Anantapur Latest News
-
No Headline
గుత్తి రూరల్: అనంతపురం నగరానికి చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పుణ్యక్షేత్రాల సందర్శనకు ఈ నెల 6న బయలదేరింది. కాశీ, ఉజ్జయిని, పండరీపురం, షిర్డీ, నాసిక్తో పాటు పలు క్షేత్రాలను సందర్శించిన భక్తులు ఈ నెల 15న కుంభమేళా నుంచి బయలుదేరారు. గురువారం మంత్రాలయానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మొత్తం 48 మంది భక్తులతో బయలుదేరిన బస్సు... ఆదోని, పత్తికొండ మీదుగా గుత్తికి వస్తుండగా కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామ శివారులో ముందు టైర్ పేలడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఘటనలో అనంతపురానికి చెందిన బస్సు డ్రైవర్ వినోద్కుమార్, వన్నూరుస్వామి, ప్రమీల, మహాలక్ష్మి, వన్నూరుస్వామి, ఉమాదేవి, బ్రాహ్మణపల్లికి చెందిన తులసి, కర్ణాటకలోని బసవనహళ్లికి చెందిన లక్ష్మయ్య, బెంగళూరు రూరల్ తాలుకా గుండంగేరికి చెందిన నాగరాజాచారి, నాగలక్ష్మి, చంద్రశేఖర్, జయలక్ష్మి, ప్రేమమ్మ, చిక్బళ్లాపురం జిల్లా డి.మల్లికెర గ్రామానికి చెందిన వెంకటరమణప్ప, యలహంకకు చెందిన పూర్ణిమాబాయి, బలసముద్రం నివాసులు ఆదెమ్మ, హనుమంతప్ప, దొడ్డబళ్లాపురానికి చెందిన ఆదిశేషు, తుమకూరుకు చెందిన పుష్పవతి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను ఆగమేఘాలపై గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న తులసి, పూర్ణిమాబాయి, ఆదిశేషు, లక్ష్మయ్యను మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి రెఫర్ చేశారు. ● గార్లదిన్నె: వుండలంలోని కల్లూరు వద్ద 44వ జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తాపడిన ఘటనలో 11 మంది వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. శింగనమల మండలం నాగులగుడ్డం తండాకు చెందిన 11 మంది కూలీలు ఉదయం పామిడి సమీపంలో సపోట కాయలు తొలగించి, సాయంత్రం బొలెరో వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. కల్లూరులోని తరిమెల క్రాస్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ వాటర్ బాటిల్ కోసం కిందికి వంగడంతో బొలెరో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఘటనలో సోనియా బాయి, రామక్క, శంకరమ్మ, సులోచన, శారదాబాయి, గీతాబాయి, శంకరమ్మ, మంగమ్మ, నీలవేణి, లక్ష్మీదేవి, నాగేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురంలోని జీజీహెచ్కు తరలించారు. ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అధికారుల అలసత్వం... ఆర్టీసీకి నష్టం
గుత్తిలో జరిగింది వాస్తవం గుత్తి డిపోలో అక్రమాలు చోటు చేసుకున్న మాట వాస్తవం. ఇందుకు సంబంధించిన ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయి. అయితే ఉరవకొండ డిపోలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదు. – సుమంత్.ఆర్.ఆదోని, ఆర్టీసీ ఆర్ఎం, అనంతపురం అనంతపురం క్రైం: అధికారుల అలసత్వం కారణంగా ఆర్టీసీకి నష్టాలు చేకూరుతున్నాయి. డిపోలపై ఉన్నతాఽధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది. టోల్గేట్ చెల్లింపులకు సంబంధించి గుత్తి డిపోలో చోటు చేసుకున్న అక్రమాలు మరువకనే తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. రూ.46 లక్షల ఆదాయానికి గండి ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి రోజూ 25 బస్సులు జల్లిపల్లి టోల్ఫ్లాజా మీదుగా 104 ట్రిప్పులు తిరుగుతాయి. ఇందుకు గాను ఒక్క బస్సుకు టోల్ ఫీజు సింగిల్ ట్రిప్పు కింద రూ.235 చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు 104 ట్రిప్పులకు గాను రూ.24,440 చెల్లించాల్సి వస్తుంది. అయితే ఆర్టీసీ అధికారులు లోకల్ కన్సెక్షన్ తీసుకుంటే టోల్ఫీజులో రాయితీ వర్తిస్తుంది. ఒక్కో ట్రిప్పుకు రూ.110 మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. అయితే ఈ అవకాశాన్ని అధికారులు కావాలనే నిర్లక్ష్యం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా 2022 నుంచి 2024 ఆగష్టు వరకు నెలకు రూ.3.90 లక్షలు చొప్పన అప్పటి ఉరవకొండ డిపో మేనేజర్ గండి కొట్టారు. జల్లిపల్లి టోల్ఫాజాకు ఆర్టీసీ ఖాతా నుంచి సకాలంలో సొమ్మును బదిలీ చేయని కారణంగా అది తడిసి మోపైడె రూ.46 లక్షలకు చేరుకుంది. ఈ వ్యవహారం తన తలకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భావించిన ఆ డీఎం వెంటనే తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చి వెళ్లిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. అక్రమాలు జరిగాయని తెలిసినా సదరు అధికారిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ఈ విషయం వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టారు. రూ.100 విలువ చేసే లీటరు డీజిల్ వృథాకాకుండా డ్రైవరుకు శిక్షణ పేరుతో 24 గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే ఆర్ఎం స్థాయి అధికారులు.. డిపో అధికారి నిర్లక్ష్యం కారణంగా రోజుకు రూ.13 వేలు నష్టపోయామనే విషయాన్ని గ్రహించలేక పోవడం సంస్థ దౌర్బాగ్యమని యూనియన్ నేతలు మండిపడుతున్నారు. గుత్తి డిపోలోని అక్రమాలు మరవకనే మరో రూ.46 లక్షల వ్యవహారం బట్టబయలు -
ప్రయాణికుల భద్రతకు చర్యలు
● ఏపీ రైల్వేస్ ఐజీపీ కేవీ మోహన్కుమార్ గుంతకల్లు: రైలు ప్రయాణికుల భద్రతతో పాటు నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ రైల్వేస్ ఐజీపీ కేవీ మోహన్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతో స్థానిక డీఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కో–ర్డినేషన్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీఆర్పీ ఎస్పీ రాహుల్మీనా, డీఎస్పీ హర్షిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రానున్న వేసవిలో రైళ్లలో చోరీలు ఎక్కువగా జరిగే అవకాశముందని, గుంతకల్లు డివిజన్కు సమీపంలోని సరిహద్దున ఉన్న కర్ణాటక, తెలంగాణ, చైన్నె రాష్ట్రాల సిబ్బందితో కలసి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్ తదతర ప్రాంతాల నుంచి కొన్ని గ్యాంగ్లు రైళ్లలో ప్రయాణిస్తూ చోరీలు చేసి వెంటనే పక్క రాష్ట్రాలకు ఉడాయిస్తుంటారన్నారు. దీంతో పక్క రాష్ట్రాల సిబ్బందిని కో–ఆర్డినేషన్ చేసుకోగలిగితే దొంగలను పట్టుకోవడం సులువవుతుందన్నారు. పెరిగిన ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్యకకు అనుగుణంగా రైల్వే పోలీసులతో పాటు లోకల్ పోలీసుల సాయాన్ని కూడా తీసుకుంటామన్నారు. సమస్యాత్మక రైలు మార్గాలపై ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆర్పీఎఫ్, జీఆర్పీలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఔట్సోర్సింగ్ కింద తాత్కాలిక సిబ్బంది నియమించుకుంటామన్నారు. అంతకు ముందు ఆయన జీఆర్పీ ఎస్పీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన బెల్ ఆఫ్ ఆర్మ్స్, గార్డు రూమ్లను ప్రారంభించారు. ప్రాంగణంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జీఆర్పీ డీఎస్పీ మురళీధర్ (నెల్లూరు), సీఐ అజయ్కుమార్, డివిజన్ పరిధిలోని జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
లైనింగ్ పనులు ఆపండి
● టీడీపీ నాయకుడి వేడుకోలు రాప్తాడు రూరల్: హంద్రీ–నీవా కాలువ రెండో దశలో ప్రభుత్వం చేపట్టిన కాంక్రీట్ లైనింగ్ పనులపై టీడీపీ శ్రేణుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, రైతు ఎర్రిస్వామి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆయన మాటల్లోనే...‘హంద్రీ–నీవా కాలువ లైనింగ్ ప్రారంభమయ్యాయి. స్టేజ్–2 కింద మా ఊరి వద్ద పనులు చేస్తున్నారు. ఈ లైనింగ్ పనులు చేపడితే మా గ్రామంలోనే వేలాది ఎకరాల్లో లక్షల సంఖ్యలో చీనీ చెట్లు ఎండిపోతాయి. చంద్రబాబు సార్..చేతులెత్తి వేడుకుంటున్నా లైనింగ్ పనులు ఆపండి. లేదంటే వేలాదిమంది రైతులు నష్టపోతారు. లైనింగ్ పనులు పూర్తయితే మా భూములన్నీ ఎండిపోతాయి. అసలే బండ భూములివి, ఎక్కడో ఒకచోట మాత్రమే నీళ్లు పడతాయి. లైనింగ్ వేస్తే అవికూడా లేకుండా పోతాయి. దయచేసి లైనింగ్ పనులు ఆపి మమ్మల్ని కాపాడండి’ అంటూ వేడుకున్నాడు. నేడు ‘మోడల్’ టీచర్లకు ‘పీఏఎల్’ శిక్షణ అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ఏపీ మోడల్, కేజీబీవీ టీచర్లకు పర్శనలైజ్డ్ అడాప్టివ్ లర్నింగ్ (పీఏఎల్) అంశంపై శనివారం రాప్తాడులోని మోడల్ స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 53 పాఠశాలల్లో ఇప్పటికే పీఏఎల్ కార్యక్రమం అమలులో ఉంది. విద్యార్థుల వ్యక్తిగత సామర్థ్యాన్ని గుర్తించి, వారి అభ్యసనా విధానాన్ని మరింత మెరుగు పరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి దశలో 32 కేజీబీవీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, గణితం, ఇంగ్లిషు, తెలుగు ఉపాధ్యాయులు ఈ ఏడాది జనవరి 3న శిక్షణ పొందారు. రెండో దశలో భాగంగా ప్రస్తుతం 15 మోడల్ స్కూళ్లు, ఆరు రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, గణితం, ఇంగ్లిషు, తెలుగు ఉపాధ్యాయులకు శనివారం శిక్షణ ఇవ్వనున్నారు. సంబందిత ప్రిన్సిపాళ్లు, టీచర్లు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు తస్కరించి.. రూ. 51 వేలు స్వాహా ● కేసు నమోదుకు సహకరించని గుత్తి పోలీసులు గుత్తి: వృద్ధుడిని ఏమార్చి ఆయన ఏటీఎం కార్డు ద్వారా రూ.51 వేలను అపహరించిన ఘటన గుత్తిలో వెలుగుచూసింది. వివరాలు.. గుంతకల్లు మండలం గొల్లలదొడ్డికి చెందిన వృద్ధుడు తలారి రామాంజనేయులు శుక్రవారం రాత్రి రూ.5 వేలు డ్రా చేయడానికి గుత్తి లోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎం కేంద్రానికి చేరుకున్నాడు. అయితే నగదు డ్రా చేసే విధానం తెలియక నిలబడి ఉండడం గమనించిన ఓ ఆగంతకుడు నగదు డ్రా చేసిస్తానంటూ ఏటీఎం కార్డు తీసుకుని ప్రయత్నించాడు. అయితే డబ్బు డ్రా కావడం లేదంటూ అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న మరో ఏటీఎం కార్డును వృద్ధుడికి అందజేసి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత తన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 51 వేలు డ్రా అయినట్లు వృద్ధుడి సెల్కు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకున్న వృద్ధుడు పోలీసులను ఆశ్రయిస్తే ఫిర్యాదు సైతం తీసుకోకుండా వెనక్కు పంపారు. ‘నీది గుంతకల్లు మండలం కావడంతో అక్కడికెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని’ పోలీసులు చెబుతున్నారంటూ విలేకరుల ఎదుట వృద్ధుడు వాపోయాడు. -
హంద్రీ–నీవా కాలువ పనులు వేగవంతం చేస్తాం
కళ్యాణదుర్గం: జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలవ పనులు, ఇతర అంశాలపై ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం హెచ్ఎన్ఎస్ఎస్ సీఈ, ఎస్ఈ, ఈఈలు, ఏఈలతో కలెక్టర్ సమీక్షించారు. హంద్రీనీవా కాలువ పనులు చేపట్టిన రెండేళ్ల లోపు పూర్తి చేయాలన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ 36బీ, 36సీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీ వరకూ కాలువ పనులు చేపట్టే అంశాన్ని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నేమకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి సంబంధించి ఏజెన్సీ నుంచి డీపీఆర్ అందాల్సి ఉందన్నారు. అంతకు ముందు రీ సర్వే పనులపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ వసంతబాబు, సివిల్ సప్లయీస్ డీఎం రమేష్రెడ్డి, సర్వే ఏడీ రూప్లానాయక్, హెచ్ఎన్ఎస్ఎస్ సీఈ నాగరాజ, ఎస్ఈ రాజా స్వరూప్కుమార్, గుంతకల్లు ఈఈ శ్రీనివాసనాయక్, డీఈలు విశ్వనాథ్, రమణ, వెంకటరమణ, ఏఈలు దాదాఖలందర్, నాగభూషణం, భాస్కర్, నాగరాజు, పీజీఆర్ఎస్ తహసీల్దార్ వాణిశ్రీ,, డివిజన్ మండలాల తహసీల్దార్లు, డీటీలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 2 లోపు మోడల్ సర్వే పూర్తి చేయాలి కళ్యాణదుర్గం రూరల్: మోడల్ సర్వేను మార్చి 2వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. శుక్రవారం కళ్యాణదుర్గంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి జీఎస్డబ్ల్యూఎస్, పీ–4 మోడల్ సర్వేపై జెడ్పీ సీఈఓ, డీపీఓ, డీఎల్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలన్నారు. వివిధ రకాల సేవలకు సంబంధించిన సర్వీసుల మొత్తాన్ని రెండు రోజుల్లోపు ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలన్నారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ -
నమ్మి ఓటేస్తే.. రైతుల నోట మట్టి కొడతారా?
రాప్తాడు రూరల్: నమ్మి ఓబేసిన పాపానికి జిల్లా రైతుల నోట కూటమి సర్కార్ మట్టి కొడుతోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు ఆపాలని పార్టీలకు అతీతంగా రైతులు స్పందిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులను అడ్డుకుంటున్నారన్నారు. కాలువకు కాంక్రీట్ లైనింగ్ వేస్తే దాదాపు 20 కిలోమీటర్ల దూరం వరకు భూగర్భ జలాలు అడుగంటి పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. బోర్లు ఎండిపోయి రైతులు వలస వెళ్లే పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఈ విషయంగా గతంలో పలు విజ్ఞప్తులు చేసినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రైతు సంక్షేమానికి పార్టీలకు అతీతంగా టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల నేతలు, రైతు సంఘాలు, రైతు కూలీలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఇందు కోసం శనివారం నుంచి హంద్రీ–నీవా ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి అఖిల పక్ష నేతలతో చర్చించి, ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. లైనింగ్ పనులను అడ్డుకునేందుకు ఎవరు వచ్చినా కలుపుకొని పోరాటాలు చేస్తామన్నారు. శ్రీశైలం డ్యాంలో 80 టీఎంసీల వరకు నీళ్లు ఉన్నాయని, రోజూ సగటున ఇరు రాష్ట్రాలు అర టీఎంసీ మాత్రమే డ్రా చేస్తున్నాయన్నారు. ఈ లెక్కన మరో ఐదు నెలల వరకు వాడుకోవచ్చన్నారు. ఈ లోపు మడకశిర బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న చెరువులు, పేరూరు డ్యాంకు కూడా నీరు ఇవ్వొచ్చన్నారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో అర్తం కావడం లేదన్నారు. పెన్నానదిలో ఇసుకను తోడుకునే విషయంలో ఉన్న ఉత్సాహం పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడంలో పరిటాల సునీత చూపించడం లేదన్నారు. తన నియోజవకర్గంలో చెరువులకు నీళ్లివ్వాలని అడగాల్సిన పెద్దమనిషి బాలకృష్ణ సైతం నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి తిరుగుతున్నారన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో చెరువులకు నీళ్లు తెచ్చుకునే విషయలో మంత్రి సవితమ్మ మాట్లాడాలన్నారు. కొత్తగా వచ్చిన ఎంఎస్ రాజు మడకశిర నియోజకవర్గంలోని అగళి, అమరాపురం డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసేందుకు రూ. 200 కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి రాబట్టుకునేందుకు ప్రయత్నించాలన్నారు. జిల్లా రైతులను కాదని చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకుపోవాలని చూస్తే అడ్డుకుంటామన్నారు. హంద్రీ–నీవా ప్రాజెక్ట్ను అనంతపురం, కర్నూలు జిల్లాలకే పరిమితం చేయాలన్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సైతం దీనిపై స్పందించాలన్నారు. మైక్రో ఇరిగేషన్ లేదా పిల్లకాలువల నిర్మాణాలు పూర్తయిన తర్వాత లైనింగ్ పనులు చేసుకోవాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రామగిరి మండల కన్వీనర్ మీనుగ నాగరాజు, నాయకులు ఆదిరెడ్డి, మదిగుబ్బ వీరాంజనేయులు పాల్గొన్నారు. జిల్లా రైతులను కాదని చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకెళతామంటే ఒప్పుకోం పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకు రావడంలో ఎమ్మెల్యే సునీత వైఫల్యం నేటి నుంచి గ్రామాల పర్యటన అఖిల పక్ష నేతలతో చర్చించి లైనింగ్ పనులు అడ్డుకుంటాం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
గార్లదిన్నె: అప్పు తీర్చక పోతే భూమిని కోల్పోయాల్సి వస్తుందన్న మనో వేదన తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... గార్లదిన్నె మండలం ముంటిమడుగు కొత్తూరుకు చెందిన శ్రీనివాసులురెడ్డి (55)కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న రెండు ఎకరాల్లో పంటల సాగు, ఇతర అసవరాల కోసం భూమిని ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. వడ్డీల భారం పెరిగి అది రూ.8లక్షలకు చేరుకుంది. ఈ క్రమంలో గడువు సమీపిస్తుండడంతో అప్పు తీర్చకపోతే భూమిని కోల్పోవాల్సి వస్తుందంటూ మనోవేదనకు లోనై గురువారం సాయంత్రం తన తోటలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చీకటి పడుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య, కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం తోటలో చెట్టుకు విగతజీవిగా వేలాడుతున్న శ్రీనివాసులరెడ్డిని గమనించి బోరున విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 24, 25న బ్యాంకు ఉద్యోగుల సమ్మె అనంతపురం అగ్రికల్చర్: యూఎఫ్బీయూ పిలుపు మేరకు మార్చి 24, 25న దేశవ్యాప్తంగా తలపెట్టిన బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం అనంతపురంలోని ఎస్బీఐ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. బ్యాంకుల్లో అన్ని విభాగాల్లో ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ నియామకాలు చేపట్టాలని, బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలని, తదితర డిమాండ్ల సాధనకు మార్చి 24, 25న సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు కె.ఖాదర్బాషా, చంద్రమోహన్, అనూష, నీలిమ, భారతి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్ బంకుల్లో మోసం.. తనిఖీల్లో బట్టబయలు
అనంతపురం: నగర శివారున సోములదొడ్డి వద్ద ఉన్న విజయలక్ష్మి (ఇండియన్) పెట్రోల్ బంక్లో చిప్ అమర్చి మీటర్ రీడింగ్ను ట్యాంపరింగ్ చేస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. శుక్రవారం చేపట్టిన తనిఖీల్లో చిప్ను విజిలెన్స్ అధికారులు పసిగట్టారు. ఏడాదిలో 28 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకం జరగగా, ఇందులో 2.80 లక్షల లీటర్ల సొమ్మును స్వాహా చేసినట్లుగా గుర్తించారు. ఇలాంటి చిప్ తరహాలోనే జిల్లాలో మరిన్ని పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్నాయని, అన్నింటిపై విస్తృత తనిఖీలు చేపట్టి అక్రమాలను అడ్డుకుంటామని విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. -
కెరియర్కే ప్రాధాన్యం
రెండు దశాబ్దాల కిందటతో పోలిస్తే ఇప్పుడు వధూవరులు వేతనానికి ఇస్తున్న ప్రాధాన్యత ఇతరత్రా వాటికి ఇవ్వడం లేదు. ఆషామాషి ఉద్యోగాలు చేసేవారికి అమ్మాయి దొరకడం కష్టమైపోయింది. ఈడు జోడు, జాతకాలు ఇవన్నీ ఉంటూనే గొప్పగా ఉండాలన్న భావనతో పెరుగుతున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకునే వారు. కానీ ఇప్పుడలా కాదు. కోరికలు పెరిగిపోవడం, ఆడపిల్లలదే పైచేయి కావడంతో అబ్బాయిలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. – బత్తలపల్లి సత్యరంగారావు, వధూవర పరిచయ వేదిక -
No Headline
అనంతపురం కల్చరల్/ఎడ్యుకేషన్/గుత్తి రూరల్ : ఒకే పోలిక.. ఒకే డ్రెస్. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే! జిరాక్స్ టూ జిరాక్స్... ఇలా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పినా తక్కువే అవుతుంది. తల్లిగర్భంలో ఒకేసారి, ఒకే రూపంతో మొదలై.. క్షణాల వ్యవధిలో బయటి ప్రపంచానికి పరిచయమై.. ఒకే ముఖకవళికలతో అందరినీ అమితంగా ఆకట్టుకోవడం కవలల ప్రత్యేకత. ముద్దులొలికే పసికందులను చూడగానే వారి పేర్లను కూడా దరిదాపు ఒకేలా పెట్టేయడం పరిపాటిగా మారింది. రామయ్య.. లక్ష్మయ్య, రమేష్.. నరేష్, జలజ.. శైలజ... లాంటి పేర్లతోనూ తికమక పట్టించేస్తుంటారు. నేడు ప్రపంచ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సైన్స్ ఏమి చెబుతోందంటే.. సృష్టి లోని ఎన్నో వింతలు, అద్భుతాల్లో కవలల జననం కూడా ఒకటిగా ఉంటోంది. బాగా తెలిసిన వారు సైతం కవలలను ఎవరెవరో పోల్చుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఫలదీకరణ సమయంలో వచ్చే మార్పుల కారణంగా కవలల జననం సంభవిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రత్యుత్పత్తి ప్రక్రియలో అండం ఏర్పడిన తర్వాత శుక్రకణం రెండుగా విడిపోయి జన్మించిన కవలలను మోనోజైగోటిక్ లేదా యూని ఓవిలార్ ట్విన్స్ అంటారు. వీరిలో ఇద్దరూ ఆడ లేదా, మగ అయి ఉంటారు. వీరికి చాలా దగ్గర పోలికలుంటాయి. రెండు శుక్ర కణాలు ఏర్పడి జన్మించే కవలలను ‘డై జైగోటిక్ లేదా బైనోవిలార్ ట్విన్స్ అంటారు. వీరిలో ఒకరు ఆడ, మరొకరు మగ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కవలల దినోత్సవ ఆవిర్భావమిలా. ప్రథమంగా కవలల దినోత్సవాన్ని పోలెండు దేశస్థులు 1976లో నిర్వహించారు. మోజెస్, విల్కాక్స్ అనే కవల సోదరులు తాము నివసిస్తున్న ఊరికి ‘ట్విన్స్ బర్గ్’ అని పేరుపెట్టుకున్నారు. కవలలనే పెండ్లాడి, మళ్లీ కవలలకే జన్మనిచ్చారు. దురదృష్టమైన విషయమేమంటే ఒకే రకమైన వ్యాధి సోకి వారిద్దరూ ఒకే రోజు మరణించారు. వీరి గుర్తుగా ప్రతి ఫిబ్రవరి 22న ప్రపంచ కవలల దినం జరపడం పరిపాటిగా మారింది. -
వైభవంగా ధ్వజారోహణం
బుగ్గలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం తాడిపత్రి రూరల్: పట్టణంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నందీశ్వరుని చిత్ర పటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి.. ఎగురవేశారు. అంతకు మునుపు బుగ్గరామలింగేశ్వర స్వామి మూలవిరాట్కు అగ్ని నివేదన చేశారు. అక్కడి నుంచి అగ్నిని ఊరేగింపుగా హోమశాలకు తీసుకువచ్చారు. అక్కడ సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. ఉదయం గణపతి పూజ, అగ్ని మదనం, వాస్తు బలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకొని పార్వతీ సమేత బుగ్గ రామలింగేశ్వర స్వామిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
పకడ్బందీగా గ్రూప్–2 మెయిన్స్
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 23న గ్రూప్–2 మెయిన్స్ రాత పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షల కో–ఆర్డినేటింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జేసీ శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో డీఆర్ఓ ఎ.మలోల, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ ఎస్ఎన్ షరీఫ్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లుగా జరగనున్న పరీక్షలకు 7,293 మంది అభ్యర్థులు హాజరు కానున్నాన్నారు. పరీక్ష నిర్వహణలో ఏపీపీఎస్సీ నిబంధనలు తప్పక పాటించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని జేసీ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఉదయం పరీక్షకు 9.45 గంటల తరువాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.45 గంటల తరువాత కేంద్రంలోకి అనుమతించబోరన్నారు. జేసీ శివ్ నారాయణ్ శర్మ ఆదేశం -
రైతులను పరామర్శించడం ఇల్లీగల్ యాక్టివిటా?
