breaking news
Annamayya District News
-
పెట్టుబడి నష్టం
ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు నష్టాలు కలిగించాయి. ఐదెకరాల పొలంలో వేరుశనగ పంటను సాగు చేస్తే పెట్టుబడి దక్కలేదు. కుటుంబంతో కలిసి చేసిన కష్టానికి తోడు రూ.50వేల పెట్టుబడి పెడితే రూ.15వేలు దక్కింది. జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం కింద సాయం అందిస్తుందని ఆశించినా ఇప్పటిదాక ఎలాంటి సహాయం అందలేదు. – బయ్యారెడ్డి, గుగ్గిళ్లపల్లె రైతు, పెద్దతిప్పసముద్రం గత ప్రభుత్వంలో లీటర్ పాలకు రూ.45 ధర ఇచ్చేవారు. అందులోనే రూ.4 ప్రోత్సాహక రాయితీ అందేది. ప్రస్తుత పరిస్థితుల మేరకు పాలధర పెరగాల్సి ఉన్నా పెరగలేదు. ఇప్పుడు లీటర్కు రూ.35–40 ఇస్తున్నారు. నాలుగు పాడిఆవులతో రోజుకు 40 లీటర్ల పాలును పోస్తున్నాను. గత ప్రభుత్వంలో 15 రోజులకోసారి రూ.18వేల దాక పాలబిల్లు వచ్చేది. ఇప్పుడు తగ్గిపోయింది. ఆర్థికంగా ఆదాయం పెరగడం లేదు. – గంగాధర, దిగువపల్లె పాడిరైతు, నిమ్మనపల్లె 2024లో మూడెకరాలు, 2025లో ఐదెకరాల్లో ఖరీఫ్ పంటగా వేరుశనగను సాగు చేస్తే వర్షాభావంతో పంటలు ఎండిపోయాయి. రెండు ఖరీఫ్లలో సాగుచేసిన పంటలకు దిగుబడులు దక్కక పూర్తిగా నష్టం వాటిల్లింది. రూ.1.20 లక్షలు పెట్టుబడి పెడితే కష్టానికి ఫలితంలేదు, పెట్టుబడి దక్కలేదు. ప్రభుత్వం పరిహారం ఇస్తుందని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. ఇప్పటికై నా పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – చిన్న నారాయణ, మర్రిమాకులపల్లె రైతు, తంబళ్లపల్లె -
చుకు చుకు బండి.. పండక్కు లేదండి !
● ప్రత్యేక రైళ్లకు మొండిచెయ్యి ● కడప, తిరుపతి జిల్లా లైనులో ప్రయాణం కష్టం రాజంపేట : కడప, తిరుపతి జిల్లా రైలుమార్గంలో ప్రయాణం పట్టాలు తప్పింది. జిల్లాకు ఒక్కటంటే ఒక్కటి కూడా సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలు వేయలేదన్న విమర్శలను రైల్వేశాఖ మూటగట్టుకుంది. తమకు ఉపయోగకరంగా ఉంటుందనే పేద, మధ్య తరగతి ప్రయాణికుల ఆవేదన రైల్వేశాఖ పట్టించుకోలేదు. తెలంగాణ, కర్నాటకతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న వారికి రెగ్యులర్ ట్రైన్లో రావాలంటే ప్రయాణం కష్టతరంగా మారింది. సంక్రాంతి రైళ్లేవీ లేకపోవడంతో స్వంత ఊళ్లకు రావాలంటే తలప్రాణం తోకకు వచ్చేలా తయారైంది. సంక్రాంతి రైళ్లు అన్నీ సర్కారు ప్రాంతం వైపే పరుగులు తీశాయి. సీమ రైల్వేలపై నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. నడుస్తున్న వారంతపు రైళ్లను ఈనెల 31 వరకు పొడిగించారు. ఈ రైళ్లకు కడపస్టేషన్ హాల్టింగ్కే పరిమితం కావడం గమనార్హం. బెర్త్ దొరకకపోయినా.. ఒక్కో బండిలో 500కు పైగా వెయింటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. రైళ్లలో ఆ పరిమితి కూడా దాటిపోయి రిగ్రెట్కు చేరింది. బెర్తు దొరక్కపోయినా వెయింటింగ్ లిస్ట్ టికెట్తో ఏదోలా ప్రయాణం చేద్దామనుకునే వారికి ఆ అవకాశం కూడా లేకుండా నిరీక్షణ తర్వాత చాంతడంత ఉంది. 60 రోజుల ముందు నుంచే.. పండుగకు 60 రోజుల ముందు నుంచే ముందస్తు గా టికెట్లు బుక్ చేసుకున్నారు. ముందే రిజర్వేషన్లు ప్రారంభం కావడంతో.. వెంటనే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇక కొంతమంది అయితే ముందురోజు ఓపెన్ అయ్యే తత్కాల్ లోనైనా టికెట్ దొరుకుతుందనే ఆశలో ఉన్నారు. సంక్రాంతి రద్దీ 14, 15, 16 తేదీలలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో వారంరోజుల ముందునుంచే రైళ్లలో రద్దీ తీవ్రంగా ఉంది. హైదరాబాదు నుంచి ఉభయ వైఎస్సార్ జిల్లాలోని కడప, రాజంపేట, రైల్వేకోడూరు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కమలాపురం, నందలూరు తదితర ప్రాంతాలకు వేలాది మంది కుటుంబాలు సంక్రాంతి పండుగకు వచ్చేందుకు కష్టాలు పడాల్సి వస్తోంది. నలుగురున్న సభ్యులు సొంతూరికి.. నలుగురు సభ్యులున్న కుటుంబం సొంతూరికి వెళ్లిరా వాలంటే ఖర్చు ఎక్కువయ్యే స్థితి నెలకొంది. ఇక రైలులో టికెట్లు దొరకని వారంతా బస్సు అడ్వాన్స్డ్ రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. రైల్వేశాఖ పండగ సీజన్ దృష్ట్యా ఏమైనా ప్రత్యేక రైళ్లు నడిపితే వాటిలో టికెట్లు బుక్ చేసుకుందామనే ఆశలు లేవు. జిల్లా మీదుగా ప్రత్యేకరైళ్లు నడపడం లేదు. డే ట్రైన్ రన్ చేయాలనే డిమాండ్ ఉభయ జిల్లాలమీదుగా అన్రిజర్వడ్ డే ట్రైన్ను తెలంగాణకు నడిపించాలనే డిమాండ్ను ప్రజాప్రతినిధులు రైల్వేబోర్టు దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
కూటమి కుట్రల్ని తిప్పి కొడదాం
వాల్మీకిపురం : క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ కూటమి కుట్రల్ని తిప్పికొట్టి జగనన్నను మరోసారి సీఎంను చేసుకుందామని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర గ్రామ కమిటీల పరిశీలకులు వజ్ర భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక షిరిడిసాయి కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. అధికారంలోకి రావడం కోసం కూటమి ప్రభుత్వం అనేక మాటలు చెప్పి, ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత హామీలను విస్మరించిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లోనే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేసిందన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరిని గుర్తించి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలల్లో పదవులను అందించడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయి నుంచి వైఎస్సార్సీపీని బలోపేతం చేద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించి సత్తా చాటుదామన్నారు. గ్రామ, వార్డు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ పార్టీలో అంతర్భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. మహిళా, యువజన, కార్మిక, విద్యార్థి, తదితర అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలు, నాయకులకు ఈ కమిటీల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. సమన్వయంతో పని చేస్తూ ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా కమిటీల నిర్మాణం ఉండాలన్నారు. అనంతరం పార్టీ కమిటీల ఏర్పాటు, సభ్యత్వం, డిజిటలైజేషన్, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేసానికి ముందు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్, నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, ఆఘామొహిద్దిన్, రత్నశేఖర్ రెడ్డి, మహిత, శివానంద రెడ్డి, వెంకట్రమణారెడ్డి, అప్పల్లా, నీళ్ల భాస్కర్, రమేష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, చక్రధర్, కేశవ రెడ్డి, ఆనంద, శ్రీధర్రాయల్, నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమ కేసులకు భయపడొద్దు మన బలగం పెరగాలి. కష్టకాలంలో జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ న్యాయం జరుగుతుందని జగనన్న భరోసా ఇచ్చారు. కమిటీలో సభ్యత్వం తీసుకొని డిజిటలైజేషన్ చేయించుకుంటే అమరావతిలోని మన పార్టీ కార్యాలయంలో బటన్ నొక్కినా వివరాలు కనిపిస్తాయి. వచ్చేది జగనన్న ప్రభుత్వమే అని రాష్ట్ర గ్రామ కమిటీల పరిశీలకులు వజ్ర భాస్కర్ రెడ్డి తెలిపారు. వైఫల్యాలను ఎండగడదాం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూటమి పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కమిటీల ద్వారా టిడిపి కుట్రలను తిప్పికొడదామని పార్టీ పరిశీలకులు సుబ్బారెడ్డి అన్నారు. గ్రామ స్థాయి నుంచి ఐకమత్యంగా ఉంటూ, కమిటీల్లో చోటు సంపాధించిన వారందరూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్ద ఎండగట్టి వైఎస్సార్సీపీ బలోపేతానికి బాటలు వేయాన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దాం గ్రామ కమిటీలే పార్టీకి పునాదులు జగనన్నని మళ్లీ సీఎంను చేసుకుందాం అక్రమ కేసులకు భయపడొద్దు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల -
తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన అల్లసాని
ఎర్రగుంట్ల : తెలుగు భాష ఔన్నత్యాని, గొప్పతనాన్ని దేశానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అల్లసాని పెద్దనామాత్యులని పంపా క్షేత్ర పీఠాధిపతి గోవిందానంద సరస్వతి స్వామి తెలిపారు. సోమవారం ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామంలో వెలసిన పూరతమైన శివాలయం ఆవరణలో అల్లసాని పెద్దనామాత్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తపు రామ్మోహన్రెడ్డి, కళావతమ్మలు అల్లసాని పెద్దనామాఽత్యుల విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ అల్లసాని పెద్దన్న నడయాడిన పెద్దనపాడు గ్రామంలోని శివాలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమని కొనియడారు. కృష్ణదేవరాయుల కాలంలోని అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడుగా పెద్దనామాత్యులు పేరుపొందారన్నారు. విగ్రహ దాత కొత్తపురామ్మోహన్రెడ్డి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కొనియడారు. అనంతరం కవి సమ్మేళనం కూడా నిర్వహించారు. అలాగే కొత్తపు గంగా చైతన్య కూమార్రెడ్డి విగ్రహాన్ని కూడా పెద్దలు ఆవిష్కరించారు.పెద్దనపాడు శివాలయంలో అల్లసాని విగ్రహం ఆవిష్కరణ -
పరిష్కారం శూన్యం.. సమస్యలు పదిలం
● పీజీఆర్ఎస్లో పదే పదే అర్జీలు ఇస్తున్నా ఫలితం శూన్యం ● పెన్షన్లు, రెవెన్యూ సమస్యలే అధికం ● ప్రజా సమస్యలపై 266 అర్జీలు సాక్షి, అన్నమయ్య : ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితు లు బారులు తీరుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడ నే ఉంటున్నాయి. వినతిపత్రాలు ఇచ్చే వారి కష్టాలు తీరడం లేదు. కలెక్టర్ నిషాంత్కుమార్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నా కిందిస్థాయి యంత్రాంగంలో చిత్తశుద్ధి లో పించడంతో ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక మొక్కుబడి తంతుగా మారింది. సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముకుని వచ్చే ప్రజలకు నిరాశే మిగులుతోంది. అర్జీలు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం తప్పితే, ఇప్పటివరకు పరిష్కారమైన దాఖలాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారులందరూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.కార్యక్రమంలో డీఆర్వో మధుసూదన్, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, సర్వే ఏడీ భరత్కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. భారీగా వినతులు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రెండోసారి సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి భారీగా వినతులు వచ్చాయి. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి సమస్యలపై 266 అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి వినతిపత్రాలు సమర్పించారు. ప్రధానంగా రెవెన్యూ పరమైన పెన్షన్లు, కబ్జాలు లాంటి వాటిపైనే పెద్ద ఎత్తున వినతులతో ప్రజలు తరలివచ్చారు. వచ్చిన దరఖాస్తుదారులే పదేపదే మళ్లీ వచ్చారు. పరిష్కారం ల భించకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. ఒక్కొక్క అర్జీ రూ.100 జిల్లాలోని బాధితులు తమ గోడు ఉన్నతాధికారులకు చెప్పి సమస్య పరిష్కరించుకుందామని వస్తున్నవారి ఆవేదనను కొంతమంది వినతులు రాసే వారు సొమ్ము చేసుకుంటున్నారు. దరఖాస్తుదారుని బాధను పేపరులో నమోదు చేయడానికి రూ. 100 తీసుకుంటుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం ఒక ఎత్తయితే, ఇక్కడ టిఫిన్, భోజన ఖర్చులు మొదలుకొని మళ్లీ అర్జీ రాసినందుకు ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సి రావడం బాధాకరం. సాధారణంగా ఒక అర్జీ రాసేందుకు గతంలో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి, వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో రూ. 30 తీసుకునేవారు. అయితే ప్రస్తుతం అర్జీ రాసేందుకు ఒక్కసారిగా రూ. 100లు ఇవ్వాల్సి రావడంతో పలువురుబాధితులు వారితో గొడవకు దిగుతున్నారు. ఇది మంచి పద్దతి కాదని..ఇలా పెద్ద మొత్తంలో తీసుకుంటే మేమే ఇక్కడ కూర్చొని తక్కువ మొత్తానికి, లేకుంటే ఉచితంగా అర్జీలు రాసిస్తామంటూ ఓ మాజీ సైనికుడు వారితో వాద నకు దిగారు. అయినా అర్జీ రాసేవారిలో మార్పు కనిపించడం లేదు. ఉన్నతాధికారులు ప్రత్యేక చర్య లు చేపట్టి అర్జీ రాసే వారు నామమాత్రపు సొమ్ము తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన పిల్లి మల్లీశ్వరి దివ్యాంగుడైన తన తొమ్మిదేళ్ల కుమారుడికి పెన్షన్ మంజూరుచేయాల్సిందిగా కలెక్టర్కు అర్జీ సమర్పించింది. కాళ్లు చచ్చుపడిపోయి, నడవలేని స్థితిలో ఉన్నటువంటి తన కుమారుడి పోషణ కోసం వికలాంగ పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా వేడుకుంది. మదనపల్లె మండలం సర్వే నం.367/1క్యూలోని తమ భూమికి వెళ్లేందుకు పక్క భూమి వారు దారి ఇవ్వడం లేదని మనేరి చలపతి అర్జీ సమర్పించారు. 1957 నుంచి కొండ వంకకు పూర్వీకులు బండిబాటగా వినియోగిస్తున్న దారి ఉన్నప్పటికీ, భూమిని ఆక్రమించుకుని తొమ్మిదేళ్లుగా తమతో పాటు ఇతర రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదుచేశారు. పొలానికి వెళ్లేందుకు దారి ఇప్పించి, రైతులకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. -
నీరుగారిన..ఉత్సవం
జమ్మలమడుగు/జమ్మలమడుగురూరల్ : గండికోట ఉత్సవాలు వెలవెలబోతున్నాయి. గండికోట వైభవాన్ని.. కీర్తిని నలుదిశలా వ్యాప్తి చెందేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్న అధికారులు ఆదిశగా అడుగులు వేయలేదు. కోట వైభవం మాటేమోగానీ ఉత్సవాలతో కొంచైమెనా ప్రయోజనం జరగకపోగా.. చుట్టూ పారిశుధ్య లేమితో.. నిరు పయోగంగా మారిన తాగునీటి నిర్వహణ కేంద్రాలతో కోట పేరును గంగలో కలిపేస్తున్నారు. తొలి రోజు పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉన్నా దానికి తగ్గట్టుగా ప్రోగ్రాంలు సక్రమంగా నిర్వహించడంలో అధికారులో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. స్థానికులు ప్రాధాన్యత ఎక్కడా...! ఉత్సవాలలో స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్పాఠశాల విద్యార్థులతో కల్చరల్ యాక్టివిటిస్ నిర్వహించేవారు. ఈ ఏడాది భాగస్వామ్యం కాదుకదా వారికి కనీస పిలుపే లేకుండా పోయింది. సోమవారం జరిగిన కార్యక్రమాలు సైతం వెలవెలబోయాయి. పట్టుమని పదిమంది కూడా కూర్చిలో కూర్చొలేని పరిస్థితి ఉంది. వెలవెలబోతున్న స్టాల్స్... గండికోట ఉత్సవాల్లో భాగంగా చేనేతవృత్తుల, వ్యవసాయానికి సంబంధించిన స్టాల్స్లు కొనుగోలు దారులు లేక వెలవెలబోయాయి. మూ డు రోజుల పాటు గండికోట ఉత్సవాలలో జిల్లాకు సంబంధించిన చేనేత వృత్తుల ప్రదర్శన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన వారికి నిరాశే ఎదురైంది. స్టాల్స్లో ముతక వస్త్రాలు చూసి ఉస్సూరుమన్నారు. తాగునీరు లేక ఇబ్బందులు... గండికోట ఉత్సవాలను చూడటానికి వచ్చిన పర్యాటకులకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా అధికారులు కల్పించలేదు. అలాగే మరుగుదొడ్లు పనిచేయకపోవడంతో తలుపులకు తాళాలు వేశారు. మరుగుదొడ్లు వసతులు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
కోడిపందేల నిర్వహణ నేరం
–జిల్లా జేసీ, ఎస్పీ మదనపల్లె : కోడిపందేల నిర్వహణ నేరమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. సోమవారం జెసీ, ఎస్పీ, సబ్కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి కోడిపందేలు నిషేధం, శిక్షార్హం అన్న పోస్టర్లను మదనపల్లెలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జేసీ మాట్లాడుతూ ప్రజలు కోడిపందేలు, జూదం తదితర నిషేధిత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడం, శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ కోడి పందేలను నిర్వహించినా, ప్రోత్సహించినా, బెట్టింగ్లకు పాల్బడినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాఫ్నర్స్గా పదోన్నతులుకడప రూరల్ : కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం ఏఎన్ఎం నుంచి స్టాఫ్ నర్స్ గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. జోన్–4 రాయలసీమ జిల్లాల పరిధిలో మొత్తం నలుగురికి ప్రమోషన్ లు కల్పించారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామ గిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, ఉద్యోగుల సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు. కార్య క్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు. 23న వాక్–ఇన్ ఇంటర్వ్యూకడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం కళాశాల జంతు శాస్త్ర శాఖలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆచార్య టి.శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెస్సీ జంతు శాస్త్రంలో నెట్/ సెట్/ పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థుల బయో–డేటా, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు.. వారి జిరాక్స్ కాపీల సెట్తో నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. వివరాల కోసం www.yvu.edu.inని సందర్శించాలని సూచించారు. జిల్లా జేసీగా శివనారాయణ శర్మ మదనపల్లె రూరల్ : అన్నమయ్య జేసీగా శివనారాయణ శర్మను నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు విడుదల చేశారు. సోమవారం రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా జేసీగా పనిచేస్తున్న ఆదర్శ రాజేంద్రన్ను చిత్తూరుజిల్లాకు, ఆయన స్థానంలో అనంతపురం జిల్లా జేసీగా పనిచేస్తున్న శివనారాయణ శర్మను నియమించారు. 2021 ఆంధ్రప్రదేశ్, ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శివనారా యణశర్మ, ఉత్తరప్రదేశ్ మధురలోని రాయకు చెందినవారు. -
హత్యాయత్నం కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు
కడప అర్బన్ : జిల్లాలోని పులివెందుల అప్ గ్రేడ్ పీఎస్ పరిధిలో రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు పిట్టు గౌతమ్ కుమార్ రెడ్డి(27), యకాసి జనార్ధన అలియాస్ జనార్ధన్ (30) లకు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ సోమవారం కడప ఏ.ఎస్.జె కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ సంఘటనలో ఫిర్యాది దేరంగుల గణేష్ కుమార్(25) వద్ద నిందితులలో ఒకరైన గౌతమ్కుమార్ రెడ్డి తన మోటార్ సైకిల్ను రూ.70 వేలకు తనఖా పెట్టాడు. 2023 మే 26వ తేదీ మధ్యాహ్నం సదరు మోటార్ సైకిల్ను తనఖా నుంచి విడిపించుకునే విషయంలో ఫిర్యాదికి, నిందితుడు గౌతమ్కుమార్ రెడ్డికి మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం గౌతమ్ కుమార్ రెడ్డి, తన స్నేహితుడైన జనార్దన్ సహకారంతో కత్తి తీసుకుని ఫిర్యాదిని చంపాలనే ఉద్దేశ్యంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. చార్జ్ షీట్ను కోర్టు కు సమర్పించారు. సోమవారం కడప అదనపు సెషన్న్స్ జడ్జి కె.ప్రత్యూష కుమారి, సాకా్ాష్ధరాలు పరిశీలించి నిందితులపై నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి 3 సంవత్సరాల సాధారణ జైలు శిక్షతో పాటు, 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో అడిషనల్ పి.పి ఎల్.బాలాజీ, తన బలమైన వాదనలతో నిందితులకు శిక్ష పడేలా చేశారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత పులివెందుల సీఐ సీతారామి రెడ్డి, కడప కోర్టు మానిటరింగ్ హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ (హెచ్.సి 1988), పులివెందుల కోర్ట్ కానిస్టేబుల్ నూర్బాషా లను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించినారు. -
అంబరాన్నంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు
● పోలీస్ కుటుంబాలలో నిండిన నూతనోత్సాహం ● కులమతాలకు అతీతంగా పండుగను జరుపుకోవాలి ● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిరాయచోటి : రాయచోటిలోని పోలీస్ పరేడ్ మైదానంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, ఆయన సతీమణి ఉమ శ్రీలక్ష్మీతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై భోగి మంటలు వెలిగించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. నిత్యం విధులు, కవాతులు, శిక్షణలతో కనిపించే పోలీస్ మైదానం సంక్రాంతి సందడితో ఒక్కసారిగా పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. జిల్లా ఎస్పీ కుటుంబం నుంచి కిందిస్థాయిలోని హోంగార్డు కుటుంబ సభ్యుల వరకు సంక్రాంతి వేడుకలలో పాల్గొనడంతో ఆ ప్రాంతం ఆనందం, ఆహ్లాదభరితంగా కనిపించింది. సంక్రాంతి పండుగ ఒక కులానికో, మతానికో పరిమితమైంది కాదని, శ్రమజీవులైన రైతులు, కూలీల పండుగని ఎస్పీ కొనియాడారు. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన శుభవేళ అందరూ కలిసి ఆనందాన్ని పంచుకునే గొప్ప సందర్భమన్నారు. ఇలాంటి వేడుకలు పోలీసు సిబ్బందికి విధి నిర్వహణలో కలిగే ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని, నూతనోత్సహాన్ని నింపుతాయని అభిప్రాయపడ్డారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు పండుగ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, చట్టాన్ని అతిక్రమించినా అలాంటి వారిని చట్టపరంగా ఉపేక్షించవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించే వారికి స్నేహితుడిగా, అతిక్రమించేవారికి సింహస్వప్నంగా ఉండాలన్నా రు. వేడుకలలో భాగంగా మహిళా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగ్గులు పోటీలను ఎస్పీ సతీమణి ఉమ శ్రీలక్ష్మీ ప్రారంభించి విజేతలను ఎంపిక చేశారు. మ్యూజికల్ చైర్స్, డ్రాయింగ్ పోటీలు, తంబోలా, గోళీలు, బొంగరాలు వంటి ఆటలు నిర్వహించారు. ఎస్పీ దంపతులు స్వయంగా పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేసి అందరిలో ఉత్సా హాన్ని నింపారు. కార్యక్రమం చివరిలో వివిధ పోటీల్లో పాల్గొన్న సిబ్బందికి, వారి పిల్లలకు ఎస్పీ దంపతులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఐలు విజె రామకృష్ణ, ఎం పెద్దయ్య, ఇతర పోలీసు అధికారులు, మహిళా పోలీసులు, హోంగార్డులు, పోలీసు కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకున్నారు. -
కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి
కడప కార్పొరేషన్ : కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డివిజన్ కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష అన్నారు. సోమవారం సాయంత్రం మాజీ డిప్యూటీ సీఎం కార్యాలంలో నార్త్జోన్, వెస్ట్జోన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులు, పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు ఎంత ఉత్సాహంగా నిర్వహించామో ఇది కూడా అలాగే నిర్వహించాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే అందరికీ గుర్తింపు కార్డులు, బీమా కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కేంద్ర కార్యాలయ రాష్ట్ర కార్యదర్శి పోతుల శివారెడ్డి మాట్లాడుతూ ఇంటర్నెట్ సక్రమంగా ఉన్నచోటు నుంచి డిజిటలైజేషన్ చేయాలని, పదిమందిని నియమించుకొని సాధ్యమైనంతవరకూ కంప్యూటర్ల ద్వారా అ పనిని పూర్తి చేయాలన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ పాకా సురేష్ కుమార్, నార్త్జోన్ అధ్యక్షుడు బీహెచ్ ఇలియాస్, వెస్ట్ జోన్ అధ్యక్షుడు నాగమల్లారెడ్డి, మాజీ కార్పొరేటర్ జమాల్వలీ, షఫీ, జమీల్ పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష -
నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా అరెస్టు
● రెండు కిలోల నకిలీ బంగారు స్వాధీనం ● రూ.3 లక్షల నగదు, కారు స్వాధీనంరాయచోటి : నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్న ముఠాను రాయచోటి రూరల్ పరిధిలోని చిన్నమండెం పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ ఎస్కె రోషన్ తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి రెండు కిలోల నకిలీ బంగారం, రూ. 3 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం రాయచోటి రూరల్ పోలీసు స్టేషన్లో చిన్నమండెం ఎస్ఐ సుధాకర్తో కలిసి సిఐ మీడియాకు వివరించారు. తమిళనాడు రాష్ట్రం, తంజావూరుకు చెందిన బంగారు వ్యాపారులకు రెండు కిలీల నకిలీ బంగారాన్ని విక్రయించి మోసం చేశారన్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ బంగారం విక్రయిస్తున్న వారిపై చిన్నమండెం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైందన్నారు. సమాచారం మేరకు చిన్నమండెం సమీపంలోని కేశాపురం చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలో కారుతోపాటు శాంపిల్గా ఉన్న 170 మిల్లీ గ్రాముల బంగారం, నగదును స్వాధీనం చేసుక్నునామన్నారు. వీరబల్లి మండలం, షికారుపాలెంకు చెందిన నలుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి నకిలీ బంగారు విక్రయంలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ల ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో జవాన్ ఆకస్మిక మృతి
కురబలకోట : దేశ రక్షణలో సేవలందిస్తున్న ఓ జవాన్ రోడ్డు ప్రమాదంలో టిప్పర్ ఢీకొని ప్రాణాలు కోల్పోవడం మండలంలో తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. సోమవారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు..మండలంలోని తూపల్లికి చెందిన ఎన్. రాజశేఖర్ రెడ్డి (31) ఆర్మీలో జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. లక్నో కేంద్రంగా పనిచేస్తున్న ఇతను ఇటీవల శిక్షణ నిమిత్తం బెంగళూరుకు వచ్చాడు. అస్వస్థతకు గురై చికిత్స పొందిన అతను అక్కడ నుంచి మూడు రోజుల క్రితం సెలవులో స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి సమీపంలోని ముదివేడు నుంచి స్వగ్రామం తూపల్లికి మోటార్ సైకిల్పై వెళుతుండగా ఎనుములవారపల్లి క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సంక్రాంతి సందర్భంగా ఆనందంగా గడపాల్సిన ఆయన ఆకస్మికంగా మృతి చెందడం కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. అతనికి భార్య రుక్మిణి, కుమార్తె ఊర్వి (3) ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అక్రమార్కుల నుంచి మా భూములు కాపాడండి
లక్కిరెడ్డిపల్లి : అక్రమార్కులు మా తెలియకుండానే మా భూములను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని బాధిత రైతులు వాపోయారు. తమ భూములను కాపాడాలని మండలంలోని గద్దగుండ్లరాచపల్లికి చెందిన బాధిత రైతులు కొండూరు రఘునాథరాజు, ఎనపడ్డ వెంకటసుబ్బన్న, వెంకటరామరాజు, షేక్ జబ్బర్ సాహెబ్, షేక్ దర్బార్ భాష, షేక్ తాజ్ భాష, షేక్ ఉమర్ భాషలు సోమవారం తహసీల్దార్ క్రాంతి కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని గద్దగుండ్ల రాచపల్లి పొలంలో సర్వే నెంబరు. 625లో 7.18 ఎకరాలతో పాటు సర్వే నెంబరులోని 626లో 6.24 ఎకరాలు, సర్వే నెంబరు 614లో 19.68 ఎకరాల భూములను కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారన్నారు. వారి నుంచి తమ భూములకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం వారు ఎస్ఐ డి శోభ, సీఐలకు కూడా వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.తహసీల్దార్కు బాధిత రైతుల వినతి -
భార్య ఫిర్యాదుపై రోడ్డుపై భర్త నిరసన
● రాజంపేట పీఎస్ ఎదుట హంగామా ● ఆర్టీసీ బస్సు కిందపడే యత్నం ● భర్త వేధింపులపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన భార్యరాజంపేట : తన భార్య తనపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో.. ఆమె భర్త రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్ ఎదుట హంగామా చేసిన సంఘటన రాజంపేట అర్బన్ పోలీసుస్టేషన్ ఎదుట శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు చెందిన అఖిల్, పుల్లంపేటకు చెందిన రాధిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో కొన్నాళ్లు నివసించారు. వీరికి ఇద్దరు సంతానం. భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. మొలకలచెరువులో కొంత కాలం కలిసి ఉన్నారు. కొన్ని రోజుల కిందట రాధిక రాజంపేటలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే భార్య కనిపించడం లేదని మొలకలచెరువులో భర్త ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సీఐ నాగార్జున విచారణ చేపట్టారు. సీఐ నాగార్జునపై అఖిల్ ఆరోపణలు చేస్తూ, రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు కింద పడేందుకు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై సీఐ నాగార్జున మాట్లాడుతూ అఖిల్కు మతిస్థిమితం సరిగా లేదన్నారు. పోలీసులపై అఖిల్ వ్యవహరించిన తీరుపై కేసు నమోదు చేశామన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేశానంటున్న భార్య భర్త, అత్త, మామపై రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్లో.. వేధింపులు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా, గృహ హింస కేసు నమోదు చేశారని అఖిల్ భార్య రాధిక మీడియాకు తెలిపింది. తన భర్త తనను కొడుతూ రాక్షస ఆనందం పొందుతున్నాడని, ప్రతి నెల తన ఇంటి నుంచి డబ్బు తీసుకురావాలని వేధిస్తున్నాడన్నారు. రాకుంటే ఇకపై ఒకటే మానసికంగా వేధింపులు పెడతారన్నారు. పెళ్లయినప్పటి నుంచి మెంటల్ రీతిలో తనపై చావబాదేవాడన్నారు. రాయచోటికి వెళ్లి ఎస్పీకి తన భర్త శాడిజంపై ఫిర్యాదు చేశానని ఆమె వివరించారు. తాను కనిపించకుండా పోలేదని, మా అమ్మమ్మ ఇంటికి వచ్చానని తెలిపారు. మొలకలచెరువులో తాను కనిపించలేదని, తప్పుడు ఫిర్యాదు ఎలా చేస్తారన్నారు. తన భర్తతో వివాహమైనప్పటి నుంచి నేటి వరకు తనకు జరిగిన సంఘటనలను ఆమె వివరించింది. -
బతుకు దెరువు కోసం వెళ్లి..
లక్కిరెడ్డిపల్లి : లక్కిరెడ్డిపల్లిలోని కుర్నూతుల స్టేట్ బ్యాంక్ సమీపంలో నివాసం ఉంటున్న జటిపిటి మధుకర్ (38) అనే వ్యక్తి బతుకుదెరువు కోసం కూలి పనికి తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి అక్కడ పని చేస్తుండగా శనివారం గుండెపోటుతో మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు. ఆదివారం మధుకర్ మృతదేహం స్వగ్రామమైన లక్కిరెడ్డిపల్లికి చేరుకోవడంతో వారి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. మధుకర్కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించే మధుకర్ తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి అక్కడ పనిలో ఉండగానే గుండెపోటుకు గురై ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో ఆదివారం మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లికి చేర్చారు. బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. పోలీసుల అదుపులో నిందితుడుఒంటిమిట్ట : మండల పరిధిలోని నరసన్నగారిపల్లిలో ఈ నెల 8వ తేదీన అమ్మమ్మ రాఘవమ్మను మనవడు పొట్టె నందకుమార్ పొడిచి పరారీ అయిన ఘటన విదితమే. అతన్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లక్కిరెడ్డిపల్లి వాసి తమిళనాడులో మృతి -
ఆ లింకుల జోలికి వెళ్లొద్దు
మదనపల్లె : పండగల సందర్భంగా మోసగాళ్లు ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, వారి నుంచి వచ్చే వాట్సప్ లింకుల జోలికి వెళ్లొద్దని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలను కోరారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటనలో.. మోసాలు ఎలా చేస్తారో వివరించారు. పండగల ఆఫర్లు, ఉచిత బహుమతులు, భారీ డిస్కౌంట్ల పేరుతో సోషల్ మీడియాలో సందేశాలను పంపుతూ ఆకర్షితులయ్యేలా చేస్తారని అప్రమత్తం చేశారు. వీటిని నమ్మి ప్రజలు లింకులను తెరిస్తే సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని నగదు ఖాళీ అవుతుందని హెచ్చరించారు. ఆన్లైన్ షాపింగ్, ట్రావెల్ బుకింగ్లపై ప్రజలు ఆధారపడే పరిస్థితి ఉన్నందున ఆఫర్ల పేరుతో లింకులు పంపుతారని తెలిపారు. అలాగే పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీలు కోరితే వివరాలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ మోసపోతే అలాంటి వ్యక్తులు మోసం జరిగినట్టు గుర్తించిన గంటలోపు 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. సకాలంలో బాధితులు అందిస్తే సాంకేతికత ఉపయోగించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.జిల్లా ఎస్పీ ధీరజ్ -
14న మకరజ్యోతి దర్శనం
సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో ఈ నెల 14న మకరజ్యోతి దర్శనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ఆ రోజున మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరు ఆభరణాలను కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా తీసుకువచ్చి అయ్యప్ప స్వామికి సమర్పిస్తారు. అనంతరం ఆలయ తూర్పు దిక్కున ఉండే కొండల్లో మకరజ్యోతి దర్శనం ఇస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. భక్తితోనే ముక్తికి మార్గంకలకడ : ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మమే అందరినీ కాపాడుతుంది అని పరమపూజ్య శ్రీధర్ చరణ్దాస్ స్వామి అన్నారు. ఆదివారం మండలంలోని ఎనుగొండపాళ్యం పంచాయతీ దిగువపాళ్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆలయంలో నిత్య ధూపదీప నైవేద్యం కొనసాగేలా సహకారం అందించాలన్నారు. చేసే పనిలో మంచి ఉండాలని, భక్తితోనే ముక్తికి మార్గం సాధ్యమని తెలియజేశారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ములకలచెరువు మండలం చౌడసముద్రంకు చెందిన గండన్న కుమారుడు కృష్ణప్ప(55) టీవీఎస్ ఎక్సెల్ వాహనంలో పొలం వద్దకు గడ్డి తెచ్చేందుకు వెళుతుండగా, తంబళ్లపల్లె మండలం ఎర్రగుంట్లపల్లె పూలబావి వద్ద ఎదురుగా వచ్చిన జీపు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. కర్ణాటక కోలారుకు చెందిన దంపతులు చంద్రశేఖర్, శశికళ(26) తమ కుమార్తెతో కలిసి గుర్రంకొండ మండలం చెర్లోపల్లె రెడ్డెమ్మకొండ దేవాలయానికి బైక్పై బయలుదేరారు. మార్గంమధ్యలో మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీ బార్లపల్లె వద్ద రోడ్డుపై ఉన్న స్పీడ్బ్రేకర్ దాటే క్రమంలో వెనుక కూర్చున్న శశికళ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్రమంగా బీర్ల తరలింపుకడప అర్బన్ : కడప నగర శివారులోని కేంద్ర కారాగారం సమీపంలో ఆదివారం కారులో అక్రమంగా రెండు కేస్ (20 బీర్లు) తరలిస్తున్న కె.సురేష్ అనే వ్యక్తిని రిమ్స్ పీఎస్ సీఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్, కే. సముద్రం నివాసి అయిన కె.సురేష్ కడపలో బీర్లను కొనుగోలు చేసి విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. బీర్లను, కారును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. -
ప్రైవేటు ట్రావెల్స్కు పండగ!
