Bandi Bhageerath
-
బండి భగీరథ్ కేసు వెలుగులోకి సంచలన విషయాలు?
-
బండి భగీరథ్ కేసులో బయటపడ్డ కీలక విషయాలు
-
TG : హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు.. నిందితుడు అరెస్టు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో దామోదర్ అనే వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే దామోదర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందంటే? పోక్సో కేసులో కీలక నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్పై హైకోర్టు వాదనలు జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా అనుచిత పోస్టుపై నమో దైన కేసు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయా పోస్టులు చేసిన వారిని గుర్తించడం కోసం ఐపీ అడ్రస్లు కోరుతూ ఆదివారం సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసు ఠాణాకు బదిలీ అయింది.బండి సాయి భగీరధ్ను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అతను ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడని, పోలీసులు, ప్రధాన మీడియా, సోషల్ మీడియాను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని పోస్టులు వచ్చాయి. సీనియర్ వెకేషన్ జడ్జి జస్టిస్ టంగిరాల మాధవి దేవిని కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కేసులో ఆరోపించారు. పాక్సో కేసులో భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, జస్టిస్ టంగిరాల మాధవి దేవి భర్తను తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నియమించేలా చూస్తానని కొందరు చెప్పినట్లు పోస్టులు చేశారు.ఈ కల్పిత వార్తను సోషల్ మీడియాలో ఉంచడమే కాకుండా ప్రింట్ మీడియాలో కూడా ప్రచురించారని, దీని వల్ల అది విస్తృతంగా ప్రచారం చెంది, న్యాయమూర్తులు. న్యాయవాదులు, సాధారణ ప్రజలు చదవడం ద్వారా న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలుగుతోందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ కల్పిత వార్తకు సంబంధించిన కాపీని ఫిర్యాదుతో జతపరిచారు.ఆయా పోస్టులను ఇప్పటికే సేకరించిన పోలీసులు వాటి మూలాలు కనిపెట్టడంపై దృష్టి పెట్టారు. దీనికి ఐపీ అడ్రస్ ప్రధాన ఆధారం కావడంతో వాటిని అందించాల్సిందిగా కోరుతూ సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన వివరాల ఆధారంగా నిందితుడు దామోదర్ను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. -
బండి భగీరథ్ కేసు.. రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బండి భగీరథ్ కేసు విషయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయంగా కూడా ఈ కేసులో ప్రకంపనలు సృష్టించింది. అయితే, ఈ కేసులో విషయమై తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ తండ్రి తప్పుచేయనప్పుడు రాజీనామా ఎందుకు చేయాలని ప్రశ్నించారు.తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘బండి భగీరథ్ తండ్రి ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన తప్పుచేస్తే పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. మా మంత్రి తప్పు చేస్తే మాది బాధ్యత. ముందస్తు బెయిల్ తీసుకోవడం హక్కు. ఆయన పారిపోలేదు. బెయిల్ పెండింగ్లో ఉంది. అనంతరం, భగీరథ్ సరెండర్ అయ్యాడు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్తే కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. కోట్లు ఖర్చు చేసి భగీరథ్, ఆయన తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఏ పని లేనట్టు బండి భగీరథ్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం సరికాదు. ఆ కుటుంబంలో కేంద్ర మంత్రి ఉన్నాడని టార్గెట్ చేశారు. కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ వాళ్లు ముందుగానే కోర్టుకు ఎందుకు వెళ్లారు?. ఈ కారు రేసింగ్ కేసులో కేటీఆర్ ముందస్తుగా కోర్టుకు వెళ్లలేదా?. మీ బీఆర్ఎస్ హయాంలో మహిళలపై దాడులు ఎన్నో జరిగాయి. పబ్లో ఎంఐఎం నేత కొడుకు అత్యాచారం చేయలేదా? ఏం చేశారు. కొమురం భీం జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగింది. గతంలో లంబాడా అమ్మాయి మీద కస్టోడియల్ డెత్ జరగలేదా?. గతంలో మీ పాలనలో అత్యాచారాలు జరిగితే మరి కేసీఆర్ రాజీనామా చేశారా?. కాళేశ్వరం, కారు రేసు కేసులో త్వరగా విచారణ జరిగేలా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తేవాలి. మోదీ సభ విజయంతో తెలంగాణ ప్రజల బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దు అని వ్యాఖ్యలు చేశారు. -
బండి భగీరథ్ కేసులో మలుపు..! బాధితురాలు మైనర్ కాదు..?
