ఘనంగా అశ్వర్థం తిరునాళ్లు
పెద్దపప్పూరు (తాడిపత్రి రూరల్) : జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అశ్వర్థం తిరునాళ్లు రెండో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అశ్వర్థ నారాయణస్వామి, చక్రభీమలింగేశ్వరస్వామివార్లను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తుల రద్దీ తగ్గలేదు.