మదనపల్లె రూరల్: సంక్రాంతి వచ్చిందంటే చాలు పండగంతా ప్రైవేటు ట్రావెల్స్దే. సీజన్లో దొరికిందే తడవుగా చార్జీల పేరుతో ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. దీంతో పండుగ ప్రయాణాలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. రైళ్లలో రెండు నెలల ముందే రిజర్వేషన్లు ముగియడం, ఆర్టీసీ సైతం అవసరానికి తగినన్ని బస్సులు నడపకపోవడంతో టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ట్రావెల్స్ను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఒక్కో ట్రావెల్స్ నిర్వాహకులు ఒక్కో విధంగా ప్రయాణికుల దోపిడీయే లక్ష్యంగా టిక్కెట్ ధర నిర్ణయించారు. సాధారణ టిక్కెట్టు ధర కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా టిక్కెట్ రేట్లను పెంచేశాయి. పెరిగిన టిక్కెట్ ధరలతో బేజారెత్తిపోతున్న జనం కళ్లల్లో సంక్రాంతి కాంతులు కళా విహీనంగా కనిపిస్తోంది. అధిక వసూళ్లు సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు రావాలనుకునే వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధి, చదువుల కోసం హైదరాబాదు, విజయవాడ, చైన్నె, బెంగుళూరులో ఉంటున్న జిల్లా వాసు లు పండక్కి ఇంటికి రావాలంటే భారీగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ముందుగా ప్లాన్ చేసుకున్న వారంతా రైళ్లకు బుకింగ్ చేసుకున్నారు. సెలవు దొరుకుతుందో లేదో అని వెయిట్ చేసి చివరి నిమిషంలో ప్రయాణానికి సిద్ధ్దమైన వారి పరిస్థితి దారుణంగా ఉంది. రైళ్లలో అడుగు పెట్టలేని పరిస్థితి ఇక రైలు ప్రయాణం గురించి ఆలోచన మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు వివిధ నగరాల నుంచి వచ్చే రైళ్లకు సంబంధించి రెండు నెలల ముందే రిజర్వేషన్లు క్లోజ్ అయ్యాయి. కనీసం వెయిటింగ్ లిస్టు కూడా దొరకడం లేదు. పోనీలే జనరల్ బోగీల్లో వద్దామనుకుంటే అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైలు ప్రయాణం ఆలోచనలను విరమించుకోవాల్సి వస్తోంది. చార్జీ రెట్టింపు..మామూలురోజుల్లో హైదరాబాద్ నుంచి మదనపల్లెకు ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సులో రూ.1,450, సీటర్..800–900 ఉండేది. ప్రస్తుతం హైదరాబాదు నుంచి మదనపల్లెకు 12వ తేదీ ప్రయాణానికి ఆన్లైన్లో చెక్చేస్తే... 4 ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉన్నాయి. వాటిలో చార్జీ రూ.867 ఉంది. అదే ప్రైవేట్ ట్రావెల్ బస్సుల విషయానికి వస్తే.. ఒక్కో బస్సులో ధర ఒక్కో విధంగా ఉండటమే కాకుండా, స్లీపర్, సీటర్ ఒకే చార్జీలు ఉంటున్నాయి. వాటి ధరలను పరిశీలిస్తే...రూ.1,300 నుంచి 1,800 వరకు ఉంటున్నాయి. లక్షల జీతాలు సంపాదించే సాఫ్ట్వేర్లకు టికెట్ ధరలతో పెద్ద సమస్య ఉండకపోవచ్చు కానీ, ఉపాధి కోసం పెద్ద నగరాలకు వలసవెళ్లి పండుగకు సొంతూరికి రావాలనుకున్న బడుగు జీవులకు ప్రయాణం భారమవుతోంది. కష్టార్జితంలో చాలావంతు చార్జీలకే సరిపోతోంది. గమ్యస్థానం చేరకుండానే మధ్యలో... ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పుంగనూరుకు బస్సు రిజర్వేషన్ చేసుకుని రూ.1,700 టికెట్ ధర చెల్లించినప్పటికీ, బస్సు యాజమాన్యం మదనపల్లెకు వచ్చాక వారిని ఆర్టీసీ బస్సులో వెళ్లాల్సిందిగా బస్టాండ్ ఎదుట దింపేశారు. ఎందుకని ప్రశ్నిస్తే.. బస్సు తిరిగి హైదరాబాద్కు వెళ్లి రాత్రికి లోడ్ చేసుకోవాల్సి ఉందని, సర్దుకుపోండని సమాధానమిచ్చారని ప్రయాణికులు వాపోయారు. చేసేదిలేక లగేజీ మోసుకెళ్తూ వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు, రైళ్లలో ఖాళీలేక ప్రైవేటు ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్న జనం అవసరాన్ని ఆసరాగా చేసుకుని దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ హైదరాబాదు, విజయవాడ నుంచి రావాలంటే పెద్ద మొత్తంలో వసూలు దోపిడీపై పట్టీపట్టనట్లు వ్యవహరించిన కూటమి సర్కార్ -
108 ఉద్యోగుల సమ్మె బాట
మదనపల్లె సిటీ : అత్యవసర వైద్యం అందించే 108 వ్యవస్థ, ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష గట్టింది. అపద్భాంవులపై అక్కసు ప్రదర్శిస్తోంది. ఎమర్జన్సీ వైద్యం అందించే ఉద్యోగులపై నిర్లక్ష్యపు ధోరణి అవలంబిస్తోంది. గతంలో వేతన నిధులు మంజూరు చేయకుండా అలక్ష్యం ప్రదర్శించిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుతం వారి సమస్యలు పరిష్కరించకుండా మోసం చేస్తోంది. ఆరు నెలలుగా సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది. దీంతో వారందరూ సమ్మెబాట పట్టనున్నారు. 12 వరకు డెడ్లైన్ 108 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే సమ్మెబాట పడతామని స్పష్టం చేశారు. ఈ నెల 12 వరకు ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. అప్పటికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే జిల్లా వ్యాప్తంగా అత్యవసర సేవలు నిలిపివేసి సమ్మెలోకి వెళ్లనున్నామని 108 ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారులతోపాటు కాంట్రాక్టు సంస్థకు కూడా సమ్మె నోటీసులను పలు దఫాలుగా అందజేశారు. గద్దెనెక్కిన నాటి నుంచి.. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి 108 ఉద్యోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సంస్థను మార్చడం మొదలు, పెంచామన్న జీతం జీవోకే పరిమితమవ్వడం, వైట్ యాఫ్రాన్ బదులు డ్రెస్కోడ్ మార్చడం, ఆరు నెలలుగా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోకపోవడంతో వారికి సమ్మె అనివార్యంగా మారింది. ఇటీవల ఒకసారి చర్చలు జరిగినప్పటికీ అందులో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేస్తుండటంతో.. వారు సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. డిమాండ్లు ● 108 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.4 వేలల్లో రూ. 2 వేలు మాత్రమే పెంచారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆర్ఎఫ్పీ ప్రకారం ఈపీఎఫ్ఓ యాజమాన్య వాటాను యాజమాన్యమే చెల్లించాలని చెప్పినా నేటీకీ అమలు కాలేదు. ● చిన్న కారణాలను చూపిస్తూ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం మానుకోవాలి. ● ఈఎంటీలను ట్రైనింగ్ పేరిట భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ట్రైనింగ్ అంటే ఉన్న నాలెడ్జ్ని పెంపొందించాలే తప్ప భయభ్రాంతులకు గురి చేస్తూ ఫెయిల్ అయితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పడం దారుణం. ● ప్రతి అంబులెన్స్ ఉన్న చోట సిబ్బంది ఉండేందుకు వసతి, వాహనం నిలుపు కొనేందుకు పక్కా షెడ్డు నిర్మించాలి. ● వివిధ కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలి. ● భవ్య సంస్థ 108 బాధ్యత తీసుకుని ఏడు మాసాలు పూర్తయినా ఏ ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదు. వేతనాలపై సైతం స్పష్టత లేకపోవడంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ● 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఆటోమెటిక్ శ్లాబ్ అప్గ్రేడ్ చేయాలి. పనిష్మెంట్ కాలాన్ని చూపుతూ వేతనం తగ్గించడం తగదు. శ్లాబ్కు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. ● కొంత కాలంగా పెండింగ్లో ఉన్న గత సర్వీస్ ప్రొవైడర్ రిలీవింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. గతంలో మాదిరిగా షిఫ్ట్నకు రూ.200 ఇవ్వాలి. ● కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరహా పండుగ ప్రయోజనాలు కల్పించాలి. ● వాహనాల్లో అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలి. ● ఐఎఫ్టీ కేసుల్లో సరైన గైడెన్స్ రూపొందించి మెడికల్ ఆఫీసర్లకు, 108 సర్వీస్ ప్రొవైడర్లకు తెలపాలి. అధికారులు, కాంట్రాక్టు కంపెనీకి నోటీసులు డిమాండ్లు పరిష్కరించకుంటే 12 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులు -
పండుగ వేళ.. క్రీడల హేల
పుంగనూరు : పట్టణంలోని గూడూరుపల్లె వద్ద ఉన్న జగనన్న టిడ్కో కాలనీలోని లబ్ధిదారులతో కలసి సంక్రాంతి సంబరాలను ఆదివారం నిర్వహించారు. కమిషనర్ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో టిడ్కో ఇన్చార్జ్ రవీన్కుమార్రెడ్డి మహిళలకు, చిన్నారులకు ఆటల పోటీలు, పరుగు పందెల పోటీలు నిర్వహించారు. అలాగే పట్టణంలోని నారాయణి ఫౌండేషన్ ప్రతినిదులు హేమంత్ రాయల్ ఆధ్వర్యంలో స్థానిక బీఎంఎస్ క్లబ్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. పొంగళ్లు వండి, భోగి మంటలు వేసి, సంక్రాంతి పాటలు పాడుతూ సంబరాలు జరిపారు. ఆటలతోనే ఐక్యత చౌడేపల్లె : ఆటలతోనే యువకుల్లో ఐక్యత చేకూరుతుందని ప్రముఖ పారిశ్రామిక వేత్త దివ్యశ్రీ ఇండ్రస్ట్రీయల్ ఎండీ భాస్కర్రాజు పేర్కొన్నారు. మండలంలోని దాదేపల్లె సమీపంలోని రాజులూరు వద్ద ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణంలో ఆదివారం కేపీఎల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (క్షత్రియ ప్రీమియర్ లీగ్) 11 యేళ్ళుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సీజన్ క్రికెట్ పోటీలను పారిశ్రామిక వేత్తలు సుదర్శనరాజు, ఎన్.పురుషోత్తంరాజు, వెంకటరమణరాజు, లక్ష్మిపతిరాజు, పి.పురుషోత్తంరాజు, రవిరాజు తదితరులు కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో వక్తలు ప్రసంగించారు. వివిధ ప్రాంతాల నుంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు తమ క్రీడలను మరుగున వేయకుండా ప్రదర్శించాలని సూచించారు. క్షత్రియుల సమస్యలను గుర్తించి వారికి చేయూత నివ్వడానికి ముందుకురావాలని సూచించారు. అనంతరం ప్రాంగణంలోని జెండాను ఆవిష్కరించి బ్యాటింగ్తో క్రీడను ప్రారంభించారు. క్షత్రియ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పొటీల్లో పాల్గొనడానికి వివిధ గ్రామాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. మూడు రోజులపాటు సాగే క్రికెట్ పోటీల్లో తలపడడానికి మొత్తం 13 టీంలు తలపడనున్నాయి. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కేవీపల్లె : మండలంలోని కేవీపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో గర్నిమిట్ట యల్లమ్మ తల్లి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మహేష్రెడ్డి, ఆనంద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఈ నెల 15వ తేదీ వరకు మండలస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో విజేత జట్టుకు రూ. 15 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచే జట్టుకు రూ. 10 వేలు తోపాటు ప్రతిభ చూపిన క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ది సీరిస్, మ్యాన్ ఆఫ్ మ్యాచ్ బహుమతులు ఇస్తామని తెలిపారు. -
నేడు అల్లసాని పెద్దన విగ్రహావిష్కరణ
కడప ఎడ్యుకేషన్: తెలుగులో తొలి ప్రబంధానికి శ్రీకారం చుట్టి రాయలసీమకు ఎనలేని కీర్తి తెచ్చిన ’ఆంధ్ర కవితా పితామహుడు ’అల్లసాని పెద్దన విగ్రహాన్ని సోమవారం పెద్దన నడయాడిన ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడు గ్రామ శివాలయంలో ఆవిష్కరిస్తున్నట్లు కొత్తపు రామమోహన్ రెడ్డి తెలియజేశారు. కార్యక్రమానికి అధ్యక్షుడిగా వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, పెద్దన్న విగ్రహావిష్కర్తగా పంపాక్షేత్రం శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి, గంగా చైతన్య కుమార్ రెడ్డి విగ్రహావిష్కర్తగా జిల్లా రెవిన్యూ అధికారి ఎం విశ్వేశ్వర నాయుడు పాల్గొననున్నారు. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన (వ్యాస సంపుటి) పుస్తకావిష్కర్తగా ’మహా సహస్రావధాన స్థాపనాచార్య’ డాక్టర్ మేడసాని మోహన్, ఆలయ చరిత్ర శిలాఫలకం ఆవిష్కర్తగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జి.భాను ప్రకాష్ రెడ్డి చేయనున్నారు. గౌరవ అతిథులుగా డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, జింకా సుబ్రహ్మణ్యం, ’పెద్దన జీవితం –సాహిత్యం ’అనే అంశంపై జరిగే శతాధిక కవి సమ్మేళన నిర్వాహకులుగా డాక్టర్ తవ్వా వెంకటయ్య, డాక్టర్ కొప్పోలు రెడ్డి శేఖర్ రెడ్డి, ’స్వామి వివేకానంద జీవితం –సాహిత్యం’ అనే అంశంపై పాఠశాల విద్యార్థులతో ఏర్పాటు చేసే క్విజ్ కు న్యాయ నిర్ణేత గా డాక్టర్ యాడికి శివ ప్రభాకర్ రెడ్డి విచ్చేయనున్నారన్నారని వారు తెలియజేశారు. ఒంటిమిట్ట: ప్రముఖ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని ఆదివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. -
కిటకిటలాడిన బోయకొండ
చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూజలు, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు, జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయ అధికారులు భక్తులకు ఉచిత తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మదనపల్లె రూరల్: ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వేర్వేరుగా పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్, మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న బాధితులు, ఫిర్యాదుదారులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కడప సెవెన్రోడ్స్: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్రీధర్ చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వం ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు పట్టాదారు పాసుపుస్తకాలు రైతులందరికీ పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ అలసత్వం వహించడంతో తొండూరు తహసీల్దార్ రామచంద్రుడును సస్పెండ్ చేశారు. అలాగే చెన్నూరు, పెండ్లిమర్రి, వీఎన్ పల్లె, గో పవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, బి.మఠం, ప్రొద్దుటూరు, సీకే దిన్నెమండల తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తహసీల్దార్లు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీలో చేస్తున్న నిర్లక్ష్యాన్ని గమనించకుండా, సరైన రీతిలో పర్యవేక్షించని కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఇర్విన్, పులివెందుల రెవెన్యూ డివిజన్ అధికారి చిన్నయ్యలకు మెమోలు జారీ చేశారు. మదనపల్లె సిటీ: సంక్రాంతి స్పెషల్స్ బస్సులు నడపడం వలన మదనపల్లె ఆర్టీసీ–1డిపోకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 10వతేదీన డిపో నుంచి హైదరాబాదు, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడిపారు. ఒక్క రోజుకే రూ.23.34 లక్షల ఆదాయం వచ్చినట్లు డీఎం మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈపీకే 50.49, ఓఆర్ 92 వచ్చిందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టి పెట్టుకుని ప్రత్యేక సర్వీసులు నడిపినట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో ఆదాయం రావడంపై డ్రైవర్లు, కండక్టర్లు, ట్రాఫిక్, గ్యారేజీ సిబ్బంది, సూపర్వైజర్లు, అద్దె బస్సు సిబ్బంది, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆన్కాల్ డ్రైవర్లుకు అభినందలు తెలిపారు. మదనపల్లె సిటీ: పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లును సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలని ఏపీ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.మునిగోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం స్థానిక జీఆర్టీ ఉన్నత పాఠశాలలో సీనియర్ సిటిజెన్స్ సమావేశం జరిగింది. ఆదిత్య కాలేజీ అధ్యాపకురాలు అరుణ పలువురి సీనియర్ సిటిజెన్స్కు లైఫ్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో చేశారు. బీటీ కాలేజీ పూర్వపు విద్యార్థి స్కూల్లైఫ్ సినిమాలో విలన్గా నటించినందుకు శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు మునిరత్నమయ్య, ఉపాధ్యక్షుడు జగన్మోహన్, కోశాఽధికారి ఉస్మాన్సాహెబ్, మహిళా ప్రతినిధి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముద్దనూరు: స్థానిక రైల్వేస్టేషన్లో ధర్మవరం–మచిలీపట్నం రైలుకు స్టాపింగ్ సౌకర్యం కల్పించడంతో ఆదివారం స్థానిక ప్రజలు ఈ రైలుకు ఘనస్వాగతం పలికారు. మచిలీపట్నం నుంచి బయలుదేరిన ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం ఉద యం స్థానిక స్టేషన్లో తొలిసారి ఆగింది. దీంతో మండలంలోని ప్రముఖులు, వ్యాపారులు, విద్యార్థులు, ఆర్యవైశ్యసంఘం ప్రతినిధులు రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్లో ఆగిన రైలును మామిడాకులు,పూలదండలతో అలంకరించారు. ఈ సందర్భంగా రైలు లోకో పైలెట్లకు సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ముద్దనూరులో రైలు స్టాపింగ్కు కృషిచేసిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ మండలఅధ్యక్షుడు శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అన్నదమ్ముల మధ్య ఘర్షణ
గోపవరం : మండలంలోని నెల్లూరు – ముంబై (ఎన్హెచ్–67) జాతీయ రహదారి పక్కనే సత్యాటౌన్షిప్లో ఆదివారం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో.. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. కలసపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన మూడే పెద్దతిరుమలయ్య, గురమ్మలకు నలుగురు కుమారులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వీరిలో చిన్న కుమారుడు మూడే చిన్నగురయ్య (41) సీడ్ వ్యాపారంలో పని చేస్తున్నాడు. చిన్నగురయ్య అతని మూడవ అన్న గురయ్యకు డబ్బులు ఇవ్వడం జరిగింది. గురయ్య పోరుమామిళ్లలో టీచర్గా పని చేస్తున్నాడు. ఇద్దరి మధ్య గత కొంత కాలంగా డబ్బుల విషయంలో గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో బద్వేలులో నివాసముంటున్న చిన్న తమ్ముడు చిన్నగురయ్యను డబ్బులు విషయం మాట్లాడదామని మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు పిలవడం జరిగింది. అందరూ కలిసి సత్యాటౌన్షిప్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వాదోపవాదాలు జరిగి ఘర్షణకు దిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో చిన్నగురయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తన అన్న పెద్దగురయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఇతని పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. ఈయన కలసపాడులో నివాసముంటూ కడప వాటర్షెడ్లో పని చేస్తున్నాడు. ఘర్షణలో చిన్నగురయ్య మృతి చెందడం, పెద్దగురయ్య తీవ్ర గాయాలతో కిందపడటంతో మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు పరారైనట్లు తెలిసింది. పరారైన అన్నదమ్ముల్లో ఒకరు బెంగళూరులో పీజీ నడుపుతున్నారు. మరొకరు టీచర్గా పని చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బద్వేలు అర్బన్, రూరల్ పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని గాయపడ్డ పెద్దగురయ్యను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన చిన్నగురయ్యను పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా అన్నదమ్ముల మధ్యే జరిగిన ఘర్షణలోనే చిన్నగురయ్య మృతి చెందాడా లేక ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. గాయపడిన పెద్దగురయ్యమృతి చెందిన చిన్నగురయ్య -
బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
సదుం : ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చెరుకువారిపల్లెకు చెందిన సయ్యద్బాషా కుమారుడు రఫీ (27) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గానుగ పనులకు వెళ్లి వచ్చి, సొంత పనుల కోసం బైక్పై మండల కేంద్రానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో మత్తుకువారిపల్లె సమీపంలోని మల్లేశ్వరస్వామి ఆలయం మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయం అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ సత్యనారాయణ పరిశీలించి, విచారణ చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదన అందరినీ కలిచి వేసింది. -
శ్రీరెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం ఆలయంలో అమ్మవారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల సందడి మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును తాగి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. కొందరు భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. పలువురు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. హిందువులతోపాటు ముస్లింలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలిరావడం విశేషం. -
ఘర్షణలో వ్యక్తి మృతి
కేవీపల్లె : నీటి పైప్లైన్ విషయమై ఇరువురు ఘర్షణ పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని జమకులవడ్డిపల్లెలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జమకుల వడ్డిపల్లెకు చెందిన పసుపులేటి రెడ్డప్ప (50) అదే గ్రామానికి చెందిన పి.రమణ మధ్య ఆదివారం రాత్రి నీటి కుళాయి పైపులైను విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. మాటకుమాట పెరిగి తోపులాటకు దారితీయగా, ఆ సమయంలో రెడ్డప్ప కింద పడిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కేవీపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 22న వేలం ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ ఆవరణలో టెంకాయల విక్రయ దుకాణం లైసెన్స్ కోసం ఈ నెల 22న వేలంపాట జరగనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టెండర్ ప్రారంభంలో ఒక సంవత్సర కాలానికి అనుమతులు ఇవ్వగా, ఏడాది గడువు ముగిసిన తరువాత వాయిదా చెల్లింపుల్లో టీటీడీ వారు సంతృప్తి చెందితే, మరో రెండు సంవత్సరాలు పొగించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. 22న మధ్యాహ్నం 2 గంటలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆత్మీయ కలయికకు వేళాయే!
● 14న రాజంపేటలోఓల్డ్ ప్లేయర్స్ క్రికెట్ మ్యాచ్ ● క్రికెట్ మ్యాచ్ ఆడేందుకుసిద్దమవుతున్న వెటరన్ క్రీడాకారులు రాజంపేట టౌన్ : సంక్రాంతి పండుగ ఆత్మీయ కలయికలకు వేదిక అవుతుంది. ఇటీవల కాలంలో అందరిది ఉరుకులు, పరుగులమయమైన జీవనమైంది. అందువల్ల సన్నిహితులను, స్నేహితులను చివరికి దగ్గరి బంధువులను కూడా స్వయంగా కలుసుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో రాజంపేటలో కొంత మంది మాజీ క్రికెట్ క్రీడాకారులు సంక్రాంతి సందర్భంగా ఆత్మీయ కలయిక పేరుతో ఈనెల 14వ తేదీ భోగి పండుగ రోజున క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ ఆడేవారంతా ఒకప్పుడు రాయలసీమలోనే పేరుగాంచిన రాజంపేట క్రికెట్క్లబ్ (ఆర్సిసి) ప్లేయర్స్ కావడం విశేషం. 1990 దశకంలో ఏర్పాటైన ఆర్సీసీ కొన్ని దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగింది. తాజాగా ఆర్సీసీకి చెందిన మాజీ క్రీడాకారులంతా భోగి పండుగ రోజు క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యారు. వీరిలో దాదాపు అందరు ఐదు, ఆరు పదుల వయస్సు పైబడిన వారు కావడం విశేషం. వీరిలో కొంత మంది ప్రముఖ రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, ఉన్నత స్థాయి అధికారులు, వివిధశాఖల్లో పనిచేసే ఉద్యోగులు,రిటైర్డ్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఈనెల 14వ తేదీ జరిగే ఆత్మీయ క్రికెట్ మ్యాచ్ కోసం శ నివారం ఆర్సీసీ మాజీ క్రీడాకారులైన షేక్ అబ్దుల్లా, పసుపులేటి గోపినాధ్, చిట్వేలి రవికుమార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని క్రీడామైదానంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. ఆర్సిసి వ్యవస్థాపకులైన మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి, ప్రముఖ న్యాయవాది కాశిరెడ్డి గిరిచంద్రారెడ్డిని కలిసి ఆత్మీయ క్రికెట్ మ్యాచ్కు ఆహ్వానించారు. -
పండుగకు ఊరెళుతున్నారా.. జాగ్రత్త !
● ఇంటి భద్రతపై పోలీస్ సూచనలు పాటించండి ● ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లె రూరల్ : సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లే వారు తమ ఇంటి భద్రతకు సంబంధించి పోలీస్ సూచనలు పాటించి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊర్లకు వెళ్లే క్రమంలో చోరీలు జరిగేందుకు అవకాశం ఉన్నందున, ప్రజలను చైతన్యపరిచేందుకు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో మైకుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం పండుగ సెలవులకు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లేవారు పాటించాల్సిన కీలకభద్రత సూచనలపై ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి తలుపులకు, బాల్కనీలకు నాణ్యమైన తాళాలు వాడాలన్నారు. ఇంట్లో భారీ నగదు, బంగారు ఆభరణాలు ఉంచవద్దన్నారు. బ్యాంక్ లాకర్లలో లేదా నమ్మకమైన బంధువుల వద్ద భద్రంగా ఉంచాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని, వాటిని మొబైల్ ఫోన్కు అనుసంధానించుకుంటే, ఎక్కడి నుంచైనా ఇంటిని పర్యవేక్షించవచ్చని తెలిపారు. ఊరికి వెళ్లేవారు స్థానిక పోలీస్స్టేషన్లో లేదా బీట్ కానిస్టేబుల్కు సమాచారం ఇస్తే, గస్తీని ముమ్మరం చేస్తామని వివరించారు. ప్రయాణవివరాలను, లైవ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దొంగలు సులభంగా సమాచారం తెలుసుకునే వీలుందని హెచ్చరించారు. రాత్రి వేళల్లో ఇంటి ఆవరణ, గ్యారేజ్ వెలుగుతో ఉండేలా చూడాలన్నారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో పోలీస్వాహనాల ద్వారా మైకుల సహాయంతో ప్రజలకు రక్షణ సూచనలు వివరించాలని సిబ్బందిని ఆదేశించారు. మైకుల ద్వారా అవగాహన కల్పిస్తూనే, రాత్రి వేళల్లో పెట్రోలింగ్, బీట్కానిస్టేబుళ్ల తనిఖీలను మరింత పటిష్టం చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ప్రజలు ఫోటో తీసి డయల్ 112 లేదా స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ప్రజలు కూడా పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ ధీరజ్ ఆకాంక్షించారు. -
ముగిసిన ఏఆర్ ఎస్ఐ అంత్యక్రియలు
పీలేరురూరల్ : మండలంలోని తలపుల పంచాయతీ పెద్దహరిజనవాడకు చెందిన దండు ఓబయ్య (55) అన్నమయ్య జిల్లా పోలీస్ విభాగంలో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహించేవారు. శుక్రవారం గుండెపోటుకు గురి కావడంతో చికిత్సనిమిత్తం తిరుపతికి తరలించారు. చికిత్సపొందుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తక్షణసాయంగా రూ. లక్ష అందజేశారు. ఆర్ఐ రామకృష్ణ, ఆర్ఎస్ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది ప్రభుత్వ లాంఛనాలతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు చేసి అంతిమ సంస్కరణలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి కేవీపల్లె : సంక్రాంతి పండుగకు ఇంటికి వెళుతున్నానన్న ఆనందం.. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబలించడంతో విషాదంగా మారింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండలంలోని మహల్రాజుపల్లె వద్ద చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సంబేపల్లె మండలం దేవపట్లకు చెందిన శివరాణి (17) తిరుపతిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడిట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో శివరాణి తన అన్న మల్లీశ్వరతో కలసి ద్విచక్రవాహనంలో తిరుపతి నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో మహల్రాజుపల్లె వద్ద కడప నుంచి చిత్తూరు వెలుతున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108 పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో శివరాణి మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. నాటుసారా విక్రేతల అరెస్ట్ పెద్దమండ్యం : నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి సారా స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ పి. శ్రావణి తెలిపారు. మండలంలోని దిగువపల్లె గ్రామం వడ్డివంకతండాలో నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తున్నారనే సమాచారం మేరకు శనివారం సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడుల్లో తండాకు చెందిన లక్ష్మానాయక్, మునేనాయక్లు పట్టుబడినట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ తెలిపారు. -
నారసింహునికి విశేష పూజలు
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి పలు రకాల నైవేద్యాలు సమర్పించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తోమాల సేవ, ఏకాంతసేవ కావించారు. ఈ సందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని స్వామివారిని సేవించుకొన్నారు. అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయఅర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: గండికోటలో ఈనెల 11, 12 13 తేదీలలో జరిగే ఉత్సవాల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుందని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు డిపోల నుంచి గండికోటకు ప్రత్యేక సర్వీసులుంటాయన్నారు. జమ్మలమడుగు డిపో నుంచి 20 బస్సులు, కడప 8, ప్రొద్దుటూరు 8, మైదుకూరు 3 బస్సులు, మొత్తం 39 బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. జమ్మలమడుగు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు చొప్పున ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సులు తిరుగుతాయన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్ : బాల్య వివాహాలు చట్టవ్యతిరేకమని, ఇందుకు తగిన శిక్షలు ఉన్నాయని పారా లీగల్ వలంటీర్లు నిర్మల, దశరథ రామిరెడ్డి, ఈశ్వరయ్యలు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ సూచనలతో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులచే చెన్నూరులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప ఎడ్యుకేషన్: కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉమ్మడి ప్రవేశ పరీక్షపై (అండర్ గ్రాడ్యుయేట్ ) 11వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు నుంచి 8.30 వరకు ఆన్లైన్ గూగుల్ ద్వారా వెబినార్ నిర్వహిస్తామని సైన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని 200 పైగా సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ప్రైవేటు డీమ్డ్ టు బి యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం కోసం జరిపే ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) గుర్తింపు పొందిన కళాశాలల్లో వ్యవసాయ కోర్సులకు కూడా ఈ పరీక్ష ప్రవేశ మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గూగుల్ వెబి నార్ లింకు https://meet. google.com/ qgd&umvd&cvx,యూట్యూబ్ లింకు https:// youtube.com /live/RVYxs4V nS98?feature =shareలో చూడాలని తెలిపారు. కడప సెవెన్రోడ్స్: ప్రముఖ రచయిత, చరిత్రకారుడు తవ్వా ఓబుల్ రెడ్డి రచించిన గండికోట గ్రంథం ఇప్పుడు ఇంగ్లీషు భాషలో వెలువడుతోంది. పుస్తక రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి ఈ పుస్తకాన్ని స్వయంగా ఆంగ్లంలోకి అనువదించారు. గండికోట ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. తెలుగులో ఐదుసార్లు ముద్రించబడి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పర్యాటక గ్రంథంగా 2013లో అవార్డుకు ఎంపికై ంది. ఈ పుస్తకం ఇప్పుడు ఇంగ్లీషులో కూడా వెలువడుతుండటంతో గండికోట చరిత్ర, వైభవం గురించి ఇతర రాష్ట్రాల, విదేశీ పర్యాటకులకు కరదీపిక కానుంది. తెలుగు పుస్తకంలోని అంశాలకు అదనంగా గండికోట చరిత్రకు సంబంధించిన అనేక కొత్త అధ్యాయాలను ఈ ఇంగ్లీషు పుస్తకంలో పొందుపరిచినట్లు పుస్తక రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తెలిపారు. -
నేటి నుంచి
● మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు ● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: మన చారిత్రక వైభవం, సంస్కృతీసంప్రదాయాలకు దర్పణం పట్టే గండికోట ఉత్సవాలకు అందరూ కుటుంబ సమేతంగా, బంధు మిత్రులతో తరలి రా వాలని జిల్లా ప్రజలకు కలెక్టర్, టూరిజం కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. కడప కలెక్టరేట్లో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండికోట ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని, ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని ఆహ్వానం పలికారు. కన్నుల పండుగ వాతావరణంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను అత్యంత ప్రాధాన్యతతో జనవరి 11, 12, 13వ తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పర్యాటకులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేలా కార్యక్రమాలను రూపొందించామని కలెక్టర్ వివరించారు. వివిధ పోటీలలో విజేతలుగా నిలిచినవారికి చివరిరోజు బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. -
చంద్రబాబు సీమ ద్రోహి
సీఎం చంద్రబాబు కేసులకు భయపడి తెలంగాణకు దాసోహం అయ్యారని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు అంజద్బాషా ఎద్దేవా చేశారు. రాయలసీమ ఎంతో వెనుకబడిన ప్రాంతమని, దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం రాయలసీమలోనే ఉందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1000కోట్లతో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను నేనే ఆపానని తెలంగాణ సీఎం అంటుంటే ఈ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తాము కృష్ణా జలాల్లో వాటా అడుగుతుంటే బనకచెర్ల నుంచి గోదావరి నీటిని తెస్తానని సీఎం చెప్పడం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టు వెంటనే పూర్తిచేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కడప కార్పొరేషన్ : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడాన్ని మించిన ద్రోహం మరొకటి లేదని... సీఎం చంద్రబాబు సీమ ద్రోహి అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు కె. సురేష్ బాబులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. కృష్ణా జలాలపై తాము మాట్లాడుతుంటే గోదావరి జలాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. కృష్ణా జలాలు లేకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. శ్రీశైలంలో 845 అడుగులకు నీరు వస్తేగానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు నీరు వచ్చే అవకాశం లేదన్నారు. మొదటి ప్రాధాన్యత తాగునీటికి, ఆ తర్వాత సాగునీటికి ఇవ్వాలని, ఆ రెండింటి తర్వాతే విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడాల్సి ఉందన్నారు. కానీ అందుకు భిన్నంగా శ్రీశైలంలో 845 లెవెల్కు చేరకముందే తెలంగాణ నీటినంతా విద్యుత్ ఉత్పత్తికి తరలించుకుపోతోందన్నారు. 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు రాయలసీమ అంటే ఎప్పుడూ ద్వేషమేనని, కడప జిల్లా అంటే అసలు పడదన్నారు. అందుకే ఇక్కడి ప్రాజెక్టులను ఆయన పూర్తి చేయలేదని, దివంగత వైఎస్సార్ సీఎం అయిన తర్వాతే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయన్నారు. ఇక శ్రీశైలం నుంచి 800 అడుగుల్లోనే నీటిని తోడేందుకు వీలుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మొదలు పెడితే చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని దాన్ని నిలిపేయడం దుర్మార్గమన్నారు. సీమ ప్రజలు తిరుపతి, హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ను గెలిపించారని, ఆయన కుమారులు హరిక్రిష్ణ, బాలక్రిష్ణలను కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించారని గుర్తు చేశారు. ఇలా టీడీపీకి రాజకీయ భిక్ష పెట్టిన రాయలసీమకు ద్రోహం తలపెట్టడం తగదని హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మళ్లీ ప్రారంభించాలని, లేకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటానికై నా సిద్ధమని హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్నంతా అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారని, లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారని రఘురామిరెడ్డి అన్నారు. అమరావతి రాజధానికి అనువైనది కాదని అన్ని కమిటీలు చెప్పాయని, అయినా అక్కడే రాజధాన్ని నిర్మిస్తూ వరద నీటిని బయటికి పంపడానికి రూ.423కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. వేలకోట్లు ఖర్చు చేసి వరదనీటిని బయటికి పంపి రాజధాని కట్టాల్సిన ఆవశ్యకత ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమను రాళ్లసీమగా మార్చవద్దు – ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాజీ ముఖ్యమంత్రులు వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమలో బంగారు పంటలు పండించడానికి అనువుగా ప్రాజెక్టులు చేపట్టారని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు వాటిని అడ్డుకొని రాయలసీమను రాళ్లసీమగా మార్చవద్దని కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం వల్ల నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా మేలు జరుగుతుందని, కుప్పానికి కూడా తాగునీరు ఇచ్చే అవకాశముంటుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, పార్టీ నాయకులు దాసరి శివప్రసాద్, రామ్మోహన్రెడ్డి, మియ్యా, నాగమల్లారెడ్డి పాల్గొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడం దారుణం టీడీపీకి రాజకీయ భిక్ష పెట్టింది రాయలసీమ ప్రజలే రాష్ట్ర బడ్జెట్ అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు వరదనీటిని బయటికి పంపడానికే రూ.423కోట్లా! వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ఎస్. రఘురామిరెడ్డి ధ్వజం రాయలసీమలోని అన్ని ప్రాజెక్టుల్లో 62 టీఎంసీల నీటిని నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని రాజంపేట పార్లమెంటు పరిశీలకులు కె. సురేష్ బాబు అన్నారు. ఎన్టీఆర్ను పదవీచ్యుతున్ని చేసి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతోనే సరిపెట్టారే తప్పా ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. దివంగత వైఎస్సార్ మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేశారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ 44వేల క్యూసెక్కులకు పెంచారని, మాజీ సీఎం వైఎస్ జగన్ దాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారన్నారు. -
వైఎస్ అభిషేక్ రెడ్డికి నివాళి
పులివెందుల/రూరల్ : ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్రెడ్డి మనుమడు, వైఎస్సార్సీపీ తొండూరు మండల ఇన్చార్జి వైఎస్ మధురెడ్డి కుమారుడు దివంగత వైఎస్ అభిషేక్రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు నివాళి అర్పించారు. పులివెందుల పట్టణంలోని స్థానిక అంబకపల్లె రోడ్డులో ఉన్న వైఎస్ ప్రకాష్రెడ్డి నివాసంలో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డితో పాటు ఆమె సోదరుడు ఈసీ దినేష్రెడ్డి పాల్గొన్నారు. తొలుత వారు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ అభిషేక్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో చిన్న వయస్సులో రాష్ట్ర వైద్య విభాగపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్టీ కోసం ఎనలేని కృషి చేశారన్నారు. తక్కువ కాలంలోనే పార్టీ కోసం అనేక సేవలు అందించి గొప్ప వ్యక్తిగా వైఎస్ అభిషేక్రెడ్డి నిలిచిపోయారన్నారు. ఆయన మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. సీఎస్ఐ చర్చి ఫాదర్ బాబు, మృత్యుంజయరావు, మణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పరలోకంలో ఉన్న వైఎస్ అభిషేక్రెడ్డికి శాంతి కలగాలని దేవున్ని ప్రార్థించారు. ప్రొద్దుటూరు క్రైం: రెండు చోరీ కేసుల్లో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 53 గ్రాముల రెండు బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను శనివారం రూరల్ పోలీసులు వెల్లడించారు. ప్రొద్దుటూరుకు చెందిన కొట్లూరు పర్వతమ్మ ఆటోలో వెళ్తున్న సమయంలో దువ్వూరు రోడ్డు సర్కిల్లోకి వెళ్లగానే దొంగలు బంగారు చైన్ను దొంగలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్రగుంట్ల రోడ్డులోని నంగనూరుపల్లె క్రాస్ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం రావడంతో రూరల్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. దాడిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన నాగమణి అలియాస్ నాగమ్మ, వెంకటరమణరేఖ, రాచనేని అర్జున్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 53 గ్రాముల రెండు బంగారు చైన్లను స్వాధీ నం చేసుకున్నారు. ప్రొద్దుటూరులోని పర్వతమ్మ మెడలోని చైన్తో పాటు నందలూరు బస్టాండులో వల్లూరు భాగ్యమ్మ అనే మహిళ మెడలో నుంచి బంగారు చైన్ను దొంగలించినట్లు నిందితులు పోలీసుల వద్ద అంగీకరించారు. రెండు కేసుల్లోని బంగారు చైన్లను దొంగల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. పట్లుబడిన ముగ్గురిపై తమిళనాడు రాష్ట్రంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
పచ్చపార్టీలో రచ్చ!