-
హైకోర్టు న్యాయమూర్తిపై అసత్య ప్రచారం.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం చేసిన ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బి.ఎస్. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరధ్ను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం జరిగాయి. ఈ వార్తలు న్యాయమూర్తులపై ప్రభావం చూపే ప్రయత్నంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్పిత వార్తలు ప్రచారం కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజల మధ్య విస్తృత చర్చకు దారి తీసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.చార్మినార్ పోలీసులు ఐటీ యాక్ట్తో పాటు భారత న్యాయసంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 353(1)(c), బీఎన్ఎస్ 353(2), బీఎన్ఎస్ 267 సెక్షన్ల కింద ఎస్ఐఆర్ (SIR) నమోదు చేసి, కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. -
కేంద్రమంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ చేయాలి. కేంద్రమంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి. లేదంటే విచారణ పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు. తప్పు చేసిన కొడుకును తొమ్మిది రోజులు దాచిపెట్టారు. బేటీ బచావో అన్నది నినాదాలకు సరిపెడతారా మోదీ గారూ. కేంద్ర మంత్రి కొడుకుపై లుక్ఔట్ నోటీసు ఇవ్వడం తొలిసారి. బాధిత కుటుంబాన్ని బెదిరించి, ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు’అని వ్యాఖ్యానించారు. -
బండి భగీరథ్తో పార్టీకి సంబంధం లేదు:కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బండి భగీరథ్ అంశమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బండి భగీరథ్ ఇదివరకే సరెండర్ అయ్యారని ఆ విషయంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు అంశంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం ఉండదని తెలిపారు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుందని తెలిపారు. పెట్రోల్ పై ట్సాక్స్ తగ్గించాలని కేంద్ర కోరినా రాష్ట్రం ఏమాత్రం తగ్గించడం లేదన్నారు.అయితే కేంద్రమంత్రి బండిసంజయ్ కుమారుడు బండి భగీరథ్ నిన్న (శనివారం) పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.కాగా ఈ విషయంపై స్పందించిన బండి సంజయ్.. తన కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదని చెబుతున్నాడని అందుకే పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని తెలిపారు -
కొడుకు సరెండర్ పై బండి సంజయ్ రియాక్షన్
-
బండి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్
-
బండి భగీరథ్కు 14 రోజుల రిమాండ్
లొంగుబాటా.. అరెస్టా?భగీరథ్ను పోలీసులు అరెస్టు చేశారా? లేక అతనే పోలీసులకు లొంగిపోయాడా? అనే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. 8 రోజులుగా పరారీలో ఉన్న భగీరథ్ దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. 20 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న క్రమంలో పోలీసు అకాడమీ వద్ద నిందితుడు భగీరథ్ను పట్టుకున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ తెలిపారు. కాగా.. ‘భగీరథ్ను పోలీసులు అరెస్టు చేయలేదని, తానే స్వయంగా ఇద్దరు లాయర్లతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారని’ పేర్కొంటూ బండి సంజయ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి అప్పా జంక్షన్లోని పోలీసు అకాడమీ వద్ద సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ పి.శోభన్ కుమార్, అతని బృందం నిందితుడు భగీరథ్ను శనివారం రాత్రి 8:15 గంటలకు అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించిన మర్నాడే ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అరెస్టు తర్వాత భగీరథ్ను భారీ బందోబస్తు నడుమ రాత్రి 9:05 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత ఠాణాలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సుమారు రెండున్నర గంటల పాటు భగీరథ్ను సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 11:35 గంటలకు భగీరథ్ను మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఆ తర్వాత నిందితుడిని మేడ్చల్లోని మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచారు. ఆయన సమక్షంలోనే భగీరథ్ వాంగ్మూలాన్ని పోలీసులు మరోసారి నమోదు చేశారు. అలాగే బాధితురాలు మైనర్ బాలిక, ఆమె తల్లి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు రెండుసార్లు రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఉదయం నుంచే హడావుడి శనివారం ఉదయం పేట్ బషీరాబాద్ పోలీసులు బంజారాహిల్స్ రోడ్ నం.3లోని ఆరోరా కాలనీలోని బండి సంజయ్, భగీరథ్ మేనమామ కరీంనగర్లోని కార్తికేయ ఆసుపత్రిలో డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణ ఇంట్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రెండు గంటల పాటు దాడులు చేసిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్లతో పాటు పలు కీలక సమాచారాన్ని సేకరించారు. శనివారం ఉదయం నుంచే భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోతాడనే ప్రచారం జరిగిన నేపథ్యంలో పేట్ బషీరాబాద్ ఠాణా, చర్లపల్లి జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాజపా కార్యకర్తలు, ఇతరులు ఎవరూ లోనికి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అపస్మారక స్థితిలో ఉండగా... కుత్బుల్లాపూర్లోని సుచిత్ర ప్రాంతంలో నివసించే ఓ మైనర్ బాలికతో భగీరథ్కు గతేడాది పరిచయం ఏర్పడింది. తరచూ ఆమెను కలవడం, ఫోన్లో మాట్లాడుతూ ఆమె నమ్మకాన్ని చూరగొన్నాడు. శారీరకంగా ఆమెను లొంగదీసుకునేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. ఈక్రమంలో గతేడాది డిసెంబర్ 31న మొయినాబాద్లోని తన ఫామ్హౌస్కు బాలికను తీసుకెళ్లిన భగీరథ్.. ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర మానసిక, శారీరక కుంగుబాటుకు గురైన బాలిక ఈ విషయాన్ని తల్లికి తెలిపింది. దీంతో ఆమె ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సున్నితమైన కేసు కావడంతో కేసు విచారణ నిమిత్తం ప్రభుత్వం కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణాధికారిగా ‘సిట్’ను నియమించిన సంగతి తెలిసిందే. పేట్ బహీరాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) పోక్సోలోని సెక్షన్ 11 రెడ్విత్ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్లను పరిశీలించిన పర్యవేక్షణాధికారి రితిరాజ్ మంగళవారం బాధితురాలిని మరోసారి విచారించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భగీరథ్పై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు సంబంధించిన సెక్షన్లను సూచించే పోక్సో–2012 చట్టంలోని సెక్షన్ 5(ఐ) జోడించారు. కేసు నమోదైన నాటి నుంచి 8 రోజులుగా నిందితుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడు. దీంతో 20 బృందాలు నిందితుడి కోసం ఢిల్లీ, హైదరాబాద్, కరీంనగర్లో తీవ్రంగా గాలించారు. మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాని, రాష్ట్రపతికి లేఖ కేంద్ర మంత్రి బండి సంజయ్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు లేఖ అందింది. సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి తరుఫు న్యాయవాది పప్పు నాగేశ్వర రావు ఈ లేఖను రాశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగితే అధికార బలంతో కేసును పక్కదారి పట్టించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బాధితులకు ఇటీవల బహిరంగంగా బెదిరింపులు కూడా వచ్చాయని, అందువల్ల తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఆ లేఖలో డిమాండ్ చేశారు. చట్టంపై గౌరవం ఉంది: బండి సంజయ్ ‘మా అబ్బాయి భగీరథ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టం పైఉన్న గౌరవంతో అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించా’నని బండి సంజయ్ మీడియాతో అన్నారు. ‘నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే స్టేషన్లో అప్పగిద్దామనుకున్నా. కానీ, లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈరోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు చెబుతున్నారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకముంది. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించానని బండి సంజయ్ అన్నారు. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్
