breaking news
Bapatla District Latest News
-
లిఫ్టులో ఇరుక్కున్న ప్రయాణికులు
దాచేపల్లి: నడికుడి రైల్వే జంక్షన్లో ఉన్న లిఫ్ట్లో ప్రయాణికులు గురువారం ఇరుక్కుపోయారు. నడికుడి రైల్వేస్టేషన్ నుంచి గుంటూరు వెళ్లేందుకు ప్రయాణికులు నడికుడి రైల్వేస్టేషన్కి చేరుకున్నారు. ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం నుంచి రెండో నెంబర్ ప్లాట్ ఫారం పైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా ఆకస్మాత్తుగా లిఫ్టు మధ్యలో ఆగిపోయింది. దీంతో లిఫ్ట్లో ప్రయాణికులు ఇరుక్కుపోయి తీవ్ర భయాందోళన చెందారు. ఈ విషయం అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు గమనించి రైల్వేస్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్లోకి వచ్చి ఆగింది. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు ఈ రైలులోనే వెళ్లాల్సి ఉంది. రైల్వే సిబ్బంది అతి కష్టం మీద లిఫ్ట్ ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వీరిని బయటకు తీసేంతవరకు జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలుని స్టేషన్లోనే ఆపేశారు. సుమారు పది నిమిషాలపాటు రైలు ఆగింది. తర్వాత లిఫ్ట్లో ఇరుక్కున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి వెళ్లారు. ఇటీవల కాలంలో నడికుడిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్లు తరచూ ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. -
‘డీఈఓ పూల్’ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 నియామకాల కంటే ముందుగానే డీఈఓ పూల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు పేర్కొన్నారు. గురువారం జిల్లాకోర్టు ఎదుట ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా శాఖ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బసవ లింగారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1236 మంది డీఈఓ పూల్లో ఉన్నారని, 2016లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నిలకడగా ఏ ఒక్క పాఠశాలలో పనిచేయలేక పోయారన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 మందికి పైగా ఉన్నారని తెలిపారు. వీరికి ఉద్యోగోన్నతి కల్పించకుండా డీఎస్సీ నియామకాలు ద్వారా కేడర్లో జూనియర్లుగా మిగిలిపోతారన్నారు. న్యాయపరమైన అంశాలతో వీరికి ఉద్యోగోన్నతులు అడ్డుకోవడం సరికాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ అర్హత గల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పీఈటీ ఉద్యోగోన్నతుల్లో అన్యాయం జరిగిందని తెలిపారు. డీఎస్సీ మాదిరిగానే జూనియర్ కాలేజీ, డైట్లలో నియామకాలు చేపట్టాలని కోరారు. ప్లస్ 2 పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు సబ్జెక్ట్ టీచర్స్ కొరతో ఇబ్బంది పడుతున్నారని, ఖాళీలను అర్హత గల స్కూల్ అసిస్టెంట్స్ తో భర్తీ చేసి విద్యా ప్రమాణాలు కాపాడలన్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ దసరా పండుగకు పెండింగ్ నాలుగు డీఏ లలో ఒక్క డీఏ ఐనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు గత 15 నెలల నుంచి ఒక్క బకాయి విడుదల కాలేదన్నారు. సమావేశంలో జిల్లా శాఖ నాయకులు పి.లక్ష్మినారాయణ, జి.దాస్, ముని నాయక్, టి.రామారావు, పి.వేణుగోపాలరావు, కిరణ్, శివరామ కృష్ణ, మూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంలో రైతులు భాగస్వాములు కావాలి
నరసరావుపేటరూరల్: ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క రైతు భాగస్వామి కావాలని ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. బృందావనంలోని ప్రకృతి వ్యవసాయం జిల్లా కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అమలకమారి మాట్లాడుతూ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా ముందుకు వెళ్తుందని తెలిపారు. 2025–26 సంవత్సరంలో జిల్లాలో 82,619 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటల సాగు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. రైతులు రసాయనాలు విడిచి కషాయాలు వాడటం వలన భూమి ఆరోగ్యంగా ఉంటుందన్నారు. పంట ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఉండటంతోపాటు రైతులకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. -
నేడు ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్
బాపట్ల: జిల్లాలోని ఎస్టీల సమస్యలపై ప్రతి నెలలో నాలుగో శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.అందులో భాగంగా ఉదయం 10.30గంటల నుంచి కలెక్టరేట్ సముదాయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్టీలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఏఎంఆర్ కంటైనర్ ధ్వంసం బల్లికురవ: గ్రానైట్, మెటల్, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ఏఎంఆర్ కంటైనర్ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం పగులగొట్టి ధ్వంసం చేశారు. అక్టోబర్ 1 నుంచి అక్రమ రవాణాకు అడ్డుకట్టతో సీనరేజ్ వసూలు బాధ్యతలను ప్రభుత్వం ఏఎంఆర్ సంస్థకు కట్టబెట్టింది. ఇందుకోసం ఆ సంస్థ నెలకు రూ.47 కోట్లు రాయల్టీ రూపంలో చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. బల్లికురవ, సంతమాగులూరు, అద్దంకి మండలాల లోని ప్రధాన గ్రామాల్లో కంటైనర్లను తెచ్చి ఇప్పటికే అమర్చారు. అక్రమ రవాణాతో కోట్ల రూపాయలు వెనకేసుకున్న వారంతా కంటైనర్ల ఏర్పాటుతో హడలెతుత్తుతున్నారు. ధర్మవరం కొండ సమీపంలో ఏర్పాటు చేసిన కంటైనర్ను ధ్వంసం చేశారు.జీఎస్టీ రేట్ల తగ్గింపుపై అవగాహన పెంచాలిబాపట్ల: జీఎస్టీ రేట్ల తగ్గింపుపై వ్యాపారస్తులు ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించాలని తూనికలు కొలతల శాఖ రీజినల్ ఆఫీసర్ ఐజాక్ పేర్కొన్నారు. బాపట్ల రిటైల్ కిరణా అండ్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో గురువారం వ్యాపారస్తులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0లో భాగంగా మార్పులు చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో బాపట్ల జిల్లా అధికారి లిల్లీ, ఇన్స్పెక్టర్ రామదాసు పాల్గొన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటుబాపట్ల టౌన్: భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనటానికి జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఏదైనా సహాయం అవసరమైతే తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 112 (లేదా) 8333813228కి ఫోన్ చేయాలని సూచించారు. ఇప్పటికే 26 పునరావాస కేంద్రాలను కొల్లూరు, రేపల్లె, భట్టిప్రోలు మండలాల్లో ఏర్పాటు చేశారని వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు వాటిల్లో రక్షణ పొందాలని ఆయన సూచించారు.రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ‘ఈ – లాటరీ‘తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీసీఆర్డీఏ పరిధిలో భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం (ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపునకు ఈ – లాటరీ నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి లాటరీ తీయనున్నట్లు పేర్కొన్నారు. 56 మంది రైతులకు 104 ప్లాట్లను ఆన్న్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా కేటాయిస్తామని వెల్లడించారు. వీటిలో 43 రెసిడెన్షియల్, 41 కమర్షియల్, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు ఉన్నట్లు వివరించారు. ఈ– లాటరీ కార్యక్రమానికి రైతులు హాజరు కావాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు. -
మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి
చినగంజాం: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వంద మంది తెలుగు మహనీయుల విగ్రహాలతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహా నిర్మాణం చేయాలని ఊరూర జన విజ్ఞానం రాష్ట్ర అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నవ్యాంధ్ర రాష్ట్ర సాంస్కృతిక చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా కడవకుదురులో నవ్యాంధ్ర సాంస్కృతిక కళాయాత్ర నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు విజ్ఞప్తులపై స్థానిక ప్రజా చైతన్య కళావేదిక సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి ఇనేళ్లయినా సరైన అభివృద్ధి జరగలేదన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఆహ్వాన కమిటీలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే ఐదు విజ్ఞప్తులపై కార్యక్రమంలో వివరించారు. ఆరిగ వెంకట్రావు, కాళిదాస్, పల్లపోలు నాగమనోహర లోహియా, సుంకర కోటేశ్వరరావు, వారు ముసలారెడ్డి, దైవాల తిరుపతిరెడ్డి, ఎం. గోపాల్, ఏడుకొండలు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరులో 21 వాటర్ ప్లాంట్లు సీజ్
నెహ్రూనగర్: నగరంలో కలుషిత తాగు నీటిని సరఫరా చేస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న 21 మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రజారోగ్యం దృష్ట్యా వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు సీజ్ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలియజేశారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో కలుషిత తాగు నీటి వలన డయేరియా కేసులు నమోదవుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో ఉన్న 120 మినరల్ వాటర్ ప్లాంట్లు సరఫరా చేసే తాగు నీటి శాంపిల్స్ను మంగళగిరిలోని ఐపీఎం పీహెచ్ ల్యాబ్, గుంటూరు మెడికల్ కాలేజీ ఆవరణలోని రీజినల్ పీహెట్ ల్యాబరేటరీలో పరీక్షించగా అందులో 21 ప్లాంట్ల నుంచి విక్రయించే నీటిలో హానికారక బ్యాక్టీరియాను గుర్తించడం జరిగిందన్నారు. సదరు ల్యాబ్ రిపోర్టులను నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపామని, ప్రభుత్వం తక్షణమే ప్రజారోగ్యానికి భంగం కలిగించే హానికారిక బ్యాక్టీరియాలను కలిగియున్న నీటిని విక్రయిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లను వెంటనే సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిందన్నారు. సీజ్ చేసిన ప్లాంట్లు ఇవీ.. నగరంలోని ఐపీడీ కాలనీలోని పెరల్స్ ఎంటర్ ప్రైజేస్, నల్లచెరువులోని నీల్ డ్రాప్, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డులోని మై ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, చరణ్ వాటర్ ప్లాంట్, రెడ్ల బజార్లోని కేపీ రావు ప్లాంట్, అంబేడ్కర్ నగర్లోని జేఎస్ వాటర్ ప్లాంట్, పాత గుంటూరు బాలాజీనగర్లోని ఏకా వారి వీధి వాటర్ ప్లాంట్, మల్లిఖార్జున పేటలోని గురుశ్రీ మినరల్ వాటర్ ప్లాంట్, ఏటీ అగ్రహారంలోని బాషా కూల్డ్రింక్, శివనగారాజు కాలనీలోని వాసవి వాటర్ ప్లాంట్, నెహ్రూనగర్లోని ఆర్కే వాటర్ ప్లాంట్, నగరాలలోని స్వాతి ఫుడ్ అండ్ వాటర్ ప్లాంట్, స్థంభాలగరువులోని ఎలైన్ ఫ్రెష్ వాటర్, మద్దిరాల కాలనీలోని పరమేష్ హోల్ సేల్, సంపత్ నగర్లోని నరేష్ షాప్, కోబాల్ట్ పేటలోని ఉమర్ బాషా ఫ్లేవర్డ్ వాటర్, పలకలూరులోని ఎన్టీఆర్ సుజల ప్లాంట్, హిమని నగర్లోని సరస్వతి కృష్ణ స్టోర్, బుడంపాడులోని స్టెయిన్ లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంక్, ఏటుకూరులోని మేఘన షాప్, లాలుపురం రోడ్డులోని 76వ సచివాలయం దగ్గరలోని ప్లాంట్లను నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు సీజ్ చేశారు. -
జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
బాపట్ల: స్వచ్ఛతా ిహీ సేవల్లో బాపట్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. 461 గ్రామాల్లో మురికి కూపాలుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయాలని ఆదేశించారు. జిల్లాకు 342 సామాజిక మరుగుదొడ్లు మంజూరు కాగా, నేటి వరకు 223 మొదలు పెట్టకపోవడం ఏమిటని ఆరా తీశారు. ముఖ్యంగా పురపాలక సంఘాలలోని ప్రధాన కాల్వలన్నిటీలో పూడికతీత పనులు చేపట్టాలని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని తాగునీటి చెరువులని క్లోరినేషన్ చేయాలన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ వారంలో మూడు రోజులు సంబంధిత గ్రామాల్లో క్షేత్ర పరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఇంచార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, ఆయా శాఖల జిల్లా అధికారులు, డీపీఓ ప్రభాకర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పాల్గొన్నారు. చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు చీరాల టౌన్: పర్యావరణ పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చీరాల మున్సిపాలిటీలో అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నుంచి పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు ప్రకటించారు. గురువారం తన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, చీరాల తహసీల్దార్ సమక్షంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 నుంచి మున్సిపల్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పాటుగా కవర్లు వినియోగం, అమ్మకం, నిల్వలు, తయారీ, పంపిణీలను పూర్తిగా నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడకం, అమ్మకాలు, పంపిణీ చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులంతా ఆదేశాలను తప్పక పాటించాలని ఆయన ఆదేశించారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చీరాల మున్సిపాలిటీలో గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యజమానులు వాటిని పబ్లిక్ స్థలాల్లో వదలకూడదని చెప్పారు. గోవుల సమస్యలను పరిష్కరించేందుకు వాటికి పునరావాసంతో పాటు గుర్తింపు కూడా చేస్తున్నామని వివరించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో గోవులను సంరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ పాల్గొన్నారు. -
ఖాతాదారులకు బురిడీ
బాపట్ల టౌన్: బాపట్ల పట్టణంలోని ఏజీ కళాశాల రోడ్డులో ఏర్పాటు చేసిన హెచ్ఎంఎఫ్ఎల్ (హిందూస్థాన్ మైక్రోఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెట్) పరిధిలో బాపట్ల జిల్లాలోని సుమారు 350 మందికిపైగా ఖాతాదారులు వివిధ రూపాలలో రూ. కోట్లలో రుణాలు తీసుకున్నట్లు సమాచారం. విడతలవారీగా ఈఎంఐలు చెల్లించినప్పటికీ అవి సంస్థ ఖాతాలో జమ చేయటం లేదనే ఆరోపణలు వచ్చాయి. ఖాతాదారులు వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగి తమ అకౌంట్లకు సంబంధించిన స్టేట్మెంట్లు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో తిరుగు పయనమవుతున్నారు. ఉన్నతాధికారులను కలిసినా ఫలితం శూన్యం ఈఎంఐలు చెల్లించినప్పటికీ తమ అప్పు యథావిధిగా ఉందనే విషయం తెలుసుకున్న ఖాతాదారులు సదరు మేనేజర్ తీరుపై విజయవాడ రీజినల్ మేనేజరు షేక్ సైదులుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆడిటర్ సమక్షంలో బాపట్ల బ్రాంచ్ను సందర్శించి సదరు మేనేజర్ తీరుపై ఆయన విచారించారు. వారి విచారణలో ఈ ఏడాది ఆగస్టు 31న జమ చేయాల్సిన రూ. 5,06,384, సెప్టెంబర్ 20లోపు జమ చేయాల్సిన రూ. 5,22,212లు జమ చేయలేదని తేలినట్లు సమాచారం. రూ.2.23 లక్షలు చెల్లించినా రూ.40,400కే రసీదులు కర్లపాలెం మండలంలోని గణపవరం పంచాయతీ కేసరపూడి కాలనీకి చెందిన తాడిశెట్టి లక్ష్మితిరుపతమ్మ గ్రామంలో రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. అప్పట్లో రూ. 7 లక్షల అప్పు అయ్యింది. దానిని తీర్చేందుకు ఇంటిని హెచ్ఎంఎఫ్ఎల్లో తనఖా పెట్టి రూ. 7.50 లక్షల రుణం తీసుకున్నారు. నెలకు రూ. 20,200 చొప్పున చెల్లించారు. ఇప్పటివరకు 11 నెలలకు రూ. 2.23 లక్షలు చెల్లించినా కేవలం రూ. 40,400 చెల్లించినట్లు రసీదులు ఇచ్చారని ఆమె వాపోయారు. ఇదేమని సిబ్బంది రామకృష్ణ, నూరేళ్ళను అడిగితే తమ మేనేజర్ రాజశేఖర్ జమ చేయడం లేదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. గురువారం మేనేజర్పై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
● భక్తుల పాలిట కల్పవల్లి కాత్యాయని దేవి
జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్య్రుత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గురువారం పలు ఆలయాల్లో కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమించారు. భక్తులు పెద్దఎత్తున దర్శించుకుని పూజలు నిర్వహించారు. కాత్యాయని దేవిని పూజిస్తే చదుర్విద పురుషార్థాలు సిద్ధిస్తాయని, రోగాల భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖఃసంతోషాలు వర్ధిల్లుతాయని భక్తుల నమ్మకం. – సాక్షి, నెట్వర్క్ పెదపులిపర్రులో ప్రత్యేక అలంకరణలో గోగులాంబ అమ్మవారుఅన్నపూర్ణాదేవిగా జిల్లేళ్లమూడి అమ్మ బాపట్ల రాజీవ్గాంధీ కాలనీలో శ్రీ కాత్యాయని దేవిగా.. చందోలులో నృసింహ, వారాహి అవతారంలో బగళాముఖి అమ్మవారు -
సమర్థంగా ప్రభుత్వ పథకాల అమలు
అధికారులకు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశం బాపట్ల: జిల్లాలో సూపర్ సిక్స్ పథకాలను సమర్థంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం పథకాల అమలుపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరువు చేయడానికి కృషి చేయాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ, ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాలను అర్హులందరికీ అందజేయాలని చెప్పారు. జిల్లాలో సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, డిపోల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా మరుగు దొడ్లు నిర్మించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆ శాఖ అధికారులకు చెప్పారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం రుచిగా, సుచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని హాస్టళ్లలో మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఆయన చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ లవన్న, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం పాల్గొన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్య సమాజం చీరాల అర్బన్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. గురువారం చీరాల పట్టణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు కలెక్టర్ అధికారులతో కలిసి చీపురు చేతపట్టి, రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారు స్వయంగా చీపుర్లు చేత పట్టాలన్నారు. పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా పరిశుభ్రత ప్రాధాన్యాన్ని ఇతరులకు తెలియచెప్పే ప్రయత్నం చేయాలని తెలిపారు. రోడ్లుపై చెత్తను నిల్వ ఉంచకుండా షాపుల నిర్వాహకులు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చెత్త పేరుకుపోవడం వల్ల నీరు నిలిచి దోమల వ్యాప్తి చెంది, విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛ బాపట్ల.. స్వచ్ఛ చీరాలలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పారు. బాపట్ల జిల్లాలో త్వరలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించనున్నామని వెల్లడించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, ప్రజలు కూడా వినియోగాన్ని తగ్గించి వస్త్రాలతో తయారు చేసిన సంచులను వాడాలని ఆయన సూచించారు. చీరాల మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, వినియోగిస్తే జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ, మున్సిపల్ చైర్మన్ ఎం. సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల: జిల్లాలోని రైతులందరికీ వారి అవసరాల మేరకు యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ చేస్తున్నారని కలెక్టర్ వి.వినోద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని 26 రైతు భరోసా కేంద్రాలు, పరపతి సంఘాల ద్వారా 318 మెట్రిక్ టన్నుల యూరియాను 3,452 మంది రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా 112 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని కలెక్టర్ తెలిపారు. -
గతాన్ని మరిచిన బాలకృష్ణ
తాడికొండ: మెంటల్ సర్టిఫికెట్తో హత్యకేసు నుంచి బయటపడిన బాలకృష్ణ గతాన్ని మరిచి మాట్లాడటం దుర్మార్గమని, ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని మాజీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. బెల్లంకొండ సురేష్పై బాలకృష్ణ ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నాడు దిగంవత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేకపోతే నీ గతి ఏమై ఉండేదో ఆలోచించుకోవాలని, అప్పుడే నువ్వు జైలు పాలు అయ్యేవాడివనే గతాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదన్నారు. అప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాళ్లు పట్టుకొనే నువ్వు కేసు నుంచి తప్పించుకున్నావని గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదని, కక్షపూరిత రాజకీయాలు, అబద్ధపు హామీలు, మాటలు వైఎస్సార్ కుటుంబానికి లేవు, రావనే నిజం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని బాలకృష్ణ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. గతాన్ని మర్చిపోయి బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై సినీనటుడు చిరంజీవి సైతం హుందాగా స్పందించారని, ప్రజా ప్రతినిధిగా ఉన్న బాలకృష్ణ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకొని క్షమాపణ చెపితే మంచిదని లేదంటే నీకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తులు అసెంబ్లీకి అనర్హులని, బాలకృష్ణ ముందు ఆ సంగతి తేల్చుకొని చట్టసభల్లో మాట్లాడాలని హెచ్చరించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ -
ఎన్ఎంఎంఎస్ నమోదుకు 30 తుది గడువు
డీఈఓ చంద్రకళ నరసరావుపేట ఈస్ట్: నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్షిప్ పరీక్ష రాసేందుకు ఈనెల 30వ తేది వరకు విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష డిసెంబర్ 7వ తేదీన నిర్వహిస్తారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, మండల ప్రాథమికోన్నత, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులని తెలిపారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 ఆన్లైన్ అప్లికేషన్లో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా చెల్లించాలని తెలిపారు. వివరాలకు డీఈఓ కార్యాలయంలో పి.శంకరరాజు (9963192487)ను సంప్రదించాలని సూచించారు. యడ్లపాడు: విద్యార్థులకు చేతిరాతలో ఉచిత శిక్షణ ఇస్తూ తనదైన శైలిలో గుర్తింపు పొందిన కొండవీడు జెడ్పీ హైస్కూల్ ఎస్జీటీ ఉపాధ్యాయుడు డాక్టర్ షేక్ జున్నుసాహెబ్కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో బిర్లా ప్లానెటోరియం వద్ద ఉన్న భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు నేషనల్ టీచర్స్ ఎక్స్లెన్స్ అవార్డు–2025ను ప్రదానం చేశారు. ఒకే నెలలో మూడు అవార్డులు విద్యారంగానికి జున్ను సాహెబ్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ నెలలో ఇది మూడో అవార్డు రావడం విశేషం. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆయనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈనెల 7న విశాఖపట్నంకు చెందిన సెయింట్ మదర్థెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి గురుబ్రహ్మ రాష్ట్రస్థాయి అవార్డు, తాజాగా జాతీయస్థాయి అవార్డు తెలంగాణ రాష్ట్రంలో అందుకున్నారు. -
రసవత్తరంగా జాతీయ చెస్ చాంపియన్ షిప్
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్ బుధవారం నాలుగోరౌండ్ ముగిసే సరికి ముగ్గురు గ్రాండ్మాస్టర్లు, నలుగురు ఇంటర్నేషనల్ మాస్టర్లు చెరో నాలుగు పాయింట్లతో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. టాప్ బోర్డులపై జీఎంలు, ఐఎంల మధ్య ఉత్కంఠభరితంగా పోటీలు జరిగాయి. మాజీ ఆసియా చాంపియన్, రెండో సీడ్ జీఎం సూర్యశేఖర్ గంగూలీ అలాగే భారత 2700 రేటింగ్ దాటిన రెండో ఆటగాడు జీఎం కృష్ణన్ శశికిరణ్లు ప్రతిభ చూపించారు. తమిళనాడు ఆటగాడు ఐఎం మనీష్ ఆంటో క్రిస్టియానోపై పీఎస్పీబీ ఆటగాడు గంగూలీ ఎక్సేంజ్ సాక్రిఫైస్ తర్వాత రూక్ త్యాగంతో ఆధిపత్యం సాధించాడు. ఆంధ్ర ఆటగాడు జీఎం ఎం.ఆర్. లలిత్ బాబు ఫ్రెంచ్ డిఫెన్స్లో స్థిరమైన ఆట ఆడి, అలేఖ్య ముఖర్జీపై విజయం సాధించాడు. మూడో సీడ్ జీఎం ఎస్.పి.సేతురామన్, హరియాణా ఆటగాడు ఐఎం ఆదిత్య దింగ్రా తప్పిదం వల్ల ఓటమి నుంచి తప్పించుకున్నాడు. గేమ్ డ్రాగా ముగిసింది. కేరళ ఐఎం హెచ్.గౌతమ్ కృష్ణ, గుజరాత్ ఆటగాడు ఘాదవి వీరభద్రసింగ్పై అద్భుతంగా ఆడాడు. రూక్ త్యాగం చేసి బ్యాక్ ర్యాంక్ చెక్మేట్తో విజయం సాధించాడు. ఇప్పటివరకు టోర్నమెంట్లో పొడవైన గేమ్ ఆంధ్ర ఆటగాడు ఐఎం ఎస్. రవితేజ (రైల్వేలు), గుజరాత్ ఆటగాడు జిహాన్ తేజస్ షా మధ్య సాగింది. రవితేజ 140 మూవ్ల తర్వాత బిషప్, నైట్ కాంబినేషన్తో చెక్మేట్ చేశాడు. -
ట్యాంకులు ఇలా.. ఆరోగ్యం ఎలా?
నెహ్రూనగర్: గుంటూరు నగరానికి తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నగరంలోని పలు వాటర్ ట్యాంకులకు నీటి సరఫరా అయి అక్కడ నుంచి పైపులు ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా జరుగుతుంది. అయితే నగరంలో ఉన్న పలు వాటర్ ట్యాంకులు శిథిలావస్థకు చేరడంతో పాటు పై కప్పులు ఊడిపోవడంతో అధ్వానంగా మారాయి. వీటి ద్వారానే తాగునీటి సరఫరా జరుగుతుండటంతో నగర వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. శిథిలావస్థలో ఏడు ట్యాంకులు.. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 62 వాటర్ ట్యాంకులు ఉన్నాయి (వీటిల్లో 42 ట్యాంకులు నగర పరిధిలో, మిగిలిన విలీన గ్రామాలకు చెందినవి). అయితే ఈ 42 వాటర్ ట్యాంకుల్లో 7 ప్రాంతాల్లోని 9 వాటర్ ట్యాంకులకు పై కప్పులు ఊడిపోయి అధ్వానంగా మారాయి. బీఆర్ స్టేడియం, నల్లచెరువు, ఏటీ అగ్రహారం, స్థంభాలగరువు, శారదాకాలనీ, వసంతరాయపురం, నెహ్రూనగర్ రిజార్వయర్లలో ఉన్న వాటర్ ట్యాంకులకు ఉన్న పై కప్పులు సక్రమంగా లేకపోవడంతో వాటిలో పక్షుల వ్యర్థాలు పడుతున్నాయి. ఈ నీటినే అధికారులు నగరంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. 2018లో బీఆర్ స్టేడియం పరిధిలోని ఆనంద్పేటలో 30కి మందికిపైగా డయేరియా బారిన పడి మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పుడు హడావుడిగా పాడైపోయిన వాటర్ ట్యాంకులను కవర్ చేస్తూ మరమ్మతులు చేపట్టారు. కాలక్రమేనా అవి కూడా పాడైపోవడంతో వాటిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. తీరా ఇప్పుడు అదే ప్రాంతంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్గా 80 కేసులు.. గుంటూరు నగర పరిధిలో ఇప్పటివరకు 160 మంది జీజీహెచ్లో డయేరియాతో బారిన చికిత్స పొందుతున్నారు. వీరిలో 80 మంది డిశార్జి అవ్వగా..ఇంకా 80 మంది చికిత్స పొందుతున్నారు. అదే విధంగా ఈకోలి బ్యాక్టరీయా కారణంగా కలరా వ్యాప్తి చెంది 3 కేసులు నమోదవగా.. వారు చికిత్స తీసుకుని డిచార్జ్ అయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాస్థాయి అధికారులను ఒక్కో వార్డుకు ఒక్కో అధికారిని నియమించి, వారికి డయేరియాపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు నగరంలో ఉన్న 42 వాటర్ ట్యాంకులను నెలకొక సారి శుభ్రం చేయాల్సి ఉంది. కాఠీ ఇందులో చాలా ట్యాంకులను సకాలంలో శుభ్రం చేయడం లేదని గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి ఇంకా ఈ నెలలో 10 ట్యాంకులను శుభ్రం చేయలేదని వారు చెబుతున్నారు. తాగునీటి సరఫరాపై అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యజఆరించడంపై నగర వాసులు పాలకులు, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గుంటూరు నగరంలో 7 ప్రాంతాల్లో ఉన్న వాటర్ ట్యాంకులు శిథిలావస్థలో పై కప్పులు ఊడిపోయి ఉన్నా యి. 42 వాటర్ ట్యాంకులు నగర పరిధిలో ఉంటే వీటిల్లో 10 ట్యాంకులను ఇంకా శుభ్రం చేయలేదు. డయేరియా ప్రభావిత ప్రాంతాలకు ఆయా పాడైన వాటర్ ట్యాంకుల నుంచే వాటర్ సప్లయి చేస్తే ప్రయోజనం ఏం ఉండదు. తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచితాగునీరు సరఫరా చేయాలి. – నారాయణరెడ్డి, గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
అతివృష్టితో అపర నష్టం!
