breaking news
Ayesha Zeenath
-
ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్!
Bigg Boss Telugu 9లో అనుకున్నదే జరిగింది. హౌస్ నుంచి ఆయేషా వెళ్లిపోయింది. మరోవైపు తనూజకు ఫెవికిక్లా అతుక్కుపోయింది మాధురి. తనకోసం రమ్యతో సైతం గొడవపడింది. తనూజనే ముఖ్యం అంటూ ఏదో నిజమైన అమ్మలా ఫీలైపోయింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (అక్టోబర్ 24వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..రీతూ కంటెండర్.. తట్టుకోలేకపోయిన మాధురివాంటెడ్ పేట టాస్క్లో సంజనాని పోలీసులకు పట్టించినందుకు తనూజ (Thanuja Puttaswamy) కెప్టెన్సీ కంటెండర్ అయింది. మాస్క్ మాధురి కటౌట్పై కిల్ అని రాసినందుకు రీతూ కూడా కంటెండర్ అయంది. కానీ, దీన్ని జీర్ణించుకోలేక రీతూపై విషం ఏదో ఒకరకంగా కక్కుతూనే ఉంది. డబ్బులు ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్లు నిఖిల్, కల్యాణ్, దివ్య, ఇమ్మాన్యుయేల్ సైతం కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఈ గేమ్లో చివరి వరకు తనూజ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు.స్పృహ తప్పిన తనూజ.. ఏడ్చేసిన కల్యాణ్కెప్టెన్సీ చేజారడంతో తనూజ ఎమోషనల్ అయింది. సడన్గా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను డాక్టర్ రూమ్కు తీసుకెళ్లారు. తనూజను అలా చూసి ఇమ్మూ, కల్యాణ్ (Pawan Kalyan Padala) తెగ ఏడ్చేశారు. కల్యాణ్ అయితే.. తనూజకు ఏదో అయిపోయినట్లు వెక్కెక్కి ఏడ్చాడు. అది చూసిన మాధురి.. హే, నువ్వెందుకు ఏడుస్తున్నావ్? జనాలు చూస్తే నవ్వుతారు. తను వీక్నెస్తో కళ్లు తిరిగి పడిపోతే నీకెందుకు ఏడుపొస్తుంది.. ఛీఛీ అని చీవాట్లు పెట్టింది.సేవ్ అయితే ఒకటి చెప్తా!అర్ధరాత్రి తనూజ.. ఎందుకు ఏడ్చావ్? అని కల్యాణ్ను అడిగింది. అందుకతడు ఓడిపోయినందుకు ఏడ్చానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది ఉట్టి అబద్ధం అని తెలిసిన తనూజ.. నిజం చెప్పు, ఎందుకు ఏడ్చావ్? అని మరోసారి నిలదీసింది. దీంతో అతడు అది నేను చెప్పలేను.. సర్లే బజ్జో.. నేను సేవ్ అయితే నీకొకటి చెప్తా అంటూ నిద్రపోతున్న తనూజతో అన్నాడు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషాను మెడికల్ రూమ్కు పిలిచారు. టైఫాయిడ్తో పాటు, డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకో ఛాన్స్ఇక బిగ్బాస్.. మీ అనారోగ్యం దృష్ట్యా చికిత్స అవసరం. అలాగే ఇతర హౌస్మేట్స్ ఆరోగ్య భద్రత కూడా అవసరమే! అందుకే మిమ్మల్ని హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నా అన్నాడు. అప్పుడు ఆయేషా.. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ బిగ్బాస్.. ఫ్యూచర్లో ఇంకో ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో వెళ్తున్నా.. అంటూ వీడ్కోలు చెప్పింది. ఇక వెళ్లేముందు తనూజతో.. జాగ్రత్త.. మళ్లీ ఫేక్దాంట్లో పడొద్దు. ఇదొక్కటే చెప్తున్నా అంటూ పిచ్చి లవ్ట్రాకులు వద్దని హెచ్చరించి వెళ్లిపోయింది.చదవండి: కమల్-రజనీ మూవీ.. సౌందర్య, శృతి హాసన్ ఏమన్నారంటే? -
బిగ్బాస్ 9: సడన్గా రౌడీ బేబి ఎలిమినేట్! ఎందుకంటే?
