Bapatla District Latest News
-
బాపట్ల జిల్లాలో 14 సిలిండర్లు స్వాధీనం
నగరంపాలెం: గృహ ఎల్పీజీ సిలిండర్లను వినియోగించే వ్యాపార దుకాణాలు, హోటళ్లల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండల పరిధిలోని గొల్లపాలెం రోడ్డులో ఉన్న బాలాజీ మెస్లో ఆరు సిలిండర్లు, మసీద్ సెంటర్లోని మస్తాన్ బాబా ముబారక్ హోటల్లో ఎనిమిది గృహ ఎల్పీజీ సిలిండర్లను గుర్తించారు. అక్రమంగా వినియోగిస్తున్న 14 సిలిండర్లను స్థానిక డిప్యూటీ తహసీల్దార్కు అప్పగించారు. ఆయా హోటళ్ల యాజమానులపై రెండు 6–ఎ కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్న్స్, పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. కర్లపాలెం: చేపలవేటకు వెళ్లి వలకు చిక్కుకుని ఓవ్యక్తి మృతిచెందిన సంఘటన కర్లపాలెం మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... కర్లపాలెం పంచాయతీ పరిధిలోని లంక కాలువ కట్టపై నివసిస్తున్న అద్దూరి వెంకటరావు(50) యాజలి రెవెన్యూ పరిధిలోని తుంగభద్ర కాలువపై ఉన్న గుడిపూడి వంతెన వద్ద చేపల వేటకు దిగి కట్టువలకు చిక్కుకుని ఊపిరాడక మృతిచెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య సముద్రాలు కుమారుడు శివనాగరాజు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ–2023 బ్యాచ్లో ఎంపీడీఓగా ఎంపికై కొల్లూరు మండలంలో పోస్టింగ్ పొందిన అమర్తలూరి స్పందనకు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మంగళవారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, డెప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, ఏఓ జె.పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు. గుంటూరు లీగల్: పెదకాకాని పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన హుండీలోని కానుకలు లెక్కింపు సమయంలో కొంత సొమ్ము చోరీకి గురైంది. మల్లేశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ రఘునందనరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ గౌస్ నిందితురాలైన తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీరావమ్మకు మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించారు. ఈ కేసుకు సకాలంలో సాక్ష్యాధారాలను అందించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై.వినోద్కుమార్ కోర్ట్ కానిస్టేబుల్ కే.ప్రేమ్కుమార్కు సంబంధిత అధికారులు అభినందనలు తెలిపారు. కేసు లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి మురళీకష్ణ వాదనలు వినిపించారు. రెంటచింతల: మండలంలోని పాలువాయిగేటు గ్రామ సమీపంలో ఉన్న టోల్ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడకక్కడే మృతిచెందాడు. పాతపాలువాయికి చెందిన ఇండ్లచెరువు పుల్లారావు(28) జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మాచర్ల నుంచి రెంటచింతల వైపు వెళ్తున్న వాహనం పుల్లారావును ఢీ కొట్టి ఉంటుందని ఆ ప్రాంతంలో వాహనానికి సంబంధించిన అద్దాలు ఉండటంవలన అనుమానిస్తున్నారు. పుల్లారావు భార్య కోటేశ్వరితో కొంతకాలంగా మనస్పర్థలు ఉన్న నేపథ్యంలో ఆమె కొత్తపల్లి గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఘటన వివరాలు తెలుసుకున్న ఎస్ఐ సీహెచ్ నాగార్జున ప్రమాద స్థలానికి చేరుకుని విచారించారు. భార్య కోటేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
బాపట్ల అభివృద్ధి ఊసేలేని కూటమి ప్రభుత్వం
బాపట్ల: బాపట్ల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సంఘ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లులా ముందుకుపోతున్నామని చెప్పే నాయకులు ఎక్కడ, ఏవిధమైన అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో బాపట్ల ప్రాంతాభివృద్ధి మరో పదేల్లుపాటు వెనక్కిపోయిందన్నారు. పేదోళ్లకు అవసరమైన మెడికల్ కళాశాలను బాపట్ల నిర్మించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కృషి చేస్తే కూటమి ప్రభుత్వం మోకాలు అడ్డుపెట్టి చోద్యం చూస్తోందని చెప్పారు. ఇప్పటికై న కూటమి ప్రభుత్వం పేదోళ్లకు అందే వైద్య సేవలు అడ్డుకునే కార్యక్రమాలు మానుకోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు తన్నీరు అంకమ్మరావు, కటికల మోషే, పాల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
విశ్రాంత ఉద్యోగులకు అండగా పోలీస్శాఖ
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావుబాపట్లటౌన్: ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు పోలీస్శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం చీరాల వన్ టౌన్ ఏఎస్ఐ ఎం.ముస్తఫా ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్శాఖలో 33 సంవత్సరాలపాటు విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన ముస్తఫా దంపతులను సన్మానించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో సైతం సమర్ధవంతంగా విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. గతంలో నక్సల్స్ ఉద్యమం ముమ్మరంగా ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, నిర్వహించిన విధుల గురించి ముస్తఫా తన అనుభవాలను వెల్లడించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని అన్నారు. నిబద్ధతతో విధులు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అందించిన సహకారం వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ ఆర్.ఐ మౌలుద్దీన్, చీరాల ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ పవన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం.. మాయాజాలం!
బాపట్టబుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ప్రజలను మత్తుతో చిత్తు చేస్తున్న చంద్రబాబు సర్కార్ – ఎస్.శ్రీనివాసులు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ, చీరాల వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో తగ్గుతున్న విక్రయాలు పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు జోరుగా ఎన్డీపీ లిక్కర్ విక్రయాలు పలుచోట్ల నకిలీ మద్యం కూడా అమ్మకం నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కొనకంచి లక్ష్మయ్య, కుమారి దంపతులు రూ.1.01,116 విరాళంగా అందజేశారు. -
రెవెన్యూ అధికారుల బాధ్యతలు కీలకం
బాపట్ల: నిషేధిత భూముల జాబితాలో పెండింగ్ ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోదకుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీసీ హాలులో 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించే ప్రక్రియపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిషేధిత జాబితాలో పొరపాటున చేర్చబడిన భూములను గుర్తించి, సరైన ఆధారాలతో త్వరితంగా తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించడం, భూమి యజమానులకు హక్కు కల్పించాలన్నారు. గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు 410 అర్జీలు వచ్చాయన్నారు. అందులో 44 అర్జీలకు సంబంధించిన భూములను తొలగించి, భూమి యజమానులకు యాజమాన్య హక్కు కల్పించామన్నారు. కొన్ని మండలాలలో పూర్వ జిల్లాలు గుంటూరు, ప్రకాశం జిల్లాల పేర్లు ఉన్నాయని వెంటనే తొలగించి బాపట్ల జిల్లా పేరు రాయాలని తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా స్థాయి కమిటీలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, చీరాల, బాపట్ల ఆర్డీఓలు చంద్రశేఖర్, బి.శ్రీదేవి, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, అనుబంధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. అట్రాసిటీ కేసులలో బాధితులకు పరిహారం అందేలా చర్యలు అట్రాసిటీ కేసుల్లో బాధితులకు చెల్లించాల్సిన పరిహారం, ఉద్యోగాలు, ప్రత్యేక పింఛన్లు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో లేవనెత్తిన సమస్యల పరిష్కారంపై పురోగతిని పరిశీలించిన కలెక్టర్, జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రస్తావించిన అంశాలను శ్రద్ధగా విన్నారు. బాధిత కుటుంబాలకు అందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రత్యేక పింఛన్ల అంశాలపై ప్రత్యేకంగా చర్చించి, ఇప్పటికే కొన్ని కేసుల్లో పింఛన్ల మంజూరు పూర్తయ్యిందని తెలిపారు. మిగిలిన కేసుల్లో కూడా ఆలస్యం లేకుండా పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సింగయ్య, చీరాల, రేపల్లె ఆర్డీవోలు చంద్రశేఖర్, శ్రీదేవి, డీఎంహెచ్వో విజయమ్మ, పొలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వేము భగవాన్దాస్, ఆల్ఫ్రెడ్ రాజా, సల్మాన్, మిల్టన్ లూథర్ శాస్త్రి, కే వెంకట ప్రసాద్, డి.పోతురాజు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ఈవీఎం గోదాములు, వీవీ ప్యాట్స్ గోదాముల త్రైమాసిక పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. గోదాములకు సీల్ వేసిన తాళాలు, సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును, భద్రతా సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. గోదాములను తెరిచి లోపల ఉన్న గదులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్గౌడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, బీజేపీ నాయకులు రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు దోనేపూడి రవి, సీపీఐ నాయకులు గంగయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బాలాజీరెడ్డి, బీఎస్పీ నాయకులు రాజారావు పాల్గొన్నారు. -
స్వర్ణ గ్రామ కార్యాలయానికి టీడీపీ నేతలు తాళాలు
కొల్లూరు : స్వర్ణ గ్రామ కార్యాలయానికి టీడీపీలోని ఓ వర్గం నాయకులు తాళాలు వేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... మండలం లోని క్రాప స్వర్ణ గ్రామ కార్యాలయం స్వీపర్ శుభ్రం చేసి తలుపులకు గడియ పెట్టి వెళ్లాడు. పంచాయతీ సెక్రటరీ కార్యాలయంలో ఉండగా టీడీపీలోని ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కార్యాలయానికి తాళాలు వేశారు. క్రాప గ్రామంలోని ఓ చెరువు వ్యవహారంలో టీడీపీకి చెందిన వర్గాల మధ్య వివాదం నడుస్తుంది. మంగళవారం చెరువు కొలతలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో కోర్టులో కేసు నడుస్తుండగా కొలతలు ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీకి చెందిన మరో వర్గం వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్వర్ణ గ్రామ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. చెరువు వ్యవహారం కోర్టులో ఉండగా పంచాయతీ కార్యదర్శి ఓ వర్గానికి కొమ్ముకాస్తూ తమకు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వర్గానికి చెందిన కుటుంబం ఇచ్చిన స్థలంలో నిర్మించిన కమ్యూనిటీ భవనంలో స్వర్ణ గ్రామ కార్యాలయం తొలగించాలంటూ కార్యాలయానికి తాళాలు వేశారు. కార్యాలయానికి తాళాలు వేసి ఉండడాన్ని చూసి సిబ్బంది అవాక్కయ్యారు. కొద్ది సమయం అనంతరం కార్యాలయానికి వేసిన తాళాలను పగలగొట్టి తలుపులు తెరసి సిబ్బంది విధులు నిర్వహించారు. -
వర్సిటీ బడ్జెట్కు ఆమోదముద్ర
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 90వ అకడమిక్ సెనేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్సిటీలోని డైక్మెన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో సోమవారం సాయంత్రం జరిగిన పాలకమండలి, ఫైనాన్స్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. నూతనంగా ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్సుకు, బీటెక్లో స్పేస్ టెక్నాలజీ కోర్సులను 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సెనేట్ ఆమోదం తెలిపింది. ఏఎన్యూ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ విజయోత్సవాలను నిర్వహించాలని పలువురు మాజీ వీసీలు సూచించారు. 50 ఏళ్లకు గుర్తుగా ఒక ప్రత్యేక నిర్మాణం చేపట్టాలని చర్చించారు. లైబ్రేరియన్ ఆచార్య వెంకట్రావ్ మాట్లాడుతూ అధ్యాపకులు తన పరిశోధన పత్రాలను వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్లో నమోదు చేసుకుంటే పబ్లిక్కు అయ్యే ఖర్చులను ఆ సంస్థ భరిస్తుందన్నారు. సమావేశానికి హాజరైన మాజీ వీసీ ఆచార్య హరగోపాల్రెడ్డి పెన్షనర్లకు బకాయిలు విడుదల చేయాలన్నారు. మాజీ వీసీ ఆచార్య వియన్నరావు మాట్లాడుతూ ఏఎన్యూ రీసెర్చ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందేందుకు అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విశ్రాంత వీసీ బాలమోహన్దాస్ మాట్లాడుతూ ఏఎన్యూ 50 ఏళ్ల సందర్భంగా ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కోరాలని సూచించగా మాజీ వీసీ ఆచార్య రాఘవులు ఐకానిక్ భవనం నిర్మాణం చేపట్టాలని కోరారు. మాజీ వీసీ ఆచార్య ఎల్.వేణుగోపాల్రెడ్డి మాజీ ప్రొఫెసర్ సేవలను వర్సిటీ వాడుకోవాలన్నారు. మాజీ వీసీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 50 ఏళ్ల వేడుకకు నోబెల్ విన్నర్లను తీసుకురావాలన్నారు. అనంతరం బడ్జెట్కు ఆమోదముద్ర వేశారు. ఇన్చార్జి వీసీ గంగాధరరావు వర్సిటీ నివేదికను వివరించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్, రిజిస్ట్రార్ జి.సింహాచలం, పాలకమండలి సభ్యులు వెంకటేశ్వరరావు, షాహేదా అక్తర్, సుమంత్ కుమార్, జగదీష్ నాయక్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్ రత్నషీలామణి పాల్గొన్నారు. కఠిన చర్యలు.. దూరవిద్య కేంద్రం నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన ఆరోపణలపై వర్సిటీ ఉన్నతాధికారులు నియమించిన ప్రత్యేక తనిఖీ బృందం కమిటీ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని దూరవిద్య పరీక్షల విభాగం కో–ఆర్డినేటర్ డి.రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ తనిఖీ బృందం (స్క్వాడ్) సమర్పించిన నివేదికలో పొందుపరిచిన అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళాశాలలకు చెందిన విద్యార్థుల పరీక్ష ఫలితాలను తాత్కాలికంగా విత్హెల్డ్లో ఉంచుతున్నామన్నారు. ఇంపర్సనేషన్ (ఇతరుల స్థానంలో పరీక్ష రాయడం), మాల్ప్రాక్టీస్ వంటి అక్రమాలకు పాల్పడిన విద్యార్థులపై వర్సిటీ నిబంధనలకు అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తనిఖీ బృందం నివేదికలో సూచించిన ఆరోపణలు ఉన్న పలు పరీక్ష కేంద్రాలను భవిష్యత్లో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వబోమని, అవసరమైతే వాటి అనుబంధాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికే సమర్పించిన నివేదికలో కొన్ని అంశాలు అసంపూర్తిగా ఉన్నందున, సంబంధిత కమిటీ నుంచి పూర్తి వివరాలను మరోసారి సేకరించడం జరుగుతుందని వివరించారు. అనంతరం మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు దూరవిద్యాకేంద్రం పరీక్షా విభాగం కో–ఆర్డినేటర్ ఆచార్య రామచంద్రన్ తెలిపారు. -
తహసీల్దార్ కృష్ణకాంత్
పెదకాకాని: గ్రామానికి చెందిన బెజవాడ సాంబయ్య, విజయలక్ష్మి దంపతులకు నలుగురు కొడుకులు ఉండగా చిన్న కుమారుడు బెజవాడ కృష్ణమూర్తి మాత్రమే సంతానం అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చిన మాట వాస్తవమేనని తహసీల్దార్ పి.కృష్ణకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘సాక్షి’ లో మంగళవారం రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం పేరుతో కథనం ప్రచురితమైంది. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్(ఎఫ్ఎంబీ) నా హయాంలో ఇవ్వలేదు, గతంలో ఇక్కడ పనిచేసిన పెల్లూరి రత్నం అనే తహసీల్దార్ విచారించి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ ఎఫ్ఎంబీ ఆధారంగా బెజవాడ కృష్ణమూర్తి తన తల్లి పేరిట ఉన్న 38 సెంట్ల భూమికి 1బీ, అడంగల్, పాస్ పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఆ దరఖాస్తును విచారించి బెజవాడ కృష్ణమూర్తి, మరో ఇద్దరు అని ఉదహరిస్తూ 38 సెంట్లకు హక్కు కల్పించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. గురజాల: వీఆర్ఏల డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బదంగి సాహెబ్ డిమాండ్ చేశారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద మంగళవారం వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పే స్కేల్ జీతాలు అమలు చేయాలని, వన్టైమ్ సెటిల్మెంట్ ద్వారా వీఆర్వో, రికార్డు అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచ్మెన్ పోస్టులకు భర్తీ చేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీతాలు పెరుగుతాయని, ప్రమోషన్లు వస్తాయని ఆశించామని.. కానీ నేడు ఆ పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో వీఆర్ఏల సమస్యలు గురించి చర్చించిన దాఖలాలు కనిపించలేదన్నారు. రీ సర్వే పేరుతో మమ్ములను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పలు డిమాండ్లను సత్వరమే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం పరిపాలనాధికారిణికి వినతిపత్రం అందించారు. ఇమాం వలి, ఏడుకొండలు, దేవ సహాయం, రవి, మునాఫ్, పాపారావు, వెంకటేష్, మస్తాన్వలి, ముస్తఫా, రామకృష్ణ, అశోక్, రాజారావు, గురవయ్య, సైదా పాల్గొన్నారు. వీఆర్ఏల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బదంగి సాహెబ్ -
ముగిసిన గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు
గుంటూరు లీగల్: గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది 2023 మంది న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉండగా 1608 మంది ఓటు వేశారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ప్రస్తుత బార్ అధ్యక్షుడు యంగలశెట్టి శివ సూర్యనారాయణ వ్యవహరించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, జి.శాంత కుమార్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాత్రి 9 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంత సమయం అయినప్పటికీ రాత్రికి ఫలితాలు వెల్లడిస్తామని సూర్యనారాయణ వెల్లడించారు.. చేబ్రోలు: ఉద్యోగాన్ని ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరంగా నిర్వర్తించాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా అన్నారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో మంగళవారం మండల విద్యాశాఖాధికారి రాయల సుబ్బారావు ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. మండలంలోని ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తదితరులు ఎంఈవో దంపతులను సన్మానించారు. డీఈఓ మాట్లాడుతూ 37సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో రాయల సుబ్బారావు సమర్ధవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందన కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
సమస్యల పరిష్కారంలో తాత్సారం తగదు
● ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ ● ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరసన రేపల్లె: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం తాత్సారం చేయటం తగదని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. గతంలో 42 రోజుల పోరాటంతో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసి, వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ విధానంలో మార్పులు చేసి అందరికీ వర్తించేలా చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి సీహెచ్.మణిలాల్ మాట్లాడుతూ 22 నెలలుగా వేతనాల పెంపుదల లేకపోవడం అంగన్వాడీలను నిరాశకు గురిచేస్తోందన్నారు. ఇతర ఖర్చులపై దృష్టి పెట్టే ప్రభుత్వం, అంగన్వాడీల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీడీపీవో ఎం.సుచిత్రకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కే.రత్నకుమారి, నిర్మల జ్యోతి, ఎన్.కష్ణకుమారి, డి.జ్యోతి, జయప్రద, అమల, శారద, రాజ్యలక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు. నిజాంపట్నం మండలం పల్లపట్ల ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు వై.మేరీమణి, అంగన్వాడీలు పాల్గొన్నారు. -
శ్రీమన్నారాయణకు జాతీయ ఉత్తమ కౌన్సిలర్ అవార్డు
బాపట్ల: బాపట్ల జిల్లా వాసి శ్రీమన్నారాయణకు జాతీయ స్థాయిలో ఉత్తమ కౌన్సిలర్గా అవార్డు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమంలో ఉత్తమ కౌన్సిలర్గా అవార్డు పొందిన శ్రీమన్నారాయణ జిల్లా కలెక్టర్ను మంగళవారం కలెక్టరేట్లో కలిశారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో మార్చి 25 నుండి 29 వరకు అంతర్రాష్ట్ర జూనియర్ రెడ్క్రాస్ స్టడీ కం ట్రైనింగ్ క్యాంపు జరగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందానికి బాపట్ల జిల్లాకు చెందిన పిన్నిబోయిన శ్రీమన్నారాయణ కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన రెడ్క్రాస్ బృందాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించాయి. ఏపీకి ఉత్తమ కౌన్సిలర్ అవార్డును ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు రెండు వందలకు పైగా ప్రతినిధులు ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్, జాతీయ సమగ్రత వంటి అంశాలలో శిక్షణలు ఇచ్చారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరచిన ఉత్తమ కౌన్సిలర్గా గుర్తించి రెడ్క్రాస్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు, తదితరులు పాల్గొన్నారు. -
మందుబాబులకు అడ్డాగా పూసపాడు
ఇంకొల్లు(చినగంజాం): చంద్రబాబు ప్రభుత్వంలో తాగునీరు దొరకదేమో కాని మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతోంది. మండలంలోని పూసపాడు గ్రామంలో మందుబాబుల ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మద్యం ప్రియులు గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతూ మహిళలను, చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామంలో మందుబాబుల విచ్చలవిడితనం విపరీతంగా పెరిగి పోతోంది. వీధుల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితికి గ్రామ వాతావరణాన్ని తీసుకువస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వీధుల్లో తిరగాలంటే భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని అరుగులు, వీధులు, ఖాళీ ప్రదేశాలు, చిన్నకొద్ది డొంకలు, ఆఖరుకు పొలాలకు వెళ్లే బహిరంగ ప్రదేశాలలో మందుబాబులు తమ పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మహిళలు పొలం పనులకు వెళ్లాలంటే అక్కడ మందుబాబులు తిష్ట వేసి ఉంటారేమో అన్న భయానికి గురవుతున్నారు. పొలానికి వెళ్లాలన్నా, ఇంటికి తిరిగి రావాలన్నా కష్టంగా మారింది. గ్రామంలో ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు నిత్యం దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో ప్రధాన సమస్యగా మందుబాబుల వ్యవహారం తయారైంది. ఈనేపథ్యంలో పోలీసులు గ్రామంలో నిఘా పెట్టి బహిరంగంగా మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బందులకు కలుగజేస్తున్న మందుబాబులను దండించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. -
బెట్టింగ్ బంగార్రాజులు!
చీరాల టౌన్: ఉత్కంఠగా సాగే ఐపీఎల్ క్రికెట్ పోటీలను కొందరు ఎంజాయ్ చేస్తుంటే.. అంతకు రెట్టింపు స్థాయిలో వ్యక్తులు తమ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. క్రికెట్ బెట్టింగ్ భూతం కారణంగా వందలాది కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాయి. చివరకు పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం పాకెట్ మనీ డబ్బును బెట్టింగ్కు వెచ్చిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే బెట్టింగ్ యాప్లు, క్రికెట్ యాప్ల ద్వారానే అధికంగా పందేలు కాస్తున్నారు. పేదలు, యువత, రోజువారీ కూలీలు, ప్రైవేటు ఉద్యోగుల కూడా కష్టపడి సంపాదించిన డబ్బుతో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి అప్పుల పాలువుతున్నారు. – చీరాలలో కోట్లాది రూపాయలు బెట్టింగ్ కారణంగా చేతులు మారుతున్నాయి. వేటపాలెం నుంచి ఈపూరుపాలెం వరకు పెద్ద ఎత్తున బుకీలుగా ఏజెంట్లు కథ నడుపుతున్నారు. ఆన్లైన్లో సాగుతున్న ఈ బెట్టింగ్ దందాను పోలీసులు పసిగట్టేలోపే అంతా దుకాణం సర్దేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో చిన్న, మద్యతరగతి కుటుంబాల వారు ఈ బెట్టింగ్తో చితికిపోతున్నారు. – గతంలో క్రికెట్ బెట్టింగ్ కారణంగా అప్పులపాలై, తిరిగి చెల్లించలేక మానసిక వేదనతో పేరాలలోని ఓ హోటల్ యజమాని తనయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడియార స్తంభం సెంటర్లో మెడికల్ షాపు నిర్వాహకుడు బెట్టింగ్ కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. పేరాలలోని ఓ వ్యాపారి తన వ్యాపారాన్ని సైతం బెట్టింగ్ కారణంగా వదిలేసి అప్పులపాలై తనువు చాలించాడు. బహిర్గతం కాని ఇటువంటి సంఘటనలు చీరాలలో చాలా ఉన్నాయి. బెట్టింగ్కు డిపాజిట్! చీరాలలో 10 మందికి పైగా బుకీలు ఏజెంట్లు ఉన్నారు. నియోజకవర్గంలోని పేరాల, చీరాల పట్టణం, జాండ్రపేట, వేటపాలెం, ఈపూరుపాలెం, చీరాల ప్రాంతాలలో జరిగే బెట్టింగ్లను నడుపుతున్నారు. అయితే ఎప్పటికికప్పుడు పోలీసులకు సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నగదు లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే సాగుతున్నాయి. ఫలితాన్ని బట్టి బెట్టింగ్రాయుళ్లకు డబ్బు అందుతుంది. ఇందుకు నమ్మకస్తులను మాత్రమే ఎంచుకుంటున్నారు బుకీ ఏజెంట్లు. నమ్మకంలేని వారి వద్ద ముందే డబ్బు డిపాజిట్ చేసుకుంటున్నారు. బెట్టింగ్ బాబులు బుకీ ఏజెంట్లకు ముందుగానే రూ. 30 వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. చితుకుతున్న కుటుంబాలు చీరాల ప్రాంతంలో అధికంగా నివసించే చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని ఆర్థిక ఇబ్బందులతో విలవిల్లాడుతున్నారు. బెట్టింగ్లో డుబ్బ పోగొట్టుకుని గతంలో కొందరు ప్రాణాలు తీసుకుంటే మరికొందరు ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. బెట్టింగ్ల కోసం చేసిన అప్పులు వడ్డీతో సహా పేరుకుపోయి అవి తిరిగి చెల్లించలేని స్థితిలో వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక ఇళ్లలోని బంగారం తాకట్టు పెడుతున్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఎక్కువగా యువకులు, విద్యార్థులు, వ్యాపారులే బలైపోతున్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లతోపాటు చీరాల, పర్చూరు ప్రాంతాల్లో కొందరు బుకీలు, బెట్టింగ్ రాయుళ్లు పోలీసు సిబ్బందిలో కొందరితో సత్సంబంధాలు నెరుపుతూ, మామూళ్లు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ దందాకు పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఛిద్రమవుతున్న జీవితాలు గ్రామాలకు పాకిన బెట్టింగ్ భూతం ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో జోరుగా పందేలు పెద్ద ఎత్తున బుకీ ఏజెంట్లు కట్టడి చేయలేని స్థితిలో ఖాకీలు -
పెదకాకానిలో రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం
పెదకాకాని: కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారుల పనితీరు ఇష్టారాజ్యంగా మారింది. టీడీపీ నాయకులు సిఫార్స్లు చేస్తే చాలు రికార్డులు తారుమారు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక్కరే ఉన్నట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు మంజూరు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఆధారంగా భూముల రికార్డులు మార్చేస్తున్నారు. ఈక్రమంలో నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన పెదకాకాని గ్రామానికి చెందిన బెజవాడ సాంబయ్య, విజయలక్ష్మి(బుల్లెమ్మ) దంపతులకు బెజవాడ గణపతి, సుబ్రహ్మణ్యం, సీతారామాంజనేయులు నలుగురు సంతానం. వారిలో చిన్న కుమారుడు బెజవాడ కృష్ణమూర్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్(ఎఫ్ఎంబీ) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనతో పాటు చుట్టు పక్కల వారిని విచారించిన రెవెన్యూ అధికారులు కృష్ణమూర్తి ఒక్కడే సంతానం అని ఎఫ్ఎంబీ మంజూరు చేశారు. ఆ తరువాత కొంతకాలానికి ఒక్కడి పేరిటే ఎఫ్ఎంబీ ఇచ్చారని తెలుసుకుని తహసీల్దార్ను ఆశ్రయించారు. బెజవాడ సాంబయ్యకు నలుగురు సంతానం ఉండగా ఒక్కరే ఉన్నట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చారని మిగిలిన ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కూడా చేర్చాలని, లేని పక్షంలో రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. – 2025, జనవరి నెలలో తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తిరిగి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ద్వారా అదే నెలలో ఫిర్యాదు చేశారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకూ సమస్య పరిష్కారం కాకపోగా ఆ ఎఫ్ఎంబీ ఆధారంగా తల్లి పేరిట సర్వేనెంబరు 228 బి లో ఉన్న భూమి 38 సెంట్లకు చిన్న కుమారుడైన కృష్ణమూర్తి పేరిట 1బి, అడంగల్ నమోదు చేశారు. సమస్యను పరిష్కరించకపోగా ఫిర్యాదు చేసిన తరువాత 1బి, అడంగళ్ నమోదు చేయడంపై మార్చి 10వ తేదిన మళ్లీ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నలుగురు పేర్లు నమోదు చేసి ఎఫ్ఎంబీ ఇవ్వాలని, దాని ఆధారంగా ఇచ్చిన 1బి అడంగళ్ను రద్దు చేయాలని బాధితులు కోరుతున్నారు. టీడీపీ నాయకులు ఫోన్ చేస్తే.. చేయాల్సి వచ్చింది టీడీపీ నాయకుల సిఫార్సుల ఆధారంగా 1బి అడంగళ్ చేయాల్సి వచ్చిందని రెవెన్యూ అధికారి చెప్పడం దారుణంగా ఉందని బాధితుడు సీతారామాంజనేయులు దంపతులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం సహకరించని వయసులో భార్యభర్తలం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా న్యాయం చేయాలని కోరుతున్నారు. రికార్డులు తారుమారు చేస్తున్న వైనం నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక్కరే ఉన్నట్లు ఫ్యామిలీ మెంటర్ సర్టిఫికెట్ 15 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధితులు సమస్య పరిష్కరించకపోగా ఫిర్యాదు చేసిన తరువాత 1బి, అడంగళ్ మంజూరు చేసిన అధికారులు టీడీపీ నాయకుడు ఫోన్ చేస్తే ఇచ్చామన్న ఆర్ఐ -
దళితులను దూషించిన వ్యక్తి అరెస్ట్
తెనాలి రూరల్: దళితుల్లోని మాల, మాదిగ సామాజిక వర్గ ప్రజలను రాయలేని పదాలతో అసభ్యకరంగా దూషించి, వీడియోలను సాషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వీడియోలో అతని తల్లి కూడా దళితుల గురించి అసభ్యంగా మాట్లాడడంతో ఆమైపెనా కేసు నమోదు చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వివరాలు వెల్లడించారు. ● మండలంలోని ఖాజీపేటకు చెందిన చల్లా నాగరాజు చైన్నెలో కరెంటు పనులకు వెళుతుంటాడు. వచ్చిన డబ్బుతో మద్యం తాగి తిరుగుతుంటాడు. ఈ నెల 26న చైన్నె నుంచి వచ్చిన అతను 27న ఫూటుగా మద్యం తాగాడు. నందివెలుగు–గుంటూరు రోడ్డులో గుంటూరు నుంచి కొలకలూరుకు చెందిన బుల్లా వివేక్, అతని భార్య బైక్పై వస్తుండగా ఖాజీపేట వద్ద ఆవుల మంద అడ్డు వచ్చింది. అదే సమయంలో నాగరాజు వివేక్తో ఘర్షణ పడి దుర్భాషలాడి దాడి చేశాడు. అడ్డుకోబోయిన వివేక్ భార్యనూ నెట్టివేసి అసభ్యంగా దూషించాడు. ● దంపతులు వెళ్లిపోయిన అనంతరం నాగరాజు బైక్పై కొలకలూరు సెటరులోని అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాల వద్దకు వెళ్లి ఫేస్ బుక్ లైవ్ వీడియో పెట్టి మాల, మాదిగ సామాజిక వర్గ ప్రజలను అసభ్యంగా దూషించాడు. తిరిగి ఇంటికి వెళ్లి తీవ్ర అసభ్యపదజాలంతో వీడియో చేసి పోస్ట్ చేశాడు. దీనిపై దళిత సంఘాలు ఆందోళన చేశాయి. – బాధితుడు వివేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. ● నిందితుడు ఇంట్లో వీడియో రికార్డు చేస్తుండగా అతని తల్లి పద్మ అలియాస్ వెంకమ్మ దళితులను కించపరిచే విధంగా మాట్లాడడంతో ఆమె పైనా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నాగరాజుకు 2019లో వివాహం కాగా మద్యంకు బానిసైన భర్తతో వేగలేక భార్య 2024లో విడిచిపెట్టిందని చెప్పారు. నిందితుడిపై రౌడీ షీట్ తెరవనున్నట్టు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ నాయబ్రసూల్, ఎస్ఐ కె. ఆనంద్, సిబ్బంది ఉన్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. -
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