హైదరాబాద్: పేట్బషీరాబాద్లో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. అడ్వకేట్ల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈరోజు(శనివారం, మే 16వ తేదీ) రాత్రి లాయర్ల సమక్షంలో బండి భగీరథ్ను కుటుంబ సభ్యులే పోలీసులకు అప్పగించారు. కాసేపట్లో బండి భగీరథ్ను జడ్జి ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. పోలీసులకు అప్పగించాం: బండి సంజయ్‘చట్టంపైన గౌరవంతోనే మా అబ్బాయిని పోలీసులకు అప్పగించా. ఏ తప్పు చేయలేదని మా అబ్బాయి చెబుతున్నాడు. ఆధారాలను చూపేందుకే పోలీసులకు అప్పగింతలో జాప్యం జరిగింది’ అని పేర్కొన్నారు బండి సంజయ్.తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, అందుచేత ఏ తప్పూ చేయని తన కుమారుడు పోలీసులకు లొంగిపోయాడన్నారు బండి సంజయ్. చట్టం ముందు అంతా సమానమేనని, ప్రతీ ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి భగీరథ్ను అరెస్ట్ చేశాం: సీపీబండి భగీరథ్ను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ రమేష్రెడ్డి స్పష్టం చేశారు. భగీరథ్ను గాలించే క్రమంలో అరెస్ట్ చేశామన్నారు. నార్సింగ్లోని పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ను అరెస్ట్ చేశామన్నారు. అటు తర్వాత పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నామన్నారు సీపీఇదిలా ఉంచితే, బండి భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్ కోర్టులో బాధితురాలు.. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు.కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా రంగంలోకి దిగిన న్యాయమూర్తి.. బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా జడ్జి.. స్టేట్మెంట్ తీసుకున్నారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మూడోసారి స్టేట్మెంట్ ప్రక్రియ.. కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. న్యాయమూర్తి సేకరించిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది. -
బండి భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, మేడ్చల్: బండి భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్ కోర్టులో బాధితురాలు.. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు.కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా రంగంలోకి దిగిన న్యాయమూర్తి.. బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా జడ్జి.. స్టేట్మెంట్ తీసుకున్నారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మూడోసారి స్టేట్మెంట్ ప్రక్రియ.. కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. న్యాయమూర్తి సేకరించిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది.మరోవైపు, భగీరథ్ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అతని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలతో ముమ్మరంగా గాలించారు. బాలికను లైంగిక వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్పై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసు (పోక్సో చట్టం కింద) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటిరోజు నుంచే(ఈ నెల 9న) భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడు. కేసు నమోదుకు ముందు చివరిసారిగా హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. విచారణకు తమ ఎదుటకు రావాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పిలుపునకు కూడా అతని నుంచి సరైన స్పందన లేదు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. తక్షణ ఉపశనమం విషయంలో నిరాశే ఎదురైంది. అయితే గురువారం(మే 21న) ఆ పిటిషన్పై తుది తీర్పు వెలువడనుంది. భగీరథ్ కోసం ఐదు బృందాలు.. ఢిల్లీ, కరీంనగర్తో పాటు హైదరాబాద్ను జల్లెడపట్టారు. ఇవాళ సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్లోని అతని తండ్రి ఇంట్లో సోదాలు కూడా చేశారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి (శనివారం మే 16) షేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో బండి భగీరథ్ లొంగిపోయారు. -
విదేశాలకు పారిపోయే ప్లాన్..!?
-
బండి భగీరథ్ POCSO CASE పిన్ టు పిన్ డీటెయిల్స్
-
హైదరాబాద్ లో హై టెన్షన్...బండి భగీరథ్ కోసం గాలింపు
-
బండి భగీరథ్ కు ఊహించని షాక్
-
బండి భగీరథ్కు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: మైనర్పై లైంగిక వేధింపుల కేసులో బండీ భగీరథ్కు మరో షాక్ తగిలింది. భగీరథ్ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. హైకోర్టులో మధ్యంతర ఉపశమనం దక్కని నేపథ్యంలో.. శనివారం అతని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. మైనర్ బాలికను లైంగిక వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్పై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కేసు (పోక్సో చట్టం కింద) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటిరోజు నుంచే(ఈ నెల 9న) భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడు. కేసు నమోదుకు ముందు చివరిసారిగా హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. విచారణకు తమ ఎదుటకు రావాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పిలుపునకు కూడా అతని నుంచి సరైన స్పందన లేదు. ఈ క్రమంలో.. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. తక్షణ ఉపశనమం విషయంలో నిరాశే ఎదురైంది. అయితే గురువారం(మే 21న) ఆ పిటిషన్పై తుది తీర్పు వెలువడనుంది. ఈలోపు..ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదు బృందాలు భగీరథ్ కోసం ఢిల్లీ, కరీంనగర్తో పాటు హైదరాబాద్ను జల్లెడపడుతున్నాయి. శనివారం మధ్యాహ్నాం సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్లోని అతని తండ్రి ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటు పేట్ బషీర్బాద్ పీఎస్ వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. దీంతో ఇవాళో రేపో భగీరథ్ను అరెస్ట్ చేస్తారని.. తనంతట తానే లొంగిపోతాడని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి.సెన్సిటివ్ కేసు.. ఎలాపడితే అలా కుదరదు: సీఎం రేవంత్ఈ కేసు దర్యాప్తు విషయంలో వస్తున్న విమర్శలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. చర్యలు తీసుకునే ఉద్దేశమే లేకపోతే పోక్సో కేసు ఎందుకు పెడతామని విమర్శకులను ఆయన ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన వే2న్యూస్ కాంక్లేవ్–2026లో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి మైనర్ బాలిక తల్లి ఒకరు పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ మరుసటిరోజే విచారణ ప్రారంభించి సెక్షన్లు కూడా మార్చి కేసు పెట్టాం. 11న సెక్షన్లు సవరించి వెంటనే నోటీసులు జారీ చేశాం. ఇదే వ్యవహారంలో బండి భగీరథ్ కూడా కరీంనగర్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులను బేరీజు వేసుకుని అమ్మాయి స్టేట్మెంట్ను తీసుకొని నోటీసులిచ్చారు. ఈ కేసులో ఎలా పడితే ఎలా చేయడానికి వీల్లేదు. నేను సహాయ పడాలనుకుంటే పోక్సో కేసు పెట్టం కదా? బండి భగీరథ్ తండ్రికి, బీఆర్ఎస్ మధ్య ఎక్కడ చెడిందో నాకు తెలియదు. కేటీఆర్కి, బండి భగీరథ్ తండ్రికి మధ్య ఏముందో నాకు తెలియదు. కానీ ఎవరైనా తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తాం. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు ఎవరైనా నాకు మినహాయింపులు లేవు. ఆ అమ్మాయికి రెండు బర్త్ సర్టీఫికెట్లు ఉన్నాయి. అవన్నీ పోలీసులు విచారించాలి. ఒకరోజు ఆలస్యమైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు. మేము సత్రం నడపడం లేదు.. ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. మా ప్రభుత్వం బాధితులకు 100 శాతం అండగా ఉంటుంది. కుమారుడి విషయంలో ఆ కేంద్ర మంత్రి(సహాయ) తీరు నైతికంగా సరైంది కాదు. ఆయన ధైర్యంగా ఎదుర్కోవాలి. కొడుకును తెచ్చి పోలీసులకు అప్పగించాలి అని సీఎం రేవంత్ సూచించారు. -
జడ్జి ముందు బండి భగీరథ్ లొంగిపోతాడా..?
