breaking news
Bigg boss reality show
-
బిగ్బాస్ షాలిని జీవితంలో ఇంత విషాదమా?
బిగ్బాస్ తెలుగు 10లో కామనర్గా అడుగుపెట్ని షాలిని తనదైన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతకముందు ‘అగ్నిపరీక్ష2’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టి తన మాటలతో ఆట తీరుతో మెప్పిస్తోంది. అయితే ఎప్పుడూ యాక్టివ్గా, కానిఫడెంట్గా కనిపించే షాలిని జీవితంలో ఓ విషద కథ ఉన్నట్లు మీలో ఎంతమందికి తెలుసు..? ఆమె జీవతంలో జరిగిన కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యులో తెలిపారు. అవే ఏంటో తెలుసుకుందాం రండి!ఇదీ చదవండి: Bigg Boss 10: ఓటీంగ్ కోసం స్కూల్లో ప్రచారం.. కంటెస్టెంట్పై ఫిర్యాదు8 ఏళ్ల వయసులోనే తల్లి మృతి..షాలిని తన వ్యక్తిగత జీవితం గురించా మాట్లాడుతూ.. ‘8ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు తండ్రి కూడా మృతి చెందారు. చిన్నతనంలోనే ఇలా జరగడంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఈ విషయాన్ని అగ్ని పరీక్షలో పాల్గొన్న చెప్పాలని అనిపించలేదు. ఎందుకంటే ఈవిషయాలన్నీ చెప్పా ప్రేక్షకుల నుంచి సానుభూతి పొందడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు’ అని షాలిని తెలిపారు.కామనర్గా బిగ్బాస్లోకి..సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే షాలిని రీల్స్, ఫొటోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బిగ్బాస్ అగ్నిపరీక్ష 2’లో పాల్గొని తన ఆట తీరుతో మెయిన్ షోకు అర్హత సాధించింది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్బాస్ తెలుగు 10లో కామనర్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో షాలిని గేమ్పై ఆసక్తి పెరుగుతోంది. అగ్నిపరీక్షలో తనపై వచ్చిన అభిప్రాయాలను దాటి.. బిగ్బాస్ 10లో తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదీ చదవండి: ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక.. -
Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!
-
బిగ్బాస్లో హైరిస్క్ టెన్షన్.. వేడెక్కిన వాతావరణం..
బిగ్బాస్ ఇంట్లో మరోసారి హైరిస్క్ టెన్షన్ మొదలైంది. మహాపరీక్షలో భాగంగా రోహిత్, టెంపర్ వంశీ, ముకేశ్, త్రిగుణ్లకు బిగ్బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్లో విజయం సాధించిన ఇద్దరికి హౌస్మేట్గా మారే అవకాశం కల్పించడంతో పాటు.. హైరిస్క్ జోన్లోకి ఒకరిని పంపాల్సి ఉంటుందని చెప్పాడు.విజయం కోసం ఒకరిని హైరిస్క్లోకి పంపే వ్యక్తి పేరును ఇచ్చిన స్లాట్లో సరిగ్గా అమర్చాలని బిగ్బాస్ సూచించాడు. ఈ టాస్క్లో ముకేశ్, త్రిగుణ్ విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ కృష్ణుడిని హైరిస్క్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే కృష్ణుడు పేరును అసంపూర్తిగా అమర్చడంతో.. ఆ పేరును పరిగణనలోకి తీసుకోబోమని బిగ్బాస్ స్పష్టం చేశాడు. ఇదీ చదవండి: విత్తన గణపతిని పూజిద్దాం.. మొక్కలు పెంచేద్దాం..!మరోవైపు రోహిత్, వంశీలు చైత్ర పేరును హైరిస్క్ కోసం సూచించారు. ఇదే సమయంలో షాలినీ డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం హౌస్లో కొత్త వివాదానికి దారితీసింది. చైత్రను హైరిస్క్లోకి నెట్టినందుకే షాలినీ ఇలా సంబరాలు చేసుకుంటోందంటూ బ్లూ టీమ్ సభ్యులు ఆమెతో వాదించారు.దీంతో చైత్ర, షాలినీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా స్పందించడంతో హౌస్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ గొడవ ఎక్కడివరకు వెళ్లిందనేది ఎపిసోడ్లో ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: మండాడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
Bigg Boss 10: ఓటీంగ్ కోసం స్కూల్లో ప్రచారం.. కంటెస్టెంట్పై ఫిర్యాదు
బిగ్బాస్ తెలుగు10 రియాలిటీ షోకు సంబంధించిన ఓటు ప్రచారంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఓ కంటెస్టెంట్కు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారంటూ ప్రధానమంత్రి కార్యాలయం, తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డికి, కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రికి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.18 ఏళ్లు నిండిన వారికే..‘నల్గొండ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మమేకమైనట్లు కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ పాఠశాలలు విద్య కోసమే తప్పా రియాలిటీ షోల ఓటింగ్ ప్రచారం కోసం కాదు. ఇది విద్యా వాతావరణాన్ని భంగపరచడం, పిల్లల భద్రతకు ప్రశ్నార్థకం చేయడమే. భవిష్యత్తులో పాఠశాలల్లో ఇలాంటి ప్రచారాలు జరగకుండా కఠిన ఆదేశాలు జారీ చేయాలి’ అని ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారికే బిగ్ బాస్ రియాలిటీ షో ఓటింగ్ కి అర్హులను చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: వర్షిణికి వాష్రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష? -
Bigg Boss 10 : వర్షిణికి వాష్రూమ్ కడిగే పని.. ఎందుకింత శిక్ష?
బిగ్బాస్ తెలుగు సీజన్ 10లో ఆట రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్ల మధ్య పోటీతో పాటు గ్రూపులుగా చర్చలు, బాధ్యతల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. మూడో రోజు ఎపిసోడ్లో హైరిస్క్ జోన్, కొత్త కెప్టెన్ ఎంపిక, ఇంటి పనుల పంపకం, మానిటరింగ్ విషయంలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం సాగింది. మరోవైపు తనకు లభించిన ప్రత్యేక పవర్ ని షాలిని ఉపయోగించుకుంది. ఇంతకీ మూడో రోజు ఏం జరిగింది?. అసలు వర్షిణి శాశ్వతంగా వాష్రూమ్ కడగాల్సిన అవసరం ఏం వచ్చింది.? నిన్న జరిగిన ఎపిసోడ్ పై ఒక లక్కేద్దాం రండి..!రెండు టీమ్లకు షాక్.. హైరిస్క్లోకి ఇద్దరు బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లో బ్లూ, రెడ్ టీమ్లు ఆశించిన స్థాయిలో రాణించలేదని బిగ్బాస్ ప్రకటించాడు. రెండు టీమ్లు విఫలమైనందుకు చెరో కంటెస్టెంట్ను హైరిస్క్లో పెట్టాలని ఆదేశించాడు. బ్లూ టీమ్ నుంచి రామ్ ప్రసాద్ స్వయంగా ముందుకొచ్చాడు. తనను హైరిస్క్లో పెట్టాలని టీమ్ సభ్యులకు చెప్పాడు. రెడ్ టీమ్లో మాత్రం చరణ్, షాలినీలలో ఒకరిని ఎంపిక చేయాలని చర్చ జరిగింది. చివరకు టీమ్ సభ్యుల నిర్ణయంతో మేరకు చరణ్ హైరిస్క్లోకి వెళ్లాడు.కెప్టెన్సీ బాధ్యతలో మార్పు..హైరిస్క్లోకి వెళ్లిన రాంప్రసాద్, చరణ్లు రెండు టీమ్లకు సంబంధించిన కొన్ని హక్కులను కోల్పోయారు. దీంతో బ్లూ టీమ్ కెప్టెన్ స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది. కొత్త కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేయాలనే చర్చలో ముఖేశ్, త్రిగుణ్ పేర్లు వినిపించినప్పటికీ.. ఇక్కడో మ్యాజిక్ జరిగింది. రాంప్రసాద్ ప్రతిపాదనతో దేబ్జానీకి అవకాశం దక్కింది. టీమ్ సభ్యుల అంగీకారంతో ఆమె బ్లూ టీమ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టింది.పనుల పంపకంలో వివాదం..ఇంటి పనుల విషయంలోనూ కంటెస్టెంట్ల మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. వంట పూర్తయ్యే వరకు పాత్రలు శుభ్రం చేసే వ్యక్తి కిచెన్ దగ్గరే ఉండాలంటూ త్రిగుణ్, వర్ష, సుధీర్.. రోహిత్కు సూచించారు. అయితే తాను ఎప్పుడూ అక్కడే ఉండటం సాధ్యం కాదని, అవసరమైనప్పుడు పిలిస్తే వచ్చి పని చేస్తానని రోహిత్ చెప్పాడు. ఆ తర్వాత బిగ్బాస్ రెండు టీమ్లకు మరో బాధ్యత అప్పగించాడు. ఒక టీమ్ ఇంటి పనులు చేయాలని, మరో టీమ్ వాటిని పర్యవేక్షించాలని చెప్పాడు. దీంతో ఏ టీమ్ ఏ బాధ్యత తీసుకోవాలనే దానిపై చర్చ మొదలైంది.రోహిత్ విషయంలో రచ్చ..బ్లూ టీమ్ తరఫున దేబ్జానీ.. తమ టీమ్ ఇంటి పనులు చేస్తుందని, రెడ్ టీమ్ మానిటరింగ్ బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పింది. అయితే రోహిత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాము కూడా అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరాడు.మాటామాటా పెరగడంతో..రోహిత్ మాటలపై వర్ష, త్రిగుణ్, కృష్ణుడు స్పందించడంతో వాతావరణం వేడెక్కింది. మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సుధీర్తోనూ రోహిత్కు గొడవ జరిగింది. తన పని తాను చేయాల్సి ఉండగా సుధీర్ ఎందుకు చేశాడంటూ రోహిత్ ప్రశ్నించాడు. ఈ సమయంలో త్రిగుణ్ జోక్యం చేసుకోవడంతో ‘నీకు సంబంధం లేని విషయంలో ఎందుకు కలుగజేసుకుంటున్నావు?’ అంటూ రోహిత్ ఘాటుగా స్పందించాడు.ఎవరికి ఏ పని?చివరకు దేబ్జానీ ఇంటి పనులను కంటెస్టెంట్లకు విభజించింది. వంశీకి కుకింగ్ బాధ్యత అప్పగించి, అతనికి సహాయంగా ఝాన్సీని నియమించింది. దేబ్జానీ మానిటర్గా వ్యవహరించనుంది. షాలినికి వాష్రూమ్, అమన్కు లాండ్రీ, సృష్టికి హౌస్ క్లీనింగ్ బాధ్యతలు దక్కాయి. సుధీర్కు మానిటరింగ్ బాధ్యత, రోహిత్కు అంట్లు తోమే పని అప్పగించి.. అతడిని త్రిగుణ్ పర్యవేక్షించాలని నిర్ణయించారు. చైత్రకు హౌస్ క్లీనింగ్ బాధ్యత ఇచ్చారు. వర్షిణికి వాష్రూమ్ బాధ్యత..ఇక ఎపిసోడ్లో షాలిని తనకు లభించిన ప్రత్యేక పవర్ ని ఉపయోగించుకోవడం మరో హైలైట్గా నిలిచింది. తనకు కేటాయించిన వాష్రూమ్ క్లీనింగ్ బాధ్యతను వర్షిణికి అప్పగించింది. దీంతో వర్షిణి బిగ్బాస్ హౌస్లో ఉన్నంతకాలం వాష్రూమ్ బాధ్యత ఆమెనే చేయాలి. వర్షిణి నవ్వుతూ తనకు ఇచ్చిన బాధ్యతను స్వీకరించింది.30 సెకన్ల ఛాలెంజ్..అంట్లు తోముతున్న రోహిత్ను పర్యవేక్షించే బాధ్యత త్రిగుణ్కు దక్కడంతో ఇద్దరి మధ్య మరోసారి వివాదం మొదలైంది. త్రిగుణ్ పిలవగానే ‘30 సెకన్లలో వస్తా’ అన్న రోహిత్.. ఆలస్యం చేసాడు. నిజానికి ఇక్కడ రోహిత్ కావాలనే అలా చేశాడు .త్రిగుణ్ ఈ విషయాన్ని బిగ్బాస్ దృష్టికి తీసుకెళ్లాడు.అంతటితో ఆగకుండా రోహిత్ పని చేస్తున్న విధానంపై త్రిగుణ్ సూచనలు చేయడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగింది. ‘ఇలా చేయాలి.. అలా చేయాలి’ అంటూ తనను మానిటర్ చేయడంపై రోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘నేను ఇంట్లోని వాళ్లను కాదు.. నిన్నే మానిటర్ చేస్తున్నా’ అంటూ త్రిగుణ్ కౌంటర్ ఇచ్చాడు. ఇలా మూడో రోజుకే బిగ్బాస్ హౌస్లో ఆధిపత్య పోరు, పనుల విషయంలో విభేదాలు బయటపడటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత వేడెక్కేలా కనిపిస్తోంది. -
బిగ్బాస్లో ఛాన్స్మిస్.. రాజకుమారి పరిస్థితి ఇదా..?
బిగ్బాస్ సీజన్ 10 తెలుగులో బిగ్బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ రాజకుమారి దయాన. కామన్ మ్యాన్ కేటగిరీలో పోటీ చేసిన ఆమె.. తనదైన ఆటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో వెనకడుగు వేయకుండా పోరాడిన తీరు.. జడ్జీలతో పాటు ఆడియన్స్ను కూడా మెప్పించింది. దీంతో బిగ్బాస్ మెయిన్ హౌస్లో ఆమెకు చోటు ఖాయమని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా ఆ అవకాశం దక్కలేదు. ( ఇదీ చదవండి: ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్)పిల్లలతో ఉన్న ఓ వీడియో..ఇదిలా ఉంటే.. బిగ్బాస్ అవకాశం కోసం తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను బయటపెట్టారంటూ కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ‘సింపతీ స్టార్’ అంటూ విమర్శలు చేయడంపై రాజకుమారి దయాన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలతో ఉన్న ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. తాను ఎదుర్కొంటున్న బాధను చెప్పుకొచ్చారు.‘సింపతీ స్టార్’ అంటూ రాబందుల కన్నా దారుణంగా..‘హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసరికి నా పిల్లల పరిస్థితి చూసి చాలా బాధేసింది. ‘సింపతీ స్టార్’ అంటూ రాబందుల కన్నా దారుణంగా నన్ను పొడుచుకు తిన్నారు. నేను ఏం తప్పు చేశాను? నాకే అర్థం కావట్లేదు అండి. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కానీ నా గురించి మాట్లాడిన మాటలు, నాపై వేసిన నిందలు అన్నీ వింటుంటే… ఒక మనిషిగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. బయటికి ధైర్యంగా కనిపించినంత మాత్రాన మనసులో బాధ ఉండదని కాదు కదా. నేను కూడా ఒక మనిషినే అండి. నాకూ బాధ ఉంటుంది… నాకూ కన్నీళ్లు వస్తాయి. ఒక్కసారి నా పరిస్థితిని కూడా ఆలోచించండి’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by rajakumari_dayana 46 (@rajakumari_dayana) -
బిగ్బాస్లో రాంప్రసాద్, చరణ్లకు షాక్! ఎలిమినేట్ అవుతారా?