పెదకూరపాడు: అతివేగం ఇద్దరు మైనర్ల ప్రాణాల మీదకు తెచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకూరపాడుకు చెందిన ఇస్మాయిల్, సుభానీలు ద్విచక్ర వాహనంపై సినిమా హాల్వైపు వెళుతున్నారు.. ఈక్రమంలో వ్యక్తిగత పనులపై పెదకూరపాడు బస్టాండ్ వైపు వెళుతున్న షేక్ బాజీ వాహనం గ్రామంలోని కట్టెల అడితి వద్ద ఇరుకు బ్రిడ్జిపై ఒకరికొకరు ఢీకొనగా ఇస్మాయిల్, సుభానిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి గుంటూరు జీజీహెచ్కి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావటంతో ఇరువురు పరిస్థితి విషమంగా ఉంది. బాజీకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతివేగంగా రావడంతో రెండు ద్విచక్ర వాహనాలు టైర్లు పేలి దగ్ధమయ్యాయి. రెండు గంటల ఆలస్యం.. నెడితే గానీ కదలని వైనం.. ఇదిలా ఉండగా.. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు 108 వాహనానికి ఫోన్ చేయడంతో ఘటనాస్థలానికి రెండు గంటల ఆలస్యంగా వాహనం వచ్చింది. ఈ క్రమంలో హుటాహుటిన కుటుంబ సభ్యులు క్షతగాత్రులను వాహనంలోకి ఎక్కించారు. వాహనం ఎక్కించిన వెంటనే సెల్ఫ్ డౌన్ అయి వాహనం ఎంతసేపటికి కదలికి పోవడంతో గాయపడిన క్షతగాత్రుల బంధువులు వాహనాన్ని రెండు మూడు పర్యాయాలు నెట్టినా స్టార్ట్ కాలేదు. చివరికి ఎక్కువ మంది వచ్చి వాహనాన్ని నెట్టడంతో స్టార్ట్ అయింది. ఇది మరో రెండు గంటల పాటు జరగటంతో క్షత గాత్రుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే వాహనం ఇదే రోజు మూడు పర్యాయాలు మరమ్మతులకు గురైనట్లు పైలెట్ తెలిపారు. అదిచేశాం.. ఇది చేశాం.. అంటూ గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఆపద్భాందవి అయిన 108 వాహనాలకు మరమ్మతులు సైతం చేయించలేకపోతోందని స్థానికులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. -
నాట్యకళే ఆయన జీవితం
తెనాలి: 1995 సంవత్సరంలో ఒకరోజు... ఎన్వీఆర్ కల్యాణమండపం వేదికపై ‘అభిజ్ఞాన శాకుంతలము’ నృత్యరూపకం ప్రదర్శన. శకుంతల వృత్తాంతంతో కూడిన ఆ రూపకంలో పాత్రధారుల ఆహార్యం అద్భుతం. సన్నివేశాల కనుగుణమైన రంగాలంకరణ మరో ప్రత్యేకత! ఇక నటీనటుల ఆంగికం, అభినయం రక్తికట్టింది. మొత్తంమీద రంగస్థలంపై ఓ దృశ్యకావ్యం చూసిన అనుభూతితో ప్రేక్షకులు కరతాళధ్వనులు మిన్నంటాయి. ● ఎక్కడివారో తెలీదు...తెనాలిలో స్థిరపడిన ఓ నాట్యాచార్యుడు తీర్చిదిద్దిన నృత్యరూపకమది. అందులో శకుంతల పాత్రధారి జంధాల్య వేదవల్లి భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఫెలోషిప్ను అందుకుని నృత్యగురువుగా దేశవిదేశాల్లో ఎందరికో శిక్షణనిస్తున్నారు. ఆమె ఒక్కరే కాదు... చిలకలూరిపేట కళానిలయం సంస్థ ‘నాట్యమయూరి’ అవార్డును తొలిగా గెలుచుకున్న తెనాలికి చెందిన భాస్కర్ల రంగనాయకి, మరో శిష్యురాలు చల్లా బాలత్రిపురసుందరి, ఆలపాటి ప్రజ్ఞ...వీరంతా ఆ నాట్యాచార్యుడి శిష్యులే. ప్రస్తుతం అందరూ నృత్యగురువులుగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కళల తెనాలి గౌరవాన్ని ప్రకాశింపజేస్తున్నారు. ● నృత్యరంగానికి ఘనమైన వారసులను తీర్చిదిద్దిన ఆ నాట్యాచార్యుడు ఎం.దస్తగిరి...ఎండీ గిరిగా సుపరిచితులు. తెనాలిలో గల నృత్య శిక్షణ సంస్థ శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకులు. స్వస్థలం అనంతపురంలోని బోగాలకట్ట గ్రామంగా చెబుతారు. సంపన్న రైతుకుటుంబంలో జన్మించారు. నాయనమ్మ మరణంతో మనసు చెదిరి 1964లో ఏడో తరగతి చదువుతుండగానే ఇంటినుంచి వచ్చేశారు. 1969 నాటికి చీరాలకు చేరుకుని నాట్యాచార్యులు సీహెచ్ ఆంజనేయులు వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు. స్నేహితుడి సలహాపై విజయవాడకు వెళ్లారు. జీవనోపాధి కోసం అక్కడ హోటల్ క్యాషియర్గా ఏడేళ్లు పనిచేశారు. నాట్యంపై ఆశ, ఆసక్తితో నాట్యాచార్యులు పరమానంద పిళ్లై, భాగవతుల యజ్ఞనారాయణశర్మ వద్ద శిక్షణ పొందారు. కొంతకాలం యజ్ఞనారాయణశర్మకు సహాయకునిగా ఉన్నారు. ● దేశీయ నృత్యరీతులను, వాటి వైశిష్ట్యాన్ని వ్యాప్తి చేయటానికి 1987లో శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీని స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే తొలి ప్రదర్శన ఇచ్చారు. దీనిని తిలకించిన పద్మశ్రీ నటరాజ రామకృష్ణ స్వయంగా గిరిని ఆహ్వానించి మెలకువలను నేర్పారు. నాట్యం అభ్యసిస్తూనే ‘మోహినీ భస్మాసుర’ నృత్యరూపకాన్ని ప్రదర్శించి, కళాభిమానుల ప్రశంసలను అందుకున్నారు. ఈ నృత్యరూపకాన్ని గిరితో సాటిగా ప్రదర్శింపగల మరో కళాకారుడు లేడని ఆ రోజుల్లోనే గురువు పరమానంద పిళ్లై రంగస్థల వేదికపై ప్రకటించారు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, రతీమన్మథ, శిలువ ప్రభావం, ఇరవై సూత్రాల పథకం వంటి నృత్యరూపకాలను రచించి, ప్రదర్శనలతోపాటు శిక్షణనూ ఇవ్వసాగారు. నృత్యరూపకాలపై చేసిన కృషికి గుర్తింపుగా ‘దేవపారిజాతం’ అవార్డును వేదాంతం సత్యనారాయణశర్మ చేతులమీదుగా స్వీకరించారు. ‘నాట్యభూషణ’ గౌరవాన్నీ అందుకున్నారు. ● నటరాజ రామకృష్ణ శిక్షణలో ఉంటూనే ఆంధ్ర నాట్యం వ్యాప్తికి తగిన శిక్షణనివ్వాలని భావించిన గిరికి, అందుకు తెనాలి అనువైనదిగా ఎంచుకున్నారు. 1986లో తెనాలి చేరుకుని శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీని ఇక్కడ ప్రారంభించారు. తెనాలి ప్రజల అభిరుచికి అనుగుణంగా గురువు అనుమతితో కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యంలో శిక్షణను ఆరంభించారు. పురాణాలు, ఇతిహాసాల్లోని ప్రధానాంశాలను నృత్యరూపకాలుగా మలచి కళాభిమానులను రంజింపజేయటం కత్తిమీద సాము. నటనలో పరిణతి, కళాకారుల సమష్టి కృషి అవసరం, వీటికితోడుగా రంగస్థల అలంకరణ నుంచి వాయిద్య సంగీత వరకు అవసరమైన వనరులుంటేనే నృత్యరూపకం రక్తి కడుతుంది. ఇన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని నాట్యకళ పవిత్రతకు భంగం వాటిల్లకుండా కళాకారులకు శిక్షణనిచ్చి, దృశ్యకావ్యం అనిపించుకునేలా తెనాలిలో ‘అభిజ్ఞాన శాకుంతలము’ నృత్యరూపకాన్ని ప్రదర్శింపజేశారు ఎండీ గిరి. ● ఆ విధంగా తెనాలిలో నాలుగు దశాబ్దాలపాటు ఎందరో నృత్యకళాకారులను తీర్చిదిద్దారు. వీరి శిష్యులు కొందరు ఆయన బాటలోనే నృత్యగురువులుగా ఎదిగారు. ఆవిధంగా ఎక్కడనుంచో వచ్చి, తెనాలిలో స్థిరపడి సొంత కుటుంబమంటూ లేకుండా తన శిష్యబృందమే లోకంగా, నాట్యకళే ఊపిరిగా కొనసాగిన నాట్యాచార్యుడు ఎండీ గిరి, కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురై ఆదివారం మృతిచెందారు. తన కళావారసత్వాన్ని శిష్యుల రూపంలో వదిలి వెళ్లారు. ఆయన భౌతికంగా లేకుండా నాట్యరీతుల్లో ఆయన అడుగులు మువ్వల సవ్వడుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ‘నాట్యమయూరి’, ‘సూపర్ డ్యాన్స్ ఆర్టిస్ట్’ వంటి పలు అవార్డులతో సహా భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఫెలోషిప్ను పొందిన నన్ను నాట్యంలో తీర్చిదిద్దిన ఘనత గిరి మాస్టారుదే. మాస్టారుతో కలిసి రూపొందించిన నృత్యరూపకం ‘అభిజ్ఞాన శాకుంతలము’ అద్భుతం. పెళ్లయ్యాక కువైట్లో కొన్నేళ్లు ఉన్నాను. అక్కడ నృత్యశిక్షణాలయం నడిపాను. ఇప్పుడు హైదరాబాద్లో నటశిక్షణను కొనసాగిస్తున్నా. – జంధ్యాల వేదవల్లి, నృత్యగురువు తెనాలిలో కన్నుమూసిన ప్రముఖ నాట్యాచార్యుడు ఎండీ గిరికి నివాళిగా.... ‘దేవపారిజాతం’ అవార్డు గ్రహీత ఎండీ గిరి నృత్యరూపకాలతో తరగని ఖ్యాతి తెనాలిలో స్థిరపడి నృత్యశిక్షణ నృత్యగురువులుగా రాణిస్తున్న శిష్యబృందం -
ప్రతి అర్జీని ఆడిట్ చేయాలి
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో అర్జీదారులు అందజేసే ప్రతి అర్జీని ఆడిట్ చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్గౌడ్ జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్తోపాటు రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారులు అందజేసే అర్జీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరం చూపాలని అధికారులను ఆదేశించారు. అర్జీ పరిష్కారం కాలేదన్న సమాచారం అర్జీదారులకు స్పష్టంగా సూచించాలని తెలియజేశారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండలు అధికంగా ఉంటాయని ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పని ఉంటేనే బయటకు వెళ్లాలని, ఎక్కువగా నీటిని తీసుకోవాలని ప్రజలకు సూచించారు. డ్వామా పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ లేబర్ బడ్జెట్కు సంబంధించి ఎంపీడీఓలకు ఆదేశాలు అందజేశారు. డీఆర్డీఏ పీడీ బి.సింగయ్య మాట్లాడుతూ ఏప్రిల్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీపై ఎంపీడీఓలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ లవన్న, ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ డిప్యూటీ సీఈఓ కృష్ణ, డీపీఓ ఎల్.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
టీచర్పై సస్పెన్షన్ ఎత్తివేత
గుంటూరు ఎడ్యుకేషన్: అకారణంగా ఉపాధ్యాయురాలిపై విధించిన సస్పెన్షన్ను గుంటూరు జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీంబాషా వెనక్కి తీసుకున్నారు. ఉపాధ్యాయురాలికి జరిగిన అన్యాయంపై ‘సాక్షి’లో వచ్చిన కథనం విద్యాశాఖలో కలకలం సృష్టించిన నేపథ్యంలో ఎట్టకేలకు క్షేత్ర స్థాయిలో విచారణ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఎత్తివేశారు. గుంటూరు బీఆర్ స్టేడియం ఎదుట ఉన్న మహాకవి తిక్కన – శ్రీ పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 23న మధ్యాహ్న భోజనం తనిఖీ చేసేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే ఎం.డి.నసీర్ అహ్మద్ పథకంలో తలెత్తిన లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంఘటనతో సంబంధంలేని ఉపాధ్యాయురాలు సి.హెచ్.అరుణరాణిని మరుసటి రోజే డీఈఓ సస్పెండ్ చేశారు. విచారణ లేకుండా సస్పెండ్ చేసిన విషయమై ‘సాక్షి’లో కథనం ప్రచురించడంతో దిగి వచ్చిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ‘సాక్షి’ కథనంతో దిగివచ్చిన విద్యాశాఖ అధికారులు -
కారు ఢీకొని దుర్గగుడి అర్చకుడి దుర్మరణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కారు డ్రైవర్ నిర్లక్ష్యం దుర్గగుడి అర్చకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరానికి చెందిన పాణిగ్రాహి జగన్మోహన శర్మ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గత గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన జగన్మోహనశర్మను తాడేపల్లి పీహెచ్సీ సెంటర్కు వచ్చే సరికి కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో జగన్మోహనశర్మ రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదస్థలం నుంచి హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. మరి కొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన జగన్మోహన శర్మ మరణం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రమాదంపై జగన్మోహన శర్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన శర్మ భౌతికకాయాన్ని దుర్గగుడి దేవస్థానానికి చెందిన పలువురు అధికారులు, అర్చకులు, సిబ్బంది సందర్శంచి నివాళులర్పించారు. పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద ఏడాది పాటు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలం, ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ఆలయానికి రూ.92.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.50,05,000(పచ్చల శివప్రసాద్), మట్టికుండలు నిర్వహణ లైసెన్స్ హక్కునకు రూ.10,50,000(పచ్చల శివప్రసాద్), మునేరు అవతల 7 షెడ్లు, 4 ఏసీ గదులు, ఒక కల్యాణ మండపం నిర్వహణకు రూ.9,50,000(కొత్తపల్లి సతీష్కుమార్), ఆలయం వద్ద సంచారంగా ఐస్క్రీమ్ విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.5,10,000(ముండ్లపాటి నాగరాజు), భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరచు లైసెన్ప్ హక్కునకు రూ.3,15,000 (గడిపూడి గోపి), సులభ కాంప్లెక్స్ నిర్వహణకు రూ.11,80,000(నూతలపాటి సురేష్), పువ్వులు, పాలు, బియ్యం పోగుచేసుకునే హక్కునకు రూ.2,80,000(దండా పుష్పలత), హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్ హక్కును పొందారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. కోడూరు: పార్కింగ్లో పెట్టిన కారులోమంటలు చెలరేగి కారు దగ్ధం అయిన ఘటన కోడూరులో సోమవారం చోటు చేసుకుంది. కోడూరుకు చెందిన షేక్ కరిముల్లా తన కారును రామకృష్ణా థియెటర్కు చెందిన ఖాళీ ప్రదేశంలో పెట్టారు. ఉదయం 10 గంటల సమయంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు మొత్తం అగ్నికి అహుతైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, అవనిగడ్డ ఫైర్ అధికారులు వచ్చి మంటలు అదుపు చేశారు. ఘటనాస్థలాన్ని కోడూరు ఎస్ఐ పరిశీలించి, వివరాలు సేకరించారు. కారుకు ఎవరైనా నిప్పుపెట్టారా, కారు లోపల నుంచి మంటలు వ్యాపించాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
మూల్పూరులో గృహ ప్రవేశాలు
వేమూరు: నిరుపేదలకు ఇళ్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్టి తెలిపారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం మూల్పూరు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహాల ప్రవేశాల కార్యక్రమంలో సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.58 లక్షల గృహాలను జయప్రదంగా గృహా ప్రవేశాలు కార్యక్రమం చేపట్టిందన్నారు. సొంత స్థలాలు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇంటి స్థలాలు కేటాయించడంతోపాటు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలో 335 గృహ ప్రవేశాలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, రేపల్లె ఆర్డీఓ, శ్రీదేవి, తహసీల్దార్ నెహ్రుబాబు, గృహ నిర్మాణ శాఖ డీఈ పాల్గొన్నారు. -
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మరోసారి డ్రామా
బాపట్ల: అమరావతే రాజధాని అంటూ మూడోసారి తీర్మానం చేయటం చూస్తుంటే చంద్రబాబు ప్రజలను ఏవిధంగానైనా మోసం చేయగలరని మరోసారి నిరూపితమైందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోన రఘుపతి మాట్లాడారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశంతో హడావిడిగా శాసనసభ ఏర్పాటుచేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అగౌరపరిచే విధంగా మాట్లాడించటం బాధాకరమన్నారు. శాసనమండలిలో తగినంత బలం లేకపోవటంతో శాసనసభలో తీర్మానం చేసి మమ అనిపించారని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేసిన చంద్రబాబు అన్నింటిని తాత్కాలికం పేరుతో అసెంబ్లీ, పరిపాలనభవనం, హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటో అర్ధం కావటంలేదన్నారు. తాజాగా మరో తీర్మానం చేసి మరికొంత భూమిని కాజేసేందుకు చంద్రబాబు టీమ్ సిద్ధంగా ఉందని కోన ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటం చేతకాని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టించేందుకు కుటిల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బాపట్ల అభివృద్ధిపై ఎమ్మెల్యే వేగేశన పెద్దవి విప్పాలి వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు బాపట్ల కేంద్రంగా జిల్లాను సాధించుకున్నామని కోన రఘుపతి గుర్తు చేశారు. ప్రస్తుతం బాపట్లలో జరుగుతున్న అభివృద్ధిపై ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పెద్దవి విప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రూ.530 కోట్లతో మెడికల్ కళాశాలను సాధించుకున్నామని, ఇప్పుడు నిలిచిపోయిన ఆ పనులను ఏవిధంగా చేపడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. సూర్యలంక ప్రాంతాభివృద్ధికి వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్రమంత్రి కిషన్రెడ్డికి రూ.100కోట్లతో ప్రతిపాదనలు పంపటం జరిగిందన్నారు. ఆ ప్రతిపాదనలపై ఇప్పుడు నిధులు విడుదల కాగా వాటిని ఏవిధంగా ఖర్చుపెడుతున్నారో బహిరంగంగా తెలియజేయాలని అన్నారు. సమావేశంలో బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు జి.సురేంద్ర, రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, నాయకులు వడ్డిముక్కల డేవిడ్, గంగిశెట్టి రత్తయ్య, నక్కా వీరారెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పిట్టు శ్రీనివాసరెడ్డి, చీరాల వెంకటేశ్వరెడ్డి, గవిని కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. -
అంతర్జాతీయ కోచింగ్ కోర్సుకు శ్రీనివాసరావు ఎంపిక
యడ్లపాడు: మండలంలోని మైదవోలు గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు, కోచ్ నక్కా శ్రీనివాసరావు చైనాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఎఫ్ఐవీబి లెవల్–3 అంతర్జాతీయ కోచింగ్ కోర్సుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తనపేరును అధికారికంగా సిఫార్సు చేసినట్లు ఆదివారం తెలిపారు. చైనా వేదికగా ఈ ఏడాది జూలై 17 నుండి 25 వరకు ఈ అత్యున్నత స్థాయి శిక్షణ తరగతులు జరగనున్నాయి. వాలీబాల్ కోచింగ్లో అత్యున్నత ప్రమాణంగా భావించే లెవల్–3 కోర్సుకు ఇంత చిన్న వయసులోనే ఎంపిక కావడం విశేషం. శ్రీనివాసరావు ఎంపిక పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ నేతలపై వరుస కేసులు
రేపల్లె: రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నమోదవుతున్న కేసులు రాజకీయ కక్షసాధింపులేనని పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇద్దరు కీలక నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒత్తిళ్లతో పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తూ వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిత్రాల ఓబేదు, రేపల్లె పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు ఆలా రాజ్పాల్లపై వరుసగా కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీషీట్లు తెరిచి, ప్రతి వారం పోలీస్ స్టేషన్కు పిలిపిస్తూ విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఫ్లెక్సీల తొలగింపుపై నెలకొన్న వివాదంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద శాంతియుతంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరిపై బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఒక్కొక్కరికి రూ.2 లక్షల జరిమానా విధించడం అధికారుల అత్యుత్సాహానికి నిదర్శనమని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారనే కారణంతోనే లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన చిత్రాల ఓబేదు గతంలో పదేళ్ల పాటు జగన్ యువజన విభాగం అధ్యక్షుడిగా సేవలందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర హస్తకళల శాఖ డైరెక్టర్గా, బాపట్ల జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఒక దళిత నాయకుడు రాజకీయంగా ఎదుగుతున్నాడనే అక్కసుతోనే టీడీపీ నాయకులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి. అదేవిధంగా బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడు ఆలా రాజ్ పాల్ అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు పొందారు. కరోనా సమయంలో ‘రాజ్ పాల్ హెల్పింగ్ హ్యాండ్స్’ ద్వారా కోవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటువంటి నాయకులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ విషం కక్కుతూ చేస్తున్న ప్రయత్నాలు బాధాకరమని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేపల్లె నియోజకవర్గంలో పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చట్టపరంగా ధైర్యంగా ఎదుర్కొంటాం. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ శ్రేణులకు అండగా ఉంటాను. టీడీపీ ప్రభు త్వం పోలీసులతో కలిసి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా భయపడే పరిస్థితి లేదు. నిజం కోసం, ప్రజల కోసం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో ఎలాంటి వెనకడుగు వేయం. రేపల్లె నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు హామీ ఇస్తున్నాను. పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడుతున్నంత వరకు, నేను ఎప్పుడూ అండగా ఉంటాను. – పీటా నాగమోహన్కృష్ణ, వైఎస్సార్ సీపీ రేపల్లె సమన్వయకర్త -
ఆధునిక జీవనశైలి వల్లే సంతానలేమి సమస్యలు
గుంటూరు మెడికల్ ఆధునిక జీవనశైలి వల్ల నేడు దంపతుల్లో సంతానలేమి (ఇన్ఫెర్టిలిటి) సమస్యలు పెరిగిపోతున్నాయని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఆదివారం గుంటూరు ఐటీసీ హోటల్లో కిమ్స్ ఫెర్టిలిటి ఐవీఎఫ్ సెంటర్ ఆధ్వర్యంలో గుంటూరు ఆబ్స్ట్రిక్ట్ అండ్ గైనకాలాజికల్ సొసైటీ సహకారంతో ఇన్ఫెర్టిలిటి గురించి వైద్యులకు ఫెమ్కాన్ పేరుతో నిరంతర వైద్య విద్య కార్యక్రమం(సీఎంఈ) నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంతాన చికిత్సలు అందించే కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం సంతాన చికిత్సలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఐవీఎఫ్ సెంటర్లో చట్టపరంగా చికిత్సలు అందించాలని చెప్పారు. పేదలకు సైతం ఆధునిక సంతాన చికిత్సలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మాత మరణాలు నివారించడంలో సీ్త్ర వైద్య నిపుణులు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక వైద్య సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించి సంతానోత్పత్తి సమస్యలకు పరిష్కారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మాత మరణాలను పూర్తిగా తగ్గించే దిశగా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యంపై సమగ్ర పర్యవేక్షణతోపాటు, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఆధునిక వైద్య సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ సంతాన చికిత్సలు అందించే ఆస్పత్రుల వారు తప్పని సరిగా తమ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పీజీ వైద్యులకు, నూతనంగా ప్రాక్టీస్లోకి వస్తున్న వైద్యులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. సీఎంఈ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కర్నాటకకు చెందిన డాక్టర్ ప్రత్యూష్కుమార్ నారాయణ్ సంతాన చికిత్సల్లో హార్మోన్స్ ఏవిధంగా స్పందిస్తాయనే విషయాలను, డాక్టర్ హితేష్బట్ సంతాన చికిత్సలు చేసే సమయంలో పాటించాల్సిన చట్టపరమైన అంశాలను, డాక్టర్ సచిన్ కులకర్ణి ఐవిఎఫ్ చికిత్సలు ఎవరికి చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేయాలనే విషయాల గురించి వివరించారు. సదస్సులో వైద్యులు, నిపుణులు పాల్గొని ఫెర్టిలిటీ, ఎంబ్రియాలజీ రంగాల్లో వచ్చిన అధునాతన పోకడలను వివరించారు. కార్యక్రమంలో కిమ్స్ ఫెర్టిలిటి ఐవిఎఫ్ సెంటర్ డైరక్టర్ డాక్టర్ బి.శ్వేత, సీఓఓ సుధర్జాదవ్, డాక్టర్ ఐ.ప్రత్యూష, డాక్టర్ శిరీషా, ఎంబ్రాలజిస్ట్ డాక్టర్ ఉదయ్, యూనిట్హెడ్ డాక్టర్ ఎస్. వి.హరికుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్, గుంటూరు ఆబ్స్ట్రిక్ట్స్ అండ్ గైనకాలాజికల్ సొసైటి ప్రెసిడెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, సెక్రటరీ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, జీజీహెచ్ గైనకాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ అరుణ, పలువురు గైనకాలజిస్ట్లు, ఐవీఎఫ్ స్పెషలిస్ట్లు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా -
గోవాడ ప్రాశస్త్యాన్ని కాపాడుకుందాం
తెనాలిటౌన్: వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం గోవాడ తిరునాళ్ల ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీ సభ్యులు ఆరోపించారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్లో ఆదివారం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కమిటీ కన్వీనర్ దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి దగ్గరలోని గోవాడ శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రెండు తెలుగురాష్ట్రాల నుంచి ఈ తిరునాళ్ళకు లక్షల సంఖ్యలో వస్తారని చెప్పారు. ఆలయ సమీపంలోని గోవాడ నుంచి కావూరు డొంకలో ఉత్సవం కోసం నిర్దేశించిన స్థలంలో ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కుకు స్థలం కేటాయిస్తూ ఏపీఐఐసీ వారికి స్థలం అప్పగించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూవుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1943 నుంచి అనేకసార్లు ఈ స్థలాన్ని వేరేవారికి కేటాయించగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉత్సవ విశిష్టతను తెలుసుకుని కేటాయింపులు రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, తహసీల్దార్ ఈ స్థలం కేటాయింపునకు ప్రాధాన్యం కనబరుస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో తుమ్మల జగదీష్, మండవ మల్లీశ్వరి, కెవి సత్యనారాయణ, వేదాంతం ఫణీంద్ర, కె.వాసుదేవనాయుడు, కడియాల నంద కిషోర్, బసవపున్నయ్య, ఆర్.శివశంకరరావు, రాజేష్ పాల్గొన్నారు. -
అధికార పార్టీ అండతో రెసిడెన్షియల్ ప్లాట్లలో బార్ అండ్ రెస్టారెంట్
రాజధానిలో నిబంధనలకు మంగళం తాడికొండ: రాజధాని ప్రాంతంలో ఇప్పట వరకు భూముల వ్యవహారాలు, వివాదాలే చూసిన స్థానికులకు ఇప్పుడు ఇది కాస్తా వ్యాపారాలకు కూడా పాకడంతో ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. పనుల్లేక సామాన్యులు చిన్నపాటి బడ్డీ కొట్టును జీవనం సాగించేందుకు కుటుంబాన్ని సాకుతుంటే ఆఘమేఘాలపై వచ్చి కూలదోసే అధికారులు ఏకంగా రెసిడెన్షియల్ కోసం కేటాయించిన ప్లాట్లలో కమర్షియల్ వ్యాపారానికి ఎంచక్కా అనుమతులివ్వడం విశేషం. అది ఎక్కడో మారుమూలన అనుకుంటే పొరబాటే రాజధాని నడిబొడ్డున ఏపీ సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే వెలగపూడి, తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్ మలుపులో ఏకంగా బార్ అండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేసుకునేందుకు గేట్లు బార్లా తెరవడంతో గంటల వ్యవధిలో కంటెయినర్ను తెచ్చిపెట్టి విద్యుత్ సౌకర్యంతో సహా ఇచ్చి బార్ అండ్ రెస్టారెంట్ను ప్రారంభించారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి చినబాబు ఆశీస్సులతో రాజధానిలో బార్ అండ్ రెస్టారెంట్ను కేటాయించారని, దీంతో ఆయన నిబంధనలకు విరుద్దంగా కమర్షియల్ ప్లాట్లలో దుకాణం ప్రారంభించడం ఎంతవరకు సమంజసం అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని నివాస ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన వ్యాపారాన్ని తొలగించి నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని పలువురు రాజధాని వాసులు కోరుతున్నారు. మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు వయోపరిమితి పెంపు వర్తింపజేయాలి కారెంపూడి: ఏపీ మోడల్ స్కూల్స్లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ అమరావతి జేఏసీ అధ్యక్షుడు వినుకొండ పేరయ్య తదితరులు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని రంగాల ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న వారి వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందని, అయితే ఏపీ మోడల్ స్కూల్స్లో పని చేస్తున్న ఉద్యోగులను మాత్రం మరచిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ మోడల్ స్కూల్స్లో పని చేస్తున్న వారికి కూడా వయోపరిమితి పెంపు వర్తింపచేయాలని కోరారు. -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం
చెరుకుపల్లి: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు వారు నివసించే ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులతో కలసి పాల్గొన్నారు. ముందుగా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలసి ఎంపీడీవో కార్యాలయం నుంచి ఐలాండ్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఙ చేయించారు. అదే సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ అధికారులతో కలసి ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి కె.ఎల్ ప్రభాకరరావు అధ్యక్షత వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీవో బూసి శ్రీదేవి, మండల ప్రత్యేక అధికారి మాధవి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు వైద్య ఆరోగ్య శాఖ, డ్వాక్రా, అంగన్వాడీ, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ భావనవశిష్ఠ -
పర్చూరు వరకు గుంటూరు చానల్ పొడిగించాలి
భక్త ప్రహ్లాద సన్నివేశంలో ఉగ్రరూపంలో నృసింహుడు శ్రీనివాస కల్యాణ నృత్య ప్రదర్శనలో చిన్నారులు పర్చూరు(చినగంజాం): పర్చూరు ప్రాంత రైతులు సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న గుంటూరు చానల్ పొడిగింపు పనులు సత్వరం ప్రారంభించి స్థానిక రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నల్లమడ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పర్చూరులోని బొమ్మల సెంటర్ వద్ద శనివారం నల్లమడ ప్రాంత రైతులు, నాయకులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ పర్చూరు ప్రాంత రైతులు సుదీర్ఘ ఆందోళనలు, పోరాటం అనంతరం ప్రభుత్వం గుంటూరు చానల్ను పొడిగించే పనులు చేపట్టి భూసేకరణకు అవసరమైన రూ.113 కోట్లలో రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రభుత్వం సత్వరం పెదనందిపాడు మండలంలోని గ్రామాలకు, పర్చూరు మండలంలోని గ్రామాలకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి భూ సేకరణ పనులు పూర్తిచేసి చానల్ పొడిగింపు పనులు ప్రారంభించాలన్నారు. చానల్ను పొడిగించడం ద్వారా ప్రజల తాగు, సాగునీరు అందుతుందని త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. విదేశీ దిగుమతులను వెంటనే ఆపివేసి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుకు అనుగుణంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర అందించాలి.. మొక్కజొన్నకు ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.2400 కాకుండా రూ.2928కు కొనుగోలు చేయాలని, శనగ కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం ఫ్రకటించిన కనీస రూ.5875 కాకుండా రూ.7500 మద్దతు ధర కల్పించాలని కోరారు. శనగకు డిస్టోన్ మిషన్లను కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం రైతులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ పీ బ్రహ్మయ్యకు అందజేశారు. కార్యక్రమంలో నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహనరావు, కోటా హరిబాబు, ఒగ్గిశెట్టి నరసింహులు, వైఏ చౌదరి, లావు అంకమ్మచౌదరి, అడుసుమల్లి జగన్నాధం, నాయుడు సుబ్బారావు, అడ్డగడ వెంకటేశ్వర్లు, నందిపాడు పున్నయ్య, కొల్లా నిర్మల, మంజూష, రత్నకుమారి, గోరంట్ల బుచ్చయ్య, భాస్కరరావు, లంకశివ, నల్లమండ ప్రాంత రైతులు పాల్గొన్నారు. పర్చూరులో నల్లమడ రైతు సంఘం నాయకుల ధర్నా -
నారాయణాచార్యులు సేవలు హర్షణీయం
బాపట్లటౌన్: సాహిత్యరంగంలో డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో సరస్వతీపుత్ర డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ తెలుగు సాహితీ జగత్తులో పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక ధ్రువతారగా వెలిగారన్నారు. ‘సరస్వతీపుత్ర‘గా ఆయన తెలుగు సాహిత్యానికి విశిష్టమైన కీర్తిని చేకూర్చారన్నారు. ఆయన సాహిత్య సేవలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 28ను రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. తెలుగుతో పాటు సంస్కృతం, ఫ్రెంచ్, పర్షియన్, పాలీ, అరబిక్ వంటి మొత్తం 14 భాషల్లో అఖండమైన పట్టు ఉండేదన్నారు. అనేక నవలలు, నాటకాలు, కావ్యాలు రచించి సాహిత్య శిఖరంగా నిలిచారన్నారు. ఆయన కలం నుండి జాలువారిన ‘శివతాండవం’ కావ్యం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1972లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నారు. శ్రీ వేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయన్నారు. బాపట్ల డీఎస్పీ పి.జగదీష్ నాయక్ పాల్గొన్నారు. -
అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు
భట్టిప్రోలు: భట్టిప్రోలులోని విఠలేశ్వరనగర్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆద్యంతం ఆహుతులను అలరించాయి. శ్రీలక్ష్మీ కూచిపూడి నృత్య కళాక్షేత్రం ఎ.వెంకటలక్ష్మి(తెనాలి) ఆధ్వర్యంలో 13 ఏళ్ల చిన్నారి బిట్రా సహిత, నృత్య కళాక్షేత్రం బృందం చిన్నారులు ప్రవస్తి, హేమ, ఆస్త్రిత, నిష, లహరిలు నృత్య ప్రదర్శనలను కనులపండువగా ప్రదర్శించారు. రాధాకృష్ణుల కథ, శ్రీనివాస కల్యాణం, భక్త ప్రహ్లాద చరిత్ర, కూచిపూడి నృత్యాలు, కోలాటం వంటి కార్యక్రమాలు వైభవోపేతంగా సాగాయి. తొలుత టీటీడీ బాల గోపాల భజన మండలి స్థానిక మాతా కాన్వెంట్ బాలికలతో కోలాట ప్రదర్శన నిర్వహించింది. అధ్యక్షులు బూర్లె అరుణకుమారి, కొత్త నాగవెంకట రవితేజ కార్యక్రమాలను పర్యవేక్షించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాలను వీక్షించారు. -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా కలెక్టర్ కృతికా శుక్లా బాధ్యతల స్వీకారం చిలకలూరిపేట: పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్ల నిర్వహణ, అమృత్ స్కీమ్ పనుల తీరు, పన్నుల వసూళ్లు, షాపుల అద్దెల వసూళ్లు, భవన నిర్మాణ అనుమతులు, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, టిడ్కో ఇళ్ల నిర్మాణం, గృహ నిర్మాణపథకాలు, జనన గణన, జనన మరణాల రికార్డుల పరిశీలనతో పాటు సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మున్సిపల్ సేవలు మరింత మెరుగ్గా అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, మున్సిపల్ డీఈఈ షేక్ అబ్దుల్ రహీం, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ క్రోసూరు: ఏపి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్లలో ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్–2026 ప్రవేశపరీక్షకు క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కళశాల ప్రిన్స్పాల్ బి.వీ.రమాదేవి శనివారం తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరుగుతుందని, అందుకుగాను ఏప్రిల్ 4 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు ఎంట్రన్స్ రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందచేయబడుతుందన్నారు. పాలిసెట్ ఎంట్రన్స్కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4 వ తేదీగా తెలిపారు. దరఖాస్తు చేసుకొనే వారు అధికారిక వెబ్సైట్ http://polycetap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. వివరాలకు 94903 43929, 96189 26798,72072 88540 లో సంప్రదించవచ్చునన్నారు. వరికోత మిషన్ తగిలి మహిళ మృతి మాచవరం: వరి కోత మిషన్ తగిలి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని వేమవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెరుగు నాగేంద్ర (60) తెల్లవారు జామున ఇంటి పనులు చేసుకునేందుకు ఇంటి ముందుకు రాగా, మాచవరం వైపు నుంచి తెలంగాణ వైపు వెళుతున్న వరి కోత మిషన్ ముందు భాగం నాగేంద్రం తలభాగానికి తగిలింది. ఘటనలో నాగేంద్ర తలకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు . మృతురాలి కుమారుడు జానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్య యడ్లపాడు: చీరతో ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యడ్లపాడులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మృతురాలు షేక్ జిమ్మాబి(28)కి సుమారు ఎనిమిదేళ్ల కిందట ఫిరంగిపురానికి చెందిన షేక్ ఖాజావలితో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగేళ్ల కిందట కుమారుడిని భర్త వద్ద వదిలివేసి పెదకాకానిలోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు గమనించిన తల్లిదండ్రులు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. మనస్తాపానికి గురైన జిమ్మాబి యడ్లపాడు వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటుంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరెతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నాగార్జునకొండను సందర్శించిన శ్రీలంక మంత్రి విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను శనివారం శ్రీలంక దేశానికి బుద్ధ సేన రిలీజియస్, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్ సేన్వి 21 దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు విదేశీ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. వీరు లాంచీలో నాగార్జునకొండకు చేరుకొని కొండలోని మ్యూజియంలో ఉన్న తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని పుట్టుకకు సంబంధించిన శిలా ఫలకాలు, రాతి పనిముట్లు, సింహళ విహార్, మహా స్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం తిలకించి బౌద్ధ గురు దలైలామా నాటిన బోధి వృక్షం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వీరికి నాగార్జునకొండ మ్యూజియం క్యూరేటర్ కమల్హాసన్ నాగార్జునకొండ చరిత్రను వివరించారు. -
రామ మందిరాలలో భక్తులకు అన్నదానం
చెరుకుపల్లి: శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం ఆయా రామ మందిరాల వద్ద శనివారం సత్యనారాయణస్వామి వ్రతం వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్నసమారాధన చేపట్టారు. మండల కేంద్రంలోని వీరరాఘవపేట రామ మందిరం, గుళ్లపల్లి శ్రీ కోదండ రామాలయం, అదే గ్రామంలో రజక సంఘం ఏర్పాటు చేసిన మండపం, బలుసులపాలెంలో కొనకాల రవికిరణ్ ఆధ్వర్యంలోని గ్రామ రామ మందిరం, పొన్నపల్లి, తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
‘సంపన్నకారి’తో వ్యాపారాలు మెరుగు
ఇంకొల్లు(చినగంజాం): మహిళా గ్రూపులు సంపన్నకారి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రమీల సూచించారు. మండల వెలుగు కార్యాలయంలో శనివారం గ్రామ సంఘ సహాయకులకు, గ్రూపు సభ్యులకు సంపన్న కారి కార్యక్రమంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంపన్న కారి అంటే వ్యాపారాలు ఒక స్థాయి దాటిన తరువాత మరింతగా అభివృద్ధి చెందటానికి సరైన వ్యాపార ప్రణాళిక, మార్కెట్ అవకాశాలు, పెట్టుబడి అవసరమవుతుంది. వారికి సహాయం లేక వ్యాపారం విస్తరించటం కష్టంగా మారుతుంది. సమస్యను పరిష్కరించటానికి రూపొందించినదే సంపన్నకారి కార్యక్రమం అని అన్నారు. కార్యక్రమంలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఒక పద్ధతిలో రూపొందించిన విధానం ద్వారా సహాయం పూర్తిగా ఉచితంగా అందిస్తారన్నారు. వ్యాపారాలు తమ పనితీరు, మార్కెట్ పరిధి, ఆదాయానికి పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమం ముఖ్య లక్ష్యం సంవత్సరానికి కనీసం 15 శాతం ఆదాయం పెరుగుదల సాధించేలా సహాయం చేయడమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అంతటా 150 రకాల వ్యాపారాలు మాత్రమే ఎంపిక చేస్తారని, కనీసం 18 నెలలు సహాయం అందుతుందని, సహాయం రూ.15 లక్షలు వరకు గ్రాంట్ రూ.4 లక్షలు వరకు సున్నా వడ్డీ రుణ సహాయంగా ఉంటుందని ఆమె తెలిపారు. సంపన్నకారి కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఎస్ఎస్సీ అర్హత కలిగి మహిళలు నడుపుతున్న వ్యాపారమై, రాష్ట్రంలోనే కనీసం రెండు సంవత్సరాలుగా నడుపుతూ ఉండాలన్నారు. వార్షిక ఆదాయం వ్యక్తిగత వ్యాపారానికి రూ.12 లక్షలు, గ్రూపు వ్యాపారానికి రూ.15 లక్షలు ఉండాలని తెలియజేశారు. సంపన్నకారి కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సేవా రంగం, తయారీ రంగంలో ఉన్న వారు మాత్రమే అర్హులని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కువ మందికి కార్యక్రమంపై అవగాహన కల్పించాలని తెలియజేశారు. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వతేదీ లోపు చేసుకోవాలని తెలియజేసి కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఎం అనురాధ, సీసీలు, అకౌంటెంట్ పాల్గొన్నారు. – జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రమీల -
ప్రాణం తృణప్రాయం
బాపట్లరవాణాశాఖ అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు ● వ్యక్తి మృతి రేపల్లె: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ మల్లికార్జునరావు వివరాల మేరకు బస్టాండ్ సమీపంలో మురుగు కాల్వలో అనుమాస్పద స్థితిలో మృతదేహం పడి ఉండటాన్ని శనివారం గమనించిన స్థానికులు సమాచారం అందించారన్నారు. మృతదేహాన్ని పరిశీలించగా మృతుడి ముఖంపై గాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుడు నిజాంపట్నం మండలం ఎడ్లంకకు చెందిన మాతంగి సురేష్ (40)గా గుర్తించటం జరిగిందని, ప్రస్తుతం రేపల్లెలోనే నివసిస్తున్నట్లు తెలిపారు. I– రామకృష్ణారెడ్డి, ఎంవీఐ, చీరాల రాయవరం ఘటనతో ఉలిక్కిపడ్డ రాష్ట్రం నిబంధనలకు విరుద్ధంగా రూట్ మ్యాప్లు ౖపైపె సొబగులు టిక్కెట్ ధరలపై నియంత్రణ లేదా? తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.7,500 వరకు పలికింది. మాచర్ల:వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 535.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది. చిలకలూరిపేట: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓట్లు వేసి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఏపీ 27 టీటీ 6577 ట్రావెల్స్ బస్సు చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామ శివారు ఈవూరివారిపాలెం డొంక వద్ద ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు, టిప్పర్ డ్రైవర్, ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు. సంఘటన 14 మే, 2024 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగింది. -
ఘనంగా పాండురంగడి కల్యాణం
వేమవరం(భట్టిప్రోలు): భట్టిప్రోలు మండలం సూరేపల్లి పంచాయతీ పరిధిలోని వేమవరంలో కొలువైన శ్రీ రుక్మాబాయి సహిత శ్రీ పాండురంగ స్వామివారి దేవస్థానంలో శనివారం స్వామి వారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు జరిపారు. ఆదివారం తెల్లవారు జామున విశేష పంచామృత అభిషేకాలు జరుగనున్నట్లు అర్చకులు ధారా నారాయణ మూర్తి తెలిపారు. అదే విధంగా వేమవరం గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి నైవేద్యాలను సమర్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమాలను దేవాలయ కార్యనిర్వాహక వర్గం పర్యవేక్షించారు. కల్యాణ క్రతువును వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అలానే ఐలవరం గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలను యునెస్కో వాస్తు పండిట్ వంగర చలమయ్య సిద్ధాంతి నిర్వహించి పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు అన్నసమారాధన కార్యక్రమం చేపట్టారు. -
సీతా కల్యాణ వైభోగమే
శ్రీరామ నవమిని పురస్కరించుకొని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోని వాడవాడలు రామనామంతో మార్మోగాయి. శుక్రవారం చలువ పందిరిలో దశరథ రాముని కల్యాణ క్రతువును ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ‘రామ నామము, రామ నామము.. రమ్యమైనది రామ నామము’ అంటూ భక్తులు కల్యాణ మండపాలకు చేరుకున్నారు. జగదభి రామయ్య కల్యాణాన్ని కనులారా తిలకించి ప్రణమిల్లారు. వడపప్పు, పానకాల ప్రసాదాలను స్వీకరించి సీతారామ లక్ష్మణ, హనుమ ప్రతిమల ముందు మోకరిల్లారు. వైభవంగా రాములోరి కల్యాణం రేపల్లె: శ్రీరామ నవమిని పురస్కరించుకొని నియోజకవర్గంలో శుక్రవారం వేడుకలను వైభవంగా నిర్వహించారు. చలువ పందిళ్లను ఏర్పాటు చేసి సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపల్లె పట్టణంలోని రైలుపేట పట్టాభిరామస్వామి, రామకోటిపేటలో పట్టాభి రామస్వామి ఆలయం.. 1, 6వ వార్డుల్లోని రామాలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అదే విధంగా వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం, పెదకూరగాయల మార్కెట్, ఇసుకపల్లి, నేతాజీనగర్, పాతస్టేట్ బ్యాంక్, 10వ వార్డు తదితర ప్రాంతాలలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి సీతారాముల ప్రతిమలను నెలకొల్పి కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పట్టణ, మండలంలోని పలు పందిళ్లను సందర్శించి సీతారాములకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భట్టిప్రోలు: శ్రీరామ నవమిని పురస్కరించుకొని భట్టిప్రోలు మండలంలోని గ్రామాలు పులకించాయి. చక్కని సీతను అందాల రాముడు మనువాడిన ఆ శుభగడియల్లో భక్తులు రామనామ స్మరణ చేస్తూ తరించారు. భట్టిప్రోలులోని విఠలేశ్వరనగర్ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కాగిత పరుశురామ్–నిర్మల దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. పోలన శివశంకరరావు సిద్ధాంతి పూజా కార్యక్రమాలను ఘనంగా జరిపారు. అద్దేపల్లి రామాంజనేయ గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో రామాంజనేయ నగర్(ఎస్టీ కాలనీ)లోనూ సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. పిట్టలవానిపాలెం(కర్లపాలెం): శ్రీరామనవమిని పురస్కరించుకొని పిట్టలవానిపాలెం మండల పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం రాములోరి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పిట్టలవానిపాలెం, అల్లూరు, ఖాజీపాలెం, చందోలు, మంతెనవారిపాలెం, భవనంవారిపాలెం, జిఎన్పాలెం, సంగుపాలెం, కోడూరు గ్రామాల్లో రామాలయాల వద్ద సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపారు. పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాలను తిలకించారు. కర్లపాలెం: శ్రీరామ నవమి సందర్భంగా మండలంలోని నాగరాజుపాలెం, దమ్మనవారిపాలెం, దుండివారిపాలెం, తిమ్మారెడ్డిపాలెం, యాజలి, బుద్ధాం ఏట్రవారిపాలెం, కొత్తనందాయపాలెం, నల్లమోతువారిపాలెం, పాతనందాయ పాలెం, కర్లపాలెం, పాపిరెడ్డిపాలెం, బంగారురెడ్డిపాలెం, చింతాయపాలెం, తదితర గ్రామాలలోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. -
రాములోరి పురాతన నాణేలు
కారంచేడు: వివిధ దేశాలకు, ప్రాంతాలకు చెందిన నాణాలు, కరెన్సీ, స్టాంపులు వంటివి సేకరించడం అతని హాబీ. దీనిలో భాగంగా రాముని పరిపాలనా సమయంలో వినియోగించిన నాణేలను కూడా ఆయన సేకరించాడు. శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆయన ఈ నాణేలను కారంచేడు కల్యాణ మండపం వద్ద ప్రదర్శనగా ఉంచాడు. వీటిని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వాటిని తిలకించి సీతారాములను పూజించుకుంటున్నారు. మండలంలోని ఆదిపూడి గ్రామానికి చెందిన కాలవ రఘురామయ్య 20 ఏళ్లుగా పురావస్తు వస్తువులు సేకరిస్తున్నట్లు తెలిపారు. 1762వ సంవత్సరంలో ‘యునైటెడ్ కింగ్ డమ్ లండన్ ఈస్ట్ ఇండియా’ సంస్థ తయారు చేసి వాడుకలోకి తీసుకొచ్చిన 250 గ్రాముల బరువుతో 2.50 పైసల నాణెంపై ఒకవైపు సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయస్వామి వారి బొమ్మలు, మరో వైపు ఈస్ట్ ఇండియా సింబల్ను ముద్రించారు. 1818వ సంవత్సరంలో ముద్రించిన నాణెంపై ఒక వైపు సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వారి బొమ్మలు, మరో వైపు ఈస్ట్ ఇండియా సింబల్తో పద్మం ఉండే విధంగా తయారు చేశారు. దీని బరువు 150 గ్రాములు ఉంది. వీటిని సేవరించి తన ఖజానాలో భద్రపర్చడం జీవితంలో మర్చిపోలేని సంఘటని రఘరామయ్య తెలిపారు. -
బీసీ మహిళపై టీడీపీ కక్షసాధింపు చర్యలు
సత్తెనపల్లి: ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చెందిన వారిపై టీడీపీ దాడులు పరాకాష్టకు చేరాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ వేముల శ్రీదేవి వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఈక్రమంలో తనపై కక్ష సాధింపు చర్యలగా కూటమికి చెందిన సత్తెనపల్లి నాయకులు తన పేరుతో ఫేస్ బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యకర ఫొటో లు, వీడియోస్ క్రియేట్ చేశారని బాధితురాలు వాపోయింది. సత్తెనపల్లిలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. తనపై ఫేక్ అకౌంట్ క్రియేట్చేసిన వైనంపై గ్రీవెన్స్లో నాలుగు సార్లు ఫిర్యాదు చేశానని.. అయితే నిందితులు నిజం ఒప్పుకున్నా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనను దూషించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇలా ఉంటే ఈనెల 25న రాత్రి సమయంలో తన ఇంటి మీదకి ఓ మహిళ, సుమారు 20 మంది పురుషులు వచ్చి ఒక్కసారిగా కళ్లలో కారం చల్లి, సభ్య సమాజం తలదించుకునే రీతిలో దుర్భాషలాడుతూ.. వైఎస్సార్ సీపీలోనే కండువా కప్పుకొని పార్టీలో తిరుగుతావా? వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పోస్టులు పెడతావా? అంటూ మాట్లాడటానికి వీలు లేని పదజాలంతో దూషించి దాడి చేశారని ఆవేదన వెలిబుచ్చింది. తన భర్త శ్రీనివాసరావు సెంట్రింగ్ పనిచేస్తూ పని నుంచి వస్తుంటే అతనిపై కూడా దాడి చేశారని, ఎందుకు ఇలా దాడులు చేస్తున్నారో అర్థం కాక సత్తెనపల్లి రూరల్ పోలీస్స్టేషన్కి వెళ్లి తమపై టీడీపీకి చెందిన వారు దాడి చేసేందుకు వచ్చారని ఫిర్యాదు చేస్తే పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించకపోగా .. నువ్వేదో వాళ్లపై పోస్ట్ పెట్టావంట, వాళ్లను తిట్టావంట అంటూ తననే తిరిగి ప్రశ్నించారని, బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకేమాత్రం సంబంధ లేదంటూ మొత్తుకుంటున్నా.. వినకుండా.. తనపై దాడి చేసిన వారికి మాత్రం రాచమర్యాదలు చేసి కూర్చోబెట్టారని, ఇది ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వెలిబుచ్చింది. మహిళలపై దాడి చేసే హక్కు ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ చట్టంలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తపరిచింది. తన భర్తకు రెండు నెలల బెడ్ రెస్ట్ అని చెబుతున్నారని, ఇలా చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. దాడి చేసిన వారికే పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్త పరిచింది. ఇప్పటికై నా జరిగిన ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఇరువురికి గాయాలు వినుకొండ: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఇరువురికి గాయాలయ్యాయి. వినుకొండ – వెల్లటూరు మధ్యలో ఉన్న కురవ దగ్గరలోని పార్కు సమీపంలో గురువారం రాత్రి ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటేశ్వర్లు (27) మృతిచెందగా మరో ఇద్దరు హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. మృతుడు చింతపల్లి వెంకటేశ్వర్లుకి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నేడు ప్రత్యేక పీజీఆర్ఎస్ నరసరావుపేట: స్థానిక కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం శనివారం ఉదయం 10గంటలకు ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): అతివేగంగా వెళ్తు న్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఒక యువకుడు దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన మేడికొండ అన్వేష్(27), జెట్టి అజయ్(17), మేడికొండ అఖిల్బాబు (15), పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన ఈదులమూడి రాజ్కుమార్(24) స్నేహితులు. అజయ్, అఖిల్బాబు ఐటీఐ చదువుతుండగా అన్వేష్ పెయింటర్గా పనిచేస్తుంటాడు. రాజ్కుమార్ గుండిమెడలోని సోదరి ఇంటిలో ఉంటూ పెయింటింగ్ పనులకు వెళ్తుంటాడు. వీరు నలుగురు శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సెల్ఫోన్ రిపేరు నిమిత్తం ఒకే ద్విచక్ర వాహనంపై గుండిమెడ నుంచి గవర్నర్పేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్కు బయలుదేరారు. ద్విచక్ర వాహనాన్ని రాజ్కుమార్ నడుపుతుండగా వెనుక అజయ్, తర్వాత అఖిల్, ఆ తర్వాత అన్వేష్ కూర్చున్నారు. మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో వారధి దాటి ట్రాఫిక్ సబ్ కంట్రోల్ సమీపానికి చేరుకోగానే అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో నలుగురు కింద పడిపోయి రోడ్డుకు గుద్దుకున్నారు. అన్వేష్ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. -
హోరాహోరీగా రాష్ట్రస్థాయి పోటేళ్ల పోటీలు
బాపట్లటౌన్: బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామంలో శ్రీరామనవమిను పురస్కరించుకొని శుక్రవారం గొర్రెల కాపరుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పొట్టేళ్ల పందెం హోరాహోరీగా సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి 26 పొట్టేళ్లు పోటీల్లో పాల్గొన్నాయి. మూడు రౌండ్లలో ఉత్తమ ప్రతిభ కనపరిచి కాకుమానుకు చెందిన ముత్యాల నాగయ్య పోటేలు ప్రథమ బహుమతి సాధించింది. ద్వితీయ బహుమతి అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన మారుబోయిన దుర్గాప్రసాద్కు చెందిన పొటేలు సాధించింది. తృతీయ బహుమతి చిన్నగంజాం మండలం, ఉలిచి గ్రామానికి చెందిన ధీరకు చెందిన పోటేలు సాధించింది. నాల్గవ బహుమతి బాపట్ల మండలం, పిన్నిబోయినవారిపాలెం గ్రామానికి చెందిన పిన్నిబోయిన కోటేశ్వరరావుకు చెందిన పోటేలు సాధించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోటీలు సాయంత్రం 6 గంటలకు ముగిశాయి. పోటీలకు ప్రథమ బహుమతి క్షత్రియ సేవాసంఘం, ద్వితీయ బహుమతి పిన్నిబోయిన కృష్ణమూర్తి, తృతీయ బహుమతి కర్నేటి బాలకృష్ణ, నాగబాబు, నాల్గవ బహుమతి నక్కల నాగార్జునలు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు, గ్రామపెద్దలు, గొర్రెల కాపరుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో కాకుమాను పొట్టేలు బహుమతులు అందజేసిన నిర్వాహకులు -
బెట్టింగ్లకు బానిసలైతే జీవితం అంధకారమే
బాపట్లటౌన్: బెట్టింగ్లకు బానిసలైతే జీవితం అంధకారంగా మారుతుందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. శనివారం నుంచి దేశవ్యాప్తంగా ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో వీటిని అదునుగా చేసుకొని కొందరు స్వార్థపరులు, చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్లకు తెరలేపే అవకాశం ఉందన్నారు. బెట్టింగ్లకు బలి అవుతున్న వారిలో ఎక్కువ శాతం యువతేనన్నారు. సులభంగా అధిక రెట్టింపుల్లో నగదును అర్జించవచ్చని యువతకు ఆశ చూపుతూ బెట్టింగ్ ఊబిలో దించుతారన్నారు. ఒక్కసారి బెట్టింగ్ లకు అలవాటు పడితే వాటి నుండి బయటకు రావడం కష్టతరం అవుతుందన్నారు. బెట్టింగ్లో ఒకసారి ఆదాయం వచ్చినా పలుమార్లు నష్టపోవడం జరుగుతుందన్నారు. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి, చేసిన అప్పులను తీర్చడానికి యువత దొంగతనాలకు, ఇతర నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారన్నారు. బెట్టింగ్ అనేది పెనుభూతం లాంటిదని, ఆశ చూపి అధ:పాతాళానికి నెట్టేస్తుంది. యువత దానికి బలికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రికెట్ మ్యాచ్ లను వినోదం కోసం మాత్రమే చూడాలని, బెట్టింగుల వైపు మొగ్గు చూపకూడదన్నారు. యువత, విద్యార్థులు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా చదువుపై, తమ ఉజ్వల భవిషత్తుపై దృష్టి సారించాలన్నారు. తమ తల్లిదండ్రుల ఆశయాల సాధన కోసం ఉన్నతంగా జీవించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. బెట్టింగులకు పాల్పడుతున్నట్లయితే వారికి నచ్చచెప్పి ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలన్నారు. కొద్ది మొత్తంలో బెట్టింగ్ వేసినా ఉపేక్షించకూడదన్నారు. అదే భవిష్యత్తులో పెను వ్యసనంగా మారుతుందన్నారు. గతంలో బెట్టింగ్ లకు పాల్పపడిన వారిపై, అనుమానితుల పై నిఘా ఉంచామన్నారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగులను నిర్వహించినా, అమాయకులను, యువతను బెట్టింగ్ ఊబిలోకి లాగాలని ప్రయత్నించినా ఉపేక్షించబోమన్నారు. నిర్వాహుకులను గుర్తించి వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు -
జాతీయ ఆర్చరీ పోటీలు ప్రారంభం
పెదకాకాని: నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. పోటీలు ఏప్రిల్ 7వ తేదీ వరకు విశ్వవిద్యాలయం క్యాంపస్లో జరగనున్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2,300 మంది ఆర్చరీ క్రీడాకారులు, కోచ్లు రానున్నారు. అండర్ 10, అండర్ 13, అండర్ 15 విభాగాలుగా నిర్వహించనున్న పోటీలలో తొలి రోజున 723 మంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందమూరి తేజస్విని, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఎండీ ఎస్.భరణి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్షీశా, వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్సిటీ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ ఆర్చరీ వంటి క్రీడలు విద్యార్థులలో ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెప్పారు. అలాంటి పోటీలకు తమ విశ్వవిద్యాలయం వేదిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, ఇండియన్ ఆర్చరీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ, పీడీ ఎన్. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అమరావతిలో వైభవంగా సీతారాముల కల్యాణం
అమరావతి: దక్షిణ కాశీ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన అమరావతిలోని కోదండ రామ ఆలయంలో వేంచేసియున్న సీతాసమేత కోదండ రామ స్వామికి శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా వైభవంగా కల్యాణం నిర్వహించారు. స్వామి వారిని తొలుత దేవాలయంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఉంచి కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి పరాశరం రామకృష్ణమా చార్యులు ఆధ్వర్యంలో వైఖానస ఆగమానుసారం వేడుక జరిపించారు. సత్తెనపల్లి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవంటూ అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష పేపర్లు దిద్దేందుకు కనీసం కూర్చునేలా కూడా బల్లలు సరిపడా లేవని, భోజనాలు చేయటానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినం కావడంతో కొందరు ముందస్తుగా బయటకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో బయట గేటుకు తాళాలు వేయడంతో అధ్యాపకులు గేట్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్ష కేంద్ర పర్యవేక్షకుడితో కొందరు అధ్యాపకులు వాగ్వివాదానికి దిగారు. గుంటూరు వెస్ట్: జిల్లా లోని 16 మండలాల్లో శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించిందని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వడగాల్పులకు గురి కాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పనులు ఉంటే మినహా ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరినవారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. డీ హైడ్రేషన్కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధింత అధికారులు ప్రజలకు తగు సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు. ప్రకృతి సాగును పరిశీలించిన నేపాల్ బృందం కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) సంయుక్తంగా వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం‘ (ఏపీసీఎన్ఎఫ్) పద్ధతులను నేపాల్ బృందం పరిశీలించింది. శుక్రవారం గుంటూరులోని రైతు సాధికార సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంస్థ సీఈఓ రామారావు సదరు బృందంతో సమావేశమయ్యారు. ఆర్వైఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్ కుమార్ వర్చువల్గా ప్రకృతి వ్యవసాయంలో అనుసరిస్తున్న విధానాలు, రైతులకు అందుతున్న ప్రోత్సాహం, పరస్పర సహకారం, భవిష్యత్తులో ఈ రంగంలో చేపట్టాల్సిన కార్యాచరణ వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ బృందం కొల్లిపర మండలం, అత్తట గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించింది. క్షేత్రస్థాయిలో సాగు పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించింది. రైతు సాధికార సంస్థకు చెందిన కృష్ణారావు, ఎన్ఆర్ఓ యూనిట్ ఆధ్వర్యంలో పర్యటన కొనసాగుతోంది. -
అవగాహన లేకనే...
బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం బీచ్లతోపాటు, పర్యాటక రంగాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఆస్వాదించేందుకు వచ్చే ప్రయాణికులు రహదారిపై ఉన్న డైవర్షన్లు, అక్కడక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను కూడా గమనించడం లేదు. అవగాహన లేని ప్రయాణాలతోనే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. పర్చూరు వైపు నుంచి వాడరేవుకు వచ్చే మార్గంలో కారంచేడు వద్ద సుమారు 5 కిలోమీటర్ల ముందుగానే రోడ్డు డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం వలన ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కచ్చితమైన విజువల్ బోర్డులను ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చెయ్యాలని వాహనదారులు కోరుతున్నారు. -
ఇదేం.. ప్రగతి?
చంద్రబాబు పాలనలో తెనాలి పట్టణంలో అభివృద్ధి జాడే కనిపించడం లేదు. నిధుల లేమి కారణంగా ఇప్పటికే ప్రతిపాదించిన పనులను కూడా రద్దు చేస్తున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లుల అప్లోడ్, బిల్లుల చెల్లింపులో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రగతి మచ్చుకైనా లేదు. ఇదే కోవలో మున్సిపల్ కౌన్సిల్లో జనరల్ ఫండ్ కింద మంజూరు చేసిన పనులలో ప్రారంభం కాని వాటిని రద్దు చేసేందుకు అఽధికారులు సిద్ధమయ్యారు. కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. సమస్యలను పరిష్కరించి ప్రగతిని పట్టాలెక్కించాల్సిందిపోయి పనులనే రద్దు చేస్తున్న సర్కారు తీరుపై తెనాలి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి అర్బన్: తెనాలి పట్టణం 16.77 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 55,917 నివాస గృహాలున్నాయి. 2.60 లక్షల జనాభాతో జిల్లాలోనే ఏకై క సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా పేరుగాంచింది. ప్రతి ఏడాది వివిధ పన్నులు, షాపుల అద్దెలు వంటి వాటి ద్వారా రూ.36 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇవి కాకుండా 15వ ఆర్థిక సంఘం, ఇతర ప్రత్యేక గ్రాంట్ల ద్వారా సుమారు రూ.70 కోట్ల వరకు సమకూరుతుంటాయి. రద్దు కానున్న 214 పనులు అభివృద్ధి పనులు చేసేందుకు మున్సిపల్ సాధారణ నిధులతో పాటు వివిధ ఆర్థిక సంఘ నిధులు, ప్రత్యేక నిధులను ఉపయోగిస్తుంటారు. అయితే జనరల్ ఫండ్ కింద తెనాలి పట్టణంలో గత రెండు సంత్సరాలలో 500 పనులుకు టెండర్లు పిలిచారు. వాటిలో కొన్నింటిని పూర్తి చేయగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అసలు ప్రారంభానికి నోచుకుని పనులు 107 ఉన్నాయి. వాటి విలువ రూ.11.69 కోట్లు, అలాగే అగ్రిమెంట్ దశలో ఉన్నవి 44 ఉన్నాయి. వాటి విలువ రూ.5.67 కోట్లు, టెండర్లలో కాంట్రాక్టర్లు పాల్గొనని పనులు 63 ఉన్నాయి. వీటి విలువ రూ.6.01 కోట్లు. వీటన్నింటిని రద్దు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల మున్సిపల్ అఽధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. అంతేకాకుండా సాధారణ నిధుల కొరత ఉన్నప్పుడు ఎందుకు టెండర్లు పిలుస్తున్నారని ప్రశ్నించారు. దీంతో అధికారులు పనులు ప్రారంభించని, టెండర్లు దక్కించుకుని అగ్రిమెంట్ చేసుకోని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా డిపాజిట్ నగదును మున్సిపల్ బ్యాంకు ఖాతాలో జమ చేయాలనే భావనలో ఉన్నట్లు సమాచారం. దీనివల్ల తెనాలి పట్టణంలో సుమారు రూ.24 కోట్ల విలువ చేసే 214 అభివృద్ధి పనులు రద్దు కానున్నాయి. నిధుల లేమి.. బిల్లుల చెల్లింపులోజాప్యం జిల్లాలో ఏకై క సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న తెనాలిని నిధుల కొరత వేధిస్తోంది. వివిధ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు, ఇతర అత్యవసర పనులకు ఉపయోగించటం వల్ల ప్రతి నెలా ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసిన వెంటనే కంప్యూటర్ ఆపరేటర్లు బిల్లులు తయారు చేసి నిధి యాప్లో పొందుపరచటం లేదు. కాంట్రాక్టర్లు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయలేక టెండర్లను బహిష్కరిస్తూ వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరపకపోవటంతో పనులు చేసేందుకు ముందుకు రావటం లేదు. టెండర్లు దక్కించుకున్నాక వాటిని ప్రారంభించకుండా వదిలేయటం తెనాలిలో పరిపాటిగా మారింది. తెనాలిలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోంది. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి బిల్లుల తయారు చేయటంలో నెలకొన్న జాప్యాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ సాధారణ నిధుల కింద గతంలో మంజూరై పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నాం. వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే డిపాజిట్లను మున్సిపాలిటీకి జమ చేస్తాం. అలాగే ఆ పనులన్నింటినీ రద్దు కూడా చేయనున్నాం. నిధుల కొరత కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక నుంచి జనరల్ ఫండ్ కింద అభివృద్ధి పనులు కొంత కాలం నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –జేఆర్ అప్పలనాయుడు, కమిషనర్, తెనాలి పురపాలక సంఘం -
రుధిర రహధారి!
జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారింది. ప్రారంభానికి ముందే ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. వాడరేవు – పిడుగురాళ్ల 167ఏ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. వాస్తవానికి ఈ రహదారి ఇంకా ప్రారంభం కూడా కాలేదు. అక్కడక్కడ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వాహనదారులు మాత్రం ప్రయాణం చేస్తుండటంతో హెచ్చరిక బోర్డులు లేని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.కారంచేడు: చీరాల ప్రాంతంలోని సముద్ర తీరంగా పేరుగాంచిన వాడరేవు నుంచి కారంచేడు, పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, నకిరికల్లు, పిడుగురాళ్ల మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వరకు ఈ జాతీయ రహదారి ఉంది. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు నిర్మాణ పనులు చాలా వరకు పూర్తి చేశారు. చీరాల ప్రాంతంలోని రైల్వే లైన్పై నిర్మాణం చేయాల్సిన ఆర్ఓబీ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇవి ఇంకా పూర్తిస్థాయిలో చేయాల్సి ఉంది. పర్చూరు సమీపంలోని ఉప్పుటూరు, నాగులపాలెం సమీపంలోని సర్వీస్ రోడ్లు, కల్వర్ట్ల నిర్మాణం కూడా ఇంకా సాగుతూనే ఉంది. గత ఏడాది వచ్చిన భారీ వరదలతో జాతీయ రహదారి పనుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పొలాల మీదకు నీరు వచ్చింది. అప్పుడు రైతులు, ఆ ప్రాంత ప్రజల ఆవేదనను గమనించిన బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ వెంటనే స్పందించి ఘటన స్థలాన్ని పరిశీలించారు. జాతీయ రహదారిని అడ్డంగా పొక్లెయిన్లతో తవ్వించి వరద గ్రామాలను ముంచెత్తకుండా చర్యలు తీసుకున్నారు. వరదలు తగ్గినా ఇంత వరకు జాతీయ రహదారిని తవ్వించిన ప్రాంతాల్లో నేటికీ పనులు మందకొడిగానే సాగుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల వలన ఈ రహదారిపై వాహనాలను డైవర్షన్ ఇచ్చి ఎదురెదురుగా వచ్చే వాహనాలు సైతం ఒకే మార్గంలో ప్రయాణించాల్సి వస్తుందని కూడా వాపోతున్నారు. ఇలాంటి సమయాల్లో తెలంగాణతోపాటు ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి సముద్ర తీర ప్రాంతాలకు విడిది కోసం వచ్చే ప్రయాణికులు పలు ప్రమాదాలకు గురవుతున్నారు. పండుగ సమయాల్లో, శని, ఆదివారాలలోనూ యాత్రికులు ఎక్కువగా ఈ ప్రమాదాలకు గురవుతున్నారు. టోల్గేట్తోనూ తప్పని అవస్థలు ఈ జాతీయ రహదారిలో ఇంకా అనేక పనులు జరగాల్సి ఉంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం రహదారులు అందుబాటులో ఉంచారు. అయినప్పటికీ ఉప్పుటూరు వద్ద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా వద్ద టోల్ వసూలు చేస్తుండటం గమనార్హం. ఇటీవల ప్రయాణికులు, సమీప గ్రామాల ప్రజలు దీనికి నిరసనగా రహదారిపై ధర్నా చేశారు. టోల్ప్లాజా ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి సమీపంలోని 20–30 కిలోమీటర్ల దూరంలో నివాస గ్రామాల వాహనదారులకు పాస్లు కూడా ఇవ్వలేదు. సంబంధిత నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి వాహన యజమానులకు పాస్లు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలి. ఇప్పటికే అనేక మార్లు ఈ రహదారిలో ప్రయాణించే వాహనదారులకు అవగాహన కల్పించాం. కార్లు, జీపులు వంటి వాహనాల డ్రైవర్లు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవడంతోపాటు పరిమిత వేగంతోనే ప్రయాణించాలి. అనేక మందికి జరిమానాలు విధిస్తున్నాం. అయినా ప్రజల్లో చైతన్యం పెరగాల్సి ఉంది. – షేక్ ఖాదర్బాషా, ఎస్ఐ, కారంచేడు -
బాపట్ల
శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5884 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 536.30 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 18,516 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7500, గరిష్ట ధర రూ.9200, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది. 7 -
అంధుల క్రికెట్ పోటీల్లో ఆంధ్ర జట్టు ఘన విజయం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అంధుల క్రికెట్ టోర్నమెంట్లోమధ్యప్రదేశ్పై ఆంధ్ర జట్టు 5–0 తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు రోజులుగా స్థానిక అరండల్పేటలోని పిచ్చుకులగుంట క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (సీఏబీఏపీ), డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అంధుల క్రికెట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అంధుల క్రికెట్ ఇన్క్లూజివ్ చాలెంజర్స్ ట్రోఫీ‘ టీ20 బైలాటరల్ సిరీస్ను ఆంధ్ర జట్టు ఏకపక్ష విజయాలతో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్స్లో జట్టు సమిష్టిగా ఆడి విజయం నమోదు చేసింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ పోటీతత్వం ముందు అంధత్వం ఓటమి పాలైందని పేర్కొన్నారు. యువ క్రీడాకారులకు ఈ విజయం ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. దృష్టి లోపం ఉన్నా, గుండె నిండా ధైర్యంతో మైదానంలో ప్రదర్శించిన పోరాట పటిమ అద్భుతమన్నారు. విజేతలతోపాటు రన్నర్స్కు ట్రోఫీలతోపాటు నగదు బహుమతులు అంజేశారు. అంతర్జాతీయ అంధుల మాజీ క్రికెటర్ అజయ్కుమార్ రెడ్డి, ఎస్బీఐ డీజీఎం కృష్ణకుమార్, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వెంకటరమణప్ప, ఏఐబీఓిసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జయకుమార్, వీసీవైఏ అధ్యక్షుడు ఎల్.రత్నరాజ్ పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి
భట్టిప్రోలు: భట్టిప్రోలు–రేపల్లె జాతీయ రహదారి 216 ఏ సహా ఇతర రహదారుల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన రహదారిని పరిశీలించారు. ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో అందుకు కారణాలు తదితర వివరాలను పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మళ్లీ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మైనర్ల డ్రైవింగ్ను కట్టడి చేయాలన్నారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన వెంట రేపల్లె ఆర్డీవో శ్రీదేవి, సీఐలు వేమూరు, రేపల్లె పీవీ ఆంజనేయులు, సురేష్బాబు, ఎస్ఐ ఎం.శివయ్య, తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు, కొల్లూరు తహసీల్దార్, పలువులు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీ భూముల పరిశీలన బాపట్ల: సూర్యలంక అడవి రెవెన్యూ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పరిశీలించారు. గురువారం మైరెన్ పోలీస్స్టేషన్ పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సర్వే నెంబర్ 547/3ఏ7 లో ఉన్న 4 ఎకరాల 3 సెంట్లు ప్రభుత్వ భూమిని మ్యాప్ ద్వారా మండల సర్వే అధికారులు కలెక్టర్కు వివరించారు. నిర్మితమైన శివాలయం, మైరెన్ పోలీస్స్టేషన్, ఫిష్ ఆంధ్రషాపులు, పంచాయతీ స్థలం, బీచ్ వద్ద తుపాను రక్షణ భవనాన్ని, తుపాను రక్షణ భవనంలోని రెండు అంతస్తులు గల ప్రతి గదిని ఆయన పరిశీలించారు. సర్వే నెంబర్ 547/3ఏ7లో గల 4.03 సెంట్లు పంచాయతీ స్థలంలో గల శివాలయం, మెయిన్ పోలీస్ స్టేషన్, ఫిష్ ఆంధ్ర షాపులు మరియు ఖాళీ ప్రదేశం మొత్తం 3 ఎకరాల ప్రాంతం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయాలని, వాటికి సంబంధించి అంచనా తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆక్రమణలు తొలగించాలని సూచించారు. శివాలయ నిర్మాణంపై ఆరా తీశారు. బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, బాపట్ల మండల రెవెన్యూ అధికారి సలీమా, ఇన్చార్జి పంచాయతీరాజ్ డీఈ రామారావు, బాపట్ల ఎంపీడీవో బాబురావు, బాపట్ల మండల సర్వేయర్ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. రేపల్లె: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ సూచించారు. రేపల్లె బాపట్ల జాతీయ రహదారిలోని శివంగులపాలెం, కన్నెగంటివారిపాలెం, ఓలేరు వద్ద ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించి అధికారులతో చర్చించారు. ఆర్డీవో బూసి శ్రీదేవి, డీటీవో పరంధరామిరెడ్డి, భట్టిప్రోలు ఇన్చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ డీఈ రాజేష్, ఎస్ఐలు తదితరులు ఉన్నారు. -
భట్టిప్రోలులో సాంస్కృతిక కార్యక్రమాలు నేడు
భట్టిప్రోలు: భట్టిప్రోలు విఠలేశ్వర్నగర నగర్ వీధిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నట్లు పద్మశాలీయ సంఘం నిర్వాహకులు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా నగర్ వీధిలో రామమందిరం వద్ద నిర్మించిన చలువ పందిరిలో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. చిన్నారులతో కోలాటం, శ్రీ లక్ష్మి కూచిపూడి నృత్య కళా కేంద్రం నాట్య గురువు ఎ.వెంకట లక్ష్మి(తెనాలి) ఆధ్వర్యంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వివరించారు. తితిదే, బాల గోపాల భజన మండలి స్థానిక మాతా కాల్వెంట్ బాలికలతో కోలాట ప్రదర్శన జరుగుతుందని అధ్యక్షులు బూర్లె అరుణకుమారి, కొత్త నాగవెంకట రవితేజ పేర్కొన్నారు. రేపల్లె: రేపల్లె మున్సిపల్ స్పెషల్ అధికారిగా ఆర్డీవో బూసి శ్రీదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కౌన్సిల్ రద్దు కావడంతో పరిపాలనా బాధ్యతలు నిర్వహించేందుకు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ను నియమించింది. దీంతో స్పెషల్ ఆఫీసర్గా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలిచెరుకుపల్లి: జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో పోలీస్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రమాదాలను నియంత్రించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ పోలీస్, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. గురువారం మండలలోని కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని ఆయన పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. జాతీయ రహదారిపై వాహనాలు అతి వేగంగా వస్తాయని.. వాటి వేగాన్ని నియంత్రించేందుకు వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక ఎస్ఐ టి.అనీల్కుమార్కు సూచించారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలలో పలు ఉద్యోగాలను కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలు 85, ఆఫీస్ సబార్డినేట్స్ 26, ల్యాబ్ టెక్నీషియన్స్ 20, ల్యాబ్ అటెండెంట్ 10, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 8, ఇలా 27 రకాల ఉద్యోగాలు జీజీహెచ్, వైద్య కళాశాలలో భర్తీ చేస్తున్నామన్నారు. విద్యార్హతలు, వేతనాలు, వివరాల కోసం http: guntur.ap.gov.in లేదా www. gunturmedicalcollege.edu.in గుంటూరు మెడికల్ కాలేజ్.ఈడీయూ.ఇన్ వెబ్సైట్లో చూడాలన్నారు. -
గంజాయి చాక్లెట్లు పట్టివేత
బాపట్లటౌన్: పూరి నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో బాపట్ల ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా 70 గంజాయి చాక్లెట్లు, 8 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నామని బాపట్ల డీఎస్పీ పి. జగదీష్నాయక్ తెలిపారు. బాపట్ల డీఎస్పీ కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంజాయి కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు గురువారం ప్రత్యేక బృందం పూరి నుంచి తిరుపతి వెళ్తున్న రైలులో తనిఖీలు నిర్వహించామన్నారు. ఇందులో 8 కిలోల గంజాయి, 70 గంజాయి చాక్లెట్లను సీజ్ చేసి, అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒడిశా నుంచి వస్తున్న పున్నారెడ్డి, గౌతమ్ మాలిక్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రవికుమార్లను అరెస్ట్ చేశామన్నారు. వీరు వీటిని ఒడిశా నుంచి తీసుకువచ్చి ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నారన్నారు. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ -
రన్ ఫర్ జీసస్–2026 జయప్రదం చేయాలి
బాపట్ల: క్రైస్తవ్యం మతం కాదని.. సన్మార్గమని దిసాల్వేషన్ ఆర్మీ బాపట్ల నాయకులు మేజర్ వంపుగూడి యేసుపాదం పేర్కొన్నారు. బాపట్ల క్రైస్తవ నాయకుల రన్ ఫర్ జీసస్–2026 సదస్సుకు సంబంధించిన కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేజర్ వంపుగూడి యేసుపాదం మాట్లాడుతూ.. ఏప్రిల్ 4వ తేదీన జరిగే క్రీస్తు ప్రేమను చాటే రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గేరా మణి భూషణ్, కన్వీనర్ ఎఫ్ డబ్ల్యూ కోల్, బెనర్జీ మీనన్, రెవ రాహుల్ దేవ్, రెవ దాసరి కిషోర్, రెవ గడ్డం ఏలియా, రెవ జైపాల్, రెవ హనోక్, రెవ సుధాకర్, రెవ శామ్యూల్, రెవ దయాకర్, డాక్టర్ కాగిత వరప్రసాద్, చేగుడి బాబురావు, మాతంగి డేనియల్, జాకబ్ జయాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు. -
సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
చెరుకుపల్లి: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చెరుకుపల్లి మండల పరిసర గ్రామాల్లో ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాల వద్ద చలువ పందిళ్లు, ఆలయాలకు విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మండల కేంద్రంలో ఉన్న వీరరాఘవపేటలో కృష్ణబలిజ వారి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు 68వ వార్షిక స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. గుళ్ళపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో 23వ వార్షికోత్సవం, గౌడ సంఘం ఆధ్వర్యంలో 19వ వార్షికోత్సవ శ్రీ సీతారాముల వసంత నవరాత్రి కల్యాణ మహోత్సవాలు నిర్వహించేందుకు ఆయా కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. -
రామనవమికి సర్వం సిద్ధం
ముస్తాబైన ఆలయాలు, ఏర్పాటైన చలువ పందిళ్ళు రేపల్లె: శ్రీరామ నవమిని పురస్కరించుకుని రాములోరి కల్యాణానికి నియోజకవర్గంలో పలు ఆలయాలు ముస్తాబయ్యాయి. వివిధ కమిటీల ఆధ్వర్యంలో వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే రామాలయాలను విద్యుత్ద్దీపాల అలంకరణతో దేద్దీప్యమానంగా ముస్తాబు చేశారు. రైలుపేటలోని పట్టాభిరామస్వామి ఆలయం, రామకోటిపేటలోని కోదండరామస్వామి ఆలయం, నేతాజీనగర్లోని సీతారామాంజనేయస్వామి ఆలయం, పెద్ద పోస్టాఫీసు ఎదురు రోడ్డులోని రామాలయం సింగుపాలెం, కై తేపల్లి, పేటేరు తదితర గ్రామాలలోని రామాలయాలలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పట్టణంలో పాత స్టేట్ బ్యాంక్ వద్ద బాల భక్త బృందం, పెదకూరగాయల మార్కెట్లోని రామాలయం, మార్కెట్ సమీపంలోని వినాయక స్వామి ఆలయం వద్ద, ఇసుకపల్లిలో భారీగా చలువ పందిళ్ళు ఏర్పాటు చేసి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. -
ఆధునిక సాంకేతిక వ్యవసాయంపై మొగ్గుచూపాలి
రేపల్లె: రైతులు సాంప్రదాయ వ్యవసాయం నుంచి ఆధునిక సాంకేతికత వైపు దృష్టిసారించాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అద్దేపల్లి లక్ష్మి తెలిపారు. మండలంలోని నల్లూరుపాలెం గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ, ఆత్మల సంయుక్త ఆధ్వర్యంలో సాంప్రదాయ వ్యవసాయంలో సుస్థిరత సాధించే సాంకేతిక నైపుణ్యాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతుల నైపుణ్యాలను గుర్తించి ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న రైతులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అవ్వారు మహేష్బాబు, ఏఈఓలు కె.సుమంత్, ఎంపీఈఓ సతీష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. నల్లమోతువారిపాలెం(కర్లపాలెం): పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల వ్యాధులు ప్రబలుతాయని నల్లమోతువారిపాలెం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె.అనూష తెలిపారు. బాపట్ల ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నల్లమోతువారిపాలెంలో నిర్వహిస్తున్న సేవా శిబిరంలో అపరిశుభ్రత వ్యాధులపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అనూష మాట్లాడుతూ.. కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడంతో వ్యాధులు వస్తాయని చెప్పారు. గ్రామస్తులు తమ గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు శివనాగమణి, సుబ్బలక్ష్మి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల టౌన్: యువత మత్తుకు బానిసైతే జీవితం అంధకారం అవుతుందని వెదుళ్లపల్లి ఎస్ఐ భాగ్యరాజ్ తెలిపారు. మండలంలోని వెదుళ్లపల్లి జీబీసీ రోడ్డుపై మాదకద్రవ్యాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ట్రాఫిక్ రూల్స్పై గురువారం ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐ భాగ్యరాజ్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువతను వ్యసనాలకు బానిసలుగా మార్చి, వారి ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ, భవిష్యత్తును దెబ్బతీస్తుందన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో ఈగిల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ సురేష్, వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కర్లపాలెం: ఇంటి పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు కోరారు. కర్లపాలెంలో ఇంటి పన్నుల వసూలు కోసం గురువారం వినూత్నంగా ప్రచార కార్యక్రమం చేపట్టారు. తన కారుపై సౌండ్బాక్స్లు ఏర్పాటు చేసి వీధులో తిరుగుతూ ఇంటి పన్నులు చెల్లించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఎంపీడీఓ గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందితో కలిసి పన్నులు చెల్లించాల్సిన వారి ఇళ్లకు వెళ్లి ఇంటి పన్నులు చెల్లించాలని కోరారు. మండలంలో ఇప్పటి వరకు 9 పంచాయతీలలో నూరుశాతం పన్నుల వసూలు పూర్తయిందని తెలిపారు. మిగిలిన పంచాయతీలలో ఈనెలాఖరు లోపు పన్నుల వసూలు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. డెప్యూటీ ఎంపీడీఓ దొంతిరెడ్డి పద్మావతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ముస్లింలను దగా చేస్తున్న చంద్రబాబు
వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షురాలు నసీరున్నీసా బేగం రేపల్లె: ముస్లిం మైనార్టీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షురాలు నసీరున్నీసా బేగం అన్నారు. పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలు మోసపూరితమన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు అందించి ముస్లింలను ఆదుకునేందుకు రూ.173.57 కోట్లు కేటాయించినట్లు గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించి నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన దాఖలాలు లేవన్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన ఇఫ్తారు విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు బూటకపు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిననాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 33,275 మందికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ.193 కోట్ల రుణాలు అందిచినట్లు ప్రకటించి ముస్లిం సమాజాన్ని మోసగిస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా కేటాయింపు లేదని, అంతమందికి ఎక్కడ కేటాయింపులు చేశారో ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో పదేపదే అవాస్తవాలు చంద్రబాబు చెబుతున్నా తెలుగుదేశం పార్టీలోని ముస్లిం మైనార్టీ నాయకులు ప్రశ్నించకపోవటం మైనార్టీలను మోసగించటమేనన్నారు. ఇప్పటికై నా పార్టీలకు అతీతంగా చంద్రబాబు ప్రకటనలను ప్రశ్నించి ముస్లిం సమాజానికి న్యాయం జరిగేలా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. -
రాములోరి కల్యాణానికి వేళాయె!
కర్లపాలెం: శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. నవమిని పురస్కరించుకుని గ్రామాలలో గల రామాలయాల వద్ద సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చలువ పందిళ్లు వేసి ప్రత్యేక వేదికలను సిద్ధం చేశారు. చలువ పందిళ్లకు పలు రంగుల కాగితాలు, మామిడి తోరణాలు, అరటి చెట్లను అందంగా అలంకరించారు. సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు, స్వామివారి కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. బాపట్ల టౌన్: పట్టణంలోని రామాలయాల వద్ద శుక్రవారం నిర్వహించే సీతారాముల కల్యాణానికి ఆయా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు గురువారం ఏర్పాట్లను పూర్తిచేశారు. రామాలయాలను నూతన రంగులతో అలంకరించి కల్యాణం జరిగే ప్రాంతాలలో చలువ పందిళ్లను ఏర్పాటుచేశారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేసేందుకు ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాల్లో నిమఘ్నమయ్యారు. పట్టణంలోని రథం బజార్ సెంటర్లో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీస్థాయిలో చలువ పందిరి ఏర్పాటుచేశారు. ఇక్కడ వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సన్నద్ధమయ్యారు. భీమావారిపాలెం, బెస్తపాలెం, చీలురోడ్డు, కాకుమానువారిపాలెం, మార్కెట్ సెంటర్, మున్నంవారిపాలెం, చీలురోడ్డు, ఉప్పరపాలెంలోని రామాలయాల వద్ద ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. మండలంలోని ముత్తాయపాలెం, రామానగర్, ఆదర్శనగర్, అప్పికట్ల, కంకటపాలెం, పాండురంగాపురం, మరుప్రోలువారిపాలెం, పోతురాజుకొత్తపాలెం, దరివాద కొత్తపాలెం, వెదుళ్లపల్లి, పిన్నిబోయినవారిపాలెం గ్రామాల్లో సీతారాముల కల్యాణం కనులపండువగా జరుగనుంది. -
తండ్రిని హత్య చేసిన కుమారుడు
వేమూరు: ఆస్తి వివాదంతో తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... చుండూరు మండలంలోని మోదుకూరు గ్రామంలోని కందేపాడుకు చెందిన గండికోట నరసిహారావు రైల్వే శాఖలో గ్యాంగ్ మేన్గా పని చేసి పదవీ వివరమణ పొందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రవీంద్ర తన తండ్రిని సోమవారం రాత్రి హత్య చేశాడు. చుండూరు పోలీసు స్టేషన్లో తండ్రి కనిపించడం లేదని మంగళ వారం ఫిర్యాదు చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి రవీంద్రను అదుపులోకి తీసుకొని విచారించారు. తండ్రిని చంపినట్లు పోలీసులు వద్ద ఒప్పకున్నాడని ఎస్ ఐ చంద్రావతి బుధవారం తెలిపారు. అమృతలూరు మండలంలోని పంచాళవరం గ్రామంలోని పొలాల్లో ఉన్న బావిలో మృతదేహాన్ని పడవేసినట్లు చెప్పాడు. బావిలో శవం గుర్తించి బయటకు తీశామన్నారు. రవీంద్రపై కేసు నమోదు చేశారు. చిలకలూరిపేట: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, మోడరన్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో ఈ నెల 28న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఈ తమ్మాజిరావు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఫార్మాసీ, పీజీ వంటివి కలిగి ఉండి 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసు గలవారు దరఖాస్తు చేయవచ్చన్నారు. విద్యార్హతను బట్టి జీతం రూ. 14,500 నుంచి రూ. 35 వేలు వరకు ఉంటుందన్నారు. ఉదయం 9 – సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 98487 93357, 77029 21219 ఫోన్ నంబర్లకు సంప్రదించాలన్నారు. -
పెన్షన్ వాలిడేషన్ యాక్ట్కు వ్యతిరేకం
గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో తీసుకొచ్చిన పెన్షన్ వాలిడేషన్ యాక్ట్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పి.నాగరాజు తెలిపారు. ఈ రోజును తాము బ్లాక్ డే నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. పెన్షనర్లందరికి సమాన హక్కులు ఉండాలన్నారు. జనవరి 1, 2026 ముందు రిటైరైన వారు, తర్వాత రిటైరైన వారిని విభజించి పెన్షనర్లను తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పెన్షన్ కమ్యూటేషన్ పీరియడ్ను 12 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం డీఆర్వో షేఖ్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సీహెచ్.వెంకటేశ్వర్లు, ఎన్జీఓ నాయకులు మూర్తి, కోటేశ్వరరావుర, సాయిబాబు, నాగేశ్వరరావు, నాగేంద్రం, సుబ్బారావు పాల్గొన్నారు. -
నృసింహుని హుండీ ఆదాయం లెక్కింపు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దిగువ, ఎగువ సన్నిధులతో పాటు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులకు సంబంధించి హుండీ ఆదాయాలను బుధవారం ఆలయ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ మాట్లాడుతూ ఎగువ సన్నిధిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి రూ. 16,74,302, దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి రూ. 25,06,239, శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి రూ. 79,682, అన్నదానంకు రూ. 30,297 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని వైకుంఠపురం శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి అనుపమ పర్యవేక్షించారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ను బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్పాట్ వాల్యూయేషన్ జరుగుతున్న తీరు, తెన్నులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మూల్యాంకన విధుల్లో నిమగ్నమైన అధ్యాపకులకు ఇంటర్మీడియెట్బోర్డు నిర్దేశించిన వాల్యూయేషన్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని, వాల్యూయేషన్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన సూచించారు. బుధవారం రెండో స్పెల్లో భాగంగా కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కామర్స్, సివిక్స్ సబ్జెక్టులకు ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు. మూల్యాంకన విధానంలో తీసుకువచ్చిన సంస్కరణలు, ప్రశ్నల కోడ్స్, ప్రశ్నపత్రం సరళి, మార్కుల వెయిటేజీ తదితర అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్ఐవో, స్పాట్ వాల్యూయేషన్ క్యాంపు అధికారి సునీత, సహాయ క్యాంపు అధికారులు, కోడింగ్ అధికారులు పాల్గొన్నారు. ముప్పాళ్ళ: మైనర్ బాలికపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక (13)ను యువకుడు(23) మాయమాటలు చెప్పి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా గమనించి తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. బుధవారం బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లడాన్ని గమనించి మళ్లీ లైంగిక వేఽధింపులకు పాల్పడుతుండగా బాలిక సమీప బంధువులు యువకుడిని పట్టుకున్నారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు సమస్యల పరిష్కారం ముఖ్యం నరసరావుపేట రూరల్: నూతన సాంకేతిక పద్ధతులు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి తోడ్పాటును అందించేలా ఏరువాక కేంద్రం పనిచేయాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివన్నారాయణ తెలిపారు. మండలంలోని రావిపాడు ఏరువాక కేంద్రంలో జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ జి.శివన్నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖల సమన్వయం చేసుకుంటూ పంటలలో ఎదురయ్యే సమస్యలు, వాటి సమగ్ర నివారణ చర్యలు రూపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఏరువాక కేంద్రం కార్యక్రమాలను రైతు స్థాయిలో సమస్యలకు అనుగుణంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. -
గల్లంతయిన విద్యార్థి మృతదేహం లభ్యం
మేడికొండూరు: మండల పరిధిలోని పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీ గుంతలో ఈతకు దిగి గల్లంతయిన విద్యార్థి మృతదేహం బుధవారం మేడికొండూరు పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి బయటకు తీశారు. పలకలూరు గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థి చంద్రశేఖర్(16) తన స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో క్వారీ గుంతలో ఈతకు దిగి కనిపించకుండా పోయాడు. సంఘటన జరిగిన సమయం నుంచి మేడికొండూరు సీఐ మధుసూదన్ రావు తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం తాడేపల్లి నుంచి గజ ఈతగాళ్ళను రప్పించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్వారీ గుంతలలో రాళ్ళల్లో లోతుగా ఉన్న చంద్రశేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మతుని తండ్రి బండారు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు సిఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు.. పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీలో విద్యార్థి గల్లంతైన సంఘటన ప్రదేశానికి విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. తండ్రి రాంబాబు ఆటో డ్రైవర్ గా పని చేస్తూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివిస్తూ.. జీవనం సాగిస్తున్న ఈ తరుణంలో రెండవ కుమారుడు మృతి చెందటంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. తను ఆటోడ్రైవర్గా పనిచేసిన కుమారులు మాత్రం ఆ విధంగా ఉండకూడదని ఉన్నతంగా స్థిరపడేందుకు చదువే ఆధారంగా భార్యాభర్తలు కుమారుల కోసం కష్టపడుతూ ఉంటారని బంధువులు తెలిపారు. -
ఉపాధి కష్టాలు
వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో కూలీలకు కనీస వసతులు కరువయ్యాయి. మరోవైపు ఈ పథకం రద్దు చేసి కొత్తగా వీబీ జీ రాంజీ ప్రవేశపెట్టాలని కేంద్రం తీసుకున్న చర్యలకు నిరసనగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. చీరాల టౌన్: ఉపాధి హామీ కూలీలకు ఓ వైపు భానుడు ఉగ్రరూపం దాల్చి విపరీతంగా ఎండలు కాస్తున్నా తాగేందుకు నీరు, పనిప్రదేశంలో టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. ఎండలో చెమటోడ్చి పనిచేసినా ఎప్పుడు కూలీ డబ్బు అందుతుందో తెలియడం లేదు. డబ్బు విడుదలలో జాప్యం కావడంతో జాబ్కార్డులు ఉన్నా పనులకు వచ్చేందుకు కూలీలు అయిష్టత చూపుతున్నారు. చీరాల మండలంలోని 15 పంచాయతీల్లో 8,823 జాబ్కార్డులు ఉన్నాయి. అధికారుల లెక్కల్లో మాత్రం 5,036 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీటిలో 2,381 మంది కూలీలకే పని కల్పిస్తున్నారు. మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో పనులు జరుగుతున్నాయి. కేవలం గ్రామాల్లో పంటకాలువల పూడికతీత మాత్రమే నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పని చేసిన శ్రామికులకు రోజు కూలీ రూ.307గా నిర్ధారించారు. కొలతల్లో తేడాలు, ఇతరత్రాల పేరుతో శ్రామికులు ఒక్కొక్కరికి రొజుకు చెల్లింపు చేస్తోంది రూ.278 మాత్రమే. కూలీలకు సంబంఽధించిన డబ్బు వారి బ్యాంకు అకౌంట్లలో జమ అవుతుందని చెబుతున్నా కొద్ది నెలలుగా డబ్బులు సక్రమంగా పడటం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.6 కోట్ల ఉపాధి పనులను అధికారులు గుర్తించారు. 2026 మార్చి 31 కల్లా ఉపాధి శ్రామికులకు 2.10 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. కేవలం 1.7 లక్షల పనిదినాలను మాత్రమే కల్పిస్తున్నారు. ఉపాధి పని చేసిన కూలీలకు వారానికి చొప్పున బిల్లుల రూపంలో పంపినా కూలీల బ్యాంకు ఖాతాల్లో సక్రమంగా జమ కావడం లేదు. ఈ కారణంతో కూడా కొంతమంది పనులకు రావడంలేదని అధికారులు చెబుతున్నారు. ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తారా? పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే పనులు చేపడుతున్నారు. కూలీలకు మౌలిక వసతులు కల్పించడం లేదు. ఈ ఏడాది మాత్రం కూలీలకు మజ్జిగ అందించేందుకు నిధులే రాలేదు. టెంట్లు కూడా వేయడం లేదు. కూలీలు తెచ్చుకున్నదే తింటున్నారు. తాగునీరు కూడా అందివ్వడం లేదు. కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం లేదు. గతంలో పనిచేసిన ఉపాధి కూలీలకు పెండింగ్ బకాయిలు ప్రాధాన్యత క్రమంలో వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇటీవలే ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. ఎండ వేడికి కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు తెచ్చుకోవాలని ఆదేశించాం. మజ్జిగ పంపిణీ చేస్తారో లేదో తెలియదు. మెడికల్ కిట్లు పీహెచ్సీలోని ఏఎన్ఎంల నుంచి తీసుకుంటున్నాం. అందరికీ ఉపాధి పనులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. – దాసు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో, చీరాల -
బాబుచులాట..!
చీరాల అర్బన్: ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు చీరాల పర్యటన రద్దయింది. ఈ మేరకు కలెక్టర్ వి.వినోద్కుమార్ బుధవారం ప్రకటించారు. 28వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉన్నందున సీఎం పర్యటన రద్దయినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలనుకున్న వారికి నిరాశ మిగిలింది. ఈ క్రమంలో తమ అవినీతి బండారం బయట పడుతుందేమోనని ఆందోళన చెందుతున్న వారిలో ఆనందం కనిపిస్తోంది. రెండో పర్యాయం రద్దు గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన తరువాత చంద్రబాబు చీరాల పర్యటన రద్దు కావడం ఇది రెండో పర్యాయం. 2024 ఆగస్టులో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని చీరాల మండలం జాండ్రపేట (దేవాంగపురి) హైస్కూల్లో ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతానని ప్రకటించారు. అయితే ఆ రోజు వర్షంతో వాతావరణం అనుకూలించలేదని సీఎం పర్యటనను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఏడాదికి రూ.25 వేలు ఎప్పుడో? గత ఎన్నికల ప్రచారంలో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు నమ్మబలకడంతో వారు నమ్మారు. తొలి ఏడాది అమలు చేయలేదు. రెండో ఏడాది అమలు కాలేదు. – ఇదిలా ఉంటే గత అసెంబ్లీ సమావేశాల్లో ఉపవృత్తుల వారికి కూడా మగ్గం ఉన్న వారితో సమానంగా లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపడతామని మంత్రి సవిత చెప్పారు. అవేమీ అమలు కాలేదు. దీంతో చీరాల పర్యటనకు వస్తున్న చంద్రబాబుకు నేతన్నలు తమ గోడును నేరుగా వెళ్లబోసుకుందామని అనుకున్నారు. టెక్స్టైల్ పార్కు విషయం ప్రస్తావించాలని భావించారు. అవినీతిపరుల్లో ఆనందం ... ప్రధానంగా రేషన్ మాఫియా, ఇసుక అక్రమ రవాణా, అనధికారిక లేఅవుట్లు, పైరవీలు చేసేవారు. వారికి కొమ్ము కాస్తున్న వారు సీఎం పర్యటన ప్రకటన విడుదలైన రోజు నుంచి ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ తమ అవినీతి బాగోతాల గుట్టును రట్టు చేసే విధంగా ఎవరు ఏ విధంగా స్పందిస్తారోనని మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే సీఎం పర్యటన రద్దు కావటంతో వారు ఆనంద పడుతున్నారు. ఇక నియోజవకర్గ సమస్యలను, అవినీతికి పరాకాష్టగా మారిన అంశాలను, పార్టీ స్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణపై సూచనలు చేద్దామనుకున్న వారు పర్యటన రద్దుతో చాలా బాధపడుతున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటనను చీరాల మండలం వాడరేవులో ఖరారు చేశారు. ఈ క్రమంలో మత్స్యకారులు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. ప్రధానంగా వాడరేవు తీరంలో ఫిషింగ్ హార్బర్ను ఎప్పుడు నిర్మాణం చేస్తారనే విషయంలో స్పష్టత కోరాలని తలచారు. హార్బర్ నిర్మాణం పూర్తయితే తమకు ఒనగూరే ప్రయోజనాలను వివరించాలని భావించారు. అయితే పర్యటన రద్దు కావటంతో తమ ఆలోచనలు ఆవిరయ్యాయని బాధ పడుతున్నారు. -
బాపట్ల
నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7600, గరిష్ట ధర రూ.9300, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది. సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 536.70 అడుగులకు చేరింది. ఇది 181.5216 టీఎంసీలకు సమానం. ఒక్కరోజే రూ. 2.55 కోట్లు నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీని వినియోగించుకుని బుధవారం రూ. 2.55 కోట్లు పన్నులు ప్రజలు చెల్లించారని కమిషనర్ తెలిపారు.7 -
రేపటి నుంచి నేపాల్ ప్రతినిధి బృందం పర్యటన
రేపల్లె/బాపట్ల: రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీఓ)గా బూసి శ్రీదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా కేఆర్సీలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా బాధ్యతలు తీసుకున్న ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందించటం జరుగుతుందని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని డివిజనల్ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారిగా బి.శ్రీదేవి బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ని మర్యాద పూర్వకంగా కలిశారు. బుట్టాయగూడెం: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురు గాయపడిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలోని శివాలయం సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరానికి చెందిన తాళ్లభోగి సురేష్, కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, మనవడితో పొగాకు పనుల నిమిత్తం వచ్చి కంసాలిపాలెంలో నివాసముంటున్నారు. మనవడు చిన్నా పానీపూరీ అడగడంతో సురేష్ కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, చిన్నాతో కలిసి ద్విచక్రవాహనంపై బుట్టాయగూడెం వస్తున్నారు. అదే సమయంలో స్థానిక అరుంధతీ కాలనీకి చెందిన ఉండ్రాజవరపు కాంతారావు, మరో యువకుడు ద్విచక్ర వాహనంపై బుట్టాయగూడెం నుంచి శివాలయం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రియాంక, చిన్నా, శ్రావణిలకు స్వల్ప గాయాలు కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే వైద్య సేవలు అందించారు. కాంతారావు, సురేష్ల పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో జంగారెడ్డిగూడెం తరలించారు. -
పైసా మే..పాస్
తరగతులకు హాజరు కాకుండానే కేవలం పరీక్ష రాస్తే చాలు బీఈడీ సర్టిఫికెట్ ఇస్తారంటూ దేశవ్యాప్తంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరువు పోయింది. పైసలిస్తే చాలు ప్రాక్టికల్ రాయకుండానే పాస్ అనే తీరులో మరోసారి అభాసుపాలైంది. బీఈడీ ప్రాక్టికల్స్ పేరిట ఏఎన్యూలో రూ.కోట్ల విద్యావ్యాపారం జరిగింది. బీఈడీ కళాశాలలు రూ.లక్షలు విరజిమ్మి... లక్ష్యం నీరుగార్చారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఏఎన్యూ పరిధిలో 2024– 26 బీఈడీ విద్యాసంవత్సర ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 10 నుంచి 25వ తేదీ వరకు మూడు విడతలలో నిర్వహించారు. దాదాపు 7 వేల మంది విద్యార్థులు హాజరు కావలసిన ఈ పరీక్షలలో 4500 నుంచి 5000 మంది ఇతర రాష్ట్రాలవారే. తెలంగాణ, ఒడిశా, అసోం, మిజోరాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకో రేటు నిర్ణయించి వసూలు చేశారు. 50 మార్కుల పరీక్షకు 49గానీ, 50గానీ మార్కులు వేసి ఏఎన్యూని మరోసారి భ్రష్టుపట్టించారు. విచ్చలవిడిగా ధనార్జన ఏఎన్యూ పరిధిలోని 60కి పైగా కళాశాలల్లో అనేకమంది విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో దోచుకున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.10 వేల నుంచి రూ.12 వేల చొప్పున ఒక సిండికేట్ కళాశాలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇలా వసూలు చేసినట్లు సమాచారం. బీఈడీ ప్రాక్టికల్స్ పేరిట విద్యా వ్యాపారం రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు జరిగిందని పల్నాడులోని ఓ కళాశాల కరస్పాండెంట్ తెలిపారు. పల్నాడులోని ఒక ప్రిన్సిపాల్, నర్సరావుపేటలోని ఒక లెక్చరర్, కళాశాల నుంచి కలెక్షన్ చేసే ఏజెంట్లుగా వ్యవహరించారు. వీరు అనధికారికంగా యాజమాన్యాలను బెదిరించి మరో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా వీరే దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో ఎగ్జామినర్కి రోజుకి రూ.2 వేల నుంచి రూ.2,500 చొప్పున కొన్ని కళాశాలలు చెల్లించాయి. గైర్హాజరైన ప్రతి విద్యార్థికి రూ. 500 అదనంగా కొందరు చెల్లించారు. ప్రాక్టికల్ ఫీజ్ పేరిట కొన్ని కళాశాలల్లో రూ.2,000 నుంచి రూ.5,000 వసూలు చేశారు. మెయింటెనెన్స్ ఫీజు అంటూ రూ.లక్ష నుంచి రూ. 2 లక్షలు దక్షిణగా సమర్పించారు. తొమ్మిది రోజుల పరీక్షల తంతులో రూ.ఐదు కోట్ల వరకు విద్యావ్యాపారం జరిగిందని తెనాలికి చెందిన ఒక ఇంగ్లిషు లెక్చరర్ తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో బురిడీ కొట్టించారు. వినుకొండ, తెనాలి ప్రాంతంలోని మూడు చొప్పున కళాశాలల్లో క్లర్కులు, ప్రిన్సిపల్స్ ఇలా ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విద్యార్థుల, పరిశీలకుల సంతకాలు పోల్చి విచారణ జరిపితే అనేక మందిపై చర్యలు ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. సంతకాలను పోలిస్తే అవకతవకలు బహిర్గతం కానున్నాయి. మూడవ సెమిస్టర్ హాల్ టికెట్లలో విద్యార్థుల సంతకాలను ప్రాక్టికల్ పరీక్ష డైలీ రిపోర్టు సంతకాలతో పోలిస్తే నకిలీల గుట్టు రట్టవుతుందని తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖాధికారి అనుమతితో ఎన్ని కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు నిర్వహించాయో పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. పల్నాడులోని ఇద్దరు అయ్యవార్ల ఫోన్ పేలు, కాల్ లిస్టులపై విచారణ జరిపితే రూ.కోట్ల కుంభకోణం వెలుగు చూడటం తథ్యమనే వాదనలు తెరపైకి వచ్చాయి. విద్యావ్యవస్థను కాసుల కోసం దిగజార్చిన వారి అక్రమాలకు కళ్లెం పడుతుంది. -
ఆర్డీఓగా బాలకృష్ణ బాధ్యతల స్వీకరణ
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా నియమితులైన బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన బదిలీల్లో భాగంగా ఆయన నందిగామ నుంచి నరసరావుపేటకు వచ్చారు. ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన కె.మధులతను రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు బదిలీ చేశారు. పలువురు ఉద్యోగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. నరసరావుపేట డివిజన్ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని నూతన ఆర్డీఓ వెల్లడించారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక బృందావన్గార్డెన్న్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నయ్య కళావేదికపై పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మాగంటి మురళీమోహన్ ద్వితీయ నాటకోత్సవాలు, గుమ్మడి శ్రీమన్నారాయణ కళా సమితి, వైకే.నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ తొమ్మిదవ వార్షికోత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహాకులు కాట్రగడ్డ రామకృష్ణప్రసాద్, బొప్పన నరసింహారావు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈనెల 28, 29, 30 తేదిల్లో నాటకోత్సవాలు కొనసాగుతాయని అన్నారు. 28న ఏపీ సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్మన్ తేజస్వినికి డాక్టర్ మురళీమోహన్ రంగస్థల పురస్కారం, మా ఇంట్లో మహాభారతం నాటిక ప్రదర్శిస్తారని తెలిపారు. 29న నువ్వో సగం, నేనో సగం నాటిక, 30న ఆర్యచాణక్య చారిత్రాత్మిక నాటకం ప్రదర్శించనున్నారని అన్నారు. -
హామీల అమలులో చంద్రబాబు విఫలం
పుల్లలచెరువు: సూపర్ సిక్స్ పథకాలు హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు.. గద్దెనెక్కిన తర్వాత ఆ సంగతే మరిచారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్, ఆ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. పుల్లలచెరువు మండలంలోని మల్లాపాలెంలో శ్రీ సుబ్బారెడ్డి స్వామి తిరునాళ్ల సందర్భంగా సోమవారం రాత్రి ఎమ్మెల్యే చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. – ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించ లేదని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వని చంద్రబాబు.. తన కుమారుడికి మాత్రం మంత్రి ఉద్యోగం ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. అర్హులైన వారికి పింఛను ఎగ్గొట్టారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారటీలకు 50 ఏళ్లకే పింఛను హామీ ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం ఊసే లేదని, రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 22 నెలల్లో రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, ఆ సొమ్మంతా టీడీపీ, జనసేన నేతలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గ పాలనను ప్రజలు గమనించాలని సూచించారు. రాబోయేది వైఎస్సాఆర్ సీపీ ప్రభుత్వమే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే రానుందని పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు మరో రెండేళ్లు ఓపిక పట్టాలని సూచించారు. రెడ్ బుక్ పేరుతో మంత్రి లోకేష్ అండ్ కో సాగిస్తున్న అరాచకాల్లో పాలుపంచుకున్న వారిని చట్ట ముందు నిలబెట్టి శిక్షిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురి చేసిన వారి పేర్లు రాసి పెట్టుకోవాలని, వారిని వదిలే ప్రసక్తి లేదని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ వాగ్యానాయక్, రాష్ట్ర వలంటరీ విభాగం కార్యదర్శి బి.సుబ్బారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ ఎల్.రాములు, సర్పంచ్లు టి.సత్యనారాయణరెడ్డి, ఎ.రమణారెడ్డి, కార్యవర్గ సభ్యుడు కె.రఘు, నాయకులు ఆవుల రవణారెడ్డి, గడ్డం సుబ్బయ్య, రోసిరెడ్డి, వాసు, శ్రీనివాసరెడ్డి, చరణ్రెడ్డి, నాసర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
9 అసెంబ్లీ స్థానాలు పెరగొచ్చు...