అనంతపురం కార్పొరేషన్: రైతుల కష్టాలు తెలుసుకుని.. వారికి బాసటగా నిలిచేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లీగల్ యాక్టివిటీ అంటూ వ్యాఖ్యానించడాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తప్పు పట్టారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను పరామర్శిస్తే మాజీ సీఎంతో పాటు వైఎస్సార్సీపీ శ్రేణులపై కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ నుంచి పండిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. విత్తనాలు, ఎరువులు, తదితర ధరలు పెరగడంతో పాటు కంది, శనగ, మొక్కజొన్న, ధాన్యం, రాగులు, పత్తి, అరటి తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక అమ్ముకోలేని దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. గిట్టుబాటు ధర లభించకపోతే పోటీ మార్కెట్ను తీసుకురావాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. గతంలో 24 పంటలకు గిట్టుబాటు ధర లభించకపోతే అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కొనుగోలు చేసేలా తీసుకున్న చర్యలను ఆయన గుర్తు చేశారు. పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించకపోతే తర్వాత జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రభుత్వ తీరు దారుణం మిర్చి రైతుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని అనంత మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఒక మాజీ సీఎంకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కష్టాలను తెలుసుకునేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో మాజీ సీఎం వెళితే అక్కడ ఆయనకొచ్చిన విశేషమైన ప్రజాదరణను ఓర్వలేక సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతుల భూములు వేలం వేస్తారట! అనంతపురం జిల్లాలో సెంట్రల్ బ్యాంకులు రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు జారీ చేయడం విస్మయానికి గురి చేస్తోందని అనంత పేర్కొన్నారు. బ్యాంకులో తీసుకున్న రుణాలకు సంబంధించి భారీ మొత్తంలో చెల్లించాలంటూ అధికారులు పంపిన నోటీసును ఆయన విలేకరులకు చూపించారు. వన్టైం సెటిల్మెంట్ కూడా లేకుండా డబ్బులు కట్టకపోతే భూములు వేలం వేస్తామని రైతులకు నోటీసులు పంపడం సరికాదన్నారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న పాపపై ట్రోల్ చేయడం ఏంటి? అభిమానంతో ఓ చిన్నారి మాజీ సీఎం వైఎస్ జగన్వద్దకు వెళ్లి అమ్మఒడి ప్రస్తావన తెస్తే దాన్ని టీడీపీ సోషల్ మీడియా ట్రోల్ చేయడాన్ని అనంత వెంకటరామిరెడ్డి తప్పుబట్టారు. ఇంత కన్నా దిగుజారుడు రాజకీయాలు ఎక్కడా చూడలేదన్నారు. టీడీపీ సైకోల వికృత చేష్టలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. తెనాలిలో జగనన్న కాలనీలో పట్టా అందుకున్న మహిళ తన ఆనందాన్ని పంచుకుంటే.. అప్పట్లోనే టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా వేధింపులకు గురి చేయడంతో.. ఆమె ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, గోగుల రాధాకృష్ణ, అమర్నాథ్రెడ్డి, పుల్లయ్య, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలం ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం -
డ్రిప్ లక్ష్యం పూర్తి చేయాలి
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు నిర్ధేశించిన 18 వేల హెక్టార్ల డ్రిప్, స్ప్రింక్లర్ల లక్ష్యాన్ని మార్చి 20 లోపు పూర్తి చేయాలని ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) ఆఫీసర్ అన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ– టెక్నికల్) డాక్టర్ చేరెడ్డి పుల్లారెడ్డి ఆదేశించారు. స్ప్రింక్లర్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి తనిఖీ నిమిత్తం అనంతపురం వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం ఏపీఎంఐపీ కార్యాలయంలో పీడీ బి.రఘునాథరెడ్డి, ఏపీడీ జి.ఫిరోజ్ఖాన్, సూపరెండెండెంట్ వరప్రసాద్తో సమావేశమై ప్రాజెక్టు పనితీరు, సమస్యలపై ఆరా తీశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా అనంతపురానికే అధిక కేటాయింపులు ఉన్నాయన్నారు. ఇందుకు తగ్గట్లుగా సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు పరికరాలు అందిస్తున్నామన్నారు. వచ్చే 2025–26 నుంచి విధి విధానాలు, ప్రోత్సాహక రాయితీల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు 100 శాతం రాయితీ అవకాశం ఉంటుందేమో వేచి చూడాలన్నారు.28న సైన్స్ సంబరాలు అనంతపురం ఎడ్యుకేషన్: జాతీయ సైన్స్ డే సందర్భంగా ఈ నెల 28న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సైన్సు సంబరాలు నిర్వహించి విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలని డీఈఓ ప్రసాద్ బాబు అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీలను వినియోగించుకొని ప్రఖ్యాత శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, వారు ప్రపంచానికి అందించిన ఆవిష్కరణలు, ఇస్రో సాధించిన విజయాలను విద్యార్థులకు చూపించి వారిలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని సూచించారు. ‘సైన్స్ క్విజ్, ‘పాఠశాల స్థాయి సైన్స్ ఫెయిర్’, ‘సైన్స్ నాటికలు నిర్వహించాలన్నారు. ‘ప్రపంచ గతిని మార్చిన సైన్స్ అవిష్కరణలు’ అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని సైన్స్, మ్యాథ్స్ ఉపాధ్యాయులు సైన్స్ డేలో పాల్గొనాలని ఆదేశించారు. ఆ ఉద్యోగుల బదిలీలు రద్దు అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పలువురు అధికారులు, ఉద్యోగుల బదిలీలు రద్దయ్యాయి. ఉమ్మడి జిల్లాలో అనంతపురం రామ్నగర్ సబ్ రిజిస్ట్రార్ యూనస్, రాయదుర్గం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు, పెనుకొండ సబ్ రిజిస్ట్రారు వెంకటనాయుడు, సీనియర్ అసిస్టెంట్లు జయదీప్, శ్రీనివాసరెడ్డి తదితరులను డిప్యుటేషన్పై విజయవాడలోని ఐజీ కార్యాలయానికి రెండు రోజుల క్రితం బదిలీ చేశారు. అయితే బదిలీ ఉత్తర్వుల్లో 45 సంవత్సరాలలోపు వయస్సు నిబంధనతోపాటు డైరెక్టు రిక్రూట్ అయి ఉండాలనే నిబంధనలు ఉండడంతో వారందరూ బదిలీకి అనర్హులుగా గుర్తించి ఐజీ కార్యాలయ అధికారులు జాయినింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా వెనక్కు పంపారు. వీరందరిని తిరిగి వారి స్థానాలకు కేటాయించనున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మి తెలిపారు. మద్యం మత్తులో రైలింజన్ ఎక్కి.. గుత్తి: మద్యం మత్తులో ఓ యువకుడు తానేమి చేస్తున్నాడో తెలియని స్థితిలో విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.... తెలంగాణలోని మహబూబ్నగర్కు చెందిన సలీం మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరిగేవాడు. ఫుల్గా మద్యం సేవించి రైలు ఎక్కి ఎక్కడ పడితే అక్కడ దిగేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున మద్యం మత్తులో గుత్తి రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫారం–1కి చేరుకున్నాడు. తన వైపుగా వస్తున్న రైల్వే పోలీసులను గమనించి వెంటనే పక్కనే ఉన్న గూడ్స్ రైలు ఇంజిన్పైకి ఎక్కాడు. పైనున్న విద్యుత్ లైన్ తగిలి షాక్కు గురై గాయపడ్డాడు. వీపు భాగం కాలిపోయింది. క్షతగాత్రుడిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపారు. -
యువత ‘మత్తు’ బారిన పడకూడదు
అనంతపురం అర్బన్: యువత మత్తుబారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ జగదీష్తో కలిసి ఎన్సీఓఆర్డీ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న సామాజిక మాధ్యమ గ్రూపుల్లో ప్రభుత్వ పథకాలు, మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు తదితర అంశాలపై సమాచారం ఉంటుదన్నారు. ఈ గ్రూపుల్లో అధికారులు భాగస్వాములై సమాచారాన్ని ఆయా శాఖలకు చెందిన లబ్ధిదారులకు చేరవేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు. నాశ్ముక్త్ భారత్ అభియాన్ కింద జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డీ– అడిక్షన్ వార్డులో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని రెండు వారాల్లోగా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డీటీ వీర్రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 2025–26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్బాబు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి మార్చి 31 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. 5వ తరగతి స్థాయిలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు మోడల్ స్కూళ్లలో సంప్రదించాలని సూచించారు. -
అభద్రతలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు
అనంతపురం: కూటమి ప్రభుత్వ తీరుతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు డోలాయమానంలో పడ్డాయి. ఎంతో సౌలభ్యంగా ఉన్న ‘ఆప్కాస్’ను రద్దు చేసి ప్రైవేటుకు అవుట్సోర్సింగ్ విధానాన్ని కట్టబెట్టాలని ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుండటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జేఎన్టీయూ అనంతపురం వర్సిటీని 2008లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారు. అప్పట్లోనే అవుట్సోర్సింగ్ కింద 400 మందికి ఉద్యోగాలు కల్పించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆప్కాస్ కిందకు అవుట్సోర్సింగ్ వారిని తెచ్చి.. జీతాలు నేరుగా ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు చేపట్టారు. అయితే, ఆప్కాస్ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు చేపట్టాలని ఇటీవల కూటమి సర్కారు నిర్ణయించడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో అభద్రత నెలకొంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల స్థానంలో తమ అనుచరులను నియమించాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు నేరుగా సీఎంకు లేఖలు రాస్తుండటంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఆప్కాస్ను రద్దు చేస్తే తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. గతంలో ప్రైవేట్ ఏజెన్సీల నిర్వహణలో సకాలంలో జీతాలు రాక ఇబ్బందులు పడిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఉద్యమాలకు కార్యాచరణ.. జేఎన్టీయూ అనంతపురం ఉద్యోగులపై కొందరి ప్రజా ప్రతినిధుల కన్ను పడినట్లు తెలిసింది. ఏజెన్సీనే తమకు అప్పగించాలని ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే ఆప్కాస్ను రద్దు చేయాలని మంత్రి వర్గ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించారు. జీఓ నంబర్ 2ను సవరించి అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలనే డిమాండ్లతో ఈ నెల 24న సీఎం, విద్యాశాఖ మంత్రికి మెయిల్స్ ద్వారా వినతిపత్రాలు పంపనున్నారు. మార్చి 10న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. జీతాలు కూడా లేవు.. గత ఏడాది అక్టోబర్ వరకు జేఎన్టీయూ అనంతపురం (జేఎన్టీయూ–ఏ) అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ నుంచి జీతాలు అందాయి. ఆ తర్వాత జీతాలు చెల్లించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఏజెన్సీకి అప్పగించిన అనంతరమే జీతాలు ఇస్తారా అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఆప్కాస్తో ఉద్యోగ భద్రత: చిరుద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆప్కాస్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఈ వ్యవస్థ కిందకు తెచ్చి నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించేది. ఈఎస్ఐ, పీఎఫ్ వెసులుబాటు కల్పించింది. ఆప్కాస్లో విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించాలంటే అందుకు బలమైన కారణాలు ఉండాలి. మూడు సార్లు షోకాజ్ నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సదరు ఉద్యోగి ఇచ్చే జవాబు సంతృప్తికరంగా ఉన్నట్లయితే ఆ ఉద్యోగిని కొనసాగించాల్సి ఉంటుంది. ఆప్కాస్ కాకుండా ఏజెన్సీ ద్వారా ఇస్తే జీతాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు. ‘ఆప్కాస్’ రద్దు యోచనలో సర్కారు తమ అనుయాయులను నియమించాలని ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ప్రైవేట్కు అప్పగిస్తే నష్టపోతామంటున్న చిరుద్యోగులు -
వధువు తరఫు డిమాండ్లివీ..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కాలం ఎప్పుడూ ఒకరిదే ఉండదు.. మాకంటూ ఒకరోజు వస్తుంది.. ఇది తరచూ వినే నానుడి. ఇప్పుడీ మాట అమ్మాయిలకు సరిగ్గా సరిపోతుంది. సరైన అబ్బాయి దొరక్క, దొరికిన అబ్బాయికి కట్నమిచ్చుకోలేక నానా తంటాలు పడే అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ఇప్పుడు పైచేయి సాధించారు. మాకు ఇలాంటి అబ్బాయే కావాలి, మాకు నచ్చినట్టే ఉండాలి, మేము చెప్పినట్టే వినాలి.. అంటూ గట్టిగా, సూటిగా చెబుతుండటంతో అబ్బాయిల మైండ్ బ్లాక్ అయినంత పనవుతోంది. ఓవైపు వయసు మీద పడుతున్నా అమ్మాయి దొరక్క అబ్బాయిలు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. వధువుల డిమాండ్లతో అబ్బాయిలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మాఘమాసం వచ్చినా... మాఘమాసంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా పెళ్లిళ్లు జరిగేవి. అమ్మాయిల తాజా డిమాండ్లతో అబ్బాయిలకు పెళ్లి ఒక పట్టాన అవడం లేదు. మ్యాట్రిమోని సంస్థలు, మ్యారేజీ బ్రోకర్లు, పేరయ్యలు, తెలిసిన వాళ్లు ఇలా ఎంతమందికి చెప్పినా అబ్బాయికి జోడీ దొరకడం కష్టమవుతోంది. నూరు అబద్ధాలాడైనా పెళ్లి చేయాలంటారు.. కానీ నూరు నిజాలు కుండబద్దలు కొట్టి అయినా సరే సరిజోడీ తెచ్చుకుంటాం అని అమ్మాయిలు ధైర్యంగా చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. వధువుల డిమాండ్ల జాబితా చాంతాడంత మంచి ప్యాకేజీతో ఉద్యోగం.. పొలమూ ఉండాలి డిమాండ్లకు సరితూగక ముందుకు సాగని పెళ్లిళ్లు మాఘ మాసంలోనూ అంతంతమాత్రంగానే వివాహాలు నెలకు రూ.లక్ష దాకా జీతం ఉండాలి. సొంత ఇల్లు ఉండాలి. మంచి ప్యాకేజీ, సొంత ఇళ్లు ఉన్నా.. కొద్దో గొప్పో పొలం ఉండాలి. రెండుమూడేళ్ల కంటే వయసు గ్యాప్ ఉండరాదు. బట్టతల ఉంటే ఒప్పుకోం. ఉమ్మడి కుటుంబంలో ఉంటే గనుక ఇబ్బంది. పెళ్లవగానే వేరే కాపురం పెట్టాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులుంటే వాళ్లకు మేము సేవలు చేయలేం. ఆడపడుచులు ఎక్కువగా ఉన్న కుటుంబంలో వరుడైతే వద్దు. మేము ఎలాంటి నగదూ ఇవ్వలేం.. మా పిల్ల వరకూ బంగారం చేయించుకుంటాం. ఉమ్మడి ఆస్తులుంటే ఎంగేజిమెంటు అవగానే నీ పేరుమీదకు బదిలీ చేయించుకోవాలి. -
పట్టింపులు ఎక్కువయ్యాయి
ఇటీవల అబ్బాయిలకు సంబంధం కుదిరిందంటే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చేసింది. దానికితోడు మళ్లీ జాతకాలు, గ్రహరాశుల ప్రభావం, కుజదోషం వంటివి ఎక్కువవుతున్నాయి. ఎంత సర్దిచెప్పినా ఎక్కడో అసంతృప్తి ఉంటోంది. చాలా చోట్ల పెళ్లిళ్లు వేరే కారణాల వల్ల కంటే జాతకాల, శ్యాలరీ ప్యాకేజీ పట్టింపుల వల్ల కూడా ఆలస్యమైపోతున్నాయి. మా బంధువుల్లో అబ్బాయిలు పెళ్లిళ్లు కుదరక అలాగే మిగిలిపోతున్నారు. – కొడేకండ్ల నాగభూషణ రావు, మూడవరోడ్డు, అనంతపురం -
ప్యాకేజీ చుట్టూనే ఆలోచన
ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు విచిత్రంగా మారిపోతున్నాయి. తమకంటే అధిక స్థాయిలో ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ అబ్బాయి స్థితిగతులను చూడడం మానేసి అతనికొచ్చే శ్యాలరీ ప్యాకేజీ చుట్టూ ఆలోచనలుంటున్నాయి. ఇక పౌరోహిత్యం చేసే వాళ్లయితే దాదాపు వారికి ఆడపిల్లలు దొరకని పరిస్థితి వచ్చేసింది. దానికి తోడు ఆడపిల్లలు బాగా చదువుకుని సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడుతుండడంతో వారికి తగ్గ సంబంధాలు ఉండడం లేదు. – బాలాజీ శర్మ, పురోహితుడు, అనంతపురం -
చిట్స్ నిర్వాహకుల ఆస్తుల అటాచ్
అనంతపురం: చిట్స్ పేరిట డబ్బు వసూలు చేసి.. తిరిగి సభ్యులకు చెల్లించకుండా తాత్సారం చేసిన నిర్వాహకుల ఆస్తులను అటాచ్ చేశారు. నగరానికి చెందిన నజీర్ బాషా, జరీనా, దాదు అఫ్రిది, మహమ్మద్ రఫీ ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరు చిట్స్ పేరుతో 108 మంది నుంచి రూ.8 కోట్లకు పైగా నగదు వసూలు చేశారు. నిర్దేశిత కాలం పూర్తయినా సభ్యులకు తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీస్స్టేషన్లో చిట్స్ నిర్వాహకులపై కేసు నమోదైంది. కలెక్టర్, ఎస్పీ నివేదిక ఆధారంగా నిర్వాహకుల ఆస్తులను అటాచ్ చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. నజీర్ బాషా కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ అటాచ్ చేశారు. తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు ఆస్తి అమ్మకం, నగదు లావాదేవీలు జరపడానికి వీల్లేదని పేర్కొన్నారు. -
షరతులు వర్తిసాయి.. ఇదేదో వ్యాపార ప్రకటన అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే నేటితరం యువతులు పెళ్లి కోసం ముందుగానే షరతులు విధిస్తున్నారు. తాము చెప్పిన ఏ అంశంలోనైనా తేడా ఉంటే ఆ సంబంధాన్ని కాదనుకుంటున్నారు. ఉద్యోగ భద్రత.. ఆస్తులు.. ఆర్థిక వెసులుబాటుకు ప్
● వెంకట్ అనే మరో కుర్రాడు మొబైల్ షాపు నిర్వహిస్తున్న్తాడు. నెలకు రూ.60వేలు సంపాదిస్తున్న్తాడు. ఇప్పటివరకూ చాలా సంబంధాలు చూశారు. కానీ అమ్మాయిలు పెట్టే డిమాండ్లకు అతను ఇబ్బంది పడుతున్నాడు. 30 ఏళ్లు దాటి 31లోకి వచ్చినా పెళ్లి కాలేదు. ● పి.చైతన్య అనే అబ్బాయి అనంతపురంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. రూ.50 వేల వరకు జీతం. పార్ట్టైం బిజినెస్ చేసి నెలకు మరో రూ.30వేలు సంపాదిస్తున్నాడు. అయినా సరే 30 ఏళ్లు దాటినా పిల్లనిస్తామనే వారు లేరు. దీంతో చైతన్య టెన్షన్ అంతా ఇంతా కాదు. -
ట్రాక్టర్తో గుద్దారు.. కాలువలో పడేశారు
