baba rampal
-
హత్య కేసుల్లో బాబా రాంపాల్కు జీవితఖైదు
చండీగఢ్ : రెండు హత్య కేసుల్లో దోషిగా తేలిన బాబా రాంపాల్కు హిసార్లోని సెషన్స్ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. రాంపాల్ అనుచరులు పదిహేను మందికి కూడా కోర్టు ఇదే శిక్ష విధించింది. మరో మహిళ హత్య కేసులో విధించే శిక్షను కోర్టు బుధవారం నిర్ధారించనుంది. బాబా రాంపాల్కు శిక్ష ఖరారు నేపథ్యంలో హిసార్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హిసార్లో సత్లోక్ ఆశ్రమ్ను స్ధాపించిన 67 ఏళ్ల రాంపాల్ రెండు హత్యలు, ఇతర నేరాల్లో దోషిగా నిర్ధారణ అయ్యారు. హిసార్ జిల్లా జైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయస్ధానంలో నాలుగేళ్ల పాటు విచారణ చేపట్టిన అనంతరం హిసార్ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి డీఆర్ చాలియా తుది తీర్పు వెల్లడించారు. నవంబర్ 2014లో అరెస్ట్ అయినప్పటినుంచి రాంపాల్ ఆయన అనుచరులు జైలు జీవితం గడుపుతున్నారు. 2014 నవంబర్ 19న రాంపాల్, ఆయన అనుచరులపై బర్వాలా పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. బర్వాలాలోని రాంపాల్ ఆశ్రమంలో బాబా, ఆయన అనుచరుల నిర్బంధంలో ఉన్న తమ భార్యలు హత్య గావించబడ్డారని వారి భర్తలు ఢిల్లీకి చెందిన శివపాల్, యూపీకి చెందిన సురేష్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భారీ భద్రత డేరా బాబాను కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించిన క్రమంలో చెలరేగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని బాబా రాంపాల్కు శిక్ష ఖరారు నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. హిసార్ జిల్లా అంతటా సెక్షన్ 144 విధించి 2000 మంది పోలీసులను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించామని జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ మీనా తెలిపారు. -
జంట హత్యల కేసులో దోషిగా తేలిన రాంపాల్
సాక్షి, న్యూఢిల్లీ : తనకు తాను స్వామీజీగా చెప్పుకునే రాంపాల్ బాబా రెండు హత్య కేసుల్లో దోషిగా తేలారు. హర్యానాలోని హిసార్ కోర్టు గురువారం ఆయనను జంట హత్యల కేసులో దోషిగా నిర్ధారించింది. ఈనెల 16, 17 తేదీల్లో ఆయనకు విధించే శిక్షను కోర్టు ఖరారు చేయనుంది. పెద్ద ఎత్తున శిష్యగణం కలిగిన రాంపాల్ ప్రస్తుతం హిసార్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నారు. తన అనుచరులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు మరణించడం, పలువరు గాయపడిన ఘటనకు సంబంధించి 2015 నవంబర్లో రాంపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్ధానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పును వెలువరించింది. తీర్పు నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు హిసార్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1800 మంది పోలీసులను నియోగించారు. 2017 ఆగస్ట్లో డేరా బాబాను దోషిగా తేల్చిన సందర్భంలో పంచ్కులలో చెలరేగిన ఘర్షణలు పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. రాంపాల్ అనుచరులు హిసార్లోకి ప్రవేశించకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. -
నిర్దోషిగా తేలిన బాబా రాంపాల్
న్యూఢిల్లీ : వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు బాబా రాంపాల్ను హర్యానాలోని హిస్సార్ కోర్టు నిర్ధోషిగా నిర్ధారించింది. రాంపాల్పై అల్లర్లు, హత్యానేరాలపై రెండు కేసులు నమోదయ్యాయి. 2014 నుంచి రాంపాల్ హిస్సార్లో జైలు జీవితం గడుపుతున్నారు. మూడేళ్ల కిందట బల్వారాలో జరిగిన అల్లర్ల కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగేలా ప్రేరేపించారనే అభియోగాలు రామ్పాల్పై నమోదయ్యాయి. ఈ ఘర్షణల్లో ఆరుగురు మరణించారు. బాబాపై ఆరోపణలను రుజువు చేయడంలో పోలీసులు విఫలమవడంతో రాంపాల్ను నిర్ధోషిగా కోర్టు నిర్ధారించింది. మరోవైపు గుర్మీత్ సింగ్కు శిక్ష ఖరారు సందర్భంగా అల్లర్లు చెలరేగిన క్రమంలో బాబా రాంపాల్పై తీర్పు నేపథ్యంలో హర్యానా అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
బాబా రాంపాల్ను నిర్దోషిగా నిర్ధారించిన హర్యానా కోర్టు
-
రాంపాల్ బాబా కేసు.. 28కి వాయిదా!