Bapatla District Latest News
-
బైకును ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
చెరుకుపల్లి: కావూరు ప్రభుత్వ వైద్యశాల రోడ్డులో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరం మండలం పెదమట్లపూడి శివారు లుక్కావారి పాలెం గ్రామానికి చెందిన ఆట్ల దుర్గాప్రసాద్(25), కేశన గోపి కలసి గురువారం ఉదయం మిరప నారు కొనేందుకు బాపట్ల వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో మధ్యాహ్నం కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై రేపల్లె డిపో ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొంది. దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. గోపీకి తీవ్ర గాయాలు కావటంతో 108 సాయంతో తెనాలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్సై టి.అనిల్కుమార్ ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
బాపట్ల టౌన్: వైద్యారోగ్య శాఖలో పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కూరపాటి సత్యంరాజు గురువారం రాష్ట్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. సత్యంరాజు మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అన్ని క్యాడర్స్లో వారికి వంద శాతం గ్రాస్ వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్స్ ఉద్యోగులకు బదిలీల సౌకర్యం కల్పించాలన్నారు. జీవో 143 సరళతరం చేసి, తొలగించబడిన హెల్త్ అసిస్టెంట్లను మానవతా దృక్పథంతో తిరిగి నియమించాలని పేర్కొన్నారు. ఆర్థికపరమైన అంశాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవకాశం ఉన్నంతవరకు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ సభ్యులు వైవీ శేషయ్య ఉన్నారు. -
శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి
జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తమ్ బాపట్ల టౌన్: విద్యార్థి దశ నుంచే శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తమ్ తెలిపారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రూపేష్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 6 – 9 తరగతు విద్యార్థినులకు కరాటేలో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. జీసీడీవో చారులత మాట్లాడుతూ ఆత్మరక్షణ సాహసానికి తొలి మెట్టు అన్నారు. ఈ శిక్షణ 20 రోజులు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, సొసైటీ జిల్లా కో ఆర్డినేటర్ రాము, ట్రైనర్స్ ఇన్చార్జి ఉమామహేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏఎంఓ మోసేస్, ఐఈడీ జోత్స్న సీఎంఓ శ్రీనివాస రెడ్డి, ఏఎస్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
హోంగార్డుపై యువకుడు దాడి
చెరుకుపల్లి: మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగాడు. వివరాలు.. గుళ్ళపల్లి గ్రామానికి చెందిన వాగు దినేష్ గురువారం సాయంత్రం మద్యం తాగి జాతీయ రహదారిపై వాహనాల ముందుకు వెళ్లాడు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న కారంకి శ్రీనివాసరావు అనే హోంగార్డు, మరో కానిస్టేబుల్ ఎంత వారించినా వినలేదు. వారిని దుర్భాషలాడుతూ హోంగార్డు శ్రీనివాసరావును కింద పడేసి దాడి చేశాడు. చొక్కా చించేశాడు. ఎస్సై అనీల్కుమార్ సిబ్బందితో వచ్చి ట్రాఫిక్ నియంత్రించారు. దినేష్కు ఎంత చెప్పినా వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. హోంగార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించాలి బాపట్ల టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శి టి.వి. సురేష్లు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు ఉన్నాయన్నారు. బాలిక అదృశ్యంపై కేసు మంగళగిరి టౌన్: బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు మంగళగిరి పట్టణ పోలీసులు గురువారం తెలిపారు. మంగళగిరి పార్కు రోడ్డులో ఉంటున్న బాలిక గుంటూరు సమీపంలోని సిమ్స్ కాలేజీలో నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి కొంతకాలం క్రితం మరణించడంతో బాలిక తల్లి తిరుపతమ్మ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో హౌస్ కీపింగ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఫిబ్రవరి 14న కాలేజీకి వెళ్లిన కుమార్తె సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. ఆచూకీ లభించకపోవడంతో బుధవారం రాత్రి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బడ్జెట్లో చేనేత రంగానికి రూ.2వేల కోట్లు కేటాయించాలి మంగళగిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో చేనేత రంగానికి రూ. 2వేల కోట్లు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నగర పరిధిలోని ఏపీ చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లా డుతూ చేనేతలకు జనాభా ప్రాతిపదికన నిధు లు కేటాయించాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు బకాయి ఉన్న రూ. 172 కోట్లను వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, నేతన్న నేస్తం పథకాన్ని రూ.24 వేల నుంచి రూ.36 వేల రూపాయలకు పెంచాలని కోరారు. బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట కృష్ణారావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
టీటీడీ సభ్యుడిపై చర్యలు తీసుకోండి
నరసరావుపేట: శ్రీ వెంకటేశ్వరుడు నిలయమైన తిరుమల ఆలయంలో మహా ద్వారం వద్ద విధు లు నిర్వహిస్తున్న బాలాజీ సింగ్పై టీటీడీ పాలకవర్గ సభ్యుడు నరేష్కుమార్ అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడటాన్ని ఏపీ రాష్ట్ర బొందిలి సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక కార్యాలయంలో గురువారం సంఘ నాయకులు సమావేశమయ్యారు. సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొందిలి శ్రీనివాస సింగ్ మాట్లాడుతూ విధుల్లో ఉన్న ఉద్యోగిపై నరేష్కుమార్ ‘‘నిన్ను ఎవరు ఇక్కడ పెట్టించింది.. ఏమనుకుంటున్నావు.. నీ సంగతి చూస్తా.. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా? నువు ముందు బయటికి పో’’ అంటూ దూషించడం దారుణమని తెలిపారు. వెంటనే నరేష్ కుమార్ క్షమాపణ చెప్పాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించి పాలకవర్గ సభ్యుడుగా ఉన్న అతడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. -
ప్రకృతి సేద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కొరిటెపాడు(గుంటూరు): ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి కోరారు. ఈ మేరకు గురువారం ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరులోని రైతు సాధికార సంస్థ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం సీఈవో రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో 15 వేల మంది ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములై అనేక క్యాడర్లలో పనిచేస్తున్నారని తొమ్మిది ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రైతులకు చేరదీసే విషయంలో కష్టపడి పనిచేస్తున్న అనేక క్యాడర్ల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. వారిని అర్ధాంతరంగా తొలగించే విధానాన్ని ఆపాలని సూచించారు. అంతేకాకుండా తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. పి.ఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వేతనాల పెంపుకై ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. -
ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్టు
నిందితుల్లో ఒకరు మైనర్ తెనాలిరూరల్: గంజాయి విక్రయిస్తున్న మైనర్ సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం డీఎస్పీ బి.జనార్దనరావు వన్టౌన్ సీఐ మల్లికార్జునరావుతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన ఆరుమళ్ల సాహిత్ రెడ్డి, రెడ్డిబత్తుల హర్షవర్ధరెడ్డి, పాముల రిషిబాబు, తెనాలి రామలింగేశ్వరపేటకు చెందిన యర్రమోతు పవన్ ప్రశాంత్, నాజరుపేటకు చెందిన పసుపులేటి వెంకటేశ్వరరావు, గంగానమ్మపేటకు చెందిన మరో మైనర్ కలిసి వైకుంఠపురం రైల్వే అండర్ పాస్ వద్ద గంజాయి విక్రయిస్తుండగా అందిన సమాచారంతో గురువారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి తెనాలిలో అమ్ముతున్నట్టు గుర్తించామని వెల్లడించారు. వీరి వద్ద నాలుగు కిలోల 50 గ్రాముల గంజాయితోపాటు రూ. 4,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను అరెస్ట్ చేసిన సీఐ మల్లికార్జునరావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
మహిళల రక్షణపై దృష్టి ముఖ్యం
బాపట్ల టౌన్: మహిళల రక్షణపై దృష్టి సారించాలని రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం రాష్ట్రంలోని ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాపట్ల జిల్లా నుంచి ఎస్పీ తుషార్డూడీ హాజరయ్యారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్లనే ధరించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. కొత్త చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించాలని, డ్రోన్లను విరివిగా వాడుతూ పట్టణ ట్రాఫిక్ ప్రాంతాల్లో సేవలు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. -
టోల్ ప్లాజాల వద్ద సౌకర్యాల కల్పనే లక్ష్యం
ఎన్హెచ్ఏఐ ఆర్వో ఆర్కే సింగ్ మంగళగిరి: టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికుల కోసం వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ఎన్హెచ్ఏఐ ఆర్వో ఆర్కే సింగ్ తెలిపారు. నగర పరిధిలోని కాజ టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన కొత్త అంబులెన్స్లతోపాటు బేబి కేర్ రూమ్లను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అంబులెన్సులు, బేబీకేర్ రూంలు ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో టోల్ ప్లాజా మేనేజర్ రవి, బేబీ కేర్ రూమ్ దాతలు శ్రీ వేంకటేశ్వర ఫుడ్ బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు పాలడగు కృష్ణ వంశీ,శ్రీనివాసరావు, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
హజరత్ మస్తాన్ వలి దర్గాను స్వాధీనం చేసుకోవాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంలోని హజరత్ కాలే మస్తాన్ వలి దర్గాను రావి రామ్మోహనరావు, అతని కుమారుడు మస్తాన్ సాయి వ్యాపార కేంద్రంగా మార్చారని ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ గుంటూరు జిల్లా వక్ఫ్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ షేక్ సుభాని, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా ధ్వజమెత్తారు. స్థానిక నగరంపాలెంలోని ముస్లిం సేన రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రావి రామ్మోహనరావు కుటుంబానికి ఈ దర్గాకు సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసినా, గత వక్ఫ్ బోర్డులో ఇతనిపై చర్యలు తీసుకోవాలని షోకాజ్ నోటీస్ ఇచ్చి దర్గాను స్వాధీనం చేసుకోవాలని వక్ఫ్బోర్డు నిర్ణయించినా వక్ఫ్ బోర్డు సీఈఓ కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికై నా సర్కారు, వక్ఫ్ బోర్డు అధికారులు దృష్టి సారించి దర్గాను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మస్తాన్ సాయిపై డ్రగ్స్, మహిళలను మోసం చేసిన కేసులు నమోదయ్యాయని, ఇది దర్గా పవిత్రతకు భంగం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్, మైనార్టీ నాయకుడు సైదా, సత్య పలువురు పాల్గొన్నారు. జేఈఈ మెయిన్లో మెరిసిన విద్యార్థికి సత్కారం తెనాలి: జాతీయస్థాయి ఐఐటీ–జేఈఈ మెయిన్లో రికార్డు స్థాయిలో 99.37 పర్సెంటైల్ సాధించిన తెనాలి వివేక జూనియర్ కాలేజి విద్యార్థి తూనుగుంట్ల వెంకట పవన్కుమార్ను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. తెనాలిలోని తన కార్యాలయంలో శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. పేద కుటుంబానికి చెందిన పవన్కుమార్కు ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పవన్కుమార్ వెంట ఉన్న వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె.రామరాజు, సీఈవో ఉదయ్కిరణ్ను మంత్రి మనోహర్ ప్రశంసించారు. పసుపు ధరలు దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో గురువారం 168 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాసరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సరుకు 139 బస్తాలకు కనిష్ట ధర రూ.8400 గరిష్ట ధర రూ.10,750 మోడల్ ధర రూ.10,750, కాయలు 29 బస్తాలకు కనిష్ట ధర రూ.8,400, గరిష్ట ధర రూ.10,001, మోడల్ ధర రూ.10,001 పలికింది. మొత్తం 126 క్వింటాళ్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. -
ఆహార భద్రతా శిక్షణ కేంద్రం ప్రారంభం
బాపట్ల టౌన్: ఆహార, కిరాణా, మాంసం, మిఠాయి వంటి షాపుల నిర్వాహకులు శిక్షణ తీసుకొని ధ్రువపత్రాలు పొందాలని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గరికపాటి ప్రభాకరరావు తెలిపారు. పట్టణంలోని విజయలక్ష్మిపురంలో గురువారం ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రణీత్, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ట్రైనర్ కలకండ ప్రవీణ్ కుమార్, బాపట్ల బ్రాంచ్ మేనేజర్ నవీన్, కిరాణా అసోసియేషన్ సెక్రటరీ దిలీప్, ఫ్యాన్సీ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీనివాస్, రాధాకృష్ణ, నాగేశ్వరరావు, మువ్వ శ్రీనివాస్, అనిల్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన
గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనున్న దృష్ట్యా స్థానిక ఏసీ కళాశాలలో బ్యాలెట్ బాక్సులు భద్రపర్చే గదులు, రిసెప్షన్ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను గురువారం సాయంత్రం కలెక్టర్తోపాటు జేసీ భార్గవతేజ పరిశీలించారు. అధికారులకు సూచనలు సలహాలు అందించారు. ఫిబ్రవరి 26న పోలింగ్ మెటీరియల్ పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎన్నికల సిబ్బంది కోసం అన్ని వసతులూ కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి షేక్. ఖాజావలి , ఆర్డిఓ కె. శ్రీనివాస రావు , ల్యాండ్ అండ్ సర్వే శాఖ ఏ.డి పవన్ కుమార్ , గుంటూరు తూర్పు , పశ్చిమ మండల తహశీల్దార్లు నగేష్ , వెంకటేశ్వర్లు, రెవెన్యూ , సర్వే అధికారులు పాల్గొన్నారు. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జేసీ భార్గవ తేజ తో కలిసి ఆమె పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. పలు సూచనలు చేశారు. జిల్లాలోని 11 పరీక్ష కేంద్రాల్లో 9,277 అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వెంకటలక్ష్మీ, లైజన్ అధికారులుగా నియమించిన జిల్లా అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టాలి లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ సతీష్ కుమార్తో కలసి ఆమె నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్సీఓఆర్డీ ) జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి, ఎండీఎం, కోకై న్ వంటి మాదక ద్రవ్యాల కేసులు జిల్లాలో నమోదవుతున్నందున తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగంను అరికట్టేందుకు పర్యవేక్షణకు అంతర్గతంగా ప్రత్యేకంగా కమిటీలను పదిహేను రోజుల్లో ఏర్పాటు చేసేలా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మత్తు పదార్థాల రవాణా సమాచారం చేరవేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14405 టోల్ ఫ్రీ నంబరును విద్యా సంస్థల్లోనూ, జనసమ్మర్ద ప్రాంతాల్లోనూ ప్రదర్శించాలని చెప్పారు. నిరంతరం తనిఖీలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఎస్పీ సతీష్ కుమర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలపై గట్టి నిఘా పెట్టామని వివరించారు. విద్యార్థులు మత్తుపదార్థాలు తీసుకుంటున్నారని వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు వివరించారు. నేరస్తులపై కేసులు నమోదు చేస్తున్నట్టు వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజా వలి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కన్జర్వేషన్ రిజర్వ్గా ఉప్పలపాడు పక్షుల కేంద్రం లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): పెదకాకాని మండలం ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని వన్యప్రాణి చట్టం –1972 నిబంధనల ప్రకారం.. కన్జర్వేషన్ రిజర్వ్గా నోటిఫికేషన్ ఇచ్చినట్టు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి వెట్ ల్యాండ్ మేనేజ్మెంట్ సమావేశంలో జేసీ భార్గవ తేజతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ హిమ శైలజ మాట్లాడుతూ ఉప్పలపాడు పక్షుల కేంద్రం 20ఏళ్లుగా అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తోందని వివరించారు. దీనిని కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. అరుదైన పక్షి జాతులను కాపాడుకోవాలని చెప్పారు. వెట్ ల్యాండ్ ఉపయోగాలను వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు అటవీశాఖ ద్వారా గుర్తించిన 300 వెట్ లాండ్స్ను పంచాయతీ రాజ్, ఇరిగేషన్ , ఆర్ డబ్ల్యూఎస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు , రెవెన్యూ స్టేక్ హోల్డర్ శాఖల అధికారులు పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి , ఆర్డిఓ కె.శ్రీనివాసరావు , పశు సంవర్ధక శాఖ జేడీ ఒ.నరసింహారావు , ఇరిగేషన్ ఎస్ఈ వెంకట రత్నం , ఆర్డబ్ల్యూ ఎస్ ఎస్ఈ కళ్యాణ చక్రవర్తి , డీఎల్పీఓ శ్రీనివాస్ రెడ్డి , పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నజీనా బేగం , ఫారెస్ట్ రేంజ్ అధికారులు డి.పోతురాజు, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో దొంగలు
చేబ్రోలు: చేబ్రోలు గ్రామ పంచాయతీకి చెందిన పెద్ద మంచినీటి చెరువులో అర్ధరాత్రి సమయంలో చేపలు పట్టుకున్న ఇద్దరు స్టువార్టుపురం దొంగలు పోలీసులు అదుపులో ఉన్నారు. చేబ్రోలు పరిధిలోని కొమ్మమూరు చానల్కు పక్కనే ఉన్న 22 ఎకరాల మంచినీటి చెరువులో కొంతకాలంగా రాత్రి సమయాల్లో పెద్ద పెద్ద చేపలను పట్టుకొని వెళ్తున్నారు. నీళ్ల మోటార్లు, కాపర్, యంత్ర పరికరాలు అపహరణకు గురవతుండటంతో పంచాయతీ కార్యదర్శి కారసాని శ్రీనివాసరావు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆటోలో వచ్చి నలుగురు దొంగలు మంచినీటి చెరువులోని పెద్ద పెద్ద చేపలను పట్టకుండటంతో పంచాయతీ సిబ్బంది పథకం ప్రకారం వారిలో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు. వీరంతా స్టువార్డుపురానికి చెందిన వారిగా గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కౌలు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలి లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కౌలు రైతులకు ఎటువంటి ష్యూరిటీలు లేకుండా పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వి.జగన్నాథం డిమాండ్ చేశారు. ఈ మేరకు జీటీ రోడ్డులోని లీడ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ సమావేశంలో కౌలు రైతులకు పెద్ద ఎత్తున పంట రుణాలు ఇచ్చామని చెప్పడం విడ్డూరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులను రక్షించిన పోలీసులు సత్తెనపల్లి: అదృశ్యమైన ఐదుగురు మైనర్ విద్యార్థినులను పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు గురువారం రక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్న ముస్తాబాద్కు చెందిన ఐదుగురు మైనర్ విద్యార్థినులు అదృశ్యం కావడంతో వారి బంధువులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన గన్నవరం పోలీసులు సాంకేతికతను వినియోగించి, విద్యార్థినులు సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ వెళుతున్నట్లు గుర్తించారు. వెంటనే సత్తెనపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో సీఐ బొప్పన బ్రహ్మయ్య, ఏఎస్ఐ రమణ, సిబ్బంది దరియావలి, సలీం, దశరథ్నాయక్లు ఉదయం 6:30–7:00 గంటల మధ్య విజయవాడ–నల్గొండ వెళుతున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు విద్యార్థినులను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. -