గుంతకల్లు: యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు భోగాల తిరుమలరెడ్డి (42) హత్య కేసును గుంతకల్లు రూరల్ పోలీసులు ఛేదించారు. ముందుగా ట్రాక్టర్తో గుద్దిన అనంతరం హంద్రీ–నీవా కాలు వలో పడేసినట్లు గుర్తించారు. గురువారం కసాపురం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ ఎన్.ప్రవీణ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన తిరుమలరెడ్డి గుంతకల్లులోని తిలక్నగర్లో నివాసముంటున్నాడు. ‘బీవీఆర్ న్యూస్ టుడే’ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహించేవాడు. గుంతకల్లు మండలం సంగాల గ్రామానికి చెందిన జీవన్కుమార్ తన నాలుగెకరాల పొలం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటుండగా, ఈ విషయమై తిరుమలరెడ్డి, జీవన్కుమార్కు మధ్య వివాదం చోటుచేసుకుంది. తనకు డబ్బు ఇవ్వకుంటే కథ చూస్తానంటూ జీవన్కుమార్ను తిరుమలరెడ్డి వేధించేవాడు. దీంతో ఒప్పందం కుదుర్చుకుని కొంత డబ్బును జీవన్కుమార్ చెల్లించాడు. అయితే, అక్కడితో ఆగకుండా తహసీల్దార్కు తిరుమలరెడ్డి ఫిర్యాదు చేయడంతో జీవన్కుమార్ కక్ష పెంచుకున్నాడు. సంగాలకు చెందిన బోయ రామాంజినేయులు, కసాపురానికి చెందిన బోయ రామన్నతో కలిసి తిరుమలరెడ్డి హత్యకు పథకం రచించాడు. ఈ నెల 17న ఉదయం తన ఇంటి నుంచి బైకుపై పొలానికి బయలుదేరిన తిరుమలరెడ్డి కసాపురం సమీపంలోని హంద్రీ–నీవా కాలువ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ట్రాక్టర్తో బలంగా ఢీ కొట్టారు. దీంతో స్పృహ కోల్పోయిన తిరుమలరెడ్డిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కాలువలో పడేసి పరారయ్యారు. మృతుడి భార్య రామేశ్వరి ఫిర్యాదు మేరకు డీఎస్పీ ఏ.శ్రీనివాస్ నేతృత్వంలో ముమ్మరంగా విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలో నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని వారు అంగీకరించారన్నారు. హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్తోపాటు ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన కసాపురం ఎస్ఐ వెంకటస్వామితోపాటు సిబ్బందిని డీఎస్పీ అభినందినట్లు సీఐ తెలిపారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ -
23న గ్రూప్–2 మెయిన్స్
అనంతపురం అర్బన్: ‘‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈనెల 23న గ్రూప్–2 మెయిన్స్ రాత పరీక్షలు జరగనున్నాయి. 14 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 7,293 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కేంద్రాల వద్ద ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి’’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోలతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీపీఎస్సీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్షల నిర్వహణకు కోఆర్డినేటింగ్ అధికారిగా జేసీ ఉంటారన్నారు. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారన్నారు. పేపర్–1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్–2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందన్నారు. 14 పరీక్ష కేంద్రాలకు 14 మంది జిల్లాస్థాయి సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించామన్నారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి జిల్లాలో మార్చి 1 నుంచి 20 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు డీఆర్ఓ కో–ఆర్డినేటింగ్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. పరీక్షల ప్రశ్నపత్రాలు కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసు బందోబస్తు తప్పనిసరి అన్నారు. కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది ఉండాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్ఎన్ షరీఫ్, సెక్షన్ ఆఫీసర్లు శంకర్రావు, ఆరోగ్యవాణి, నాగభవాని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, డీఈఓ ప్రసాద్బాబు, డీవీఈఓ వెంకటరమణనాయక్, పరిశ్రమల శాఖ జీఎం శ్రీధర్, డీపీఓ నాగరాజునాయుడు, సీపీఓ అశోక్ కుమార్, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, ఎన్ఐసీ డైరెక్టర్ రవిశంకర్, ఉపాధి కల్పనాధికారి కల్యాణి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏడీ రజిత, డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు. ● బుక్కరాయసముద్రం మండల పరిధి రోటరీపురంలో ఉన్న గ్రూప్–2 పరీక్ష కేంద్రం ఎస్ఆర్ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలను గురువారం సాయంత్రం కలెక్టర్ సందర్శించారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. 14 కేంద్రాల వద్ద ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 23న జరగనున్న గ్రూప్–2 పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థుల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. శుక్రవారం నుంచి 23వ తేదీ వరకు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఏదేని సమాచారం లేదా ఫిర్యాదు కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 18004258804, 08554– 231722కు కాల్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. -
పరమేశ్వరా..పాహిమాం
పరమేశ్వరా.. పరంధామ పాహిమాం.. అంటూ భక్తుల నామస్మరణతో శైవాలయాలు ప్రతిధ్వనిస్తున్నాయి. శివాలయాల్లో మహా శివరాత్రి శోభ నెలకొంది. అనంతపురం మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి పార్వతీ పరమేశ్వరులు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కళాకారుల భక్తి గీతాలాపన, కోలాట ప్రదర్శనలతో సందడి నెలకొంది.తాడిపత్రి మండలంలోని బుగ్గరామలింగేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలకు గురువారం భక్తిశ్రద్ధలతో శ్రీకారం చుట్టారు. ఆలయంలో పార్వతీ సమేత స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.–అనంతపురం కల్చరల్/ తాడిపత్రి రూరల్ -
సర్వే.. శఠగోపం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల వేళ ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు తన నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘సంపద సృష్టిస్తా.. ఆ సంపదను పేదలకు పంచుతా.. రైతులు పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసి, ఆ తర్వాత వాడుకోగా మిగిలింది గవర్నమెంటుకు సప్లై చేసే విధంగా చేస్తా’ అంటూ అప్పట్లో లేనిపోని గొప్పలు చెప్పిన బాబు.. ఇప్పుడు పెన్షన్లు, రేషన్ తదితర ప్రభుత్వ పథకాలకు కోత వేసేలా పావులు కదుపుతుండటంపై అన్ని వర్గాలు పెదవి విరుస్తున్నాయి.భారీగా ఆంక్షలు..ఉమ్మడి జిల్ల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టేలా చంద్రబాబు ప్రభుత్వం సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇంటింటి సర్వేలో ప్రభుత్వ పథకాల అర్హతకు భారీగానే ఆంక్షలు విధించనున్నారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటే వెంటనే ఆ ఇంట్లో వారికి వచ్చే పెన్షన్, రేషన్ కట్చేసేలా సర్వే నిర్వహిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంటికీ రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్) ఉంది. ఇప్పుడు ఇది కూడా ఆంక్షల జాబితాలోకి వచ్చింది. కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చి, ఫ్రిజ్ ఉందంటే కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక కారు, సొంతిళ్లు, భూములు, స్థలాలు కూడా ఆంక్షల జాబితాలో చేరుతున్నాయి. పైన నిర్ణయించిన వాటిలో ఏవైనా ప్రభుత్వ పథకానికి అడ్డంకిగా మారే అవకాశమున్నట్టు తెలుస్తోంది.ఏవి ఉన్నా హోల్డ్..!గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శులతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ముందుగా అర్బన్ ఏరియాల్లో కార్యదర్శులకు ఈనెల 19న శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే ఇళ్లన్నీ జియోట్యాగింగ్లో ఉన్నాయి. ఆయా ఇళ్లకు వెళ్లి గత నెల వచ్చిన కరెంటు బిల్లుతో పాటు ఫ్రిజ్ ఉందా, ఏసీ ఉందా వంటివన్నీ పరిశీలించి నమోదు చేస్తారు. ముందుగా మున్సిపాలిటీల పరిధిలో పూర్తయ్యాక, తర్వాత గ్రామీణ ప్రాంతా ల్లో సర్వే నిర్వహిస్తారని, ఆయా వస్తువుల్లో ఏవి ఉన్నాయని తేలినా పథకాలు హోల్డ్లో పెడతారని చెబుతున్నారు.వైకల్య బాధితులనూ వదల్లేదు..ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైకల్య బాధితులను కూటమి సర్కారు ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే జిల్లాలో వేలాది పెన్షన్లకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. గడిచిన పదేళ్లుగా వైకల్య పెన్షన్ తీసుకుంటున్న వారికి మళ్లీ ఇప్పుడు కొత్తగా పరీక్షలు చేస్తామని చెప్పింది. దీంతో శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో ఉన్న 36 వేల మంది లబ్ధిదారులు అనంతపురం రావాల్సి వస్తోంది. డాక్టర్లు ఇక్కడే ఉండటంతో 130 కిలోమీటర్ల నుంచి కూడా అవస్థలు పడుతూ వస్తున్నారు. తాజాగా సదరం వెరిఫికేషన్లో సుమారు 30 శాతం పింఛన్లకు కోత వేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.సకాలంలో మోడల్ సర్వేఅనంతపురం అర్బన్: పీ4 మోడల్ సర్వే సకాలంలో చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కు కలెక్టర్ వి.వినోద్కుమార్ చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి పీ4 మోడల్ సర్వేపై కలెక్టర్లతో సీఎస్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆరోఓ ఎ.మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చామన్నారు. సర్వే మొదటి దశ గురువారం జిల్లాలో ప్రారంభమైందని, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులను భాగస్వాముల్ని చేశామని చెప్పారు. -
రమేష్గౌడ్కు ఇంటర్నేషనల్ అవార్డ్
అనంతపురం ఎడ్యుకేషన్: కులమతాలకు అతీతంగా 13 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, టాస్క్ఫోర్స్ సభ్యుడు, బీసీ కులాల ఐక్య వేదిక నాయకుడు చిట్లూరు రమేష్గౌడ్కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్’ సంస్థ ప్రతిఏటా ప్రతిష్టాత్మకంగా అందజేసే ‘ఇంటర్నేషనల్ ఎక్స్లెన్సీ అవార్డ్స్’ను ఆయన అందుకున్నారు. వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 20 మంది ఎంపిక కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికై న ఏకై క వ్యక్తి రమేష్గౌడ్ కావడం విశేషం. ‘నిస్వార్థ సేవలు, ప్రజలను ఎక్కువగా ప్రభావితం’ కేటగిరీ నుంచి అవార్డుకు ఎంపిక చేయడం గమనార్హం. సౌదీ అరేబియా దేశంలోని దుబాయి వేదికగా బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రమేష్గౌడ్ అవార్డు అందుకున్నారు. నిరుపేదల వైద్యానికి, పేద విద్యార్థుల చదువులకు రమేష్గౌడ్ అండగా నిలిచారు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు దుస్తులు, మందులు, ఆహారం, నిత్యావసర సరుకులు తదితరాలు పంపిణీ చేశారు. తన సేవలతో యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నారని గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్’ సంస్థ వెల్లడించింది. అవార్డు ప్రదానోత్సవంలో కేంద్రమంత్రి రాందాస్ అథవలితో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా, దుబాయ్, చైనా, రష్యా, జర్మనీ తదితర దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్గౌడ్కు వైఎస్సార్సీపీ నాయకులు, బీసీ కులాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
‘పీఎంఏవై’ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ
అనంతపురం టౌన్: ప్రధాన మంత్రి అవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇళ్ల నిర్మాణాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సొంత స్థలం ఉండి పొజిషన్ సర్టిఫికట్ లేదా ఇంటి డీ పట్టా ఉన్న వారు మార్చి 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. లక్షతోపాటు ఎస్సీలకు, వీవర్స్కు అదనంగా రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అందజేయనున్నట్లు తెలిపారు.చిత్తడి నేలలు పరిరక్షించాలిఅనంతపురం అర్బన్: జిల్లాలో చిత్తడి నెలల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మార్చి 10లోగా జిల్లాలో గుర్తించదగిన 15 చిత్తడి నేలల ప్రాంతాల కోసం నోటిఫికేషన్ ప్రతిపాదనలను సమర్పించాలని చెప్పారు. రెండో దశలో జూన్ 10వ తేదీ నాటికి మరో 100 నోటిఫికేషన్ ప్రతిపాదనలు, మూడో దశలో జూలై 10 నాటికి మిగిలిన వాటికి నోటిఫికేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డీఎఫ్ఓ మాట్లాడుతూ చిత్తడి నెలల ప్రాముఖ్యతను వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.ప్రజా సేవల్లో జిల్లా వెనుకబడింది..‘ప్రజలకు సేవలందించడంలో జిల్లా వెనుకబడి ఉంది. ప్రభుత్వ పాధాన్యత అంశాల అమలులో రాష్ట్రంలోనే జిల్లా ఆరో స్థానంలోపే ఉండేలా పనిచేయాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్ఓ, డీఎంహెచ్ఓ, ఆర్టీసీ, రెవెన్యూ, మునిసిపల్ శాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి జిల్లా ఆరో స్థానంలోపే ఉండేలా చూడాలన్నారు. ఎకై ్సజ్, అన్నా క్యాంటీన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిరుపయోగంగా ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. -
ఒత్తిడికి గురి కావొద్దు.. పరీక్షలు బాగా రాయండి
● విద్యార్థులకు ‘ఆల్ ద బెస్ట్’ చెప్పిన కలెక్టర్ అనంతపురం ఎడ్యుకేషన్: ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. త్వరలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ‘ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష హాలులోకి వెళ్లండి. ప్రశ్నపత్రాన్ని బాగా చదవండి. ప్రశ్నలు ఎన్ని వస్తాయో...ఎన్ని రావో చూసుకోండి. ముందుగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాసే ప్రయత్నం చేయండి. వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లండి. అద్భుతమైన కలలు కనండి. నోస్ట్రెస్...గివ్ యువర్ బెస్ట్...ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్...మీ కలెక్టర్’ అంటూ పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి గార్లదిన్నె: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి శివప్రసాద్ యాదవ్ సూచించారు. గురువారం మండల పరిధిలోని కేకే తండా గ్రామంలో న్యాయ సేవా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్న నిర్భాగ్యులకు వన్ స్టాప్ సెంటర్ ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో 7 రోజులు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తారన్నారు. అలాగే వారి సమస్య పరిష్కరించుకునే మార్గాలు, ఉచిత న్యాయ సహాయం కూడా పొందవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహాలు, లింగ నిర్ధారణ నేరమన్నారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ దామోదరమ్మ, ఎంఈఓ చంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు. సబ్ జైలు తనిఖీ కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పట్టణంలోని సబ్ జైలును గురువారం న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి శివప్రసాద్ యాదవ్ శివ ప్రసాద్ యాదవ్ తనిఖీ చేశారు. ఖైదీలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. బాల నేరస్తులు ఉన్నారా అని ఆరా తీశారు. అనంతరం వంట గది, స్టోర్ రూమ్, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో లాయర్ దాదా ఖలందర్, చలపతి, జైల్ సూపరింటెండెంట్ ధనుంజయ నాయుడు, పారా లీగల్ వలంటీర్ అనిత, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య గార్లదిన్నె: మండల పరిధిలోని ముకుందాపురం గ్రామానికి చెందిన ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు సదాశివారెడ్డి (65) తన 15 ఎకరాల భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ ఆయకం పెట్టాడు. దాదాపు రూ.20 లక్షల అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పులు ఎలా తీర్చాలని ఇంట్లో రోజూ మదన పడుతుండేవాడు. ఈ నెల 14వ తేదీన పెనకచెర్ల గ్రామ సమీపంలో పురుగు మందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా పేర్కొన్నారు. కరువు మండలాల్లో ఉపాధి పనిదినాల పెంపు అనంతపురం టౌన్: కరువు మండలాల్లో ఉపాధి పనిదినాలను పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సలీంబాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇటీవలే కేంద్ర కరువు బృందాలు పర్యటించి 7 మండలాలను(అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, నార్పల, రాప్తాడు, విడపనకల్లు, యాడికి) కరువు ప్రాంతాలుగా ప్రకటించాయన్నారు. ఆయా మండలాల్లో ఉపాధి పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచినట్లు తెలిపారు. 100 రోజుల పనులు పూర్తి చేసుకున్న కుటుంబాలు సైతం అదనంగా మరో 50 రోజులు హాజరు కావొచ్చన్నారు. -
హజ్ యాత్రికులకు అవగాహన తరగతులు
