ప్రవహిస్తూ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పార్వతీ సమేత బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రతి ఏటా రెండు పర్యాయాలు స్వామి వారిని సంధ్యా సమయంలో కిరణాలు తాకుతాయి. ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా చూసిన భక్తులు పరవశించిపోయారు. అనంతరం స్వామి వారికి అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.రైల్లోంచి జారిపడి ప్రయాణికుడి దుర్మరణంగుత్తి: రైల్లోంచి జారిపడి ఓ ప్రయాణికుడు దుర్మరణం చెందాడు. గుత్తి రైల్వేస్టేషన్ సమీపంలోని పెండేకల్లు క్రాసింగ్ లైన్ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ రైలులో ప్రయాణిస్తున్న మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన యశ్వంత్ నాగోరావ్(43) ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. జీఆర్పీ ఎస్ఐ నాగప్ప పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కురుబ లింగమయ్యది రాజకీయ హత్యే
సాక్షి, పుట్టపర్తి: రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్యది ముమ్మూటికీ రాజకీయ హత్యే అని వైఎస్సార్సీపీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఎ. శివ స్పష్టం చేశారు. శనివారం ఆయన లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ పరిటాల కుటుంబం ఆధిపత్యం కోసం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా గడిపారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హత్యా రాజకీయాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక బీసీ వర్గానికి చెందిన లింగమయ్యను దారుణంగా హత్య చేయించారని ఆరోపించారు. లింగమయ్య హత్యలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరో వైపు రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగానికి శ్రీకారం చుట్టి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ద్వజమెత్తారు. రాప్తాడులో పరిటాల రాజ్యాంగం నడుస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు, హత్యలు చేస్తున్నారని, ఇవి కొన్నాళ్లే అని, తమ ప్రభుత్వం వస్తే అప్పుడు వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. హిందూపురం ఎంపీ పార్థసారథి, మంత్రి సవిత కురుబ సామాజిక వర్గానికి చెందిన వారే అయినా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. త్వరలోనే తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఆసీఫుల్లా, మహేష్ గౌడ్, మల్లికార్జున, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుత్తి రూరల్: శ్రీపురం గ్రామంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని సర్పంచ్ ఉండ్ర రామలింగమయ్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, నంద్యాల, అన్నమయ్య జిల్లాల వృషభాలు పాల్గొన్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన మస్తాన్యాదవ్ వృషభాలు మొదటి స్థానంలో నిలిచి రూ.30వేలు, బొమ్మనహాల్ మండలం గోవిందవాడకు చెందిన గురుస్వామి వృషభాలు రెండవ స్థానంలో నిలిచి రూ.20వేలు, లింగదల్ ఎర్రిస్వామి వృషభాలు మూడో స్థానంలో నిలిచి రూ.15 వేలు నగదు బహుమతి గెలుచుకున్నాయి. వైఎస్సార్ జిల్లా వేముల మండలం తెర్నపాడు గ్రామానికి చెందిన భువనేశ్వర్ కుమార్ వృషభాలు రూ.10వేలు, గుత్తి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మోహన్బాబు వృషభాలు రూ.5వేల నగదు బహుమతులు గెలుపొందాయి. కార్యక్రమంలో గ్రామస్తులు కోనా లక్ష్మణరావు, చంద్ర, లోకేష్, నామాల సందీప్ పాల్గొన్నారు. -
కష్టపడి చదివితే లక్ష్యాలను చేరుకోవచ్చు
● జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ ఉరవకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే తాను ఐఏఎస్ సాధించానని, ఇష్టంతో కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యాలనైనా చేరుకోవచ్చని జాయింట్ కలెక్టర్ శివనారాయణ్శర్మ పేర్కొన్నారు. శనివారం అనంతపురంలోని రోటరీపురం వద్ద సీసీఎల్ క్యాంపస్లో ఉరవకొండకు చెందిన నిస్వార్థ ఫౌండేషన్, హైదరాబాద్కు చెందిన అభయ ఫౌండేషన్ సంయుక్తగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులకు ‘సూపర్–60’ పేరుతో ఏపీఆర్జేసీ, పాలిసెట్, ఆర్డీటీ సెట్కు ఉచిత కోచింగ్ ప్రారంభించాయి. జాయింట్ కలెక్టర్ హాజరై విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల్లో చదవితేనే ర్యాంకులు వస్తాయని అనుకోవడం భ్రమ అని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐఏఎస్, ఐపీఎస్ సాధించిన వారు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. అనంతరం అభయ ఫౌండేషన్ నిర్వాహకులు స్వామి బాలచంద్ర మాట్లాడుతూ రూ.లక్షల కోసం కాకుండా లక్ష్యం కోసం చదవాలని సూచించారు. పరీక్షల కోసం మాత్రమే శిక్షణ కాదని, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఇస్తున్నామని చెప్పారు. నిస్వార్థ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెంకట్ తాటికొండ మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జైకిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగమల్లి ఓబుళేసు, నిస్వార్థ ఫౌండేషన్ సభ్యులు చంద్ర, వాణి, రజినీ తదితరులు పాల్గొన్నారు. జీసీజీటీఏ జిల్లా నూతన కార్యవర్గం అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం (జీసీజీటీఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం నగరంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పి.శ్రీధర్రెడ్డి, కార్యదర్శిగా వి.షణ్ముక ఆచారి, ఉపాధ్యక్షుడిగా వి.వీరాంజనేయులు, జాయింట్ సెక్రటరీగా జి.నారాయణస్వామి, మహిళా విభాగం కార్యదర్శిగా కె.శ్రీసుధ, స్టేట్ కౌన్సిలర్లుగా బి.బాపూజీ, పి.హనుమంతరెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా బి.మనోహర్రెడ్డి వ్యవహరించారు. -
●కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే జిల్లాకు 8న వైఎస్ జగన్ రాక ●పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలపాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ‘‘ఫ్యాక్షన్ ఆనవాళ్లే ఉండకూడదని గడిచిన ఐదేళ్లలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. ఈ కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం సాగవు. చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి పేర్కొన్నారు.టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ మజ్జిగ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 8న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్న నేపథ్యంలో శనివారం నగరంలోని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మాజీ మంత్రి శంకరనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సతీష్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8న ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో చెన్నేకొత్తపల్లికి చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా 10 గంటలకు పాపిరెడ్డిపల్లికి చేరుకుని లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలను కాపాడే అంశంలో తరతమ భేదాలు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులు, దాడులు నిత్యకృత్యమయ్యా యన్నారు. కేవలం తమ ఉనికిని కాపాడుకునేందుకు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను హతమార్చడం వారి క్రూర ఆలోచన విధానానికి అద్దం పడుతోందన్నారు. ఎన్నికలకు ముందు అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పది నెలలవుతున్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేదని విమర్శించారు.సమావేశంలో మేయర్ వసీం, వైఎస్సార్ సీపీ కదిరి, మడకశిర నియోజకవర్గాల సమన్వయకర్తలు మక్బూల్బాషా, ఈరలక్కప్ప, ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి, నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి, మహాలక్ష్మీ శ్రీనివాస్, నదీం అహమ్మద్, రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, గంగుల భానుమతి, మీసాల రంగన్న, పామిడి వీరా, రంగంపేట గోపాల్రెడ్డి, రమేష్రెడ్డి తదితరులుపాల్గొన్నారు. ప్రజల్లో భయం పుట్టించేందుకే కురుబ లింగమయ్య హత్య దారుణ ఘటనను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలి లింగమయ్యలా మరో కార్యకర్తకు అన్యాయం జరగకూడదు వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి పిలుపు మాజీ సీఎం పర్యటన ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం -
అరాచకాలు పేట్రేగిపోయాయి
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అరాచకాలు పేట్రేగిపోయాయి. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితిని టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కల్పించలేదు. స్థానిక సంస్థల స్థానాల్లో ఏమాత్రం బలం లేకపోయినా పోలీసు, రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని కుట్ర చేశారు. ఇందులో భాగంగానే కురుబ లింగమయ్యను హత్య చేశారు. ఎస్పీ దుస్తులను కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు వేసుకుని పోలీసు వ్యవస్థను శాసిస్తున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేను నియోజకవర్గంలో అడుగుపెట్టకూడదంటే పోలీసులు అదే అమలు చేయడం అన్యాయం. ప్రతి కార్యకర్తకు ధైర్యం నింపేందుకే వైఎస్ జగన్ జిల్లాకు వస్తున్నారు. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
నిద్రలేమితో వచ్చే సమస్యలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రకరకాల వ్యసనాలు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించినా రకరకాల ఒత్తిళ్లు, రుగ్మతలతో రాత్రి ఒంటిగంట దాటినా నిద్ర పట్టడం లేదు. యాభై ఐదేళ్లు దాటిన వారి సంగతి అటుంచితే నిండా ముప్ఫై కూడా లేని కుర్రాళ్లు కూడా ఇబ్బంది పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 30– 40 ఏళ్ల వారిలో ఎక్కువ.. వాస్తవానికి యువకులకు నిద్రలేమి ఉండకూడదు. కానీ మొబైల్ వ్యసనం, బెట్టింగ్లు, ఆర్థిక పరిస్థితులు, ఆల్కహాల్, ఉద్యోగాల్లో ఒత్తిడి వెరసి రాత్రి పొద్దు పోయే వరకూ నిద్ర ఉండటం లేదు. మొబైల్కు అతుక్కుపోతుండటం అతిపెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 8 లక్షల మందికి పైగా ముప్ఫై ఏళ్లలోపు యువత చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నట్టు అంచనా. సామాజిక మాధ్యమాల్లో గంటల కొద్దీ ఉండిపోతూ సమయం సంగతే మరిచిపోయిన పరిస్థితి. దీంతో నలభై ఏళ్లు దాటే లోపే జీవనశైలి జబ్బుల బారిన పడుతున్నట్టు తేలింది. 30 నుంచి 40 ఏళ్లలోపు వారికి నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన ఓ పరిశీలనలో వెల్లడైంది. హైపర్ టెన్షన్ (రక్తపోటు) ఒత్తిడి పెరిగి మధుమేహం మతిమరుపు గుండె సంబంధిత సమస్యలు ఊబకాయం మెదడుపై ఒత్తిడి పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ -
60 శాతం మందిలో సమస్య
నిద్రలేమిని వైద్య పరిభాషలో ‘స్లీప్ డిప్రెషన్’ అంటాం. దీన్ని చాలామంది గుర్తించడం లేదు. సకాలంలో గుర్తించి డాక్టర్ కౌన్సెలింగ్ తీసుకుంటే నియంత్రించవచ్చు. దీర్ఘకాలంగా ఇలా స్లీప్ డిప్రెషన్లో ఉంటే పనిచేసే సామర్థ్యం కోల్పోతారు. కుటుంబ, ఆర్థిక, ఉద్యోగ ఒత్తిళ్లతో స్లీప్ డిప్రెషన్ వస్తుంది. 60 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి. మొబైల్ను వీలైనంతగా తగ్గించడం మంచిది. –డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు, జాతీయ హెల్త్ మిషన్ -
మహనీయుడు జగ్జీవన్ రామ్