ఈరోజు బిగ్బాస్10 హౌస్లో హైరిస్క్ జోన్ టాస్క్ ఉత్కంఠ రేపనుంది. రెండు టీమ్ల నుంచి ఒక్కొక్కరిని హైరిస్క్లో పెట్టాలని బిగ్బాస్ ఆదేశించాడు. హైరిస్క్లో ఉన్నవారు ఈ వారంలో ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.ఎలాంటి వాదనలు, ఆర్గ్యుమెంట్స్ లేకుండానే బ్లూ టీమ్ నుంచి రాంప్రసాద్ హైరిస్క్ జోన్లోకి వెళ్లేందుకు అంగీకరించాడు. అందుకు కారణం ఏంటని అడగగా.. శనివారం చెప్తా అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో తమ టీమ్ తరఫున రాంప్రసాద్ను హైరిస్క్లో పెడుతున్నట్లు నరేశ్ బిగ్బాస్కు తెలిపాడు.ఎమోషనల్ వాతావరణం..ఇక రెడ్ టీమ్ నుంచి చరణ్ను యూనానిమస్గా ఎంపిక చేసినట్లు రోహిత్ ప్రకటించాడు. అయితే అంతకుముందే త్రిగుణ్.. రోహిత్ హైరిస్క్లోకి వెళ్లడని టీమ్ సభ్యులతో చెప్పడం ఆసక్తికరంగా మారింది. చివరకు రోహిత్ కాకుండా చరణ్ హైరిస్క్ జోన్లోకి వెళ్లాడు.ఇదీ చదవండి: సందీప్రెడ్డికి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్మరోవైపు.. ‘హైరిస్క్లో ఉంటాను.. అక్కడి నుంచి ఎలాగైనా బయటికి వస్తా అంటూ రాంప్రసాద్ బిగ్బాస్ ముందు ఎమోషనల్ అయ్యాడు. చరణ్తో రోహిత్ మాట్లాడుతూ.. ‘ఒక్కరు నీకు సపోర్ట్ చేసినా.. నీ కోసం నేను పోరాడేవాడిని’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో హౌస్లో ఒక్కసారిగా ఎమోషనల్ వాతావరణం నెలకొంది. మరి ఈరోజు జరగబోతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కువమంది చదివింది: ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి మరీ వెక్కిరించాడు: ఐశ్వర్య లక్ష్మి -
Bigg Boss 10: రోహిత్ కళ్లు నెత్తికెక్కాయి...అతన్ని కిందకు దింపాలి.. వర్షిణి ఫైర్
బిగ్బాస్ 10 రెండో రోజు ఆట రసవత్తరంగా సాగింది. ‘మహాపరీక్ష’లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కూల్గా, కామ్గా ఉంటాడనుకున్న కృష్ణుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. మరోవైపు రోహిత్పై యాంకర్ వర్షిణి చేసిన సంచలన వ్యాఖ్యలు హౌస్లో హీట్ పెంచాయి. ఇక సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే బ్యాగ్ టాస్క్ నుంచి నామినేషన్స్, ప్రొటెక్టివ్ బాస్ టాస్క్ వరకు మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.సైన్యం కోసం బ్యాగ్ టాస్క్హౌస్మేట్స్ అంతా కలిసి తమ లీడర్లుగా రామ్ప్రసాద్, రోహిత్లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 12 మంది ఇంటిసభ్యులకు నాయకులకు సైన్యంగా నిలబడేందుకు బిగ్బాస్ ఓ బ్యాగ్ టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో కొన్ని బ్యాగ్లను ఉంచి.. వాటిలో ఉన్న బ్యాడ్జ్ల ఆధారంగా సైనికులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. బ్యాగ్ అందుకున్న సైనికుడు దాన్ని తన నాయకుడికి ఇవ్వాలి. ఆ బ్యాగ్లో ఉన్న బ్యాడ్జ్ల ఆధారంగా నాయకులు తమ టీమ్లోకి సభ్యులను తీసుకోవాల్సి ఉంటుంది.మొదట ముఖేష్ గౌడ బ్యాగ్ తీసుకుని రామ్ప్రసాద్కు ఇవ్వగా.. అందులోని తొలి బ్లూ బ్యాడ్జ్ను త్రిగుణ్కు ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ అమన్కు రెడ్ బ్యాడ్జ్ ఇచ్చాడు. అనంతరం టెంపర్ వంశీకి మరో రెడ్ బ్యాడ్జ్ ఇచ్చి తన టీమ్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాత శాలినిని కూడా తన జట్టులోకి తీసుకున్నాడు. అలా రామ్ ప్రసాద్.. త్రిగుణ్, ముఖేష్, సుధీర్, నరేష్, దేబ్జాని, చరణ్, వర్షిణి, చైత్రతో.. రోహిత్.. వంశీ, శాలిని, వంశీ, సృష్టి, ఝాన్సీ, కృష్ణుడుతో టీమ్స్ని ఫామ్ చేసుకున్నారు. అయితే వర్షిణిని రాంప్రసాద్ ముందుగా తన టీమ్లోకి తీసుకోలేదు. రోహిత్ తనకున్న ఆప్షన్తో ఆమెను రాంప్రసాద్ టీమ్లోకి పంపాడు. దీంతో వర్షిణి..రాంప్రసాద్ పై అలక పూనింది. ‘నన్ను ఎందుకు పిక్ చేసుకోలేదు? నాకెందుకు బ్యాడ్జ్ ఇవ్వలేదు?’ అని అతన్ని నిలదీసింది.దీనికి రామ్ప్రసాద్ స్పందిస్తూ.. ‘రోహిత్ నిన్ను ఖచ్చితంగా తీసుకోడు అనే నమ్మకం ఉంది. అందుకే నిన్ను చివరి వరకు తీసుకోలేదు’ అని చెప్పాడు.గ్రూప్ గేమ్పై వర్షిణి, చరణ్ మధ్య డిస్కషన్ఇక వర్షిణి, ఆర్జే చరణ్ మధ్య గ్రూప్ గేమ్ అంశంపై చర్చ జరిగింది. ‘గ్రూప్’ అని అనడం తనకు నచ్చలేదని చరణ్ చెప్పగా.. ‘గ్రూప్గా ఆడుతున్నప్పుడు గ్రూప్ గేమ్ అనకపోతే ఏమంటాం?’ అంటూ వర్షిణి రివర్స్ కౌంటర్ ఇచ్చింది.అంతేకాదు.. ‘మీరంతా కలిసే ఉంటున్నారు. కానీ మీతో ఝాన్సీ ఎందుకు కలవడం లేదు?’ అని చరణ్ను ప్రశ్నించింది. దీనికి చరణ్ తనకు అలా అనిపించడం లేదని చెప్పగా.. ‘నాకు కనిపిస్తుంది’ అంటూ వర్షిణి తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.రోహిత్ తోపులా ఫీలవుతున్నాడుఅనంతరం బిగ్బాస్ బ్లూ టీమ్ సభ్యులకు ఓ కీలక టాస్క్ ఇచ్చాడు. ఇంటిసభ్యులుగా ఉండేందుకు అనర్హులు అనిపించే ఒక్కొక్కరి పేరును చెప్పాలని సూచించాడు.ఈ సందర్భంగా వర్షిణి అనూహ్యంగా రోహిత్ పేరును చెప్పింది. అంతేకాదు.. అతని గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అగ్నిపరీక్షలో రోహిత్ను చూసినప్పుడు అతనితో మంచి వైబ్ ఉంటుందని అనుకున్నానని చెప్పింది. కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత అతని యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయిందని విమర్శించింది. రోహిత్ తనను తాను పెద్ద తోపులా ఫీల్ అవుతున్నాడని.. ‘నా అంతటోడు లేడు, నేనే పెద్ద దేవుడ్ని’ అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడని వ్యాఖ్యానించింది. అతను గేమ్లో ఓడిపోయినప్పటికీ.. తన తప్పును అంగీకరించకుండా ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేశాడని ఆరోపించింది. అంతేకాదు.. త్రిగుణ్ ‘గ్రూప్’ అని అనగానే రోహిత్ ట్రిగ్గర్ అయ్యాడని వర్షిణి చెప్పింది. ‘దొంగను దొంగ అంటే ఎంత కోపం వస్తుందో.. సార్గారిని గ్రూప్ అనగానే అంత కోపం వచ్చింది. అగ్నిపరీక్ష నుంచి బిగ్బాస్ హౌస్లోకి వచ్చేలోపే రోహిత్ కళ్లు నెత్తికెక్కాయి. అది రియాలిటీ కాదు. అతనికి రియాలిటీ ఏంటో తెలియాలి. అతన్ని కిందకు దింపాలి’ అంటూ కాస్త సీరియస్గానే మాట్లాడింది.రోహిత్పై కృష్ణుడు ఫైర్..ఆ తర్వాత నామినేషన్ బాధ్యత రెడ్ టీమ్కు వచ్చింది. బ్లూ టీమ్ సభ్యుల్లో హౌస్మేట్స్గా మారేందుకు ఎవరు అనర్హులో చెప్పే బాధ్యతను బిగ్బాస్ రోహిత్కు అప్పగించాడు.రోహిత్ వరుసగా కృష్ణుడు, రామ్ప్రసాద్, వర్షిణి, త్రిగుణ్, దేబ్జానిలను అనర్హులుగా ప్రకటించాడు. దీంతో కృష్ణుడు రోహిత్పై ఫైర్ అయ్యాడు. ‘కీ తనకు ఇచ్చారని కుళ్లుబోతుతనం.. సుపీరియారిటీ కాంప్లెక్స్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే రోహిత్ మాత్రం నవ్వుతూ నిలబడిపోయాడు. రామ్ప్రసాద్, వర్షిణి సైతం రోహిత్పై మండిపడ్డారు.‘ప్రొటెక్టివ్ బాస్’ టాస్క్లో ఫౌల్ గేమ్ఆ తర్వాత నామినేట్ అయిన పది మంది సభ్యులకు బిగ్బాస్ ‘ప్రొటెక్టివ్ బాస్’ టాస్క్ ఇచ్చాడు. ఇందులో డిఫెండర్లను కిల్ చేస్తూ బాస్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో బ్లూ టీమ్ అటాకర్స్గా, రెడ్ టీమ్ డిఫెండర్స్గా టాస్క్ ప్రారంభమైంది. ఈ క్రమంలో త్రిగుణ్ ఫౌల్ గేమ్ ఆడాడని రోహిత్ ఆరోపించాడు. మొత్తంగా చూస్తే బిగ్బాస్ 10 రెండో రోజు ఎపిసోడ్లో మాటల యుద్ధం మాత్రం బాగానే కనిపించింది. ముఖ్యంగా రోహిత్పై వర్షిణి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. కృష్ణుడు కూడా ఊహించని విధంగా ఫైర్ అవుతూ కనిపించాడు.అయితే టాస్క్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎపిసోడ్లో పెద్దగా పస లేదనిపించింది. -
‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్
బిగ్బాస్ హౌస్లో నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. అయితే ఈసారి బిగ్బాస్10లో నామినేషన్స్ ప్రక్రియకు ముందే ఓ కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇకపై తనను నామినేట్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడుఊహించలేరు..‘రేపటి నుంచి నేను ఎవరినైనా నామినేట్ చేయాలంటే మీరు ఊహించలేరు. ఇది ఒక రీజనా అని అడిగితే.. అఫ్కోర్స్ అని చెబుతా. మీరు చాలా తెలివైన వాళ్లని అనుకుంటున్నా. కాబట్టి జాగ్రత్తగా ఆడండి. నాతో మాత్రం పెట్టుకోవద్దు. నామినేషన్ చేసే ముందు చాలా సార్లు ఆలోచించండి’ అంటూ హెచ్చరించాడు.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్ఒకసారి మాట్లాడుకోండి..అంతేకాదు.. రెడ్ గ్రూప్లో ఉన్న ఎనిమిది మంది సభ్యులు పక్కకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించాడు. తమలో కనీసం ముగ్గురైనా తన మాట కరెక్ట్ కాదని చెబుతారని వ్యాఖ్యానించాడు. దీంతో అసలు అతడు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నాడు? ఎవరిని నామినేట్ చేయబోతున్నాడు? అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే టాస్కులు, టీమ్ల మధ్య గొడవలతో వేడెక్కిన బిగ్బాస్ హౌస్లో ఈ వార్నింగ్ మరింత మంట రాజేసేలా కనిపిస్తోంది. నామినేషన్స్లో తనను టార్గెట్ చేస్తే తాను కూడా ఊహించని విధంగా స్పందిస్తానని చెప్పడంతో.. రాబోయే ఎపిసోడ్పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. A sweet warning from Auto. Top5 contestant?#BiggBossTelugu10 pic.twitter.com/tML4F3H640— AnantapurBO (@AnantapurBO) September 8, 2026 -
వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్బాస్ హౌస్
బిగ్బాస్ సీజన్ 10లో హౌస్మేట్గా మారేందుకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనే విషయంలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద రచ్చ మొదలైంది. రెడ్, బ్లూ టీమ్ సభ్యుల ఫొటోలను పెట్టి.. హౌస్మేట్గా మారేందుకు అర్హత లేని ఐదుగురి ఫొటోలపై కారణాలు చెబుతూ స్టార్ చేయాలని బిగ్బాస్ ఆదేశించాడు. దీంతో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.రాంప్రసాద్, వర్షిణి ఎం చెప్పారంటే..బ్లూ టీమ్ నుంచి వర్షిణి, రాంప్రసాద్ కలిసి రోహిత్, చరణ్ ఫొటోలపై స్టార్ చేశారు. అగ్నిపరీక్షలో రోహిత్ను పదేపదే లేపి పైకి కూర్చోబెట్టారని.. అంతేతప్ప అతనికి అంత సీన్ లేదని వర్షిణి చెప్పింది. అగ్నిపరీక్షలో రోహిత్ 100 శాతం ఇచ్చాడని అనుకుంటే.. హౌస్లో మాత్రం 10 శాతం కూడా చరణ్ లేడని రాంప్రసాద్ వ్యాఖ్యానించాడు.మరోవైపు దేబ్జానీ.. షాలినీ ఫొటోపై స్టార్ చేసింది. షాలినీకే అంతా తెలుసన్నట్లు వ్యవహరించడం తనకు నచ్చలేదని చెప్పింది. అలాగే సృష్టి, అమన్ కూడా హౌస్మేట్గా ఉండేందుకు అర్హులు కాదంటూ బ్లూ టీమ్ సభ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.రెడ్ టీమ్వాళ్ల వాదనలు ఇవీ..ఇదే టాస్క్ను రెడ్ టీమ్కు కూడా బిగ్బాస్ ఇచ్చాడు. అయితే ఈసారి కూడా అందరి ముందే కారణాలు చెప్పాలని ఆదేశించాడు. దీంతో రోహిత్ రంగంలోకి దిగాడు. రాంప్రసాద్, వర్షిణి, వినాయకుడు (కృష్ణుడు), దేబ్జానీ, త్రిగుణ్ ఫొటోలపై స్టార్ చేశాడు. వీళ్లు కూడా హౌస్మేట్గా పనికిరారని చెబుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లు టాస్క్లో రూల్స్ అన్నీ బ్రేక్ చేశారని, ఎదుటివాళ్లు చెప్పేది వినే ఓపిక కూడా లేదని రోహిత్ ఆరోపించాడు. ఊరికే ఓవర్ డామినేషన్ చేస్తారని, పనికిరాని వాదనలు చేస్తారని విమర్శించాడు. రోహిత్ మాటలకు వర్షిణి వెకిలిగా నవ్వడంతో వాతావరణం మరింత వేడెక్కింది.రోహిత్కి గట్టి కౌంటర్..అక్కడితో ఆగని వినాయకుడు (కృష్ణుడు).. రోహిత్కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. తాను 100 శాతం ఇవ్వలేదని ఎలా అంటావంటూ ప్రశ్నించాడు. ‘యూ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ ఏ లీడర్.. నువ్వు ఎలా ఉండాలో మాకు చెబుతున్నావు. నువ్వు రాజు.. మేము నీ సైనికులమా?’ అంటూ రోహిత్పై తీవ్రంగా మండిపడ్డాడు.ఇప్పటికే టాస్క్ విషయంలో రెండు టీమ్ల మధ్య పోటీ తారస్థాయికి చేరగా.. రోహిత్, వినాయకుడి మధ్య మాటల యుద్ధం మరింత ఆసక్తిని పెంచింది. ప్రోమో చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్లో బిగ్బాస్ హౌస్లో పెద్ద వార్ జరగబోతున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుంది? ఎవరు వెనక్కి తగ్గుతారు? హౌస్మేట్గా మారే అవకాశం ఎవరికి దక్కుతుంది? తెలియాలంటే ఈరోజు రాత్రి 9.30 గంటల వరకు వేచి చూడాల్సిందే! -
Bigg boss 10 : బిగ్బాస్ ఇంట్లో తొలిరోజే రచ్చ.. ‘నాయకుడి’ కోసం పెద్ద గొడవ!