-
బండి భగీరథ్ కు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ ను నిరాకరించిన హై కోర్టు
-
ముందస్తు బెయిల్పై 21న ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)పై ఉత్తర్వులను హైకోర్టు రిజర్వు చేసింది. ఈనెల 21న ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది. వాదనలకే 3 గంటలకుపైగా సమయం పట్టిందని, ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. హడావుడిగా ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని, అన్నింటినీ పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.అన్ని పక్షాలు చేసిన వాదనలు, గత తీర్పులను సమగ్రంగా పరిశీలించాల్సి ఉందంటూ ఉత్తర్వులను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్ను అరెస్టు చేయకుండా, కఠిన చర్యలు తీసుకోకుండా స్టేటస్కో ఆదేశాలు ఇవ్వాలని కోరగా, నిరాకరించింది. తనపై పేట్బïÙరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం రాత్రి మరోసారి విచారణ చేపట్టింది. పోలీసులు కుమ్మక్కు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘గత సంవత్సరంలోనే బాధితురాలు, నిందితుడు స్నేహితులుగా మారారు. గత అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు నాలుగుసార్లు బాధితురాలిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనడంలో వాస్తవం లేదు. పోలీసులు బాధితులతో కుమ్మక్కై తొలుత ఉన్న సెక్షన్లకు తోడు పోక్సో సెక్షన్లు 5, 6ను చేర్చారు.బెయిల్ రాకుండా పూర్తి న్యాయ సలహాతో ఇచి్చన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ మార్చారు. నానక్రామ్గూడ, తర్వాత ఫామ్హౌస్లకు వెళ్లినప్పుడు వారి వెంట మిత్రులు కూడా ఉన్నారు. బాధితురాలికి గతంలోనే ఆల్కహాల్ అలవాటు ఉంది. బాధితురాలు మైనర్ కాదు (కొన్ని సర్టీఫికెట్లను సమరి్పంచారు). నాలుగున్నర నెలల వరకు ఫిర్యాదు చేయకపోవడంలో కుట్రదాగి ఉంది. బాధితురాలు పలుమార్లు బెదిరిస్తూ సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపారు. దీంతో ఆమె ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా చూడాలని బాధితురాలి తల్లిదండ్రులకు పిటిషనర్ చెప్పారు’ అని పేర్కొన్నారు. పిటిషనర్కు నేర చరిత్ర... బాధితురాలి తరఫు న్యాయవాది పప్పు నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. ‘బాధితురాలి డాక్యుమెంట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది సమరి్పంచడం అభ్యంతరకరం. బాధితురాలు మేజర్ అనేది నిరాధార ఆరోపణ. బర్త్ సర్టీఫికెట్ స్కూల్లో ఇచ్చింది ప్రధాన ఆధారం. దీనిపై ఏది ప్రామాణికమో సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. మున్సిపల్ అధికారులు ఇచి్చన పత్రం, టెన్త్ సర్టీఫికెట్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. భగీరథ్ ఒత్తిడితో బాధితురాలు అతని ప్రేమను అంగీకరించింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. పెళ్లి చేసుకుంటానంటున్నాడన్న నమ్మకంతో మరికొందరు కూడా ఉండటంతో భగీరథ్ వెంట తమ అమ్మాయిని తల్లిదండ్రులు పంపారు. అక్కడ బలవంతంగా ఆల్కహాల్ తాగించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని అవమానించేలా రూ.50 వేలు పంపగా, ఆమె వెంటనే ఆ మొత్తాన్ని వెనక్కు పంపింది. నిందితుడి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో అందరి నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. దుండిగల్ పోలీస్స్టేషన్లో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. నిందితుడికి గతంలోనే నేర చరిత్ర ఉంది’ అని పేర్కొన్నారు. ఐవోకు ఎఫ్ఐఆర్లో మార్పు అధికారం.. పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. ‘పుట్టిన రోజు (2008, ఆగస్టు), ఇతర సర్టీఫికెట్లు దర్యాప్తు అధికారి నుంచి తీసుకున్నాం (వాటిని కోర్టుకు సమరి్పంచారు). పోక్సో కేసుల్లో ముందస్తు బెయిల్ సాధ్యంకాదు. ఇలాంటి కేసుల్లో కూడా నిందితులకు బెయిలిస్తే చట్టంపై నమ్మకం లేకుండా పోతుంది. ఎఫ్ఐఆర్లో మార్పులు చేసే అధికారం దర్యాప్తు అధికారి (ఐవో)కి ఉంటుంది. సేకరించిన వివరాల ఆధారంగా సెక్షన్ల మార్పు, నిందితులను చేర్చడం చేయొచ్చు’ అని చెప్పారు. నాపైనే తీవ్ర ఆరోపణలు...కేసు విచారణకు స్వీకరించడానికి ముందు న్యాయమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి తప్పుడు ఆరోపణలతో తనపై, తన భర్తపై సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టులు చేశారన్నారు. ఇది అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టవద్దని భావించానని, కానీ, వెకేషన్ కోర్టు అయినందున అన్ని పక్షాల న్యాయవాదులంతా అంగీకరిస్తేనే వాదనలు వింటానని చెప్పారు.అయితే, సోషల్ మీడియా పోస్టులు తాము కూడా చూశామని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తున్న న్యాయమూర్తిపై అత్యంత నమ్మకం ఉందన్నారు. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే వాటిని తొలగించాలని డీజీపీని కోరినట్లు పీపీ పల్లె నాగేశ్వర్రావు పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి విచారణ ప్రారంభించారు. కాగా, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కేసుల విచారణ ప్రారంభించిన న్యాయమూర్తి రాత్రి 12 గంటల వరకు విచారణ చేపట్టడం గమనార్హం. -
మద్యం తాగించి.. బలవంతం చేసి!