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో ఇప్పటివరకు ఏడుగురు వెళ్లిపోయారు. ఒకరు మళ్లీ తిరిగొచ్చారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, హరిత హరీశ్, శ్రీజ, భరణి వరుసగా వెళ్లిపోయారు. మధ్యలో సంజనాను మిడ్వీక్లో హౌస్మేట్స్ ఎలిమినేట్ చేశారు. కానీ, బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఆమెను సీక్రెట్ రూమ్కు పంపించాడు. వీకెండ్లో సంజనా వెళ్లిపోతుందని సంబరపడ్డారా? ఛాన్సే లేదంటూ మళ్లీ హౌస్లోకి పంపించారు.నామినేషన్స్లో 8 మందిఇక ఏడోవారం నామినేషన్స్లో ఎనిమిది మందున్నారు. వారే.. తనూజ, పవన్ కల్యాణ్, రీతూ చౌదరి, సంజన గల్రాని, రాము రాథోడ్, దివ్య, రమ్య, శ్రీనివాస్ సాయి. వీరిలో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన రమ్య, శ్రీనివాస్, రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్లోనే లేని వ్యక్తి ఒకరు ఎలిమినేట్ కావొచ్చు. ఆ కంటెస్టెంటే ఆయేషా. తను హైపర్ యాక్టివ్. ఫుల్ జోష్తో హౌస్లో అడుగుపెట్టింది. ఆరోగ్య సమస్యలుఅరుపులు, కేకలతో హౌస్ దద్దరిల్లేలా చేసింది. చీటికిమాటికి గొడవలు పడుతూ జనాలకు మాత్రం చిరాకు తెప్పించింది. వచ్చిన వారంలో ఉన్నంత జోష్ తర్వాతి వారంలో లేదు. కారణం.. ఆయేషా (Ayesha Zeenath)కు ఆరోగ్య సమస్యలున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎపిసోడ్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే డాక్టర్ రూమ్కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. వైద్యులు ఓకే అంటేనే హౌస్లో కొనసాగుతుంది. లేదంటే మాత్రం ఆమెను బయటకు పంపించే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. రీతూను టార్గెట్ చేసి..నిజానికి ఆమె హౌస్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మంచి ఫైర్ బ్రాండ్ అవుతుందనుకున్నారంతా! కానీ అనవసరపు గొడవలు, అరుపులతో అందరికంటే వరస్ట్ అనిపించుకుంది. రీతూను టార్గెట్ చేసి ఆమె నెగెటివిటీని కాస్త పోగొట్టేందుకు సాయపడింది. ఆమె నామినేషన్స్లోకి వస్తే పంపించేందుకు జనాలు రెడీగా ఉన్నారు. కానీ, వాళ్లకు పని చెప్పకుండా తనే స్వయంగా వాకౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగా వెళ్లిపోతుందా? వెళ్తే తిరిగొస్తుందా? ఆరోగ్యం కుదుటపడి హౌస్లోనే కొనసాగుతుందా? అనేది చూడాలి!చదవండి: సంజనా నోటి దురుసు.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమన్న మాధురి -
నీకెందుకే అంత యాటిట్యూడ్? రీతూపై విషం కక్కిన ఆయేషా..