అనంతపురం కల్చరల్: జిల్లా నుంచి హజ్కు వెళ్తున్న యాత్రికులకు ఈ నెల 22 నుంచి ప్రతి శని, ఆదివారాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించునున్నారు. ఈ మేరకు హాజీ ఖాదిమ్ మహమ్మద్ రఫీ గురువారం ఓ ప్రకటన విడదుల చేశారు. అనంతపురంలోని పీటీసీ ఎదురుగా ఉన్న చాందినీ మసీదులో ఉదయం 10 నుంచి 11 .30 గంటల వరకు అవగాహన తరగతులుంటాయి. హజ్ విధిఽవిధానాలను తెలియజేసే పుస్తకాలను సైతం అందిస్తారు. మహిళలకు పర్దా సౌకర్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాలకు 94409 83090, 86885 26178లో సంప్రదించవచ్చు. మట్కా బీటర్ల అరెస్ట్ రాయదుర్గం: స్థానిక రూరల్ సర్కిల్ పరిధిలోని డి.హీరేహాళ్, కణేకల్లు, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట మండలాల్లో గురువారం పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పలువురు మట్కా బీటర్లు పట్టుబడ్డారు. వివరాలను సీఐ వెంకటరమణ వెల్లడించారు. బొమ్మనహాళ్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ చెక్పోస్టు వద్ద బళ్లారికి చెందిన మట్కా నిర్వాహకుడు ఇమ్రాన్ పట్టుబడ్డాడు. రూ.50,500 నగదుతో పాటు మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కణేకల్లు పీఎస్ పరిధిలోని అంబాపురం గేటు వద్ద పాపసాని సత్యనారాయణరెడ్డిని అరెస్ట్ చేసి రూ.41,980 నగదు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. డి.హీరేహాళ్ మండలం నాలాలపురం శివారులో మట్కా రాస్తూ ఎర్రిస్వామి, నారాయణ, లాలూస్వామి, కల్యం గ్రామానికి చెందిన బోయ లక్ష్మన్న పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.64,865 స్వాధీనం చేసుకున్నారు. గుమ్మఘట్ట మండలం పూలకుంటలో మట్కా రాస్తున్న వడ్డే వన్నూరుస్వామి, వడ్డే హరిని అరెస్ట్ చేసి రూ.25 వేలు నగదు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. బీటర్ల అరెస్ట్లో చొరవ చూపిన ఎస్ఐలు గురుప్రసాదరెడ్డి, నాగమధు, నబీరసూల్, ఈశ్వరయ్యను సీఐ వెంకటరమణ అభినందించారు. లారీ ఢీ... వృద్ధుడి మృతి గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లి శివారులో గురువారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్ఎస్కు చెందిన విశ్రాంత పోస్ట్మెన్ మస్తాన్వలి (66) వ్యక్తిగత పనిపై గురువారం కర్నూలు జిల్లా జి.ఎర్రగుడి తండాకు వెళ్లాడు. అక్కడ పనిముగించుకుని రాత్రికి తిరుగు ప్రయాణమైన ఆయన ఆటో ఎక్కేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో గుత్తి నుంచి పత్తికొండ వైపునకు వెళ్తున్న లారీ ఢీకొంది. ఘటనలో ఆయన రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స మొదలు పెట్టేలోపు ఆయన మృతిచెందాడు. కాగా, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లడాన్ని గమనించిన స్థానిక యువకులు ద్విచక్ర వాహనాల్లో వెంబిడిస్తూ కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో పట్టుకున్నారు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిపై కత్తితో దాడి రాప్తాడు రూరల్: ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఇటుకలపల్లికి చెందిన సిద్ధార్థ్... అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. కందుకూరు గ్రామానికి చెందిన ప్రభాస్ కూడా ఇదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరి మధ్య ఇటీవల కళాశాలలో గొడవ జరిగింది. విషయాన్ని ప్రభాస్ తన గ్రామంలోని స్నేహితుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో గురువారం సిద్ధార్థ్ స్నేహితుడు సతీష్ పుట్టిన రోజు కావడంతో మధ్యాహ్నం స్నేహితులందరూ కలసి అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాల వెనుక బర్త్డే పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రభాస్, అతని స్నేహితులు అక్కడికి చేరుకుని, సిద్ధార్థ్తో గొడవకు దిగారు. సర్ది చెప్పే ప్రయత్నం చేసిన బర్త్డే బాయ్ సతీష్పై కత్తితో దాడి చేసి, అక్కడి నుంచి ఉడాయించారు. క్షతగాత్రుడిని వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ విజయ్కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి బాధితుడు సతీష్తో మాట్లాడి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్య లేపాక్షి: పెళ్లి కాలేదన్న దిగాలుతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి మండలం కుర్లపల్లికి చెందిన రామాంజినేయులు (26)కు కుటుంబసభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేపట్టారు. అయితే ఏ సంబంధమూ కుదరలేదు. దీంతో తనకు పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదేమోనని దిగాలుతో గురువారం ఉదయం లేపాక్షి చెరువు కట్టపై ఉన్న చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో మున్సిపల్ కార్మికుడి మృతి పావగడ: స్థానిక శని మహాత్మ సర్కిల్లో చోటు చేసుకున్న ప్రమాదంలో మున్సిపల్ కార్మికుడు మంజునాథ్ (40) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గురువారం ఉదయం 11 గంటల సమయంలో సర్కిల్ వద్ద రోడ్డు పక్కన చెత్తను శుభ్రం చేస్తుండగా ఎస్ఎస్కే సర్కిల్ నుంచి ఆర్జే సర్కిల్ వైపు వేగంగా వెళుతున్న ట్రాక్టర్ ఢీకొంది. ట్రాక్టర్ టైర్ తగలడంతో మంజునాథ్ తలకు బలమైన రక్తగాయమైంది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తుమకూరు జిల్లాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. -
నిరుద్యోగులపై ‘కూటమి’ కపటప్రేమ
అనంతపురం అర్బన్: రాష్ట్రంలోని నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్కుమార్ మండిపడ్డారు. ఇప్పటికై నా ఈ తరహా నాటకాలకు స్వస్తి చెప్పి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. అనంతపురంలోని ఆ సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తవుతున్నా నిరుద్యోగ యువతకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. హామీలను నెరవేర్చకుండా యువతను మాటలతో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ చర్యలను ఇక సహించేది లేదన్నారు. అమరావతిని ఫ్రీజోన్ చేసి అక్కడ భర్తీ చేసే ఉద్యోగ నియమాకాల్లో 26 జిల్లాల నిరుద్యోగులకు సమాన అవకాశం కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, ఇతర శాఖల్లో ఖాళీ పోస్టులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి భర్తీ చేయాలన్నారు. వలంటీర్ వ్యవస్థను కొనసాగించి రూ.10 వేలు గౌరవవేతనం ఇవ్వాలన్నారు. ఇలా మొత్తం 32 తీర్మానాలను ప్రభుత్వం ముందు ఉంచబోతున్నామన్నారు. వీటిపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోట్రేష్, ఉపాధ్యక్షుడు దేవేంద్ర, సహాయ కార్యదర్శి ధనుంజయ, కోశాధికారి శ్రీనివాస్, ఉరవకొండ మండల కార్యదర్శి నవీన్, తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్కుమార్ -
ఆత్మ విశ్వాసం కోల్పోకుండా సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఆత్మకూరుకు చెందిన సాధారణ రైతు బిడ్డలు. అంధ విశ్వాసాలు వెంటాడి గేలి చేస్తున్నా గ్రామీణ ప్రాంతానికి చెందిన బాలికలు వెనుకంజ వేయలేదు. బాల్ కొడితే.. గోల్ పడాల్సిందేనంటూ జాతీయ స్థాయి క్ర
జాతీయ స్థాయి పుట్బాల్ పోటీలకు ఎంపికై న క్రీడాకారులుమాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న ఎంతో పట్టుదలతో నన్ను చదివిస్తున్నారు. వారి కష్టం వృధా కాకుండా చదువుతో పాటు క్రీడల్లోనూ నేను రాణిస్తున్నా. క్రీడా కోటా కింద ప్రభుత్వ ఉద్యోగం సాధించి వారి కష్టాలను తీరుస్తా. – శ్వేత, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, ఆత్మకూరు ఆత్మకూరు : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విష్ణుప్రణవి, అస్మిత, వ్వేత, రియాన్షిక సాయి, కీర్తిలక్ష్మి.. ఫుట్బాల్ క్రీడలో రాణిస్తున్నారు. ఇప్పటకే ఈ పాఠశాలలో చదివిన మందల అనూష భారత మహిళా పుట్బాల్ జట్టుకు ఎంపికై న విషయం తెలిసిందే. అదే బాటలో మరికొందరు పయనిస్తూ మరికొందరు ఆత్మకూరు ఖ్యాతిని జాతీయ స్థాయిలో రెపరెపలాడించనున్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి... జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో చోటు దక్కించుకున్న విష్ణుప్రణవి, అస్మిత, వ్వేత, రియాన్షిక సాయి, కీర్తిలక్ష్మి.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే కావడం విశేషం. చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ క్రీడపై ఆసక్తి పెంచుకున్న వారు నిరంతర సాధనతో తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రోజూ ఉదయం, సాయంత్రం క్రమం తప్పని సాధన వారిని ఫుట్బాల్ క్రీడలో మెరికలుగా మార్చేసింది. ప్రతిభకు పేదరికం అడ్డురాదని... అనుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 27 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు అనంతపురంలోని ఆర్డీటీ స్పోర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పుట్బాల్ పోటీలు అండర్ –13 విభాగంలో పాల్గొని తమ సత్తాను నిరూపించుకుని జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన ఆత్మకూరు బాలికలు అందరూ సాధారణ రైతు కుటుంబాలకు చెందిన వారే -
జాప్యం జరిగింది
నేను సంస్థ సొమ్ము రూపాయి కూడా వాడుకోలేదు. జాతరలు, పండుగలు నేపథ్యంలో అదనంగా బస్సులు తిప్పాం. ఆ సమయంలో టోల్గేట్ చెల్లింపులు తదితర వాటి కోసం డబ్బు చెల్లింపులు జరిగాయి. ఈ క్రమంలోనే కాస్త జాప్యం జరిగింది అంతే. – ఆర్వీ ప్రసాద్బాబు, డిపో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అలాంటిదేమి జరగలేదు గుత్తి డిపోలో టోల్గేటు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి పొరపాటు జరగలేదు. టోల్ డబ్బులు కట్టించుకోలేదు. యాజమాన్యం మారిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. తిరిగి కట్టేశారు. – గంగాధర్, ఇన్చార్జ్ డీఎం -
ఆటోను ఢీకొన్న కారు
పామిడి: మండలంలోని గజరాంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై పెయింట్ డబ్బాలతో వెళుతున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొంది. ఘటనలో ఆటో బోల్తాపడి అనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి తొలుత పామిడి సీహెచ్సీలో ప్రథమ చికిత్స అందించి, అనంతపురానికి రెఫర్ చేశారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన హైదరాబాద్కు చెందిన వేణుగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఘటనలో దాదాపు రూ.2 లక్షల విలువైన సరుకు రోడ్డు పాలైందని ఆటో డ్రైవర్ తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులను బెదిరించిన వారిపై కేసు నమోదు బెళుగుప్ప: పోలీసులను బెదిరించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు బెళుగుప్ప ఎస్ శివ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తగ్గుపర్తి రోడ్డు సమీపంలోని విండ్ పవర్ స్టేషన్ వద్ద బుధవారం బహిరంగ మద్యపానం చేస్తూ నిఖిల్ అనే యువకుడు గస్తీ నిర్వహిస్తున్న హెడ్కానిస్టేబుల్ బాలనరసింహులు, జనార్ధన్, వెంకటేశ్నాయక్కు పట్టుపడ్డాడు. దీంతో నిఖిల్ను పీఎస్కు తరలించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న నిఖిల్కు వరసకు అన్న అయిన శివశంకర్... పీఎస్కు చేరుకుని పోలీసు సిబ్బందిని దుర్భాషలాడాడు. అంతేకాక తన తమ్ముడిని స్టేషన్కు పట్టుకెళ్లిన వారు మండలంలో ఎలా తిరుగుతారో తాను చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో హెడ్కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు నిఖిల్, శివశంకర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు గుంతకల్లు: మండలంలోని వెంకటాంపల్లిలో వెలసిన పెద్ద కదిరప్పస్వామి రఽథోత్సవంలో భాగంగా గురువారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. దాదాపు 9 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లికి చెందిన రైతు ఇంద్రారెడ్డి వృషభాలు మొదటి స్థానంలో నిలిచాయి. రెండో స్థానాన్ని తాడిపత్రికి చెందిన రైతు రాజశేఖర్రెడ్డి వృషభాలు, మూడో స్థానాన్ని పెద్దవడుగూరు మండలం లక్షుంపల్లికి చెందిన రైతు శివారెడ్డి వృషభాలు, నాల్గో స్థానాన్ని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం డి.రంగాపురం గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి వృషభాలు దక్కించుకున్నాయి. విజేత వృషభాల యజమానులను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. -
మహిళపై వేట కొడవలితో దాడి
అనంతపురం: స్థానిక పాతూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం సమీపంలో నివాసముంటున్న హేమలతపై మంగలి బాలఓబులేసు అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వందలాది మంది చూస్తుండగా వేటకొడవలితో వెంటాడి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు తెలిపిన మేరకు... నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన హేమలత భర్త కొంత కాలం క్రితం మృతి చెందాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతపురంలోని అత్త, మామ వద్ద పిల్లలు ఉంటూ చదువుకుంటున్నారు. కొంత కాలంగా హేమలతకు మంగలి బాలఓబులేసుతో పరిచయం ఉంది. ఈ క్రమంలో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించిన బాలఓబులేసు వేటకొడవలితో దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఆమె విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దాడికి పాల్పడిన బాల ఓబులేసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లా వాసులు అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు, బీసీ, పంచాయతీరాజ్, బూత్ కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురికి చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా తరిమెల వంశీగోకుల్రెడ్డి, చౌల మల్లయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధిగా భాస్కరరెడ్డి, సహాయ కార్యదర్శిగా అలేరి రాజగోపాల రెడ్డి, వాచిపల్లి నరేంద్రరెడ్డికి చోటు దక్కింది. బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గోగుల పుల్లయ్య, తలారి వెంకటేశులు, సహాయ కార్యదర్శులుగా కురుబ శ్రీనివాసులు, ఎంఏ నవీన్కుమార్, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా బెడదల మదన్మోహన్రెడ్డి, సహాయ కార్యదర్శులుగా ఎం.బసవ రాజు, షేక్ సాదిక్ వలి, బూత్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోగుల రాధాకృష్ణ నియమితులయ్యారు. రేషన్ బియ్యం పట్టివేత కణేకల్లు: అక్రమంగా కణేకల్లు నుంచి ఐచర్ వాహనంలో తరలిస్తున్న రేషన్ బియాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కణేకల్లు నుంచి గురువారం కర్ణాటకకు రేషన్ బియ్యం తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న అనంతపురం విజిలెన్స్ సీఐ శ్రీనివాసులు, తన సిబ్బందితో కలసి తనిఖీలు చేపట్టారు. ఐచర్ వాహనాన్ని సీజ్ చేసి, పీఎస్కు తరలించారు. 270 బస్తాల బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న వేణుగోపాల్తో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. -
మామిడి రైతులకు ఫ్రూట్ కవర్ రాయితీలు
అనంతపురం అగ్రికల్చర్: నాణ్యమైన మామిడి దిగుబడుల కోసం ఇటీవల కొత్తగా రాయితీతో అందిస్తున్న ఫ్రూట్ కవర్ల (రక్షణ కవచం)ను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు సూచించారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీపై గురువారం అనంతపురంలోని ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో మామిడి రైతులతో పాటు ఎఫ్పీఓలు, ఎన్జీఓలకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మామిడితోటల్లో కాయలు నిమ్మకాయ, కోడిగుడ్డు సైజులో ఉన్నప్పుడు గాలిచొరబడకుండా తొడిమ వరకు కవర్లు కట్టాలని తెలిపారు. ఫ్రూట్ కవర్ వాడటం వల్ల ఊజీ ఈగ, తేనెమంచు పురుగు, మచ్చలు, తామర పురుగుల నుంచి రక్షణ ఉంటుందన్నారు. అలాగే అధిక సూర్యరశ్మి, వడగండ్ల వాన నుంచి కూడా కాపాడుకోవచ్చన్నారు. ఎలాంటి క్రిమికీటకాలు పండ్లను నాశనం చేయకుండా నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని తెలిపారు. తొడిమ కూడా ధృఢంగా తయారై కాయ పరిమాణం కూడా పెరుగుతుందన్నారు. ఒక్కో కవర్ రూ.2 కాగా 50 శాతం రాయితీతో గరిష్టంగా ఒక హెక్టారుకు రూ.10 వేలు వరకు రాయితీ వర్తిస్తుందన్నారు. ఎఫ్పీఓలు, ఎన్జీఓలు సహకరిస్తే మామిడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఏఎఫ్ ఎకాలజీ, కార్డు, జీటీ, రెడ్స్, ఏపీమాస్ తదితర ఎన్జీఓ, ఎఫ్పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమంలో డీహెచ్ఓ నరసింహారావు -
ఆర్టీసీలో అక్రమాల గంప‘గుత్తి’
అనంతపురం క్రైం: గుత్తి ఆర్టీసీ డిపోలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్.వరప్రసాద్ బాబు అలియాస్ ఆర్వీపీ బాబు అక్రమాలు బహిర్గతమయ్యాయి. గుత్తి డిపోకు సంబందించిన ఆర్టీసీ బస్సులకు చెల్లించే టోల్ గేటు సొమ్ములో రూ.1,96,290ను సంస్థకు చెల్లించలేదు. ఆలస్యంగా ఈ విషయాన్ని పసిగట్టిన తోటి ఉద్యోగులు వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారి సదరు అధికారిని రక్షించేందుకు విషయాన్ని గుట్టుగా దాచేసి, రికవరీ చేయాలని ఆదేశించారు. దీంతో వారం రోజుల గడువునిస్తూ వాడుకున్న డబ్బును తిరిగి సంస్థ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని డిపో ఉన్నతాధికారులు తాకీదు జారీ చేశారు. దీంతో తాను స్వాహా చేసిన మొత్తాన్ని రెండు విడతలుగా ఆయన బ్యాంక్లో జమ చేసి, చేతులు దులుపుకున్నాడు. ఇక్కడితో ఏమీ జరగనట్లు అధికారులు మిన్నకుండిపోయారు. అక్రమార్కుడిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి 2024 ఆగస్టు నుంచి టోల్గేటుకు చెల్లించాల్సిన సొమ్మును పలు దఫాలుగా వాడుకున్నట్లు అధికారులు రికార్డు పరంగా గుర్తించారు. ఈ చర్య వల్ల ఆర్టీసీకి రూ.3 లక్షల జరిమానా రూపంలో పడినట్లుగా సమాచారం. ఈ క్రమంలో ప్రసాద్ నుంచి ఉన్నతాధికారులు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఒకటికి పదింతలు వసూలు చేయాలి ఆర్టీసీలో నిబంధనల ప్రకారం నగదు కార్యకలాపాలకు సంబంధించి ఉద్యోగి, కార్మికుడు ఏరోజుకారోజు చెల్లింపులు జరపాలి. అలా చెల్లించని పక్షంలో మరుసటి రోజు రూ.10కి పదింతలు అధికంగా రూ.110 చెల్లించాల్సి ఉంటుంది. అలా కట్టినప్పుడే విధులకు అనుమతిస్తారు. ఈ నిబంధన అందరికీ వర్తిస్తున్నా ఆర్ఎం సుమంత్.ఆర్.ఆదోని అస్మదీయులకు మాత్రం వర్తించడం లేదు. తాజాగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్వీపీ బాబు విషయంలోనూ ఇదే బహిర్గతమైంది. ఒక్క గుత్తి డిపోలోనే లక్షలాది రూపాయల చేతివాటం ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన అధికారులు ఆరా తీయడంతో తిరిగి చెల్లించిన వైనం -
1962 హెల్ప్లైన్ మూగబోయింది. మొబైల్ వెటర్నరీ క్లినిక్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మారుమూల పల్లెల్లో సైతం అందించే విశిష్ట పశువైద్య సేవలు నిలిచిపోయాయి. ఎన్నో అరుదైన, కష్టసాధ్యమైన శస్త్రచికిత్సలు చేసి మూగజీవాలకు ప్రాణదానం చేసిన మొబైల్ అంబులెన్స్లు నేడు రోడ