అనంతపురం టవర్క్లాక్/సిటీ: సమాజంలో సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు జగ్జీవన్రామ్ అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బాబు జగ్జీవన్రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం నగరంలో చర్చి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ జయంతిని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తోందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారన్నారు. యుక్త వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. నేటి తరం ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, డీఆర్ఓ మలోల, ఆర్డీఓ కేశవనాయుడు తదితరులు పాల్గొన్నారు. కోడుమూరు వాసిపై పోక్సో కేసు తాడిపత్రిటౌన్: మైనర్ను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన వ్యక్తిపై తాడిపత్రి పట్టణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాడిపత్రికి చెందిన 17 ఏళ్ల అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన రామాంజనేయులు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో అమ్మాయికి మాయమాటలు చెప్పి తన స్వగ్రామానికి తీసుకెళ్లి.. ఆరు నెలలు సహజీవనం చేసి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరితే నిరాకరించాడు. దీంతో బాధితురాలు తాడిపత్రికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు రామాంజనేయులుపై సీఐ సాయిప్రసాద్ శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. నేడు సీతారాముల కల్యాణం గుంతకల్లు రూరల్:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం సీతారాముల కల్యాణోత్స వాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కల్యాణోత్సవం సాగుతుంది. భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈఓ కే. వాణి కోరారు. -
డాక్టర్ మధు మృతిపై అనుమానాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నగరంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న దంతవైద్యులు అమిలినేని మధు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబసభ్యుల వాంగ్మూలం మేరకు మేడపై నుంచి కాలుజారి పడి మృతి చెందినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఆయనది ప్రమాదవశాత్తు జరిగిన మృతి కాదని, ఆత్మహత్య చేసుకున్నారని స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏరోజూ పై అంతస్తుకు వెళ్లి నీళ్ల ట్యాంకును పరిశీలించలేదని, ఇప్పుడెందుకు చేసి ఉంటారని చెబుతున్నారు. పైగా భార్య, తల్లిదండ్రులు, సోదరులు ఇచ్చిన స్టేట్మెంట్లే ఫైనల్గా మూడో పట్టణ సీఐ కేసు నమోదు చేశారు. కానీ తల్లిదండ్రులు వేరే కాలనీలో ఉంటున్నారు, మధు కుటుంబం రెవెన్యూ కాలనీలో ఉంటుంది, తమ్ముడు కోర్టు రోడ్డులో ఉంటున్నారు.. వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వీళ్లు కాలుజారి పడినట్టు చెప్పడం అనుమానాలకు తావిస్తోందని మధుకు బాగా కావాల్సిన వారు చెబుతున్నారు. ఒక ఉన్నతాధికారి జోక్యం మేరకు పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే తతంగం పూర్తి చేశారని తెలుస్తోంది. చెడ్డపేరు రాకుండా చూడండి! మధు, ఆయన భార్య సుష్మ ఇద్దరూ దంతవైద్యులు. టవర్క్లాక్ సమీపంలో రూప డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. చనిపోవడానికి రెండు, మూడు గంటల ముందు క్లినిక్ నుంచి ఇంటికెళ్లే సమయంలో.. ‘నేను ఇక రాను, నాకు చెడ్డపేరు తెచ్చేలా క్లినిక్ను నిర్వహించొద్దు’ అని అన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది ఎవరికీ చెప్పకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం. గత కొన్ని నెలలుగా మధు.. మానసికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు ఆయన మిత్రులు చెబుతున్నారు. కాగా, త్రీటౌన్ అంటే తిమ్మిని బమ్మిని చేసే స్టేషన్ అని ఇప్పటికే విమర్శలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లు చెప్పినట్టే కేసు నమోదు: సీఐ భార్య, తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంటు ప్రకారమే కేసు నమోదు చేశామని త్రీటౌన్ సీఐ శాంతిలాల్ తెలిపారు. మృతిపై అనుమానముందని ఎవరో ఒకరు చెప్పాలని, అయితే ఎవరూ చెప్పలేదన్నారు. అయినా తమ వైపు నుంచి విచారణ చేస్తామని, ఇందుకు సమయం పడుతుందన్నారు. జారిపడిన దానికి, ఆత్మహత్య చేసుకున్న దానికి తేడాపై ప్రశ్నించగా.. ‘చనిపోయినది నిన్ననే కదా. విచారణకు సమయం పడు తుంది. అప్పుడు తేలుతుంది’ అని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్నట్టు స్నేహితుల అనుమానం కాలుజారి పడి మృతి చెందినట్టు పోలీసుల రికార్డుల్లో.. అనుమానాస్పదమని ఎవరూ చెప్పలేదంటున్న సీఐ -
కేసులకు భయపడొద్దు
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మనల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. పోలీసుల కేసులకు ఎవరూ భయపడొద్దు. నాకు జైలు, బెయిలు కొత్తకాదు. రెండున్నరేళ్లు జైలు జీవితం గడిపా. మహా అంటే కేసులు నమోదు చేస్తారు, లేదంటే రిమాండ్కు పంపుతారు, అంతకంటే ఏం చేస్తారు. కార్యకర్తలెవరూ భయపడొద్దు. రాజన్న భక్తులు, జగనన్న సైనికులు 8న పాపిరెడ్డిపల్లికి తరలిరావాలి. చంద్రబాబు చేతిలో మోసపోయిన మహిళలు, నిరుద్యోగులు, రైతులు, యువకులు పెద్ద ఎత్తున వచ్చి జగనన్నకు సంఘీభావం తెలపాలి. లింగమయ్యదే చివరి రాజకీయ హత్య కావాలి. ఈ ఘటనను అన్ని రాజకీయ పార్టీలు ఖండిం చాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే నేర వ్యవస్థ రాప్తాడు నియోజకవర్గంలో ఉంది. ఈ సంప్రదాయాన్ని ఇక్కడే అణిచి వేయాలి. – తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారు
అనంతపురం, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అనంతపురం(Anantapur) జిల్లా పర్యటన ఖరారైంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్రెడ్డి శనివారం ప్రకటించారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరిటాల వర్గీయుల చేతిలో ఉగాది నాడు వైఎస్సార్సీపీ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్(YS Jagan).. బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడారు. తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య కుటుంబ సభ్యులు జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వాళ్లకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, అవసరమైతే న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో త్వరలో వచ్చి కలుస్తానంటూ మాట ఇచ్చారు.వైఎస్ జగన్ పర్యటన వేళ.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైఎస్సార్సీపీ కీలక నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
కరెంటు పోలుపై నుంచి పడి యువకుడి మృతి
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామంలో ఓ యువకుడు కరెంటు పోలుపై నుంచి కింద పడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. కందుకూరుకు చెందిన లక్ష్మీనారాయణ ఇంటికి విద్యుత్ పోల్ నుంచి అనుసంధానం చేసిన వైర్ లూజ్ కనెక్షన్ కారణంగా కరెంటు సరఫరాలో హెచ్చుతగ్గులు ఉంటూ వచ్చింది. ఇదే విషయాన్ని సమీపంలో ఉన్న పుట్టపర్తి లింగమయ్యకు (26) లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో శుక్రవారం సాయంత్రం లింగమయ్య కరెంటు పోలు ఎక్కి లక్ష్మీనారాయణ ఇంటికి సంబంధించిన సర్వీస్ వైర్ తాకగానే షాక్ కొట్టింది. దీంతో ఆయన కిందకు పడ్డాడు. తల నేరుగా వెళ్లి రాయిపై పడడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. -
ఎకై ్సజ్లో 44 మందికి ఎస్ఐలుగా అడ్హాక్ పదోన్నతి
కర్నూలు : ఎకై ్సజ్ శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఎస్ఐ పోస్టులను భర్తీ చేస్తూ ఆ శాఖ నోడల్ అధికారి (డిప్యూటీ కమిషనర్) శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న 29 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 15 మంది క్లర్కులకు అడ్హాక్ పద్ధతిలో పదోన్నతి కల్పించి బదిలీల్లో భాగంగా వారికి స్టేషన్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ మహిళా ఎస్ఐలకు సంబంధించి మరో నాలుగు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీరి సీనియారిటీ జాబితా త్వరలోనే రూపొందించి ఆయా పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. పదోన్నతి పొందిన వారందరికీ శుక్రవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో ప్రమోషన్తో పాటు పోస్టింగ్ కాపీలను డీసీ శ్రీదేవి అందజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదోన్నతి దక్కిన వారిలో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని డీపీఈఓలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న షేక్ రవితేజ ఉన్నారు. ఆయనకు కర్నూలు ఎసీ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. -
అదనపు కట్నం వేధింపులు.. ముద్దాయికి ఏడాది జైలు
గార్లదిన్నె: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం అనంతపురం స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి జె.సుజిన్కుమార్ వెల్లడించారు. ఈ మేరకు గార్లదిన్నె ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా శుక్రవారం వెల్లడించారు. కల్లూరుకు చెందిన ప్రసాద్కు అదే గ్రామానికి చెందిన సుహాసినితో 2017లో పెద్దల సమక్షంలో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో భర్త ప్రసాద్, అత్త, మరిది కలసి అదనపు కట్నం తీసుకురావాలంటూ తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ 2019లో గార్లదిన్నె పోలీసులకు బాధితురాలు సుహాసిని ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం సెక్షన్ ఐపీసీ34, 498ఏ కింద అప్పటి ఎస్ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు వాదనలు అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చాయి. సాక్షుల విచారణ అనంతరం అత్త, మరిది నిర్దోషులుగా తేలారు. నేరం రుజువు కావడంతో ముద్దాయి ప్రసాద్కు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సుజిన్కుమార్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలను పీపీ కె.శ్రీనివాసులు వినిపించారు. ఇంటిపై నుంచి కిందపడి వైద్యుడి మృతి అనంతపురం: ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడి ఓ వైద్యుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం నగరంలోని రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న డాక్టర్ అమిలినేని మధు (49)కు భార్య డాక్టర్ సుష్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరూ దంత వైద్యులు కావడంతో నగరంలోని క్లాక్ టవర్ సమీపంలో ఓ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఇంటిపైన నాలుగో అంతస్తులో ఉన్న వాటర్ ట్యాంక్ను పరిశీలించేందుకు డాక్టర్ అమిలినేని మధు వెళ్లాడు. గోడపైకి ఎక్కి వాటర్ ట్యాంక్ మూత తీసి పరిశీలిస్తుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి పై నుంచి కిందకు పడడంతో వెన్నముక, కాళ్లు విరిగాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డాక్టర్ సుష్మ ఫిర్యాదు మేరకు అనంతపురం మూడో పట్టణ సీఐ కె.శాంతిలాల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
సహనానికి ఫిట్నెస్ పరీక్ష
అనంతపురం సెంట్రల్: ఫిట్నెస్ టెస్ట్ ప్రక్రియ వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తోంది. సాఫ్ట్వేర్ల అప్డేట్ నేపథ్యంలో సర్వర్లు తరచూ మొరాయిస్తుండడంతో వాహనదారులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. గత కొన్ని నెలలుగా అనంతపురం శివారులోని ప్రసన్నాయపల్లి జాతీయరహదారి వద్ద శివ శంకర్ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) నిర్వహిస్తున్నారు. గతంలో రవాణాశాఖ ఆధ్వర్యంలో వాహనాలకు ఫిట్నెస్ టెస్ట్లు నిర్వహించేవారు. జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా ఈ పరీక్షలు జరిగేవి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి జిల్లాలోనూ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో శివ శంకర్ ఎంటర్ ప్రైజెస్ టెండర్ దక్కించుకుంది. సతాయిస్తున్న సర్వర్ వాహనాల ఫిట్నెస్ కోసం వందలాది వాహనాలు జిల్లా నలుమూలల నుంచి ఏటీఎస్ కేంద్రానికి వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా సర్వర్ సరిగా పనిచేయడం లేదు. కొత్తగా ఆటోమేటెక్ ఫిట్నెస్ మేనేజ్మెంట్ (ఏఎస్ఎంఎస్) సాఫ్ట్వేర్ తీసుకొస్తుండడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. అయితే వాహనదారులకు సరైన సమాచారం లేకపోవడంతో ఏటీఎస్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. సదరు కేంద్రంలో సరైన సదుపాయాలు లేకపోవడం వలన వాహన యజమానులు, డ్రైవర్లు చెట్లకిందే సేద తీరుతున్నారు. ఫిట్నెస్ టెస్ట్కు స్లాట్ బుక్చేసుకున్న వారికి సమాచారమైనా ఇస్తే ఈ విధమైన పరిస్థితులు వచ్చేవి కావని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బందులు రాకుండా చర్యలు దేశ వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి సర్వర్ సమస్య తలెత్తింది. ఏఎస్ఎంఎస్ సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. శనివారంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. సర్వర్ సమస్యను వాహనదారులకు తెలియజేస్తున్నాం. దీనివల్ల ఎక్కువమంది రావడం లేదు. దూరప్రాంతాల నుంచి కొంతమందే వచ్చారు. వాహనదారులకు ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. – నాగార్జునరెడ్డి, ఏటీఎస్ నిర్వాహకుడు రెండురోజులుగా పనిచేయని సర్వర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వాహనాలు ఏటీఎస్ వద్దే రోజంతా తప్పని పడిగాపులు -