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్, శ్రీజ, భరణి వరుసగా హౌస్ నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఇప్పుడు మరొకరిని పంపించేందుకు నామినేషన్స్ షురూ అయ్యాయి. ఈమేరకు ఓ ప్రోమో రిలీజైంది.కెప్టెన్ల చేతిలో పవర్నామినేషన్ చేసే హక్కును కూడా పోరాడి గెలవాల్సి ఉంటుందన్నాడు బిగ్బాస్. ఆ పోరాటానికి ఇద్దర్ని ఎంపిక చేసుకోమని కెప్టెన్స్కు పవర్స్ ఇచ్చారు. దీంతో గౌరవ్.. ఆయేషాను, సుమన్.. ఇమ్మాన్యుయేల్ను ఎంపిక చేశాడు. ఆయేషా, ఇమ్మూకి బిగ్బాస్ బెలూన్ల టాస్క్ ఇచ్చాడు. బెలూన్ పగలగొట్టినప్పుడు అందులో ఓ చిట్టీ వస్తుంది. దానిపై రాసున్నదాని ప్రకారం నామినేషన్స్ ముందుకు సాగుతాయి. ఈ క్రమంలో ఆయేషా.. రీతూను డైరెక్ట్గా నామినేట్ చేసింది. నామినేషన్స్నువ్వు, నీ ఓవరాక్షన్ నచ్చలేదు. నువ్వు లవ్ కంటెంట్ కోసం వచ్చావు అంటూ పర్సనల్ అటాక్ చేసింది. దానికి రీతూ.. నేను లవ్ చేస్తున్నానని చెప్పానా? అని నిలదీసింది. అప్పటికీ తగ్గని ఆయేషా... నీకంత యాటిట్యూడ్ ఎందుకే? నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు అని మండిపడింది. చూస్తుంటే వీరిమధ్య పెద్ద గొడవే జరిగినట్లు కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియా లీక్స్ ప్రకారం.. రమ్య, సాయి, రీతూ, తనూజ, దివ్య, రాము, సంజనా, కల్యాణ్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఆయేషా నామినేషన్లో ఉండాల్సింది. కానీ గౌరవ్ సేవ్ చేయడంతో ఆమె గండం గట్టెక్కింది. -
ఒక్క టాస్క్కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం పట్టుకుందా?
సుమన్, గౌరవ్ కెప్టెన్స్ అయ్యారని ముందే లీక్ అవడంతో ఎపిసోడ్లో పస లేకుండా పోయింది. హౌస్మేట్స్ను వచ్చినప్పటినుంచి చెడుగుడు ఆడేసుకుంటున్న ఆయేషా ఒక్క గేమ్లో ఓడిపోయినందుకు గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..అంతా నావల్లే..కెప్టెన్సీ కంటెండర్లను జంటలుగా విడిపోమన్నాడు బిగ్బాస్ (Bigg Boss 9 Telugu). సుమన్తో జత కట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు గౌరవ్ అతడితో జోడీ కట్టాడు. మాధురి- రమ్య, ఆయేషా- సాయి, గౌరవ్- సుమన్ జంటలు కెప్టెన్సీ గేమ్ ఆడారు. ఈ గేమ్లో సుమన్-గౌరవ్ చాలా ప్రశాంతంగా ఆడి గెలిచారు. ఓటమిని ఆయేషా జీర్ణించుకోలేకపోయింది. నాకు చీకట్లో కళ్లు సరిగా కనిపించలేదు, నా వల్లే గేమ్ పోయిందంటూ తన చెంపపై తనే కొట్టుకుంటూ ఏడ్చింది. ఆమెనలా చూసి మాధురి సైతం కన్నీళ్లు పెట్టుకుంది.