అనంతపురం అగ్రికల్చర్: దేశంలోనే తొలిసారిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో 108 అంబులెన్స్లు ప్రవేశపెట్టారు. పేదలకు ఎంతో సాంత్వన చేకూర్చారు. తండ్రి స్ఫూర్తితో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి మూగ జీవాల కోసం సైతం మొబైల్ అంబులెన్స్లు తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ అంబులెన్సులు మంచి ఫలితాలు ఇవ్వడంతో నియోజకవర్గాలకు అదనంగా మరొకటి సమకూర్చారు. నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల విలువ చేసే మందులు సైతం ఉచితంగా అందించారు.అర్హత కలిగిన పశువైద్యులు, ఒక పారా వెట్, పైలెట్ కింద డ్రైవర్ను నియమించారు. 1962 టోల్ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు. రైతుల నుంచి ఫోన్ రాగానే 108 మాదిరిగానే మారుమూల ప్రాంతాలకు వెళ్లి రైతు ఇంటి వద్దే మూగజీవాలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. మూగజీవాలు మరీ ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ ద్వారానే సమీప పశువుల ఆస్పత్రికి తీసుకువచ్చి పశుసంవర్ధక శాఖ డాక్టర్లు, ఏడీల సహకారంతో అరుదైన, కష్టసాధ్యమైన శస్త్రచికిత్సలు చేసి ప్రాణం పోశారు. కక్ష గట్టి నిలిపివేత.. ఉన్నతాశయంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1962 అంబులెన్స్లపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. కాంట్రాక్టు ముగిసిందనే నెపంతో 14 అంబులెన్స్లను ఈనెల 16 నుంచి నిలిపివేసింది. మరికొన్ని రోజుల్లో మిగిలిన అంబులెన్స్లు కూడా నిలిచిపోనున్నట్లు తెలిసింది. ఉన్నపళంగా 1962 అంబులెన్స్ సేవలను నిలిపివేయడంపై రైతులు, కాపర్లు మండిపడుతున్నారు. మూగజీవాల వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోందని వాపోతున్నారు. మరోపక్క 1962 అంబులెన్స్ల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు వాపోతున్నారు. తమకు రావాల్సిన బకాయిల సంగతి కూడా తేల్చకుండానే కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళన చెందుతున్నారు. 1962 అంబులెన్సులపై కూటమి సర్కారు కక్ష ఉమ్మడి జిల్లాలో 14 మొబైల్ అంబులెన్స్ల నిలిపివేత 108 మాదిరిగా పశువుల కోసం అంబులెన్స్లు తెచ్చిన జగన్ సర్కారు మారుమూల ప్రాంతాల్లో సైతం విశిష్ట సేవలు అందించేలా చర్యలు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై పాడి రైతుల ఆగ్రహం -
1 నుంచి ఇంటర్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారంతో ప్రాక్టికల్ పరీక్షలు ముగియడంతో థియరీ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. మార్చి 20 వరకు థియరీ పరీక్షలుంటాయి. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్, ఒకేషనల్ కలిపి 48,690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 25,730 మంది కాగా 12,397 మంది బాలురు, 13,333 మంది బాలికలు ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 22,960 మంది కాగా వీరిలో 11,064 మంది బాలురు, 11,896 మంది బాలికలు ఉన్నారు. పరీక్ష ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుతున్నాయి. స్థానిక కొత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో భద్రపరుస్తున్నారు. పరీక్షలపై ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూం (నం.08554– 274256) ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల సమయంలో ప్రశ్రపత్రాలను లీక్ చేస్తే అడ్డంగా దొరికిపోతారు. ప్రశ్నాపత్రాలపై క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. పొరపాటున బయట ప్రశ్నపత్రం దొరికిందా... దానిపై ఉన్న క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అది ఏ కేంద్రానికి కేటాయించిందో ఇట్టే తెలిసిపోతుంది. వెబ్సైట్లో హాల్ టికెట్లు.. విద్యార్థులు హాల్టికెట్లు https://bie.ap.gov.in వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులకు, హాల్ టికెట్లకు ముడిపెట్టొద్దని, ఎవరైనా బలవంతం చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఇంటర్ బోర్డు ఆర్ఐఓ ఎం. వెంకటరమణనాయక్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలను ముందురోజే వెళ్లి సంబంధిత కళాశాల యాజమాన్యంతో నిర్ధారించుకోవాలని సూచించారు. వర్సిటీ పురోగతికి సమష్టి కృషి అనంతపురం: జేఎన్టీయూ(ఏ) పురోగతికి సమష్టిగా కృషి చేద్దామని నూతన వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు అన్నారు. బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రతి ఉద్యోగి సహకారంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. -
బాడుగకిస్తే బాధే మిగులుతోంది!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘మనవాళ్లే కదా.. అంతా బాగుంటుంది లే’ అనుకుంటూ భవనాన్ని అద్దెకిచ్చిన పాపానికి ఓనర్లు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అద్దెదారులు చివరకు ‘ఖాళీ చేయం.. నీ దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ ధిక్కరిస్తున్న పరిస్థితి. పైగా కోర్టుకు వెళ్లడం.. ఇప్పుడే ఖాళీ చేయలేమని గడువుతో కూడిన స్టే ఆర్డర్లు తెచ్చుకోవడం.. ఆ గడువు కూడా ముగిసినా ఖాళీ చేయకపోవడం... ఇదీ దుస్థితి. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో భవన యజమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అద్దె కరెక్టుగా ఇచ్చేవారికి కూడా కొందరి ఆగడాలతో బాడుగకు భవనం దొరకడం కష్టతరమవుతోంది. ‘క్రాంతి’.. భ్రాంతి అనంతపురం గుత్తిరోడ్డులోని ఓ అద్దె భవనంలో క్రాంతి హాస్పిటల్ నడు స్తోంది. నెలకు అద్దె రూ.3.25 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. 2021లోనే భవనం అద్దె లీజు ముగిసింది. ఈ క్రమంలో భవనాన్ని ఖాళీ చేయాలని అనేక సార్లు ఓనరు అడిగినా స్పందన లేకుండా పోయింది. పైగా గడిచిన 14 నెలల నుంచి అద్దె కూడా చెల్లించలేదు. దీంతో భవన యజమాని నగేష్ 2024 డిసెంబరులో ఎస్పీకి ఫిర్యాదు చేయ గా... పరిష్కారం చూపాలంటూ అనంతపురం త్రీ టౌన్ పోలీసులను ఆయన ఆదేశించారు. అయితే, సదరు పోలీసుల నుంచి కూడా సరైన స్పందన లేకపోవడంతో ఆస్పత్రి వద్ద భవన యజమాని బుధవారం ధర్నాకు దిగారు.ఈ క్రమంలో ఆస్పత్రి నిర్వాహకుడు మురళి దిగిరాకపోగా బాధితుడిపైనే దౌర్జన్యం చేశారు. ‘దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ బెది రించాడని నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది కేసులు.. అనంతపురంలోనే కాదు కళ్యాణదుర్గం, రాయదుర్గం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు పట్టణాల్లోనూ ఇలాంటి కేసులు ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సగటున రోజుకు 10 కేసులు నమోదవుతున్నాయి. అద్దెకున్న వారు ఖాళీ చేయకపోవడంతో బిల్డింగ్ యజమానులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది విదేశాల్లో ఉంటూ ఇక్కడ అద్దెకిస్తే ఆ ఇళ్లకు ఏకంగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కుదువకు పెట్టిన వారూ ఉన్నట్లు సమాచారం. భవనాలను ఖాళీ చేయని అద్దెదారులు అవసరమైతే కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్లు పోలీసులను ఆశ్రయిస్తున్న ఓనర్లు రోజుకు 10 పైనే కేసులు అద్దె ఇప్పించే ఉద్యోగం కాదు మాది అద్దెకిచ్చిన ఇంటికి రెంటు ఇప్పించడమో, ఖాళీ చేయించడమో చేసే ఉద్యోగం కాదు మాది. ఇలాంటి వాటి జోలికొస్తే సివిల్ పంచాయితీల్లో ఎందుకు తలదూరుస్తారు అంటారు. అందుకే కోర్టుకెళ్లి తేల్చుకోండి అని చెబుతున్నాం. మా పరిధిలో ఉన్నవి మాత్రమే పరిష్కరిస్తాం. –శాంతిలాల్, సీఐ, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ -
రోడ్డున పడేయొద్దు
తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని 1962 మొబైల్ అంబులెన్స్ డాక్టర్లు, పారావెట్స్, డ్రైవర్లు వేడుకున్నారు. ఉన్నపళంగా మొదటి విడత అంబులెన్స్లు నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బుధవారం అనంతపురం పశుసంవర్ధక శాఖ జేడీ కార్యాలయంలో జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ముందస్తు సమాచారం లేకుండానే అంబులెన్స్లు నిలిపివేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు సంస్థ మారినా మళ్లీ తమనే విధుల్లోకి తీసుకునేలా చూడాలని కోరారు. జేడీని కలిసిన వారిలో డాక్టర్ శృతి, డాక్టర్ హైమ, డాక్టర్ కరణ్, డాక్టర్ మంజుశ్రీ, సిబ్బంది మహదీప్, ఆకాష్, వినోద్, షరీఫ్, పవన్సాయి, కళ్యాణ్బాబు తదితరులు ఉన్నారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఉరవకొండ: మండల పరిధిలోని లత్తవరం తండా గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని కావ్యబాయి (16) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. లత్తవరం తాండా గ్రామానికి చెందిన ఈశ్వర్నాయక్, జానకిబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె కావ్యబాయి ఉరవకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం (సీఈసీ) చదువు తోంది. మూడు రోజుల నుంచి కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. బుధవారం ఉదయం కూలి పనులకు వెళ్లిన ఈశ్వర్నాయక్, జానికిబాయిలు మధ్యాహ్నం ఇంటికి రాగా, కావ్యబాయి ఫ్యాన్కు ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కుమార్తెను కిందికి దించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యార్థిని మృతికి దారితీసిన కారణాలు తెలియరాలేదు. ఎస్ఐ జనార్దన్నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొప్పాయి చెట్ల నరికివేత బ్రహ్మసముద్రం: మండలంలోని రాయలప్పదొడ్డి పంచాయతీ యనకల్లు గ్రామ సమీపంలో సర్పంచ్ రామ్మోహన్ సాగు చేసిన బొప్పాయి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తనకున్న 5 ఎకరాల్లో రామ్మోహన్ బొప్పాయి సాగు చేపట్టారు. గిట్టని వారు తోటలోకి చొరబడి పిందె దశలో ఉన్న 70కి పైగా చెట్లను నరికి వేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు తెలిపారు. -
రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాలి
అనంతపురం అర్బన్: ‘‘రెవెన్యూశాఖ పరిధిలోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఏ ఒక్క అర్జీ పెండింగ్లో ఉండడానికి వీలులేదు’’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ రెవెన్యూ డివిజన్, మండలస్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఎస్డీటీలు, మండల సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సేవలకు సంబంధించి చుక్కల భూములు, మ్యుటేషన్ దరఖాస్తులు, వివాహ, సమీకృత, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్లు, మ్యుటేషన్ ఫార్ ట్రాన్సాక్షన్, పాసుపుస్తకం సేవలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు, దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్జీలు పరిష్కరించారా.. లేదా? ఆత్మకూరు: రెవెన్యూ సదస్సుల్లో అందిన అర్జీలను పరిష్కరించారా లేదా అని క్షేత్ర స్థాయిలో కలెక్టర్ వినోద్కుమార్ పరిశీలించారు. ఆత్మకూరు మండలంలోని మదిగుబ్బలో బుధవారం ఆయన పర్యటించారు. గ్రామానికి చెందిన జింకల నరసింహులు అనే రైతు తన భూమికి దారి చూపించాలంటూ అందించిన అర్జీపై ఆరా తీశారు. ఇరు వర్గాలతో మాట్లాడారు. ప్లాన్ మార్క్ ప్రకారం రస్తా చూపించాలని ఆర్డీఓ, తహసీల్దార్ను ఆదేశించారు. మిగిలిన భూమిలో చట్ట ప్రకారం హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎవరూ గొడవలు చేసుకోరాదని హితవు పలికారు. న్యూస్రీల్ -
అన్ని సౌకర్యాలుంటేనే సబ్సిడీ పరికరాలు
● ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్ఖాన్ కూడేరు: బోరు, మోటార్, విద్యుత్ తదితర అన్ని సౌకర్యాలున్న రైతులకే ప్రభుత్వం సబ్సిడీతో సూక్ష్మ సేద్యం పరికరాలు అందిస్తుందని ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్ఖాన్ అన్నారు. బుధవారం ఆయన కూడేరు, ఇప్పేరులోని రైతు సేవాకేంద్రాలను సందర్శించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల పొలాల్లో బోరు వద్ద ఫొటోలు తీసి అప్లోడ్ (పీఏఆర్) చేసే అంశంలో చోటు చేసుకున్న జాప్యంపై సిబ్బందితో సమీక్షించారు. మార్చిలోపు అన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూడేరు మండల వ్యాప్తంగా ఇంకా 405 మంది రైతుల పొలాల్లో ఫొటోలు తీసి అప్లోడ్ చేయడం, జియో టాగింగ్ చేయడం ఉన్నాయన్నారు.రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు అందుబాటులో ఉండి సిబ్బందికి సహకరిస్తే ఈ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ హార్టికల్చర్ ఆఫీసర్ నెట్టికంటయ్య, వీహెచ్ఏ సాజియా, ఎంపీఈఓ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం పెద్దవడుగూరు: మండలంలోని అప్పేచర్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై స్థానిక టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన టీడీపీ నేత ప్రకాష్రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్త విజయభాస్కరరెడ్డి మధ్య కొంత కాలంగా స్థల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న వెంచర్లో విజయభాస్కరరెడ్డి పని చేస్తుండగా అక్కడికి టీడీపీ నేతలు ప్రకాష్రెడ్డి, నాగేశ్వరరెడ్డి చేరుకుని వాగ్వాదానికి దిగారు. మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండడాన్ని గమనించిన విజయభాస్కరరెడ్డి అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అడ్డుకుని వేట కొడవలి, ఇనుప పైపులతో దాడి చేశారు. ఘటనలో విజయభాస్కరరెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన ఆయన తమ్ముడు రామ్మోహన్రెడ్డిపై సైతం టీడీపీ నేతలు దాడిచేయడంతో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళితే.. దాడికి పాల్పడిన వారు సైతం అక్కడకు చేరుకుని ప్రతిగా ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
మాతాశిశు సంరక్షణ చర్యలు చేపట్టండి
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో మాతాశిశు సంరక్షణ చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ ఆదేశించారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ప్రకారం తల్లీబిడ్డల వైద్య సేవలు, గర్భిణుల వివరాల నమోదుపైబుధవారం ఆయన డీఎంహెచ్ఓ కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీదేవితో కలసి వైద్యాధికారులతో సమీక్షించారు. వీడియో కాన్పరెన్స్ ఏర్పాటు చేసి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ యుగంధర్, డాక్టర్ అనుపమ, డాక్టర్ రవిశంకర్, ఎస్ఓ మహ్మద్ రఫీ, కిషోర్ పాల్గొన్నారు. పామిడి: మండల కేంద్రంలోని సీహెచ్సీతో పాటు రామరాజుపల్లిలోని హెల్త్ క్లినిక్ను బుధవారం ఉదయం డాక్టర్ అనిల్కుమార్ తనిఖీ చేశారు. ముందుగా పామిడిలోని గుప్తా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా 11 రకాల వ్యాధులకు సంబంధించిన టీకాలపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. అనంతరం సీహెచ్సీలో పలు రికార్డులు పరిశీలించారు. రామరాజుపల్లిలో హెల్త్ క్లినిక్ను పరిశీలించి 14 రకాల ల్యాబ్ పరీక్షల విధానం, ఎన్సీడీ సీడీ సర్వేపై ఆరోగ్యసిబ్బందికి అవగాహన కల్పించారు. ఆయన వెంట ఆర్బీఎస్కే సీఓ నారాయణస్వామి, ఎద్దులపల్లి వైద్యాధికారి సుధాకర్, సిబ్బంది ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అనిల్కుమార్ -
నేడు
నాడు వన్యప్రాణుల సంరక్షణకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. వేసవిలోనే కాదు.. మిగిలిన అన్ని సీజన్లలోనూ నీటి కోసం వన్యప్రాణులు విలవిల్లాడకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా తొట్టెలు ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా వాటిని నీటితో నింపుతూ వచ్చింది. ఈ చర్యలతో అటవీ ప్రాంతాన్ని వీడి ఏనాడూ వన్యప్రాణులు గ్రామాల బాట పట్టింది లేదు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రస్తుత కూటమి సర్కార్ ఉదాసీనత కనబరుస్తోంది. వేసవి ప్రారంభం కాక ముందే ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నా ఇప్పటి వరకూ వన్యప్రాణుల దాహార్తీని తీర్చే చర్యలు చేపట్టలేదు. ఫలితంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు నిరుపయోగంగా మారడంతో దాహం తీర్చుకునేందుకు వన్యప్రాణులు గ్రామాల బాట పడుతున్నాయి. మానిరేవు బీట్లో తొట్టెలోకి నీరు పడుతున్న అటవీ సిబ్బంది (ఫైల్) రాయదుర్గం: వేసవి ప్రారంభానికి ముందే ఫిబ్రవరి రెండో వారంలోనే భానుడు ప్రచండ నిప్పులు చెరుగుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇక అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరకకపోవడంతో గ్రామాల బాట పడుతున్నాయి. దాహార్తీ తీరేలోపు చాలా మూగజీవాలు మృత్యువాత పడుతుండగా, మరికొన్ని వీధి కుక్కలు, వేటగాళ్ల బారిన పడి చనిపోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణపై కూటమి సర్కార్ ఉదాసీనత కనబరుస్తుండడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారుతోంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, కణేకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం, కూడేరు తదితర గ్రామాల్లో ఇప్పటికే ఎలుగుబంట్లు, చిరుతలు, తాడిపత్రి, యాడికి, యల్లనూరు, పుట్లూరు, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, గుత్తి, గుంతకల్లు పరిసర ప్రాంతాల్లో జింకలు, దుప్పిలు, కుందేళ్లు. ఇతర మూగజీవాలు దాహం తీర్చుకునేందుకు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో సరైన నీటి వసతిని ప్రభుత్వం కల్పించకపోవడంతోనే సమీప పొలాల్లోని ట్యాంకుల్లో దాహం తీర్చుకునేందుకు వన్యప్రాణులు వస్తుంటాయని రైతులు అంటున్నారు. వంద తొట్టెల నిర్మాణం జిల్లాలోని మూడు ఫారెస్ట్ రేంజ్ల పరిధిలో 74,400 హెక్టార్లలో విస్తరించిన అటవీ ప్రాంతం వేలాది వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఈ క్రమంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని అన్ని ఫారెస్ట్ రేంజ్లలో సుమారు వందకు పైగా నీటి తొట్టెలను నిర్మించింది. ఇందు కోసం రూ.లక్షలు వెచ్చించింది. వీటికి తోడు సాసర్ రింగ్స్, చెక్డ్యామ్లు, పెర్కోలేషన్ ట్యాంకులు, నీటి కుంటల్ని నిర్మించి సీజన్తో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా నీటితో నింపుతూ వస్తుండడంతో ఏనాడూ వన్యప్రాణాలు అటవీ ప్రాంతాన్ని వీడి జనావాసాల్లోకి వచ్చింది. లేదు. అడవుల సరంక్షణ, వన్యప్రాణుల చట్టాలపై సమీప గ్రామాల ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చింది. దీంతో కారుచిచ్చు నుంచి అడవుల్ని కాపాడుకునే బాధ్యత ప్రజలే స్వచ్ఛందంగా తీసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వన్యప్రాణి సంరక్షణ చర్యలు మచ్చుకై నా కనిపించడం లేదని గ్రామీణులు అంటున్నారు. దీంతో అడవికి అందాలుగా చెప్పుకునే వన్యప్రాణులు దాహంతో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేవు వన్యప్రాణుల సంరక్షణకు కంపా, బయోసాట్ పథకాల కింద నిధులు అందాల్సి ఉంది. ప్రస్తుతం కంపా పథకం కింద రూ.50 వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంతకు మించి నిధులేమీ లేవు. అన్నీ రేంజీల పరిధిలోనూ వన్యప్రాణుల తాగునీటి అవసరాలను గుర్తించాం. దానికి తగినట్లుగా నీటి వసతి ఏర్పాటుకు ప్రణాళికలు చేపట్టాం. వన్యప్రాణులతో పాటు అడవులను కాపాడుకునే బాధ్యత తీసుకున్నాం. అవసరమైనచోట సాసర్రింగ్స్ను అందుబాటులోకి తీసుకోస్తాం. – విజ్ఞేష్ అప్పావు, డీఎఫ్ఓ, అనంతపురం -
గొంతు తడవక సొమ్మసిల్లి...