తాడికొండ: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు కుదేలవుతున్నారు. మబ్బుకు చిల్లుపడిందా అన్న చందంగా ప్రతి రోజు వాన కురుస్తుండటంతో రైతన్నలు పంట పొలాల్లో అడుగు పెట్టేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అరకొరగా సాగుచేసిన అపరాల పంటలు వర్షార్పణం కాగా పత్తి పంట ఎదుగుదల లేక ఎర్రబారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జ్యూట్ పంట పరిస్థితి కూడా ఇదేవిధంగా మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా పొలంలోకి అడుగు పెట్టి అంతర కృషి చేసే పరిస్థితి కూడా లేని కారణంగా పై పాటుగా మందుల పిచికారీ కలుపు ఏరివేత కూడా చేయలేని పరిస్థితితో పొలాలు పిచ్చి కంపల్లా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండె ‘చెరువు’ అయింది! ఈ ఏడాది నెలకొన్న అతివృషి పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు పెట్టుబడుల రూపంలో పెట్టిన సొమ్ము అయినా తిరిగొస్తుందా లేదా అనే బెంగ అన్నదాతల్లో పట్టుకుంది. కొండవీటి వాగు ఉధృతికి తాడికొండ, తుళ్ళూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు గత రెండు నెలలుగా నానుతున్నాయి. పంటనష్టం పరిహారం అంచనాలు రూపొందించి అన్నదాతకు అండగా నిలవాల్సిన వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా యత్నించిన దాఖలాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు యూరియా సరఫరా లేక ప్రభుత్వం చేతులెత్తేయగా.. అధిక ధరలు వెచ్చించి కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టామని, తీరా ఇప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కొండవీటి వాగు ముంపునకు గురైన రైతులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ముగిసిన చేతిరాత శిక్షణ శిబిరం
గుంటూరు రూరల్: అందమైన చేతిరాత అదృష్టమని, అది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మున్నంగి సంజీవరెడ్డి తెలిపారు. శ్రీమతి చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చేతిరాత శిక్షణ శిబిరం బుధవారంతో ముగసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంజీవరెడ్డి మాట్లాడుతూ అందమైన చేతిరాత వలన విద్యార్థులు పరీక్షల్లో అదనంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. జాతీయ అవార్డు గ్రహీత వి.రామమోహనరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది విద్యార్థులు, 15 వేల మంది ఉపాధ్యాయులు చేతిరాతలో శిక్షణ పొందారన్నారు. వీర గంగాధరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చైల్డ్ లైన్ వెల్ఫేర్ బోర్డు రిటైర్డ్ అధికారి ప్రసాదలింగం మాట్లాడుతూ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా శిక్షణ పొందటం అమూల్యమైనదని ప్రశంసించారు. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి, విద్యార్థులకు అందిస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని సత్కరించిన అనంతరం చేతిరాతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు. -
ఇకపై రోబోటిక్ తుంటిమార్పిడి సర్జరీలు
స్ట్రైకర్ సంస్థతో సాయిభాస్కర్ ఆస్పత్రి ఒప్పందం గుంటూరు మెడికల్: ఇప్పటివరకు మోకీలు మార్పిడి సర్జరీలకు మాత్రమే రోబోటిక్ వ్యవస్థను వినియోగిస్తుండగా, ఇకపై తుంటి మార్పిడిలకు కూడా రోబోటిక్ సర్జరీలు చేయనున్నట్లు సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి చెప్పారు. అందుకోసం వరల్డ్ క్లాస్ రోబోటిక్ సంస్థ స్ట్రైకర్తో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలోని తమ ఆస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ తర్వాత తుంటి కీలు అరుగుదలపై తీవ్ర ప్రభావం చూపి, చిన్న వయస్సులోనే తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తుందన్నారు. రోబోటిక్ వ్యవస్థతో రోగికి మరింత మెరుగైన వైద్యసేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఏపీలోనే మొదటిసారిగా తుంటి మార్పిడి ఆపరేషన్లలో మాకొ హిప్ అండ్ నీ రోబోటిక్ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అక్టోబర్ నుంచి తమ ఆస్పత్రిలో రోబోటిక్ తుండి మార్పిడి ఆపరేషన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. -
పొన్నల కాలువపై చప్టా పరిశీలన
కర్లపాలెం: పొన్నల కాలువ చప్టాపై వరద నీరు ఉన్నప్పుడు ప్రజలు రాకపోకలు కొనసాగించవద్దని తహసీల్దార్ షాకీర్ పాషా, ఎంపీడీవో శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. మండల పరిధిలోని తుమ్మలపల్లి, నర్రావారిపాలెం గ్రామాల మధ్యనున్న కాలువను ఎస్ఐ రవీంద్రతో కలసి బుధవారం వారు పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు చప్టా పైకి రావడంతో స్థానికుల సమాచారం మేరకు అధికారులు పరిశీలించారు. చప్టాపైకి వరద నీరు వచ్చినప్పుడు స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండి రాకపోకలను నిలిపివేయాలని చెప్పారు.గాయత్రీ దేవిగా బాలచాముండేశ్వరి దర్శనంఅమరావతి: ప్రముఖ శైవక్షేత్రం అమరావతి బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్య్రుత్సవాలలో భాగంగా బుధవారం బాలచాముండేశ్వరి అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. దసరా వేడుకల్లో మూడో రోజు సహస్ర కుంకుమార్చన, దేవీ ఖడ్గమాల, త్రిశల, లలితా సహస్రనామార్చన, శ్రీ చక్రార్చనతోపాటు గాయత్రీదేవికి సంధ్యా సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్దిని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు.పల్నాడు జిల్లా మత్స్యశాఖ అధికారిగా వెంకట్రావునరసరావుపేటరూరల్: జిల్లా మత్స్యశాఖ అధికారిగా ఐ.వెంకట్రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకట్రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. గతంలో మత్స్యశాఖ జిల్లా అధికారిగా పనిచేసిన సంజీవరావుపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఈనెల 11న అప్పటి జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు వెంకట్రావు అదనపు బాధ్యతలు స్వీకరించారు.శింగరకొండ ఆలయ పాలక మండలి నియామకంఅద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాల మండలిని నియమించారు. అధ్యక్షుడుగా చుండూరి మురళీ సుధాకరరావుతో పాటు సభ్యులుగా ఆకుల కోటేశ్వరరావు, బత్తుల చంద్రశేఖర్, నూతి లక్ష్మీ ప్రసాద్, మందా సునీత, ఏల్చూరి వెంకట నారాయణమ్మ, ధూళిపాళ్ల వెంకటరత్నం, గొర్రెపాటి పద్మజ, హరబోలు నాగమ్మ, దేవరపల్లి సురేష్బాబు, కొనంకి సుబ్బారావు నియమితులయ్యారు. -
సాగర్ కాలువకు గండి
కొల్లూరు: కృష్ణమ్మ ఉగ్రరూపంతో నదీ పరీవాహక లంక గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. వాణిజ్య పంటలు ముంపు బారిన పడుతున్నాయి. బుధవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.44 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయడంతో నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్ని వరద నీరు ముంచెత్తింది. మండలంలోని పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాల చుట్టూ ఇటుకరాయి తయారీకి అవసరమైన మట్టి కోసం తవ్విన భారీ గుంతల్లోకి నీరు చేరింది. చింతర్లంక, గాజుల్లంక, పోతార్లంక, దోనేపూడి కరకట్ట దిగువు ప్రాంతాల్లో వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. పంట భూములలోకి వరద నీరు ప్రవేశించింది. అరటి, కంద, కూరగాయలు, పసుపు, మినుము పంటలు ముంపు బారిన పడ్డాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని దిగువుకు విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంచుమించు ఇంచుమించు 6.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదిలే అవకాశాలున్నట్లు అధికారులు ముందస్తు హెచ్చరికలు చేస్తూ ప్రజలను ఆప్రమత్తం చేశారు. వరద తీవ్రత పెరిగిన పక్షంలో ప్రజలను తరలించడానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు మండలంలో 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతుల గుండెల్లో రైళ్లు భట్టిప్రోలు: కృష్ణమ్మ బిరబిరమంటూ పరవళ్లు తొక్కుకుంటూ ప్రవహిస్తుంటే లంక గ్రామాల రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ఆరేళ్లుగా ఏటా వరదలు పంటల్ని ముంచెత్తుతున్నాయి. బిక్కుబిక్కుమంటూ దేవునిపై భారం వేసి సాగుకు సమాయత్తమవుతున్నారు. వరదల సమయంలో ఓలేరు పల్లెపాలెం పక్కనే ఉన్న రేవులో నీరు పారుతోంది. దీంతో పంట భూములు కోతకు గురవుతున్నాయి. ఏటా భూములు రేవులో కలిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు తెలిపారు. మండలంలో లోతట్టు ప్రాంతాలైన చింతమోటు, పెదలంక, పెసర్లంక, ఓలేరు లంక గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కారంచేడు: మండలంలోని దగ్గుబాడు సమీపంలో సాగర్ కాలువ కట్ట కోతకు గురైంది. గండి పడిన సమయంలో 130 క్యూసెక్కులు నీరు ప్రవహిస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు కూడా వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. కట్టలు పటిష్టంగా లేకపోవడంతో ఈ ప్రమాదం తలెత్తింది. 50 ఎకరాలు మునక కాలువలోని నీరు సుమారు 50 ఎకరాల్లోకి చేరింది. ప్రస్తుతం పంటలు ఇంకా సాగు చేయక పోవడంతో ఇటు అధికారులు, అటు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాలువలను శుభ్రం చేయించి, అవసరమైన మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సాగర్ ఆయకట్టుతో పాటు, కొమ్మమూరు కాలువ ఆయకట్టే ఆధారం. గత ఏడాది సాగర్ కాలువ కట్టల పైన జంగిల్ క్లియరెన్స్ సమయంలో వాటిని పటిష్ట పరచాలని రైతులు డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోలేదు. ప్రమాదం గురించి ఎన్ఎస్పీ జేఈ రాజేష్ను వివరరణ కోరగా, ప్రస్తుతం నీటి ప్రవాహానికి ఓవర్ ఫ్లో అయిందని, దీంతో బలహీనంగా ఉన్న కట్ట కోతకు గురైందని వివరణ ఇచ్చారు. వెంటనే చిమ్మిరిబండ లాకుల వద్ద నీటి ప్రవాహం నిలుపుదల చేశామని తెలిపారు. ప్రవాహం పూర్తిగా తగ్గిన తరువాత తాత్కాలిక మరమ్మతులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వేసవిలో శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు చేస్తామని వివరించారు. -
కనుల పండువగా శరన్నవరాత్రి ఉత్సవాలు
బాపట్ల టౌన్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని జిల్లేళ్లమూడిలో గల అనసూయాదేవి అమ్మవారు బుధవారం గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పట్టణంలోని రాజీవ్గాంధీ కాలనీలో సనాతన హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాత్యాయనిగా బగళాముఖి చందోలు(కర్లపాలెం): భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చందోలు బగళాముఖి అమ్మవారు శరన్నవ రాత్రుల్లో మూడవ రోజు కాత్యాయనీ దేవిగా దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పసుపుకుంకుమలు సమర్పించి పూజలు చేశారు. తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. -
ఆపదలను కొని తెచ్చుకోవద్దు !
కొల్లూరు: కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు వరద ప్రభావాన్ని తక్కువ అంచనా వేసి, ప్రాణాల మీదకు కొని తెచ్చుకోవద్దని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ హెచ్చరించారు. నదికి వరద తీవ్రత పెరిగిన నేపథ్యంలో ముంపు గ్రామాలైన చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, పెసర్లంక గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. వరద తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక రేషన్ దుకాణాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాల తనిఖీ తొలుత కలెక్టర్ కొల్లూరులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. నదికి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. వరద అధికమయ్యే పక్షంలో సురక్షిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రావాలని తెలిపారు. తమ గ్రామాలకు ప్రమాదం ఉండదన్న భరోసా ప్రజలు వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వరద ముప్పును తక్కువ అంచనా వేయడం సమంజసం కాదని సూచించారు. అకస్మాత్తుగా వరద ప్రవాహం అధికమమైతే ముంపు గ్రామాల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, ముందుగానే అప్రమత్తమవ్వాలని ఆయన సూచించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలి వరద ప్రభావానికి గురయ్యే లంక గ్రామాల్లోని ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను తక్షణం అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది అవసరమైన మందులతో అందుబాటులో ఉండాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి వరద బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాల్లో సకల సౌకర్యాల కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో కేంద్రానికి మండలస్థాయి అధికారిని, వారికి మరొక అధికారిని సహాయకులుగా నియమించి వరద బాధితులకు సేవలందించేలా చూడాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో మంచినీరు, కరెంట్, టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. నిర్ణీత వేళల్లో ఆహారం అందించాలని, అందుకు అవసరమైన నిల్వల్ని తక్షణం పునరావాస కేంద్రాలకు చేర్చాలని సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి, తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు, ఆర్సీ ఏఈ విజయరాజు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.లంక గ్రామాల్లో ప్రాణ నష్టం లేకుండా చూడాలి బాపట్ల: కృష్ణా నది వరదల నేపథ్యంలో లంక గ్రామాల్లో మనుష్యులు, పశువులకు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ మత్స్యశాఖ అధికారులకు సూచించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫ్రెన్స్ హాలు నుంచి మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదిలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉందని, ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉందని ఆయన తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో రెండవ ప్రమాద హెచ్చరిక రాబోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. వరద ముంపునకు గురయ్యే కొల్లూరు లాక్ల వద్ద నుంచి ఎనిమిది గ్రామాలు, దోనేపూడి చప్టా నుంచి మూడు గ్రామాలు, వెల్లటూరు నుంచి ఏడు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, భోజన సదుపాయాలు, వైద్య సేవల కోసం 73 బోట్లను అందుబాటులో ఉంచాలని ఆయన మత్స్య శాఖ అధికారులకు సూచించారు. -
ప్రజలకు కట్టుదిట్ట రక్షణ
కొల్లూరు: కృష్ణా నదికి వరద తాకిడి అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలను ఆపద నుంచి రక్షించడానికి కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. మండలంలోని పెసర్లంక అరవిందవారధి వద్ద నదిలో బుధవారం వరద ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద సమయంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ముంపు ప్రాంత ప్రజల్ని కాపాడటానికి పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉందని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరిస్తూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రవాహంలోకి పిల్లలను వెళ్లనివ్వ వద్దని తెలిపారు. వరద ముంపు గ్రామాల ప్రజలు ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. వరద నీరు చేరిన రోడ్లపై రాకపోకలు సాగించ వద్దని, నీటిలో మునిగిన ప్రాంతాల్లో ప్రజల్ని నియంత్రించేందుకు పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆపదలో ఉంటే తక్షణం కంట్రోల్ రూమ్లకు, డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. ఆయన వెంట రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు, వేమూరు సీఐ పి.వి. ఆంజనేయులు, ఎస్బీ సీఐ జి. నారాయణ పాల్గొన్నారు. -
గ్రామాల్లో ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులు
●దాడులకు భయపడేది లేదు ●అధికారంలోకి రాగానే బదులు తీర్చుకుంటాం ●మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పిడుగురాళ్ల: కొంత మంది వ్యక్తులకు డబ్బులు ఇచ్చి గ్రామాల్లో ఫ్యాక్షన్ పెంచాలని టీడీపీ నాయకులు చూస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి విమర్శించారు. ఇటీవల టీడీపీ మూకల దాడిలో గాయపడి పట్టణంలోని పల్నాడు హాస్పటల్లో చికిత్స పొందుతున్న చల్లా అంజిరెడ్డిని మహేష్రెడ్డి, వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్కుమార్లు మంగళవారం పరామర్శించారు. మహేష్రెడ్డి మాట్లాడుతూ జూలకల్లు గ్రామంలో పటిష్టంగా ఉన్న వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలని, అలజడి సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. ఏడాదిన్నరలో అంజిరెడ్డి, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డిలపై దాడులు చేశారని తెలిపారు. నారు తీసుకొని వచ్చేందుకు వెళ్తే దారి కాచి అంజిరెడ్డిపై దాడి చేశారని తెలిపారు. గ్రామంలో కొంతమంది అలగా జనం చేస్తున్నారని, దీనికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని, ప్రభుత్వం మారగానే ఎవరికి సంబంధం ఉందో తెలుస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను నాలుగు, ఐదుసార్లు ఆసుపత్రి చుట్టూ తిప్పుదామని అనుకుంటే రేపు ప్రభుత్వం మారితే 40సార్లు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నేడు 20 ఎకరాలు బీడులుగా పెడితే రేపు 200, 300 ఎకరాలు బీడు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, గ్రామాల్లో మళ్లీ ఫ్యాక్షన్ తెవాలని చూస్తే అది మీ కర్మ అని అన్నారు. పోలీసు ఇప్పటికై నా శాంతియుతంగా ఉండేలా చూడాలని, కొట్టిన వారే గ్రామాల్లో గొడ్డళ్లు పట్టుకొని తిరుగుతున్నారని అన్నారు. దాడులకు భయపడేది లేదని జూలకల్లు గ్రామంలో పార్టీని మరింత పటిష్ట పరుస్తామని కాసు అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి, పట్టణ కన్వీనర్ మాదాల కిరణ్కుమార్, ఎంపీపీ గార్లపాటి వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి, ఎన్డీఎల్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కో ఆర్డినేటర్ మట్టారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికత జోడింపుతో ఉత్తమ ఫలితాలు
పెదకాకాని(ఏఎన్యు): రాష్ట్రంలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో 36వ దక్షిణ మండల జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు, ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి రాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ క్రీడల విధానంలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఆధునిక సాంకేతికతను క్రీడల రంగానికి జోడించడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా పలు అథ్లెటిక్ అసోసియేషన్లు, మల్టీ నేషనల్ కంపెనీలు క్రీడలను ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. తొలుత అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పతాకాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ పతాకాన్ని శాప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. -
వైద్యుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 25వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టరు ఎం.గోపీనాథ్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టరు వి.వినోధ్కుమార్ను, జిల్లా వైద్యాధికారిణి డాక్టరు విజయమ్మను మంగళవారం కలిసి సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశాలల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇన్–సర్వీస్ కోటాను పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలని, గిరిజన ప్రాంతాల్లో పని చేసే వారికి అలవెన్సు మంజూరు చేయాలని, నోషనల్ ఇన్క్రిమెంట్స్ మంజూరు చేయాలని కోరారు. చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రాం కింద వైద్యులకు రూ.5 వేలు ఇవ్వాలన్నారు. వైద్యులకు కచ్చితమైన పనిగంటలు, స్థిరమైన వారాంతపు సెలవులు ఇవ్వాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో డాక్టరు పవన్చైతన్య తదితరులు ఉన్నారు. -
మిత్రుడిని హతమార్చిన నిందితుల అరెస్ట్
చిలకలూరిపేట: స్నేహితుడిని తలపై రాడ్తో కొట్టి, గొంతును తాడుతో బిగించి క్రూరంగా హత్య చేసిన ముగ్గురు నిందితులను చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చిలకలూరిపేట రూరల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన తాడిబోయిన గోపి(32) గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసేవాడు. అతను దక్షిణామూర్తి సేలిస్టియాన్ క్రియేషన్స్ బ్యానర్పై షార్ట్ఫిలింలు, మిషన్ మంగళాద్రి పేరుమీద వెబ్సిరీస్లు తీయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ 25వ తేదీన గుర్తుతెలియని మృతదేహం యడ్లపాడు సర్వీస్ రోడ్డు కాల్వలో కాలిపోతున్న స్థితిలో కనిపించింది. పోలీసుల విచారణలో అది తాడిబోయిన గోపిదిగా గుర్తించారు. చనిపోయిన గోపికి గుంటూరుకు చెందిన ఆఫ్రిన్ అనే ఆమె ద్వారా వాళ్ల తమ్ముడు, గుంటూరులోని సుద్దపల్లిడొంకలో నివాసం ఉండే షేక్ ఇమ్రాన్ పరిచయమయ్యారు. కొంతకాలానికి గోపి, ఇమ్రాన్ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గోపిని హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. ఇమ్రాన్కు స్నేహితులైన గుంటూరు రామిరెడ్డిపేటకు చెందిన షేక్ రియాజ్, నల్లచెరువు ప్రాంతానికి చెందిన షేక్ ఖాజామొహిద్దీన్లను కలుపుకొని పథకం ప్రకారం గుంటూరులోని ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న ఇమ్రాన్ అద్దె గదికి గోపిని జూన్ 24న ఫోన్ చేసి రప్పించారు. ముగ్గురు కలసి ఇనుపరాడ్డుతో గోపి తలపై కొట్టి ఆపై తాడుతో మెడకు ఉరివేసి హత్యచేశారు. మృతుడు గోపికి చెందిన కారు డిక్కీలో శవాన్ని చిలకలూరిపేటకు తీసుకువచ్చి ఇక్కడ పెట్రోల్ బంకులో రెండు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి గుంటూరు రోడ్డులో తిమ్మాపురం దాటిన తర్వాత యడ్లపాడు సమీపంలో సర్వీస్ రోడ్డు పక్కన సిమెంట్ కాల్వలో గోపీ మృతదేహాన్ని వేసి పెట్రోలు పోసి తగలబెట్టి పరారయ్యారు. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గోపికి చెందిన కారు, కీ పాడ్ ఫోన్, సెల్ఫోన్, ఏటీఎం కార్డులు, రూ.12వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
వేదమాతా నమోనమః
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేదమాత గాయత్రీదేవిగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవ రాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం దుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. వేకువజాము నుంచి ఉదయం ఆరు గంటల వరకు భక్తులతో అన్ని క్యూలైన్లు కిక్కిరిశాయి. అమ్మవారికి నిర్వహించే పలు ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు, ఉభయదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు కొండపైకి చేరుకోవడం ఇబ్బందికరంగా ఉందని పలువురు ఉభయదాతలు నేరుగా కలెక్టర్ లక్ష్మీశకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఆరు గంటల తర్వాత సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. అయితే రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లు ఖాళీగానే దర్శనమిచ్చాయి. రద్దీని కట్టడి చేసేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు భక్తులను రూ.100 క్యూలోకి అనుమతించారు. ఇక అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీయాగం, కుంకుమార్చనలో ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రత్యేక కుంకుమార్చనను మొదటి షిఫ్టునకే పరిమితం చేశారు. వీఐపీ దర్శనాలకు బ్రేక్ తొలి రోజున ఆలయ ప్రాంగణంలో ఇష్టానుసారంగా వీఐపీల పేరిట జరిగిన దర్శనాలకు మంగళవారం బ్రేక్ పడింది. ప్రొటోకాల్ ఉన్న వారికి మాత్రమే సీఎం గేటు, వీఐపీల పేరుతో వచ్చే వారిని గాలిగోపురం వద్ద ఉన్న క్యూలైన్ ద్వారానే ఆలయంలో అనుమతించారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం ఉదయం లడ్డూ తయారీ పోటులను తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న పిండి పర్థారాలు, పంచదార, నూనె, నెయ్యి, జీడిపప్పు నాణ్యతను పరిశీలించారు. రోజుకు ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు? మొదటి రోజు ఎన్ని విక్రయించారు? ఇంకా ఎన్ని నిల్వ ఉన్నాయన్న వివరాలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్యం 2.50 లక్షల లడ్డూలను తయారీ చేసేలా దేవస్థానం మూడు లడ్డూ పోటులను సిద్ధం చేసిందని, ఉత్సవాల్లో 36 లక్షల లడ్డూలు అవసరమయవుతాయని అంచనా వేశామని తెలిపారు. లడ్డూ విక్రయ కేంద్రాలను మంగళవారం నుంచి మరి కొన్నింటిని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పలుచోట్ల ఈ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వించిపేట(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో రెండో రోజు మంగళవారం శ్రీగాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్.సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బండారు శ్రావణి, గల్లా మాధవి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వేద పండితులు వేదాశీర్వచనం, ఆలయ ఈఓ శీనా నాయక్ అమ్మవారి చిత్రపటాలు అందజేశారు. గాయత్రీదేవిగా దుర్గమ్మ దర్శనం -
ఏఎన్యూ లా బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యునిగా నర్రా
నాదెండ్ల: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లాబోర్డు ఆఫ్ స్టడీస్ (అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్) సభ్యునిగా సాతులూరు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఎన్యూ డిప్యూటీ రిజిస్ట్రార్ కె రంగారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన న్యాయశాస్త్రంలో డిగ్రీ, పోస్ట్గ్రాడ్యుయేషన్ విభాగంలో సిలబస్, ఇతర అంశాల నిర్ణయాలకుగాను తొమ్మిది మంది సభ్యులతో వైస్ఛాన్సలర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఏర్పాటు చేశారు. ఈయన ఏఎన్యూ పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా, హైకోర్టు న్యాయవాదిగా, అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. న్యాయ విద్యార్థులు, న్యాయవాదులకు తరచూ అనేక అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది న్యాయమూర్తులుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా, ప్రభుత్వ విభాగాల్లో న్యాయసలహాదారులుగా సేవలందిస్తున్నారు. ఇప్పటికే ఏఎన్యూ న్యాయసలహాదారుగా వ్యవహరిస్తున్నారు. -
నమ్మించి.. నట్టేట ముంచేసి..
నాగులుప్పలపాడు: యాప్లో నగదు జమ చేస్తే భారీగా లాభం వస్తుందని నమ్మించి ఆ ఊరి ప్రజలను నట్టేట ముంచాడో ప్రబుద్ధుడు. సుమారు 500 మందికిపైగానే రూ.5 కోట్లకుపైగా చెల్లించి మోసపోయారు. ఆ వ్యక్తి ఊరిలో కనిపించకపోవడంతో విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నాగులుప్పలపాడు మండలంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన తూతిక నాగాంజనేయులు అనే వ్యక్తి ఎల్ఎఫ్ వర్క్ మనీ పేరుతో ఉన్న యాప్లో పెట్టుబడి పెడితే రూ.లక్షల్లో లాభాలు వస్తాయని ఆశ చూపించాడు. గ్రామంలోని సుమారు 500 మంది నుంచి రూ.5 కోట్లకుపైగా వసూలు చేసి అందులో చేర్పించాడు. యాప్ను ఈ ఏడాది జనవరిలో నాగాంజనేయులుకు ఒడిశాకు చెందిన కొందరు వ్యక్తులు పరిచయం చేశారు. ఎవరైనా డిపాజిట్ చేస్తే నగదును బట్టి రోజువారీగా కొంత మొత్తం తొమ్మిది నెలలపాటు ఇస్తారని నాగాంజనేయులు నమ్మించాడు. రూ.2,400 డిపాజిట్ చేస్తే రోజుకి రూ.72 చొప్పున, రూ.6,000 చెల్లిస్తే రోజుకి రూ.350 చొప్పున, రూ.12,000 చెల్లిస్తే రోజుకి రూ.725 చొప్పున ఇస్తామని చెప్పి ప్రజలకు అలవాటు చేసి మొదట్లో తిరిగి చెల్లింపులు కూడా చేశారు. ఆశావాహులు పెరిగారని నమ్మకం కుదిరిన తరువాత రూ.24 వేలు, రూ.51,100 వంటి పెద్ద మొత్తాలను కూడా డిపాజిట్ చేయొచ్చని నమ్మబలికారు. ఎల్ఎఫ్ వర్కు పేరుతో చీరాల, ఇంకొల్లు ప్రాంతాల్లో కార్యాలయాలు కూడా తెరిచారు. ఈ మధ్య కాలంలో చీరాలలోని ఓ రిసార్టులో ఆర్భాటంగా పెద్ద అవగాహన సభ ఏర్పాటు చేశారు. వచ్చిన క్లైంట్లకు భారీ విందు కూడా ఇచ్చారు. దీంతో నమ్మిన జనం ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ మొదటి వారాల్లో అందిన కాడికి అప్పులు తెచ్చి రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టారు. నాగాంజనేయులు ఈ సంస్థకు చీరాల ఏరియా మేనేజర్గా పరిచయం చేసుకోవడంతో తిమ్మసముద్రం గ్రామంతో పాటు చీరాల, వేటపాలెం, పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల ప్రజలు తమ బంగారాలను సైతం తాకట్టు పెట్టి ఈ యాప్లో పెద్ద మొత్తంలో జమ చేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి యాప్ ద్వారా డబ్బులు విత్డ్రా కావడం లేదు. నాగాంజనేయులు ఊరి విడిచి వెళ్లిపోవడంతోపాటు 2 రోజుల నుంచి అతని ఫోన్ పనిచేయడం లేదు. ఒక్కసారిగా గ్రామంలో అలజడి మొదలైంది. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టారు. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే లక్షాధికారులు అవుతారంటూ ప్రచారం ఎల్ఎఫ్ వర్క్ మనీ యాప్ పేరుతో రూ.5 కోట్ల వరకు వసూలు నిర్వాహకుడు ఊరు విడిచి వెళ్లడంతో వెలుగులోకి భారీ మోసం -
రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలు
బల్లికురవ: మినీ వ్యాన్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో వ్యాన్లో ఉన్న 9 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన మంగళవారం నార్కెట్పల్లి– మేదరమెట్ల నామ్ రహదారిలో కొప్పరపాడు గ్రామ శివాలయం సమీపాన జరిగింది. అద్దంకి మండలం చినకొత్తపల్లి గ్రామానికి చెందిన చింతంరెడ్డి అంకిరెడ్డి తన కుమారుడి పుట్టెంట్రుకలు తీయించేందుకు పల్నాడు జిల్లా అడిగొప్పుల అమ్మవారి సన్నిధానానికి 20 మందితో కలిసి వాహనంలో వెళ్లారు. తిరిగి వస్తుండగా కొప్పరపాడు గ్రామ సమీపంలోని చేపల చెరువుల నుంచి వస్తున్న లారీ రోడ్డు క్రాస్ చేస్తూ వ్యాన్ను ఢీకొట్టింది. జయరామిరెడ్డి, వెంకటరెడ్డి, ప్రభాకరరెడ్డి, పేరమ్మ, వెంకటేశ్వరరెడ్డి, అంజిరెడ్డి, మాగంటి రామాంజనేయులు, మిర్యాల సీతారామయ్య తదితరులు గాయాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. -
కృష్ణానదికి వరద ఉద్ధృతి
కొల్లూరులో ఓ ప్రయివేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో సౌకర్యాలను పరిశీలిస్తున్న తహసీల్దార్ వెంకటేశ్వర్లు కొల్లూరు కరకట్టపై వాహనం ఎదురు రావడంతో అతికష్టంపై వెళుతున్న కలెక్టర్ ప్రయాణిస్తున్న కారు నదిలో క్రమక్రమంగా పెరుగుతున్న నీటి ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు లోతట్టు ప్రాంతాలలోకి భారీగా చేరిన వరద నీరు ముంపు ప్రాంత ప్రజల కోసం పునరావాస కేంద్రాలు సిద్ధం క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ సహాయక చర్యలపై అధికారులు, సర్పంచ్లతో సమావేశం -
రసవత్తరంగా విజ్ఞాన్ జాతీయ చెస్ చాంపియన్షిప్
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్ పోటీల్లో మంగళవారం రెండో రౌండ్ ముగిసేసరికి 68 మంది క్రీడాకారులు తలో రెండు పాయింట్లతో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. ఎక్కువమంది అగ్ర క్రీడాకారులు మూడో రౌండ్కి సులభంగా అడుగుపెట్టారు. మాజీ జాతీయ చాంపియన్ గ్రాండ్ మాస్టర్ సూర్యశేఖర్ గంగూలీ (పీఎస్పీబీ) టాప్ బోర్డులపై తొలి విజయాన్ని నమోదు చేశారు. గియూకో పియానో ఆరంభంలో, 19వ మూవ్లో యషద్ బంబేశ్వర్ (ఛత్తీస్గఢ్) చేసిన తప్పిదాన్ని గంగూలీ సద్వినియోగం చేసుకున్నారు. వరుసగా బిషప్, నైట్ త్యాగాలు చేసి పూర్తిగా ఆధిపత్యం సాధించిన గంగూలీ, 30వ మూవ్లో ప్రత్యర్థిని రాజీనామా చేయించారు. – టాప్ సీడ్ జీఎం ఇనియన్.పి (తమిళనాడు), అధిరాజ్ మిత్రా(ఝార్ఖండ్)పై గెలుపొందాడు. వెటరన్ జీఎం కృష్ణన్ శశికిరణ్, హృషికేశ్ బానిక్ (పశ్చిమ బెంగాల్)పై గెలుపొందాడు. కొత్తగా గ్రాండ్మాస్టర్ బిరుదు పొందిన ఎస్.రోహిత్ కృష్ణ (తమిళనాడు), దేవర్ష భోర్కటేరియా (గుజరాత్)పై గెలుపొందాడు. జీఎం.ఎం.ఆర్.లలిత్ బాబు (ఆంధ్రప్రదేశ్), అయుష్ రవికుమార్ (తమిళనాడు)పై ఆసక్తికర పోరులో గెలిచారు. కర్ణాటక ఐఎం వియాని ఆంటోనియో డి కున్హాను ఆంధ్ర యువకుడు అందమాల హేమల్ వర్షన్ డ్రాలో కట్టేశారు. మూడో రౌండ్లో టాప్ బోర్డులపై మరింత రసవత్తర పోటీలు జరగనున్నాయి. -
కనుల పండువగా శరన్నవరాత్రి ఉత్సవాలు
దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారు మంగళవారం భక్తులకు మాంగల్య గౌరి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పసుపుకుంకుమలు సమర్పించారు. వివాహ దోష నివారణ పూజలలో బాలికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా గౌరి, మహా చండీ హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. – కర్లపాలెంప్రముఖ పుణ్యక్షేత్రమైన జిల్లెళ్ళమూడి గ్రామంలోని అనసూయ దేవి (జిల్లెళ్ళమూడి అమ్మ వారు) దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బాల త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనం చేసుకునేందుకు పరిసర గ్రామాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఏర్పాట్లను కమిటీ నిర్వాహకులు పర్యవేక్షించారు. – బాపట్ల టౌన్ -
క్రీడాపోటీల బ్రోచర్ ఆవిష్కరణ
చీరాల టౌన్: రెవెన్యూ అసోసియేషన్ బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10, 11వ తేదీల్లో బాపట్లలో జిల్లా స్థాయి రెవెన్యూ ఉద్యోగుల క్రీడాపోటీలు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. క్రీడల్లో చీరాల డివిజన్ పరిధిలోని ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలని ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం తమ కార్యాలయంలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ చీరాల డివిజన్ అధ్యక్షుడు, తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణతో కలసి ఆయన బ్రోచర్ ఆవిష్కరించారు. నిత్యం పని ఒత్తిడి ఉండే రెవెన్యూ ఉద్యోగులకు కాస్త ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోటీలను కలెక్టర్ ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సురేష్బాబు, డివిజన్ కార్యదర్శి పీకా సురేష్, జిల్లా క్రీడల కార్యదర్శి డి.అర్జున్, ప్రతినిధులు సత్యనారాయణ, ఆదినారాయణ, సీహెచ్ రమేష్, తేజ, నారాయణమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో స్కౌట్స్, గైడ్స్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, సమానత్వ భావాలతో పాటు దేశభక్తిని పెంపొందిస్తున్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి ఆర్. నరసింహారావు తెలిపారు. సోమవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్ష భవన్లో గుంటూరు జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వార్షిక సమావేశాన్ని జిల్లా కార్యదర్శి ఎం. ఏడుకొండలు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింహారావు గుంటూరు జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ రిజిస్ట్రేషన్, బిగినర్స్ కోర్స్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 955 పీఎంశ్రీ పాఠశాలలకు రూ. 50 వేలు చొప్పున విడుదల చేసిన నిధులతో విద్యార్థులకు యూనిఫామ్తో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఉన్నతమైన సంస్థగా గుర్తింపు పొందిన స్కౌట్స్, గైడ్స్ ఆశయాలకు అనుగుణంగా సేవా భావంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని 111 పాఠశాల నుంచి 136 యూనిట్స్ రిజిస్ట్రేషన్ చేశారని వివరించారు. సమావేశంలో ఎస్ఓసీ పి. శ్రీనివాసరావు, చేబ్రోలు ఎంఈవో రాయ సుబ్బారావు, పెదకాకాని ఎంఈఓ బీవీ రమణయ్య, డీటీసీ టి. నరేష్, డీఓసీ ఎం.శ్రీ హరి, ఘంటా కిరణ్, కామాక్షి, అనిల్, నాగేశ్వరరావు, రమేష్ పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఆర్.నరసింహారావు -
నయనానందకరం.. నగరోత్సవం..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్కు స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం దర్శనాలకు అనుమతించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనాచౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్లతో పాటు పలువురు జిల్లా అధికారులు తొలి దర్శనం చేసుకున్నారు. ఉదయం 8 గంటలకు అన్ని క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా మహా మండపం ఆరో అంతస్తుకు తీసుకువెళ్లి ప్రతిష్టించారు. ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం సమీపంలోని యాగశాలలో కలశస్థాపన, పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జన హృది బాలా.. నిత్యకల్యాణశీలా.. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ప్రత్యేక కుంకుమార్చనలో 104 మంది ఉభయదాతలు ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రనవార్చనలో 13 మంది, చండీయాగంలో 29మంది ఉభయదాతలు పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న వారికి రూ.300 క్యూలైన్లో బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఇక పరోక్ష చండీ హోమానికి 57మంది, కుంకుమార్చనకు 18మంది రుసుం చెల్లించి ఆన్లైన్లో పూజను వీక్షించారు. మహా మండపం ఆరో అంతస్తులో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్పాట్ల పరిశీలన..ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. తొలుత కలెక్టర్, కమిషనర్ క్యూలైన్లో ఉన్న భక్తులతో ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో చర్చించారు. అనంతరం నూతన అన్నదాన భవనంలో జరుగుతున్న అన్న ప్రసాద వితరణను పరిశీలించారు. ఆలయ ఈవో శీనానాయక్తో కలిసి అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆహార పదార్థాల నాణ్యత, ఆలయ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఆది దంపతుల నగరోత్సవ సేవ సోమవారం సాయంత్రం కనుల పండువగా సాగింది. శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలతో పాటు కేరళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, కావడి నృత్యా లతో పలువురు కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, రథం సెంటర్, దుర్గాఘాట్, దుర్గగుడి ఘాట్రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంది. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
బాపట్లటౌన్: అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 65 మంది బాధితులు వచ్చి నేరుగా తమ సమస్యలను ఎస్పీకు వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ అర్జీల స్వీకరణ అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మానవీయ కోణంతో వ్యవహరిస్తూ అర్జీలను చట్టపరిధిలో పరిష్కరించాలని చెప్పారు. పదేపదే బాధితులను స్టేషన్ చుట్టూ తిప్పుకోరాదని సూచించారు. స్టేషన్కు వచ్చిన బాధితులకు తగిన గౌరవం ఇచ్చి వారితో ఫ్రెండ్లీగా మెలగాలని కోరారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని పరిష్కరించినప్పుడే పోలీస్శాఖపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ యు.శ్రీనివాసులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి బాపట్లటౌన్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం సైబర్ నేరాలపై ఎస్పీ ప్రచార పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. డిజిటల్ అరెస్ట్(ఆన్లైన్ వీడియో కాల్లో అరెస్ట్) అనేది లేదని, డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు చేసే వీడియో కాల్స్కు స్పందించవద్దని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినుట్లు వివరించారు. డిజిటల్ అరెస్ట్, పీఎం కిసాన్ యాప్ ఏపీకే ఫైల్స్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, నకిలీ లోన్ యాప్స్, పార్ట్ టైం జాబ్స్, నకిలీ వెబ్సైట్లు, బ్యాంకింగ్, ఈ కామర్స్, సోషల్ మీడియా వంటి పలు రకాల మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతూ బాధితుల నుంచి రూ.లక్షల్లో నగదు కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. ఎస్పీ ఉమామహేశ్వర్ -
ఉత్కంఠభరితంగా జాతీయ చెస్ పోటీలు
చేబ్రోలు: ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన్లో నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్–2025 పోటీలు సోమవారం రెండో రోజు ఉత్కంఠభరితంగా సాగాయి. 14 మంది గ్రాండ్మాస్టర్లు, 30 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు సహా మొత్తం 394 మంది పోటీ బరిలో నిలిచారు. తొలి రౌండ్లో ఎక్కువ మంది గ్రాండ్ మాస్టర్లు, ఇంటర్నేషనల్ మాస్టర్లు సునాయాస రెండో రౌండ్కి చేరుకున్నారు. ● రెండో సీడ్ సూర్యశేఖర్ గంగూలీ మొదటి రోజు సుదీర్ఘమైన గేమ్ను ఆడి, చివరికి తనదైన స్టైల్లో విజయం సాధించారు. ● రైల్వే జట్టుకు చెందిన గ్రాండ్మాస్టర్ దీపన్ చక్రవర్తి, ఐఎం సిద్ధాంత్ మోహాపాత్రా ప్రత్యర్థులతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ● పీఎస్పీబీకి చెందిన ఐఎం నిషా మొహోటా, తెలంగాణ ఆటగాడు మోక్షిత్ పసుపులేటి చేతిలో ఓటమి పాలయ్యారు. ● ఆంధ్రప్రదేశ్ అభిమాన ఆటగాడు, 2017 జాతీయ చాంపియన్ లలిత్ బాబు, ఛత్తీస్గఢ్కు చెందిన గగన్ సహూను చాకచక్యంగా ఓడించారు. -
ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం
చీరాల అర్బన్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని చీరాల, పేరాలలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాలతో పాటు, భావనారుషి దేవాలయం, పేరాల శివాలయంలో, ఎంజీసీ మార్కెట్లోని అమ్మవారి దేవాలయం, కామాక్షి అమ్మవారి దేవాలయం తదితర దేవాలయాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. దేవాలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సంతబజారులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారి చిత్రపటంతో నగరోత్సవాన్ని నిర్వహించారు. దేవాలయం నుంచి 1116 మంది మహిళలు కలశ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విశేష అలంకరణలు చేశారు. కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షుడు గుంటూరు మాధవరావు పాల్గొన్నారు. అలానే పేరాలలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో, బెస్తపాలెంలోని సాయిబాబా మందిరంలో, పాపరాజుతోటలోని కామాక్షి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లెళ్లమూడిలో..బాపట్లటౌన్: జిల్లెళ్ళమూడిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అమ్మవారికి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో విశ్వజనని పరిషత్ ట్రస్ట్ ట్రెజరర్ జె.ఎల్.పి.సుబ్రహ్మణ్యం, అలయ అర్చకులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అమృతలూరు(వేమూరు): మండలంలోని గోవాడ బాల కోటేశ్వర స్వామి దేవస్ధానంలో దేవి శరన్నవ రాత్రి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. విగ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, కులశస్థాపన చేసి మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించినట్లు అర్చకులు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు పిట్టలవానిపాలెం(కర్లపాలెం): చందోలు శ్రీ బండ్లమ్మ ఆలయం అల్లూరు రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మంతెనవారిపాలెం రామలింగేశ్వరస్వామి ఆలయం, ఖాజీపాలెం కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాలతో పాటు మండలంలోని పలు గ్రామాలలో కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. -
అద్దె బస్సులకు మైలేజీ తిప్పలు
చీరాల అర్బన్: సీ్త్రశక్తి పథకంతో అద్దె బస్సుల యజమానులు కష్టాలపాలవుతున్నారు. పథకాన్ని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. జిల్లాలో అధిక శాతం బస్సులు హయర్ బస్సులే. కూటమి సర్కారు దెబ్బకు చితికిపోతున్నారు. నిర్వహణ భారం మోయలేకపోతున్నామని యజమానులు వాపోతున్నారు. ఆందోళనలో అద్దె బస్సుల యజమానులు.. –జిల్లాలో చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకి ఆర్టీసీ డిపోలున్నాయి. మొత్తం 253 బస్సులు సేవలందిస్తున్నాయి. సీ్త్రశక్తి పథకం 212 బస్సుల్లో అమలవుతోంది. అందులో వంద వరకు అద్దె బస్సులే నడుస్తున్నాయి. 56 సీటింగ్ కెపాసిటీతో నడిపేందుకు యజమానులతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. రద్దీ పెరగడంతో మైలెజ్ పడిపోయింది. మెయింట్నెన్స్పై ఆందోళన చెందుతున్నారు. అద్దె బస్సుల టెండర్ల సమయంలో ఫ్రీ బస్ ప్రస్తావనే లేదని, తక్కువ కోడ్ చేసిన వారికే టెండర్లు దక్కడంతో ఇప్పుడే ఏమి చేయలేని స్థితిలో ఉన్నామంటూ ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ కంటే అద్దె బస్సులే అదనం.. జిల్లాలో మొత్తం 212 బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలవుతుంటే వీటిలో వంద బస్సుల వరకు అద్దె బస్సులున్నాయి. వీటిలో ఎక్స్ప్రెస్ 20, పల్లెవెలుగు 70 ఉన్నాయి. హయర్ బస్సులకు 56 సీటింగ్ కెపాసిటీ ఉండాలి. సర్వీసు రూట్ను బట్టి టెండర్లలో కోడ్ చేసిన విధంగా పల్లెవెలుగు బస్సుకు రూ.8 నుంచి రూ.12 వరకు, ఎక్స్ప్రెస్కు రూ.9 నుంచి రూ.14 చొప్పున కిలో మీటరుకు ఇస్తున్నారు. పల్లె వెలుగు బస్సుకు లీటర్ డీజిల్కు రూ.5.5 కిలోమీటర్లు ప్రయాణించాలి. మైలేజ్ షార్టేజ్ వస్తే ఆ భారాన్ని యజమానులే భరించాలి. ఫ్రీ బస్సు వలన ప్రయాణికుల రద్దీ పెరుగింది. కెపాసిటికి మించి బస్సులో ప్రయాణికులు ఎక్కితే ఓవర్ లోడ్ వలన టైర్లు అరుగుదల, ఇంజన్ సంబంధిత సమస్యలు తలెత్తి మెయింట్నెన్స్ పెరిగిపోతుంది. ప్రస్తుతం ఆయిల్ షార్టేజ్ వలన నెలకు అదనపు భారం పడుతుంది. అలానే రవాణా శాఖ నిబంధనల మేరకు సీటింగ్ కెపాసిటి 56 మందికే ప్రీమియం చెల్లిస్తారు. ఓవర్ లోడ్తో అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే బీమా కొందరికే వస్తుంది. ఆర్టీసీలో అద్దె బస్సులు నడపడం ద్వారా కిలోమీటరుకు ఇచ్చే డబ్బులు బస్సుల మెయింట్నెన్స్కే సరిపోతున్నాయి. నెలకు లక్షన్నర రూపాయలు వస్తే అందులో ఈఎంఐ, డ్రైవర్లు, క్లీనర్ల జీతాలు, డీజిల్, మెయింట్నెన్స్కే సరిపోతుంది. నిర్వహణ భారం పెరగడంతో వచ్చిన ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి. తమ సమస్యలపై రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు యాజమాన్యానికి విన్నవించాం. కిలోమీటర్కు మైలేజ్ తగ్గించాలని, మెయింట్నెన్స్ చార్జీలు కిలోమీటర్కు పెంచాలని కోరుతున్నాం. – ఎన్.శ్యామ్ప్రసాద్, స్టేట్ జనరల్ సెక్రటరీ, హయర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళనలో యజమానులు -
అతుకులకట్ట.. భద్రత ఎట్టా!