సాక్షి, నరసరావుపేట: దేశంలో లోక్సభతోపాటు శాసనసభ స్థానాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలోనే ఈ బిల్లును ఆమోదించేలా అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో నేతలు ‘కొత్త’ లెక్కలేసుకుంటున్నారు. జిల్లాలో కొత్తగా ఎన్ని సీట్లు పెరగనున్నాయి, ఏ మండలాలతో ఏర్పడితే రాజకీయంగా తమకు అనుకూలమనే ఆలోచనలో వారు ఉన్నారు. సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు తమ సొంత మండలం కొత్తగా ఏర్పడే వేరే నియోజకవర్గంలోకి వెళితే ఏం చేయాలన్న ఆలోచనలు మొదలుపెట్టారు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా పునర్విభజన ద్వారా ఏకంగా 50 శాతం స్థానాల సంఖ్య పెరుగుతాయన్న వార్తలతో ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టసభలకు వెళ్లాలనుకునే వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగడం, మహిళా రిజర్వేషన్ అమలులోకి రానుండటంతో కొత్తవారికి చట్టసభలకు వెళ్లే అవకాశాలు పెరగనున్నాయి. 2008లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో కొంతమేర మార్పుచేర్పులు జరగగా... తాజా పునర్విభజనతో సమూల మార్పులు రానున్నాయని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కేవలం అసెంబ్లీ స్థానాలు మాత్రమే మార్పు జరగగా... ఈసారి లోక్సభ స్థానాలలో సైతం పునర్విభజన జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఏడు చొప్పున, బాపట్ల జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. తాజా పునర్విభజన తరువాత ఉమ్మడి జిల్లాలో కొత్తగా 8 నుంచి 9 స్థానాలు పెరిగే అవకాశముంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 25గానీ, 26గానీ కానుంది. గతంలో అసెంబ్లీ స్థానాలుగా ఉండి రద్దు అయిన ఫిరంగిపురం, పెదకాకాని, దుగ్గిరాలలతోపాటు గుంటూరు రూరల్, నగరం, రొంపిచర్ల, పిడుగురాళ్ల, కారంపూడి, అమరావతి వంటి కొత్త అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ స్థానాలు కొత్తగా మరో 9 పెరగనున్న నేపథ్యంలో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మరోవైపు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు నియోజకవర్గాలు ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు కాగా... ఈ సంఖ్య పునర్విభజన తరువాత పెరగనుంది. ప్రస్తుతం గుంటూరు ఈస్ట్, వెస్ట్తోపాటు తెనాలి, నరసరావుపేట వంటి అర్బన్ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశముంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాలు 17 నుంచి 26కు పెరిగితే అందులో మూడో వంతు మహిళలకు రిజర్వు కానున్నాయి. ఈ లెక్కన 9 అసెంబ్లీ స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్లు రాష్ట్రాన్ని యూనిట్గా చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్య ఒకటి తగ్గడం లేదా పెరగడం జరిగే అవకాశముందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు లోక్సభ స్థానాలలో సైతం ఒకటి లేదా రెండు ప్రత్యేకంగా మహిళలక రిజర్వు అయ్యే అవకాశముంది. మహిళా రిజర్వేషన్ ద్వారా చట్టసభలకు వెళ్లే అతివల సంఖ్య ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పెరగనుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాత్రమే మహిళా ఎమ్మెల్యే ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రజల్లో చర్చలు.. నేతల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు ఉత్సాహంగా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూపురేఖలు పూర్తిగా మారేలా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ ప్రాంతం ఏ నియోజకవర్గంలో ఉంటోందననే లెక్కలు అప్పుడే మొదలయ్యాయి. 9 శాసనసభ, 2 లోక్సభ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే అవకాశం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో అతివలకు మరింత అందలం ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు మహిళలకు కేటాయింపు ఏ ప్రాంతం ఏ నియోజకవర్గంలోనో.. అభ్యర్థి ఎవరో.. అంటూ ప్రజల్లో చర్చ భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్న రాజకీయ నేతలు -
చోరీ కేసులో నిందితుడు అరెస్టు
కనిగిరి రూరల్: పట్టణంలోని ఆకృతి షాపింగ్ మాల్లో చోరీకి పాల్పడిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు ఇన్చార్జి డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. నిందితుడి నుంచి రూ 9,49,800 నగదు, 30 గ్రాముల బంగారు సరుడు, ఏపీ 27బీఎం 3997నెంబర్ గల మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కనిగిరిలోని కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. కనిగిరి శివారులో పొదిలి రోడ్డులోని లారీ ఆఫీసు వద్ద సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సందీప్ కుమార్ వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వడ్డమాను శివారెడ్డి(అంకిరెడ్డి పాలెం, గుంటూరు జిల్లా)ను అదుపులోకి తీసుకుని విచారించారు. కనిగిరిలో ఆకృతి షాపింగ్ మాల్లో చోరీకి పాల్పడటంతోపాటు దర్శిలో బైక్ అపరిహించినట్లు నిందితుడు అంగీకరించాడు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 24 చోరీ కేసులు నిందితుడిపై నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుడి అరెస్టులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధనరాజు ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
ఘనంగా జిల్లెళ్లమూడి అమ్మ జయంతి వేడుకలు
బాపట్ల: మండలంలోని జిల్లెళ్ళమూడి అమ్మవారి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. దేవాలయంలోని శ్రీ హైమాలయోత్సవములలో విశ్వజననిగా, అన్నపూర్ణేశ్వరిగా ప్రసిద్ధిగాంచిన మాతృశ్రీ అనసూయ మహాదేవికి ప్రత్యేక పూజలు చేపట్టారు. పుణ్యక్షేత్రంలో 27వ తేదీ వరకు శ్రీ హైమాలయోత్సవములు, 28, 29 తేదీలలో 104వ జన్మదినోత్సవాలు జరగనున్నాయి. 25న సామూహిక శ్రీ హైమవతి వ్రతాలు, 26న మూలవిరాట్కి ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీరామనవమి సందర్భంగా 27న శ్రీ అనసూయేశ్వరాలయంలో శ్రీ సీతారాముల ప్రత్యేక పూజ, భజనలు ఉంటాయి. 28న శ్రీ అనసూయా మహాదేవి 104వ జన్మదినోత్సవము సందర్భంగా అమ్మ జన్మస్థలమైన మన్నవ గ్రామంలో, ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక అనసూయా వ్రతాలు, అనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుంది. 29న శ్రీ అనసూయేశ్వరాలయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక అనసూయా వ్రతాలు, కిరీట ధారణ తదితర కార్యక్రమాలు చేపడుతారు. ఈ మేరకు ట్రస్టు కోశాధికారి జొన్నాభట్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. -
మార్టూరులో మరో సైబర్ క్రైమ్ కలకలం
మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరులో మంగళవారం రాత్రి మరో సైబర్ క్రైమ్ వెలుగు చూసింది. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నాగరాజుపల్లి సెంటర్లో మెడికల్ షాప్ నిర్వహించే ఓ యువకుడి వద్దకు సుమారు 20 రోజుల క్రితం ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. తన బ్యాంకు ఖాతా నుంచి పరిమితికి మించి నగదు డ్రా చేసుకున్నందున టాక్స్ సమస్యలు ఉంటాయని నా స్నేహితుడు నీ బ్యాంకు ఖాతాలో రూ.ఐదు లక్షలు జమ చేస్తాడని, అవి నీవు డ్రా చేసి నాకు ఇస్తే లక్ష కు రూ.3 వేల చొప్పున రూ.5 లక్షలకు రూ.15 వేలు కమీషన్గా ఇస్తానని మెడికల్ షాప్ యువకుడిని నమ్మించాడు. అతడిని నమ్మిన మెడికల్ షాప్ యువకుడు తన బ్యాంక్ ఖాతా నంబరును అపరిచిత వ్యక్తికి ఇచ్చాడు. తరువాత పనులన్నీ చకచకా జరిగిపోయాయి. మెడికల్ షాప్ యువకుడి బ్యాంకు ఖాతాలో గుర్తు తెలియని మరో బ్యాంక్ ఖాతా నుంచి రూ.5 లక్షలు జమయ్యాయి. తన ఫోన్కు వచ్చిన మెసేజ్ చూసుకున్న మెడికల్ షాప్ యువకుడు అపరిచిత వ్యక్తికి రూ.5 లక్షలు డ్రా చేసుకోవడం కోసం తన బ్యాంకు చెక్ ఇచ్చి ముందుగానే రూ.లక్షకు రూ.3 వేల చొప్పున రూ.15 వేలు కమీషన్ అందుకున్నాడు. ఇది జరిగిన 20 రోజులు తర్వాత మంగళవారం సాయంత్రం హైదరాబాదు నుంచి వచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు మెడికల్ షాప్ యువకుణ్ణి అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి వారికి సమాచారం అందించి ఆ యువకుడిని హైదరాబాద్ తీసుకువెళ్లారు. కోలలపూడి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా నుంచి ఓ కిలాడి మహిళ రూ.కోటి తొమ్మిది లక్షలు మాయం చేసి నాలుగు రోజులు కూడా గడవకముందే మరో ఉదంతం వెలుగు చూడటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. క్షయ వ్యాధి నివారణపై అవగాహన పెంచాలి జిల్లా వైద్యాధికారిణి డాక్టరు విజయమ్మ బాపట్ల: క్షయవ్యాధి నివారణపై ప్రజలలో అవగాహన పెంచాలని జిల్లా వైద్యాధికారిణి డాక్టరు విజయమ్మ పేర్కొన్నారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బాపట్ల పట్టణంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టరు విజయమ్మ మాట్లాడుతూ 100రోజులు పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి ఒక్కరు టీబీవ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ అధ్యక్షులు బి.ఎస్.నారాయణభట్టు, డాక్టరు సోమల నాయక్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. రేపల్లె: పట్టణంలోని ఓల్డ్ టౌన్లో వేంచేసియున్న గ్రామదేవత బూరగలమ్మ వారికి పుష్కర మహా కుంభాభిషేక మహోత్సవాలు మంగళవారంతో రెండవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వేకువ జాము నుంచే ఆలయ అర్చకులు నందివెలుగు భానుసుధాకర్ గురుకులు, బాలాజీ గురుకులు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పట్టు, రజత వస్త్రాలంకరణ చేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో నిత్య హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మ వారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. -
మేఘా క్యాంపును పరిశీలించిన ఏడీసీ సీఎండీ
తాడికొండ: రాజధాని పరిధిలో రాయపూడి – తుళ్లూరు గ్రామాలకు చేరువలో మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన స్టాక్ పాయింట్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి మంగళవారం పరిశీలించారు. ఎల్పీఎస్ జోన్ – 6 అభివృద్ధి కోసం తీసుకొచ్చిన మెటీరియల్ స్టాక్ను కాంట్రాక్టర్ ఇక్కడ ఉంచారని, ఈ ప్రమాదంలో ఎల్పీఎస్ నిర్మాణ పనులకు తీసుకువచ్చిన వివిధ రకాల యుటిలిటీ పైపులు అగ్నికి ఆహుతైనట్లు ఏడీసీ చీఫ్ ఇంజినీరు సీహెచ్ ధనుంజయ సీఎండీకి వివరించారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. అగ్ని ప్రమాదానికి కారణాలను లోతుగా పరిశోధించాలని ఆమె ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్టాక్ పాయింట్లలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. పరిశీలించిన ఇంటిలిజెన్స్ ఎస్పీ, జిల్లా ఎస్పీలు తాడికొండ: రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలం రాయపూడి సమపంలో మేఘా ఇంజినీరింగ్ కంపెనీ స్టాక్ యార్డు వద్ద మంగళవారం పైపులు తగలబడిన ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘటనా స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసకున్నారు. ఆర్ఎఫ్ఎస్ఎల్, ఎఫ్ఎస్ఎల్ బృందాలతో కలిసి పరిసరాలను పరిశీలించి 22 లాటులు పీఎల్బీ పైపులు కాలిపోయినట్లు గమనించారు. ప్రమాదానికి కారణమైన వారిని తక్షణమే గుర్తించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. సీసీ టీవీ పుటేజీలు పరిశీలించడంతో పాటు పాత నేరస్తులు, అనుమానితుల కదలికలను గమనించాలని సూచించారు. ఆయన వెంట లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
బాపట్ల: అభివృద్ధిలోనూ, అన్ని రంగాలలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులందరూ కలసి కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. బాపట్ల జిల్లాలో ప్రజల తలసరి ఆదాయం బాగా పెరగడం, వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధి రేటు మరింత మెరుగుపడిందని మంత్రి తెలిపారు. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 18.75 శాతం పెరిగేలా కలెక్టర్ చొరవ తీసుకోవడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. పంట కాల్వల మరమ్మతు, నిర్వహణ, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 600 పనులు గుర్తించి, రూ.13 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించాలి, ముఖ్యంగా 22 ఏ నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని మంత్రి సూచించారు. తీర ప్రాంతాలను అనుసంధానిస్తూ జాతీయ రహదారులను నిర్మించడం ద్వారా అభివృద్ధిలో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం పొందనుందన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోవా తరహాలో బాపట్ల జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జల జీవన్ మిషన్ పనులు వేగంగా చేపట్టాలని, రూ.117 కోట్ల నిధులు కేటాయింపునకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిందన్నారు. సమగ్ర ప్రణాళికతో పనిచేయడం ద్వారా జిల్లా ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. దీంతో 13వ స్థానంలో ఉన్న బాపట్ల జిల్లా ఎనిమిదవ స్థానానికి చేరిందన్నారు. వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారికి సర్వీస్ రోడ్లు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, ఆర్డీవోలు, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి -
శోభాయాత్ర నిర్వహణ అభినందనీయం
పట్నంబజారు: ఈనెల 27న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న శోభాయాత్ర కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీరామనవమి శోభాయాత్ర ఉత్సవ సమితి సభ్యులు మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఆహ్వానించారు. రెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో కలిసిన సమితి సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాతగుంటూరులోని మణిహోటల్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమై గోరంట్ల వరకు జరిగే శోభాయాత్రలో పాల్గొనాలని విన్నవించారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ పవిత్ర శ్రీరామనవమి రోజున అద్భుతమైన శోభాయాత్రను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. భక్తులంతా ఏకతాటిపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సమితి సభ్యులను ప్రశంసించారు. కార్యక్రమంలో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహక సమితి సభ్యులు రామరాజు త్రికోటేశ్వరరావు, సాయి, తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర సమరంలో వెంకటరెడ్డి సేవలు ఎనలేనివి
జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ నిషేధిత భూముల జాబితాలో మార్పులకు చర్యలు బాపట్ల: నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించే ప్రక్రియ ప్రారంభించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించే ప్రక్రియపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించడం, భూమి యజమానులకు హక్కు కల్పిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 410 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. అందులో 107 అర్జీలకు సంబంధించిన భూములను తొలగించి, భూమి యజమానులకు యాజమాన్య హక్కు కల్పించామని చెప్పారు. ఇ–భూమి, వెబ్ ల్యాండ్, వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రెవెన్యూ దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. జిల్లాస్థాయి కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి విచారణతో పూర్తిగా పరిష్కరిస్తున్నామని వివరించారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు వందలాది ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించామని చెప్పారు. ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న అర్జీలను పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. దశలవారీగా 22ఏ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. వారంలో రెండు పర్యాయాలు జిల్లా స్థాయి కమిటీ సమావేశమై పరిశీలన, విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెవెన్యూ అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. కొల్లూరు, యద్దనపూడి, చిన్నగంజాం, మార్టూరు, కారంచేడు, కర్లపాలెం, చెరుకుపల్లి, పర్చూరు, చుండూరు, భట్టిప్రోలు మండలాలలో సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కనీసం ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నందుకై నా పనిచేయరా అని నిలదీశారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలని మార్గ నిర్దేశం చేశారు. జిల్లాస్థాయి కమిటీలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
విత్తన గుళికలు తయారు చేయాలి
కోనేటిపురం(భట్టిప్రోలు): వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విత్తనాలను విత్తన గుళికలుగా తయారు చేయాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సయ్యద్ అక్తర్ హుస్సేన్ పేర్కొన్నారు. భట్టిప్రోలు మండలం కోనేటిపురం గ్రామంలో సోమవారం పీండీఎస్ (ఫ్రీమాన్ సూన్ డ్రై సోయింగ్) కార్యక్రమం హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిలో బీజామృతం, బంకమట్టి, ఘన జీవామృతం పౌడర్, బూడిదతో తయారు చేయాలని తెలిపారు. ఈ పద్ధతిలో మినుములు, పెసలు, శనగలు, అలసందలు, కందులు లాంటి విత్తనాలను గుళికలుగా తయారు చేయవచ్చని చెప్పారు. రైతులు ఈ పద్ధతులను అనుసరించి విత్తనాలు వేయడం వల్ల వర్షాలు లేకపోయినా తక్కువ తేమతోనే మొలకలు వస్తాయన్నారు. కార్యక్రమంలో రేపల్లె ఎన్ఎఫ్ఎ బి.వి. శ్రీనివాస్, మండల నోడల్ పర్సన్ డి.ఝూన్సీరాణి, ఎఫ్ఎన్టీలు సురేష్, బాలాజి, ఐసీఆర్పీస్లు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సయ్యద్ అక్తర్ హుస్సేన్ -
టెన్త్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన గుంటూరు కలెక్టర్
గుంటూరు ఎడ్యుకేషన్: మార్కెట్ సెంటర్లోని హిందూ హైస్కూలులో పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య శిబిర ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు రవాణా సదుపాయం తదితర వివరాలపై ఆరా తీశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను పక్కాగా అమలు చేయడంతోపాటు పరీక్షలు జరుగుతున్న రోజుల్లో పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ దుకాణాలను మూసి వేయించాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ 149 కేంద్రాల పరిధిలో నిరంతరం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్, శాఖాధికారులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్లో బాధితుడి ఆవేదన
గుంటూరు వెస్ట్ : ప్రపంచ క్షయ వ్యాధి (టీబీ) దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన పోస్టర్ను కలెక్టరేట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. టీబీ నిర్మూలనకు సమష్టి కృషి అవసరం అనే థీమ్తో ఈ సంవత్సరం టీబఈ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. గుంటూరు వెస్ట్: ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాము ఉన్నట్లు నిత్యం చెబుతున్న అధికారులు సామాన్యుల సమస్యల పట్ల దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు తిరిగినా సరైన సమాధానం కూడా చెప్పకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు తమ అసహనాన్ని వ్యక్తం చేయగా కలెక్టర్ దీనిపై సీరియస్గా స్పందించారు. బాధితుల వివరాల ప్రకారం... సిరిపురపు స్వరాజ్యలక్ష్మి (77) అనే వృద్ధ మహిళకు చెందిన సుమారు ఎకరం వ్యవసాయ భూమి చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఉంది. దీనిపై పూర్తి హక్కులకు సంబంధించిన దస్తావేజులు కూడా ఉన్నాయి. అయితే ఆమె పేరుతో అడంగుల్తోపాటు మీ భూమి వెబ్ ల్యాండ్ లో ఇతరులు అనే ఆప్షన్ లో నమోదు చేయమనడంతోపాటు , పట్టాదారు పాస్ పుస్తకం కోసం స్థానిక చేబ్రోలు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకున్నారు. సదరు కార్యాలయం సిబ్బంది ఈ ఫైల్ ను జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి పంపారు. ఇప్పటికి సుమారు మూడేళ్ళు గడుస్తున్నా ఈ ఫైల్కు మోక్షం లభించలేదు. సిబ్బంది నిర్లక్ష్యంతోపాటు అధికారుల ఉదాసీనత తోడవడంతో బాధితులకు చుక్కలు కనబడుతున్నాయి. దీంతో స్వరాజ్య లక్ష్మి కుమారుడు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కలిసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని వృద్ధుల సమస్యలు గాలికి వదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు. న్యాయం స్థానాన్ని ఆశ్రయించి మీ అందరి పేర్లు పెడతానని పేర్కొనడంతో కలెక్టర్ సదరు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగుల సమస్యలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని తాను చెప్పాను కదా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని ఆగ్రహించారు. తప్పకుండా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు వెళ్ళిపోయారు. -
యువతకు చంద్రబాబు మరో సారి మోసం
బాపట్ల: నిరుద్యోగ యువకులతో చంద్రబాబునాయుడు సర్కారు మరోసారి ఆటలాడుకుంటోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య ధ్వజమెత్తారు. నిరుద్యోగభృతి, జాబ్క్యాలెండర్లో స్పష్టత లేదంటూ సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం పేరుతో నారా లోకేష్ రాష్ట్రం మొత్తం తిరిగి యువకులకు హామీలు ఇచ్చి మొండిచేయి చూపారని ఆరోపించారు. నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి వస్తోందని నమ్మిన యువకులు ఆ పార్టీ వైపు మొగ్గుచూపుతే ఆ ఊసేలేకుండా పోయిందని చెప్పారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటూ స్పష్టతలేని హామీలతో మరోసారి యువతను ముంచేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. యువతకు మోసం చేసిన చంద్రబాబు నాయుడుకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. జగనన్న పాలనలోనే యువతకు న్యాయం.. జగనన్న పాలనలోనే యువతకు రాష్ట్రంలో న్యాయం జరిగిందని మేరుగ చందనాగ్ పేర్కొన్నారు. అధికారం చేపట్టిన వెంటనే సచివాలయ వ్యవస్థను రూపొందించి 1.46 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. యువతకు ఉద్యోగాలతోపాటు సంక్షేమాన్ని అందించిన వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చారని వివరించారు. పాలనలో పారదర్శకత ఉండాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను చూసి నేర్చుకోవాలని సూచించారు. సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నక్క వీరారెడ్డి, రాష్ట్రకార్యదర్శి దొంతిబోయిన జై భారత్ రెడ్డి, నాయకులు నీలం వీరేంద్ర, జెల్లీ జోషి కాంత్, శీలం చంటి, దొంతిబోయిన ఏడుకొండలరెడ్డి, ఎరిపల్లి కోదండ వడ్డీముక్కల రవితేజ, ఐల ఏసుబాబు, షేక్ అక్రమ్, ఎస్.మురళి పాల్గొన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చెంచయ్య -
వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ళ
కర్లపాలెం: శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన తిరునాళ్ళ మహోత్సవం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరునాళ్లలో స్వామివారి ఆలయ జండాతో పాటు గ్రామంలో భక్తుల మొక్కుబడుల జండాలు ప్రత్యేకంగా అలంకరించిన 20 ట్రాక్టర్లపై ఉంచి మంగళ వాయిద్యాలు, కనక తప్పెట్లతో గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారి జండాలకు మహిళలు హారతులిచ్చి పూజలు చేసి టెంకాయలు సమర్పించారు. గ్రామోత్సవంలో స్వామివారి జండాలు ఏట్రవారిపాలెం నుంచి పాతనందాయపాలెం డొంకమీదుగా కర్లపాలెం ఐలాండ్ సెంటర్ వరకు అక్కడి నుంచి తిరిగి ఊరేగింపు చేస్తూ స్వామివారి గుడి వద్దకు తీసుకువచ్చి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయించి రావిచెట్టుకు జండాలను ప్రతిష్టించారు. తిరునాళ్ళలో భాగంగా ఆలయానికి రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించటంతో పాటు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధనరెడ్డి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తిరునాళ్లకు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చి తిరునాళ్ళలో ప్రధాన ఘట్టమైన స్వామివారి మొక్కుబడి జండాల ఊరేగింపు తిలకించి స్వామిని దర్శించుకుని పూజలు చేసి రావి చెట్టు వద్ద కొబ్బరి కాయలు కొట్టారు. ఆలయం వద్ద ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మురళీ కోలాటం భజన భక్తులను ఆకట్టుకున్నాయి. తిరునాళ్లలో ఎలాంటి అల్లర్లు జరగకుండా స్థానిక ఎస్ఐ రవీంద్ర తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
కట్టుకున్న భార్యే కడతేర్చింది
మృతదేహానికి రాయి కట్టి చెరువులో పడేసిన కేసులో వీడిన మిస్టరీనగరంపాలెం: ఈనెల 19వ తేదీన యనమదల / ఈదులపాలెం గ్రామాల పరిధిలోని ఎన్హెచ్ 16 సమీపానున్న చెరువులో నడుముకు రాయికట్టి గోనెసంచిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం తాలూకా మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఉన్న భర్తను తాడుతో కట్టేసి, కర్రలతో కొట్టి భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసులో మృతుడి భార్య, మరో ముగ్గుర్ని ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈనెల 19న మృతుడి నడుంకు రాయిని తాడుతో కట్టి, గోనెసంచిలో పెట్టిఉంచారని అందిన సమాచారం మేరకు.. ప్రత్తిపాడు పీఎస్ సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతన్ని ఎవరైనా హత్య చేసి ఉంటారని, ఆ దిశగా దక్షిణ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్రావు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గుంటూరు దాసరిపాలెం గ్రామంలోని ఓ కుటుంబం ఇంటి సామగ్రి, పశువులతో పరారవుతున్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెం ప్లాట్స్లో ఉంటున్న తెనాలి ఐతానగర్ బత్తులవారివీధికి చెందిన ఉప్పుతల్ల లక్ష్మి అలియాస్ తన్నీరు తిరుపతమ్మ, ప్రస్తుతం తెనాలి పెదరావూరులో ఉంటున్న చౌడవరం సీఆర్నగర్కు చెందిన భార్యభర్తలు సిద్ధి అంకమ్మ, సురేష్, పేరేచర్ల లక్ష్మీనరసింహకాలనీ ఐదో వీధికి చెందిన ఓ మైనర్గా గుర్తించారు. చెరువులో మృతదేహం తన్నీరు వెంకటేశ్వర్లు (30)గా గుర్తించి, మృతురాలి భార్య తిరుపతమ్మ, ఆమె సోదరి అంకమ్మ, భర్త సురేష్, సోదరుడు మైనర్ను అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన కరల్రు, ఇనుప పలుగు, పారలు, మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య చేశారిలా.. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై, భార్య తిరుపతమ్మను శారీరక, మానసికంగా వేధించేవాడు. పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేసినా అతనిలో మార్పురాలేదు. ఈనెల 17న వెంకటేశ్వర్లు, తిరుపతమ్మకు మళ్లీ వివాదం నెలకొంది. దీంతో తిరుపతమ్మ ఆతన సోదరి, బావ, మైనర్లకు సమాచారం అందించింది. దీంతో భార్య, ఆ ముగ్గురు కల్సి వెంకటేశ్వర్లను తాడుతో కట్టేసి, కరల్రతో తీవ్రంగా కొట్టగా మృతిచెందాడు. తొలుత భర్త మృతదేహన్ని ఇంట్లో పూడ్చాలని అనుకున్నా, స్థానికులకు అనుమానం వస్తుందని భావించారు. దీంతో మిరపకాయల గోనె సంచిలో మృతదేహం వేసుకుని మోటార్సైకిళ్లపై తీసుకెళ్లి చెరువులో పడవేశారు. అయితే మృతదేహాం పైకి తేలకుండా నడుముకు రాయిని తాడుతో కట్టేసి చెరువులో వేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసుని చేధించిన సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. సమావేశంలో దక్షిణ ఇన్ఛార్జ్ డీఎస్పీ మధుసూదన్రావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అక్రమాలే.. కొంటే ‘అవుట్’
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026పైసా పైసా కూడ బెట్టి పొదుపు చేసి..ఓ ప్లాటు కొందామనేది మధ్య తరగతి ప్రజల కల. కొంతమంది అయితే అప్పులు చేస్తారు. మరి కొందరు బంగారం తాకట్టు పెడతారు. ఇంకొందరు బ్యాంకుల్లో అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటారు. ఇంతా చేసి ఓ వెంచర్లో ప్లాటు కొన్నాక అది అక్రమం అని తేలితే.. ఆ వ్యక్తి, ఆ కుటుంబం పడే క్షోభ వర్ణనాతీతం. చీరాల అర్బన్: చంద్రబాబు జమానాలో ధృతరాష్ట్ర పాలన సాగుతోంది. చీరాల నియోజకవర్గంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అనధికారిక లేఅవుట్లు అందుకు ఒక నిదర్శనం. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి లేఅవుట్లు, నిర్మాణాలు చేపట్టేందుకు ముందస్తుగా కన్వర్షన్ రుసుం చెల్లించాలి. అయితే సుమారు ఐదు నెలలుగా ఆర్డీఓ, తహసీల్దార్ లాగిన్ల నుంచి కన్వర్షన్ ఆప్షన్ తొలగించారు దీంతో స్థిరాస్థి వ్యాపారులు ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వేస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర స్థాయిలో కింద నుంచి పైవరకు ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయి అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తరువాత నిర్మాణ సమయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో అత్యధికంగా అనధికారిక లేఅవుట్లు అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో అనధికారిక లేఅవుట్లు, అత్యధికంగా చీరాల నియోజకవర్గంలో ఉన్నాయి. అందులో బుడా (బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో సింగిల్ నెంబర్లో, ఓడా (ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో రెండంకెల సంఖ్యలో అనధికారిక లేఅవుట్లు ఉన్నాయని అధికారికంగానే ప్రకటించారు. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయం పక్కన పెడితే, కొత్తగా కూడా అనధికారిక (పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకోకుండా) లేఅవుట్లు వెలుస్తుండటం దేనికి సంకేతమో సంబంధిత అధికారులే చెప్పాలి. సంబంధీకులు కీలక నేతలకు కప్పం కడుతూ, రాజకీయ అండ ఉందని చెప్పుకుంటూ, అధికారులను కూడా సంతృప్తి పరుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పచ్చ గూటికి చేరాం .. ఇబ్బంది ఉండదులే... ఎన్నికల అనంతరం అనధికారిక లేఅవుట్లు వేసే వారిలో కొందరు ప్రత్యక్షంగా పచ్చ గూటికి చేరారు. మరికొందరు పరోక్షంగా పచ్చ నేతలతో రాయ‘బేరాలు’ నడుపుకుంటూ తమ పనులు చక్కబెట్టుకుంటున్నారనే వాదనలు బలంగా వివిపిస్తున్నాయి. ఓ మాజీ మున్సిపల్ చైర్మన్ గతంలో వేసిన, ప్రస్తుతం వేస్తున్న అడుగులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్య పాలెం సమీపంలో తీరం వెంట ప్రస్తుతం చేపట్టిన ఓ లేఅవుట్ ప్రక్రియ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు సంబంధించి ఆ మాజీ చైర్మన్ పైకి కనిపిస్తున్నా, అంతర్లీనంగా మరికొందరు ఉన్నారని చెప్పుకుంటున్నారు. అడుగు వేద్దాం... పొట్టిసుబ్బయ్యపాలెం తీరం సమీపంలో వేస్తున్న అడుగులకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే అప్పుడు అసలు కథ మొదలు పెడదామనే భావనలో సంబంధీకులు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ అభ్యంతరాలు లేకుండా పని సాగితే అసలు ప్రాజెక్టు అప్పుడు ప్రారంభమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెరవెనుక బడా బాబులు ఉన్నారని చెప్పుకుంటున్నారు. క్విడ్ ప్రోకోకు అడుగులు తీరప్రాంత అభివృద్ధి నేపథ్యంలో నిధులు మంజూరవుతాయని చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలో సదరు లేఅవుట్ వెంట ప్రభుత్వ నిధులతో రోడ్డు వేసేందుకు ఒక ప్రణాళిక రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో క్విడ్ ప్రోకోకు అడుగులు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. లేఅవుట్కు ఇబ్బంది లేకుండా విక్రయాలు జరిగేలా, రోడ్డు కూడా వేస్తే భారీ మొత్తంలో నగదు కీలక నేతలకు, సంబంధిత అధికారులకు ముట్టచెప్పే ఒప్పందాలపై చర్చలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఆర్జెడ్ నిబంధనలా... అవేంటి? తీరంలో సీఆర్జెడ్ పరిధిలో నిర్మాణాలు చేపట్టేవారు కానీ, లేఅవుట్లు వేసే వారు కానీ పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించటం లేదనే విమర్శలు ఉన్నాయి. సీఆర్జెడ్ పరిధిలో నిర్మించిన, నిర్మిస్తున్న రిసార్టులు, వేసిన లేఅవుట్లు అందుకు నిలువెత్తు నిదర్శనాలంటున్నారు. అసలు నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఎందుకు అడ్డుకోవటం లేదనేది ప్రశ్న. సంబంధిత అధికారులకు ఆ నిర్మాణాలు కనిపించవా అని ప్రజలు మండిపడుతున్నారు. -
తోటి విద్యార్థినులతో స్నేహంగా ఉండాలి
చెరుకుపల్లి: ప్రతి విద్యార్థిని తోటి విద్యార్థినులతో స్నేహ భావంతో మెలుగుతూ ఆరోగ్యకర వాతావరణంలో విద్యను అభ్యసిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కెరీర్ గైడెన్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు బిట్రా జయంతి, జి.నాగలక్ష్మీ అన్నారు. మండలంలోని కావూరు బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచి స్నేహం, ఆరోగ్యకరమైన దిన చర్య పాటిస్తూ తోటి విద్యార్థుల పట్ల స్నేహ పూర్వకంగా పరస్పర గౌరవంతో మెలుగుతూ మంచి అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కాకుండా దానిని ఎలా అధిగమించాలి, భావోద్యేగ నియంత్రణను ఎలా పెంపొందించుకోవాలి అనే అంశాలపై వివరిస్తూ విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.విజయలక్ష్మి, పాఠశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కెరీర్ గైడెన్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు జయంతి, నాగలక్ష్మి -
లారీ ఢీకొని బాలుడు దుర్మరణం