సాక్షి, హైదరాబాద్: బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బాధితురాలైన మైనర్ బాలిక తల్లి తొలిసారిగా మీడియాకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘2025లో నా కుమార్తెకు భగీరథ్తో పరిచయం ఏర్పడింది. తరుచూ మాట్లాడుతూ నా కూతురి నమ్మకాన్ని చూరగొన్నాడు. క్రమంగా ఆమెను చదువుకు దూరం చేస్తూ, ఆమెకు ఇష్టం లేకపోయినా శారీరకంగా లొంగదీసుకోవడం కోసం నిరంతరం ఒత్తిడి తెచ్చాడు.ఈ క్రమంలో 2025 డిసెంబర్ 31 రాత్రి మెయినాబాద్లోని ఫామ్హౌస్లో నా కుమార్తెకు బలవంతంగా మద్యం తాగించారు. దీంతో స్పృహ తప్పిన స్థితిలో ఉన్న ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించి, శారీరక దాడులకు తెగబడ్డాడు. తర్వాత బాలిక తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి భగీరథ్ నా కూతురితో చేసిన చాటింగ్లు, క్షమాపణల మెసేజ్లు మా వద్ద ఉన్నాయి’ అని ఆమె వెల్లడించారు. తమపై ఒత్తిళ్లు : న్యాయపరమైన చర్యల కోసం తాము ప్రయత్నిస్తున్న క్రమంలో తమపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని బాధితురాలి తల్లి తెలిపారు. ‘ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి రాజీ కోసం ప్రయత్నించారు. మర్నాడు ఉదయం ఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో ఆయన్ను కలిసిన క్రమంలో అక్కడ మాకు భరోసా లభిస్తుందని ఆశిస్తే, దానికి భిన్నంగా రాజకీయ ప్రభావం, అనుచరుల అండదండల గురించి మాట్లాడుతూ మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేశారు’ అని ఆరోపించారు.ఈనెల 8న తాము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. అధికారులు తమను దాదాపు 5 గంటల పాటు నిలబెట్టారని ఆవేదన చెందారు. జ్యురిస్డిక్షన్ నెపంతో కాలయాపన చేశారని, కేసు నమోదు చేయాలని తాము పట్టుబట్టడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. మరోవైపు తాము ఫిర్యాదు చేసిన అదే సమయంలో కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో తమ కుటుంబంపై రూ.5 కోట్ల బ్లాక్మెయిల్, వసూళ్ల ఆరోపణలతో భగీరథ్ తరఫు వ్యక్తులు కౌంటర్ కేసు నమోదు చేశారన్నారు. -
బండి భగీరథ్ కేసు: హై కోర్టులో దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో దాఖలైన ముందస్తు రక్షణ (బెయిల్) పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పరిస్థితిలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు ఇస్తామని హై కోర్టు వెల్లడించింది.‘బాధితురాలు ముమ్మాటికీ మైనరే’పిటిషన్పై విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. బండి భగీరథ్కు ఎలాంటి ముందస్తు రక్షణ ఇవ్వకూడదని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో బాధితురాలి వయసుపై వస్తున్న అనుమానాలకు పీపీ తెరదించారు. బాధితురాలు ముమ్మాటికీ మైనరేనని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. విచారణలో బాధితురాలి వయసు 17 ఏళ్ల 3 నెలలుగా నిర్ధారణ అయిందని తెలిపారు. దీనికి సంబంధించి ఆమె పదో తరగతి (టెన్త్) మెమోతో పాటు, జీహెచ్ఎంసీ (GHMC) జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ కూడా ఉన్నట్లు కోర్టుకు సమర్పించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సైతం బాధితురాలు మైనర్ అనే విషయం స్పష్టమైందని పీపీ పేర్కొన్నారు.బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో జరిగిన సంఘటన మొత్తాన్ని వివరంగా వివరించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. "బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే సదరు బాలిక అతనితో కలిసి బయటకు వెళ్లింది" అని పీపీ వాదనలు వినిపించారు. ఈ కారణాల చేతనే పోలీసులు అతనిపై లైంగిక దాడి కేసులు నమోదు చేశారని, అందువల్ల నిందితుడికి ముందస్తు రక్షణ కల్పించకూడదని కోరారు.కాగా, అంతకుముందు బండి భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో తన వాదనలు వినిపించారు. బండి భగీరథ్ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలన్న కోర్టును కోరారు. -
బండి భగీరథ కేసులో ఆ పేరు వాడొద్దు: కోర్టు
హైదరాబాద్: బండి భగీరథ కేసులో సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేరును వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసులో తన పేరును వాడుతున్నారంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్. ఈ మేరుకు విచారించిన కోర్టు.. బండి భగీరథ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ పేరు వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసింది సివిల్ కోర్టు. తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు రాయకుండా చూడాలని కోరారు. ఇప్పటివరకు మీడియాలో తన పేరుతో వచ్చిన ఈ కేసుకు సంబంధించిన వార్తలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు బండి సంజయ్. కేంద్రమంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. -
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్
-
బండి భగీరథ్ ముందుస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశాడు. భగీరథ్ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. బండి భగీరథ్ ముందస్తు రక్షణ పిటిషన్పై విచారణ వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. -
బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్
-
పోలీసులకు బండి భగీరథ్ మెయిల్
-
బండి భగీరథ్ కోసం ప్రత్యేక బృందాలతో రాష్ట్రమంతా గాలింపు
-
బండి భగీరథ్ కేసు.. వాట్ వాట్ నెక్స్ట్?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో కరీంనగర్, హైదరాబాద్తోపాటు రాష్ట్రమంతా గాలిస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఠాణాలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భగీరథ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. లుక్ ఔట్ నోటీసులు (ఎల్ఓసీ) జారీ చేసే విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పట్నుంచీ నిందితుడు పరారీలోనే ఉన్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే భగీరథ్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ పిటిషన్పై విచారణ జరగనుంది.ఫోరెన్సిక్ ల్యాబ్కు బాధితురాలి ఫోన్ బాధితురాలైన మైనర్ బాలిక సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ ఇతరత్రా కీలకాంశాలను తెలుసుకునేందుకు ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. బాలికను ఫామ్ హౌస్ తీసుకెళ్లే ముందు జరిగిన చాటింగ్, లొకేషన్ షేరింగ్, కాల్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ మొత్తం సేకరించనున్నారు. భగీరథ్ పరారీలోనే ఉండటంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతోనే దర్యాప్తును సాగిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిన మొయినాబాద్ ఫామ్హౌస్, పరిసర ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాలను, సెల్ఫోన్ సిగ్నల్స్, లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు విశ్లేషించారు. భగీరథ్తోపాటు పలువురు స్నేహితులు కూడా ఫామ్హౌస్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ స్నేహితులనూ విచారించాలని పోలీసులు నిర్ణయించారు.