మదనపల్లె: టీడీపీ మదనపల్లెలో పాత, కొత్త నేతల మధ్య పదవుల రచ్చ మొదలై అమరావతికి చేరింది. శుక్రవారం జరిగిన సంస్థాగత ఎన్నికల్లో మదనపల్లె పట్టణం, మండలాల అధ్యక్ష పదవులకు పార్టీ పరిశీలకులు ఎన్నిక నిర్వహించారు. ఇందులో ఎవరూ ఊహించని విధంగా పార్టీలోని సీనియర్ నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎమ్మెల్యే షాజహన్బాషా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. పదవులన్నీ తమ వర్గానికే దక్కుతాయన్న ఆశతో ఇంతకాలం ఎదురుచూసిన ఆయన వర్గీయులకు ఈ ఎన్నిక వ్యవహరం మింగుడుపడటం లేదు. చాలాకాలం క్రితమే పట్టణ, మండలాలకు అధ్యక్షులు ఎవరనేది ఎమ్మెల్యే వర్గీయులు ముందుగానే నిర్ణయించుకున్నారు. అయితే సమావేశం నిర్వహించాక ఎమ్మెల్యే వర్గానికి ఊహించని పరిణామం ఎదురైంది. సమావేశాల్లో మదనపల్లె పట్టణ అధ్యక్షుడిగా అరుణ్తేజ్, మదనపల్లె రూరల్ మండలానికి డి.శ్రీనివాసులు, రామసముద్రం అధ్యక్షుడిగా విజయ్కుమార్, నిమ్మనపల్లె అధ్యక్షుడిగా రాజన్నలను ఎన్నుకోవడం, ప్రకటించడం జరిగిపోయింది. ఎన్నికై న వారిలో అరుణ్తేజ మినహా అందరూ 30ఏళ్లకు పైబడిన సీనియర్లే. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే వర్గంలో కలకలం రేగింది. తమకు ఒక్క పదవీ దక్కలేదన్న ఆందోళనతో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు శుక్రవారం రాత్రికి రాత్రే ఎమ్మెల్యే సహా ఆయన వర్గీయులు అమరావతి బయలుదేరి వెళ్లినట్టు, శనివారం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తమ వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పుకునేందుకే ఎమ్మెల్యే వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ వర్గాలుగా విడిపోయి ఇదేవిషయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నాయి. పాత, కొత్త రచ్చ టీడీపీ మదనపల్లె నియోజకవర్గ అధ్యక్షుల ఎన్నిక వ్యవహారం పాత టీడీపీ, కొత్త టీడీపీ అన్నట్టుగా రెండు వర్గాలైంది. ఇందులో ప్రస్తుతం పదవులు పొందిన నేతలు పాత టీడీపీ అని, పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరిగిందని బహిరంగంగా అంటున్నారు. తాము కొత్తగా పార్టీలోకి వచ్చి పదవులు ఆశించలేదు, కష్టపడ్డామనే ఎన్నుకుని గుర్తించారని అంటున్నారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే వర్గంలో అంతర్మథనం మొదలైంది. కొత్తగా వచ్చిన వాళ్లంటే ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినవారే కదా అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పైగా పదవులు పొందిన కొత్త అధ్యక్షులు శనివారం వేసిన బ్యానర్లలో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై కూడా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేను గుర్తించరా, ఇది పార్టీ ధిక్కారం అంటూ గళం విప్పుతున్నారు. దాంతో ఇప్పుడు టీడీపీలో పాత, కొత్త రచ్చ ఒకవైపు ఉండగానే.. ఎమ్మెల్యే కొత్త అధ్యక్షుల విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచక పోవడంతో ఏం జరుగుతుందో అని క్యాడర్ ఆసక్తిగా చూస్తోంది. నిన్నటిదాకా ఎమ్మెల్యే నిర్ణయించిన వారికే పార్టీ పదవులు దక్కుతాయని, దీనిపై ఆయన వర్గీయులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊహించని పరిణామాలతో ఎమ్మెల్యే ఈ వ్యవహరంపై ఎలా వ్యవహరించబోతున్నారదనేది ఉత్కంఠగా మారింది. కొత్త అధ్యక్షుల ఎన్నికలో తన ముద్ర లేకపోగా, పదవులేవీ తన అనుచరులకు దక్కకపోవడం ద్వారా పార్టీలో ఎమ్మెల్యే పట్టు తప్పిందన్న సంకేతాలు ఇప్పటికే వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పార్టీలో తనకు వ్యతిరేక వర్గం లేకుండా పా పట్టు ఎలా నిలుపుకుంటారన్నది చర్చనీయాంశమైంది. టీడీపీ పదవుల్లో సీనియర్ నాయకులదే హవా మదనపల్లె ఎమ్మెల్యే వర్గానికిఒక్కటీ దక్కని పట్టణ, మండలఅధ్యక్ష పదవులు తామే నిజమైన పార్టీనేతలంటున్న కొత్తనేతలు ఉన్నఫళంగా అమరావతికి ఎమ్మెల్యే, వర్గీయులు -
సంక్రాంతి క్రికెట్ టోర్నీ విజేత ‘మదనపల్లె పోలీస్’
మదనపల్లె రూరల్ : జీవీఎస్సీఎస్ సొసైటీ, వాల్మీకిపురం సహకారంతో అన్నమయ్య క్రీడాభారతి ఆధ్వర్యంలో మదనపల్లె అఫిషియల్స్ సంక్రాంతి క్రికెట్ కప్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. మదనపల్లె జర్నలిస్ట్స్, పోలీస్, రెవెన్యూ, జీవీఎస్సీఎస్ టీచర్స్, సర్వేపల్లె రాధాకృష్ణ, మదనపల్లె మున్సిపాలిటీ పేరుతో మొత్తం 6 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ లో మదనపల్లె పోలీస్ జట్టు విజేతగా నిలిచింది. ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఫైనల్ పోటీల్లో పోలీస్ జట్టు 10 ఓవర్లలో 49 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ దిగిన మదనపల్లె మున్సిపల్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 47 పరుగులు చేసింది. పోటీల్లో గెలుపొందిన జట్టుకు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, జీవీఎస్సీఎస్ సొసైటీ ఫౌండర్ జీ.శ్రీధర్కుమార్ చేతులమీదుగా మదనపల్లె అఫీషియల్స్ ఇన్విటేషన్ సంక్రాంతి క్రికెట్ కప్ను అందించారు. మదనపల్లె డీఎస్పీ కే.మహేంద్ర పోలీస్జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా క్రీడాభారతి కార్యదర్శి నరేష్బాబు, వైస్ ప్రెసిడెంట్ విష్ణుచైతన్య, అన్నమయ్యజిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాజారమేష్, జీవీఎస్సీఎస్ మెంబర్లు ఉదయ్, నాగరాజ, రంజిత్, కిల్లా నాగరాజ, నవీన్, స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజ పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన జీవీఎస్సీఎస్ అఫిషియల్స్ క్రికెట్ పోటీలు -
అక్రమాలపై ఈఓ విచారణ
చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి జరిగిన అవినీతి అక్రమాలపై అందిన ఫిర్యాదు మేరకు కాణిపాకం ఈఓ పెంచల కిషోర్ శనివారం విచారణ చేపట్టారు. బోయకొండ గంగమ్మ ఆలయం వద్దకు చేరుకొని తొలుత అమ్మవారిని దర్శించుకున్నారు. నవంబరు 6న బోయకొండలోఅవినీతి అక్రమాలపై రాష్ట్ర బీసీ కార్పొరేషన్ (పాల ఏకరి) చైర్మన్ , పుంగనూరు నియోజకవర్గపు టీడీపీ అబ్జర్వర్ నాగేశ్వర నాయుడు దేవదాయశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారన్నారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన కమీషనర్ విచారణ అధికారిను నియమించి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈమేరకు ఆలయ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర నాయుడుతోపాటు పలువురు ఫిర్యాదిదారులను పెంచల కిషోర్ సుధీర్ఘంగా విచారణ చేపట్టి వారి వద్ద గల ఆధారాలను సేకరించారు. ఆలయంలో గల హుండీ ఆదాయంలో అక్రమాలు, ఆలయం వద్ద తలకాయలు అఽధిక రేట్లకు విక్రయిస్తున్నా ఈఓ ఏకాంబరం ప్రేక్షకపాత్ర పోషించారని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా గృహాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించాలని పలువురు విన్నవించారు. విచారణ నివేదికను దేవదాయశాఖ కమిషనర్కు త్వరలో అందజేస్తామని పెంచలకిషోర్ వెల్లడించారు. -
ట్రాన్స్పోర్ట్ కంటైనర్ను ఢీకొని స్కూటరిస్టు మృతి
● కంటైనర్ క్యాబిన్లో చెలరేగిన మంటలు ● పరారీలో కంటైనర్ డ్రైవర్ రాయచోటి టౌన్ : బ్యాటరీల లోడుతో వెళ్లుతున్న కంటైనర్ను మాధవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు (58) శుక్రవారం అనే వ్యక్తి ఢీకొన్నాడు. ఈ దర్ఘటనలో శ్రీనివాసులు అక్కడిక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో స్కూటర్ను కంటైనర్ లాకెళ్లడంతో స్కూటర్లో ఉన్న పెట్రోల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటలు కంటైనర్ క్యాబిన్లోకి చొచ్చకోవడంతో పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన కంటైనర్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ విషయం స్థానికులు ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ స్టేషన్ అధికారి వెంకట్రామిరెడ్డి తన సిబ్బందితో వచ్చి మంటలు అదుపు చేసి పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు. కంటైనర్లో ఉన్న సుమారు రూ. 25–30 లక్షల విలువ చేసే అమరన్ బ్యాటరీలు కాలిపోకుండా, నష్టం జరగకుండా చేశా రు. అనంతరం రాయచోటి ట్రాఫిక్ సీఐ కులాయప్ప తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై విచారించి కేసు నమోదు చేశారు. -
ఒంటిమిట్ట రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ దాడులు
● దాడుల్లో పట్టుబడ్డ వీఆర్వో ● కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కోనరాజుపల్లి వీఆర్వో శ్రీనివాసులు పట్టుబడినట్లు కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోనరాజుపల్లి గ్రామంలో రైతులు అయినటువంటి చింతకుంట రాజారెడ్డికి సర్వే నెంబర్ 195లో 1.79 ఎకరాలు, చింతకుంట రమణారెడ్డికి సర్వే నెంబర్ 201 లో 2.31 ఎకరాలు భూమి ఉందన్నారు. ఈ భూముల్లో ఇదివరకే ఉన్న బోర్లకు వొల్టా చట్టం కింద ఎన్వోసీ ధ్రువీకరణ పత్రాల కోసం 2025 డిసెంబర్ 19వ తేదీన స్థానిక రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు సంబంధించిన వివరాలను పరిశీలించి, రిపోర్టు తయారు చేయాలని ఆ గ్రామానికి చెందిన వీఆర్వో శ్రీనివాసులును తహసీల్దార్ దామోదర్ రెడ్డి ఆదేశించారు. అప్పటి నుంచి వీఆర్వో శ్రీనివాసులు దరఖాస్తు చేసుకున్న ఈ ఇద్దరి రైతుల నుంచి రూ. 9వేల చొప్పున మొత్తం రూ. 18వేలు లంచ అడిగినట్లు తెలిపారు. ఈ రూ.18వేలతో పాటు దరఖాస్తు చలానా ఇద్దరి రైతుల నుంచి రూ. 2వేలు చొప్పున మొత్తం రూ. 22వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. అయితే అంత ఇచ్చుకోలేని రైతులు రాజారెడ్డి, రమణారెడ్డి వీఆర్వోను తగ్గించమని ప్రాధేయపడగా ఒక్కొక్కరికి రూ. 8వేలు చొప్పున రూ.16 వేలు, దరఖాస్తు చెలానా రూ.2 వేలు చొప్పున మొత్తం రూ. 20వేలు ఇవ్వాలని లేని పక్షంలో మీ పని చేయలేనని బెదిరంచారన్నారు. వీఆర్వో చెప్పిన రూ. 20 వేల లంచంలో మొదటి విడతగా రూ.15 వేలు శుక్రవారం తీసుకురావాలని వీఆర్వో శ్రీనివాసులు ఆదేశించారన్నారు. అంత లంచం ఇవ్వడం ఇష్టంలేని రాజారెడ్డి కడప ఏసీబీ కార్యాలయంలోని తనను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగా శుక్రవారం వీఆర్వో శ్రీనివాసులు స్థానిక రెవెన్యూ కార్యాలయం వెనుక వైపు ఫిర్యాదుదారుడు రాజారెడ్డి వద్ద నుంచి మధ్యాహ్నం 2:39 గంటలకు రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా తాను, తమ సీఐలు శ్రీనివాసరెడ్డి, నాగరాజు, సిబ్బంది దాడులు చేసి, వీఆర్వో శ్రీనివాసులును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. కేసు విచారణ పూర్తి అయిన తరువాత వీఆర్వో శ్రీనివాసులును కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరచి, రిమ్యాండ్ కు పంపనున్నట్లు తెలిపారు. -
రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పీఎండీడీకేవై అమలు
పీలేరు: రైతుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) కార్యక్రమాన్ని అమలు చేయాలని నోడల్ అధికారి బాలమురగన్, కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. శుక్రవారం వారు మండలంలోని గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లెలో పర్యటించారు. స్థానిక రైతులు, ఎఫ్పీవోలతో మాట్లాడుతూ పీఎండీడీకేవై పథకం గూర్చి వివరించారు. జిల్లాలో మామిడి కాయలకు కవర్లను సబ్సిడీతో రైతులకు అందించి వాటిని మామిడి పంటకు ఏర్పాటు చేయించడం ద్వారా పంట ఉత్పత్తి, పంట నాణ్యత ఏ విధంగా పెరుగుతుందో తెలియజేశారు. ఈశ్వరయ్య అనే రైతు తన వ్యవసాయ భూమిలో మామిడి, మిరప, వేరుశెనగ పంటలను అధికారులకు చూపించి ఏ విధంగా మల్టీ క్రాపింగ్ చేస్తున్నాడో వివరించారు. మరో రైతు కృష్ణయ్య సాగు చేసిన డ్రాగన్ ఫ్రూట్, అందులో అంతర పంటగా సాగు చేసిన డేట్పామ్ తోటను పరిశీలించారు. పీలేరులో తమకు అనుకూలంగా మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. మామిడి పంటకు సూక్ష్మ పోషకాలు అందించగలిగే పంట బాగా వస్తుందన్నారు. పంటలకు ఇచ్చే బీమా, టమాట ప్రాసెసింగ్, తదితర అంశాలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, సూక్ష్మ నీటి పారుదల శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేడీఏ శివనారాయణ, జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి, జిల్లా సూక్ష్మ నీటి అధికారిణి లక్ష్మీప్రసన్న, జిల్లా పశువైద్యాధికారి గుణశేఖర్, తహసీల్దార్ శివకుమార్, ఏఎంసీ చైర్మన్ రామ్మూర్తి, రైతులు పాల్గొన్నారు. నోడల్ అధికారి బాలమురగన్, కలెక్టర్ నిశాంత్కుమార్ -
తల్లి పొత్తిళ్ల నుంచి.. ప్రార్థనా మందిరం మెట్లపైకి
ఆ తల్లికి తొమ్మిది నెలలు మోసినప్పుడు లేని బరువు...బయటకు వచ్చాక అనిపించిందేమో...కఠిన గుండె పేగు బంధం మరిచిందేమో...ఆడపిల్లని వద్దనుకుందో..లేక తల్లికి తెలియకుండా ఎవరైనా వదిలేశారో తెలియదు కానీ...బొడ్డు పేగు రక్తం మరక ఆరకనే పురిటిబిడ్డ ఎముకలు కొరికే చలిలో ప్రార్థనామందిరం మెట్లపై కనిపించింది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రించాల్సింది పోయి, ఆరుబయట చలి, మంచుకు తట్టుకోలేక ఏడుస్తూ కనిపించింది. ఎవరో చేసిన నేరానికి..భూమిమీద పడగానే పసికందు శిక్ష అనుభవిస్తోంది. ● మదనపల్లె పట్టణంలో అమానుష ఘటన ● ఎముకలు కొరికే చలిలో పురిటిబిడ్డను వదిలివెళ్లిన కసాయి ● ఐసీడీయస్ అధికారులకు అప్పగించిన పోలీసులు మదనపల్లె రూరల్ : మదనపల్లె పట్టణం తిరుపతిరోడ్డు బాలాజీనగర్లో ప్రార్థనా మందిరం మెట్లపైన శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఓ ఆడ పసికందును వదిలేసి వెళ్లారు. చిమ్మ చీకట్లో, ఓ వైపు చలి, మరో వైపు మంచు కురుస్తుండగా, తట్టుకోలేక పసిప్రాణం విలవిలలాడుతూ ఏడుస్తుంటే...ఉదయాన్నే బిడ్డ ఏడుపులు ఏందంటూ స్థానికులు బయటకు వచ్చి చూశారు. చుట్టూ ఎవరూ లేకపోవడం, బొడ్డు పేగు సైతం సరిగ్గా కత్తిరించకుండా, రక్తపుమరకలతో పసికందును గుర్తించారు. దీంతో స్థానికంగా ఉన్న మహిళ గౌతమి, బిడ్డను చేతుల్లోకి తీసుకుని, ఓదార్చింది. టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు...తక్షణం స్పందించి శిశువును ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఎన్ఐసీయూ విభాగంలో వైద్యులు పురిటిబిడ్డకు చికిత్సలు అందించారు. బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఐసీడీయస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సీడీపీఓ నాగవేణి, సూపర్వైజర్ కళావతి జిల్లా ఆస్పత్రికి చేరుకుని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బిడ్డకు టీకాలు వేయించి, ప్రొసీడర్స్ పూర్తిచేసి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనుమతితో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉన్న బాలసదన్ శిశుగృహకు తరలించి, మేనేజర్ సుప్రియకు అప్పగించారు. ఆడపిల్ల పుట్టిందనే వదిలి వెళ్లారా..? మరేమైనా కారణాలున్నాయా..? అనే కోణంలో ఐసీడీయస్ సిబ్బందితో స్థానికంగా విచారణ చేస్తున్నట్లు సీడీపీఓ నాగవేణి తెలిపారు. -
20న డైట్లో జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలు
● పోటీలకు 6,7,8 తరగతుల విద్యార్థులు అర్హులు ● రంగోత్సవ్ పోస్టర్లు ఆవిష్కరణ ● డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి రాయచోటి : ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి రంగోత్సవ్ పోటీలను జనవరి 20న రాయచోటి డైట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం డైట్ ప్రాంగణంలోని రంగోత్సవ్ పోస్టర్లను తోటి అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. రంగోత్సవ్ అనేది విద్యార్థులు తమలోని ప్రతిభను స్వేచ్ఛగా, సృజనాత్మకంగా ప్రదర్శించుకునే అద్భుతమైన వేదిక అని అన్నారు. విద్యార్థుల సహజ కళా ప్రతిభను గుర్తించి దాన్ని పెంపొందించడమే రంగోత్సవ్ ఉద్దేశ్యమన్నారు. పోటీలను ఐదు విభాగాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న 6,7,8 తరగతుల విద్యార్థులు ఈ పోటీలకు అర్హులన్నారు. ఒక విద్యార్థి ఒక పోటీలో మాత్రమే పాల్గొనాలన్నారు. పోటీలలో ప్రథమస్థాంలో నిలిచిన వారిని జనవరి 23న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు శివభాస్కర్, వైసీ రెడ్డప్పరెడ్డి, గిరిబాబు యాదవ్, తిరుపతి శ్రీనివాస్, వెంకటసుబ్బారెడ్డి, శివప్రసాద్, కలిముల్లా, మేరీ నిర్మల, ఓబుల్ రెడ్డి, యుగంధర్, ఛాత్రోపాధ్యాయులు ప్లాల్గొన్నారు. -
విద్యతోనే సమాజాభివృద్ధి
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి రాజంపేట : విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. అన్నమాచార్య యూనవర్సిటీ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసింగించారు. మూడు దశబ్దాల కిందట నల్లరాళ ప్రాంతం ఇప్పుడు అన్నమాచార్య యూనివర్సిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మహర్దశ కలిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యప్రదర్శనలు విద్యార్ధులను ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే ఆకేపాటి, చైర్మన్ పోలా, ఏయూ అధినేత చొప్పాగంగిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. చదువుతో పాటు సామాజిక బాధ్యత – ఏయూ ఉత్సవాల ముగింపు సభలో సినీనటుడు నిఖిల్ సిద్ధార్థ రాజంపేట అన్నమాచార్య యూనవర్సిటీ విద్యాసంస్థలలో చదువుతో పాటు సామాజిక బాధ్యత, నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, విలువలను అవలంభిస్తూ ఆదర్శంగా నిలవడం ప్రశంసనీయమని సినీనటుడు నిఖిల్ సిద్ధార్థఅన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీ వార్షికోత్సవ ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విలువైన సమయాన్ని వృథా చేయరాదన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చేవిధంగా, ఎంచుకున్న లక్ష్యాన్ని అధిగమించేలా ఇష్టపడి చదువుకోవాలన్నారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర కృషి తనను సినీరంగంలో నిలబెట్టిగలిగిందన్నారు. విద్యార్ధుల తమలోని ప్రతిభను నిరంతరం మెరుగుపరుచుకోవాలన్నారు. లక్ష్యంపట్ల నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలరన్నారు. వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఏయూ అధినేత చొప్పా గంగిరెడ్డి, ఏఐటీఎస్ వైస్చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, వీసీ డా.సాయిబాబరెడ్డి, రిజిస్ట్రార్ డా.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
పోగొట్టుకున్న పర్సు అందజేత
వాల్మీకిపురం : స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద ఒక వ్యక్తి తనకు దొరికిన పర్సును సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్పగించి మానవత్వం చాటుకున్నాడు. శుక్రవారం స్థానిక గ్రోమోర్లో పని చేస్తున్న మేనేజర్ రెడ్డి శేఖర్ పర్సు పోగొట్టుకున్నాడు. పర్సును దారిలో వెళ్తున్న సికిందర్కు దొరకడంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో అందించారు. విచారించిన ఎస్ఐ తిప్పేస్వామి పర్సు గ్రోమోర్ మేనేజర్ రెడ్డి శేఖర్ది అని తెలియడంతో అతనికి పర్సును అందించారు. పర్సులో నగదు, ఎటీఎం కార్డులు ఉన్నాయి. విద్యార్థికి తీవ్ర గాయాలు బి.కొత్తకోట : మండలంలోని బడికాయలపల్లె పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని హరిక (7)ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలకు గురైంది. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా వెనుకవైపు వచ్చిన వాహనం ఢీకొని వె వెళ్లిపోవడంతో హరికను స్థానిక సీహెచ్సీకి తరలించగా కాలు విరిగినట్టు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న సీఐ గోపాల్రెడ్డి, ఎంఈఓ రెడ్డిశేఖర్ బాలికను పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్నారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పుంగనూరు రెడ్డెమ్మక్వార్టర్స్కు చెందిన మహమ్మద్ హుస్సేన్ భార్య షాహీనా(40) కుటుంబసమస్యలతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఐసీయూ విభాగంలో చికిత్సలు అందిస్తున్నారు. మదనపల్లె పట్టణం రామారావుకాలనీకి చెందిన రామాంజులు కుమారుడు వెంకటరెడ్డి(33) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది నీరుగట్టువారిపల్లె సమీపంలోని కాట్లాటవారిపల్లె రోడ్డులో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. దొంగతనం కేసులో వ్యక్తి అరెస్టు పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక ప్రశాంత్ నగర్లో 2024లో చోరీకి పాల్పడిర నల్లమూతుల సురేష్ అనే వ్యక్తిని శుక్రవారం కదిరి రింగురోడ్డు సమీపంలో అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ సీతారాంరెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి 30 గ్రాములు బంగారు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
జమ్మలమడుగు : బాలికలు అన్ని రంగాల్లో రాణించడం కోసం తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా ప్రొత్సహించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ముద్దనూరురోడ్డులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న 69వ జాతీయ వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని వాలీబాల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి భానుమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా భూపేష్రెడ్డి మాట్లాడుతూ మొత్తం 27 టీంలు వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం వాలీబాల్ క్రీడల్లో గెలిచిన పశ్చిమ బెంగాల్ టీంకు, రన్నర్గా వచ్చిన హార్యానా టీంకు, మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ టీంలకు షీల్డ్లను బహుకరించారు. వాలీబాల్ విజేత పశ్చిమ బెంగాల్ : జాతీయ స్థాయి వాలీబాల్ విజేతగా పశ్చిమబెంగాల్ నిలిచింది. గురువారం జరిగిన మ్యాచ్లో గెలిపొంది క్వార్టర్ పైనల్కు వచ్చిన 8జట్ల మధ్య శుక్రవార సెమీఫైనల్ పోటీలను నిర్వహించారు. మొదట రాజస్థా న్–పశ్చిమ బెంగాల్ మధ్య జరిగిన మ్యాచ్లో పశ్చిమ బెంగాల్ గెలుపొందింది. అదేవిధంగా హర్యానా– తమిళనాడుల మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా జట్టు గెలుపొందింది. దీంతో ఫైనల్ మ్యాచ్లో పశ్చిమ బెంగాల్–హర్యానా జట్లు తలపడ్డాయి. -
ప్రకృతి అందాలకు పెట్టని కోట
జమ్మలమడుగు: 11వ శతాబ్దంలో చాణక్య రాజైన కాకరాజు గండికోట నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు. ఇప్పటికి గండికోట నిర్మాణం జరిగి 903 సంవత్సరాలు అవుతున్నట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ గోల్కొండ నవాబుల కాలంలో జుమ్మా మసీదు నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు సైతం గండికోటను పాలించినట్లు చరిత్ర చెబుతోంది. గండికోట వైభవాన్ని ప్రపంచానికి తెలియపరిచేందుకు గండికోట ఉత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రప ంచంలో ప్రఖ్యాతి గాంచిన గండికోట అందాలను వీక్షించడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు వచ్చిపోతున్నారు. గండికోట అభివృద్ధికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి శ్రీకారం చుట్టారు. గండికోటకు వచ్చే పర్యాటకులకు సరైన వసతుల కల్పన కోసం టూరిజం అభివృద్ధి కింద హరిత హోటల్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఇది పర్యాటకులకు ఎంతో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం గండికోటలో రిసార్టులతోపాటు, టూరిస్టుల కోసం టెంట్ కల్చర్ను తీసుకు రావడంతో పర్యాటకులు పెన్నానది అందాలు చూడటంతో పాటు సూర్యోదయం, సూర్యా స్తమయం వీక్షించి కనులపండువ చేసుకుంటున్నారు. పెన్నానది లోయ అందాలను ఫేస్బుక్, యూట్యూబ్లలో పెడుతుండటంతో భారీగా పర్యాటకులు వస్తున్నారు. 11 నుంచి గండికోట ఉత్సవాలు గండికోట ఉత్సవాలు ఈనెల 11వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ గాయని మంగ్లీ, రామ్ మిర్యాల పాటల కార్యక్రమం, ప్రముఖ డ్రమ్స్ శివమణితో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అసలు సమస్య రవాణా సౌకర్యం పర్యాటక కేంద్రమైన గండికోటకు సరైన రవాణా సౌకర్యం లేదు. ఆర్టీసీ బస్సులు ఉదయం, సాయంత్రం పూట మాత్రమే గండికోటకు ఉన్నాయి. ఆ తర్వాత ఆటోలపైనే పర్యాటకులు, స్థానికులు ఆధారపడవలసి వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం గండికోట ఉత్సవాలకు శ్రీకారం చుట్టినందున పర్యాటకులకు సరైన రవాణా సౌకర్యం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్సవాలకు ఏర్పాట్లుగండికోట ఉత్సవాల్లో జిల్లాలోని చరిత్రకారులు, కళాకారులకు ప్రాధాన్యత శూన్యమనే చెప్పాలి. ఇప్పటికి వరకూ సింగర్స్ మంగ్లీ, రామ్ మిర్యాల, డ్రమ్స్ శివమణి ఒక్కొక్క రోజు ఒకరు పాల్గొననున్నారు. ఆమేరకు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఫలితంగా ఆనాటి వైభవం ఉట్టి పడేలా ఉత్సవాలను నిర్వహించడం, జిల్లా ప్రజల్ని భాగస్వామ్యులను చేయడంలో విఫలమయ్యారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఈ నెల 11, 12, 13వ తేదీలలో గండికోట ఉత్సవాలు నిర్వహిస్తుంటే ఆ దిశగా ప్రణాళికలు, స్థానికుల భాగస్వామ్యం దక్కలేదు. పైగా గండికోట కేంద్రంగా పెమ్మసాని వంశస్థులు పాలించారు. వారిలో పెమ్మసాని చిన తిమ్మనాయుడు ప్రముఖుడు. వారి వారసుడు పెమ్మసాని ప్రభాకర్నాయుడు ఇప్పటికీ పలుమార్లు గండికోట ఉత్సవాలకు హాజరయ్యారు. కాగా, అధికార యంత్రాంగం జిల్లా ప్రజలతో పాటు, పెమ్మసాని వారసులను కూడా విస్మరించారు. గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మినహా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేది ఇప్పటికీ ప్రజానీకానికి స్పష్టత లేకుండా పోయింది. సినిమా సెట్టింగ్ తరహాలో ఏర్పాట్లు చేయడం మినహా గండికోట ఉత్సవాల్లో జిల్లా వాసుల భాగస్వామ్యం ఏముందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పర్యాటకులకు గండికోట అందాలతో పాటు మైలవరం జలాశయం, ఆకాశ మార్గం నుంచి పెన్నానది లోయ అందాలు ఎంతో అద్భుతంగా పర్యాటకులకు చూపించాలనే లక్ష్యంతో విశాఖపట్నంకు చెందిన విహంగ్ సంస్థ ప్యారమోటర్స్, హెలిక్యాప్టర్ల ద్వారా సన్నద్ధమైంది. ఈ క్రమంలో హెలిక్యాప్టర్ శనివారం గండికోటకు చేరుకోనుంది. హెలిక్యాప్టర్లో పర్యాటకులు వీక్షించాలంటే ఐదువేల రూపాయలు ఒక్కరికి చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నిమిషాల పాటు ఆకాశ మార్గంలో విహరించి గండికోట అందాలను చూపించబోతున్నారు. గండికోటకు 903 సంవత్సరాలు ఉత్సవాల సందర్భంగా విహంగ్ సవారి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చురుగ్గా ఏర్పాట్లు -
పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ
బొమ్మయ్యగారిపల్లె రైతు సేవా కేంద్రంలో పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు రొంపిచెర్ల రైతు కేంద్రంలో పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ చేస్తున్న అఽధికారులు రొంపిచెర్ల: పోలీసు బందోబస్తుతో చిత్తూరు జిల్లాలోని పలు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయాఽధికారులు శుక్రవారం యూరియా పంపిణీ చేశారు. నాలుగు రోజుల క్రితం గానుగచింత రైతు సేవాకేంద్రంలో యూరియా కోసం రైతులు ఘర్షణ పడటం అందరికీ విధితమే. వ్యవసాయ శాఖ అధికారులు దీనిని దృష్టిలో పెట్టుకుని రొంపిచెర్ల–2, బొమ్మయ్యగారిపల్లె రైతు సేవా కేంద్రాల్లో యూరియాను పోలీసు బందోబస్తుతో పంపిణీ చేయాల్సి వచ్చింది. ఒక రైతుకు ఒక బస్తా వంతున మాత్రమే ఇచ్చారు. రెండు రైతు సేవా కేంద్రాల్లో 800 బస్తాలకు శుక్రవారం 405 బస్తాల యూరియాను పంపిణీ చేసినట్లు ఏవో శ్రావణి తెలిపారు. మిగిలిన యూరియా బస్తాలను సోమవారం ఇస్తామని చెప్పారు. యూరియా కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూరియా పంపిణీలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ఖాదర్వల్లీ, వీహెచ్ఏలు ఉదయశ్రీ, తిరుమల, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ సొమ్మే కదా..?