ప్రతి వర్షాకాలం క్షణక్షణం.. భయం భయంగా లంకగ్రామాలు కొల్లూరు: కృష్ణా కరకట్ట భయపెడుతోంది.. వరదొస్తే క్షణక్షణం భయం.. పరీవాహక గ్రామాలకు రక్షణ కవచంగా ఉండాల్చిన కరకట్ట భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో 67 కిలోమీటర్లు పొడవునా అతుకుల బొంతను తలపించేలా కరకట్ట మారింది. కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. అభివృద్ధికి నిధులు లేవు.. కృష్ణా నదికి వరదలు వచ్చే సమయంలో ప్రభుత్వం హడావిడి చేస్తుంది. శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. జిల్లాలో కొల్లూరు మండలం చిలుమూరు శివారు కొత్త చిలుమూరు నుంచి రేపల్లె మండలం లంకేవానిదిబ్బ వరకు 67 కిలోమీటర్లు పొడవునా విస్తరించి ఉంది. 55 ప్రాంతాలలో బలహీనంగా మారినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. మరో 20 వరకు పెరుగుతాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. కానీ కరకట్ట పటిష్టతకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. డేంజర్ స్పాట్లు ఇలా... కొల్లూరు ఆర్సీ సెక్షన్ (రివర్ అండ్ కన్జర్వేషన్) పరిధిలో ఈపూరు, దోనేపూడి– కోటిపల్లి ప్రాంతాలలో అధిక చోట్ల కరకట్ట బలహీనంగా మారింది. గతంలో తాత్కాలిక మరమ్మతులలో భాగంగా వేచిన ఇసుక మూటలు ధ్వంసమై వరద తీవ్రత పెరిగిన పక్షంలో తట్టుకొని నిలవడం కష్టంగా తయారైంది. వీటికి తోడు సాగు నీటి కోసం ఏర్పాటు చేసిన పైప్లైన్లతో ముప్పు పొంచిలేకపోలేదు. పెనుమూడి ఆర్సీ సెక్షన్ పరిధిలో 51 ప్రాంతాలలో కరకట్ట బలహీనంగా మారి ప్రమాదకరంగా మారడం కరకట్ట దుస్థితికి అద్దం పడుతుంది. అనుభవాల నుంచి నేర్వని గుణపాఠాలు 2024లో 11.43 లక్షల క్యూసెక్కులు వరద ముంచెత్తడంతో జిల్లాలోని కరకట్ట పొడవునా ప్రజలు నిద్రాహారాలు మాని స్వచ్ఛందంగా కదలి కట్ట తెగకుండా అడ్డుకట్టలు వేస్తూ కంటికి రెప్పలా కాపాడుకొని గ్రామాలపై వరద విరుచుకుపడకుండా అడ్డుకున్నారు. చివరి నిమషంలో కృష్ణమ్మ తగ్గుముఖం పట్టడంతో గండం గట్టెక్కి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్నుంచి కరకట్ట బలహీనంగా ఉండి కోతలకు అవకాశాలున్న ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడంతో ప్రస్తుత ఏడాది కృష్ణా నది వరదలు ఉదృతరూపం దాల్చితే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థ్ధకంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణా నదిలో పెరుగుతున్న వరద కొల్లూరు: కృష్ణా నదికి వరద ఉధృతి పెరగింది. నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.75 లక్షల క్యూసెక్కులు సోమవారం విడుదల చేస్తున్నారు. మండలంలోని పెసర్లంక– పెదలంక అరవింద వారధి సమీపంలోని నక్కపాయ గండి, గాజుల్లంక చినరేవు, పోతార్లంక – గాజుల్లంక నడుమ కృష్ణా నది గట్లకు ఏర్పడిన గండ్లు ద్వారా వరద నీరు ఉధృతంగా పల్లపు ప్రాంతాలలోకి ప్రవహిస్తున్న కారణంగా గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. దోనేపూడి కరకట్ట దిగువును పోతార్లంక– దోనేపూడి లోలెవల్ వంతెన(చప్టా) పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పోతార్లంక, తిప్పలకట్ట, తోకలవారిపాలెం, కిష్కిందపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి ప్రజలు చుట్టు మార్గాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. బాపట్ల: బంగాళాఖాతంలో అల్ప పీడనంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 24 గంటలపాటు కంట్రోల్ రూమ్ నెంబర్ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.కంట్రోల్ రూమ్ 9711077372 టోల్–ఫ్రీ నంబర్ 1077, 1070 -
సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై అవగాహన
కొల్లూరు: కృష్ణా నదికి వరద పెరగనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం పోతార్లంక శివారు రావిలంక వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, ఎస్ఐ జానిక అమరవర్ధన్ సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచించారు. అక్కడ నివసిస్తున్న కుటుంబాలు తమ వద్ద అందుబాటులో ఉన్న పడవల సాయంతో కృష్ణా జిల్లా వెలివోలు, నడకుదురు ప్రాంతాలకు వెళ్తామని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. జీవాలు, పశువులను తమ వద్ద ఉన్న పడవల ద్వారా నదిని దాటించడం కష్టమని అధికారుల దృష్టికి తీసుకురావడంతో మంగళవారం పెద్ద బోట్లను ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. -
కరకట్ట గండిని పరిశీలించిన కలెక్టర్
ఓలేరు(భట్టిప్రోలు): కృష్ణా నది పరీవాహక లంక గ్రామాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ సోమవారం పరిశీలించారు. బాపట్ల జిల్లా పరిధిలోని భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో మళ్లీ కరకట్ట దెబ్బ తినకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట రేపల్లె ఆర్డీఓ ఎన్.రామలక్ష్మి, డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, భట్టిప్రోలు తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు, పీఏసీఎస్ చైర్పర్సన్ పరుచూరి రమేష్ ఉన్నారు. -
ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి
బాపట్ల: జాతీయ ఉపాధి హామీ పథకం కింద ముమ్మరంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఉపాధి హామీ పథకం, జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ సేవలు, స్వామిత్వ, స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం క్రింద లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో పనులు చేపట్టాలని సూచించారు. జిల్లాలో స్వామిత్వ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో జి.ఎస్. డబ్ల్యూ.ఎస్ సేవలను పెండింగ్ లేకుండా సత్వరమే ప్రజలకు అందించాలని ఆయన చెప్పారు. మనమిత్ర క్యాంపు మరియు ఆధార్ సీడింగ్ వాహనాల లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. కర్లపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అభివృద్ధి పనుల అమలులో వెనుకబడి ఉన్నారని పద్ధతి మార్చుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జి.ఎస్ బ్ల్యూ.ఎస్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. పరిపాలనలో పారదర్శకంగా ఉండాలి బాపట్ల: జిల్లా యంత్రాంగం పరిపాలనలో పారదర్శకంగా, నాణ్యతతో పని చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ కోరారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో కలెక్టర్ కార్యాలయ పీజీఆర్ఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లా పరిపాలనలో అన్ని విభాగాలలో ర్యాంకింగ్లో మొదటి మూడు వరుసలలో ఉండే విధంగా సిబ్బంది పని చేయాలని చెప్పారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఏమైనా సమస్యలు ఉంటే సత్వర పరిష్కార చర్యల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, డీఆర్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ గంగాధర్ గౌడ్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి నాగిరెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మల్లికార్జున రావు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టరు వినోద్కుమార్ -
న్యాయం చేస్తారా... నిందితుడిని అప్పగిస్తారా?
ప్రత్తిపాడు: పసి పిల్లలపై నీచంగా, అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడిని కఠినంగా శిక్షించి ‘మాకు న్యాయం చేస్తారా.. లేదా నిందితుడిని అప్పగిస్తారా ?’ అంటూ మహిళలు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రత్తిపాడు మండలం రావిపాటివారిపాలెం ప్రాథమిక పాఠశాలలో స్కావెంజర్ భర్త 72 ఏళ్ల వృద్ధుడు సామియేలు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అతడి అరెస్టు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ఆదివారం రాత్రి రావిపాటివారిపాలెం గ్రామస్తులు పెద్ద ఎత్తున స్థానిక పోలీస్ స్టేషను వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. పాఠశాలకు సంబంధం లేని వ్యక్తిని నెలల తరబడి పాఠశాలలోనికి హెచ్ఎం, ఉపాధ్యాయులు ఎలా అనుమతిస్తున్నారని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, తప్పు చేసిన వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎంఈవోతోపాటు హెచ్ఎం, ఉపాధ్యాయులపైనా వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్ఐ నరహరి మాట్లాడుతూ నిందితుడిని ఆదివారం అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశామని, చట్టప్రకారం అతడిని కోర్టుకు హాజరు పరచనున్నట్లు చెప్పారు. మరలా రెండు నెలల్లో బయటకు వచ్చి తిరుగుతాడని, ఒక్కసారి మాకు అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో ఎస్ఐ చట్టాన్ని చేతుల్లోనికి తీసుకోవడం సరికాదని తెలిపారు. బాధిత పిల్లల తల్లిదండ్రులు స్టేషనుకు వచ్చిన వెంటనే కేసు నమోదు చేశామని, ఎలాంటి తాత్సారం చేయలేదని ఎస్ఐ స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు గుంటూరు ఎడ్యుకేషన్: నాగమ్మ భర్త విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
2 హోల్డింగ్లు.. 5 క్యూలైన్లు
వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావిస్తున్న అధికార యంత్రాంగం సీతమ్మవారి పాదాల వద్ద, వీఎంసీ కార్యాలయం సమీపంలో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు హోల్డింగ్ పాయింట్లలో సుమారు 12వేల మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్లకు చైనా వాల్ వద్ద మరో క్యూలైన్, ఓం టర్నింగ్ వద్ద మరో క్యూలైన్ కలిసి మొత్తంగా ఐదు క్యూలైన్లు అలయం వరకు కొనసాగుతాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న ఈ క్యూలైన్లలో అత్యవసరమైన సేవలతో పాటు అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకుంటారు. -
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా మహోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం శ్రీ దేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాల తొలి రోజైన సోమవారం శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలుత అమ్మవారి ప్రధాన ఆలయంలోని ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొస్తారు. అక్కడ ఉత్సవమూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాల నిర్వహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చనలు, చండీయాగం, శ్రీచక్ర నవార్చనలు మొదలవుతాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో సాయంత్రం వేళ అమ్మవారికి పంచహారతుల సేవ సమయంలో క్యూలైన్లు యథావిధిగా నడిపించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో పాటు దేవదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. అంతరాలయంలో పంచహారతులు జరుగుతుండగానే రూ.300, రూ.100 క్యూలైన్తో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు నడుస్తూ ఉంటాయి. ఏర్పాట్లను దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు ఆదివారం మరో మారు తనిఖీ చేశారు. -
స్క్రీనింగ్ పరీక్షలతో చెక్
స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్కు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా మహిళలు 45 సంవత్సరాలు దాటాక ప్రతి ఏడాది మ్యామో గ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. 55 సంవత్సరాలు దాటిన వారు సీ టీ స్కాన్, కొలనోస్కోపి చేయించుకోవాలి. తొమ్మిదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు బాలికలకు, 45 సంవత్సరాల్లోపు మహిళలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. హెపటైటీస్ బీని కూడా వ్యాక్సిన్ వేయించుకుని రాకుండా నిరోధించవచ్చు. – డాక్టర్ బైరపనేని స్రవంతి, మెడికల్ అంకాలజిస్ట్ -
108 వాహనం, బైక్ ఢీ : ఒకరు మృతి
కొల్లూరు : జోరు వానలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాల బారినపడిన సంఘటన కొల్లూరు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆదివారం నిజాంపట్నానికి చెందిన 108 వాహనంలో రేపల్లె వైద్యశాల నుంచి తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు రోగులను తరలిస్తున్నారు. వేమూరు వైపు నుంచి ద్విచక్ర వాహనంపై కొల్లూరుకు ముగ్గురు యువకులు వస్తున్నారు. స్థానిక స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న షేక్ నరేష్, పాలపర్తి కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ హుటాహుటిన కొల్లూరు ఎస్ఐ, స్థానికులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నరేష్ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. కోటేశ్వరరావు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనం పైనే ఉన్న మరో యువకుడు అక్షయ్ అభిజిత్ స్వల్ప గాయాలతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం కారణంగా 108 వాహనం అదుపుకోల్పోయి రోడ్డు పక్కనున్న ముళ్ల పొదల్లోకి దూసుకుపోయింది. డ్రైవర్ ముద్రబోయిన సుబ్బారావు పంట కాలువలోకి వాహనం పల్టీ కొట్టకుండా నిలువరించగలగడంతో రేపల్లె నుంచి తరలిస్తున్న రోగులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడగలిగారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని కొల్లూరు పోలీసు స్టేషన్కు తరలించారు. రోగులను మరో 108 వాహనంలో పోలీసులు తెనాలి వైద్యశాలకు తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు ఎస్ఐ జానకీ అమరవర్ధన్ తెలిపారు. -
రేవేంద్రపాడులో వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఎంపికలు
దుగ్గిరాల: విద్యార్థులు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని అని హెచ్.ఎం బి.వి.కృష్ణారావు చెప్పారు. మండలంలోని రేవేంద్రపాడు జెడ్పీ హైస్కూలులో ఆదివారం జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఎంపికలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గేమ్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో 17 నుంచి 19 సంవత్సరాల బాలబాలికల విభాగంలో ఎంపికలు జరిగినట్లు తెలిపారు. విద్యార్థులు చురుగ్గా ఉండటానికి ఆటలు ఆడాలని, దేహ దారుఢ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు నాగ శిరీష, రాంబాబు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: తమలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుని డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారని జిల్లా ఎస్పీకి కళాకారులు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితుడు, శ్లోక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంట స్వామి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కళాశాల గ్రౌండ్ 99 అడుగుల మట్టి మహాగణపతిని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. నగరంలో ఉన్న వివిధ సాంస్కృతిక సంస్థలతో కలసి శ్లోకా ఫౌండేషన్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు నిత్యం శాసీ్త్రయ నృత్యాలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఉత్సవాల అనంతరం కళాకారులకు సొమ్మును ఇవ్వకుండా కమిటీ ప్రెసిడెంట్ నరేంద్రరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజానాయుడు, సెక్రటరీ లక్ష్మీరెడ్డిలు అందుబాటులో లేరని ఫిర్యాదు చేశారు. ఫోన్ ద్వారా కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని వెళ్లి పోయారని ఆరోపించారు. కళాకారులు, చిన్నారులు, మహిళలు, మేకప్ మేన్కు రూ 1,75,000 ఇవ్వాలని తెలిపారు. వెంటనే నగదు ఇప్పించాలని స్వామి ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. -
పులిచింతలకు 3,37,264 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 16 క్రస్ట్ గేట్లు ద్వారా 3,37,264 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 16 క్రస్ట్ గేట్లు నాలుగు మీటర్లు ఎత్తి 3,37,264 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 74.78 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటిసామర్థ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.593 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. రెండు విద్యుత్ యూనిట్ల ద్వారా ఉత్పాదన నిలిపివేసినట్లు వెల్లడించారు. టీఆర్సీ లెవల్ 62.43 మీటర్లకు చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి 3,09,545 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. సాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. -
25న విజయవాడలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాఽధితుల రక్షణపై ధర్నా
లక్ష్మీపురం: దళితులపై దాడులు, అత్యాచారాలు ఆగాలంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, లేకుంటే బాధితులకు న్యాయం జరగదని కుల వివక్ష వ్యతిరేక సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. దళితులు, బహుజనులపై జరుగుతున్న అత్యాచారాలు, అట్రాసిటీ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ గుంటూరు బ్రాడీపేటలోని పీఎల్ రావు భవన్లోని కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాల్యాద్రి మాట్లాడుతూ దళితులపై అణచివేత కొనసాగుతున్న పరిస్థితుల్లో బహుజన సమాజం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయకపోవడం, ఆలస్యం చేయ డం, లేదా ఎఫ్ఐఆర్లు బలహీనంగా నమోదు చేయడం వల్ల న్యాయం జరగడం లేదని అన్నారు. డీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ బాధితుల పక్షాన నిలబడే మానవ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలను ప్రభుత్వం అడ్డుకోవడం మానుకోవాలన్నారు. న్యాయవాది శిఖా సురేష్ మాట్లాడుతూ కేసులను తేలికగా తీసుకుంటే న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటుందన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షించడమే సమాజంలో మార్పు తీసుకొస్తుందన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మణరావు మాట్లాడుతూ దళితులు గిరిజనుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా అన్ని దళిత గిరిజన సంఘాలతో పాటు వర్గ సంఘాలు కూడా తోడై ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 25న విజయవాడలో జరగబోయే ధర్నాలో పాల్గొని ప్రభుత్వాన్ని కదిలించేలా పోరాటం చేస్తామని తీర్మానం చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కీలకంగా మారనున్న కుమ్మరిపాలెం క్యూలైన్లు
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో కుమ్మరిపాలెం క్యూలైన్లు కీలకం కానున్నాయి. గతంలో భవానీపురం వైపు నుంచి వచ్చే భక్తుల కోసం హెడ్ వాటర్ వర్కు నుంచి క్యూలైన్లు ప్రారంభమయ్యేవి. అయితే ఈ ఏడాది ఈ క్యూలైన్లలను కుమ్మరిపాలెం సెంటర్ వరకు ఏర్పాటు చేశారు. తెలంగాణ వైపు నుంచి వచ్చే భక్తులతో పాటు భవానీపురం, గట్టు వెనుక ప్రాంతం, సింగ్నగర్, వాంబే కాలనీ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కుమ్మరిపాలెం క్యూలైన్లే కొండపైకి చేరుకునేందుకు దగ్గర మార్గం అవుతాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరూ మహా మండపం, గోశాల, కనకదుర్గనగర్ మీదగానే బయటకు వెళ్లేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఎస్సీ కాలనీలో పంచాయతీ రహదారి మూసివేత
చెరుకుపల్లి: అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి వందలాది మంది రాకపోకలు సాగించే పంచాయతీ రహదారిని ఆక్రమించి ఎస్సీ కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటన మండలంలోని కావూరులో జరిగింది. నివాసితుల వివరాల మేరకు.. ఎస్సీ కాలనీ నుంచి గ్రామంలోకి వెళ్లేందుకు 50 సంవత్సరాల కిందట రోడ్డు ఏర్పాటు చేశారు. అనంతరం కాలనీ వాసుల సహకారంతో పంచాయతీకి రాశారు. విద్యుత్ స్తంభాలు, మంచినీటి కుళాయిలు కూడా పంచాయతీ అనుమతితోనే ఏర్పాటు చేశారు. ఇన్ని సౌకర్యాలతో రాకపోకలు సాగిస్తున్న ఈ రోడ్డును అదే గ్రామం కూటమి ప్రభుత్వానికి చెందిన కొల్లు సుధీర్ సిమెంటు తూములు, ఇనుప కంచె వేసి మూసి వేశాడని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ప్లాన్ ప్రత్యేక గ్రాంటుతో రోడ్డు నిర్మాణం మాజీ సర్పంచ్ నన్నపనేని వెంకటరావు మాట్లాడుతూ తాను గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు సమయంలో 2010–11లో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ ప్రత్యేక గ్రాంటు ద్వారా కొంత దూరం సీసీ రోడ్డును నిర్మించినట్లు తెలిపారు. ఈ రోడ్డులో నూతన భవనాలు నిర్మించుకునే వారికి, నీటి కుళాయిలు, విద్యుత్ మీటర్లకు పంచాయతీ ద్వారానే ఇప్పటి వరకు అనుమతులు కొనసాగుతున్నాయని తెలిపారు. పట్టించుకోని అధికారులు దౌర్జన్యంగా రోడ్డు ఆక్రమించిన వ్యక్తిపై పంచాయతీ అధికారులకు, స్థానిక పోలీసులు, రెవెన్యూ వారికి పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఎస్సీ కాలనీవాసులు వాపోతున్నారు. వందలాది మంది నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తూ, పంచాయతీకి అన్ని పన్నులు చెల్లిస్తున్నా రోడ్డుకు సంబంధించి అసలు రికార్డే లేకపోవడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కుట్రే అని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా వేసిన సిమెంటు తూములు తొలగించి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. రోడ్డు సమస్యపై పంచాయతీ కార్యదర్శి ఎం. డోగేంద్ర కుమార్ను వివరణ కోరగా గ్రామానికి చెందిన కొల్లు సుధీర్ కోర్టును ఆశ్రయించాడని తెలిపాడు. ఈ రోడ్డుకు సంబంధించి అసలు ఏ రికారుర్డు పంచాయతీలో లేదని వివరణ ఇచ్చారు. నివాసితులను భయభ్రాంతులకు గురి చేస్తున్న గ్రామానికి చెందిన వ్యక్తి -
క్యాన్సర్కూ ఉంది ఆన్సర్
కెనడా దేశానికి చెందిన 12 ఏళ్ల మెలిండా రోజ్ అనే బాలిక 1994లో క్యాన్సర్ వ్యాధికి గురైంది. అది కూడా చాలా అరుదైన బ్లడ్ క్యాన్సర్. కొన్ని వారాల్లోనే చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. కాని రోజ్ భయపడకుండా ఆస్పత్రిలో ఉన్న రోగులకు రోజూ పువ్వులు అందించేది. వారికి కవితలు వినిపించి రోగుల్లో మనో ఉల్లాసాన్ని కలిగించేది. ఇలా ఆరునెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోగులను చిరునవ్వుతో పలుకరిస్తూ ఉండేది. ఉత్తరాలు రాస్తూ వారిలో ఆనందం, ఉత్సాహాన్ని నింపుతూ సెప్టెంబరు 22న మరణించింది. ఆ బాలిక జ్ఞాపకార్థం ప్రతి ఏడాది రోజ్ డేను నిర్వహిస్తున్నారు. గుంటూరు మెడికల్: క్యాన్సర్ .. ఈ వ్యాధి పేరు చెబితేనే చాలా మందికి ఒంట్లో వణుకు పుడుతుంది. వస్తే చనిపోవటమే అనే అపోహల్లో ప్రజలు ఉన్నారు. పూర్వ రాచపుండుగా పిలువబడే క్యాన్సర్ వ్యాధికి చికిత్స ఉండేది కాదు. వ్యాధిగ్రస్తులు మరణానికి రోజులు లెక్క బెట్టుకుంటూ గడిపేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. బాధితుల్లో భయాన్ని పోగొట్టి వారిలో మానసిక ధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 22న రోజ్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. క్యాన్సర్కు కారణాలు క్యాన్సర్ రావటానికి ప్రధాన కారణం పొగాకు ఉత్పుత్తుల వినియోగమే. సిగిరెట్, బీడీ, చుట్ట , పాన్పరాగ్, ఖైనీ, గుట్కా.. ఇలా ఏ రూపంలో పొగాకును తీసుకున్నా వస్తుంది. మద్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఆకు కూరలు తినకపోవడం, ఊరగాయ పచ్చళ్లు, కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసాహారం తినడం, అధిక బరువు ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. జీజీహెచ్లో అత్యాధునిక వైద్య సేవలు గుంటూరు జీజీహెచ్లో 2020 జులైలో అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు నాట్కో క్యాన్సర్ సెంటర్ను మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. కోట్ల రూపాయలతో పెట్ స్కాన్ను ఏర్పాటు చేశారు. 100 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జీజీహెచ్లో చికిత్స పొందిన వారి వివరాలు క్యాన్సర్కు నేడు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ, టార్గెట్థెరపీ ద్వారా త్వరగా కోలుకుంటున్నారు. నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ ద్వారా చాలా త్వరగా గుర్తించవచ్చు. ఏ జీన్లో తేడా వల్ల సోకుతుందనే విషయం తేటతెల్లమవుతుంది. కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ ఉంటే ఇతరులకు వచ్చే అవకాశం ఉందా లేదా నిర్ధారించే బీఆర్సీఏ–1, 2 పరీక్షలు ఉన్నాయి. లాప్రోస్కోపిక్, రొబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. –డాక్టర్ ఎం.జి.నాగకిశోర్, సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్, గుంటూరు ఆపరేషన్లు సంవత్సరం రోగుల సంఖ్య 2020 2067 – 2021 5,865 114 2022 13,107 395 2023 14,647 753 2024 ఆగస్టు వరకు 9,376 542 -
‘బీచ్ ఫెస్టివల్’పై ముమ్మర ప్రచారం
బాపట్ల: బీచ్ ఫెస్టివల్కు ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా ప్రచార ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టరు వి.వినోద్ కుమార్ ఆదివారం పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26 నుంచి 28 వ తేదీ వరకు సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్కు సంబంధించి సామాజిక మాధ్యమాలలో, ఇతర ప్రచార విధానాల గురించి ఆరా తీశారు. బాపట్ల జిల్లాలోని కాజు ప్రాసెసింగ్, ఆక్వా ఉత్పత్తులు, చీరాల చేనేత వస్త్ర తయారీ గురించి ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని చెప్పారు. బీచ్ అందాలను, ఫెస్టివల్లో నిర్వహించే కార్యక్రమాల గురించి నిమిషం నిడివి కలిగిన వీడియోలు రూపొందించాలని సూచించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ ప్రాంతాలు, ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రచార స్టిక్కర్లను అతికించాలని తెలిపారు. ప్రచార కరపత్రాలను ముద్రించాలన్నారు. ఏర్పాట్లపై టూరిజం శాఖ సాంకేతిక అధికారులను అడిగి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ప్రముఖులకు, అధికారులకు, మీడియా వారికి పాసులు అందజేయాలన్నారు. హరిత రిసార్టును సుందరంగా తీర్చిదిద్దాలని మేనేజరును ఆదేశించారు. కార్యక్రమంలో టూరిజం అధికారి పద్మారాణి, ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎస్ఈ ఈశ్వరయ్య, డీఈలు, ఏఈలు, ఏపీ టూరిజం అథారిటీ బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పనులు త్వరగా పూర్తి చేయండి సూర్యలంక బీచ్ ఫెస్టివల్ నిర్వహణ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఇన్చార్జి జేసీ గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ఫెస్టివల్ నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులతో కలిసి ఆదివారం ఉదయం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ.. కేటాయించిన పనులను దగ్గర ఉండి సంబంధిత అధికారులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డీపీఓ ప్రభాకరరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, బాపట్ల, చీరాల ఆర్డీఓలు పి.గ్లోరియా, చంద్రశేఖర్ నాయుడు, డీఆర్డీఏ ఇన్ చార్జి పీడీ లవన్న, వివిధ శాఖల అధికారులు, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం -
11 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ 11 విశేష అలంకారాల్లో భక్తులను కరుణించనున్నారు. తిథుల హెచ్చుతగ్గుల కారణంగా అలంకారాల్లో మార్పులు వస్తుంటాయని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. మొదటిగా శ్రీబాలా త్రిపుర సుందరీదేవి, రెండో అలంకారంగా శ్రీగాయత్రిదేవి, మూడో అలంకారంగా శ్రీఅన్నపూర్ణాదేవి, నాల్గో అలంకారంగా శ్రీకాత్యాయనిదేవి, ఐదో అలంకారంగా శ్రీమహాలక్ష్మీదేవి, ఆరో అలంకారంగా శ్రీ లలితా త్రిపురసుందరీదేవి, ఏడో అలంకారంగా శ్రీమహాచండీదేవి, ఎనిమిదో అలంకారంగా శ్రీసరస్వతిదేవి, తొమ్మిదో అలంకారంలో శ్రీదుర్గాదేవి, పదో అలంకారంలో శ్రీ మహిషాసుర మర్దినీదేవి, పదకొండో అలంకారంలో శ్రీరాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ఏడాది కాత్యాయని దేవి అలంకారం అదనం కావడంతో పండుగ 11 రోజులకు వచ్చింది. నిరంతరం ప్రసాద వితరణ.. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కొండ దిగువన మహా మండపం ఎదుట నూతన అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలోనే ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని భక్తులకు అందజేస్తారు. ఒకే దఫా వెయ్యి మంది అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఇక క్యూలైన్లో చిన్నారుల కోసం పాలు, పెద్దల కోసం బిస్కెట్లు, మంచినీటి బాటిళ్లను అందజేయనున్నారు. -
అన్నీ ఉచితమే..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ. 45 కోట్లతో ప్రభుత్వ సహకారంతో గుంటూరు జీజీహెచ్లో నాట్కో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటైంది. ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలతో వ్యాధిగ్రస్తులకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నాం. రూ. కోట్లు ఖరీదు చేసే అత్యాధునిక లీనియర్ యాక్సిలేటర్, ట్రాకీథెరపీ, సీటీ స్టిమ్యులేటర్, పెట్స్కాన్ వైద్య పరికరాలు ప్రభుత్వం అందజేసింది. క్యాన్సర్ చివరి దశలో ఉన్నవారికి సైతం ప్యాలేటీవ్ కేర్ చికిత్సలు అందిస్తున్నాం. మందులు కూడా ఉచితంగా అందించి రోగుల్లో మనోధైర్యం కల్పిస్తున్నాం. మరో వంద పడకలతో క్యాన్సర్ సెంటర్ను నిర్మాణం చేస్తున్నాం. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ -
కృష్ణా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కొల్లూరు : కృష్ణా నదీ వరద ప్రవాహంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చి, నది అంచుల వద్ద పొదల్లో తేలింది. ఆదివారం ఉదయం మండలంలోని ఈపూరులంకలో పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు నది ఒడ్డు వెంబడి 60 సంవత్సరాల వరకు ఉన్న ఓ పురుషుడి మృతదేహం తేలి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రెవెన్యూ సిబ్బందితో కలసి అక్కడకు వెళ్లారు. రెండు రోజుల కిందట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నదిలోకి దూకి గల్లంతైన వ్యక్తి మృతదేహం అయి ఉండవచ్చన్న అనుమానంతో కొల్లూరు పోలీసులు తాడేపల్లి, విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. అయితే, మృతదేహం విజయవాడ వద్ద నదిలో దూకిన వ్యక్తిది కాదని అతని బంధువులు నిర్ధారించారు. నది ఒడ్డున పొదల్లో ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లభించలేదు. బట్టతలతో, లేత గోధుమ రంగు చొక్కా, బ్లూ ప్యాంట్ ధరించి, చేతికి ఎర్రని దారంతో ఆంజనేయ స్వామి లాకెట్ కట్టి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం శవాగారంలో భద్రపరచనున్నట్లు ఎస్ఐ జానకీ అమర్వర్ధన్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు చెప్పారు. -
పార్క్ చేసిన బుల్లెట్ చోరీ
చీరాల అర్బన్: స్థానిక దర్బార్ రోడ్డులోని ఓ షాపు ఎదుట పార్క్ చేసిన బుల్లెట్ బైక్ను శుక్రవారం రాత్రి దుండగులు అపహరించుకెళ్లారు. దుండగులు బైక్ హ్యాండిల్ను కాలుతో తన్ని లాక్ తీశారు. బైక్ స్టార్ట్ చేసుకొని దర్జాగా వెళ్లిపోయారు. చోరీ దృశ్యాలు షాపు వద్ద ఉన్న సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి. శనివారం బుల్లెట్ బైక్ కనిపించకపోవడంతో వాహనదారుడు సీసీ కెమెరాలలో చూసి చీరాల ఒన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మార్టూరు: మండల కేంద్రంలో శనివారం గుర్తు తెలియని పురుషుని మృతదేహం వెలుగు చూసింది. స్థానికులు పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కొణిదెన రోడ్డులో వైన్స్ షాపుల సమీపంలోని చెట్ల కింద పురుషుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు వీఆర్వో మోహన్ రావు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండవచ్చని మద్యంలో గడ్డి మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుడి చేతికి రాఖీ, ఎడమ చేతికి గోల్డ్ కలర్ వాచ్ ఉంది. రెండు రోజుల క్రితం చనిపోయినట్లు భావిస్తున్న మృతదేహాన్ని మార్టూరు పోలీస్ స్టేషన్కు తరలించి భద్రపరిచారు. మరొకరికి తీవ్ర గాయాలు కారంచేడు: ఎదురెదురుగా వస్తున్న కారు, ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం చీరాల–స్వర్ణ దండుబాట రోడ్డులో స్వర్ణ సమీపంలోని టపాసుల గోదాముల వద్ద జరిగింది. కారంచేడు ఎస్ఐ షేక్ ఽఖాదర్బాషా అందించిన సమాచారం మేరకు.. జె. పంగులూరు గ్రామానికి చెందిన కొమరాబత్తిన శ్రీనివాసరావు (50) చీరాల నుంచి స్వర్ణ మీదుగా ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న ఇంకొల్లు మండలం గంగారానికి బయలుదేరారు. కాగా మార్గమధ్యంలో జోరుగా వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో స్వర్ణ వైపు నుంచి చీరాలకు వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో ద్విచక్రవాహనం నడుపుతున్న శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిడుగురాళ్ల: చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల మెడికల్ కళాశాల వద్దకు వెళ్లిన 43 మందికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పిడుగురాళ్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు జాగ్రత్తలలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలప్పుడు లా ఆండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా వారిని అదుపులోకి తీసుకొని, సొంత పూచీకత్తుపై పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన
చేబ్రోలు: భారీ వర్షాలు, వరదలకు మండలంలోని శలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాల్లో నీట మునిగి దెబ్బతిన్న వరి పొలాలను శనివారం వ్యవసాయశాఖాధికారులు పరిశీలించారు. సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘‘రెక్కల కష్టం... వర్షార్పణం’’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా స్థానిక ఏవో పి. ప్రియదర్శిని మాట్లాడుతూ శేకూరు, శలపాడు రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతులు నాలుగు వేల ఎకరాల్లో వరి సాగు చేశారని తెలిపారు. పంట కూడా 30రోజులు పైబడిన దశలో ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉన్న పొలాలను పరిశీలించామని, ప్రాథమిక నివేదికను జిల్లా వ్యవసాయశాఖాధికారికి సమర్పించినట్లు తెలిపారు. వ్యయసాయశాఖ సిబ్బంది, మైలా రామరాజు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్: బీఆర్ స్టేడియంలో శనివారం అండర్– 14, అండర్– 17, అండర్– 19 జిమ్నాస్టిక్స్ బాలబాలికల జిల్లా టీం సెలక్షన్లు నిర్వహించారు. అండర్– 14, 17 ఎంపికలు ఎస్జీఎఫ్ సెక్రటరీ గోపి, అండర్ –19 ఎంపికలు నరసింహారావు, కోచ్ ఆఫ్రోజ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగాయి. -
తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు – 2026 సన్నాహాల్లో భాగంగా శనివారం కలెక్టర్ బంగ్లా రోడ్ భారతీయ విద్యాభవన్లో ‘తెలుగు భాషా వికాసం‘పై అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవంలో భాగంగా 44 చిత్రాల ప్రదర్శన నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాడారని, ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి కావాలని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ జాతి అస్తిత్వానికి మాతృభాష కొలమానమని అన్నారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని చెప్పారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని మాట్లాడుతూ లలిత కళలు, మన సంస్కృతి గొప్పతనంపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జరిగే మూడో ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. సభలో వీవీఐటీ విశ్వవిద్యాలయం కులపతి వాసిరెడ్డి విద్యాసాగర్, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్, నంబర్ వన్ టీవీ చైర్మన్ సుధాకర్నాయుడు, చలనచిత్ర ప్రముఖులు దశరథ్, కోన వెంకట్, డి.వై.చౌదరి, బి.వి.ఎస్. రవి, సిరాశ్రీ, సమన్వయకర్త పి.రామచంద్రరాజు, సినీ, టీవీ, రంగాల రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులుపై కొత్తపల్లి సీతారాం దర్శకత్వంలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన తెలుగు వెలుగు గొడుగు గిడుగు లఘు చిత్రం ఆకట్టుకుంది. తెలుగు భాష ప్రాధాన్యతపై నలభైకి పైగా లఘు చిత్రాలను ప్రదర్శించారు. నలభైకి పైగా లఘు చిత్రాల ప్రదర్శన -
వెదుళ్లపల్లిలో ‘అగ్నివీర్’ అంత్యక్రియలు
బాపట్లటౌన్: వ్యక్తిగత కారణాలతో రాజస్థాన్లో ఆత్మహత్య చేసుకున్న అగ్నివీర్ మేడిబోయిన వెంకటదుర్గారెడ్డి మృతదేహాన్ని ఆర్మీ అధికారులు శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు, మాజీ సైనికుల ఆధ్వర్యంలో వెదుళ్లపల్లిలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో మాజీ సైనికులు వెదుళ్ళపల్లి గ్రామానికి చేరుకొని అగ్నివీర్కు పార్ధీవదేహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ అగ్నివీర్గా ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం, 10 నెలలు మాత్రమే అయ్యిందన్నారు. క్షణికావేశంలో చిన్నవయస్సులోనే మృతిచెందడం బాధాకరమన్నారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణషీలా, సూపరింటెండెంట్ ఆనందరావులు అగ్నివీర్కు నివాళులర్పించారు. బాపట్ల అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షుడు చలికొండ వెంకటకృష్ణారావు, బాపట్ల జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ షేక్ నిజాముద్దీన్, సీనియర్ మాజీ సైనికుడు కె.ఆంజనేయులు, 23 ఎన్సీసీ ఆంధ్ర బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు. -
క్రీడా కోటాలో డీఎస్సీలో ఉద్యోగాలు
జె.పంగులూరు: ఈ ఏడాది ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీలో పోటీ పరీక్షలతో సంబంధం లేకుండా పీఈటీగా ఉద్యోగాలు కల్పించినట్లు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మేకల సీతారామిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు సన్మానం ఏర్పాటు చేశారు. గోవాలో జాతీయ క్రీడల్లో పాల్గొని పతకం సాధించిన సందర్భంగా క్రీడాకారులు ప్రతి ఒక్కరికి వ్యాయామ ఉపాధ్యాయునిగా పోస్టులు ఇస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన క్రీడాకారులు: పి. శివారెడ్డి (ప్రకాశం), జి. క్రాంతికుమార్ (విశాఖపటణం), ఏ. శివనాగిరెడ్డి (గుంటూరు), వై. సతీష్ ( తూర్పు గోదావరి), ఎల్. సురేష్ (విజయనగరం), ఎల్. అప్పలనాయుడు (పశ్చిమగోదావరి), వై. దాలినాయుడు (కృష్ణ), పి. రామ్మోమెహన్ (కడప), ఏ. రాజ్కుమార్ (చిత్తూరు). -
జిల్లాస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
వేటపాలెం: కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి ఆటల పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు గుమ్మా శ్రీనివాసరావు శనివారం తెలిపారు. పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో శుక్రవారం జరిగిన డివిజన్ స్థాయి ఆటల పోటీల్లో పాల్గొని విజేతలగా నిలిచారని తెలిపారు. జిల్లా పోటీలకు ఎంపికై న విద్యార్థులు డిస్కస్త్రోలో ప్రసాద్, 5కే నడకలో సుర్యతేజ, డిస్కస్ త్రోలో జయచంద్రిక, 200 మీటర్ల పరుగు పందెంలో వెంకాయమ్మ, 400 మీటర్లు పరుగు పందెంలో రేఖ విజేతలుగా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. కఠారివారిపాలెం స్కూల్ విద్యార్థి ఎస్. రాహుల్ జిల్లా స్థాయి ఆటల పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం పద్మావతి తెలిపారు. -
సంక్షోభంలో పారిశ్రామిక రంగం
మార్టూరు: ఇటీవల భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లోప భూయిష్ట విధానాల వల్ల పారిశ్రామిక రంగం సంక్షోభం అంచున ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి. రమాదేవి అన్నారు. మార్టూరు సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నూలు మిల్లుల నిర్వహణ భారం పెరిగి మార్టూరు, చిలకలూరిపేట ప్రాంతాల నూలు మిల్లుల యాజమాన్యాలు మూసివేత దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గ్రానైట్ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల రాయితీలను విడుదల చేసి విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ క్వారీలు పరిశ్రమల్లో ఇటీవల ప్రమాదాల బారిన పడి వలస కార్మికులు మృత్యువాత పడుతున్నారని అందుకు అధికారుల అలసత్వం, నిర్లక్ష్య వైఖరే కారణాలని ఆమె ఆరోపించారు. రైతులకు సకాలంలో ఎరువులను అందించలేని రాష్ట్ర ప్రభుత్వం వీధి వీధినా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. బాపట్ల సీపీఎం కార్యదర్శి సీహెచ్ గంగయ్య, మార్టూరు నాయకులు బత్తుల హనుమంతరావు, ఎనిక పాటి రాంబాబు, బి.సూరిబాబు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి -
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పర్చూరు(చినగంజాం): పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పర్చూరులోని బీఏఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాలలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కళాశాల నుంచి జెడ్పీ హైస్కూల్ వరకు పాఠశాల, కళాశాల విద్యార్థులు, జిల్లా అధికారులతో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బొమ్మల సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సాధించాలనే సంకల్పంతో పర్చూరు నియోజక వర్గంలో కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పర్చూరులో పంచాయతీ కార్మికులతో కలెక్టర్ వినోద్ కుమార్ కాఫీ విత్ క్లాప్ మిత్ర నిర్వహించారు. అదేవిధంగా పర్చూరు మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహిస్తున్న నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వినోద్కుమార్ సందర్శించి పరిశీలించారు. గోడౌన్ సౌకర్యం లేకపోవడంతో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరపలేకపోతున్నామని అధికారులు తెలపడంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి తక్షణం చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆర్డీఓ గ్లోరియా, డీపీఓ ప్రభాకరరావు, నియోజక వర్గ ప్రత్యేకాధికారి ఎస్.లవన్న, మార్కెటింగ్ డీఎం కరుణశ్రీ, వ్యవసాయ శాఖాధికారి అన్నపూర్ణ, మార్కెటింగ్ ఏడీ రమేష్ బాబు, డ్వామా పీడీ విజయలక్ష్మి, అధికారులు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకటరావు పాల్గొన్నారు. జిల్లాలో పుష్కలంగా యూరియా.. బాపట్ల: జిల్లాలో యూరియా పుష్కలంగా ఉందని రైతులు సంతోషంగా యూరియా తీసుకొనివెళ్లవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం బాపట్ల జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్ఎస్కేలు, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 112 మెట్రిక్ టన్నుల యూరియాను 978 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగిందని, ఇంకా 114 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. -
ధరలు తగ్గించాలి
నాడు అందుబాటులో.. కూటమి పాలనలో ఎరువుల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుకుంటూ పోతుండటంతో మోయలేని భారం వారిపై పడుతోంది. పెట్టుబడి సాయం అంతంత మాత్రం అందడం, గిట్టుబాటు ధర లేక నష్టాల పాలవుతున్నారు. గత ఏడాది వరి, పొగాకు, శనగ, మిర్చి, పత్తి రైతులు భారీగా నష్టాలు చవి చూశారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడంతోపాటు బస్తాకు అదనంగా వ్యాపారులు కూడా దోచుకుంటున్నారు. కూటమి సర్కార్ తీరుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకం పాత ధర కొత్త ధర -
డయేరియా కేసులు @ 100
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరులో డయేరియా కేసులు సెంచరీకి చేరువలో ఉన్నాయి. తగ్గుముఖం పట్టకపోగా రోజ రోజుకీ పెరుగుతుండటంతో ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం ఉదయానికి జీజీహెచ్లో బాధితుల సంఖ్య 92కు చేరింది. సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా అధికారులు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. కలుషిత నీరు కాదు, కలుషిత ఆహారం వల్లే సమస్య ఏర్పడిందంటూ కమిషనర్ డయేరియా వెలుగు చూసిన రోజే ప్రకటన చేయడం వివాదాస్పదంగా మారింది. జీజీహెచ్ వైద్యులు మాత్రం కలుషిత నీటి వల్లే ఈ సమస్య ఏర్పడిందని స్పష్టంగా చెబుతున్నారు. బాధితులు సంఖ్య బయటపెట్టని అధికారులు జీజీహెచ్కి వచ్చిన కేసులను కూడా పూర్తిగా బయటపెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులకు, ఆర్ఎంపీల వద్దకు వెళుతున్న వారు, ఇంటి వద్దనే వైద్యం తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలను వెల్లడించకుండా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జీజీహెచ్ను అకస్మికంగా తనిఖీ చేశారు. అతిసార, ఇతర బాధితులను పరా మర్శించారు. వైద్య సిబ్బంది సందర్శనలు, స్థానికుల తాగు నీటి వసతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర ప్రజల్లో ఆందోళన 2018లో ఆనందపేటతో పాటు పలు ప్రాంతాల్లో ఇదే విధంగా డయేరియాతో 30 మంది వరకూ మరణించడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నగరంలోని 57 డివిజన్లలో పలు ప్రాంతాల్లో ఇంటింటికీ సరఫరా అయ్యే తాగునీటి పైపులైన్లు మురుగు కాలువల్లోనే దర్శనమిస్తున్నాయి. మరికొన్ని మురుగు కాలువను అనుకొని వెళుతున్నాయి. వర్షం కురిస్తే చాలు పొంగి వాటర్ పైపులైన్లన్నీ కూడా మునిగిపోతున్నాయి. పైపుల్లోకి మురుగు నీరు చేరుతుందని నగరంలోని రామిరెడ్డితోట, ఆనందపేట, దుర్గానగర్, యానాదికాలనీ వాసులు చెబుతున్నారు. రంగు మారిన నది నీరు నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో నీరు కూడా రంగుమారి వస్తోంది. దీన్ని తక్కెళ్లపాడులో శుద్ధి చేసి నగరానికి తాగునీటిని సరఫరా చేస్తుంటారు. సాధారణ సమయాల్లో వాటర్ టర్బీడిటీ(బురద) 5 శాతంగా ఉన్నా వరదల సమయంలో ఇది 20 శాతానికి పైగానే ఉంటుంది. ఈ సమయంలో నీటిని శుద్ధి చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా యంత్రాంగం దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కూడా క్షీణించింది. ప్రతి రోజు కాలువలను శుభ్రం చేయకపోవడంతో దోమలు పెరుగుతున్నాయి. మా ప్రాంతంలో రెండు రోజుల నుంచి మురికి నీరు సరఫరా అవుతోంది. నీరు కూడా వాసన వస్తోంది. తప్పక వాటినే వాడాల్సిన పరిస్థితి నెలకొంది. తాగు నీటి సరఫరాపై అధికారులు దృష్టి సారించాలి. – అచ్చమ్మ, దుర్గానగర్(సుద్దపల్లి డొంక) మా ప్రాంతంలో కాలువల్లో పైపులైన్లు ఉన్నాయి. వాటిని అధికారులు తొలగించకపోవడంతో డ్రైనేజీ వాటర్ పైపుల్లోకి చేరుతోంది. దీని వల్ల విరేచనాలు, వాంతులు, జ్వరాలతో బాధపడుతున్నాం. – ఎండీ.ఎఫ్. షరీఫ్, ఆనందపేట -
పత్రికా స్వేచ్ఛను హరించటం సిగ్గుచేటు
ప్రభుత్వాలు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచే పత్రికా స్వేచ్ఛను హరించటం సిగ్గుచేటు. ఏ మీడియాకు లేని ఆంక్షలు ఒక్క ‘సాక్షి’కే ఎందుకు వర్తిస్తాయో కూటమి సర్కారు జవాబు చెప్పాలి. వాస్తవాలు రాస్తున్నారని ద్వేషమా? నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్నారనే ఆక్రోశంతో చంద్రబాబు, లోకేష్లు రగిలిపోతున్నారు. విలేకరుల సమావేశంలో కూటమి కుట్రల గురించి ప్రస్తావిస్తే.. ‘సాక్షి’పై.. ఎడిటర్పై కేసులు కట్టడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఆలోచించాలి. నిస్సిగ్గుగా మేం ఏం చేసినా అడిగే వాడు లేడన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేసులు పెట్టి కలాన్ని, పాత్రికేయులను నిలువరించలేరు. ఈ వాస్తవాన్ని కూటమి సర్కారు ఇప్పటికై నా గ్రహించాలి. – పోలూరి వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు -
దేవీ శరన్నవరాత్రుల వాల్పోస్టర్ల ఆవిష్కరణ
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : ఈ నెల 22 నుంచి చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 22వ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. దేవస్థానంలో శనివారం మహోత్సవాల గోడప్రతులను కమిటీ సభ్యులతో కలసి ఆమె ఆవిష్కరించారు. వచ్చేనెల రెండో తేదీ వరకు ఉత్సవాలు జరగుతాయన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, అడకా పద్మావతి, తుమ్మల నాగేశ్వరరావు, కుమ్మర క్రాంతి కుమార్, అంగడి శ్రీనివాసరావు, అడకా శ్రీనివాసరావు, పెద్ద బుజ్జి పాల్గొన్నారు. అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ నరసరావుపేట టౌన్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఎన్జీఓ సంఘాల ప్రతినిధులతో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్.సత్య శ్రీ శనివారం కోర్టు ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళలు, బాలికల అక్రమ రవాణా నిర్మూలనకు ఎన్జీఓలు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలన్నారు. సీనియర్ సిటిజన్లకు అన్ని విధాలైన సహాయ సహకారాలు అందించాలన్నారు. హెచ్ఐవీ నిర్మూలనకు, ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణకు ఎన్జీవోలు తగు చర్యలు చేపట్టాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ ఎన్జీఓల ప్రతినిధులు హృదయ రాజు, మీరా, డేవిడ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మొదట న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై ఆరోగ్యశాఖ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. నెహ్రూనగర్: గుంటూరు నగరంలో శనివారం రాత్రి ఉరుములతో భారీ వర్షం కురిసింది. నగర ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. అరండల్పేటలో పైపులైను కోసం తవ్విన గుంతల పక్కన మట్టి రోడ్డుపైనే ఉండటంతో వర్షం నీటితో చిత్తడిగా మారింది. పలువురు పాదచారులు, వాహన చోదకులు జారిపడి గాయపడ్డారు. డొంకరోడ్డులో మూడు వంతెనల వద్ద వర్షపునీటితో రాపోకపోలకు అంతరాయం ఏర్పడింది. కంకరగుంట అండర్పాస్ పూర్తిగా నీటి మయం కావడంతో అక్కడ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే దసరా ఉత్సవాలను అపహాస్యం చేయటానికి, అమ్మవారి ప్రతిష్టను, ఖ్యాతిని తగ్గించడానికి కూటమి నేతలు విజయవాడ ఉత్సవ్ పేరుతో అడ్డగోలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ శనివారం విమర్శించారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో రూ.100 కోట్లు దోచుకోవడానికి ఎంపీ కేశినేని చిన్ని తదితర నేతలు పథకం పన్నారని దుయ్యబట్టారు. -
ఇసుక అక్రమ తరలింపుపై నిలదీసినందుకు దాడి
కొల్లూరు: పట్టపగలు యథేచ్ఛగా వందల ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేపట్టడాన్ని ప్రశ్నించిన వ్యక్తిపై శుక్రవారం మండలంలోని చింతర్లంకలో అక్రమార్కులు దాడికి తెగబడ్డారు. గ్రామంలోని సీసీ రోడ్ల వెంబడి ఉన్న నీటి పైపులు, పశువులు, జీవాల కోసం ఉంచిన గ్రాసాలను తొక్కించుకుంటూ వెళ్లడం, ప్రజలకు హానికరంగా ట్రాక్టర్లు ప్రయాణించడంపై చింతర్లంకకు చెందిన ప్రజా సంఘాల నాయకుడు తోడేటి సురేష్ ప్రశ్నించారు. భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉండటంతోపాటు నదీ తీరం వెంబడి కోతలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని పట్టుపట్టడంతో వివాదం చోటుచేసుకుంది. సురేష్పై ఇసుక తవ్వకాలకు ప్రోత్సహిస్తున్న వ్యక్తులు తిరగబడటంతో తోపులాట చోటుచేసుకొంది. బాధితుడు ఓ ట్రాక్టర్పై పడటంతో గాయపడ్డారు. బంధువులు ఆయన్ను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొల్లూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ. 100 – రూ. 200 వరకు వసూలు చేపట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సంఘాల నాయకుడిపై దాడి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నదిలో ఉన్న ట్రాక్టర్లను అడ్డగించకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు నది వద్దకు వెళ్లే సమయానికి 50కి పైగా ట్రాక్టర్లు ఇసుక నింపుకొని సిద్ధంగా ఉన్నా వాటిని నిలువరించకుండా వెనుతిరగడంపై పోలీసుల తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. దీనిపై కొల్లూరు తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పెసర్లంక అరవిందవారధి, చింతర్లంక గ్రామాలలో పోలీసు, రెవెన్యూ సిబ్బందితో 24 గంటల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తన దృష్టికి సిబ్బంది తీసుకొచ్చారని పేర్కొన్నారు. -
లబ్ధిదారులకు దీపం నగదు బదిలీ చేయాలి
గుంటూరు వెస్ట్: దీపం పథకం – 2 ద్వారా జిల్లాలో 1,257 మందికి సబ్సిడీ నగదు ఖాతాల్లో నమోదు కావడం లేదని వచ్చిన ఫిర్యాదులపై శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్సీ హాలులో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, తెనాలి, మేడికొండూరు మండలాల్లో ఎక్కువగా నగదు జమ కాలేదని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 1257 మంది జాబితాను గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లకు పంపాలని జిల్లా సప్లయ్ అధికారికి సూచించారు. వినియోగదారులకు ఫోన్ చేసి ఎందుకు సబ్సిడీ నగదు పడలేదో వివరించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను వచ్చే బుధవారం నాటికి పూర్తి చేయాలని చెప్పారు. ఎల్డీఏం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులు లేటెస్ట్ ఆధార్ కార్డు , పాసు పుస్తకం బ్యాంక్కు తీసుకువెళ్లి అక్కౌంట్ డీ లింక్ చేయించుకుని, మళ్లీ లింక్ చేయించాలని సూచించారు. కొంత మందికి ఆధార్ ఇన్ ఆక్టివ్ అని వస్తున్నదని, వారికి పొరపాటున రెండు ఆధార్లు ఉంటే ఒక కార్డును ఇవ్వాలని తెలిపారు. కొందరికి ఆధార్ బ్యాంక్ ఖాతాకు లింక్ కానందున, ఈకేవైసీ చేయించుకోకపోవడం వల్ల సబ్సిడీ జమ కావడం లేదని వివరించారు. ఆధార్ అప్ డేట్ వివరాలు లేనివారు 1,031 మంది ఉన్నారని , వారు వివరాలు అందజేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
సమస్యలపై చర్చించే తీరిక ప్రభుత్వానికి లేదా?