బిగ్బాస్ అంటేనే ఆటలు, టాస్కులు, గొడవలు, అరుపులు.. షో మొదలైన తొలి రోజే ఇవన్నీ కనిపించాయి. ఒకవైపు ‘మ్యాజికల్ కీస్’ కోసం పోటీ.. మరోవైపు హౌస్మేట్స్ హోదా కోసం ‘మహా పరీక్ష’. ఇక టీమ్ లీడర్ల ఎంపిక దగ్గరికి వచ్చేసరికి సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా హౌస్ రెండుగా విడిపోయిన పరిస్థితి కనిపించింది. మాటల యుద్ధంతో హౌస్లో వేడి వాతావరణం నెలకొంది. ఇంతకీ తొలిరోజు ఏం జరిగింది? ఎవరి చేతికి ఎలాంటి పవర్స్ వచ్చాయి? ఎవరు ఏ టీమ్కు నాయకులుగా నిలిచారు? తొలిరోజు హైలెట్స్పై ఓ లుక్కేయండి..మరో ఇద్దరి చేతికి మ్యాజికల్ కీస్!బిగ్బాస్ ఇంట్లో మొత్తం 16 మంది ఉండగా.. ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు మ్యాజికల్ కీస్ను సొంతం చేసుకున్నారు. మరో ఇద్దరికి కీస్ రావాల్సి ఉండటంతో.. ఈ వారమంతా ‘మహా పరీక్ష’ ఉంటుందని బిగ్బాస్ ప్రకటించాడు. వచ్చే వారంలో చాలామంది ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని, ఇంకా ఎవరూ పూర్తి స్థాయి హౌస్మేట్స్ కాలేదని స్పష్టం చేశాడు. మ్యాజికల్ కీస్ సాధించిన ఎనిమిది మంది కలిసి మరో ఇద్దరిని ఎంపిక చేయాలని బిగ్బాస్ సూచించాడు. దీంతో త్రిగుణ్ వంశీ, కృష్ణుడు పేర్లను ప్రతిపాదించాడు. మరోవైపు షాలినీ రోహిత్ పేరును సూచించింది. కొద్దిసేపు చర్చ జరిగిన అనంతరం అందరూ కలిసి వంశీ, కృష్ణుడు పేర్లకు ఓటు వేశారు. దీంతో వారిద్దరూ కూడా మ్యాజికల్ కీస్ను దక్కించుకున్నారు.రోహిత్ టాస్క్ చేయలేదంటూ త్రిగుణ్ ఫైర్బిగ్బాస్ ఇచ్చిన వాటర్ కొట్టే టాస్క్ను రోహిత్ చేయలేదంటూ పలువురు కంటెస్టెంట్లు ప్రస్తావించారు. ఇదే విషయాన్ని త్రిగుణ్ కూడా పదేపదే ప్రస్తావిస్తూ తన వాదనను వినిపించాడు. అయితే తమ నిర్ణయం అందరికీ నచ్చకపోవడంపై దేబ్జానీ అసంతృప్తి వ్యక్తం చేసింది.‘మీ నిర్ణయం నాకు ఫెయిర్గా అనిపించలేదు’ అంటూ రాం ప్రసాద్తో దేబ్జానీ చెప్పింది. అయితే సెలెబ్రిటీ కేటగిరీలో ఉన్న ఇద్దరికే అవకాశం రావడం తనకు సంతోషంగా ఉందంటూ సరదాగా నవ్వేసింది.వర్షిణితో అమన్ ఫ్లర్టింగ్..ఇక హౌస్లో కొన్ని సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. కిచెన్లో ఝాన్సీ, వర్షిణి టీ తయారు చేస్తుండగా.. అక్కడికి వచ్చిన అమన్ వర్షిణితో సరదాగా ఫ్లర్ట్ చేశాడు. వర్షిణి టీ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ ఆమెను పొగిడాడు. మరోవైపు బెడ్రూంలో రాం ప్రసాద్, నరేష్, దేబ్జానీ సరదాగా మాట్లాడుకున్నారు. రాం ప్రసాద్ను ‘రామన్న’ అంటూ పిలిచిన దేబ్జానీ.. ఇంట్లో జెన్యూన్ పర్సన్ నువ్వే అంటూ ప్రశంసించింది.త్రిగుణ్, షాలినీ మధ్య కిచెన్లో గొడవకిచెన్లో చపాతీలు చేస్తున్న త్రిగుణ్ వద్దకు వచ్చిన షాలినీ కర్రీ గురించి అడిగింది. అయితే ‘అది నా కేటగిరీ కాదు’ అని త్రిగుణ్ సమాధానం ఇచ్చాడు. ఆ మాటను షాలినీ తప్పుగా తీసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సాధారణంగా కూడా చెప్పొచ్చు కదా అంటూ షాలినీ ప్రశ్నించడంతో మాటామాటా పెరిగింది.నామినేషన్స్పై నరేష్, రాం ప్రసాద్ కామెడీమరోవైపు నామినేషన్స్ గురించి నరేష్, రాం ప్రసాద్ సరదాగా మాట్లాడుకున్నారు. గార్డెన్లో తిరుగుతూ ‘వాళ్లని చేద్దాం.. వీళ్లని చేద్దాం.. వద్దులే పాపం.. వాళ్లకి ఫ్యామిలీ ఉంది.. వీళ్లకి ఈ కష్టాలున్నాయి’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేసుకున్నారు. చివరికి మనిద్దరమే మిగిలాం.. ఒకరినొకరం నామినేట్ చేసుకుందాం అంటూ ఇద్దరూ నవ్వులు పూయించారు.ఒక్కొక్కరి చేతికి ఒక్కో పవర్మ్యాజికల్ కీస్ సొంతం చేసుకున్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ బిగ్బాస్ పిలిచి.. వారి కీ ద్వారా లభించే పవర్ ఏంటో వివరించాడు. అయితే తమకు వచ్చిన పవర్ గురించి ఇతర కంటెస్టెంట్లతో చర్చించవద్దని వార్నింగ్ ఇచ్చాడు.ముందుగా త్రిగుణ్కు ‘టేక్ ఓవర్’ పవర్ వచ్చింది. అంటే తనకు నచ్చిన మరో కంటెస్టెంట్ పవర్ను తీసుకునే అవకాశం అతడికి లభించింది. ఝాన్సీకి ఓ పవర్ ఇచ్చి వీకెండ్ ప్రారంభం కావడానికి ముందు వీక్లో ఎప్పుడైన దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పాడు. ఎలిమినేషన్ భయం ఉంటే ఈ పవర్ని యూజ్ చేసుకొని సేవ్ కావచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ముఖేష్ గౌడ: ఇతరుల పవర్ను రివర్స్ చేసే అవకాశంవర్షిణి: ‘గ్రాబ్ ఎనీ విన్’ పవర్కృష్ణుడు: ‘స్వాప్’ పవర్షాలినీ: ఇంట్లోని ఒక డ్యూటీని అసైన్ చేసే పవర్శ్రిష్టి: ఒకరిని నేరుగా నామినేట్ చేసే పవర్రాం ప్రసాద్: ‘సేఫ్ షీల్డ్’.. నామినేషన్ నుంచి ఒకరిని కాపాడే అవకాశంనరేష్: నామినేషన్స్లో డబుల్ ఓట్స్ వేసే పవర్.. ఇలా మ్యూజికల్ కీస్ గెలుచుకున్న ఒక్కొక్కరికి ఒక్కో పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్కిచెన్, క్లీనింగ్ డ్యూటీల దగ్గర మళ్లీ గొడవఆ తర్వాత హౌస్లో కిచెన్, క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ వంటి పనులను విభజించే ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలోనూ త్రిగుణ్తో గొడవ జరిగింది.సుధీర్ డిష్ వాషింగ్ బాగా చేశాడని చెప్పడంతో.. ‘మేం చేయలేమా?’ అంటూ ముఖేష్, రోహిత్, సుధీర్, షాలినీ తదితరులు వాదనకు దిగారు. డ్యూటీలను ఎవరు ఎలా చేయాలనేది తామే నిర్ణయించుకుంటామని వారు స్పష్టం చేశారు.దేబ్జానీ బ్యాటరీని సరిగ్గా ధరించకపోవడంతో బిగ్బాస్ ఆమెను హెచ్చరించాడు. అయితే ‘ఎందుకు బిగ్బాస్.. క్యూట్గా చెప్పొచ్చు కదా’ అంటూ దేబ్జానీ సరదాగా స్పందించింది. చివరకు బిగ్బాస్కు సారీ చెప్పింది. దీనికి బిగ్బాస్ కూడా ఆసక్తికరంగా స్పందిస్తూ.. తాను స్కూల్ ప్రిన్సిపల్నో.. సాంటానో మున్ముందు తెలుస్తుందని చెప్పాడు.హౌస్మేట్ హోదా కోసం ‘మహా పరీక్ష’ఇక అసలు ఆట ఇక్కడే మొదలైంది. ‘హౌస్మేట్స్ హోదాను పొందడమే మీ లక్ష్యం. నామినేషన్లో లేకపోయినా అందరికీ ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. మహా పరీక్షలో గెలిచి హౌస్మేట్ హోదాను పొందాలి. ఎలిమినేషన్ మాత్రం కన్ఫామ్’ అంటూ బిగ్బాస్ కీలక ప్రకటన చేశాడు.అంతేకాకుండా 16 మంది రెండు టీమ్లుగా విడిపోయి.. హై రిస్క్ నుంచి నో రిస్క్ వైపు తీసుకెళ్లగల సత్తా ఉన్న ఇద్దరు నాయకులను ఎంచుకోవాలని సూచించాడు.లీడర్గా రోహిత్.. రాంప్రసాద్టీమ్ లీడర్ల ఎంపికలో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్లలో దాదాపు అందరూ రోహిత్కు మద్దతు తెలిపారు. ఒక్క ఝాన్సీ మాత్రమే మినహాయింపు. మరోవైపు సెలెబ్రిటీ కంటెస్టెంట్లు రాం ప్రసాద్, త్రిగుణ్ పేర్లకు ఓటు వేశారు.అయితే త్రిగుణ్ మాత్రం రాం ప్రసాద్ను లీడర్గా ఉంచాలని సూచించాడు. అగ్నిపరీక్ష టీమ్ మొత్తం కలిసి రోహిత్కు ఓటు వేసిందని, వాళ్లంతా ఒక గ్రూప్గా ఉన్నారని త్రిగుణ్ వ్యాఖ్యానించాడు. తాను మాత్రం ఝాన్సీకి ఓటు వేసినట్లు చెప్పాడు.త్రిగుణ్పై షాలినీ, శ్రిష్టి ఫైర్త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలతో షాలినీ, శ్రిష్టి, రోహిత్, చరణ్, అమన్ తదితరులు అతడిపై మాటల దాడికి దిగారు.‘మేం రోహిత్ ఆట చూశాం.. అందుకే అతడిని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు కూడా సెలెబ్రిటీలకే ఓట్లు వేసుకున్నారు కదా.. మరి మేం అలా అన్నామా?’ అంటూ షాలినీ, శ్రిష్టి ప్రశ్నించారు.దీంతో హౌస్లో మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బిగ్బాస్ ఇంట్లో రెండు టీమ్లు ఏర్పడ్డాయి. బ్లూ టీమ్కు రాం ప్రసాద్, రెడ్ టీమ్కు రోహిత్ నాయకులుగా నిలిచారు. లీడర్ల ఎంపికతో తొలి రోజు ఎపిసోడ్ ముగిసింది.మొత్తానికి బిగ్బాస్ సీజన్ తొలి రోజే ఆటకు కావాల్సిన మసాలా మొత్తం కనిపించింది. మ్యాజికల్ కీస్, కొత్త పవర్స్, నామినేషన్స్ చర్చలు, వ్యక్తిగత గొడవలు, సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా మారిన గ్రూప్ వార్.. ఇలా తొలిరోజే హౌస్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ‘మహా పరీక్ష’లో ఎవరు నెగ్గుతారు? ఎవరు హౌస్మేట్స్గా కొనసాగుతారు? ఎవరి ప్రయాణం మధ్యలోనే ముగుస్తుందో చూడాలి. -
బిగ్బాస్లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..?
బిగ్బాస్ సీజన్ 10లో అసలు ఆట మొదలైనట్టే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే హౌస్లో తొలినాళ్లలోనే విభేదాలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానున్న ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం ఆసక్తిని పెంచుతోంది.బిగ్బాస్ సూచనల మేరకు..తొలి టాస్క్లో భాగంగా ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు కీలను సొంతం చేసుకున్నారు. మిగిలిన వారిలో మరో ఇద్దరికి ఆ రెండు కీలను ఎవరు ఇవ్వాలనేది నిర్ణయించుకోవాలని బిగ్బాస్ సూచించినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. దీంతో ఎవరికి ఆ అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది.మరోవైపు కీల విషయంలో కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముకేశ్.. రాంప్రసాద్, త్రిగుణ్తో వాదిస్తున్నట్లు ప్రోమోలో కనిపించింది. ‘నాకు అన్నీ తెలిసినట్లు ముందే వెళ్లిపోవడానికి తొందరపడ్డారు’ అంటూ ముఖేశ్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్బాస్లో ప్రత్యర్థులవుతారా..?మీతో ఆడితే గెలవచ్చు..ఇక త్రిగుణ్ మరో టీమ్తో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ప్రోమోలో కనిపించాయి. ‘మీతో ఆడితే గెలవచ్చు’ అంటూ టెంపర్ వంశీని త్రిగుణ్ దూరం పెట్టినట్లుగా చూపించారు. దీంతో హౌస్లో గ్రూపులు ఏర్పడుతున్నాయా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ఆ రెండు కీలను ఎవరికి ఇస్తారు? కీలక నిర్ణయం ఎవరికి అనుకూలంగా మారుతుంది? తెలియాలంటే ఈరోజు జగరబోయే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.ఇదీ చదవండి: టాలీవుడ్ 'చిన్న' హీరో.. బిగ్బాస్ 10లోకి వచ్చేశాడు View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్బాస్లో ప్రత్యర్థులవుతారా..?
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 10వ సీజన్ నిన్న (ఆదివారం) గ్రాండ్గా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్గా సందడి చేశాడు. ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది, కామనర్స్ నుంచి 6 మంది హౌస్లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రేక్షకుల కళ్లన్నీ ఆ ఇద్దరి కంటెస్టెట్లపైనే పడింది. వాళ్లే రాంప్రసాద్, నరేశ్లు. బుల్లితెరపై తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన నరేశ్, రాంప్రసాద్ మంచి స్నేహితులు. ఇప్పుడు వీరిద్దరూ బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. బయట మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ.. హౌస్లో మాత్రం ఎలా ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.బిగ్బాస్ విషయానికి వస్తే..బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత సంబంధాల కంటే ఆటకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. టాస్కులు, నామినేషన్లు, కెప్టెన్సీ పోటీలు వంటి అంశాలు హౌస్మేట్స్ మధ్య విభేదాలకు కారణమవుతుంటాయి. ఈ నేపథ్యంలో నరేశ్, రాంప్రసాద్ మధ్య స్నేహం ఆటను ఎంతవరకు ప్రభావితం చేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలిసి ఉంటే హౌస్లో మంచి కామెడీ పండే అవకాశం ఉంది. ఒకరి బలహీనతలు, మరొకరి ప్లస్ పాయింట్లు ఇద్దరికీ బాగా తెలుసు కాబట్టి.. వారి మధ్య సంభాషణలు, సరదా పంచ్లు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారొచ్చు.ఇదీ చదవండి: బిగ్బాస్ 10: హాట్ టాపిక్గా నాగార్జున రెమ్యునరేషన్భేదాభిప్రాయాలు రావడం..అయితే బిగ్బాస్ అంటేనే అనూహ్య పరిణామాలకు కేరాఫ్. ఒక టాస్క్లో పోటీ పడటం, నామినేషన్ సమయంలో ఒకరిపై మరొకరు అభిప్రాయం చెప్పాల్సి రావడం, ఇంట్లో నిర్ణయాల విషయంలో భేదాభిప్రాయాలు రావడం.. ఇలా ఏదైనా వారి మధ్య చిన్నపాటి మనస్పర్థకు దారితీయొచ్చు.ఇదీ చదవండి: శారీరక లోపం వరమైతే.. బిగ్బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్ఒకవేళ గొడవ జరిగితే?ఇదే ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. బయట మంచి స్నేహితులైన వీరిద్దరూ హౌస్లో గొడవ పడితే.. ఆ తర్వాత వెంటనే కలిసిపోతారా? లేక ఆట కోసం తమ స్నేహాన్ని పక్కన పెడతారా? అన్నది చూడాలి. ముఖ్యంగా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉండటంతో.. వాదన జరిగితే అది మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే వీరిద్దరి స్నేహమే హౌస్లో బలంగా మారుతుందా? లేక బిగ్బాస్ ఆట వారి స్నేహానికి పరీక్షగా నిలుస్తుందా? అనేది బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్బాస్'లోకి ఆటో రాంప్రసాద్.. అవినాష్, ఇమ్ములా మెప్పిస్తాడా? -
‘గుప్పెడంత మనసు' రిషి సర్.. బిగ్బాస్ 10లోకి ఆగయా
ప్రతిసారి సీరియల్ బ్యాచ్ నుంచి కచ్చితంగా బిగ్బాస్ హౌస్లోకి పలువురు నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈసారి అలా 'గుప్పెడంత మనసు' రిషి సర్( ముకేశ్ గౌడ) వచ్చేశాడు. చివరి కంటెస్టెంట్గా లోపల అడుగుపెట్టేశాడు.రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన 'గుప్పెడంత మనసు' సీరియల్.. ఎంతలా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనే రిషిగా చేసిన ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే సీరియల్ పేరుతోనే బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. స్వతహాగా కన్నడ కుర్రాడు అయినప్పటికీ తెలుగులో ఇతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కన్నడలో హీరోగా ఓ మూవీ, తెలుగులో 'గీతా శంకరం' అనే చిత్రం చేశాడు. కాకపోతే అవేమంత పేరు తీసుకురాలేదు.గతంలోనే ఓసారి తెలుగు, ఇంకోసారి కన్నడ బిగ్బాస్ షో నుంచి ఇతడికి అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో గేమ్, షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల నో చెప్పానని ఓ ఇంటర్వ్యూలో ముఖేష్ గౌడ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు క్రేజీ కంటెస్టెంట్గా 10వ సీజన్లో అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఇతడికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది రాబోయే వారాల్లో తెలుస్తుంది. -
నటిగా మొదలుపెట్టి యాంకర్గా ఫేమస్ అయి.. ఎట్టకేలకు 'బిగ్బాస్'లోకి..
ప్రతిసారి 'బిగ్బాస్'లోకి గ్లామరస్ యాంకర్స్ని తీసుకొస్తూనే ఉంటారు. ఈసారి ఆ కోటాతో హౌస్లోకి వచ్చిన బ్యూటీ వర్షిణి. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈమె పేరు వినిపించేది. కానీ చివరలో తూచ్ ఈమె లేదని తేలేది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్లో కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇకపోతే వర్షిణి సౌందరరాజన్.. హైదరాబాద్లో స్థిరపడిన తమిళ కుటుంబంలో పుట్టింది. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన 'చందమామ కథలు' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర మూవీస్లో చేసింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్తో పాటు ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ కనిపించింది.అందంగా ఉండే వర్షిణి మీద రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. ప్రతిసారి బిగ్బాస్ షోలో ఈమె కచ్చితంగా అడుగుపెడుతుందనే టాక్ వచ్చేది. టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్తో ప్రేమాయణం నడిపిందనే రూమర్స్ కూడా వినిపించాయి. మరో సందర్భంలో ఏకంగా టీవీ షో డైరెక్టర్తోనే ప్రేమలో ఉందన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు షోలేం చేయట్లేదు. మరి బిగ్బాస్లో అడుగుపెట్టిన ఈమె.. గ్లామర్తో పాటు తనదైన ఆటతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి? -
'బిగ్బాస్'లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ 'వినాయకుడు'
తెలుగు సినిమాల్లో సహాయ నటుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.. 'బిగ్బాస్' హౌస్లో 13వ కంటెస్టెంట్గా అడుగుపెట్టేశాడు. ఇతడి అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి గ్రామంలో ఓ జమీందారీ కుటుంబంలో పుట్టాడు. ఈయన ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు చిన్నచింతనడ జమీందార్గా ఉండేవారు. 1970లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల వీరి ఫ్యామిలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా సుమారు 4500 ఎకరాల భూమిని కోల్పోయింది!వ్యక్తిగత విషయాలకొస్తే కృష్ణుడు.. బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశాడు. కానీ సినిమాలపై పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ స్టూడియో నడపుతూ, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. హ్యాపీ డేస్, పోకిరి, షాక్, వాన, యువత, ఓయ్ తదితర సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన వినాయకుడు మూవీతో హీరోగానూ చేసి హిట్ అందుకున్నాడు. అనంతరం విలేజ్లో వినాయకుడు, స్నేహగీతం, పప్పు లాంటి చిత్రాల్లోనూ హీరోగా చేశాడు. ఆర్య 2, ఏ మాయ చేశావే, మిస్టర్ పెర్ఫెక్ట్, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, గోపాల గోపాల తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.కుర్ర వయసులో ఉన్నప్పుడు కృష్ణుడు మనందరిలానే ఉండేవాడు. కానీ ఓసారి కాలికి గాయం కావడంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైపోయాడు. దీంతో బరువు బాగా పెరిగిపోయాడు. కానీ అదే రూపం ఇతడికి నటుడిగా అవకాశాలు తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని ఇతడు ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టాడు. మరి ఇందులో ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి? -
Bigg Boss 10: బిగ్బాస్లోకి నిజామాబాద్ కుర్రాడు
ఈసారి అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్బాస్ 10లోకి అడుగుపెట్టిన వాళ్లలో తెలంగాణ కుర్రాడు చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ ఒకడు. నిజామాబాద్లో పుట్టి పెరిగిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్లో కెరీర్ మొదలుపెట్టాడు. యాంకర్గా పలు ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తుంటాడు.చరణ్కి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలా రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన ప్రతిభని చూపిస్తూ బిగ్బాస్ అగ్నిపరీక్ష పోటీ వరకు వచ్చాడు. ఇందులో తనదైన ముద్ర వేసి జడ్జిలను మెప్పించి ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో పాల్గొనే సదావకాశం దక్కించుకున్నాడు. -
శారీరక లోపం వరమైతే.. బిగ్బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్
ప్రతిసారి బిగ్బాస్ షోలోకి కమెడియన్స్ వస్తూనే ఉంటారు. ఈసారి ఆ కోటాలో పొట్టి నరేశ్ అలియాస్ కమెడియన్ నరేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గత పదేళ్లుగా పలు షోలతో అలరిస్తున్న ఇతడు.. ఇప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో బిగ్బాస్ 10లోకి 11వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోల్లో కనిపించే నరేశ్.. తన ఆహార్యం వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పొట్టిగా ఉన్నప్పటికీ దానినే తన బలంగా మార్చుకుని పంచులేస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే 600కి పైగా స్కిట్స్ చేశాడు. రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు షోలు, ఈవెంట్స్ చేస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.నరేశ్ కుటుంబం విషయానికొస్తే ఇతడి తండ్రికి ట్రాలీ ఆటో ఉండేది. వీళ్ల కుటుంబం స్క్రాప్ దుకాణం బిజినెస్ చేసేది. అంటే పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలని జనాల దగ్గర కొని వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న నరేశ్.. ఓ సందర్భంలో ఢీ జూనియర్స్ ఆడిషన్స్కు వెళ్లాడు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తి ఇతడిని జబర్దస్త్కి తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్.. ఇలా చాలామంది టీమ్స్లో ఎన్నెన్నో కామెడీ పాత్రలు చేసి తెగ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. -
బిగ్బాస్ 10లోకి 'టెంపర్' విలన్
ఈసారి బిగ్బాస్లోకి టాలీవుడ్ విలన్ ఎంట్రీ ఇచ్చాడు. తన లుక్స్తోనే అందరినీ భయపెట్టే 'టెంపర్' వంశీ.. 9వ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. వంశీ అసలు పేరు వంశీ కృష్ణ కానీ తొలి సినిమా 'టెంపర్' నుంచి వంశీ అనే పేరుతోనే చాలా ఫేమస్ అయిపోయాడు. దీని తర్వాత లోఫర్, కాటమరాయుడు, పైసా వసూల్, భరత్ అను నేను, బ్లఫ్ మాస్టర్, డిస్కో రాజా, భీష్మ, వకీల్ సాబ్, పుష్ప పార్ట్-1, సర్కారు వారి పాట, హిట్ 2, టైగర్ నాగేశ్వరరావు, డబుల్ ఇస్మార్ట్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా చాలా మూవీస్లో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పటి వరకు 5పైగా సినిమాలు చేశాడు. చూడటానికి రఫ్ అండ్ టఫ్గా కనిపించే వంశీ ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. మరి సినిమాల్లో కనిపించే వంశీ.. ఆఫ్ స్క్రీన్లోనూ అలానే ఉంటాడా? లేదంటే తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా అనేది చూడాలి? -
Bigg Boss 10: అగ్ని పరీక్ష నుంచి హౌస్లోకి..ఎవరీ అమన్?