విద్యార్థిపై అడవి పంది దాడి
కంబదూరు: పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థిపై అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన శుక్రవారం కంబదూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గుండ్లపల్లి కాలనీకి చెందిన బొమ్మలాట ఆంజినేయులు కుమారుడు చరణ్ కంబదూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి సైకిల్పై పాఠశాలకు వెళ్తుండగా అడవి పంది అడ్డొచ్చింది. దీంతో చరణ్ కింద పడిపోయాడు. అతనిపై అడవి పంది దాడి చేయడంతో గట్టిగా కేకలు వేశాడు. చుట్టు పక్కల వారు కేకలు విని పరుగెత్తుకొచ్చి అడవి పందిని తరిమేశారు. తీవ్రంగా గాయపడిన చరణ్ను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. నేటి అర్ధరాత్రి నుంచి సమ్మె అనంతపురం అర్బన్: శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మికులు తమకు రావాల్సిన బకాయి వేతనాలు, పీఎఫ్ చెల్లించాలనే డిమాండ్తో శనివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ మేరకు శ్రీరామిరెడ్డి నీటి సరఫరా పథకం కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు జి.ఓబుళు, అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్యదర్శి రాము, కోశాధికారి వన్నూరుస్వామి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చుక్కల భూముల ఫైళ్లు పక్కాగా ఉండాలి అనంతపురం అర్బన్: నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూముల సమస్యలు పరిష్కరించే క్రమంలో వాటి ఫైళ్లు సమగ్ర వివరాలు, ఆధారాలతో పక్కాగా ఉండాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో డీఎల్సీ (డాటెడ్ ల్యాండ్ కమిటీ) సమావేశం నిర్వహించారు. బుక్కరాయసముద్రం మండలం పరిధిలో 22ఏ జాబితాలో నాలుగు కేసులను విచారించి, రెండు కేసులను ఆమోదించారు. మిగిలిన రెండింటిని తిరస్కరించారు. కళ్యాణదుర్గం మండలానికి సంబంధించి రెండు కేసులను విచారణ చేసి, ఆమోదించారు. అనంతరం రాయదుర్గం మునిసిపాలిటీకి సంబంధించి డీఎల్ఎన్సీ (డిస్ట్రిక్ లెవల్ నెగోషియేషన్ కమిటీ) నిర్వహించి ఎకరాకు రూ.43 లక్షలు నిర్ణయించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, తహసీల్దార్లు భాస్కర్, పుణ్యవతి, మహబూబ్బాషా, నాగరాజు, కలెక్టరేట్ భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, డీటీ ప్రభంజన్రెడ్డి, రాయదుర్గం మునిసిపల్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు. -
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనలో భాగంగా వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటైన సచివాలయాలు పారదర్శక సేవలతో ప్రజల అభిమానం చూరగొన్నాయి. సిఫార్సులు లేకుండా.. సంతకాల కోసం ఎదురుచూపులు లేకుండా.. దరఖాస్తు చేస్తే చాలు అర్హతలను బట్టి పథకాలు, ధ్రువపత్రాలు, వివిధ రకాల
జిల్లా సమాచారంసాక్షి ప్రతినిధి, అనంతపురం: గడిచిన ఐదేళ్లలో ప్రజలు కోరుకున్న సేవలన్నీ ఇంటి ముంగిటకే వచ్చాయి. గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ కారణంగా పింఛన్లు మొదలుకొని అన్ని సేవలూ సత్వరమే అందాయి. కరోనా లాంటి ఆపత్కాలంలోనూ ఈ సేవలే గట్టెక్కించాయని స్వయానా నీతి ఆయోగ్ చెప్పింది. అలాంటి ఈ వ్యవస్థను కూటమి సర్కారు బలితీసుకుంది. ఎన్నికలకు ముందు ‘సంపద సృష్టిస్తా.. మహిళలను లక్షాధికారులను చేస్తా’ అంటూ అలివికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని గాలికొదిలేయడమే కాకుండా గడప ముందుకొచ్చే సేవలన్నిటినీ నిలిపివేశారు. పంచాయతీ కార్యాలయాల్లో పింఛన్కోసం పడిగాపులు కాసే పరిస్థితులకు అద్దం పట్టేలా మళ్లీ పాతరోజులు గుర్తుకొస్తున్నాయని జనం అంటున్నారు. వ్యవస్థ నిర్వీర్యం ప్రతి 2 వేల జనాభాకు గ్రామ లేదా వార్డు సచివాలయం ఉండేది. బర్త్ సర్టిఫికెట్ మొదలుకొని పింఛన్ వరకూ అన్నీ ఇచ్చేవారు. ఇప్పుడు ఉద్యోగులను వివిధ విభాగాలకు బదిలీ చేసి గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. గతంలో రోజూ వేలాదిమంది లబ్ధిదారులు సచివాలయాలకు వచ్చి తమ పనులు చేసుకునే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు.సచివాలయ సేవలకు తిలోదకాలు ఇంటివద్దకే వచ్చి ఇచ్చే పింఛన్లకు ఎగనామం రేషన్ డోర్ డెలివరీ నిలిపివేతతో వృద్ధులకు కష్టాలు ఇంటింటా చెత్త సేకరించే వాహనాలూ ఆపిన సర్కారు -
సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడాలి
బుక్కరాయసముద్రం: శరవేగంగా పరుగులు తీస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజినీరింగ్ విద్యార్థులు పోటీ పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్ఆర్ఐటీ కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి పేర్కొన్నారు. సింఫనీ–2025 పేరుతో శుక్రవారం ఎస్ఆర్ఐటీ (అటానమస్) వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి హాజరయ్యారు. శ్రీనివాస రామానుజం చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో ఇంజనీరింగ్ విద్యకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. ప్రతి విద్యార్థికీ మంచి నైపుణ్యాలు కల్పించడంతో పాటు ఉద్యోగం కల్పించే దశగా ఎస్ఆర్ఐటీ అధ్యాపక బృందం సాగిస్తున్న కృషిని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఐటీ దిగ్గజ కంపెనీల్లో తమ కళాశాల విద్యార్థులు వందలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అనంతరం కళాశాల వివిధ బ్రాంచ్లలో సీనియర్ ప్రొఫెసర్లకు అవార్డులు, మెమెంటోలు, కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు పతకాలను, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రంజిత్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, ఐక్యూసీ డైరెక్టర్ సాయి చైతన్య కిషోర్ వివిధ విభాగాల అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆలూరి సాంబశివారెడ్డి పిలుపు -
సమాజంలోని అసమానతలను, బాల్య వివాహాలను రూపు మాపేందుకు సీ్త్ర విద్యను ప్రోత్సహించిన సంఘ సంస్కర్తగా.. ప్రజల్లో పాతుకుపోయిన మూఢ నమ్మకాలను తనదైన సాహిత్యంతో పారదోలిన అభ్యుదయ కవిగా ప్రజల హృదయాల్లో యోగి వేమన చిరస్థాయిగా నిలిచిపోయారు. పామరుల నోట సైతం అలవోకగా జాలువా
గాండ్లపెంట: వేమన చరిత్ర కదిపితే ఎన్నో కథలు అలలు అలలుగా పలకరిస్తాయి. ఆయన కులంపై ఎన్నో వాదనలు ఉన్నా.. ఎన్నిసార్లు చరిత్రను తిరగేసినా వేమన ‘రెడ్డి’ కులస్తుడనే స్పష్టమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ అధికారి సీపీ బ్రౌన్ ద్వారా 1839లో వేమన పద్యాలు తొలిసారిగా పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి. ప్రజాచైతన్య బావుటా సామాజిక వైజ్ఞానిక నేత్రాలతో సమాజాన్ని దర్శించిన వేమన... కుట్రలను, కుతంత్రాలను రూపు మాపడానికి తనదైన సాహిత్యంతో ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంధించిన వ్యంగ్యాస్త్రాలు ఎప్పటికీ నిత్యనూతనంగానే నిలిచాయి. ఇందులో మచ్చుకు కొన్ని... వేషభాష లెరిగి కాషయవస్త్రముల్ గట్టగానె ముక్తి గలుగబోదు తలలు బోడులైన తలపులూ బోడులా విశ్వదాభిరామ వినురవేమ! అర్థం: ‘వేషభాషలు నేర్చుకుని, కాషాయ వస్త్రములు ధరించినంత మాత్రాన మోక్షము రాదు, గుండు గీయించుకున్నమాత్రాన దురాలోచనలు దూరం కావు’ అంటూ అలాంటి వ్యక్తుల వైఖరిపై వేమన వ్యంగ్యాస్త్రం సంధించారు. ● మరో పద్యంలో వ్యక్తుల ఎదుట ఒకరీతిన... మనసులో మరోరీతిన వ్యవహరించేవారి వైఖరిని ఎండగడుతూ.. మాటలాడు నొకటి మనసులోన నొకటి ఒడలి గుణము వేరె యోచన వేరె ఎట్లుగల్గు ముక్తి యీలగు తానుండ విశ్వదాభిరామ వినురమేమ అర్థం: ‘మనస్సులో ఒకటి ఉంచుకునే పైకి మరోలా మాట్లాడే వ్యక్తి గుణమొకటి... యోచన వేరొకటిగా ఉంటుంది. ఇట్టి వారికి మోక్షము ఎట్లా కలుగుతుంది’ అని ప్రశ్నించారు. ఉత్సవాలు ఇలా... ● ఆదివారం నుంచి 4 రోజుల పాటు గాండ్లపెంట మండలం కటారుపల్లిలో విశ్వకవి యోగివేమన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం మహాశక్తిపూజ (కుంభం పోయుట), మధ్యాహ్నం నుంచి రాత్రి 1 గంట వరకు శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ● సోమవారం రాత్రి బండ్లు తిరుగుట, పానక పన్నేరం, రాత్రి 9 గంటలకు పాటల కచేరీ (ఆర్కెస్ట్రా) ఉంటుంది. ● మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఉట్ల తిరునాల, రాత్రి 9 గంటలకు అగ్ని సేవ ఉంటాయి. అలాగే సాయంకాలం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ● బుధవారం రాత్రి 9 గంటలకు గొడుగుల మేరవణితో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రత్యేక ఏర్పాట్లు.. ఉత్సవాలకు కదిరి పరిసర మండలాల నుంచే కాక ఉమ్మడి కర్నూలు, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే కదిరి నుంచి వచ్చే భక్తులు గాండ్లపెంట, రాయచోటికి వెళ్లే బస్సులు ఎక్కి కటారుపల్లి క్రాస్లో దిగి ఆటో లేదా నడక మార్గంలో కిలోమీటరు దూరం వెళ్లాల్సి ఉంటుంది. రాయచోటి నుంచి వచ్చే భక్తులు గాండ్లపెంట మీదుగా 4 కిలోమీటర్లు దూరంలో ఉన్న కటారుపల్లి క్రాస్కు చేరుకోవచ్చు. రేపటి నుంచి 4 రోజుల పాటు యోగి వేమన ఉత్సవాలు -
జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం
అనంతపురం క్రైం: మహిళల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యమని సెర్ప్ సీఈఓ కరుణ వాకటి, కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో విలువ ఆధారిత మార్కెటింగ్ (వాల్యూ చేంజ్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ ఇంటర్వెన్షన్)పై అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి తొలి వర్క్షాప్ ఫ్లిప్కార్ట్– సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి సెర్ప్ సీఈఓ కరుణ వాకటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెర్ప్ సీఈఓ, కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఫ్లిప్కార్ట్, సెర్ప్ ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. కందులు, వేరుశనగ, బియ్యం, చిరుధాన్యాలు, తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పీడీలు, డీపీఎంలు ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. రైతులు పండించే పంటలలో నాణ్యత చాలా ముఖ్యమన్నారు. మార్కెట్తో అనుసంధానించిన ఉత్పత్తిదారుల సమూహాలను స్థాపించడానికి అట్టడుగు వ్యవసాయ వర్గాల నుంచి గ్రామీణ మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఫ్లిప్కార్ట్ కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల తలసరి ఆదాయం పెంచే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. దళారుల బెడద లేకుండా ఎక్కువ ధర లభించేలా చూస్తామన్నారు. మైక్రో ఇరిగేషన్, ఉద్యాన రంగంలో అనంతపురం జిల్లా రాష్ట్రానికి రోల్మోడల్గా ఉందన్నారు. ఈ అంశంలో రైతులకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయి సహకారం అందించాలని, తగు సూచనలు, సలహాలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో సెర్ప్ ఎగ్జిక్యూటివ్ బి.శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, డీఆర్డీఏ పీడీ బి.ఈశ్వరయ్య, ఇతర జిల్లాల పీడీలు నరసయ్య, ఆనంద్ నాయక్, శ్రీధర్రెడ్డి, రమణారెడ్డి, ఫ్లిప్కార్ట్ గ్రాసరి మేనేజర్ గిరిబాబు, సెర్ప్ అదనపు డైరెక్టర్ సరళ, అదనపు డైరెక్టర్ మహిత, డీఆర్డీఏ–వెలుగు డీపీఎం బి.గంగాధర్, జిల్లా సమాఖ్య సెక్రటరీ, వీఓఏలు, తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ సీఈఓ కరుణ, కలెక్టర్ వినోద్కుమార్ ఫ్లిప్కార్ట్, సెర్ప్ ఆధ్వర్యంలో అనంతపురంలో తొలి వర్క్షాప్ -
పోలీస్ శాఖకు రూ.కోటి విలువైన ఉపకరణాల వితరణ