రోడ్డు ప్రమాదాలను నివారించండి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి 15రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు, ప్రమాదాల నియంత్రణకు చర్యలు తక్షణం ప్రారంభం కావాలని చెప్పారు. వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. గుంతల రహిత జిల్లా కోసం కృషి చేయాలని వివరించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలు జరిగితే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే మార్చి 1 నుంచి రూ.1,000 జరిమానా విధిస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, జాతీయ రహదారుల పీడీ పార్వతీశం, పంచాయతీరాజ్ ఎస్ఈ బ్రహ్మయ్య, డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరిండెంట్ అరుణ కుమారి, ఆర్టీఓలు సత్యనారాయణ ప్రసాద్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించండి అధికారులకు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశం -
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
● జిల్లాలో 103 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ● రీజినల్ జాయింట్ డైరెక్టర్ బి.లింగేశ్వరరెడ్డిచీరాల అర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం స్థానిక వీఆర్ఎస్వైఆర్ఎన్ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాలులో పరీక్ష కేంద్రాల చీఫ్లు, డిపార్టుమెంట్ అధికారులు, రూట్ ఆఫీసర్లు, కస్టోడియన్లకు శిక్షణ నిర్వహించారు. ఆర్జేడీ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 17 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్ష పత్రాలు భద్రపరిచే కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు, 17 నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు 103 పరీక్ష కేంద్రాలో 16,361 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని, కాపీయింగ్ జరగకుండా చూడాలన్నారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అఽధికారిని నియమించామని, ఫ్లయింగ్ స్క్వాడ్లు, 10 రూట్లు ఏర్పాటుచేశామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలు, నెట్ సెంటర్ను మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. భద్రత సిబ్బందిని, వైద్యసిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద, స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు నిర్వహించి అత్యవసర మందులు సిద్ధం చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాన్ని సెల్ఫోన్ రహిత ప్రాంతాలుగా ప్రకటించామని, చీఫ్తో సహా ఎవరి వద్ద సెల్ఫోన్ ఉండడానికి వీల్లేదన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.పురుషోత్తం, ఉప విద్యాశాఖాధికారి గంగాధరరావు, సురేష్, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామ్స్ డి.ప్రసాదరావు, శ్రీనివాసరావు, చీరాల ఎంఈఓ పి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
11 మంది రెవెన్యూ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
మార్టూరు: జిల్లా వ్యాప్తంగా కొందరు రెవెన్యూ సిబ్బందికి గురువారం జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ సమస్యలపై దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు ఇటీవల ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగారా? తీసుకున్నారా? అంటూ ప్రభుత్వం తరఫున ఫోన్ ద్వారా ఐవీఆర్ఎస్ సర్వే చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలో 11 మంది రెవెన్యూ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం. వారిలో అత్యధికంగా మార్టూరు మండలం నుంచి ఐదుగురు వీఆర్వోలు ఉండటం విశేషం. మండలంలో షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ద్రోణాదుల–2, కోలలపూడి, జొన్నతాళి, బొబ్బేపల్లి, మార్టూరు– 3 వీఆర్వోలు కే మోహన్ నాయక్, జి.వీరయ్య, ఎ. ఉమామహేశ్వరరావు, జి.రోశయ్య, కె.మోహనరావులు ఉన్నారు. మిగిలిన ఆరుగురిలో నగరం మండలం ధూళిపూడి గ్రామ సర్వేయర్ ఎం. గోపి నాగకృష్ణ, భట్టిప్రోలు వీఆర్ఓ ఎం.లక్ష్మి, అద్దంకి వీఆర్వో ఎం.శ్రీనివాసరావు, ఇంకొల్లు వీఆర్వో ఎం. సురేష్ ఉన్నారు. పర్చూరు మండలం ఉప్పుటూరు వీఆర్వో పి. నాగలక్ష్మి, జే. పంగులూరు మండలం రేణింగివరం వీఆర్వో వి. సుమతి షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరిని మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తూ కలెక్టర్ గురువారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. సర్వే లోపాలమయం.. ఇదిలా ఉండగా ఈ విషయమై జిల్లాలోని కొందరు వీఆర్వోలు విలేకరులతో మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ సర్వే లోపభూయిష్టంగా ఉందన్నారు. దరఖాస్తు చేయని వారికి కూడా ఫోన్ చేసి ఒకటి నొక్కమని ఒత్తిడి చేశారని చెబుతున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బందే బలి పశువులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైళ్లు రద్దు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): చర్లపల్లి–దానాపూర్–చర్లపల్లి రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి నుంచి దానాపూర్కు ఈనెల 21 –28వ తేదీ వరకు , దానాపూర్ నుంచి చర్లపల్లి వరకు 21 – 28వ తేదీ వరకు నడపదలిచిన ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్టు వివరించారు. ఐవీఆర్ఎస్ సర్వేలో అవినీతి ఆరోపణలే కారణం -
స్ట్రాంగ్రూముల వద్ద పకడ్బందీ భద్రత
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్కుమార్ చెప్పారు. ఈనెల 27న జరగనున్న ఉమ్మడి గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచేందుకు ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన నాలుగు స్ట్రాంగ్ రూంలను గురువారం ఎస్పీ పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియమించాల్సిన పోలీస్ బందోబస్తు, స్ట్రాంగ్ రూంల వద్దకు వెళ్లే మార్గాలు, బ్యాలెట్ పెట్టెల తరలింపుపై చర్చించి, పలు సూచనలు చేశారు. అనంతరం రెవెన్యూ శాఖ నుంచి చేపట్టే ఏర్పాట్లపై ఆరాతీశారు. పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ చెప్పారు. స్ట్రాంగ్ రూంలో భద్రపరిచే బ్యాలెట్ పెట్టెల భద్రతపై ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చేపట్టాలని సూచించారు. ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి, తూర్పు, పశ్చిమ తహసీల్దార్లు గణేష్ (తూర్పు), వెంకటేశ్వర్లు (పశ్చిమ), కళాశాల ప్రిన్సిపల్ మోజేస్ పాల్గొన్నారు.గుంటూరు ఎస్పీ సతీష్కుమార్ -
కొనసాగుతున్న నష్టాలు
కూటమి పాలనలో అన్నదాతలకు అష్టకష్టాలుసాక్షి ప్రతినిధి, బాపట్ల: చంద్రబాబు పాలన అన్నదాతలకు అష్టకష్టాలు మిగులుస్తోంది. బాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కోసారి కరవు వచ్చి పంటలు పండవు, ఇంకోసారి వరదలతో పెను నష్టాలు తప్పవు.. అన్నీ దాటుకుని పంటలు పండినా గిట్టుబాటు ధరలుండవు. రైతులకు చేయూత మచ్చుకై నా కనిపించదు. ఇప్పుడూ కూటమి అధికారంలోకి వచ్చాక ఇదే కొనసాగుతోంది. తొలి ఏడాది ఖరీఫ్ నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రాజెక్టులు నీటితో నిండుకుండల్లా కళకళలాడాయి. పంటలు పుష్కలంగా పండాయి. అప్పటి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు అన్నివిధాలా ఆదుకుంది. కానీ బాబు పాలనలో జిల్లాలో అధికంగా సాగు చేసిన వరితోపాటు పొగాకు, మిర్చి, కంది తదితర పంటలకు మద్దతు ధర లేదు. కనీసం పెట్టుబడులు కూడా రాక అన్నదాతలు లబోదిబో అంటున్నారు. నిండా మునిగిన వరి రైతులు జిల్లాలోని రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు ప్రాంతాల్లో ఈ ఏడాది రైతులు 2,16,434 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరాకు 35 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వచ్చింది. 5,62,729 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ప్రభుత్వం మాత్రం పట్టుమని 60 వేల మెట్రిక్ టన్నులూ మద్దతు ధరకు కొనలేదు. మిల్లర్లకు అమ్ముదామంటే బస్తా రూ.1,300కు మించి కొనలేదు. 5 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం కొన్న ధాన్యానికి మద్దతు ధర లభించగా.. బయట మార్కెట్లో బస్తా రూ. 2 వేలకుపైగా పలికింది. అన్నదాతలకు గిట్టుబాటు లభించింది. మిర్చి రైతు కంట్లో కారం జిల్లాలోని నగరం, సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, జె.పంగులూరు, అద్దంకి, కొరిశపాడు మండలాల పరిధిలో 9,330 ఎకరాల్లో మిర్చి సాగైంది. గత సంవత్సరం ఎకరానికి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. క్వింటా రూ.22 వేలు పలికింది. ఈ ఏడాది ఎకరానికి 5 – 10 క్వింటాళ్ల లోపే దిగుబడి రాగా... ధర రూ. 8 వేల – రూ.10 వేలకు మించలేదు. కూలీల ఖర్చులు కూడా రావని రైతులు లబోదిబో అంటున్నారు. ప్రభుత్వం కూడా మద్దతు ధర, ఇతరత్రా సాయం చేయకుండా మిర్చి రైతు కంట్లో కారం కొడుతోంది. తేరుకోని పొగాకు రైతులు ఈ ఏడాది శనగకు బదులు పొగాకు సాగుకు మొగ్గు చూపారు. సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, జె.పంగులూరు, అద్దంకి, కొరిశపాడు మండలాల పరిధిలో 64,165 ఎకరాల్లో సాగు చేశారు. బర్లీ వైట్ రకాన్ని అధికంగా.. కొంతమంది బ్యార్నీ రకం వేశారు. ఈ ఏడాది ధరలు పూర్తిగా పడిపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో బ్యార్నీ రకం క్వింటా రూ. 30 వేలు పలకగా.. ప్రస్తుతం సగంలోపే ఉంది. బర్లీ రకం రూ.10 వేలు– రూ. 13 వేలు ఉండగా.. ఇప్పుడు దారుణంగా రూ. 3,500 – 4 వేలలోపే పలుకుతోంది. కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. జూట్ రైతులకూ తీవ్ర నష్టం జిల్లాలోని అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో జూట్ సాగు చేస్తున్నారు. గత ఏడాది క్వింటా విత్తనాలు రూ. 15 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ. 5 వేలకు మించడం లేదు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సగానికి సగం తగ్గిన కంది ధర జిల్లాలోని సంతమాగులూరు, బల్లికురవ, పర్చూరు, అద్దంకి, కొరిశపాడు మండలాల పరిధిలో సుమారు 300 ఎకరాల్లో కంది వేశారు. గత ఏడాది క్వింటా రూ. 10 వేలుండగా... ఇప్పుడు రూ. 6 వేలకు మించి లేదు. ఎకరంలో 3 నుంచి 5 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తోందని, ఈ లెక్కన ఖర్చులు రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో వరి సాగు బస్తా ధాన్యం రూ.1,300 కూడా పలకని ధర 10 వేల ఎకరాల్లో మిర్చి పంట క్వింటా రూ.8 వేలకు మించి పలకని వైనం 64,165 ఎకరాల్లో పొగాకు సాగు సగానికిపైగా పడిపోయిన ధరలతో రైతులకు కన్నీరు 500 ఎకరాల్లో కంది పంట క్వింటా రూ.6,400కి మించి ఇవ్వని వ్యాపారులు ధర లేక ఇబ్బందులు మాది చిమటవారి పాలెం. రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. వైరస్తోపాటు నల్లి, తామర పురుగు తెగుళ్లతో దిగుబడి సగం తగ్గింది. దిగుబడి ఎకరానికి 5 క్వింటాళ్లు మించేలా లేదు. ధర రూ. 8 వేలకు మించి లేదు. గత ఏడాదితో పోలిస్తే కూలి ఖర్చులు రెండింతలు పెరిగాయి. అవీ ఇప్పుడు వచ్చేలా లేవు. – గనిపిశెట్టి వెంకటరావు, రైతు పొగాకు సాగుతో తీవ్రంగా నష్టం గత ఏడాది 4 ఎకరాల్లో పొగాకు సాగు చేశా. క్వింటా రూ. 15 వేలకుపైగా పలికింది. మంచి రాబడి వచ్చింది. ఈ సంవత్సరం 7 ఎకరాల్లో వేశా. ఎకరాకు రూ. 1.50 లక్షలు చొప్పున పెట్టుబడి పెట్టా. ఈ ఏడాది క్వింటా ధర రూ. 4 వేలకు మించలేదు. కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. –గొట్టిపాటి వెంకట్రావు, రైతు దళారుల దెబ్బకు జూట్ ధరలు పతనం దళారుల జోక్యంతో జూట్ ధరలు బాగా పతనమయ్యాయి. వారు అడిగిందే ధరగా మారింది. నాలుగు ఎకరాల్లో జూట్ వేశా. కోసే ముందు రూ.7 వేల వరకు ధర పలికింది. కొట్టే సమయానికి రూ.6 వేలకు, తర్వాత రూ.ఐదున్నర వేలకు పడింది. గతంలో రూ.15 వేల వరకు ధర లభించింది. – ఎ. రాంబాబు, రైతు కందికి మద్దతు ధర కరవు మాది కొరిశపాడు. గతంలో కంది సాగు చేశా. క్వింటా రూ.15 వేల వరకు ఉండేది. మొన్నటి వరకూ అదే ధర కొనసాగింది. పంట వచ్చే సమయానికి ఇప్పుడు రూ.ఆరున్నర వేలకు పడిపోయింది. – బ్రహ్మారెడ్డి, రైతు -
గిరిజన భాషలకు సు‘వర్ణమాల’
● 19 భాషలకు లిపి రూపొందించిన ప్రొఫెసర్ ● ఏకేఎన్యూ వీసీ స్థాయికి ఎదిగిన వైనం ● ‘నారీ’శక్తిని చాటిన మహిళామూర్తి సాతుపాటి ప్రసన్నశ్రీ తెనాలి: సాతుపాటి ప్రసన్నశ్రీ.. 19 గిరిజన భాషలకు లిపులను సిద్ధం చేశారు. ఈ ఇంగ్లిష్ ప్రొఫెసర్ ఇప్పుడు రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి(ఏకేఎన్యూ) ఉపకులపతి అయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్టూవర్టుపురం ప్రసన్నశ్రీ పూర్వీకుల ఊరు. ఒకప్పుడు పేరుమోసిన దొంగలకు నిలయమైన ఈ ఊరిలో సామాజికవేత్త హేమలతా లవణం వారిలో పరివర్తనకు కృషిచేశారు. ఫలితంగా అక్కడ నేరప్రవృత్తి కలిగిన పలువురు మారి చదువుకుని ఉద్యోగాలు చేపట్టారు. ఎందరో ఉన్నతస్థానాలకు చేరారు. ప్రసన్నశ్రీ తాత హేమలతా లవణం వంటి ప్రముఖులతో కలిసి ఆ కృషిలో భాగస్వామి అయ్యారు. ఆయన కుమారుడు ప్రసాదరావు చదువుకుని రైల్వే ఉద్యోగం చేపట్టారు. పలు ప్రాంతాల్లో పనిచేశారు. గుంటూరు జిల్లాలోని సీతాగనరంలో ప్రసాదరావు స్థిరపడ్డారు. ఆయన కుమార్తె ప్రసన్నశ్రీ పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. సర్దార్ పటేల్ మహావిద్యాలయంలో పీహెచ్డీ చేసిన ఆమె తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్గా రెండు దశాబ్దాలకుపైగా పనిచేశారు. ఎస్టీ ఎరుకల సామాజికవర్గానికి చెందిన ప్రసన్నశ్రీ, లిపి లేని గిరిజన భాషలు అంతరించిపోతుండటంపై ఆవేదన చెందారు. గిరిజనుల వెనుకబాటుకు అక్షరాస్యతే లోపమని భావించారు. అక్షరాలు ముఖ్యమని గ్రహించారు. దేశవ్యాప్తంగా పర్యటించారు. గిరిజన తండాలకు వెళ్లారు. అక్కడ జరిగే సంతలు, పండగుల్లో గిరిజనుల జీవన స్థితిగతులు, భాషలపై పరిశోధనలు చేశారు. గోండు, కోయ, బగట వంటి 19 గిరిజన తెగలు మాట్లాడుకునే భాషలకు సొంతంగా లిపిని రూపొందించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని గిరిజనులకూ ఓ లిపిని సిద్ధం చేశారు. వరించిన పురస్కారాలు ప్రసన్నశ్రీ పరిశోధనలకు గుర్తింపు లభించింది. 2021లో అప్పటి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి నారీశక్తి పురస్కారాన్ని ప్రసన్నశ్రీ అందుకున్నారు. 19 గిరిజన భాషలకు అక్షర మాలలు రాసిన ఘనతకు అమెరికాలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కూడా స్వీకరించారు. 125 పరిశోధన వ్యాసాలు రాశారు. తన కృషికి ఇప్పటి వరకు 16 జాతీయ అవార్డులు, 15 అంతర్జాతీయ అవార్డులు అందుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులయ్యారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్
బాపట్ల టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గానికి చెందిన దమ్ము పాల్ప్రవీణ్ను రాష్ట్ర బూత్ కమిటీ విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రవీణ్ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి సిఫార్సు మేరకు నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తానని పేర్కొన్నారు. అమరేశ్వరుని సేవలో మంత్రి సుభాష్ అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రం అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమపూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనం చేసి, స్వామివారి శేష వస్త్రంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సునీల్కుమార్, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. కుంభమేళాకు ప్రత్యేక బస్సుపట్నంబజారు(గుంటూరు ఈస్ట్): భక్తుల కోరిక మేరకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు కుంభామేళాకు ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ స్పెషల్ హైటెక్ బస్సు బయలుదేరుంది. మొత్తం 8 రోజుల ప్రయాణంలో భాగంగా అయోధ్య, ప్రయాగ్రాజ్, వారణాసి ప్రాంతాలను సందర్శించేలా ఈ సర్వీసుకు రూపకల్పన చేశారు. ఉదయం 10గంటలకు బస్సు బయలుదేరనుంది. ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకోదలచిన వారు 91927 సర్వీస్ నంబర్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో టికెట్ ధర రూ 8,300 నిర్ణయించారు. భోజనాలు, వసతి ఖర్చుల బాధ్యత ప్రయాణికులదే. మరిన్ని వివరాల కోసం 73828 97459, 73828 96403 ఫోన్ నంబర్లో సంప్రదించాలని అధికారులు తెలిపారు. క్వారీ ప్రాంతాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ వీరనాయకునిపాలెం(చేబ్రోలు): గ్రామంలో జరిగిన మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ గురువారం పరిశీలించారు. గ్రామానికి చెందిన కొందరు అక్రమ క్వారీయింగ్పై గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశారు. గ్రామ పరిధిలో జరిగిన మైనింగ్పై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని రెవెన్యూ, మైనింగ్ శాఖాధికారులను కోర్టు ఆదేశించింది. గ్రామానికి చెందిన నిరుపేద దళితులకు 32 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం అందజేసింది. ఆ భూమిలో కొందరు నేతలు ఎటువంటి అనుమతులు లేకుండా క్వారీయింగ్ చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎంతమేర మైనింగ్ జరిగిందనే దానిపై రెవెన్యూ, సర్వేయర్లతో నివేదికను తయారు చేస్తున్నారు. దీనిపై సిబ్బందికి సబ్ కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఫిర్యాదు చేసిన గ్రామానికి చెందిన పలువురు సబ్ కలెక్టర్కు తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందజేశారు. తహసీల్దారు కె.శ్రీనివాసశర్మ, ఎస్ఐ డి.వెంకటకృష్ణ, మండల సర్వేయర్ సునీల్ పాల్గొన్నారు. 1,37,523 బస్తాల మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): మార్కెట్ యార్డుకు గురువారం 1,29,446 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,37,523 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 67,713 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
బైకును ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకరు మృతి