బిగ్బాస్ 10వ సీజన్లో 5వ కంటెస్టెంట్స్గా కామనర్స్ నుంచి అమన్ వెళ్లాడు. ఇతను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా గెలిచి హౌస్లోకి వెళ్లాడు. అయితే సెలబ్రిటీ కంటెస్టెంట్లతో పోలిస్తే అమన్కు అంతగా పరిచయం లేకపోవడంతో.. అసలు ఎవరీ అమన్? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ముఖ్యంగా బిగ్బాస్ అగ్నిపరీక్షలో తనదైన శైలిలో ఆకట్టుకున్న అమన్.. ఇప్పుడు ఏకంగా బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.అమన్ మసూద్ మోడల్, డిజిటల్ క్రియేటర్, సోషల్ మీడియా పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యాషన్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన కంటెంట్ ద్వారా ఆయన సోషల్ మీడియాలో కనిపిస్తూ వచ్చారు. నటన, మోడలింగ్పై ఆసక్తితో పాటు డిజిటల్ కంటెంట్ రంగంలోనూ యాక్టివ్గా ఉన్నారు.అయితే అమన్కు అసలు గుర్తింపు తెచ్చింది మాత్రం ‘బిగ్బాస్ అగ్నిపరీక్ష 2’. బిగ్బాస్ తెలుగు 10లో కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి అవకాశం దక్కించుకునేందుకు నిర్వహించిన ఈ సెలెక్షన్ షోలో తనదైన ఆటతీరుతో ఆకట్టుకోని..ఇప్పుడు బిగ్బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు. మరి బిగ్బాస్ హౌస్లో కూడా అమన్ ఆకట్టుకుంటాడా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. -
బిగ్బాస్'లోకి ఆటో రాంప్రసాద్.. అవినాష్, ఇమ్ములా మెప్పిస్తాడా?
అంగరంగ వైభవంగా 'బిగ్బాస్' 10వ సీజన్ మొదలైంది. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే కమెడియన్ ఆటో రాంప్రసాద్ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. తనదైన డ్యాన్స్తో అలరించాడు. గతంలో ఇతడి స్నేహితులైన ముక్కు అవినాష్, ఇమ్మాన్యుయేల్ లాంటి వాళ్లు కమెడియన్ కేటగిరీలో వచ్చారు. ఫుల్ ఎంటర్టైనర్ చేశారు. మరి వాళ్లని రాంప్రసాద్ మర్చిపోయేలా చేస్తాడా లేదా అనేది చూడాలి?రాంప్రసాద్ విషయానికొస్తే ఆంధ్రాలోని విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. 2009లో రిలీజైన నాగచైతన్య 'జోష్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత పెద్దగా ఛాన్స్లు రాకపోవడంతో తిరిగి సొంతూరికి వెళ్లిపోయి మెడికల్ హోల్సేల్ వ్యాపారం చేశాడు. 'జబర్దస్త్' షో మొదలైన తర్వాత ధనరాజ్ టీమ్కి రైటర్గా పనిచేసేందుకు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. కొన్నాళ్లు ఈ టీమ్లో చేసిన తర్వాత సుడిగాలి సుధీర్తో కలిసిపోయాడు. ఇతడి టీమ్లో రైటర్ కమ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటో పంచులతో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, పటాస్, అనుభవించు రాజా తదితర టీవీ షోల్లో చేస్తూనే నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ఖైదీ నంబర్ 150, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బెదురులంక 2012, ది ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టాడు. ఇందులో తనదైన పంచులు,ప్రాసలతో పాటు ప్రతిభ చూపించి విజేతగా నిలుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. -
‘బిగ్బాస్’లోకి ఇద్దరు ఆడపిల్లల తల్లి.. ఎవరీ సీరియల్ బ్యూటీ!
బిగ్బాస్ 10వ సీజన్లో 6వ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టిన చైత్ర రాయ్ స్వతహాగా కన్నడ. సొంత భాషలోనే తొలుత నటిగా కెరీర్ ప్రారంభించింది. సీరియల్స్తో మంచి గుర్తింపు అందుకుంది. 'అష్టా చమ్మా' సీరియల్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' తదితర సీరియల్స్ చేసింది. 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు'లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.చైత్ర కేవలం సీరియళ్లకే పరిమితం కాలేదు. ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'లో ఓ సహాయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వ్యక్తిగత విషయానికొస్తే ప్రసన్న అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండో పాప పుట్టి కేవలం 10 నెలల మాత్రమే అవుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టేసింది. మళ్లీ తనదైన ప్రతిభ చూపించి తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకోవాలని అనుకుంటోంది.ప్రతి సీజన్లోనూ సీరియల్స్ నుంచి పాపులర్ నటీనటులను బిగ్బాస్ హౌస్లోకి తీసుకురావడం ఓ ఆనవాయితీ. ఈసారి చైత్ర రాయ్ని ఆ అవకాశం వరించింది. గ్లామర్, ఆమెకున్న ఫ్యాన్ బేస్, బోల్డ్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ షోకి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని బిగ్బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. 10 నెలల పాపని వదిలేసి వెళ్తున్న ఈమె షోలో ఎంతలా మెప్పిస్తుందో చూడాలి? -
బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చిన ఫేమస్ యాంకర్
బిగ్బాస్ 10లోకి యాంకర్ కేటగిరీలో సుధీర్ రెడ్డి నాలుగో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. ఇతడి విషయానికి వస్తే గతంలో ఓ మీడియా ఛానెల్లో యాంకర్గా పనిచేశాడు. ప్రస్తుతం 'సుధీర్ టాక్స్' పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ(నంద్యాల)లో పుట్టి పెరిగిన సుధీర్.. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటూ పలువురు వ్యాపారవేత్తలు, డాక్టర్స్, సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు.సోషల్ మీడియా వేదికగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రెడ్డి.. ఇప్పుడు బిగ్బాస్ 10లో ఓ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టడు. మరి బుల్లితెరపై అలరించిన ఇతడు ఈ రియాలిటీ షోలో ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి? -
అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్బాస్లోకి అడుగుపెట్టిన లేడీ రైతుబిడ్డ
తొలి సీజన్ నుంచి బిగ్బాస్ షోలో సామాన్యులు పాల్గొన్నప్పటికీ మహా అయితే ఒకటి రెండు వారాలకు మించి ఉండేవాళ్లు కాదు. ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్, కల్యాణ పడాల లాంటి వాళ్లు ఏకంగా విజేతలయ్యారో.. కామనర్స్ అనే పదానికి విలువ పెరిగింది. వీళ్లని ఎంపిక చేసేందుకు పెట్టిన అగ్నిపరీక్ష పోటీపైనే ఆడియెన్స్కి ఆసక్తి కలిగింది. అలా ఈసారి జరిగిన అగ్నిపరీక్షలో నెగ్గిన సింగర్ ఝాన్సీ ఇప్పుడు సగర్వంగా బిగ్బాస్ 10 హౌస్లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టేసింది.తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎలాంటి సంగీత నేపథ్యం, సౌకర్యాలు లేనప్పటికీ జానపద పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ టాపర్గా నిలిచింది. తెలంగాణ జానపద గీతాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.రామ్ రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మాస్, ఎనర్జిటిక్ వాయిస్తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడిషన్స్లోనూ తన మాటలతో జ్యూరీని ఆకట్టుకున్న ఝాన్సీ.. అగ్నిపరీక్ష సీజన్ 2లో తనదైన గేమ్తో గెలిచి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సెలబ్రిటీలతో పోటీపడి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి? -
టాలీవుడ్ 'చిన్న' హీరో.. బిగ్బాస్ 10లోకి వచ్చేశాడు
తెలుగు సినిమాల్లో హీరోగానే కెరీర్ మొదలుపెట్టి మధ్యలో సహాయ పాత్రలు చేసి ప్రస్తుతం హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తున్న అదిత్ అరుణ్ అలియాస్ అదిత్ ఈశ్వరన్ అలియాస్ త్రిగుణ్.. బిగ్బాస్ 10లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టేశాడు.తమిళనాడులో పుట్టి పెరిగిన అదిత్ అరుణ్.. జెనీలియా 'కథ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ లవ్, తుంగ భద్ర, పీఎస్వీ గరుడ వేగ, మనసుకు నచ్చింది, 24 కిసెస్, డియర్ మేఘా, WWW, కొండా, ప్రేమ దేశం, డెవిల్, లైన్ మ్యాన్, ఉద్వేగం, మనమే, జిగిల్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు.ప్రస్తుతానికైతే అదిత్ చేసిన పలు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్గా తెలుగులో రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీలో సెకండ్ హీరోగానూ నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్బాస్ 10 హౌస్లోకి అడుగుపెట్టాడు. వ్యక్తిగత విషయానికొస్తే 2023లో నివేదిత అనే అమ్మాయిని అదిత్ అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు గతేడాది ఓ ఆడపిల్ల పుట్టింది. ‘ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంటింటికి మళ్లీ పలికే పేరు కావాలి’ అని బిగ్బాస్లోకి వస్తున్నాని త్రిగున్ చెప్పాడు. అంతేకాదు. 2.0 స్టార్ట్ చేశానని.. ఇకపై త్రిగున్ని కొత్తగా చూశారని కూడా చెప్పాడు. మరి నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. ఈ షోలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి. -
Bigg Boss 10: తొలి కంటెస్టెంట్గా సీరియల్ బ్యూటీ!
ప్రతిసారి బిగ్బాస్లోకి సీరియల్ బ్యూటీస్ కచ్చితంగా వస్తారు. అలా ఈసారి ఆ కోటాలో వచ్చిన ముద్దుగుమ్మ దేబ్జానీ మోదక్. బిగ్బాస్ 10లోకి ఈమె కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. ఇప్పటికే సీరియల్స్, షోల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే.కోల్కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ మోదక్.. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మన భాష పెద్దగా రాకపోయినప్పటికీ తన నటనతో, అందంతో ఇక్కడి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తెలుగులో ప్రసారమైన పలు రియాలిటీ షోల్లోనూ కనిపించిన ఈమె ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టింది.సీరియల్స్తో అలరించిన ఈమె.. బిగ్బాస్తో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి? సీరియల్ ప్రేక్షకులు, లేడీ అభిమానుల నుంచి ఈమెకు మద్ధతు లభించే అవకాశముంది. టాస్కుల్లో ఫెర్ఫార్మెన్స్ బాగుంటే టాప్ కంటెండర్ అయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుంది. -
బిగ్బాస్పై అంచనాలు పెంచేస్తోన్న ప్రోమో
బిగ్బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో..ఈ షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లాంచింగ్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ప్రోమోలో నాగార్జున ఓ మ్యాజిక్ కీని చూపిస్తూ ఇది ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ల తలరాతను మార్చుతుంది అని చెప్పడం ఈ సీజన్పై అంచానాలు పెంచేస్తోంది. ప్రోమో చూస్తుంటే గత సీజన్లకు మించి ఈసారి లాంచింగ్ ఎపిసోడ్ను గ్రాండ్గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతుబిడ్డ ఝాన్సీ ఎంట్రీని ప్రోమోలో చూపించడం ఆసక్తిని పెంచుతోంది. బిగ్బాస్లో హీరో కార్తీక్ సందడి చేసినట్లు ప్రోమోలో కనిపించింది.నాగార్జునకు సైతం షాక్!బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన హోస్ట్ నాగార్జున.. అక్కడి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు తాను ఇలాంటి కాన్సెప్ట్ను చూడలేదని బిగ్బాస్తో చెప్పడం ప్రోమోలో కనిపించింది. దీంతో ఈసారి హౌస్లో ఏదో కొత్తగా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.ఒకేసారి మూడు భాషల్లో..మరోవైపు తెలుగు బిగ్బాస్తో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ బిగ్బాస్ షోలు ఇదే రోజు ప్రారంభం కానున్నాయి. ఆయా భాషల హోస్టులు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్లాల్.. నాగార్జునతో వర్చువల్గా భేటీ కావడం కూడా ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి కొత్త కంటెస్టెంట్లు, కొత్త కాన్సెప్ట్లు, గ్రాండ్ లాంచింగ్తో బిగ్బాస్ సీజన్ 10పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈసారి బిగ్బాస్ హౌస్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. -
Bigg Boss 10: హౌస్లోకి అడుగుపెట్టిన 16 మంది వీళ్లే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 10వ సీజన్ గ్రాండ్గా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్గా సందడి చేశాడు. ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది, కామనర్స్ నుంచి 6 మంది హౌస్లోకి వెళ్లారు. ఈ సారి హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ జాబితా, వారి నేపథ్యంతో పాటు లాంచ్ ఎపిసోడ్ ఎలా జరిగిందో పూర్తి వివరాలు ఇదిగో...బిగ్బాస్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే1) దేబ్జానీ మోదక్2) త్రిగుణ్3) సింగర్ ఝాన్సీ4) సుధీర్రెడ్డి5) అమన్6) చైత్ర రాయ్7) రాంప్రసాద్8) షాలిని9) టెంపర్ వంశీ10) సృష్టి11) జబర్దస్త్ నరేశ్12) చరణ్13) కృష్ణుడు14) వర్షిణి15) రోహిత్16 నిహర్ ముకేశ్పదహారో కంటెస్టెంట్గా నిహర్ ముకేశ్ప్రతిసారి సీరియల్ బ్యాచ్ నుంచి కచ్చితంగా బిగ్బాస్ హౌస్లోకి పలువురు నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈసారి అలా 'గుప్పెడంత మనసు' రిషి సర్ వచ్చేశాడు. 16వ కంటెస్టెంట్గా లోపల అడుగుపెట్టేశాడు. ‘రయ్ రయ్ రారా’ సాంగ్కు డ్యాన్స్ వేస్తూ పదహారో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు నిహర్ ముకేశ్. ‘సామాన్య కుటుంబం నుంచి వచ్చా. 10 సంవత్సరాల కిందట యాక్టర్ అవ్వాలనుకున్నా. ఇప్పుడు సినిమాలో హీరో వరకు వచ్చా. యాక్టర్గా ప్రతి ఒక్కరు ఒక అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అలా బిగ్బాస్లో కూడా నాకో అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకుని ప్రేక్షకుల మనసును గెలుచుకుంటా. తెలుగు నాకు మాట్లాడటం రాదు. ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. తెలుగు నా నాలుక మీద కాదు గుండెలో ఉంటుంది‘ అని తెలిపాడు.ముఖేశ్ విషయానికి వస్తే..రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన 'గుప్పెడంత మనసు' సీరియల్.. ఎంతలా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనే రిషిగా చేసిన ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే సీరియల్ పేరుతోనే బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. స్వతహాగా కన్నడ కుర్రాడు అయినప్పటికీ తెలుగులో ఇతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కన్నడలో హీరోగా ఓ మూవీ, తెలుగులో 'గీతా శంకరం' అనే చిత్రం చేశాడు. కాకపోతే అవేమంత పేరు తీసుకురాలేదు.గతంలోనే ఓసారి తెలుగు, ఇంకోసారి కన్నడ బిగ్బాస్ షో నుంచి ఇతడికి అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో గేమ్, షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల నో చెప్పానని ఓ ఇంటర్వ్యూలో ముఖేశ్ గౌడ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు క్రేజీ కంటెస్టెంట్గా 10వ సీజన్లో అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఇతడికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది రాబోయే వారాల్లో తెలుస్తుందిపదిహేనో కంటెస్టెంట్గా రోహిత్పదిహేనో కంటెస్టెంట్గా ఎంపిక చేసేందుకు బిందు మాధవి వచ్చారు. రోహిత్ని ఎంపిక చేశారు. నాగార్జున రోహిత్కి టాస్క్ ఇచ్చారు. గ్లాస్ తీసుకెళ్లి హౌస్లో ఉన్నవారిలో ఒకరి మీద వాటర్ వేయమన్నారు. అయితే ఇలా చేయలేనని రోహిత్ చెప్పాడు. అనంతరం వైట్ గోల్డ్ మెడల్ తీసుకుని హౌస్లోకి వెళ్లాడు. పద్నాలుగో కంటెస్టెంట్గా వర్షిణివిశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలోని ‘పుట్టా ముద్దుగా’. పాటకు డ్యాన్స్ వేస్తూ బిగ్బాస్లోకి అడుగెపెట్టింది యాంకర్ వర్షిణి. ‘ఇదొక మంచి ఫ్లాట్ఫాం. నేను ఇక్కడ ఫిట్ అవుతానని అనుకోలేదు.రోజు నిద్రపోయే ముందు నాకు నేను ప్రశ్నించుకున్నా. తర్వాత కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పింది.వర్షిణి విషయానికి వస్తే..వర్షిణి సౌందరరాజన్.. హైదరాబాద్లో స్థిరపడిన తమిళ కుటుంబంలో పుట్టింది. ఓ అక్క, అన్నయ్య ఉన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన 'చందమామ కథలు' సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర మూవీస్లో చేసింది. 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్తో పాటు ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ కనిపించింది.అందంగా ఉండే వర్షిణి మీద రూమర్స్ కూడా చాలానే వచ్చాయి. ప్రతిసారి బిగ్బాస్ షోలో ఈమె కచ్చితంగా అడుగుపెడుతుందనే టాక్ వచ్చేది. టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్తో ప్రేమాయణం నడిపిందనే రూమర్స్ కూడా వినిపించాయి. మరో సందర్భంలో ఏకంగా టీవీ షో డైరెక్టర్తోనే ప్రేమలో ఉందన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు షోలేం చేయట్లేదు. మరి బిగ్బాస్లో అడుగుపెట్టిన ఈమె.. గ్లామర్తో పాటు తనదైన ఆటతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి?పదమూడో కంటెస్టెంట్గా కృష్ణుడుతెలుగు సినిమాల్లో సహాయ నటుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.'బిగ్బాస్' హౌస్లో 13వ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. ‘నాలో చాలా యాంగిల్స్ అన్నీ హౌస్లో చూపిస్తా’ అని కృష్ణుడు తెలిపారు. కృష్ణుడు విషయానికి వస్తే.. అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి గ్రామంలో ఓ జమీందారీ కుటుంబంలో పుట్టాడు. ఈయన ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు చిన్నచింతనడ జమీందార్గా ఉండేవారు. 1970లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల వీరి ఫ్యామిలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా సుమారు 4500 ఎకరాల భూమిని కోల్పోయింది!వ్యక్తిగత విషయాలకొస్తే కృష్ణుడు.. బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేశాడు. కానీ సినిమాలపై పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ స్టూడియో నడపుతూ, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. హ్యాపీ డేస్, పోకిరి, షాక్, వాన, యువత, ఓయ్ తదితర సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన వినాయకుడు మూవీతో హీరోగానూ చేసి హిట్ అందుకున్నాడు. అనంతరం విలేజ్లో వినాయకుడు, స్నేహగీతం, పప్పు లాంటి చిత్రాల్లోనూ హీరోగా చేశాడు. ఆర్య 2, ఏ మాయ చేశావే, మిస్టర్ పెర్ఫెక్ట్, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, గోపాల గోపాల తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.