అనంతపురం: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద జిల్లా పోలీసు శాఖకు రూ.కోటి విలువ చేసే డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, సోలార్ లైట్లు, బాడీవోర్న్ కెమెరాలు, ఎల్ఈడీ డిస్ప్లేలు, మహీంద్రా బొలేరో వాహనాలను ఆయా కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఇందులో తాడిపత్రి అల్ట్రాటెక్ కంపెనీ రూ.10.05 లక్షల విలువ చేసే 50 సోలార్ లైట్లు, మొబీస్ ఇండియా మాడ్యుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు రూ.33 లక్షల విలువ చేసే 300 అత్యాధునిక సోలార్ బేస్డ్ కెమెరాలు, ఆర్జాస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ.18.17 లక్షల విలువ చేసే 10 డ్రోన్ కెమెరాలు, సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ.5 లక్షల విలువ చేసే రెండు డ్రోన్, 7 బాడీవోర్న్ కెమెరాలు , జిందాల్ స్టీల్ కంపెనీ వారు రూ.10 లక్షల విలువ చేసే 6 డ్రోన్ కెమెరాలు, అదానీ ఫౌండేషన్ (తాడిపత్రి) వారు రూ.19 లక్షల విలువ చేసే ఎల్ఈడీ డిస్ప్లేలు, మహీంద్ర బొలేరో వాహనాన్ని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను ఎస్పీ పి. జగదీష్ సత్కరించారు. 13 తులాల బంగారం మాయం తాడిపత్రి టౌన్(యాడికి): ఇంట్లోని బీరువాలో దాచిన 13 తులాల బంగారు నగలు కనిపించడం లేదంటూ గురువారం ఉదయం పోలీసులకు యాడికి మండలం పెద్దపేట గ్రామానికి చెందిన సంజీవరాయుడు ఫిర్యాదు చేశాడు. గత నెలలో యాడికిలో జరిగిన చెన్నకేశవ బ్రహోత్సవాలకు కుటుంబసభ్యులతో కలసి సంజీవరాయుడు వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి తాళం ఆరుబయట ఉన్న బాత్రూమ్లో దాచి వెళ్లారు. ఉత్సవాల నుంచి తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత వేసిన తలుపులు వేసినట్లుగానే ఉండడంతో ఎలాంటి అనుమానాలు రాలేదు. గురువారం బంగారు నగలు అవసరం కావడంతో బీరువా తెరిచి చూడగా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇరువర్గాలపై కేసులు నమోదు బొమ్మనహాళ్: మండలంలోని కృష్ణాపురంలో బొమ్మ–బొరుసు ఆట ఆడుతూ రూ. వెయ్యి కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఇరువర్గాలకు చెందిన మొత్తం 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. ఒక వర్గానికి చెందిన ఈశ్వరరెడ్డి, గంగిరెడ్డి, నరేష్, హనుమంతరెడ్డి, యోగానందరెడ్డి, చంద్రశేఖర్, వెంకట్రెడ్డి, సంజీవ్రెడ్డి, బ్రహ్మయ్య మరో వర్గానికి చెందిన పెద్ద తిప్పయ్య, చిన్న తిప్పయ్య, వన్నూరుస్వామి, ప్రభాకర్, సుధాకర్, లింగప్ప, తిమ్మరాజు, ప్రసాద్, తిప్పక్కపై కేసులు నమోదు చేసి, నిందితులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు. మరోసారి గొడవలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని ఇరువర్గాలను హెచ్చరించినట్లు పేర్కొన్నారు. -
పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలి : కలెక్టర్
అనంతపురం అర్బన్: పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ అంశంపై గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో డీఈఓ ప్రసాద్బాబు, సమగ్ర శిక్ష ఏపీపీ శైలజతో కలసి విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. పాఠశాల యాజమాన్య కమిటీల ఆమోదంతో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలన్నారు. స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి ఎస్ఎంసీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులను ఒప్పించి సామరస్యంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రీ ప్రైమరీ 1, 2 పిల్లలు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాల్లోనే ఒకటవ తరగతి చేరేలా తల్లిదండ్రులను ఒప్పించి 100 శాతం ప్రవేశాలు జరిగేలా చూడాలన్నారు. పీజీ ప్రవేశాలకు వేళాయె అనంతపురం: పీజీ ప్రవేశాలకు సన్నాహాలు మొదలయ్యాయి. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష (పీజీ సెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మార్కుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 వర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తాజాగా ఏపీ పీజీసెట్ నిర్వహణ బాధ్యతలను తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీకి అప్పగించారు. httpr://cets.apche.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ సెట్కు అర్హత వివరాలు.. డిగ్రీ ఉత్తీర్ణులైన ఓసీ, బీసీ కేటగిరి విద్యార్థులకు 50 శాతం , ఎస్సీ, ఎస్టీ కేటగిరి విద్యార్థులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అబ్జెక్టివ్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయి. 90 నిమిషాల సమయం ఇస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. వర్సిటీ క్యాంపస్ కళాశాలలో ఉన్న కోర్సులను మూడు కేటగిరీలుగా విభజించి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుకు తుది గడువు ఏప్రిల్ 13. జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఎస్కేయూలో ప్రవేశాలు.. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ పీజీ కోర్సుల్లో పీజీ సెట్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఎస్కేయూ క్యాంపస్ కళాశాలలో ఆర్ట్స్ బ్రాంచ్లు 13 ఉన్నాయి. ఇందులో లా కోర్సులు లాసెట్ ద్వారా, ఎంబీఏ కోర్సులు ఐసెట్ ద్వారా భర్తీ చేస్తారు. తక్కిన 11 కోర్సులు పీజీ సెట్ ద్వారా భర్తీ అవుతాయి. సైన్సెస్లో 15 బ్రాంచులు ఉన్నాయి. ఎంపీఈడీ ప్రత్యేక సెట్ ద్వారా భర్తీ చేస్తారు. ఎస్కేయూ పరిధిలో 19 అనుబంధ పీజీ కళాశాలలు ఉన్నాయి. పీజీసెట్లో ర్యాంకులను బట్టి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. -
కూటమి ప్రభుత్వంలో వైద్య రంగం నిర్వీర్యమైంది. నాణ్యమైన వైద్యం దేవుడికెరుక... కనీసం మౌలిక సదుపాయాలు లేక రోగులు విలవిల్లాడిపోతున్నారు. మందుల కొరత వేధిస్తోంది. రక్త పరీక్షలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. పదుల సంఖ్యలో పోస్టులు భర్తీకి నోచుకోలేదు. ఇదే అదునుగా పేద
అనంతపురం హాస్పిటల్: జిల్లాలోని సీహెచ్సీల్లో సమస్యలు తిష్ట వేశాయి. ఉమ్మడి జిల్లా ప్రజలకు పెద్ద దిక్కైన అనంతపురం సర్వజనాస్పత్రిలో అయితే, సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. కొందరు వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓపీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీలపై భారం వేసి వెళ్లిపోతున్నారు. ఇటీవల ఏకంగా డెంటల్ ఓపీకి తాళాలు వేసేశారు. ● ఆస్పత్రిలో సిబ్బంది యథేచ్ఛగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కళ్యాణదుర్గానికి చెందిన శ్రీకాంత్ తమ బంధువు ఒకరికి అనారోగ్యంగా ఉంటే జీజీహెచ్కు తీసుకురాగా, రోగిని తరలించడానికి క్యాజువాలిటీలో ఉన్న ఓ ఎంఎన్ఓ వంద కొట్టాల్సిందేనన్నాడు. చేసేది లేక రూ.50 ఇచ్చినట్లు శ్రీకాంత్ తెలిపాడు. ● కొన్ని రోజుల క్రితం వజ్రకరూరుకు చెందిన శ్రీలక్ష్మి రెండో కాన్పు కోసం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. ప్రసవం అయ్యాక ఆడబిడ్డ అని తెలియగానే అక్కడి క్లాస్–4 సిబ్బంది రూ.500 డిమాండ్ చేశారు. శ్రీలక్ష్మి మొదట రూ.వంద ఇవ్వగా.. ‘మేం నలుగురున్నాం, వంద సరిపోదు’ అంటూ వాదించడంతో చివరకు రూ.400 ఇవ్వాల్సి వచ్చింది. ఆస్పత్రిలో మెడిసిన్, సర్జరీ, ఆర్థో, పీడియాట్రిక్, గైనిక్, లేబర్, పల్మనాలజీ తదితర వార్డుల్లోనూ కొందరు ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్లు, క్లాస్–4 సిబ్బంది అందినకాటికి దోచేస్తున్నట్లు తెలిసింది. ● ఆస్పత్రిలో రక్తపరీక్షలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. బయోకెమెస్ట్రీకి సంబంధించి రీ ఏజెంట్ లేకపోవడంతో థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్ ఆగిపోయింది. ప్రైవేట్గా థైరాయిడ్ పరీక్ష రూ.600, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షను రూ.150 ఇచ్చి చేయించుకోవాల్సి వస్తోంది. గుంతకల్లు ఆస్పత్రి.. మైనర్ ఆపరేషన్లతో సరి.. ● రోజు ఓపీ: 600–700 గుంతకల్లు పట్టణంలోని శ్రీరాయ్సాహెబ్ మిడతల హంపయ్య ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. నాలుగు సివిల్ సర్జన్ (జనరల్, పీడియాట్రీషన్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, రేడియాలజిస్ట్)లతో పాటు స్టాఫ్ నర్సు పోస్టులు 10 ఖాళీలున్నాయి. ఫార్మసీ సూపర్వైజర్,గ్రేడ్–1 ఫార్మసిస్ట్,డార్క్రూమ్ అసిస్టెంట్–2, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్–1, అలాగే పరిపాలనా విభాగంలో పలు పోస్టులు ఖాళీలున్నాయి. సివిల్ సర్జన్ల కొరత కారణంగా సిజేరియన్, మైనర్ ఆపరేషన్లు తప్ప పెద్ద ఆపరేషన్లు జరగడం లేదు. బ్లడ్బ్యాంక్లో కూడా స్టాఫ్ నర్సు–1, టెక్నీషియన్లు–3, కౌన్సిలర్–1 ఖాళీలున్నాయి. మందుల కొరత కూడా ప్రధాన సమస్యగా మారింది. చర్మ రోగాలకు సంబంధించి (ఫ్లూకొనజోల్, ఇట్రాకొనజోల్), హెర్పిస్ వైరస్ ఇన్ఫెక్షన్లకు ఇచ్చే (పసిక్లోవిర్), నొప్పులకు సంబంధించి (ట్రెమడాల్), గజ్జి, పగుళ్లకు సంబంధించిన మందులు, ఆయింట్మెంట్, ముక్కులో వేసుకునే డ్రాప్స్ను కూడా ప్రభుత్వం సరిగా సరఫరా చేయడం లేదు. అంతేకాకుండా ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, సిబ్బందికి అవసరమైన సర్జికల్ గ్లౌవ్స్ను కూడా సక్రమంగా సరఫరా చేయకపోవడంతో బయటి నుంచి తెప్పించుకుంటున్నారు. సర్వజనాస్పత్రిలో మందుల కొరత వేధిస్తోంది. కాన్పు కోసం ఇటీవల దివ్య అనే గర్భిణి ఆస్పత్రిలో అడ్మిట్ కాగా, వైద్యులు కొన్ని మందులు రాసిచ్చారు. అయితే, ఆ మందులు ఆస్పత్రిలో లేకపోవడంతో దివ్య ప్రైవేట్ మెడికల్ స్టోర్లో రూ.430 వెచ్చించి కొనుగోలు చేశారు. ఆస్పత్రిలోని గైనిక్, లేబర్, మెడిసిన్, ఐసీసీయూ, ఎమర్జెన్సీ, ఏఎంసీ, ఆర్థో తదితర వార్డుల్లో అమాక్సీక్లేవ్, సెఫిగ్జిమ్, పారాసిట్మాల్, సెట్రిజిన్, మెట్ఫార్మిన్, సెఫొపెరాజాన్, పాంటాప్రజోల్ తదితర మాత్రలతో పాటు ఐవీ ఇంజెక్షన్లు లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యల తిష్ట భర్తీ కాని వైద్యులు, సిబ్బంది పోస్టులు వేధిస్తున్న మందుల కొరత సౌకర్యాల కల్పనపై కూటమి సర్కారు నిర్లక్ష్యం ఉమ్మడి జిల్లా నుంచి వైద్యారోగ్య శాఖ మంత్రి ఉన్నా ప్రయోజనం శూన్యం -
సమగ్ర విచారణ జరపాలి
రాయదుర్గం రిజిస్ట్రార్ కార్యాలయంలో గత మూడు నెలలుగా జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్పై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలి. అప్పుడే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. ప్రభుత్వ చలానా ఎంత? రిజిస్ట్రేషన్కు వచ్చిన వారితో ఎంత వసూలు చేశారు? అనే కోణంలో విచారణ చేపడితే అసలు బాగోతం వెలుగు చూస్తుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల దందా అరికట్టాలి. ఉన్నతాధికారుల స్పందించకపోతే ఉద్యమాలకు సిద్దపడుతాం. – మల్లికార్జున, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు -
నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం
అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. www.igrs.ap.gov వెబ్ సైట్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. కావాల్సిన తేదీ, సమయాల్లో ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని కార్యాలయానికి వెళ్తే కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. ఆఫ్లైన్లో సైతం రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, స్థిరాస్తి కొనుగోలు, అమ్మకందార్లు గమనించాలని ఆయన సూచించారు. కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు అనంతపురం: సామాజిక మాధ్యమాల్లో ఏ సామాజిక వర్గాన్నైనా కించపరిచే పోస్టులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి. జగదీష్ హెచ్చరించారు. కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) తదితర సామాజిక మాధ్యమాల్లో అవమానకర రీతిలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా వివాదాస్పద విషయాలు, తప్పు దారి పట్టించే ఫేక్ న్యూస్ పెట్టినా, షేర్ చేసినా చట్టరీత్యా నేరమన్నారు. సంబంధిత గ్రూప్ అడ్మిన్ను బాధ్యుల్ని చేస్తూ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆసియా పారా త్రోబాల్ పోటీల్లో సత్తా అనంతపురం: కంబో డియా దేశంలో గత నెల 28 నుంచి 30 వరకు నిర్వహించిన తొలి ఆసియా పారా త్రోబాల్ పోటీల్లో జిల్లాకు చెందిన యువకుడు సత్తా చాటాడు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన వెన్నపూస రొషి రెడ్డి ఏకంగా రజత పతకాన్ని సాధించాడు. ఈ మేరకు త్రో బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆల్బర్ట్ ప్రేమ్ కుమార్ తెలిపారు. కంబోడియా మొదటి స్థానం, శ్రీలంక రెండో స్థానం, భారతదేశం మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెన్నపూస రొషిరెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. రైతులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి పుట్లూరు: రైతులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ అన్నారు. గురువారం ఆమె మండలంలోని పుట్లూరు, కడవకల్లు, కోమటి కుంట్ల రైతు సేవా కేంద్రాలను అకస్మిక తనిఖీ చేశారు. ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ల పక్రియను వేగ వంతం చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేయించుకుని విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ చెంగలరాయుడు, ఏఓ కాత్యాయని, ఏఈఓ హరి, సిబ్బంది పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు వివాహిత మృతి