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించే తీరిక కూటమి ప్రభుత్వానికి లేకుండా పోయిందని యూటీఎఫ్ రాష్ట అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు విమర్శించారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద విద్యారంగ, ఉపాధ్యాయ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ తలపెట్టిన రణభేరి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయుల బైక్ ర్యాలీకి జెండా ఊపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2023 జూలై నుంచి వర్తింప చేయాల్సిన 12వ పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటూ తేల్చలేదని, నాలుగు విడతలుగా డీఏ బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. సంబంధిత ఆర్థిక అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఒక్కరోజు సైతం చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై నిందలు మోపుతూ వారిని ఒత్తిడి గురి చేసే విధానాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించకపోవడంతో పాటు నాలుగు విడతల డీఏ బకాయిలపై వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏ.ఎన్. కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ మాట్లాడుతూ సెల్ఫోన్కు తావులేని పాఠశాల కావాలని, ప్రభుత్వ పాఠశాలను రక్షించుకుని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. రాజశేఖర్రావు, ఎం. కళాధర్ మాట్లాడుతూ ఈనెల 25న జరిగే రణభేరి రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
యువకుడు ఆత్మహత్య
చందోలు(కర్లపాలెం): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన ఖాజీపాలెం పంచాయతీ పరిధిలోని అయోధ్యనగర్లో చోటుచేసుకుంది. చందోలు ఎస్ఐ ఎంవీ శివకుమార్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు... అయోధ్యనగర్కు చెందిన కంతేటి మల్లేశ్వరరావు(29) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం రాత్రి తమ ఇంటి సమీపంలోని తుమ్మ చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడని తెలిపారు. మల్లేశ్వరరావుకు భార్య సముద్రాలు ఉందన్నారు. మృతుని సోదరుడు రమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించామని పేర్కొన్నారు. కారు ఢీకొని ద్విచక్రవాహన చోదకుడు మృతి కర్లపాలెం: బైకును కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, స్ధానికులు తెలిపిన వివరాల మేరకు.. కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామానికి చెందిన ఆట్ల అంజిరెడ్డి(54) చీరాల వెళ్లి బైకుపై తిరిగి వస్తున్నాడు. ఇంతలో బాపట్ల నుంచి చీరాల వైపు వెళుతున్న కారు తోటవారిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై అతడి బైకును ఎదురుగా ఢీకొంది. అంజిరెడ్డికి తీవ్రగాయాలు కావటంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కారు రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో అందులో ఉన్న ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈపురుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల ఆర్మీ ఉద్యోగి రాజస్థాన్లో మృతి బాపట్ల టౌన్: బాపట్ల ప్రాంతానికి చెందిన ఆర్మీ ఉద్యోగి రాజస్థాన్లో మృతి చెందారు. బాపట్ల మండలం, వెదుళ్ళపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన మేడిబోయిన వెంకట దుర్గారెడ్డి 2023లో అగ్నివీర్గా ఆర్మీ ఉద్యోగంలో చేరారు. రాజస్థాన్లో విధులు నిర్వర్తిస్తున్న దుర్గారెడ్డి గురువారం రాత్రి మృతి చెందారు. విశ్వసనీయ సమాచారం మేరకు దుర్గారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహం శనివారం స్వగ్రామానికి వస్తుందని ఆర్మీ అధికారులు, పోలీసులు తెలిపారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ సరికాదు
బాపట్ల టౌన్/చీరాల అర్బన్: పేదల వైద్యసేవలు అందించే మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయటం సరికాదని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున తెలిపారు. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు శుక్రవారం బాపట్ల జిల్లాలోని బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు, యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బాపట్లలోని మెడికల్ కళాశాల వరకు నిర్వహించారు. పేదలకు వైద్యసేవలు అందించే మెడికల్ కళాశాలలను చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం సరికాదని మేరుగ పేర్కొన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే ఏ స్థాయిలో ఉద్యమించడానికై నా వెనుకాడేది లేదన్నారు. ప్రైవేటుపరం చేస్తే సహించం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ చీరాల నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్బాబు అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పిలుపు మేరకు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి శుక్రవారం బాపట్లలోని మెడికల్ కాలేజీ భవనం వద్దకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్బాబు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయం దారుణమన్నారు. అలా చేస్తే సామాన్యులకు వైద్యం, పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహిస్తే ఫీజులు కూడా తగ్గుతాయన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కాలేజీల్లో రూ.వేలల్లో ఉన్న ఫీజులు.. ప్రైవేటుపరం అయితే రూ.లక్షల్లోకి వెళతాయన్నారు. టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించలేదన్నారు. 2019–24 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారన్నారు. కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నిధుల లేమి సాకుతో ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కాలేజీలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాపట్లకు తరలివెళ్లారు. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గోసాల అశోక్, పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, వేటపాలెం మండల అధ్యక్షులు సాధు రాఘవ, మాజీ అధ్యక్షులు బి.సుబ్బారావు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు డాక్టర్ ఐ.బాబూరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాస్టర్, మహిళా నాయకురాలు ప్రసన్న, జిల్లా మున్సిపల్ వింగ్ సభ్యులు కంచర్ల చక్రవర్తి, కౌన్సిలర్లు కీర్తి వెంకటరావు, కంపా అరుణ్, మాజీ కౌన్సిలర్ చెల్లి బాబూరావు, పార్టీ నాయకులు ఎస్.నవీన్, పోతురాజు, జంగా ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున -
రైల్వే ప్రాంగణాల పరిశుభ్రత సమష్టి బాధ్యత
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : స్వచ్ఛ భారత్ దార్శనికతకు అనుగుణంగా రైల్వే ప్రాంగణాలను, పరిసరాలను శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంలో సమష్టి బాధ్యత వహించాలని గుంటూరు రైల్వే డివిజనల్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ పిలుపు నిచ్చారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలం నుంచి గుంటూరు రైల్వే స్టేషన్ వరకు స్వచ్ఛతా హి సేవ –2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. డివిజన్ అధికారులు, సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, వలంటీర్లతో కలిసి డీఆర్ఎం ప్రారంభించారు. ర్యాలీలో సిబ్బంది, అధికారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రతి రైల్వే స్టేషన్, కార్యాలయాల ప్రాంగణంలో ఆకు పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు నిర్వహించడం వల్ల మానసిక సంతృప్తి దక్కుతుందని తెలిపారు. పచ్చని చెట్లు చుట్టు ఉన్న ప్రాంగణాల్లోకి కలుషితమైన గాలి రాదని తెలిపారు. అనంతరం ర్యాలీని విజయవంతంగా రైల్వే స్టేషన్ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ఎం కార్యాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.డీఆర్ఎం సుథేష్ఠ సేన్ -
విద్యారంగ సమస్యలను అసెంబ్లీలో చర్చించాలి
నరసరావుపేట ఈస్ట్: అసెంబ్లీ సమావేశాలలో కూట మి ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ లింగిశెట్టి బాలనవ్యశ్రీ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నవ్యశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో 77, 107, 108 జీఓలను రద్దు చేస్తామని ప్రకటించారని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా జీఓల రద్దు మాట అటుంచి వైద్యవిద్యను ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయించటం దారుణమన్నారు. ప్రైవేటు పరం చేయటాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేసారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6,400 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దాసరి హేమంత్కుమార్, ఎం.మధు, శ్రీనివాస్ పాల్గొన్నారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ రూ.6,400 కోట్లు విడుదల చేయాలి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర బాలికల కన్వీనర్ బాలనవ్యశ్రీ -
ప్రమాదంలో గ్రానైట్ కార్మికుడు మృతి
బల్లికురవ: రాయి ఎత్తుతున్న సమయంలో గొలుసు తెగి రాయి, యంత్రం మీద పడటంతో కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉప్పమాగులూరు సమీపంలోని హర్షిత గ్రానైట్ పరిశ్రమలో జరిగింది. ఎస్సై వై. నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్కు చెందిన రాకేష్ కుమార్(29) పరిశ్రమలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. కటింగ్ రాయిని మిషన్పైకి ఎత్తుతుండగా రాయికి కట్టిన గొలుగు తెగింది. రాయితోపాటు తుప్పు పట్టిన యంత్రం కూడా అతడిపై పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చిలకలూరిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కూటమి కుట్రలపై ఎగసిన నిరసన
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ’చలో మెడికల్ కాలేజీ’ విజయవంతం బాపట్ల టౌన్: ప్రభుత్వ వైద్యవిద్యను అంగడి సరుకుగా అమ్మేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున తెలిపారు. పార్టీ పిలుపు మేరకు శుక్రవారం బాపట్లలో ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమాన్ని యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గడియారస్తంభం, అంబేడ్కర్ సర్కిల్, జమ్ములపాలెం రైల్వే ఓవర్బ్రిడ్జి మీదుగా మెడికల్ కళాశాల వరకు సాగింది. జిల్లాలోని వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల నుంచి ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుకున్నారు. ర్యాలీలో ‘అన్నీ ప్రైవేటీకరణ చేస్తే ప్రభుత్వం ఎందుకు’, ‘ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కళాశాల జగన్ ఆశయం’, ‘ప్రతి బినామీకి ఓ మెడికల్ కళాశాల చంద్రబాబు ఆశయం’, ‘పేద విద్యార్థులకు వైద్య విద్య జగన్ సంకల్పం’, తన వర్గానికే వైద్యవిద్య బాబు సంకల్పం’ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం మెడికల్ కళాశాల వద్ద విలేకరులతో మేరుగ నాగార్జున మాట్లాడుతూ... పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారన్నారు. వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేసేందుకు నేడు చంద్రబాబు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. నీతి, నిజాయతీ లేకుండా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి... వాటిల్లో 7 పూర్తి చేసి, 2 మెడికల్ కళాశాలలకు సీట్లు కూడా కేటాయిస్తే వాటిని వెనక్కి పంపించిన ఘనుడు చంద్రబాబు అన్నారు. అసలు మెడికల్ కళాశాలలే ఏర్పాటు చేయలేదు... పునాదులే వేయలేదని హోంమంత్రి మాట్లాడటం దారుణమని మేరుగ పేర్కొన్నారు. ధైర్యం ఉంటే మీడియా సాక్షిగా రాష్ట్రంలోని ఏ మెడికల్ కళాశాల వద్దకై నా కూటమి నాయకులు చర్చకు రావాలని, తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేద, బడుగు, బలహీన వర్గాలపై అక్కసుతోనే పాలన సాగిస్తోందని చెప్పారు. నిధుల కొరతను సాకుగా వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసే కుట్రకు తెరతీశారన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు వరికూటి అశోక్బాబు (వేమూరు), ఈవూరి గణేష్ (రేపల్లె), కరణం వెంకటేష్ (చీరాల), చింతలపూడి అశోక్కుమార్ (అద్దంకి), గాదె మధుసూదన్రెడ్డి (పర్చూరు), యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేరుగ చందక్నాగ్, జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు యల్లావుల సోహిత్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. -
నేడు మాచర్లలో సీఎం పర్యటన
మాచర్లరూరల్:‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మాచర్ల పట్టణానికి సీఎం చంద్రబాబు శనివారం రానున్నారు. ఆయన ఉదయం 10.30 గంటలకు సాగర్ రోడ్డులోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిషు మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు. 10.45 నుంచి 11.05 గంటల వరకు 23వ వార్డు యాదవ బజారులో నిర్వహించే ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.10 నుంచి 11.28 గంటల వరకు ఆర్టీసీ గ్యారేజీ వద్ద సఫాయి కార్మికులు, మెడికల్ సిబ్బందితో కలిసి మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. స్వచ్ఛత రథాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం ప్రజా వేదిక వద్ద స్టాళ్లను సందర్శించి, వేదికపై నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆటోనగర్ వద్ద పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తర్వాత యాదవుల బజారులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు తదితరులు శుక్రవారం సీఎం పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. నేడు కోర్టు ప్రాంగణంలో సమావేశం నరసరావుపేట టౌన్: మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీస్ ఫర్ చిల్డ్రన్ పథకంపై శనివారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రధాన సివిల్ జడ్జి కె.మధుస్వామి శుక్రవారం తెలిపారు. విద్య, ఆరోగ్య, మహిళాశిశు సంక్షేమం,పంచాయతీ రాజ్, కార్మిక సంక్షేమ శాఖల అధికారులతో 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు కోర్టు ప్రాంగణంలో ఈ సమావేశం జరగనుందని పేర్కొన్నారు. రాహుకేతు పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు పెదకాకాని: శివాలయంలో రాహుకేతు గ్రహ పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ జీవీడీఎల్ లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 21వ తేదీన మహాలయ అమావాస్య ఆదివారం కావడంతో ఈ పూజలు చేయించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని శుక్రవారం ఆయన పేర్కొన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని రాహుకేతు పూజా మండపం వద్ద షామియానాలు, క్యూలైన్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ జరిగే పూజలకు ప్రధాన కౌంటర్లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సుప్రీంకోర్టులోనూ ఉచిత న్యాయ సహాయం 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్. సత్యశ్రీ నరసరావుపేట టౌన్: మధ్య ఆదాయ వర్గాల వారికి సుప్రీంకోర్టులో ఉచిత న్యాయ సహాయం అందించనున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎన్. సత్యశ్రీ శుక్రవారం తెలిపారు. సుప్రీంకోర్టులో ఉన్న మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లీగల్ ఎయిడ్ సొసైటీ ద్వారా సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. సంవత్సరానికి రూ. 12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు దీనికి అర్హులని వివరించారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ మంగళగిరిటౌన్: మంగళగిరి పట్టణ పరిధిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి సన్నిధిలో ఈ నెల 22వ తేదీ నుంచి జరగనున్న శ్రీదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల శుభ ఆహ్వానపత్రికను దేవస్థానంలో శుక్ర వారం ఆవిష్కరించారు. ఆలయ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
గుంటూరు చానల్లో వ్యక్తి గల్లంతు
కాజ(మంగళగిరి): గుంటూరు చానల్లో పడి వ్యక్తి గల్లంతైన ఘటన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాజలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ సీహెచ్. వెంకటేశ్వర్లు గురువారం తెలిపిన వివరాల మేరకు... కాజ గ్రామానికి చెందిన దొడ్డక రాంబాబు(40) పొలానికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తూ గుంటూరు చానల్పై ఉన్న వంతెన మీద నుంచి కాలువలో పడి గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ వెంకట్ ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకుని, గాలింపు చర్యలు చేపట్టారు.వంతెన శిథిలావస్థకు చేరడంతో పాటు ఇరువైపులా ప్రహరీ గోడ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు స్థానికులు తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులకు పలుమార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు భార్య ఆర్టీసీ కండక్టర్గా పని చేస్తుండగా, ఇద్దరు పిల్లలున్నారని స్థానికులు తెలిపారు. -
అతిసారం.. ప్రాణాంతకం
గుంటూరు మెడికల్: వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం (డయేరియా) ముఖ్యమైంది. సకాలంలో వైద్యం చేయించని పక్షంలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. గుంటూరు నగరంలో మంగళ, బుధవారాల్లో 25 మంది వ్యాధి బారిన పడి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఏటా వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అతిసార వ్యాధి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత ఏడాది గుంటూరు నగరం శారదా కాలనీలో 326 కేసులు నమోదు కాగా, ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. చేబ్రోలు పీహెచ్సీ పరిధిలోని మంచాల గ్రామంలో 62 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇటీవల నగరంలో కేసులు వస్తున్న నేపథ్యంలో వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం వ్యాధి సోకడానికి కారణాలు విరోచనాలు నీళ్లుగా, పలచగా అవుతుంటే డయేరియా(అతిసార వ్యాధి) అంటారు. వైద్య పరిభాషలో దీన్ని గ్యాస్ట్రో ఎంటైరెటిస్గా పిలుస్తారు. ఈ వ్యాధి జీర్ణవ్యవస్థకు సోకుతుంది. నీళ్ల విరేచనాలు నూటికి 70శాతం వైరస్ క్రిముల వల్ల వస్తాయి. కలుషితమైన నీటిని తాగడం వల్ల, మలం మీద వాలిన ఈగలు ఆహార పదార్థాలపై వాలిన తర్వాత తినడం ద్వారా వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలోకి ప్రవేశించి విరేచనాలవుతాయి. పిల్లలకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి డయేరియా వల్ల పెద్దవారికంటే పిల్లలకు ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. దాహం పెరిగితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగించాలి. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందిస్తారు. ఒక ప్యాకెట్ పౌడర్ను లీటర్ నీటిలో కలుపుకుని తాగించాలి. విరోచనాలు అయ్యేవారికి కారం, మసాలావంటి ఘాటు పదార్థాలు పెట్టకూడదు. డయేరియా తగ్గే వరకు వైద్యుల సలహా ప్రకారం మందులు, ఆహారం అందించాలి. -
ప్రభుత్వమే మెడికల్ కాలేజీ నిర్మించాలి
బాపట్ల అర్బన్: ప్రభుత్వమే బాపట్ల మెడికల్ కాలేజీని నిర్మించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సింగయ్య అన్నారు. నిర్మాణంలో ఉన్న బాపట్ల మెడికల్ కాలేజీని గురువారం ఆయన ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, అఖిలపక్ష నేతలు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం వలన వైద్య విద్యను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు దూరం చేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అన్నారు. డాక్టర్ కావాలన్న వారి కల కలగానే మిగిలిపోతుందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లు కూడా వారు కోల్పోతున్నారని చెప్పారు. చంద్రబాబు మెడికల్ సీట్లు అమ్ముకునే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. పీపీపీ విధానం వెనుక లంచాలు, తమ సామాజిక వర్గం అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులను 63 సంవత్సరాలకు ఎలా లీజుకు ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తారని మండిపడ్డారు. తన కేబినెట్లో ఉన్న మంత్రి నారాయణ, విద్యా సంస్థలు నడుపుతున్న వారికి మెడికల్ కళాశాలలను ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు కొచ్చర్ల వినయ్ రాజు, కుల నిర్మూలన పోరాట సమితి పట్టణ కార్యదర్శి కోలా శరత్, రైతు కూలీ సంఘం కార్యదర్శి కొండయ్య, బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఏపూరి జోసెఫ్ పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సింగయ్య -
మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
మంగళగిరి: మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడం వల్ల ఆత్మహత్యలను నివారించవచ్చని ఎయిమ్స్ ప్రొఫెసర్, డైరెక్టర్ డాక్టర్ అహెంతమ్ శాంత సింగ్ తెలిపారు. నగర పరిధిలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం ముగింపు సందర్భంగా డాక్టర్ అహెంతమ్ శాంత సింగ్ మాట్లాడుతూ ఆత్మహత్యల నివారణకు హెల్ప్ లైన్ నంబర్ 7331115179ను ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం,సృజనాత్మకత, విమర్శనాత్మకత ప్రోత్సహించే విధంగా పెయింటింగ్, వక్తృత్వం పోటీలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్ అధికారులు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేస్తున్న డైరెక్టర్ అహెంతమ్ శాంత సింగ్ తదితరులు ప్రతిజ్ఞ చేస్తున్న మెడికల్ విద్యార్థులు -
కౌలు రైతులకు చట్టమే ఆటంకం
రైతు సంఘం సీనియర్ నేత వై.కేశవరావు లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వటానికి గత ప్రభుత్వం తెచ్చిన చట్టమే ఆటంకంగా ఉందని రైతు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకోవాలంటే దరఖాస్తు ఫారంలో భూ యజమాని సంతకం ఉండాలనే నిబంధన విధించడం వల్ల గుర్తింపు కార్డు దక్కట్లేదని తెలిపారు. గుంటూరు కొరిటెపాడు రామన్నపేటలోని జనచైతన్య వేదిక హాలులో మంగళవారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ 2011 కౌలుదార్ల చట్టాన్ని సవరించి, గత ప్రభుత్వం 2019లో తెచ్చిన చట్టంతో కౌలు రైతులకు గుర్తింపుకార్డులు దక్కటమే గగనమైందని తెలిపారు. ఈ చట్టాన్ని సవరిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన టీడీపీ గెలిచాక సవరణ ముసాయిదాపై ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేసి, ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పడేశారని తెలిపారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ కౌలు రైతుల సమస్య నేడు దేశంలో చాలా పెద్దదని, వారి సంక్షేమాన్ని పట్టించుకోకపోతే అశాంతి, అలజడి పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి, ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు , డీబీఎఫ్ వ్యవస్థాపకులు కొరివి వినయ్కుమార్, కిసాన్ ఫౌండేషన్ నాయకులు సూరయ్య చంద్ర, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు తదితరులు ప్రసంగించారు. -
సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గుంటూరు వెస్ట్: విపరీతమైన పనిభారంతో పాటు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్ కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వే విధుల నుంచి విముక్తి కలిగించి మాతృ శాఖలకు అప్పగించాలని విన్నవించారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, బకాయిలు ఇప్పించాలని కోరారు. సచివాలయ ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు అప్గ్రేడ్ చేయాలని, స్పష్టమైన సర్వీస్ రూల్స్ రూపొందించి పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బదిలీలకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలతో జీవో ఇవ్వాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్కు విన్నవించారు. కార్యక్రమంలో కోశాధికారి ధనలక్ష్మి, వైస్ చైర్మన్ మధులత, మరియదాసు, జేఏసీ నాయకులు మధు, సతీష్, మహేష్, రాజారావు, బాషా, హిదాయత్, పవన్, ప్రసాద్, భరత్, సరోజిని, దీప్తి, ప్రశాంతి, గీత పావని, రాధిక పాల్గొన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి జిల్లాలో గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం నాయకులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ సంఘ నాయకులతో కలసి జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా గురువారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. చాలా కాలం నుంచి సమావేశం నిర్వహించలేదని, సమస్యలు చెప్పుకునే అవకాశం తమకు రాలేదని పేర్కొన్నారు. తాము ప్రభుత్వంతో కలిసి ప్రజలకు ఉత్తమ సేవలందించేందుకు ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. న్యాయమైన తమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కరిముల్లా షాఖాద్రి, సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ, కోటా సాహెబ్, జిల్లా కోశాధికారి పోతురాజు, నగర శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత, కార్యదర్శి సుమిత్రాదేవి, షబానా, అరుణ కుమారి, రమణి పాల్గొన్నారు. -
ఉచితంగా వైద్య సేవలు
వర్షాకాలంలో కేసులు నమోదయ్యే దృష్ట్యా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. బాధితులకు చికిత్స అందించేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు, సైలెన్లు, అన్ని అందుబాటులో ఉంచాం. డయేరియా సోకిన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ముందస్తుగా గుర్తించి నివారణ చర్యల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అతిసార వ్యాధి బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. –డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు డయేరియా సోకిన వారికి ద్రవ రూపంలో ఉండే ఆహారం అందజేయాలి. మజ్జిగ, పాలు, బార్లీ గంజి, పలచగా తయారు చేసిన సగ్గు బియ్యం, రాగి జావ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, సోయాబీన్స్ రసం, ఇతర పళ్ల రసాలు ఇవ్వొచ్చు. మలమూత్ర విసర్జన పిదప, భోజనం చేసే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం చాలా ఉత్తమం. ఇంట్లో వైద్యాలు, మందుల షాపుల వద్దకు వెళ్లి మందులు తెచ్చుకోవడం చేయవద్దు. డయేరియా వచ్చినప్పుడు అర్హత ఉన్న వైద్య నిపుణుడి వద్దకు వెళ్లాలి. – డాక్టర్ షేక్ నాగూర్బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గుంటూరు -
ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉద్యోగోన్నతిపై ఎంపీడీవోలుగా నియమితులైన అధికారులకు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా నియామక ఉత్తర్వులను అందజేశారు. గురువారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న నలుగురు ఏవోలు, ఆరుగురు డిప్యూటీ ఎంపీడీవోలకు ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ విడుదల చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా నియామకపత్రాలను అందజేశారు. నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు తమవంతు సేవ చేయడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, జీ సెక్షన్ ఏవో పూర్ణచంద్రారెడ్డి, మోహన్రావు పాల్గొన్నారు. -
కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలి
చీరాల అర్బన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు డాక్టర్ విస్తర్ల బాబూరావు అన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు ఆదేశాలతో గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు అధ్యక్షతన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం తలపెట్టిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలన్నారు. ప్రైవేటీకరణను విరమించుకోకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిర్మాణ దశలో ఉన్న కాలేజీలను త్వరగా పూర్తి చేయాలన్నారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గోసాల అశోక్, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, మాజీ అధ్యక్షుడు బి.సుబ్బారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాస్టర్, మహిళా నాయకురాలు ప్రసన్న, జిల్లా మున్సిపల్ వింగ్ సభ్యుడు కంచర్ల చక్రవర్తి, మాజీ కౌన్సిలర్ చెల్లి బాబూరావు, పార్టీ నాయకులు ఎస్.నవీన్, పోతురాజు, జంగా ప్రేమ్ పాల్గొన్నారు. -
రైతులను వెంటనే ఆదుకోవాలి
పర్చూరు(చినగంజాం): రాష్ట్రంలో రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని, యూరియా కొరత లేకుండా చూడాలని బాపట్ల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డిలు డిమాండ్ చేశారు. ఎరువుల బ్లాక్ మార్కెట్, యూరియా కొరతపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. గాదె మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. ముందుగా పర్చూరులోని పార్టీ కార్యాలయం నుంచి గాదె ఆధ్వర్యంలో నియోజక వర్గ పరిధిలోని రైతులు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలు దేరి స్థానిక బొమ్మల సెంటర్లోని వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి రైతులంతా శాంతియుతంగా మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ పి. బ్రహ్మయ్యకు వినతి పత్రం అందజేసిన అనంతరం మాజీ మంత్రి నాగార్జున మాట్లాడారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారన్నారు. వ్యవసాయం దండగ అని సలహా ఇచ్చిన చంద్రబాబు ... రైతులను ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తూ నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ వరి సాగు వలన ప్రయోజనం లేదంటూ సీఎం ఉచిత సలహాలు ఇస్తున్నారన్నారు. బర్లీ పొగాకు రైతులకు పాట్లు గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంగా రైతులను నమ్మించి మోసగిస్తూ వస్తోందన్నారు. బర్లీ పొగాకు కొనుగోలు విషయంలో అన్నదాతలను ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ అంటూ రైతులను విడగొట్టిందన్నారు. యూరియాను కూటమి నాయకులు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ఆరోపించారు. జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, మాజీ జెడ్పీటీసీ భవనం శ్రీనివాసరెడ్డి, ఆరు మండలాల కన్వీనర్లు మున్నం నాగేశ్వరరెడ్డి, రావూరి వేణు, చిన్ని పూర్ణారావు, జంపని వీరయ్య చౌదరి, కఠారి అప్పారావు, పఠాన్ కాలేషావలి, ఉప్పలపాటి అనిల్, ముప్పాళ్ళ రాఘవయ్య, కొల్లా శ్రీహరి, శేషగిరి, ఎం.జగన్నాథం, జంగా అనిల్, దాసరి వెంకటరావు, తోకల కృష్ణమోహన్, వై.హరిప్రసాద్, కె. శ్రీనివాసరావు, జి. చిన్న, జె. శేషయ్య, వై. సుబ్బారెడ్డి, పి.వీరయ్య, డి.నరసింహారావు, రూబేను, బ్రహ్మారెడ్డి, వై. రామకృష్ణ, పి. ప్రకాష్, ఎ. సూరి, జి. ఉమాశంకరెడ్డి, బట్టు అనిల్ కుమార్, గోగినేని సతీష్, ఎన్.రామాంజనేయులు, బసవయ్య, మొగిలి నాగేశ్వరరావు, కె.అనిల్, వైస్ ఎంపీపీ యార్లగడ్డ సుబ్బారావు, అహ్మద్, దండా చౌదరి, గోపతోటి బాబురావు, డి. వెంకటేశ్వరరెడ్డి, బుల్లిబాబు, అట్లూరి వెంకయ్య, తమ్మలూరి సురేష్, మైలా చిననాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పాత వారికే బార్ టెండర్లు
చీరాల అర్బన్: చీరాలలోని బార్ అండ్ రెస్టారెంట్లకు జరిగిన లాటరీలో నాలుగు టెండర్లు పాత వారికే దక్కాయి. గురువారం జిల్లాలోని కలెక్టరేట్ కాంపౌండులో పీజీఆర్ఎస్ హాలులో జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ టెండర్ల లాటరీ డ్రా నిర్వహించారు. గతంలో ఏడు బార్లకుగాను ఒక దానికే నాలుగు టెండర్లు పడ్డాయి. మిగిలిన వాటికి రాలేదు. గడువు పెంచగా.. గురువారం ఆరు బార్లకుగాను నాలుగింటికి డ్రా నిర్వహించారు. ఈగల్, గాయత్రి, కనకదుర్గ, లహరి బార్ అండ్ రెస్టారెంట్లు అవకాశం దక్కించుకున్నాయి. కొత్తవారు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు సార్లు టెండర్లు గడువును పెంచారు. చివరకు పాత వారే నాలుగు టెండర్లు దక్కించున్నారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్.ఆయేషా బేగం, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, ఎకై ్సజ్ అధికారులు పాల్గొన్నారు. పర్చూరు(చినగంజాం): ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలోని పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె. విజయ అన్నారు. పర్చూరులోని స్టేషన్ను ఆమె గురువారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి డేటాను సమీక్షించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఒంగోలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ (ఎన్ఫోర్స్మెంట్) ఎ. జనార్దన్, పర్చూరు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ భుజంగరావు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం, శ్రీధర్ బాబు, జి. రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు. భట్టిప్రోలు: స్థానిక బౌద్ధస్తూపం ఎంతో పురాతనమైనదని లోక్సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. గురువారం స్తూపాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి స్తూపం ప్రపంచంలోనే మరెక్కడా లభించకపోవడం ప్రత్యేకత అన్నారు. బౌద్ధ వారసత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర నిధులను సమకూర్చి ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయపురి సౌత్: కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ బీపీ పాండే ఆధ్వర్యంలో సభ్యులు కేకే జాన్గిడ్ తదితరులతో కలిసి గురువారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్ ప్రధాన డ్యామ్, గ్యాలరీలు, రైట్ కెనాల్, పవర్ హౌస్, ప్రధాన జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించారు. స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్లో భాగంగా ప్రాజెక్టు అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రధాన డ్యాం, పైలాన్ పిల్లర్ పార్కులను శుభ్రపరిచారు. పార్కులో మొక్కలు నాటారు. శుక్రవారం లో లెవెల్ కెనాల్, లెఫ్ట్ కెనాల్లను సందర్శించనున్నారు. కేఆర్ఎంబీ ఈఈ శ్రీనివాసరావు, సాగర్ డ్యాం ఈఈ సీతారాం, డీఈ అశోక్ ఆనంద్, ఏఈ కృష్ణయ్య తదితరులు ఉన్నారు. -
కూటమి ప్రైవేటీకరణపై ఆగ్రహ జ్వాల
నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీవిజయవంతం చేయాలి బాపట్ల అర్బన్/వేమూరు/అద్దంకి: కూటమి ప్రభుత్వ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వైద్య విద్య దూరం చేసేలా ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో బాపట్లలో ‘చలో మెడికల్ కళాశాల’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నటికీ ప్రైవేటు వ్యక్తులు, పెట్టుబడిదారులకు మద్దతుగా వ్యవహరిస్తుంటారని గుర్తుచేశారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఆయనకు చిన్నచూపు అని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో చేపట్టిన మెడికల్ కళాశాలల ఏర్పాటును చంద్రబాబు స్వార్థపూరిత ఆలోచనలతో నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ‘చలో మెడికల్ కళాశాల’ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు పార్టీ ఆధ్వర్యంలో ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మేరుగు నాగార్జున, నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. మేరుగ నాగార్జున ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ శుక్రవారం ‘చలో మెడికల్ కళాశాల’ కార్యక్రమం విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నియోజక వర్గంలోని విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని చెప్పారు. యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి మంచి ఆరోగ్యం అందించాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల, ప్రభుత్వ వైద్యశాల ఉండాలన్నారు. వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ చేయడమే చంద్రబాబు వైఖరి అన్నారు. వైఎస్ జగన్ తన పాలనలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. నాడు–నేడు పథకం ద్వారా ప్రతి పాఠశాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రవేటీకరణను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జడ శ్రావణ కుమార్ విజయవాడలో ధర్నా చౌక్ వద్ద గురువారం చేపట్టిన ధర్నాకు అశోక్కుమార్ మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బాపట్లలో శుక్రవారం జరిగే చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీహెచ్ అశోక్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, విద్యార్థి, యువజన విభాగ నేతలు రావాలని పిలుపునిచ్చారు. వరికూటి అశోక్బాబు సీహెచ్ అశోక్ కుమార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు బాపట్ల జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య గురువారం మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలకు వైద్య విద్య అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించాలని సంకల్పించారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది పేద పిల్లలకు వైద్య విద్యను దూరం చేయడమేనని పాలకుల తీరుపై మండిపడ్డారు. ప్రజలకు ఉచిత వైద్యం అందక అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రైవేటీకరణ వలన పేద, మధ్యతరగతి వారు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఈ అన్యాయాన్ని అడ్డుకోవడం కోసం అందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు. శుక్రవారం బాపట్ల పట్టణం రఽథం బజార్ పార్టీ కార్యాలయం నుంచి బాపట్ల మెడికల్ కాలేజీ వద్దకు శాంతియుత నిరసన ర్యాలీ చేపడతామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, వివిధ పార్టీ అనుబంధ జిల్లా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పేద, మధ్య తరగతి వారిపై కూటమి నేతలు తమ సవతి తల్లి ప్రేమను చాటుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి వైద్య విద్య దూరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ప్రైవేటీకరణకు తెరతీసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తనకు కావాల్సిన వారికి ధారాదత్తం చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు గురువారం మండిపడ్డారు. మాజీ మంత్రి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీహెచ్ అశోక్ కుమార్, బాపట్ల జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్యలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బాపట్లలో శుక్రవారం జరిగే కార్యక్రమానికి ప్రతిఒక్కరూ మద్దతు తెలుపుతూ తరలిరావాలని పిలుపునిచ్చారు. -
సక్రమంగా పొగాకు కొనుగోలు
జిల్లా కలెక్టర్ ఆదేశం బాపట్ల టౌన్: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు సక్రమంగా సాగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల పట్టణంలోని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములను జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. తొలుత బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోదాముల్లో నిల్వ సామర్థ్యం లేకపోతే పొరుగు జిల్లాలకు సరుకు పంపాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 7,788 మంది రైతుల నుంచి 12వేల మెట్రిక్ టన్నుల పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మరో 1,600 మెట్రిక్ టన్నులు కొనాల్సి ఉందన్నారు. మార్క్ఫెడ్ ఏడీ కరుణశ్రీ,, ఆర్డీవో పి.గ్లోరియా, తహసీల్దార్ సలీమా పాల్గొన్నారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు అసంక్రమిత వ్యాధులు రాకుండా మహిళలు ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో స్వస్థనారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరూ తప్పనిసరిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ విజయమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధా మాధవి, సిబ్బంది పాల్గొన్నారు. విశ్వకర్మ సిద్ధాంతాలు పాటించాలి ప్రతి ఒక్కరూ విశ్వకర్మ సిద్ధాంతాలను పాటించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యేతో కలిసి నిర్వహించారు. ఇన్చార్జి జేసీ జి.గంగాధర్ గౌడ్, రేపల్లె సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి బి.శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇ–ఆఫీస్ ఫైల్స్ అమలుకు ఆదేశం ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఇ–ఆఫీస్ ఫైల్స్ విధానం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారదర్శకత కోసం ప్రతి దస్త్రాన్ని ఆన్లైన్లో ఉంచాలన్నారు. డ్వామా కార్యాలయంలో అత్యధికంగా దస్త్రాలు టేబుల్స్పైనే ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడా యూరియా పంపిణీ చేస్తాం ఈ సీజన్లో సాగు చేసిన ప్రతి ఎకరాకు యూరియాను అందిస్తామని జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు 186.590 మెట్రిక్ టన్నుల యూరియాను 1,281 మంది రైతులకు పంపిణీ చేశామన్నారు. ఇంకా 486 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. మార్టూరులో ఆకస్మిక పర్యటన మార్టూరు: బాపట్ల జిల్లా కలెక్టర్ బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మార్టూరులో ఆకస్మికంగా పర్యటించారు. ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో ఎంపికై న ఉపాధ్యాయ అభ్యర్థులతో ఈ నెల 19వ తేదీ అమరావతిలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు తదితర ప్రాంతాల చెందిన 500 మంది ఒకరోజు ముందుగానే రానుండగా.. మార్టూరులో బస చేయడానికి ఏర్పాటు చేశారు. మార్టూరులోని వివేకానంద, రాయల్ స్కూలు, హర్షిణి కళాశాలలో ఏర్పాటు చేస్తున్న వసతులను ఆయన పరిశీలించారు. వెంట ఆర్డీవో గ్లోరియా, తహసీల్దార్ టి.ప్రశాంతి తదితరులున్నారు. -
అవుట్ సోర్సింగ్ టీచర్లను తొలగిస్తే అసెంబ్లీ ముట్టడి
ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్ చిలకలూరిపేట: గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను తొలగించమని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్ విమర్శించారు. పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను బుధవారం ఆయన కలిసి సమస్యలు చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం డీఎస్సీ నియామకాలు చేసే పనిలో ఉందన్నారు. తద్వారా ఇప్పటివరకు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 191 గిరిజన గురుకుల పాఠశాలలు ఉండగా అందులో 1700 మంది అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. వీరంతా ఎన్నో ఏళ్లుగా ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్నప్పటికీ వీరిని తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ఏడాది నవంబర్లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు ఆందోళన కార్యక్రమాలు చేపడితే చర్చల ద్వారా సమస్య పరిష్కరిస్తామని ఆనాడు గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఉపాధ్యాయులుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులు హైకోర్టును, జాతీయ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించినట్లు తెలిపారు. వారి ఆదేశాలను సైతం తుంగలో తొక్కివేస్తున్నారని, జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించకపోతే సంబంధిత ఉపాధ్యాయులతో కలసి అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు. పి.స్టాలిన్బాబు, జి.ఏసుదాసు, ఇ.నారాయణబాబు, ఎ.అంజన కుమారి, యు.ఊర్మిళ, జి.పవన్సుధా పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యానికి పెను ముప్పు
కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలపై సాక్షి దినపత్రికలో ప్రచురించారని పోలీసులు కేసులు నమోదు చేయడం తగదు. సాక్షి ఎడిటర్, విలేకరులను నిందితులుగా చూపడం హాస్యాస్పదం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పత్రికలపై కేసులు పెట్టి వేధించడం దారుణం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ హరించేలా కేసులు నమోదు చేయడం పెనుముప్పుకు సంకేతం. పాత్రికేయులకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలి. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. – నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే, పెదకూరపాడు -
యూరియా సరఫరాపై ఆందోళన వద్దు
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వెస్ట్: జిల్లాలో యూరియా సరఫరాపై రైతులు అనవసర ఆందోళనతో అవసరానికి మించి నిలువ చేసుకోకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులతో కలసి వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అధిక వర్షాలు, యూరియా సరఫరాపై అపోహలతో కొంతమంది రైతులు అవసరానికి మించి ముందస్తుగా నిల్వ చేసుకున్నట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం సరిపడా అందుబాటులో ఉందని, మరికొంత కూడా జిల్లాకు వస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా సరఫరా కోసం ఆఫ్ సీజన్లోనే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాస్తవంగా పంటలు సాగు చేస్తున్న భూ యజమానులకు, కౌలు రైతులకు మాత్రమే యూరియా పంపిణీ జరిగేలా కేంద్ర ప్రభుత్వ యాప్లో ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ,రాష్ట్ర వ్యవసాయ అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 13వేల భూసార పరీక్షలు జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు 13వేల భూసార పరీక్షలు చేశామని మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణ , ఫలితాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రైతులు తెలియజేశారన్నారు. గ్రామస్థాయిలోనే నిర్వహించి వెంటనే ఫలితాలు అందించేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు నేషనల్ సాయిల్ హెల్త్ మిషన్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ –క్రాప్ బుకింగ్ ఇప్పటి వరకు 58 శాతం మాత్రమే పూర్తయిందని, నూరు శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీకి సూచించామని చెప్పారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద జిల్లాలో రైతులు 10 శాతం మంది మాత్రమే నమోదైనట్లు తెలిపారు. ప్రకృతి విపత్తుల సంభవించినప్పుడు బీమాలో నమోదైతే నష్టపరిహారం పొందవచ్చని రైతులందరికీ అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు ఆయన సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అయితా నాగేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, మార్కెఫెడ్ డీఎం నరసింహా రెడ్డి, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజరు హరిగోపాలం, జిల్లా ఉద్యానశాఖ అధికారి రవీంద్రబాబు, ఏపీఎంఐపీ పీడీ వజ్రశ్రీ, పశుసంవర్ధకశాఖ డీడీ సత్యనారాయణ, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రైతుల పక్షాన నిరంతర పోరాటం
● వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి ● నేడు పర్చూరులో రైతు సమస్యలపై అధికారులకు వినతిపత్రం పర్చూరు(చినగంజాం): రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి అన్నారు. బుధవారం ఇంకొల్లు మండలంలోని పావులూరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో వైఎస్సార్సీపీ స్థాపన నుంచి రైతుల కోసం కృషి చేస్తూనే ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలు స్థాపించి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుబాటులోకి ఉంచామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను ఇబ్బందులు పడుతున్నట్లు దుయ్యబట్టారు. రైతులకు చేసిన మేలేమీ లేదన్నారు. ఎరువులు, పురుగు మందులు సరఫరా లేక, గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు కన్నీటిపాలయ్యారని ఆరోపించారు. పొగాకు రైతులు నట్టేట మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు విషయంలో కృత్రిమ కొరత సృష్టించి, తమ పార్టీలోని నాయకులతోనే యూరియాను దారి మళ్లించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు గురువారం పర్చూరులో ఽరైతులకు మద్దతుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంచనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు పర్చూరులోని పార్టీ కార్యాలయం నుంచి బయలు దేరి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుంటామన్నారు. అధికారులకు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
కూటమి వైఫల్యాలపై పోరుబాట
చెరుకుపల్లి: ప్రైవేటీకరణ పేరుతో జాతీయ సంపదలైన వైద్య కళాశాలలతో రాష్ట్రంలో కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పార్టీ మండల కన్వీనర్లు, యువజన, విద్యార్థి విభాగ ప్రతినిధులు, పార్టీ నాయకులతో బుధవారం గుళ్ళపల్లిలోని తన కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని ఎండగట్టేందుకు పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బాపట్ల మెడికల్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమానికి తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్రాన్ని ఒప్పించి రూ.వేల కోట్లతో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. వాటిలో ఐదు కళాశాలలు శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయని, వాటిలో తరగతులు కూడా జరుగుతున్నట్లు వివరించారు. మిగిలిన కళాశాలల నిర్మాణం కూడా వివిధ దశల్లో ఉన్నట్లు గుర్తుచేశారు. నిర్మాణాలను పట్టించుకోని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ కాలేజీలను పూర్తి చేయకుండా పీపీపీ పేరుతో ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేయటం దుర్మార్గమన్నారు. ఇప్పటికై నా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి నీలం వీరేంద్ర, జిల్లా యువజన విభాగం కార్యదర్శి బడుగు ప్రజన్న తేజ, రేపల్లె నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు దొంతిబోయిన ఏడుకొండలు రెడ్డి, రేపల్లె నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎండీ వశీం, చెరుకుపల్లి మండల యువజన విభాగ అధ్యక్షుడు తుమ్మా రామకృష్ణారెడ్డి, చెరుకుపల్లి మండల కన్వీనర్ దుండి వెంకట రామిరెడ్డి, నగరం మండల కన్వీనర్ ఇంకొల్లు రామకృష్ణ, దగ్గుమల్లి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా గొర్రెల దొంగల ముఠా అరెస్ట్
అద్దంకి: గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అద్దంకి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ మొయిన్ తెలిపిన వివరాల మేరకు... కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామానికి చెందిన చీదరబోయిన రాజేంద్రప్రసాద్ గతంలో గొర్రెల వ్యాపారం చేస్తుండేవాడు. పేకాట ఆడి డబ్బు పోగొట్టుకున్నాడు. ఉన్న ఎకరా భూమి అమ్ముకోవడంతోపాటు అప్పుల పాలయ్యాడు. వ్యాపారం చేసిన ప్రాంతాల్లోనే గొర్రెల దొంగతం చేసి వాటిని విక్రయించి డబ్బు సంపాదించాలని భావించాడు. అదే గ్రామానికి చెందిన ఏసీ మెకానిక్ షేక్ మహ్మద్ రఫీ, కారంచేడులోని కారు సర్వీసింగ్ సెంటరుకు చెందిన మైలా శ్రీనివాసరావు, తనకు పరిచయం ఉన్న మరో వ్యక్తి సన్నెబోయిన శ్రీనివాసరావులతో ముఠా కట్టాడు. బాపట్ల, చీరాల, కారంచేడు, కుంకులమర్రు, అద్దంకి, మార్టూరు, ప్రాంతాల్లో ముందుగా కారులో వెళ్లి రెక్కీ నిర్వహించేవారు. రాత్రి సమయంలో కారులోని సీట్లు తొలగించి అందులో గొర్రెలను ఎత్తుకొచ్చేవారు. వాటిని తమకు తెలిసిన వారి వద్ద ఉంచేవారు. కేసుల దర్యాప్తునకు పోలీసులు బృందాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ మొయిన్ ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాజు, ఏఎస్సై వసంతరావు, ఎస్సై నరసింహల ఆధ్వర్యంలో ముఠాను అరెస్ట్ చేశారు. 21 గొర్రెలు, 4 పాట్టేళ్లను, కారును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.71 లక్షలు ఉంటుందని డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ సుబ్బరాజు, ఎస్సై నరసింహ, ఏఎస్సై వసంతరావు తదితరులున్నారు. సీఐ, ఎస్సై బృందానికి ఎస్పీ ప్రకటించిన రివార్డులు అందజేశారు. -
ఆచార్య అమృతవల్లికి జీవిత సాఫల్య పురస్కారం
పెదకాకాని(ఏఎన్యు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రం, సూక్ష్మజీవ శాస్త్ర విభాగంలో ఆచార్యులుగా సేవలు అందిస్తూ విస్త్రృత పరిశోధనలు చేస్తున్న ఆచార్య అడిపూడి అమృతవల్లికి జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఉత్తమ ఆచార్యులుగా, పరిపాలకురాలిగా పురస్కారం ఆమెను వరించింది. ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ భారతీయ శాఖ ఆధ్వర్యంలో జమ్మూలో 14,15,16 తేదీల్లో జరిగిన జాతీయ సదస్సుకు అమృతవల్లి అధ్యక్షత వహించారు. దశాబ్దం పైగా పీజీపీఆర్ అధ్యక్షురాలిగా, మూడు దశాబ్దాలకు పైగా అధ్యాపకురాలిగా పరిశోధకురాలుగా ఆమె చేస్తున్న సేవలకు గానూ ఈ పురస్కారం లభించింది. షేర్ ఈ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ టెక్నాలజీ ఆఫ్ జమ్మూ ఉపకులపతి బి.ఎన్. త్రిపాఠి, ఘజియాబాద్లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్–ఇన్నోవేషన్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్ ధార్, అమెరికా ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ చైర్మన్ ఆచార్య ఎం.ఎస్. రెడ్డి, జమ్మూ సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్, ఎస్కేయూఏఎస్టీ పరిశోధక విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె. గుప్తా వంటి ప్రముఖుల చేతుల మీదుగా అమృతవల్లికి పురస్కారం అందించారు. పుడమి– పంటల సంరక్షణే ధ్యేయంగా భారత దేశ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు విజ్ఞాన వేత్తలతో ఈ సదస్సు జరిగింది. నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆచార్యులు, వివిధ విభాగాల అధ్యాపకులు, పలువురు పరిశోధకులు అమృతవల్లికి అభినందనలు తెలిపారు. ఉత్తమ ఆచార్యులుగా, పరిపాలకురాలిగా గుర్తింపు షేర్ ఈ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ టెక్నాలజీలో ప్రదానం పుడమి– పంటల సంరక్షణపై జమ్ము విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు -
ప్రబలిన డయేరియా
గుంటూరు మెడికల్ / నెహ్రూనగర్: గుంటూరు నగర ప్రజలు ఒక్కసారిగా ప్రబలిన డయేరియాతో ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి నిత్యం పది మందికి పైగా బాధితులు వాంతులు, విరేచనాలతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వరుసగా డయేరియా కేసులు నమోదవుతుండటంతో ఆసుపత్రి అధికారులు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. కొద్దిరోజులుగా నగరంలో విపరీతంగా వర్షాలు కురవడంతో పాటు, నీటి నిల్వలు బాగా పేరుకు పోయాయి. తద్వారా నీరు కలుషితమై డయేరియా ప్రబలినట్లు బాధితులు వాపోతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో మున్సిపల్ వాటర్ పైపులైనులు మురుగు నీటిలో ఉన్నాయి. అవి దీర్ఘకాలికంగా కాల్వల్లో ఉండటం వల్ల తుప్పుపట్టి పోయి లీకవుతున్నాయి. వ్యర్థాలు మంచినీటి పైపులైనుల ద్వారా కుళాయిలోకి చేరి వ్యాధులు కలుగ చేసేందుకు కారణమవుతున్నాయి. గతంలో డయేరియా నమోదైన ప్రాంతాల్లో అధికారులు పైపులైనులు కొన్నింటిని మార్పించారు. పూర్తి స్థాయిలో ప్రక్రియ చేపట్టకపోవడంతో మరలా డయేరియా సమస్య ప్రబలింది. కలుషిత నీరే కారణం మంచినీరు కలుషితంగా మారడం వల్లే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధితులు వాపోయారు. మంచినీరు మురుగు వాసన వస్తుందని తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర,ఊ నీటి కాలుష్యం జరగడం వల్లే వ్యాధులు ప్రబలుతున్నట్లు ఆరోపిస్తున్నారు. -
పల్నాడు జిల్లాకు రెండో విడత ఎరువులు రాక
నాదెండ్ల: పల్నాడు జిల్లాకు రెండో విడతగా 1185 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులను ప్రభుత్వం కేటాయించిందని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు చెప్పారు. సాతులూరులోని రైల్వే ర్యాక్ పాయింట్ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత కేటాయించిన ఎరువులను రైతులకు పంపిణీ చేశామన్నారు. రెండో విడతలో స్పిక్ యూరియా 530 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 210 మెట్రిక్ టన్నులు, డీఏపీ 445 మెట్రిక్ టన్నులు వచ్చాయన్నారు. వీటిని సొసైటీలు, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎరువులు రైతులకు సక్రమంగా అందేలా స్ధానిక వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయనవెంట జిల్లా ఏడీఏ కార్యాలయం సిబ్బంది హనుమంతరావు, శ్రీనివాసరావు, ఏఓ శ్రీలత పాల్గొన్నారు. సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుట్బాల్, సెపక్ తక్రా బాల, బాలికల జట్ల ఎంపికలు బుధవారం నిర్వహించారు. ఈ ఎంపికలను ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్–19 ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.నరసింహా రావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో అండర్–19 స్కూల్ గేమ్స్ జాయింట్ సెక్రటరీ కె.పద్మాకర్, పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎ.సురేష్ కుమార్, విద్యా కేంద్రం డైరెక్టర్ నిమ్మగడ్డ చిట్టిబాబు, ప్రిన్సిపాల్ షేక్ మౌలాలి, ఫిజికల్ డైరెక్టర్ పి.శివరామకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు గండు సాంబశివరావు, బి.అనిల్ దత్త నాయక్, కోనంకి కిరణ్ కుమార్ ఫుట్బాల్ కోచ్లు పి.సురేష్, పి.వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగే రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొంటారని స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.నరసింహారావు తెలిపారు. సత్తెనపల్లి: ఆంధ్ర గాంధీగా పేరు తెచ్చుకున్న స్వాతంత్య్ర సమరయోధులు, సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు వావిలాల గోపాలకృష్ణయ్య ఆదర్శప్రాయుడని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వావిలాల స్మృతివనంలో బుధవారం నిర్వహించిన వావిలాల గోపాలకృష్ణయ్య 119వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మద్యపాన నిషేధం కోసం వావిలాల ఎన్నో పోరాటాలు చేశారన్నారు. సత్తెనపల్లి శాసనసభ్యుడిగా వరుసగా 1952 నుంచి 1967 వరకు నాలుగు ఎన్నికల్లో గెలుపొంది 20 ఏళ్ల పాటు పని చేశారన్నారు. డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య జీవితం అందరికీ ఆదర్శం కావాలన్నారు. ముందుగా వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వావిలాల గోపాల కృష్ణయ్య మనవడు మన్నవ సోడేకర్, గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
రెండు ప్రాణాలు తీసిన అప్పు గొడవ
సత్తెనపల్లి: ఇద్దరు కౌలు రైతుల మధ్య చిన్న గొడవ కుటుంబాల వరకు చేరింది. ఈ క్రమంలో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన సత్తెనపల్లి మండలం పణిదం గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. వివరాలు... గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన దాసరి వెంకటేశ్వర్లు కౌలు రైతు. భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన మరో కౌలు రైతు రామనాథం శ్రీనివాసరావుతో పరిచయం ఉంది. స్థానికుడైన కంచేటి జనార్దనరావు వద్ద ఎకరం పొలానికి రూ. 25 వేలు సాగుకు ముందే కౌలు చెల్లించేలా శ్రీనివాసరావు ఒప్పందం కుదిర్చాడు. శ్రీనివాసరావు వద్ద రూ. 50 వేల నగదు, ద్విచక్రవాహనం కుదవ పెట్టి రూ. 48 వేలను వెంకటేశ్వర్లు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకుండా దాటవేస్తుండటంతో బొడ్డు రమేష్ మధ్యవర్తిత్వం ద్వారా బైకు తాలూకు నగదు వడ్డీ సహా ఇచ్చాడు. మిగతా రూ. 50 వేలు అడగటంతో కాలయాపన చేస్తున్నాడు. ఈ నెల 15న శ్రీనివాసరావు, ఆయన కుమారుడు, మరో వ్యక్తి కలిసి వెళ్లి గట్టిగా ప్రశ్నించటంతో రూ. 25 వేలు ఇచ్చాడు. జనార్దనరావు వచ్చి కౌలు తాలూకు నగదు కూడా ఇప్పించాలని శ్రీనివాసరావును అడిగాడు. దీనికి సంబంధించి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు మధ్య వాదనలు జరిగాయి. అనంతరం వెంకటేశ్వర్లు, శ్రీలేఖ దంపతులు ఇంట్లో కూడా గొడవపడ్డారు. మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి పురుగుమందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. సత్తెనపల్లిలో ప్రాథమిక చికిత్స చేయించి, గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. నేలబావిలోకి దూకి... ఈ క్రమంలో కేసులు అవుతాయనే భయంతోనే శ్రీనివాసరావు, ఆయన భార్య పూర్ణకుమారి (47), కుమారుడు వెంకటేష్ (23)లు బుధవారం పొలానికి వెళ్లారు. అక్కడే వారు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటికి తల్లి, కుమారుడు స్థానికంగా ఉన్న ఓ నేల బావిలోకి దూకి బలవన్మరణానికి యత్నించారు. పూర్ణకుమారికి గుండె సమస్యలు ఉండటంతో చనిపోయింది. కుమారుడు బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో మృతదేహం బయటపడింది. శ్రీనివాసరావు కూడా అప్పటికే వివాహమై తాటికొండ మండలం పాములపాడులో ఉంటున్న కుమార్తె వెంకట జ్యోతికి ఫోన్ చేసి చనిపోవాలని ముగ్గురం నిర్ణయించుకున్నట్లు చెప్పి ఫోన్ ఆపేశాడు. తర్వాత గడ్డి మందు తాగి పొలం వద్దకు వెళ్లాడు. వెంకటజ్యోతి తన భర్తతో కలిసి వచ్చి తండ్రిని సత్తెనపల్లి ప్రైవేట్ వైద్యశాలకు తరలించింది. ప్రస్తుతం ఆయన వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు, పోలీసులు సందర్శించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.పూర్ణకుమారి, వెంకటేష్ మృతదేహాలుచికిత్స పొందుతున్న శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు -
పేద విద్యార్థులకు ఆధునిక విద్యే లక్ష్యం
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వినూత్నంగా ఆధునిక విద్యాబోధన అందించటం టీచ్ ఫర్ చేంజ్ సంస్థ లక్ష్యమని టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ధరణికోట మండల పరిషత్ పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ, పెగాసెస్ సిస్టమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ 3,4,5 తరగతుల విద్యార్థులకు ఆధునికంగా వచ్చిన మార్పులతో కూడిన విద్యను బోధించాలన్నారు. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు దీటుగా విద్యాబోధన ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని తీర్చటానికి టీచ్ ఫర్ చేంజ్ సంస్థ పని చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 1,70,000 మంది విద్యార్థులకు ఉపయోగపడేలా స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశామని అందులో అమరావతి మండలంలో 10 గ్రామాలలోని పాఠశాలల్లో తమ సంస్థద్వారా స్మార్ట్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం స్మార్ట్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పెగాసెస్ సిస్టమ్స్ అధినేత హెచ్.ధరణి తో పాటుగా ఎంపీడీఓ పార్వతి, ఎంఈఓలు శివబాబు, కంచర్లప్రసాద్లతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తొలుత మంచు లక్ష్మి అమరావతి బాలచాముండికా సమేత అమరేశ్వరుని దర్శించుకుని స్వామివారికి,అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సినీ నటి, టీచ్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి -
గుర్తు తెలియని యువకులు బాలుడిపై బ్లేడుతో దాడి
తాడికొండ: గుర్తు తెలియని యువకులు బాలుడిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి రామ సంతోష్ రాత్రి 10:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై కిరాణా షాపునకు వచ్చాడు. మార్గం మధ్యలో గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఏటీఎంలో నగదు డ్రా చేయడం తమకు రాదని, సాయం చేయాలని పిలవగా వెళ్లాడు. ద్విచక్ర వాహనం తాళాలు ఇవ్వాలని బాలుడిని బెదిరిస్తూ వెంట తెచ్చుకున్న పదునైన బ్లేడుతో దాడికి దిగడంతో, పెద్దగా కేకలు వేస్తూ పరుగెత్తడంతో నిందితులు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె. శ్రీనివాసరావు తెలిపారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తాం
నరసరావుపేట: విద్యుత్ రంగంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె బాట పడతామని రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు ఆర్.బంగారయ్య హెచ్చరించారు. యాజమాన్యం తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించాలని ఈ నెల 15వ తేదీ నుంచి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా బుధవారం విద్యుత్ ఉద్యోగులు ఎగ్జిక్యూటీవ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వందల మంది విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్లు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారని బంగారయ్య పేర్కొన్నారు. మురళీమోహనప్రసాదు, షేక్ నజియా, గోపాలరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.బీచ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ బాపట్ల టౌన్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు సూర్యలంక తీరంలో జరుగనున్న బీచ్ ఫెస్టివల్కు సంబంధించిన వాల్ పోస్టర్లను బుధవారం అమరావతి సచివాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు కొండయ్య యాదవ్, నరేంద్ర వర్మ, ఏలూరి సాంబశివరావు, నక్క ఆనందబాబులు పాల్గొన్నారు.ఆశ్రమ నిర్వాహకుడు చందుకు అవార్డుమార్టూరు: మార్టూరులోని అమ్మ ఆశ్రమ నిర్వాహకుడు గుంటుపల్లి చందు తన సేవలకు గాను అరుదైన పురస్కారం అందుకున్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా చైన్నెలోని చెన్నపురి తెలుగు విశ్వకర్మ సమాజం వారు తాదం కుప్పం బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలో బుధవారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు. వృద్ధులకు చందు నిర్వహిస్తున్న సేవలకు గాను ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విశ్వకర్మ అవార్డు అందజేసి, ఘనంగా సత్కరించారు.నేడు డీఎస్సీ సెలెక్టడ్ అభ్యర్థులకు ఐడీ కార్డులుగుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయులగా ఎంపికై న అభ్యర్థులు ఈనెల 19న అమరావతిలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్న దృష్ట్యా సంబంధిత కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా గురువారం ఐడీ కార్డులు జారీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఎంపికై న అభ్యర్థులు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో ఉన్న ఆంధ్ర ముస్లిం కళాశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు తమ పొటోతో పాటు వెంట వచ్చేవారికి సంబంధించిన పాస్పోర్ట్ ఫొటో, ఐడీ కార్డును తెచ్చుకోవాలని ఆమె సూచించారు.గవర్నర్కు ఆహ్వానంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై 22వ తేదీ నుంచి నిర్వహించే దసరా ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు దేవదాయ శాఖ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. బుధవారం గవర్నర్ను దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనానాయక్లతో పాటు ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అంతకు ముందు దసరా ఉత్సవాల ఏర్పాట్ల గురించి దేవదాయ శాఖ కమిషనర్ గవర్నర్కు వివరించారు. -
నేపాల్ బాలిక అదృశ్యం
లక్ష్మీపురం: నేపాల్కు చెందిన బాలిక అదృశ్యమైన ఘటనపై అరండల్పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్ దేశానికి చెందిన గోవింద్ తాప అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వలస వెళ్లి అక్కడ హోటల్లో పని చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల రెండు నెలల క్రితం గోవింద్ తాప కుమార్తె సరిత కుమారి మరి కొంత మందితో కలిసి గుంటూరుకు వచ్చి, గుంటూరులోని రైల్వే కోచ్ రెస్టారెంట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే ఈనెల 14వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. ఘర్షణలో నిందితుడికి రిమాండ్ విషయం తెలుసుకున్న తండ్రి గోవింద్ తాప గుంటూరు వచ్చి చుట్టు పక్కల ప్రాంతాలలో, బంధుమిత్రుల వద్ద ఎంత వెతుకులాడినా ఆచూకీ తెలియక పోవడంతో దిక్కు తోచక అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు అరండల్పేట పోలీసు స్టేషన్ 0863–2231955, సీఐ ఆరోగ్య రాజు 8688831332, ఎస్ఐ రోజాలత, 8688831334, నంబర్లకు సమాచారం తెలియజేయాల్సిందిగా సూచించారు.బల్లికురవ: మండలంలోని వేమవరం నాలుగు రోడ్ల జంక్షన్లో జరిగిన ఘర్షణలో నిందితుడికి అద్దంకి కోర్టు మంగళవారం 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై వై.నాగరాజు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న జరిగిన ఘర్షణలో నిందితునిగా ఉన్న ఉప్పుమాగులూరు గ్రామానికి చెందిన జాగర్లమూడి వీరాంజనేయులును అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంప దెబ్బతీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఎంఐఎం నాయకుడునరసరావుపేట: కేంద్ర ప్రభుత్వంతోపాటు కూటమి నేతలు సైతం బలపరిచి చట్టం చేసిన వక్ఫ్ చట్టంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించడం కేంద్ర ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని తెలిపారు. మధ్యంతర తీర్పులో మూడు కీలక సెక్షన్లపై స్టే విధించిందన్నారు. బోర్డులో ముస్లింమేతరులను చేర్చరాదని, ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధన వర్తించదని స్పష్టం చేసిందన్నారు. వక్ఫ్ ప్రాపర్టీ ఖరారు అధికారం కలెక్టర్లకు వర్తించదని, అది ట్రీబ్యునల్దేనని కోర్టు పేర్కొందన్నారు. సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టంపై పిటిషన్ వేసి స్వయంగా వాదనలు వినిపించిన బారిస్టర్ లా అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం పర్సనల్లా బోర్డు వారికి మరోక పిటిషన్ వేసిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డికి ముస్లిం సమాజం తరపున కృతజ్ఞతలు తెలిపారు. -
అనుమానంతో భార్య చేయి నరికిన భర్త
మేడికొండూరు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మద్యం మత్తులో కత్తిపీటతో ఆమె చేయి నరికిన ఘటన జరిగింది. మేడికొండూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలవర్తిపాడు గ్రామానికి చెందిన దాసరి రాజు నిత్యం మద్యం తాగి వచ్చి తన భార్య దాసరి రాణిపై అనుమానంతో వేధిస్తూ ఉంటాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్న కత్తిపీటతో రాణి కుడిచేతిని నరికేశాడు. రాణి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మేల్కొని సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంతలో రాజు నరికిన చేతిని ఒక సంచిలో వేసుకుని, 108 అంబులెన్స్ సహాయంతో బాధితురాలిని గుంటూరు జీజీహెచ్కు తరలించాడు. రాజుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మేడికొండూరు మండలం వెలవర్తిపాడులో ఘటన -
సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా చూడాలి