పవన్ వాడేసిన నిఖిల్గెలిచిన జంట సుమన్ (Suman Shetty)- గౌరవ్ను కెప్టెన్స్గా ప్రకటించాడు బిగ్బాస్. అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్.. తన కెప్టెన్సీ కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్స్లో ఒకర్ని చాలెంజ్ చేయొచ్చన్నాడు. దీంతో అతడు గౌరవ్తో తలపడతానన్నాడు. అలా వీరిద్దరికీ సాండ్ టాస్క్ పెట్టగా ఇందులో గౌరవ్ గెలిచి తన కెప్టెన్సీ కాపాడుకున్నాడు. అలా గెలిచాడో, లేదో.. అప్పుడే సుమన్తో చర్చించి ఆయేషాకు ఓ వరమిచ్చాడు. భరణిలో భయం మొదలైందా?ఆయేషాకి పడుకోవడానికి బెడ్ లేదు కాబట్టి.. ఇంకో ఇద్దరమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్లో పడుకోవచ్చు.. మేము బయట మిగిలిన బెడ్స్పై పడుకుంటాం అన్నాడు. ఈ మాటకు అందరూ చప్పట్లు కొట్టారు. ఇక బంధాల సుడిగుండంలో చిక్కుకున్న భరణి (Bharani Shankar)కి తన ఫ్యూచర్ అర్థమైపోయింది. ఎలిమినేట్ అవుతానని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం ఇమ్మాన్యుయేల్ మాటల్లో స్పష్టమైంది. సంజనతో ఇమ్మూ మాట్లాడుతూ.. ఎప్పుడైనా నేను డేంజర్లో ఉన్నప్పుడు.. ఇంట్లో ఎవరూ నన్ను కాపాడలేనప్పుడు నువ్వు నాతో ఉంటావా? అని భరణి అన్న అడిగాడని చెప్పాడు. మహా ముదురుఆ మాటకు సంజనా అవాక్కైపోయి.. నీ దగ్గర పవరాస్త్ర ఉంది, కాబట్టి నిన్ను ముందే లాక్ చేస్తున్నాడన్నమాట! మహా ముదురు అని కామెంట్ చేసింది. ఇంకా ఇమ్మూ మాట్లాడుతూ.. హౌస్లో 15 మంది ఒకవైపు, నువ్వొకడివే ఒకవైపు ఉంటే.. నీవైపు న్యాయం ఉంటే.. అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పా.. అని ఇమ్మూ సంజనాతో చెప్పుకొచ్చాడు. అంటే భరణిలో ఎలిమినేషన్ భయం మొదలైందన్నమాట!చదవండి: ‘కె-ర్యాంప్’ మూవీ ట్విటర్ రివ్యూ -
బిగ్బాస్లో మాధురి కొత్త రూల్స్.. నచ్చకపోతే వెళ్లిపోమని వార్నింగ్!
(Bigg Boss Telugu 9) వైల్డ్కార్డులు తమ ప్రతాపం చూపించాలనుకుంటున్నారో, ఏమో కానీ గొడవలు పడుతూనే ఉన్నారు. మాధురి తగ్గేదేలే అన్న లెవల్లో కొట్లాటకు సిద్ధం అవుతుంటే ఆయేషా కావాలని కొందరిని టార్గెట్ చేసి మరీ తిడుతోంది. మరి నిన్నటి (అక్టోబర్ 15వ) ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం...ప్రాంక్ పేరుతో..సంజనాతో కలిసి ప్రాంక్ గొడవ ప్లాన్ చేసింది మాధురి (Divvala Madhuri). ప్రాంక్ పేరుతో మనసులో ఉన్న కోపం, అక్కసునంతా సంజనాపై కక్కేసింది. ఆమె తిట్ల దండకానికి జడుసుకున్న సంజనా.. వెంటనే కట్ చెప్పేసి ఇదంతా ఊరికనే చేశామని చెప్పి ఊపిరి పీల్చుకుంది. మాధురి.. దివ్యను టార్గెట్ చేసిందో ఏంటోకానీ, మరోసారి ఆమెతో గొడవపడింది. దివ్య సాధారణంగా మాట్లాడుతుంటే కూడా నువ్వెంత? అని చీప్గా తీసిపడేసే ప్రయత్నం చేసింది. రూల్స్ పాటించనని, తనకు నచ్చినట్లుగానే ఉంటానని, అది నచ్చకపోతే హౌస్ నుంచి వెళ్లిపోమని దివ్యకు ఆర్డర్ వేసింది. లైవ్లో హౌస్మేట్స్ అందరికీ ఇంకా చాలానే ఆంక్షలు పెట్టింది.