విచారణకు సహకరిస్తా: బండి భగీరథ్పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఆలస్యంగా సాయంత్రం 6 తర్వాత భగీరథ్ స్పందించారు. ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)కు లేఖను పంపారు. తాను నోటీసును అందుకున్నానని, కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తక్కువ సమయంలో పోలీసులు నోటీసులు ఇవ్వడం, అలాగే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయానని వివరించారు. తనపై, తన కుటుంబంపై వచి్చన ఆరోపణలు తప్పుడువని.. వీటిని నిరూపించేందుకు కీలక పత్రాలు, సమాచారాన్ని సేకరించి పోలీసులకు సమరి్పంచడానికి తనకు కనీసం రెండు రోజుల సమయం కావాలని కోరారు. గడువు ముగిసిన వెంటనే దర్యాప్తు అధికారి ముందు హాజరై పూర్తి వివరాలు అందజేస్తానని పేర్కొన్నారు.పోక్సో కేసును కావాలని బలహీనపరిచారు: బీఆర్ఎస్కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసును పోలీసులు ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారని బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు విమర్శించారు. బాధిత బాలికపై లైంగిక, మానసిక వేధింపులు, డిజిటల్ వేధింపులకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, పేట్ బషీరాబాద్ పోలీసులు నామమాత్ర సెక్షన్లతో కేసు పెట్టడాన్ని వారు ప్రశ్నించారు. పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్లకు బదులుగా సాధారణ సెక్షన్లతో కేసు పెట్టడంతో పాటు కొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చకపోవడాన్ని నిలదీశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుల ఉమ తదితరులు బుధవారం డీజీపీ సీవీ ఆనంద్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కుమారుడిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం, మొబైల్ ఫోన్లు, చాట్లు, వీడియోలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకోకపోవడం తదితరాలు విచారణపై అనుమానాలు పెంచుతున్నాయన్నారు. అలాగే కరీంనగర్లో మంగళవారం జరిగిన హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆరోపించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, సాక్షులకు వెంటనే రక్షణ కలి్పంచాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్తో పాటు కేసులో ఉన్న ఇతరులను అరెస్టు చేయడం, వారిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయడం, సంబంధిత పోలీస్ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టడం సహా మొత్తం ఏడు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీజీపీకి సమర్పించినట్లు మహిళా నేతలు వెల్లడించారు.విదేశాలకు పారిపోకుండా చూడాలి: కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణల నేపథ్యంలో ఆయన విదేశాలకు పారి పోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కుమారుడిపై ఆరోపణలు వచి్చనా, ప్రధానితో వేదికను బండి సంజయ్ పంచుకోవటం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు మరో సారి మొండిచెయ్యి చూపించారని చేశారు. తెలంగాణ పర్యటనలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇస్తారని భావించినా, మనకు పొదుపు సూత్రాలు చెప్పి... ఆంధ్రాకు పైసలు ఇచ్చి వెళ్లిపోయారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో రైల్ రోకో చేసిన కేసులో కవిత బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కోర్టు మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేయడంతో వ్యక్తిగతంగా హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ జూలై 17న నిర్వహిస్తామని మేజిస్ట్రేట్ ప్రకటించారు. -
పూర్తి ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ
-
‘‘బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి’’
హైదరాబాద్: బీఆర్ఎస్ మహిళా నేతలు బుధవారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ను కలిశారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డీజీపీకి వినతిపత్రం అందించారు. పోక్సో కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రజలకు పోలీసులపై నమ్మకం, విశ్వాసం ఉండాలంటే.. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: సీపీఎం బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మే 14న రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీపీఎం పిలుపునిస్తుందని ఆయన తెలిపారు. పోక్సో కేసు నమోదైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దారుణమని చెప్పారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ ప్రభావంతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. బండి సంజయ్ తన కుమారుడిని వెంటనే సరెండర్ చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీ వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
సిట్కు బండి భగీరథ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: సిట్కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ లేఖ రాశారు. ఎల్లుండి(శుక్రవారం) విచారణకు హాజరవుతానన్న బండి భగీరథ్.. కీలక ఆధారాలతో వస్తానని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. విచారణకు హాజరై అవసరమైన సమాచారం, పత్రాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. అయితే చాలా తక్కువ సమయం ఇచ్చిన కారణంగా ఇవాళ(మే 13) హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు...వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా విచారణకు రావడం సాధ్యం కాదన్న భగీరథ్.. అవసరమైన డాక్యుమెంట్లు, వివరాలు సేకరించడానికి రెండు రోజుల గడువు ఇవ్వాలని పోలీసులను కోరారు. తనపై, తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు తప్పుడువంటూ లేఖలో భగీరథ్ ప్రస్తావించారు. నిష్పాక్షిక దర్యాప్తు కోసం రెండు రోజుల సమయం మంజూరు చేయాలంటూ సిట్కు విజ్ఞప్తి చేశారు.కాగా, ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో కేసు విచారణకు ఇవాళ బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. ఈ కేసులో నిందితుడైన బండి భగీరథ ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎల్లుండి హాజరవుతానంటూ సిట్కు భగీరథ్ లేఖ రాశారుకుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్కు తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. -
బండి భగీరథ్ ఎక్కడ? పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్
-
పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్..