మరో యువకుడు పరిస్థితి విషమం అద్దంకి: బైకును ట్రాక్టర్ ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని పార్వతీపురం గ్రామ శివార్లలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన యెనికపాటి చౌదరి (19) మార్బుల్ కూలీగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మద్దు అనిల్తో కలసి బుధవారం రాత్రి పార్వతీపురం గ్రామం వైపు నుంచి సొంతూరుకు బైక్పై వస్తున్నాడు. పార్వతీపురం గ్రామ శివారు దగ్గర మోదేపల్లి వెళ్తున్న కట్టెల ట్రాక్టరు ఢీకొట్టడంతో బైకు వెనుక వైపున కూర్చున్న చౌదరి మృతి చెందాడు. బైకు నడుపుతున్న అనిల్కు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ సుబ్బరాజు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కట్టెల ట్రాక్టరు డ్రైవరు పరారీలో ఉన్నాడు. కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలిరూరల్: తెనాలి చెంచుపేటలో ఈనెల 16 సాయంత్రం తీవ్ర సంచలనం రేకెత్తించిన పండ్ల వ్యాపారి షేక్ రబ్బాని హత్య కేసు నిందితుడిని త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ ఎస్ రమేష్బాబు కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. చినరావూరుకు చెందిన షేక్ రబ్బాని చెంచుపేటలోని భాను టీ స్టాల్ సమీపంలో పండ్ల బండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. రబ్బాని మేనకోడలును పినపాడుకు చెందిన గౌస్బాషాకు ఇచ్చి గతంలో పెళ్లి చేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల వల్ల ఆమె పుట్టింట్లో ఉంటోంది. గౌస్బాషా ఆదివారం భార్య ఇంటికి వెళ్లి ఆమెను కాపురానికి పంపించాలని కోరాడు. ఈ సమయంలో రబ్బానికి, గౌస్బాషాకి మధ్య వాగ్వాదం జరిగింది. తన భార్యను కాపురానికి పంపించే విషయంలో రబ్బాని అడ్డుపడుతున్నాడన్న కోపంతో ఆదివారం సాయంత్రం చెంచుపేటలో ఉన్న రబ్బనిపై గౌస్బాషా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రబ్బానిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐ ప్రకాశరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
శివరాత్రి తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష
● స్థానిక అధికారులకు డీఎస్పీ, ఆర్డీవో ఆదేశం ● చినగంజాంలో అన్ని శాఖలతో సమావేశం ● భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచన చినగంజాం: శివరాత్రి తిరునాళ్లను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని చీరాల డీఎస్పీ మొహ్మద్ మొయిన్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో చినగంజాంలోని రామకోటేశ్వర, బాలకోటేశ్వరస్వామి శివరాత్రి తిరునాళ్ల నిర్వహణకు సంబంధించి మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తిరునాళ్లను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, అందుకు పోలీసు శాఖతో దేవాలయాల కమిటీలు, ప్రజలు సహకరించాలన్నారు. వాహనాలను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే నిలపాలని పేర్కొన్నారు. ప్రభల వద్ద నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను సమయ పాలన పాటించాలని సూచించారు. చిన్నపాటి సమస్యలు తలెత్తినా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ.. భక్తులు రైల్వే ట్రాక్ వద్ద ఇబ్బందులు పడకుండా అధికారులు, దేవాలయ కమిటీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యం, తాగునీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖాధికారులు సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. దేవాలయాల్లో అర్ధరాత్రి నుంచి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నందున ఆలయ కమిటీలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణాలలో వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సకాలంతో ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశానికి ముందుగా అధికారులు లలితా రామకోటేశ్వరాలయం, బాలకోటేశ్వరాలయాలను సందర్శించారు. అధికారులకు సంప్రదాయాల ప్రకారం ఆహ్వానం పలికి, పూజాది కార్యక్రమాలను నిర్వహించాక శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, ఎంపీడీఓ ఏ శ్రీనివాసమూర్తి, సీఐ వైవీ రమణయ్య, ఎస్ఐ శీలం రమేష్, రెండు దేవాలయాల కమిటీల ప్రతినిధులు టీఎస్సార్ ఆంజనేయులు, కుర్రి రామసుబ్బారావు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫర్టిలైజర్స్ దుకాణాల్లో విజిలెన్స్ దాడులు
చెరుకుపల్లి: ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయించినా.. అక్రమంగా నిల్వ ఉంచిన చర్యలు తప్పవని గుంటూరు విజిలెన్స్ సీఐలు చంద్రశేఖర్, శివాజీలు దుకాణాదారులను హెచ్చరించారు. మండల కేంద్రంలోని భువనశ్రీ ఫర్టిలైజర్స్, గుప్తా ట్రేడర్స్ ఎరువుల దుకాణాలలో బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఏకకాలంలో మొదలైన విజిలెన్స్ అధికారుల దాడులు అర్ధరాత్రి వరకు నిర్వహించారు. ఈ దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న మండల కేంద్రంలోని ఎరువుల వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. దాడుల వివరాలు తెలియాల్సి ఉంది. కార్యక్రమంలో గుంటూరు అగ్రికల్చర్ ఏఓ ఆదినారాయణ, స్థానిక మండల వ్యవసాయ అధికారి ఎ.మహేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
మరణించినా.. నలుగురికి పునర్జన్మ
మహిళ అవయవదానం మంగళగిరి: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన మహిళ అవయదానంతో మరో నలుగురికి పునర్జన్మనిచ్చింది. తాను మట్టిలో కలిసినా.. నలుగురి జీవితాలకు వెలుగిచ్చింది. విజయవాడ భవానీపురానికి చెందిన ఎం.సరస్వతి(54) ఈనెల 14న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఎయిమ్స్కు తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం బ్రెయిన్ డెడ్ అయింది. కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అభినందించిన వైద్యులు జీవన్ధాన్ ద్వారా సరస్వతి శరీరం నుంచి కిడ్నీలు, కళ్లు, గుండె, లివర్, లంగ్స్ను సేకరించారు. లివర్, కిడ్నీ, లంగ్స్ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించి అవసరమైన రోగులకు శస్త్రచికిత్సతో అమర్చారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్కు తరలించారు. సరస్వతి అవయదానం చేసి మరికొందరి జీవితాలకు పునర్జన్మ అందించడం అభినందనీయమని వైద్యులు కొనియాడారు. ఆమె బాటలో ప్రతిఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని కోరారు. అభినందనీయం అవయదానం అభినందనీయమని తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహా, ఎయిమ్స్ డైరెక్టర్ అహెంతమ్ శాంత సింగ్ పేర్కొన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా అవయవ దాత సరస్వతి గౌరవార్థం ప్రభుత్వం అందజేసిన నగదును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ నగదును ఆమె కుటుంబ సభ్యులు లేనివారి కోసం ఖర్చుచేయాలని ఎయిమ్స్ డైరెక్టర్కు అందజేశారు. -
కుటుంబ సమస్యలపైనా రాజకీయం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు జే.పంగులూరు: దంపతుల నడుమ సమస్యలను తెలుగుదేశం నాయకులు స్వలాభం కోసం రాజకీయం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు పేర్కొన్నారు. అలవలపాడులో పోలీసులు వేధింపులతో పురుగుల మందు తాగి ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న షేక్ గాలీబీని కనకారావు పరామర్శించారు. కుమారుడు ఇమామ్కు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులను టీడీపీ నాయకులు అడ్డం పెట్టుకొని వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను, సానుభూతిపరులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కోర్టులో ఉన్న కేసును పోలీసులు ఎలా సెటిల్ చేస్తారని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి నడుస్తున్న కుటుంబ కలహాల విషయంలో రాజకీయ నాయకుల మెప్పు కోసం పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించడం తగదన్నారు. రేణింగవరం ఎస్సై వినోద్బాబుపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలువుతోందన్నారు. బల్లికురవలో రైతులు మరణానికి కారణం అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలీసులు... అలవలపాడులో కూడా ఇలా చేయడం బాధాకరం అన్నారు. పోలీసుల తప్పుడు రిపోర్టు.. రేణింగవరం పోలీసుల వల్ల ఇబ్బంది పడి పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలీబీ వద్ద పోలీసులు తప్పుడు రిపోర్టు రాసి, వారితో సంతకం పెట్టించుకున్నారని అన్నారు. కోడలు ఇంటికి రాకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగారని రిపోర్టు రాసుకొని రేణింగవరం ఎస్సైను కాపాడుతున్నారని చెప్పారు. మొదటి నుంచి ఇమామ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తుండేవాడని, అతడిని టార్గెట్ చేసిన టీడీపీ నాయకులు ఇబ్బందికి గురిచేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ రాజ్కుమార్ ఉన్నారు. -
మెదడు క్యాన్సర్ నివారణకు కేఎల్యూ విద్యార్థిని సరికొత్త విధానం
తాడేపల్లిరూరల్: గ్లియో బ్లాస్టోమా మల్టీ ఫార్మ్(జీబీఎం)ను అదుపులో ఉంచడం ద్వారా మెడడు క్యాన్సర్ను నివారించే సరికొత్త విధానాన్ని కేఎల్యూ విద్యార్థిని కనిపెట్టినట్లు వర్సిటీ బయో టెక్నాలజీ ఆచార్యులు డాక్టర్ ఎం.జానకి రామయ్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఔషధాల కొత్త కలయిక ద్వారా ఈ విధానాన్ని విద్యార్ధి సాహితి ఆర్ చామ కొనుగొందని వివరించారు. ఈ విధానంలో ప్రారంభ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో వర్శిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ డాక్టర్ కె.రాజశేఖరరావు,ప్రో వీసీ డాక్టర్ ఎవిఎస్ ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, విద్యార్ధి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ వి.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని అభినందించారు. -
స్వగ్రామంలో విషాదఛాయలు
జవాన్ మృతితో ● రాజస్థాన్లో బాపట్ల జిల్లాకు చెందిన సైనికుడు మృతి ● నేడు స్వస్థలానికి భౌతికకాయం ● కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు పిట్టలవానిపాలెం (కర్లపాలెం): గన్ బుల్లెట్ బ్యాక్ ఫైర్ కావడంతో బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం పంచాయతీ గౌడపాలెం గ్రామానికి చెందిన జవాన్ పరిశా మోహన్ వెంకటేష్ (27) మృతి చెందారు. ఈ మేరకు సైనిక అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... పరిశా శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులకు కుమారులు మోహన్ వెంకటేష్, గోపీకృష్ణ ఉన్నారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ వారిని చదివించారు. ఇంటర్ వరకు చదివి 2019 డిసెంబర్లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం మోహన్ వెంకటేష్ 16వ లైట్ క్యావలరీ ఆర్మ్డ్ రేంజ్మెంట్లో రాజస్థాన్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఆయనకు గాయత్రితో వివాహం జరిగింది. వారికి కుమార్తె జ్యోత్స్న ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో మోహన్ వెంకటేష్ ఫోన్లో మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు భార్యకు వీడియోకాల్ చేసి ముచ్చటించాక, పాపను కూడా చూశారు. మళ్లీ రాత్రికి ఫోన్ చేస్తానని చెప్పారు. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయారు. జవాన్ భౌతికకాయం సూరజ్గడ్లోని మిలిటరీ హాస్పటల్ నుంచి విమానంలో గురువారం ఉదయం 5 గంటలకు ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వస్తుందని, తరువాత రోడ్డు మార్గాన పిట్టలవానిపాలెంలోని ఆయన స్వగృహానికి తీసుకొస్తామని సైనికాధికారులు తెలిపారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వివరించారు. ప్రస్తుతం మోహన్ వెంకటేష్ సోదరుడు గోపీకృష్ణ సెలవుపై వచ్చి స్వగ్రామంలో ఉన్నారు. అన్న మరణ వార్తతో తల్లడిల్లిపోతున్నారు. మాకిక దిక్కెవరంటూ మోహన్ వెంకటేష్ భార్య గాయత్రి విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తోంది. -
కిడ్నాప్, హత్యాయత్నం కేసులో నలుగురు అరెస్ట్
పరారీలో మరో నిందితుడు తెనాలిరూరల్: కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన ఇద్దరు యువకులను కారులో కిడ్నాప్ చేసి తెనాలి తీసుకువచ్చి దాడి చేసి హత్యాయత్నం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెనాలి త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్బాబు తెలిపారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తెనాలి నందులపేటకి చెందిన మన్నే మణిదీప్కు కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన జానా సతీష్, మరికొందరితో ఆర్థిక లావాదేవీల వివాదం ఉంది. ఈ క్రమంలో సతీష్ తన స్నేహితుడు పండుతో కలిసి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని మణిదీప్ను అడుగుతున్నాడు. డబ్బులు ఇస్తాను రమ్మంటూ సతీష్ అతని స్నేహితుడు పండు ఈనెల 14న విజయవాడ వచ్చారు. మణిదీప్, అతని స్నేహితులు ఉప్పు రంగారావు, పెనమలూరి ఆదం, కోటా ప్రేమ్చంద్, బచ్చలకూర రమేష్బాబుతో కలిసి విజయవాడ వెళ్లి సతీష్, పండును కిడ్నాప్ చేశారు. కారులో తెనాలి తీసుకువచ్చి సుల్తానాబాద్ సమీపంలో ఒక గదిలో బంధించి తీవ్రంగా కొట్టడంతో పాటు వారికి కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. వారి బారి నుండి తప్పించుకున్న సతీష్, పండు త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో నలుగురుని అరెస్టు చేసినట్లు త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. బచ్చలకూర రమేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ ప్రకాశరావు సిబ్బంది పాల్గొన్నారు. -
జెడ్పీలో ఆ‘మెక్కు’వంట !
జిల్లా పరిషత్ (జెడ్పీ) అంటే అధికారులు హడలెత్తిపోతుతున్నారు. జెడ్పీని నడిపిస్తున్న అమ్మ అవినీతికి బలవుతున్నారు. నాలుగేళ్లలో నలుగురు సీఈవోలు మారిన ఏకై క జిల్లా పరిషత్గా గుంటూరు నిలిచింది. సీఈవోలుగా బాధ్యతలు నిర్వర్తించిన అధికారులు గత నాలుగేళ్లలో బలవంతంగా బదిలీ అవ్వడమే, లేక వారంతట వారే ఇక్కడ ఇమడలేక వెళ్లిపోవడం గమనార్హం. గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ నుంచి మంజూరు చేస్తున్న ప్రతి పనిలో కమిషన్లు దండుకుంటూ తిరిగి అధికారులపై ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూ రచ్చకెక్కడటం పరిపాటిగా మారింది. జెడ్పీ సీఈవో విధుల్లో నిత్యం జోక్యం చేసుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లినా, అక్కడ అవినీతి జరుగుతోందని తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారు. జెడ్పీలో సీఈవోగా కొనసాగుతున్న ఉన్నతాధికారిపై పాలకవర్గంలో ఉన్న కీలక వ్యక్తులు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని జెడ్పీటీసీలు ఖండిస్తున్నారు. అవినీతి, అక్రమ సంపాదనతో జెడ్పీని భ్రష్టు పట్టిస్తున్న ఆమె సీఈవోలపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ జెడ్పీ పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు. వచ్చిన మూడు నెలలకే ఫిర్యాదుల పరంపర ప్రస్తుతం సీఈవోగా పనిచేస్తున్న వి. జ్యోతిబసు గుంటూరు జిల్లాకు వచ్చి మూడు నెలలైంది. కృష్ణాజిల్లా సీఈవోగా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో ఇక్కడికి వచ్చిన ఆయనపై అప్పుడే జెడ్పీ పాలకుల నుంచి పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు వరుసగా రెండేళ్ల పాటు ‘‘జగనన్న విద్యాజ్యోతి’’ పేరుతో స్టడీ మెటీరియల్ ముద్రించి పంపిణీ చేశారు. జెడ్పీ పాలకులు పార్టీ మారిన తరువాత మూడోసారి మెటీరియల్ పంపిణీకి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ నుంచి మెటీరియల్ తెప్పించుకుని, టెండర్లు పిలిచి ప్రింటింగ్ చేయించే బాధ్యత సీఈవోకు అప్పగించారు. అయితే, ముద్రణలో ఉండగానే మరో వైపు స్టడీ మెటీరియల్ పంపిణీలో జాప్యం అంటూ ఆరోపణలు చేయించారు. అధికారులను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. స్టడీ మెటీరియల్పై సీఎం, విద్యాశాఖ మంత్రి ఫోటోలు ముద్రించలేదని, సీఈవోను లక్ష్యంగా చేసుకున్నారని జెడ్పీటీసీలు ఆరోపిస్తున్నారు. తక్కువ ధరకే టెండర్ ఖరారు చేసినా ఆరోపణలు ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 34,747 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ముద్రణకు సంబంధించి గతంలో కంటే తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టినా సీఈవోపై అర్థం లేని అవినీతి ఆరోపణలు చేయించారు. ఒక పేజీ ముద్రణకు గతంలో 33 పైసలు చెల్లించగా, ప్రస్తుతం అది 30 పైసలకే ఖరారు చేశారు. ఈ విధంగా 564 పేజీలతో ముద్రణ పూర్తయిన పుస్తకాలకు గాను జెడ్పీకి రూ. లక్షల్లో ఆదా అయింది. టెండర్ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున అధికారులపై ఆరోపణలు సాగిస్తుండగా, అసలు ఇప్పటి వరకు ముద్రణదారులకు చెల్లింపులు జరపలేదని అధికారులు చెబుతున్నారు. స్టడీ మెటీరియల్కు పైసా చెల్లించకుండా అవినీతి ఆస్కారం ఎక్కడ ? అని పలువురు జెడ్పీటీసీలు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీకి సీఈవోలుగా వచ్చిన వారిపై అవినీతి ఆరోపణలు చేస్తూ, వారిని బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు దృష్టి సారించని పరిస్థితులు లేవు. పరిస్థితులు ఇలాగే ఉంటే జెడ్పీ సీఈవోగా వచ్చేందుకు సైతం అధికారులు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. సీఈవో పోస్టు అంటే హడలెత్తిపోతున్న అధికారులు జెడ్పీని నడిపిస్తున్న అమ్మ అవినీతికి బలి తమ అవినీతిని దాచి అధికారుల చేతికి మసిపూస్తున్న వైనం నాలుగేళ్లలో మారిన నలుగురు సీఈవోలు ప్రస్తుత సీఈవో వచ్చిన మూడు నెలలకే ఫిర్యాదుల పరంపర -
విజ్ఞాన్, బౌలింగ్ గ్రీన్ వర్సిటీల మధ్య ఒప్పందం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ – యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీల (బీజీఎస్యూ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్ బుధవారం తెలిపారు. యూనివర్సిటీలోని ఆఫీస్ ఆఫ్ డీన్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్ అండ్ ఫ్యాకల్టీ అఫైర్స్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ ఇంటిరిమ్ వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ రామ్ వీరపనేని, ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ వేల్ మోక్తర్తో పత్రాలను మార్చుకున్నట్టు వివరించారు. ఒప్పందం వల్ల తమ వర్సిటీ విద్యార్థులకు బీజీఎస్యూతో కలిపి జాయింట్ డిగ్రీలను అందజేయవచ్చునని పేర్కొన్నారు. సంయుక్తంగా పరిశోధనలు, ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం ఉంటుందని వివరించారు. యూఎస్ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ ఇంటిరిమ్ వైస్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ రామ్ వీరపనేని మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతోపాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ వేల్ మోక్తర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కొల్ల, కెన్ (జాన్), సీఈవో మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ తదితరులు పాల్గొన్నారు. -
భవనాస్తి!