● సచివాలయంలో ఎలక్ట్రికల్బైక్కు చార్జింగ్ ● ఆరునెలలుగా ఇదే తంతు చౌడేపల్లె : ప్రభుత్వ సొమ్మే కదా...? మనం కూడా వినియోగించుకొంటే అడిగేవారెవరున్నారు..? అనుకొన్నారేమో చౌడేపల్లె మండలం కాగతి సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్. ఆ ఉద్యోగి రోజూ విధులకు ఎలక్ట్రికల్ బైక్లో వస్తుంటారు. ఇంటి వద్ద చార్జింగ్ పెట్టకుండా ఏకంగా సచివాలయం వద్ద కు బైక్ను తెచ్చి చార్జింగ్ పెట్టుకొని ఎంచెక్కా.. షికారుతోపాటు ఇంటికి వెళ్ళడం గత ఆరునెలలుగా సాగుతోంది. ఇంటి వద్ద కరెంటు బిల్లు ఆదా చేయాలనుకున్నారేమో కానీ.. ప్రభుత్వ సొమ్ముతో తమకున్న ఎలక్ట్రికల్ బైక్కు పవర్ను పక్కాగా వాడేస్తున్న దృశ్యం శుక్రవారం సాక్షి కెమెరాకు చిక్కింది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మొగిల్రెడ్డిను విచారించగా ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాదని బదులిచ్చారు. -
ప్రజలకు దక్కని వాటా
సాక్షి ప్రతినిధి, కడప: కడప ద్విశతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కడపోత్సవాలు సైతం అదే తీరున చేపట్టారు. ఆ కార్యక్రమాల్లో జిల్లా కళాకారులకు ప్రాధాన్యత, చరిత్రకారులకు భాగస్వామ్యం దక్కింది. జిల్లా వ్యాప్తంగా ఉత్సవాన్ని స్వంత పండుగలా చేపట్టారు. ఇపుడు తద్భిన్నంగా గండికోట ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లా భాగస్వామ్యం కొరవడింది. సినీ కళాకారులకే పరిమితమైంది. అది కూడా ఇరువురు సింగర్స్, డ్రమ్స్ నిర్వాహకుడు ఒకరికి మాత్రమే పరిమితమైంది. దీంతో ఉత్సవాల నిర్వహణలో నాటికి, నేటికి ఎంత తేడా ఉందో విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ● కడపోత్సవాలను అప్పటి కలెక్టర్లు జయేష్రంజన్, అశోక్కుమార్..కడప ద్విశతాబ్ది ఉత్సవాలను కృష్టబాబు అద్భుతంగా నిర్వహించారు. ఇప్పటికీ జిల్లా వాసులకు గుర్తుండిపోయేలా నాటి కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలోని అన్ని రంగాల ప్రముఖులను భాగస్వామ్యులను చేశారు. జిల్లా వ్యాప్తంగా చరిత్రకారులు, కళాకారులు, రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధులతో చర్చించారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దిశగా కార్యచరణ ముందే సిద్ధం చేశారు. అప్పటి అధికారుల చిత్తశుద్ధి కారణంగానే అత్యంత పారదర్శకంగా చరిత్రలో గుర్తుండిపోయేలా ఉత్సవాలు చేపట్టారు. సమష్టి కార్యాచరణతో కడప ద్విశతాబ్ది, ఉత్సవాలు అంగరంగ వైభవంగా నాటి పాలకుల నిర్వహణ నేడు గండికోట ఉత్సవాల్లో కన్పించని నాటి ప్రణాళిక స్థానిక చరిత్రకారులు,కళాకారులకు దక్కని ప్రాధాన్యత -
జిల్లా ఫైర్ ఆఫీసర్గా ఆదినారాయణరెడ్డి
రాయచోటి టౌన్: అన్నమయ్య జిల్లా ఫైర్ ఆఫీసర్గా ఎం.ఆదినారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం నియోజక వర్గాల అధికారులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈయన స్థానంలో జిల్లా ఆఫీసర్గా పని చేసిన అనిల్ కుమార్ రెడ్డి గుంటూరు జిల్లా సత్తెనపల్లెకు వెళ్లారు. కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ యాన్యువల్ అకడమిక్ క్యాలెండర్ను అనుసరించి జిల్లా లోని అన్ని జూనియర్ కళాశాలలకు ఈ నెల 10వ తేది నుంచి 18వ తేది వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించినట్లు ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి టిఎన్యు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంక్రాంతి సెలవులలో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే బోర్డు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కడప ఎడ్యుకేషన్: ఈనెల 10వ తేదీ ఉదయం 9.30 గంటలకు కడప సీఎస్ఐ ఉన్నత పాఠశాలలో టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ(టీహెచ్బీఎస్) సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, బాలశౌరిరెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో పబ్బాపురం ప్లాట్ల సాధనపై ప్రత్యేక చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. కావున సొసైటీ సభ్యులంతా విరివిగా పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. మదనపల్లె సిటీ: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ది సంస్థ అధికారి జి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు రాయచోటి మండలం నక్కవడ్లపల్లి వద్దనున్న డీఎస్ఏ క్రికెట్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు జరుగుతాయన్నారు. మహిళలు స్కిప్పింగ్, తొక్కొడు బిళ్ల, కర్రసాము–పురుషులు, మహిళలు– లగోరీ( 7 పెంకులాట)–పురుషులు, తాడిపోరు (టగ్ ఆఫ్ వార్) పురుషులు, మహిళలు– గాలిపటం పోటీలు– పురుషులకు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో ప్రజలు, డ్వాక్రా, వెలుగు గ్రూపు మహిళలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాలకు 9154731106 నంబరులో సంప్రదించాలని కోరారు. -
● ప్రభుత్వ కార్యాలయాలతో ఆందోళన
మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలోని బిసెంట్ థియోసాఫికల్ కళాశాల (బీటీ కళాశాల) ఒక చరిత్రాత్మక విద్యా సంస్థ. 1915లో ఐరిష్ వనిత అన్నీబిసెంట్ స్థాపించిన ఈ కళాశాల దేశ స్వాతంత్ర పోరా టంలో జాతీయవిద్యకు కేంద్రమైంది. రాయలసీమలో తొలి కళాశాల, లక్షల మంది విద్యార్థులకు విద్యా దీపమై వెలిగి, స్వాతంత్య్ర ఉద్యమానికి కేంద్రంగా పోరుబాట నడిపించింది. తొలి తరం నుంచి మొన్నటి తరం వరకు ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్రెడ్డి, మాజీ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య లాంటి ఉన్నతస్థానాలకు ఎదిగినవారు, ఎందరో మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యావేత్తలు, పారిశ్రామిక, శాస్త్రవేత్తలు.. ఇలా అన్నిరంగాల్లో మేధావులను అందించిన బీటీ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా 5వేల మందికిపైగా విద్యార్థులతో కళకళలాడిన కళాశాలను ఇప్పుడు పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. వందల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఈ కళాశాలకు మళ్లీ పూర్వవైభవం తేవాలని, జిల్లాకు విశ్వవిద్యాలయం అందించాలన్న ఆశయంతో ఎంపీ పీవీ మిథున్రెడ్డి చేసిన కృషి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూటమి ప్రభుత్వం రాగానే నీరుగార్చింది. కళాశాల స్థితిగతులను గాలికి వదిలేసింది. ప్రస్తుతం కేవలం 154 మంది విద్యార్థులతో కళాశాల దీనంగా నడుస్తోంది. మిథున్రెడ్డి కృషితో.. ఎయిడెడ్ బీటీ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేసి నడపాలన్న డిమాండ్తో ఉద్యమాలు జరిగాయి. స్పందించిన ఎంపీ పీవీ మిథున్రెడ్డి ఈ విషయమై విద్యావేత్తలు, మేధావులతో సమీక్షించి.. చర్చలు జరిపి వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం సముచితమన్న నిర్ణయానికి వచ్చి బీటీ కళాశాల ట్రస్టీలతో చర్చించాక వారు సుముఖత వ్యక్తం చేశారు. దాంతో డిగ్రీ కళాశాలను, దానికి సంబంధించిన ఆస్తులు, వగైరాలు ప్రభుత్వానికి అప్పగించడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ 2022 ఆగస్టు, 16న జీవో జారీ చేసింది. తర్వాత అన్నయ్యజిల్లాకు విశ్వవిద్యాలయం లేకపోవడంతో ఎంపీ పీవీ మిథున్రెడ్డి కృషితో ప్రభుత్వం 2024 ఫిబ్రవరి, 9న అన్నీబిసెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవోలోనే మిథున్రెడ్డి సిఫార్సు మేరకు అని స్పష్టంగా పేర్కొన్నారు. విలువైన ఆస్తులు సమకూర్చి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నీబిసెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు జీవో జారీ చేయకముందే బీటీ కళాశాల ట్రస్ట్ నుంచి సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి చెందేలా చేసింది. కళాశాల ట్రస్ట్కు 47.36 ఎకరాలు ఉండగా, అందులో 11.86 ఎకరాలను ప్రభుత్వానికి, కళాశాలను అప్పగించారు. దాంతో విశ్వవిద్యాలయం చేసేందుకు కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. కావాల్సినన్ని భవనాలు, భూమి అందుబాటులోకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం అన్నీబిసెంట్ విశ్వవిద్యాల యం ఏర్పాటుపై చర్యలు తీసుకోకపోగా ఇప్పు డు కళాశాల భవనాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండటంపై ప్రజలు, సంఘాలు, పార్టీల నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. విశ్వవిద్యాలయం ఏర్పాటు కలను ప్రభుత్వం చెరిపేస్తోందన్న భావన కలుగుతోంది. బీటీ కళా శాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు అవుతున్నందున ఇక కళాశాల అభివృద్ధి ఉండదని, విశ్వవిద్యాలయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చర్చించుకొంటున్నారు. ఈ విష యమై ప్రజా సంఘాలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నా యి. బీటీ కళాశాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసి కళాశాలను ఎత్తివేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బీటీ కళాశాలకు యూనివర్సిటీగా గుర్తింపు అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు మంజూరు కూటమి పాలకుల నిర్లక్ష్యంతోఒక్క అడుగు ముందుకు పడలేదు ఇప్పుడు జిల్లా కార్యాలయాలకువినియోగంపై ఆందోళన ఐరిష్ వనిత, హోంరూల్ ఉద్యమంనడిపిన అన్నీబిసెంట్ స్థాపించినచరిత్రాత్మక విద్యాసంస్థ 1919, 1929లో ఠాగూర్, గాంధీ సందర్శన ఎంతో ఖ్యాతి కలిగిన కళాశాలమనుగడపై నీలినీడలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈపాటికి విశ్వవిద్యాలయ కార్యాచరణ మొదలై దాని ఫలితాలు కనిపించేవి. కూటమిపాలన రాకతోనే ఈ కళాశాలను నిర్లక్ష్యం చేశారు. ఇంటర్మీడియట్ కోర్సులు ఎత్తేశారు. డిగ్రీ కళాశాల నిర్వహణ ఉన్నప్పటికీ, దాని అభివృద్ధికి ఒక్క చర్య తీసుకోలేదు. అడ్మిషన్ల పరిస్థితి, అధ్యాపకులు, సిబ్బంది స్థితిగతులపైనా సమీక్ష లేదు. ప్రిన్సిపాల్ రిటైర్ అయి నెలలు గడుస్తున్నా రెగ్యులర్ ప్రిన్సిపాల్ నియామకం లేదు. విద్యార్థుల సంఖ్య పెంచే చర్యలు శూన్యం. చరిత్ర కలిగిన కళాశాల విషయంలో కూటమి పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని ఫలితంగానే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముందడుగు పడటం లేదు. దీనిని గత ప్రభుత్వం చేపట్టింది, తమకెందుకనే ధోరణి వ్యక్తం అవుతోంది. దాంతో పేద విద్యార్థులకు అందించే విద్యపైన రాజకీయాలు మొదలయ్యాయి. ప్రస్తుతం డిగ్రీకళాశాలలో మూడేళ్లకు కలిపి కేవలం 154 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. స్పందన లేకుంటే ఉద్యమరూపం బీటీ కళాశాలకు పూర్వవైభవం తేవడమే కాక, విశ్వవిద్యాలయంతో విద్యాభివృద్దికి కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంగా భావించకుండా పేద విద్యార్థులు, మారుమూలన ఉన్న మదనపల్లె అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేకుండా చర్య లు చేపట్టాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. లేనిపక్షంలో ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ సంఘాలు కళాశాల అభివృద్ధిని, భవిష్యత్తును ప్రశ్నిస్తున్నాయి. దీంతో పరిస్థితులు ఉద్యమరూపం దాల్చకముందే ప్రభుత్వం స్పందించాలని పరిశీలకులు కోరుతున్నారు. -
నేడు తలనీలాల సేకరణకు వేలం
సిద్దవటం : మండలంలోని వంతాటిపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజ స్వామి భక్తుల తలనీలాల పోగు హక్కు కోసం శనివారం సిద్దవటంలోని రంగనాయక స్వామి ఆలయంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 14 నుంచి 16వ తేదీ వరకు నిత్యపూజ స్వామి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు స్వామి వారికి సమర్పించు తలనీలాల ప్రోగు హక్కు కోసం వేలంలో పాల్గొనే పాటదారుడు డిపాజిట్ లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వేలం ముగిసిన వెంటనే హెచ్చు పాటదారుడు మిగిలిన డబ్బులు చెల్లించి అధికారుల వద్ద రసీదు పొందాలన్నారు. గంగమ్మకు రాహుకాల పూజలు చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేకపూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయం 10:30 గంటలనుంచి 12 గంటల వరకు సాంప్రదాయరీతిలో అర్చనలు ,అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి మొక్కులు తీర్చారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. -
క్యూ ఆర్ కోడ్తో సులభంగా భూ వివరాలు
కలెక్టర్ నిశాంత్కుమార్ కలకడ: క్యూ ఆర్కోడ్ పట్టాదారు పాస్బుక్కు ద్వారా భూ యజమాని, భూమి వివరాలను సులభంగా తెలుకోవచ్చునని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలకడ మండలంలోని దేవులపల్లె గ్రామం సచివాలయంలో నిర్వహించిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్బుక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధునాతన సాంకేతికతద్వారా భూ వివాదాలను సులువుగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూగ్రామ సభ లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులను పట్టాదారు పాస్బుక్కుల నమోదులో తప్పులు ఉంటే ఆధార్నెంబర్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. పట్టాదార్ పాస్పుస్తకాలలో తప్పులు దొర్లితే వెంటనే పరిష్కరించాలని మండల తహసీల్దార్ మహేశ్వరిభాయ్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, సర్వేయర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
● అధినేతను కలసిన అజయ్ రెడ్డి
ఉపాధి సిబ్బందికి పండుగ భారమే ! కడప సిటీ : ఉపాధి హామీ సిబ్బందికి కూటమిప్రభుత్వం వేతనాలు మంజూరు చేయకపోవడంతో పండుగ భారంగా మారబోతోందని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 మంది ఏపీఓలు, 40 మంది ఈసీలు, 160 మంది టీఏలు, 100కు పైగా కంప్యూటర్ ఆపరేటర్లు, 619 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వాటర్షెడ్ సిబ్బంది ఉపాధి హామీలో పనిచేస్తున్నారు. కనిష్టంగా రూ. 9 వేల నుంచి గరిష్టంగా రూ. 72 వేల వరకు వేతనాలు అందాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిపితే రూ. 2 కోట్ల మేర నిధులు ప్రతినెల వేతనం కింద ప్రభుత్వం చెల్లించాలి. గతంలో ఆలస్యమైనా ఓపికతో ఉన్న సిబ్బంది అప్పో సప్పో చేసుకుని కుటుంబ పోషణ సాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ సమీపిసున్నా జీతాలు తమ ఖాతాల్లో పడకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ వేతనాలు అందజేయాలని కోరుతున్నారు. -
రామసముద్రంలో వైభవంగా ఇస్తిమా
రామసముద్రం : మండల కేంద్రంలో బుధ, గురువారాల్లో నిర్వహించిన ఇస్తిమా వేడుకలు వైభవంగా జరి గాయి. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. భక్తు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం, పరోపకారం, ప్రపంచ మానవాళి సుఖ, సంతోషాల తో జీవనం సాగించాలని ప్రార్థనలు చేశారు. మత పె ద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వారి అమూల్యమైన మాటలు శ్రద్ధగా విన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ ఉమా మాహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
కృషి,పట్టుదలతో ఏదైనా సాధ్యమే
సినీనటి శ్రీదేవిని సత్కరిస్తున్న ఏయూ అధినేత చొప్పా గంగిరెడ్డి, ఏయూ వార్షికోత్సవ సభకు హాజరైన వేలాది మంది విద్యార్ధులు రాజంపేట: సాధారణ నేపథ్యం నుంచి సినీపరిశ్రమలో నటిగా స్థిరపడ్డానంటే సవాళ్లను ఎదుర్కొవడంతో పాటు, కృషి, పట్టుదల కారణమని ప్రముఖ సినీనటి శ్రీదేవి అప్పల అన్నారు. గురు వారం రాత్రి అన్నమాచార్య యూనివర్సిటీ వార్షికోత్సవంలో భాగంగా క్రీడా–సాంస్కృతిక దినోత్సవం సభకు ఆమె ముఖ్యఅతిఽథిగా హాజరై ప్రసంగించారు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకుని నిరంతర శ్రమ,క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో మందుకు సాగితే ఏ రంగాలోనైనా విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై స్పష్టతతో ముందుకుసాగుతూ, తమలోని నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ , నాయకత్వ లక్షణాలు జీవిత విజయానికి కీలకమని వివరించారు. ఏయూ అధినేత చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఇందుకు అన్నమాచార్య యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు నాణ్యమైనబోధన, అధునాతన సౌకర్యాలను కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారకీ కార్యక్రమంలో ఏఈటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, వీసీ సాయిబాబారెడ్డి, రిజిస్ట్రార్ మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ నారాయణ, కార్యనిర్వహణ కమిటీ సభ్యులు డాక్టర్ బి.జయరామిరెడ్డి, డాక్టర్ ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో , ఆటలలో విజేతలైన వారికి సినీనటి శ్రీదేవి బహుమతులను అందచేశారు. విద్యార్థులు భారతీయ జ్ఞాన కేంద్రం భావనను ప్రతిబింబించే నృత్యాలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ, జానపద నృత్యాల ప్రదర్శనతో అలరించారు. ఏయూ వార్షికోత్సవ వేడుకసభలో సినీనటి శ్రీదేవి అప్పల -
గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
పుంగనూరు : పట్టణంలోని హౌసింగ్ కార్యాలయంలో పీడీ రమేష్రెడ్డి హౌసింగ్ సిబ్బందితో కలసి సమావేశం నిర్వహించారు. గురువారం పుంగనూరు, చౌడేపల్లె, సోమల మండలాల హౌసింగ్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పీడీ రమేష్రెడ్డి మాట్లాడుతూ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలని తెలియజేశారు. లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈ దీన్దయాల్రాజు, ఏఈలు, వర్కింగ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
కమిషనర్లకు బదిలీల గ్రహణం
రాజంపేట : పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పురపాలకసంఘంపై పచ్చపెత్తనంతో అధికారులు అవినీతికి ద్వారాలు తెరిచేశారన్న ఆరోపణలు పట్టణవాసుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రతి పనికి కమిషన్ అనే నినాదంతో వివిధ విభాగాలకు చెందిన కొందరు అధికారులు తమ విధులు చక్కబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి విధులకు వచ్చిన కమిషనర్ల మద్దతు లేకుంటే జరగదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో కమిషనర్ల బదిలీలకు దారితీస్తోందన్న వాదన లేకపోలేదు. పుర పాలికను అవినీతి జలగలు పట్టిపీడిస్తున్నా ఉన్నతాధికారులు చోద్యం చూడటమే తప్ప చేసేదే లేదు..ఇందుకు కారణం పచ్చపెత్తనమే అని బహిరంగగానే వ్యా ఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన కమిషనర్లు పచ్చపెత్తనానికి ఎదురొడ్డితే బదిలీ వేటునపడాల్సిన పరిస్ధితులు దాపురించాయని పట్టణవాసులు ఆందోళ న చెందుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు మారడం విశేషం. తాజాగా కమిషనర్గా కడప కార్పొరేషన్లో శ్యానిటరీ సూపర్వైజరుగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. మరీ ఈయన ఎన్నినెలలు ఉంటారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాట వినకుంటే..బదిలీనే.. పచ్చపెత్తనంలో భాగంగా తమ మాట వినకుంటే..కమిషనర్లు వెంటనే బదిలీ అవుతున్నారు. మరికొంతమంది కాసుల కక్కుర్తితో కూటమినేతల కబంధహస్తాల్లో చిక్కుతున్నారు. పట్టణాభివృద్ధికి సంబంధించి కూటమి నేతలు పురపాలకసంఘానికి సహకారం ఉండదు కానీ, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పనులతోపాటు పలు కార్యకలాపాలకు కమిషనర్లు అనుకూలంగా కొనసాగించలేకపోతే, అప్పుడే కూటమి నేతల నుంచి ఆరోపణలు ఎదుర్కోవాల్సివస్తోంది. కమిషనర్ల బదిలీలకు సంబంధించి ముఖ్యనేత సిఫార్సు లేఖకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల నుంచి...వరుసపెట్టి.. సార్వత్రిక ఎన్నికల సమయంలో కమిషనరుగా జనార్ధన్రెడ్డి పనిచేశారు. తర్వాత ఆయనను బదిలీ చేశారు. అనంతరం రాంబాబును నియమించారు. ఈయనను అధికారపార్టీ నాయకులు ముప్పుతిప్పలు పెట్టారు. చివరికి గదిలో బంధించి, గొడవకు దిగారు. ఎస్సీఎస్టీ కేసుకూడా పెట్టారు. చివరికి టీడీపీ నేతల ఆగడాలకు మానసికంగా అనారోగ్యంపాలయ్యారు. వేలూరు ఆసుపత్రిలో చికిత్సపొందేందుకు లాంగ్లీవ్ పెట్టి వెళ్లిపోయారు. నెల్లూరు కార్పొరేషన్ నుంచి నాగేశ్వరరావు కమిషనరుగా రాజంపేటకు వచ్చారు. వచ్చీరాగానే వివాదాల్లో ఇరుక్కున్నారు. గతంలో ఆరోపణల నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం శ్యానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాసులును కమిషనర్గా రాజంపేటకు ప్రభుత్వం నియమించింది. ఈయన రాగానే అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈయనను కూడా ఇటీవల ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. శానిటరీఅధికారులే..కమిషనర్లు మేజర్ పంచాయతీగా ఉన్న రాజంపేట దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో నగర పంచాయతీగా మారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాజంపేట పురపాలకసంఘం గ్రేడ్–2గా మారింది.టీడీపీ ప్రభుత్వం వచ్చాక పురపాలిక అభివృద్ధి అటుంచి, కమిషనర్ల బదిలీ, కమిషన్లు, స్వలాభర్జన దిశగా టీడీపీ నేతలు ముందుకు సాగుతున్నారు. పచ్చపెత్తనంలో కమిషనర్లు విలవిలలాడుతున్నారు. చివరికి చికెన్ వేస్ట్ను కై వసం చేసుకునేందుకు కూడా పురపాలిక పచ్చరాజకీయంతో వేడెక్కుతోంది. -
హుండీ ఆదాయం రూ.49.14లక్షలు
చౌడేపల్లె: ప్రముఖ బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా రూ.49.14లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఇందులో బంగారం 19గ్రాములు , వెండి 292 గ్రాములు సమకూరినట్లు పేర్కొన్నారు. వీదేశీ కరెన్సీ నోట్లతోపాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ.28,943 నగదు లభించినట్లు తెలిపారు. ఈ ఆదాయం31 రోజులకు వచ్చినట్లు ఈఓ చెప్పారు. చిత్తూరు దేవదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ చిట్టెమ్మ, ఆలయ, ఏపీజీ బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: కేంద్రీయ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 9, 11 తరగతుల ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 11 నుంచి హాల్టిక్కెట్లు పొందవచ్చునని మదనపల్లె జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ ఎం.గీత ఓ ప్రకటనలో తెలిపారు. హాల్టిక్కెట్లు డౌన్లోడ్లో ఏదైనా సమస్య వున్నా రిజిస్ట్రేషన్ నంబర్ మరచిపోయినా హెల్ప్డెస్క్ 89199 56395, 80743 05048కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్ష 7.2.2026న (శనివారం) జరుగుతుందని తెలియజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 11వ తరగతికి మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎ,బి కేంద్రాలు, 9వ తరగతికి మదనపల్లె హోప్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, జవహర్ నవోదయ విద్యాలయ, వలసపల్లెలో పరీక్షలు నిర్వహణ ఉంటుందని వివరించారు. పరీక్షలు ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ హుండీ ఆదాయం పెరిగింది. గురువారం ఆలయ టీటీడీ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 9 నుంచి జనవరి 8వ లేది వరకు శ్రీరాముడిని దర్శించుకున్న భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను లెక్కించగా రూ. 10,15,154 వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆలయ రంగమండపంలో ఈ లెక్కింపు జరిగింది. గత నెల రూ. 5,91,855 రాగా ప్రస్తుతం రూ.4,23,299 పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. కడప సెవెన్రోడ్స్: జిల్లా పర్యాటకరంగ ప్రముఖులు సిద్దవటం సీతారామయ్య వర్ధంతి కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు నగరంలోని సాయిబాబా థియేటర్ సమీపంలోని గ్రాండ్ ఇన్ హోటల్లో నిర్వహించనున్నట్లు కొండూరు జనార్దన్రాజు తెలిపారు. రాజంపేట: రాజంపేట తహసీల్దారు కార్యాలయం ఆవరణలో కుక్కలదాడిలో పునుగుపిల్లి మృత్యువాతకు గురైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన వన్యప్రాణిగా గుర్తించబడిన పునుగుపిల్లి పట్టణ ప్రాంతానికి ఎలా వచ్చిందో అన్న అనుమానాలు తలెత్తాయి. అటవీ అధికారులకు సమాచారం రాగానే పునుగుపల్లి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజంపేట పశుసంవర్దకశాఖ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అటవీ ప్రాంతంలో దహనం చేశారు. శేషాచలం అటవీ ప్రాంతానికి పరిమితమైన పునుగుపిల్ల జననివాసాల్లోకి కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
సేంద్రియ వ్యవసాయంతో బహుళ ప్రయోజనాలు
● జేడీఏ శివనారాయణ కేవీపల్లె: సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా రైతులు బహుళ ప్రయోజనాలు పొందవచ్చని జేడీఏ శివనారాయణ అన్నారు. గురువారం మండలంలోని వగళ్ల, తిమ్మాపురం గ్రామ పంచాయతీలలో పర్యటించి వివిధ రకాల పంటలను పరిశీలించారు. వగళ్లలో వర్మీకంపోస్టు యూనిట్ను పరిశీలించారు. వేరుశెనగ పొలాన్ని పరిశీలించి రైతులకు సూచనలిచ్చారు. తిమ్మాపురం పంచాయతీ చిన్నకమ్మపల్లెలో డ్రమ్ సీడర్ పద్ధతిలో వరిసాగు చేస్తున్న పొలంను పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీఏ రైతులకు పలు సూచనలు చేశారు. స్థానికంగా వ్యవసాయ సిబ్బంది ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏవో మాధవి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీ ఎస్ఎస్డీసీ, జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని జొయలుక్కాస్ జ్యువెలరీలో ప్రముఖ కంపెనీలతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివి 19–30 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థి విద్యార్హతలకు సంబంధించిన ధృవపత్రాలు, ఫొటోలు తీసు కుని ఇంటర్వ్యూకు రావాల్సి ఉంటుందన్నారు. -
కూలీల సంఖ్య పెంచకపోతే చర్యలు తప్పవు
పీడీ వెంకటరత్నంరామసముద్రం : ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచకుండా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని పీడీ వెంకటరత్నం హెచ్చరించారు గురువారం రామచంద్ర మండలం లోని ఈజీఎస్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు పని కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. పనుల్లో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవన్నారు. కూలీలకు పనులను కల్పించాలని, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజీవికమిషన్ గ్రామీణ్ గురించి తెలియజేశారు. ప్రస్తుతం 125 రోజులు పని దినాలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయన్నారు. నీటి సంరక్షణ, నీటి నిల్వ పనులను చేపట్టాలని ఫారంపాండ్స్, కంపోస్ట్ పిట్స్ పనులు చేపట్టాలని తెలిపారు. అనంతరం మానేవారిపల్లి అరికెల పంచాయతీలలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. మానే వారి పల్లి పంచాయతీ దాసిరెడ్డిగారిపల్లి వద్ద సమస్యగా ఉన్న రోడ్డుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంపై పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. గోపాల్ రెడ్డి కొబ్బరి తోటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారి పల్లిలో నిర్మించిన పశువుల షెడ్డు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో మాధవి, జె ఈ రెడ్డిశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. -
పేద పిల్లలకు అండ.. అభినందనీయం
రాయచోటి : పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన చిన్నారులను సేవా దృక్పథంతో ఆదుకోవడంలో నిజమైన భక్తి ఉందని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. గురువారం రాయచోటిలోని గుట్టపై వెలసిన అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామి సేవా సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పేద పిల్లలకు ఉచితంగా దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురుస్వామి బయ్యారెడ్డి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో దాతలు సమకూర్చిన నూతన వస్త్రాలను చిన్నారులకు ఎస్పీ అందజేశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి అర్బన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు బివి చలపతి, కుళాయప్ప, అయ్యప్ప స్వామి ట్రస్టు ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రామసముద్రం : ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరుకు చెందిన ఇస్మాయిల్ (45) రామసముద్రంలో ఇస్తిమా కు వస్తుండగా దిన్నిపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఇస్మాయిల్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందివ్వడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్క అడ్డురావడంతో.. – బైక్పై నుంచి పడి ముగ్గురికి గాయాలు రొంపిచెర్ల : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన రొంపిచెర్ల మండలం ఫజులుపేటలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గానుగచింత గ్రామ పంచాయతీ మద్దిపట్లవారిపల్లెకు చెందిన మహేంద్రనాయుడు, శేషముని నాయుడు, జస్వంత్ ద్విచక్ర వాహనంలో రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు వెళుతుండగా ఫజులుపేట వద్ద కుక్క అడ్డు రావడంతో ఢీకొని కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయ పడ్డారు. స్థానిక ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని వెళ్లారు. రోడ్డు మీద కుక్కలు వీపరీతంగా ఉన్నాయని, ద్విచక్ర వాహనాల్లో వెళుతున్నవారిపై ఎగ బడుతున్నాయని వాహనదారులు తెలిపారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బొలెరో, బైక్ ఢీ: రియల్టర్ మృతి కురబలకోట : రోడ్డు ప్రమాదంలో రియల్టర్ మృతి చెందిన విచారకర సంఘటన కురబలకోట మండలంలో గురువారం చోటుచేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు..మదనపల్లి రూరల్ మండలం సీటీఎం సోమలగడ్డకు చెందిన రెడ్డెప్ప (52) పరిసర ప్రాంతాల్లో రియల్టర్గా కొ నసాగుతున్నారు. ఇతను భవన నిర్మాణ పనులు చేపట్టాడు. గురువారం సాయంత్రం టైల్స్ కోసం మదనపల్లి దగ్గరున్న అమ్మచెరువు మిట్ట వద్దకు వెళ్లాడు. అనంతరం ద్విచక్రవాహనంలో మదనపల్లె హైవేపై అవతలి రోడ్డుపైకి వెళ్లడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఎదురుగా వాహనాలు వస్తుండడంతో ఆపాడు. హైవేపై వెనుకగా వచ్చిన బొలెరో వాహనం ఇతన్ని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రెడ్డెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని స్థానిక సీఐ రవి నాయక్ సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు. చికిత్సపొందుతూ.. పీలేరురూరల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్కూటరిస్తు మృతి చెందినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. వివరాలి లావున్నాయి, పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణావడ్డిపల్లెకు చెందిన సి. వెంకటేష్ (28) బుధవారం ద్విచక్రవాహనంలో యల్లంపల్లె నుంచి స్వగ్రామానికి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొ న్న విషయం విధితమే. ఈ ప్రమాదంలో గాయప డిన వెంకటేష్ను చికిత్సనిమిత్తం తిరుపతి రుయా కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య అన్నపూర్ణ, కుమారులు ధీరజ్, అరుణ్, ధనుష్ ఉన్నారు. మృతుడు ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. -
మదనపల్లె కోర్టులకు బాంబు బెదిరింపు
మదనపల్లె రూరల్: పట్టణంలోని కోర్టులకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. చిత్తూరు జిల్లా కోర్టుకు ఈ–మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో న్యాయాధికారులు మెయిల్ ద్వారా వచ్చిన లేఖలను పోలీసులకు అందించారు. మదనపల్లెలోని కోర్టు సిబ్బందిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ మహమ్మద్ రఫీ, తాలూకా సీఐ కళావెంకటరమణ పోలీసు సిబ్బందితో కోర్టు ఆవరణకు చేరుకున్నారు. కోర్టు ప్రాంగణం, పరిసరాలు, కోర్టు భవనాలు క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు బెదిరింపు సమాచారాన్ని బాంబ్ స్క్వాడ్కు తెలియజేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ కోర్టుకు చేరుకుని జిల్లా ఏడీజే కోర్టుతో పాటు మిగిలిన 8 కోర్టు భవనాలలోనూ బాంబ్ డిటెక్టింగ్ యంత్రం సహాయంతో తనిఖీలు చేపట్టారు. బాంబులు లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తాం
మదనపల్లె రూరల్ : 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే, ఈనెల 12 తర్వాత సమ్మెలోకి వెళ్తామని 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్(సీఐటీయూ) జిల్లా గౌరవఅధ్యక్షులు ఎ.రామాంజులు, జిల్లా అధ్యక్షులు రమణయాదవ్, ప్రధాన కార్యదర్శి బీవీ.చలపతి పేర్కొన్నారు. గురువారం 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో మధుసూదనరావుకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..రూ.4వేలు వేతనం పెంచుతూ ప్రభుత్వం జీఓ.నంబర్ 49 ఇచ్చినప్పటికీ, పూర్తిస్థాయి వేతనం అమలుచేయకుండా కేవలం రూ.2వేలు ఇవ్వడం సరికాదన్నారు. ఉద్యోగుల వేతనం నుంచి పీఎఫ్ కట్చేసి, యాజమాన్యం వాటా పీఎఫ్ బ్యాంకు ఖాతాకు జమచేయకపోవడం దుర్మార్గపుచర్యగా పేర్కొన్నారు. ఒకో నెలలో కొందరికి కారణం తెలపకుండా వేతనాలు తగ్గించి ఇస్తున్నారన్నారు. కనీసం పే స్లిప్ ఇవ్వనటువంటి భవ్య యాజమాన్యంపై అధికారుల చర్యలు శూన్యమన్నారు. చిన్న చిన్న కారణాలు చూపి ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాల సర్వీసు ఉన్నవారికి మళ్లీ పరీక్ష ఉత్తీర్ణులైతేనే నియామకం ఇస్తామని చెప్పడంపై ఉద్యోగ భద్రత గాల్లో దీపంగా ఉందన్నారు. వెంటనే పరీక్షలు రద్దుచేసి, ఐదేళ్ల సర్వీసు ఉన్నవారికి స్లాబ్ అప్గ్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలీవింగ్ బిల్లులు, ఐటీడీఏ అలవెన్సులు క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. క్యాజువల్ లీవులు, పండుగ సెలవులు అమలుచేయాలన్నారు. పనిచేసే ప్రదేశంలో షెల్టర్, వాహన క్లీనింగ్ తదితర సౌకర్యాలు కల్పిస్తూ, 8 గంటల పని అమలుచేయాలని కోరారు. వాహన మరమ్మతులు ప్రభుత్వమే చేయించి సిబ్బందికి అప్పుల బాధ నుంచి ఉపశమనం కలిగించాలన్నారు. జిల్లాకు ఒకటి కాకుండా డివిజన్కు ఒక గ్యారేజీ ఏర్పాటుచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 108 సిబ్బంది పాల్గొన్నారు. -
మదనపల్లెకు పతకాల పంట
మదనపల్లె: జాతీయ స్థాయి స్కయ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో మదనపల్లె విద్యార్థులు అద్భు త ప్రతిభ చూపించారు. ఈ వివరాలను చైర్మన్ ఇస్మాయిల్, కోచ్ ఖాదర్ బాషా గురువారం వెల్లడించారు. 26వ జాతీయ స్థాయి స్కయ్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు జనవరి 5 నుంచి 7 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం జరిగాయి. ఈ పోటీలకు ఏపీ నుంచి 94 మంది విద్యార్థులు పాల్గొంటే అందులో 24 మంది మదనపల్లె విద్యార్థులే కావడం విశేషం. ఇందులో 15 మంది బంగారు పతకాలు, ఆరు గురు రజత పతకాలు, 16 మంది కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. మెడల్ సాధించిన విద్యార్థులను స్కయ్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఇబ్రహీం, చైర్ పర్సన్ ఇస్మాయిల్ అభినందించారు. -
మూర్చవ్యాధితో పొలంలోనే రైతు మృతి
కలకడ : మండలంలోని నడిమిచెర్ల గ్రామంలో ఓ రైతు మూర్చవ్యాధితో పొలంలో పడి మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. నడిమిచెర్ల గ్రామానికి చెందిన రైతు నరసింహులు (45) మంగళవారం రాత్రి వరి పొలం వద్దకు వెళ్లాడు. బుధవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా బురదలో పడి ఉన్నాడు. నరసింహులుకు మూర్చవ్యాధి ఉన్నట్లు, అందువల్లే మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు నరసింహులుకు భార్య నిర్మల, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిరు పేద రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు
పీలేరురూరల్ : రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మండలంలోని ఠాణావడ్డిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణావడ్డిపల్లెకు చెందిన సి.వెంకటేష్ (28) ద్విచక్రవాహనంలో యల్లంపల్లె నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటేష్కు ఎడమకాలు విరిగింది. తలకు బలమైన గాయమైంది. స్థానికుల సాయంతో క్షతగాత్రున్ని చికిత్సనిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మార్కెట్ కమిటీ డైరెక్టర్పై టీడీపీ నాయకుల దాడి
మదనపల్లె రూరల్ : మార్కెట్ కమిటీ డైరెక్టర్, టీడీపీ నాయకులు మున్నా నాయక్పై, అదే పార్టీకి చెందిన నాయకులు దాడికి పాల్పడ్డారు. బుధవారం పట్టణంలోని జేఎన్ఆర్ గ్రాండ్ హోటల్లో, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ పార్టీ పరిశీలకులు గురుమూర్తి హాజరయ్యారు. సమావేశంలో కోటవారిపల్లె సర్పంచ్ అభ్యర్థి ఎంపిక విషయంపై ప్రస్తావన వచ్చింది. మార్కెట్కమిటీ డైరెక్టర్ మున్నా, తనకు అవకాశం ఇవ్వాలని కోరగా, కొందరు వ్యతిరేకించారు. నిన్న లేక మొన్న నాయకులైన వారికి పదవులు ఇస్తారా అని అడిగితే, 11 నెలల క్రితం పార్టీలో చేరిన వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించుకున్నాం కదా అని మున్నా నాయక్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సమావేశం ముగిసిన తర్వాత ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మున్నా నాయక్ను, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు షంషీర్, స్నేహితుడైన టీడీపీకి చెందిన రఘునాయక్, లాల్బాషాలు నిలదీశారు. ఎమ్మెల్యేపైనే మాట్లాడేంత గొప్ప వ్యక్తి నువ్వా అంటూ నిలదీశారు. నియోజకవర్గ పరిశీలకులు గురుమూర్తి గౌడ్ ఎదుట మున్నానాయక్పై, ఉన్న పళంగా రఘునాయక్, లాల్బాషా దాడికి పాల్పడ్డారు. చెంపపై బలంగా కొడుతూ చేయి విరిచే ప్రయత్నం చేశారు. దీంతో మున్నానాయక్ చేయికి గాయమైంది. పార్టీ పరిశీలకుడి ఎదుటే మార్కెట్ కమిటీ డైరెక్టర్ను, సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు కొట్టడంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం డిమాండ్ చేశారు. మున్నానాయక్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. దీంతో విషయం పెద్దది అవుతుందని భావించిన ఎమ్మెల్యే షాజహాన్బాషా... ఈ విషయంలో జోక్యం చేసుకుని, మార్కెట్కమిటీ డైరెక్టర్ మున్నానాయక్ను, దాడిచేసిన రఘునాయక్, లాల్బాషాను ఇంటికి పిలిపించి కుటుంబ సమస్యతో వాగ్వాదం జరిగిందని చెప్పించారు. -
పాసు పుస్తకాల్లో తప్పులు
● అధికారులకు తప్పని నిలదీతలు ● అధిక భూ విస్తీర్ణం నమోదుపై మండిపడుతున్న రైతులుపెద్దతిప్పసముద్రం : చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమంటూ ఊదర గొడుతూ చేపట్టిన పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీతో రెవెన్యూ అధికారులు రైతుల నుంచి చీవాట్లు ఎదుర్కొంటున్నారు. తప్పులన్నీ చేసేదీ మీరే..మళ్లు మా జేబులకు చిల్లులు పెట్టి చలానా కట్టించుకుని సవరించేది మీరేనా అంటూ రైతులు అధికారులపై మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మండలంలోని మడుమూరు సచివాలయం ఎదుట పాసు పుస్తకాల పంపిణీపై రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. పుస్తకాలు అందుకున్న రైతులు అందులో ఇష్టారాజ్యంగా పొందు పరచిన భూ వ్యత్యాసాలను చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అస్తవ్యస్తంగా వివరాలు నమోదు చేసి ఇస్తున్న ఈ పుస్తకాల కోసమా ప్రభుత్వం రూ. కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని రైతులు ఎద్దేవా చేస్తున్నారు. 1.75 ఎకరాలుంటే రూ.15 ఎకరాల నమోదు నాకు ఉన్న భూమి 1.75 ఎకరాలే. రాజముద్రతో మీరిచ్చిన కొత్త పాసు పుస్తకాల్లో మాత్రం 15.90 ఎకరాల భూమి ఉందని నమోదు చేశారు. అధికారులుగా మీరు ఇచ్చిన బుక్కుల ప్రకారం 15 ఎకరాల భూమి ఆన్లైన్ చేసి అది ఎక్కడ ఉందో చూపించండి అని శ్రీనివాసులురెడ్డి అనే రైతు తహసీల్దార్ శ్రీరాములు నాయక్ను ప్రశ్నించాడు. మళ్లీ చలానా కడితే సవరించి ఇస్తామని తహసీల్దార్ చెప్పడంతో మీరు ఇస్తున్న పాసు పుస్తకాల్లో 90 శాతం అన్నీ తప్పులే ఉన్నాయి..సరిచేసి ఇవ్వాలి కదా అని రైతు తిరిగి ప్రశ్నిస్తూ నిలదీశాడు. ప్రభుత్వ పథకాలు నిలిచిపోతే బాధ్యత ఎవరిది? కూలి చేసుకుని బతికేవాళ్ల. మాకు ఉన్న అరకొర భూములు కాకుండా మాకు లేని భూమి ఉన్నట్లు పాసు పుస్తకాల్లో ఉన్నాయి. మా కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా వస్తున్న పింఛన్, అమ్మ ఒడి, స్కాలర్షిప్ లాంటి సంక్షేమ పథకాలు నిలిచిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు రెవెన్యూ అధికారుల ఎదుట గోడును వెళ్లబోసుకుంటున్నారు. లేదంటే మా దినసరి కూలి పనులు, సేద్యాలు, పాడి ఆవులన్నీ వదిలేసి భూమి విస్తీర్ణం మార్పుల కోసం చలానా కట్టి నెలల తరబడి మీ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ మరి కొందరు అధికారులపై మండి పడుతున్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రామాపురం : గువ్వలచెరువు తూర్పుబీటు పాలకొండ వంగిమళ్ళ రిజర్వ్ ఫారెస్టులో పాము పొడుగు రాయి వద్ద 4 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి రేంజ్ ఆఫీసర్ జె మదన్మోహన్ ఆదేశాల మేరకు అధికారులు కూంబింగ్ చేస్తుండగా వాహనంలో ఎర్రచందనం దుంగలను ఎక్కిస్తున్న నిందితులను గుర్తించారు. అధికారులు వారిని చుట్టుముట్టారు. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన డ్రైవర్ ఎండీ సుకూర్,తమిళనాడులోని వేలూరు చెందిన చిన్నరాజలతో సహా 4 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. దుంగల బరువు సుమారు 100 కేజీలు ఉంటుందని వాటి విలువ 50,000 వరకు ఉంటుందని రాయచోటి రేంజ్ ఆఫీసర్ జె మదన్మోహన్ అన్నారు. నిందితులను తిరుపతి రెడ్ శాండిల్ కోర్టుకు తరలించారు. దాడిలో ఎఫ్ఎస్ఓ జి.భరణికుమార్,ఎఫ్బిఓ కే.రఘుపతి రాజు తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియా కార్యకర్తపై దాడి హేయం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ రామచంద్రారెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేయడం హేయమని పార్టీ అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. బుధవారం కడపలోని శ్యామల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయనను ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరిసుధ, మేయర్ పాకాసురేష్ కుమార్ల తో కలిసి పరామర్శించారు. దాడికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకొని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకొని ఆరోగ్యవంతుడిగా రావాలని ఆకాంక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. తాజాగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు తరలించడంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు రామచంద్రారెడ్డిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. తమను ఎవరూ ప్రశ్నించకూడదనే ఏకై క లక్ష్యంతో వైఎస్సార్సీపీ నాయకుల గొంతునొక్కుతూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులకు తాము అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో దాడులు చేసిన ప్రతి ఒక్కరూ ముల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు. -
నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు
● 9 మంది నిందితుల్లో ఆరుగురు అరెస్ట్ ● రూ.2లక్షల10వేలు ఫేక్ కరెన్సీ, 6 మొబైల్ఫోన్లు స్వాధీనంమదనపల్లె రూరల్ : రూ.లక్ష అసలు కరెన్సీకి రెండు రెట్లు అధికంగా నకిలీ నోట్లు మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠాను ముదివేడు పోలీసులు అరెస్ట్ చేయగా, మదనపల్లె డీఎస్పీ కే.మహేంద్ర బుధవారం వివరాలు వెల్లడించారు. నకిలీనోట్ల వ్యవహారంలో మొత్తం 9 మంది నిందితులను గుర్తించామని, వారిలో ఆరుగురిని అరెస్ట్చేసి, రూ.2లక్షల10వేలు ఫేక్ కరెన్సీ, 6 సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నకిలీనోట్ల తయారీకి సంబంధించిన ఏ–1 ప్రధాన నిందితుడుతో సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. దొరికిన నిందితుల నుంచి క్లూస్ సేకరించి త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. నకిలీనోట్ల ముఠాలో ప్రధాన నిందితుడైన ఏ–1 ఫేక్ నోట్లను తయారుచేసి, కర్ణాటకలోని బెల్గామ్ జిల్లా హుక్కేరి తాలూకా గులాబషా టాకియా వీధికి చెందిన మహమ్మద్ జుబేర్ మకందర్(27) ద్వారా తను చెప్పిన వ్యక్తులకు 1ః2 నిష్పత్తిలో అంటే, 10 వేలు ఒరిజినల్ నోట్లు ఇస్తే...20 వేలు నకిలీనోట్లు ఇస్తుంటాడు. రెండేళ్లుగా ఈ విధంగా సంపాదించిన డబ్బులను ఏ–1, మహమ్మద్ జుబేర్ ఇద్దరూ పంచుకునేవారు. ఈ క్రమంలో తెలంగాణ హైదరాబాద్ సిటీ హయత్నగర్కు చెందిన చిన్నోళ్ల మాణిక్యరెడ్డి(50)కి ఏ–1 పరిచయం అయ్యాడు. నకిలీనోట్ల మార్పిడి గురించి చెబితే, అందుకు మాణిక్యరెడ్డి ఒప్పుకోవడమే కాకుండా, తనకు తెలిసిన వారైన తెలంగాణ భూపాలపల్లె జిల్లా టేకుమట్ల మండలం బోర్నపల్లెకు చెందిన రేనుకుంట్ల సుమన్(32), హైదరాబాద్ షామీర్పేట్ బీజేఆర్ నగర్కు చెందిన చింతకుంట్ల సుమన్ అలియాస్ పీటర్ (27)ను కలుపుకుని నకిలీనోట్లు మార్పిడి చేస్తుండేవారు. మూడు నెలల క్రితం ఏ–1, బెల్గామ్లో ఇచ్చిన రూ.2లక్షల నగదును తీసుకుని మార్పిడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకే ప్రాంతంలో తరచూ నకిలీ నోట్లు మార్పిడి చేస్తే పట్టుబడతామనే ఆలోచనతో కొత్తగా వేరే ప్రాంతాల్లో చలామణి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మాణిక్యరెడ్డి, కొద్దిరోజుల క్రితం తనకు పరిచయమైన శ్రీ సత్యసాయిజిల్లా రామగిరి మండలం పేరూరుకు చెందిన కమ్మర వెంకటేష్(42), అన్నమయ్యజిల్లా వాల్మీకిపురం మండలం ప్యారంపల్లె గొల్లపల్లెకు చెందిన దాదిమి రమణప్ప(39)ను ముఠాలో సభ్యులుగా చేర్చుకున్నారు. దాదిమి రమణప్ప అంగళ్లులో కాపురం ఉండటంతో, అక్కడ జనసంచారం తక్కువగా ఉంటుందని, నకిలీ నోట్లు మార్చేందుకు అనువుగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఏ–1 నిందితుడు జనవరి 6న రూ.2లక్షల10వేల రూపాయల ఫేక్ కరెన్సీని, మహమ్మద్ జుబేర్ ద్వారా అంగళ్లుకు పంపాడు. జుబేర్ నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాణిక్యరెడ్డి, సుమన్, సైమన్, వెంకటేష్, రమణప్పలు నకిలీ కరెన్సీని తీసుకుని మాట్లాడుకుంటుండగా, పోలీసులకు ముందుగా అందిన సమాచారం మేరకు ముదివేడు పోలీసులు కదిరి–మదనపల్లె మెయిన్రోడ్డు దొమ్మన్నబావి క్రాస్ వద్ద ఆరుగురిని అరెస్ట్చేసి, నగదుతో పాటు 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు విచారణలో సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన రూరల్ సీఐ రవినాయక్, ఎస్ఐ మధురామచంద్రుడు, సిబ్బంది ప్రసాద్, చక్రి, వెంకటేష్, ప్రతాప్, శ్రీనివాస్ను ప్రత్యేకంగా అభినందించారు. రివార్డుకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. -
రాయచోటి జిల్లా సాధన కోసం పోరాటం ప్రారంభం
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని రద్దు చేసి ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి 14 మండలాల కేంద్రంగా ఉన్న రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని రిటైర్డ్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రెడ్డికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అంబేడ్కర్ ఫ్లెక్సీ వద్ద నూతనంగా తయారు చేసిన రాయచోటి జిల్లా చిత్రపటాన్ని అఖిలపక్ష కమిటీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని మార్చే ప్రసక్తే లేదని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ప్రజలు పలు రకాల పెట్టుబడులు రాయచోటి ప్రాంతంలో పెట్టుకున్నారని గుర్తుచేశారు. అయితే జిల్లా కేంద్రం మార్చడంతో వారంతా నష్టపోతున్నారని తెలిపారు. ఈ తప్పును సరిదిద్దుకునేందుకు రాయచోటి చుట్టూ ఉన్న 14 మండలాలను కలుపుకుని ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎంఈవో రెడ్డెన్న మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలుగా కొనసాగిన జిల్లా కేంద్రాన్ని రద్దు చేసి మదనపల్లెను జిల్లా చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే రాయచోటి ప్రత్యేక జిల్లా చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. భారత న్యాయవాదుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు, పౌర హక్కుల సంఘం నాయకుడు రెడ్డెయ్య, రవిశంకర్, ఉపాధ్యాయులు హరిబాబు, రామచంద్ర, రజక సంఘం నాయకులు రమేష్, శ్రీనివాసులు, వడ్డెర సంఘం నాయకులు జీవానందం, చల్లా రెడ్డెయ్య, చంద్రశేఖర్, న్యాయవాదుల సంఘం నాయకులు ఆనంద్ కుమార్, ఐఏఎల్ నాయకులు నాగముని, రవిశంకర్, జగదీష్, కోటేశ్వరరావు, శంకర్ నాయక్, రమణ, చెన్నకృష్ణ, తాతయ్య, ఖాదర్ బాషా, రామచంద్ర, బసిరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
బాలికలు అంతర్జాతీయ పోటీల్లోనూ రాణించాలి
జమ్మలమడుగు : బాలికలు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ క్రీడా పోటీల్లోనూ రాణించాలని బీసీ సంక్షేమశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వాలీబాల్ జాతీయ స్థాయి క్రీడా పోటీలను ఆమె తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఏ ఆటలోనైనా రాణించవచ్చన్నారు. జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన శ్రీచరణి అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో పాల్గొని ప్రపంచకప్ సాధించడంలో కీలకంగా మారారని తెలిపారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డిలు మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనటానికి దేశంలోని నలుమూలల నుంచి తమ జమ్మలమడుగుకు రావడం తమకు గర్వంగా ఉందన్నారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, బద్వేల్ ఇన్చార్జి రితేశ్వరరెడ్డి, వాలీబాల్ అసోషియేషన్ సెక్రెటరీ భానుమూర్తి పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్లు అంతకుముందు వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. బుధవారం జరిగిన మ్యాచ్ల్లో పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, కేరళ, హర్యానా, పంజాబ్, మహరాష్ట్ర, తమిళనాడు టీంలు గెలుపొందాయి. గురువారం గెలుపొందిన జట్లతోపాటు ఓడిన జట్ల మధ్య మరోమారు క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. గెలిలచిన జట్లు శుక్రవారం సెమీఫైనల్లో తలపడతాయి. గెలుపొందిన జట్ల మధ్య శనివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.ఇన్ఛార్జీ మంత్రి సబితా -
నేడు బోయకొండలో హుండీ ఆదాయం లెక్కింపు
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం ఉదయం 7 గంటలకు హుండీ కానుకలను లెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈఓ ఏకాంబరం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి బ్యాంకు, ఆలయ, పోలీసు సిబ్బంది హాజరు కావాలని కోరారు. వైఎస్సార్ సీపీలో నియామకాలు సాక్షి అన్నమయ్య : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీలలో జిల్లాకు చెందిన పలువురిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర లీగల్ సెల్ కమిటీలో... జనరల్ సెక్రటరీగా వీసీ రెడ్డెప్పరెడ్డి (రాయచోటి), సెక్రటరీగా ఎన్.శ్రీనివాస్రెడ్డి (రాయచోటి), జాయింట్ సెక్రటరీలుగా ఎం.గోవర్దన్రెడ్డి (రాజంపేట), టి.ఆనంద్ యాదవ్ (మదనపల్లె)లు నియమితులయ్యారు. జిల్లా అనుబంధ విభాగ కమిటీలలో.. జిల్లా యూత్ వింగ్ సెక్రటరీగా యండపల్లి శ్రీకాంత్రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శిగా షేక్ మహమ్మద్ రఫీ, జిల్లా పబ్లిసిటీ విభాగం కార్యదర్శిగా షేక్ రెడ్డి గఫార్, జిల్లా సోషల్ మీడియా విభాగ కార్యదర్శిగా మండెం రాఘవేంద్రలను నియమితులయ్యారు. వీరందరూ రాయచోటికి చెందిన వారుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో నియామకాలు చిత్తూరు అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురికి స్థానం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ విభాగం జోన్–5 వర్కింగ్ ప్రెసిడెంట్గా పుంగనూరుకు చెందిన షేక్ ఫక్రుద్ధీన్ షరీఫ్, రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా చిత్తూరుకు చెందిన పి.రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర లీగల్సెల్ అధికార ప్రతినిధిగా నగరికి చెందిన బి.రవీంద్ర, రాష్ట్ర లీగల్సెల్ కార్యదర్శులుగా పుంగనూరుకు చెందిన కె.గోవర్దన్రెడ్డి, చిత్తూరుకు చెందిన ఇ.సుగుణశేఖర్రెడ్డి, జిల్లా ఉద్యోగులు–పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా పలమనేరుకు చెందిన ఎన్.సోమచంద్రారెడ్డిను నియమిస్తున్నట్లు ప్రకటించారు. శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు ఒంటిమిట్ట : పవిత్ర ధనుర్మాసంలో భాగంగా 20వ రోజైన బుధవారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా సాగాయి. రంగమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువు తీరిన సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, అభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం వేదపండితులు రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పారాయణం చేశారు. మూల విరాట్ దర్శనానికి వచ్చేసిన భక్తులకు ఈ మహత్కార్యాన్ని తిలకించే భాగ్యం లభించింది. శని, ఆదివారాల్లోనూ దరఖాస్తుల స్వీకరణ కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో సమగ్ర శిక్ష సొసైటీ ద్వారా నడుస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సి బ్బంది పోస్టులను (35 ఖాళీలు) పొరుగు సేవల (ఔట్సోర్సింగ్) ప్రాతిపదికన భర్తీ చేయుటకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 10వ తేదీ రెండవ శనివారం, 11వ తేదీ ఆదివారం కూడా స్వీకరించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్కుమార్ తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజులయినప్పటికీ కార్యాలయ సిబ్బంది విధుల్లో కొనసాగి అభ్య ర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలని సమగ్రశిక్ష ఏపీసీ వివరించారు. హాల్టికెట్లు విడుదల రాజంపేట : రాజంపేట మండలం నారమరాజుపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026– 2027 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతులలో ప్రవేశపరీక్ష రాసేందుకు హాల్టికెట్లు విడుదలైనట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ గంగాధరన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 7న ప్రవేశపరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ప్రవేశపరీక్ష నిమిత్తం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టినతేది నమో దు చేసి ఆన్లైన్ కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. లింక్ హెచ్టీటీపీః//సీబీఎస్ఈఐటీఎంఎస్.ఆర్సీఐఎల్.జీఓవీ.ఇన్/ఎన్వీఎస్/ను సంప్రదించాలని సూచించారు. -
పెద్ద పండక్కు ధరాఘాతం
రాజంపేట టౌన్ : పెద్ద పండగ సంక్రాంతి ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నింగినంటిన కూరగాయలు,నిత్యావసర ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల పథకాల వల్ల ప్రజలకు ఆర్థిక స్వావలంబన లభించేది. దీంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం సాఫీగా సాగించేవారు. పండుగలను కూడా ఆనందంగా జరుపుకునేవారు.చంద్రబాబు నాయుడు సర్కార్లో సీన్ రివర్స్ అయింది. చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో ఇచ్చిన మేరకు పథకాలను అమలు చేయకపోగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలోని పథకాలను కూడా తొలగించారు. దీంతో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా తెలుగువారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని కూడా పేద, మధ్యతరగతి ప్రజలు సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు గోరుచుట్టపై రోకటిపోటులా నిత్యావసర సరుకులు, కూరగాలు, కోడిగుడ్లు, చికెన్, మటన్ ... ఇలా అన్ని రకాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో పేద,మధ్య తరగతి ప్రజలకు పండగ భారంగా మారింది. ఇక ప్రభుత్వం చౌకదుకాణాల్లో కూడా కందిపప్పును ఇవ్వక పోవడంతో పేద ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేస్తే కాని పండుగ గడవదు.. సంక్రాంతి పండుగను జరుపుకోవాలంటే ప్రజలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పండగ సందర్భంగా దాదాపు 90 శాతం మంది హిందువులు పిండివంటలు చేసుకుంటారు. పిండి వంటలకు కావాల్సిన ప్రధానమైన నూనె ధర లీటరు 155 రూపాయిలు ఉంది. అలాగే కందిపప్పు కిలో రూ.120, ఉద్దిపప్పు కిలో.110 ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దినసరి కూలీలు, పనికి వెళితేనే పూటగడిచే పరిస్థితులు ఉన్న నిరుపేద వర్గాల ప్రజల్లో సంక్రాంతి సంతోషం కనిపించడం లేదు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నిరకాల వస్తువుల ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజల జీవనం దుర్లభంగా మారింది. సంక్రాంతి పెద్ద పండుగ. రేషన్ స్టోర్లలో ప్రభుత్వం కందిపప్పు కూడా ఇవ్వకుంటే మాలాంటి పేదోళ్లకు పప్పు అన్నం కూడా కరువవుతుంది. కనీసం స్టోర్లలో ఈనెల కందిపప్పు ఇచ్చినా పప్పు అన్నం అయినా తినేవాళ్లం. అన్ని రకాల వస్తువులు, కూరగాయలు, మాంసాహార ధరలు పెరిగాయి. – లలితమ్మ, రాజంపేట మేము నిరుపేదలం. మాబోటివాళ్లు సంక్రాంతి పండుగను సంతోషంగా చేసుకునే పరిస్థితి లేదు. కూరగాయల నుంచి అన్ని ధరలు పెరిగి ఉన్నాయి. ధరలు ఈ విధంగా పెరిగితే ఏం కొనాలి.. పండుగను ఎలా చేసుకోవాలి.. పండుగ పూటయినా ధరలను తగ్గిస్తే బాగుంటుంది. – లక్షుమ్మ, తుమ్మల అగ్రహారం, రాజంపేట మండలం ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు నిత్యావసర సరుకులదీ అదే దారి గుడ్లు, చికెన్, మటన్ కూడా...... ప్రభుత్వ పథకాలు అమలుకాక... చేతిలో డబ్బులు లేక.. పేద, మధ్య తరగతి ప్రజల్లో కనిపించని సంక్రాంతి సంతోషం -
●హంద్రీ–నీవా నాశనం
● తాను చేపట్టని సాగునీటి ప్రాజెక్టులంటే చంద్రబాబుకు చిన్నచూపు ● వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన రూ.వేల కోట్ల ప్రాజెక్టులను నిలిపివేసిన బాబు సర్కార్ మదనపల్లె : చంద్రబాబు అధికారంలో ఉండగా .. ఇతరుల హయాంలో మొదలైన ప్రాజెక్టులకు గ్రహణం పట్టినట్లే. అవును.. ఆయన చేపట్టని ప్రాజెక్టులంటే అస్సలు గిట్టదంతే.. ప్రాజెక్టుల పనులు మొదలైనా, పురోగతిలో ఉన్నా, చివరదశలో ఉన్నా సరే ఒక్క అడుగు ముందుకేస్తే ఒట్టే. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వ్యవసాయంపై ఆధారపడిన మన గ్రామీణ ప్రాంతాల రైతాంగానికి నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉండాలి. దీనికోసం అందుబాటులోని వనరులను సద్వినియో గం చేసుకోవాలి లేదంటే ప్రాజెక్టుల ద్వారా నీటి ఆధారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. దీన్ని అక్షరాలా పాటించిన పాలకులు వైఎస్.రాజశేఖర్రెడ్డి, వైఎస్.జగన్మోహన్రెడ్డి. వీరిపాలనలో ఎప్పుడూ జరగనంతగా ప్రాజెక్టుల అభివృద్ధి జరిగింది. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి రైతాంగ ప్రయోజనాలను కాపాడాల్సిన చంద్రబాబు సర్కా ర్ వీటికి మరణశాసనం రాశారు. వేలకోట్లతో జరిగిన ప్రాజెక్టుల పనులు ఆగిపోయి కనిపిస్తున్నాయి. తనసొంతజిల్లాకు ఉపయోగమైనా సరే... ఎన్టీఆర్ చేపట్టిన హంద్రీ–నీవా ప్రాజెక్టు కూడా చంద్రబాబు పాలనలో వెన్నుపోటుకు గురైంది. అదే ప్రాజెక్టును సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి చేపట్టి అత్యధిక శాతం పనులు పూర్తిచేస్తే..దీన్ని అపలేని పరిస్థితుల్లో కొంతమేర పని చేయించి ఇదిగో ఇది నా ఘనత, హంద్రీ–నీవాను నేనే పూర్తి చేశానంటూ చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. అనుసంధానం వద్దంట చంద్రబాబు సొంతజిల్లా ఉమ్మడిచిత్తూరుకు ప్రయోజనం కలిగించే హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల అనుసంధానంతో కరువు రైతుల తలరాతను మార్చేదిశగా వైఎస్.జగన్మోహన్రెడ్డి రూ.4,373.23 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రూ.1,220 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఈ అనుసంధానం ద్వారా గండికోట రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల కృష్ణానీటిని తరలిస్తారు. 13 టీఎంసీలు ఉమ్మడిచిత్తూరుజిల్లాకు పంపిణీ అవుతాయి. తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల ప్రయోజనం. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు వద్దంటూ పనులు నిలిపివేశారు. దీనివల్ల నిధుల వినియోగం నిష్పలంకాగా రైతాంగానికి ప్రయోజనం అన్న విషయాన్ని పట్టించుకోకుండా తాను చేపట్టింది కాదన్న ధోరణితో ఆపేయించారు. ఈ పథకంవల్ల అడవిపల్లె, శ్రీనివాసపురం రిజర్వాయర్లు, ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్లను నింపుతారు. ఈ పథకంతో ఈ ప్రాంతంలో కొత్తగా 2,48,150 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. అయితే కూటమి పాలనలో చంద్రబాబు సర్కార్కు ఇది ఇష్టంలేదు ప్రాజెక్టు ఆగిపోయింది. వైడనింగ్ అసలే వద్దుహంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగంపై పుంగనూరు ఉపకాలువను వెడల్పు అధిక సామర్థ్యంలో కృష్ణాజలాలను తరలించి రైతాంగానికి సాగునీరు ఇద్దామని వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రూ.1,929 కోట్లతో పనులు చేపట్టారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ పీవీ.మిథున్రెడ్డి ఈ ప్రాజెక్టు మంజూరు కోసం చాల శ్రమపడ్డారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే పనులను అడ్డుకుంది. వెడల్పు పనులు వద్దంటూ, ఈ నిధుల నుంచే రూ.480 కోట్లతో లైనింగ్ పనులు చేపట్టింది. లైనింగ్ వద్దని రైతులు వ్యతిరేకించినా పట్టించుకోలేదు. దీనివల్ల రైతులు 13 టీఎంసీల అదనపు కృష్ణా జలాలను కోల్పోవాల్సి వచ్చింది. రిజర్వాయర్ల అడ్డగింత జిల్లాలోని తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.2,100 కోట్లతో చేపట్టిన ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాంతాలకు గత పాలకులు పట్టించుకోకపోవడంతో మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవి.మిథున్రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కృషితో రిజర్వాయర్లను మంజూరు చేయించారు. ఈ పనులు ప్రారంభమై కీలకదశలో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు టీడీపీ నేతలతో కేసులు వేయించి పనులు అడ్డుకున్నారు. తర్వాత ప్రాజెక్టుల సందర్శన చేపట్టి చంద్రబాబు ప్రజలు, రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేలా విమర్శలు చేశారువైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రైతులకు ద్రోహం చేయడమే. రైతులు, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పును తెచ్చి వ్యవసాయ అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలంటారు. ఒక అభివృద్ధి పని మొదలయ్యాక ఏ ప్రభుత్వమైనా కొనసాగించి వాటి ఫలాలను ప్రజలకు అందించడం బాధ్యత. దీన్ని విస్మరించడం దారుణం. కోట్లు ఖర్చుచేసిన ప్రాజెక్టుల పనులు నిరుపయోగం చేయడం భావ్యంకాదు. రైతు ప్రయోజనాలను కాపాడేలా ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. – పీవీ.మిథున్రెడ్డి, రాజంపేట ఎంపీ -
టీడీపీ నాయకులా.. మజాకా
● పది రోజులకే ఎస్ఐపై బదిలీ వేటు ● నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తే చర్యలా.. సాక్షి టాస్క్ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో టీడీపీ నాయకుల అధికార దాహంతో మేము చెప్పిందే వినాలి.. మేము చెప్పినట్టే చేయాలి అన్న ధోరణిలో వారి వ్యవహార శైలి మారింది. నాలుగు రోజుల కిందట పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉల్లిమెల్లగ్రామ సమీపంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తూగుట్ల మధుసూదన్రెడ్డి తోటలో జూదమాడుతున్నారని సమాచారం తెలుసుకుని పులివెందుల ఎస్ఐ ప్రణయ్కుమార్రెడ్డి, లింగాల ఎస్ఐ జగదీశ్వరరెడ్డిలు ఆ ప్రాంతానికి వెళ్లారు. 10 రోజుల క్రితం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ప్రణయ్కుమార్ రెడ్డి జూదమాడుతున్న వారిని అరెస్ట్ చేసి జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ సంఘటనలో జూదమాడుతున్న టీడీపీ నాయకులు ఎస్ఐపై అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. అంతేగాక నువ్వు ఆఫ్ట్రాల్ ఎస్ఐవి, నువ్వు మాపై, మా నాయకులపై కేసు నమోదు చేస్తావా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఎస్ఐగా ప్రణయ్కుమార్రెడ్డి పులివెందులలో బాధ్యత చేపట్టి పట్టుమని పది రోజులు కాకముందే టీడీపీ నాయకులు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాలెంకు బదిలీ చేయించారు. ఏదీఏమైనా పులివెందులలో టీడీపీ నాయకుల మాట వినకుంటే. పోలీసులకే కాదు.. ఏ అధికారికై నా బదిలీ వేటు తప్పదేమోనని పలువురు చర్చించుకుంటున్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తే చర్యలా.. పులివెందుల ఎస్ఐ ప్రణయ్కుమార్రెడ్డి నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తే అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం ఆశ్చర్యానికి కలిగిస్తోంది.జూదశాల నిర్వహిస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద నాయకుడు కావడంతో ఎస్ఐపై బదిలీ వేటు పడటం గమనార్హం. వివాదస్పదమవుతున్న సబ్ డివిజనల్ అధికారి పోలీసు డిపార్ట్మెంట్కు విధేయుడుగా ఉండాల్సిన పులివెందుల సబ్ డివిజనల్ అధికారి అధికార పార్టీ నాయకులు చెప్పిన మాటలకు జీ హుజూర్ అంటూ విధులు నిర్వహించడం వివాదస్పదంగా మారింది. పేకాట ఆడుతున్న టీడీపీ నాయకులను తన చాంబర్లో కుర్చీలో కూర్చొబెట్టుకుని వారి ముందే సక్రమంగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐని దండించడం ఎంతవరకు సబబు అని పోలీసు డిపార్ట్మెంట్లో పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఎస్ఐ బదిలీ విషయంలో టీడీపీ నాయకులతో కలిసి సబ్ డివిజనల్ అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నాకు తెలియకుండా దాడులు చేయవద్దు అధికార పార్టీ చేసే ఆగడాలకు, వారు చేసే అసాంఘిక కార్యకలాపాలకు, జూదాలకు పులివెందుల సబ్ డివిజనల్ అధికారి వెన్నుదన్నుగా ఉన్నాడని చెప్పవచ్చు. మూడు రోజుల క్రితం జరిగిన సంఘటనలో ఎస్ఐ ప్రణయ్కుమార్రెడ్డి టీడీపీ నాయకుల జూదశాలపై దాడి చేయడంపట్ల సబ్ డివిజనల్ అధికారి తీవ్రంగా ఆక్షేపించారు. అంతేకాకుండా ఇకపై తనకు తెలియకుండా జూదశాలలపై ఎవరూ దాడులు చేయకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు ఇలా అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు తెలపడంపై ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. -
హెల్మెట్ భారం కాదు భరోసా
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని భారంగా అనుకోకుండా భరోసాగా భావించి తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని మిషన్ కాంపౌండ్ వద్ద హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్వయంగా హెల్మెట్ ధరించి, మిషన్ కాంపౌండ్ నుంచి చౌడేశ్వరి సర్కిల్ వరకు బైక్ నడిపి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే, సుమారు 70 శాతం మరణాలు కేవలం హెల్మెట్ లేకపోవడం వల్లే సంభవిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. తలకు తగిలే చిన్న గాయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని, కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందని, ఇది అత్యంత విచారకరమన్నారు. హెల్మెట్ అనేది కేవలం ఒక వస్తువు కాదని, ప్రాణాలను కాపాడే భద్రతా కవచంగా పేర్కొన్నారు. వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం వల్ల సంపూర్ణ రక్షణ లభిస్తుందన్నారు. మద్యం తాగి వాహనం నడపడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడటం ప్రాణాంతకమని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, అతివేగాన్ని నియంత్రించుకోవాలన్నారు. అడిషనల్ ఎస్పీ యం.వెంకటాద్రి, డీఎస్పీ కే.మహేంద్ర, ట్రాఫిక్ సీఐ గురునాథ్, సీఐలు చంద్రశేఖర్, మహమ్మద్ రఫీ, రాజారెడ్డి, కళా వెంకటరమణ, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. -
నేడు హైకోర్టులో రాయచోటి జిల్లా కేంద్రం అంశంపై వాదనలు
రాయచోటి అర్బన్: రాయచోటి జిల్లా కేంద్రంగా యథథాతథంగా కొనసాగించాలనే అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) హైకోర్టులో బుధవారం వాదనలు జరగనున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసును ఇటీవలే హైకోర్టు స్వీకరించిందని, బుధవారం జరగనున్న వాదనలకు 7వ నంబరింగ్ పొందిందన్నారు. ఈ అంశంపై ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు రాయచోటి నియోజకవర్గ ప్రజల ఆందోళనలు న్యాయస్థానం ద్వారా పరిష్కారం పొంది, ప్రజలకు మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని శ్రీకాంత్ రెడ్డి వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
బాబు హయాంలోనే సీమకు అన్యాయం
రాయచోటి: రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది చంద్రబాబు పాలనలోనే అని కడప జెడ్పీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపించారు. రాయచోటిలోని ఆయన స్వగృహంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్రంతో కుమ్మకై తీవ్ర ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందాన్ని బయటపెట్టడంతో నిజాలు వెలుగుచూశాయన్నారు. ఇప్పుడేడో దొంగే దొంగ దొంగా అన్న రీతిలో టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా కృష్ణా జలాలలను రాయలసీమ ప్రాంత ప్రజలకు అందివ్వడంలో బాబు విఫలమయ్యారన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గండికోట నుంచి కడప, అన్నమయ్య జిల్లాలోని అనేక ప్రాజెక్టులు, చెరువులకు కృష్ణా జలాలను అందించేందుకు రూ. 3600 కోట్లతో ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి 70 శాతంకుపైగా పనులు పూర్తి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న ఉద్దేశ్యంతోనే పనులను నిలుపుదల చేయలేదంటూ తిరిగి విమర్శలు చేయడం టిడిపి నాయకులకే చెల్లిందన్నారు. చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసిన ద్రోహం బయట పడటంతో రాష్ట్ర ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. బాబు మోసానికి రానున్న ఎన్నికలలో రాయలసీమ ప్రాంత ప్రజలు ఓటుతో తగిన గుణపాఠం తప్పక చెబుతారని బాలసుబ్రమణ్యం హెచ్చరించారు. జగన్ హయాంలో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్కు బాబు బ్రేకులు వేశారు జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి బాల సుబ్రమణ్యం -
వేళకు వస్తున్నారా.. భోజనం పెడుతున్నారా!
మదనపల్లె: వైద్యులు వేళకు వస్తున్నారా.. భోజనం సరిగా పెడుతున్నారా అంటూ కలెక్టర్ నిశాంత్ కుమార్ రోగులతో ఆరా తీశారు. మంగళవారం కలెక్టర్ స్థానిక జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నివార్డులు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఇన్ పేషంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా సాగుతోందని రికార్డులను పరిశీలించారు. దీనిపై సూపరింటెండెంట్ రమేష్ వివరించారు. ఆసుపత్రిలోని ఓపి, ఇన్ పేషెంట్ గదులను, ఐసీయూ వార్డును, తనిఖీ చేసి ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఫార్మసీ ని తనిఖీ చేసి ఏయే ఔషధాలు వస్తున్నాయి ఏ విధంగా నిల్వ చేస్తున్నారు, ఆన్ లైన్ లో ఎలా నమోదు చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ ప్రక్రియ వేగవంతంగా ఉండాలని చికిత్స కోసం వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నవజాత శిశువులకు కేటాయించిన సంరక్షణ విభాగాన్ని, ఆక్సిజన్ ప్లాంటును తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, సిబ్బంది కొరత, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైక్రియాట్రి, అనస్థీషియా తదితర విభాగాలకు పూర్తిస్థాయిలో వైద్యులు ఉన్నారా లేదా అని ఆరా తీశారు. ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది కొరతపై నివేదికను సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ ను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీలు సిబ్బంది కొరతపై నివేదిక ఇవ్వాలని ఆదేశం -
● పుంగనూరుపై కక్షకట్టి
మదనపల్లె: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. ఫ్లోరైడ్నీటితో ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు 2020లో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన వాటర్గ్రిడ్ పథకాన్ని విడగొట్టి వివక్ష చూపిస్తోంది. పనులు చేపట్టకుండా కాంట్రాక్టును రద్దు చేయడమేకాక పథకాన్ని కుదించి ప్రజలకు అన్యాయం చేస్తోంది. – వాటర్గ్రిడ్ పథకాన్ని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, రాయచోటి నియోజకవర్గాలకు వర్తింపజేయాల్సిన ఆవశ్యకతను అప్పటిమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంిపీ పీవీ.మిథున్రెడ్డి గుర్తించి.. నిర్మాణానికి కృషి చేశారు. దాంతో వాటర్గ్రిడ్ పథకం పరిధి పెరిగి 27 మండలాల్లోని 4,938 పల్లెలు, మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో 2054 నాటి జనాభాకు అనుగుణంగా వాటర్గ్రిడ్కు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనికోసం ఐదు నియోజకవర్గాలకు రూ.1,550 కోట్లు, మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీలకు రూ.850 కోట్లను పనులకు కేటాయించారు. పనులు మొదలయ్యే దశలో... గండికోట రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను ఐదు నియోజకవర్గాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతానికి కలిపి 13,94,757 మంది జనాభాకు తాగునీటిని అందించే వాటర్గ్రిడ్ పనులకు 2023లో టెండర్లు నిర్వహించగా రివర్స్ టెండరింగ్లో రూ.1,825.68 కోట్లకు టెండర్ దాఖలైంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.76.08 కోట్లు మిగలగా, కాంట్రాక్టు సంస్థ గండికోట రిజర్వాయర్ నుంచి ఐదు నియోజకవర్గాల్లో పైప్లైన్, ట్యాంకులు, సంపులు, రీట్రిట్ప్లాంట్ నిర్మాణం తదితర వాటిపై సమగ్ర సర్వే పూర్తి చేసింది. ఇక పనులకు చర్యలు చేపడుతుండగా కూటమి ప్రభుత్వం రాకతో పథకానికి సంబంధించి కాంట్రాక్టును తప్పించింది. 18 మండలాలకే గ్రిడ్ పేజ్–1 పేరుతో చేపట్టిన పనులను తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజజకవర్గాల్లోని 18 మండలాలకే పరిమితం చేసింది. ఈ పనులకు 2025 ఏప్రిల్ 7 రూ.1,939.42 కోట్లతో కాంట్రాక్టు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకో గా 2027 అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేయాలి. ఫేజ్–1కే రూ.2,370 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదు నియోజకవర్గాల కు నీటిని అందించే పనులను రూ.1,825 కోట్లకే కాంట్రాక్టు అప్పగించింది. కూటమి ప్రభుత్వం ఈ కాంట్రాక్టును రద్దుచేసి వాటర్గ్రిడ్ పథకాన్ని తంబళ్లపల్లె, రాయచోటి, పీలేరు నియోజకవర్గాలకు కుదించి టెండర్లు నిర్వహించగా అంచనా వ్యయం రూ.2,370 కోట్లుగా, టెండర్ ఒప్పందం విలువ రూ.1,939 కోట్లకు అప్పగించింది. రెండు నియోజకవర్గాల్లో పని తగ్గినా విలువ తగ్గలేదు. పైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒప్పంద విలువ కంటే రూ.114 కోట్లు అదనం. ప్రభుత్వం పని తగ్గించినా పని విలువ తగ్గకపోగా.. పెరగడం గమనార్హం. ఫేజ్–2కి రూ.2,989 కోట్లు వాటర్గ్రిడ్ పథకం నుంచి పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాలను తొలగించిన ప్రభుత్వం..కొత్త ఎత్తుగడ వేసింది. పథకానికి ఫేజ్–2 అని పేరుపెట్టి మరో రూ.2,989 కోట్లకు ప్రతిపాదన పెట్టింది. ఈ విడతలో పుంగనూరు, మదనపల్లె, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు అమలు చేయబోతున్నట్లు నివేదికలు పంపారు. ఇది ఎప్పటికి ఆమోదం పొందుతాయో, ఎప్పుడు టెండర్లు నిర్వహిస్తారు, ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి. రూ.2,400 కోట్లతో ఐదు నియోజకవర్గాలకు వెఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాటర్గ్రిడ్ పథకం మంజూరు టెండర్లు, సర్వే పూర్తయి పనుల చేపట్టే సమయంలో కూటమి ప్రభుత్వం రాక పథకం రద్దు చేసి 3 నియోజకవర్గాలకే పరిమితం కక్షగట్టి పుంగనూరు నియోజకవర్గం తొలగింపు ఇప్పుడేమో రెండు విడతలపేరుతో కాలయాపన 3 నియోజకవర్గాల పథకానికి రూ.2,370 కోట్లు రెండో విడత పేరుతో రూ.2,989 కోట్లు వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2020లో తంబళ్లపల్లె సహా మదనపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటి నియోజకవర్గాల ప్రజలకు 30 ఏళ్లదాక...2054 వరకు నీటిసమస్య ఉండకూడదని భావించారు. ఇంటింటికి తాగునీరు అందించేలా రూ.2,400 కోట్లతో గండికోట ప్రాజెక్టు నుంచి 3.37 టీఎంసీల కృష్ణా జలాలను తరలించే భగీరథ పథకానికి నాంది పలికారు. కుప్పంను వాటర్గ్రిడ్ పరిధిలోకి తెవాలన్న నెపంతో పుంగనూరు నియోజకవర్గాన్ని పథకం నుంచి తొలగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలుచేసిన పథకం పనులు కూటమిపాలనలో కొనసాగించి ఉంటే పాతికశాతం పనులు పూర్తయ్యేవని ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. కుప్పానికి పథకం వర్తించాలంటే తీవ్ర జాప్యం అవుతుంది, తద్వారా పుంగనూరుకు పథకం అమలు కాకుండా అడ్డుకట్ట వేయొచ్చన్న ప్రయత్నంగా తెలుస్తోంది. ఫలితంగా ప్రస్తుతం ఫేజ్–1 పేరుతో తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాల్లోని 18 మండలాలకే వాటర్గ్రిడ్ పథకం అమలు చేస్తున్నారు. వీటి పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో మంచినీళ్లు ఎప్పుడిస్తారో అని ప్రజలు బాబు తీరుపై తూర్పారబడుతున్నారు. -
రాయచోటి జిల్లా సాధన అఖిలపక్ష సమావేశం నేడు
రాయచోటి అర్బన్: రాయచోటి జిల్లా కేంద్రంగా 14 మండలాలతో జిల్లా సాధన కోసం అఖిల పక్ష సమావేశం బుధవారం జరగనున్నట్లు అఖిలపక్ష కమిటీ నాయకులు తెలిపారు. అందులో భాగంగా అంబేడ్కర్ ఫ్లెక్సీ వద్ద మంగళవారం వారు సమావేశమయ్యారు. బుధవారం రాయచోటి జిల్లాకు సంబంధించిన నూతన చిత్రపటాన్ని ఆవిష్కరించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష కమిటీతో పాటు విద్యార్థినీవిద్యార్థులు , ఉపాధ్యాయులు, కార్మిక సంఘం నాయకులు, జర్నలిస్టులు , రిటైర్డ్ ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. రాయచోటి జిల్లా సాధన కోసం చేస్తున్న ఉద్యమానికి తగిన సూచనలు ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో భారత న్యాయవాదుల సంఘం కడప , అన్నమయ్య జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
భాకరాపేట జెడ్పీ హైస్కూల్ తనిఖీ
సిద్దవటం: మండలంలోని భాకరాపేట జెడ్పీ హైస్కూల్ను విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించారు. అలాగే 6–10వ తరగతుల వరకు జరుగుతున్న ఎఫ్ఏ–3 పరీక్ష గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవ తరగతి వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీకేశమ్మకు సూచించారు. అలాగే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారు కూడా పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులకు వర్క్షాప్
మదనపల్లె సిటీ: విజయవాడ భవానీదీవిలో ఈనెల 9,10 తేదీల్లో జరిగే మార్షల్ ఆర్ట్స్ వర్క్షాపును క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. వర్క్షాపులో కరాటే, తైక్వాండో, జూడో, కుంగ్ఫూ తదితర మార్షల్ ఆర్ట్స్ విభాగాలకు చెందిన క్రీడాకారులు, కోచ్లు, శిక్షణార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 7వతేదీ సాయంత్రంలోపు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ, అన్నమయ్య జిల్లాకు పంపాలన్నారు. వివరాలకు 91547 31106ను సంప్రదించాలని కోరారు. మదనపల్లె సిటీ: శబరిమలై అయ్యప్ప మాలధారుల కోసం ఈనెల 10న కొల్లం స్పెషల్ రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 10న చర్లపల్లి నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మదనపల్లె రోడ్డుకు రాత్రి 10.28 గంటలకు చేరుకుని కొల్లంకు 11వతేదీ రాత్రి 10 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణం 12వతేదీన కొల్లం నుంచి ఉదయం 2.30 గంటలకు బయలుదేరి మదనపల్లె రోడ్డుకు రాత్రి 11.48 గంటలకు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి చర్లపల్లికి 13వతేదీ మధ్యాహ్నం 11.20 గంటలకు చేరుకుంటుందన్నారు. అయ్యప్ప మాలాధారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గాలివీడు: యూత్ గేమ్స్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ నేషనల్ ఖోఖో పోటీల్లో అన్నమయ్య జిల్లా, గాలివీడు మండలం అద్వైత గురుకులం పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి విజేతలుగా నిలిచారు. ఈ పోటీల్లో అద్వైత గురుకులం బాలురు,బాలికలు రెండూ జట్లు జాతీయ విజేతలుగా ఎంపిక కావడం విశేషం. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు నేపాల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ ఖోఖో పోటీలకు ఈ రెండు జట్లు ఎంపికయ్యాయని పాఠశాల చైర్మన్ డాక్టర్ బి. ఇంద్రసేన తెలిపారు. రాయచోటి టౌన్: రాష్ట్ర స్థాయి అండర్ –19 హాకీ జట్టుకు రాయచోటి రాజు విద్యాసంస్థలకు చెందిన జూనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థి కోటకొండ వెంకటేష్ ఎంపికయ్యాడు. అన్నమయ్యజిల్లా జట్టు నుంచి ఈ నెలలో విశాఖపట్టణం జిల్లా నక్కపల్లెలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్–19 విభాగంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు రాయచోటి హాకీ ఫౌండర్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ విద్యార్థి ఈ నెల 12వ తేది నుంచి 17వ తేది వరకు రాజస్థాన్లో నిర్వహించే హాకీ పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. వెంకటేష్ను ఫౌండర్ సీఐతో పాటు రాజు కళాశాల ప్రిన్సిపల్ శంకర్ నారాయణ తదితరులు అభినందించారు. కురబలకోట: ఆదాయమే లక్ష్యంగా తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి వచ్చే పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ సూచించారు. మంగళవారం ఆయన తెట్టులో స్ప్రింకర్లు, డ్రిప్ ద్వారా సాగవుతున్న వేరుశనగ సాగును పరిశీలించారు. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పూత దశ పంటకు ప్రాణం పోసే దశన్నారు. ఎఫ్పీఓ ద్వారా రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ ఖర్చు తక్కువ నీటితో ఇవి సాగయి ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగు పద్దతులు అవలంభిస్తే రసాయనిక ఎరువులపై ఖర్చు తగ్గడంతో పాటు భూ సారం సంరక్షించుకోవచ్చన్నారు. -
రైతులకు అండగా ఉంటాం
వీరపునాయునిపల్లె: రాష్ట్రంలోని ప్రతి రైతును ఆదుకోని వారికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసి సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉల్లి రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులు సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక పోగా అధిక వర్షాలు పడడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పంటనష్ట పరిహారం మంజూరు చేశామన్నారు. కలెక్లర్ చెరుకూరి శ్రీదర్ మాట్లాడుతూ రైతులు మార్కెట్కు అనుకూలంగా పంటలు సాగు చేయాలని అలా కాకుండా పంటలు సాగు చేస్తే నష్టాల బారిన పడాల్సి వస్తుందన్నారు. అనంతరం రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఉల్లి పంటకు సంబందించిన మెగా చెక్కును మంత్రి సవిత రైతులకు అందజేశారు. ఎమ్మెల్యే పుత్తా చైతన్యకుమార్రెడ్డి, టీడీపీ రాష్ట ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి పాల్గొన్నారు. మంత్రి సవిత -
పిల్లలకు తప్పిన ఎండ కష్టాలు
చౌడేపల్లె: మండలంలోని కోటూరు ప్రాథమికోన్నత పాఠశాల ముందు గల వరండాలో నుంచి ఎట్టకేలకు మంగళవారం ఉపాధ్యాయులు తెచ్చే బైక్లను పార్కింగ్ చేసే ప్రదేశాన్ని మార్చేశారు. సోమవారం సాక్షిలో ‘బైక్లకు వరండా... బుడతలకు ఎండ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంఈఓ కేశవరెడ్డి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు తెచ్చే బైక్లను వరండాలో పార్కింగ్ చేయకుండా విద్యార్థుల సౌకర్యార్థం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాల తరగతి గదులు కాకుండా బయట ప్రదేశాల్లో విద్యార్థులను కూర్చోబెట్టరాదన్నారు. విద్యార్థుల సామర్థ్యం, ప్రగతి అంశాలపై చర్చించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. కోటూరు పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న ఎంఈఓ కేశవరెడ్డి కోటూరు ప్రాథమికోన్నతపాఠశాల ముందుగల వరండాలోనుంచి బయట పార్కింగ్ చేసిన బైక్లు -
ఈ–గవర్నెన్స్పై అవగాహన అవసరం
జెడ్పీ సీఈఓ ఓబులమ్మ కడప సెవెన్రోడ్స్: ఈ–గవర్నెన్స్ అప్లికేషన్స్పై ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ సూచించారు. ఈ–గవర్నెన్స్పై మంగళవారం ఉమ్మడి జిల్లాకు చెందిన డిప్యూటీ ఎంపీడీఓలు, సీనియర్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరిపాలన రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులను ఆకళింపు చేసుకుంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని సూచించారు. సాంకేతిక వల్ల సత్వర, పారదర్శక సేవలను అందించవచ్చన్నారు. ఉద్యోగులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు భయ పడొద్దు: పెద్దిరెడ్డి