-
పోక్సో కేసు.. సిట్ విచారణకు బండి భగీరథ్ డుమ్మా
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసు విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ గైర్హాజరయ్యాడు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ బుధవారం మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరీంనగర్లో బండి సాయి భగీరథ మేన మామ డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణకు మంగళవారం పేట పేట్బషీరా బాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన భగీరథ్ హాజరు కాలేదు. దీంతో బండి భగీరథ్ చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందిపోక్సోకేసు విచారణకు హాజరు కాకపోతే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS, 2023) చట్టాల ప్రకారం, పోక్సో కేసులో సిట్ విచారణకు హాజరు కాకపోతే నిందితులెవరైనా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో అరెస్టు వారెంట్ జారీ చేయడం, మధ్యంతర బెయిల్ రద్దు కావడం, పరారీలో ఉన్నవాడిగా గుర్తించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం, కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. సిట్ విచారణకు హాజరు కాకపోతే మరిన్ని చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుత్బుల్లాపూర్ లోని సుచిత్రలో నివసించే 17 ఏళ్ల బాలికపై భగీరథ అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేశాడని ఈనెల 8న ఆ బాలిక కుటుంబసభ్యులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు నమోదైన నాటి నుంచి నిందితుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడు.బండి భగీరథపై అదనపు సెక్షన్లు నమోదు..కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణాధికారిగా సిట్ ఏర్పాటు చేశారు. బండి భగీరథపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్యువల్ అఫెన్సెస్ (పోక్సో)లోని సెక్షన్ 11 ఆర్/డబ్ల్యూ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లను పరిశీలించిన డీసీపీ రితిరాజ్ మంగళవారం బాధితురాలిని మరోసారి విచారించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడు భగీరథపై అదనపు సెక్షన్లను జోడించారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసిన లైంగిక చర్యలకు సంబంధించిన సెక్షన్లను సూచించే పోక్సో-2012 చట్టంలోని సెక్షన్ 5(ఐ)ను జోడించారు. -
మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు
-
బండి భగీరథ్ కేసుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్షన్
-
బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సిట్ బృందం బండి భగీరథ్కు నోటీసులు జారీ చేసింది. పోక్సో కేసులో నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో రేపు మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరు కావాలని సూచించింది.భగీరథ్ను వెంట తీసుకుని రావాలని కరీంనగర్లో నివసించే అతని మేనమామ వంశీ కృష్ణకు పోలీసులు నోటీసులు పంపించారు. మరోవైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి విచారణకు రానుట్లు తెలుస్తోంది. భగీరథ్.. తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోమవారం (మే11,2026)న భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు మెమో జారీ చేసింది. ‘‘సైబరాబాద్ కూకట్పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ పెట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 684/2026లో బీఎన్ఎస్ 74, 75 సెక్షన్లు, పోక్సో 12 సెక్షన్ కింద నమోదైన కేసు దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాం.దర్యాప్తు సరైన, నిష్పాక్షిక, వృత్తిపరమైన విధానంలో సాగేటట్లు చూసి, కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి తప్పుదారి పట్టింపు లేకుండా పరిశీలించాల్సిందిగా ఆమెకు ఆదేశాలు ఇచ్చాం. దర్యాప్తు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతిరోజూ దర్యాప్తు నివేదికపై సంతకం చేసిన అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి’’ అని పేర్కొంది. -
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు మే 14న విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇక ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం భగీరథ్ను స్వయంగా విచారణ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. పోక్సో కేసు నమోదు, సిట్ ఏర్పాటు పరిణామాల నడుమ భగీరథ్ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పేట్ బషీరా బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసు దర్యాప్తును ప్రత్యేక బృందానికి అప్పగించారు. కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఈ టీమ్ను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. రమేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు శుక్రవార రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్కు తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. కాగా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగుతుందని, ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని సైబరాబాద్ సీపీ ప్రకటించారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది.బండి భగీరథ పరారీలో ఉన్నట్లు కేసు విచారణాధికారి,డీసీపీ రీతిరాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. మూడు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉందని చెప్పారు. అతని ఆచూకీ కోసం గాలి స్తున్నామని, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) పరిశీలిస్తుస్తున్నామని వెల్లడిం చారు. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, మరిన్ని వివరాల కోసం ఇం కోసారి ప్రశ్నిస్తామని వివరించారు. -
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్టు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది. మైనర్ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె. -
బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి
● బీఆర్ఎస్ మహిళా విభాగం నిరసనగచ్చిబౌలి: బండిభగీరథ్ను వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తుల ఉమా డిమాండ్ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ముందు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర హోంశాఖా సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఎప్పుడూ ధర్మరక్షణ, దేశ రక్షణపై చాలా మాట్లాడతారని.. అతని కుమారుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని, మా బిడ్డను రక్షించాలని కోరిన ఆ తండ్రికి ఏం న్యాయం చేస్తారన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ బేటీ బచావో, బేటీపడావో అని చెబుతుంటారని ఇప్పుడు ఇలాంటి నేరానికి పాల్పిడిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ? చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు. నేరం చేసిన వ్యక్తిని కాపాడుతున్న బండి సంజయ్, సీఎం రేవంత్రెడ్డి నేరస్తులేనని విమర్శించారు. బీఆర్ఎస్ శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు కొమిరిశెట్టిసాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ మహిళా ఐపీఎస్తో విచారణ