గుంతకల్లు రూరల్: పిడుగుపాటుకు ఓ వివాహిత మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం కదిరిపల్లికి చెందిన సుంకన్న, రమాదేవి దంపతుల కుమారుడు రమణకు రెండేళ్ల క్రితం పెద్దపప్పూరు మండలానికి చెందిన ఇంద్రజ (24)తో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో బోరు బావి కింద సాగు చేసిన వేరుశనగ పంట చేతికి వచ్చింది. శుక్రవారం పంటను తొలగించాలనుకున్న దంపతులు గురువారం సాయంత్రం పొలానికి వెళ్లి స్ప్రింక్లర్ల సాయంతో నీళ్లు పెడుతుండగా జడి వాన మొదలైంది. కాసేపటికి ఉరుములు, మెరుపులు ఎక్కువ కావడంతో పని ఆపి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రమణ బోరు బావి వద్దకెళ్లి కాలికి అంటుకున్న బురదను కడుక్కుంటుండగా, నాలుగు అడుగుల దూరంలోనే భర్త కోసం వేచి చూస్తున్న ఇంద్రజపై పిడుగు రాలింది. ఆమె శరీరంలో నుంచి నేరుగా దూసుకెళ్లి భూమిని తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గుండె కింద భాగంలో బొక్క పడి శరీరంలో రెండు చీలికలు ఏర్పడ్డాయి. కాలి పట్టీలు తెగిపడ్డాయి. శరీరం మొత్తం నల్లగా మాడిపోయింది. విషయాన్ని గమనించిన భర్త ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. దాదాపు అరగంట తర్వాత తేరుకున్న ఆయన వెళ్లి విగతజీవిగా ఉన్న పడి ఉన్న భార్యను చూసి బోరున విలపించాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఇంద్రజ మృతదేహాన్ని ఇంటికి తరలించారు.విషయం తెలుసుకున్న తహసీల్దార్ రమాదేవి... గ్రామానికి చేరుకుని ఇంద్రజ మృతదేహాన్ని పరిశీలించి, నివేదిక సిద్ధం చేశారు. -
మైసూరు–అజ్మీర్కు సమ్మర్ స్పెషల్ రైలు
రాయదుర్గంటౌన్: రాయదుర్గం మీదుగా మైసూరు నుంచి అజ్మీర్కు సమ్మర్ స్పెషల్ రైలు సర్వీసు నడుస్తున్నట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ డివిజన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మంజునాథ కనమడి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మైసూరు–అజ్మీర్ (06281) ఏప్రిల్ 5,12,19,26 తేదీల్లో, మే 3,10,17,24 తేదీల్లో, జూన్ 7, 14 తేదీల్లో ప్రతి శనివారం (మొత్తం 11 సర్వీసులు) రైలు నడుస్తుందన్నారు. మైసూరులో ఉదయం 8 గంటలకు బయల్దేరి హాసన్, అర్సికెరె, చిత్రదుర్గం, రాయదుర్గం, బళ్లారి కంటోన్మెంట్, హుబ్లీ, కళ్యాణ్, వడోదర మీదుగా సోమవారం ఉదయం 6.55 గంటలకు అజ్మీర్ చేరుకుంటుందన్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో (06282) ఏప్రిల్ 7,14,21,28 తేదీల్లో, మే 5, 12, 19,26 తేదీల్లో, జూన్ 2,9,16 తేదీల్లో ప్రతి సోమవారం (11 సర్వీసులు) సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మైసూరు చేరుకుంటుందని తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభమైందని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాయదుర్గం మీదుగా రాకపోకలు -
పూర్తి స్థాయిలో స్పెషల్ అసిస్టెంట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి మూల్యాంకనం విధులకు స్పెషల్ అసిస్టెంట్లు పూర్తిస్థాయిలో వచ్చారు. 200లోపు అవసరం కాగా... 220 మంది ఉపాధ్యాయులు ఆసక్తి చూపుతూ విధుల్లో చేరడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో గురువారం పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఏఈలుగా నియమించిన పలువురు టీచర్లు వివిధ కారణాలతో ఉత్తర్వులు రద్దు చేసుకునేందుకు తంటాలు పడ్డారు. అలాగే విధుల్లో చేరేందుకు చాలామంది టీచర్లు ఆసక్తి చూపించారు. అన్నింటినీ సర్దుబాటు చేసిన అధికారులు ఎట్టకేలకు మధ్యాహ్నం భోజనం అనంతరం మూల్యాంకనం ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సరిపడా ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. చల్లని తాగునీటి వసతి కల్పించారు. తొలిరోజు ఒక్కొక్కరికి 15–20 పేపర్లు ఇచ్చారు. రెండోరోజు నుంచి ఉదయం 20, మధ్యాహ్నం 20 పేపర్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. క్యాంపు ఆఫీసరు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్బాబు, డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ (స్ట్రాంగ్రూం) గోవిందనాయక్, డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్) శ్రీనివాసరావు పర్య వేక్షించారు. పేపర్లు మూల్యాంకనం చేసే అసిస్టెంట్ ఎగ్జామినర్లు (ఏఈ) ఇంగ్లిష్కు 150 మంది, తెలుగు 140, హిందీ 120, ఫిజికల్ సైన్స్ 120, బయాలజికల్ సైన్స్ 100, సోషల్ 120 మందిని నియమించారు. జాగ్రత్తగా దిద్దండి... పరీక్షలు బాగా రాసిన ఏ ఒక్క విద్యార్థికీ మార్కుల నమోదులో అన్యాయం జరగకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు స్పష్టం చేశారు. జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు పరిశీలించి మార్కులు వేయాలన్నారు. వేసిన మార్కుల టోటలింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడిన మూల్యాంకన విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. విధుల్లో పాల్గొనే టీచర్లకు అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఊపిరి పీల్చుకున్న విద్యాశాఖ అధికారులు ఆలస్యంగా ప్రారంభమైన టెన్త్ ‘స్పాట్’ -
‘ఉపాధి’ లక్ష్యం 1.20 కోట్ల పనిదినాలు
అనంతపురం అర్బన్: ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద 1.20 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 2.12 లక్షల కుటుంబాలకు రూ.287.01 కోట్లు వేతన రూపంలో చెల్లించాం’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డ్వామా పీడీ సలీమ్బాషా, పీఆర్ ఎస్ఈ జహీర్ అస్లాంతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. కూలీలకు ఉపాధి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కింద నీటి నిల్వ, సంరక్షణ పనుల్లో భాగంగా 238 చెరువుల్లో పూడిక తీత, 575 సేద్యపు నీటి కుంటలు, 1,276 కొండల్లో నీటి నిల్వ కందకాలు, 2,347 డిగ్ అవుట్ పాండ్లు, 374 పంట కాలవల్లో పూడికతీత చేపట్టామన్నారు. అలాగే, రూ.73.86 కోట్లతో 194.57 కిలోమీటర్ల సీసీ రోడ్లు, రూ.4.85 కోట్లతో 10.39 కిలోమీటర్ల బీటీ రోడ్లు, రూ.93.60 లక్షలతో 7.25 కిలోమీటర్ల సీసీ కాలువలు, రూ.29.16 కోట్లతో 1,437 పశువుల షెడ్ల నిర్మాణ పనులు జరిగాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.20 కోట్ల పనిదినాలు కల్పించి కూలీలకు రూ.375 కోట్లు వేతన రూపంలో చెల్లించాలని లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. మొదటి త్రైమాసికంలో భాగంగా ఈ నెలలో 24.62 లక్షల పనిదినాలు, మేలో 32.59 లక్షలు, జూన్లో 10.79 లక్షల పనిదినాలు మొత్తం 68 లక్షలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అదే విధంగా 8 వేల ఎకరాల్లో పండ్లతోటల పెంపకం చేపట్టనున్నామన్నారు. పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వినోద్కుమార్ -
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
పెద్దవడుగూరు: మండలంలోని దిమ్మగుడి గ్రామానికి చెందిన హరినాథ్రెడ్డి (15) గురువారం ఈత కొట్టేందుకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. తల్లిదండ్రులు వలస కూలీలు కావడంతో డ్రాపౌట్గా మారాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం తన స్నేహితులతో కలసి సి.రామరాజుపల్లి వద్ద ఉన్న నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. తనకు ఈత రాకున్నా.. ప్రయత్నిస్తూ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీట మునిగిపోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకుని గజ ఈతగాళ్ల రంగంలో దించడంతో సుదీర్ఘ సమయం అనంతరం హరినాథ్రెడ్డి మృతదేహం బయటపడింది. హైదరాబాద్లో ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా గ్రామస్తులు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నీట మునిగి విద్యార్థి మృతి కళ్యాణదుర్గం రూరల్: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గంలోని వడ్డేబండ వీధికి చెందిన గోవిందప్ప, లలితమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరి రెండో కుమారుడు సంజయ్ (13) స్థానిక నార్త్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి ఊరి చెరువులోకి ఈతకెళ్లిన సంజయ్.. కాసేపు సరదాగా నీటిలో ఆడుకుంటూ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీట మునిగాడు. గమనించిన స్థానికులు వెంటనే సంజయ్ను వెలికి తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో హుటాహుటిన స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పచ్చిరొట్ట విత్తన ధరల ఖరారు
అనంతపురం అగ్రికల్చర్: పచ్చిరొట్ట (గ్రీన్ మెన్యూర్స్) విత్తన ధరలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్లో రాయితీ విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా ఏటా రైతులకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. పచ్చిరొట్ట విత్తనాల కింద జీలుగ (ధనించా), జనుము (సన్హెంప్), పిల్లిపెసర ద్వారా భూసారం పెంచుకునేందుకు వీలుగా పొలాల్లో చల్లి పూతకు వచ్చిన తర్వాత కలియదున్నితే సేంద్రియ పదార్థం బాగా పెరుగుతుందని శాసీ్త్రయంగా నిరూపితమైంది. దీంతో ఇటీవల ఈ విత్తనాలకు రైతుల నుంచి డిమాండ్ పెరగడంతో వీటి ధరలు, రాయితీలు ఖరారు చేశారు. జిల్లాకు ఈ ఏడాది 190 క్వింటాళ్ల జీలుగ, రెండు క్వింటాళ్ల జనుము, 15వ క్వింటాళ్ల పిల్లిపెసర... మొత్తం 207 క్వింటాళ్లు కేటాయించారు. రబీలో కూడా జనుము, జీలుగ విత్తనాలు 425 క్వింటాళ్లు కేటాయించారు. అటు శ్రీసత్యసాయి జిల్లాకు కూడా ఖరీఫ్లో 138 క్వింటాళ్లు ఇచ్చారు. వీటిని 50 శాతం సబ్సిడీతో రైతులకు ఇవ్వనున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా వీటిని సరఫరా చేసి రైతులకు పంపిణీ చేయనున్నారు. జీలుగ విత్తనాలు క్వింటా పూర్తి ధర రూ.12,300 కాగా, 50 శాతం రాయితీతో రూ.6,150 చొప్పున రైతులకు అందజేయనున్నారు. అలాగే క్వింటా జనుము విత్తనాల పూర్తి ధర రూ.10,900 కాగా, 50 శాతం రాయితీ పోను రూ.5,450 చెల్లించాలి. పిల్లిపెసర క్వింటా పూర్తి ధర రూ.18 వేలు కాగా, 50 శాతం రాయితీ పోను రూ.9 వేల చొప్పున రైతులకు విక్రయిస్తారు. జీలుగు, జనుము విత్తనాలు 10 కిలోల ప్యాకెట్ల రూపంలో, పిల్లిపెసర 8 కిలోల ప్యాకెట్ కింద ఎకరాలోపు ఒక బ్యాగ్, రెండు ఎకరాలకు రెండు, మూడు ఎకరాలున్న రైతులకు మూడు బ్యాగులు, నాలుగు ఎకరాలున్న వారికి నాలుగు బ్యాగులు, ఐదు ఎకరాలు, అంతకన్నా ఎక్కువ ఉన్న వారికి గరిష్టంగా ఐదు బ్యాగులు పంపిణీ చేయనున్నారు. రైతు ఆసక్తిని బట్టి మూడు రకాల విత్తనాలు వేర్వేరుగానూ, మూడు రకాల విత్తనాలు కలిపి ఒకే బ్యాగ్ రూపంలోనూ ఇవ్వనున్నారు. మూడు కలిపిన వాటిలో నాలుగు కిలోల చొప్పున జీలుగ, జనుము, రెండు కిలోల పిల్లిపెసర ఉంటాయి. 10 కిలోలు కలిగిన మిక్సింగ్కిట్ పూర్తి ఖరీదు రూ.1,296 కాగా, 50 శాతం రాయితీ పోను రూ.648 చొప్పున రైతులు చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన రైతులు ఆర్ఎస్కేలలో తమ వాటా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. జిల్లాకు 207 క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాకు 138 క్వింటాళ్ల కేటాయింపు 50 శాతం రాయితీతో రైతులకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనం -
●వైభవంగా సిడిమాను ఉత్సవం
రాయదుర్గం టౌన్: స్థానిక రససిద్ధుల కొండపై వెలసిన రససిద్ధేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం సిడిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు సిడిమానుకు బాలుడిని కట్టి తిప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ ఈశ్వర్ స్నేహబృందం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. రససిద్ధుల కొండపై అశేష భకుల మధ్య సిడిమానుకు బాలుణ్ని కట్టి తిప్పుతున్న దృశ్యం -
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