పుట్టపర్తి: గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరక్కపోవడంతో ఓ మామిడి తోటలో వాలిన జాతీయ పక్షి నెమలి... అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. బుక్కపట్నం గ్రామానికి చెందిన రైతు చిట్రా నారాయణస్వామి తోటలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. విపరీతమైన దాహంతో సొమ్మసిల్లిన నెమలిని గమనించిన కొత్త చెరువుకు చెందిన విశ్రాంత సైనికోద్యోగి రవిచంద్ర వెంటనే దానికి సపర్యలు చేపట్టారు. బిందెలతో నీటిని దానిపై పోసిన కాసేపటికి తేరుకుంది. అయినా పైకి స్వేచ్ఛగా ఎగరలేక ఇబ్బంది పడుతుంటే రైతు నారాయణస్వామితో కలసి పోలీసులకు అప్పగించారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గొంతు తడుపుకునేందుకు మూగజీవాలు పడుతున్న ఇబ్బందులకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఘటనలో కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నా.. వెలుగులోకి కొన్ని మాత్రమే వస్తున్నాయి. సకాలంలో రైతులు గుర్తించడంతో నెమలికి ప్రాణాపాయం తప్పింది. దాహంతో అలమటిస్తున్న పలు వన్యప్రాణులు నీరు అందక మృత్యువాత పడుతుండడం బాధాకరం. -
ఉచిత ఎంబీఏ విద్య కోసం 23న పరీక్ష
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని సంస్కృతి కళాశాలలో ఉచిత ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే సాయి ప్రుడెంట్ స్కాలర్షిప్ పరీక్ష ఈ నెల 23 ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను బుధవారం విద్యాసంస్థల చైర్మన్ విజయ్భాస్కర్రెడ్డి విడుదల చేశారు. అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రశాంతి, ప్రిన్సిపాల్ అండ్ డీన్ డాక్టర్ బాలకోటేశ్వరి మాట్లాడుతూ రెండేళ్ల ఎంబీఏ విద్యతో పాటు హాస్టల్ సౌకర్యాలను పొందడానికి సాయి ప్రుడెంట్ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ కోర్సు చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 91000 64545, 91009 74544, 91009 74537 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జర్మనీకి చెందిన అన్హటా స్టప్టుంగ్ ఫౌండేషన్ సహకారంతో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
సీసీ కెమెరాల్లేవు.. రికార్డుల ఊసే లేదు
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ ఆలమూరు రోడ్డులో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో డొల్లతనం బయట పడింది. రెసిడెన్షియల్ కళాశాల నిర్వహణలో తీసుకోవాల్సిన కనీస చర్యలు పాటించడం లేదని వెల్లడైంది. కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శ్రీకాంత్ సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థి మృతిపై అనుమానాలు తలెత్తుతుంటే, మరోవైపు కళాశాలలో కనీస భద్రత చర్యలు లేకపోవడంపై చర్చ జరుగుతోంది. కళాశాలలో సీసీ కెమెరాలు లేవు. కాంపౌండ్ ఎత్తు లేదు. విద్యార్థుల అటెండెన్స్ నిర్వహణ లేదు. సెక్యూరిటీ లేడు. గేటు వద్ద కచ్చితంగా రిజిస్టర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా విద్యార్థి బయటకు వెళ్లాలంటే యాజమాన్యంతో అనుమతి తీసుకోవాలి. బంధువులు వస్తే వారి ఊరు, పేరు, సంతకం, వచ్చిన సమయం రిజిస్టర్లో నమోదు చేసిన తర్వాతనే విద్యార్థిని బయటకు పంపాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. రాత్రి విద్యార్థి బయటకు పోతే వార్డెన్ ఏం చేస్తున్నాడు?ఎందుకు గుర్తించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. ఇక.. రాత్రి పడుకునే ముందు అన్ని గదుల్లోకి వెళ్లి విద్యార్థుల అటెండెన్స్ తీసుకోవాలి... అలా జరిగి ఉంటే విద్యార్థి శ్రీకాంత్ లేడనే విషయం అప్పుడే వెలుగు చూసేది. కానీ ఇక్కడ మాత్రం మరుసటి రోజు ఉదయం విద్యార్థి చెట్టుకు ఉరికి వేలాడుతూ కనిపించేదాకా ఆ విద్యార్థి బయటకు వెళ్లాడనే సమాచారమే లేకపోవడం గమనార్హం. ప్రిన్సిపాల్ సెల్ స్విచ్చాఫ్.. కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్బాబు మంగళవారం ఉదయం 7.45 గంటలకు కళాశాలకు వచ్చాడు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలీగానే అక్కడి నుంచి వెళ్లిపోయి తన మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. పోలీసులు ఆయన ఇంటివద్దకు వెళ్తే అందుబాటులో లేరు. తీరిగ్గా బుధవారం ఉదయం కళాశాలకు రావడం విమర్శలకు తావిచ్చింది. డీఎస్పీ ఆగ్రహం.. విద్యార్థుల భద్రతకు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఏజీఎం జగన్మోహన్రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫీజులు వసూళ్లు చేసినంతగా విద్యార్థులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి బయటకు పోయిన విద్యార్థి ఉదయం శవమై తేలేంతవరకూ తెలీదా అని ప్రశ్నించారు. ‘తరచూ రౌండ్స్కు వస్తుంటారు కదా... కళాశాలలో విద్యార్థుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది పరిశీలించక పోతే ఎలా?’ అని రూరల్ పోలీసులపైనా అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఇంటర్ బోర్డు అధికారులు కూడా ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని, తరచూ కళాశాలలను తనిఖీలు చేసి, లోపాలుంటే సరిదిద్దేలా ఆదేశాలు జారీ చేసి ఉంటే ఈరోజు ఇంతటి పరిస్థితి ఉండేది కాదని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి శ్రీకాంత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్బీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఐఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తక్షణమే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్ఐఓ వెంకటరమణనాయక్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కుళ్లాయిస్వామి, పరమేష్, పృథ్వి, సురేష్, హనుమంతరాయుడు, వంశీ, చందు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ కళాశాలలో భద్రత డొల్ల రోజంతా పత్తా లేకుండా పోయిన ప్రిన్సిపాల్ -
సుత్తితో మోది.. బంగారు నగల అపహరణ
ఓడీచెరువు: ఇంటి తలుపుతట్టిన దుండగులు...డోరు తీసిన మహిళ నెత్తిపై సుత్తితో మోది ఆమె వంటిపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఓడీచెరువులో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు... వైద్య,ఆరోగ్యశాఖ విశ్రాంత ఉద్యోగి లక్ష్మమ్మ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోనే ఒంటరిగా నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో దుండగులు తలుపుతట్టి పేరుపెట్టి పిలిచారు. దీంతో ఆమె తలుపుతీయగానే సుత్తితో తలపై కొట్టడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం ఆమె మెడలోని గొలుసు, చేతికున్న బంగారు గాజులను దుండగులు తీసుకెళ్లిపోయారు. కాసేపటి తర్వాత మెలుకున్న లక్ష్మమ్మ తన కూతురుకు ఫోన్ చేసి విషయం తెలిపడంతో ఆమె వచ్చి తల్లిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అనంతరం స్థానిక పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. మొత్తంగా 14 తులాల బంగారు నగలు దుండగులు అపహరించినట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్య ధర్మవరం అర్బన్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని సత్యసాయి నగర్కు చెందిన అశోక్ (35) ఇటుకల బట్టీతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక కొంత కాలంగా మదన పడుతున్న అశోక్ బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై చెన్నేకొత్తపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ ప్యాదిండి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
కొరవడిన ముందుచూపు
గుంతకల్లు టౌన్: బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించేందుకు గానూ బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో చేపట్టిన ఇంటర్వ్యూలు నిర్వహించలేక అధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా ఇంటర్వ్యూలు వాయిదాపడ్డాయి. ఇంటర్వ్యూలకు ఒక్క రోజు ముందు పత్రికా ప్రకటన ఇవ్వడం... ప్రణాళిక లేకుండా అర్ధ రోజులోనే ఇంటర్వ్యూలను ముగించాలనుకోవడం అధికారిక వైఫల్యాలకు కారణంగా తెలుస్తోంది. ముందుచూపులేని అధికారులు హడావుడిగా తీసుకున్న నిర్ణయాల వల్ల మండుటెండల్లో అభ్యర్థులు నానా తిప్పలు పడ్డారు. ఒకానొక దశలో తోపులాట చోటు చేసుకోవడంతో తోపులాటను చూసి బ్యాంకు అధికారులు భయాందోళనలకు గురయ్యారు. బీసీ, ఈబీసీ కింద 117 యూనిట్లకు సుమారు 1,200 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరూ ఇంటర్వ్యూలకు హాజరవుతారని తెలిసి కూడా కార్యాలయ ఆవరణలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. కాగా, మున్సిపల్ కమిషనర్ నయీమ్ బాధ్యతారాహిత్యమే ఇందుకు కారణమని సీఐటీయూ పట్టణ కార్యదర్శి సాకే నాగరాజు మండిపడ్డారు. ఇంటర్వ్యూలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వస్తున్నట్లుగా ముందస్తుగా తమకు ఎందుకు సమాచారమివ్వలేదని మున్సిపల్ కమిషనర్ నయీమ్, సంబంధిత అధికారులను పోలీసు అధికారులు నిలదీశారు. తొక్కిసలాట జరిగితే బాధ్యత వహిస్తారా అంటూ టూటౌన్ సీఐ మస్తాన్ ప్రశ్నించారు. ఇంటర్వ్యూ తేదీ ఒక్క రోజు ముందు ఖరారు కావడంతో మౌలిక వసతులు కల్పించలేకపోయినట్లు మెప్మా టీపీఆర్ఓ మోహన్ తెలిపారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇంటర్వ్యూలను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంటర్వ్యూలు నిర్వహించలేక చేతులెత్తేసిన అధికారులు -
1962 హెల్ప్లైన్ మూగబోయింది. మొబైల్ వెటర్నరీ క్లినిక్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మారుమూల పల్లెల్లో సైతం అందించే విశిష్ట పశువైద్య సేవలు నిలిచిపోయాయి. ఎన్నో అరుదైన, కష్టసాధ్యమైన శస్త్రచికిత్సలు చేసి మూగజీవాలకు ప్రాణదానం చేసిన మొబైల్ అంబులెన్స్లు నేడు రోడ
అనంతపురం అగ్రికల్చర్: దేశంలోనే తొలిసారిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో 108 అంబులెన్స్లు ప్రవేశపెట్టారు. పేదలకు ఎంతో సాంత్వన చేకూర్చారు. తండ్రి స్ఫూర్తితో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకు వేసి మూగ జీవాల కోసం సైతం మొబైల్ అంబులెన్స్లు తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ అంబులెన్సులు మంచి ఫలితాలు ఇవ్వడంతో నియోజకవర్గాలకు అదనంగా మరొకటి సమకూర్చారు. నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల విలువ చేసే మందులు సైతం ఉచితంగా అందించారు.అర్హత కలిగిన పశువైద్యులు, ఒక పారా వెట్, పైలెట్ కింద డ్రైవర్ను నియమించారు. 1962 టోల్ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు. రైతుల నుంచి ఫోన్ రాగానే 108 మాదిరిగానే మారుమూల ప్రాంతాలకు వెళ్లి రైతు ఇంటి వద్దే మూగజీవాలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. మూగజీవాలు మరీ ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ ద్వారానే సమీప పశువుల ఆస్పత్రికి తీసుకువచ్చి పశుసంవర్ధక శాఖ డాక్టర్లు, ఏడీల సహకారంతో అరుదైన, కష్టసాధ్యమైన శస్త్రచికిత్సలు చేసి ప్రాణం పోశారు. కక్ష గట్టి నిలిపివేత.. ఉన్నతాశయంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1962 అంబులెన్స్లపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. కాంట్రాక్టు ముగిసిందనే నెపంతో 14 అంబులెన్స్లను ఈనెల 16 నుంచి నిలిపివేసింది. మరికొన్ని రోజుల్లో మిగిలిన అంబులెన్స్లు కూడా నిలిచిపోనున్నట్లు తెలిసింది. ఉన్నపళంగా 1962 అంబులెన్స్ సేవలను నిలిపివేయడంపై రైతులు, కాపర్లు మండిపడుతున్నారు. మూగజీవాల వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోందని వాపోతున్నారు. మరోపక్క 1962 అంబులెన్స్ల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు వాపోతున్నారు. తమకు రావాల్సిన బకాయిల సంగతి కూడా తేల్చకుండానే కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళన చెందుతున్నారు. 1962 అంబులెన్సులపై కూటమి సర్కారు కక్ష ఉమ్మడి జిల్లాలో 14 మొబైల్ అంబులెన్స్ల నిలిపివేత 108 మాదిరిగా పశువుల కోసం అంబులెన్స్లు తెచ్చిన జగన్ సర్కారు మారుమూల ప్రాంతాల్లో సైతం విశిష్ట సేవలు అందించేలా చర్యలు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై పాడి రైతుల ఆగ్రహం -
అహుడా వార్డు ప్లానర్ అనుమానాస్పద మృతి
అనంతపురం: అహుడాలో వార్డు ప్లానర్గా పనిచేస్తున్న నాగశ్రీ(38) అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురంలోని మారుతీనగర్లో నివాసముంటున్న ఆమె తన ఇంట్లోనే మంగళవారం ఉరికి వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు గమనించి పెద్దాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అత్యవసర వైద్య విభాగంలో చేర్చారు. చికిత్సకు స్పందించక బుధవారం ఆమె మృతిచెందింది. కాగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రీ సర్వే పారదర్శకంగా సాగాలి ● జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ నార్పల: గ్రామాల్లో రీ సర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జేసీ శివ్నారాయణ్ శర్మ ఆదేశించారు. నార్పల మండలం దుగుమర్రిలో చేపట్టిన రీ సర్వే పనులను బుధవారం ఆయన పరిశీలించారు. గ్రామ సరిహద్దులు, బ్లాక్ సరిహద్దులు, ప్రభుత్వ స్థలాల సరిహద్దులు పక్కగా నిర్ణయించాలన్నారు. రీ సర్వే చేసే గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. వారి సమక్షంలోనే రీసర్వే పనులు చేపట్టాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. హంద్రీ–నీవా లైనింగ్ పనుల అడ్డగింత కనగానపల్లి: హంద్రీ–నీవా కాలువ సిమెంట్ లైనింగ్ పనులను రైతులు అడ్డుకున్నారు. ఎవరికో మేలు చేసేందుకు తమకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. తగరకుంట సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్ద లైనింగ్ పనులు చేపట్టేందుకు బుధవారం కాంట్రాక్టర్లు యంత్రాలతో రాగా, విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు అక్కడికి వెళ్లి పనులు చేపట్టకూడదన్నారు. కూటమి ప్రభుత్వం హంద్రీ–నీవా కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు కృష్ణాజలాలు తరలించేందుకు తమకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కాలువ వెడల్పు, జంగిల్ క్లియరెన్స్కు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ కాలువలో సిమెంట్ వేసి లైనింగ్ చేస్తే ఒప్పుకోబోమన్నారు. కార్యక్రమంలో తగరకుంట, పాతపాల్యం గ్రామాల సర్పంచ్లు మాధవరాజులు, రాజాకృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు. -
భూ సమస్యలు పునరావృతం కారాదు
ప్రశాంతి నిలయం: జిల్లాలో భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టి భవిష్యత్తులో రైతులకు భూ సమస్యలు తలెత్తకుండా రికార్డులు పక్కాగా రూపొందించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు. బుధవారం శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్, రీ సర్వే, రెవెన్యూ సదస్సులతో పాటు పలు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ టీఎస్ చేతన్తో కలసి అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భూముల వర్గీకరణతో కూడిన మ్యాప్లు తయారు చేయాలన్నారు. భూముల రిజిస్ట్రేషన్, 22ఎ, డి.నోటిఫైడ్, భూసేకరణ, సమీకరణ, ఫ్రీహోల్డ్, డిజిటలైజేషన్, జాయింట్ ఎల్పీఎంల రూపకల్పనతో పాటు ఇతర రెవెన్యూ అంశాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్వో విజయసారథి, ఆర్డీఓలు సువర్ణ, శర్మ, మహేష్, ఆనంద్కుమార్, 32 మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా -
గంజాయి విక్రేతల అరెస్ట్
గుంతకల్లు టౌన్: ఒడిశా నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల్లో విక్రయిస్తున్న గుంతకల్లుకు చెందిన షికారి నాగులు, అశోక్కుమార్, తాడిపత్రి నివాసి యర్రగుడి అల్తాఫ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన పక్కా సమాచారంతో బుధవారం ఉదయం గుంతకల్లులోని ఆలూరు రోడ్డులోని దర్గా ఆర్చ్ వద్ద తచ్చాడుతున్న ముగ్గురినీ అదుపులోకి విచారణ చేయడంతో గంజాయి విక్రయం బయటపడినట్లు వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. వీరి నుంచి 1,100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
రుణ మంజూరులో ఎందుకింత నిర్లక్ష్యం?
అనంతపురం సిటీ: తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా, పదేపదే చెబుతున్నా బ్యాంకర్ల పని తీరులో మార్పు రావడం లేదని కలెక్టర్ వినోద్కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతపురంలోని జిల్లా పరిషత్ డీపీఆర్సీ భవన్లో మంగళవారం జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ విద్యా రుణాలకు సంబంధించి యూకో బ్యాంక్ 109 మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, కేవలం ముగ్గురికి మంజూరు చేయడం చూస్తే బ్యాంకర్ల పని తీరు ఎలా ఉందో ఇట్టే అర్థమైపోతుందన్నారు. స్టాండప్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి కేవలం 39.34 శాతం రుణాలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగైతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని, అప్పటికీ మార్పు రాకపోతే ఆయా శాఖల ఉన్నతాధికారులకు లేఖలు రాస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కింద రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఆయా పథకాల కింద లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంకర్లతో తరచూ సమీక్షలు చేయాలని ఎల్డీఎం, జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పశుసంవర్ధక, మత్స్య శాఖలకు చెందిన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేయాలని సూచించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి బ్యాంక్ లింకేజీ కోసం ప్రభుత్వం లక్ష్యాలను కేటాయించిందని, గడువులోగా రుణాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో 34 బ్యాంకులకు సంబంధించి 290 బ్రాంచీలు ఉండగా, 51 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్ల కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి, ఏర్పాటయ్యేలా చూడాలని ఎల్డీఎంను ఆదేశించారు. రైతులకు విరివిగా పంట రుణాలు అందించి, వారికి మేలు చేసేలా చొరవ చూపాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సౌకర్యార్థం మినీ బస్సు ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. గిట్టుబాటుపై ఒత్తిడి తీసుకురండి జిల్లాలో మిరప, పత్తి, పప్పుశనగ, సీడ్ జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతు సంఘం నాయకులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కోరారు. ఖరీఫ్, రబీ పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించి బాధిత రైతులతో పాటు కౌలు రైతులనూ ఆదుకోవాలని కోరుతూ ఎంపీకి వినతిపత్రం అందజేశారు. బ్యాంకర్ల తీరుపై కలెక్టర్ వినోద్కుమార్ అసహనం -
రోగులకు నాణ్యమైన సేవలందాలి
● వైద్య ఆరోగ్య శాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ అనంతపురం మెడికల్: రోగులకు నాణ్యమైన సేవలందించాలని సంబంధిత అధికారులను వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన అనంతపురంలోని ఆదిమూర్తినగర్లోని పట్టణ ఆరోగ్య కేంద్రం, రుద్రంపేటలోని విలేజ్ హెల్త్ క్లినిక్ను ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందించిన సేవలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ విధానానికి సంబంధించిన రిపోర్టులు, ఓపీ సేవల వివరాలు, మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల అమలుపై సిబ్బందితో సమీక్షించారు. వైద్య సేవల్లో నాణ్యత పెంచడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట డీఐఓ డాక్టర్ యుగంధర్, ఎన్హెచ్ఎం కిషోర్, ఫణి ఉన్నారు. అమ్మలా లాలిస్తూ అక్షరాలు నేర్పండి కూడేరు: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను అమ్మలా లాలిస్తూ అక్షరాలు, మంచి నడవడిక నేర్పుతూ వారి ఉజ్వల భవితకు పునాదులు వేయాలని కార్యకర్తలకు అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పిలుపునిచ్చారు. ‘పునాది స్థాయి అక్షరాస్యత, సంఖ్యా శాస్త్రం(ఎఫ్ఎల్ఎన్)’ కార్యక్రమం అమలుపై అంగన్వాడీ కార్యకర్తలకు కూడేరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆరు రోజుల శిక్షణా తరగతులను మంగళవారం డీఈఓ ప్రసాద్బాబుతో కలసి ఆమె ప్రారంభించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్(ఎస్ఎస్ఏ ఏపీసీ) శైలజ, ఏఎంఓ చంద్రశేఖర్రెడ్డి, ఐసీడీఎస్ పీడీ వనజా అక్కమ్మ హాజరయ్యారు. వినూత్న మాట్లాడుతూ.. అంగన్వాడీ స్థాయిలోనే పిల్లలకు చదువులపై ఆసక్తి పెంపొందేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పిల్లల పోషణపై అలసత్వం వీడాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి, ఏసీడీపీఓ యల్లమ్మ, ఎంఈఓలు–1, 2 మహమ్మద్ గౌస్, సాయికృష్ణ, సూపర్ వైజర్లు రాజేశ్వరి, అరుణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
చెలరేగిన ‘కేబుల్’ దొంగలు