నగరం: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడిపై కళ్లెదుటే లారీ ఎక్కడంతో తల పగిలి మెదడు బయటకు వచ్చిన దృశ్యాన్ని చూసి కన్నతల్లి తల్లడిల్లిపోయింది. ఈ విషాద ఘటన ఆదివారం మండలంలోని శివంగులపాలెం జాతీయ రహదారి వద్ద జరిగింది. స్థానికులు, ఎస్ఐ బండ్ల భార్గవ్ కథనం ప్రకారం... మండలంలోని మంత్రిపాలెం శివారు బొడ్డువారిపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి రాజేశ్వరావు, సుజిని దంపతులు. వారు తమ కుమారుడు దినేష్(13), కుమార్తెతో కలసి ద్విచక్ర వాహనంపై భట్టిప్రోలు వెళుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో వస్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేష్ తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో తల ఛిద్రమై మెదడు బయటకు వచ్చి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రాజేశ్వరావుకు తీవ్ర గాయాలయ్యాయి. కుమార్తె కూడా గాయాలపాలైంది. కుమారుడి మృతదేహం వద్ద తల్లి రోదిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దినేష్ మృతదేహానికి పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయాలపాలైన వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భార్గవ్ తెలిపారు. ప్రమాదాలతో భయాందోళన.. గత రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పీటా గోపాలం ద్విచక్రవాహనంపై వెళుతున్న సమయంలో అంబులెన్స్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఆదివారం అదే ప్రాంతంలో లారీ ఢీకొని బాలుడు మృతి చెందడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు .వరుస ప్రమాదాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో హెచ్చరికల బోర్డులు పెట్టించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
కారంచేడు: డీజే వ్యాన్ ఆటోను ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈఘటన ఆదివారం 167–ఏ వాడరేవు– పిడుగురాళ్ల జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ ఖాదర్బాషా అందించిన వివరాలు.. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి సౌండ్ సిస్టమ్తో ఉన్న వ్యాన్ చీరాల వైపు వేగంగా వెళ్తోంది. ఈక్రమంలో జే పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన షేక్ కాలేషావలి, భార్య, కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో చీరాల సమీపంలోని వాడరేవు బీచ్కు వెళ్తున్నారు. సరిగా రెండు వాహనాలు జాతీయ ప్రధాన రహదారిలో కారంచేడు– పర్చూరు గ్రామాల మధ్యకు రాగానే డీజే వ్యాన్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో మొత్తం ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో చీరాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య కోసం గుంటూరుకు తరలించే క్రమంలో షేక్ కాలేషా వలి భార్య హబియా(45) మృతి చెందింది. మరో ఏడుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే ద్విచక్రవాహనదారులు, ఆటోవాలాలు తమ ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ కోరారు. మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీ... జాతీయ రహదారిలో మలుపు తిరుగుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన వాడరేవు–ి పడుగురాళ్ల జాతీయ రహదారిలో కారంచేడు– చీరాల మధ్య ఆదివారం చోటుచేసుకుంది. కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా వివరాల మేరకు.. కారంచేడుకు చెందిన కొర్రపాటి వెంకటేశ్వరరావు మరొక వ్యక్తితో కలసి యద్దనపూడి మండలం పూనూరు వెళ్లి తిరిగి కారంచేడుకు వస్తున్నారు. ఈ క్రమంలో కారంచేడు కొమ్మమూరు కాలువ కట్ట సమీపంలో రోడ్డు మలుపు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సరిగా అదే పర్చూరు వైపు నుంచి చీరాల వైపు వస్తున్న పూర్ణచంద్రరరావు తన బైక్తో వేగంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మలుపు తిరగుతున్న వెంకటేశ్వరావు తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. అదే వాహనంపై ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలవడంతో అతనిని చీరాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని చెప్పారు. హోటల్ సామగ్రి తీసుకొస్తుండగా.. ముందు వెళ్తున్న బైక్ను వెనుక నుంచి మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈఘటన చీరాల–కారంచేడు రొంపేరు కుడి కాలువ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన చొప్పరపు శ్రీనివాసరావు (50) కొన్నేళ్లుగా కారంచేడు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కారంచేడు యూనియన్ బ్యాంక్ సమీపంలో హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. ఆదివారం శ్రీనివాసరావు హోటల్కు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడానికి చీరాలకు వెళ్లి వస్తున్నాడు. ఈక్రమంలో కారంచేడుకు చెందిన మరో వ్యక్తి తన బైకుతో ముందు వెళ్తున్న శ్రీనివాసరావు బైకును ఢీకొట్టాడు. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా, వెనక కూర్చొన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఢీకొట్టిన వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వారిని చీరాల ఆస్పత్రికి తరలించారు. 11 మందికి గాయాలు -
టపాసుల గోదాములపై అధికారుల దాడులు
కారంచేడు: బాణసంచా గోదాములపై చీరాలకు చెందిన పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్నాయుడు, చీరాల డీఎస్పీ మొహ్మద్ మొయిన్, ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ ఏకకాలంలో కారంచేడు మండలంలోని టపాసుల నిల్వల గోదాములపై దాడులు నిర్వహించారు. దాడుల్లో నిల్వ ఉండాల్సిన చోట కాకుండా రహస్య ప్రాంతాల్లో అక్రమ నిల్వలు ఉంచారనే సమాచారంతో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మండలంలోని స్వర్ణ, కారంచేడు గ్రామాల్లోని మూడు చోట్ల జరిపిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచి న మందుగుండు సామగ్రి పెద్ద మొత్తంలోనే కను గొన్నట్లు సమాచారం. దీంతో అధికారులు అక్రమ నిల్వలపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. వీరితోపాటు ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య, కారంచేడు తహసీల్దారు జీ నాగరాజు, సంబంధిత అధికారులు, రెవెన్యూ, ఫైర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎదను కదిపిన ఆలాపన
సంగీత విద్వన్మణి డాక్టర్ చింతలపాటి మంజులకు సత్కారం తెనాలి: ఆ గానం సంగీత మధురిమలను పంచింది...ఆధ్యాత్మిక కీర్తనలు శ్రోతలను అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. సంగీతాభిమానులకు పారవశ్వాన్ని కలిగించాయి. దాదాపు గంటన్నరసేపు సాగిన ఆ గానాలాపనకు శ్రోతలు కరతాళధ్వనులతో తమ ఆనందాన్ని చాటారు. ఎన్నో ఏళ్లుగా తన సంగీత విద్యతో శ్రోతలను రంజింపజేస్తూ, మరెందరికో శిక్షణనిస్తున్న చింతలపాటి మంజుల గానాలాపన ప్రతి ఎదనూ కదిపింది. ప్రతి కీర్తనకూ శ్రోతలనుండి కర తాళధ్వనులు అందుకున్నారు. స్థానిక బోసురోడ్డులోని హనుమాన్చౌక్లో గల శ్రీసీతారామమందిరంలో 94వ వార్షిక వసంత నవరాత్ర మహోత్సవాలు ఇందుకు వేదికగా నిలిచాయి. సంగీతవ్యాప్తికి చేస్తున్న కృషిలో భాగంగా సొంతూరు తెనాలిలో వసంత నవరాత్ర ఉత్సవాల్లో సంగీత కచేరీ చేయటం అదృష్టంగా భావించానని డాక్టర్ మంజుల చెప్పారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెనాలి డబుల్హార్స్ మినపగుళ్లు అధినేత, కళాభిమాని మునగాల మోహన్శ్యాంప్రసాద్ డాక్టర్ మంజులను సత్కరించి అభినందించారు. సంగీతరంగంలో తెనాలికి గల ఘనవారసత్వాన్ని కొనసాగిస్తున్న విద్వన్మణిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీసీతారామమందిరం పాలకవర్గ కమిటి కార్యదర్శి కల్లూరి వేంకట సూర్యనారాయణమూర్తి, సభ్యులు నేతి ఆంజనేయశాస్త్రి డాక్టర్ మంజులను ప్రశంసించారు. -
గుంటూరు జిల్లాలో 5.6 మిల్లీమీటర్ల వర్షపాతం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా గుంటూరు పశ్చిమలో 20.2 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా ప్రత్తిపాడు మండలంలో 2 మి.మీ. వర్షం కురిసింది. సగటున 5.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. తాడికొండ మండలంలో 17.4 మి.మీ., పెదకాకాని 13.6, గుంటూరు తూర్పు 11.2, తుళ్లూరు 8, మంగళగిరి 7.8, దుగ్గిరాల 3.4, మేడికొండూరు 3.4, తాడేపల్లి 3.2, చేబ్రోలు 3, వట్టిచెరుకూరు 3, తెనాలి 2.6, కొల్లిపర మండలంలో 2.5 మి.మీ చొప్పున వర్షం కురిసింది. జిల్లాలో మార్చి 22వ తేదీ నాటికి సాధారణ వర్షపాతం 7 మి.మీ. కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 17.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. గుంటూరు ఎడ్యుకేషన్ :ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి దాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కోర్టు వద్ద ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో పెదనందిపాడు మండలం గోగులమూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిపాటి దాస్ను ఎన్నుకున్నారు. 11 ఏళ్లుగా సంఘ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కె.బసవ లింగారావు ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి స్థానాన్ని భర్తీ చేశారు. డాక్టర్ కొంగర శ్రీకాంత్ గుంటూరు మెడికల్: ఆధునిక జీవనశైలితో నేడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారని డాక్టర్ కొంగర శ్రీకాంత్ అన్నారు. ఆధునిక చికిత్సలతో జీవనశైలిలో మార్పులతో ఊబకాయాన్ని కట్టడి చేయవచ్చని తెలిపారు. ఆదివారం స్థానిక అమరావతిరోడ్లోని బండ్లమూడిగార్డెన్స్లో ఎండోలైఫ్ ఒబేసిటీ అప్డేట్ ఆధ్వర్యంలో ఊబకాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అధిక బరువుతో అనేక వ్యాధులు వస్తున్నాయని, బరువు తగ్గించుకోవటం కోసం చాలా మంది అవస్థలు పడుతున్నారన్నారు. ఊబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఊబకాయం తగ్గించే వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఊబకాయాన్ని తగ్గించే మెడిసిన్ స్టాల్స్ను ప్రదర్శనలో ఉంచామని, అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు అనేక మంది ఈ కార్యకమంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైద్యులు నర్మదా, నీరజ, స్వప్న్కి, ఋషి కృష్ణ, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. తాడికొండ: కవిత్వమంటే గొప్ప సామాజిక అన్వేషణ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. స్థానిక పెదపరిమి మొవ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘గ్రామ్ లోక్– యువ కవుల కోసం కవిత్వ మెలకువల’పై ఒక రోజు వర్క్షాప్ ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువకులు తమ చుట్టూ జరిగే సామాజిక అంశాలను అంతర్ముఖంగా దర్శిస్తూ ఆవేదన, సున్నితం, వ్యంగ్యం, చైతన్యం రగిల్చే విధంగా రాస్తూ యువకవులుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ప్రముఖ కవి కొప్పర్తి వెంకట రమణమూర్తి మాట్లాడుతూ.. పెద్దగా చదువు లేని గుర్రం జాషువా, భరద్వాజ తమ రచనల ద్వారా జాతీయ పురస్కారాలు పొందారని గుర్తు చేశారు. సభాధ్యక్షులు ఎంవీఆర్ఎం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎంవీ రామిరెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో వృద్ధాలయాల నిర్వహణతో పాటు నిరుద్యోగ యువతకు ఉచిత భోజన వసతితో కూడిన పోటీ పరీక్షల శిక్షణ ఇస్తూ 700 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు చేయూతనందిస్తున్నామని అన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన వర్క్షాప్నకు సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు వల్లూరు శివప్రసాద్ అధ్యక్షత వహించారు. అనంతరం ‘కవిత్వంలో గ్రామీణ జీవనం’ అంశంపై డాక్టర్ సుంకర గోపాల్, మందరపు హైమావతి, కోసూరి రవికుమార్లు విశ్లేషించారు. వర్క్షాప్నకు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి 50 మందికి పైగా గ్రామీణ యువకవులు, రచయితలు, రచయిత్రులు ఉత్సాహంగా హాజరయ్యారు. కార్యక్రమంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, ట్రస్టు అధ్యక్షులు మొవ్వ సాంబిరెడ్డి, కార్యదర్శి మున్నంగి శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, విశ్రాంత ప్రొఫెసర్ శారద తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు అసభ్య వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్ట్
● రెండు సెల్ఫోన్లు స్వాధీనం ● సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావు వివరాలు వెల్లడి గుంటూరు రూరల్: ట్రూకాలర్లో మహిళల పేర్లను చూసి ఆయా సెల్ నంబర్లకు వీడియో కాల్స్ చేసి అసభ్యకర వీడియోలు పంపుతున్న వ్యక్తిని నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అడవితక్కెళ్లపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావు, సీఐ వంశీధర్ వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం, మాచవరం గ్రామానికి చెందిన రామనాథం నాగేశ్వరరావు గతంలో పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. జల్సాలకు అలవాటు పడి ఆడవారిని బెదిరించి డబ్బులు గుంజాలని తన ఫోన్లో రియల్ నంబర్స్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఆ నంబర్లను ట్రూ కాలర్లో చెక్ చేసి వాటిలో ఆడవారి పేర్లతో రిజిస్టర్ అయిన నెంబర్లకు వాట్సప్ ద్వారా మెసేజ్లు పెట్టడం, వారికి వీడియో కాల్స్ చేయడం అసభ్య కరమైన ఫొటోలను వీడియోలను పంపుతున్నాడు. తద్వారా డబ్బులు సంపాదించాలని చూస్తుండేవాడు. పలకలూరు రోడ్డులోని ఒక మహిళకు అదే విధంగా అసభ్య పదజాలంతో వాట్సప్ ద్వారా బూతులు తిట్టి అసభ్యకరమైన ఫొటోలు పంపించాడు. ఆ మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆదివారం పలకలూరు రోడ్డు విజ్ఞాన్ కాలేజి దగ్గరలో నిందితుడిని పట్టుకొని అతడి వద్ద నుంచి వివో ఫోన్, ఆపిల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు, మహిళా భద్రతా దష్ట్యా శక్తి టీములు నిరంతరం అందుబాటులో ఉంటున్నట్లు డీఎస్పీ మధుసూదనరావు తెలిపారు. ఆపదలో ఉన్న వారు 112కు ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం పొందవచ్చని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా మాధ్యమాలను దుర్వినియోగం చేయరాదని సూచించారు. కేసులో ప్రతిభ కనబరిచిన నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్, ఎస్ఐ మహేష్కుమార్, సిబ్బందికి రివార్డు అందజేసి అభినందించారు. + రూ.11.80 లక్షల సొత్తు స్వాధీనం తెనాలిరూరల్: తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్డులోని ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనోవిజన్లో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని రూ.11.80 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. నిందితుల్లో ఒకరు ఇప్పటికే జువైనెల్ హోమ్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. మళ్లీ ఇప్పుడు మద్యం, గంజాయికి అలవాటుపడిన మరో బాలుడిని కలుపుకుని ఏకంగా ఎలక్ట్రానిక్ షోరూమ్లోనే చోరీ చేశాడు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వివరాలను వెల్లడించారు. బుర్రిపాలెం రోడ్డులోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనోవిజన్లో ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి అనంతరం జరిగిన చోరీ కేసులో ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని వారి నుండి రూ.11.80 లక్షల విలువైన సెల్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణ ముత్యంశెట్టిపాలెంకు చెందిన 17 ఏళ్ల బాలుడు, చినరావూరు ఆర్టీసీ ఓల్డ్ డిపోరోడ్డుకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఈ కేసులో నిందితులని తెలిపారు. ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి రెండో అంతస్తులో గల గ్లాస్ డోరు పగులగొట్టి లోపలకు ప్రవేశించి వివిధ కంపెనీల మొబైల్స్, వాచీలు, బడ్స్, చార్జర్, అడాప్టర్లను దొంగతనం చేశారు. దీనిపై షోరూమ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో ఆదివారం గాంధీచౌక్లో నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ బి.జనార్ధనరావు చెప్పారు. ముత్యంశెట్టిపాలెంకు చెందిన బాలుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో అక్కల వద్ద నివాసం ఉంటున్నాడు. క్యాటరింగ్ పనులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు బానిసైనట్టు తెలిపారు. ఆదాయం సరిపోక బైక్ దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నేరాలకుగాను అతడిపైన స్థానిక వన్న్ టౌన్, త్రీటౌన్, రూరల్ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. వీటిలో రెండు కేసుల్లో ఇప్పటికే శిక్ష పడగా, తొమ్మిది నెలలపాటు విజయవాడ హోమ్లో ఉండి నాలుగు నెలల కిందట విడుదలయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఇంటర్ సెకండియర్ చదువుతూ మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటుపడిన చినరావూరు బాలుడిని కలుపుకుని సోనోవిజన్ షోరూమ్లో చోరీ చేసినట్టు వివరించారు. షోరూమ్ ఉన్న కాంప్లెక్సులోనే ఉన్న హోటల్లో క్లీనర్గా చేసిన 17 ఏళ్ల బాలుడు, రెక్కీ నిర్వహించి 16 ఏళ్ల బాలుడితో కలిసి చోరీ పాల్పడినట్టు తెలియజేశారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన సీఐ రాములునాయక్, ఆయన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిఽధిలోని బకింగ్హామ్ కెనాల్ ఉండవల్లి సెంటర్ బ్రిడ్జి పైనుంచి ఆదివారం ఓ వృద్ధుడు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సాయికుమార్ సంఘటనా స్థలానికి వచ్చి నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీయించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కొట్టు సెంటర్ ప్రాంతంలో నివాసముండే ధనేకుల అర్జునరావు (68)గా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్న అర్జునరావు ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పోలీసులకు తెలిపారు. జరిగిన సంఘటనపై భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకే సమయంలో ప్రాణం పోయి ఉంటుందని అందువల్లే మృతదేహం నీటిపై తేలియాడిందని ఎస్ఐ తెలిపారు. అమరావతి: పిడుగుపాటుకు గురై మండల పరిధిలోని ఎండ్రాయి గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎండ్రాయి గ్రామానికి చెందిన నల్లగోర్ల విజయకుమార్ గేదెలను తోలుకుని రోజులాగానే శనివారం కూడా పొలానికి వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలివాన తోపాటు పిడుగు పడటంతో విజయ్కుమార్(25) అక్కడిక్కడే మృతిచెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా విజయకుమార్ రాకపోవటంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎండ్రాయి పరిసర ప్రాంతాలలో గాలించారు. శనివారం రాత్రి పొలాల్లో విగతజీవిగా పడి ఉన్న విజయకుమార్ను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని అమరావతి సీహెచ్సీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబసభ్యులకు ఆదివారం అప్పగించారు. మృతుడికి ఏడాది కిందటే వివాహమైంది. భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ప్రపంచ కవితా దినోత్సవ సభలో రంగిశెట్టి రమేష్
తెనాలి: ప్రపంచ కవితా దినోత్సవం రోజైన శనివారం సాయంత్రం తెనాలి నాజరుపేటలోని కమలశ్రీ సాహితీ నిలయంలో శ్రీకృష్ణ దేవరాయ కళావేదిక, విశ్వ సాహితీ కళావేదిక సంయుక్త నిర్వహణలో ‘విశ్వశాంతి ఆవశ్యకత–కవుల పాత్ర’ అంశంపై కవిసమ్మేళనం నిర్వహించారు. తొలుత ప్రాచీన కవుల నుంచి నేటి ఆధునిక కవుల చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. సభకు శ్రీకృష్ణదేవరాయ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వ సాహితీ కళావేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు రంగిశెట్టి రమేష్ అధ్యక్షత వహించారు. నేటి వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య విశ్వశాంతి స్థాపనకు కవులందరు మరొక్కసారి పునరంకితం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యుద్ధం అనర్థాలపై సమాజాన్ని చైతన్యపరచి యుద్ధ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎలుగెత్తి చాటాలన్నారు. -
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించండి
బెల్లంకొండ: స్టేషన్ ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. శనివారం బెల్లంకొండ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు, ఫిర్యాదుల నిర్వహణ, కేసుల వివరాలను పరిశీలించారు. మండలవ్యాప్తంగా సీసీ కెమెరాల నిర్వహణను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీలైనంత తొందరగా పెండింగ్ కేసులను పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్ఐకు సూచించారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు, గంజాయి సరఫరా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటూ, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని ఎస్పీ తెలిపారు. గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, పల్లెనిద్ర, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు, పెదకూరపాడు రూరల్ సీఐ ప్రత్తిపాటి సురేష్, స్థానిక ఎస్ఐ పి.గోపి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : వాణిజ్య అవసరాలకు అక్రమంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న దుకాణాలు, హోటళ్లపై గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం విద్యానగర్లో వణుకూరి పవన్కుమార్ కార్ఖానాలో నాలుగు ఎల్పీజీ సిలిండర్లను గుర్తించారు. ఈ మేరకు సీజ్ చేసిన సిలిండర్లను స్థానిక వీఆర్ఓకి అప్పగించారు. ఈ మేరకు అతనిపై 6–ఎ కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. -
బాణసంచా మంటల్లో చిక్కిన ఇద్దరు చిన్నారులు
పెదకాకాని: కూటమి ప్రభుత్వంలో నాయకుల పర్యవేక్షణలో జరిగిన బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మహోత్సవం పెదకాకాని పొలిమేర సెంటర్ జెండా చెట్టు నుంచి బయలుదేరి గురువారం రాత్రి 2 గంటలకు వెనిగండ్లలోని వేమారెడ్డి గుడి సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో ఆటో పక్కనే నిలబడి బాణసంచా కాలుస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఆకాశంలోకి వదిలిన తారాజువ్వ నుంచి నిప్పురవ్వలు ఆటోలో నిల్వ ఉన్న బాణసంచాపై పడ్డాయి. ఆటోకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బాణసంచాపై పడుకుని నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు ఆ మంటల్లో చిక్కుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి అనాస్ పరిస్థితి విషమంగా ఉండగా.. అజయ్ అనే చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికీ తండ్రులు లేదు. తల్లులు దర్గా వద్ద పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. గుంటూరు ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తహసీల్దార్ కృష్ణకాంత్, టీపీ నారాయణస్వామిలు పరామర్శించారు. నిద్ర వస్తుండటంతో బాణసంచాపై పడుకుని ఉన్నామని, పక్కకు వెళ్ళి కాల్చాలని ఆ వ్యక్తిని కోరామని బాధితులు తెలిపారు. అయినప్పటికీ అతడు వినిపించుకోలేదని వాపోయారు. -
రంజాన్కు సర్వం సిద్ధం
రేపల్లె: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని ఈద్గాలను, మసీదులను నమాజులు నిర్వహించుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. గత నెల రోజులుగా ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న రంజాన్ కఠోర ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో విరమించారు. శనివారం ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) ప్రత్యేక ప్రార్థనలకు ముస్లింలు సన్నద్ధమవుతున్నారు. రేపల్లె పట్టణంలోని పెనుమూడి రోడ్డులో ఉన్న తూర్పుజామియా మసీదు, పెద పోస్టాఫీసు సెంటరులోని పెదజామియా మసీదు, రామకోటిపేటలోని మదీనా మసీదు, లక్ష్మీ టాకీసు సెంటరులోని మర్కస్ మసీదు, జేఎల్బీ కళాశాల రోడ్డులోని అబూబకర్ మసీదు, నేతాజీనగర్లోని నసీరుద్దీన్ మసీదు, నగరం మండలం కట్టవలోని మదీనా మసీదుల, రేపల్లె పట్టణం ఉయ్యూరువారిపాలెం రోడ్డులోని ఈద్గా విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. -
ఇంజినీరింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్హతతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2026 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 24వ తేదీవరకు పొడిగించారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్–2026 (గతంలో ఎంసెట్) నోటిఫికేషన్ ఆధారంగా సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులతో తాజాగా పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్–2026 ఆధారిత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. సైట్కు లాగిన్ అయ్యి ఏపీ ఈఏపీసెట్–2026పై క్లిక్ చేయాలి. ఏపీఈఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు పూరింపు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్స్టక్షన్స్ మాన్యువల్ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు. -
వైఎస్సార్ సీపీని అధికారంలోకి తేవటమే లక్ష్యం
తెనాలి:మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటమే అందరి లక్ష్యంగా కృషిచేద్దామని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి మున్సిపాలిటీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గత అయిదేళ్లు చైర్పర్సన్లుగా, కౌన్సిలర్లుగా, కో–ఆప్షన్ సభ్యులుగా పదవీకాలం పూర్తిచేసిన సందర్భంగా బుధవారం రాత్రి అభినందన సత్కారాన్ని నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని శశివేదికలో జరిగిన సభకు పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్ తప్పకుండా, పార్టీకి ఎలాంటి డ్యామేజి లేకుండా, తనకు ఎలాంటి మచ్చ తేకుండా పరిపాలన చేసిన చైర్పర్సన్ తాడిబోయిన రాధికను శివకుమార్ ముందుగా అభినందించారు. ఓటమితో కుంగిపోకుండా పట్టణ అభివృద్ధికి కౌన్సిల్ పాటుపడిందని చెప్పారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అయిదేళ్లపాటు దిగ్విజయంగా ప్రజాసేవలో గడిపే అవకాశం దక్కిందని గుర్తుచేశారు. శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో రూ.1800 కోట్ల సంక్షేమం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1800 కోట్ల సంక్షేమాన్ని అందించే అవకాశం తనకు కలిగినట్టు చెప్పారు. ఓసీలకు రిజర్వు చేసిన తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయిస్తానని 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ప్రకటించినట్టు శివకుమార్ గుర్తుచేశారు. ఆ ప్రకారం తొలిగా ముస్లిం మైనారిటీకి చెందిన సయ్యద్ ఖలేదా నసీమ్, తర్వాత బీసీ వర్గానికి చెందిన తాడిబోయిన రాధికకు చైర్పర్సన్గా అవకాశం కల్పించినట్టు చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తికాలం వైఎస్సార్ సీపీ కౌన్సిల్ నడిచేందుకు తాడిబోయిన రమేష్ కృషిచేశారని చెబుతూ ఆయన్ను అభినందించారు. అనంతరం చైర్పర్సన్, వైస్చైర్మన్లు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులను శివకుమార్ సత్కరించారు. మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీమ్, మాజీ వై స్చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, కోటేశ్వరరావు, అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, గెడ్డటి సురేంద్ర, ఝాన్సీవాణి, కుర్రా సుజాత, అన్నాబత్తుని పద్మజ, కఠారి రత్నకుమారి, మల్లెబోయిన సురేఖ, పెదలంక లక్ష్మీలావణ్య, మట్లపూడి సంధ్యారాణి, వీర్లపాటి విజయలక్ష్మి, షేక్ దుబాయ్బాబు, షేక్ ఇస్మాయిల్, ఆవుల కోటయ్య, యాతాటి అనిల్, కో–ఆప్షన్ సభ్యులు బచ్చనబోయిన శ్రీనివాసరావు, పెచ్చింగ్ సుభాని, షేక్ గౌసియా, పార్టీ నాయకులు తపాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ -
ప్రజల జీవితాల్లో ఉగాది ఆనందాన్ని నింపాలి
బాపట్ల: ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనందాలను నింపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆకాంక్షించారు. ఉగాది వేడుకలు గురువారం స్థానిక కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. తొలుత జిల్లా కలెక్టర్కు మేళతాళాలతో స్వాగతం పలికారు. పవన్ కుమార్ అవధాని పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది పచ్చడిని అతిథులకు అందజేశారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంచాంగాన్ని విడుదల చేశారు. చిన్నారుల సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. పలువురికి ఉగాది పురస్కారాలను కలెక్టర్ అందజేశారు. జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రగతిపథంలో జిల్లాను నడిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖలో సేవలు అందించిన నారాయణ శ్రీనివాసాచార్యులు, పవన్ కుమార్ అవధాని, ఫణి కుమార్ స్వామి, వేదాంత మురళీమోహన్, తెలుగు భాష వ్యాప్తిపై విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయులు చుండూరు వెంకటేశ్వర్లు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పి. శ్రీరామచంద్రమూర్తి, ఎం. కోటేశ్వరరావు, అల్లూరి శివ కోటేశ్వరరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి షాలేము రాజు, డీఆర్ఓ గంగాధర్ గౌడ్లకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, ఉప కలెక్టర్ లవన్న, జిల్లా దేవదాయ శాఖ అధికారి ఎం. నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ట్రేడ్ దోస్త్ కంపెనీ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు
లక్ష్మీపురం: గుంటూరు అరండల్పేటలో నవ్య వారాహి ప్రైవేటు లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ కంపెనీ పేర్లతో భారీ మొత్తంలో మోసం చేసి పరారైన నిర్వాహకుడిపై బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరండల్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య వారాహి ప్రైవేటు లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ పేరుతో అరండల్పేట 16వ లైనులో అన్నం పూర్ణచంద్రరావు, మరికొంత మందితో కలిసి గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నామని, పెట్టుబడి పెట్టిన వారికి 20 నెలల్లో రూ. లక్షకు రూ. 2 లక్షలు కలిపి ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అక్రమంగా వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన వారి పేర్లపై డ్రా తీసి 40 గ్రాముల బంగారం, తదితర స్కీమ్ల పేర్లతో పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇటీవల అన్నం పూర్ణచంద్రరావు తీరుపై అనుమానం వచ్చిన బాధితులు సంబంధిత డ్రాల గురించి నిలదీసే ప్రయత్నం చేయగా.. పూర్ణ చంద్రరావు పరారయ్యాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతా శివకోటేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మట్టి ఆధారంగా ఎరువుల మోతాదు
బాపట్ల: రైతులు నేలలో మట్టి నమూనా పరీక్షలు చేయించి, పోషక లోపాలను గుర్తించాక నివారణ చర్యలను చేపట్టడంలో జాగ్రత్తలు తీసుకోవాలని పంటల శరీర ధర్మశాస్త్ర విభాగాధిపతి డా.కె.జయలలిత అన్నారు. వ్యవసాయ కళాశాలలో ప్రధాన పంటలలో వచ్చే పోషకాల లోపాలు నివారణ అంశంపై జరిగిన రైతు శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎరువులను అధికంగా వాడినా, తక్కువగా వాడినా అవి నేలపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడతాయని తెలిపారు. నేలను పరిశీలించిన అనంతరం వచ్చిన నివేదికల ఆధారంగా ఎరువుల మోతాదులను నిర్ణయిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నత్రజని, భాస్వరం, పోటాష్ వంటి ప్రధాన పోషకాలను నేలకు సమతుల్యంగా అందించాలన్నారు. రసాయన ఎరువులతోపాటు సేంద్రియ ఎరువులను వాడితే నేల సారవంతం అవుతుందని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఆచరిస్తూ శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దిగుబడులను పొందవచ్చన్నారు. గోవిందపురం, పూండ్ల గ్రామాలకు చెందిన రైతులు ఈ శిక్షణలో పాల్గొని తగు సూచనలను పొందారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ఎస్సీ ఉప ప్రణాళిక కో ఆర్డినేటర్ డాక్టర్ బి.అపర్ణ, డాక్టర్ జి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో బాజీబాబా దర్గా ఉరుసు
వేలాదిగా తరలివచ్చిన భక్తులు పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం గురువారం కనుల పండువగా ప్రారంభమైంది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జామున ప్రత్యేక ప్రార్థనలతో ఉరుసు మహోత్సవం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో దర్గా ఈఓ షేక్ ఖాజావలి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు షఫా బావి నీటితో స్నానాలు చేసి దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సాయంత్రం 7 గంటలకు బాజీబాబా గుఱర్రం దర్గాలో ప్రదక్షిణలు చేసింది. దర్గా ప్రాంగణమంతా భక్తులతో కళకళలాడింది. పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందిని అలంకరణలో గంధం బిందెలతో ప్రారంభమైన బాజీబాబా వారి గుర్రంతో శుక్రవారం ఉదయం వరకూ వెనిగండ్ల గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం చేశారు. ఈ మహోత్సవం బాణసంచా వెలుగులు, తీన్మార్ తప్పెట్లు, సన్నాయి వాయిద్యాలు, బాండ్మేళాలు, విద్యుత్ కాంతుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. దర్గాకు చేరుకున్న భక్తులు బాబా వారి గుర్రం వెంట నడిచారు. ఊరేగింపు ముగించుకుని బాబావారి గుర్రం శుక్రవారం సాయంత్రం 3 గంటలకు దర్గాకు చేరుకుంటుందని అనంతరం భక్తులకు గంధం పంచిపెట్టడం, సలామి ప్రార్ధనలతో ఉరుసు మహోత్సవం ముగుస్తుందని ఈఓ షేక్ ఖాజావలి తెలియజేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సూపరింటెండెంట్లు, జూనియన్ అసిస్టెంట్లను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈఓ శీనానాయక్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు(చందు)కు సత్రాలు, వేద పాఠశాల, దత్తత ఆలయాలకు బదిలీ చేశారు. వేదపాఠశాల, దత్తత దేవాలయాల విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ వి.సత్యనారాయణమూర్తికి కేశఖండనశాల, దుర్గాఘాట్, కృష్ణమ్మ హారతుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కేశఖండనశాల, దుర్గాఘాట్, ఆడిట్ జనరల్ విధులు నిర్వహిస్తున్న హేమ దుర్గాంబకు ఆడిట్, జనరల్, అన్న దానం విధులు అప్పగించారు. జూనియర్ అసిస్టెంట్ ఎం.రమేష్ను ప్రధాన ఆలయం నుంచి పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.జగన్నాథరావును ప్రధాన ఆలయ ఇన్స్పెక్టర్ బాధ్యతలు అప్పగించారు. -
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులకు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు నూతన వస్త్రాలను బహూకరించగా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దుశ్శాలువాతో వైఎస్ జగన్ను సన్మానించారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్కుమార్, షేక్ నూరి ఫాతిమా, గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, వరికూటి అశోక్బాబు, పి. నాగమోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నడుముకు రాయి కట్టి.. చెరువులోకి పడేసి..!