గుంతకల్లు: స్థానిక మద్దికెర రైలు మార్గంలోని పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. రన్నింగ్ రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందకు పడి మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. మృతుడికి దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని, ఛామని చాయ రంగు, తెల్లరంగు నీలం పూల చొక్కా, బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించాడని వివరించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 98661 44416కు సమాచారం అందించాలని కోరారు. -
దాయాదుల ఘర్షణ – ఇద్దరికి గాయాలు
కళ్యాణదుర్గం: శెట్టూరు మండలం మాలేపల్లిలో ఆస్తి విషయంగా దాయాదుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... మాలేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు రామాంజనేయులుకు ఇద్దరు భార్యలున్నారు. ఆస్తి విషయంగా బుధవారం రాత్రి రామాంజనేయులుతో పెద్ద భార్య హనుమక్క, కుమారుడు హనుమంతరాయుడు, అల్లుడు గోపి, మర్రిస్వామి, నాగార్జున నవీన్, కుర్లపల్లి బంధువులు హనుమంతరాయుడు, కోనేరు గొడవ పడ్డారు. ఆ సమయంలో పెద్ద భార్య బంధువులు రామాంజనేయులు, ఆయన చిన్నభార్య ఈశ్వరమ్మపై దాడి చేయడంతో ఇద్దరూ గాయపడ్డారు. ఘటనపై శెట్టూరు పోలీసు స్టేషన్లో ఇరువర్గాలూ ఫిర్యాదు చేసుకున్నాయి. విషయం తెలుసుకున్న వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వసంత్కుమార్, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్సింహా, రూరల్ అధ్యక్షుడు మల్లాపురం దొణస్వామి, ప్రతినిధులు నాగరాజు, ఖాజా, రఘుతో పాటు పలువురు రామాంజనేయులుకు బుధవారం రాత్రి కళ్యాణదుర్గంలోని టీ సర్కిల్లో ధర్నా చేపట్టారు. కుటుంబ ఆస్తి విషయంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని, దాడులకు ప్రేరేపించడం సరికాదని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న సీఐ యువరాజు సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. సమస్యకు పరిష్కారం చూపుతానని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. -
జిరసం అధ్యక్షుడిగా ‘కొత్తపల్లి’
అనంతపురం కల్చరల్: జిల్లా రచయితల సంఘం (జిరసం) నూతన కార్యవర్గాన్ని స్థానిక ఉపాధ్యాయ భవన్లో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీత డాక్టర్ శాంతినారాయణ, సీనియర్ కవి డాక్టర్ రాధేయ, ఉప్పరపాటి వేంకటేశుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ జెన్నె ఆనంద్ అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షుడిగా వర్ధమాన కవి కొత్తపల్లి సురేష్, ప్రధాన కార్యదర్శిగా వన్నప్ప, కోశాధికారిగా మధురశ్రీను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను సీనియర్ రచయితలు అభినందించారు. కార్యక్రమంలో జిరసం ప్రతినిధులు విద్యావతి, గోసల నారాయణస్వామి, ఎల్ఆర్ వెంకటరమణ, డాక్టర్ అంకె శ్రీనివాస్, చేగువేరా హరి, ఒంటెద్దు రామలింగారెడ్డి, విశ్వనాథరెడ్డి, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 89 మంది కానిస్టేబుళ్ల బదిలీ అనంతపురం: సీనియార్టీ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి 89 మంది కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో చేపట్టిన ఈ ప్రక్రియను అడిషనల్ డీఎస్పీ డీవీ రమణమూర్తి, ఏఓ రవిరాం నాయక్ తదితరులు పర్యవేక్షించారు. ఒకే పోలీస్స్టేషన్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సిబ్బంది జాబితాను సిద్ధం చేసి కౌన్సెలింగ్కు ఆహ్వానించారు. -
జగనన్నకు రుణపడి ఉంటాం
అనంతపురం కార్పొరేషన్/శింగనమల: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామని వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ వింగ్ కో ఆర్డినేటర్గా నియమితులైన ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అధినేతను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అంకితభావంతో పని చేస్తానన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ అభిమానులను ఏకతాటిపైకి తీసుకురావడానికి నిబద్ధతతో పని చేస్తానని తెలిపారు. రీ సర్వే త్వరితగతిన పూర్తి చేస్తాం : కలెక్టర్ అనంతపురం అర్బన్: జిల్లాలో చేపట్టిన రీ–సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని అదనపు సీసీఎల్ఏ ప్రభాకర్రెడ్డికి కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. రీ సర్వే అంశంపై అదనపు సీసీఎల్ఏ బుధవారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కాన్ఫరెన్స్కు కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. సమస్యలను క్షేత్రస్థాయిల పరిశీలించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వర్క్షాపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ముగ్గురు ఉత్తమ తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు, వీఆర్ఓలను గుర్తించి వారితో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పనులను వారికి అప్పగించి త్వరితగతిన రీసర్వే పూర్తి చేయాలని డీఆర్ఓను ఆదేశించామన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్, పరిష్కార వేదిక తహసీల్దారు వాణిశ్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్య ● మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఆత్మకూరు/బ్రహ్మసముద్రం: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బ్రహ్మ సముద్రం మండలం ముప్పలకుంట గ్రామానికి చెందిన వన్నూరుస్వామి (20) రెండేళ్ల క్రితం ఆత్మకూరు మండలం గొరిదిండ్ల గ్రామానికి చెందిన సి.నారాయణస్వామి వద్ద గొర్రెల కాపరిగా పనిలో చేరాడు. బుధవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత తనతో పాటు ఉన్న వారు అన్నం తీసుకొచ్చేందుకు గ్రామంలోకి వెళ్లారు. ఉదయం 8 గంటల సమయంలో అన్నం తీసుకుని గొర్రెల మందకు చేరుకోగా నారాయణస్వామి కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో నీటి కుంట వద్ద చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న నారాయణస్వామిని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లిదండ్రులు నాగరాజు, చౌడమ్మకు సమాచారం అందించారు. కాగా, నారాయణస్వామికి ఇంకా పెళ్లి కాలేదు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. తమ కుమారుడు వన్నూరుస్వామి మృతిపై తల్లిదండ్రులు పశువుల నాగరాజు, చౌడమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఏళ్ల డిమాండ్ను నెరవేర్చారు
మరింత పెంచాలి సంతోషం కలిగించింది పదో తరగతి పరీక్షల నిర్వహణ, జవాబుపత్రాల మూల్యంకన విధుల నిర్వర్తించే సిబ్బందికి రెమ్యునరేషన్ దాదాపు పదేళ్ల తర్వాత గతేడాది పెంచడం చాలా సంతోషం. అంతకముందు అన్ని హోదాల సిబ్బందికి చాలా నామినల్గా రెమ్యునరేషన్ చెల్లించేవారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం రెమ్యునరేషన్ మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలి. – డెగావత్ రవీంద్రనాథ్ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పదో తరగతి మూల్యాంకనం విధులకు హాజరయ్యే ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు చాలా తక్కువమొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించేవారు. గతేడాది ప్రభుత్వం ఆశాజనకంగా పెంచుతూ చర్యలు తీసుకోవడం చాలా సంతోషమేసింది. కష్టపడి పని చేస్తున్నా ఆశించిన స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో టీచర్లు చాలా అసంతృప్తిగా ఉండేవారు. స్పెషల్ అసిస్టెంట్లకు డీఏ సదుపాయం కల్పించాలి. – కె.గోవిందరెడ్డి, వైఎస్సార్టీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడుపదో తరగతి మూల్యాంకనం రేట్లు పెంచాలని అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయ సంఘాలు చేసిన డిమాండ్ను గతేడాది ప్రభుత్వం నెరవేర్చింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మూల్యాంకనానికి హాజరవుతారు. వారం రోజులపాటు అనంతపురంలో ఉండాల్సి వస్తుంది. అలాంటి వారికి జిల్లా విద్యాశాఖ ఎలాంటి వసతి, భోజన సదుపాయం కల్పించడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని భోజన, వసతి కల్పించాలి. – వి. గోవిందరాజులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
దౌర్జన్యాలు సహించం
● తిట్టినందుకే దుర్మార్గుడినైతే వందలాది మందిని పొట్టనబెట్టుకున్న పరిటాల రవి దేవుడా? ● మారణకాండను ఆపేందుకు అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధం ● 8న రామగిరి మండలం పాపిరెడ్డి పల్లికి వైఎస్ జగన్ రాక ● వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: దౌర్జన్యాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించబోమని ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారులు, సోదరులు, బంధువులను వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వారి బంధువుల దౌర్జన్యాలు పెచ్చుమీరాయని మండిపడ్డారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిటాల సునీత బంధువుల చేతిలో హత్యకు గురైన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 8న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులు, శాంతికాముకులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులకు విస్తృత స్వేచ్ఛ ఉండేదన్నారు. ఏ చిన్నదాడి జరిగినా మన.. తమ అనే భేదభావాలు లేకుండా కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. దీంతో రాప్తాడు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారులు, సోదరులు, బంధువులు హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని, ఫలితంగా నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం మటుమాయమైందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తాను చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలను తరచూ గుర్తు చేస్తున్నారని, అయితే తనను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతోనే తాను ఆయనపై విమర్శలు చేయాల్సి వచ్చిందన్నారు. ‘చంద్రబాబు, లోకేష్... మీకు బాధ కలిగి ఉంటే క్షమించాలని ఆ రోజే చెప్పా...ఈ రోజు కూడా క్షమించమని చెబుతున్నా. తిట్టినందుకే నేను దుర్మార్గుడిని అయితే వందలాది మందిని హతమార్చిన నీ భర్త (పరిటాల రవి) దేవుడా?... చెప్పు సునీతమ్మా’ అంటూ ప్రశ్నించారు. పరిటాల వర్గీయులు సాగిస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా తాము సమిధలయ్యేందుకు కూడ సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో అనంతపురం రూరల్, రాప్తాడు ఎంపీపీలు వరలక్ష్మి, జయలక్ష్మి,, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గోవిందరెడ్డి, బండి పవన్, రాప్తాడు సత్తిరెడ్డి, మామిళపల్లి హరినాథ్రెడ్డి, బాలపోతన్న, నాగముని, తిరుపాల్రెడ్డి, భానుకోట శివ పాల్గొన్నారు. -
ఆ హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు
అనంతపురం ఎడ్యుకేషన్: పరీక్ష సమయంలో విద్యార్థిని వద్ద ప్రశ్నపత్రం కనిపించలేదనే నెపంతో విచక్షణ కోల్పోయి విద్యార్థిని భుజపుటెముక విరిగేలా చితకబాదిన ఘటనలో ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెండ్ శ్రీనివాసప్రసాద్పై సస్పెన్షన్ వేటు పడింది. గత నెల 29న ఆత్మకూరు పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్న కేజీబీవీ విద్యార్థిని ప్రశ్నపత్రం తన టేబుల్ నుంచి కిందకు పడిపోయింది. అప్పటికే ఆ అమ్మాయి తెలిసిన ప్రశ్నలన్నింటికీ జవాబులు రాసి కూర్చుంది. ఈ క్రమంలోనే ప్రశ్నపత్రం కిందకు పడిపోయి గాలికి వెనుక వైపు బెంచీవద్దకు వెళ్లింది. ఇదే సమయంలో చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసప్రసాద్ గదికి చేరుకున్నాడు. పరిశీలిస్తున్న క్రమంలో విద్యార్థిని వద్దకు వెళ్లాడు. ఆన్షర్ షీటు మాత్రమే కనిపించడంతో ప్రశ్నపత్రం ఎక్కడ.. అని అడిగాడు. హఠాత్పరిణామంతో విద్యార్థిని ఆందోళనకు గురైంది. ఇక్కడే ఉందంటూ వెతుకుతుండగా ఒక్కసారిగా కర్రతో విద్యార్థినిని చితకబాదాడు. ఈ క్రమంలోనే ఆమె భుజపుటెముక విరిగింది. దీంతో తర్వాత రోజు పరీక్ష రాయలేని పరిస్థితి. ఈ పరిణామంపై ‘సాక్షి’లో ‘శ్రీనివాసా... ఇదెక్కడి ‘కర్ర పెత్తనం’ శీర్షికతో కథనం వెలువడింది. దీనిపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. స్వయంగా పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినిది ఏమాత్రం తప్పు లేదని, హెచ్ఎం అతిగా స్పందించాడంటూ జిల్లా అధికారులు వివరించడంతో సదరు హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో హెచ్ఎం శ్రీనివాస ప్రసాద్ను సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు కలెక్టర్ వినోద్కుమార్ కూడా ఘటనను తీవ్రంగా పరిగణించారు. మూడు రోజులుగా స్వయంగా డీఈఓ ప్రసాద్ బాబును పిలిపించి ఆరా తీశారు. హెచ్ఎంపై ఏ మేరకు చర్యలు తీసుకోవచ్చో తెలపాలంటూ ఆదేశించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే అకారణంగా విద్యార్థినిని చితకబాదిన హెచ్ఎంపై ఉచ్చు బిగుస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. -