● కలగా మినీ రిజర్వాయర్ నిర్మాణం ● బడ్జెట్లో పైసా కేటాయించని కూటమి ప్రభుత్వం ● 5 వేల ఎకరాలకు చెందిన రైతులు ఎదురుచూపులు భవనాశి చెరువు అద్దంకి: బాపట్ల జిల్లాలోని శింగరకొండలో బ్రిటిష్ కాలంలో 250 ఎకరాల్లో తవ్వించిన భవనాశి చెరువు ఉంది. దీని కింద ఇప్పటికే హైలెల్, లో లెవెల్, ప్లగ్హోల్ కాలువలు ఉన్నాయి. దక్షిణ అద్దంకిలోని నర్రావారిపాలెం, వేలమూరిపాడు, మణికేశ్వరం, గోపాలపురం, చక్రాయపాలెం గ్రామాల్లో 1,197 ఎకరాల మాగాణి భూమికి నీరు అందుతోంది. గతంలో ఈ చెరువు పల్లంలో ఉండడంతో పరిసర గ్రామాల కొండలపై నుంచి వచ్చిన వర్షపు నీటితో కలకళలాడుతుండేది. కొన్నేళ్ల నుంచి చెరువులో నీరు చేరడం తగ్గిపోయింది. సాధారణ సాగు అంతంతమాత్రంగా మారింది. ఈ క్రమంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా భవనాశి చెరువుపై దృష్టి సారించారు. బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం దగ్గర గుండ్లకమ్మ నదిపై చెక్ డ్యామ్ నిర్మించాలని నిర్ణయించారు. అక్కడి నీటిని ఫీడర్ చానల్తో చెరువుకు తరలించడం ద్వారా మినీ రిజర్వాయరుగా మార్చాలని భావించారు. ప్రాజెక్టుకు రూ.27 కోట్లు కేటాయించి భూమి పూజ కూడా చేశారు. 2013లో ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. అప్పటి టీడీపీ సర్కారు పట్టించుకోకపోవడంతో తరువాత ప్రాజెక్టు వ్యయాన్ని రూ.45 కోట్లకు పెంచాల్సి వచ్చింది. మూడు పనులుగా.. ఈ ప్రాజెక్టును మూడు పనులుగా విభజించారు. ఒకటి వెలమారిపాలెం వద్ద చెక్ డ్యామ్, రెండోది భవనాశి కట్ట ఎత్తు పెంచడం, మూడో పనిగా భవనాశి చెరువుకు నీరు చేరేలా నది నుంచి ఫీడర్ చానల్ నిర్మించడం. అయితే ఇందులో ప్రస్తుతం చెక్డ్యామ్, చెరువు కట్ట ఎత్తు పెంచే పనులు పూర్తయ్యాయి. 12.6 కిలో మీటర్ల మేర తవ్వాల్సిన ఫీడర్ చానల్ పనులు మూడొంతులు మాత్రమే పూర్తయ్యాయి. చెరువు విస్తరణ పనులు పూర్తి కాలేదు. ఫలితంగా ప్రస్తుతం కాంట్రాక్టర్ క్లోజింగ్ ఇవ్వాలని వేడుకోలుతోపాటు ప్రాజెక్టు పూర్తి, భూ సేకరణకు మరో రూ.40 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి ఇంజినీర్లు ప్రతిపాదనలు పంపారు. సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో రూ.27 కోట్ల అంచనా పనులు ప్రస్తుతం రూ.వంద కోట్లు మించేలా ఉన్నాయి. రైతుల కలలు కల్లలుగానే మిగిలాయి. మరో 5 వేల ఎకరాలకు లబ్ధి.. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం సాగవుతున్న 1,197 ఎకరాలతోపాటు చెరువుకు తూర్పు భాగంలో ఏర్పాటు చేసిన తారకరామ ఎత్తిపోతల పథకానికి పుష్కలంగా నీరు అందనుంది. మొత్తం 5 వేల ఎకరాల మెట్ట భూములు మాగాణిగా మారుతాయి. ఇప్పటికై నా ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
అద్దంకి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీజీఆర్ఎఫ్ ముఖ్య ఉద్దేశమని చైర్పర్సన్ ఎన్ విక్టర్ ఇమ్మానియేలు పేర్కొన్నారు. బుధవారం స్థానిక విద్యుత్ కార్యాలయంలో వినియోగదారుల ఆదాలత్, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమ్మానియేలు మాట్లాడుతూ వినియోగదారులు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయొద్దన్నారు. సమస్య సమంజసంగా ఉండాలని పేర్కొన్నారు. అధికారులు కూడా పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అదాలత్లో 8 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో సాంకేతిక సభ్యుడు కె. వెంకట కృష్ణ, ఆర్థిక సభ్యుడు ఆర్సీహెచ్ శ్రీనివాసరావు, స్వతంత్ర సభ్యురాలు సునీత, ఎస్ఈ బీవీ ఆంజనేయులు, ఈఈ ఎన్ మస్తాన్రావు, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు స్కూల్ బస్ను ఢీకొన్న కూలీల ఆటో ఏడుగురికి స్వల్ప గాయాలు జరుబులవారిపాలెం (కారంచేడు): పక్కన ఆగి ఉన్న స్కూల్ బస్సును కూలీలతో వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని జరుబులవారిపాలెం గ్రామం నుంచి ఇంకొల్లు వెళ్లే రహదారిలో బుధవారం జరిగింది. ఎస్సై వి. వెంకట్రావు కథనం మేరకు.. ఇంకొల్లుకు చెందిన ఒక ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థుల కోసం కేశవరప్పాడు నుంచి వచ్చి వెళ్తోంది. వ్యవసాయ కూలీలతో ఇంకొల్లు నుంచి కేశవరప్పాడుకు వస్తున్న ఆటో ఎదురుగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో ఆటో పొలాల్లోకి పోగా, కూలీలలో కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చీరాల ఆసుపత్రికి తరలించారు. కొందరు స్కూల్ బస్సు వచ్చి ఆటోను ఢీకొందని చెబుతున్నారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను ఏఎస్ఐ బి. శేషసాయి సేకరించారు. మల్చింగ్ విధానంతో మంచి దిగుబడులు బల్లికురవ: వ్యవసాయంలో మల్చింగ్ విధానంతో రైతులకు మేలు జరుగుతుందని బాపట్ల జిల్లా ఉద్యాన అధికారి పి.జెనమ్మ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు గ్రామాల్లో 200 ఎకరాల్లో మల్చింగ్ విధానంలో పుచ్చకాయ సాగు చేపట్టిన పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్చింగ్ విధానంలో కలుపు తక్కువగా రావటం, నీరు ఆవిరి కాకుండా మొక్కలు ఎదుగుదలకు ఉపకరిస్తాయన్నారు. పురుగు, తెగుళ్ల నుంచి పంటను రక్షించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి బి. హనుమంత్ నాయక్, వీఏఏ వెంకటేశ్వర్లు, ప్రసన్న పాల్గొన్నారు. డాక్టర్ శరత్ చంద్రకుమార్ ఔదార్యం గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల 1998 బ్యాచ్ పూర్వ వైద్య విద్యార్థి, గుంటూరు చంద్ర కేర్ న్యూరో స్పెషాలిటీ అధినేత, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నలమోతు శరత్చంద్రకుమార్ తన తల్లి నలమోతు శైలజకుమారి జ్ఞాపకార్థంగా గుంటూరు వైద్య కళాశాలలో తారు రోడ్ల నిర్మాణానికి నిర్మించేందుకు రూ. 6 లక్షలు విరాళం అందజేశారు. ఈ విరాళంతో నిర్మించిన రోడ్లను బుధవారం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుందరాచారి శరత్చంద్రకుమార్ను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శ్రీధర్, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేడు, రేపు న్యాయవాదుల విధుల బహిష్కరణ గుంటూరు లీగల్ : న్యాయవాదుల అమెండ్మెంట్ బిల్లు 2025కు వ్యతిరేకంగా గుంటూరు బార్ ఫెడరేషన్ నిరసన తెలుపుతుందని ఫెడరేషన్ చైర్మన్ కాసు వెంకటరెడ్డి బుధవారం తెలిపారు. నిరసనలో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు గురు, శుక్రవారాల్లో విధులను బహిష్కరిస్తున్నట్టు వివరించారు. -
చిన్నారులను తీర్చిదిద్దాలి
డీఈఓ చంద్రకళ కారెంపూడి: బడిపై ఆసక్తి కలిగేలా అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులను తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ తెలిపారు. స్థానిక బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ టీచర్లకు నిర్వహిస్తున్న జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3,4,5 ఏళ్లలోపు చిన్నారులను బడికి ఆకర్షితులను చేయడం అంగన్వాడీల చేతుల్లోనే ఉందని చెప్పారు. చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటల ద్వారా విద్యపై ఆసక్తి కలిగేలా నర్సరీ బోధన సాగాలని తెలిపారు. అనంతర జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని, పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిని తనిఖీ చేశారు. ప్రీ పైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిశీలించి, వాటిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంఈఓ టి. రవికుమార్, జెడ్పీ హెచ్ఎం అనంత శివ ఉన్నారు. -
ట్రాక్టర్ పైనుంచి పడి వలస కూలీ మృతి
క్రోసూరు: ట్రాక్టర్ పైనుంచి పడి వలస కూలీ మృతి చెందిన ఘటన బుధవారం మండలంలోని బాలెమర్రులో జరిగింది. ఎస్ఐ నాగేంద్రరావు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా నుంచి మిర్చి కోతలకు 40 మంది కూలీలు బాలెమర్రు గ్రామానికి వచ్చారు. వారు పనులకు వెళ్తున్న క్రమంలో నగేష్ సోదరుడు సిద్ధరామయ్య ట్రాక్టర్ నడుపుతుండగా పక్కన కూర్చుని జారి పడిపోయాడు. తలకు గాయమైంది. 108 వాహనంలో సత్తెనపల్లికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడుకి భార్య, పాప ఉన్నారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సూర్యప్రకాశరావు మృతి తీరని లోటు కొరిటెపాడు: కోల్డ్ స్టోరేజెస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో ఫెడరేషన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ వైస్ ప్రెసిడెంట్గా, గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్గా గత 30 ఏళ్లుగా సేవలందించిన తడికమళ్ల సూర్యప్రకాశరావు బుధవారం ఉదయం మృతిచెందారు. సూర్యప్రకాశరావు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులకు పలు రకాల సేవలు అందించారని పలువురు ప్రముఖులు, మిత్రులు, బంధువులు కొనియాడారు. కోల్ట్ స్టోరేజ్ల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని వెల్లడించారు. రైతు సోదరుల కోసం ఆరు కోల్డ్స్టోరేజీలను సొంత ఖర్చులతో పలు ప్రాంతాల్లో నిర్మించి నడుపుతున్నారని గుర్తు చేశారు. ఆయన మృతి తీరని లోటన్నారు. సూర్యప్రకాశరావు ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాయమాటలు చెప్పి బాలికపై లైంగిక దాడి యువకుడిపై పోక్సో కేసు మంగళగిరి టౌన్: ఓ బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బుధవారం మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి నగరానికి చెందిన ఓ బాలిక 9వ తరగతి వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటోంది. పార్కురోడ్డుకు చెందిన శ్యామ్బాబు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్యామ్బాబు పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ నేపథ్యంలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని బాలిక అడగడంతో వివాహానికి నిరాకరించాడు. దీంతో బాలిక పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యార్డుకు 1,47,414 బస్తాల మిర్చి కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,47,414 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,42,943 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,900 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.7,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 75,790 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
పక్కా ఇళ్ల నిర్మాణ లక్ష్యాలు సాధించాలి
బాపట్ల: పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలని జేసీ ప్రఖర్ జైన్ తెలిపారు. గృహ నిర్మాణంపై సంబంధిత శాఖ అధికారులతో బుధవారం ఆయన స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. మొదటి త్రైమాసికంలో జిల్లాకు 4,898 గృహాల నిర్మాణం లక్ష్యం అన్నారు. ప్రస్తుతం 290 మాత్రమే పూర్తి చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. మిగినవన్ని మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద గృహ నిర్మాణాలలో పని దినాలు కల్పించాలన్నారు. నిర్దేశించిన 90 పని దినాలు చూపి లబ్ధిదారులకు కూలి సొమ్ము చెల్లించాలన్నారు. అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి ఇంటికి ఉండాలన్నారు. అలా నిర్మించుకుంటే త్వరగా బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. పేద లబ్ధిదారులకు ఇల్లు నిర్మించి ఇవ్వడానికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. జేసీ ప్రఖర్జైన్ -
దేచవరంలో భూచోళ్లు
నరసరావుపేట: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామంలో చర్మకారుల సహకార సంఘానికి కేటాయించిన భూమి ఆక్రమణకు గురైంది. గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ అధికారుల అండదండలతో ఆన్లైన్ చేయించుకొని, నకిలీ రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. దర్జాగా అనుభవిస్తున్న విషయం బయటకు పొక్కడంతో కొన్నాళ్లపాటు మిన్నకుండిపోయారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి సదరు భూమిని ఆక్రమణ చేసుకొని సొంతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా నాలుగు రోజుల కిందట భూమిలో ముళ్లపొదలు తొలగించి తమదిగా నమ్మించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్ఎస్ఆర్, అడంగల్లో స్పష్టంగా నమోదు 1970లో అప్పట్లో ఉన్న ప్రభుత్వం దేచవరం గ్రామంలోని చర్మకారుల సహకార సంఘం కోసం భూమిని కేటాయించే ప్రక్రియ ప్రారంభించింది. గ్రామ పరిధిలోనే రూపెనగుంట్ల గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఆనుకొని సర్వే నంబరు 192–6బి1లో 3.56 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. అందులో ఎకరాన్ని చర్మకారుల సహకార సంఘానికి కేటాయించారు. వివరాలు ప్రసుత్తం కూడా ఆర్ఎస్ఆర్, అడంగల్లో స్పష్టంగా ఉన్నాయి. ఆక్రమణ రహస్యం బయటకు వచ్చిందిలా... వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ కుటుంబాలకు నివేశనా స్థలాలు మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వ భూమి కోసం అధికారులు రికార్డులు తిరగేశారు. చర్మకారులకు కేటాయించిన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పేరుపై ఆన్లైన్ చేయించుకున్నట్లు తేలింది. దీంతో అసలు విషయాన్ని బయటకు లాగారు. ఆన్లైన్ చేయించుక్నున వ్యక్తి తన కుమారుల పేరుపై తప్పుడు రిజస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్లు తేలింది. దీనిపై అప్పట్లో వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆన్లైన్ నుంచి పేర్లను తొలగించి చర్మకారుల సొసైటీ పేరు మీదే తిరిగి ఆన్లైన్ చేశారు. ముళ్ల పొదలు తొలగింపు వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో మిన్నకుండిపోయిన సదరు వ్యక్తి గత నాలుగు రోజులుగా సదరు స్థలాన్ని తిరిగి ఆక్రమణ చేసుకునే పనిలో ఉన్నాడు. సంఘానికి చెందిన భూమిలో ముళ్లపొదలు తొలగించి, కబ్జా చేయాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాడు. తన పేరుపై తిరిగి ఆన్లైన్ చేసేందుకు రెవెన్యూ శాఖ ద్వారా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కబ్జాకు గురవుతున్న స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి విడిపించి తప్పుడు రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని పలువురు ఎస్సీలు కోరుతున్నారు. చర్మకారుల సహకార సంఘం భూమి ఆక్రమణ రోడ్డు పక్కనే ఉండడంతో ఆక్రమణదారుల కన్ను పట్టపగలే ముళ్లపొదలు తొలగించి సొంతం చేసుకునే యత్నం గతంలో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకొని తప్పుడు రిజిస్ట్రేషన్లు -
జిందాల్ ప్లాంట్ను సందర్శించిన ఐజీ
యడ్లపాడు: కృష్ణా జిల్లాలో ఇటీవల పట్టుబడ్డ నాలుగు టన్నుల అక్రమ గంజాయిని ధ్వంసం చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఐజీ ఆరె రవికృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారుల బృందం యడ్లపాడు మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను సందర్శించారు. ప్లాంట్ ఆపరేషన్ ఏపీ అధ్యక్షుడు ఎం.వి. చారితో సమావేశమయ్యారు. ప్లాంట్లో ఈనెల 22న గంజాయి దహనం కోసం అనుమతి తీసుకున్నారు. కార్యక్రమానికి డీజీపీ హరీష్కుమార్ గుప్తా సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అనంతరం అధికారుల బృందం ప్లాంట్లోని వివిధ విభాగాలను పరిశీలించింది. వ్యర్థాల సేకరణ, వాటిని దహనం చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం గురించి తెలుసుకుంది. -
బాపట్ల
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం బుధవారం 535.90 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 9,217 క్యూసెక్కులు విడుదలవుతోంది. ఆలయ నిర్మాణానికి విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం శ్రీ మహంకాళి అమ్మ ఆలయ నిర్మాణానికి మక్కెన సుబ్బారావు దంపతులు బుధవారం రూ.1,01,116 విరాళం అందించారు. వైభవంగా కోటి కుంకుమార్చన పిడుగురాళ్ల: పట్టణంలోని భవానీ నగర్లో గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో బుధవారం కోటి కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళలు పాల్గొన్నారు. కూటమి సర్కారు నిర్లక్ష్యంతో భవనాశి మినీ రిజర్వాయరు కలగానే మిగిలిపోనుంది. ఫలితంగా 5 వేల ఎకరాల మెట్ట భూములకు నీరు అందే అవకాశం లేకుండాపోయింది. ఇటీవల బడ్జెట్లో రిజర్వాయర్ కోసం ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఎన్నికల ప్రచారంలో అద్దంకి సభలో నారా లోకేశ్ సమక్షంలో హామీ ఇచ్చిన ప్రస్తుత మంత్రి గొట్టిపాటి ఇకనైనా దానిని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. 7న్యూస్రీల్ -
ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో ఉద్రిక్తత
దాచేపల్లి: ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో బుధవారం రాత్రి దాచేపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శోభయాత్ర లైబ్రరీ సెంటర్లోకి రాగానే భారీఎత్తున నినాదాలు చేశారు. ఓ వ్యక్తి టిప్పు సుల్తాన్ జెండా చూపుతూ హల్చల్ చేయడంతో శోభాయాత్రలో ఉన్న యువకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు శోభాయాత్రలో రాళ్లు విసిరారు. ఘటనా స్థలాన్ని గురజాల డీఎస్పీ జగదీష్ పరిశీలించి, సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దుకాణాలన్నింటిని మూసి వేయించారు. డ్రోన్ కెమెరాలతో పలు ప్రాంతాలను చిత్రీకరించారు. రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి లాఠీచార్జీ చేసిన పోలీసులు -
27న ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చని జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ షేక్.ఖాజావలి మంగళవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రైవేటు ఉద్యోగులకు యాజమాన్యాలు అనుమతివ్వాలని సూచించారు. ప్రకృతి సేద్య ఖరీఫ్ కార్యాచరణపై అవగాహన కల్పించండి లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ప్రకృతి సేద్యం చేస్తున్న గ్రామ సంఘాల్లోని రైతులకు ఖరీఫ్ కార్యాచరణపై అవగాహన నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ చెప్పారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశపు హాలులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఖరీఫ్ కార్యాచరణ అమలుకు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, డీఆర్డీఏ శాఖలు ఏపీసీఎన్ఎఫ్ సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ప్రగతి, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర బాబు, డీఆర్డీఏ పీడీ విజయ లక్ష్మి, జిల్లా పశు సంవర్ధక అధికారి నరసింహారావు మాట్లాడుతూ కార్యాచరణ విజయవంతానికి కృషి చేస్తామన్నారు. రైతులు వట్టిచెరుకూరు ధనుంజయరావు, అత్తోట బాపయ్య, ఎరుకులపూడి విజయలక్ష్మి ప్రకృతి వ్యవసాయంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఇఫ్కో కొత్త ఎరువు మార్కెట్లోకి విడుదల కొరిటెపాడు(గుంటూరు): ఇఫ్కో వారు నూతనంగా తయారు చేసిన 28ః28ః0 అనే కాంప్లెక్స్ ఎరువును జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు మంగళవారం గుంటూరు రూరల్ మండలం, రెడ్డిపాలెం గూడ్స్షెడ్ వద్ద మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా నున్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 28ః28ః0 ఇఫ్కో వారు తెప్పించడం ఆనందంగా ఉందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎరువుల విభాగం ఏడీఏ కేజేడీ రాజన్, గుంటూరు ఏడీఏ తోటకూర శ్రీనివాసరావు, డీసీఎంఎస్ జిల్లా బిజినెస్ మేనేజర్ డి.హరిగోపాలం, కొల్లిపర ఏఓ వెంకట్రావు, ఇఫ్కో జిల్లా మేనేజర్ రఘు తదితరులు పాల్గొన్నారు. -
గుడారాల పండుగకు ఏర్పాట్లు
అమరావతి: హోసన్న మందిరం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే గుడారాల పండుగను ఈ ఏడాది గుంటూరు శివారులోని గోరంట్ల గ్రామంలో కాకుండా మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో నిర్వహించాలని హోసన్న మందిరం పెద్దలు నిర్ణయించారని పాస్టర్ అనీల్ తెలిపారు. మంగళవారం ఆయన ఏర్పాట్ల గురించి వివరిస్తూ హోసన్న మందిరం వ్యవస్థాపకులు హోసన్న మొదటి చర్చి లేమల్లె గ్రామంలో నిర్మాణం చేసినందు వల్ల ఈ పవిత్ర ప్రదేశంలో 18వ గుడారాల పండుగ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మార్చి 6వ తేదీ సాయంత్రం నుంచి 9వ తేదీ మధ్యాహ్నం వరకు గుడారాల పండుగ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇచ్చే లక్షలాది మంది హోసన్నా విశ్వాసులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు వెయ్యికి పైగా మరుగుదొడ్లు, వచ్చిన విశ్వాసులందరికీ భోజన వసతి, పార్కింగ్తో పాటుగా వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సుమారుగా పదివేల మంది వలంటీర్లు పనిచేస్తారని అలాగే పోలీసు శాఖ వారి సహకారం తీసుకుంటామన్నారు. గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి నుంచి గుడారాల పండుగ వేదిక వద్దకు ప్రత్యేక బస్సులు అర్టీసీ వారు నడుపుతారన్నారు. అనకాపల్లి నుండి భీమవరం మీదగా ఆ గుడారాల పండుగకు ప్రత్యేక రైతులు విశ్వాసులు తరలివస్తారన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుండే కాక ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుండి భక్తులు లక్షలాది మంది ఈ పండుగకు తరలి వస్తాన్నారు. ప్రార్ధన వేదిక, ప్రార్ధన మందిరాలను పరిశుభ్రంగా ఉంచటానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. హోసన్నా మందిరంకు సుమారు 20ఎకరాల భూమి ఉండగా మిగిలినది రైతుల నుంచి సుమారు వంద ఎకరాలు లీజుకు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గుడారాల పండుగకు వచ్చు వీఐపీలకు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. -