చిలకలూరిపేట: సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావులు కోరారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ డీఎస్సీ –2025 ద్వారా నియామకం అవుతున్న ఉపాధ్యాయులు విధుల్లో చేరకముందే, సీనియర్ ఉపాధ్యాయులకు పాఠశాలల్లో ఉన్న ఖాళీ స్థానాల్లో సర్దుబాటు చేసి, క్లస్టర్ వేకెన్సీలలో కొత్త ఉపాధ్యాయులను నియమించాలన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు క్లస్టర్లో ఉండి జూనియర్ ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండడం జరిగితే సీనియర్లకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా 2025 డీఎస్సీలో ఎంపికై న ఖాళీలను కూడా ఈ నియామకాల్లోనే భర్తీ చేయాలని, లేనిచో ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వివరాలు తీసుకొని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జూన్ మాసంలో ఉపాధ్యాయ బదిలీలు జరిగిన తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వారి స్థానంలో కూడా విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య, నాయకులు మేకల కోటేశ్వరరావు, వడ్లాన జయప్రకాశ్ పాల్గొన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు -
ఏబీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఆత్మహత్యాయత్నం
రేపల్లె(చెరుకుపల్లి): రేపల్లె పట్టణంలోని అనగాని భగవంతరావు(ఏబీఆర్) డిగ్రీ కళాశాల విద్యార్థి సొంటి రామ్ మల్లేష్ సోమవారం కళాశాల ప్రాంగణంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సహచర విద్యార్థులు గుర్తించి అతనిని ఆస్పత్రికి తరలించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనకు బాధ్యుడైన గెస్ట్ ఫ్యాకల్టీ నారాయణపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి వై.నవీన్ మాట్లాడుతూ విద్యార్థి సొంటి రామ్ మల్లేష్ పట్ల గెస్ట్ ఫ్యాకల్టీ నారాయణ కొంత కాలంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. సోమవారం తరగతులకు అనుమతించకుండా వేధింపులకు గురిచేయడంతోపాటు టీసీ ఇచ్చి ఇంటికి పంపుతానని బెదిరించాడని తెలిపారు. చదువుకు దూరం అవుతాననే భయంతో మనస్తాపం చెందిన మల్లేష్ కళాశాల ఆవరణలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపించి, నారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి తిరిగి కళాశాలలో చదువుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. సైన్స్ విభాగానికి కొత్త ఫ్యాకల్టీని నియమించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం.సూర్యప్రకాశరావు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
శిల్ప సంపదను అమరావతికి చేర్చాలి
అమరావతి: దేశ, విదేశాలలో ఉన్న అమరావతి ప్రాచీన శిల్ప సంపదను అమరావతి మ్యూజియంకు రప్పించాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు మంగళవారం అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు వినతిపత్రం సమర్పించారు. ఆయన ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడుతూ కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోని అమరావతి సర్కిల్లో 15 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న క్యాజువల్ కార్మికులను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని, జెమ్ ద్వారా టెండర్ పిలిచేందుకు చర్యలు తీసుకున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళామన్నారు. పూర్వం శాతవాహనుల రాజధానిగా ఉన్న ధరణికోటలో ఉన్న కేంద్ర పురావస్తు శాఖకు సంబంధించిన 16 ఎకరాల్లో తవ్వకాలు జరిపితే విలువైన శిల్పాలు వెలుగుచూసే అవకాశం ఉందన్నారు. తవ్వకాలు జరిపేందుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వంతో చర్చించి లండన్ మ్యూజియంలోని అమరావతి శిల్పాలను తిరిగి తెప్పించెందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం చైన్నె, ఢిల్లీ, కొల్కత్తా, హైదరాబాద్ మ్యూజియంలలో ఉన్న అమరావతికి సంబంధించిన శిల్పాలతోపాటు లండన్ బ్రిటిష్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ నెంబర్ 33ఏలో ఉన్న సుమారు 133 అద్భుతమైన అతి ప్రాచీనమైన కళాఖండాలను అమరావతికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి షెకావత్కు డాక్టర్ జాస్తి వినతి -
ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం
విమానాశ్రయం(గన్నవరం): విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పనిచేస్తోందని గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. స్థానిక విమానాశ్రయ టెర్మినల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీన ‘యాత్రి సేవ దివస్’లో భాగంగా పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విమానాశ్రయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. విమానయాన సేవలపై విద్యార్థులకు అవగాహన, యువతకు ఎయిర్పోర్ట్ ఉద్యోగ అవకాశాలపై కెరీర్ గైడెన్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి థీమ్పై విద్యార్థులకు, బాల ప్రయాణికులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. -
రోడ్లపైనే జంతువుల వధ
నరసరావుపేటటౌన్: నరసరావుపేట పట్టణంలో బహిరంగంగానే జంతువులను వధిస్తున్నారు. బహిరంగ జంతు వధ నిషేధం అమలులో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్తం, అవశేషాలు, దుర్వాసన వాతావరణాన్ని కలుషితం చేస్తుండగా, కాలుష్య సమస్యలు ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డీమార్ట్ పక్కన, హార్డ్ జూనియర్ కళాశాల ఎదుట ప్రతి ఆదివారం పందులను నడిరోడ్లపై యథేచ్ఛగా వధ చేస్తున్నారు. దీంతోపాటు ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల ఎదుట గాడిదలను అక్కడే వధ చేసి మాంసం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మాంసం విక్రయాలపై ఇప్పటికే అనేకమార్లు మున్సిపల్, ఫుడ్సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. వధ చేసే పరిసరాల చుట్టుపక్కల చెదలు, కుక్కలు చేరి దుర్వాసన వ్యాపిస్తోంది. రహదారులపై మిగిలిపోయే రక్తం, మాంసపు ముక్కల వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు దుర్వాసనతో అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పలుమార్లు మున్సిపల్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా, పెద్దగా చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు. ప్రతి వారం మాంసం విక్రయదారుల నుంచి మామూళ్లు తీసుకొని వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ, శుభ్రతపై నినాదాలు చేస్తూనే.. మరోవైపు బహిరంగ వధలపై పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజారోగ్యంపై దుష్ప్రభావాలు వధ సమయంలో తగిన శానిటేషన్ లేకపోవడం వల్ల జూనోటిక్ వ్యాధులు (జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు) వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. జంతువుల రక్తం, అవశేషాలు వల్ల హెపటైటిస్–ఎ, టైఫాయిడ్, కలరా, లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందవచ్చు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు లేకుండా వచ్చిన మాంసం ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలపై ఇవి ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. కలుషిత మాంసం వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి, బహిరంగ వధలకు పాల్పడే వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పర్యావరణంపై ప్రభావం.. రక్తం, మాంసపు ముక్కలు వలన దుర్వాసన కాలుష్యం ఏర్పడుతుంది. చెదలు, ఎలుకలు, కుక్కలు చేరి పర్యావరణంలో మలిన వాతావరణం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. వర్షపు నీటితో ఈ మలినాలు కలసి కాలువలు, తాగునీటి వనరులు కలుషితం అవుతాయి. ఈ పరిణామాలు పర్యావరణానికే కాక ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతోపాటు రోడ్ల మీద వధ చూసే పిల్లల్లో భయం, మానసిక ఒత్తిడి కలుగుతుంది. ప్రజల్లో సమాజ శుభ్రతపై నిరాసక్తత పెరుగుతుంది. బహిరంగ వధ ప్రాంతాల్లో నివసించే వారికి సామాజిక అవమానం, జీవన ప్రమాణం తగ్గడం మొదలవుతుంది. బహిరంగ జంతు వధకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. హార్డ్ జూనియర్ కళాశాల, ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాలల వద్ద తనిఖీలు చేపట్టి అక్రమంగా జంతు వధకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. –జస్వంత్రావు, మున్సిపల్ కమిషనర్ -
రెండేళ్ల క్రితం తప్పిపోయిన తల్లి, పిల్లల గుర్తింపు
మంగళగిరి: రెండేళ్ల క్రితం తప్పిపోయిన మహిళ, ఆమె ఇద్దరి పిల్లలను గుర్తించి పట్టుకుని, కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. మంగళగిరి రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన కట్టా లక్ష్మి అనే మహిళ మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో నివసించే తన కుమార్తె తోకల తిరుపతమ్మ(23) ఆమె ఇద్దరు పిల్లలు మోక్ష శ్రీనాథ్(5), స్నేహశ్రీ(3)లు కనిపించడం లేదని 2023 ఏప్రిల్ నెలలో మంగళగిరి రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త సరిగా చూడడం లేదనే కారణంతో మనస్థాపం చెందిన తిరుపతమ్మ తన పిల్లలతో సహా ఎక్కడికో వెళ్లిపోయిందని తల్లి లక్ష్మి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐ వై.శ్రీనివాసరావు, ఎస్ఐ సీహెచ్ వెంకట్లు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అనేక ప్రాంతాలలో సమాచారం సేకరించి చివరకు గుంటూరు జిల్లా బుడంపాడులో వున్నట్లు గుర్తించి తిరుపతమ్మను, పిల్లలను మంగళవారం తల్లి లక్ష్మి, కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. కేసును చేధించి తల్లి, పిల్లలను కనుగొన్న డీఎస్పీ, సీఐ, ఎస్ఐలతో పాటు బృందంలోని సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు -
శతాధిక వృద్ధురాలు అప్పమ్మ మృతి
దాచేపల్లి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మందపాటి రమేష్రెడ్డి తల్లి అప్పమ్మ(103) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణలో రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో అప్పమ్మ పాల్గొన్నారు. ఆమైపె నిర్బంధం ఉండడంతో రెండేళ్లపాటు అడవుల్లో అజ్ఞాత జీవితం గడిపారు. అప్పమ్మ భర్త అప్పిరెడ్డి నడికుడి మేజర్ పంచాయతీ సర్పంచిగా పదేళ్లపాటు పనిచేశారు. అప్పమ్మ కోడలు, రమేష్రెడ్డి భార్య విజయశ్రీ కూడా నడికుడి సర్పంచిగా ఐదేళ్లపాటు పనిచేశారు. అప్పమ్మకి ఆరుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు నివాళి అప్పమ్మ భౌతికకాయాన్ని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సందర్శించారు. రమేష్రెడ్డిని పరామర్శించారు. మిర్యాలగూడెం శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్రెడ్డి, అద్దంకి సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్బాబు, నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, ఎంపీపీ కందుల జాను, జెడ్పీటీసీ సభ్యుడు మూలగుండ్ల ప్రకాష్రెడ్డి, నాయకులు షేక్ జాకీర్ హుస్సేన్, బుర్రా విజయ్కుమార్రెడ్డి ఉన్నారు. -
ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలి
చీరాల అర్బన్: ఆర్టీసీలో రాబోతున్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ఆర్టీసీనే నిర్వహించాలని ఎస్డబ్ల్యూఎఫ్ చీరాల డిపో అధ్యక్షుడు ఏబీకే రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆవిర్భావం సభ మంగళవారం చీరాలలో నిర్వహించారు. సందర్భంగా కార్యాలయం వద్ద పతాకావిష్కరణ చేశారు. పలువురు వక్తలు మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా కార్మికులంతా ఆర్టీసీ రక్షణకు సిద్ధం కావాలన్నారు. ఆర్టీసీలో రద్దీకి అనుగుణంగా నూతన నియామకాలు చేయాలన్నారు. మెరుగైన టిమ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణ కార్యదర్శి ఎం.వసంతరావు మాట్లాడుతూ సీఐటీయూ అనుబంధ సంస్థ ఎస్డబ్ల్యూఎఫ్ ఆవిర్భావం తర్వాతనే అనేక ఐక్య ఉద్యమాలు ఆర్టీసీలో జరిగాయని గుర్తు చేశారు. ఆర్టీసీలో ఎస్డబ్ల్యూఎఫ్ని బలమైన సంఘం నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో తులసిరావు, రాంబాబు, రామ్మోహనరావు, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, బాషా, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్డబ్ల్యూఎఫ్ చీరాల డిపో అధ్యక్షుడు ఏబీకే రెడ్డి డిమాండ్ -
నేటి నుంచి ఆరోగ్య శిబిరాలు
బాపట్ల అర్బన్: స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ (ఎస్ఎన్ఎస్పీఏ)లో మహిళా ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ తెలిపారు. మంగళవారం బాపట్ల పట్టణంలో ఏరియా వైద్యశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్యవంతమైన మహిళ – శక్తివంతమైన కుటుంబం అనే నినాదంతో సమగ్ర ఆరోగ్య సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేశాయన్నారు. దానిలో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, జిల్లాలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటళ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆయా వ్యాధులకు సంబంధించి మహిళలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. మహిళలకు గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లకు పరీక్షలు చేసి వైద్య చికిత్స అందిస్తారని తెలిపారు. అదేవిధంగా గర్భిణులు, కిశోర బాలికలకు పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన చికిత్సలు అందజేయడం జరుగుతుందన్నారు. ఎస్ఎన్ఎస్పీఏ స్టేట్ నోడల్ ఆఫీసర్ బి.వి.రావ్, వైద్యులు పాల్గొన్నారు. -
ప్రైవేటుకు అప్పగిస్తే ప్రజాఉద్యమం
– కర్ణ లక్ష్యారావు, చేనేత సొసైటీ అధ్యక్షుడు, దేశాయిపేట బాపట్ల మెడికల్ కాలేజీని ప్రైవేటుకు ఇవ్వొద్దు అలా చేస్తే నాణ్యమైన వైద్యానికి పేదలు దూరం నిర్మాణం పూర్తిచేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి గత ప్రభుత్వ హయాంలో 60 ఎకరాల్లో స్థల సేకరణ, రూ.750 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు బాపట్ల అర్బన్: మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిన చేపట్టడం తగదని, మెడికల్ కాలేజీ సాధన కోసం ప్రజలు, మేధావులు, ప్రజాతంత్ర వాదులు రాజకీయాలకతీతంగా జరిగే పోరాటంలో పాల్గొనాలని సీపీఎం జిల్లా కమిటీ కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో సీపీఎం ఆధ్వర్యంలో బాపట్ల మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మించాలని జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీల, దళిత, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ బాపట్ల ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ పద్ధతికి బదలాయించడం తగదని, ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలు చేపట్టి నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. సమావేవంలో పలువురు నేతలు మాట్లాడారు. 2021లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసి, ఇంకా పూర్తి కాని 10 వైద్య కళాశాలల్లో బాపట్ల ఒకటన్నారు. గత ప్రభుత్వ హయాంలో కళాశాలకు అవసరమైన 60 ఎకరాల స్థలం సేకరించారని, రూ.750కోట్ల వ్యయ అంచనాతో నిర్మాణం కోసం మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెండర్ దక్కించుకుందని, గత ప్రభుత్వ హయాంలో 5శాతం పనులు మొదలయ్యాయన్నారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేయడంలో విఫలమైందన్నారు. నిధులు కేటాయింపులు చేయకపోగా ప్రైవేటుకు అప్పగించడం దారుణమన్నారు. బాపట్ల ప్రాంతవాసుల చిరకాల వాంఛగా ఉన్న వైద్య కళాశాల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులను భాగస్వాములను చేస్తే వైద్య విద్య పేదలకు దూరం అవుతుంద వక్తలు అభిప్రాయపడారు. ఈ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు సంభవించినపుడు, గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అత్యవసర వైద్యం కోసం కిలోమీటర్లు దూరంలోని గుంటూరు, విజయవాడ వెళ్లవలసిన తరుణంలో ఎందరో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయని తెలిపారు. మెడికల్ కాలేజీ సాధన కోసం జరిగే పోరాటాలలో ప్రజలందరూ రాజకీయాలకతీతంగా పాల్గొనాలన్నారు. వైద్య కళాశాల నిర్మాణం పీపీపీ పద్ధతిన ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే యత్నాలను పక్కన బెట్టి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం, నిర్వహణ భాద్యతలు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వామపక్ష పార్టీలు, దళిత ప్రజాసంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు మేకల ప్రసాద్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు గొర్ల శ్రీనివాసరావు, బీఎస్పీ నాయకుడు జి.రాజారావు దళిత, ప్రజాసంఘాల నాయకులు టి.కృష్ణమోహన్, పి.కొండయ్య, సీహెచ్ మనిలాల్, కె.శరత్, వినయ్ కుమార్, ఆర్ చంద్రశేఖర్, సిహెచ్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు
నాడు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు మూరల చీర నేసిన మన చేనేత వైభవం, విశిష్టత.. సముద్రాలు దాటి విస్తరించగా.. నేడు నేతన్నల జీవితాలు కష్టాల కడలిలో చిక్కుకున్నాయి. నాడు దేశమంతటికీ వస్త్రాలు అందించిన నేతన్న .. నేడు భుక్తి కోసం ఇతర పనులు వెదుక్కొనే దుస్థితి దాపురించింది. ఈ దశలో చేనేతకు చేయూతనందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపడంతో నేతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సర్కారు నుంచి రావాల్సిన మొండి బకాయిలు చేనేత సొసైటీల ఉసురు తీస్తున్నాయి. ఈక్రమంలో నిత్యం మగ్గాల సవ్వడితో సందడిగా ఉండే చేనేత కాలనీల్లో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. -
పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ
కుంకలమర్రు (కారంచేడు): రైతులకు అవసరమైన ఎరువులను పోలీస్ బందోబస్తు నడుమ, అదీ అరకొర సరఫరా చేస్తుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కుంకలమర్రు గ్రామంలోని సొసైటీ కేంద్రం వద్ద మంగళవారం రైతులకు యూరియా బస్తాలు సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో కేంద్రం వద్దకు రైతులు చేరుకోగా భారీగా పోలీసులను బందోబస్తుగా నియమించి, ఒక్కో రైతుకు కేవలం రెండు యూరియా బస్తాలు మాత్రమే పంపిణీ చేశారు. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుమీద బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయాధికారులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో 299 మంది రైతులకు 640 బస్తాల యూరియా సరఫరా చేశామని తహసీల్దార్ జి.నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ ఎం.నాగరాజు, పోలీస్ సిబ్బంది, పీఏసీఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్
బాపట్ల టౌన్: జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ తెలిపారు. జిల్లాలో సోమవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆర్ఎస్కేలు, పీఏసీఎస్ 35 కేంద్రాల ద్వారా 4,983 మంది రైతులకు 220 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇంకా 220 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని పేర్కొ న్నారు. అవసరమైన రైతులు ఆయా గ్రామాల పరిధిలోని రైతుసేవా కేంద్రాలు, సహకార పరపతి సంఘాల ద్వారా పొందవచ్చని ఆయన సూచించారు. గుంటూరులో హత్య.. గుండ్లకమ్మలో శవం! మద్దిపాడు/లక్ష్మీపురం: గుంటూరులో హత్యకు గురైన వ్యక్తి ప్రకాశం జిల్లా మద్దిపాడు సమీపంలోని గుండ్లకమ్మ నదిలో శవమై తేలాడు. అందిన సమాచారం ప్రకారం.. వేముల రామాంజనేయులు(45) కనిపించకపోవడంతో భార్య గుంటూరులోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గుంటూరు పోలీసులు బండారు కొండయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. రామాంజనేయులును హత్య చేసి మద్దిపాడు మండలం వెల్లంపల్లి సమీపంలోని గుండ్లకమ్మ నది పక్కన పూడ్చి వేసినట్లు అంగీకరించాడు. గుంటూరు పోలీసులు సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు తరలించారు. గుంటూరు పోలీసులకు మద్దిపాడు ఎస్ఐ సైదులు సహకారం అందించారు. యూరియా కోసం ఆందోళన వద్దు ఆర్డీఓ చంద్రశేఖరనాయుడు కారంచేడు: యూరియా కోసం అన్నదాతలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అందరికీ సరఫరా చేస్తామని చీరాల ఆర్డీఓ చంద్రశేఖరనాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన కారంచేడు సొసైటీ వద్ద యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ‘యూరియా కోసం తిప్పలు’ అనే శీర్షికతో సాక్షి స్టేట్ పేజీలో వచ్చిన కథనానికి రెవెన్యూ, పోలీస్, వ్యవసాయాధికారులు స్పందించారు. సంబంధిత అధికార యంత్రాంగం మొత్తం కారంచేడులో తిష్టవేసి ఎరువులు సరఫరా చేయించారు. గ్రామంలో రైతులకు అవసరమైన ఎరువులను దగ్గరుండి అన్ని సౌకర్యాలతో పంపిణీ చేయించారు. ఆదివారం ఎండలో రైతులు పడిగాపులు పడటంతో అధికారులు టెంట్ వేయించి, రైతులు కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయించారు. వరుస క్రమంలో పేర్లు పిలచి యూరియాను సరఫరా చేశారు. పీజీ రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల పెదకాకాని(ఏఎన్యూ): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జూలైలో జరిగిన పీజీ కోర్సుల రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఎంఎస్సీ స్టాటిస్టిక్స్లో 45 మందికి 44 మంది, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీలో 24 మందికి 17మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యూయేషన్కు ఈనెల 24వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.1860, పర్సనల్ వెరిఫికేషన్కు రూ.2190 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మానవత్వం చూపిన పోలీసులు మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలోని హుస్సేన్ కట్ట వద్ద గత నాలుగు రోజులుగా మతిస్థిమితం లేని ఓ మహిళ తిరుగుతోంది. ఇది గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రవీంద్రనాయక్ తక్షణమే స్పందించి సోమవారం ఉదయం ఆ మహిళను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ గిరిపురం అని తప్ప ఆమె ఇంకేమీ వివరాలు వెల్లడించలేక పోతోందని, ఆమె చెప్పిన ప్రాంతానికి పోలీస్ సిబ్బందిని పంపించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
గుటకాయ‘స్వాహా’పై విచారణ
కర్లపాలెం: విద్యార్థుల సొమ్ము స్వాహా అని ఈనెల 12న సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. చింతాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో పీఈటీ, ఎన్సీసీ ఆర్గనైజర్గా ఎం.గోపి వ్యవహరించారు. ప్రస్తుతం వెనిగండ్లలో పీఈటీగా పని చేస్తున్నారు. చింతాయపాలెం హైస్కూలులో పని చేస్తున్న సమయంలో ఎన్సీసీ విద్యార్థుల సర్టిఫికెట్ల మంజూరులోనూ, యూనిఫాం అలెవెన్స్లో అవకతవకలకు పాల్పడ్డారని కొంతమంది విద్యార్థులు, పేరెంట్స్ ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తం ఉత్తర్వుల మేరకు స్థానిక పాఠశాలలో జిల్లా డెప్యూటీ డీఈవో కె.సురేష్ సోమవారం ప్రధానోపాధ్యాయుడు, వేణుమాధవ్, ఎంఈవోలు మనోరంజని, విద్యాశ్రీల సమక్షంలో విచారణ చేపట్టారు. తల్లిదండ్రుల స్టేట్మెంట్లు నమోదు ఈ సందర్భంగా డెప్యూటీ డీఈవో మాట్లాడుతూ విచారణకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రుల స్టేట్మెంట్లు నమోదు చేశామని, వీటిని ఉన్నతాధికారులకు సమర్పించినట్లు తెలిపారు. పాఠశాల బయట ఘర్షణ పాఠశాల బయట చింతాయపాలెం ఎస్ఎంసీ వైస్ చైర్మన్ నాగలక్ష్మి, ఆమె కుమార్తె అనూరాధ, నంబూరు వ్యాయామ ఉపాధ్యాయుడు మస్తాన్రెడ్డి ఘర్షణ పడ్డారు. గతంలో వెనిగండ్ల పీఈటీగా పనిచేసిన సమయంలో ఆయన సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మస్తాన్రెడ్డి, వైస్ చైర్మన్ పిట్టు నాగలక్ష్మి, ఆమె కుమార్తె అనూరాధల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఇందులో నాగలక్ష్మికి, మస్తాన్రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. తన అబ్బాయి అయ్యప్పరెడ్డి సర్టిఫికెట్ కోసం కుమార్తె అనూరాధతో కలసి పాఠశాలకు వచ్చినట్లు నాగలక్ష్మి తెలిపారు. ఈ సమయంలో దూరం నుంచి మస్తాన్రెడ్డి తమ ఫొటోలు తీస్తున్నాడని, దీన్ని ప్రశ్నించినందుకు తనపై దాడి చేశాడని నాగలక్ష్మి అంటోంది. అన్యాయంగా సస్పెన్షన్ మస్తాన్రెడ్డి మాట్లాడుతూ తాను వెనిగండ్ల పీఈటీగా పనిచేసి నంబూరు పాఠశాలకు బదిలీపై వెళ్లానని తెలిపారు. వెనిగండ్లలో పనిచేస్తున్న సమయంలో అవకతవకలకు పాల్పడ్డానని పీఈటీ గోపి తన మీద అధికారులకు లేనిపోనివి చెప్పి పత్రికల్లో రాయించినట్లు ఆరోపించారు. దీంతో అధికారులు సస్పెండ్ చేసినట్లు వాపోయారు. గోపీపై విచారణను పత్రికల ద్వారా తెలుసుకుని వచ్చానని, తనకు జరిగిన అన్యాయాన్ని విచారణ కమిటీకి చెప్పుకునేందుకు వచ్చి పాఠశాల బయట కారులో కూర్చున్నట్లు వివరించారు. నాగలక్ష్మి కూతురు అనూరాధ మొబైల్తో తన వీడియో తీస్తుండగా, తాను కూడా ఫోన్తో ఫొటో తీసే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అనూరాధ, నాగలక్ష్మి ఫోన్ లాక్కుని పగలకొట్టి, షర్టు చించి దాడి చేశారని మస్తాన్ రెడ్డి ఆరోపించారు. దాడిపై కర్లపాలెం ఎస్ఐ రవీంద్రను వివరణ అడుగ్గా ఘర్షణ, దాడి జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. ఇద్దరు ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
డీఆర్వో జి. గంగాధర్గౌడ్ బాపట్ల టౌన్: ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్వో జి. గంగాధర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను విన్నవించారని తెలిపారు. తన పరిధిలోని వాటికి అక్కడికక్కడే పరిష్కార చూపామని పేర్కొన్నారు. కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటిని విచారణకు ఆదేశించామని చెప్పారు. జిల్లా నలుమూలల నుంచి 164 మంది ఫిర్యాదుదారులు వచ్చినట్లు తెలిపారు. తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదు పీజీఆర్ఎస్ లో నమోదైన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 14,458 అర్జీలు నమోదు అయ్యాయని, వాటిని ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించామని వెల్లడించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్త పాటించాలని డీఆర్వో తెలిపారు. స్వస్తి నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. అందులో భాగంగా అన్ని ప్రాంతాల్లో సచివాలయాల స్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రజలంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వర్షాలు కురుస్తున్నందున కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని, డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, ఉప కలెక్టర్ లవన్న, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్. విజయమ్మ పాల్గొన్నారు. స్మార్ట్ న్యూ రైస్ కార్డుల ద్వారానే బియ్యం పంపిణీ జరుగుతుందని డీఆర్వో జి. గంగాధర్గౌడ్ తెలిపారు. స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ స్మార్ట్ న్యూ రైస్ కార్డులను ప్రజల ఇంటి వద్దకే అందిస్తామని తెలిపారు. జిల్లాలోని 1,123 చౌక ధరల దుకాణాల పరిధిలో 4,71,382 రైస్ కార్డులు ఉన్నాయన్నారు. పాత కార్డులకు బదులుగా వాటి స్థానంలో స్మార్ట్ న్యూ రైస్ కార్డులను ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. 15వ తేదీ నుంచి పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. జిల్లాకు 4.71 లక్షల కార్డులు వచ్చాయని, సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వచ్చి పంపిణీ చేస్తారని చెప్పారు.ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ఎంపీడీవోలు పర్యవేక్షించాలని డీఆర్వో ఆదేశించారు. వీటి వినియోగం కోసం ఈ–పాస్ యంత్రాలను ఇప్పటికే జిల్లాకు ప్రభుత్వం విడుదల చేసిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. పశువులకు గాలికుంటు వ్యాధుల టీకాలు జిల్లాలోని పశువులకు గాలి కుంటు వ్యాధుల టీకాల కార్యక్రమం ఈనెల 15 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని డీఆర్వో గంగాధర్ గౌడ్ తెలిపారు. పశు వైద్యశాఖ రూపొందించిన వాల్పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో ఆయన విడుదల చేశారు. -
రాత్రి ప్రతిష్ఠ .. తెల్లారి తొలగింపు
మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడిలో ఆదివారం అర్ధరాత్రి ప్రతిష్ఠించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అనుమతులు లేవంటూ సోమవారం అధికారులు తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి... స్థానిక జగనన్న కాలనీ సమీపంలోని రెండు సెంట్ల భూమిని పంచాయతీ సర్పంచ్ జంపని అంజమ్మ వార్డు సభ్యుల సంతకాలతో తీర్మానం చేయించి, గత నెలలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి సహకరించారు. సెప్టెంబర్ మొదటి వారంలో దళిత నాయకులతో కలిసి మార్టూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జంపని వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో అధికారులు విగ్రహ స్థాపనకు అనుమతులు లేవంటూ గ్రామస్తులకు, పంచాయతీ కార్యాలయానికి తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు శంకుస్థాపన స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమవారం ఉదయం ఆర్ఐ అశోక్, వీఆర్ఏ ఏడుకొండలు విగ్రహ ప్రతిష్ఠ స్థలాన్ని పరిశీలించి, ఈఓఆర్డీ రామాంజనేయులుకు విషయం తెలిపారు. ఆయన సూచనల మేరకు సచివాలయ కార్యదర్శి మరికొందరితో వచ్చి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి పంచాయతీ కార్యాలయంలో ఓ గదిలో ఉంచి తాళం వేసి వెళ్లిపోయారు. ఈ విషయమై ఈఓఆర్డీ రామాంజనేయులును విలేకరులు వివరణ కోరగా విగ్రహ ప్రతిష్ఠ కోసం పంచాయతీ సభ్యులు తీర్మానం చేసిన భూమి గ్రామ కంఠానికి నికి చెందిన ప్రభుత్వ భూమి అని తెలిపారు. పంచాయతీ తీర్మానం ఉన్నప్పటికీ ఎంపీడీవో, పంచాయతీరాజ్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ తదితర శాఖలతో కూడిన మండల కమిటీ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అనుమతులతో విగ్రహ నిర్మాణం చేపట్టాలని, గ్రామంలో ఇవేమి లేకుండా అర్ధరాత్రి విగ్రహ ప్రతిష్టాపన జరిగినట్లు ఆయన తెలిపారు. డేగరమూడిలో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు -
కొత్త టీచర్లు వస్తున్నారు
దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆప్షన్ ఆధారంగానే పోస్టింగ్స్ ఈనెల 22 నుంచి ఇండక్షన్ శిక్షణ డీఈవో సైట్లో డీఎస్సీ– 2025 ఎంపిక జాబితా గుంటూరు జిల్లాలో డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన అన్ని కేటగిరీల వారీగా ఎంపిక జాబితాను డీఈవోజీన్టీ.బ్లాగ్స్పాట్.కామ్లో ఉంచినట్లు జిల్లా విద్యాశాకాధికారి సీవీ రేణుక సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. అదే విధంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్లోని డిస్ప్లే బోర్డులలో జాబితాను ఉంచామని, అదనపు సమాచారం కోసం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లో సంప్రదించాలని సూచించారు. -
బీసీల హామీలను నెరవేర్చాలి
బాపట్ల అర్బన్: ఎన్నికల ముందు బీసీలకు చేసిన వాగ్దానాలను అమలుపరచడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపాలని బీసీల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇన్చార్జ్ అధ్యక్షుడు బాపట్ల రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో సంఘం ఆధ్వర్యంలో ఇన్చార్జ్ జేసీ గంగాధర్కు పలువురు బీసీ నేతలు సోమవారం వినతిపత్రం అందజేశారు. ముందుగా చీలు రోడ్డు కూడలిలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపు మేరకు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బీసీలకు కేటాయిస్తామన్న 34 శాతం రిజర్వేషన్ను స్థానిక సంస్థల్లో అమలు పరచాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు ఏ విధమైన అట్రాసిటీ చట్టం ఉందో బీసీలకు కూడా ఆ మాదిరిగానే రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను అమలు పరచాలని, బీసీ కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భాజాపా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కొక్కిలగడ్డ శ్రీనివాసరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బీసీలకు కేటాయిస్తానన్న నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అగ్నికుల క్షత్రీయుల కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అనాదిగా అణిచివేతకు గురవుతున్న బీసీలకు రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కేటాయింపుపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. భాజపా మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఎల్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ ప్రాదేశికంగా నియోజకవర్గాల విభజన పూర్తి చేసి, జనాభా దామాషా లెక్కల ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కేటాయించాలని కోరారు. రాష్ట్ర రాజధానిలో మహాత్మ జ్యోతీరావు పూలే, సావిత్రీ బాయి పూలే స్మృతివనాన్ని అద్భుత కళాఖండంగా దేశం గర్వించే రీతిలో నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు ఉల్చి శ్రీను, కంకణాల రాంబాబు, రామ్మోహనరావు, ప్రత్తిపాటి సాయికుమార్ పాల్గొన్నారు. జేసీకి సంఘ నాయకుల వినతిపత్రం -
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారం
బాపట్ల టౌన్: బాఽధితుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 54 మంది అర్జీదారులు పాల్గొని, తమ సమస్యలను ఎస్పీకు వివరించారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్న ఆయన త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అధికంగా భర్త, అత్తారింటి వేధింపులు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు వంటి కేసులు అధికంగా వస్తున్నాయన్నారు. వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా చట్టపరంగా విచారించి పరిష్కరించాలని చెప్పారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని అధికారులను హెచ్చరించారు. తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఎస్ఐ ఏ.నాగేశ్వరరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ -
కృష్ణమ్మ పరవళ్లు
కొల్లూరు : కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్కు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని దిగువుకు యథాతథంగా దిగువకు విడుదల చేస్తుండటంతో నది నిండు కుండలా మారింది. బ్యారేజ్ నుంచి సోమవారం ఉదయం 3.15 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదలడంతో మధ్యాహ్నం నుంచి వరద ప్రవాహ తీవ్రత పెరిగింది. అంచులను ఒరుసుకుకంటూ కృష్ణమ్మ ప్రవహిస్తోంది. పెసర్లంక అరవింద వారధి సమీపంలోని నక్కపాయ గండి, గాజుల్లంక చినరేవు ద్వారా వరద నీరు లోతట్టు ప్రాంతాలతో పాటు ఇటుక బట్టీలు, పల్లపు ప్రాంతాల్లోకి భారీగా చేరింది. దోనేపూడి కరకట్ట దిగువున పోతార్లంక, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, తోకలవారిపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి గ్రామాలకు వెళ్లే లోలెవల్ వంతెన పైనుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉద్ధృత ప్రవాహం.. ప్రాణాలు పణం ఉద్ధృతమైన కృష్ణా నదీ వరద ప్రవాహంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నా నిలువరించే నాథులే కరువయ్యారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి – పోతార్లంక మార్గంలో ఉన్న లోలెవల్ వంతెన పైనుంచి సోమవారం ఉదయం నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు, వాహనాలు రాకపోకలు నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ సిబ్బంది పత్తా లేరు. ప్రజలు ప్రమాదకర పరిస్థితిలో వరద నీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రవాహంలో ఏ మాత్రం పట్టు కోల్పోయినా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోమవారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదులుతున్న నీటి పరిమాణం క్రమంగా తగ్గుతూ 2.34 లక్షలకు చేరింది. మంగళవారానికి నీటి మట్టం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆర్సీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