యాడికి: మండలంలోని చందన గ్రామంలో కేబుల్ దొంగలు చెలరేగారు. తొమ్మిది మంది రైతులు బోరు బావులకు అనుసంధానం చేసిన విద్యుత్ కేబుల్ను సోమవారం రాత్రి కత్తిరించి ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం పంట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి లబోదిబో మన్నారు. ప్రతి బోరు బావి వద్ద స్టార్టర్ పెట్టెలోని ఫీజులు తొలగించి, కేబుల్ వైర్లు కత్తిరించి అపహరించడం గమనార్హం. ఘటనతో ప్రతి రైతు రూ. వెయి, నుంచి రూ. 2వేల వరకూ నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులకు బాధిత రైతులు ఓంకారయ్య, మధు, రామకృష్ణ, నాగేంద్ర, నాగయ్య, ఆదిరంగారెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. సరైన చికిత్సతో వంకర పాదాల సమస్య దూరం అనంతపురం మెడికల్: సరైన చికిత్సను అందివ్వడం ద్వారా చిన్నారుల్లో వంకర పాదాల సమస్యను నయం చేయవచ్చునని అమెరికాకు చెందిన క్యూర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ట్రైనర్ డాక్టర్ బ్రూస్స్మిత్ సూచించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని డీఈఐసీను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆర్థో విభాగాన్ని పరిశీలించి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వంకర పాదాలతో ఇబ్బంది పడుతున్న పలువురు చిన్నారులకు స్వయంగా చికిత్స చేయడంతో పాటు చికిత్స విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ వంకరపాదాలతో ఇబ్బంది పడిన 78 మంది పిల్లలకు క్యూర్ ఇండియా సంస్థ తరఫున డీబీ స్ల్పిట్లను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్థో హెచ్ఓడీ డాక్టర్ ఆత్మారాం, వైద్యులు డాక్టర్ సతీష్, రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమాధికారి డాక్టర్ నారాయణస్వామి పాల్గొన్నారు. -
పథకాలు దూరం చేసేందుకే ‘భూ ఆధార్’
అనంతపురం అర్బన్: రైతులకు సంక్షేమ ఫలాలు దూరం చేసేందుకే రైతు విశిష్ట సంఖ్య (భూ ఆధార్) నమోదుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, వెంటనే ఈ ప్రక్రియను ఆపేయాలంటూ కూటమి సర్కార్ను సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక గణేనాయక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆగమేఘాలపై రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగానే గడువు నిర్దేశించి, ఈ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. భూ ఆధార్ నమోదు చేసుకున్న వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం, పంటల బీమా వంటి సంక్షేమ పథకాలు వర్తిస్తాయని, నమోదు చేసుకోకపోతే పథకాలు వర్తించవంటూ ఓ విధంగా రైతులను రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. జిల్లాలో 70 శాతం మంది రైతులు ప్రభుత్వం నుంచి అసైన్మెంట్ భూములను పొందినవారే ఉన్నారన్నారు. భూ ఆధార్ నమోదు ప్రక్రియతో వీరంతా తీవ్రంగా నష్టపోతారన్నారు. భూమి లేని లక్షల మంది కౌలురైతులకు ఎలాంటి గుర్తింపు ఉండదన్నారు. వీరికి సంక్షేమ పథకాలు వర్తించవన్నారు. అలాగే చుక్కల భూములు ఉన్న రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చూపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు రక్షణ కల్పించాలని నల్లప్ప డిమాండ్ చేశారు. విద్యార్థులకు రక్షణ కల్పించడంలో, సమస్యల పరిష్కారంలో విఫలమైన వీసీని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. నమోదు ప్రక్రియను వెంటనే ఆపేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప డిమాండ్ -
ఎస్ఈ సంపత్ బదిలీ అశాసీ్త్రయం
● మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అనంతపురం కార్పొరేషన్: ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) సంతప్కుమార్ బదిలీ పూర్తి అశాసీ్త్రయంగా ఉందని, వెంటనే ఈ బదిలీని ఆపాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన సంపత్కుమార్ విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించేవారన్నారు. ఎలాంటి తప్పుడు ఆరోపణలు లేకున్నా కొందరి ప్రయోజనాల కోసం ఆయనను బదిలీ చేయడం సరికాదన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని కూటమి ప్రభుత్వం పదే పదే చెబుతున్నా.. ఆచరణలో కనీసం కనుచూపు మేరలోనూ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. సంపత్ కుమార్ విషయంలో ఉన్నతాధికారుల తీరును తప్పుబట్టారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడి మృతదేహం లభ్యం గుంతకల్లు రూరల్: కనిపించకుండా పోయిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు 24 గంటలు గడవక ముందే హంద్రీనీవా కాలువలో మృతదేహమై తేలాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లుకు చెందిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు తిరుమలరెడ్డి (45) గత ఆదివారం బుగ్గ సంగాల క్షేత్రం సమీపంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. కాగా, ఆయన మృతదేహం గుంతకల్లు–మద్దికెర మార్గంలోని హంద్రీ–నీవా ప్రధాన కాలువలో సోమవారం కొట్టుకువచ్చింది. తల, ముఖం, కాళ్లపై ఉన్న గాయాలను బట్టి తిరుమలరెడ్డి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, తిరుమలరెడ్డి అదృశ్యమైన ప్రాంతంలో దెబ్బతిన్న ఆయన బైక్ తప్ప ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. హతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, వ్యక్తుల పేర్లను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ అనుమానితుడిని ఇప్పటికే తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. తిరుమలరెడ్డి హత్యకు గురైనట్లు తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ నేత మంజునాథరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రికి చేరుకుని తిరుమలరెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. హతుడి భార్య, కుమార్తె, కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. రైతు ఆత్మహత్య యల్లనూరు: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లి గ్రామానికి చెందిన రైతు ఆంధ్ర శ్రీనివాసుల నాయుడు (62) భార్య పదేళ్ల క్రితమే మృతిచెందింది. అప్పటి నుంచి తన కుమారుడితో కలసి ఆయన ఉంటున్నాడు. కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయితే వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న శ్రీనివాసుల నాయుడు సోమవారం రాత్రి తన పాత ఇంట్లో నిల్వ చేసిన పురుగుల మందు తాగాడు. కాసేపటి తర్వాత తన స్నేహితుడు సద్దల చంద్రమౌళీశ్వరరెడ్డి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. వెంటనే స్పందించిన ఆయన, శ్రీనివాసులు నాయుడు కుమారుడు మధుసూదన్నాయుడు, బంధువులతో కలసి పాత ఇంటి వద్దకు చేరుకున్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న శ్రీనివాసుల నాయుడిని తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. మధుసూదన్నాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఉద్యోగులతో బంతాట
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పుణ్యమా అని జిల్లా అధికార యంత్రాంగంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఉన్నతాధికారులు సైతం ఉద్యోగం చేయాలంటే భయపడుతున్నారు. ఎప్పటివరకూ ఉంటామో.. ఎప్పుడు బదిలీ చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. శాఖల హెచ్ఓడీలకే దిక్కులేకుండా పోయిన పరిస్థితి. రాజకీయ జోక్యంతో రాత్రికి రాత్రే బదిలీలు జరుగుతుండటంతో పనిచేయాలంటేనే మనసొప్పడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు ఇప్పుడు తమ పనులు చేయకుంటే మెడపై కత్తి పెట్టి మరీ బదిలీ చేయిస్తున్న దుస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా కలెక్టర్ పూర్తిగా నిశ్చేష్టులై చూస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఈ బదిలీతో అలజడి.. కూటమి సర్కారు వచ్చేనాటికి ఉమ్మడి అనంతపురం జిల్లాకు విద్యుత్ శాఖ ఎస్ఈగా సురేంద్ర ఉండేవారు. ఈయనపై రాజకీయ ముద్రవేసి అనంతపురం జిల్లా ఎస్ఈగా తెచ్చారు. మడకశిర ఎమ్మెల్యే రాజు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు సంతకాలు చేసి మరీ ఆయన్ను తీసుకొచ్చారు. అయితే, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్కుమార్ నాలుగు నెలలు పని చేశారో లేదో ఉన్నఫళంగా రెండు రోజుల క్రితం బదిలీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా విద్యుత్శాఖలో అలజడి మొదలైంది. ఐదుగురు ఎస్పీలు.. కూటమి సర్కారు వచ్చాక జిల్లాకు ఐదుగురు ఎస్పీలు వచ్చి వెళ్లారు. ఎస్పీలపై ఇక్కడి నాయకులు పదే పదే అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. ఎన్నికల సమయంలో ఉన్న అన్బురాజన్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్లకే బదిలీ అయ్యారు. ఆ తర్వాత అమిత్ బర్దార్, గౌతమి శాలి, మురళీ కృష్ణలు వచ్చిన రెండు మాసాలకే తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుత ఎస్పీ జగదీష్పై కూడా బదిలీ కత్తి వేలాడుతోందని అంటున్నారు. సంతకం చేయకుంటే ఊడినట్లే.. కూటమి ప్రభుత్వంలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మరీ భ్రష్టు పట్టింది. ఇక్కడ ఐదు నెలల్లో ఐదుగురు కమిషనర్లు మారారు. నేతలు చెప్పిన చోట సంతకం చేయకపోతే మరుసటి రోజే బదిలీ కావాల్సి వస్తోంది. మేఘ స్వరూప్ అనంతరం నాగరాజు, రామలింగేశ్వర్, మల్లికార్జునరెడ్డిలు బదిలీ అయ్యారు. తాజాగా బాలస్వామి వచ్చారు. ఈయన ఎన్నాళ్లుంటారో తెలియని పరిస్థితి. దీంతో కార్పొరేషన్లో పాలన స్తంభించి పోయింది. రెండు నెలలు తిరక్కముందే ఏఎస్పీపై.. శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ డీఎస్పీగా ఉన్న ఆర్ల శ్రీనివాసులుకు ఇటీవల అడిషనల్ ఎస్పీగా పదోన్నతి వచ్చింది.అదే జిల్లాకు ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రశాంతంగా పనిచేస్తున్న సమయంలో ఉన్నఫళంగా ఆయనకు బదిలీ ఆర్డర్స్ వచ్చాయి. ఆ జిల్లా ఎస్పీకి నచ్చలేదని అడిషనల్ ఎస్పీని బదిలీ చేయించారనే విమర్శలొస్తున్నాయి. దీంతో శ్రీ సత్యసాయి జిల్లాలో పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు బదిలీలు ఆరుమాసాల్లో ఐదుగురు ఎస్పీలను మార్చిన వైనం అనంతపురం కార్పొరేషన్లో ఇష్టారాజ్యంగా కమిషనర్ల మార్పు తాజాగా విద్యుత్ శాఖ ఎస్ఈ బదిలీ అటకెక్కిన పాలన -
బరువెక్కిన గుండెతో వలసబాట
గుంతకల్లు రూరల్: మండలంలోని మొలకలపెంట గ్రామస్తులు ఒకరి తరువాత మరొకరు వలస బాట పడుతున్నారు. ఉపాధి పనులు కల్పించి ఆదుకోవా ల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో నిస్సహాయ స్థితిలో ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. 604 కుటుంబాలు, 2 వేలకు పైగా జనాభా ఉన్న మొలకలపెంట గ్రామంలో ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాభావం, వరుస తుపాన్ల కారణంగా ఖరీఫ్, రబీ పంటలు తుడిచి పెట్టుకు పోయాయి. కనీసం పెట్టుబడి కూడా చేతికి అందకపోవడంతో రైతన్నలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. తినడానికి తిండి గింజలు కూడా లేక పూట గడవని స్థితిలో పొట్ట చేతపట్టుకుని వలసబాట పడుతున్నారు. ఉపాధి ఊసేలేదు.. 421 జాబ్ కార్డులు, 796 మంది కూలీలు ఉన్న మొలకలపెంట గ్రామంలో ఇప్పటివరకూ ఉపాధి పనులు ప్రారంభించనే లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఫీల్డ్ అసిస్టెంట్ల ను బలవంతంగా తొలగించారు. స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో మొలకలపెంట ఫీల్డ్ అసిస్టెంట్కు ఉద్వాసన పలికిన అధికారులు.. కొత్త వారిని నియమించలేదు. దీంతో గ్రామంలో ఇప్పటి వరకూ ఉపాధి పనులు ప్రారంభం కాలేదు. ఈ ఒక్కటే కాదు.. గుంతకల్లు మండలంలోని మరో 7 గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం ఇప్పటివరకూ జరగలేదు. దీంతో పనులు దొరక్క గ్రామీణులు వలస పోవాల్సిన దుస్థితి నెలకొంది. మొలకలపెంట వ్యథ గ్రామంలో ఇప్పటికే వందకు పైగా ఇళ్లకు తాళాలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం -
జిల్లాలో బర్డ్ ప్లూ లేదు
వదంతులను నమ్మొద్దు. ఇప్పటి వరకూ జిల్లాలో ఎక్కడే గాని బర్డ్ఫ్లూ ప్రభావం లేదు. పశుసంవర్ధక శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మండలానికి రెండు చొప్పున ఆర్ఆర్టీంలు ఏర్పాటు చేశారు. ఈ బృందాల ద్వారా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఒకవేళ భయం వెన్నాడుతుంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్ అస్సలు తినొద్దు. గ్రిల్డ్ చికెన్, ఉడికీ ఉడకని చికెన్ తినొద్దు. చికెన్ను 160 ఫారెన్ హీట్ వేడిలో వండుకుని తింటే మంచిది. – సుబ్బారెడ్డి, వెటర్నరీ డాక్టర్, తాడిపత్రి -
వివాహిత దుర్మరణం
కణేకల్లు: ద్విచక్ర వాహనంఅదుపు తప్పి కింద పడిన ఘటనలో ఓ వివాహిత దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ, అనసూయమ్మ (38) దంపతులు. మంగళవారం ఉదయం బొమ్మనహళ్ మండలంలోని కృష్ణాపురంలో జరిగిన బంధువుల పెళ్లికి తన భార్యతో కలసి ద్విచక్ర వాహనంపై సత్యనారాయణ వెళ్లాడు. అనంతరం రాయదుర్గం మండలంలోని కదరంపల్లిలో ఉన్న అత్తారింటికి బయలుదేరాడు. సాయంత్రం 6 గంటల సమయంలో కణేకల్లు క్రాస్లోని ఆర్డీటీ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో అనసూయమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి వృషభాల బల ప్రదర్శన
గుత్తి రూరల్: మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృషభాల బలప్రదర్శన మంగళవారం ముగిసాయి. ఆరు పళ్లు, న్యూ కేటగిరి, సీనియర్ విభాగాల్లో జరిగిన పోటీలు హోరాహోరీగా సాగాయి. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, నంద్యాల, అన్నమయ్య జిల్లాలకు చెందిన వృషభాలు పాల్గొన్నాయి. సీనియర్ విభాగం పోటీల్లో నంద్యాల జిల్లా గుంపరమానుదిన్నెకు చెందిన రైతు కుందూరు రాంభూపాల్రెడ్డి వృషభాలు మొదటి స్థానం, వైఎస్సార్జిల్లా కల్లూరుకు చెందిన రైతు పెరుమాల్ శివకృష్ణయాదవ్ వృషభాలు రెండవ స్థానం, అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురానికి చెందిన రైతు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి వృషభాలు మూడవ స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులను అభినందిస్తూ నగదు ప్రోత్సాహాకాలను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ అందజేశారు. అలాగే సీనియర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వృషభాల యజమానికి ఓ పాడి ఆవును రైతులు రమేష్రెడ్డి, చిలుకూరు కుమార్రెడ్డి బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు చిన్నరెడ్డి యాదవ్, రంగస్వామిరెడ్డి యాదవ్, లక్ష్మీరంగయ్య పాల్గొన్నారు. -
రాయితీతో మామిడి ఫ్రూట్ కవర్లు
● హెక్టారుకు రూ.10 వేలు ప్రోత్సాహం అనంతపురం అగ్రికల్చర్: మామిడిలో నాణ్యమైన దిగుబడుల కోసం రైతులకు ప్రోత్సాహక రాయితీలు అందించనున్నట్లు ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాయలు మంచి పండ్లుగా తయారవడానికి వీలుగా రాయితీతో రక్షణ కవచం (ఫ్రూట్ కవర్) రాయితీతో ఇస్తామన్నారు. ఒక్కో కవర్ రూ.2 కాగా 50 శాతం రాయితీతో గరిష్టంగా ఒక హెక్టారుకు రూ.10 వేల వరకు రాయితీ వర్తింపజేస్తామన్నారు. కాయలు కోడిగుడ్డు సైజులో ఉన్నపుడు కవర్లు చుట్టాలన్నారు. గాలి చొరబడకుండా తొడిమ వరకు కట్టాలన్నారు. దీంతో ఊజీ ఈగ, తేనెమంచు పురుగు, మచ్చలు, తామర పురుగుల నుంచి రక్షణ ఉంటుందన్నారు. అధిక సూర్యరశ్మి, వడగండ్ల వాన నుంచి కూడా కాపాడుకోవచ్చన్నారు. తొడిమ కూడా దృఢంగా తయారై మంచి సైజు వస్తుందన్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వల్ల రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఉద్యానశాఖ అధికారులు లేదా రైతు భరోసా కేంద్రాల అసిస్టెంట్లను సంప్రదించాలన్నారు. సుదర్శనరావుకే వీసీ బాధ్యతలు అనంతపురం: ఇన్చార్జ్ వీసీగా ఉన్న ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావుకే ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యతలు కట్టబెట్టింది. జేఎన్టీయూ (ఏ) నూతన వీసీగా ఆయనను నియమిస్తూ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫెసర్ సుదర్శనరావు జేఎన్టీయూ(ఏ) ఇంజినీరింగ్ కళాశాలలోనే బీటెక్ పూర్తి చేశారు. ఇక్కడే చదివి అత్యున్నత స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించే అవకాశం దక్కడం గమనార్హం. గతంలో జేఎన్టీయూ అనంతపురంలో మూడున్నర సంవత్సరాలు ఆయన రెక్టార్గా పనిచేశారు. బుధవారం ఆయన పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు పుట్లూరు: రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మండలంలో రీ సర్వే జరిగిన గ్రామాల్లో మంగళవారం కలెక్టర్ వినోద్కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూరేపల్లి రెవెన్యూ గ్రామ 167 ఎల్పీఎం నంబర్లో 6.04 ఎకరాలు జాయింట్గా నమోదు కావడంతో రైతులు సబ్డివిజన్ చేయాలని ఇటీవల వినతి పత్రం అందించారన్నారు. తహసీల్దార్ శేషారెడ్డి, సర్వేయర్లు రైతులకు నోటీసులు అందించి హద్దులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం మండలంలోని అరకటివేముల గ్రామ సచివాలయం నుంచి జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డీపీఓ నాగరాజునాయుడు, డీఎల్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు రోజూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలన్నారు. హౌస్హోల్డ్ మిస్సింగ్ సిటిజన్ ప్రక్రియను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. 24న ‘పీఎం కిసాన్’! అనంతపురం అగ్రికల్చర్: పీఎం కిసాన్ కింద ఈనెల 24న రైతుల ఖాతాల్లోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.2 వేల చొప్పున జమ చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. జూన్, అక్టోబర్, జనవరిలో విడతకు రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఏటా రూ.6 వేల ప్రకారం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి కాస్త ఆలస్యంగా ఫిబ్రవరిలో మూడో విడతగా 2.90 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.58 కోట్లు విడుదల కావొచ్చని చెబుతున్నారు. మొదటి రెండు విడతలతో పోలిస్తే మూడో విడతలో మరికొందరు రైతులు ‘పీఎం కిసాన్’కు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. -
చెలరేగిన ‘కేబుల్’ దొంగలు
యాడికి: మండలంలోని చందన గ్రామంలో కేబుల్ దొంగలు చెలరేగారు. తొమ్మిది మంది రైతులు బోరు బావులకు అనుసంధానం చేసిన విద్యుత్ కేబుల్ను సోమవారం రాత్రి కత్తిరించి ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం పంట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి లబోదిబో మన్నారు. ప్రతి బోరు బావి వద్ద స్టార్టర్ పెట్టెలోని ఫీజులు తొలగించి, కేబుల్ వైర్లు కత్తిరించి అపహరించడం గమనార్హం. ఘటనతో ప్రతి రైతు రూ. వెయి, నుంచి రూ. 2వేల వరకూ నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులకు బాధిత రైతులు ఓంకారయ్య, మధు, రామకృష్ణ, నాగేంద్ర, నాగయ్య, ఆదిరంగారెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. సరైన చికిత్సతో వంకర పాదాల సమస్య దూరం అనంతపురం మెడికల్: సరైన చికిత్సను అందివ్వడం ద్వారా చిన్నారుల్లో వంకర పాదాల సమస్యను నయం చేయవచ్చునని అమెరికాకు చెందిన క్యూర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ట్రైనర్ డాక్టర్ బ్రూస్స్మిత్ సూచించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని డీఈఐసీను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆర్థో విభాగాన్ని పరిశీలించి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వంకర పాదాలతో ఇబ్బంది పడుతున్న పలువురు చిన్నారులకు స్వయంగా చికిత్స చేయడంతో పాటు చికిత్స విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ వంకరపాదాలతో ఇబ్బంది పడిన 78 మంది పిల్లలకు క్యూర్ ఇండియా సంస్థ తరఫున డీబీ స్ల్పిట్లను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్థో హెచ్ఓడీ డాక్టర్ ఆత్మారాం, వైద్యులు డాక్టర్ సతీష్, రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమాధికారి డాక్టర్ నారాయణస్వామి పాల్గొన్నారు. -
రోగులకు నాణ్యమైన సేవలందాలి
● వైద్య ఆరోగ్య శాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ అనంతపురం మెడికల్: రోగులకు నాణ్యమైన సేవలందించాలని సంబంధిత అధికారులను వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన అనంతపురంలోని ఆదిమూర్తినగర్లోని పట్టణ ఆరోగ్య కేంద్రం, రుద్రంపేటలోని విలేజ్ హెల్త్ క్లినిక్ను ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందించిన సేవలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ విధానానికి సంబంధించిన రిపోర్టులు, ఓపీ సేవల వివరాలు, మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల అమలుపై సిబ్బందితో సమీక్షించారు. వైద్య సేవల్లో నాణ్యత పెంచడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట డీఐఓ డాక్టర్ యుగంధర్, ఎన్హెచ్ఎం కిషోర్, ఫణి ఉన్నారు. అమ్మలా లాలిస్తూ అక్షరాలు నేర్పండి కూడేరు: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను అమ్మలా లాలిస్తూ అక్షరాలు, మంచి నడవడిక నేర్పుతూ వారి ఉజ్వల భవితకు పునాదులు వేయాలని కార్యకర్తలకు అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పిలుపునిచ్చారు. ‘పునాది స్థాయి అక్షరాస్యత, సంఖ్యా శాస్త్రం(ఎఫ్ఎల్ఎన్)’ కార్యక్రమం అమలుపై అంగన్వాడీ కార్యకర్తలకు కూడేరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆరు రోజుల శిక్షణా తరగతులను మంగళవారం డీఈఓ ప్రసాద్బాబుతో కలసి ఆమె ప్రారంభించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్(ఎస్ఎస్ఏ ఏపీసీ) శైలజ, ఏఎంఓ చంద్రశేఖర్రెడ్డి, ఐసీడీఎస్ పీడీ వనజా అక్కమ్మ హాజరయ్యారు. వినూత్న మాట్లాడుతూ.. అంగన్వాడీ స్థాయిలోనే పిల్లలకు చదువులపై ఆసక్తి పెంపొందేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పిల్లల పోషణపై అలసత్వం వీడాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి, ఏసీడీపీఓ యల్లమ్మ, ఎంఈఓలు–1, 2 మహమ్మద్ గౌస్, సాయికృష్ణ, సూపర్ వైజర్లు రాజేశ్వరి, అరుణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించిన ‘గురుకుల’ విద్యార్థులు