‘కూటమి’ కపటంపై నిరసనాగ్రహం
అనంతపురం అర్బన్:కూటమి సర్కారు కపటంపై టీచర్లు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ‘ఫ్యాప్టో’ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ధర్నాకు పీడీ అసోసియేషన్ అమరావతి సంఘాల నాయకులు అక్కులప్ప, పీఎస్హెచ్ఎం గోవిందరెడ్డి, తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ శ్రీనివాస్నాయక్, సెక్రటరీ జనరల్ పురుషోత్తం, వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా ఇప్పటికీ ఉద్యోగులపై దృష్టి పెట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆత్మ గౌరవం దెబ్బతిని అసంతృప్తిలో ఉన్నారని, దీని పర్యవసానాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. తక్షణం 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసి 21 నెలలైనా 12వ వేతన సవరణ కమిటీపై నూతన ప్రభుత్వం దృష్టి సారించకపోవడం అన్యాయమన్నారు. 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనీర్లకు సంబంధించి 11వ పీఆర్సీ, డీఏ, సంపాదిత సెలవుల బకాయిలు, సీపీఎస్ ఉద్యోగుల బకాయిలు దాదాపు రూ.30 వేల కోట్లు ఉన్నాయ న్నారు. ఇప్పటికి ప్రభుత్వం రెండు విడతలుగా కేవలం రూ.7,300 కోట్ల బకాయిలను చెల్లించిందన్నారు. మిగిలిన రూ.23 వేల కోట్ల చెల్లింపుపై ప్రభుత్వ కార్యాచరణ ప్రకటించాలన్నారు. అనంతరం కలెక్టర్ వినోద్కుమార్ను నాయకులు కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కో– చైర్మన్లు ఓబుళేసు, లింగమూర్తి, డిప్యూటీ సెక్రటరీ జనరర్లు గోవిందరాజులు, రమణారెడ్డి, వెంకటేష్, కార్యదర్శి రత్నం, కోశాధికారి రెహమాన్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి, సిరాజుద్ధీన్, రామాంజినేయులు, లింగమయ్య, గోపాల్ రెడ్డి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.‘ఫ్యాప్టో’ మరికొన్ని డిమాండ్లు.. స్థానిక సంస్థల్లో పనిచేస్తూ కోవిడ్ సమయంలో మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల వారసులకు కారుణ్య నియామకాలను కలెక్టర్ ఫూల్ నుంచి చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు, పోలీసులకు, ఇతర ఉద్యోగులు దాదాపు 10 వేల మందికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ 72, 73, 74 ప్రకారం ఉపాధ్యాయులకు ఎంసీఓలు, డిప్యూటీ డీఓలు, డైట్ లెక్చరర్లగా పదోన్నతి కల్పించాలి. ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 12 నెలల పూర్తి వేతనం ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్టైం ఉపాధ్యాయులను ఫుల్టైం ఉపాధ్యాయులుగా పరిగణించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతో పాటు సమాంతరంగా తెలుగు మీడియం కొనసాగించాలి. డిమాండ్ల సాకారానికి ‘ఫ్యాప్టో’ ధర్నా పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీచర్లు -
రోగులకు నాణ్యమైన వైద్యం అందాలి
అనంతపురం మెడికల్: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వస్తుంటారని, ఇక్కడకు వచ్చే వారికి నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. బుధవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో హెచ్ఓడీలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. వృత్తి ధర్మాన్ని పాటించాలన్నారు. సర్వజనాస్పత్రి, వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీల అభివృద్ధికి పాటుపడాలన్నారు. పీజీ సీట్లు, సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావును ఆదేశించారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావును ఆదేశించారు. ఉమ్మడి జిల్లా నుంచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న విషయాన్ని మరువొద్దన్నారు. రోగులకు నాణ్యమైన భోజనాన్ని అందించేలా చూడాలన్నారు. పేషంట్ అటెండర్స్తో సమస్య.. సర్వజనాస్పత్రిలో పేషంట్ అటెండర్స్ అధికంగా ఉంటున్నారని, మహిళలుండే వార్డుల్లోకి పురుషులు వస్తున్నారని గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్బేగం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వివిధ వార్డులోనూ ఇదే సమస్య నెలకొందని హెచ్ఓడీలు తెలిపారు. దీంతో ఇన్ఫెక్షన్ రేటు అధికమయ్యే సమస్య ఉందన్నారు. స్పందించిన కలెక్టర్ సెక్యూరిటీలను అప్రమత్తం చేయాలని హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, సూపరింటెండెంట్లను ఆదేశించారు. సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్ రామకృష్ణ, డిప్యూటీ ఆర్ఎంఓలు డాక్టర్ పద్మజ, డాక్టర్ హేమలత, గ్రేడ్– 1 నర్సింగ్ సూపరింటెం డెంట్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. ప్రవర్తన బాగా లేకుంటే కఠిన చర్యలు అనంతపురం అర్బన్: ‘జిల్లాలో పలు చోట్ల ప్రిన్సిపాళ్లు, వార్డెన్ల ప్రవర్తన బాగాలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డీఈఓ, సమగ్రశిక్ష ఏపీసీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఉపేక్షించే ప్రసక్తే ఉండదన్నారు. కేజీబీవీల్లో నెలకోసారి బాలికలకు వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. పాఠశాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియ హేతుబద్ధంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరి ధిలోని మండలాల్లో 16 సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిని జాగ్రత్తగా పరిష్కరించాలని ఆదేశించారు. డీఈఓ ప్రసాద్బాబు, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ -
అరాచకాలను తిప్పికొడతాం
అనంతపురం కార్పొరేషన్: ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రాప్తాడు, కదిరి ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. తమకు మెజారిటీ లేదని, ఎంపీపీ అభ్యర్థి లేరని చెప్పిన ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరిలో అరాచకం సృష్టించారు. 20 ఏళ్ల క్రితం పరిస్థితులను మళ్లీ తీసుకురావాలని అనుకుంటున్నారా.. టీడీపీ అరాచకాలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే తిప్పికొడతాం’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా ఉప ఎన్నికల్లో 51 స్థానాలకుగానూ 39 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు. టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 8న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లికి రానున్నారని, ప్రతి కార్యకర్త, నాయకులు, నేతలకు జగన్ అండగా ఉంటారన్నారు. పోలీసు శాఖ ఫెయిల్యూర్.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసు శాఖ విఫలమైందని ‘అనంత’ విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పింఛన్లకు కోత పెట్టారన్నారు. ప్రస్తుతమున్న పింఛన్ లబ్ధిదారులకు రూ.33,800 కోట్లు అవసరమున్నా, బడ్జెట్లో కేవలం రూ.27 వేల కోట్లు కేటాయించారని, దీన్ని బట్టి రానున్న రోజుల్లో భారీగా పింఛన్ల కోత పెట్టనున్నట్లు అర్థమవుతోందన్నారు. పీ–4 అనేది ఒక బూటకమని విమర్శించారు. వైఎస్ జగన్ ఐదేళ్లలో నొక్కిన బటన్లన్నీ తాను పింఛన్ల కోసం నొక్కిన బటన్తో సమానమని చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. జగన్ బటన్ నొక్కితే ప్రజల ఖాతాల్లో నేరుగా రూ.2.72 లక్షల కోట్లు జమ అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాకు తీరని అన్యాయం జరుగుతున్నా మంత్రులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఎన్నడూ లేనివిధంగా జిల్లాకు హెచ్ఎల్సీ, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా సుమారు 55 టీఎంసీలు వస్తే కేవలం 55 వేల ఎకరాలకు అందించినట్లు కలెక్టర్ ప్రకటించారంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని పేర్కొన్నారు. ఒక టీఎంసీ నీరు 9 వేల ఎకరాలకు రావాలని, ఈ క్రమంలో దాదాపు 4.50 లక్షల ఎకరాలకు ఇవ్వాల్సి ఉంటే కేవలం 55 వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చారన్నారు. పీఏబీఆర్లో 5 టీఎంసీలు నిల్వ చేసుకున్నారా అంటే అదీ లేదన్నారు. పెనక చెర్లలో 0.5 టీఎంసీలు కూడా లేవన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, నాయకులు ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, మీసాల రంగన్న, పుల్లయ్య, చామలూరు రాజగోపాల్, వేణు, కేశవరెడ్డి, కుళ్లాయస్వామి, దేవి, పార్వతి, కార్పొరేటర్లు కమల్భూషణ్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ అండగా ఉంటారు ఈ నెల 8న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి జగన్ రాక వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
మహిళ హత్యకేసులో ముద్దాయికి యావజ్జీవం
అనంతపురం: మహిళను హత్య చేసిన కేసులో ముద్దాయికి కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. వివరాలు.. అనంతపురం రంగస్వామి నగర్లో నివాసం ఉంటున్న రవి, రామాంజినమ్మ (25) దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. రామాంజినమ్మకు నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన దూదేకుల సిద్ధయ్యతో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ ఎక్కిడికై నా వెళ్లి జీవిద్దామనుకుని సిద్ధయ్య వెంట రామాంజినమ్మ కొన్ని రోజులకే వెళ్లిపోయింది. అలా వెళ్లిన వీరు కళ్యాణదుర్గం రోడ్డు బైపాస్ సమీపంలోని ఒక గదిలో తలదాచుకున్నారు. ఈ క్రమంలో రామాంజినమ్మ తన వెంట తెచ్చుకున్న బంగారు, నగదుపై సిద్ధయ్య కన్నేశాడు. ఆమెను మభ్య పెట్టి 5 తులాల బంగారు, నగలు, రూ.3 వేలు తీసుకుని ఆటో కొనుగోలు చేశాడు. తనను వివాహం చేసుకోవాలని సిద్ధయ్యను రామాంజినమ్మ కోరడంతో ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. ప్రస్తుతం తామున్న ఇంటిని ఖాళీ చేద్దామని, నగర శివారులోని సెయింట్ ఆన్స్ స్కూలు సమీపంలోని మబ్బుకొట్టాలలో తాను చూసిన ఇంట్లో చేరదామని చెప్పి అనుమానం రాకుండా కొన్ని సామాన్లతో 2014 ఫిబ్రవరి 25న ఆటోలో రామాంజినమ్మను ఎక్కించుకుని బయలుదేరాడు. నగర పరిధిలోని ఇంద్రజిత్ నగర్ వద్ద కంపచెట్లలోకి తీసుకెళ్లి బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు.అనంతరం మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. హత్య చేసిన మూడు రోజుల తర్వాత మళ్లీ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించాడు. మృతదేహం కంపు కొట్టడంతో పాటు గుర్తు పట్టలేని రీతిలో ఉండటంతో ఇక తనకేం ఇబ్బంది ఉండదని భావించి, అక్కడి నుంచి నేరుగా గోరంట్లలో పూల వ్యాపారం చేసే తన అన్న వద్దకు చేరుకున్నాడు. సిద్ధయ్య నడవడికపై అప్పటి గోరంట్ల ఎస్ఐకి అనుమానం వచ్చి విచారించగా, రామాంజినమ్మ హత్య విషయం వెలుగు చూసింది. ఈ క్రమంలోనే మృతురాలి భర్త వడ్డే రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ముద్దాయి సిద్ధయ్య వీఆర్వో వద్ద లొంగిపోయాడు. దీనిపై అప్పట్లో సీఐగా ఉన్న దేవానంద్ కోర్టులో చార్జ్షీటు దాఖలు చేశారు. అనంతపురంలోని నాలుగో అదనపు జిల్లా కోర్టులో కేసు నడిచింది. కేసులో 8 మంది సాక్షులను నాలుగో అదనపు జిల్లా జడ్జి శోభారాణి విచారించారు. ముద్దాయిపై నేరం రుజువు కావడంతో బుధవారం తీర్పు వెలువరించారు. దూదేకుల సిద్ధయ్యకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ సుజన వాదించారు. కోర్టు మానిటరింగ్ సిస్టం సీఐ వెంకటేష్ నాయక్, కోర్టు లైజన్ ఆఫీసర్ శ్రీనివాసులు (ఏఎస్ఐ), కోర్టు కానిస్టేబుల్ శౌ రెడ్డి, త్రీ టౌన్ పీసీ హెచ్. నాగరాజులు నిందితుడికి శిక్ష పడేలా కృషి చేశారు. -
‘గ్రోత్ ఇంజిన్లు’గా చెప్పుకునే అరటి, చీనీ, టమాట, మిర్చి, మామిడి ఈ ఏడాది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. లక్షలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు కన్నీళ్లే మిగిల్చాయి. పంట పండితే ధరలు లేవు, ధరలుంటే పంటలు పండవు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. గతంలో ఎన్నడూ లేన