ఇద్దరు చైన్స్నాచర్లు అరెస్టు
బంగారం, నగదు స్వాధీనం నరసరావుపేట రూరల్: జిల్లాలోని పలుచోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ పి.రామకృష్ణ వెల్లడించారు. మంగళవారం రూరల్ పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టుకున్న నిందితులతో హాజరై వివరాలను వెల్లడించారు. యడ్లపాడు మండలం చెంఘీజ్ఖాన్పేటకు చెందిన పోతురాజు బాలకృష్ణ, యద్దల నరేంద్రసాయిలను అరెస్టు చేశామన్నారు. వీరు పగలు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ బయట, ఇళ్లల్లో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయిస్తుంటారన్నారు. గతేడాది సెప్టెంబరు 15న నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో సాయంత్రం సమయంలో ఊరిచివర గంగమ్మ దేవాలయం వద్ద సిమెంట్బల్లపై కూర్చోని ఉన్న దేవిశెట్టి లక్ష్మమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వాహనంపై వేగంగా పారిపోయారన్నారు. పెదకూరపాడు, ముప్పాళ్ల మండలం తొండపి, రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామాల్లో కూడా ఒంటరి మహిళలపై దాడులు చేసి బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారన్నారు. ఈ నేరాలపై దేవిశెట్టి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్కేటీ బైపాస్ వద్ద ఇరువురిని అరెస్టుచేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. -
విద్యుత్ తీగలు తగిలి రైతుకు తీవ్రగాయాలు
ఈపూరు(శావల్యాపురం): మండలంలోని బొమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన రైతు చీదా సుబ్బారావు తాను సాగు చేసిన కంది పంటకి కాపలాగా వెళ్ళి పంట పొలాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఎస్సై ఎం.ఉమామహేశ్వర రావు కథనం ప్రకారం.. చీదా సుబ్బారావుకు చెందిన కంది పొలం భధ్రుపాలెం–ముప్పాళ్ళ గ్రామాల మధ్య ఉంది. అయితే అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గమనించని చీదా సుబ్బారావు బహిర్భూమికి వెళ్ళగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలి సంఘటన స్థలంలో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొంత సమయం గడిచిన తర్వాత స్పృహలోకి వచ్చి పడుతూ లేస్తూ వెళ్ళగా ఆ చుట్టుపక్కల పొలంలో ఉన్న రైతు ఆంజనేయులు గమనించి జరిగిన సంఘటన గురించి సెల్ఫోను ద్వారా సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సుబ్బారావుకు విద్యుత్తీగలు తగిలి తలకు, కాలికి శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వినుకొండ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యసేవలు నిమిత్తం గుంటూరు తరలించారని ఎస్సై తెలిపారు. క్షతగాత్రుడిని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. -
రెంటచింతలలో దొంగలు హల్చల్
రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతలలో సోమవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. పలు ప్రాంతాల్లోని రెండు ఇళ్లల్లో తాళాలు పగలుగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గ్రామంలోని ఆరోగ్యనాథుని మందిరం వద్దనున్న ఆదూరి ఇన్నారెడ్డి నాలుగు రోజుల కొందట వెళంగిని వెళ్లగా ఆయన భార్య రజని కొంతకాలంగా గుంటూరులోని మనవరాళ్ల వద్దకు వెళ్లి ఉంటోంది. మంగళవారం సాయంత్రం 3 గంటల సమయంలో ఇన్నారెడ్డి విత్తనాల షాపులో పనిచేసే సాగర్ వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళాన్ని గ్యాస్ కట్టర్తో కోసి ఇంట్లోని బీరువాను, ఇనుపపెట్టెను పగలగొట్టి వస్తువులను చెల్లాచెదురుగా పడవేసిన విషయాన్ని ఇన్నారెడ్డికి తెలిపారు. బీరువా, ఇనుపపెట్టెలో దాచిన 75 గ్రాములు బంగారు వస్తువులు, రూ.70 వేల నగదు అపహరణకు గురైనట్లు ఇన్నారెడ్డి పోలీసులకు వివరించారు. వెండి కిరీటాలు, చిన్నచిన్న వెండి వస్తువులను దొంగలు అక్కడే వదిలి వెళ్లినట్లు తెలిపారు. అలాగే స్థానిక రామాలయం వద్ద ఉంటున్న తాళ్ళూరి సాంబశివరావు భార్యతో కలిసి ఈ నెల 14న హైదరాబాద్లోని కుమారుడి వద్దకు వెళ్లి మంగళవారం ఉదయం తిరిగి వచ్చారు. అయితే ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బీరువాను తెరిచి దానిలో నున్న రూ.1 లక్ష నగదుతో పాటు రెండు బంగారు చెవి దిద్దులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాలను ఎస్ఐ సీహెచ్ నాగార్జున సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల పాటు ఇల్లు విడిచి పొరుగు గ్రామానికి వెళ్లే సమయంలో స్థానిక పోలీసు స్టేషన్లో తెలియ చేయాలని తెలిపారు. రెండు ఇళ్లల్లో చోరీ బంగారం, నగదు అపహరణ -
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
చుండూరు(వేమూరు): డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 6వ తేదీ వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పరీక్షలు ఏప్రిల్ 6వ తేదీన ఉంటాయని తెలిపారు. మార్కుల శాతం, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారని తెలిపారు. జోరుగా పొట్టేళ్ల పందేలు మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో నిషేధిత కోడి పందేలు, పొట్టేళ్ల పోటీలు జోరుగా సాగుతున్నాయి. తమ్మవరంలో మంగళవారం పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. నెల్లూరు, భీమవరం నుంచి తెప్పించిన పొట్టేళ్లతో స్థానిక నాయకులు బరులు ఏర్పాటు చేశారు. భారీ మొత్తంలో పందేలు వేశారు. పోలీసులు సైతం కన్నెత్తి కూడా చూడలేదు. యర్రబాలెం, అనమనమూరు తమ్మవరం గ్రామాల్లో నిత్యం కోడి పందేలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వీటిని అరికట్టాలని కోరుతున్నారు. హైవేలో ప్రమాద స్థలాల పరిశీలన రొంపిచర్ల: పల్నాడు జిల్లాలోని శ్రీ కాసుబ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం మంగళవారం పర్యటించింది. దాచేపల్లి టోల్గేట్ వద్ద నుండి సంతమాగులూరు అడ్డరోడ్డు వరకు ఉన్న రాష్ట్ర రహదారిలోని ప్రమాద స్థలాలను బృందం పరిశీలించింది. ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రత్యేక ప్రాంతాలను పరిశీలించి, ప్రమాదాలకు గల కారణాలను వారు పరిశీలించారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో రొంపిచర్ల ఎస్ఐ మణికృష్ణతో పాటు ఎంఐఈ అధికారులు, హైవే అధికారులు, జిల్లా ఎస్పీ నియమించిన ప్రత్యేక పోలీస్ బృందం అధికారులు ఉన్నారు. -
కేంద్ర పథకాల అమలు తీరుపై ఆరా
శావల్యాపురం: మండలంలోని శానంపూడి గ్రామంలో కేంద్ర టీం సభ్యులు పర్యటించి కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు పొందుతున్న లబ్థిదారులను మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామసచివాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో న్యూఢిల్లీ సంబోధ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్ మేనేజరు అండ్ కోఆర్డినేటరు వికాస్ మల్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రధానమంత్రి అవాస్ యోజన, స్వయ సహాయక సంఘూలు, పింఛన్లు పంపిణీ, గ్రామీణ సడక్ యోజన, గ్రామ స్వరాజ్య అభియాన్ తదితర పథకాల పురోగతిపై లబ్థిదారులను అడిగి తెలుసుకున్నారు. పథకాల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులున్నాయా, అర్హులకు అందుతున్నాయా తదితరవన్నీ క్షేత్రస్థాయిలో లబ్థిదారులతో మాట్లా డారు. అనంతరం గ్రామంలో పర్యటించి ఆవాస్ యోజన పఽథకంలో నిర్మించిన నివాస గృహాలను పరిశీలించి లబ్థిదారులతో మాట్లాడి బిల్లులు గురించి ఆరా తీశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలో పర్యటించి పథకాల వారీగా లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆయనతో పాటు సర్పంచ్ మొనపాటి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ చెన్నంశెట్టి రంగారావు, ఎంపీడీవో పేరుమీనా సీతారామయ్య, కేంద్ర టీం సభ్యులు వి.సంధ్యారాణి, లక్ష్మి, లోకేష్, జి.సంధ్యా, భానుచంద్ర, హౌసింగ్ డీఈ ఎన్.శ్రీనివాసరావు, ఏఈ రసూల్, పంచాయతీ కార్యదర్శి బాల పరమేశ్వర రావు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. శావల్యాపురంలో... శావల్యాపురం: ఉపాధి పనులు పారదర్శకంగా జరిగేలా అధికారులు బాధ్యత వహించాలని న్యూఢిల్లీ కేంద్ర సంబోధ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ అధికారి వికాస్ మల్కర్ అన్నారు. మంగళవారం మండలంలోని శానంపూడి గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వికాస్ మల్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ఉపాధి పనులు పేదలందరు సద్వినియోగం చేసుకొని మంచి ఆర్ధిక ప్రగతి సాధించాలన్నారు. కూలీలు చేస్తున్న పంట కాల్వ పనులను, మస్టర్ను పరిశీలించి ఉపాధి అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయనతో పాటు ఏపీవో కె.రామారావు, డీఎఫ్టీ లావణ్య, ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. శానంపూడిలో పర్యటించిన కేంద్రం బృందం -
పౌష్టికాహారంతో దృష్టి లోపాలకు చెక్
బాపట్ల: విద్యార్థులు దృష్టి లోపం రాకుండా పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పురపాలక ఉన్నత పాఠశాలలో పలువురు విద్యార్థులకు కళ్ల అద్దాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం 3 వేల మంది విద్యార్థులకు కళ్ల అద్దాలు పంపిణీ చేశామన్నారు. డీఈఓ పురుషోత్తం, డీఎంహెచ్ఓ విజయమ్మ, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా పాల్గొన్నారు. ఈక్రమంలో మున్సిపల్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న వై.వెంకట వసంతకు కలెక్టర్ రూ.10వేలు అందజేశారు. ఓటు హక్కు కరపత్రాలు ఆవిష్కరణ.. బాపట్ల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు అత్యంత జాగురూకతతో ఓటు చేయవలసి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.వెంకట మురళి చెప్పారు. ఓటర్లు ప్రథమ ప్రాధాన్యతా ఓటును నమోదు చేయనట్లయితే వారి ఓటు చెల్లుబాటు కాదన్నారు. మంగళవారం ఓటింగ్ విధానంపై ఎన్నికల నిఘావేదిక ప్రచురించిన కరపత్రాలను ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు. బాలికల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి బాపట్ల: బాలికల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. బాలికల సంక్షేమం, హక్కుల పరిరక్షణపై అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం ఆయన నిర్వహించారు. బాలికల హక్కుల పరిరక్షణకు జిల్లాస్థాయిలో కమిటీని నియమించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ పని చేస్తుందన్నారు. అదేవిధంగా పీఎంఈజీపీ రుణాల మంజూరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
దగా పెరిగింది!
స్టయిల్ మారింది..అధికారుల పేర్లతో ఫోన్లు.. ఆనక ఫోన్పేలు అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్ ద్వారా మోసపోయినట్లు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు మా దృష్టికిరాలేదు. అయితే చాలా మంది ఇటువంటి మోసాలబారిన పడినట్లు సమాచారం ఉంది. ప్రజలకు వీటిపై అవగాహన సదస్సులు నిర్వహించి, అప్రమత్తం చేస్తున్నాం. ప్రజలు తమ ఫోన్లలో యాప్లను ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ సైబర్ నేరాల బారిన పడిన వారు నిర్భయంగా పోలీసు స్టేషన్లో పిర్యాదులు చేయాలి. – మల్లికార్జునరావు, పట్టణ సీఐ, రేపల్లె రేపల్లె రూరల్: సైబర్ నేరాలు తీరప్రాంతమైన రేపల్లెలోనూ పెచ్చుమీరుతున్నాయి. సైబర్ కేటాగాళ్ల ఉచ్చులో పట్టణంలోని అమాయకపు ప్రజలు ఇట్టేపడిపోతూ మోసపోతున్నారు. సైబర్ కేటుగాళ్లు పేద, మధ్య తరగతివారికి సైతం ఫేస్బుక్, వాట్సాప్ వంటి పలు సామాజిక మాధ్యమాల్లో ఎరవేస్తూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. నేటి వరకు ఉద్యోగాలు, లక్కీడీప్లు అంటూ ఎరవేసిన కేటుగాళ్లు ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్ చేసి ఆన్లైన్లో పన్నులు చెల్లించాలని కొత్తతరహా వసూళ్లకు తెరతీశారు. దుస్తులు, సెల్ఫోన్ల పేరుతో టోకరా.. పట్టణానికి చెందిన గోపీ అనే యువకుడు ఫేస్బుక్ చూస్తుండగా అందులో మంచి మోడల్ దుస్తులు తక్కువ ధరకు కనిపించాయి. రూ.5వేల నుంచి రూ.10వేల విలువ చేసే దుస్తులు ఆఫర్లో కేవలం రూ.2వేలకే ఇస్తున్నట్లు చూపించాయి. వెంటనే డబ్బులను చెల్లించి దుస్తులను బుక్చేశాడు. వారం రోజుల తరువాత పనికిరాని దుస్తుల పీలికలతో డెలివరీ అయిన ప్యాకెట్ను ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు. రిటన్ పెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అదేవిధంగా ఒక ప్రముఖ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ యాప్లో మొబైల్ ఫోన్లు విక్రయిస్తున్నట్లు వినయ్ అనే యువకుడు తన ఫోన్లో వచ్చిన మెసెజ్లో చూశాడు. రూ.80,000 విలువ చేసే ఆపిల్ ఐఫోన్ రూ.2వేలకు, రూ.48వేల విలువ చేసే రీయల్మీ ఫోన్ కేవలం రూ.1600కు వస్తున్నట్లు ఆఫర్లో చూపుతోంది. వెంటనే డబ్బులు రూ.4వేలు చెల్లించి రెండు ఫోన్లను బుక్ చేసుకున్నాడు. తదుపరి పరిశీలించగా ప్రముఖ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ యాప్ పేరుతో, అదే డిజైన్లో రూపొందించిన డూప్లికేట్ యాప్ అని, తాను మోసపోయానని గ్రహించి, పలువురి వద్ద బావురమన్నాడు. రూటు మార్చి పేట్రేగుతున్న సైబర్ మోసగాళ్లు రేపల్లెలో మున్సిపల్ చలానాలపేరుతో డబ్బులు స్వాహా సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే తంతు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులుస్పందించవద్దు మున్సిపల్ కార్యాలయానికి చెల్లించాల్సిన పన్నులు, ఫీజులు కార్యాలయంలో చెల్లించి రశీదులు పొందాలి. మున్సిపల్ కార్యాలయం పేరుతో అధికారులమంటూ ఎవరూ ఫోన్ చేసి ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలని కోరినా స్పందించవద్దు. మున్సిపల్ కార్యాలయం పేరుతో సైబర్ కేటుగాళ్లు ఆన్లైన్లో ఫీజులు చెల్లించాలని వ్యాపారులకు ఫోన్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – కాకర్ల సాంబశివరావు,మున్సిపల్ కమిషనర్, రేపల్లె -
మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
నాగులుప్పలపాడు: ఈ ఏడాది మిర్చి రైతులు తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోయారని, ఆ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. మండలంలోని ఒమ్మెవరం గ్రామంలో మిర్చి కళ్లాల్లో పంటను మంగళవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ మిర్చి పంటకు సరైన ధర లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులు ఏనాడూ గిట్టుబాటు ధర కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వమే అండగా నిలిచిందన్నారు. గత ఏడాది మిర్చి ధరలు క్వింటాలుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పలికాయని, ప్రస్తుతం ఈ ధరలు క్వింటాకు రూ.12 వేలకు పడిపోవడం బాధాకరమన్నారు. రైతులకు ఎకరాకు రూ.2.50 లక్షల వరకు పెట్టుబడి అవుతుందని, ఈ పరిస్థితుల్లో నల్లి, తామర తెగులుతో దిగుబడులు భారీగా తగ్గాయన్నారు. ఎకరాకు దిగుబడి 10 నుంచి 15 క్వింటాళ్లకు మించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఒక్కో ఎకరానికి రైతు సుమారు రూ.1.50 లక్షల వరకు నష్టపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు నలమలపు కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, కంచర్ల సుధాకర్, కోటిరెడ్డి, కుమ్మూరి సుధాకర్, గండు వెంకట్రావు, హరిబాబు, రాంబాబు, అంజిరెడ్డి, బాలకృష్ణ, సుబ్బారావు, వెంకటేష్ ఉన్నారు. ధరల పతనంతో నష్టాల్లో మిర్చి రైతులు వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున -
హత్యకేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు
మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండల పరిధిలో సుమారు పది సంవత్సరాల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులకు ఒంగోలు ఏడో అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీ రాజా వెంకటాద్రి జీవిత ఖైదు విధించారు. అలాగే ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా విధించారు. బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రెస్ నోట్ వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుత బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన దళిత మహిళ బూరగ యేసు దయమ్మ కుమారుడు బూరగరత్నం బాబు (22) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసేవాడు. 2015లో రత్నం బాబు అదే గ్రామానికి చెందిన బాలిక షేక్ కరిష్మా (17) ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన అమ్మాయి తరపు పెద్దలు పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించినా వారు ఖాతరు చేయలేదు. చెప్పిన మాట వినడం లేదని కరిష్మాను ఆమె తల్లిదండ్రులు మార్చి 23వ తేదీ 2015లో ఇంటి నుంచి బయటకు పంపించేశారు. ఈ క్రమంలో రత్నంబాబు కరిష్మాకు మైనారిటీ తీరాక పెళ్లి చేసుకుంటానని అప్పటివరకు ఆమెను తమ ఇంట్లోనే ఉంచుకుందామని తల్లిని ఒప్పించి ఇంటికి తీసుకువెళ్లాడు. నెల రోజుల తర్వాత ఏప్రిల్ 28, 2015న కరిష్మా మేనమామలైన నజీర్, మున్నీర్ బాషా వారి స్నేహితుడు అన్వర్ బాషా కలిసి.. రత్నం బాబు ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు జె.పంగులూరు గ్రామ మసీదులో ఇద్దరి వివాహానికి అంతా నిశ్చయించామని వలపర్ల వెళ్లి పెళ్లికి అవసరమైన బట్టలు కొనుగోలు చేద్దామని నమ్మించి రత్నం బాబును తమతో తీసుకుని వెళ్లారు. అదే రోజు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో రత్నం బాబును రామకూరు ఉత్తరం వైపు పొలాల్లోకి తీసుకువెళ్లి మరికొందరితో కలిసి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం రక్తపు మడుగులో ఉన్న రత్నం బాబు మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో తెలుసుకున్న రత్నం బాబు తల్లి బూరగ యేసు దయమ్మ.. మార్టూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి చీరాల డీఎస్పీ సి.జయ రామరాజు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపి ఆధారాలు, సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. హత్య జరిగినట్లు నిర్ధారించి మొత్తం తొమ్మిదిమందిని నిందితులుగా గుర్తించి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులపై హత్యానేరం రుజువు కావడంతో ఒంగోలు ఏడో అడిషనల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి టి.రాజా వెంకటాద్రి మంగళవారం సాయంత్రం తీర్పు వెలువరించారు. మొత్తం తొమ్మిది మంది నిందితుల్లో రామకూరు గ్రామానికి చెందిన ఏ8 ముద్దాయి షేక్ మస్తాన్ విచారణ సమయంలో మృతి చెందాడు. మిగిలిన వారిలో ముగ్గురు మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన ఏ1 షేక్ మునీర్ బాషా, ఏ2 షేక్ అన్వర్ బాషా, ఏ3 షేక్ నజీర్ కాగా రామకూరు గ్రామానికి చెందిన ఏ4 షేక్ కరిముల్లా, ఏ5 షేక్ బాజీ బుడే, ఏ6 షేక్ సద్దాం హుస్సేన్, ఏ7 షేక్ షకీల.. యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన ఏ9 పఠాన్ మౌలాలికి జడ్జి రాజా వెంకటాద్రి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.ప్రశాంతకుమారి సాక్ష్యాధారాలతో నిరూపించారు. సాక్షులకు సరైన రీతిలో నిర్భయంగా సాక్ష్యం చెప్పే విధంగా తర్ఫీదునిచ్చి నేరం రుజువై నిందితులకు శిక్ష పడేందుకు సహకరించిన వారిని ఎస్పీ తుషార్ డూడీ ప్రత్యేకంగా అభినందించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు పర్యవేక్షణలో మార్టూరు సీఐ ఎం.శేషగిరిరావు, కోర్టు కానిస్టేబుళ్లు ఎ.శ్రీనివాసులు, ఎ.కిరణ్ లు కేసును ఛేదించారు. -
రైల్వే ఉద్యోగుల సమస్యలను కేంద్రం పరిష్కరించాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రైల్వే శాఖ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి ఎస్.మంజునాథ్, ఎం.వి ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్లోని యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో వారు మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల సమస్యలను వివరించారు. అనంతరం రైల్వే ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. కేంద్రం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ డివిజన్ ట్రెజరర్ ఎస్.జి.కృష్ణయ్య, ఏడీఎస్ కె.కోటేశ్వరరావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ట్రెజరర్ సాంబశివరావు, ఏడీఎస్లు కరుణశ్రీ, హక్, లావణ్య, సంఘ నాయకులు వెంకటేష్, సాయి కృష్ణ, కిరణ్, ప్రసాంత్, మూర్తి, టి.వి.రావు, సునీల్కుమార్, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రేడ్ లైసెన్స్ల పేరుతో..
వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించాలని వారం రోజుల క్రితం డిమాండ్ చలానాలను మున్సిపల్ అధికారులు అందించారు. పన్నులు సకాలంలో చెల్లించాలని విస్తృతంగా ప్రచారం చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ సైబర్ కేటుగాడు ఇటీవల ఓ ప్రైవేటు వైద్యశాలకు 6300805117 నంబరు నుంచి ఫోన్ చేసి మున్సిపల్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీరు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించలేదు.. నేటితో రూ.1500 చెల్లిస్తే సరిపోతుందని, లేనిపక్షంలో పెనాల్టీలు చెల్లించాలని నమ్మబలికాడు. వెంటనే ఫోన్పే చేస్తే సరిపోతుందని, రశీదును మీకు వాట్సాప్లో పంపుతానన్నాడు. 8349772206 నంబరుకు ఫోన్పే చేయమన్నాడు. దీంతో ఆ వైద్యశాల సిబ్బంది ఫీజును ఫోన్పే ద్వారా చెల్లించారు. ఎంతసేపటికి రశీదు పెట్టకపోవటం, ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోవటంతో మున్సిపల్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా తాము మోసపోయినట్లు గ్రహించారు. ఇలాగే పట్టణంలో పలువురికి ఫోన్లు చేసినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను కార్యాలయంలోనే చెల్లించాలని, ఎవరు ఫోన్ చేసినా స్పందించవద్దని ప్రచారం చేసి ప్రకటనలు చేశారు. -
తరలింపు
చౌకచక్యంగా బాపట్ల నుంచి గుజరాత్కు రేషన్ బియ్యంసాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు వ్యాపారులు గుజరాత్ రాష్ట్రానికి తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. బాపట్ల సమీపంలోని వెదుళ్లపల్లిలో ఉన్న ఓ రైస్మిల్లు యజమాని ఈ చౌక బియ్యాన్ని సేకరించి పాలిషింగ్ చేసి తరలిస్తున్నట్లు సమాచారం. ఆయనతోపాటు బాపట్ల పట్టణ పరిధిలోని మరో రైస్మిల్లు యజమానితోపాటు ఇదే మండలం అప్పికట్ల ప్రాంతంలోని ఇంకో రైస్మిల్లుకు చెందిన బాపట్ల టీడీపీ నేత అనుచరుడు రేషన్ బియ్యాన్ని కొని పాలిషింగ్ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. కార్డుదారులను వంచిస్తున్న డీలర్లు.. మరోవైపు.. కొందరు డీలర్లు కార్డుదారులకు మొక్కుబడిగా డబ్బులు చెల్లిస్తుండగా.. మరికొందరు దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు. ఏమైనా ప్రశ్నిస్తే తెల్లకార్డు గల్లంతవుతుందని పచ్చనేతలు బెదిరిస్తున్నారు. దీంతో.. బియ్యం పోతే పోయింది కార్డు అయినా మిగులుతుందని చాలామంది పేదలు మిన్నకుండిపోతున్నారు. దీంతో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి, రేపల్లెతోపాటు పర్చూరు, చీరాల, బాపట్ల, వేమూరు నియోజకవర్గాల్లోనూ చాలామంది డీలర్లు గోడౌన్ల నుంచే రేషన్ బియ్యాన్ని వ్యాపారులకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదు. అక్రమంగా రాష్ట్ర సరిహద్దులుదాటిస్తున్న వైనం వెదుళ్లపల్లి, బాపట్ల, అప్పికట్ల ప్రాంతాల్లో రైస్ మిల్లుల నుంచి అక్రమ రవాణా వెదుళ్లపల్లి నుంచి నెలకు15 వేల క్వింటాళ్లు.. బాపట్ల, కర్లపాలెం మిల్లుల నుంచి 10 వేల క్వింటాళ్లు బియ్యం వ్యాపారుల నుంచి కిలో రూ.22కు కొంటున్న అక్రమార్కులు మిల్లుల్లో పాలిషింగ్ చేసి గుజరాత్లో రూ.40కు విక్రయాలు ఇక్కడ కిలో రూ.22కు కొన్న రేషన్ బియ్యాన్ని గుజరాత్లో కిలో రూ.40కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా ఒక్కో కిలోకు అన్ని ఖర్చులూ పోను రూ.15 తక్కువ కాకుండా వస్తోంది. ఈ లెక్కన ప్రతి నెలా రూ.కోట్లలోనే రాబడి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వెదుళ్లపల్లి మిల్లు యజమాని నెలకు 15 వేల క్వింటాళ్లు సేకరిస్తుండగా.. మిగిలిన రెండు మిల్లుల నుంచి మరో 10 వేల క్వింటాళ్లు అనుకున్నా మొత్తంగా జిల్లా నుంచి గుజరాత్కు సగటున 25 వేల క్వింటాళ్లు తరలిపోతున్నట్లు సమాచారం. వెదుళ్లపల్లి మిల్లుకు చెందిన వ్యాపారితోపాటు బాపట్ల, అప్పికట్ల మిల్లులకు చెందిన వ్యాపారులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు గుంటూరు జిల్లా పొన్నూరు, పల్నాడు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేస్తున్నారు. రేషన్ బియ్యం ఖరీదు ఇలా.. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్డుదారులకు డీలర్లు కిలోకు రూ.8 చెల్లించి బియ్యం వ్యాపారులకు రూ.12కు ఇచ్చేవారు. అలాగే, బియ్యం అక్రమ రవాణాదారులు బియ్యం సేకరణ వ్యాపారులకు రూ.20 చెల్లించేవారు. కానీ, రేషన్ బియ్యానికి డిమాండ్ పెరగడంతో కార్డుదారులకు రూ.10 నుంచి రూ.12.. డీలర్లకు రూ.15 నుంచి రూ.17 వస్తోంది. ఇక వ్యాపారుల వద్ద నుంచి అక్రమ ఎగుమతిదారులు కిలో రూ.22 నుంచి రూ.24కు కొనుగోలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సేకరణ.. బాపట్లతో పాటు పర్చూరు, అద్దంకి, రేపల్లె, చీరాల, వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లోని డీలర్ల నుంచి కిలో బియ్యాన్ని రూ.15కు ఈ ముఠా కొనుగోలు చేస్తోంది. ఇలా సేకరించిన బియ్యాన్ని వెదుళ్లపల్లితో పాటు మిగిలిన ఇద్దరు మిల్లర్లకు కిలో రూ.22 చొప్పున విక్రయిస్తున్నారు. వెదుళ్లపల్లి మిల్లు యజమాని ఒక్కరే నెలకు సుమారు 15 వేల క్వింటాళ్ల బియ్యాన్ని తన మిల్లుకు తరలించి ఎప్పటికప్పుడు పాలిషింగ్ చేసి లారీలు, ట్రక్కుల ద్వారా పొన్నూరు, గుంటూరు, మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్కు, అక్కడి నుంచి గుజరాత్కు తరలిస్తున్నట్లు సమాచారం. -
మెడికల్ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకం
మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బాపట్ల: గత ప్రభుత్వ హయాంలో రూ. 505 కోట్ల నిధులతో మంజూరైన బాపట్ల మెడికల్ కళాశాల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం ప్రశ్నార్ధకంగా మార్చడం దారుణమని, అసలు ఏం చేయబోతున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. మంగళవారం తనను కలిసిన విలేకరులతో కోన మాట్లాడారు. అసాధ్యమని భావించిన అనేక పనులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూర్తిచేసి బాపట్ల వాసులకు అందించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొన్ని కొత్త జిల్లాల కేంద్రాలు (హెడ్ క్వార్టర్స్) ఒక ప్రాంతంలో ఉండగా, మెడికల్ కళాశాలలు మరో ప్రాంతానికి మంజూరయ్యాయని, బాపట్లకి మాత్రం జిల్లా కేంద్రం, మెడికల్ కళాశాల రెండింటినీ తీసుకువచ్చామని, ఈ అభివృద్ధిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకుల మీద ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో కొన్ని మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయనుండటం పట్ల అభ్యంతరం తెలిపారు. బాపట్ల మెడికల్ కళాశాలపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కళాశాల నిర్మాణంలో ఎంతో క్లిష్టమైన భూసేకరణ, పునాదులకు సంబంధించిన పనులను తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాల విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయరాదని సూచించారు. బాపట్లలో నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కళాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. చింతపల్లి మేజర్కుసాగునీరు విడుదలఅచ్చంపేట: మండలంలోని కొండూరు పంచాయతీ పరిధిలోని శ్రీనివాసతండా వద్ద నాగార్జున సాగర్ కాలువల ద్వారా చింతపల్లి మేజర్కు సాగునీటి అవసరాలకు కెనాన్స్ ఏఈ చిల్కా భాస్కర్ ఆదేశాలతో మంగళవారం సాగునీటిని వదిలారు. చింతపల్లి మేజర్ కాలువ కింద ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలు వేశారు. ఈ కాలువకు నీళ్లు రాకపోవడంతో రైతులు గత కొద్దికాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచే కస్తల మేజర్కు సాగునీటిని వదిలిన అధికారులు చింతపల్లి మేజర్కు వదలకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు శ్రీనివాసతండా నుంచి ఐదు రోజులు కస్తల మేజర్కు, ఐదు రోజులు కస్తల మేజర్కు సాగునీటిని మార్చి మార్చి వదిలే విధంగా ఆదేశాలు జారీ చేశారు. అమరేశ్వరుని సేవలో క్యాట్ న్యాయమూర్తి అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరుని మంగళవారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్) న్యాయమూర్తి లతా భరద్వాజ్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు న్యాయమూర్తికి స్వాగతం పలికారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేషవస్త్రంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట క్యాట్ మెంబర్ వరణ్సింధు కౌముది, అధికారులు ఉన్నారు. కాలువలో కారు బోల్తా అమర్తలూరు(వేమూరు): ఇంటూరు కాల్వలో కారు బోల్తా పడిన ఘటన మంగళవారం జరిగింది. అమర్తలూరు పోలీసుల కథనం మేరకు గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగే శుభ కార్యక్రమానికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఈక్రమంలో ఉదయం 6.30 నిమిషాలకు ఇంటూరు నుంచి చెరుకుపల్లి వెళ్లే దారిలో లారీని క్రాస్ చేస్తుండగా అదుపు తప్పి కారు ఇంటూరు కాల్వలో పడింది. అందులోఉన్న వారికి స్వల్ప గాయాలు కావడంతో చెరుకుపల్లిలో ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొంది, రేపల్లె వెళ్లినట్లు ఎస్ఐ జానకి అమర్ వర్థన్ తెలిపారు. -
ఇంజినీ‘రింగ్ రింగ’
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ఇంజినీరింగ్ విద్యార్థులు రింగరింగ అంటూ మత్తులో మునిగితేలుతున్నారు. నిషేధిత మత్తు పదార్థాలను కలిగి ఉండడంతోపాటు వాటిని తక్కువ ధరకు కొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నాలుగేళ్లుగా గుంటూరులో సాగుతున్న ఈ మత్తు దందాను ఎకై ్సజ్ శాఖ అధికారులు తాజాగా రట్టు చేశారు. ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మంగళగిరి రూరల్ మండలం కాజకు చెందిన ఎం.సాయి కృష్ణ గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతని సోదరుడు బెంగళూరులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. సోదరుడి దగ్గరకు సాయి కృష్ణ వెళ్లిన సమయంలో అదే రూంలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్, తెనాలి చినరావూరుకు చెందిన ధరావత్ సతీష్కుమార్ పరిచయమయ్యాడు. సతీష్కుమార్కు బెంగళూరుకు చెందిన నితిన్తో కలిసి ఎండీఎంఏ మత్తుమందును సేవించేవాడు. దీనిని సాయికృష్ణ కూడా అలవాటు చేసుకున్నాడు. ఈ మత్తుమందును గుంటూరులోనూ అమ్ముకోవచ్చని, లాభాలు పొందొచ్చని సతీష్కుమార్, నితిన్ సాయికృష్ణకు సూచించారు. దీంతో నితిన్ ద్వారా ఎండిఎంఏ మత్తు మందును నాలుగేళ్లుగా సాయి కృష్ణ, సతీష్ కుమార్ ఇద్దరూ గుంటూరు తీసుకొచ్చి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు అమ్ముతున్నారు. సాయి కృష్ణ ఇటీవల గుంటూరు సమీపంలోని గోరంట్ల ప్రాంతంలో కోదండ రామా నగర్ లోని సాయి లక్ష్మీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని అక్కడి నుంచే దందా నిర్వహిస్తున్నాడు. గుట్టురట్టు ఇలా.. రెండు రోజుల క్రితం గుంటూరు ఎకై ్సజ్–2 టౌన్ సీఐ ఎం. యశోధర దేవి, ఆమె సిబ్బంది బృందావన్ గార్డెన్స్ సమీపంలోని వేంకటేశ్వర స్వామి గుడి రోడ్డులో తనిఖీ చేస్తుండగా ఇద్దరు ద్విచక్ర వాహనాన్ని ఆపి నిలబడి ఉన్నారు. అనుమానం వచ్చిన ఎకై ్సజ్ అధికారులు వారిని ప్రశ్నించారు. ఇద్దరూ తడబడుతుండడంతో వారిని తనిఖీ చేశారు. ఇద్దరి వద్ద 2.52 గ్రాముల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించగా సాయి కృష్ణ వద్ద కొన్నామని తెలిపారు. సాయి కృష్ణ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్కి వెళ్లి విచారించగా అతని వద్ద 8.15 గ్రాముల మత్తు మందుతోపాటు, ఏడుగురు విద్యార్థులు, ఒక కేజీ గంజాయి, ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు లభించాయి. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉండగా 9 మందిని అరెస్ట్ చేసి కోర్టు హాజరు పరిచినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంకా గంజాయి సరఫరా చేస్తున్న సాయి కృష్ణ బంధువు వేంపాటి చైతన్యతోపాటు బెంగళూరుకు చెందిన నితిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంది. వీరు పరారీలో ఉన్నట్టు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయిస్తూ పట్టుబడిన విద్యార్థులు 9 మంది అరెస్టు, పరారీలో ఇద్దరు బెంగళూరు నుంచి తక్కువ రేటుకు దిగుమతి గుంటూరులో అధిక ధరకు అమ్మకాలు వివరాలు వెల్లడించిన ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు బెంగళూరులో గ్రాము రూ.1400కు కొనుగోలు ఎండీఎంఏ మత్తుమందును బెంగళూరులో గ్రాము రూ.1400 కొని ఇక్కడికి తీసుకొచ్చి ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.4 వేల నుంచి రూ.ఐదువేలకు అమ్ముతున్నట్టు ఎకై ్సజ్ అధికారులు గుర్తించారు. గుంటూరు సమీపంలోని ప్రధానంగా రెండు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ మత్తు మందును సాయి కృష్ణ అలవాటు చేసినట్లు తెలుస్తోంది. గోరంట్లలోని తన ఫ్లాట్లోకి విద్యార్థులను పిలిపించి మత్తుమందు, గంజాయి అమ్ముతున్నట్టు సమాచారం. నాలుగేళ్లుగా ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్న సాయికృష్ణ తన గ్రామానికి చెందిన సమీప బంధువుతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెప్పించి విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు ఎకై ్సజ్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ యశోధర దేవిని ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. సీఐతో పాటు ఎస్ఐలు సత్యనారాయణ, మాధవి, హెడ్ కానిస్టేబుల్స్ హనుమంతురావు, సీహెచ్ రాజు, మైలా శ్రీనివాసరావు, రవిబాబు, బీఎస్ఎన్రాజు, పి నాగేశ్వరరావు, ఎం సూర్యనారాయణ, వివి చారి, చిన్న బాబు తదితరులనూ అభినందించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రవి కుమార్ రెడ్డి, గుంటూరు ఎకై ్సజ్ శాఖ అధికారి వి అరుణ కుమారి, ఏ ఈ ఎస్ ఈడే మారయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. -
శిడి బండి సంబరం
వైభవం.. ఉయ్యూరు: అశేష భక్తజన కోలాహలం.. సన్నాయి మేళాల జోరు, డప్పు వాయిద్యాల హోరు.. జై వీరమ్మ.. జైజై వీరమ్మ భక్తజన నినాదాల నడుమ.. శిడిబండి ఊరేగింపు కనుల పండువగా సాగింది. పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్యకిరణ్ శిడిబుట్టలో కూర్చున్న ఉత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. పారుపూడి, నెరుసు వంశస్తులు మూడు సార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. నయనానందకరంగా.. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో 11వ రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన శిడిబండి వేడుక మంగళవారం నయనానందకరంగా సాగింది. పాత వాటర్ ట్యాంకు రోడ్డులో ప్రత్యేకంగా తయారుచేసిన శిడిబండికి స్థానికులు పసుపునీళ్లు ఓరబోసి గుమ్మడికాయలు కట్టి, కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఊరేగింపుగా బయలుదేరిన శిడిబండికి దారిపొడవునా భక్తులు పువ్వులు విసురుతూ పసుపునీళ్లు ఓరబోస్తూ హారతులు పట్టారు. పూలదండలు, గుమ్మడికాయలను శిడిబండికి కట్టి భక్తిపారవశ్యం చెందారు. కాలేజ్ రోడ్డు, ప్రధాన రహదారి వెంబడి సాగిన ఊరేగింపులో అశేష భక్తజనం పాల్గొని తన్మయత్వం చెందారు. శిడిబుట్టలో కూర్చున్న పెళ్లి కుమారుడు.. సంప్రదాయం ప్రకారం ఉయ్యూరు దళితవాడ నుంచి పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్య కిరణ్ ఊరేగింపుగా ఆలయం వద్దకు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మౌర్య కిరణ్ను శిడి బుట్టలో కూర్చోబెట్టి ఆలయ ప్రదక్షిణ చేయించారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా శిడిబండిని నిలిపి మూడుసార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. శిడి ఆడే సమయంలో భక్తులు అరటికాయలు విసురుతూ భక్తిపారవశ్యం చెందారు. వేడుక అనంతరం పెళ్లి కుమారుడితో పాటు ఉయ్యూరు వంశస్తులు, బంధువులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో 300 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఉత్సవానికి పోటెత్తిన భక్తజనం -
క్వారీ తిరునాళ్లకు సకల సౌకర్యాలు
చేబ్రోలు: మహారాత్రి సందర్భంగా క్వారీ తిరునాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెనాలి సబ్కలెక్టర్ సంజనా సింహా ఆదేశించారు. వడ్లమూడి క్వారీ తిరునాళ్ల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ అధికారుల కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. భక్తుల అభిషేకాలు, దర్శనాలు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, ఎలక్ట్రికల్ ప్రభల బరువు, సామర్థ్యం, ఎత్తు, ట్రాఫిక్ నియంత్రణ, వెహికల్స్ పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అధికారులను శాఖల వారీగా విడిది స్టాల్స్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ ఈఓ రామకోటేశ్వరరావు మాట్లాడుతూ మూడు రోజులు పాటు వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయని, ఈ వేడుకల్లో మొదటిరోజు పశువుల ప్రదక్షిణలు ఉంటాయని, రెండో రోజు వాహనాల ప్రదక్షిణలు పూజలు ఉంటాయని, మూడవరోజు ఈనెల 26వ భక్తుల అభిషేకాలు మహాశివరాత్రి వేడుకలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ కె.శ్రీనివాసశర్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.ఉమాదేవి, ఈఓపీఆర్డీ టి.ఉషారాణి, ఆలయ ఈఓ రామకోటేశ్వరరావు, తిరునాళ్ల కమిటీ చైర్మన్ జి.శ్రీకాంత్, 52 శాఖల అధికారులు పాల్గొన్నారు. తెనాలి సబ్కలెక్టర్ సంజనా సింహా -
డాక్టర్ కవితకు అరుదైన అవార్డు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్) గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ముక్కు కవిత, కేంద్ర మంత్రి కె.రామమోహన్ నాయుడు చేతుల మీదుగా అరుదైన పురస్కారం అందుకున్నారు. టైమ్స్ నెట్వర్క్ ఇండియా హెల్త్ కేర్ అవార్డుల పురస్కారం ఆదివారం వైజాగ్లో నిర్వహించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన కృషి చేసినందుకు మార్గదర్శకులను గుర్తించి అవార్డులను అందజేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్ను రూపొందించడంలో మెరుగైన పాత్ర వహించి గణనీయమైన కృషి చేసినందుకు డాక్టర్ కవితకు అవార్డు లభించింది. అవార్డు అందుకున్న డాక్టర్ కవితకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ, వైద్య కళాశాల, జీజీహెచ్కు చెందిన పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది సోమవారం అభినందనలు తెలిపారు. -
సర్వేను అడ్డుకున్న పచ్చమూకలు