బుక్కరాయసముద్రం: ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు మహారాష్ట్రలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బీకేఎస్ మండలం కొర్రపాడులో ఉన్న ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. లాంగ్జంప్ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి ఇందు, 6వ తరగతి విద్యార్థి నవ్యశ్రీ వెండి పతకాలు సాధించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ శ్యామలాదేవి, పీఈటీలు వరలక్ష్మి , తేజస్విని, హేమ, శ్యామలమ్మ అభినందించారు. కాలువలో పడి విద్యార్థి మృతి గుమ్మఘట్ట: ప్రమాదవశాత్తు సాగునీటి కాలువలోని నీటి ప్రవాహంలో పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు... బేలోడుకు చెందిన అన్నపూర్ణకు 11 సంవత్సరాల క్రితం గలగల గ్రామానికి చెందిన లోకేష్తో వివాహమైంది. అనారోగ్యంతో 2020లో అన్నపూర్త మృతి చెందింది. అప్పటి నుంచి వారి కుమారుడు జాని పోషణను అమ్మమ్మ హనుమక్క, తాత హనుమప్ప తీసుకున్నారు. ప్రస్తుతం జాని (7) బేలోడులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన జాని.. మధా్య్హ్నం తోటి స్నేహితుడు లక్కీతో కలసి గ్రామ సమీపంలోని బీటీపీ సాగునీటి కాలువ వద్దకెళ్లాడు. అప్పటికే సిద్దంగా ఉంచుకున్న గాలాన్ని తీసి కాలువలో వేసే క్రమంలో జాని ప్రమాదవశాత్తు అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. ఆ సమయంలో లక్కీ కేకలు విన్న చుట్టుపక్కల పొలాల్లోని రైతులు అక్కడకు చేరుకుని జానీని వెలికి తీశారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని వెంటనే రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళితే.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చికోటి ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు గుంతకల్లు టౌన్: ధర్మరక్ష వ్యవస్థాపకుడు, తెలంగాణ బీజేపీ నేత చికోటి ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం గుంతకల్లు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పొట్టిశ్రీరాములు సర్కిల్లో ఏర్పాటు చేసిన సభనుద్దేశించి చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. మత ప్రబోధకుల్లో 90 శాతం మంది సరిగా లేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నినదిస్తే హైదరాబాద్లోని ఒవైసీతో పాటు ఇతరులకు వణుకు పుట్టాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రతిచోటా హిందుత్వానికి శత్రువులు ఎక్కువయ్యారని, సెక్యులర్ వాదులను తాను శిఖండీలుగా అభివర్ణిస్తున్నానని అన్నారు. -
చికెన్ కర్రీస్ కాదు.. బర్డ్ఫ్లూ వైరస్ వర్రీనే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో బర్డ్ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమై పశుసంవర్దక శాఖ ద్వారా చర్యలు చేపట్టింది. దీంతో కోడి మాంసం కొనుగోలుదారులు లేక జిల్ల
తాడిపత్రి రూరల్: జిల్లాలోని చికెన్ సెంటర్లపై బర్డ్ ప్లూ ప్రభావం పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ప్లూ వ్యాపించి లక్షలాది కోళ్లు మృత్యువాత పడడం జిల్లా ప్రజలను కలవరపెడుతోంది. జిల్లాలో బర్డ్ ప్లూ ప్రభావం లేదని పశు సంవర్దక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నా.. ప్రజల్లో మాత్రం భయం వీడడం లేదు. చికెన్ తిని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అనే ధోరణి సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో కొనుగోలుదారులు లేక చికెన్ సెంటర్లు వెలవెలపోతున్నాయి. ఫలితంగా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి కోళ్ల పెంపకం చేపట్టిన వారు ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నారు. కర్ణాటక నుంచే దిగుమతి జిల్లాలోని కంబదూరు, కళ్యాణదుర్గం, కుందుర్పి, పామిడి తదితర ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించింది. పేరొందిన వెంకోబ్, సుగుణ,స్నేహ, లోటస్ తదితర కంపెనీలు ఆయా ప్రాంతాల్లో రైతులకు కోడి పిల్లలను పంపిణీ చేసి పెంపకాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటి వరకూ జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమ నుంచే మిగిలిన ప్రాంతాలకు కోళ్లు సరఫరా అయ్యేవి. బర్డ్ఫ్లూ ప్రభావం కారణంగా ప్రస్తుతం కర్ణాటక ప్రాంతంలోని బెంగళూరు, పావగడ, చిక్కబళ్లాపూర్, దొడ్డబళ్లాపురం, చిత్రదుర్గ ప్రాంతల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. నెలకు 20 లక్షల కిలోలకు పైగా అమ్మకాలు జిల్లా వ్యాఫ్తంగా 1,500 నుంచి 2వేల వరకు చికెన్ సెంటర్లు ఉన్నాయి. ఆయా చికెన్ సెంటర్ల నుంచి నెలకు 20లక్షల కిలోలకు పైగా అమ్మకాలు జరుగుతుండేవి. పండుగలు, ఇతర శుభ కార్యాల్లో దీనికి అదనంగా విక్రయాలు సాగేవి. వందల సంఖ్యలో కుటుంబాలు చికెన్ కబాబ్ బండ్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాయి. దాదాపు 10వేల మందికి పైగా స్థానికులు, స్థానికేతరులు నెలసరి జీతాలకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం బర్డ్ ప్లూ ప్రభావంతో వీరి జీవనం దుర్భరంగా మారింది. సగానికి పైగా వ్యాపారం పడిపోవడంతో చికెన్ విక్రేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ల నిర్వహణకు తీసుకున్న గదులకు సంబంధించి అద్దెలు చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. అద్దెలు, కార్మికులు, విద్యుత్ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పశు సంవర్దక శాఖ అప్రమత్తత జిల్లాల్లో బర్డ్ ప్లూపై పశుసంవర్దక శాఖ అప్రమత్తంగా ఉంది. కోస్తా ప్రాంతంలో కనిపించిన బర్డ్ ప్లూ వైరస్ జిల్లాను తాకకుండా ప్రతి మండలానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ఆర్ఆర్టీ)ను ఏర్పాటు చేసింది. ఇందులో వెటర్నరీ డాక్టర్తో పాటు నలుగురు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈ బృందాలు పౌల్ట్రీ పరిశ్రమలను పరిశీలించి కోళ్లకు వైద్యపరీక్షలు నిర్వహిస్తాయి. అనుమానిత కోళ్ల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపుతున్నారు. బర్డ్ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ సేల్స్ ఢమాల్ సగానికి పైగా తగ్గిన వ్యాపారం కొనుగోలుదారులు లేక చికెన్ సెంటర్ల వెలవెల ఆందోళనలో పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు -
ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరి అరెస్ట్
ఉరవకొండ: వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. మంగళవారం ఉరవకొండ పీఎస్లో ఏర్పాఉట చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్ఐ జనార్దననాయుడు వెల్లడించారు. స్థానిక కుమ్మర వీధిలో నివాసముంటున్న కిషోర్కుమార్ (39), దాసరి కేదార్నాథ్, కమ్మరి హరికృష్ణ, మరో ఇద్దరు స్నేహితులు. ముగ్గురూ కొంత కాలంగా ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారు. ఈ క్రమంలో రూ.9 లక్షల వరకూ నష్టపోయారు. దీంతో కిషోర్కుమార్ ప్రమేయం వల్లనే తాము నష్టపోయామని, ఆన్లైన్ బెట్టింగ్లో పొగొట్టుకున్న డబ్బు మొత్తాన్ని చెల్లించాల్సిందేనంటూ కొంత కాలంగా నలుగురు స్నేహితులూ తీవ్ర ఒత్తిడి చేశారు. ఈ క్రమంలోనే ఇంటి వద్ద గొడవ చేసి మాటలతో హింసించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిషోర్కుమార్ ఈ నెల 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం ఉరవకొండ శివారున కేదార్నాథ్, హరికృష్ణను అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యువకుడి ఆత్మహత్య
కణేకల్లు: మండలంలోని 43 ఉడేగోళం గ్రామానికి చెందిన బోయ ఈశ్వర్ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... నిరుపేద కుటుంబానికి చెందిన ఈశ్వర్కి రెండేళ్ల క్రితం డి.హిరేహళ్ మండలం పులకుర్తి గ్రామానికి చెందిన కావేరితో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. కూలీ పనులతో కుటుంబాన్ని పోషించుకునే ఈశ్వర్ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానేయమని భార్య పలుమార్లు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్థాపం చెందిన ఆమె కుమారుడిని పిలుచుకుని మంగళవారం సాయంత్రం తన పుట్టింటికెళ్లింది. దీంతో అత్తింటి వారు మందలిస్తారేమోననే అనుమానంతో మంగళవారం రాత్రి 7.30 గంటలకు తాము నివాసముంటున్న గుడిసెలోనే ఈశ్వర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు కొన్ని...
జిల్లా అంతటా మంగళవారం చలి వాతావరణం కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ● అనంతపురం శివారులోని సోములదొడ్డి వద్ద ఉన్న నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి చరణ్ మూడు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ●● గార్లదిన్నె సమీపంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాల ఆవరణలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● అనంతపురం బళ్లారి రోడ్డులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ● ఇటీవల సోములదొడ్డి సమీపంలో శ్రీచైతన్య రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. వారం తర్వాత తిరుమలలో ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ● రెండేళ్ల క్రితం భవ్యశ్రీ అనే ఇంటర్ విద్యార్థిని అనంతపురం నగరంలోని నారాయణ క్యాంపస్ బిల్డింగ్ పై నుంచి దూకింది. సుదీర్ఘకాలం చికిత్స పొంది అదృష్టవశాత్తూ మృత్యువు నుంచి బయటపడింది. -
సాయీశ్వరా.. మముబ్రోవరా
ప్రశాంతి నిలయం: సాయీశ్వర నామంతో ప్రశాంతి నిలయం మార్మోగింది. సత్యసాయి.. ఈశ్వరుడి ప్రతిరూపమంటూ కీర్తించారు. సాయీశ్వరా...మముబ్రోవరా అంటూ వేడుకున్నారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రశాంతి నిలయంలో చేపట్టిన అతిరుద్ర మహాయజ్ఞంలో భాగంగా నార్త్ బిల్డింగ్స్ మైదానంలో చేపట్టిన అష్టోత్తర శత సహస్త్ర సాయీశ్వర లింగార్చన ఘట్టం మంగళవారం ముగిసింది. చివరి రోజు లింగార్చనలో పాల్గొన్న భక్తులు ప్రత్యేకంగా రూపొందించిన సాయీశ్వర లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్రాజు దంపతులు సాయీశ్వరునికి పూజలు నిర్వహించారు. ఇక అతిరుద్ర మహాయజ్ఞం 6వ రోజు మంగళవారమూ కొనసాగింది. వేదపండితులు వేదమంత్రోచ్ఛారణ మధ్య యజ్ఞ క్రతువు నిర్వహించారు. సాయంత్రం ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసుడు సంబుద్దా ఛటర్జీ బృందం సంగీత కచేరీ భక్తులను ఆకట్టుకుంది. జ్యోతిష్య శాస్త్ర ఉపన్యాసకులు డాక్టర్ ఎస్.మురళీ భక్తులనుద్దేశించి ప్రసంగించారు. -
జవాన్కు కన్నీటి వీడ్కోలు
బ్రహసముద్రం : బీఎస్ఎఫ్ జవాన్ వడ్డే లక్ష్మన్నకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆర్మీ సిబ్బంది కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. ఢిల్లీ సమీపంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన వడ్డే లక్ష్మన్న (33) భౌతికకాయం ఆదివారం అర్ధరాత్రి స్వగ్రామం బ్రహ్మసముద్రానికి అధికారులు తీసుకువచ్చారు. కుమారుడిని చూసి తల్లిదండ్రులు సుశీలమ్మ, రామచంద్రప్ప గుండెలవిసేలా రోదించారు. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఉదయం జవాన్ భౌతికాయాన్ని ప్రతేక వాహనంలో ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. వందలాది మంది అభిమానుల మధ్య ‘వీరుడా... నీకు వందనం.. అమరుడా లక్ష్మన్నా నీకు వందనం’ అంటూ ఆర్మీ అధికారులు నినదించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి జైజవాన్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పశువైద్యశాల సమీపాన శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బీఎస్ఎఫ్ ఎస్ఐ మాధవ్రావ్, హెడ్కానిస్టేబుల్ మాంతేష్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర భద్రత బలగాలు కవాతు నిర్వహించారు. జవాన్ భౌతికకాయంపై ఉన్న జాతీయ జెండాను వారి కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం కుటుంబ సభ్యుల కడసారి వీడ్కోలు అనంతరం ఆర్మీ అధికారులు గౌరవ వందనం సమర్పించి మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కార్యక్రమంలో సీఐ నీలకంఠేశ్వర్ , తహశీల్దార్ సుమతి, ఎస్ ఐ నారేంద్రకుమార్ , ఆర్ ఐ నాగిరెడ్డి, ఎంపీడీఓ నందకిశోర్, ఎంఈఓ ఓబుళపతి, క్రిష్ణానాయక్, ఎంపీపీ చంద్రశేకర్ రెడ్డి జెడ్పీటీసీ ప్రభవతి రాజకీయ పార్టీల నాయకులు పలువురు పాల్గొన్నారు. -
వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలి
అనంతపురం అర్బన్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మహర్షి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (ఎంవీఆర్పీఎస్), రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం (ఆర్వీఎస్ఎస్) సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులికొండన్న, ఆర్వీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణమూర్తి మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. వాల్మీకి/ బోయల చరిత్ర చాలా గొప్పదన్నారు. పురాతన పద్ధతులు, సంస్కృతి కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నామన్నారు. అటవీ చట్టాల కారణంగా బోయలు అడవిని వదిలి జీవనోపాధికి మైదాన ప్రాంతాల్లోకి వలస వచ్చారన్నారు. రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో వాల్మీకి/ బోయలు ఎస్టీలుగా కొనసాగుతున్నారన్నారు. మిగిలిన జిల్లాల్లో కోస్తా, ముఖ్యంగా రాయలసీమ జిలాల్లో వాల్మీకులు/ బోయలుగా బీసీలుగా ఉండడం దురదృష్టకరమన్నారు. ఇది తమ జాతి అభివృద్ధికి గొడ్డలిపెట్టని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.జి.నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి దేవాదుల గోపాల్, ఆర్వీఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్లపల్లి మోహన్, స్వర్ణక్క, శివప్రసాద్, సురేభాష్, నాయ్యవాది చంద్రాచర్ల హరి, తదితరులు పాల్గొన్నారు. -
సకాలంలో పరిష్కారం చూపాలి
అనంతపురం: మహిళల ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కారం చూపాలని ఎస్పీ పి.జగదీష్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో ఎస్పీ 80 అర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ మహబూబ్బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈగా శేషాద్రి శేఖర్ అనంతపురం టౌన్: విద్యుత్ శాఖ ఎస్ఈగా శేషాద్రి శేఖర్ను నియమిస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కళ్యాణదుర్గం ఈఈగా పనిచేస్తున్న శేషాద్రిశేఖర్కు ఎస్ఈగా పదోన్నతి కల్పించారు. దీంతో సాయంత్రమే ఆయన ఎస్ఈగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఈ సంపత్ కుమార్ను కార్పొరేట్ కార్యాలయంలో సీజీఎంగా బదిలీ చేశారు. -
మందకొడిగా రైతు రిజిస్ట్రేషన్లు
అనంతపురం అగ్రికల్చర్: ఆధార్ నంబర్ మాదిరిగా రైతులకు ఐడీ నంబర్లు కేటాయించేందుకు చేపడుతున్న రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోంది. ఆర్ఎస్కే అసిస్టెంట్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే, కనీక సదుపాయాలు కల్పించకుండానే రంగంలోకి దించడంతో సమస్య తలెత్తుతున్నట్లు తెలిసింది. నాలుగు రోజులుగా అగ్రీ స్టాక్ యాప్లో రైతుల రిజిస్ట్రేషన్లు చేపడుతున్నారు. అయితే యాప్లో నెలకొన్న సాంకేతిక కారణాల వల్ల డీ–పట్టా భూములు కలిగిన రైతులకు, ఒకే సర్వే నంబరుతో ఇద్దరు, ముగ్గురికి భూములు కలిగిన వారికి ఐడీ నంబరు కేటాయింపు జరగడం లేదని సమాచారం. ఇలాంటి వారు జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. వీరందరికీ ఐడీ నంబరు లేకుండా మున్ముందు ప్రభుత్వ పథకాల వర్తింపులో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. పంట నమోదు, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, యాంత్రీకరణ, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఎంఎస్పీ అమ్మకాలు తదితర అన్ని రకాల పథకాలు వర్తించాలంటే రైతుకు తప్పనిసరిగా ప్రత్యేక ఐడీ నంబరు ఉండాలని షరతు విధించడంతో చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా పీఎం కిసాన్ కింద రిజిస్టర్ అయిన 2.79 లక్షల రైతుల అకౌంట్ల ఆధారంగా ఐడీ నంబరు కేటాయిస్తున్నారు. నెలాఖరుకు 40 శాతం పూర్తీ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికి 32 వేల మంది రైతుల రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గుంతకల్లు, తాడిపత్రి, కణేకల్లు, పెద్దవడుగూరు, గుత్తి మండలాల్లో మాత్రమే 2 వేలకు పైగా పూర్తి కాగా... కుందుర్పి, వజ్రకరూరు, శెట్టూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, శింగనమల తదితర మండలాల్లో ఇంకా 200 నుంచి 400 మంది రైతుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. -
ఉపాధి పనుల్లో భారీగా అక్రమాలు
రాయదుర్గం: కూటమి అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు, అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ పథకం కూలీలకు కాకుండా కూటమిలోని కొందరు కాంట్రాక్టర్లకు వరంగా మారిందన్నారు. సోమవారం రాయదుర్గంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు హాజరైన ఆయన జిల్లాలోని పలు మండలాల ఎంపీపీలు, సర్పంచులతో కలసి కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో రవీంద్రారెడ్డి మాట్లాడారు. అధికార పార్టీ చెప్పిన వారికి ఉపాధి పనులను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కూలీలతో కాకుండా ఉపాధి పనులను కాంట్రాక్టర్లకు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్కళ్యాణ్ ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు. ఉపాధి పనులు జరిగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాల్సిన నేమ్బోర్టుల బిల్లుల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందించారు. నేమ్బోర్డుల నిధులు తమ బందువుల వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్న వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. కార్యక్రమంలో రాయదుర్గం మండల కన్వీనర్ రామాంజినేయులు, స్థానిక నాయకుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూలీలకు కాకుండా కాంట్రాక్టర్తో పనులు ఎలా చేయిస్తారు? -
రైతులను ఆదుకోని ప్రభుత్వం
అనంతపురం అర్బన్: రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తరిమెల నాగరాజు, ఆర్.చంద్రశేఖర్రెడ్డి ధ్వజమెత్తారు. రబీలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని, మిరప, పత్తి, పప్పుశనగ, విత్తన జొన్నకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట పంట ఉత్పత్తులతో రైతులతో కలిసి ధర్నా చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఖరీఫ్, రబీలో పండించిన మిరప, పత్తి, సీడ్ జొన్న, పప్పుశనగ పంటలకు గిట్టుబాటు ధరలేక దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రబీలో దాదాపు 57 వేల హెక్టార్లలో పప్పుశనగ సాగు చేశారన్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఎకరాకు దిగుబడి రెండు నుంచి మూడు క్వింటాళ్లు కూడా రాలేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలన్నారు. మద్దతు ధర క్వింటాలు రూ.5,560ను రూ.10 వేలకు పెంచి కొనుగోలు చేయాలన్నారు. పత్తి పంట మద్దతు ధర రూ.7,250 నుంచి రూ.10 వేలకు పెంచి షరతులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. విత్తన జొన్న రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో దళారుల జోక్యం లేకుండా కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మిరపకు గిట్టుబాటు ధర కింటాలుకు రూ.50 వేలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ధర్నా వద్దకు విచ్చేసిన కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్కు నాయకులు వినతిపత్రం అందజేసి రైతుల పరిస్థితిని వివరించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, ఉపాధ్యక్షులు శివారెడ్డి, బీహె చ్ రాయుడు, మధుసూదన్, నాయకులు పొతులయ్య, వెంకటేష్, ఈరప్ప, నారాయణరెడ్డి, నాగమ్మ, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శుల ధ్వజం గిట్టుబాటు ధర, పరిహారం కోసం డిమాండ్ కలెక్టరేట్ ఎదుట పంట ఉత్పత్తులతో ధర్నా -
మహిళలకు రక్షణ కరువు
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో మహిళలు, విద్యార్థినులకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖ్ యాదవ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ధ్వజమెత్తారు. ఇటీవల అన్నమయ్య జిల్లాలో యువతిపై హత్యాయత్నం, అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినుల బాత్రూమ్లో బిహార్ యువకులు తొంగిచూసిన ఘటన కూటమి మంత్రి వర్గానికి కన్పించలేదా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్గా పరిగణించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు అండగా నిలుస్తామన్న పవన్ కళ్యాణ్ పూజలకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నగరాధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, విద్యార్థి విభాగం నాయకులు భారతి, నరేష్, మహేశ్వరి, శేఖర్, భాను, అనిత, చందు, రాజేష్, సూర్య, రమేష్, అరుణ్యాదవ్, కరుణాకర్, శివ, శశికళ, పాల్గొన్నారు. ● వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల నేతల ధ్వజం