రొంపిచెర్ల : అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రొంపిచెర్ల మండలం చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీ గురికివారిపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బాలాజి మాజీ మంత్రిని కలిశారు. గత 25 రోజుల క్రితం తన వ్యవసాయ పొలంలో ఉన్న శ్రీగంధం మొక్కలను చదును చేసుకునే క్రమంలో తొలగించానని, టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు అక్రమంగా కేసు నమోదు చేశారని మంత్రికి వివరించారు. దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి తొత్తులుగా పని చేస్తున్న అధికారుల పేర్లను వైఎస్సార్సీపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలన్నారు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, తర్వాత అసలు, వడ్డీ కూడా తిరిగి ఇచ్చేదామని చెప్పారు. పెద్దిరెడ్డిని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రతాప్రెడ్డి, ఆనందనాయుడు, పరమేశ్వర, రామనారాయణరెడ్డి, అనిల్రెడ్డి ఉన్నారు. -
వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
రొంపిచెర్ల : గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చైన్నై– అనంతపురం హైవేలోని రొంపిచెర్ల క్రాస్రోడ్డులో సోమవారం రాత్రి జరిగింది. ఎస్ఐ మధుసూధన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి 11 గంటల సమయంలో రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వాహనదారులు చూసి రొంపిచెర్ల పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాధితుడిని 108లో అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుంది. మృతుడి ఆచూకీ తెలియని వారు కల్లూరు సీఐ జయరాం నాయక్ 9490617885, రొంపిచెర్ల ఎస్ఐ 9440900709 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలియజేశారు. -
హెల్మెట్ ధారణతో ప్రాణాలు కాపాడుకుందాం
● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ● రాయచోటిలో బైక్ ర్యాలీరాయచోటి : ‘రోడ్డు భద్రత అనేది కేవలం ఒక నిబంధన కాదు. అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత’ అని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం రాయచోటిలో హెల్మెట్ ధారణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా ఎస్పీ స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ కడప రింగ్ రోడ్డులోని అన్నమయ్య సర్కిల్ నుంచి ప్రారంభమై చిత్తూరు జాతీయ రహదారి, మాసాపేట, బండ్లపెంట, ఠానా, నేతాజీ సర్కిల్, శివాలయం చెక్పోస్టు మీదుగా బంగ్లా వరకు ఉత్సాహంగా సాగింది. పోలీసు అధికారులు, సిబ్బంది, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, విద్యాసంస్థల ప్రతినిధులు, పట్టణంలోని బైక్ మెకానిక్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా రోడ్డు భద్రత నినాదాలతో ప్రజల్లో చైతన్యం నింపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహన ప్రమాదాలలో జరిగే మరణాలలో అధికశాతం తలకు గాయాలు కావడం వల్లనే జరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఐఎస్ఐ ముద్ర కల్గిన హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుంచి ఎనభై శాతంకు పైగా తప్పించుకోవచ్చన్నారు. కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా అన్నమయ్య జిల్లాను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, ట్రాఫిక్ సీఐ కులాయప్ప, రాయచోటి పట్టణ రూరల్ సీఐలు చలపతి, రోషన్, లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్, ఎంవీఐ సుబ్బరాయుడు, పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
హైవేలో బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
● బస్స్టాప్ వద్ద నిలపాలని డిమాండ్ ● ఆర్టీసీ డీఎం చొరవతో సమసిన వివాదంచైన్నై– అనంతపురం హైవేలో నిలిచిన బస్సులురొంపిచెర్ల క్రాస్ రోడ్డులో బస్సులను అడ్డుకున్న ప్రజలురొంపిచెర్ల : చైన్నై– అనందపురం హైవేలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సులు బస్స్టాప్లో అగడం లేదని, దీని కారణంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మంగళవారం మధ్యాహ్నం బస్సులను అడ్డుకున్నారు. దీంతో అన్నమ్మయ్య జిల్లా పీలేరు ఆర్టీసీ డీఎం రోషన్ వచ్చి బస్స్టాప్లోనే బస్సులు నిలుపుతామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దు మణిగింది. గత నాలుగు నెలల కాలంలో రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో రోడ్డు దాటుతూ 8 మంది మృతి చెందగా, మరో 10 మంది వరకు గాయ పడ్డారు. దీనికి ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను బస్స్టాప్లో అపక పోవడమే కారణమని మండి పడ్డారు. సోమవారం రాత్రి కూడా గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలసి పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బస్సులను అడ్డుకున్నారు. సంఘటన స్థలానికి రొంపిచెర్ల పోలీసులు వచ్చి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చి ఇక్కడికి రావాలని తెలిపారు. డీఎం అప్పటికప్పుడే బస్స్టాప్ వద్దనే బస్సులు నిలపాలని డ్రైవర్లను ఆదేశించడంతో సమస్య సద్దుమణిగింది. -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
జమ్మలమడుగు : 69వ జాతీయ వాలీబాల్ పోటీలు వివిధ రాష్ట్రాల క్రీడాకారుల మధ్య రసవత్తరంగా సాగుతున్నాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను జిల్లా స్థాయి అధికారులతోపాటు వాలీబాల్గేమ్ అసోసియేషన్లు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల క్రీడాకారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలికల జూనియర్ కాలేజీలో పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయిశ్రీ, అధికారులు పాల్గొన్నారు. అదే జోరులో పశ్చిమబెంగాల్ జాతీయ స్థాయిలో వచ్చిన 30 టీంలలో పశ్చిమ బెంగాల్ క్రీడాకారుల జట్టు బలమైన జట్టుగా కనిపిస్తోంది. గతంలో వాలీబాల్ జాతీయ స్థాయిలో పోటీలలో విన్నర్గా నిలిచారు. ప్రస్తుతం అదే జోరు కొనసాగిస్తున్నారు. మంగళవారం జరిగిన పోటీలలో రాజస్థాన్ జట్టు తమ ప్రత్యర్థి అయిన జమ్మూకశ్మీర్పై గెలుపొందగా, ఛత్తీస్గఢ్పై పంజాబ్, గోవాపై ఒడిశా, ఢిల్లీపై విద్యాభారతీ, ఎన్వీఎస్పై కర్ణాటక, బీహార్పై తమిళనాడు, మధ్యప్రదేశ్పై హర్యానా, కేవీఎస్పై పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీరుపై గుజరాత్, ఛత్తీస్గఢ్పై ఢిల్లీ జట్లు గెలుపొందాయి. గురువారం గెలుపొందిన జట్లు మధ్య క్వార్టర్స్ ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్లు నిర్వహించి శుక్రవారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్రెడ్డి, శివశంకర్రెడ్డి తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ
చౌడేపల్లె : మండల కేంద్రంలోని హైస్కూల్ వీధిలో చర్చి పక్కన ఉన్న పెయింట్ వ్యాపారి గంగాధరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర మంగళవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును విచారణ చేశారు. పెయింట్ వ్యాపారిపై పెద్ద కొండామర్రికి చెందిన శ్రీదేవి, ఆమె అల్లుడు రాజేష్రెడ్డి, చిన్నకొండామర్రికి చెందిన చెంగళ్రాయప్పలు దాడి చేసి పెయింట్ డబ్బాలు తీసుకెళ్లడంతోపాటు షాప్నకు తాళాలు వేశారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకొని డీఎస్పీ విచారణ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రవర్తిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ రాంభూపాల్, ఎస్ఐ నాగేశ్వరరావు ఉన్నారు. -
యూరియా కోసం రైతుల ఘర్షణ
● ఐదు గంటల్లో అయిపోయిన ఎరువు ● వారం రోజుల్లో ఇస్తాం : రాజేశ్వరిరొంపిచెర్ల : యూరియా కోసం రైతులు ఘర్షణ పడ్డ సంఘటన రొంపిచెర్ల మండలం గానుగచింత రైతు సేవా కేంద్రంలో మంగళవారం జరిగింది. రైతుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గానుగచింత రైతు సేవా కేంద్రానికి మోటుమల్లెల, గానుగచింత గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 2250 మంది రైతులకు 400 బస్తాల యూరియా సోమవారం వచ్చింది. దీంతో రైతు సేవా కేంద్రం ఇన్చార్జి రాజేశ్వరి మంగళవారం ఉదయం 10 గంటలకు యూరియా పంపిణీ ప్రారంభించారు. అయితే యూరియా కొరత ఎక్కువగా ఉండటంతో రైతులు భారీగా చేరుకున్నారు. రైతుల పేర్లను వ్యవసాయ శాఖ అధికారి రాజేశ్వరి ఆన్లైన్ చేసి ఇస్తుండగా.. మరి కొందరు రైతుల పేర్లు ఆన్లైన్ చేయకుండానే పంచాయతీ అధికారుల సాయంతో యూరియా తీసుకుని వెళ్లారు. ఎక్కువగా ఒక గ్రామానికి చెందిన రైతులే తీసుకెళ్లారని మరి కొందరు అభ్యంతరం చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకే 400 బస్తాల యూరియా పంపిణీ అయిపోయింది. దీంతో తుర్పుగడ్డ, పడమర గడ్డ రైతులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రైతు సేవాకేంద్రం ఇన్చార్జి రాజేశ్వరి ఇరు వర్గాలకు సద్ది చెప్పి.. మరో వారం రోజులలో 300 బస్తాల యూరియా తెప్పించి రైతులకు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు వెనుతిరిగి వెళ్లారు. మోటుమల్లెల రైతు సేవా కేంద్రంలోనే ఇవ్వాలి మోటుమల్లెల గ్రామ పంచాయతీకి చెందిన రైతులకు మోటుమల్లెల రైతు సేవా కేంద్రంలోనే యురియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గానుగచింత, మోటుమల్లెలలో రెండు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసే వారని.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ పాలనలో మోటుమల్లెల రైతు భరోసా కేంద్రాన్ని రద్దు చేసి రెండు గ్రామ పంచాయతీలకు గానుగచింత రైతు సేవా కేంద్రంలోనే ఎరువులు ఇస్తున్నారు. అయితే మోటుమల్లెల గ్రామ పంచాయతీ రైతులకు తెలియకుండానే ఎరువుల పంపిణీ జరిగి పోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విడత మోటుమల్లెల రైతులకు అక్కడే యూరియా పంపిణీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.గానుగచింత రైతు సేవా కేంద్రంలో ఘర్షణ పడుతున్న రైతులు -
గాయపడిన ఇంటర్ విద్యార్థి మృతి
కలికిరి : గాయపడిన ఇంటర్ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కలికిరి మండలం కలికిరి పంచాయతీ నర్రావాండ్లపల్లికి చెందిన సుబ్బారెడ్డి కుమారుడు మహీధర్రెడ్డి(17) తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. గత నెల 9న మంగళవారం అర్ధరాత్రి సమయంలో కళాశాలలో స్నేహితులతో కలిసి నాల్గవ అంతస్తు నుంచి కిందికి వెనుక వైపు నుంచి దిగతూ కిందపడి తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. అప్పటి నుంచి తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాదాపు నెల రోజులు మృత్యువుతో పోరాడిన విద్యార్థి మహీధర్రెడ్డి సోమవారం ప్రాణాలు విడిచాడు. దీంతో అతనిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఆశలు అడియాశలయ్యాయి. స్వగ్రామం నర్రావాండ్లపల్లిలో మహీధర్రెడ్డి మృతదేహానికి తల్లిదండ్రులు, బంధువుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా విద్యార్థి మహీధర్రెడ్డి కళాశాల అధ్యాపకుల ఒత్తిడి భరించలేకే పారిపోయేందుకు యత్నించి ప్రమాదం పాలయ్యాడని అప్పట్లో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంతాపం విద్యార్థి మహీధర్రెడ్డి మృతి సమాచారం తెలుసుకున్న పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంగళవారం ఉదయం నర్రావాండ్లపల్లిలోని వారి స్వగృహానికి చేరుకుని విద్యార్థి మృతదేహానికి నివాళులు అర్పించారు. మృతుడి తల్లిదండ్రులను పరామర్శించారు. ఏపీఎండీసీ మాజీ డైరెక్టరు హరీష్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమేష్కుమార్రెడ్డి, కాకతీయ రమణారెడ్డి, రవీంద్రనాథరెడ్డి, మహేంద్రరెడ్డి, బాలాజీ రెడ్డి తదితరులు విద్యార్థి మృతదేమానికి నివాళులు అర్పించారు. -
కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పిన బైక్
మదనపల్లె రూరల్ : కుక్క అకస్మాత్తుగా అడ్డుపడటంతో ఎంబీఏ విద్యార్థి కిందపడి తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం పుంగనూరు మండలంలో జరిగింది. పుంగనూరు ఎన్ఎస్పేటకు చెందిన షణ్ముగం కుమారుడు మదన్కుమార్(21) విశ్వం కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. మంగళవారం పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బైక్లో బయలుదేరాడు. మార్గమధ్యంలో సుగాలిమిట్ట వద్ద అకస్మాత్తుగా వాహనానికి అడ్డుగా కుక్క రావడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నేటి నుంచి అన్నమాచార్య యూనివర్సిటీ వార్షికోత్సవాలు రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ విద్యాసంస్థల వార్షికోత్సవాలను పండుగలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నమాచార్య యూనివర్సిటీ ప్రొ–చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి తెలిపారు. మంగళవారం ఏయూ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి చాంబరులో ఆయన మాట్లాడారు. ఈ నెల 7, 8, 9వ తేదీలలో అన్నమాచార్య యూనివర్సిటీ వార్షికోత్సవాలను నిర్వహించదలుచుకున్నామన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలకు సంబంధించి ఒకేసారి వార్షికోత్సవం చేపట్టడం ఇదే తొలిసారి అన్నారు. యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ, న్యాయ, బీఈడీ, పారామెడికల్ కోర్సుల కళాశాలలు ఉన్నాయన్నారు. వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఏయూ యాజమాన్యం తన వంతుగా కృషి చేస్తోందన్నారు. ఏయూ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి ఆధ్వర్యంలో అన్నమాచార్య యూనివర్సిటీ రాయలసీమకే తలమానికంగా ఉండేలా రూపుదిద్దుకుంటోందన్నారు. వార్షికోత్సవాల తొలిరోజున అంటే 8న ప్రముఖ సింగర్ మంగ్లి, సినీ నటుడు మౌలి తనుజ్ ప్రశాంత్ పాల్గొంటారన్నారు. సంగీత విభావరి కార్యక్రమం ఉంటుందన్నారు. రెండవ రోజున కోర్టు మూవీ హిరోయిన్ శ్రీదేవి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి పాల్గొంటారన్నారు. స్పోర్ట్స్, కల్చరల్ దినోత్సవాలు జరుగుతాయన్నారు. ముగింపు రోజున హ్యాపీడేస్ హీరో నిఖిల్ సిద్దార్థ, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుగిల్లి, అన్నమాచార్య యూనివర్సిటీ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి పాల్గొంటారన్నారు. ఏయూ విద్యాసంస్థల వార్షికోత్సవాలు ఉంటాయన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో విభిన్న రీతిలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారన్నారు. ఈ ఉత్సవాలకు ఏయూ యాజమాన్యం సర్వం సిద్ధం చేసిందన్నారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు నిర్దేశించిన సమయానికి ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఈయూ డాక్టర్ సాయిబాబరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ క్లబ్ ప్రారంభం రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీలో మంగళవారం భారతీయ విజ్ఞాన్ వ్యవస్థ క్లబ్ను ఏకశిలానగరం శ్రీ పోతన సాహిత్యపీఠం అధ్యక్షుడు పసుపులేటి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విజ్ఞాన సంపద, సంస్కృతి, సంప్రదాయలను నేటి విద్యార్ధి లోకం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అన్నమాచార్య యూనవర్సిటీ ప్రొ చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి మాట్లాడుతూ భారతీయవిజ్ఙాన వ్యవస్థ క్లబ్ను ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబారెడ్డి, ప్రిన్సిపాల్ డా.నారాయణ, పీజీ కాలేజి ప్రిన్సిపాల్ సమతానాయుడు, సివిల్ డిపార్టుమెంట్ గౌతమి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.విద్యార్థికి తీవ్ర గాయాలు -
వన్యప్రాణుల విక్రయాల కేసులో ఏడుగురి అరెస్ట్
పీలేరు : వన్యప్రాణుల విక్రయాల కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పీలేరు డీఎఫ్వో జయప్రసాద్రావు తెలిపారు. మంగళవారం స్థానిక ఫారెస్ట్ కార్యాలయంలో నిందితుల అరెస్ట్ చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక కడప రోడ్డులోని గోపీ ఫంక్షన్ హాల్లో 18.7 కేజీల బరువు గల అలుగు పొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో కేవీపల్లెకు చెందిన రెడ్డెప్ప, చిన్నగొట్టిగొల్లుకు చెందిన రమణ, రేగళ్లుకు చెందిన చంద్రశేఖర్, కొత్తపల్లెకు చెందిన నాచూరి భాస్కర్, రాజ, పెనుమూరు మండలానికి చెందిన గోపి, పాలమందకు చెందిన రవి, కొత్తపల్లెకు సురేష్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఫారెస్ట్ అధికారులు మామూళ్లు తీసుకుని ప్రధాన నిందితులను వదిలిపెట్టినట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. -
ఇంటి వద్దే కాన్పు చేసిన 108 సిబ్బంది
రామాపురం : ఓ మహిళకు ఇంటి వద్దనే 108 సిబ్బంది కాన్పు చేశారు. మండలంలోని నల్లగుట్టపల్లి గ్రామం బీసీ కాలనీలో గర్భిణి టి.సుబ్బమ్మ వయసు 20. నాల్గవ కానుపు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ 108కు ఫోన్ చేశారు. సకాలంలో అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. పురిటినొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ సిబ్బంది ఇంటి వద్దనే ఆమెకు ప్రసవం చేశారు. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. అనంతరం చికిత్స నిమిత్తం రామాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఈఎంటీ శివానందరెడ్డి, అంబులెన్స్ ఫైలెట్ శ్రీకాంత్ ఉన్నారు. మాజీ సైనికుడిపై మందుబాబుల దాడి రాయచోటి : రాయచోటి పట్టణ పరిధిలో మందుబాబుల వీరంగం రోజురోజుకు అధికమవుతోంది. మంగళవారం సాయంత్రం పీకలదాకా మద్యం తాగిన కొంతమంది మందుబాబులు మాజీ సైనికుడు గాదిరాజు రామ్మోహన్ రాజు(43) పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో రామ్మోహన్ రాజు తలకు, చేతులకు రక్త గాయాలు అయ్యాయి. ఎస్ఎన్ కాలనీ సమీపంలోని శివాలయం చెక్పోస్ట్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలు అటుగా వస్తున్న రామ్మోహన్ రాజును అటకాయించి విచక్షణ రహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేసినట్లు తెలిసింది. దీంతో చెయ్యికి తీవ్రమైన గాయం కావడంతో పాటు తలపై రాడ్డు దెబ్బ బలంగా తగలడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. దాడి సంఘటనపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు చేశారు. అట్టహాసంగా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కడప అర్బన్ : వైఎస్ఆర్ జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్– 2025 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. క్రీడల్లో ఓవరాల్, వ్యక్తిగత, టీమ్ ఛాంపియన్ షిప్ విభాగంలో విజేతలకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. స్పోర్ట్స్ మీట్లో ఓవరాల్ చాంపియన్గా డి.ఏ.ఆర్ జట్టు నిలవగా, వ్యక్తిగత విభాగంలో చాంపియన్గా కానిస్టేబుల్ ఎల్.సతీష్(పి.సి 3322) కడప సబ్–డివిజన్ టీం చాంపియన్ షిప్ సాధించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, కడప డి.ఎస్.పి ఏ.వెంకటేశ్వర్లు, జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వేంకటేశ్వరరావు, ప్రొద్దుటూరు డి.ఎస్.పి పి.భావన, పులివెందుల డి.ఎస్.పి మురళి, మైదుకూరు డి.ఎస్.పి జి.రాజేంద్ర ప్రసాద్, డి.టి.సి డి.ఎస్.పి అబ్దుల్ కరీమ్, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి కేసులో నలుగురి అరెస్ట్
శ్రీనివాసపురం(కర్ణాటక) : కోలారు జిల్లాలో గంజాయిని రవాణా చేస్తున్న నలుగురిని శ్రీనివాసపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన ముగ్గురు పురుషులు, మదనపల్లికి చెందిన మహిళ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి సుమారు 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాలూకాలోని జివి కాలనీ గేట్ సమీపంలోని ద్విచక్రవాహనంలో తరలిస్తున్న సమయంలో దాడి జరిపి పట్టుకున్నారు. రేషన్ బియ్యం సీజ్ ములకలచెరువు : అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించి సీజ్ చేశారు. సీఎస్డీటీ సుబ్బయ్య కథనం మేరకు.. మండలంలోని పర్తికోటకు చెందిన రెడ్డెప్ప తన ఫీడు దుకాణంలో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ దాడులో 815 కేజీల బియ్యం స్వాధీనం చేసుకొని నిందితుడు రెడ్డెప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రతాప్ పేర్కొన్నారు. అన్నదమ్ములపై దాడి మదనపల్లె రూరల్ : స్థలం సమస్య కారణంగా ఏర్పడిన వివాదం, వ్యక్తిగత కక్షలతో అన్నదమ్ములపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన మంగళవారం కురబలకోట మండలం చేనేతనగర్లో జరిగింది. స్థానికంగా నివాసం ఉన్న రామచంద్ర కుమారుడు లోకేష్ (35) పెయింటర్గా, రెండో కుమారుడు రాజేష్ (30) ఎలక్ట్రిషియన్గా పని చేస్తుంటారు. వీరికి స్థానికంగా ఉన్న మరికొందరితో స్థలం వివాదం ఉంది. ఈ క్రమంలో మంగళవారం నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద రాజేష్ పనులు చేస్తుండగా, అదే దారిలో వెళుతున్న మరో వర్గంలోని రెడ్డెప్ప, హరి, ప్రశాంత్ దూషించారు. దీంతో గొడవ మొదలైంది. రాజేష్ అన్న లోకేష్ అక్కడికి చేరుకుని అకారణంగా ఎందుకు గొడవకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో వారు మరికొందరితో కలిసి అన్నదమ్ములపై దాడికి పాల్పడ్డారు. దాడిలో రాడ్ తీసుకుని కొట్టడంతో రాజేష్, లోకేష్ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్కు చెందిన శ్రీరాములు(70) రోడ్డుపై అవతలివైపున ఉన్న దుకాణం వద్దకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మదనపల్లె పట్టణంలోని రామారావుకాలనీకి చెందిన రామప్ప కుమారుడు శ్రీకాంత్ పెయింట్ పనులు చేస్తుంటాడు. సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్లో రామసముద్రం వెళ్లి తిరిగి వస్తుండగా, కట్టుబావి వద్ద వాహనం అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వాల్మీకిపురం మండలం జరావారిపల్లెకు చెందిన వెంకటరత్నం కుమారుడు శివ(35) బెంగళూరులో ఓలాలో పనిచేస్తాడు. తన పిల్లలను చూసేందుకు స్వగ్రామానికి వచ్చి తిరిగి బైక్లో బెంగళూరుకు వెళుతుండగా, మార్గమధ్యంలోని కాశీరావుపేట వద్ద ముందు వెళుతున్న మరో ద్విచక్రవాహనదారుడు అకస్మాత్తుగా బైక్ను మళ్లించడంతో శివ అతడి వాహనాన్ని ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయా ఘటనల్లో గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
అధ్యయనోత్సవాల్లో ధనుర్మాస పారాయణం
ఒంటిమిట్ట : పవిత్ర ధనుర్మాసంలో భాగంగా 18వ రోజైన సోమవారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో అధ్యయనోత్సవాల పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రంగమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువు తీరిన సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, అభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం వేదపండితులు ధనుర్మాస పారాయణం చేశారు. కోళ్ల వ్యాన్ బోల్తారొంపిచెర్ల : బాయిలర్ కోళ్లను సరఫరా చేసే వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటన అనంతపురం–చైన్నై జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో సోమవారం జరిగింది. చిత్తూరు జిల్లా కల్లూరుకు చెందిన వ్యాపారి బాయిలర్ కోళ్లను వ్యాన్లో తిరుపతి జిల్లాలోని భాకరాపేట, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు ప్రాంతాల్లోని చికెన్ షాపులకు ఇచ్చి తిరిగి కల్లూరుకు వెళుతుండగారొంపిచెర్ల క్రాస్ రోడ్డు వద్ద అదుపు తప్పి హైవే రోడ్డు పక్కన పడింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో 500 కోళ్లు ఉన్నాయి. వ్యాన్ డ్రైవర్ మాదిరెడ్డి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. డ్రైవర్ నిద్ర మత్తులో వ్యాన్ను అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగ పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారు బోల్తా: ఒకరికి గాయాలుములకలచెరువు : అదుపుతప్పి కారు బోల్తా కొట్టడంతో ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతికి చెందిన ఎస్. ఉస్మాన్(33) తన కుటుంబ సభ్యులతో సత్యసాయి జిల్లా కదిరిలో పెళ్లిచూపుల నిమిత్తం వెళ్తుంగా కొండకింద రైల్వే గేటు సమీపంలో అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఉస్మాన్ తీవ్రంగా గాయపడ్డారు. అటువైపు వెళ్లే ప్రయాణికులు గమనించి బాధితుడిని 108 సహాయంతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులోని కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పులివెందుల మున్సిపల్ కమిషనర్పై సస్పెన్షన్ వేటు
పులివెందుల : పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడుపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సీడీఎమ్ఏ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని సోమవారం ఆదేశాలు రావడంతో ఆయన బయలుదేరి వెళ్లారు. పులివెందుల ఇన్చార్జి కమిషనర్గా డీఈసీ సురేశ్బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ రాముడుపై వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ● పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య విభాగంలో పనిచేసే పలువురు చిరుద్యోగులను మున్సిపల్ కమిషనర్ రాముడు వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ కార్యాలయంతోపాటు ఇంట్లో కూడా క్లీనింగ్ పనులు చేయాలని హుకుం జారీ చేసేవారని,ఇంటికి పోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని మహిళా ఉద్యోగులు ఆరోపించారు. ఆయన మాట వినకపోతే సమావేశం నెపంతో అనేకమార్లు తన కార్యాలయానికి రప్పించుకొని మహిళా సచివాలయ సిబ్బందిపై సైతం వేదింపులకు పాల్పడ్డారని సమాచారం. కనీసం కూర్చోమనేవాడు కాదని, మీటింగ్ మొత్తం నిలబెట్టేవారని వారు ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విచారణ చేపట్టి అధికారిపై చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. రాముడుపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.మహిళా చిరుద్యోగులపై అధికారి లైంగిక వేధింపులే కారణం -
వ్యక్తిపై దాడి
మదనపల్లె రూరల్ : నగదు తిరిగి ఇవ్వమన్నందుకు వ్యక్తిపై కుటుంబం మొత్తం కలిసి దాడిచేసిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ఎస్టేట్ పద్మావతి కల్యాణమండపం వద్ద నివాసం ఉన్న చంద్రానాయక్(52) అదే ప్రాంతానికి చెందిన దేవరాజు ద్విచక్రవాహనాన్ని ఐదునెలల క్రితం రూ.30వేలకు కుదువ పెట్టుకున్నాడు. 20 రోజుల తర్వాత దేవరాజు సాయంత్రానికి తనకు డబ్బు వస్తుందని తిరిగి ఇచ్చేస్తానని బైక్ తీసుకెళ్లాడు. అప్పటి నుంచి నగదు ఇవ్వకుండా చంద్రానాయక్ కుటుంబసభ్యులను వేధిస్తూ వచ్చాడు. ఈక్రమంలో చంద్రానాయక్ వారి ఇంటివద్దకు వెళ్లి ఇవ్వాల్సిన నగదు వెంటనే చెల్లించాలని నిలదీశాడు. దీంతో దేవరాజు, అతడి కుటుంబసభ్యులు మూకుమ్మడిగా చంద్రానాయక్పై దాడిచేశారు. బకెట్ తీసుకుని తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అంతేకాకుండా దేవరాజు కత్తితో చంపేస్తానంటూ మీదకు రావడంతో ఇతరులు వారించి ఇంట్లో ఉంచి తాళం వేశారు. అనంతరం స్థానికులు గాయపడిన చంద్రానాయక్ను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
యువకుడు ఆత్మహత్య
పెద్దమండ్యం : ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని శిద్దవరం పంచాయతీ కోటగుట్టపల్లె హరిజనవాడలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ పి శ్రావణి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంపల శివానంద కుమారుడు రెడ్డిశేఖర (20) ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఇంటి వద్దనే ఉన్నాడు. ఇక్కడే డ్రైవర్, మెకానిక్ పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేవాడు. ఇటీవల సెల్ఫోన్ కొనుగోలు చేసి తరచూ గేములు ఆడటానికి అలవాటు పడ్డాడు. ఈ విషయమై తల్లిదండ్రులు ఒకసారి మందలించగా ఆత్మహత్యకు ప్రయత్నించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాలతో బయట పడ్డాడు. తల్లిదండ్రులు రోజువారి కూలి పనులకు సోమవారం ఉదయం 6 గంటలకు వెళ్లగా ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న రంగాపురం గ్రామానికి చెందిన రఘు (43) అనే వ్యక్తి సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల కథనం మేరకు వివరాలు..రఘు గత కొన్నేళ్లుగా బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సుమారు రూ. 10 లక్షలు అప్పు చేశాడు. అయితే అప్పులవాళ్ల బాధ తాళలేక ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కమలాపురం : కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన కబడ్డీ జట్టు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ సత్య నారాయణ రెడ్డి తెలిపారు. ఈ నెల 4వ తేదీన జమ్మల మడుగులో జరిగిన పాలిటెక్నిక్ కళాశాలల జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో కమలాపురం జట్టు పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అలాగే అథ్లెటిక్స్ విభాగంలో 400మీటర్ల రిలే పోటీల్లో ద్వితీయ స్థానం, 800 మీటర్ల పరుగు పోటీల్లో తృతీయ స్థానంలో తమ కళాశాల విద్యార్థులు నిలిచారని ప్రిన్సిపల్ తెలిపారు. క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్ వీరాంజనేయులును ప్రిన్సిపల్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని సూచించారు. కళాశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగుపడాలి
మదనపల్లె రూరల్: మై స్కూల్, మై ప్రైడ్ కార్యక్రమంతో 9, 10 తరగతుల విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగుపడాలని కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో...మదనపల్లె సబ్ కలెక్టర్, రాయచోటి, పీలేరు ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, హౌసింగ్ సిబ్బందితో మై స్కూల్, మై ప్రైడ్, జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టులకు భూసేకరణ, రీసర్వే, స్వామిత్వ, స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న గెజిటెడ్ అధికారులు ఆయా పాఠశాలల్లో 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు రోల్ మోడల్గా నిలిచి అభ్యసన ఫలితాలను పెంచాలన్నారు. ఇంగ్లీష్ మాట్లాడాలన్న ఆసక్తితో పాటు మాట్లాడగలిగే సామర్థ్యాన్ని పెంచాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలపై ప్రజలకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని ఆదేశించారు. వికసిత్ భారత్ జీ రామ్ జీ చట్టం అమలుకు సంబంధించి అన్ని మండలాల ఎంపీడీఓలు అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకుని నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్రపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో పంపిణీ చేస్తున్న నూతన పట్టాదారు పాసుపుస్తకాలు, రీసర్వే, స్వామిత్వ అంశాలపై జేసీ ఆదర్శ రాజేంద్రన్, రెవెన్యూ, సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమావేశంలో సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, రాయచోటి, పీలేరు ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ● జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ -
రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడికి జైలు
రాయచోటి టౌన్ : రోడ్డు ప్రమాదానికి కారణమైన షేక్ హసన్బాషా అనే నిందితుడికి రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి సుయోధన్ రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. సంబేపల్లె పల్లె పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంబేపల్లె మండల పరిధిలో 2021 డిసెంబర్లో ప్రైవేట్ అంబులెన్స్ను నడుపుతూ రోడ్డుపై బైక్లో వెళుతున్న మండెం మాదయ్యను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో సోమవారం రాయచోటి కోర్టులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిందితుడికి రెండేళ్లు జైలు శిక్ష, పాటు రూ.1000లు జరిమానా విధించారు. -
8న కాకినాడలో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఎంపికలు
మదనపల్లె సిటీ: శాప్ ఆదేశాల మేరకు ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి ఎంపికలు ఈనెల 8వ తేదీన కాకినాడలోని డీఎస్ఏ మైదానంలో జరగనున్నట్లు అన్నమయ్య జిల్లా స్పోర్ట్సు అథారిటీ అధికారి చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికల ద్వారా రాష్ట్రం నుంచి ప్రతిభావంతులైన గిరిజన క్రీడాకారులను గుర్తించి ఫేజ్–2కు పంపడం జరుగుతుందన్నారు. అథ్లెటిక్స్, అర్చరీ, స్విమ్మింగ్, వెయిట్ లిప్టింగ్, రెజ్జింగ్, హాకీ, పుట్బాల్ క్రీడల్లో ఎంపికలుంటాయన్నారు. జిల్లాలోని అర్హత కలిగిన గిరిజన క్రీడాకారులు ఈ అవకాశం వినియోగించుకుని ఎంపిక పోటీలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9985113210ను సంప్రదించాలని కోరారు. మదనపల్లె సిటీ: జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకు మారింది. ఇందులో భాగంగా స్థాని బీటీ కాలేజీలో జిల్లా ఎస్సి సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం సోమవారం ప్రారంభించారు. కాలేజీలో రూము నంబర్ 145 కేటాయించారు. కార్యక్రమంలో డీఎస్డబ్యూఓ దామోదర్, ఏఎస్డబ్యూఓ గంగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు రాయచోటి: జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, దారి మళ్లించినా, అధిక ధరలకు విక్రయించినా వారి లైసెన్సులను రద్దు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి శివనారాయణ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, కొరత ఉన్నట్లు నిబంధనలు అతిక్రమించి చూపిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నూతనంగా రూపొందించిన నానా యూరియా, నానో డీఏపీ ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. రైతులు ఎరువుల కొనుగోలు సమయంలో ఎంఆర్పీ ధరలను చూసి కొనుగోలు చేయాలని.. డీలర్ నుంచి రశీదు పొందాలని సూచించారు. మదనపల్లె రూరల్: శ్రామికులకు ఉపాధిహామీ చట్టంలో 100 రోజులు ఉంటే, వికసిత్ భారత్–జి రామ్ జి చట్టంలో 125 రోజుల ఉపాధికి హామీ ఇస్తామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ వెంకటరత్నం తెలిపారు. సోమవారం మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో స్వచ్ఛ సంక్రాంతి గ్రామం, వికసిత్ భారత్–జి రామ్ జి చట్టంపై అవగాహన సభలు నిర్వహించారు. కొత్తవారిపల్లె గ్రామపంచాయతీలో సర్పంచ్ బోర్వెల్ మహేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి డ్వామా పీడీ వెంకటరత్నం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం కంటే మెరుగ్గా ఈ చట్టాన్ని కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంలో 125 రోజుల ఉపాధితో పాటు, వేతనాలు ఆలస్యమైతే ఆలస్యపు సమయానికి పరిహారం ఇస్తుందన్నారు. సకాలంలో పనులు కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, జలవనరుల అభివృద్ధి, ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ, వ్యవసాయ అభివృద్ధి కోసం పనులు చేపడతామన్నారు. సీటీఎం, కోళ్లబైలులో నిర్వహించిన గ్రామసభల్లో స్వచ్ఛ సంక్రాంతి– స్వచ్ఛ గ్రామం కార్యక్రమంలో డీపీఓ రాధమ్మ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ పారిశుధ్య పనులు గుర్తించి రోజువారీ చెత్తసేకరణ కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ జరపాలన్నారు. గ్రామంలో చెత్త దిబ్బలను గుర్తించి వెంటనే తొలగించాలన్నారు. కార్యక్రమంలో డీడీఓ అమరనాథరెడ్డి, సర్పంచ్ ఆనందపార్థసారధి, ఏపీడీ నందకుమార్రెడ్డి, ఎంపీడీఓ తాజ్మస్రూర్, డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్నాయక్, ఏపీఓ పాల్గొన్నారు. -
శిష్యుడి కోసం.. సీమను ఎడారి చేసిన చంద్రబాబు
రాజంపేట : రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, సీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు సైంధవుడిలా అడుగడునా అడ్డుపడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు. ఇందుకు నిదర్శనమే రాయలసీమ ఎత్తిపోతలను నిలిపివేయడమని విమర్శించారు. సోమవారం తన ఎస్టేట్లో ఆకేపాటి విలేకర్లతో మాట్లాడుతూ తన శిష్యుడు రేవంత్రెడ్డికి రాజకీయ ప్రయోజన చేకూర్చడం కోసం చంద్రబాబు రాయలసీమను ఎడారి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై సీమ ఎత్తిపోతల పనులు నిలిపివేయించా.. కావాలంటే నిజనిర్ధారణ కమిటీతో తనిఖీ చేసుకోవచ్చునని అంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా శనివారం రాత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలంరేపడం తెలిసిందేనన్నారు. ఒక్క రాయలసీమ ఎత్తిపోతలే కాదు.. శ్రీశైలానికి వరద జలాలను ఒడిసిపట్టి రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు పనులు, రాజోలు, జొలదరాశి,కుందూ ఎత్తిపోతల లాంటి కొత్త ప్రాజెక్టుల పనులను చంద్రబాబు సర్కారు రాగానే పూర్తిస్థాయిలో నిలిపివేసిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి 2015లో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్కు చంద్రబాబు తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 2020లో ఏపీ ప్రయోజనాలను పరిరక్షిస్తూ చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. సీమ ఎత్తిపోతలపై ఆది నుంచి చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరొస్తుందనే ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ(చైన్నె) బెంచీలో తెలంగాణా రైతులతో టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు అప్పట్లో రిట్పిటిషన్ దాఖాలు చేయించిన సంఘటనను సీమ రైతులు మరిచిపోలేరన్నారు. ఎన్జీటీ, పర్యావరణ అనుమతి తీసుకొని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబరు 29న ఆదేశించిదన్నారు. ఒకవైపు రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. అధికారులు పనులు కూడా చేపట్టారన్నారు. కానీ గత ఏడాది పిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కార్ సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడంతో రాయలసీమ ఎత్తిపోతల తొలిదశ పనులకు బ్రేక్ పడిందన్నారు. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులుకొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పలేకపోయిందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఏకాంత సమావేశంలో కుదిరిన ఒప్పందం వల్ల సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తిగా నిలిపివేయించారనడానికి ఇది మరో నిదర్శనమని సాగునీటి రంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారన్నారు. అలాగే బోగాపురం ఎయిర్పోర్టుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుంకుస్థ్ధాపన చేశారని, ఇప్పుడు ఆ ఎయిర్పోర్టు పూర్తయిన క్రమంలో ఆ క్రెడిట్ చోరీకి పాల్పడ్డ ఏకై క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అని అన్నారు. ఆంధ్రజ్యోతి కథనం అవాస్తవం.. రాయలసీమ ఎత్తిపోతలను నిలిపివేసింది జగనేనని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని ఆకేపాటి కొట్టిపారేశారు. ఈ విషయం సీమ రైతులందరికి తెలుసునని ఆయ తెలిపారు. ఎల్లోమీడియా చంద్రబాబు కోసం విలువలను తుంగలోకి తొక్కేస్తుందనడానికి ప్రచురితమైన కథనం నిదర్శనంగా నిలుస్తోందని ఆకేపాటి చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేసినప్పటికి, ఆంధ్రజ్యోతి మాత్రం వైఎస్ జగన్ నిలిపివేశారని రాయడం దుర్మార్గమని పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి -
● కల నెరవేర్చిన మిథున్రెడ్డి
రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉమ్మడి చిత్తూరులోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, వాయల్పాడు, ఉమ్మడికడపలోని రాజంపేట, రాయచోటి, కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి ఉండేది. 2009లో వాయల్పాడు నియోజకవర్గం కనుమరుగు కావడంతో దానిస్థానంలో పుంగనూరు నియోజకవర్గం కలిసింది. 1967 నుంచి 2014 వరకు అన్ని పార్టీలు కడపజిల్లాకు చెందిన వారినే అభ్యర్థులుగా ఎంపికచేసేవి. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి చిత్తూరుకు అభ్యర్థిత్వం దక్కేదికాదు. ఇక్కడి ప్రజల నిరాశ, అసంతృప్తిని దూరం చేస్తూ 2014లో పిన్న వయస్కుడైన పీవీ.మిథున్రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ నుంచి బరిలో నిలబడి గత ఎంపీల రికార్డులన్ని తిరగరాస్తూ 1,74,762 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఇక్కడి ప్రజల చిరకాల ఆశ నెరవేరింది. హ్యాట్రిక్లో మిథున్రెడ్డి రికార్డు 2014 పార్లమెంటు ఎన్నిక బరిలో దిగేనాటి కి, అంతకుముందు పనిచేసిన ఎంపీలకంటే పిన్న వయస్కుడు పీవీ.మిథున్రెడ్డి. ఈ ఎన్నికలో తన ప్రత్యర్థి సాధారణ వ్యక్తికాదు. ఎన్టీఆర్ తనయ పురందేశ్వరీ బీజేపీ అభ్యర్థిగా మిథున్రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేశారు. తొలి ఎన్నికే అయినా మిథున్ రెడ్డి తన స్టామి నాను నిరూపించుకున్నారు. అప్పటిదాకా ఉన్న అభ్యర్థుల మెజార్టీని తిరగరాశారు. 1,74,762 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి పురందేశ్వరీని ఓడించారు. తర్వాత 2019 ఎన్నికలో తన రికార్డును తానే చెరిపేస్తూ 2,68,284 ఓట్ల మెజార్టీ సాధించారు. రాజంపేట పార్లమెంటు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ. 2024లోనూ గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. -
రోడ్డు ప్రమాదంలో సుమో డ్రైవర్కు తీవ్ర గాయాలు
పీలేరురూరల్ : రోడ్డు ప్రమాదంలో సుమో డ్రైవర్కు తీవ్ర గాయాలైన సంఘటన పీలేరు శివారు ప్రాంతం వెంకటాద్రిళ్ల వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. కేవీపల్లె మండలం గోరంట్లపల్లె పంచాయతీ బెస్తపల్లెకు చెందిన పి. యల్లప్ప (45), తోపాటు అదే గ్రామానికి వెంకటరమణ, కేవీపల్లె పంచాయతీ నక్కలదిన్నెవడ్డిపల్లెకు చెందిన శేషు, అంజి నలుగురు సుమోలో పీలేరు నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. రాయచోటి వైపు నుంచి చిత్తూరు వైపు వెళుతున్న లారీ వెంకటాద్రిళ్ల వద్ద సుమోను ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ యల్లప్పకు కుడిచేయి పూర్తిగా తొలిగిపోయింది. మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని చికిత్సనిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నాలుగు జిల్లాల సీటు!