కొల్లూరు: టీడీపీ వర్గీయులు అడ్డగింత కారణంగా వివాదాస్పదంగా మారిన నడకదారి హద్దుల వ్యవహారం సర్వే జరగకుండానే నిలిచిపోయింది. మండలంలోని జువ్వలపాలెం శివారు గుంటూరుగూడెంలో టీడీపీకి చెందిన పక్క పొలం రైతు తన పంట పొలంలోని మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి బలవంతంగా తన భూమిని ఆక్రమించుకున్నాడని మారీదు ప్రసాద్ అనే రైతు ఆరోపించాడు. గుంటూరుగూడెంకు చెందిన రైతు ప్రసాద్ ఈ వ్యవహారంపై రెవెన్యూ యంత్రాంగంను సైతం సంప్రదించి సర్వే చేయించి న్యాయం చేయాలని అప్పట్లోనే వినతి పత్రం రూపంలో మొరపెట్టుకున్నాడు. ఈనెల 4న ‘సాక్షి’లో ‘పేద రైతుపై దౌర్జన్యకాండ’ శీర్షికతో కథనం సైతం వెలువడింది. సమస్యను పరిష్కరించేందుకు బాధిత రైతును ప్రభుత్వ సర్వేకు దరఖాస్తు చేసుకోవాలని కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు సూచించడంతో వారు అధికారిక సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రవేటు సర్వేయర్లతో టీడీపీకి చెందిన నాయకుడు వేములపల్లి రవికిరణ్ కొలతలు కొలిపించి తనపై దౌర్జన్యానికి పాల్పడి తమపై దాడి చేయించి పొలం ఆక్రమించుకోవడంతోపాటు, నష్టం కలిగించారన్న బాధితుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ప్రభుత్వ సర్వేయర్లు కొలతలు సేకరించాలని ఆదేశించడంతో సోమవారం కొలతల ప్రక్రియ కోసం సర్వేయర్లు వివాదాస్పద భూమి వద్దకు వెళ్లారు. ఈనేపథ్యంలో బాధిత రైతులు తమ వద్దనున్న పత్రాలను అందజేసి దాని ప్రకారం తమ హద్దులు నిర్ణయించాలని సర్వేయర్లను కోరారు. టీడీపీ నాయకుడు వర్గీయులు మాత్రం మొత్తం భూమికి కొలతలు సేకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, బాధిత రైతు పేర్కొంటున్న 2 సెంట్ల భూమి తమకు చెందినదని కొలతల సేకరణను అడ్డగించారు. ఒక దశలో బాధిత రైతుల పక్షాన నిలిచి సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపైన సైతం దురుసుగా వ్యవహరిస్తూ వివాదం సృష్టించారు. దీంతో భూమి హద్దులు నిర్ధారించేందుకు వెళ్లిన సర్వేయర్లు టీడీపీ నాయకులు వివాదంలో ఉన్న 2 సెంట్ల భూమి కొలిసేందుకు ఒప్పుకునేది లేదని పట్టుపట్టడంతో సాయంత్రం వరకు వేచి చూసి వెనుతిరిగారు. బాధిత రైతు పక్షాన వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు సుగ్గున మల్లేశ్వరరావు వివాదాస్పదమైన భూమి వద్దకు వెళ్లి కొలత ప్రక్రియ చట్టబద్ధంగా నిర్వహించాలని సర్వేయర్లను కోరారు. నడకదారి వివాదంలో ప్రభుత్వ సర్వే అడ్డగింత కొలతలు సేకరించవద్దంటూ పట్టు రికార్డుల ప్రకారం కొలతలు సేకరించాలని పేద రైతు మొర ఇరు వర్గాల నడుమ వివాదంతో సర్వే నిలిపివేసిన యంత్రాంగం లింక్ డాక్యుమెంట్లతో సమస్య పరిష్కరిస్తాం నడక దారి వివాదంలో తన వద్ద ఉన్న పత్రాల మేరకు 1.06 సెంట్లకు కొలతలు నిర్వహించి హద్దులు నిర్వహించాలని బాధిత రైతు సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పక్క రైతు సైతం తమ పత్రాల మేరకు ఆభూమి తమ కు చెందుతుందని వెల్లడించడంతో కొలతల సేకరణను నిలుపుదల చేయాల్చి వచ్చింది. ఆ భూములకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను సైతం తీసుకురావాలని ఇరుపక్షాలకు సూచించి తిరిగి కొలతలు నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. –బి. వెంకటేశ్వర్లు, తహసీల్దార్, కొల్లూరు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, ఇద్దరికి గాయాలు మార్టూరు: దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ఇంటికి చేరకుండానే ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈఘటన మార్టూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. హైవే అంబులెన్స్ సిబ్బంది రవి, స్థానికుల వివరాల మేరకు.. జూలూరు శ్రీకృష్ణ (40), జూలూరు వంశీకృష్ణ, కె.వివేక్లు తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి నూజివీడుకు కారులో బయలుదేరారు. సరిగా ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో స్థానిక దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి మొదట ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి అనంతరం డివైడడ్ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు తీవ్రంగా ధ్వంసం కాగా అందులో ఉన్న ముగ్గురిలో జూలూరు శ్రీకృష్ణ (40) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మిగిలిన వంశీకృష్ణ, వివేక్లు గాయాలతో బయటపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
కాజ టోల్ ప్లాజాను రద్దుచేయాలి
మంగళగిరి టౌన్: మంగళగిరి– తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని అధిక టోల్ఫీజు వసూలు చేస్తున్న కాజ టోల్ప్లాజాను వెంటనే రద్దు చేయాలని ప్రయాణికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బాల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు కోరారు. మంగళగిరి నగర పరిధిలోని ప్రెస్క్లబ్లో సోమ వారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కాజ టోల్గేట్ వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 79 కిలోమీటర్ల దూరంలో టోల్ప్లాజా ఉండకూడదని దీనిపై లారీ ఓనర్స్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో రూ.150 ఉండే టోల్పాస్ ఇప్పుడు రూ.340 చేశారని దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న ఈ టోల్గేటును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. -
హనుమత్ వైభవం చాలా గొప్పది
తెనాలి: హనుమత్ వైభవం చాలా గొప్పదని, వాస్తవానికి భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయస్వామిగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి(బాలస్వామి) అన్నారు. స్థానిక షరాఫ్బజారులోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయస్వామి దేవాలయాన్ని బాలస్వామి సోమవారం దర్శించారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. తన బాల్యంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంతో అనుబంధాన్ని గుర్తుచేశారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. హనుమంతుడి ధ్వజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జయాలు ఉంటాయని చెప్పారు. హనుమాన్ చాలీసా కూడా జయహనుమతోనే ప్రారంభమవుతుందని గుర్తుచేశారు. మాఘమాసంతో సహా ఏ మాసంలో ఏరోజు ఏమేం చేయాలో? ధర్మ ఆచరణ విధివిధానాలను పెద్దలు చెప్పారనీ, ప్రజలు శాస్త్రప్రకారం ధర్మాన్ని పాటిస్తూ, భగవంతుడిని ఆరాధిస్తూ తమ జీవనవిధానాన్ని ఆచరించాలని సూచించారు. బాలస్వామీజీకి ఆలయ ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, ప్రధాన అర్చకుడు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్వీ కిరణ్కుమార్ స్వాగతం పలికారు. స్వామీజీతో సాలిగ్రామ మఠం కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, సభ్యులు రాజేశ్వరరావు, ప్రభరాణి, వరలక్ష్మి, ప్రమీల పాల్గొన్నారు. నీతి ఆయోగ్ బృందం తక్కెళ్లపాడు సందర్శన పెదకాకాని: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సద్వినియోగంపై నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం తక్కెళ్లపాడు పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం సందర్శించింది. బృందం సభ్యులు జిష్యుపాల్, స్వప్నలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సడక్ యోజన, పింఛన్ పంపిణీ, డ్వాక్రా యానిమేటర్లతో మాట్లాడారు. డ్వాక్రా స్వయం సహాయ సంఘాలకు మంజూరు చేసిన నిధుల సద్వినియోగంపై డ్వాక్రా సంఘాల మహిళలతో చర్చించారు. ఈ పథకాలను సంబంధించిన పలు రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పసుపు ధరలు దుగ్గిరాల: పసుపు గరిష్ట ధర రూ.9800 పలికింది. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డుకు సోమవారం 320 బస్తాలు రాగా మొత్తం అమ్మకం జరిగినట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. సరకు కనిష్ట ధర రూ.9600, గరిష్ట ధర రూ.9800, మోడల్ ధర రూ.9800, కాయ కనిష్ట ధర రూ.9,551, గరిష్ట ధర రూ.9700, మోడల్ ధర రూ.9700 పలికినట్లు తెలిపారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చీరాల రూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈఘటన సోమవారం చీరాల రైల్వే స్టేషన్ ఫైరాఫీసు గేటు సమీపంలోని వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య వివరాల మేరకు.. ఫైరాఫీసు గేటు సమీపంలో వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో ప్రమాద స్థలాన్ని పరిశీలించగా మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉండవచ్చని, మృతదేహంపై బ్లాక్ కలర్ చొక్కా, గళ్ల లుంగీ ఉందని చెప్పారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ ఎస్సై 94406 27646 కు సమాచారం అందించాలన్నారు. -
చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి
తాడికొండ: చిన్నారులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించే టీకాలు సకాలంలో వేయించేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్ బాబు అన్నారు. సోమవారం తుళ్లూ రు పీహెచ్సీని సందర్శించిన ఆయన వైద్య బృందంతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిన్నారులకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఏఏ టీకాలు ఏ సమయంలో వేయించాలి అనే విషయంపై స్పష్టంగా అవగాహన కల్పించాలని కోరారు. టీకాలకు సంబంధించిన సమాచారాన్ని యు విన్ పోర్టల్లో అప్లోడ్ చేసే విధానాన్ని వివరించారు. గ్రామాల్లో సీడీఎన్సీ సర్వే చేసి ప్రతి గ్రామంలోని కుటుంబాలకు ఐడీ నంబర్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు డి.శ్రీనివాస్, వసుంధర, శివపార్వతీ, సీహెచ్ఓ వెంకట రమణ, ఎంఎస్ రాణి, పర్యవేక్షకులు సుధాకర్, డీఎస్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ కరీమ్ పాల్గొన్నారు. -
ఇస్సోపార్బ్ అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే
మంగళగిరి: ఇండియన్ సొసైటీ ఆఫ్ పెరినాటాలజీ అండ్ రీ ప్రొడక్ట్ మెడిసన్(ఇస్సోపార్బ్) కొత్త అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే బాధ్యతలు స్వీకరించారు. నగర పరిధిలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో మూడు రోజులు పాటు నిర్వహించిన ఇస్సోపార్బ్ 40వ జాతీయ సదస్సు సోమవారం ముగిసింది. మూడు రోజులు పాటు నిర్వహించిన సదస్సులో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్లోని కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సును ఇస్సోపార్బ్ విజయ వాడ చాప్టర్ నిర్వహించింది. ప్రారంభోత్సవానికి ఇస్సోపార్బ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నారా యణ జానా, కార్యదర్శి డాక్టర్ మిశ్రా చౌదరి, ఎన్టీఆర్యూహెచ్ఎస్ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి హాజరై అనేక అంశాలను చర్చించారు. చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ కె.గీతాదేవి, కార్యదర్శి కె.లత ప్రాతినిథ్యం వహించగా 450 మంది ప్రతినిధులు హాజరైన కార్యక్రమంలో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్లోని పలు అంశాలను చర్చించారు. -
తరలింపు వేగవంతం ..
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాక్షి ప్రతినిధి, బాపట్ల: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సొంత నియోజకవర్గం అద్దంకి ప్రాంతంలో పచ్చ నేతలు మట్టి, గ్రావెల్ అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు గుండ్లకమ్మ నది నుంచి ఇసుక, మరికొందరు నియోజకవర్గంలో ఇసుకతోపాటు గ్రావెల్, మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరంతా మంత్రి అనుచరులు కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అద్దంకి మండలం ధర్మవరంకు చెందిన పచ్చనేత ధర్మవరం పెద్ద చెరువు నుంచి గ్రావెల్ తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. 113 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో సుమారు పదికి పైగా యంత్రాలతో వంద టిప్పర్ల ద్వారా మట్టి తరలించి అమ్ముకుంటున్నారు. రేయింబవళ్లు అక్రమ రవాణా సాగుతోంది. తాజాగా అద్దంకి నియోజకవర్గంలో ... బెంగళూరు – అమరావతి ఎక్స్ప్రెస్వే రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా తాళ్లూరు ప్రాంతం నుంచి అద్దంకి నియోజకవర్గం ముప్పవరం వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. చెరువు నుంచి రోజుకు వందలాది ట్రిప్పర్ల మట్టి, గ్రావెల్ను హైవేకు తరలిస్తున్నారు. దీంతోపాటు అద్దంకి నియోజకవర్గంలోని రియల్ వెంచర్లు, ఇతర అవసరాలకు ధర్మవరం చెరువు నుంచే గ్రావెల్ తరలిస్తున్నారు. ఒక టిప్పర్ గ్రావెల్కు హైవే కాంట్రాక్టర్లు రూ.ఐదు వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన రాబడి రోజుకు రూ.లక్షల్లో ఉన్నట్లు అంచనా. న్యూస్రీల్ ధర్మవరం పెద్ద చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు బెంగళూరు – అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి సరఫరా విద్యుత్ మంత్రి ఇలాకాలో ఆగని గ్రావెల్, మట్టి దందా రియల్ వెంచర్లకూ ఇక్కడి నుంచే సరఫరాగ్రావెల్, మట్టి రవాణాపై ‘సాక్షి’లో కథనం రావడంతో తరలింపును కొద్ది రోజులు నిలిపి, ఇప్పుడు మళ్లీ వేగవంతం చేశారు. చెరువు నుంచి మట్టి లేదా గ్రావెల్ తరలించాలంటే నిబంధనల మేరకు నీటిపారుదల శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే తనకు అనుమతులు ఉన్నట్లు సదరు నేత బుకాయిస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా అనుమతులు ఉంటే రోజువారీ తరలిస్తున్న మట్టి, గ్రావెల్ వివరాలు, ప్రభుత్వానికి ఎంత మొత్తం చెల్లించారో కూడా తెలియజేయాలి. ఆ వివరాలు అధికారులకు ఇచ్చిన దాఖలాలు కనిపించడంలేదు. నియోజకవర్గంలో పలు చెరువులు ఉన్నా ఆయా గ్రామాల ప్రజలు గ్రావెల్, మట్టి అక్రమ తరలింపుకు అంగీకరించ లేదని తెలుస్తోంది. తొలుత ఇదే మండలంలోని కలవకూరు, శింగరకొండ తదితర గ్రామాల చెరువుల నుంచి గ్రావెల్ తరలించేందుకు పచ్చనేతలు ప్రయత్నించగా గ్రామస్తులు అంగీకరించలేదు. ముళ్ల కంపలు, ఇతర చెట్లు ఉన్న ధర్మవరం చెరువును ఆధునీకరించాల్సిన అధికారులు, పచ్చనేతలు కుమ్మకై ్క మట్టి, గ్రావెల్ అమ్మకానికి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె రూరల్: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే.ఝాన్సీ అన్నా రు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవో ఎం.సుచిత్రకు అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం వినతిపత్రం అందజేసి అనంతరం మాట్లాడారు. అంగన్వాడీలకు గ్రాడ్యుటీని వెంటనే అమలు చేయాలన్నారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలన్నారు. కనీస వేతనం రూ.26000 అందించాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్ధిష్టమైన గైడ్లైనెన్స్ను రూపొందించి అమలు చేయ్యాలన్నారు. సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలన్నారు. సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని కోరారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చు లకు రూ.20 వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. సమ్మెకాలంలో చనిపోయిన వారికి సైతం ఇదే విధానాన్ని కొనసాగించాలన్నారు. పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలని, అన్నియాప్లు కలిపి ఒకేయాప్ మార్పు చేయాలని, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెనూ చార్జీలు పెంచటంతో పాటు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయ్యాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలన్నారు. ప్రీ స్కూల్ బలోపేతం చేయ టంతో పాటు ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎన్. కృష్ణకుమారి కె.రత్నకుమారి, నిర్మల జ్యోతి, డి.జ్యోతి, శ్రీలక్ష్మి, రాజ్యలక్ష్మి, సీఐటీయూ నాయకులు కె.వి.లక్ష్మణరావు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ -
కొలిక్కి రాని బంగారం చోరీ కేసు
మంగళగిరి: బంగారం చోరీ కేసు పోలీసు అధికారులకు అంతుచిక్కడం లేదు. రూ.5 కోట్ల అని చెబుతుండడంతో అధికారులు లోతైన విచారణ చేపట్టారు. సోమవారం ఎస్పీ సతీష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు దర్యాప్తుపై పలు సూచనలు చేశారు. ఏఎస్పీ రవి కుమార్ నేతృత్వంలో ఫిర్యాదుదారుడు దివి నాగరాజుతో పాటు దుకాణంలో పని చేస్తున్న ఐదుగురు యువకులను రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారిస్తున్నారు. పట్టణానికి చెందిన దివి రాము, విజయవాడలో డీవీఆర్ జ్యూయలరీ దుకాణం నిర్వహిస్తుంటాడు. అందులో మేనేజర్గా పనిచేసే దివి నాగరాజు ఈ నెల 15వ తేదీ రాత్రి సుమారు ఐదు కిలోల వివిధ రకాల బంగారు ఆభరణాలను సంచిలో పెట్టుకుని స్కూటీపై వస్తుండగా ఆత్మకూరు బైపాస్లోని అండర్ పాస్ వద్ద గుర్తు తెలియని ఇద్దరు యువకులు అడ్డుకుని సంచిని లాక్కుని పారిపోయారని మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో చోరీ జరిగిన తీరుపై ట్రయల్ రన్ నిర్వహించారు. సంచి లాక్కుని వెళ్లిన తీరుపై నిర్వహించిన ట్రయల్ రన్లో లాగినా సంచి చేతికి వచ్చే అవకాశం లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విజయవాడలో ఆభరణాలతో బయల్దేరిన నాగరాజు ఏ మార్గంలో మంగళగిరి చేరుకున్నారనే అంశంపై సీసీ కెమెరాలను పరిశీలించారు. విజయవాడ దుకాణం వద్ద నుంచి కెమెరాలను పరిశీలించిన పోలీసులు 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ఇద్దరు వ్యక్తులు నాగరాజును వెంబడించినట్లు గుర్తించి వారిని అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. దీంతో అసలు చోరీ జరిగిందా లేదా అనే అంశంతో పాటు చోరీ జరిగిన రోజున దుకాణంలో ఐదు కేజీల బంగార ఆభరణాలున్నాయా.. ఆభరణాలు తయారు చేయించుకున్న దుకాణదారులు, కస్టమర్లు ఎవరు అనే కోణంలోను దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీష్ కుమార్ -
విద్యుత్ నెట్ వర్క్లో ఏఐ ఆధారిత పరిష్కారాలపై సదస్సు
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎనర్జీ డిస్ఎగ్రిగేషన్ ఏఐ బేస్డ్ సొల్యుషన్ మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ అంశంపై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యవక్తగా సౌత్ కొరియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రామ్మోహన్ మల్లిపెద్ది హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎనర్జీ డిస్ఎగ్రిగేషన్ పద్ధతి అంటే కరెంట్ మీటర్ నుంచి కరెంటు పరికరాల శక్తి వినియోగాన్ని వేరు చేసే ఓ టెక్నిక్ అని తెలిపారు. శక్తి వినియోగంలో ఆధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ ఉపయోగించి ఉపకరణాల వినియోగాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించవచ్చని దాని ద్వారా ఉపకరణాల పనితీరును మెరుగుపరుచుకోవడం శక్తి వినియోగాన్ని తగ్గించుకోవడం చేయవచ్చన్నారు. ఉపకరణాల వినియోగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా పనితీరుకు సరిపడా శక్తిని అందించబడుతుందని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ ఏవీ సరేష్ బాబు, డాక్టర్ సీహెచ్ నాగసాయి కళ్యాణ్ పాల్గొన్నారు. -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు
రూ.2.40 లక్షల విలువైన 24 కిలోల గంజాయి పట్టివేత నగరంపాలెం: ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలులో సోమవారం ట్రైనీ ఐపీఎస్ దీక్ష, జిల్లా ఏఎస్పీ కె. సుప్రజ (క్రైం)తో కలిసి కేసు వివరాలను ఆయన తెలిపారు. గుంటూరు రూరల్ మండలం శివారెడ్డిపాలెం పోలేరమ్మ గుడి సమీపాన ఉంటున్న దమ్మాలపాటి మణికంఠ ఏడో తరగతి వరకు చదివాడు. చెడు అలవాట్లకు బానిసయ్యాడు. బేల్దారి పనులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్గా వెళ్లేవాడు. గతేడాదిలో వైజాగ్ వెళ్లి, తిరుగు ప్రయాణంలో తునిలో దిగి, గంజాయి ఎక్కడ విక్రయిస్తారని వాకబు చేశాడు. అనంతరం విశాఖపట్నం జి.మడుగు మండలం పెద్ద కిల్తారికి చెందిన చింతల సత్యనారాయణ అలియాస్ సతీష్తో పరిచయమైంది. దీంతో రూ.10 వేలకు రెండు కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. అక్కడ నుంచి ప్రతిసారి బస్లో వెళ్లి, రైళ్ల ద్వారా గుంటూరుకు గంజాయి తెచ్చేవాడు. యాభై గ్రాములు సంచులను రూ.500కు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట చింతల సత్యనారాయణకు ఫోన్ చేసి భారీగా గంజాయి కావాలని అడిగాడు. దీంతో సత్యనారాయణ భార్య చింతల పద్మ 24 కిలోల గంజాయిని సోమవారం మణికంఠ నివాసానికి తీసుకువచ్చింది. ముందస్తు సమాచారంతో మణికంఠను, చింతల పద్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.40 లక్షల ఖరీదు చేసే 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సతీష్ను త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. -