ఇటీవల ఈదురుగాలులకు పుట్లూరు మండలం జంగంరెడ్డిపేటలో దెబ్బతిన్న అరటి తోటలో దిగాలుగా రైతు మహేశ్వరరెడ్డి (ఫైల్) సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉద్యాన రైతులకు ఎక్కడా ఊరట లభించడం లేదు. అరటి రైతులైతే ఈ ఏడాది దారుణంగా దెబ్బతిన్నారు.పెట్టుబడులు పెరగడం, ధర తగ్గడంతో నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక దశలో రూ. 25 వేలు పలికిన టన్ను అరటి.. నేడు రూ.11 వేలు కూడా లేదు. రైతులేమో ఎకరాకు రూ. లక్షన్నర వరకూ పెట్టుబడి పెట్టారు. చాలా చోట్ల దిగుబడి బాగా వచ్చినా ధరల్లేక నిరాశే మిగులుతోంది. వాస్తవానికి జిల్లాలో పండే ‘గ్రాండ్ నైన్ అరటి’కి అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర లభిస్తున్నా ఎగుమతి సౌకర్యం లేకపోతోంది. మిరప, టమాట రైతుల కన్నీళ్లు మిరప, టమాట రైతులను కదిలిస్తే కన్నీటి గాథ బయటికొస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం పచ్చి మిర్చి కేజీ రూ.20 లేదా రూ.30 కంటే ఎక్కువ లేదు. కేజీ కనీసం రూ.40 పలికితేనే రైతుకు గిట్టుబాటవుతుంది. రిటైల్ మార్కెట్లోనే రూ.20 ఉంటే రైతు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక టమాట రైతులకు అప్పులే మిగులుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా కిలో టమాట రూ.10 కంటే ఎక్కువ పలకడం లేదు. ఎరువులు, పురుగుమందు ఖర్చులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. చీనీ రైతులకూ చేదు గుళికలే.. రాష్ట్రంలోనే అత్యధికంగా చీనీ దిగుబడి జిల్లాలో ఉంటుంది. చీనీ టన్ను ఇటీవల కాలంలో రూ.20 వేలు మించి పలకడం లేదు. 2021 కరోనా అనంతరం టన్ను లక్ష రూపాయలు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది నేడు రూ.20 వేలు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. మరోవైపు.. మామిడి ప్రస్తుతానికి పూత, పిందె వస్తున్నా.. వచ్చే రోజుల్లో నిలబడగలదా అన్న భయం రైతుల్లో నెలకొంది. ‘గ్రోత్ ఇంజిన్’ పంటల సాగు రైతులకు ఈ ఏడాది భారీ నష్టాలు మిర్చి, టమాట పంటలకు గిట్టుబాటు ధరల్లేక కుదేలు అరటి ధరలు పడిపోయి ఆవేదన చీనీ రైతులకూ చేదే మామిడి మీద ఆశలున్నా.. ముందు ముందు ఎలా ఉంటుందోనని భయం -
విద్యాశాఖ ఆడిట్లో ‘చేతి’వాటం
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలో ఆడిట్ అధికారుల చేతివాటం వెలుగులోకి వచ్చింది. ఎమ్మార్సీలు, ఉన్నత పాఠశాలలకు ఓ ధర చొప్పున నిర్ణయించి మరీ వసూళ్లకు తెర తీయడం హాట్టాపిక్గా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు... దాదాపు 15 రోజులుగా విద్యాశాఖలో ఏజీ జనరల్ ఆడిట్ జరుగుతోంది. విజయవాడ నుంచి ప్రత్యేక బృందం వచ్చింది. ఎమ్మార్సీలకు మంజూరైన గ్రాంట్లు, ఎంఈఓలు ఎన్ని తనిఖీలు చేశారు, నాడు–నేడు స్కూళ్లకు మంజూరైన నిధులు, పీఎంశ్రీ స్కూళ్లకు మంజూరైన నిధులు, ఖర్చు, కోడిగుడ్లు, చిక్కీల ఇండెంట్లు, బిల్లులు, గ్రాండ్ రిజిష్టరు, ఉద్యోగులు, టీచర్ల సర్వీస్ రిజిష్టర్లు తదితర ఖాతాలను వీరు పరిశీలిస్తున్నారు. అయితే ఖాతాల పరిశీలనకు సంబంధించి ప్రతి స్కూల్కు రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడడంపై కొందరు ఎంఈఓలు, హెచ్ఎంలు మండిపడుతున్నారు. ఇందుకోసం డీఈఓ కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులను నియమించుకున్నారు. ఆడిట్ కోసం వచ్చిన ఎంఈఓలు, హెచ్ఎంలు రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత వారు ఫిక్స్ చేసిన ‘క్యాష్’ను సదరు ఉద్యోగికి ముట్టజెప్పాలి. రూ. వెయ్యి, రూ. 3 వేలు, రూ. 5 వేలు, రూ. 10 వేలు వరకు స్కూళ్లు, ఎమ్మార్సీలకు ఫిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇక డీసీఈబీ, డీఈఓ, సమగ్రశిక్ష ఏపీసీ కార్యాలయాలు అదనపు వసూళ్లు సాగిస్తున్నట్లు సమాచారం. వారు చెప్పిన మొత్తం చెల్లిస్తే ఏవీకూడా లోతుగా పరిశీలించడం లేదని తెలిసింది. ఒక స్కూల్లో 20 మంది టీచర్లు పని చేస్తుంటే 4–5 మంది ఎస్ఆర్లు మాత్రమే చూసి ‘అంతా ఓకే’ అని సర్టిఫై చేస్తున్నట్లు సమాచారం. కాగా, దాదాపు ఐదేళ్ల రికార్డుల పరిశీలనకు సంబంధించి ఆడిట్ చేసినట్లు కనీసం ఒక సంతకం కాని, సీలు కానీ వేయడం లేదు. ఇంత డబ్బు చెల్లించినా ఆడిట్ చేసినట్లు ధ్రువీకరణ లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అంతా ఆన్లైన్ చేస్తున్నామని తర్వాత స్మార్ట్ కాపీలు వస్తాయని సర్దిచెప్పినట్లు ఓ హెచ్ఎం తెలిపారు. డీఈఓ కార్యాలయంలోని ఓ అధికారి వ్యవహారంపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. తమవద్ద అన్ని రికార్డులు కరెక్టుగా ఉన్నాయి సర్ అని కొందరు హెచ్ఎంలు ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఏదో వారు అడిగినంత ఇచ్చి వెరిఫై చేయించుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చారని చెబుతున్నారు. ప్రతి స్కూల్కు రేట్ ఫిక్స్ చేశారంటున్న హెచ్ఎంలు, ఎంఈఓలు ఆడిట్ పేరుతో చేతులు మారుతున్న రూ.లక్షలు -
కనుల పండువగా ‘లంకా దహనం’
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు రోజులుగా సాగుతున్న ఉగాది ఉత్సవాలు మంగళవారం నాటి లంకాదహనం కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. దాదాపు రెండు గంటల పాటు సాగిన లంకాదహనం వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం సాయంత్రం ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటె వాహనంపై కొలువదీర్చి ఆలయం నుంచి అనుబంధ దేవాలయమైన కాశీవిశ్వేశ్వరాలయం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ఆలయం ఈఓ కె.వాణి, సిబ్బంది ఆధ్వర్యంలో కాశీవిశ్వేశ్వరుడికి పూజలు నిర్వహించిన అనంతరం ఆంజనేయస్వామి పల్లకీని ప్రాంగణంలో కొలువు దీర్చి వేదగోష్టి నిర్వహించారు. అనంతరం అయ్యప్ప క్రాకర్స్ సౌజన్యంతో సమకూర్చిన టపాసులతో దాదాపు రెండు గంటలపాటు లంకా దహనం వేడుకగా సాగింది. -
జిల్లా అంతటా మంగళవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవి తాపం అధికంగా ఉంది. ఆగ్నేయం దిశగా గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
చల్లటి కబురు అనంతపురం అగ్రికల్చర్/ బుక్కరాయ సముద్రం: జిల్లావాసులకు భారత వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. ఈనెల 4, 5, 6 తేదీల్లో జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం మెట్ట వ్యవసాయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్.మాధవీలత, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో తెలిపారు. ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడవచ్చన్నారు.గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 38.5 డిగ్రీలు, కనిష్టం 24 నుంచి 25.1 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 68 నుంచి 71, మధ్యాహ్నం 15 నుంచి 43 మధ్య రికార్డు కావొచ్చని తెలిపారు. ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 6 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. వర్షసూచన నేపథ్యంలో రైతులు, జీవాల పెంపకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉద్యాన తోటలు గాలికి దెబ్బతినకుండా ఊతకర్రలు పెట్టుకోవాలని సూచించారు. నేల ఉష్ణోగ్రత తగ్గించుకునేందుకు ఎండిన ఆకులు, వరి గడ్డి, సేంద్రియ పదార్థాలను మొక్కల చుట్టూ ఆర్గానిక్ మల్చింగ్ విధానం పాటించాలన్నారు. వేసవిలో లోతుగా దుక్కులు చేసుకుంటే ఖరీఫ్లో పంటలకు మేలు కలుగుతుందని తెలిపారు. నేడు కలెక్టరేట్ ఎదుట ‘ఫ్యాప్టో’ ధర్నా అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు జరిగే ధర్నాకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తరలిరావాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఆర్.శ్రీనివాస్ నాయక్, సెక్రటరీ జనరల్ పురుషోత్తం పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ, ఐఆర్, డీఏ, సరెండర్ లీవ్స్, సీపీఎస్ ఉపాధ్యాయుల అరియర్స్ వంటి మొండి బకాయిల సాధన, విద్యారంగ సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. -
జోరుగా గ్రామీణ క్రీడా పోటీలు
శింగనమల: ఉగాది పండుగను పురస్కరించుకుని మంగళవారం శింగనమలలోని నల్లమ్మ దేవాలయం వద్ద ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. పోటీల్లో నాగలాపురానికి చెందిన ఫణేంద్ర మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానంలో పామిడి మండలం వంకరాజు కాలువ గ్రామానికి చెందిన నరేష్ నిలిచాడు. విజేతలను అభినందిస్తూ నగదు పురస్కారాలతో ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. రైలు నుంచి జారిపడి యువకుడి దుర్మరణం అనంతపురం సిటీ: స్థానిక జీఆర్పీ పరిధిలోని గార్లదిన్నె– తాటిచెర్ల మార్గమధ్యంలో రైలు నుంచి జారిపడి ఓ యువకుడు (30) మృతి చెందాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి జేబులో యాదగిరి నుంచి యశ్వంత్పూర్ వెళ్లే రైల్వే జనరల్ టికెట్ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. మృతుడు ఎరుపు, నీలం గీతలు కలిగిన పసుపు రంగు ఆఫ్ టీ షర్ట్, లైట్ సిమెంట్ రంగున్న షర్ట్, మెరూన్ రెడ్ కలర్ ఉన్న పుల్ అండర్వేర్ ధరించాడని, ఎత్తు 5.5 అడుగులు, ఛామన ఛాయ రంగు, ఎడమ చేతికి పి.మహి అని, కుడి చేతిపై ఎంఎస్ అనే ఆంగ్ల అక్షరాలు పచ్చబొట్టు వేయించుకున్నాడని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. లవ్ సింబల్ సహా ఓం అనే సింబల్ పచ్చ రంగు టాటూ కూడా చేతిపై ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు :94406 27662 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఉంతకల్లులో నగదు చోరీ బొమ్మనహాళ్: మండలంలోని ఉంతకల్లు గ్రామంలో చోరీ జరిగింది. నిందితుడిని స్థానికులు బంధించారు. వివరాలు.. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు సోమవారం మృతి చెందడంతో రాత్రి మృతదేహం వద్ద భజన చేసేందుకు తలారి వన్నూరుస్వామి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో భార్య అనంతమ్మ ఒక్కతే నిద్రిస్తోంది. విషయాన్ని గుర్తించిన అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి బీరువాపై ఉన్న తాళాలు తీసుకుని తలుపులు తెరిచి రూ.50వేలు అపహరించుకెళ్లాడు. కాసేపటి తర్వాత మళ్లీ ఇంట్లోకి చొరబడిన అదే వ్యక్తి బీరువాలో నగదు తీస్తుండగా అనంతమ్మ మేలుకువ కావడంతో గమనించి కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని వ్యక్తిని నిర్బంధించారు. చోరీ చేసిన డబ్బు వెనక్కు ఇవ్వాలని గ్రామస్తులు తెలపడంతో ఇంట్లో ఉన్నాయని, ఉదయాన్ని తెచ్చిస్తానంటూ తెలిపాడు. దీంతో ఇద్దరికీ స్థానికులు సరిచెప్పి పంపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. -
‘డైట్’ అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలోని విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిప్యూటేషన్ పద్దతిలో పని చేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు డీఈఓ ప్రసాద్బాబు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలు https://deo ananthapuramu.blogspot.com/ వెబ్సైట్లో పొందుపరిచారని, మరింత సమాచారానికి డైట్ ప్రిన్సిపాల్ లేదా అనంతపురం డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఆత్మకూరు హెచ్ఎంపై కేసు నమోదు ఆత్మకూరు: పరీక్ష కేంద్రంలో కేజీబీవీ పాఠశాల విద్యార్థిని శ్రావణిని కర్రతో కొట్టి ఆమె భుజపుటెముక విరిగేందుకు కారణమైన ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రీనివాసప్రసాద్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం పదో తరగతి పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రాలను తీసుకెళ్లేందుకు పీఎస్కు చేరుకున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతలో చైన్స్నాచర్ బరితెగింపు అనంతపురం: నగరంలో ఓ చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. సామాజిక పించన్ల పంపిణీకి స్కూటీలో బయలుదేరిన ఓ సచివాలయ ఉద్యోగిని వెంటాడి, ఆమె మెడలోని బంగారం చైన్ను బలవంతంగా లాక్కెళ్లాడు. వివరాలు.. అనంతపురం నగరంలోని 71వ సచివాలయంలో హెల్త్ సెక్రెటరీగా పనిచేస్తున్న శకుంతల మంగళవారం ఉదయమే సామాజిక పింఛన్ల పంపిణీకి స్కూటీలో బయలుదేరారు. బైపాస్ నుంచి హెచ్చెల్సీ పక్కనే ఉన్న దారిలో వెళుతున్న ఆమెను గమనించిన ఓ యువకుడు వెంబడిస్తూ నిర్మానుష్య ప్రాంతంలో తన ద్విచక్ర వాహనాన్ని అడ్డుపెట్టి అటకాయించాడు. హఠాత్పరిణామంతో ఆమె తేరుకునేలోపు మెడలోని బంగారం చైన్ను బలవంతంగా లాగేశాడు. దీంతో చైన్ రెండు ముక్కలైంది. తన చేతికి అందిన సగం చైన్తో యువకుడు అక్కడి నుంచి శరవేగంగా ఉడాయించాడు. ఘటనపై బాధితురాలు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.