రెవెన్యూ సమస్యలపై రైతు సంఘం ఆందోళన
తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేస్తామంటూ హెచ్చరిక మార్టూరు: మార్టూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ సమస్యలపై ధర్నా నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు సైతం పాల్గొనటం సమస్యల తీవ్రతకు అద్దం పట్టింది. తహసీల్దార్ టి. ప్రశాంతిని నాయకులు రైతుల సమస్యలపై నిలదీయడంతో ఆమె ఇబ్బందికి గురయ్యారు. ధర్నాలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కందిమళ్ల రామకోటేశ్వరరావు, ఇతర నాయకులు రెవెన్యూ సమస్యలపై స్పందించారు. తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బాపట్ల జిల్లాలో ఎక్కడా లేనివిధంగా మార్టూరు తహసీల్దార్ కార్యాలయం లో అవినీతి విపరీతంగా పెరిగి పోయింది. ప్రతి గ్రామంలోనూ జాయింట్ ఎల్పీఎం నంబర్లతో రైతులకు 1బీలు రాక బ్యాంకు రుణాలు పొందలేక, రిజిస్ట్రేషన్లు జరగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్టూరు మండలంలోని ద్వారకపాడు, వలపర్ల, లక్కవరం గ్రామాలతో పాటు అద్దంకి నియోజకవర్గంలోని వల్లాపల్లి, ధర్మవరం, కొమ్మినేని వారి పాలెం రామకూరు గ్రామాల్లోని 2565 ఎకరాలు భూమి ఎలాంటి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు జరగలేదు. వందలాది మంది రైతులు గత 12 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేసి గ్రామాలకు ఒక వీఆర్వోను నియమించడంతో వారు తప్పించుకు తిరుగుతున్నారని, వసూళ్లు ఎక్కువయ్యాయని రైతు సంఘ నేతలు ఆరోపించారు. ఇటీవల అవినీతి వీఆర్వోలపై ఫిర్యాదు చేస్తే వారిని బదిలీ చేశారు కానీ సమస్యలు మాత్రం యథావిధిగానే ఉన్నాయని తెలిపారు. ఈ మధ్యకాలంలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని చెప్పారు. రైతులు ఇచ్చిన వందలాది అర్జీలను కనిపించకుండా మాయం చేశారని ఆరోపించారు. మండలంలోని రెవెన్యూ సమస్యలపై గత నాలుగు నెలల కాలంలో తహసీల్దార్ కు రెండుసార్లు, ఎమ్మెల్యే ఏలూరి దృష్టికి రెండుసార్లు తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. ఇటీవల ఇంకొల్లులో రెవెన్యూ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రులను కలిసి సమస్యల గురించి అర్జీలు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని వాపోయారు. విసిగి వేసారిపోతున్న రైతులు భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు విసిగి వేసారి పోతున్నారని, సమస్యలు త్వరలో పరిష్కారం కాకుంటే తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేస్తామని రామకోటేశ్వరరావు హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ టి. ప్రశాంతికి నాయకులు వినతిపత్రం అందజేసి, సమస్యల గురించి ఏకరువు పెట్టారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ మాట్లాడుతూ వీఆర్వోలు దాదాపుగా ఉన్నారని, కోనంకి, కొలలపూడి గ్రామాలకు మాత్రం రావాలంటే భయపడుతున్నారని, అందుకు తానేమి చేయలేనని తెలిపారు. అధికార పార్టీకి చెందిన కొందరు రైతు నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో కొంతమంది నాయకులు చెప్పిన పనులే అధికారులు చేస్తున్నారని, మిగిలిన వారి పనులను సదర నాయకులే అడ్డుకుంటున్నారని చెప్పటం గమనార్హం. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు వీరవల్లి కృష్ణమూర్తి ఎనికపాటి రాంబాబు, గోనుగుంట్ల మోహనరావు, తాళ్లూరి శివరావు, బెజవాడ కృష్ణయ్య, బి సూరిబాబు, కందిమళ్ల శ్రీనివాసరావు, రైతులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలలను అమ్ముకుంటున్నారు
దాచేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం లంచాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను అమ్ముకుంటుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఎవరైతే లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీలను లీజుకు తీసుకున్నారో.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వాటిని స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే కాలేజీలను ప్రభుత్వం ద్వారానే నడిపించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రూ.8 వేల కోట్లు విలువ చేసే 17 మెడికల్ కాలేజీలను తన చెంచాలకు అప్పగిస్తున్నాడని, దీనిపై తప్పనిసరిగా సీబీఐ, ఈడీ విచారణ ఉంటుందని మహేష్ రెడ్డి హెచ్చరించారు. తమ ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్ పోతే మిగిలిన మూడు సంవత్సరాల్లో నాలుగైదు కాలేజీలు పూర్తి కాగా మరికొన్ని కాలేజీలు 60 నుంచి 80 శాతం వరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయని వివరించారు. పిడుగురాళ్ల కాలేజీ 60 శాతం పూర్తి పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ 60 శాతం పూర్తి కాగా హాస్పిటల్ 90 శాతం పూర్తి అయిందని ఆయన చెప్పారు. 1923 నుంచి 2019 వరకు 96 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 12 ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తరువాత 17 మెడికల్ కళాశాలను నెలకొల్పారని ఆయన అన్నారు. చంద్రబాబుకు చేతనైతే పూర్తి చేసి కళాశాలలను నడిపించాలని సవాల్ విసిరారు. ఒక్కొక్క మెడికల్ సీటు రూ.30 నుంచి 40 లక్షలకు అమ్ముకునేదానికి ఆ కాలేజీ ఎవరికై తే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారో వారికి అనుమతులు ఇస్తున్నట్లుగా మీడియాలో కథనలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సుమారుగా ఐదేళ్లలో రూ.20 నుంచి రూ.30 వేల కోట్లు సంపదను సృష్టిస్తూ పోతే దాన్ని ఈరోజు అప్పనంగా అమ్ముకుంటున్నారని మహేష్ రెడ్డి ధ్వజ మెత్తారు. టీడీపీ నాయకులకు మెదడు పనిచేయడం లేదు ఎక్కడో అమరావతిలోనో, .గుంటూరులో ఏసీ రూములో కూర్చుని విమర్శలు చేసే తెలుగుదేశం నాయకులకు తాను ఛాలెంజ్ విసురుతున్నానని, టీడీపీ నాయకులకు దమ్ముంటే గురజాల గల్లీకి రావాలని, పిడుగురాళ్లలో ఉన్న కాలేజీ ఎలా పూర్తి చేశామో చూపిస్తామన్నారు. ఇప్పుడెందుకు మెడికల్ కళాశాలలను అమ్ముకుంటున్నారో ప్రజలందరికి తెలుసని, నిర్మాణం పూర్తి చేసుకున్న పులివెందుల మెడికల్ కళాశాలలో సీట్లు కేటాయిస్తామని చెబితే చంద్రబాబు ప్రభుత్వం సీట్లు కేటాయించవద్దని లేఖ రాయటం వాస్తవం కాదా? అని మహేష్ రెడ్డి ప్రశ్నించారు. రూ 500 కోట్ల విలువ చేసే ఒక్కో కాలేజీని కేవలం రూ.50 కోట్లకు అమ్ముకొని మరో రూ.200 కోట్లు లంచాలు తీసుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మహేష్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నాయకులకు మెదడు సరిగ్గా పనిచేయటం లేదని, తెలుగుదేశం నాయకులు చేసే చౌకబారు విమర్శలకు తాము స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్న టీడీపీ నాయకులు కొత్తగా మంజూరైన 17 మెడికల్ కాలేజీలకు ఒక్కో దానికి రూ.200 కోట్లు కూడా తీసుకురాలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ నిధులు తెస్తే అన్ని కళాశాల నిర్మాణాలు పూర్తి అవుతాయని మహేష్ రెడ్డి పేర్కొన్నారు. రూ.లక్షల కోట్ల అప్పు చేసి అమరావతిలో పెడుతున్నప్పుడు రూ.3 వేల కోట్లు అప్పుచేసి విద్య, వైద్యానికి ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కళాశాలల నిర్మాణాలు కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే ఆ ప్రాంతాలలోని నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి అన్నారు. మెడికల్ కళాశాల మంజూరులో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎటువంటి సంబంధం లేదని, గత ప్రభుత్వంలో జవహర్రెడ్డి పట్టు పట్టి ఈ కళాశాలను మంజూరు చేయించారని మహేష్ రెడ్డి గుర్తు చేశారు. రూ.200 కోట్ల వసూలుకు పన్నాగం సీటు రూ.50 లక్షలకు అమ్ముకునేలా ప్రైవేటు వ్యక్తులకు అవకాశం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే మెడికల్ కళాశాలల స్వాధీనం గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి -
వృద్ధురాలిపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
నగరం: మండలంలోని చినమట్లపూడి శివారు దళితవాడలో అరవై సంవత్సరాల వృద్ధురాలిపై అత్యాచారం చేసి మరణానికి కారణమైన నిందితుడు వసుమతి విజయ్కుమార్ అలియాస్ విజయ్ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపల్లె రూరల్ సీఐ సురేష్బాబు సమాచారం మేరకు.. చినమట్లపూడి శివారు దళితవాడలో సుశీలమ్మపై ఈనెల 2వ తేదీ తెల్లవారుజాము సమయంలో అదే గ్రామానికి చెందిన విజయ్ అత్యాచారం చేయడంతో మృతి చెందింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీఐ తెలిపారు.విచారణలో విజయ్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయని చెప్పాడు. నిందితుడిని శిరిపూడి నాగమ్మ కొట్టు సెంటర్ వద్ద సోమవారం అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐ బండ్ల భార్గవ్ పాల్గొన్నారు. -
పీఆర్సీ కమిషన్ వేయకపోవడం మోసగించటమే
● ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు ● సత్తెనపల్లిలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శన సత్తెనపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ వర్తింపజేయాల్సి ఉండగా సమయం దాటి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు కమిషన్ను నియమించక పోవడం ఉద్యోగులను మోసగించటమేనని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలు పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిరసన వారం 5వ రోజు కార్యాచరణలో భాగంగా సత్తెనపల్లి మండల పరిషత్ కార్యాలయం నుంచి సోమవారం ర్యాలీగా వెళ్లి తాలూకా కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనకు ఏపీటీఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ మొహమ్మద్ ఇబ్రహీం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఉద్యోగుల సొమ్ము 10 శాతాన్ని పెట్టుబడిదారులకు దోచిపెట్టే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మెమో నంబర్ 57 ప్రకారం 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే కలిసొచ్చే సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు బాళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు వెంటనే విడుదల చేయాలని, బోధనేతర యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ హెల్త్ ప్రీమియం చెల్లిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, పరీక్షలలో అసెస్మెంట్ బుక్లెట్ విధానం వల్ల ఉపాధ్యాయుల బోధన సమయం హరించడమే కాకుండా పిల్లలకు ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పారు. అసెస్మెంట్ బుక్ లెట్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాలూకా పరిధిలోని మండలాల ఏపీటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు శివారెడ్డి, ఫిరోజ్ ఖాన్,ఽ ధర్మారావు, ఐతమ్రాజు,రవికుమార్, శ్రీధర్, సుభాని, సాబీర్, చంద్రం,రమేష్,రామకృష్ణ, హఫీస్, కోటేశ్వరరావు, సునీల్, వెంకటేశ్వరరావు వినోద్, సమద్ ఖాన్, నాసరయ్య, సుబ్బారెడ్డి, ఇలియాస్, శేషగిరి, అత్తరున్నీసా, లెనీన్రాణి, శ్రీదేవి, తులసి, కుదిషియా పాల్గొన్నారు. -
మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిరస్మరణీయుడు
సత్రశాల(రెంటచింతల): ఇంజినీరింగ్ రంగంలో అసాధారణ ప్రతిభతో అత్యున్నత శిఖరాలను అధిరోహించి మన దేశ ఖ్యాతిని చాటిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్ట్ జీఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం విశ్వేశ్వరయ్య జయంతి నిర్వహించారు. ప్రాజెక్ట్ ఆవరణలోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతు విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా ఇంజినీర్స్ డేను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. జలాశయాల నిర్మాతగా, ఆర్థికవేత్తగా శాశ్వత కీర్తి గడించిన విశ్వేశ్వరయ్యను భారత ప్రభుత్వం 1955లో భారత రత్న పురస్కారంతోను, బ్రిటీష్ ప్రభుత్వం అత్యుత్తమ పౌర పురస్కారమైన బ్రిటీష్ నైట్హుడ్గా సన్మానించిందన్నారు. మైసూర్ ఆదర్శ నగరంగా మారడంలో ఆయన యనలేదినని కొనియాడారు. హైదరాబాద్, ముంబాయి నగరాలకు డ్రెయినేజి వ్యవస్థ రూపకల్పన, విశాఖపట్నం పోర్టు ఏర్పాటులో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఈఈ సుబ్రహ్మణ్యం, డెప్యూటీ ఈఈలు జయశంకర్, గిరిబాబు, మహహ్మద్, మతిన్, ఏఈలు వెంకటరమణ, మల్లేష్, ఏఈఈ శ్రీలత పాల్గొన్నారు. సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్ట్ జీఎం శ్రీనివాసులు -
కొత్తరెడ్డిపాలెంలో సాధారణ జ్వరాలే..
చేబ్రోలు: మండలంలోని కొత్తరెడ్డిపాలెంలో జ్వరాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కె. విజయలక్ష్మి తెలిపారు. గ్రామంలో ఆదివారం వైద్య సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ప్రబలిన జ్వరాలు, సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. సీజనల్ జ్వరాల ప్రభావం బలహీనంగా ఉన్న వృద్ధులు, పిల్లలపై ఉంటాయని తెలిపారు. అనారోగ్య సమస్యలున్న వారు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తురకపాలెం బాధితులు మరణించిన వైద్యశాలలో కొత్తరెడ్డిపాలేనికి చెందిన వ్యక్తి మరణించటంతో కలవరం మొదలైందని తెలిపారు. ఇక్కడ జ్వరాల బాధితులంతా సాధారణ మందులతో పూర్తిగా కోలుకున్నారని ఆమె పేర్కొన్నారు. వ్యాధి తీవ్రత అనుమానంతో రక్తపరీక్షలు చేయగా తొమ్మిది మందిలో నలుగురికి నెగిటివ్, ఐదుగురికి జలుబుకు సంబంధించిన స్టైపెలో కోకై లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. ఇక్కడ సాధారణ జ్వరాలు నమోదైనట్లు తెలిపారు. సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించామని, ఆదివారం రెండు జ్వరాల కేసులు వచ్చాయని చెప్పారు. గ్రామంలో మెడికల్ క్యాంపు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమలో పీహెచ్సీ వైద్యాధికారిణి వై. ఊర్మిళ, శైలజ, డెప్యూటీ ఎంపీడీవో రవిశంకర్, పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. -
పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వాలి
యడ్లపాడు: పత్తికి మద్దతు ధర నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుడటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. స్థానిక పీఆర్ విజ్ఞాన కేంద్రంలో కల్లూరి రామస్వామి అధ్యక్షతన పత్తి రైతుల సమస్యలపై ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రాధాకృష్ణ మాట్లాడుతూ కనీస మద్దతు ధర కన్నా తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీనికి పరిష్కారంగా పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కి కేటాయించాల్సిన నిధులను తగ్గించడం, చివరకు దాన్ని రద్దు చేసి నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ఆలోచన రైతులను కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తుందని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర రూ.8,110 కాగా, రైతులు కోరుతున్నది మాత్రం సి2+50 ఫార్ములా ప్రకారం క్వింటాల్కు రూ.10,075 అని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ లేకపోవడం రైతులకు మరింత నష్టం చేకూరుస్తుందని అన్నారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై విధించే 11 శాతం సుంకాన్ని రద్దు చేయడం వల్ల దేశీయ మార్కెట్లో పత్తి ధరలు పడిపోతాయని, ఇది రైతులకు కోలుకోలేని దెబ్బ అని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అక్టోబర్ 9న నరసరావుపేటలో నిర్వహించనున్న పత్తి రైతుల జిల్లా సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి కల్లూరి రామస్వామి కన్వీనర్గా 9 మంది సభ్యులతో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు కల్లూరి రామారావు, శ్రీనివాసరెడ్డి, గోగడ హరిబాబు, నూతలపాటి సుబ్బరామమూర్తి, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
కొండవీడు రాజుల సాహిత్యసేవ మరువలేనిది
నగరంపాలెం: కొండవీడు రాజుల సాహిత్యసేవ మరువలేనిదని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కలెక్టర్ బంగ్లారోడ్లోని భారతీయ విద్యాభవన్లో ఆదివారం కొండవీడు హెరిటేజ్ సొసైటీ ఆధ్వర్యంలో మహాకవి కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలమ్’ నాటకానికి కాటయ వేమారెడ్డి రచించిన ‘కుమారగిరి రాజీయమ్’ వ్యాఖ్యాన గ్రంథ– ఆవిష్కరణ సభ నిర్వహించారు. సభకు డాక్టర్ డీఎన్ దీక్షిత్ అధ్యక్షత వహించారు. ఈ గ్రంథాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఈ గ్రంథం కొండవీడు రాజుల సాహిత్య ప్రతిభాపాటవానికి ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కొండవీడు పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు కల్లి శివారెడ్డి గణనీయమైన కృషి చేస్తున్నారని అన్నారు. గ్రంథ సంపాదకుడు మోదుగుల రవికృష్ణ మాట్లాడారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి కల్లి శివారెడ్డి, గ్రంథ ప్రచురణ కోసం సహకరించిన ఆవుల మురళీధర్రెడ్డి, ఆవుల సుశీల దంపతులు పాల్గొనగా, డాక్టర్ కాజ సుబ్రహ్మణ్యం నిర్వహణలో కొల్లి అక్షయరెడ్డి నాట్య ప్రదర్శన అలరించింది. -
డ్రెయిన్లో పడి బాలుడి మృతి
నకరికల్లు: డ్రెయిన్లో పడి రెండేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన మండలంలోని కుంకలగుంటలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మస్తాన్వలి, ఖైరాబి దంపతుల కుమారుడు షేక్ ఇషాన్అహ్మద్(2). రెండురోజులుగా భారీ వర్షం పడుతున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం సమయం తరువాత తల్లీకొడుకు ఇద్దరూ కలసి తమ ఇంటిముందు నిలబడ్డారు. అప్పటి వరకు భారీ వర్షం పడడంతో వారి ఇంటిముందున్న డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తుంది. కొడుకును బయట కూర్చోబెట్టిన తల్లి చీపురుకోసం ఇంట్లోకి వెళ్లి వచ్చింది. ఒక్క నిమిషం వ్యవధిలోనే చిన్నారి ఇషాన్ అహ్మద్ కనిపించకపోవడంతో వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్న సమయంలో రెడ్డిపాలెం సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద ఉన్న చిన్నపాటి వాగులో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వర్షంనీటికి ఉధృతంగా ప్రవహిస్తున్న డ్రెయిన్లో పడడంతో గల్లంతై ఊపిరాడక మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
పులిచింతలకు 3,02,629 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 15 క్రస్ట్ గేట్లు ద్వారా 3,02,629 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 14 క్రస్ట్ గేట్లు నాలుగు మీటర్లు, ఒక క్రస్ట్గేటు 2.5 మీటర్లు ఎత్తు ఎత్తి 3,02,629 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 74.58 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.462 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 61.83 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
నగరంపాలెం: శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. ఆదివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హాలులో జిల్లా పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఏదైనా నేరం జరిగితే వెంటనే స్పందించాలని, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, సంఘ విద్రోహశక్తులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, వారి కదలికలు, జీవన విధానంతో పాటు ఏవైనా అనుమానాలు తలెత్తితే తక్షణమే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు. పేకాట, కోడి పందేలు, మట్కా, సింగిల్ నంబర్ జూదాలను అరికట్టాలని తెలిపారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని, వారితో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు. చట్ట పరిధిలో వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పోలీస్స్టేషన్లలో ఎక్కువసేపు కూర్చోపెట్టొద్దని తెలిపారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. జనరల్ డైరీ, రఫ్ డ్యూటీ రోస్టర్, ప్రాపర్టీ రిజిస్టర్, కేసు డైరీ ఇతర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాలు, వార్డుల్లో కానిస్టేబుళ్లకు విధులు కేటాయించాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్, ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ డ్రైవ్, కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), రవికుమార్ (ఎల్/ఓ), హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్పీ గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
రేపటి నుంచి బాలబాలికల టీంలు ఎంపిక
బాపట్ల టౌన్: బాపట్ల, నగరం మండలాల్లో ఈనెల 16,17 తేదీల్లో స్కూల్ గేమ్స్ అండర్ 14,17 బాలబాలికల టీంలు ఎంపికలు నిర్వహించనున్నట్లు సెక్రటరీ కె. వెంకటేశ్వరరావు తెలిపారు. బీచ్ వాలీబాల్ పోటీల ఎంపిక బాపట్ల మండలంలోని ముత్తాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో, తైక్యాండో పోటీలకు ఎంపిక నగరం మండలంలోని ఉలిపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో జరుగుతాయని పేర్కొన్నారు. అండర్–14 పోటీలకు విద్యార్థులు 1–1–2012 తర్వాత, అండర్ –17 పోటీలకు విద్యార్థులు 1–1–2009 తర్వాత జన్మించి ఉండాలని పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో కూడిన ఎంట్రీ ఫామ్, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నికల్, ఓపెన్ స్కూల్ విద్యార్థులు అనర్హులని పేర్కొన్నారు. అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన పట్టణంలోని భవానీ సెంటర్లో ఆదివారం జరిగింది. ఎన్టీర్ కాలనీకి చెందిన యర్రమోతు అంజయ్య బైకుపై పట్టణంలోకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో భవానీ సెంటర్లో శింగరకొండ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది బాధితుడిని తొలుత అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వైద్యశాలకు తరలించారు. నగరంపాలెం: స్థానిక చుట్టుగుంట కూడలిలోని టుబాకో బోర్డు రైతు భవన్లో ఆదివారం భారత పొగాకు బోర్డు పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల వలె హెల్త్ పాలసీ పొగాకు బోర్డులో ఉద్యోగ విరమణ పొందిన వారికి వర్తింపచేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. తద్వారా విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్య ఖర్చులు పొందుతారని అన్నారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు వెంకటరావు, మరో ఎనిమిది 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షులు బీఎన్.మిత్ర, సభ్యులు, కర్ణాటక రాష్ట్రం నుంచి హాజరయ్యారు. -
ఆది ఆచార్యులు బ్రాహ్మణులు
నగరంపాలెం: సమాజంలో గురు పరంపరకు మూలం బ్రాహ్మణం అని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం(తిరుపతి) ఉప కులపతి ఆచార్య జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి అన్నారు. అందుకే ఆది ఆచార్యుల స్థానం బ్రాహ్మణులకే సొంతమని ఆయన పేర్కొన్నారు. ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఏపీలోని 13 జిల్లాలకు చెందిన 56 మంది బ్రాహ్మణ జాతికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో సత్కరించి, అవార్డులు అందించారు. ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడారు. కార్యక్రమంలో సమాఖ్య ఉపాధ్యక్షుడు, కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), శారదాంబ, సమాఖ్య ఉపాధ్యక్షులు మంగళంపల్లి అంజిబాబు, రామభద్రుడు, కసలపాటి లక్ష్మీనారాయణ, పేరి శ్రావణ్, కుప్పం ప్రసాద్, కౌతా ధర్మ సంస్థల అధినేత కౌతా సుబ్బారావు, గుంటూరు బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రంగావజ్థుల లక్ష్మీపతి, పోతావజ్థుల పురుషోత్తమశర్మ, మాగంటి శాస్త్రి పాల్గొన్నారు. -
అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
బాపట్ల అర్బన్: బాపట్ల మున్సిపల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో బాపట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల సెలక్షన్న్స్ ఆదివారం జరిగాయి. పోటీల్లో బాలికలు 60 మంది, బాలురు 78 మంది పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన బాలురులో 14 మంది, బాలికలో 14 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 21వ తేదీ వరకు బాపట్ల మున్సిపల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో క్యాంపులో పాల్గొంటారు. 21న క్యాంపు ముగించుకొని విజయవాడలో జరిగే అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. మున్సిపల్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ కత్తి శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా ప్రెసిడెంట్ అర్జున్రావు, సెక్రెటరీ సుబ్బరాజు, జాయింట్ సెక్రెటరీ మరక సాయికుమార్, ట్రెజరర్ రాధాకృష్ణ, సాప్ కోచ్ శైలజ, పీడీ శ్రావణి, పీడీ మమత, పీడీ లలితమ్మ, పీడీ శాంతికుమారి, బాపట్ల కబడ్డీ క్లబ్ సభ్యులు సాంబశివరావు, నాగులు, నాగేశ్వరరావు, విజయ్, రామాంజిల్రెడ్డి, ఊస హరికృష్ణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ బాలికల చాంపియన్ గుంటూరు
బత్తలపల్లి: మండలంలోని రామాపురం జెడ్పీహెచ్ఎస్ మైదానం వేదికగా మూడు రోజులుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల 10వ బాల్బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నీ ఆదివారం ముగిసింది. అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీ చాంపియన్ షిప్ను బాలుర విభాగంలో తూర్పు గోదావరి జిల్లా, బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్లు దక్కించుకున్నాయి. కాగా, ఆదివారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీగా సాగాయి. బాలుర విభాగంలో రెండో స్థానంలో చిత్తూరు, మూడో స్థానంలో శ్రీకాకుళం, నాల్గో స్థానంలో ప్రకాశం జిల్లా జట్టు నిలిచాయి. బాలికల విభాగంలో రెండో స్థానంలో విశాఖపట్నం, మూడో స్థానంలో తూర్పుగోదావరి, నాల్గో స్థానంలో శ్రీకాకుళం జట్లు నిలిచాయి. విజేతలకు ట్రోఫీలను ముఖ్యఅతిథులు అందించి, అభినందించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కోలాటంతో స్థానిక కళాకారులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ తలారి లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయులు వెంకటనాయుడు, రాష్ట్రబాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు విజయశంకర్రెడ్డి, చైర్మన్ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ బాలాజి, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, జనరల్ సెక్రటరీ వెంకటేష్, నాయకులు ధర్మవరం మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ అయ్యప్పనాయుడు, చిలకం మధుసూదన్రెడ్డి, నారాయణరెడ్డి, ఆకులేటి వీరనారప్ప, పురంశెట్టి రవి, గ్రామ పెద్దలు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. ముగిసిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు -
రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
చీరాల రూరల్ : స్థానిక రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్–1 ఉత్తరం వైపు చివరన ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని జీఆర్పీ ఎస్ఐ సీహెచ్. కొండయ్య తెలిపారు. 55 సంవత్సరాలు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ప్లాట్ఫాంపై పడున్నాడనే సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే మరణానికి కారణాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైలు నుంచి జారిపడి మరొకరు రైల్లో ప్రయాణిస్తూ జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చీరాల–వేటపాలెం రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. విజయవాడ వైపు వెళ్లే డౌన్ మెయిన్ లైన్పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో పరీక్షించగా ఎటువంటి అధారాలు లభించలేదని ఎస్ఐ కొండయ్య తెలిపారు. మృతుని వయస్సు 45 సంవత్సరాలు ఉంటాయని చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గంజాయి రహితంగా జిల్లా మార్పు
బాపట్లటౌన్: బాపట్ల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ చెప్పారు. బాపట్ల జిల్లా ఎస్పీగా బి.ఉమామహేశ్వర్ ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ బాధ్యతలు చేపట్టారు. తొలిసారిగా జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీకి జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పోలీస్ పరేడ్తో ఆహ్వానించారు. బాధ్యతల స్వీకారం అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రజలకు నిష్పక్షపాతమైన సేవలు అందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. మహిళలకు, చిన్నపిల్లలకు సంబంధించిన నేరాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పెండింగ్ కేసుల విచారణలో సాంకేతికతను జోడించి వేగంగా దర్యాప్తు చేస్తామన్నారు. సముద్రతీర ప్రాంతంలో భద్రత చర్యలపై మరింత దృష్టి పెడతామని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పోలీస్స్టేషన్కి వచ్చి వారి సమస్యలు చెప్పుకొనే విధంగా చూస్తామన్నారు. మాదక ద్రవ్యాల కట్టడి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రాబోయే రోజుల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలియపరచడానికి హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభిస్తామన్నారు. జిల్లా ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించిన సమాచారం పోలీస్ శాఖకు అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. పోలీస్ అధికారులతో సమీక్ష అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తొలుత జిల్లాలోని నేరాలపై సమీక్షించారు. ఇప్పటివరకు నేరాలు జరిగిన తీరు..ఏ తరహా కేసులు ఈ ప్రాంతంలో అధికంగా నమోదవుతుంటాయనే విషయాలపై ఆరా తీశారు. సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ పోలీస్శాఖ పేరు ప్రఖ్యాతలు సాధించేలా పనిచేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, చిన్నారులు, మహిళలపై దాడులకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజిబుల్ పోలీసింగ్, ఎన్ఫోర్స్మెంట్ విధులను నిబద్ధతతో నిర్వర్తించాలన్నారు. తీర ప్రాంతంలో గస్తీ మరింత పెంచాలన్నారు. ఎలాంటి సమస్యతో బాధితులు స్టేషన్కు వచ్చినా తక్షణమే స్పందించి వారికి సహాయం చేయాలన్నారు. తక్షణమే స్పందించడం ద్వారా నేరాలను ఆదిలోనే అరికట్టవచ్చన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్నాయక్, రేపల్లె డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, చీరాల డీఎస్పీ ఎం.డి.మొయిన్, ఏఆర్ డీఎస్పీ పి. విజయసారధి, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కారు బీభత్సం
జాతీయ రహదారిపై చీరాల అర్బన్: మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఆదివారం 216 జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించారు. చిలకలూరిపేటకు చెందిన యువకులు ఆదివారం రామాపురం సముద్రతీరానికి వచ్చారు. మద్యం తాగి సాయంత్రం రామాపురం నుంచి జాతీయ రహదారిపైకి కారులో వేగంగా వచ్చారు. ద్విచక్రవాహనంపై వస్తున్న వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన వ్యక్తిని ఢీకొని ఆగకుండా వెళ్లిపోయారు. అదే వేగంతో హాయ్ రెస్టారెంట్ వద్ద ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ఉన్న రామానగర్కు చెందిన ఆరుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు వేగ నియంత్రణ కాకపోవడంతో రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు ఆటోలో గాయాలపాలైన యువకులను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులకు ఏరియా వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు టూటౌన్ సీఐ నాగభూషణం తెలిపారు. -
సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
అక్రమ కేసులు బనాయించడం దారుణం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్గా గుర్తింపు ఉన్న పత్రికలపై, ఎడిటర్లపై, రిపోర్టర్లపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం దారుణం. సాక్షి దినపత్రిక నిజాలను వెలికి తీస్తోందనే అక్కసుతో కూటమి ప్రభుత్వం దారుణాలకు దిగుతోంది. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై, ఇతర విలేకర్లపై కేసులు నమోదు చేసింది. ప్రభుత్వంపై వ్యతిరేకతను దినపత్రిక ద్వారా ప్రజలకు తెలియజేసిన సాక్షి పత్రికపై అక్కసు వెళ్లగక్కడం మంచి పరిణామం కాదు. – బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ మెంబరు ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం నాలుగో స్తంభం. సాక్షి దినపత్రికపై కూటమి ప్రభుత్వం కక్షగట్టి కేసులు నమోదు చేయడం అత్యంత దారుణం. ప్రభుత్వ లోపాలు, ప్రజల సమస్యలను తెలియజేసే క్రమంలో వ్యతిరేక వార్తలు రావడం సహజం. వాటిలో తప్పొప్పులను బేరీజు వేసుకోవాలి తప్పా అక్రమ కేసులు బనాయించడం హేయం. ఇది పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు వంటిది. ఇప్పటికై నా కూటమి సర్కారు తీరు మార్చుకోవాలి. – మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ -
అక్షరంపై కక్ష సాధింపు తగదు
అక్షరం ప్రశ్నిస్తుంది.. అక్రమం ఎక్కడుంటే అక్కడ గర్జిస్తుంది. ఒక అక్షరాన్ని బహిష్కరిస్తే లక్ష పుట్టుకొస్తాయి. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. కూటమి ప్రభుత్వం దాన్ని కాల రాస్తోంది. సాక్షి మీడియాతో పాటు ఎడిటర్, జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. తప్పులు ఎత్తి చూపుతున్న సాక్షి దినపత్రిక, ఎడిటర్, పాత్రికేయులపై కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. సమాజంలో ప్రతి ఒక్కరూ పత్రికా సేచ్ఛను పరిరక్షించాలి. –దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త -
కృష్ణా నదిలో పెరిగిన వరద ప్రవాహం
కొల్లూరు : కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ సుంచి దిగువ సముద్రంలోకి నీటిని విడుదల చేస్తుండటంతో మండలంలో కృష్ణా నదిలో వరద తీవ్రత పెరిగింది. నది నిండుగా ప్రవహిస్తోంది. ఆదివారం ప్రకాశం బ్యారేజ్ నుంచి 2.87 లక్షల నీటిని ఆర్సీ అధికారులు దిగువకు విడుదల చేశారు. అనంతరం నాలుగు నుంచి ఐదు గంటల వ్యవధిలో జిల్లాలోకి వరద నీటి తాకిడి తగలనుండటంతో గణనీయంగా నదిలో నీటి మట్టం అర్ధరాత్రి అనంతరం పెరిగే సూచనలున్నాయి. తీర ప్రాంత గ్రామాల ప్రజలు, పశువుల కాపర్లు, చిన్నారులు నదిలోకి దిగరాదని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద తీవ్రత అధికమైతే పంటలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళనలో రైతులు ఉన్నారు. ఎగువ ప్రాంతాలో వర్షాలు కురవకుండా ఉంటే నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులతోపాటు మున్నేరు తదితర వాగుల ద్వారా కూడా ప్రకాశం బ్యారేజ్ వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టే సూచనలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 3.50 లక్షల వరకు కృష్ణా నదికి వరద నీటి విడుదల ఉండవచ్చునని ప్రాథమిక అంచనాకు వచ్చారు.