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు వ్యవహారంపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సోమవారం ఉదయం సమీక్షించానని, ఈ కేసు సున్నితమైనందున మహిళా ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. సోమవారం మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన ఈ విషయం ప్రస్తావించారు. ఈనెల 8వ తేదీన మైనర్ బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని, అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా 9, 10 తేదీల్లో దాదాపు 10 వేల మంది పోలీసు యంత్రాంగం బందోబస్తు విధుల్లో నిమగ్నమైందని సీఎం తెలిపారు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేయడానికి ముందే.. బండి సంజయ్ కుమారుడు కరీంనగర్లో వాళ్లపై వేరే ఫిర్యాదు చేశారని అన్నారు. సోమవారం ఉదయమే ఈ కేసులో విచారణ ప్రారంభమైందన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద ఏవీ జరగవని, వారు పనిలేకుండా ఉన్నంత మాత్రాన ఎవరూ పనిలేకుండా ఉన్నారను కోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తాను మాజీ పోలీసు అధికారినన్న విషయం మరిచిపోవద్దని సూచించారు. బాధితులను కలిసి స్టేట్మెంట్ తీసుకుని చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని, దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని చెప్పారు. కేటీఆర్ బావమరిది ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ జరిగితే కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైనర్ బాలికకు సంబంధించిన అంశంలో అంతా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ కమిషనర్కు ఇవ్వొచ్చని సూచించారు. -
బండి సంజయ్ రాజీనామా చేయాల్సిందే
జనగామ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలను బీజేపీ నిర్లక్ష్యంగా తీసుకోవడం ఆందోళనకరమని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మినారాయణనాయక్ అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు..బండి సంజయ్కి నీతి, నిజాయితీ, ఉంటే ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. మైనర్ను ఫాంహౌస్కు రప్పించి, కూల్డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి భగీరథ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు చిన్నవేమీ కావన్నారు. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ బీజేపీ నేతలు నిశ్శబ్దం పాటించడం మహిళల భద్రతపై వారి అసలు వైఖరి బయటపడుతుందని విమర్శించారు. సమావేశంలో మాజీ మున్సిపల్, మార్కెట్ చైర్మన్లు వేమెళ్ల సత్యనా రాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్ తదితరులు ఉన్నారు.డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి -
‘బండి సంజయ్ను మంత్రివర్గం నుంచి తొలగించాలి’
నారాయణపేట: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని.. అధికారం న్యాయానికి అడ్డుకాకూడదని వెంటనే భగీరథ్ను అరెస్టు చేయడంతో పాటు కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన సాయి భగీరథ్ను అరెస్టు చేయడంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎందుకు వెనకడగు వేస్తోందని ప్రశ్నించారు. అసలు నిందితుడు దేశంలో ఉన్నాడా లేక దాటించాలనుకుంటారా అనే సందేహాలు నెలకొంటున్నాయన్నారు. 8వ తేదీన ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో 3 రోజుల తర్వాత పోక్సో కేసు నమోదు చేయడంపై పలు అనూమానాలకు తావిస్తోందని తెలిపారు. బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ స్వయంగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి పరిధిలోనే హోంశాఖ ఉందని.. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా డీఐజీతో విచారణ జరిపించి బాధిత బాలికకు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కొత్తపార్టీ పెట్టిన ఓ మహిళ అధినేత రాష్ట్రంలో ప్రజలందరికి తాను అమ్మాలాంటి దానినని బహిరంగా సభలో చెప్పిందని.. మరి ఈరోజు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే మహిళలతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్సాగర్, సుదర్శన్రెడ్డి, బుల్లెట్ రాజు, కౌన్సిలర్ భరత్ పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్లో జిల్లా విద్యార్థుల ప్రతిభనారాయణపేట ఎడ్యుకేషన్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్లోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 9, 10న జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి కిక్బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి పోలేపల్లి నవీన్కుమార్ తెలిపారు. 42 పాయింట్ ఫైట్ క్యాడెట్ విభాగంలో నర్వ మండలానికి చెందిన ఆర్య విశ్వకరణ్ కాంస్యం, 67 కిక్ సీనియర్ పురుషుల విభాగంలో నారాయణపేటకు చెందిన కగడ సోనల్ రజతం, అదేవిధంగా 67 కిక్ సీనియర్ విభాగంలో దామరగిద్ద మండలానికి చెందిన సాయిరాం రాథోడ్ కాంస్య పతకం సాధించినట్లు వివరించారు. -
బండి సంజయ్ కుమారుడి కేసు.. నీరుగారే ప్రయత్నం జరుగుతోందా?
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు నీరుగారే ప్రయత్నం జరుగుతోందా? విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయడం కేసును నీరుగార్చడమేనా? అంటే అవునని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.బండి భగీరథ్ కేసుపై హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యానిస్తూ..‘సిట్ అంటేనే కేసును నీరుగార్చడం’ అని అన్నారు. బండి భగీరథ్ వ్యవహారంలో కేసు పెట్టి నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 10 సిట్లు ఏర్పాటు చేశారని, కానీ ఏ సిట్ కూడా ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు. సిట్ వేసి లీకులు ఇవ్వడం రేవంత్కు అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు. -
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కొలేక నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.నేను పార్టీ తలవంచే పనిని నేను చేయను.చేతకాని దద్దమ్మలు నన్ను ఇబ్బంది పెట్టలేరు. నేను భయపడటానికి ఫామ్ హౌస్లో ఎలుకని కాదు. సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చాను’ అని వ్యాఖ్యానించారు. -
కుమారుడిపై ఆ కేసు.. బండి సంజయ్ రియాక్షన్
సాక్షి, కరీంనగర్: తన తనయుడిపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఇటీవల నిరాధారమైన ఆరోపణల దృష్ట్యా.. నా ప్రజా జీవితమంతటా నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవించానని, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నానని తెలియజేయాలనుకుంటున్నాను. నేను ఎలాంటి మచ్చ లేకుండా జీవించాను. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగడం అనేది.. నాతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతను మాత్రమే ప్రతిబింబిస్తుంది. క్షేత్రస్థాయి నుండి వచ్చి, కార్పొరేటర్గా పనిచేసి, కఠోర శ్రమ, ప్రజా మద్దతుతో అంచెలంచెలుగా కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి...రేపు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ముందు.. నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయడానికి ఉద్దేశించిన రాజకీయ కుట్ర ఇది అని స్పష్టమవుతోంది. ఏది సరైనదో, ఏది తప్పో న్యాయవ్యవస్థే నిర్ణయిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. కాలమే ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతుంది. ప్రతి కుట్రను బయటపెడుతుంది. సత్యమేవ జయతే’’ అంటూ ఆయన ఎక్స్లో పేర్కొన్నారు.నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటననాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను.నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 9, 2026కాగా, కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో ఉండే ఓ బాలిక (17) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి ఫిర్యాదురాగా పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ (24) డిసెంబర్ 31న మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో స్నేహం పేరిట తిరుగుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే రోజు రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ప్రధాన ఆరోపణ. భగీరథపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 74, 75తోపాటు సెక్షన్ 11 రెడ్విత్ 12 పోక్సో చట్టం కింద నమోదు చేశారు. భగీరథపై గతంలో బహదూర్పల్లిలో ఉన్న కళాశాలలో ర్యాగింగ్తోపాటు డ్రగ్స్ విషయంపై ఫిర్యాదులు రాగా దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ప్రధాని మోదీ నగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదుకావడం చర్చనీయాంశమైంది.