నా రూల్స్ నచ్చకపోతే వెళ్లిపోరాత్రి ఇకఇకలు పకపకలు ఉండొద్దని, లైట్స్ ఆఫ్ అయ్యాక అంతా సైలెంట్గా ఉండాలంది. మీ అల్లరి వల్ల తన నిద్ర చెడిపోతే క్షమించను అని వార్నింగ్ ఇచ్చింది. పొద్దున పాట వచ్చేవరకు మాట్లాడొద్దని కండీషన్ పెట్టింది. అంతగా మాట్లాడాలనుకుంటే గార్డెన్ ఏరియాకి వెళ్లి సైలెంట్గా మాట్లాడుకోమంది. ఈ రూల్స్కు రీతూ ఒప్పుకోలేదు. మీరు చెప్పిన మాట వినేందుకు ఇక్కడికి రాలేదు. బిగ్బాస్ రూల్స్ మాత్రమే పాటిస్తా అని కరాఖండిగా చెప్పింది. నా రూల్స్ నచ్చకపోతే బిగ్బాస్ హౌస్ నుంచి వెళ్లిపోమనగా.. నేనెందుకు వెళ్తా.. కావాలంటే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది రీతూ. మాధురి రూల్స్ పెడుతుంటే కెప్టెన్ ఏం చేస్తున్నాడో మరి!ఓవరాక్షన్ ఆపవే..కిచెన్లో గిన్నెలు తోమే దగ్గర ఆయేషా, రీతూకి పంచాయితీ అయింది. రాత్రి గిన్నె కడగనని ఆయేషా.. అది అర్ధరాత్రి సింక్లో వేశారని రీతూ గొడవపడ్డారు. నీ పని నువ్వు చేయకపోతేనే కదా అడుగుతున్నాను.. ఫస్ట్ కరెక్ట్గా ఉండు.. అని కోప్పడింది ఆయేషా. నువ్వు కూడా ఉండని రీతూ అనగా.. నువ్వు ఊరుకోవే.. ఏం పని చేయవు, అడిగితే న్యన్యన్య అంటావ్ అని ఆయేషా వెక్కిరించింది. మధ్యలో మాధురి కూడా దూరిపోయి రీతూపై రెచ్చిపోయింది. ఏయ్.. నీకో స్టాండ్ లేదా? అబద్ధాలు ఆడుతున్నావ్ అంటూ మండిపడింది. రీతూ కూడా తగ్గకుండా ఆమెకు కౌంటర్లిచ్చింది. ఇక గిన్నెలు తోముతున్న ఆయేషా.. ఆపవే ఓవరాక్షన్.. మాటలు ఆపేయ్ ఫస్ట్.. అంటూ రీతూను వాయించేసింది.పెద్ద లిస్ట్ చదివిన పచ్చళ్ల రమ్యమరోవైపు పచ్చళ్లపాప రమ్య మోక్ష తన సూపర్ పవర్ ఉపయోగించేసింది. ఈరోజు కోసం నిన్న ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ అంటే ఏదో బిర్యానీ, ఐస్క్రీమ్ అంతేగా అనుకునేరు.. కాదుకాదు! టిఫిన్లోకి గుడ్డు పెసరట్టు ఉప్మా, పూరి, మైసూర్ బజ్జీ.. లంచ్లోకి ఎగ్ బిర్యానీ, చికెన్ జాయింట్స్, వెజ్ టిక్కా పిజ్జా.. సాయంత్రం బనానా చిప్స్, నాలుగు ఎగ్ ట్రేలు, మిక్చర్, ఫ్యామిలీ ప్యాక్ ఐస్క్రీమ్, చాక్లెట్స్.. డిన్నర్కు చికెన్, వెజ్ పికిల్స్, నాన్వెజ్ పికిల్స్.. ఇలా పేద్ద లిస్ట్ చదువుకుంటూ పోయింది. ఈ ఫుడ్ను హౌస్మేట్స్ అందరూ ఆస్వాదించేందుకు వీల్లేదు. కేవలం రమ్య.. ఆమె సెలక్ట్ చేసిన సుమన్ మాత్రమే కలిసి షేర్ చేసుకోవాలి.చదవండి: దీపికా పదుకొణెతో మీరు కూడా మాట్లాడొచ్చు.. -
కమల్ హాసన్పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్బాస్లో వైల్డ్కార్డ్ ఎంట్రీ
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ ప్రారంభమై నెలరోజులవుతోంది. మొదటి రెండు వారాల్లో ఉన్నంత ఊపు ఇప్పుడు లేకుండా పోయింది. గొడవలతో అట్టుడికిన హౌస్ తర్వాత చప్పున చల్లారిపోయింది. కంటెస్టెంట్లకు ఎక్కువ హింట్స్ వెళ్లడం వల్లే అందరూ సైలెంట్ అయిపోయారు. ఏం చేస్తే ఏమవుతుందో? అన్న జంఝాటంలో పడిపోయారు. ఇలాగైతే ఈ సీజన్.. ఆరో సీజన్ కంటే అట్టర్ ఫ్లాప్గా మారడం ఖాయం. ఆరుగురు కన్ఫార్మ్!