కాజ టోల్ ప్లాజాను రద్దుచేయాలి
మంగళగిరి టౌన్: మంగళగిరి– తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని అధిక టోల్ఫీజు వసూలు చేస్తున్న కాజ టోల్ప్లాజాను వెంటనే రద్దు చేయాలని ప్రయాణికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బాల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు కోరారు. మంగళగిరి నగర పరిధిలోని ప్రెస్క్లబ్లో సోమ వారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కాజ టోల్గేట్ వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 79 కిలోమీటర్ల దూరంలో టోల్ప్లాజా ఉండకూడదని దీనిపై లారీ ఓనర్స్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో రూ.150 ఉండే టోల్పాస్ ఇప్పుడు రూ.340 చేశారని దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న ఈ టోల్గేటును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. -
ట్రాక్టర్ అడ్డుపెట్టి దౌర్జన్యం
బల్లికురవ: కూటమి ప్రభుత్వంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. గ్రామ పంచాయతీ రోడ్డుపై ఏకంగా ట్రాక్టర్ అడ్డుపెట్టి రాకపోకలకు ఇబ్బందులు సృష్టించారు. ఫిర్యాదు చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వారి ‘పచ్చ’పాతానికి నిదర్శనంగా మారింది. ●వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అంబడిపూడి గ్రామ పంచాయతీలోని చిన అంబడిపూడి గ్రామంలోని బీసీ కాలనీలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సర్పంచ్ మందలపు శ్రీలక్ష్మి, బుజ్జి ఆనందరావు ఇంటినుంచి పల్లపు రామకృష్ణారావు ఇంటివరకు సిమెంట్ రోడ్డు వేశారు. నిధుల లేమితో సైడు కాలువల పనులు నిలిచాయి. ఈ రోడ్డులోని టీడీపీ నాయకుడు మన్నం శ్రీను తన ఇంటిముందుకు మురుగు నీరు వస్తుందంటూ రోడ్డుపై మట్టికుప్పలు తోలి రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ ట్రాక్టర్ను అడ్డుపెట్టాడు. దీంతో స్థానికంగా ఉండే బాధితులు పల్లపు రామకృష్ణారావు, వెంకటరావు, వెంకటరమణ, శారద, మహేష్బాబులు ఇప్పటికే రెండు పర్యాయాలు గ్రీవెన్స్లో తహసీల్దార్ రవినాయక్కు, ఎంపీడీఓ కుసుమ కుమారికి ఫిర్యాదు చేశారు. ఇదంతా మనుసులో పెట్టుకున్న మన్నం శ్రీను నాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ గొడవలకు దిగడంతో ఫిర్యాదుదారులు ఐదుగురితో పాటు మన్నం శ్రీను ఆయన భార్య భూలక్ష్మిని జనవరి 23న తహసీల్దార్ వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా బైండోవర్ చేశారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదని తమ ఇంటి ముందు రోడ్డులో నడిచి వెళ్లలేకపోతున్నామని బాధితులు వాపోయారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని రోడ్డుకు పెట్టిన అడ్డంకులను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు తొలగించాలని బాధితులు కోరుతున్నారు. రాకపోకలకు తీవ్ర ఆటంకం బల్లికురవ మండలం అంబడిపూడి గ్రామంలో టీడీపీ నేత దాష్టీకం -
కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
కారంచేడు: వ్యవసాయ పనుల నిమిత్తం తమ యజమాని పొలంలోని ధాన్యం బస్తాలను ఇంటికి తోలేందుకు కూలీలతో పొలానికి బయలుదేరిన వ్యక్తి అకాల మరణం చెందాడు. కారంచేడు ఎస్ఐ వి.వెంకట్రావు, ప్రతక్ష్య సాక్షుల వివరాల మేరకు.. మండల కేంద్రం కారంచేడు అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన గర్నెపూడి పోతురాజు (51) సోమవారం తమ యజమాని ఇంటి నుంచి ట్రాక్టర్ తీసుకొని వ్యవసాయ కూలీలతో ధాన్యం బస్తాలు తీసుకురావడానికి పొలానికి బయలుదేరాడు. వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో కల్యాణ మండపం ఎదురుగా ఉన్న రొంపేరు కాలువపై నిర్మించిన వంతెన ఎక్కే క్రమంలో అదే వంతెనపై ఎదరుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పింది. దీంతో ఒక్కసారిగా కాలువలోని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ట్రాలీలో ఉన్న వ్యసాయ కూలీలు చాకచక్యంగా కిందికి దూకేశారు. ఇంజిన్లో ఉన్న పోతురాజుకు కిందకు దూకే అవకాశం లేక నీళ్లలో పడిపోయాడు. నీటిలో ఉన్న పోతురాజును వ్యవసాయ కూలీలు బయటకు తీశారు. అక్కడకు చేరుకున్న మరికొందరితో కలసి సీపీఆర్ చేశారు. 108 వాహనాన్ని పిలిపించి వెంటనే చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పోతురాజు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య లూర్ధు, కుమారులు ఏసు రాజు, గాబ్రియేలు ఉన్నారు. కంటతడి పెట్టించిన మృతుడి భార్య రోదన కూలి పనులు చేసుకుంటే గాని పూట గడవని పేద కుటుంబం పోతురాజుది. అనారోగ్యంతో ఉన్న భార్యను చిన్నచిన్న పనులకు మాత్రమే పంపించేవాడు. తానే అన్నీ అయి బిడ్డలను చదివించుకుంటూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పోతురాజు మృతితో కుటుంబ సభ్యులు దిక్కులేనివారయ్యారు. మాకు దిక్కెవరయ్యా అంటూ మృతుడి భార్య లూర్ధు రోదిస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది. డ్రైవర్ మృతి, ఐదుగురు కూలీలకు గాయాలు కారంచేడులో రొంపేరు కాలువ వద్ద ఘటన -
పోలీసుల తీరుతో ఆత్మహత్యాయత్నం
జె.పంగులూరు: పోలీసుల వేధింపులు భరించలేక వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడైన కొడుకు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా ఆ డబ్బా లాక్కొని తల్లి తాగిన ఘటన బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం అలవలపాడులో సోమవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం మేరకు.. రెండేళ్ల క్రితం అలవలపాడు గ్రామానికి చెందిన షేక్ ఇమామ్, అతని భార్య సల్మా కుటుంబ కలహాలతో విడిపోయారు. వారికి 18 నెలల పాప ఉంది. షేక్ ఇమామ్ తన భార్య తనవద్దకు రావాలని పెద్ద మనుషులను పిలిపించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చట్టపరంగా విడాకులు కావాలని కోరాడు. దీంతో సల్మా తనను గృహహింస చేస్తున్నారంటూ భర్త, అత్త మరికొందరిపై రేణింగవరం స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇమామ్ కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా ఉండేవారు. ఈ కేసును ఆసరాగా చేసుకుని కొందరు టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తేవడంతో ఇమామ్ కుటుంబంతో సంబంధం లేని మరో తొమ్మిది మందిపై రేణింగవరం ఎస్ఐ వినోద్బాబు 498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రతి రోజూ తొమ్మిది మందిని ఎస్ఐ స్టేషన్కి పిలిపించి వేధిస్తున్నారు. అంతటితో ఆగకుండా సోమవారం ఎస్ఐ తనతో దురుసుగా ప్రవర్తించారని, ‘నీ భార్య బంగారం ఆమెకు ఇచ్చేయి. లేకుంటే నీపై దొంగతనం కేసు నమోదు చేస్తా.. నీ కుటుంబాన్ని రోడ్డు కీడుస్తా..బంగారాన్ని సీజ్ చేస్తా.. జీవితంలో బయటకు రాకుండా చేస్తా..’ అంటూ దురుసుగా మాట్లాడాడని బాధితుడు ఇమామ్ వాపోయాడు. ఎస్ఐ మాటలు భరించలేక పురుగుల మందు తాగి చనిపోదామని తెచ్చుకుంటే.. ఆ మందు డబ్బాను లాక్కొని ఇమామ్ తల్లి గాలీబ్బీ తాగింది. ఆమెను హుటాహుటిన అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయంలో ప్రమేయం లేని తన చెల్లెలిని పసిపిల్ల తల్లి అని కూడా చూడకుండా రాత్రిళ్లు స్టేషన్కు పిలిపించి టార్చర్ పెడుతున్నారని బాధితుడు కన్నీటిపర్యంతం అయ్యాడు. ఈ విషయమై ఎస్ఐను వివరణ కోరగా దంపతుల మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఇద్దరినీ పిలవగా, సల్మా స్టేషన్కు వచ్చేందుకు ఇష్టపడటం లేదని, కోర్టులో ఈ వ్యవహారం తేల్చుకోమని చెప్పడం మాత్రమే జరిగిందని తెలిపారు. కొడుకు చేతిలోని పురుగుల మందు డబ్బా లాక్కొని తాగిన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, ఇద్దరికి గాయాలు మార్టూరు: దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ఇంటికి చేరకుండానే ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈఘటన మార్టూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. హైవే అంబులెన్స్ సిబ్బంది రవి, స్థానికుల వివరాల మేరకు.. జూలూరు శ్రీకృష్ణ (40), జూలూరు వంశీకృష్ణ, కె.వివేక్లు తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి నూజివీడుకు కారులో బయలుదేరారు. సరిగా ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో స్థానిక దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి మొదట ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి అనంతరం డివైడడ్ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు తీవ్రంగా ధ్వంసం కాగా అందులో ఉన్న ముగ్గురిలో జూలూరు శ్రీకృష్ణ (40) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మిగిలిన వంశీకృష్ణ, వివేక్లు గాయాలతో బయటపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
విజ్ఞాన్లో డ్రోన్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో డ్రోన్ టెక్నాలజీ సెంటర్(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ అటానమస్ సిస్టమ్స్)ను హైదరాబాద్లోని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.విద్యాసాగర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సెంటర్ వలన విద్యార్థులకు డ్రోన్్ డిజైన్, ప్రోగ్రామింగ్, డ్రోన్ల వినియోగంపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. టెక్నాలజీలో హ్యాండ్స్– ఆ అనుభవం కల్పించేందుకు ల్యాబ్ సౌకర్యాలు, విద్యాపరమైన కోర్సులు, వర్క్షాప్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ, ఆటోనమస్ నావిగేషన్, రిమోట్ సెన్సింగ్పై ప్రత్యేక కోర్సులను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. విద్యార్థులకు పరిశ్రమ నిపుణులతో వర్క్షాప్లు, సెమినార్లు, అతిథి ఉపన్యాస కార్యక్రమాలను ఏర్పా టు చేస్తామన్నారు. విద్యార్థులకు కొత్త డ్రోన్ ఆధారిత స్టార్టప్లను ప్రారంభించేందుకు మద్దతు అందిస్తామని వివరించారు. పరిశ్రమలతో కలిసి కొత్త డ్రోన్న్ సొల్యూషన్న్ల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. డ్రోన్న్టెక్నాలజీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో సహకారానికి తోడ్పాటుపడతా మని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. డ్రోన్న్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్పై పోటీలు నిర్వహించడం, డ్రోన్పై పై కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్ మాట్లాడుతూ ఈ డ్రోన్ టెక్నాలజీ సెంటర్ను హైదరాబాద్లోని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ప్రై వేట్ లిమిటెడ్ మరియు విజ్ఞాన్ యూనివర్సిటీల సంయుక్త ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ పాల్గొన్నారు. -
సర్వేను అడ్డుకున్న పచ్చమూకలు
కొల్లూరు: టీడీపీ వర్గీయులు అడ్డగింత కారణంగా వివాదాస్పదంగా మారిన నడకదారి హద్దుల వ్యవహారం సర్వే జరగకుండానే నిలిచిపోయింది. మండలంలోని జువ్వలపాలెం శివారు గుంటూరుగూడెంలో టీడీపీకి చెందిన పక్క పొలం రైతు తన పంట పొలంలోని మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి బలవంతంగా తన భూమిని ఆక్రమించుకున్నాడని మారీదు ప్రసాద్ అనే రైతు ఆరోపించాడు. గుంటూరుగూడెంకు చెందిన రైతు ప్రసాద్ ఈ వ్యవహారంపై రెవెన్యూ యంత్రాంగంను సైతం సంప్రదించి సర్వే చేయించి న్యాయం చేయాలని అప్పట్లోనే వినతి పత్రం రూపంలో మొరపెట్టుకున్నాడు. ఈనెల 4న ‘సాక్షి’లో ‘పేద రైతుపై దౌర్జన్యకాండ’ శీర్షికతో కథనం సైతం వెలువడింది. సమస్యను పరిష్కరించేందుకు బాధిత రైతును ప్రభుత్వ సర్వేకు దరఖాస్తు చేసుకోవాలని కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు సూచించడంతో వారు అధికారిక సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రవేటు సర్వేయర్లతో టీడీపీకి చెందిన నాయకుడు వేములపల్లి రవికిరణ్ కొలతలు కొలిపించి తనపై దౌర్జన్యానికి పాల్పడి తమపై దాడి చేయించి పొలం ఆక్రమించుకోవడంతోపాటు, నష్టం కలిగించారన్న బాధితుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ప్రభుత్వ సర్వేయర్లు కొలతలు సేకరించాలని ఆదేశించడంతో సోమవారం కొలతల ప్రక్రియ కోసం సర్వేయర్లు వివాదాస్పద భూమి వద్దకు వెళ్లారు. ఈనేపథ్యంలో బాధిత రైతులు తమ వద్దనున్న పత్రాలను అందజేసి దాని ప్రకారం తమ హద్దులు నిర్ణయించాలని సర్వేయర్లను కోరారు. టీడీపీ నాయకుడు వర్గీయులు మాత్రం మొత్తం భూమికి కొలతలు సేకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, బాధిత రైతు పేర్కొంటున్న 2 సెంట్ల భూమి తమకు చెందినదని కొలతల సేకరణను అడ్డగించారు. ఒక దశలో బాధిత రైతుల పక్షాన నిలిచి సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపైన సైతం దురుసుగా వ్యవహరిస్తూ వివాదం సృష్టించారు. దీంతో భూమి హద్దులు నిర్ధారించేందుకు వెళ్లిన సర్వేయర్లు టీడీపీ నాయకులు వివాదంలో ఉన్న 2 సెంట్ల భూమి కొలిసేందుకు ఒప్పుకునేది లేదని పట్టుపట్టడంతో సాయంత్రం వరకు వేచి చూసి వెనుతిరిగారు. బాధిత రైతు పక్షాన వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు సుగ్గున మల్లేశ్వరరావు వివాదాస్పదమైన భూమి వద్దకు వెళ్లి కొలత ప్రక్రియ చట్టబద్ధంగా నిర్వహించాలని సర్వేయర్లను కోరారు. నడకదారి వివాదంలో ప్రభుత్వ సర్వే అడ్డగింత కొలతలు సేకరించవద్దంటూ పట్టు రికార్డుల ప్రకారం కొలతలు సేకరించాలని పేద రైతు మొర ఇరు వర్గాల నడుమ వివాదంతో సర్వే నిలిపివేసిన యంత్రాంగం లింక్ డాక్యుమెంట్లతో సమస్య పరిష్కరిస్తాం నడక దారి వివాదంలో తన వద్ద ఉన్న పత్రాల మేరకు 1.06 సెంట్లకు కొలతలు నిర్వహించి హద్దులు నిర్వహించాలని బాధిత రైతు సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పక్క రైతు సైతం తమ పత్రాల మేరకు ఆభూమి తమ కు చెందుతుందని వెల్లడించడంతో కొలతల సేకరణను నిలుపుదల చేయాల్చి వచ్చింది. ఆ భూములకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను సైతం తీసుకురావాలని ఇరుపక్షాలకు సూచించి తిరిగి కొలతలు నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. –బి. వెంకటేశ్వర్లు, తహసీల్దార్, కొల్లూరు. -
‘ప్రకృతి’తో ఆరోగ్యకర పంటలు
ప్రకృతి వ్యవసాయం జిల్లా అడిషనల్ డీపీఎం మోహన్ యద్దనపూడి: ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వనరులను వినియోగించుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ప్రకృతి వ్యవసాయశాఖ అడిషనల్ డీపీఎం మోహన్ అన్నారు. సోమవారం మండలంలోని పూనూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్పీఎం (పురుగు మందులు లేని వ్యవసాయం) దుకాణం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విచక్షణ రహితంగా ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల ప్రస్తుతం భూసారం క్షీణించి గాలి, నీరు కలుషితమవటంతో పాటు ప్రజలు అనారోగ్యంతో బాధపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని నివారణకు ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంభించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఇంటిలో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్నారు. ఎన్ఎఫ్ఏ శ్రీనివాసరావు, ఎన్పీఎం మాస్టర్ ట్రైనర్ భీమరాజులు మాట్లాడారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తయారు చేసిన కషాయాలను పరిశీలించారు. మాస్టర్ ట్రైనర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి మేరమ్మ, హోమియో వైద్యాధికారి గుర్రం అంజమ్మ, మండల సమైఖ్య అధ్యక్షురాలు బత్తుల కృష్ణవేణి, ఎల్టూలు వెంకటరత్నం, కోటిబాబు, మోడల్ మేకర్ నాగరాజు, ఐసీఆర్పీలు, రైతులు పాల్గొన్నారు. -
జీబీ సిండ్రోమ్పై అవగాహన కల్పించండి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: గులియన్ బ్యారి(జీబీ) సిండ్రోమ్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ వ్యాప్తిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపట్టిన అభా కార్డుల నమోదు ప్రక్రియ, జీబీ సిండ్రోమ్ వ్యాధి వ్యాప్తిపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో సమావేశం నిర్వహించారు. ప్రాణాంతకమైన జీబీ సిండ్రోమ్ వ్యాధికి జిల్లా వాసులు గురిగాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలోని విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. బ్యాక్టీరియా సోకి వ్యాధిగ్రస్తులైన వారికి ప్రభుత్వం ప్రత్యేక వైద్యం అందిస్తుందని కలెక్టర్ చెప్పారు. గుంటూరు జీజీహెచ్లో, ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్లో ప్రత్యేక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అభా కార్డుల నమోదు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. జిల్లాలో కిడ్నీ డయాలసిస్ కేసులు 1010 ఉన్నాయని, నూతనంగా డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు తక్షణమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.చేనేతల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాలి.. బాపట్ల: చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. చేనేత కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులతో సోమవారం స్థానిక కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ముద్ర పథకం కింద చేనేత కుటుంబాలకు చేయూత అందించేందుకు 1,044 మందికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకు 76 మందికి మాత్రమే ఆయా బ్యాంకుల ద్వారా రుణాలు అందాయని తెలిపారు. జిల్లాలో చీరాల, వేటపాలెం, భట్టిప్రోలు, చెరుకూరు, రేపల్లె, మార్టూరు మండలాల్లో నేత కార్మికుల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, వీరిని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు, ఎల్డీఎం కలసి వ్యక్తిగతంగా వెళ్లి వారితో చర్చించి రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు నాగమల్లేశ్వరరావు, ఎల్డీఎం శివకృష్ణ, డీఆర్డీఏ పీడీ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి
తాడికొండ: చిన్నారులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించే టీకాలు సకాలంలో వేయించేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్ బాబు అన్నారు. సోమవారం తుళ్లూ రు పీహెచ్సీని సందర్శించిన ఆయన వైద్య బృందంతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిన్నారులకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఏఏ టీకాలు ఏ సమయంలో వేయించాలి అనే విషయంపై స్పష్టంగా అవగాహన కల్పించాలని కోరారు. టీకాలకు సంబంధించిన సమాచారాన్ని యు విన్ పోర్టల్లో అప్లోడ్ చేసే విధానాన్ని వివరించారు. గ్రామాల్లో సీడీఎన్సీ సర్వే చేసి ప్రతి గ్రామంలోని కుటుంబాలకు ఐడీ నంబర్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు డి.శ్రీనివాస్, వసుంధర, శివపార్వతీ, సీహెచ్ఓ వెంకట రమణ, ఎంఎస్ రాణి, పర్యవేక్షకులు సుధాకర్, డీఎస్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ కరీమ్ పాల్గొన్నారు.