Aqua factory
-
'ఆక్వా' బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
-
మొగల్తూరులో ఉద్రిక్తత
మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ఆనంద్ ఆక్వా ప్రాసెసింగ్ పరిశ్రమలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతిచెందడంతో.. ఆగ్రహించిన గ్రామస్థులు పరిశ్రమపై దాడి చేశారు. మృత దేహాలను ఫ్యాక్టరీ ఎదుట ఉంచి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఆగ్రహించిన ఆందోళన కారులు ఫ్యాక్టరీ పై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు. -
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం
-
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం మొగల్తూరు మండలం నల్లావారి చెరువులోని ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువులు వెలువడి ఐదుగురు కార్మికులు మరణించారు. రసాయనిక ట్యాంకును శుభ్రం చేస్తుండగా విషవాయువులు లీక్ అయినట్టు తెలుస్తోంది. మృతులను ఈగ ఏడుకొండలు, జక్కంశెట్టి ప్రవీణ్, నల్లం ఏడుకొండలు, బొడ్డు రాంబాబు, తోట శ్రీనుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. పశ్చిమ గోదావరిలోనే తుందుర్రు వద్ద మెగా ఆక్వా ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేయడాన్ని స్థానిక రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల ప్రజలు నిరసన తెలియజేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుందుర్రు వెళ్లి రైతులకు మద్దతు తెలిపారు. ఇక్కడ భారీగా పోలీసులను మోహరించి తమను వేధిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకే మొగ్గు చూపించింది. ఈ నేపథ్యంలో మొగల్తూరు సమీపంలో ఆక్వా పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. -
రుణమాఫీ పేరుతో దొంగ సంతకాలు!
ఆక్వా ఫ్యాక్టరీ సిబ్బంది ఘనకార్యం కనిపెట్టిన గ్రామస్తులు పారిపోయిన దళారులు గుడిదిబ్బలో ఉద్రిక్తత కృత్తివెన్ను : డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలంటే గ్రామస్తులంతా సంతకాలు చేయాలని చెబుతూ తిరుగుతున్న కొంతమంది దళారుల మోసకారి వ్యవహారం బట్టబయలు కావడంతో వారంతా పరార యిన ఘటన కృత్తివెన్ను పంచాయతీ గుడిదిబ్బలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుడిదిబ్బలో ఆక్వా పరిశ్రమకు సంబంధించిన ఓ ఫ్యాక్టరీని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. అయితే దీని వల్ల గ్రామస్తుల ఆరోగ్యంతో పాటు మత్స్యకారుల జీవన విధానం దెబ్బతింటుందని రెండు నెలల క్రితం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అధికారులు నిలిపివేశారు. అయితే ఎలాగైనా ఆ ఫ్యాక్టరీ పనులు పునఃప్రారంభించాలనే దురుద్దేశంతో కొంతమంది గ్రామస్తులతో కలసి ఫ్యాక్టరీ సిబ్బంది బుధవారం రాత్రి రుణమాఫీ పేరుతో దొంగ సంతకాలు తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ సంతకాల విషయంలో అనుమానం వచ్చిన కొంతమంది గ్రామస్తులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కోపోద్రిక్తులయిన సుమారు 400 మంది గ్రామస్తులు సంతకాలు సేకరిస్తున్న సిబ్బందిపై దాడిచేయడానికి సిద్ధమయ్యారు. ఉద్రిక్త పరిస్థితులు గమనించిన ఫ్యాక్టరీ సిబ్బంది, దళారులు బలమున్నంత వరకు కాలికి బుద్ధిచెప్పారు. అనంతరం గ్రామస్తులంతా ఒకచోట సమావేశమై ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఆత్మహత్యలు చేసుకోవడానికీ వెనుకాడేది లేదని హెచ్చరిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రజల మాన ప్రాణాలతో చెలగాట మాడే ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఎరవేసే ఎంగిలి మెతుకులకు అలవాటుపడిన కొంత మంది స్వార్థపరుల వల్లనే వ్యవస్థ నాశన మవుతుందని ధ్వజమెత్తారు. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎస్ఐ కె. సత్యనారాయణ తన సిబ్బందితో పరిస్థితిని అదుపులోకి తేవడానికి నానా తంటాలు పడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ఫ్యాక్టరీల నిర్మాణానికి సహకరించే దళారులను, ఫ్యాక్టరీ సిబ్బందిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పట్టుబట్టారు. ఫ్యాక్టరీ నిర్మాణంపై మరోసారి ఇలాంటి చర్యలకు పూనుకుంటే ఆమరణ నిరాహారదీక్షలకూ వెనుకాడబోమంటూ హెచ్చరించారు. చివరకు పెద్దల సహకారంతో ఎస్ఐ పరిస్థితిని చక్కదిద్దారు.