రాజంపేట పార్లమెంటు..మదనపల్లె: దేశ రాజకీయాల్లో రాజంపేట పార్లమెంటు స్థానానికి ఉన్న ప్రాధాన్యత ఏ నియోజకవర్గానికి లేదు. మనకు స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి సాధారణ ఎన్నిక 1952 నుంచి 2024 ఎన్నిక వరకు రాజంపేటకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు జిల్లాల పరిధిలో ఉన్న ఈ స్థానం ఇప్పుడు నాలుగుజిల్లాల పరిధికి చేరింది. ముగ్గురు ఎంపీలు హ్యాట్రిక్ సాధించగా ఒకరు డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఇక 1957 ఎన్నికలో ఎన్నికే లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం విశేషం. వార్డు సభ్యుని పదవికి పోటాపోటి ఉండే పరిస్థితుల్లో గౌరవ ప్రదమైన లోక్సభ ఎంపీ పదవికి పోటీయే లేదంటే ఇక్కడి నేతల గొప్పదనం అర్థమవుతుంది. తొలి ఏకగ్రీవం ఎన్నిక 1957లో జరిగిన రెండవ పార్లమెంటు ఎన్నికల్లో రాజంపేట స్థానం నుంచి తంబళ్లపల్లెకు చెందిన టిఎన్.విశ్వనాథరెడ్డి పోటీకి సిద్ధమై నామినేషన్ దాఖలు చేశారు. దేశ వ్యాప్తంగా 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే రాజంపేట ఎంపీ స్థానానికి ఒకేఒక నామినేషన్ దాఖలైంది. ఆ నామినేషన్ టిఎన్.విశ్వనాథ రెడ్డిదే కావడంతో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ప్రకటించారు. దేశంలో పార్లమెంటు సభ్యుని తొలి ఏకగ్రీవ ఎన్నికగా దేశ ఎన్నికల చరిత్రలో నమోదైంది. ఇలా రాజంపేటకు తొలినాళ్లలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. స్వతంత్ర పార్టీకి అవకాశం రాజంపేట ఓటర్లు కాంగ్రెస్ హవాలోనూ స్వతంత్య్ర పార్టీ అభ్యర్థి సీఎల్.నరసింహారెడ్డిని గెలిపించారు. 1962లో దేశంలో ఆపార్టీకి 18 ఎంపీ స్థానాలు దక్కగా అందులో రాజంపేట ఒకటి కావడం విశేషం. 1967 నుంచి 1980 వరకు నాలుగుసార్లు పి.పార్థసారధి ఎంపిగా గెలిచారు. 1984లో టీడీపీ నుంచి పాలకొండ్రాయుడు ఎంపీగా గెలిచారు. 1989 నుంచి 1998 వరకు, 2004, 2009 వరకు కాంగ్రెస్ నుంచి సాయిప్రతాప్ ఎంపీగా గెలిచారు. 1999లో టీడీపీ నుంచి రామయ్య ఎంపీగా గెలిచినా పార్లమెంటు ఎన్నిక చరిత్రలో అత్యల్ప మెజార్టీ వచ్చింది ఈయనకే. ఆ ఎన్నికలో కేవలం 27,170 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇందులో సాయిప్రతాప్ డబుల్ హ్యాట్రిక్ చేయగా పార్థసారధి నాలుగుసార్లు గెలిచారు. వీరి తర్వాత మిథున్రెడ్డి వరుసగా హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. సాయి ప్రతాప్ ఈ పార్లమెంటు స్థానానికి దేశ రాజకీయాల్లో గుర్తింపు 1957లో ఇక్కడి ఎంపీ టీఎన్.విశ్వనాథ రెడ్డి ఏకగ్రీవం ఎంపీగా గెలిచిన వారిలో అత్యధిక మెజార్టీ మిథున్రెడ్డిదే ఇప్పుడు నాలుగుజిల్లాల్లో పార్లమెంటు పరిధితోనూ రికార్డే విశ్వనాథ రెడ్డి, మిథున్రెడ్డి మినహాఅందరూ కడపనేతలే 1952 నుంచి 2019 వరకు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం కడప–చిత్తూరుజిల్లాల పరిధిలో ఉండేది. 2022 ఏప్రిల్లో కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్నమయ్యలో ఆరు, చిత్తూరులో ఒక నియోజకవర్గంతో ఉండేది. తాజాగా అన్నమయ్య, చిత్తూరుజిల్లాల్లో జరిగిన మార్పులతో రాజంపేట పార్లమెంటు స్థానం నాలుగుజిల్లాల పరిధిలోకి వచ్చింది. ఏడు నియోజకవర్గాల్లో రాజంపేట వైఎస్సార్ కడపజిల్లా, కోడూరు తిరుపతిజిల్లా, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలు మదనపల్లె జిల్లా కేంద్రమైన అన్నమయ్యజిల్లా పరిఽధిలోకి వచ్చాయి. పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్ల, పులిచర్ల మండలాలు చిత్తూరుజిల్లాలో విలీనం చేయడంతో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నాలుగుజిల్లాల పరిధిలోకి వచ్చింది. ఇలా ఎంపీకి నాలుగుజిల్లాల్లో ప్రాతినిథ్యం ఏర్పడింది. -
బాధితులకు న్యాయం చేయాలి
మదనపల్లెరూరల్ : బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించి, న్యాయం అందించడమే పోలీసుల బాధ్యతని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, వేధింపులపై వచ్చిన అర్జీలను పరిశీలించారు. బాధితుల సమస్యలను విన్న వెంటనే, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను విచారించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారులకు న్యాయం జరిగినట్లు నిర్ధారించుకోవడమే కాకుండా, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ప్రధాన కార్యాలయానికి పంపాలని అధికారులకు సూచించారు. అక్రమ వడ్డీ వ్యాపారాలు చేస్తూ సామాన్యులను పీడించే వారిపై, ఆన్న్లైన్ మోసాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు, మహిళలపై వేధింపులకు దిగే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, మదనపల్లి డిఎస్పీ మహేంద్ర, సి ఐ లు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిట్టీల పేరుతో రూ.4.5 కోట్ల మోసం.. చీటీల వ్యాపారి రెడ్డప్ప చీటీల నిర్వహణ పేరుతో రూ. 4.5 కోట్లు మోసం చేశాడంటూ వాల్మీకిపురానికి (వాయల్పాడు) చెందిన కొందరు బాధితులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణంలో నివాసమున్న చీటీల రెడ్డప్ప 179 మందికి రూ. 4.50 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనికి ఆస్తులు భారీగానే ఉన్నాయని, అతను వేసిన ఐపీని కోర్టు సైతం తిరస్కరించిందని, అయినా తమకు నగదు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఎస్పీకి తెలిపారు. స్పందించిన ఎస్పీ వెంటనే చీటీల రెడ్డప్ప ఆస్తులు జప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. దేవుడి పేరుతో కిలో బంగారు, రూ.కోటి నగదు స్వాహా.. పట్టణంలోని బసినికొండ ప్రాంతానికి చెందిన ఆలయ పూజారిగా ఉన్న ఉంగరాల స్వామి అలియాస్ వెంకట శాస్త్రి కుటుంబ సభ్యులు తమకు చెందిన సుమారు కిలో పైగా బంగారు ఆభరణాలు, కోటి రూపాయలకు పైగా నగదు కాజేశారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మదనపల్లె పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడు బెంగళూరు వాసులకు కుటుంబ క్షేమం, ఆదాయవృద్ధికై వెంకట శాస్త్రి మండల పూజలు నిర్వహించే వాడన్నారు. పూజల్లో భాగంగా భక్తులు నగదు, నగలు స్వామికి అందించి 40 రోజులపాటు పూజలో ఉంచే వారన్నారు. పూజల అనంతరం తిరిగి భక్తులకు ఇచ్చేవాడన్నారు. రెండు నెలల క్రితం ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందాడన్నారు. ఆయన మరణానంతరం ఉంగరాల స్వామి దత్తపుత్రిక శైలజ, మనవడు తరుణ్ రెడ్డి తమ సొత్తులను కాజేసి పరారయ్యారన్నారు. దీనిపై వెంటనే విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలంటూ ఎస్పీ టూటౌన్ సీఐను ఆదేశించారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
పంటపొలాలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని పాళెం పంచాయతీలో ఉన్న కోటపల్లె,జూపల్లె గ్రామాల సమీపంలోని పంటపొలాలపై ఏనుగులు దాడి చేశాయి. సోమవారం తెల్ల వారు జామున ఏనుగులు జూపల్లె,కోటపల్లెకు చెందిన సుబ్బరామయ్య, నాగరత్నంకు చెందిన మామిడి కొమ్మలు,బోరు పైపులు తొక్కి నాశనం చేశాయి. .జూపల్లెకు చెందినదాము కొబ్బరిచెట్లను కూడా ధ్వంసం చేశాయి. ఫారెస్టు అధికారులు స్పందించి ఏనుగులు పొలాల్లోకి రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. సైకిల్పై ప్రపంచ యాత్ర రామసముద్రం : తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ముత్తుచలవన్ సైకిల్పై ప్రపంచాన్ని చుడుతున్నాడు. 2021లో సైకిల్పై బయలుదేరి సోమవారం రామసముద్రం చేరుకున్నాడు. ప్రపంచయాత్రికుడు నేపాల్, బంగ్లాదేశ్తో పాటు ఇండియాను పూర్తిచేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 11,11,111 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు. స్థానిక పోలీస్స్టేషన్కు చేరుకుని ఎస్ఐ ఉమామహేశ్వరరెడ్డిని కలిశాడు. ఎనిమిది దేశాలు చుట్టి 44వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. ఎస్ఐతో పాటు అతన్ని స్థానిక విశ్వహిందూ సమ్మేళన సమితి సభ్యులు నవీన్, చలపతి, రెడ్డి, కృష్ణారెడ్డి తదితర యువకులు ముత్తు చలవన్ను అభినందించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరు మదనపల్లె సిటీ : గుంటూరులో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు మునిగోపాలకృష్ణ హాజరయ్యారు. తాను రచించిన కవిత తెలుగు మాటల సౌందర్యం, తెలుగు గొంతు చేసే ప్రతి శబ్దం’అనే కవితను చదివి వినిపించారు.ఆయన్ను తెలుగు మహాసభల నిర్వాకుడు గజల్ శ్రీనివాసులు సన్మానించారు. -
ఒక్కొక్క అర్జీకి రూ.100
మదనపల్లె రూరల్: మదనపల్లె కేంద్రంగా అన్నమయ్యజిల్లా ఏర్పాటైన తర్వాత మొదటిసారి జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమాని కి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తమ సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకు అర్జీలు రాయించుకునేందుకు కలెక్టరేట్ ఎదుట కూర్చున్న రైటర్లను ఆశ్రయించారు. అమాయక పేదల అవసరాన్ని అవకాశంగా తీసుకుని అర్జీకి రూ.100 చొప్పున వసూలుచేశారు. దీనిపై చాలామంది పేదలు గతంలో సబ్ కలెక్టర్ కార్యాలయంగా ఉన్నప్పుడు అర్జీకి రూ.30 వసూలు చేసే వారని, ఇప్పుడు రైటర్లు పెరిగారు.. రేటు కూడా పెంచేశారంటూ వాపోయారు. ఒకరిద్దరైతే, అంత డబ్బులు ఇవ్వలేమంటూ రైటర్లతో వాదులాడటం కనిపించింది. వృద్ధులు, చదువురాని గ్రామీణ ప్రజల కోసం అర్జీలు రాయించి ఇచ్చేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ● కలెక్టరేట్ ఎదుట రైటర్ల దోపిడీ ● ఇచ్చుకోలేమంటున్న పేదలు -
బైక్లకు వరండా.. బుడతలకు ఎండ
చౌడేపల్లె మండలంలోని కోటూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 108మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే రూముల సమస్య వల్ల కేవలం నాలుగు గదుల్లో విద్యార్థులు కూర్చోవాల్సి ఉంది. ఇటీవల ఓ దాత సహకారంతో నాడు–నేడు ద్వారా చేపట్టిన పనులు మధ్యలో ఆపేసిన భవనానికి ఫ్లోరింగ్ వేసి వినియోగించుకుంటున్నారు. ఇంతవరకు బాగున్నా... అసలే రూముల సమస్య ఉండగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు తెచ్చిన బైక్లను పాఠశాల వరండాలో పార్క్ చేస్తున్నారు. దీంతో మండుటెండలో విద్యార్థులు కూర్చోవాల్సి వస్తోంది. ఉపాధ్యాయుల తీరుపై పిల్లల తల్లితండ్రులు మండిపడుతున్నారు. – ఎన్. రసూల్, చౌడేపల్లి -
యూరియా కోసం పడిగాపులు
కేవీపల్లె : మండలంలోని జిల్లేళ్లమంద గ్రామ పంచాయతీలో పంటలు సాగు చేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. సోమవారం జిల్లేళ్లమంద రైతు సేవా కేంద్రానికి రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. ఒక బస్తా యూరియా కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ఫోన్లు చేస్తే కావాల్సిన వారికి ఎన్ని బస్తాలు అయినా ఇస్తున్నారని, తమకు మాత్రం ఒక బస్తా మాత్రమే ఇచ్చారని పలువురు రైతులు వాపోయారు.అధికారులు స్పందించి అవసరం మేరకు యూరియా పారదర్శకంగా పంపిణీ చేయాలని కోరారు. -
మిట్స్ అశ్వ్–26 పోస్టర్ ఆవిష్కరణ
కురబలకోట : మదనపల్లి దగ్గర అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అశ్వ్–26 ఫెస్టివల్ వెబ్సైట్, పోస్టర్లను చాన్స్లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి ఆదివారం ఆవిష్కరించారు. టెక్నికల్, కల్చరల్, స్పోర్ట్స్ విభాగాలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 25, 26 తేదీలలో వీటిని నిర్వహిస్తున్నట్లు వీసీ యువరాజ్ తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలలో డిప్లమా, ఇంజినీరింగ్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు www.mits.ac.in లో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఉత్సవ వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, గాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో పోస్టల్ ఉద్యోగి మృతివీరబల్లి్ : మట్లి పంచాయతీ, కృష్ణాపురం గ్రామానికి చెందిన కంపా రమణయ్య కుమారుడు కంపా చందు (21) నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం కృష్ణాపురంలో చందు మృతదేహానికి ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చిన్నవయస్సులోనే పోస్టల్ ఉద్యోగం సంపాదించి విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, బండి రమణయ్య, ఆర్ఎం రెడ్డి, జయచంద్ర నాయుడు, పుల్లగూర భూషణం, కృష్ణాపురం, మట్లి గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 10,11 తేదీల్లో పౌర హక్కుల సంఘం సభలు కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈ నెల 10, 11న తిరుపతి నగరం బైరాగి పట్టెడలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించే పౌరహక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కోరారు. ఆదివారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో మహాసభలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఈ సభల్లో మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ప్రముఖ గాంధేయవాది హిమాంశు కుమార్, సామాజిక కార్యకర్త బేలబాటియా, ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని అన్నదమ్ములకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : బైక్ ఢీకొని అన్నదమ్ములు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. కలిచెర్ల పంచాయతీ నత్తి ఓబన్నగారిపల్లెకు చెందిన కాలేనాయక్ కుమారులు బాబూనాయక్ (52), అతడి తమ్ముడు కృష్ణానాయక్ (45) ద్విచక్రవాహనంలో వ్యక్తిగత పనులపై సిద్ధవరం వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, నత్తి ఓబన్నగారిపల్లె క్రాస్ వద్ద కలిచెర్ల వైపు నుంచి బైక్పై వస్తున్న మరో యువకుడు వేగంగా ఢీకొన్నాడు. ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ తీవ్రంగా గాయపడగా, ప్రమాదానికి కారణమైన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన బాధితులను స్థానికులు 108 అంబులెన్స్లో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. పెద్దమండ్యం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి
రాయచోటి అర్బన్ : రాయచోటి కేంద్రంగా 14 మండలాలను కలుపుకుని రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష కమిటీలో నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాయచోటిలోని ఎన్జీఓ హోంలో సమావేశమైన అఖిలపక్ష కమిటీ ఈ మేరకు తీర్మానించింది. రాయచోటికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. రాయచోటిలో ఇప్పటికే కలెక్టరేట్, ఎస్పీ బంగ్లాతో పాటు సుమారు 70 రకాల జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేశారన్నారు. అలాగే జిల్లా కేంద్రం అలాగే ఉంటుందన్న భరోసాతో అన్ని వర్గాల ప్రజలు గ్రామాలలో ఆస్తులు సైతం అమ్ముకుని రాయచోటి కేంద్రంలో నివాసాలు, ఆస్తులు కొనుగోలు చేశారని తెలిపారు. రాయచోటి నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న వీరబల్లి, సుండుపల్లె, చక్రాయపేట, కేవీపల్లె, కలకడ, గుర్రంకొండ, పెద్దమండ్యం, ఎన్పి కుంట మండలాలతో పాటు రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలను కలిపి రాయచోటి కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ నేతలు తీర్మానించారు. ఈ సమావేశంలో భారత న్యాయవాదుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, ఓపీడీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్, ఎమ్మార్పీఎస్ నాయకుడు రామాంజనేయులు లోక్సత్తా నాయకుడు గిరిబాబు యాదవ్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు కోటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి విశ్వనాఽథ్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఉద్యమ కార్యాచరణ సమావేశం.. ఈ నెల 6వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటలకు పట్టణ ప్రముఖులతో పాటు, అఖిలపక్ష కమిటీ నాయకులు రాయచోటి అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద సమావేశమై, 14 మండలాలతో కలిపి రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే విషయంపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని అఖిలపక్ష కమిటీ నాయకులు ప్రకటించారు. -
ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పని చేయాలి
రైల్వేకోడూరు అర్బన్ : పార్టీలోని ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పనిచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి కమిటీల నిర్మాణంపై పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన పథకాలు, చెప్పని పథకాలు మొదటి ఏడాదిలోనే అమలు చేసి ప్రజలకు సంక్షేమం అంటే ఏమిటో తెలియజేశారన్నారు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను, బాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు పాలన పట్ల పేదలు నిరుత్సాహంగా ఉన్నారని తెలిపారు. పేదలను ఆదుకోవాలంటే జగనన్న ప్రభుత్వం తిరిగి రావాలని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన నుంచి భారీ చేరికలు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నాయకుల సమక్షంలో బొజ్జవారిపల్లి ఉపసర్పంచ్ దాడిశెట్టి సిద్దూరాయల్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన 50 కుటుంబాల వారు గోపాల్, నాగయ్య, మల్లికార్జున, రామాంజనేయులు, రవి, వెంకటేష్, మణి, హేమంత్, ఆది, రామయ్య, శివ, డేరంగుల అప్పయ్య, సుబ్బు, శివయ్య తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి, రాష్ట్ర కో ఆర్డినేటర్లు వజ్రం భాస్కర్రెడ్డి, దేవనాథ్రెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, వత్తలూరు సాయికిషోర్రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, తోట శివసాయి, సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, మారెళ్ల రాజేశ్వరి, భరత్కుమార్రెడ్డి, సిద్దయ్య, నందాబాల, ముస్తాక్, డీవీ రమణ, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మార్ట్ దగ్ధం
గాలివీడు : మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న వనిత మార్ట్ సూపర్ మార్కెట్లో ఆదివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దుకాణంలో ఉన్న లక్షల రూపాయల విలువైన వ్యాపార సామగ్రి పూర్తిగా దగ్ధమై బూడిదగా మారింది. స్థానికుల కథనం మేరకు బలిజపల్లి గ్రామానికి చెందిన తంగాల గంగాధర్ యాజమాన్యంలోని వనిత సూపర్ మార్కెట్ ఆదివారం సెలవు కావడంతో మూతవేసి ఉంది. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఒక్కసారిగా దుకాణం నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన చుట్టుపక్కల దుకాణదారులు మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేసి చివరకు మంటలను అదుపులోకి తెచ్చారు. వెంటనే పోలీసులకు సమాచా రం అందించడంతో గాలివీడు ఎస్ఐ జె. నరసింహారెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ యంత్రం సహాయంతో షట్టర్లు తొలగించారు. అప్పటికే దుకాణం లోపల ఉన్న సరుకులన్నీ పూర్తిగా కాలిపోయాయి. లక్షల రూపాయల నష్టం వాటిల్లిన దృశ్యాన్ని చూసి దుకాణ యజమాని గంగాధర్ బోరున విలపించారు. కుటుంబానికి ఏకై క ఆధారమైన దుకాణం పూర్తిగా దగ్ధమవడంతో తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యామని, ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
మున్సిపల్ అధికారి లైంగిక వేధింపులు?
● పారిశుధ్య మహిళా కార్మికులపట్ల అసభ్య ప్రవర్తన ● మున్సిపల్ చైర్మన్కు ఫిర్యాదు చేసిన మహిళా కార్మికులుపులివెందుల : పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో ఓ అధికారి మహిళా పారిశుధ్య కార్మికులపట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అలాగే పారిశుధ్య విభాగంలో పనిచేసే పలు చిరు ఉద్యోగులపై ఆయన వేధింపులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కార్యాలయంతోపాటు ఇంట్లో కూడా క్లీనింగ్ పనులు చేయాలని ఆ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లో పనులు చేసేందుకు వెళితే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆ అధికారి మాట వినకపోతే సమావేశం నెపంతో అనేకమార్లు తన కార్యాలయానికి రప్పించుకొని దాదాపు పలువురు మహిళా పారిశుధ్య కార్మికులతోపాటు మహిళా సచివాలయ సిబ్బందిని కూడా వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. కనీసం వారిని కూర్చోబెట్టకుండా మీటింగ్ మొత్తం నిలబెట్టేవారని ఆరోపిస్తున్నారు. ఎవరికై నా చెప్పుకుంటే ఉద్యోగాలకు భద్రత, అవమానం, భయంతో ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. చివరకు మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్కు ఆ ఉద్యోగులు మొర పెట్టుకున్నారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
ఒంటిమిట్ట : భార్యాభర్తల గొడవల కారణంగా మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని దిగువ వీధిలో ఎన్.లాస్య ప్రియ(31) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుందని ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు తెలిపారు. ఆదివారం ఒంటిమిట్ట పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 8 ఏళ్ల క్రితం నెల్లూరుకు చెందిన లాస్య ప్రియ ఒంటిమిట్టకు చెందిన అనిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందన్నారు. వివాహం అయిన కొన్ని సంవత్సరాలకు భర్త బతుకుతెరువు కోసం కువైట్కు వెళ్లి, కొన్ని సంవత్సరాల క్రితం ఇంటికి వచ్చాడని తెలిపారు. వీరికి ఆరు సంవత్సరాల కూతురు కూడా ఉందని చెప్పారు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తలైన లాస్యప్రియ, అనిల్ మధ్య గొడవలు జరుగుతుండేవని ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. దీంతో మస్థాపానికి గురై శనివారం రాత్రి 9:45 నుంచి 10 గంటల సమయంలో మృతురాలు తమ ఇంటిపైన ఉన్న మొదటి అంతస్తులోని బెడ్ రూమ్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. విషయం తెలుసుకున్న సీఐ నరసింహరాజు ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని లాస్య ప్రియ మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మండలంలో జరిగింది. కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లెకు చెందిన మాధవ, తిరుపతి రోడ్డులోని టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్నాడు. అతడి కుమారుడు రెడ్డిగణేష్, ఇంటి నుంచి బైక్లో మదనపల్లెకు వస్తుండగా, మార్గమధ్యంలో తట్టివారిపల్లె చెరువుకట్టపై వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓ కారు ఓవర్టేక్ చేస్తుండగా, కారు వెనుకనే రెడ్డిగణేష్ బైక్లో వెళుతున్నాడు. కారు ముందుకు వెళ్లగా, ఆర్టీసీ బస్సు డ్రైవర్ వాహనాన్ని ముందుకు తిప్పాడు. అప్పటికే పక్కనే బైక్పై వెళుతున్న రెడ్డిగణేష్ను బస్సు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు విరగ్గా, గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు, బైక్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు కుట్ర
వాల్మీకిపురం : ఆంధ్రరాష్టాన్ని సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని, తన చేతులతో కరువునేలకు మరణ శాసనం రాశారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వలాభాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం తెలంగాణ సీఎంతో రహస్య ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపేయడం ఎంత దుర్మార్గమో ప్రజలు గమనించాలన్నారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఆపేస్తున్నట్లు తెలంగాణ సీఎం స్వయంగా అసెంబ్లీలో వెల్లడించడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు తన సొంత రాష్ట్రాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టడం, రాష్ట్ర ప్రయోజనాలను తన స్వార్థం కోసం అమ్ముకోవడం దేశ చరిత్రలోనే ఎక్కడా చూసి ఉండమన్నారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి తన చేతిలోకి చంద్రబాబు తీసుకున్నాడన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం చేతకాని తనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను, రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు వ్యూహాత్మకంగా, విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టారన్నారు. శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందన్న అక్కసుతో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలతో కేసులు వేయించి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో చంద్రబాబు నాయుడు హయాంలో ప్రాజెక్టు పూర్తిగా పడకేసిందన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు ద్రోహం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలుగా కొనసాగడానికి ఎలాంటి నైతిక హక్కు లేదని, ప్రజల ప్రయోజనాలను కాపాడలేని మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని తీవ్రంగా స్పందించారు. ఈ సమావేశంలో నాయకులు చింతల ఆనంద రెడ్డి, పులి శివారెడ్డి, బిడ్డల కేశవ రెడ్డి, మహబూబ్బాషా, శ్యామ్, శంకర్ రెడ్డి, సుధాకర, మదనమోహన్రెడ్డి, సురేష్ రెడ్డి, నీళ్ల భాస్కర్, రఘు, చికెన్మస్తాన్, సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎంతో చేతులు కలిపి ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజం -
అన్నమాచార్య రేడియోకు గౌరవప్రదమైన గుర్తింపు
● కేంద్రం రూ.10లక్షల ఆర్థికసాయం ● స్టేషన్డైరక్టర్ను అభినందించిన చాన్స్లర్ గంగిరెడ్డిరాజంపేట : అన్నమాచార్య యూనవర్సిటీలో నిర్వహిస్తున్న అన్నమాచార్య రేడియో 89.6కు గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆదివారం అన్నమాచార్య యూనవర్సిటీ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ సమాజానికి అన్నమాచార్య రేడియో అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. స్టేషన్ డైరక్టర్ డాక్టర్ కాసిగారి ప్రసాద్ సమర్థవంతంగా రేడియో నిర్వహించారన్నారు. ఈ రేడియోకు కేంద్ర సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ పథకం కింద 2025–2026 యేడాదికి రూ.10లక్షలు ఆర్ధికసహాయం అందించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డాక్టర్ సాయిబాబారెడ్డి, ఏఐటీఎస్ వైస్చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తాం
బి.కొత్తకోట : దేశ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం బి.కొత్తకోట మండలం ఠానా మిట్ట వద్ద జరిగిన జిల్లా స్థాయి భూ పోరాట సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల ఎకరాల మిగులు భూములు గ్రామీణ నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు భూ పంపిణీ చేశారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం కావాలంటే విద్య, వైద్యం, ఉద్యోగాలలో వాటా కావాలని అన్నారు, ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూములు తీసుకుంటున్న రైతులకు ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజా ఉద్యమాలను పోలీసులు చేత అణచివేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నడపాలన్నారు. అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పజెప్పడానికే మావోయిస్టులను చంపుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో భూమి లేని పేదలకు భూమి ఇవ్వడం దానం కాదని రాజ్యాంగ బద్ధమైన హక్కు అని అన్నారు. భూ సంస్కరణలను కార్పొరేట్ లాభాల కోసం నాశనం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రామానాయుడు, ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కేశవరెడ్డి, సత్యసాయి జిల్లా కార్యదర్శి కదిరెప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య -
ఎస్పీ కార్యాలయం పరిశీలన
మదనపల్లె రూరల్: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేయనున్న ఎస్పీ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయప్రవీణ్ ఆదివారం పరిశీలించారు. పట్టణంలోని బెంగళూరు రోడ్డులో ఉన్న రేస్ కాలేజీలో జరుగుతున్న పనులను, పెరేడ్ మైదానాన్ని ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి తనిఖీ చేశారు. సత్వరమే పనులు పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేంద్ర, సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లె రూరల్: ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమ వారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని మదనపల్లెతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులు జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలని తెలిపారు. అర్జీదారులు జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదుచేసుకోవచ్చన్నారు. అర్జీల నమోదు, ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్చేసి తెలుసుకోవచ్చన్నారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ వేడుకున్నారు. అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన వారు అమ్మవారికి బంగారు, వెండి, చీరసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు హిందువులతో పాటు ముస్లీంలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించడం గమనార్హం. పెద్దమండ్యం: మండలంలోని కలిచెర్ల ఉన్నత పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం మీనానాగలక్ష్మి ఆదివారం తెలిపారు. పాపేపల్లె గ్రామం గుడిశవారిపల్లెకు చెందిన రెడ్డిబాషా కుమారుడు హసేన్ కలిచెర్ల ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు.గత నెల 4న మదనపలె లో జరిగిన రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ అండర్–16 పోటీలో విజేతగా నిలిచాడు. దీంతో జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు హసేన్ ఎంపికై నట్లు హెచ్ఎం తెలిపారు.విద్యార్థిని హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. మదనపల్లె రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్, ఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబర్ 8977716661 కు కాల్చేసి సమస్యలను సీఎండీకి తెలియజేయవచ్చని తెలిపారు. సర్కిల్ స్థాయిలో డయల్ యువర్ ఎస్ఈ... ఏపీ ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం జరుగుతుందని సీఎండీ తెలిపారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజినీర్ దృష్టికి తీసుకొచ్చేందుకు వినియోగదారులు 94408 17449, కడప..08562 242457 నంబర్లకు కాల్ చేయాలన్నారు. -
చంద్రబాబు కుట్ర
జగన్కు పేరు రావద్దనే రాయలసీమ లిఫ్ట్పై బి.కొత్తకోట: రాయలసీమ రైతుల సంక్షేమానికి ఒక్క పని చేయని చంద్రబాబు వైఎస్.జగన్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలతో సాగునీటి కష్టాలు తీరితే.. తద్వారా జగన్ ప్రతిష్ట పెరుగుతుందన్న అక్కసుతోనే ఆ పథకానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులపైకి నీరు చేరాకే వాడుకోవాలని మహానేత వైఎస్.రాజశేఖర్రెడ్డి ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టేసి ఎడాపెడా నీటిని వాడుకోవడం మొదలు పెట్టిందన్నారు. దీనివల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని గత ప్రభుత్వంలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి గుర్తించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూ.3,600 కోట్లతో చేపట్టారన్నారు. గాలేరు నగరి, తెలుగుగంగ, కేసీ కెనాల్ కు నీటిని అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి నీటిని ఎత్తిపోసేందుకు ఈ పథకం అమలు చేశారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 800 అడుగుల నుంచే శ్రీశైలం నుంచి నీటిని తరలించేలా నిర్ణయించారు. తద్వారా రాయలసీమ రైతులకు ఎనలేని ప్రయోజనం జరుగుతుందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగానే నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులతో కేసులు వేయించి పనులు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. రాయలసీమ ఎత్తిపోతలతో అన్యాయం జరుగుతుందన్న తప్పుడు వాదన చేయించారన్నారు. ఇలా పథకం ప్రారంభం నుంచే అడ్డంకులు సృష్టిస్తూ వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పథకాన్ని పూర్తిగా నిలిపివేయడం, దాని వెనక కుట్ర దాగిందన్న విషయం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డే ప్రపంచానికి చెప్పారన్నారు. ఎత్తిపోతల పనులు రూ.1,600 కోట్లు జరగ్గా, రూ.900 కోట్లు బిల్లులు మంజూరైతే అందులో రూ.779 కోట్లు గత ప్రభుత్వం చెల్లించిందన్నారు. రాయలసీమ రైతాంగానికి మంచి చేయడం చేతకాని చంద్రబాబు..ఈ పథకాన్ని అడ్డుకోవడం ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ఏ ప్రయోజనం ఆశించి పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆయన ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ఏ ప్రాజెక్టు చేపట్టినా చంద్రబాబు భరించలేరన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో శ్రీశైలం నీటిని ఇష్టారీతిన వాడుకున్నా, అక్రమ ప్రాజెక్టులు నిర్మించినా ఏనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించని చంద్రబాబు.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రజల కోసం నిలిపివేయడం న్యాయమా అని నిలదీశారు. రైతాంగ ద్రోహానికి పాల్పడుతున్న చంద్రబాబు చర్యలను రాయలసీమ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 2015లో అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెంచిందన్నారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టారన్నారు. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను హరిస్తూ వచ్చినా చంద్రబాబు నోరుమెదపలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టి ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సమాధి కట్టి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపి ద్రోహం చేసిన చంద్రబాబు, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చేసిన ద్రోహం క్షమించరానిదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.2 వేల కోట్లతో ముదివేడు, ఆవులపల్లె, నేతికుట్లపల్లె సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణం చేపడితే చంద్రబాబు భరించలేకపోయారని అన్నారు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా టీడీపీ కనమరుగువుతుందని కుట్రలు చేశారన్నారు. టీడీపీ నేతలతో అక్రమ కేసులు వేయించి పనులు ఆపి వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరున్నర టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే ఈ ప్రాజెక్టుల వల్ల సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా పనులు చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ రిజర్వాయర్లు పూర్తి అయి ఉంటే కష్ణాజలాలతో కళకళలాడేవని, రైతులకు సాగునీటి కష్టాలు తీరెవని అన్నారు. ఇప్పుడు కష్ణా జలాలు వాడుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి చంద్రబాబే కారణమని, ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ రైతుల నుంచి కేసులు వేయించారు రూ.1,600 కోట్ల పనులుజరిగినా నిలిపివేశారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి -
మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 6, 6.30 గంటలకు ప్రత్యేక బస్సులు మల్లయ్యకొండకు నడుస్తాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయన్నారు. మదనపల్లె సిటీ: సినీరంగంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా. కష్టపడి ఉన్నత స్థాయి ఎదిగాను..ఇదంతా అభిమానుల ఆశీస్సులని ప్రముఖ సినీ నటి రమాప్రభ అన్నారు. ఆదివారం మదనపల్లె మండలం గంగన్నగారిపల్లెలో రమాప్రభ చేతుల మీదుగా సూపర్స్టార్ కృష్ణ, మహేష్బాబు ఫ్యాన్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఆమెకు మెమెంటో అందజేసి సన్మానించారు. సూపర్స్టార్ కృష్ణతో నటించిన సినిమాల గురించి గుర్తు తెచ్చుకున్నారు. కృష్ణతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ప్రముఖ సీనీ హాస్యనటులు రాజబాబు, అల్లురామలింగయ్యతో నటించిన చిత్రాల అనుభూతులు పంచుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం సినిమాల్లో 800 పైగా చేశానన్నారు. ూపర్స్టార్ కృష్ణ అభిమాన సంఘ నాయకులు గోపికృష్ణ, హరికృష్ణ, బహదూర్ఖాన్, ప్రదీప్ పాల్గొన్నారు. -
కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు
రాజంపేట: కార్యకర్తలు వైఎస్సార్సీపీకి మూలస్తంభాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. ఆదివారం రాజంపేట–రాయచోటి రహదారిలోని జీఎంసీ కల్యాణమండపంలో నియోజకవర్గ విస్తృత సంస్థాగత సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కష్టపడే కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదరణ ఉంటుందన్నారు. 2029లో అధికారంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడం తథ్యమన్నారు. అప్పుడు కార్యకర్తల మనోభీష్టం మేరకు పాలన కొనసాగుతుందని, స్వయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారన్నారు. గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణం శరవేగంతో పూర్తి చేసేందుకు నాయకులు సిద్ధమవ్వాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాసీ్త్రయంగా కమిటీల బలోపేతానికి పార్టీ అధిష్టానం సూచించిన నియమ, నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పంచాయతీ కమిటీ కన్వీనర్ , కమిటీల కో–ఆర్టినేటర్ వజ్రభాస్కర్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్థాయినుంచి కమిటీలను బలోపేతం చేసుకుంటూ ముందుకెలుతున్నామన్నారు. కమిటీల నియామకం, ఎంపిక తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డి నియోజకవర్గం ఆదర్శంగా నిలిపేందుకు నియోజకవర్గంలోని క్యాడర్ సమష్టిగా కృషిచేయాలన్నారు. సమావేశంలో రాజంపేట అసెంబ్లీ పరిశీలకుడు దేవనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకటరామిరెడ్డి, రాయలసీమజోనల్ కన్వీనర్ నరసింహ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరీరెడ్డి, పురపాలిక వైఎస్సార్సీపీ కన్వీనర్ కృష్ణారావు, నియోజకవర్గంలో మండలాల కన్వీనర్లు సిద్ధవరం గోపిరెడ్డి, నీలకంఠారెడ్డి,టక్కోల శివారెడ్డి, రామస్వామిరెడ్డి, మణిరాజు, దొడ్డిపల్లె భాస్కర్రాజు, ఎంపీపీలు గాలివీటి రాజేంద్రనాథరెడ్డి, రమణమ్మ, సుండుపల్లె మండల ఉపాధ్యక్షురాలు రెడ్డమ్మ, బీసీనేత వడ్డెరమణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండుగోపి, మహిళనేత రక్కాసి శ్రీవాణి,జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి కమిటీల బలోపేతానికి కృషి కష్టపడిన వారికి పెద్దపీట జగనన్న ధ్యేయం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడుఆకేపాటి అమరనాథరెడ్డి -
19 నుంచి కడప రాయుడి బ్రహ్మోత్సవాలు
కడప సెవెన్రోడ్స్: తిరుమల తొలిగడప దేవునికడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 24వ తేది ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం ఉంటుందని వివరించారు. గృహస్తులు రూ. 300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చన్నారు. జనవరి 28న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగుతుందని వివరించారు. వాహన సేవలలో భాగంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం 9.00 నుంచి 10.00 గంటల వరకు, రాత్రి 8.00 నుంచి9.00 గంటల వరకు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారన్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 24న దేవదేవుని కల్యాణోత్సవం 25న రథోత్సవం -
హైస్కూల్ గేట్లకు కరెంటు సరఫరా
● విద్యార్థికి స్వల్ప షాక్..తప్పిన ప్రమాదం ● ఉలిక్కి పడిన విద్యార్థులు..తల్లిదండ్రులు కురబలకోట : మండలంలోని ముదివేడు జెడ్పీ హైస్కూల్ గేట్లకు గుర్తు తెలియని వ్యక్తులు కరెంటు వైర్లు అమర్చి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం ఉదయం ముందుగా వచ్చిన రెడ్డిశేఖర్ అనే విద్యార్థి హైస్కూల్ గేటు తెరవబోయాడు. ఒక్కసారిగా జిల్లుమని షాక్ కొట్టినట్లుగా అన్పించింది. నిశితంగా చూడగా మెయిన్ గేటుకు, పక్కనున్న మరో చిన్న గేటుకు కూడా కరెంటు వైర్లు ఉండటం గమనించాడు. టీచర్లు రాగా వారి దృష్టికి తీసుకెళ్లాడు. వారు పరిశీలించగా హైస్కూల్లో తాగునీటి బోరు వద్ద నున్న ఫీజు క్యారియర్ల నుంచి దగ్గర్లోనే ఉన్న మెయిన్ గేటుకు పక్కనే ఉన్న మరో చిన్న గేటుకు కరెంటు వైర్లు అమర్చినట్లు గుర్తించారు. వెంటనే హెడ్మాస్టర్ చంద్రకళ ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి పరిసరాలను పరిశీలించారు. ఎవరు..ఎందుకు కరెంటు సరఫరా పెట్టారో అంతుబట్ట లేదు. విద్యార్థికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. రాత్రి వేళ వాచ్మెన్ ఉంటాడు. ఉదయం వెళ్లిపోతాడు. ఆయన చిన్నగేటు ద్వారా శుక్రవారం ఉదయం బయటకు వెళ్లినట్లు సమాచారం. అప్పట్లో కరెంటు వైర్లు లాగినట్లు లేదు. అతను వెళ్లిన అనంతరమే ఎవరో హైస్కూల్లోకి ప్రవేశించి ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైస్కూల్ సమీపంలోనే ఉన్న వాటర్ ట్యాంక్కు నీళ్లు వదిలే స్టార్టర్ ఫీజు క్యారియర్ల ద్వారా ఈ చర్యకు దిగాడు. మెయిన్ గేటుకు పక్కనున్న చిన్న గేటుకు కూడా కరెంటు వైర్లు అమర్చాడంటే ఎంత పకడ్బందీగా చేశారో అర్థం చేసుకోవచ్చు. ఎవరన్నా ఏ గేటు నుండి వచ్చినా గేటు ముట్టుకుంటే కరెంట్ షాక్కు గురవ్వాలన్న పక్కా ప్లాన్తో ఇలా చేసినట్లు భావిస్తున్నారు. అదృష్ట వశాత్తు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై ముదివేడు పోలీసులు శనివారం కూడా విద్యార్థులను, టీచర్లను విచారించారు. విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సాంకేతిక సహకారంతో ఈ మిస్టరీని ఛేదిస్తామని ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు. ఈ సంఘటనపై డీఈఓకు సమాచారం పంపినట్లు ఎంఈఓ ద్వారకనాథ్ తెలిపారు. -
డీసీసీ ప్రెసిడెంట్గా భాస్కర్
రాయచోటి జగదాంబసెంటర్: అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి గాజుల భాస్కర్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నుంచి నియామక పత్రం అందింది. ఈ సందర్భంగా గాజుల భాస్కర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మరోమారు అన్నమయ్య జిల్లా డీసీసీ ప్రెసిడెంట్గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాహుల్గాంధీని ప్రధానమంత్రిగా చూడటమే తన ధ్యేయమని ఆయన తెలియజేశారు. రాయచోటి: అన్నమయ్య జిల్లాలో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని రాయచోటి, మదనపల్లి, పీలేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న రైతులకు 64,562 పాసుపుస్తకాలను పంపిణీ చేయడానికి సిద్ధం చేసింది. రాయచోటి 21,703, మదనపల్లి 18,770, పీలేరులో 24089 మంజూరయ్యాయి. శుక్రవారం నుంచి ఊరూరా గ్రామ సభలు నిర్వహిస్తూ రాజముద్రతో తయారు చేసిన కొత్తపాసుపుస్తకాలను జనవరి 9వ తేదీ వరకు పంపిణీ చేయనున్నారు. నూతనంగా అందజేస్తున్న పాసుపుస్తకాలలో రైతులకు సంబంధించి సర్వే నంబర్లు, వాటి విస్తీర్ణాలలో తప్పులు ఉన్నట్లు రైతులు గగ్గోలు పెడుతున్నారు. జరిగిన తప్పులపై రైతులకు రెవెన్యూ అధికారుల నుంచి సరియైన సమాధానాలు రాకపోవడంతో.. గ్రామ సభల్లోని రైతులు చంద్రబాబు ప్రభుత్వ చర్యలను ఎండగడుతున్నారు. కడప ఎడ్యుకేషన్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈ నెల చివరి వారంలో రాజ్య పురస్కార్ , తృతీయ సోపాన్ (స్కౌట్స్ అండ్ గైడ్స్) క్యాంపులు నిర్వహించనున్నట్లు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా చీఫ్ కమిషనర్ డాక్టర్ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తులను ఈ నెల8వ తేదీ వరకు కడప నగరం శంకరాపురంలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ప్రధాన కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు డీ.ఓ.సి రమణయ్య, రోహిణి, సహాయ కార్యదర్శి ఖాదర్ బాషా, సంయుక్త కార్యదర్శి వెంకట సుబ్బయ్యలను సంప్రదించాలని పేర్కొన్నారు. కమలాపురం: కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్స్ కాలనీకి చెందిన చౌడం సునంద జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో విశేష ప్రతిభ చూపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు మహారాష్ట్రలో జరిగిన 6వ సీనియర్ జాతీయ స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025–26 పోటీల్లో పాల్గొన్న సునంద 35–40 ఏజ్ గ్రూప్లోని సుపైన్ ఆసనాల పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం అందుకున్నారు. పలువురు భారతి పరిశ్రమ ప్రతినిధులు, ఉద్యోగులు సునందను అభినందించారు. రాయచోటి టౌన్: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో నాన్టీచింగ్ ఉద్యోగాలకు తాత్కాలిక ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సర్వశిక్ష ప్రాజెక్టు అధికారి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరితోపాటు పార్ట్ టైం టీచర్లకు కూడా దరఖాస్తులు చేసుకోవా లని కోరారు. మొత్తం పోస్టులు (కేజీబీవీ–36/ఏపీఎంఎస్–33)–69కు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీలోగా ఆన్లైన్ పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీటిలో ఒకేషనల్ ఇన్స్పె క్టర్లు కేజీబీవీ–2, కంప్యూటర్ ఇన్స్పెక్టర్లు కేజీబీవీ–10, ఏఎన్ఎం–7, పార్ట్టైం ఉపాధ్యాయులు ఏపీఎంఎస్–11, అటెండర్లు కేజీబీవీ–2, హెడ్కుక్ కేజీబీవీ–2, ఏపీఎంఎస్ 5, అసిస్టెంట్ కుక్ కేజీబీవీ–8, ఏపీఎంఎస్–9, నైట్వాచ్మెన్–1, స్కావెంజర్ కేజీబీవీ–3, స్వీపర్ కేజీబీవీ–1, చాకీబారు ఏపీఎంఎస్ –4, వార్డెన్ ఏపీఎంఎస్–4 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వీరిలో వార్డెన్ పోస్టులకు బ్యాచ్లర్లు అయిండి డిగ్రీ/ పీజీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పార్ట్టైం ఉపాధ్యాయులకు బీఎస్సీ (మ్యాథ్మ్యాటిక్స్, బీఎడ్, ఎంఏ (ఎడ్యుకేషన్) కంప్యూటర్ కోర్సుకు డిగ్రీ పూర్తి (బీకాం/బీఎస్సీ కంప్యూటర్స్ )అర్హులన్నారు. వీటన్నింటికి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని వివరించారు. -
పీకేఎం ఉడా.. ఖాళీలే నిండా!