కుర్ర వయసులో ఉన్నప్పుడు కృష్ణుడు మనందరిలానే ఉండేవాడు. కానీ ఓసారి కాలికి గాయం కావడంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైపోయాడు. దీంతో బరువు బాగా పెరిగిపోయాడు. కానీ అదే రూపం ఇతడికి నటుడిగా అవకాశాలు తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని ఇతడు ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టాడు. మరి ఇందులో ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి?పన్నెండో కంటెస్టెంట్గా చరణ్ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం బిగ్బాస్ హౌస్కి ఎంపికయ్యాడు చరణ్. ‘నేను ఉండే విధానమే నా బలం. చుట్టు ఉన్నవాళ్లని నవ్విస్తా. తండ్రి చిరంజీవిగారికి, మీకు పెద్ద అభిమాని‘ అని చరణ్ నాగార్జునతో తెలిపారు. నాగార్జున లైవ్లో తన తండ్రికి నమస్కారాలు తెలిపారు. వైట్ గోల్డ్ మెడల్ అందుకున్న అనంతరం చరణ్ హౌస్లోకి వెళ్లాడు. ఎవరీ చరణ్..ఈసారి అగ్నిపరీక్షలో నెగ్గి బిగ్బాస్ 10లోకి అడుగుపెట్టిన వాళ్లలో తెలంగాణ కుర్రాడు చరణ్ మహాదేవ్ అలియాస్ ఆర్జే చరణ్ ఒకడు. నిజామాబాద్లో పుట్టి పెరిగిన ఇతడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రేడియో జాకీగా ఆల్ ఇండియా రేడియో (AIR) హైదరాబాద్లో కెరీర్ మొదలుపెట్టాడు. యాంకర్గా పలు ఇంటర్వ్యూలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. డ్యాన్స్పై ఉన్న ఆసక్తితో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తుంటాడు.చరణ్కి డాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అలా రేడియో యాంకరింగ్, ఎడిటింగ్, డ్యాన్స్.. ఇలా తన ప్రతిభని చూపిస్తూ బిగ్బాస్ అగ్నిపరీక్ష పోటీ వరకు వచ్చాడు. ఇందులో తనదైన ముద్ర వేసి జడ్జిలను మెప్పించి ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో పాల్గొనే సదావకాశం దక్కించుకున్నాడు.పదకొండో కంటెస్టెంట్గా జబర్దస్త్ నరేశ్పంజా సినిమాలోని భూమికి జానడు సాంగ్కి డ్యాన్స్ వేస్తూ బిగ్బాస్ హౌస్లోకి నరేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గూగుల్లో నరేశ్ అని వెతికితే బిగ్బాస్ నరేశ్ వచ్చేలా కష్టపడతానని తెలిపాడు. నరేశ్ విషయానికి వస్తే.. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోల్లో కనిపించే నరేశ్.. తన ఆహార్యం వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పొట్టిగా ఉన్నప్పటికీ దానినే తన బలంగా మార్చుకుని పంచులేస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే 600కి పైగా స్కిట్స్ చేశాడు. రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు షోలు, ఈవెంట్స్ చేస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.నరేశ్ కుటుంబం విషయానికొస్తే ఇతడి తండ్రికి ట్రాలీ ఆటో ఉండేది. వీళ్ల కుటుంబం స్క్రాప్ దుకాణం బిజినెస్ చేసేది. అంటే పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలని జనాల దగ్గర కొని వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న నరేశ్.. ఓ సందర్భంలో ఢీ జూనియర్స్ ఆడిషన్స్కు వెళ్లాడు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తి ఇతడిని జబర్దస్త్కి తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్.. ఇలా చాలామంది టీమ్స్లో ఎన్నెన్నో కామెడీ పాత్రలు చేసి తెగ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బిగ్బాస్ షోలో అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.పదో కంటెస్టెట్గా సృష్టిమరో కంటెస్టెట్ని ఎంపిక చేసేందుకు జ్యూరీ ద్వారా ఎంపిక చేసేందుకు శ్రీముఖి వచ్చారు. సృష్టిని ఎంపిక చేశారు. ఈమెకు సైతం నాగార్జున వైట్ గోల్డ్ మెడల్ అందించారు. తొమ్మిదో కంటెస్టెంట్గా టెంపర్ వంశీటెంపర్ సినిమాలో విలన్గా నటించి ఆకట్టుకున్న వంశీ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లాడు. తన సినీ కష్టాలను తెలియజేసేలా ఏవీని రెడీ చేసుకొని స్టేజ్పైకి ఎంట్రీ ఇచ్చాడు. ‘చిరంజీవి మీద ఉన్న ఇష్టం.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కాలేజీ పుస్తకాలు చదవలేదు. కానీ చిరంజీవి ఉన్న సినిమా పుస్తకాల్ని ఒక్కటీ విడిచిపెట్టలేదు’ అని వంశీ చెప్పారు. సినిమా కష్టాల కోసం వివరించారు. కట్టేకాలేంత వరకు సినిమాలు చేస్తూ ఉంటానన్నారు. దాదాపు 50 సినిమాలు చేశానని చెప్పారు. తర్వాత పలు పాటలకు డ్యాన్స్ చేశారు. వంశీ అసలు పేరు వంశీ కృష్ణ కానీ తొలి సినిమా 'టెంపర్' నుంచి వంశీ అనే పేరుతోనే చాలా ఫేమస్ అయిపోయాడు. దీని తర్వాత లోఫర్, కాటమరాయుడు, పైసా వసూల్, భరత్ అను నేను, బ్లఫ్ మాస్టర్, డిస్కో రాజా, భీష్మ, వకీల్ సాబ్, పుష్ప పార్ట్-1, సర్కారు వారి పాట, హిట్ 2, టైగర్ నాగేశ్వరరావు, డబుల్ ఇస్మార్ట్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా చాలా మూవీస్లో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పటి వరకు 5పైగా సినిమాలు చేశాడు.చూడటానికి రఫ్ అండ్ టఫ్గా కనిపించే వంశీ ఇప్పుడు బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. మరి సినిమాల్లో కనిపించే వంశీ.. ఆఫ్ స్క్రీన్లోనూ అలానే ఉంటాడా? లేదంటే తనలోని మరో కోణాన్ని చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా అనేది చూడాలి?ఎనిమిదో కంటెస్టెంట్గా షాలినీఎనిమిదో కంటెస్టెంట్గా కామనర్స్ నుంచి ఒకరి పంపే అవకాశం జ్యూరీకి ఇచ్చాడు నాగార్జున. దీంతో నవదీప్ .. దీపక్, హేమంత్, షాలినీలను పిలిచాడు. వీళ్లలో నుంచి చివరగా షాలినీని సెలెక్ట్ చేసినట్లు నవదీప్ ప్రకటించాడు. నవదీప్ సార్ నన్ను ఎంపిక చేసినప్పుడు ఇది నిజంగానే జరిగిందా అని ఆశ్చర్చపోయానని షాలనీ తెలిపారు.ఏడో కంటెస్టెంట్గా జబర్దస్త్ రాంప్రసాద్రాంప్రసాద్కు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లను చూసి వాళ్లు ఎం మాట్లాడుకుంటున్నారో మాకు లిప్ మూమెంట్ చెప్పాలని నాగార్జున అడిగారు. ఎలాగైనా మమ్మల్ని నవ్వించాలన్నారు. రాంప్రసాద్ నవ్వించే ప్రయత్నం చేశారు. రాంప్రసాద్ విషయానికొస్తే ..ఆంధ్రాలోని విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. 2009లో రిలీజైన నాగచైతన్య 'జోష్' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత పెద్దగా ఛాన్స్లు రాకపోవడంతో తిరిగి సొంతూరికి వెళ్లిపోయి మెడికల్ హోల్సేల్ వ్యాపారం చేశాడు. 'జబర్దస్త్' షో మొదలైన తర్వాత ధనరాజ్ టీమ్కి రైటర్గా పనిచేసేందుకు తిరిగి హైదరాబాద్ వచ్చాడు. కొన్నాళ్లు ఈ టీమ్లో చేసిన తర్వాత సుడిగాలి సుధీర్తో కలిసిపోయాడు. ఇతడి టీమ్లో రైటర్ కమ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆటో పంచులతో చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయాడు.జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, పటాస్, అనుభవించు రాజా తదితర టీవీ షోల్లో చేస్తూనే నేను లోకల్, సినిమా చూపిస్త మావ, ఖైదీ నంబర్ 150, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బెదురులంక 2012, ది ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టాడు. ఇందులో తనదైన పంచులు,ప్రాసలతో పాటు ప్రతిభ చూపించి విజేతగా నిలుస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.ఆరో కంటెస్టెంట్గా చైత్ర రాయ్ అష్టాచెమ్మా సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అసలు పేరు చైత్రరాయ్. భర్త పేరు ప్రశన్న శెట్టి. రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో అమ్మగా, అక్కగా, భార్యగా పాత్రలు పోషిస్తున్నాను. ఒక నెగిటివ్ కామెంట్ వల్ల చాలా బరువు తగ్గారు . చిన్న బేబిని వదిలి బిగ్బాస్ హౌస్కి వచ్చినట్లు తెలిపారు. చైత్ర విషయానికొస్తే.. సీరియల్స్తో మంచి గుర్తింపు అందుకుంది. 'అష్టా చమ్మా' సీరియల్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' తదితర సీరియల్స్ చేసింది. 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు'లో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది.బిగ్బాస్ గ్రాండ్ లాంచ్లో తమిళ యాక్టర్స్ సూర్య, కార్తీ సందడి చేశారు. సర్దార్2 మూవీ ప్రమోషన్స్ కోసం వాళ్లు బిగ్బాస్ షోకి వచ్చారు. ఐదో కంటెస్టెంట్గా అమన్బిగ్బాస్ 10వ సీజన్లో 5వ కంటెస్టెంట్స్గా కామనర్స్ నుంచి అమన్ వెళ్లాడు. ఇతను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా గెలిచి హౌస్లోకి వెళ్లాడు. సీక్రెట్ టాస్క్హోస్ట్ నాగార్జున అమన్కు ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఒక రెడ్ బాక్స్ ఇచ్చి.. అందులో రెడ్ డాట్ ఉందని, హౌస్లోకి వెళ్లాక..వచ్చే ముగ్గురిలో కనీసం ఒకరికైనా ఇది తెలియకుండా పెట్లాలని అమన్కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. అమన్ కోసం ఒక స్వీట్ మెమోరీ అంటూ చిరిగిపోయిన టీషర్టును నాగార్జున అందించారు. వచ్చే శనివారానికి ఎన్ని హోల్స్ ఉన్నాయో చెప్పాలన్నారు. ఓ గోల్డ్ మెడల్ అందిచారు. నాలుగో కంటెస్టెంట్గా సుధీర్ రెడ్డినాలుగో నాలుగో కంటెస్టెంట్గా సుదీర్ వచ్చారు. సోషల్మీడియాలో ఇంటర్వ్యూ చేస్తూ అందరికి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం 'సుధీర్ టాక్స్' పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ(నంద్యాల)లో పుట్టి పెరిగిన సుధీర్.. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటూ పలువురు వ్యాపారవేత్తలు, డాక్టర్స్, సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు. తనకు ఇంటర్వ్యూ చేయమని నాగార్జున కోరగా..‘నాకు మీలో బాగా నచ్చేది. బిజినెస్ మ్యాన్గా, హీరోగా బాగా రాణిస్తున్నారు. లైఫ్లో ఎదైనా వెలితి ఉందా?’ అని అడగ్గా టైమ్ సరిపోవడం లేదని నాగార్జున అన్నాడు.సోషల్ మీడియా వేదికగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రెడ్డి.. ఇప్పుడు బిగ్బాస్ 10లో ఓ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టడు. మరి బుల్లితెరపై అలరించిన ఇతడు ఈ రియాలిటీ షోలో ఏ మేరకు రాణిస్తాడనేది చూడాలి? మూడో కంటెస్టెంట్గా సింగర్ ఝాన్సీ గోల్డేన్ టికెట్ సాధించి సింగర్ ఝాన్సీ మూడో కంటెస్టెంట్గా వచ్చారు. ‘మూడో తరగతి నుంచే పాటలు పాడటం మొదలు పెట్టా. అందరికీ తెలిసేలా నన్ను నేను నిరూపించుకునేందుకు ‘బిగ్బాస్’కువచ్చా. అనుకోకుండా గోల్డెన్ టికెట్ సొంతం చేసుకున్నా.‘ అని తెలిపిందిఝాన్సీ కోసం కొన్ని విషయాలు..తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎలాంటి సంగీత నేపథ్యం, సౌకర్యాలు లేనప్పటికీ జానపద పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ టాపర్గా నిలిచింది. తెలంగాణ జానపద గీతాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.రామ్ రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మాస్, ఎనర్జిటిక్ వాయిస్తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడిషన్స్లోనూ తన మాటలతో జ్యూరీని ఆకట్టుకున్న ఝాన్సీ.. అగ్నిపరీక్ష సీజన్ 2లో తనదైన గేమ్తో గెలిచి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సెలబ్రిటీలతో పోటీపడి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?రెండో కంటెస్టెంట్స్గా యాక్టర్ త్రిగున్ రెండో కంటెస్టెంట్స్గా యాక్టర్ త్రిగూన్ ఎంట్రీ ఇచ్చాడు. ది ప్యారడైజ్ మూవీలోని ఆయా షేర్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే శనివారానికి హౌస్కి వచ్చేసరికి కనీసం ముగ్గిరికి హౌస్లో దెయ్యం ఉందని నమ్మించాలి అని నాగార్జున అతనికి టాస్క్ ఇచ్చారు. త్రిగున్ నేపథ్యం ఇదే.. తమిళనాడులో పుట్టి పెరిగిన అదిత్ అరుణ్.. జెనీలియా 'కథ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీకెండ్ లవ్, తుంగ భద్ర, పీఎస్వీ గరుడ వేగ, మనసుకు నచ్చింది, 24 కిసెస్, డియర్ మేఘా, WWW, కొండా, ప్రేమ దేశం, డెవిల్, లైన్ మ్యాన్, ఉద్వేగం, మనమే, జిగిల్ తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించాడు.ప్రస్తుతానికైతే అదిత్ చేసిన పలు తెలుగు, తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్గా తెలుగులో రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీలో సెకండ్ హీరోగానూ నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్బాస్ 10 హౌస్లోకి అడుగుపెట్టాడు. వ్యక్తిగత విషయానికొస్తే 2023లో నివేదిత అనే అమ్మాయిని అదిత్ అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు గతేడాది ఓ ఆడపిల్ల పుట్టింది. ‘ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఇంటింటికి మళ్లీ పలికే పేరు కావాలి’ అని బిగ్బాస్లోకి వస్తున్నాని త్రిగున్ చెప్పాడు. అంతేకాదు. 2.0 స్టార్ట్ చేశానని.. ఇకపై త్రిగున్ని కొత్తగా చూశారని కూడా చెప్పాడు. మరి నటుడిగా ఆకట్టుకున్న ఇతడు.. ఈ షోలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.మొదటి కంటెస్టెంట్ దేబ్జానీ మోదక్‘గిరిగిర గింగిరానివే’ పాటకి చిందులు వేస్తూ మొదటి కంటెస్టెంట్గా దేబ్జానీ మోదక్ వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘మొదటి కంటెస్టెంట్గా అడుగు పెట్టడం సంతోషంగా ఉంది. నా గురించి మూడు ముక్కల్లో చెప్పమంటే ఫన్ లవింగ్, నిజాయతీ, డే డ్రీమర్ను. నేను ఎక్కువగా ఇంట్లో ఉండటానికి ఇష్టపడతా. ఎక్కడ వర్క్ చేసినా, రాత్రయితే ఇంటికి వచ్చేయాల్సిందే’ అని అన్నారు. దేబ్జానీకి నాగార్జున టాస్క్ ఇచ్చారు. హౌస్లోకి వచ్చే వాళ్ల ప్రవర్తన బట్టి వాళ్లకు పేర్లు పెట్టాలని కొన్ని బ్యాడ్జ్లను అందించారు.ఎవరీ దేబ్జానీ మోదక్ కోల్కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ మోదక్.. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మన భాష పెద్దగా రాకపోయినప్పటికీ తన నటనతో, అందంతో ఇక్కడి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తెలుగులో ప్రసారమైన పలు రియాలిటీ షోల్లోనూ కనిపించిన ఈమె ఇప్పుడు బిగ్బాస్ 10వ సీజన్లో అడుగుపెట్టింది.ఓ మ్యాజిక్ కీ ని నాగర్జున చూపించారు దాని కథ తెలుసుకునేందుకు బిగ్బాస్ హౌస్లోకి వెళ్లారు. హౌస్ అంతా కలియతిరిగిన నాగార్జునకు బిగ్బాస్ స్వాగతం పలికారు. తిరిగి స్టేజీపైకి వచ్చేశారు.బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్బాస్ సీజన్ 10’ ఎట్టకేలకు గ్రాండ్గా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున తనదైన స్టైల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి షోకు మరింత జోష్ తీసుకొచ్చారు. పాటకు స్టెప్పులేస్తూ అలరించిన ఆయన.. ఈ సీజన్లో ఆట మరింత ఆసక్తికరంగా, సవాళ్లతో సాగబోతుందనే ఆయన చెప్పిన మాటలు, సరికొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక అసలు సందడి మొదలైంది. బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. షో ప్రారంభం అయితే చాలు టీవీకి అతుక్కుపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ షోకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే 9 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 10వ సీజన్తో అలరించడానికి రేడీ అయింది. ఈ రోజు(సెప్టెంబర్ 6) బిగ్బాస్ 10 ప్రారంభం కానుంది. బిగ్బాస్ 10 ప్రోమో వచ్చేసిందిబిగ్బాస్ సీజన్ 10 మరికాసేపట్లో(సాయంత్రం 7 గంటలకు) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ లాంచింగ్ ఎపిసోడ్ ప్రోమోని వదిలారు.గత సీజన్ల మాదిరే ఈ సారి కూడా లాంచింగ్ గ్రాండ్గా ఉండబోతున్నట్లు పోమో చూస్తే అర్ధమవుతుంది. రైతు బిడ్డ ఝాన్సీ ఎంట్రీని ప్రోమోలోనే చూపించారు.అలాగే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ రోజే షో ప్రారంభం కానుంది. ఈ మూడు భాషల బిగ్బాస్ హోస్టులు(విజయ్ సేతుపతి, మోహన్ లాల్, సుదీప్) నాగార్జునతో వర్చువల్గా భేటీ అయ్యారు.‘స్టార్ మా’, ‘జియో హాట్ స్టార్’ ఓటీటీలో సాయత్రం 7 గంటల నుంచి ప్రసారం అవుతుంది. ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు సీజన్ 10పై మరింత ఆసక్తిని పెంచేశాయి. పదో సీజన్ కు తగ్గట్టుగా దశావతారం అనే కాన్సెప్ట్తో సరికొత్త సర్ప్రైజ్లు ఇవ్వడానికి నిర్వాహకులు భారీ ప్లాన్ చేశారట. మరి షో ఎలా ఉండబోతుంది. కంటెస్టెంట్స్ ఎవరనేది మరికాసేపట్లో తెలిసిపోతుంది. అయితే షో ప్రారంభానికి ముందే నెట్టింట సీజన్ 10పై భారీ చర్చ జరుగుతోంది.తెలుగు బుల్లితెరపై ఇతర భాషల ‘బిగ్ బాస్’ హోస్ట్స్ సందడిబిగ్గాస్ 10 లాంచింగ్ని మరింత గ్రాండ్గా ప్లాన్ చేశారట. ఈ సారి అనేక సర్ప్రైజ్లతో లాంచింగ్ ఎపిసోడ్ని రూపొందించారట.అందులో భాగంగా ఇతర భాషల బిగ్బాస్ హోస్టులంతా తెలుగు బిగ్బాస్ వ్యాఖ్యాత నాగార్జునతో వర్చువల్గా భేటీ అవుతారట. ఈ సారి తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ ఈ రోజే షో ప్రారంభం కానుంది.గెస్టులుగా కార్తీ, ఆనంద్ దేవరకొండబిగ్బాస్ 10 గ్రాండ్ లాంచ్కి తమిళ హీరో విజయ్తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ గెస్టులుగా వచ్చి ప్రేక్షకులను అలరించబోతున్నారట. ఎపిక్ సినిమా ప్రమోషన్స్ భాగంగా హీరోయిన్ వైష్ణవి చైతన్యతో పాటు ఆనంద్ దేవరకొండ స్టేజ్పైకి రాబోతున్నారు. ఇక సర్దార్ 2 మూవీ ప్రమోషన్స్ కోసం కార్తీ కూడా బిగ్బాస్ షోకి వచ్చారట.బిగ్బాస్ 10లోకి 16 మందిఈ సారి హౌస్లోకి తొలి రోజే మొత్తం 16 మందిని పంపించబోతున్నారట. వారిలో సామాన్యుల కోటా నుంచి ఆరుగురు, సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది ఉన్నారు.హౌస్లోకి వెళ్లే సెలెబ్రెటీలు వీళ్లే..?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా ప్రకారం బిగ్బాస్ 10లోకి వెళ్లే సెలెబ్రెటీల లిస్ట్ ఇదే. 1) ఆటో రాంప్రసాద్2) టెంపర్ వంశీ3) దేబ్జానీ మోదక్4)యాంకర్ వర్షిణి5) ముఖేష్ గౌడ6)చైత్రా రాయ్7) నటుడు కృష్ణుడు8) జబర్దస్త్ నరేశ్9) టెంపర్ వంశీ10)యాంకర్ సుధీర్ రెడ్డిఅగ్ని పరీక్ష నుంచి వెళ్లే ఆరుగురు వీళ్లే.. 1) ఝాన్సీ2) రోహిత్ నాయుడు3)శ్రష్టి4) చరణ్5)అమన్ మసూద్6)షాలిని పటేల్ -
బిగ్ బాస్ 10 ఎంట్రీ పై ఆటో రాంప్రసాద్ క్లారిటీ!