గుంటూరు రూరల్: గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురికాగా.. మృతదేహం కూడా కనిపించకుండా చేసేందుకు శరీరానికి హద్దు రాయి కట్టి గోనెసంచిలో చుట్టి చెరువులోకి పడేసిన దారుణ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న చెరువులో చేపలు పట్టుకునేందుకు గురువారం ఒక యువకుడు వెళ్ళాడు. ఆ సమయంలో చెరువులో తెలియాడుతూ వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నరహరి స్థానికులు, సిబ్బందితో కలిసి మృత దేహాన్ని బయటకు తీయించారు. -
పిన్నెల్లికి జన నీరాజనం
నకరికల్లు: అక్రమ కేసులో 98 రోజులపాటు అక్రమ నిర్భంధం అనుభవించి బెయిల్పై వస్తున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మండలంలో ఘన స్వాగతం పలికారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గజ్జల సుధీర్భార్గవరెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అడ్డరోడ్డుకు చేరుకున్నారు. సుమారు మూడున్నర గంటలపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాకకోసం ఎదురుచూశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డరోడ్డు చేరుకోగానే హర్షధ్వానాలతో అభిమానులు హోరెత్తించారు. పిన్నెల్లిని, సత్తెనపల్లి ఇన్చార్జి గజ్జల సుధీర్భార్గవరెడ్డిని భారీ గజమాలతో సన్మానించారు. జయజయ నినాదాలతో హోరెత్తించారు. అడ్డరోడ్డు వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామిని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడులో టీడీపీ రెండు వర్గాల పోరులో వాళ్లకు వాళ్లు హత్యలకు పాల్పడితే కావాలని తమను అనవసరంగా ఇరికించారని వాపోయారు. 98 రోజులపాటు అక్రమంగా జైలులో పెట్టారన్నారు. ఎస్పీ సైతం ఆధిపత్యపోరులో ఈ హత్యలు జరిగాయని చెప్పినా తమను అన్యాయంగా కేసులో ఇరికించారన్నారు. తమకంటూ ఒకరోజు వస్తుందని... తప్పుడు కేసులు పెట్టడానికి కారణమైన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూడడమే కాక తప్పుడు కేసులతో నోరు నొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని... అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రెట్టింపు బలంతో దుర్మార్గంపై పోరాడతామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ మేడికొండ పరమేశ్వరరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, వైస్ ఎంపీపీ మేడం ప్రవీణ్కుమార్రెడ్డి, దూదేకుల బాషా పాల్గొన్నారు. దాచేపల్లిలో.. దాచేపల్లి : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దాచేపల్లిలో ఘన స్వాగతం లభించింది. నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య కుటుంబ సభ్యులు గజమాలతో సన్మానించారు. చైర్మన్ సాంబయ్య నివాసంలో అల్పాహారాన్ని పీఆర్కే స్వీకరించారు. అనంతరం నారాయణపురం బంగ్లా సెంటర్లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ ఖాదర్ బాషా రంజాన్ పండుగ సందర్భంగా పీఆర్కేకు టోపీ, చౌకన్, కంకణం బహూకరించారు. నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోటా కృష్ణ, షేక్ సుభాని, నగర పంచాయతీ మాజీ చైర్మన్ మునగా పున్నారావు, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ కందులు జాను, వైస్ చైర్మన్లు షేక్ ఖాదర్ బాషా, కొమరభత్తిన విజయకుమార్, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, మాజీ సర్పంచ్లు మందపాటి రమేష్ రెడ్డి, బుర్రా విజయ్ కుమార్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పరిమి బాబు తదితరులు ఉన్నారు. ప్రత్యేక పూజలు మాచర్ల: మాచర్ల పట్టణానికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా వేలాది మంది తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. రాయవరం జంక్షన్లో ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేక పూజలు చేశారు. -
గ్యాస్ సిలిండర్... నో స్టాక్
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా తాడేపల్లి మండలంలో 24.4 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో 1 మి.మీ వర్షం పడింది. సగటున 5.6 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు మండలంలో 19 మి.మీ., తుళ్ళూరు 18.2, తాడికొండ 17.4, మంగళగిరి 13, పెదకాకాని 5.2, గుంటూరు తూర్పు 1.4, గుంటూరు పశ్చిమలో 1.2 మి.మీ చొప్పున వర్షం పడింది. కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో ఓ కీచక అర్చకుడి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను బందరు ఇన్చార్జ్ డీఎస్పీ ధర్మేంద్ర ఆర్పేట పోలీస్స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మచిలీపట్నంలోని లక్ష్మణరావుపురం రామాలయంలో నిజాంపేటకు చెందిన ఎ.రఘునాథశర్మ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఆ కుటుంబంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలిక ఉంది. ఆమైపె అర్చకుడు రఘునాథశర్మ కన్నేశాడు. ఆమెను తొలుత తన భార్యకు దగ్గర చేశాడు. అనంతరం బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారి కుటుంబం ఎక్కడికి వెళ్లినా భార్యాపిల్లలతో పాటు ఆ బాలికనూ తీసుకెళ్లేవాడు. మాయమాటలు చెప్పి గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అనేకమార్లు ఆమైపె లైంగికదాడి చేశాడు. బాలిక బుధవారం నలతగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి బాలిక గర్భంధరించిందని నిర్ధారించారు. తల్లిదండ్రులు ఆగ్రహంతో అందుకు కారణం ఎవరంటూ బాలికను ప్రశ్నించారు. తాను గర్భం దాల్చటానికి కారణం రఘునాథశర్మ అని ఆమె చెప్పటంతో తల్లిదండ్రులు వెంటనే ఆర్పేట పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రఘునాథశర్మను అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఆర్పేట సీఐ ఏసుబాబు, ఎస్ఐ యోహాను, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బాలికపై యువకుడి లైంగికదాడి చిట్టినగర్(విజయవాడపశ్చిమ):ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించిన యువకుడు ఆమైపె లైంగిక దాడికి పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేటలో చోటు చేసుకుంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ పాతరాజరాజేశ్వరికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి వరకు చదువుకుని మధ్యలో మానేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతంలో నివసించే దేవరపాటి రాజేష్ అలియాస్ నాని మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. -
స్ట్రోక్ చికిత్స వ్యవస్థ బలోపేతానికి కృషి
గుంటూరు మెడికల్: ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ 19వ వార్షిక సదస్సు ఈనెల 13 నుంచి 15 వరకు కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్లో విజయవంతంగా నిర్వహించినట్లు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి ప్రముఖ న్యూరాలజిస్టులు, స్ట్రోక్ నిపుణులు, పరిశోధకులు, ఆరోగ్య రంగ నిపుణులు పాల్గొన్నట్లు వెల్లడించారు. సదస్సులో డాక్టర్ విజయ ప్రెసిడెన్షియల్ ఓరియంటేషన్ ముఖ్య ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. 1990లలో థ్రోంబోలైటిక్ చికిత్స అందుబాటులోకి రాకముందు పరిస్థితుల నుంచి ప్రారంభించి, 1995లో 3 గంటల్లో క్లాట్ బస్టింగ్ థెరపీ ఆవిష్కరణ, 2005లో స్ట్రోక్ కేర్ అభివృద్ధి, 2015లో న్యూరో ఇమేజింగ్, మెకానికల్ థ్రోంబెక్టమీ పురోగతి వరకు జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎంపిక చేసిన రోగులకు 24 గంటల వరకు చికిత్స అవకాశాలు విస్తరించిన విషయాన్ని డాక్టర్ పి.విజయ ప్రస్తావించారు. అత్యంత ప్రేరణాత్మకంగా నిలిచి, 400 మందికి పైగా జాతీయ అంతర్జాతీయ ప్రతినిధుల స్టాండింగ్ అవేషన్ అందుకున్నట్లు తెలిపారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ -
శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం
అమరావతి: ఉగాది పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామి వారికి గురువారం వేకువ జామున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు.దేవాలయ ఈవో సునీల్కుమార్ ఆధ్వర్యంలో వెంకటాద్రినాయుడు మండపంలో స్వామి వారిని ఉంచి శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం భక్తులందరికి ఉచితంగా పంచాంగ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో గురువారం ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పంచాంగ శ్రవణం నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉగాది వేడుకలకు ప్రముఖ ప్రవచన కర్త ఎం.కృష్ణకిషోర్ ఉగాది పండుగ విశిష్టతను వివరించారు. ప్రముఖ పౌరాణికులు శ్రీహరి శర్మ పంచాంగ శ్రవణం గావించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పంచాంగ శ్రవణం విని ప్రసాదాలు స్వీకరించారు. నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో గురువారం ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. పరాభవ నామ ఉగాది సందర్భంగా ఆలయంలో వేదపండితులకు సన్మానం ఘనంగా నిర్వహించారు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొండకావూరి సత్యనారాయణ, కొండకావూరి రామకృష్ణ, శ్రీరాముల రాజశేఖరశర్మలను సన్మానించి సంభావన అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు, సిబ్బంది పాల్గొన్నారు. కర్లపాలెం: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షాలకు పిడుగు పడి ఓ వరికుప్ప దగ్ధమైంది. స్థానిక వీఆర్వో సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియటంతో బుద్ధాం గ్రామంలో నర్రా నాగరాజుకు చెందిన వరికుప్పపై పిడుగు పడి మంటలు ఎగశాయి. స్థానిక రైతులు వెంటనే స్పందించి మంటలు ఆర్పి కుప్పను కల్లంలో ఆరబెట్టారు. రైతుకు సుమారు రూ.70వేల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. -
భూసేకరణ ఎవరి కోసమో చెప్పాలి?
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణయ్య నరసరావుపేట: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం రూ.24,700 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించి గెజిట్ విడుదల చేశారని, అమరావతికి 50 కిలోమీటర్ల దూరంలో 250 మీటర్ల వెడల్పు 129 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు, 59 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్రోడ్డు దీనికి అనుబంధంగా 32 రేడియల్ లింక్ రోడ్ల నిర్మాణానికి 300 గ్రామాల్లో 15 వేల ఎకరాల అసంబద్ద భూసేకరణ ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.కృష్ణయ్య ప్రశ్నించారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో గురువారం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రవిబాబు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. అసంబద్ధ భూసేకరణ వల్ల అమరావతిలో కొన్ని గ్రామాలు పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న రేటు క్వింటా రూ.2400లు ప్రకటించి కొనుగోలు కేంద్రాలు తెరవకుండా రైతులను మోసం చేయడం తగదన్నారు. రాష్ట్రంలో 9.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా పల్నాడు జిల్లాలో 1.50 లక్షల ఎకరాలు సాగు చేశారన్నారు. పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్కుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, ఎస్.ఆంజనేయులు నాయక్, జిల్లా కమిటీ సభ్యులు గద్దె చలమయ్య, డి.శివకుమారి, జి.మల్లేశ్వరి, జె.శంకరరావు, పేరుబోయిన వెంకటేశ్వర్లు, గుంటుపల్లి బాలకృష్ణ పాల్గొన్నారు. -
వైఎస్సార్ విగ్రహం స్వచ్ఛందంగా తొలగింపు
కారెంపూడి: మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో పొట్టిశ్రీరాములు కాలనీలో ఉద్రిక్తతకు తెరపడింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని స్వచ్ఛందంగా బుధవారం అక్కడ నుంచి తాత్కాలికంగా తీసివేశారు. మంగళవారం టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు కూడా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. కల్యాణ మండపం నిర్మాణానికి అడ్డుగా ఉన్న విగ్రహాలను టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు తాత్కాలికంగా తొలగించి సమస్యకు ముగింపు పలికారు. కల్యాణ మండపం అందరికీ ఉపయోగపడుతుందని కల్యాణ మండపం నిర్మాణం పూర్తయ్యాక ఇబ్బంది లేకుండా మళ్లీ విగ్రహాలను పునప్రతిష్ట చేసుకుంటామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
బాలిక ఆపరేషన్కు రూ.లక్ష ఆర్థికసాయం
బాపట్ల: కర్లపాలెం మండలంలోని పెద్దపులివారిపాలెం సర్పంచ్ అక్కల శ్రీనివాసరెడ్డి కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండగా మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతితోపాటు పార్టీ నాయకులు కలిపి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. అక్కల శ్రీనివాసరెడ్డి కుమార్తె ఆపరేషన్ నిమిత్తం నగదు అందజేసి ఆరోగ్యం మెరుగుపడేలా చూసుకోవాలని సూచించారు. వైద్యులతో కోన మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, పేరాల వెంకట సురేష్, ధర్మేంద్ర, ఆట్ల నాగేశ్వరరెడ్డి ఉన్నారు. గుండెపోటుతో ఎస్ఐ మృతి చీరాల: ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వల్లాగి భాస్కరరావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఇంటి వద్ద గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆయనను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్, ఒన్టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు, టూటౌన్, రూరల్ సీఐలు అశోక్కుమార్, శేషగిరిరావులు, ఎస్ఐలు ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1982 బ్యాచ్లో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరిన ఆయన ఎస్సైగా పదోన్నతి పొంది చీరాల ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. 42 సంవత్సరాల పాటు పోలీస్శాఖలో సేవలందించారు. ఆయన మరణం పట్ల సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జూదరుల అరెస్ట్ చీరాల: పంట పొలాల వద్ద పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్ బుధవారం అరెస్ట్ చేశారు. చీరాల మండలం నక్కలవారిపాలెం గ్రామంలోని పొలాల్లో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు మెరుపుదాడి చేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.11,200 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షేంచేది లేదని హెచ్చరించారు. -
మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర ఎక్కడ ?
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ: ఆంధ్రప్రదేశ్లో రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎలా ఉన్నారో, కూటమి ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా ఉన్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించారని చెప్పారు. ఈ క్రాప్ నమోదు చేసి ప్రతి రైతుకు పంట నష్టం జరిగినప్పుడు సహాయం అందించారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా రైతుల ఖాతాల్లోనే పరిహారం జమ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో క్వింటా రూ.2400 అమ్మిన మొక్కజొన్నలు కేవలం రూ.1600కు కూడా కొనుగోలు లేక రైతులు లబోదిబోమంటున్నారని చెప్పారు. పొగాకు, ధాన్యం, కందులు, ఇతర పంటలు కూడా గిట్టుబాటు ధరకు కొనేవారు లేరని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామంటూ హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీస అవసరాలకు కూడా గ్యాస్ లభించే పరిస్థితి లేదన్నారు. గంజాయి, డ్రగ్స్కు కేంద్రంగా... గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయని, డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ పార్లమెంటు సభ్యుడు పుట్టా మహేష్యాదవ్ పోలీసులకు దొరకడం సిగ్గుచేటన్నారు. మదనపల్లిలో చిన్నారి హత్య వంటి దారుణాలు కూడా గంజాయి మత్తులోనే జరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రేషన్సరుకులు ఇంటి వద్దకే సరఫరా చేశామని పేర్కొన్నారు. గతంలో సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా ఇస్తామంటూ, ప్రజలకు, ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు టోపీ పెట్టారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 50 వేల ఎకరాల్లో హార్టికల్చర్ సాగవుతుందని ముఖ్యమంత్రికి అబద్ధాలు చెప్పారని, మిరప, కంది, పత్తి అన్ని పంటలను కలిపినా 50 వేల ఎకరాల సాగులో లేదని గుర్తు చేశారు. గ్రానైట్ అక్రమ రవాణా, బెట్టింగ్లు, లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించడం వంటివి తప్ప చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవన్నారు. పోలీస్స్టేషన్ల్లో అక్రమ కేసులు బనాయించడం, కాలనీల్లో బ్రాందీషాపులు ఏర్పాటు చేయడం యథేచ్ఛగా జరుగుతున్నాయని తెలిపారు. అదేమని ప్రశ్నిస్తే వారిపైనే కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని మహిళలు ధర్నా చేస్తుంటే వారిపై దాడులు చేయడం దారుణమన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం అంతా గ్రాఫిక్స్లో తప్ప వాస్తవ రూపంలో కనిపించడం లేదన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకొని చిన్న, చితక వారిని బెదిరించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పీ4 పథకంలో భాగంగా 100 కుటుంబాలను దత్తత తీసుకున్నానని చెబుతున్న ఎమ్మెల్యే జీవీ ఒక్కరికన్నా న్యాయం చేశారా అని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలందరికి ఉగాది నూతన సంవత్సరాది శుభాకాంక్షలు, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్.ప్రసాద్, రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం నాయకులు జుజ్జూరి ఐరామ్మూరి, పట్టణ అధ్యక్షులు కొత్తమాసు శివ, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ బేతం గాబ్రియేలు, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ గంధం బాలిరెడ్డి, వినుకొండ మండలం రూరల్ కన్వీనర్ దండు చెన్నయ్య, శావల్యాపురం కన్వీనర్ బోడెపూడి కొండలు, గుంజి వాసు, కొత్త కృష్ణారెడ్డి, బి.నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలి
బాపట్ల: ఏపీఐఐసీ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కుల నిర్మాణం వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంతోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించడానికి వీలవుతుందని కలెక్టర్ చెప్పారు. నిజాంపట్నం, వేటపాలెం, అమర్తలూరు, పర్చూరు, బాపట్ల మండలాలలో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం చేపట్టాలన్నారు. -
గ్యాస్ కొరత లేదు...
గుంటూరు వెస్ట్: జిల్లాలో గృహ అవసర గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. మంగళవారం స్థానిక బస్టాండ్ దగ్గరలో ఉన్న ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎల్.పి.జీ ఏజెన్సీని తనిఖీ చేశారు. అక్కడే ఉన్న వినియోగదారులతో ముఖాముఖీ మాట్లాడి ఎప్పుడు బుక్ చేశారో తెలుసుకొని, బుధవారం ఉదయం నాటికి సిలిండర్ పంపిణీ చేయాలని గోడౌన్ ఇన్చార్జిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అనవసరమైన ఆందోళనతో గ్యాస్ బుక్ చేయవద్దని వినియోగదారులను కోరారు. కొందరు డెలివరీ బాయ్స్ నిర్లక్ష్యంగా ఉన్నారని ఫిర్యాదు చేయగా, వారి పనితీరు మార్చుకోనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పెండింగ్ బుకింగ్లకు సంబంధించి కొండపల్లి ప్లాంట్ నుంచి లోడ్ వస్తుందని, బుధవారం నుంచి ముందు బుకింగ్ చేసుకున్న వారికి ముందు పంపిణీ చేసే విధంగా సిద్ధంగా ఉన్నామని గోడౌన్ ఇన్చార్జి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ కోమలి పద్మ, జిల్లా మేనేజరు, పౌరసరఫరాల ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
నరసరావుపేట: వినియోగదారులు తమ హక్కులను కాపాడుకోవడంతోపాటు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే, వారు తమ తల్లిదండ్రులు, సమాజానికి మెరుగ్గా వివరించగలరని అన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా వినియోగదారులకు మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లోపించినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం, ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరా అధికారి ఎంవీ ప్రసాద్ మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు అది సకాలంలో, సరైన తూకంతో వస్తోందా, లేదా అని గమనించాలని కోరారు. సమావేశంలో భాగంగా ఆహార భద్రత, తూనికలు–కొలతల శాఖ అధికారులు విద్యార్థులకు నాణ్యత ప్రమాణాల యంత్రాలను ప్రదర్శించారు. ఆహార పదార్థాల్లో నాణ్యతను ఎలా గుర్తించాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. వినియోగదారుల హక్కులపై రూపొందించిన వాల్పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు. వినియోగదారుల హక్కుల కోసం పోరాడుతున్న ఆర్టీఐ సంస్థ ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు. హైస్కూల్ విద్యార్థులు, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నివారణే ధ్యేయం కావాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవగుంటూరు వెస్ట్: సమాజానికి చేటు కలిగించే బాల్య వివాహాల నివారణే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా స్థాయి బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచార ముగింపు కార్యక్రమం ఎస్. ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. గత నవంబరు 27వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికా అమలులో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. వివిధ శాఖలు నిర్వర్తించాల్సిన ప్రత్యేక కార్యాచరణ పై ఆయా శాఖాధిపతులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాలికల ఆరోగ్యం పెద్ద సమస్యగా మారుతుందని, యుక్త వయసులోనే కుటుంబభారం పడుతుందని, జీవితం అంటే ఏమిటో తెలిసే సమయానికి జీవితం చరమాంకానికి చేరుతుందని అన్నారు. సమాజంలో బాలికలకు, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజ నిర్మాణంలో వారికి కీలక పాత్ర అందేటట్లు సహకరించాలని తెలిపారు. బాలికలు, మహిళల ఆరోగ్యం కుటుంబానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. బాల్య వివాహాలు సామాజిక రుగ్మత అన్నారు. తల్లిదండ్రులకు సరయిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు మాట్లాడుతూ బాల్య వివాహిత రహిత గ్రామాలుగా గుంటూరు జిల్లాలో అన్ని గ్రామాలను తీర్మానించే క్రమంలో ఆ శాఖకు చెందిన వివిధ స్థాయిలలోని బాల్య వివాహ నిషేధిత అధికారులు తమ బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ సలీం బాషా మాట్లాడుతూ బడి బయట పిల్లలు, ఎక్కువసార్లు బడికి హాజరు కానీ పిల్లలపై దృష్టి పెట్టి, అటువంటి పిల్లలు బాల్య వివాహ బాధితులు కాకుండా విద్యా సంస్థలు అన్నిటిలో అవగాహనా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. సమావేశంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ, సాధికారిత అధికారి ప్రసూన పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, మునిసిపల్ అధికారులు, మండల, గ్రామ, వార్డు అధికారులు పాల్గొన్నారు. -
గోలివాగులో సంచరిస్తున్న మొసలి
రెంటచింతల: మండలంలోని గోలి గ్రామ సమీపంలోని గోలివాగు బ్రిడ్జిపై రాత్రి వేళ మొసలి సంచరిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గోలి వాగు బ్రిడ్జిపై మొసలి సంచరిస్తున్న విషయం గమనించిన గ్రామస్తులు తహసీల్దార్ దొప్పలపూడి మేరి కనకం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె వెంటనే స్పందించి ఆర్ఐ మన్మోహన్ ప్రసాద్, అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియచేసి వాగు సమీపంలో హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. ప్రతి రోజు వాగులో దుస్తులు శుభ్రం చేసే మహిళలకు, ఈ రహదారిపై నుంచి జెట్టిపాలెం ఏపీ మోడల్ స్కూల్కు వెళ్తున్న గోలి గ్రామానికి చెందిన విద్యార్థులకు, గ్రామ సమీపంలో నాపరాయి క్వారీ కార్మికులకు, నాగమయ్య స్వామి ఆలయానికి వచ్చే భక్తులు, వాగులో పశువులకు దాహార్తిని తీర్చేందుకు వచ్చే పశుపోషకులు ఈ వాగులో మొసలి సంచరిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఐ మన్మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
తెనాలి జిల్లా వైద్యశాలను సందర్శించిన కాయకల్ప బృందం
తెనాలిఅర్బన్: తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను కాయల్ప బృందం మంగళవారం సందర్శించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నిర్మలా గ్లోరి, క్వాలిటీ మేనేజర్ వాసుబాబు, క్వాలిటీ కన్సల్టెంట్ వాసు రాజు తతదితరులు ఆసుపత్రిలోని పలు వార్డులు, ఓపీ సేవలు, ల్యాబ్, రేడియాలజీ తదితర విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి పలువురు అభిప్రాయాలు తెలుసుకున్నారు. సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్డర్ సౌభాగ్యవాణి, ఆర్.ఎం.వో డాక్టర్ మల్లిఖార్జునరావు, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిరూరల్: తల్లి మందలించిందన్న కారణంలో కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అంగలకుదురు గ్రామానికి చెందిన మన్నవ తిరుపతయ్య(35) బేలుదారు పనులు చేస్తుంటాడు. పనికి వెళ్లగా వచ్చిన డబ్బుంతా మద్యంకే వాడేస్తుండడంతో తల్లి సోమవారం మందలించింది. మనస్థాపానికి గురై పురుగులమందు తాగిన అతన్ని కుటుంబ సభ్యులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెలిపారు. మృతుడి భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. -
రూ.1.15 కోట్లకు మోసం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : సుమారు రెండేళ్లకుపైగా మిర్చి డబ్బులు కోసం కాళ్లు అరిగేలా పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తున్నామని బాధిత మిర్చి రైతులు వాపోయారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా తనగల గ్రామ వాసులు బోయ నారాయణ, పచ్చర్ల రాజు, ఈడిగ నరసింహగౌడ్, కురవ వెంకటేశ్ (సర్పంచ్), ఉప్పర లక్ష్మణ (షాబాదా గ్రామం)లు మంగళవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత రెండేళ్లుగా చవి చూసిన కష్టాలను మొరపెట్టుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, జిల్లా ఎస్పీలకు వినతిపత్రాలు అందించారు. అనంతరం మిర్చి బాధిత రైతులు మీడియాతో మాట్లాడుతూ గతంలో గుంటూరులోని రెండు చిల్లీస్ ట్రేడింగ్ సంస్థల నిర్వాహాకులకు మిర్చి బస్తాలు పంపించేవాళ్లమని అన్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం 2,300 మిర్చి బస్తాలు తీసుకురాగా, ప్రస్తుతం ధరలేదని ఓ కోల్డ్స్టోరేజీలో నిల్వ చేయాలని నిర్వాహాకులు సూచించారని చెప్పారు. వారి చెప్పినట్లుగానే సదరు స్టోరేజీలో నిల్వ చేశామన్నారు. నిర్వాహాకులను డబ్బులు అడిగితే అదిగో ఇదిగో అంటూ దాటవేశారు. దీంతో అనుమానం వచ్చి స్టోరేజీలో ఆరాతీయగా మా పేర్లపై మిర్చి బస్తాల్లేవని, నిర్వాహాకులు, వారి కుటుంబ సభ్యులపై ఉన్నాయని అన్నారు. మేమంతా మోసపోయిన గుర్తించి నిర్వాహాకులను గట్టిగా అడిగితే, మిర్చి విక్రయించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. దీనికిగాను చెక్కులు, ప్రామిసరీనోట్లు, రూ.100ల అగ్రిమెంట్లు రాసిచ్చారని అన్నారు. అలాగే గుంటూరు లాలుపురంలో స్థలం, కర్నూలులో ఎకరంన్నర పొలం విక్రయించగా వచ్చే డబ్బులు చెల్లిస్తామని బురిడి మాటలు చెప్పారని వాపోయారు. అయితే ఆ చెక్కులు, అగ్రిమెంట్ ఇతరత్రా కాగితాలు వల్ల ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్సి మోసగించి, రూ.1.15 కోట్లు చెల్లించకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రం నుంచి వందలాది కి.మీ ప్రయాణించి గుంటూరు వస్తుంటే సదరు ట్రేడింగ్ నిర్వాహాకులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయారు. సదరు ట్రేడింగ్ కంపెనీల నిర్వాహాకులను నుంచి తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు. -
న్యాయస్థానమే ఆదుకుంది
మంగళగిరి టౌన్: పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సీబీఎస్ఈ పాఠశాల యాజమాన్యం వ్యవహరించిందని హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ అన్నారు. ఆత్మకూరు నిర్మల సీబీఎస్ఈ పాఠశాల నందు 2024– 25లో 83 మంది 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఒరిజినల్ మార్కుల జాబితాలు జారీ చేయని నేపథ్యంలో వారి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పిల్లలకు ఒరిజినల్ మార్కుల జాబితాలను అందించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై పిల్లల తరఫున వాదనలు వినిపించిన హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ, పిల్లల తల్లిదండ్రులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అడ్వకేట్ బేతపల్లి మాట్లాడుతూ, 2024–25లో నిర్మల సీబీఎస్ఈ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు యాజమాన్యం ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం జరిగిందని తెలిపారు. ఈనెల 9వ తేదీన జస్టిస్ న్యాపతి విజయ్ రెండు వారాల లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తీర్పు ఇవ్వటం సంతోషించదగ్గ విషయమని అన్నారు. హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ -
పక్కా గృహాలు త్వరగా పూర్తి చేసుకోండి
వేటపాలెం: మండల పరిధిలోని జగనన్న కాలనీల్లో పక్కా గృహాల లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ వి. వినోద్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని కొణిజేటి చేనేతపురి కాలనీ పక్కనే ఉన్న జగనన్న కాలనీని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వమే నిధులు ఇస్తున్నప్పటికీ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యంపై ఆరా తీశారు. ఉగాది నాటికి రెండున్నర లక్షల గృహ ప్రవేశాలు జరపాలని ముఖ్య మంత్రి సూచనలను లబ్ధిదారులు గుర్తించాలన్నారు. జిల్లాలో 6,481 పక్కా గృహాలు నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం సూచించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాలు పురోగతి లేకపోవడంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గృహ నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యం గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. చేనేతపురి కాలనీ పక్కన 254 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు 181 గృహాలు నిర్మాణం మాత్రమే పూర్తికాగా .. ఇంకా మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో నిలిచిపోవడంపై పరిశీలించారు. కాలనీ వాసులు తమకు తాగునీరు రావడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పిస్తే మరి కొంత మంది ఇక్కడ నివాసం ఉంటారని ఆయన దృష్టికి తెచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పిలిపించి కలెక్టర్ మాట్లాడారు. పైప్లైన్లు దెబ్బతినడం వల్ల నీళ్లు రావడం లేదని సంబంధిత ఏఈ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆర్డీఓ టి. చంద్రశేఖర్ నాయుడు, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. రిసార్ట్స్కు ర్యాంకింగ్ స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్లో భాగంగా తీర ప్రాంతంలోని రిసార్ట్స్కు ర్యాంకింగ్ ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ అమలు తీరుపై తీర ప్రాంత మండలాల్లోని వివిధ శాఖల అధికారులు, రిసార్ట్స్ యజమానులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధిలోకి తీసుకొస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ (పర్యావరణానికి హాని లేకుండా చేసే పారిశుద్ధ్య వ్యవస్థ) అమల్లోకి వస్తుందన్నారు. ఈ వ్యవస్థ అమలు తీరుపై గత నెలలో ఆయా శాఖల అధికారులు, రిసార్ట్స్ యజమానులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రస్తుతం బాపట్ల జిల్లా పదో స్థానానికి చేరిందన్నారు. మరికొన్నింటిలో ఐదో స్థానంలో నిలిచిందన్నారు. ఈ క్రమంలో సూర్యలంక, వాడరేవు, పాండురంగాపురం, రామాపురం బీచ్ ప్రాంతాలన్నీ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలోని 57 రిసార్ట్స్లు పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్, డీఎల్డీవోలు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ -
201 మంది బాధితులకు ఫోన్లు అందజేత
బాపట్లటౌన్: మొబైల్ ఫోన్ల వాడకంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వర్ తెలిపారు. మొబైల్ ఫోన్లను పొగొట్టుకున్న 201 మంది బాధితులకు మంగళవారం ఫోన్లను అందజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది గడిచిన మూడు నెలల వ్యవధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు రూ. 1.61 కోట్ల విలువైన 806 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. బాపట్ల జిల్లాలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి నెలా ‘మొబైల్ రికవరీ మేళా‘ నిర్వహించి బాధితులకు ఫోన్లను అందజేస్తున్నామన్నారు. 100 శాతం మొబైల్ ఫోన్లను రికవరీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లలో పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజలు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సరైన బిల్లులు లేని, అతి తక్కువ ధరకు విక్రయించే అనుమానాస్పద ఫోన్లను కొనవద్దన్నారు. ఎక్కడైనా మొబైల్ ఫోన్ దొరికినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లలో అప్పగించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు పి.జగదీష్ నాయక్, ఎండీ మోయిన్, ఏ శ్రీనివాసరావు, సోషల్ మీడియా సెల్ సీఐ వి.సూర్యనారణ, ఎస్బీ సీఐ బి.నారాయణ, ఆర్ఐ షేక్ మౌలుద్దిన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేర నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి నేర నియంత్రణే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న తీవ్రమైన సాధారణ కేసుల దర్యాప్తును వేగవంతంగా నిర్వహించాలన్నారు. ప్రాపర్టీ కేసుల్లో దొంగిలించబడిన సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 30 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించేలా కార్యాచరణ ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు, ముఖ్య ప్రదేశాల్లో వేకువజామున 2 గంటల నుంచి నిర్వహించాలన్నారు. దేవాలయాల వద్ద భద్రతను పటిష్టం చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటు వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉగాది, రంజాన్ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు పి.జగదీష్ నాయక్, ఎండీ మోయిన్, ఎ. శ్రీనివాసరావు జిల్లాలోని సీఐలు,ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
నేడు గోవాడలో కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): గోవాడలో ప్రసిద్ధి గాంచిన గంగ పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కోటి కుంకుమార్చన సామూహిక లలిత పారాయణం జరగనున్నట్లు చైర్మన్ పావులూరి రమేష్, కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాస వర్మలు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ఇప్పటి వరకు 7 అమావాస్య కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెలలో 18వ తేదీన ఫాల్గుణ అమావాస్య మహోత్సవం జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ అర్చకులు చావలి శ్రీధర్ శర్మ, ఎస్ఎస్ఎఫ్ బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా వీరభద్రుడి పూజ, గవ్యాంత పూజలు, తదితర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్ తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారు జామున అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు లారీలను ఎస్ఐ అపర్ణ సీజ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాజధాని ప్రాంతం నుంచి రెండు లారీలు నల్ల మట్టితో విజయవాడ వెళ్తుండగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారని చెప్పారు. వాటికి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తెనాలిలో పర్యటించిన ఢిల్లీ బృందం తెనాలిఅర్బన్: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని బృందం తెనాలిలో మంగళవారం పర్యటించింది. ఆదిత్య శుక్లా నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యులు బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్టు యార్డును పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వాహణపై ఆరా తీశారు. వర్మీ, ఆర్గానిక్ కంపోస్టు, కోకో పిట్ కేంద్రాన్ని, ఎస్టీపీ ప్లాంట్ను పరిశీలించారు. వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.ఆర్.అప్పల నాయుడు, ఎంఈ శ్రీకాంత్, ఏఈ సునీల్, పంచాయతీ రాజ్ డీఈ శివరామకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై భారీ మంటలు నరసరావుపేట రూరల్: గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై పెట్లూరివారిపాలెం వద్ద మంగళవారం రాత్రి భారీగా మంటలు వ్యాపించాయి. రోడ్డు పక్కన ఉన్న చెత్తకు అగ్గి అంటుకోవడంతో ఈ మంటలు వ్యాప్తి చెందాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. -
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రాజ్యాంగం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టరు బి.ఆర్.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం దేశం మొత్తం అమలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు రాజ్యాంగం అమలు అవుతోందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం ఎంతో పవిత్రంగా చూసే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేసేలా చంద్రబాబు సర్కారు పని చేస్తోందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని నింద వేయటం ఎంతో దారుణమన్నారు. కల్తీ లేదని సీబీఐ తేల్చినా చంద్రబాబు సర్కారుకు బుద్ధి రాలేదన్నారు. ఇప్పుడు ఆ దేవస్థానం చైర్మన్ బి.ఆర్.నాయుడు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం సిగ్గు చేటన్నారు. ఆ పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగకుండా ఆయన రాజీనామా చేయాలని కోన డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు ఎల్లప్పుడూ కాపాడేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తే ఆయనను క్రిస్టియన్గా చిత్రీకరించేందుకు చంద్రబాబు సర్కారు పూనుకుందన్నారు. అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగ మోహన్ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి మోదుగుల బసవపున్నారెడ్డి, నాయకులు నక్క వీరారెడ్డి, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరులీలా శ్రీనివాసరెడ్డి, వడ్డిముక్కల డేవిడ్, కోకి రాఘవరెడ్డి పాల్గొన్నారు. -
బాపట్ల
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026దేవుడితోనూ బాబు ఆటలు ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) నరసరావుపేట 6.26 4.59 గుంటూరు 6.24 4.57 బాపట్ల 6.24 4.577ప్రాతఃకాల పూజలు పెదపులివర్రు (భట్టిప్రోలు):మండల పరిధిలో ఉన్న పెద పులివర్రు పంచాయతీ లోని గాజుల పేటలో కొలువైన అభయాంజనేయ స్వామికి మంగళవారం ప్రాతఃకాల ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,500, గరిష్ట ధర రూ.9,300, మోడల్ ధర రూ.8,300 వరకు పలికింది. ఢిల్లీ బృందం పరిశీలన అమరావతి:స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను నేషనల్ క్యాలిటీ ఎస్యూరెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. బాపట్ల: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించిన దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టరు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న దేవస్థానానికి ఎంతోమంది మహానుభావులు బాధ్యతలు నిర్వర్తించిన చైర్మన్ కుర్చీలో కూర్పొనే అర్హత బి.ఆర్.నాయుడుకు లేదని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేవిధంగా బీఆర్ నాయుడు ప్రవర్తించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవటం బాధాకరమన్నారు. బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం బాపట్ల పట్టణంలో నిరసన ప్రదర్శన జరిగింది. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ భవనం వరకు ఇది కొనసాగింది. నిరసనను ఉద్దేశించి డాక్టరు మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి చైర్మన్గా ఉన్న బి.ఆర్.నాయుడు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించటం సిగ్గు చేటన్నారు. అంతటి పవిత్రమైన పదవిలో ఉండి ఆ పనులు చేసిన బీఆర్ నాయుడు మళ్లీ తిరుమలలో అడుగుపెట్టడానికి వీలులేదని ప్రజలు ముక్తకంఠంతో నినదించేందుకు వస్తే వారిపై దాడులు చేయించి మరీ ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించటం సరికాదన్నారు. పేదలను కాపాడేందుకు ఉన్న చట్టాలను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా ప్రవర్తించడం తగదని హితవు పలికారు. వెంటనే బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
వలంచీర్స్పోయే!