మదనపల్లె: మదనపల్లె కేంద్రంగా ఏర్పాటైన పలమనేరు, కుప్పం, పుంగనూరు పట్టణాభివృద్ధి సంస్థకు ఉద్యోగుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. పుష్కలంగా నిధులతో కళకళలాడాల్సిన ఈ సంస్థకు ఆశించిన మేర ఆదాయం లేకుండా పోతోంది. దీనికి సిబ్బంది కొరత కారణమైనప్పటికీ.. ప్రభు త్వం పట్టించుకోకపోవడంతో ఈ సంస్థ ఇంకా ప్రజల్లోకే వెళ్లలేకపోతోంది. అసలు ఈ సంస్థకు ఉన్న అధికారాన్ని కూడా వినియోగించుకోలేని స్థితిలో ఉంది. ఈ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నాలుగు మున్సిపాలిటీలు, మండలాలు ఉన్నాయి. ఆదాయం లేదు సిబ్బంది, విధులను నిర్వహించాల్సిన ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్న కారణంగా.. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతోందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. లేఔట్ల అనుమతులు, ఇళ్ల నిర్మాణాల ప్లాన్లను అనుమతులు, ఇలా పలు వాటి నుంచి ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం బీపీఎస్, బీఆర్ఎస్లను అమలు చేస్తున్నారు. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారా సంస్థ ఆదాయం సమకూరుతుంది. అయితే నిబంధనల ప్రకారం నిర్మించే ఇళ్లకు అనుమతులను ఇక్కడి నుంచి పొందాలి. అయితే తనిఖీలు లేని కారణంగా మండలాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలియడం లేదు. దీంతో సంస్థకు ఆదాయం లేకుండా పోయింది. ఈ మధ్య సంస్థకు వచ్చిన ఆదాయంలో రూ.3 కోట్ల నిధులను మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు మంజూరు చేశారు. 23 పోస్టులు ఖాళీలు మొత్తం 28 మంది ఉండాల్సిన పీకేఎం ఉడా కార్యాలయంలో 23 మంది ఉద్యోగులు లేరు. ప్రభుత్వం వీటిని భర్తీ చేయకపోవడంతో ఔట్సోర్సింగ్పై ఒక అటెండర్ను నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా సంస్థకు ఆదాయ వనరులను తెచ్చిపెట్టే కీలకమైన ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాలనాపరంగా ఉండాల్సిన పోస్టుల్లో కార్యదర్శి పోస్టు మాత్రమే భర్తీ అయ్యింది. మిగిలిన పోస్టులన్నీ ఖాళీయే. అయితే ఐదురుగు డెప్యూటేషన్పై ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఖాళీగా పోస్టుల్లో పరిపాలనాధికారి, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎల్డి.స్టేనోగ్రాఫర్, క్లర్క్ కమ్ టైపిస్ట్, అటెండర్లు, చైన్మెన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, ప్లానింగ్ ఆఫీసర్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్మెన్, అసిస్టెంట్ డ్రాఫ్ట్స్మెన్, సర్వేయర్ కమ్ డ్రాఫ్ట్స్మెన్, తహసీల్దార్, సర్వేయర్, హార్టికల్చరిస్ట్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఫీల్డ్మెన్, గార్డెన్ మేసీ్త్ర, గార్డెనర్స్, ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయలేదు. ఖాళీ పోస్టుల్లో ఐదుగురు డెప్యూటేషన్పై సంస్థలో పని చేస్తున్నారు. ఒక అటెండర్, ఒక డీఈఈ, ఒక ప్లానింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, ఒక డ్రాఫ్ట్స్మెన్ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణాభివృద్ధి సంస్థలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం పోస్టులను భర్తీ చేసి సంస్థ కార్యకలాపాల విస్తరణకు, ఆదాయం సమకూర్చునేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. 28 పోస్టులకు 23 ఖాళీ ఆ ఐదు పోస్టుల్లోనూడెప్యూటేషన్ ఉద్యోగులే ఐదు నియోజకవర్గాల పరిధి.. సాగని పాలన -
మదనపల్లెకు అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం
మదనపల్లె రూరల్ : ప్రజల ఆకాంక్ష ప్రకారం అన్నమయ్య జిల్లాను మదనపల్లె జిల్లాగా ప్రకటించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్కుమార్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లె జిల్లా ప్రకటించాలని కోరుతూ బీఎస్పీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...సీఎం చంద్రబాబునాయుడు, ఇటు మదనపల్లెకు, అటు రాజంపేటకు అన్యాయం చేశారని, ఎన్నికల సందర్భంగా చేసిన హామీని తుంగలో తొక్కారని విమరిర్శంచారు. మదనపల్లె ప్రజలకు మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, కేవలం జిల్లా కేంద్రంగా చేశారన్నారు. రేపు ప్రభుత్వం మారితే, మదనపల్లె జిల్లా కేంద్రం వేరొకచోటకు తరలించే ప్రమాదం ఉందన్నారు. మదనపల్లెకు ఒక ప్రత్యేక చరిత్ర ఉందని, ప్రజలంతా మదనపల్లె జిల్లా కావాలని కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బాలాజీ, శ్రీనాథ్, ప్రశాంత్, మహేష్, లక్ష్మీపతి, అనిల్, సంధ్య, కన్న, శశి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మురళీ, పట్టణ కార్యదర్శి మాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
పొరపాటున వచ్చిన మందు
● ప్రైవేటు మెడికల్ షాపులో ప్రభుత్వ మందు దొరకడంపై విచారణ ● డ్రగ్స్ విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ ఆశాషేక్ మదనపల్లె రూరల్: మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వినియోగిస్తున్న మెట్రెండోజెల్ పొరపాటుగా ప్రైవేట్ మెడికల్ స్టోర్లో లభించిందని డ్రగ్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఆశా షేక్, ఏపీ ఎంఎస్ఐ డీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లక్ష్మీపతిరెడ్డి తెలిపారు. డిసెంబర్ 31న మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి సరఫరా అయిన మెట్రెండోజెల్ ఐవీ మందు ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ప్రైవేట్ మెడికల్ స్టోర్లో ఉన్నట్లు అత్యవసర విభాగ వైద్యులు గుర్తించి, మీడియా సమక్షంలో ప్రైవేట్ మెడికల్ సిబ్బందిని ప్రశ్నించారు. ఇదే విషయమై పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా విచారణ చేశారు. పూర్తి స్థాయిలో ప్రైవేట్ మెడికల్ స్టోర్లోను, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోనూ ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించారు. రోగి బంధువు ద్వారా వెళ్లినట్లు వెల్లడి మందు ప్రైవేట్ మెడికల్ స్టోర్లో ఇచ్చిన వ్యక్తిని గుర్తించి ఆసుపత్రికి పిలిపించారు. అతని వద్ద నుంచి జరిగిన విషయమై స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. పట్టణంలోని రామారావు కాలనీ సోనీ వీధికి చెందిన రామకృష్ణ తన భార్యకు జ్వరంగా ఉండటంతో డిసెంబర్ 31న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వచ్చాడన్నారు. డాక్టర్లు పేషెంట్కు రెండు పారాసెటమాల్ ఐవీ ఇంజెక్షన్లు, మూడు మెట్రెండోజోల్ 3 ఇంజెక్షన్లు చికిత్సలో భాగంగా సూచించారన్నారు. చికిత్సలో రెండు పారాసెటమాల్ ఇంజెక్షన్లు, రెండు మెట్రో సెల్ ఇంజెక్షన్లు వినియోగించారన్నారు. అయితే మిగిలిన ఒక మెట్రో సెల్ ఐవీ ఇంజెక్షన్ను బాధితురాలి అత్త పారాసెటమాల్ బాక్సులో ఉంచి పక్కన పెట్టింది. కుమారుడు రాగానే మందు మిగిలిందని చెప్పడంతో, రామకృష్ణ నేరుగా తీసుకువెళ్లి ప్రైవేట్ మెడికల్ స్టోర్లో వెనక్కి ఇచ్చి, డబ్బు వాపస్ తీసుకుని వెళ్లిపోయాడన్నారు. మెడికల్ స్టోర్ సిబ్బంది లోపల ఉన్న మందు గమనించకుండా అలాగే ఉంచుకున్నారన్నారన్నారు. ఈ ఘటన పొరపాటుగా జరిగింది తప్ప, ప్రభుత్వ ఆసుపత్రి మందులు బయటికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అలా ఎక్కడైనా దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి సూపరింటెండెంట్ మన్సూర్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి సరఫరా కాలేదని చెప్పిన డీసీహెచ్ఎస్ మదనపల్లి ప్రభుత్వాసుపత్రి మందులు ప్రైవేట్ మెడికల్ స్టోర్లో లభ్యం కావడంపై విచారణ చేసిన డీసీహెచ్ఎస్ లక్ష్మీప్రసాద్రెడ్డి, మెడికల్ స్టోర్లో దొరికిన మందు కుచ్ సంబంధించిన బ్యాచ్ నంబర్ మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి సరఫరా కాలేదంటూ, ఐ అండ్ పీఆర్ శాఖ ద్వారా శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేరుతో పత్రిక ప్రకటన ఇప్పించారు. విచారణలో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో వాడుతున్న మందుల బ్యాచ్ నంబర్ గమనించారే కానీ, అంతకుముందు ఆసుపత్రికి సరఫరా అయిన బ్యాచ్ నంబర్లు గుర్తించకపోవడంతో, ఇదే విషయమే విచారణ చేసిన డ్రగ్స్ విభాగం అధికారులు బ్యాచ్ నంబర్ ద్వారా, మెట్రెండోజోల్ ఐవీ మందు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి సరఫరా అయిందని నిర్ధారించారు. రోగులు పొరపాటుగా తీసుకెళ్లి ఇవ్వడంతో ప్రైవేట్ మెడికల్ స్టోర్లో ప్రత్యక్షమైనట్లు విచారణ ద్వారా నిరూపించారు. అయితే డీసీహెచ్ఎస్ సరైన విచారణ చేయకుండా హడావిడిగా పత్రిక ప్రకటన ఇప్పించి, సదరు మందు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి సరఫరా కాలేదని నిరూపించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యపు విచారణతో ప్రజలకు నష్టమే తప్ప ఒరిగేదేమీ ఉండదంటూ పలువురు చర్చించుకుంటున్నారు. -
పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
మదనపల్లె సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం అన్నారు. శనివారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదో తరగతికి వంద రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయాలన్నారు. దీంతోపాటు 1వ తరగతి నుంచి 5 వతరగతి విద్యార్థుల కోసం 75 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనురాధ, డీవైఈఓ లోకేశ్వరరెడ్డి, ఎంఈఓలు ప్రభాకర్రెడ్డి, రాజగోపాల్, పద్మావతి పాల్గొన్నారు. ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయిఫూలే అని డీఈఓ సుబ్రమణ్యం, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనురాధ అన్నారు. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని శనివారం డీఈఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు కరుణాకర్, డీవైఈఓ లోకేశ్వరరెడ్డి, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు ఆటవిక పాలనకు నిదర్శనం
రాయచోటి అర్బన్ : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్న వారిపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు నియోజకవర్గంలో ఆటవిక రాజ్యాన్ని తలపిస్తున్నాయని ఆయన శనివారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మట్కా, గంజాయి బ్యాచ్లు, ముసుగు దొంగలు బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజలపై దాడులకు పాల్పడటం అత్యంత సిగ్గుచేటు చర్య అన్నారు. రామాపురం మండలం చిట్లూరు గ్రామం చెరువుముందరపల్లెకు చెందిన రామచంద్రారెడ్డిపై కర్కశంగా, నిర్దాక్షిణ్యంగా దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం తరలిపోయిందని బాధతో సామాజిక మాధ్యమాలలో పోస్టు పెట్టిన వారిపై హత్యాయత్నాలు చేయడం ఎందుకు ? సాధారణ కార్యకర్తలపై దాడులు చేయడం ఏ రకమైన రాజకీయమని ప్రశ్నించారు. నా పైన దాడి చేస్తారో, హత్య చేస్తారో రండి, అంతే కానీ మా కార్యకర్తలపై, ప్రజా సంఘాలపై దాడులు చేయడం పిరికిపంద చర్య అన్నారు. ఇలాంటి చిల్లర దాడులు ప్రజాస్వామ్యంలో సహించబోము అని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పెరగడానికి పోలీసు వ్యవస్థ గట్టిగా వ్యవహరించకపోవడమే ప్రధాన కారణం అని ఆరోపించారు. అధికార పార్టీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత పరిస్థితిలో ప్రజలకు తోడుగా నిలవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా, మీడియాను బెదిరిస్తూ దాడులకు పాల్పడిన వారి మనుగడే లేకుండా పోయిందన్నారు. సంబేపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డి సహా పార్టీ అనుచరులను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించడం అనుచితమని అన్నారు. అక్రమాలు , అన్యాయాలు , బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులకు వెంటనే ఫుల్స్టాప్ పెట్టకపోతే దానికి పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. రామచంద్రారెడ్డికి మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్రెడ్డి పరామర్శ రామాపురం : టీడీపీ వర్గీయుల చేతిలో తీవ్రంగా గాయపడిన మండలంలోని చిట్లూరు గ్రామ పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మార్పురి ఆదిరెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డిని మాజీ ఎమ్మేల్యే గడికోట మోహన్ రెడ్డి పరామర్శించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరపున పూర్తి స్థాయిలో తోడుగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో సూరం వెంకటసుబ్బారెడ్డి, నెర్సుపల్లి నాగేంద్రరెడ్డి, దువ్వూరి ఆంజనేయులు, శ్రీధర్ రెడ్డి, గాలివీటి ప్రవీణ్రెడ్డి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
చికెన్వేస్ట్ టెండర్ కోసం టీడీపీలో కుమ్ములాట !
● వాయిదాపడిన టెండర్ల ఓపెనింగ్ ● పురపాలికలో టీడీపీ వర్గనేతల హడావుడి రాజంపేట : రాజంపేట పురపాలక సంఘంలో చికెన్వేస్ట్ టెండర్ను దక్కించుకునేందుకు అధికారపార్టీ టీడీపీలో కుమ్ములాట మొదలైంది. శనివారం టెండర్ల బాక్స్ కనపడలేదని టీడీపీలో మరో వర్గం వారు హడావుడి చేశారు. చికెన్వేస్ట్ టెండర్ను ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు అధికారపార్టీలో మరో వర్గం ప్రయత్నిస్తుందనే అనుమానం ఆ పార్టీకి చెందిన మరోవర్గం నేతలకు కలిగింది. ఈ టెండర్ బాక్స్ను శనివారం మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత తెరవాల్సి ఉంది, దానికోసం టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. అయితే కమిషనర్ లక్ష్మీనారాయణ అందుబాటులో లేకపోవడంతో వీరిలో అనుమానాలు బలపడ్డాయి. అయితే కమిషనర్ పురపాలిక కార్యకలాపాలకు సంబంధించి జిల్లా కలెక్టరేట్కు వెళ్లినట్లుగా సిబ్బంది వివరించారు. దీంతో టెండర్ బాక్స్ ఓపెన్ చేయకుండా సోమవారానికి వాయిదా వేశారు. ఇప్పటికే ఒకసారి ఈ టెండర్ వాయిదా పడింది. ఇందుకు కారణం అధికారపార్టీకి చెందిన ఒకరికే చికెన్వేస్ట్ టెండర్ను ఇప్పించేందుకు ఆ పార్టీ నియోజకవర్గనేత పావులు కదుపుతున్నారు. నామినేట్ కింద తన వర్గానికి చెందిన ఒకరికే చికెన్ వేస్ట్ టెండర్ను ఇప్పించాలని చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. కమిషనర్పై అధికారపార్టీ నుంచి ఈ టెండర్ విషయంలో ఒత్తిడి వున్నట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. కాగా చికెన్వేస్ట్కు నెల్లూరులో పెద్దగా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించి టెండర్ దక్కించుకుంటే లక్షల్లో లాభమొస్తుందని భావించి, పోటీపడుతున్నారు. పట్టణంలో చికెన్ దుకాణాల వద్ద పారేసిన వేస్ట్ను సేకరించి, ట్రాక్టర్ ద్వారా నెల్లూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. గతంలో కూడా చాలా తక్కువ చికెన్వేస్ట్ తీసుకొని వ్యాపారం చేసి లాభాలు ఆర్జించిన క్రమంలో ఇప్పుడు టీడీపీ నాయకులు దృష్టి సారించారు. దీంతో ఈ టెండర్ను దక్కించుకునేందుకు టీడీపీలోనే రెండు వర్గాలు పోటీపడుతున్నాయి. అయితే వైఎస్సార్సీపీకి చెందిన వారు కూడా చికెన్ వేస్ట్ టెండర్లకు దరఖాస్తులు దాఖాలు చేశారు. ఏది ఏమైనప్పటికి చికెన్ వేస్ట్ కోసం టీడీపీలో రెండు వర్గాల కుమ్మలాటలు చూసి జనం విస్తుపోతున్నారు. -
గండికోట ఉత్సవాలకు సన్నద్ధం కావాలి
జమ్మలమడుగు: ప్రముఖ పర్యాటక, చారిత్రాత్మక గండికోట ఉత్సవాల నిర్వహణకు అధికారులందరూ సన్నద్ధం కావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ఈనెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం గండికోటలో ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఉత్సవాల కార్యక్రమాలు, ఉత్సవ వేదికప్రాంగణం, పార్కింగ్ తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోట ఉత్సవాలు దేశం నలుమూలల చాటేవిధంగా వైభవోపేతంగా నిర్వహించాలన్నారు. జిల్లా చరిత్రను ప్రపంచానికి తెలియజేసేవిధంగా ఉత్సవాలు ఉండబోతున్నాయని వివరించారు. ఉత్సవాల కోసం జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. గండికోట ప్రాంతంలో సాస్కి పథకం కింద 79 కోట్లతో అభివృద్ధి చేసి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేవిధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని పేర్కొన్నారు. పర్యాటకులకు సంతృప్తి కరమైన అనుభూతిని అందించేందుకు పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టూరిస్టులకు ఎక్స్పీరియన్స్ సెంటర్, 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అమినీటిస్ , సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. గండికోట రహదారికి ఇరువైపుల పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం చేపట్టేవిధంగా పనులు చేస్తున్నామని సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ జల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి, టూరిజం జిల్లా అధికారి సురేష్కుమార్, ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్శ్రీనివాసుల రెడ్డి డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ శ్రీధర్చెరకూరి -
● తగ్గనున్న ప్రాముఖ్యత
రాజంపేట: అంతర్జాతీయంగా ఖ్యాతిని ఆర్జించిన రాయలసీమలోనే ఎర్రచందనం సంపద నిలయమైన రాజంపేట ఫారెస్టు కోటకు బీటలు వారాయి. ఆరు దశాబ్దాల రాజంపేట అటవీ డివిజన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నది. రాయలసీమలో ఎర్రచందనం డివిజన్గా ప్రసిద్ధి చెందిన డివిజన్కు ఇప్పుడు తిరుపతి, అన్నమయ్య జిల్లాల ప్రభావం పడింది. ఫలితంగా డివిజన్ వ్యాప్తంగా విస్తరించిన శేషాచలం అటవీ విస్తీర్ణంలో రాజంపేట తన వాటా పూర్తిగా తగ్గిపోయిందని అటవీ వర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. రాజంపేట అటవీ డివిజన్ విస్తీర్ణం పంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుపతి, అన్నమయ్యకు పోగా మిగిలిన అటవీ విస్తీర్ణం కలిగిన రాజంపేట డివిజన్ వైఎస్సార్ కడపలోకి విలీనం కానున్నది. చరిత్ర కలిగిన రాజంపేట అటవీ డివిజన్ నిర్వహణ, హద్దుల వ్యవహారంపై అటవీశాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. కడప డివిజన్లోకి విలీనమేనా? రాజంపేట కేంద్రంగా అన్నమయ్య అటవీ పాలన కొనసాగిన సంగతి విదితమే. ఇప్పుడు డివిజన్పై కొత్తగా ఏర్పడిన మదనపల్లె జిల్లా ప్రభావం పడింది. ఇటు తిరుపతి జిల్లా ప్రభావాన్ని ఎదుర్కొంది. ఫలితంగా అటవీ విస్తీర్ణంతోపాటు జిల్లా అటవీ శాఖ కార్యాలయం కూడా మదనపల్లెకు తరలింపునకు అటవీ శాఖ సమాయత్తం కావాల్సి వస్తోంది. ఇప్పుడు రాజంపేట వైఎస్సార్ కడప జిల్లాలోకి విలీనం అయిన క్రమంలో కడప జిల్లా అటవీ శాఖ పరిధిలోకి వెళుతుంది. ఇక్కడ ఉన్న అన్నమయ్య జిల్లా అటవీ కేంద్ర కార్యాలయం బదిలీ కాక తప్పదు. సబ్ డీఎఫ్ఓ పాలనలోకి రాజంపేట ఐఎఫ్ఎస్ పాలన జరిగిన రాజంపేట ఇప్పుడు సబ్డీఎఫ్ఓ కంట్రోల్కి చేరనున్నది. ఒకప్పుడు రైల్వేకోడూరుకు సబ్డీఎఫ్ఓ హోదా అధికారి ఉండేవారు. రాజంపేటకు ఐఎఫ్ఎస్ అధికారి పాలన కొనసాగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు కడప అటవీశాఖ ఆధీనంలోకి మిగిలిన రాజంపేట అటవీ విస్తీర్ణం చేరనున్నది. రాజంపేట ఎర్రబంగారంకే డిమాండ్ అరుదైన జంతుజాలంకు నెలవు.. కేంద్ర ప్రభుత్వంచే జీవవైవిధ్య అటవీ ప్రాంతం(బయోస్పెయిర్)గా గుర్తింపు పొందిన శేషాచలం.. ఎర్రచందనం చెట్లతో విశిష్ట ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనం ఎక్కువ చేవ ఉండటంతో దానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇందులో రాజంపేట ఎర్రచందనానికి మరి డిమాండ్. అందువల్లనే ఎర్రచందనం డిపో కేంద్రాన్ని గతంలో ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ బర్తరఫ్ సమయంలో జరిగిన ఆందోళనలో భాగంగా ఈ డిపో అగ్నిప్రమాదానికి గురైన సంగతి విదితమే. అన్నమయ్య జిల్లాలో 2.8 మిలయన్ల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. రాజంపేట ఫారెస్టు డివిజన్ పరిధిలో ప్రపంచలో అరుదైన ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. ఇప్పుడు రైల్వేకోడూరు తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోయింది. ఈ పరిధిలో పెనుశిల అభయారణ్యం, శేషాచలం అటవీ ప్రాంతాలు కలిగిన చిట్వేలి, పెనగలూరు, రైల్వేకోడూరు, బాలపల్లె ప్రాంతాలు తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోయాయి. ఇక రాజంపేట పరిధిలో నందలూరు, రాజంపేట, సుండుపల్లె ప్రాంతాల్లోని అటవీ ప్రాంతం మిగిలిపోయింది. దీంతో అటవీ డివిజన్ ప్రాముఖ్యత తగ్గిపోయినట్లే అటవీ వర్గాలు తెలిపాయి. ఆరు దశాబ్దాల డివిజన్ ప్రశ్నార్థకం శేషాచలంలో తగ్గిన విస్తీర్ణం మదనపల్లె దిశగా అన్నమయ్య డీఎఫ్ఓ -
వరలక్ష్మికి సౌత్ ఇండియా బెస్ట్ ఉమెన్ టీచర్ అవార్డు
కడప ఎడ్యుకేషన్: మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం జిల్లాకు చెందిన మహిళా ఉపాధ్యాయురాలు వరలక్ష్మిని సౌత్ ఇండియా బెస్ట్ ఉమెన్ టీచర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి బోధనలో ఉత్తమ ప్రతిభ, సృజనాత్మకత, వృత్తి పట్ల అంకిత భావం చూపిన 5 మంది ఉపాధ్యాయినిలను ఈ అవార్డుకు ఎంపిక చేయగా ఇందులో కడప జిల్లా పులివెందుల గవర్నమెంట్ మోడల్ ప్రైమరీ స్కూల్(రమణప్ప సత్రం)లో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పీఎస్హెచ్ఎం, ఫోరమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వద్ది. వరలక్ష్మి అవార్డును అందుకున్నారు. ఇందుకు ఏపీపీఎస్ హెచ్ఎం ఫోరం తరపున ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ అభినందనలు తెలిపారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూ అక్రమణ నిజమే
మదనపల్లె: మదనపల్లి పట్టణంలో రూ.కోట్ల విలువ చేసే భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని నిర్ధారణ అయ్యింది. గత డిసెంబర్ 5న ఉప లోకయుక్త రజని ఇచ్చిన ఆదేశాల్లో ఈ విషయం స్పష్టమైంది. దీనిపై జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక, గత రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఈ కబ్జా వ్యవహారానికి అందించిన సహకారాన్ని గుర్తించారు. వారి పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో ఉప లోకయుక్త సూచించారు. పట్టణంలోని బికేపల్లి గ్రామంలో సర్వే నంబర్ 8/1లో 2.92 ఎకరాల చెరువు భూమి ఉంది. గతంలో 142 మంది మాజీ సైనికులకు చింతచెట్ల ఫల సాయం అనుభవించేందుకు 2సీ పట్టాలను రెవెన్యూ అధికారులు జారీ చేశారు. ఈ భూమి మాజీ సైనికుడు ఇంద్రసేన రాజుకు సంబంధించినదిగా మాజీ సైనికుని పేరిట నకిలీ పట్టాను సృష్టించారు. తర్వాత ఇంద్రసేన రాజు నుంచి టీడపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, ఆయన భార్య పేరిట రెండు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. దీనిపై మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు లోకయుక్తను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన లోకాయుక్త నివేదికలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. దీనిపై జరిగిన విచారణలో వాస్తవాలను కలెక్టర్ నివేదించారు. అందులో ఈ భూమి చెరువు పోరంబోకుగా ఉందని నిర్ధారించారు. కాబట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు ఎవరికి కేటాయించరాదు. అయితే అప్పటికే మాజీ సైనికుని పేరిట నకిలీ పట్టాను సృష్టించారు. ఆ తర్వాత కథ నడిపారు. ఈ నకిలీ పట్టా సృష్టికి, దొమ్మలపాటి రమేష్ పేరిట భూమి రిజిస్ట్రేషన్కు అధికారులు సహకరించినట్టు, తప్పుడు రికార్డులు సృష్టించినట్టు నిర్ధారించారు. అందులో గత తహసీల్దార్ శివరాంరెడ్డి సెలవు రోజైన ఆదివారం నాడు రికార్డుల్లో తప్పుడు పట్టా వివరాలను సృష్టించి నమోదు చేసినట్టు గుర్తించారు. ఇతనితోపాటు రెవెన్యూ పరంగా ఈ నకిలీ వ్యవహారానికి సహకరించిన అప్పటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్రెడ్డి, వీఆర్వో ప్రదీప్ కుమార్, ఆక్రమించిన భూమిలో జరిగిన నిర్మాణాలకు బాధ్యులను చేస్తూ అప్పటి మున్సిపాలిటీ కమిషనర్ రవి, పట్టణ ప్రణాళిక అధికారి హయత్, డాక్యుమెంట్ రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్టర్లు సహకరించారని, వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని సూచించింది. శివరామిరెడ్డి పదవీ విరమణ చేసినప్పటికీ రెవెన్యూ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని తీర్పులో సూచన చేశారు. రూ.కోట్ల విలువ చేసే ఈ భూమి వ్యవహారంలో జరిగిన విచారణలో రెవెన్యూ ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలించినప్పుడు ఇంద్రసేన రాజు, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క, కుట్ర పూరితంగా వ్యవహారం నడిపినట్టు స్పష్టమైనది. జిల్లా కలెక్టర్ నివేదికలో పేర్కొన్నవి వాస్తవాలే అని స్పష్టం చేసినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నివేదికలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ భూమి వ్యవహారంలో ఇప్పటికే వాస్తవాలు నిర్ధారణ కావడం, క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయడంతో ఈ కేసును ముగిస్తున్నట్టు ఉపలోకయుక్త రజని పేర్కొన్నారు. రూ.కోట్ల విలువైన భూమికి సహకరించిన రెవెన్యూ అధికారులు వాస్తవాలు తేల్చిన జిల్లా కలెక్టర్.. లోకాయుక్తకు నివేదిక క్రిమినల్ చర్యలకు ఆదేశం సహకరించిన అధికారులపై చర్యలు ఉప లోకయుక్త తాజా ఆదేశం -
వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 9:30 గంటల నుంచి సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కల్యాణ వేదిక వద్ద అర్చకులు సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆశీనులు చేసి, నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సతీసమేతుడైన శ్రీ కోదండ రామస్వామికి ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్లు అంగరంగ వైభవంగా పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షిణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్కు సమర్పించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, బంగారు ఆభరణాలు వేసి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం వాల్మీకిపురంలో జరిగింది. గ్రామంలోని ఎంపీడీఓ కార్యాలయం వెనుక వైపున ఉన్న వాల్మీకినగర్లో నివసిస్తున్న సమర కుమారుడు నరసింహులు(37) స్థానికంగా కూలిపనులు చేస్తూ జీవించేవాడు. కుటుంబ సమస్యలతో భార్యతో గొడవపడి మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన కిందకు దించి స్థానిక సీహెచ్సీ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. వాల్మీకిపురం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. రిమ్స్ మార్చురీలో వృద్ధుని మృతదేహం కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చికిత్స పొందేందుకు గుర్తు తెలియని వృద్ధుడు చేరాడు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వృద్ధుని మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు. -
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు
పీలేరు రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం రాత్రి మండలంలోని వేపులబైలు పంచాయతీ జంగంపల్లె వద్ద జరిగింది. ఎస్ఐ లోకేష్ కథనం మేరకు.. మదనపల్లె పట్టణం పోనేటిపాళెంకు చెందిన షేక్ సయ్యద్బాషా (45) తన ఆటోలో పీలేరు నుంచి మదనపల్లెకు బయలుదేరాడు. పీలేరు – మదనపల్లె జాతీయ రహదారి సర్వీసురోడ్డు జంగంపల్లె వద్ద కలికిరి వైపు నుంచి వస్తున్న కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సయ్యద్బాషా రెండు కాళ్లు నుజ్జు నుజ్జు కావడంతోపాటు తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
24 గంటల్లోనే దోపిడీ దొంగల గుర్తింపు
● ఇద్దరు నిందితులు అరెస్టు, రూ.2.18 లక్షలు నగదు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ కృష్ణ మోహన్ గాలివీడు : మండలంలోని నూలివీడు గ్రామంలో రూ.2.18 లక్షల నగదు దోపిడీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. శనివారం గాలివీడు పోలీస్ స్టేషన్లో రాయచోటి డీఎస్పీ కృష్ణ మోహన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. గోపనపల్లె గ్రామానికి చెందిన షేక్ సాహెబ్ పీర్ కుమారుడు షేక్ మొహమ్మద్, షేక్ రహంతుల్లా కుమారుడు షేక్ బాబా ఫక్రుద్దీన్లు వృత్తి రీత్యా డ్రైవింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.అయితే చెడు వ్యసనాలకు అలవాటు పడి, జల్సాల కోసం పలు చోట్ల అప్పులు చేయడంతో వాటిని తీర్చలేక దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 31న నూలివీడు గ్రామానికి చెందిన పందికుంట ఈశ్వరమ్మ బ్యాంకు నుంచి నగదు తీసుకుని వస్తుండగా, బైక్పై వచ్చిన నిందితులు ఆమెను బెదిరించి రూ.2.18 లక్షల నగదు సంచిని లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులను గుర్తించి వారి వద్ద నుంచి రూ.2.18 లక్షలు నగదు, బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనం, ప్లాస్టిక్ పిడి కలిగిన చిన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డిని డీఎస్పీ కృష్ణ మోహన్ అభినందించారు.అనంతరం ప్రజలు తమ దుకాణాలు, నివాసాలు, కార్యాలయాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా నేరాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్, గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి పాల్గొన్నారు.