అందుకే బిగ్బాస్ (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డులను దింపబోతున్నాడు. ఈ ఆదివారం ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్లో ఎంట్రీ ఇస్తున్నారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష(అలేఖ్య చిట్టి పికిల్స్ సోదరి), నటులు నిఖిల్ నాయర్, గౌరవ్, ఆయేషా, శ్రీనివాస్ సాయి హౌస్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిలో ఆయేషా జీనత్పై కాస్త హైప్ ఎక్కువగా ఉంది. ఊర్వశివో రాక్షసివో, సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలోనూ మెరిసింది. తమిళ బిగ్బాస్లో..తమిళంలో అనేక సీరియల్స్ చేసింది. ఉప్పు పులి కారం అనే తమిళ వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. తమిళ చిత్రం రాంబోలోనూ నటించింది. అయితే ఆమెకు క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం బిగ్బాస్ షో! అవును, ఆయేషా తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొని వివాదాస్పద కంటెస్టెంట్గా నిలిచింది. ఓపక్క అల్లరి చేస్తూ, మరోపక్క తనను విమర్శిస్తే ఉగ్రరూపం చూపిస్తూ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసింది. ఆ సమయంలో ఆయేషాపై ఆమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు.రెండుసార్లు పెళ్లి?ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందన్నాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి అవమానించారని, కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని కొంతకాలం నటుడు విష్ణుతో ప్రేమాయణం నడిపిందని, ఆ తర్వాత అతడిని వదిలేసి యోగేశ్తో రిలేషన్షిప్ మొదలుపెట్టిందని ఆరోపించాడు. తనకిప్పటికే రెండుసార్లు పెళ్లయిందని బాంబు పేల్చాడు. వీటన్నింటి గురించి ఆయేషా క్లారిటీ ఇవ్వలేదు. అయితే యోగేశ్తో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిన ఆయేషా.. తర్వాత ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.కమల్ హాసన్నే ఎదిరించిన లేడీఇక షోలో ఆయేషాతో వేరే కంటెస్టెంట్లకు మధ్య ఉన్న గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశాడు కమల్ హాసన్. హోస్ట్ బుజ్జగిస్తున్నట్లుగా మాట్లాడుతుంటే ఆయేషా మాత్రం.. నన్ను తప్పుగా చిత్రీకరించొద్దు అని ఎదురుతిరిగింది. అప్పట్లో ఈ సంఘటన బాగా వైరల్ అయింది. బిగ్బాస్ షోలో రెండు నెలలవరకు కొనసాగింది. మరి ఈ బ్యూటీ ఇక్కడ కూడా వైల్డ్ఫైర్లా ఉంటుందా? తన ఆటతో ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి! View this post on Instagram A post shared by AYSHA🦋 (@aysha7__official) చదవండి: ఆ హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు: దీపికా పదుకొణె