చీరాల అర్బన్: చంద్రబాబు ఏ హామీ అయినా ఇవ్వగలడు. నమ్మించగలడు.. వంచించగలడు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన హామీలు... తరువాత వాటిని పట్టించుకోకపోవటం అందుకు నిదర్శనమనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. జీతం నెలకు రూ.10 వేలకు పెంచుతామన్నారు. ఉగాది కానుకగా అమలు చేస్తామని వలంటీర్లను నమ్మబలికారు. ఓట్లు దండుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మర్చిపోయారు. రేపు ఉగాది. బాబు ఏది మా జాబు .. అని వలంటీర్లు అడుగుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తీరు ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ వ్యవస్థకు పురుడు పోశారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించారు. ప్రభుత్వ సేవలు ఇంటి వద్దకే నేరుగా అందాయి. క్షేత్ర స్థాయిలో పరిపాలనకు దిక్సూచిలుగా మారారు. పారదర్శక సేవలు అందించారు. ప్రజల నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చింది. ఆశ పడ్డారు.. భంగ పడ్డారు – ఎన్నికల వేళ చంద్రబాబు చెప్పిన మాటలకు ఎక్కువ మంది వలంటీర్లు ప్రభావితం అయ్యారు. వలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తూ, నెలకు జీతం రూ.10వేలు చేస్తామనే మాటకు ఆశపడ్డారు. అయితే తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆ ఊసే ఎత్తక పోవటంతో భంగపడ్డారు. ప్రస్తుతం బాధపడుతున్నారు. వలంటీర్లలో చాలా మంది ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారు. పని లేకుండా ఇంట్లో పెద్దలకు భారం కాకుండా ఉండేందుకు కొలువు చిన్నదైనా గౌరవంగా ఉంటుందని, పది మందికి సేవ చేసే అవకాశం ఉంటుందని వలంటీర్లుగా చేరారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికి రుణపడి ఉంటామని చెప్పుకున్నారు. అయితే తరువాత జరిగిన పరిణామాల క్రమంలో ఉన్న ఉద్యోగం పోయి, మరలా నిరుద్యోగులుగా మిగిలారు. వలంటీర్ వ్యవస్థ లేకుంటే చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన మరో హామీ నిరుద్యోగ భృతి అన్నా దక్కక పోతుందా అని భావించారు. అయితే నిరుద్యోగ భృతి అమలు ఎప్పటికో తెలీదు. అసలు అమలు చేస్తారో లేదో తెలీదు. ఇది ఒక రకంగా తమ జీవితాలతో చెలగాటమాడుకున్నట్లేనని వారు వాపోతున్నారు. అయితే తమ బాధను బహిరంగంగా కూడా చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు
మంతెనవారిపాలెం(కర్లపాలెం): శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ చెప్పారు. పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెంలో గ్రామస్తులు రూ.2.50 లక్షలతో గ్రామంలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను సోమవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజుతో కలసి ప్రారంభించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి, స్వాతంత్య్ర సమరయోధులు వెంకటరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామస్తులంతా కలసి తమ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం అభినందనీయమన్నారు. ప్రస్తుత సమాజం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు. గ్రామస్తులందరూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గ్రామస్తులంతా ఐక్యంగా పనిచేయటం అభినందనీయమన్నారు.సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటపతిరాజు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ హరికృష్ణ, ఎస్ఐ శివకుమార్ ఉన్నారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ -
గోల్షాట్ బాల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం విజయవంతం
కొల్లూరు, (వేమూరు) : గోల్ షాట్ బాల్ దేశవ్యాప్త ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు మండలంలోని చిలుమూరు శ్రీరామ సైనిక్ స్కూల్లో విజయవంతంగా జరిగాయి. ఈనెల 14, 15 తేదీల్లో రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశాల్లో దేశంలోని 13 రాష్ట్రాల నుంచి వచ్చిన కార్యదర్శులు పాల్గొన్నారు. గోల్డ్ షాప్ బాల్ క్రీడాభివృద్ధికి, భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యాచరణ, క్రీడ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కోచ్లు, పీఈటీలు, పీడీలకు గోల్ షాట్ బాల్ ఆటపై అవగాహన సదస్సు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణలో పాల్గొన్న వ్యాయామ ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహించి, అర్హత సాధించిన వారికి రాష్ట్ర స్థాయి రిఫరీలుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ గేమ్ ఫౌండర్, ప్రధాన కార్యదర్శి నోట్ల రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. శ్రీ రామా సైనిక్ స్కూల్ అధ్యక్షులు కె.తులసి విష్ణు ప్రసాద్, గోల్డ్ షాట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు బిహార్ రాష్ట్రానికి చెందిన రామ్ పరమేష్ కుమార్ (అసోసియేషన్ ట్రెజరర్), తమిళనాడుకు చెందిన ఆర్. కరుణాకర్ (సౌత్ ఇండియా ఇన్చార్జ్), మహారాష్ట్రకు చెందిన యోగేష్ పటేల్ (వెస్ట్ ఇన్చార్జ్), ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రభాకర్ (ఈస్ట్ ఇంచార్జ్), ఢిల్లీకి చెందిన నితిన్ షైన్ (నార్త్ ఇన్చార్జ్), వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్ ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దేవి ప్రియ ప్రారంభించిన కార్యక్రమంలో ఆర్గనైజర్ సెక్రటరీ వణుకూరి గోపికృష్ణ, వర్కింగ్ సెక్రటరీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు -
రేపల్లెలో ఎగసిన నిరసన
బాపట్లమంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026 ఇఫ్తార్ సహరి (మంగళ) (బుధ) గుంటూరు 6.24 4.58 నరసరావుపేట 6.26 5.00 బాపట్ల 6.24 4.58అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు. రేపల్లె: ఏకపక్షంగా వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆ పార్టీ నాయ కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను వెంటనే ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో పట్టణంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత మూడు గంటలకు పైగా కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేసినప్పటికీ మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో రహదారిపై బైఠాయించి ప్రజాస్వా మ్య పరిరక్షణ కోరుతూ నినాదాలు చేశారు. డీఈ మధుసూదనరావు ఫ్లెక్సీల తొలగింపుపై సమాధానం ఇవ్వకపోవటంతో నిరసన కొనసాగించారు. సమాచా రం అందుకున్న పట్టణ సీఐ మల్లికార్జునరావు అక్కడికి చేరుకుని నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పార్టీ నాయకులు, పోలీసు ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, రాజకీయ పక్షపాతం లేకుండా వ్యవహరించాలని నాగమోహన్కృష్ణ డిమాండ్చేశారు. అనంతరం తాలూకా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కు వెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుతూ వినతి పత్రా న్ని సమర్పించారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలను మీరు తొలగిస్తారా... మేము తొలగించమంటారా అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తుంటే అక్కడే ఉన్న సీఐ వాగ్వాదానికి దిగా రు. అడ్డుకోబోయి న నాగమోహన్కృష్ణతో వాగ్వాదంకు దిగి చొక్కా పట్టుకుని స్టేషన్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు ప్రతిఘటించడంతో చేసేదిలేక సీఐ బెదిరింపులకు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ● నాగమోహన్కృష్ణ మాట్లాడుతూ రేపల్లె నియోజకవర్గంలో అధికారులు అధికార ప్రతినిధులకు తొత్తులుగా పనిచేయటం సిగ్గుచేటన్నారు. రేపల్లె పట్టణంలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నా మున్సిపల్ కమిషనర్ కంటికి కనిపించకపోవటం బాధాకరమన్నారు. మంత్రి మెప్పుపొందేందుకు వైఎస్సార్ సీపీ ప్లెక్సీలను మాత్రమే తొలగించటం హేయమైన చర్యన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే అన్ని ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో శాంతియుత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు చిత్రాల ఓబేదు, చిమటా బాలాజీ, జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సముద్రాల ప్రభుకిరణ్, మండల కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, యార్లగడ్డ వెంకట రాంబాబు, ఇంకొల్లు రామకృష్ణ, డుండి వెంకట రామిరెడ్డి, మహిళా విభాగం కన్వీనర్ వీసం నాగలక్ష్మి, నాయకులు ఉమారాణి, చందోలు నాగలక్ష్మికుమారి, సజ్జా పద్మావతి, ఆలా రాజ్పాల్, నిజాంపట్నం కోటేశ్వరరావు, కొలుసు బాలకృష్ణ, నాగిశెట్టి పవన్, వుయ్యూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం
ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: పొట్టి శ్రీరాములు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతిని సోమవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా కొనియాడారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని, పలుమార్లు జైలుకు వెళ్లిన గాంధేయవాది అన్నారు. ఆంధ్రుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఖ్యాతిని ప్రతి తెలుగు వారు గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్నాయక్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ భుజంగరావు, ఎస్బీ–2 సీఐ రాంబాబు, వెల్ఫేర్ ఆర్ఐ మౌలుద్దీన్ పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవు
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 59 మంది బాధితులు హాజరై వారి సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. బాధితుల సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్న ఎస్పీ సమస్యలను సాధ్యమైనంత త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఎస్.ఐ లక్ష్మీరాజ్యం, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.చినగంజాం: మహిళపై అనుమానంతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని మోటుపల్లి శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎస్సై శీలం రమేష్ వివరాల మేరకు.. ఒక మహిళతో మోటుపల్లి గ్రామానికి చెందిన పొగడదండ శ్రీనివాసరావు అనే వ్యక్తి గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో సదరు మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో సోమవారం ఉదయం మోటుపల్లి గ్రామ శివారు ప్రాంతంలో కత్తితో ఆమైపె దాడి చేసి హత్యాప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి వెళ్లి గాయాలపాలైన ఆమెను 108 వాహనంలో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు చినగంజాం ఎస్సై తెలిపారు. వేటపాలెం: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వేగంగా దూసుకెళ్తున్న బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన దేశాయిపేట పంచాయతీలోని మార్కెట్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. చీరాలకు చెందిన బి.వెంకటరమణ(60) దేశాయిపేట మార్కెట్ వద్ద చీరాల–వేటపాలెం ప్రధాన రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో చీరాల వైపు బైక్పై వెళ్తున్న యువకుడు ఢీకొట్టడంతో వెంకటరమణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న యువకుడికి సైతం తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఉద్యోగోన్నతులకు సంబంధించి అర్హులైన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ కేడర్ల వారీగా తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలిక, జనరల్ సీనియారిటీ జాబితాను సంబంధిత ఉపాధ్యాయుల అర్హతల ఆధారంగా సబ్జెక్టుల వారీగా డీఈవో.జీఎన్టీ.బ్లాగ్స్పాట్.కామ్లో ఉంచినట్లు తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సంబంధిత అధికారి ద్వారా తగిన ధ్రువపత్రాలతో ఈనెల 22లోపు సాయంత్రం 3.00 గంటల నుంచి 7 గంటల వరకు అన్ని పనిదినాల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని వినతుల స్వీకరణ కమిటీకి సమర్పించాలని సూచించారు. నిర్దిష్ట గడువు అనంతరం అందిన వినతులు స్వీకరించబడవని పేర్కొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో 2025 డిసెంబర్లో జరిగిన బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఫస్ట్ సెమిస్టర్కు 925 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 795 మంది ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు రీవాల్యుయేషన్కు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి, రీవాల్యుయేషన్ దరఖాస్తులను 26వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాలని, పర్సనల్ వెరిఫికేషన్కు రూ.2190 చెల్లించాలని ఆలపాటి తెలిపారు. -
నాణ్యత ప్రమాణాలతో శనగల కొనుగోలు
పర్చూరు(చినగంజాం): నాణ్యత ప్రమాణాల ఆధారంగా రైతుల వద్ద నుంచి శనగల కొనుగోలు చేస్తామని జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య (ఎన్సీసీఎఫ్) అధికారులు మనోజ్, భానుచందర్లు సూచించారు. మండలంలోని నూతలపాడు గ్రామంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని వారు సోమవారం సందర్శించారు. శనగల కొనుగోలు తీరును పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దళారుల జోక్యం లేకుండా నేరుగా రైతుల వద్ద నుంచి నాణ్యతను ప్రమాణంగా తీసుకొని శనగ కొనుగోలు చేస్తారన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ విన్నకోట సతీష్, రైతులు పాల్గొన్నారు. -
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రద్దుచేయాలి
తెనాలి: కేంద్ర పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం–2025ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తెనాలి హెడ్ పోస్టాఫీసులో జరిగిన తెనాలి డివిజన్ పోస్టల్, ఆర్ఎంఎస్ పెన్షనర్ల వార్షిక సమావేశానికి డివిజనల్ అధ్యక్షులు ఐ.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ఎన్.నాగేశ్వరరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కేంద్రప్రభుత్వ పెన్షనర్లు అందరినీ 8వ వేతన సంఘ పరిధిలోకి తీసుకోవాలని, 8వ వేతన సంఘాన్ని 2026 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని, కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అనుకూలంగా సీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను వెంటనే అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక డివిజనల్ కార్యదర్శి ఎల్.ప్రసాదరావు, కోశాధికారి పి.జోనేష్, రషీద్ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆలిండియా జాయింట్ జనరల్ సెక్రటరీ ఎం.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 8వ కేంద్ర వేతన సంఘ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్, కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కోరిన ప్రశ్నావళి గురించి వివరించారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు రాజేంద్రప్రసాద్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. నరసరావుపేట పెన్షనర్ల డివిజనల్ కార్యదర్శి ఎన్జీ ఘోష్, పెన్షనర్ల రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.తిరుమలరావు, బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల నాయకులు శివ మాట్లాడారు. తదుపరి 70–90 ఏళ్లు నిండిన సంఘ సభ్యులను గౌరవంగా సత్కరించారు. -
సోదర భావంతో కలిసికట్టుగా ఉండాలి
బాపట్ల: అందరూ సోదర భావంతో కలిసికట్టుగా ఉండి శాంతి భద్రతలను స్థాపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక షాదీఖానాలో ఇఫ్తార్ విందు జరిగింది. ముస్లిం మత పెద్ద ఖలీల్ లాఖాన్, జిల్లా కలెక్టర్ ఖురాన్ గ్రంథాన్ని బహుమతిగా అందజేశారు. ముందుగా అందరూ కలిసి నమాజ్ చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన కలెక్టర్ వినోద్ కుమార్ ముస్లింలకు స్వయంగా తన చేతులతో వడ్డించారు. అనంతరం వారితో కలిసి విందులో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ ప్రజలందరూ బాగుండాలని దైవాన్ని కోరుకోవడం అభినందనీయమని కలెక్టర్ చెప్పారు. యుద్ధం నేపథ్యంలో మక్కా పుణ్య క్షేత్రానికి వెళ్లేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేరొన్నారు. బాపట్ల జిల్లాలో ఎవరైనా మక్కాకు వెళ్లేవారు ఉంటే వారికి ఎలాంటి సమస్యలు రాకుండా వారి ప్రయాణ సౌకర్యాలకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ పి.గ్లోరియా, ఇంటర్మీడియెట్ బోర్డ్ జిల్లా అధికారి జుబేర్, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, కరీముల్లా సాహెబ్ పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
పరమపద నాథ అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం భక్తులకు పరమపద నాథ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ తెలియజేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా ఆత్మకూరు గ్రామానికి చెందిన మురికిపూడి మాధవరావు కుమారులు వ్యవహరించగా ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా కృష్ణమూర్తి వ్యవహరించారు. -
చరిత్రలో చిరస్థాయిగా అమరజీవి త్యాగం
బాపట్ల: భాషా ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతోపాటు జిల్లా అధికారులు, ఆర్య వైశ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. వీరు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ అమరజీవి త్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, నేటి యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.గ్లోరియా, బీసీ సంక్షేమ శాఖ డీడీ శివ నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అబ్బులు, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, ఆర్య వైశ్య సంఘాల నాయకులు, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో జరిగిన పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వీక్షించారు. విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలి బాపట్ల: విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో మెలగాలని, అప్పుడే అభివృద్ధి మొదలవుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. విద్యారంగం, గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, ఎండీఓలతో వీక్షణ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో నూరు శాతం విద్యార్థుల హాజరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హాజరు శాతం తక్కువగా ఉండడంపై సంబంధిత ఎంఈఓలను ఆయన నిలదీశారు. చిన్నగంజాం మండలంలో గడిచిన మూడు నెలలుగా పని తీరు బాగోలేదని, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. సచివాలయాల పరిధిలో చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. 4,600 కుటుంబాల సర్వే నేటికీ పెండింగ్లో ఉండడంపై అధికారులను నిలదీశారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది హాజరు నూరు శాతం ఉండాలన్నారు. కర్లపాలెం మండలంలో సిబ్బంది హాజరు తక్కువగా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ఏపీ సేవ నగదు తక్షణమే ప్రభుత్వ ఖజానాకు చేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈ ఓ. శ్రీనివాస్ సింగ్, సచివాలయాల ఇన్చార్జి విజయలక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్ పి.యశ్వంత్, ఎండీఓలు, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో కలసి కలెక్టర్ నివాళులువడదెబ్బ నివారణకు ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. వడదెబ్బ నివారణ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం చేపట్టారు. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అవగాహన కల్పించేందుకు వడదెబ్బ తగలకుండా చేయవలసిన పనులు చేయకూడని పనులు (డూస్ అండ్ డోంట్స్) పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విజయమ్మ, నోడల్ అధికారి డాక్టర్ లలిత రాజేశ్వరి, డాక్టర్ వి.లోకేష్, డాక్టర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో సత్తెమ్మతల్లి 16 రోజుల పండుగ
అచ్చంపేట: మాదిపాడు పంచాయతీ పరిధిలోని అడవిలో స్వయంభు సత్తెమ్మతల్లి దేవాలయంలో సత్తెమ్మతల్లి, సత్యదేవుళ్ల కళ్యాణ 16 రోజుల పండుగ మహోత్సవాలు సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పొంగళ్లు పొంగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ నిర్వహకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించి 16వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందులో భాగంగానే ఈనెల 1వ తేదీన అమ్మవారికి కళ్యాణం నిర్వహించామని, తిరిగి 16 రోజుల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు శ్రీనివాసరావు, సత్యవతి దంపతులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అచ్చంపేట: ఉగాది పండుగను పురస్కరించుకుని స్థానిక గ్రామదేవతగా వెలుగొందుతున్న అచ్చమ్మ పేరంటాళమ్మ తల్లి మహోత్సవాలు మంగళ ,బుధ, గురు వారాలలో మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ కన్వీనర్ సూరే వెంకట సుబ్బారావు సోమవారం తెలిపారు. ప్రతి ఏటా ఉగాదికి ముందు నుంచి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తొలిరోజు తోరణపాకు అలంకరణ, విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, మండపారాధనలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. మూడు రోజుల పాటు ప్రాతఃకాల పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. చివరిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు, అర్చనలు, లలితాసహస్రనామ పారాయణం, పంచాంగ శ్రవణం, మహో నైవేద్యం, వేపపూత ప్రసాద పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గుంటూరురూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18వ తేదీన గుంటూరు నగర పర్యటన ప్రతిపాదనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్జిందాల్లు అందుకు అవసరమైన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్రోడ్ శ్రీ కన్వెన్షన్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి ఆర్టీసీ బస్స్టాండ్ వరకు పర్యటించే అవకాశాలు ఉన్నందున వాటి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఆర్టీసీ ఆర్ఎం సామ్రాజ్యం, ట్రాఫిక్ డీఎస్పీ బి.శ్రీనివాస్, ఈస్ట్ డీఎస్పీ అజీజ్, పాత గుంటూరు సీఐ వెంకటరావు, లాలాపేట సీఐ శివరామకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరావు, డీటీసీ సీతారామిరెడ్డి, ఈస్ట్ తహసీల్దార్ సుభాని, ఇతర శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు. -
వస్తువుల కొనుగోలులో మోసపోరాదు
బాపట్ల: ప్రజలు ఏ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో మోసానికి గురికాకుండా అవగాహన పొందాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, నాణ్యత ప్రమాణాలతో రూపొందించిన తూనికలు, కొలతలు యంత్రాల ప్రదర్శించారు. వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ రూపొందించిన గోడపత్రాలను జేసీ విడుదల చేశారు. ఆహార పదార్థాలను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జమీర్ బాషా, పౌర సరఫరాల కార్పొరేషన్ జీఎం శ్రీలక్ష్మి, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రణీత్, తూనికలు కొలతలశాఖ సహాయ కమిషనర్ లిల్లీ, డీటీఓ పరందామరెడ్డి, వాణిజ్య శాఖ అధికారి గౌరీ, డీసీఐసీడీ ఇమ్మానియేలు పాల్గొన్నారు. జేసీ భావన వశిష్ట -
అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్
రాజధాని ప్రాంతం నుంచి చేబ్రోలుకు తరలిస్తున్న అధికార పార్టీ నేతలు చేబ్రోలు: నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి రాజధాని ప్రాంతం నుంచి అధికార పార్టీకి చెందిన నాయకులు మట్టిని పెద్ద పెద్ద లారీలలో తీసుకువచ్చి చేబ్రోలు ప్రాంతంలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజధాని ప్రాంతం నీరుకొండ నుంచి ఐదు టర్బో లారీలలో మట్టి తీసుకువచ్చి స్థానిక జీబీసీ రహదారి పక్కన ఖాళీ ప్రదేశంలో మెరక చేస్తుండటంతో కొంతమంది పోలీసులకు, రెవెన్యూ, అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం తెల్లవారుజామున మట్టిలోడ్తో వచ్చిన లారీలను స్థానిక ఎస్ఐ పి.వీరనారాయణ ఆధ్వర్యంలో సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. మొత్తం ఐదు లారీలకు చెందిన డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదకాకాని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకులు గత కొద్ది రోజులుగా చేబ్రోలు పరిసర గ్రామాల్లో మట్టిని పెద్ద పెద్ద లారీల్లో ఇక్కడకు తరలించి బ్రోకర్ల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టుబడ్డ లారీలు అధికార పార్టీకి చెందిన వారివి కావటంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. -
అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలి
జాయింట్ కలెక్టర్ భావన వశిష్టబాపట్ల: ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో నమోదైన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. తన పరిధిలో ఉన్న వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు. కొన్ని పరిశీలనకు, మరికొన్నింటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ‘రైతన్న మీకోసం‘ కార్యక్రమాలను జిల్లాలో జయప్రదంగా నిర్వహించాలని తెలిపారు. ప్రారంభ సూచికగా వ్యవసాయ శాఖ రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను జేసీ విడుదల చేశారు. ఆరు రోజులపాటు గ్రామాలలో నిర్వహించే ఈ కార్యక్రమాలు రైతన్నలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, పెట్టుబడులు–పరిశ్రమలు, సంక్షేమ నుంచి సంపాద సృష్టించే దిశగా రైతులు అడుగులు వేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామ సచివాలయాల స్థాయిలో ఎనిమిది మందితో బృందాలను నియమించాలన్నారు. ప్రతిరోజు ప్రతి బృందం 30 గృహాలను లక్ష్యంగా నిర్దేశించుకుని సందర్శించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమాలు విరివిగా చేపట్టాలన్నారు. ప్రతిరోజూ జిల్లా రెవెన్యూ అధికారి జిల్లా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం జాతీయ పశు వ్యాధి నియంత్రణ టీకాలు ఏప్రిల్ 29వ తేదీ వరకు జరుగుతాయన్నారు. పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకం.. పితలాటకం
ఆదాయం ఘనం.. వసతులు నామమాత్రంచీరాల అర్బన్: మండల పరిధిలోని వాడరేవు పంచాయతీకి ఆదాయం ఘనంగానే వస్తున్నా సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయి. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాడరేవు పంచాయతీ కీర్తివారిపాలెం వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. తీరానికి వచ్చే పర్యాటకుల వాహనాల (కారు, ఇతర పెద్ద వాహనాలు) నుంచి రుసుం వసూలు చేసే విధంగా ఆ చెక్పోస్ట్ నెలకొల్పారు. నిర్వహణ బాధ్యతను పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. వచ్చిన ఆదాయంతో గ్రామంలోను, తీరంలోను మెరుగైన వసతులు కల్పించాలనేది లక్ష్యం. అయితే నిర్వహణ తీరుపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చెక్పోస్ట్ వద్ద వాహనాల నుంచి రుసుం వసూలు చేసే బాధ్యతలను వేలం ద్వారా ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. ఏడాది కాలానికి కాంట్రాక్టర్ రూ.7 లక్షలు చెల్లించాలని నిబంధన విధించారు. స్నానానికీ ఇబ్బందే.. ప్రస్తుతం ఉన్న స్నానపు గదులు సరిపోవడం లేదని పలు సందర్భాల్లో పర్యాటకులు చెబుతున్నా కనీస స్పందన కరువైంది. సముద్ర స్నానం అనంతరం మంచినీటితో స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేయడంలో ఇక్కడి యంత్రాంగం విఫలమైంది. సాధారణంగా వాడరేవు తీరానికి శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆయా రోజుల్లో పర్యాటకులు స్నానమాచరించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు వైపులా రుసుం వసూలు వాడరేవు–పిడుగురాళ్ల రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక ఆ మార్గం నుంచి, ఇటు కీర్తివారిపాలెం(పాత రోడ్డు) నుంచి పర్యాటకులు తీరానికి వస్తున్నారు. ఈ క్రమంలో పిడుగురాళ్ల రోడ్డు నుంచి వాడరేవు పంచాయతీ పరిధిలో ఉన్న తారురోడ్డు వరకు ఏ వాహనం వచ్చినా రుసుం వసూలు చేస్తున్నారు. ఈ మేరకు పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. సముద్రంలో స్నానాలకు వెళ్లే వారిని హెచ్చరించేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అలానే గజ ఈతగాళ్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. ఎన్నికలు నిర్వహించనందున పంచాయతీకి ఆర్థిక సంఘం నిధులు రాలేదు. కాంట్రాక్టర్ తొలివిడతగా రూ.4.5 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంది. జీతభత్యాలు, పారిశుధ్యానికే అంతంత మాత్రంగా నిధులు ఉన్నాయి. వాటర్ ట్యాంకుల్లో తాగునీరు రాని మాట వాస్తవమే. అదనంగా పనులు చేసేందుకు నిధుల కొరత ఉంది. మా వంతు బాధ్యతగా ఉన్నంతలో సౌకర్యాలు కల్పిస్తున్నాం. – రమేష్, పంచాయతీ సెక్రటరీ, వాడరేవు -
కాపురానికి తీసుకెళ్లాలంటూ న్యాయ పోరాటం
తాడేపల్లిరూరల్: అగ్ని సాక్షిగా తాళి కట్టి భార్యను చేసుకున్న భర్త తనను వదిలివేయడంతో, తనకు న్యాయం చేయాలంటూ ఆమె బంధువులతో కలసి భర్త ఇంటి ముందు సోమవారం నిరసనకు దిగిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లి గ్రామంలోని ఎస్వీ అపార్ట్మెంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు... కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన చైతన్యకు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన యర్రంనేని విజయ్తో 2017లో పెద్దల సమక్షంలో వివాహమైంది. 2019లో వీరికి కుమారుడు జన్మించాడు. తనకి ఇష్టం లేని పెళ్లి చేశారంటూ విజయ్ భార్యను వదిలివేశాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత భర్త, అత్తమామలు బాబును చూసేందుకు వచ్చారు. భార్యను కాపురానికి తీసుకు వెళ్లలేదు. తనను కాపురానికి తీసుకువెళ్లమని ఎన్నిసార్లు వేడుకున్నా అత్తమామలు, భర్త నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా పామర్రు, తాడేపల్లి పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగలేదు. దీంతో 2020లో కోర్టును ఆశ్రయించింది. కాపురానికి తీసుకువెళ్లాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ భర్త నుంచి ఎటువంటి స్పందన లేదు. తమకు సంబంధం లేదంటూ అత్తమామలు కూడా చేతులెత్తేశారు. భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో తెలిసిన బంధువుల ద్వారా ఆరా తీస్తే ఆయన హైదరాబాదులో వేరే యువతితో సహజీవనం చేస్తున్నాడని, ఫారిన్ వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడని తెలుసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం కుంచనపల్లిలోని అపార్ట్మెంట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి ఆందోళనకు దిగింది. బాధితురాలు చైతన్య తండ్రి చౌదరి మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టినట్లు తెలిపారు. భర్త ఇంటి ముందు భార్య నిరసన -
అర్ధరాత్రి గ్రావెల్ అక్రమ తవ్వకాలు
● పూలింగ్కి ఇచ్చిన భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు ● జేబులు నింపుకొంటున్న తమ్ముళ్లు ● పట్టించుకోని మైనింగ్ ఇతర అధికారులు తాడికొండ: రాజధాని ప్రాంతంలోని అనంతవరం గ్రామంలో అధికార పార్టీ నాయకులు అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. కొండ వెనుక ఉన్న ఫూలింగ్ భూముల్లో రాత్రివేళ గ్రావెల్ తవ్వకాలు చేసి అక్రమంగా తరలించడంతో సదరు రైతు లబోదిబోమంటున్నాడు. రాజధానిలో గ్రావెల్కు తీవ్ర డిమాండ్ ఉండటంతో అధికార పార్టీకి చెందిన నాయకులు రాత్రివేళ జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలతో భారీగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. ఈ గ్రావెల్ను అమరావతి మండలం వైకుంఠపురం ఇతర గ్రామాలకు తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. దీనిపై అటు మైనింగ్, రెవెన్యూ ఇటు పోలీసులు కూడా తొంగిచూసిన దాఖలాలు లేకపోవడంతో యధేచ్ఛగా ప్రభుత్వ సంపద తరలిపోతుంది. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కనుల పండువగా బదరీ కేదారేశ్వర శాంతి కల్యాణం
కర్లపాలెం: అగ్రహారం గ్రామంలో ఉన్న గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి శివపార్వతుల శాంతి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా శివాలయంలో ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచి పలు రకాల పూలమాలలతో అలంకరించారు. లోక కల్యాణం కోసం శాస్త్రోక్తంగా శివపార్వతుల శాంతి కల్యాణ మహోత్సవం జరిపించారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. -
మహిళలు అక్షరాస్యులు కావాలి
● డీఆర్డీఏ పీడీ పి. ఝాన్సీరాణి ● వయోజనుల అక్షరాస్యత వార్షిక పరీక్ష కేంద్రాల తనిఖీ యడ్లపాడు: మండలంలోని 22 గ్రామాల్లో ఆదివారం అక్షర ఆంధ్ర–అక్షర పల్నాడు కార్యక్రమంలో భాగంగా అధికారులు వయోజనులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల నిర్వహణ పరిశీలనకు జిల్లా డీఆర్డీఏ పీడీ పి ఝాన్సీరాణి ఆకస్మికంగా మండలాన్ని సందర్శించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రలో జరిగే పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో 2200 మంది వయోజనులు అక్షరాభ్యాసం చేస్తున్నారని వీరిలో 1670 మంది డ్వాక్రా సభ్యులు కాగా, 530 మంది ఉపాధి కూలీలు ఉన్నట్లు తెలిపారు. చదువుపై వయోజనులు చూపుతున్న ఆసక్తిని ఆమె అభినందించారు. చదువు లేని డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీలు తమ రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో మోసపోకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. పొదుపు సంఘాల్లో డబ్బుల లెక్కలు తెలుసుకోవడం, ఉపాధి హామీ కూలీ డబ్బుల లెక్కలు చూసుకోవడం ,బ్యాంకు చెక్కులపై సొంతంగా సంతకాలు చేయడం వంటి అంశాల్లో స్వయం సమృద్ధి సాధించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్యోద్దేశమని ఆమె పేర్కొన్నారు. మండల ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలకు వందశాతం హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఎంపీడీవో వి హేమలత, డిప్యూటీ ఎంపీడీవో షేక్ జాకీర్హుస్సేన్, సచివాలయ మండల అధికారి నాగిరెడ్డి, ఏపీఎం కె రవీంద్రకుమార్, ఏపీఓ డి సుందరరావు, సీసీలు వై పెద్దయ్య, సీహెచ్ నాగేశ్వరరావు, జి నాగేశ్వరరావు, ఎం ద్రాక్షాయమ్మ పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించారు. -
గంజాయి కేసులో నిందితుల అరెస్ట్
పట్నంబజారు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పాత గుంటూరు పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో కే.వెంకట ప్రసాద్ వివరాలను వెల్లడించారు. గుంటూరు తారకరామానగర్కు చెందిన షేక్ మహబూబ్ బాషా అలియాస్ 220 బాషా గంజాయి తాగటానికి అలవాటు పడి, సులువుగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో లంబసింగ్ వాటర్ ఫాల్స్ దాటిన తరువాత అన్నారం అనే గ్రామం వద్ద తాబేలీ ఛత్రపతి, తామిలి కొండలరావు వద్ద లిక్విడ్ గంజాయి కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఛత్రపతి, కొండలరావుకు గంజాయి కావాలని ఫోన్ చేయగా, లిక్విడ్ గంజాయి తీసుకుని వారు ఈనెల 15వ తేదీన వస్త్ర నగర్ వద్దకు వచ్చారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కిలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు. ఈ మేరకు వారినీ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
తాడేపల్లి రూరల్: దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి.. వారి సమగ్ర అభివృద్ధికి పాలకుల ప్రణాళికలు చేయాలని జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ డిమాండ్ చేశారు. ఆదివారం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. బీసీ రమణ మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేక 80 శాతం బీసీ కులాలు చట్టసభల్లో అడుగుపెట్టడం లేదని అన్నారు. దీంతో ఆయా వర్గాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. బహుజన పోరాట వీరుడు కాన్షీరాం జయంతిని ఘనంగా నిర్వహించి, ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో బీసీ భవనాలకు రెండు ఎకరాల స్థలం కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. బీసీలను చైతన్యం చేయడమే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్య బీసీ నాయకులు పాల్గొన్నారు. -
అండర్–17, 19 బాక్సింగ్ జట్లు ఎంపిక
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్–17, 19 బాలుర బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల పర్యవేక్షణను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.చిరంజీవి, బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాఽథ్లు పర్యవేక్షించారు. చిరంజీవి మాట్లాడుతూ ఎంపికై న జట్లు 21 నుంచి 23 వరకు విశాఖలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులు.. అండర్–19 : సీహెచ్ అభిషిత్ పాల్, రామేశ్వర్, ఎన్.లోకేష్ చౌదరి, అండర్–17లో జి.సాయిహర్ష, బి.దేవ సుధాకర్, ఎస్.కుశ్వంత్ రాజ్ కుమార్, ఎస్.చరణ్ దీప్, బి.వెంకట మనోహర్, ఎస్.సత్యకుమార్, పి.కార్తీక్, ఎస్.రోహిత్ కుమార్, ఎస్.విజయ్ కుమార్, జి.కనిష్క్, జి.సాయిరామ్ చరణ్ ఉన్నారు. -
కూటమి ప్రభుత్వంలో డ్రగ్గిస్టులు
పట్నంబజారు: కూటమి ప్రభుత్వంలో కామాంధులు, డ్రగ్గిస్టులకు కేరాఫ్కు మారిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని ఒక ఫామ్ హౌస్లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని దొరకటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహేష్ ఈ విధంగా వ్యవహరిస్తే, రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థులను నేరుగా మత్తు పదార్థాలకు అలవాటు అవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేవలం డబ్బులు కోసం గంజాయి, డ్రగ్స్ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. రౌడీలను, డ్రగ్గిస్టులను, మహిళలను వేధించే వారిని పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపుతున్నారని ఆరోపించారు. కచ్చితంగా ఎంపీ మహేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. -
డాక్టర్ రమణ యశస్వికి ఎన్టీఆర్ ట్రస్ట్ అవార్డు
గుంటూరు మెడికల్ : కవి, సేవా తత్పరుడు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకుగాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు.ఽ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతుల మీదుగా హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో డాక్టర్ యశస్వి రమణ అవార్డు తీసుకున్నారు. థలసీమియా రోగులకు రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసినందుకు, వాక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 ఏళ్లకు పైగా వికలాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు ఉచితంగా అందజేసి వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు, పేదలకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నందుకు డాక్టర్ యశస్వి రమణకు ఎన్టీఆర్ ట్రస్టు అవార్డు, ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించినట్లు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజర్ శ్రీకాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా నుండి డాక్టర్ యశస్వి రమణను మాత్రమే ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అవార్డు అందుకున్న డాక్టర్ రమణ యశస్వికి గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్యులు, వైద్యాధికారులు, జిల్లాకు చెందిన పలువురు వైద్యులు, ఐఎంఏ నేతలు, రోటరీ క్లబ్ నేతలు, ఇతర స్వచ్చంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.