బిగ్బాస్ సీజన్ 10 మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు) ప్రారంభం కానుంది. అయితే ఎప్పటి మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ లీకైంది. పలువురి సెలెబ్రెటీల పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వారిలో జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ సారి ఆయన హౌస్లో సందడి చేయబోతున్నాడు. అయితే బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీపై రాంప్రసాద్ డైరెక్ట్గా స్పందించలేదు కానీ.. పరోక్షంగా ఎప్పుడో హింట్ ఇచ్చాడు. కొత్తగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన బిగ్బాస్లోకి వెళ్తున్నాడనే విషయం దాదాపు కన్ఫామ్ అయిపోయింది. తాజాగా తన ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు రాంప్రసాద్. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ పెడుతూ.. తనకు సపోర్ట్ చేయాలని కోరాడు.(చదవండి: బిగ్బాస్ 10: ఈ సారి హౌస్లోకి వెళ్లేది వీళ్లే?)కొత్త చాప్టర్ ప్రారంభం.. బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్న నేపథ్యంలో తాజాగా తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. అనంతరం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..‘జబర్దస్త్ నుంచి ఇప్పటివరకు నా కామెడీని ఎంజాయ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జబర్దస్త్ జర్నీ నాకు చాలా స్పెషల్. మీ ప్రేమ సపోర్ట్ కారణంగానే నేను ఈరోజుకి స్థాయిలో ఉన్నాను… ఇప్పుడు నా జీవితంలో మరొక కొత్త చాప్టర్ ప్రారంభం కాబోతోంది. ఈ జర్నీలో కూడా మీ సపోర్ట్ ఇలాగే నా ఉండాలని కోరుకుంటున్నాను. చేంజ్ ఏదైనా మీకోసం ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా’ టీట్ చేశాడు. దీంతో ఆయన బిగ్బాస్లోకి వెళ్తున్నాడనే వార్త నిజమని తేలిపోయింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం హౌస్లోకి వెళ్లేవరకు అధికారికంగా చెప్పకూడదు.అందుకే రాంప్రసాద్ ఇలా పరోక్షంగా తన ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఈ సారి రాంప్రసాద్తో పాటు మరో జబర్దస్త్ కమెడియన్ నరేశ్ కూడా హౌస్లోకి వెళ్తున్నట్లు సమాచారం. వీరితో పాటు యాంకర్ వర్షిణి, పల్లవి గౌడ, యూట్యూబర్ నందు, నటుడు టెంపర్ వంశీ, వినాయుకు మూవీ హీరో కృష్ణుడు, 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. #Jabardasth nunchi ippati varaku naa comedy ni enjoy chesi, nannu support chesina prathi okkariki heartfelt THANK YOU ❤️🙏Aa journey naaku chala special… mee love & support valle ee roju nenu ee stage lo unna!Ippudu life lo oka new chapter start avvabothundi… ee journey lo… pic.twitter.com/gwOp7wLQmZ— Jabardasth Ram Prasad (@RamPrasadAuto) September 5, 2026 -
బిగ్బాస్ 10: అగ్ని పరీక్ష నుంచి ఆరుగురు.. హౌస్లోకి వెళ్లేది వీళ్లే!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 10 మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్ 10) గ్రాండ్గా ప్రారంభం కానుంది.ఈ సారి దాదాపు 20 మంది వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సీజన్లో సామాన్యుల కోటా నుంచి కూడా భారీగానే వెళ్లనున్నారు. దీని కోసం ఇప్పటికే ‘అగ్ని పరీక్ష’ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో నుంచి ఐదు లేదా ఆరుగురిని హౌస్లోకి పంపనున్నారు. అయితే ఆ జాబితాలో ఎవరెవరకు ఉంటారా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే రైతు బిడ్డ ఝాన్సీ కన్ఫామ్ అయింది.తాజాగా అగ్నిపరీక్ష గ్రాండ్ ఫినాలేలో మేకర్స్ 'టికెట్ టు బిగ్బాస్' ప్రకటించారు. ఈ టికెట్ గెలిచిన వారికి నేరుగా బిగ్బాస్ తెలుగు 10 హౌస్లోకి ఎంట్రీ లభిస్తుంది. ఈ పోటీలో ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే తొలి కంటెస్టెంట్గా ఝాన్సీ నిలిచింది. దీంతో సెప్టెంబర్ 6న జరగనున్న బిగ్బాస్ 10 గ్రాండ్ లాంచ్లో ఝాన్సీ హౌస్లోకి అడుగుపెట్టనుంది. మిగిలిన వారిలో ఇప్పటికే తనదైన ఆటతీరుతో మూడు గ్రీన్స్ సాధించిన మిథిలేష్ని కూడా హౌస్లోకి పంపనున్నారు. వీరితో పాటు చరణ్, రాజకుమారి, రోహిత్, అమన్ కచ్చితంగా బిగ్బాస్ 10లో పాల్గోనే అవకాశం ఉంది. ఆరుగురి కంటే ఎక్కువ పంపిస్తే..శ్రష్టి, షాలినీ వంటి వారు కూడా ఈ సీజన్లో పాల్గోనే అవకాశం ఉంది. అగ్ని పరీక్ష నుంచి హౌస్లోకి వెళ్లేది ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక సెలెబ్రెటీ కోటాలో ఈ సారి పది మంది వరకు హౌస్లోకి వెళ్లే అవకాశం ఉంది. వారిలో జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రాంప్రసాద్, నరేశ్, 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ, యాంకర్ వర్షిణి, ముఖేష్, చైత్ర రాయ్, నటులు టెంపర్ వంశీ, కృష్ణుడు, ఎక్స్ప్రెస్ హరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో నుంచి ఎవరు హౌస్లోకి వెళ్లేది ఎవరనేది దానిపై రేపు(సెప్టెంబర్ 6) స్పష్టత రానుంది. సీజన్ 10కి కూడా కింగ్ నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. -
‘బిగ్బాస్ 10’ డేట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్లే!
గొడవలు.. అలకలు.. అరుపులు, ఆటలు ఇవన్నీ ఉండే రియాల్టీ షో బిగ్బాస్. తెలుగులో ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో 10వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి దశావతారం కాన్సెప్ట్తో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది. ఈ మేరకు ప్రారంభ తేదిని అధికారికంగా తెలియజేస్తూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు 10వ సీజన్ లాంచ్ కానుంది. మీరు ఎంతైనా ఊహించుకోండి.. దాన్ని మించి ఈ సీజన్ ఉంటుంది . ఈ సారి ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అంటూ వీడియోను పంచుకున్నారు. వెరైటీ, సర్ప్రైజ్, డ్రామా.. ఛాలెంజ్ ప్రతీది 10 రెట్లు ఎక్కువగా ఉంటుందంటూ సీజన్ 10పై ఆసక్తిని పెంచేశారు. స్టార్ మా, హాట్ స్టార్లో ప్రసారం కానున్న ఈ షోకి కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించనున్నారు. కంటెస్టెంట్స్ వీరేనా..?గత సీజన్ మాదిరే ఈ సారి కూడా కామనర్స్కి ఎక్కువ అవకాశం ఇవ్వబోతున్నారట నిర్వాహకులు. వీరి కోసం కామనర్స్ కోసం 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2' నిర్వహిస్తున్నారు. ఇందులో 70 మంది పోటీ పడగా.. చివరకు 15 మందిని సెలెక్ట్ చేశారు. వీరిలో నుంచి దాదాపు ఆరుగురిని హౌస్లోకి పంపే అవకాశం ఉంది. అంతేకాదు ఒకరిద్దరిని వైల్డ్ కార్డు ద్వారా కూడా పంపే చాన్స్ ఉందట. ఇక సెలెబెట్రీలలో ఎక్కువగా సీరియల్ యాక్టర్స్ ఉండబోతున్నారు. అలాగే బుల్లితెర కమెడియన్స్ని కూడా ఈ సారి ఎక్కువగానే హౌస్లోకి పంపిస్తున్నారట. 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దేబ్జానీ మోదక్, 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం ముఖేష్ గౌడ పేర్లు దాదాపు కన్ఫామ్ అయ్యాయని సమాచారం. ఇక జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేశ్, నూకరాజుతో పాటు ఎక్స్ప్రెస్ హరి పేరు కూడా ఈ సారి బలంగా వినబడుతుంది. వీరితో పాటు యాంకర్ వర్షిణి, పల్లవి గౌడ, తేజస్వీని గౌడ, యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ, యాంకర్ సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
‘బిగ్బాస్’ లోకి సౌరభ్ గంగూలీ.. రెమ్యునరేషన్ ఎంతంటే..?
ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్ రియాలటీ షో 'బిగ్ బాస్'. తెలుగు, హిందీ మాత్రమే కాదు అన్ని భాషల్లోనూ ఈ రియాల్టీ షోకి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో అయితే ఇప్పటికే 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే పదో సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికి వరకు అన్ని భాషల్లో ఈ రియాల్టీ షోకి సినిమా తారలే హోస్ట్గా వ్యవహరించారు. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, నాని, కన్నడలో కిచ్చా సుదీప్, తమిళ్లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి హోస్ట్లుగా వ్యవరించారు. అయితే బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారి సినిమా నటుడు కాదని ఓ క్రికెటర్ హోస్ట్గా వ్యవరించబోతున్నాడు. ఆయన ఎవరో కాదు.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.బిగ్బాస్ బెంగాలీకి హోస్ట్గా.. ఇప్పటి వరకు భాషల వారిగా వేర్వేరు సమయాల్లో బిగ్బాస్ షో ప్రారంభం అయ్యేది. కానీ ఈ సారి మాత్రం ఒకేసారి ఆరు భాషల్లో బిగ్బాస్ రియాల్టీ షో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ నెలలో ఈ రియాల్టీ షో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. అయితే బిగ్బాస్ బెంగాలీ షోకి గంగూలీ హోస్ట్గా వ్యవహరించబోతున్నాడు. ఈ మేరకు జియోహాట్ స్టార్ ఓ ప్రత్యేక వీడియో ద్వారా అధికారిక ప్రకటన వెల్లడించింది. హిందీ బిగ్బాస్కు సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్లాల్ వ్యవహరించబోతున్నారు.భారీ పారితోషికం.. బిగ్బాస్ బెంగాలీ షో కోసం గంగూలీ రూ. 125 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం. దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బిగ్బాస్ బెంగాలీ సీజన్ 3 రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు గంగూలీని రంగంలోకి దించారు నిర్వాహకులు. గతంలో జీ బెంగాలీలో వచ్చిన 'దాదాగిరి అన్లిమిటెడ్' క్విజ్ షోతో బుల్లితెరపై హోస్ట్గా గంగూలీ సంచలన విజయం సాధించారు. ఇప్పుడు బెంగాలీ బిగ్బాస్ను మరింత గ్రాండ్గా రీ-లాంచ్ చేసేందుకు రెడీ అయ్యాడు. మరి కెప్టెన్గా క్రికెట్ గ్రౌండ్లో ఆకట్టుకున్న గంగూలీ.. హోస్ట్గా బుల్లితెరపై ఎలా అలరిస్తాడో చూడాలి. View this post on Instagram A post shared by Star Jalsha (@starjalsha) -
నన్ను ‘బిగ్బాస్’లోకి తీసుకోండి.. ఎస్సై విజ్ఞప్తి, వీడియో వైరల్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో ‘బిగ్బాస్’ సందడి మళ్లీ మొదలైంది. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో 10వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సారి సామాన్యులకు భారీగానే అవకాశం ఇచ్చే చాన్స్ ఉంది. దాదాపు 10 మంది వరకు తీసుకుంటారని సమాచారం. దీని కోసం ‘అగ్ని పరీక్ష’ నిర్వహించనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో బిగ్బాస్ హౌస్లోకి వెళ్లేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు మొదలయ్యాయి. ఈ మేరకు వీడియోలు చేసి సోషల్ మీడియా వేదికగా ‘బిగ్బాస్’టీమ్కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా విజ్ఞప్తి చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దానికి గల కారణం.. బిగ్బాస్లోకి తీసుకోమని విజ్ఞప్తి చేసిన వ్యక్తి ఓ పోలీసు అధికారి అవ్వడమే. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు చెందిన ఎస్సై నాగార్జున రెడ్డి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బిగ్బాస్ టీమ్కు విజ్ఞప్తి చేస్తున్నాడు. తాను ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల పోలీసు స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నానని, ఒక్క అవకాశం ఇచ్చి బిగ్బాస్ షోలోకి తీసుకుంటే తన టాలెంట్ నిరూపించుకుంటానని చెబుతున్నాడు. బిగ్ బాస్ షోను రెగ్యులర్గా ఫాలో అయ్యే తన కూతుళ్లు ఇస్తున్న సపోర్టుతోనే ‘బిగ్బాస్’ వెళ్లాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు. ‘పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ నిత్యం ఎన్నో సవాళ్లను, మానసిక ఒత్తిడిని తట్టుకుని డ్యూటీ చేస్తున్నాను. నాకు గనుక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే అవకాశం ఇస్తే.. అక్కడ ఉండే ఎలాంటి మైండ్ గేమ్స్ అయినా ఆడగలను, నాలోని లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటో నిరూపించుకుని సత్తా చాటుతా అని నాగార్జున రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బిగ్ బాస్ సీజన్-10లో నాకు అవకాశం కల్పించండి అంటూ నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో తన కూతుర్ల కోరిక మేరకు ఈ వీడియో చేశానని, షోలో సత్తా చాటుతానని పేర్కొన్న ఎస్ఐ#BigBossTelugu #NandyalSI #ViralVideo #BigBossSeason10 #TrendingNews #PoliceOfficer #RTV pic.twitter.com/myUku9UlPI— RTV (@RTVnewsnetwork) June 25, 2026 -
Bigg Boss 10: ‘బిగ్బాస్’లోకి ఫేమస్ ఫోక్ సింగర్, కంటెస్టెంట్స్ వీళ్లే!
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్బాస్’ సందడి మళ్లీ మొదలు కానుంది. ఇప్పటికే 9 సీజన్లను దిగ్విజంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో 10వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని ఇటీవల రిలీజ్ చేసి, ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్గా వ్యవహరిస్తారని అధికారికంగా ప్రకటించారు. గత సీజన్ల కంటే భిన్నంగా ఈ సీజన్ని ప్లాన్ చేశారట మేకర్స్. దాదాపు 20 మంది వరకు కంటెస్టెంట్స్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందులో దాదాపు సగం మంది అంటే 10 మంది వరకు కామనర్సే ఉండే అవకాశం ఉంది. గత సీజన్లలో కామరన్స్ తమదైన ఆటతో అదరగొట్టేశారు. సీజన్ 9కి విజేతగా నిలిచిన కల్యాణ్ కూడా కామనర్స్ కేటగిరీ నుంచి వచ్చినవాడు. అందుకే 10వ సీజన్లో ఎక్కువ మంది కామనర్స్ని తీసుకోవాలని చూస్తున్నారట. సామాన్యులను సెలక్ట్ చేయడానికి అగ్నిపరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే అగ్నిపరీక్ష 2 కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయట. ఇవన్నీ పరిశీలించి.. అందులో నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి అగ్ని పరీక్షలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. జులై 25 నుంచి అగ్ని పరీక్ష 2ని టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్బాస్ 10వ సీజన్ ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్లో పాల్గొనే సెలెబ్రెటీల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి 10 మంది సెలెబ్రిటీలను బిగ్బాస్ హౌస్లోకి పంపించే అవకాశం ఉంది. వారిలో బుల్లితెర నటి పల్లవి గౌడ, రాకింగ్ రాకేష్, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ పవిత్ర , నూకరాజు, ప్రభాకర్ లేదా ఆయన కొడుకు చంద్రహాసన్, ఆట సందీప్ సతీమణి జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్ కుమార్, రచయిత కడలి సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.తాజాగా ఈ లిస్ట్లోకి సింగర్ మంగ్లీ కూడా వచ్చి చేరింది. ఇటీవల ఈ ఫోక్ సింగర్ వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. ఫామ్ హౌసులో డ్రగ్స్ పార్టీ, అధిక వడ్డీ పేరుతో చేసిన ఘరానా మోసాల వంటి కేసుల విషయాల్లో వార్తల్లో నిలిచిన మంగ్లీ.. సీజన్ 10లో పాల్గొని..తనపై వచ్చిన నెగెటివిటీని పొగొట్టుకోవాలని ప్రయత్నిస్తుందట. గతంలోనూ ఆమెకు బిగ్బాస్ ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పుడు తనకు ఆసక్తి లేదని చెప్పిందట. ఈ సారి మాత్రం పాల్గొనే అవకాశం ఉంది. -
రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్
దీప్తి సునయన.. ఒకప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్.. కవర్ సాంగ్స్, డబ్ స్మాష్తో పాపులర్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొంది. అమాయకత్వం, చిలిపితనంతో అభిమానులను సంపాదించుకున్న ఈ నటి అప్పట్లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు కలిసిమెలిసి ఉన్న వీరిద్దరూ 2022లో బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.టైంపాస్ చేస్తున్న దీప్తిఇటీవలే షణ్ముఖ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి కొత్తింట్లో కొత్త జీవితం ప్రారంభించాడు. మరోపక్క ఈ మధ్యే ఓ ప్రైవేట్ సాంగ్ చేశాడు. అలాగే ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇటు దీప్తి సునయన మాత్రం పనిని పక్కనపెట్టేసి జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తోంది. మధ్యమధ్యలో గుళ్లుగోపురాలు కూడా తిరుగుతోంది. అయితే ఆమె ఏ ప్రాజెక్టులు చేయకపోయినా తనపై ప్రేమను అలాగే కొనసాగిస్తున్న అభిమానులకు తాజాగా కృతజ్ఞతలు తెలిపిందీ బ్యూటీ.ఏం చేశానని ఇంత ప్రేమ?'గత 10 ఏళ్లుగా మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను ఎలా ఉన్నా ప్రేమించారు. పిచ్చిగా ప్రవర్తించినా ఇష్టపడ్డారు. ప్రతిదానిలో నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను పొందేందుకు నేను ఏం చేశానో నాకే తెలీదు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిజం చెప్పనా.. నాకు పని చేయడానికి ఒంట్లో శక్తి లేదు. రెండేళ్లుగా విశ్రాంతి తీసుకోవడంలోనే గడిపేశాను. అయినా మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వర్క్లో బిజీ అవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరిచ్చే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది.ఆ ప్రయత్నంలోనే ఉన్నా..నేను ఎందుకిలా డీలా పడిపోయానో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేను మళ్లీ పూర్తి ఉత్సాహంతో మీ ముందు నిలబడతాను. నేను ఏ పనీ చేయకపోయినా సరే.. నన్ను ప్రేమిస్తున్నందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు, నాకోసం నిలబడినందుకు థాంక్యూ సో మచ్' అని దీప్తి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.చదవండి: వరుస కష్టాలు.. నాకే ఎందుకిలా జరుగుతోంది?: శ్రీజ కొణిదెల -
‘బిగ్బాస్ 10’ వచ్చేస్తోంది.. పాటతో ప్రకటన..వీడియో వైరల్!
‘బిగ్బాస్’ అభిమానులకు గుడ్ న్యూస్. బిగ్బాస్ 10వ సీజన్ రాబోతుంది. ఇప్పటికే 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. త్వరలోనే 10వ సీజన్తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు నిర్వాహకులు. 10వ సీజన్కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్గా వ్యవహరించబోతున్నాడు.‘బిగ్బాస్.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం’అంటూ నాగార్జున చెప్పే పవర్ఫుల్ డైలాగ్తో స్పెషల్ వీడియో ప్రారంభం అవుతుంది. బిగ్బాస్పై రూపొందించిన ఓ ప్రత్యేక పాటతో వీడియో ఆద్యంతం అలరించేలా సాగుతుంది. చెదరని ప్రస్థానం..తరగని అభిమానం బిగ్బాస్ సొంతం. ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్కి సాక్ష్యం కాబోతుంది. ఈ సారి మీరు చూడబోయేది బిగ్బాస్ దశావతారం’ అంటూ సీజన్ 10పై ఆసక్తిని పెంచేశాడు నాగార్జున. ఇక ప్రతి సీజన్ ఏదో ఒక క్యాప్షన్తో వచ్చే బిగ్బాస్.. ఈ సారి కూడా ‘ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అనే క్యాప్షన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే షో ఎప్పుడు ప్రారంభం అవుతుంది? కంటెస్టెంట్స్ ఎవరనే విషయాలను మాత్రం ప్రకటించలేదు. -
నా గర్భస్రావానికి సీఎం విజయ్నే కారణం: బుల్లితెర నటి
తమిళనాడులో జల్లికట్టు ఆందోళన ద్వారా పాపులర్ అయిన బుల్లితెర నటి జూలీకి హీరో విజయ్ అంటే గిట్టదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఆయన్ను విమర్శిస్తూ ప్రచారం చేసింది. విజయ్కు వ్యతిరేకంగా చెన్నై మెరీనా బీచ్లో అనుమతి లేకుండా నిరసన తెలిపి వివాదంలో చిక్కుకుంది. అయితే దళపతి అభిమానులు, తమిళ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తల ట్రోలింగ్ వల్ల తాను నరకయాతన అనుభవించానంటోంది జూలీ. ట్రోలింగ్..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూలీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నాను. నన్ను దారుణంగా విమర్శించిన కొందరి పేర్ల వివరాలతో సహా మార్చిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. అప్పుడు ఎన్నికల సమయం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు చూస్తే రివర్స్లో నాపైనే రూ.15 లక్షల కిడ్నీ స్కామ్ ఆరోపణలు చేస్తున్నారు. నన్ను ఏదో ఒక కేసులో ఇరికించాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.గర్భస్రావానికి ఆయనే కారణంమరోవైపు వీళ్ల ట్రోలింగ్ వల్ల నాకు మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. కడుపులో బిడ్డను కూడా కోల్పోయాను. నా గర్భస్రావానికి సీఎం విజయ్ అన్నయే కారణం. ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకపోయినా పరోక్షంగా ఆయన హస్తం ఉంది. నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నవారిని ఒక్క మాట చెప్పి అదుపు చేసుంటే నేను నా బిడ్డను కోల్పోయేదాన్నే కాదు.ప్రజలపై దృష్టి పెట్టండినన్ను, నా భర్తను అనరాని మాటలంటున్నారు. మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక మహిళ జీవితాన్నే నాశనం చేస్తారా? సోషల్ మీడియా వల్లే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడని అంటున్నారు కదా.. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై దాడులు చేయించడానికి బదులుగా ప్రజల కోసం ఏం చేయాలన్నదానిపై దృష్టి పెడితే బాగుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది అనైతికంజూలీ కామెంట్స్పై నటి అంబిక అసహనం వ్యక్తం చేసింది. ప్రెగ్నెన్సీ విషయంలో నీకు జరిగినదానికి చింతిస్తున్నాను. కానీ నువ్వు చెప్పేది అనైతికంగా ఉంది. నీ గర్భస్రావానికి సీఎం విజయ్ ఎలా కారణమవుతాడు? ముందు నీ మాట తీరు మార్చుకో.. సీఎం, పీఎసం స్థానంలో ఉన్నవారిని ఎలా గౌరవించాలో నేర్చుకో అని చురకలంటించింది.బుల్లితెరకాగా జూలీ తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొంది. ఆ తర్వాత బిగ్బాస్ అల్టిమేట్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. ఒడి విలయదు పాప అనే షోకి వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. నాన్ సిరితల్ చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ ఏడాది జనవరిలో మొహ్మద్ ఇక్రీమ్ను పెళ్లాడింది.చదవండి: హీరోయిన్ కాజల్కు ఎంత కష్టమొచ్చింది? -
తండ్రయిన అవినాష్.. అప్పుడు రోడ్డుపై పిచ్చోడిలా.. ఇప్పుడేమో!
కమెడియన్ ముక్కు అవినాష్ తండ్రయ్యాడు. ఏడాది కిందటే తండ్రయినప్పటికీ చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు బాబు పుట్టిన సంగతిని పన్నెండు నెలలుగా దాచి ఇప్పుడు బయటకు ప్రకటించి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. గతేడాది మే 14న తనకు కొడుకు పుట్టాడని, అతడికి అద్వైత్ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. కొడుకు మొదటి పుట్టినరోజును ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేయగా.. ఈ వేడుకకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.2021లో పెళ్లిఅయితే అవినాష్ తన కొడుకును వెంటనే పరిచయం చేయకపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది. ఇతడు 2021 నవంబర్లో అనూజను పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ 2023లో గుడ్న్యూస్ చెప్పారు. బేబీ బంప్ ఫోటోలు, మెటర్నటీ షూట్, సీమంతం వీడియోలతో తెగ సందడి చేశారు. కానీ, ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. 2024 ప్రారంభంలో అబార్షన్ అయిందని చేదువార్త చెప్పాడు. విషాదంతెల్లవారితే డెలివరీ అనగా అనూజ కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. ఏదో ఒకటి చేసి బిడ్డను బతికించమని డాక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్నాడు అవినాష్. ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయాక తిరిగి బతికించడం ఆ దేవుడి వల్ల కూడా కాదని వైద్యులు చేతులెత్తేశారు. ఊహించని ఈ విషాదానికి పిచ్చోడైపోయాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు రోడ్డుపై ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. అందుకే ఇంత సీక్రెట్2.75 కిలోల బరువుతో పుట్టిన బిడ్డలో ప్రాణం లేకపోవడం మా ఇద్దర్నీ ఎంతో కుంగదీసిందంటూ ఓ ఇంటర్వ్యూలో అవినాష్ తన బాధను పంచుకున్నాడు. అందుకే అనూజ ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఎవరితోనూ ఆ వార్తను పంచుకోలేదు. కనీసం కొడుకు పుట్టాక కూడా ఎవరికీ చెప్పదల్చుకోలేదు. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: చిన్న వయసులోనే పెళ్లి.. గర్భస్రావం.. హీరోను వదిలేస్తున్నా: సింగర్ -
రూ. 20 కోట్ల లగ్జరీ ఇల్లు.. నాది కాదు: యాంకర్ స్రవంతి
యూట్యూబ్ యాంకర్గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు.. తన చురుకైన మాటలు, అందంతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది. బిగ్బాస్, యాంకర్, నటి, ఇలా పలు రంగాల్లో దూసుకుపోతూ సోషల్ మీడియాలో తరుచుగా ట్రెండింగ్లో నిలుస్తోంది. యాంకర్ సుమ, అనసూయ, శ్రీముఖిల మాదిరిగానే తనకంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకుని ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని కదిరికి చెందిన స్రవంతి మధ్యతరగతి అమ్మాయే.. కానీ, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె భారీగా సంపాధిస్తుందని, రూ. 20 కోట్లతో హైదరాబాద్లో ఒక లగ్జరీ ఇల్లు కూడా కొనేసిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది.గోదారి గట్టుపైన సినిమా కార్యక్రమంలో యాంకర్ స్రవంతిని నటుడు సుదర్శన్ ఒక ప్రశ్న అడిగారు. 'మీకు రూ. 20 కోట్ల విల్లా ఉందని వార్తలు వస్తున్నాయి నిజమేనా..?' అన్నారు. అందుకు ఆమె కూడా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. తనకు లగ్జరీ విల్లా ఉందనే విషయం కేవలం రూమర్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. కొందరు ఇలాంటి ప్రచారాలు చేయడం సహజమేనని ఆమె చెప్పింది. భవిష్యత్లో మంచి ఇల్లు కొనాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుందని ఆమె తెలిపింది. పుష్ప -1 రిలీజ్ సమయంలో రాయలసీమ స్లాంగ్తో అల్లు అర్జున్ ఇంటర్వ్యూ చేసి స్రవంతి పాపులర్ అయింది. అలా ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. సున్నా నుంచి మొదలు పెట్టిన స్రవంతి ప్రయాణం ఎన్నో కష్టాలను దాటుకుని మంచి స్థానానికి చేరుకుందని తన గురించి తెలిసిన వారు బహిరంగంగానే చెబుతుంటారు.యాంకర్ స్రవంతి ఆర్థిక స్థితిపై ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నేటి ప్రముఖ యాంకర్లు, డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్లందరూ కూడా సినీ నటులతో సమానంగా సంపాదిస్తున్నారనే అభిప్రాయానికి నెటిజన్లు రావడమే ఇలాంటి రూమర్స్కు కారణమని చెప్పవచ్చు. ఆపై యాంకర్లు తరచుగా ప్రయాణాలు చేస్తూ, ఆన్లైన్లో ఆడంబరమైన జీవితాన్ని ప్రదర్శించడం వల్లే ఇలాంటి అభిప్రాయానికి కారణం అవుతుంది. అసలు వాస్తవం మరోలా ఉంటుందని పలు సందర్భాల్లొ వారు చెప్పిన విషయం తెలిసిందే. తమ కాస్ట్యూమ్స్, మేకప్ ఖర్చులకే సగం రెమ్యునరేషన్ పోతుందని చాలామంది చెబుతుంటారు. View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) -
హైకోర్టుకు అషురెడ్డి
బిగ్బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.. పెళ్లి పేరుతో తన కుమారుడిని రూ. 9.35 కోట్ల వరకు మోసం చేసిందంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వై.వి. ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టును అషురెడ్డి ఆశ్రయించారు. తనపై నమోదైన FIRను కొట్టివేయాలని ఆమె కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అసలు వాస్తవాలను దాచిపెట్టి తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు.ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి రెండురోజుల క్రితం అషురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018 నుండి తన కుమారుడితో అషురెడ్డికి పరిచయం ఉందని పిర్యాదులో పేర్కొన్నారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుదపాలుగా రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ధర్మేంద్ర పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, అషురెడ్డి తండ్రి కూడా ఈ కేసు గురించి మాట్లాడారు. తన కూతురు ఇలాంటి పనిచేయదని ఆయన చెప్పుకొచ్చారు. -
రూ. 9 కోట్ల మోసం.. ఫోటోలతో స్పందించిన అషురెడ్డి
బిగ్బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డి తనపై నమోదైన కేసు గురించి సోషల్మీడియా ద్వారా స్పందించింది. తన ప్రమేయం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇన్స్టాగ్రామ్లో ఆమె ఒక పోస్ట్ చేసింది. ఆపై ఆమె పలు ఫోటోలను షేర్ చేసింది. కొద్దిరోజుల క్రితం ఆమె కొల్హాపూర్ లక్ష్మీదేవి క్షేత్రం దర్శించుకున్న దృశ్యాలను పంచుకుంది. అయితే, అందులో అమ్మవారికి సమర్పించిందేకు కొబ్బరికాయ, పూలు, పసుపు, కుంకుమ, మెట్టెలు, తాళి వంటి వస్తువులు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: నటి అషురెడ్డిపై కేసు నమోదు.. పెళ్లి పేరుతో రూ. 9 కోట్లు మోసం)సినీ నటి అషురెడ్డిపై హైదరాబాద్లో కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్ షేక్పేట్కు చెందిన వై.వి.ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన నుంచి రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా తాను పని చేస్తున్నానని చెప్పిన ధర్మేంద్ర.. 2018లో భారత్కు వచ్చిన సమయంలో అషురెడ్డి పరిచయమైనట్లు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
నటి అషురెడ్డిపై కేసు నమోదు.. పెళ్లి పేరుతో రూ. 9 కోట్లు మోసం
బిగ్బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డి(అశ్విని రెడ్డి)పై హైదరాబాద్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్ షేక్పేట్కు చెందిన వై.వి.ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన నుంచి రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా తాను పని చేస్తున్నానని చెప్పిన ధర్మేంద్ర.. 2018లో భారత్కు వచ్చిన సమయంలో అషురెడ్డి పరిచయమైనట్లు పేర్కొన్నారు.పోలీసులతో ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ' అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా ఛాన్స్లో కోసం హైదాబాద్ వచ్చినట్లు అషురెడ్డి చెప్పింది. మా అబ్బాయికి పరిచయం అయిన కొద్దిరోజుల్లోనే ప్రేమిస్తున్నాని చెప్పి పెళ్లి చేసుకుందామని నమ్మించింది. ఈ క్రమంలో మా అబ్బాయిని డబ్బులు అడగటం మొదలు పెట్టింది. బంగారం, కారు పలు ఆస్తులను కొనుగోలు చేయించుకుని తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకుంది. అయితే, కొద్దిరోజుల క్రితం ధర్మేంద్రను కలిశారు. అషురెడ్డితో పెళ్లి సంబంధాన్ని ఖాయం చేస్తున్నామని ముహూర్తం కోసం పూజారిని కూడా పిలిపించి హడావుడి చేశారు. కానీ, వెంటనే ముఖం చాటేసి పెళ్లికి నిరాకరించారు. గతేడాది వరకు నా కుమారుడితో ఆమె టచ్లోనే ఉంది. ఇప్పటి వరకు రూ.9.35 కోట్ల వరకు నగదు, సుమారు 5 కిలోల బంగారం, కారు, ఫ్లాట్ కొనుగోలు చేసి తన పేరుతో రాయించుకుంది. ఆమెతో పాటు తన సోదరి కూడా రూ. 50 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు.' అని ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
300 సినిమాలు చేశా.. నాలో ఉన్న లోపం ఏంటి?.. : సుమన్ శెట్టి ఎమోషనల్
ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ సుమన్ శెట్టి. తొలి సినిమా ‘జయం’తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అందులో ‘అధ్యక్షా..’ అంటూ సుమన్ చేసే కామెడీకి తెలుగు ఆడియన్స్ పలగబడి నవ్వారు. జయం తర్వాత సుమన్కి వరుస అవకాశాలు వచ్చాయి. ఒకనొక దశలో ఆయన డేట్స్ కూడా దొరకనంత బిజీ కమెడియన్ అయిపోయాడు. దాదాపు 300పైగా సినిమాల్లో నటించిన సుమన్.. సడెన్గా వెండితెరకు దూరం అయ్యాడు. కొన్నాళ్ల పాటు ఆయన పేరు ఇండస్ట్రీ మరిచిపోయింది. బిగ్బాస్ షోతో మళ్లీ సుమన్ శెట్టి ఫామ్లోకి వచ్చాడు. బిగ్బాస్ 9వ సీజన్లో పాల్గొన్న ఆయన..తనదైన ఆటతీరుతో దాదాపు 14 వారాల పాటు హౌస్లో ఆకట్టుకున్నాడు. ఫినాలేకు ఒక్కవారం ముందు ఎలిమేట్ అయ్యాడు. బిగ్బాస్ తర్వాత ఆయన కెరీర్ పరంగా బిజీ అయిపోతారనుకుంటే.. అదీ జరగలేదు. పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. 300పైగా సినిమాలతో పాటు నంది అవార్డు కూడా దక్కించుకున్న తనకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అర్ధం కావట్లేదని సుమన్ శెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒకప్పుడు నేను 30 రోజులూ షూటింగ్లోనే ఉండేవాడిని.300పైగా సినిమాలు చేశా. నంది అవార్డు కూడా వచ్చింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసేవాడిని. అయినా కూడా ఇప్పుడు నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదో అర్థం కావడం లేదు. ప్రాణం పెట్టి పని చేస్తా. నాలో ఉన్న లోపం ఏంటి? నటన విషయంలో ఎక్కడైనా తాను తగ్గిపోయానా? అనే సందేహాలు కూడా తనను వెంటాడుతున్నాయి’అని సుమన్ ఎమోషనల్ అయ్యాడు. -
బిగ్ బాస్ చీకటి నిజం.. ఫోటోలు షేర్ చేసి రూ. 2కోట్లు డిమాండ్
కొద్దిరోజుల క్రితమే బిగ్ బాస్ మరాఠీ 6 సీజన్ ముగిసింది. విన్నర్గా సినీ నటి తన్వీ కొల్టే నిలిచారు. అయితే, ఈ సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొన్న మోడల్, నటి సోనాలి రౌత్ బిగ్ బాస్ టీమ్కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని కోరినట్లు సమాచారం. షోలో ఉన్న సమయంలో తాను తీవ్రమైన మానసిక, శారీరక క్షోభకు గురయ్యానని ఆమె ఆరోపించారు. అక్కడి వాతావరణం కారణంగా తనకు చర్మ సంబంధిత వ్యాధి (తామర) సోకిందని తెలిపింది. ఈ కారణంగానే తాను రెండోవారంలోనే షో నుండి నిష్క్రమించానని తెలిపింది. షో నుంచి తాను బటయకు వచ్చి సుమారు 3నెలలు అవుతున్నా సరే ఆ సమస్య తనను ఇప్పటికీ వేధిస్తూనే ఉందని ఆమె పేర్కొంది.మరాఠి నటి సోనాలి రౌత్ ఒక వీడియోను పంచుకుంటూ.. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుకొచ్చింది. "రియాలిటీ షో అంటే మా ప్రాణాలను పణంగా పెట్టడం కాదు. నిర్వాహుకులపై నమ్మకంతోనే బిగ్ బాస్ మరాఠీ 6 లోకి నేను ప్రవేశించాను. కానీ, అక్కడ పరిస్థితులు మరోలా ఉన్నాయి. మమ్మల్ని అపరిశుభ్రత వాతావరణంలోకి నెట్టారు. హౌస్లో శుభ్రత లేకపోవడం వల్ల నాకు తామర వంటి అంటువ్యాధి సోకింది. వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు ఉన్నాయి. వాటితోనే కలిసి జీవించాం. ఆ పీడకల గురించి తలచుకుంటే భయమేస్తుంది. ఇకనైనా బిగ్బాస్ టీమ్ నుంచి జవాబుదారీతనం రావాలి. మా ఆడంబరాల వెనుక ఆకలి, నిద్రలేమి, సున్నా పరిశుభ్రత అనే చీకటి నిజం ఉంది. ఇతరులు వాడిన టవల్స్, రేజర్ల వంటి ప్రాథమిక వస్తువులను కూడా షేర్ చేసుకోవాల్సి వచ్చింది. హౌస్లో టవల్స్, బెడ్ షీట్లు, నాప్కిన్ల కొరత కారణంగా అపరిశుభ్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కంటెస్టెంట్స్ ఒకరి టవల్స్, బెడ్ షీట్లను మరొకరు వాడుకునేవారు, వాటిని రోజుల తరబడి మార్చేవారు కాదు. దీని వల్ల నాకు చర్మ వ్యాధికి దారితీసింది. దీంతో షో నుండి రెండో వారంలోనే నేను బయటకు వచ్చేశాను. ఇప్పటికీ కూడా ఆ సమస్య నన్ను వేధిస్తూనే ఉంది. వీకెండ్ కా వార్ సమయంలో ఎండెమోల్ ప్రొడక్షన్ నుండి వచ్చిన ఆహారంలో బొద్దింకలు కూడా కనిపించాయి. బిగ్బాస్ షోలో పనిష్మెంట్ పేరుతో 17 మంది కంటెస్టెంట్స్కు కేవలం ఒకే వాష్రూమ్ను ఉపయోగించుకోమన్నారు. అందులోనే సిగరెట్స్ తాగడం ఆపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం జరిగింది. మిగిలిపోయిన ఆహారం, చికెన్, గుడ్డు పెంకులు ఓపెన్ ప్లేస్లో వేయడంతో ఎలుకలు బెడదు ఎక్కవైంది. ఇలా పలు కారణాలతో నేను అనారోగ్యానికి గురైయాను. నా పరిస్థితి విషమించడం వల్లే హౌస్ నుంచి రెండోవారంలోనే వచ్చేశాను. నేను బిగ్బాస్ టీమ్ను నమ్మాను. కానీ, నా ఆరోగ్యం, శ్రేయస్సును దెబ్బతీశారు. ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాను.' అని ఆమె అన్నారు. అయితే,సోనాలి ఆరోపణలపై మేకర్స్ ఇంకా స్పందించలేదు.సోనాలి రౌత్.. ఒక మోడల్గా బాలీవుడ్లో గుర్తింపు పొందింది. ఆమె హిందీ బిగ్బాస్ (సీజన్ 8)లో పాల్గొంది. ఈ షో ద్వారా ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. 2010లో కింగ్ఫిషర్ క్యాలెండర్ గర్ల్ గా గుర్తింపు పొందింది. మోడలింగ్తో పాటు కొన్ని టీవీ షోలలో కూడా కనిపించిన ఆమె పలు హిందీ సినిమాల్లో కూడా నటించింది. View this post on Instagram A post shared by Sonali Raut (@isonaliraut) -
నీ పెళ్లాన్ని సన్నగా చేయ్ అని ట్రోలింగ్.. ఆ వ్యాధి వల్లే..: విశ్వ
నటుడు విశ్వ సీరియల్స్లో, సినిమాల్లో యాక్ట్ చేశాడు. తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలం క్రితమే విశ్వ ఫిట్నెస్ క్లబ్ ఓపెన్ చేసి జిమ్ ట్రైనర్గానూ మారాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టాడు. విశ్వ మాట్లాడుతూ.. 'నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 24 ఏళ్లవుతోంది. 10వ తరగతి అయిపోగానే పరిశ్రమలో అడుగుపెట్టాను. పెళ్లికోసం, విద్యార్థి వంటి పలు చిత్రాల్లో నటించాను. తర్వాత సీరియల్స్ చేశాను. తొక్కేశారుకొంతకాలంగా సీరియల్స్కు దూరంగా ఉన్నాను. ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నాను. అయితే ఒకానొక సమయంలో నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేశారు. అప్పుడు నా తమ్ముడి సంపాదనపైనే బతికాను. ఆరునెలలపాటు వాడే ఇంటిని నడిపించాడు. అలాగే నాన్నకు వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం. ఎప్పుడైనా పనివాళ్లు రాకపోతే నేను గిన్నెలు కడిగేవాడిని. రేషన్ బియ్యం తిన్న రోజులున్నాయి అన్నాడు.నా అభిమానిశ్రద్ధతో తన లవ్స్టోరీ గురించి చెప్తూ.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో శ్రద్ధ నన్ను చూసి ఇష్టపడింది. అప్పటికి నేను బ్రేకప్ బాధలో ఉన్నాను. నిజమైన ప్రేమ లేదని తెగ బాధపడిపోతూ ఉన్నాను. ఆ సమయంలో శ్రద్ధ మెసేజ్ చేయడంతో టైంపాస్ చేద్దామని నా నెంబర్ ఇచ్చాను. తనకు చాలా కనెక్ట్ అయిపోయాను. వారం రోజులకే తను ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పింది. వాళ్లు మొదట ఒప్పుకోలేదు. నా గురించి పూర్తిగా ఆరా తీశాకే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ట్రోల్స్ఆమెను దేవుడు నాకోసం పంపిన ఏంజెల్ అని భావిస్తాను. విశ్వ ఫిట్నెస్ క్లబ్లో శ్రద్ధ డైట్ ప్లాన్, ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటుంది. నేనేమో ఎక్సర్సైజ్ చేయిస్తాను. అయితే మేమిద్దరం కలిసి సోషల్ మీడియాలో ఏదైనా వీడియో పెడితే చాలు.. ముందు నీ పెళ్లాన్ని సన్నగా చేయు, వేరేవాళ్లకు నీతులు చెప్పడం కాదు, ఇంట్లో సక్కగ చూసుకో అని ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్లు అన్నదాంట్లో తప్పు లేదనుకోండి.ఆ వ్యాధి వల్లే..అయితే రెండోసారి కొడుకు పుట్టిన తర్వాత హార్మోన్ల అసమతుల్యత కారణంగా శ్రద్ధ విపరీతంగా బరువు పెరిగిపోయింది. కొన్ని నెలలకు ఎక్సర్సైజ్ మొదలుపెట్టాం. కానీ తనకు కార్పెల్ టన్నెల్ అనే అరుదైన వ్యాధి వచ్చింది. దానివల్ల చేతులు బలహీనంగా మారిపోయాయి. పిల్లాడికి షర్ట్ బటన్ కూడా పెట్టేంత శక్తి లేకపోయింది. అంటే.. తన పనులు తను చేసుకోలేదు. ఆ వ్యాధి వల్ల ఎక్సర్సైజ్ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ కోలుకుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఎక్సర్సైజ్ మొదలుపెట్టింది' అని విశ్వ చెప్పుకొచ్చాడు.చదవండి: లోక సినిమా.. నన్ను మోసం చేశారు: మమ్ముట్టి -
నేను మంచివాళ్లకే మంచివాడిని, నాలోని రాక్షసుడు బయటకు వస్తే..!
డిమాన్ పవన్.. బిగ్బాస్ షోలో ఆటతో, మాట తీరుతో ఆకట్టుకున్నాడు. రీతూతో లవ్ ట్రాక్ ఒక్కటే అతడికి మైనస్ అయింది తప్ప టాస్కుల్లో విశ్వరూపం చూపించేవాడు. కానీ, ఎంత చేసినా అండర్రేటెడ్ కంటెస్టెంట్గానే మిగిలిపోయాడు. తన తండ్రికి క్యాన్సర్ ఉన్నప్పటికీ ఎప్పుడూ దాని గురించి చెప్పి సింపతీ పొందాలని ప్రయత్నించలేదు. కానీ ఫ్యామిలీ ఎపిసోడ్లో కన్నతండ్రిని స్టేజీపై చూసి మాత్రం కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.ఇటీవలే తండ్రి మరణంబిగ్బాస్ 9 ఫైనల్స్లోనూ తండ్రి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం రూ.15 లక్షల సూట్కేస్ తీసుకుని సెకండ్ రన్నరప్ స్థానంలో ఉండగా బయటకు వచ్చేశాడు. అతడొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. కొద్దిరోజుల క్రితమే పవన్ తండ్రి క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారు. ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పవన్.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. టీవీ షోలలో పాల్గొంటున్నాడు. ట్రోలింగ్కు కౌంటర్అయితే కన్నతండ్రిని కోల్పోయిన బాధే కనిపించడం లేదు, సంతోషంగా నవ్వుతూ పోస్టులు పెడుతున్నాడంటూ పవన్ను ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్పై పవన్ స్పందించాడు. చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయినా నేను మౌనంగానే ఉన్నాను. నా తప్పు లేకపోయినా సరే కొంతవరకు నెగిటివిటీని, ద్వేషాన్ని నేను భరించగలను. కానీ నావాళ్లను ఇబ్బందిపెడితే మాత్రం నాలోని డిమాన్ (రాక్షసుడు)ని చూస్తారు. వాడిని మీరు తట్టుకోలేరు.మంచివాళ్లకే మంచివాడినిచాలామంది తెలియకుండానే ఏదో ఒక పొరపాటు చేస్తారు. కానీ, తర్వాతైనా తమ తెప్పు తెలుసుకుని మారతారని భావిస్తున్నాను. అందుకే చాలామటుకు అన్నింటినీ క్షమించేసి, నేను ప్రశాంతంగా ఉంటాను. నేను మంచివాళ్లకే మంచివాడిని.. ఇప్పటికైనా ఈ ట్రోలింగ్ను ఆపేస్తారని భావిస్తున్నాను అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన అభిమానులు.. మీరేంటో మాకు తెలుసు.. ట్రోలర్స్ను పట్టించుకోవద్దని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Uppala Pavan Kumar (@demon_pavan) చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలివే! -
అతడి నుంచి తప్పించుకునేందుకు రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..: నటి
లైంగిక వేధింపుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు రెండో అంతస్తు నుంచి దూకానంటోంది బుల్లితెర నటి, హిందీ బిగ్బాస్ 13వ కంటెస్టెంట్ ఆర్తి సింగ్. అప్పుడు తన వయసు కేవలం 13 ఏళ్లేనని చెప్తోంది. చిన్న వయసులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆర్తి సింగ్ మాట్లాడుతూ.. అప్పుడు నాకు 13 ఏళ్లు. మా ఇంట్లో పనిచేసే వ్యక్తి నాపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. చేతులు జోడించి బతిమాలినా..నేను మంచి నిద్రలో ఉండగా నా గదిలోకి నడుచుకుంటూ వచ్చాడు. నా గదిలోకి ఎందుకు వచ్చావని గొడవపడ్డాను. నాపైకి వస్తుంటే నువ్వు నా అన్నయ్యవి కదా, ప్లీజ్ వెళ్లిపో అని రెండు చేతులు జోడించి వేడుకున్నాను. అతడు నా మాట వినలేదు. నేను బయట వరండా వైపు చూస్తే తలుపులు తాళం వేసి ఉన్నాయి. అమ్మ పొలానికి వెళ్లింది, ఇంట్లో ఒంటరిగా ఉన్నాను.రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..అక్కడ వాతావరణం భయానకంగా మారింది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. నేను వెంటనే అతడి నుంచి తప్పించుకుని రెండో అంతస్తుకు పరిగెత్తి అక్కడి నుంచి కిందకు దూకేశాను. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కాబట్టే ఆ రోజు నాపై ఏ అఘాయిత్యం జరగకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను అంది. ఆర్తి సింగ్.. గృహస్తి, పరిచయ్, ఉత్తరన్, దేవోన్ కే దేవ్.. మహాదేవ్, వారిస్, విక్రమ్ బేతాళ్కీ రహస్య గాథ వంటి పలు హిందీ సీరియల్స్లో నటించింది. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లో నాలుగో రన్నరప్గా నిలిచింది.చదవండి: పెళ్లయిన నెలకే ముగ్గురమయ్యాం అంటూ రష్మిక పోస్ట్ -
'నీ ముఖానికి గోల్డ్ చైన్ ఉందా'.. తట్టుకోలేకపోయా: నటి
రంగుల ప్రపంచంలో రాణించాలని ఎంతోమందికి ఉంటుంది. కానీ, కొందరే ఎన్నో కష్టాలను అధిగమించి, ముళ్లదారిపై నడిచి చివరకు అవకాశాలు సాధిస్తారు. నువ్వు యాక్టరేంటి? నీకంత సీన్ లేదు? అని హేళన చేసేవారికి సీరియల్, సినిమా ఛాన్సులతోనే తగిన బుద్ధి చెప్తారు. అలా తాను కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు పడ్డానంటోంది కన్నడ నటి, బిగ్బాస్ బ్యూటీ రాశిక శెట్టి.సూటిపోటి మాటలురాశిక మాట్లాడుతూ.. నా జర్నీ ప్రారంభంలో ఆడిషన్స్ చాలా కష్టంగా ఉండేవి. ప్రోత్సహించడం పక్కనపెట్టి సూటిపోటి మాటలతో విమర్శలు ఎక్కుపెట్టేవారు. చాలామాటలనేవారు. అవకాశాలిచ్చేవారు కాదు. ఒకసారైతే.. నీ ముఖానికి నిజమైన బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా? అని ముఖం మీదే అన్నారు. చాలా బాధపడ్డాను, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాను.ఆ నమ్మకంతోనే..నావల్ల అవుతుందా? అని నాలో నేనే మథనపడ్డాను. అవకాశాలు రాకపోయేవి, వచ్చిన ఒకటీరెండు కూడా చివరి నిమిషంలో చేజారేవి. అప్పుడు మరింత కుంగిపోయాను. అయినా సరే వెనకడుగు వేయాలనుకోలేదు. నాకంటూ ఓ రోజు వస్తుందని ఎదురు చూశాను. ఆ నమ్మకం, ఆశతోనే ఇండస్ట్రీలో అడుగులు వేశాను అని చెప్పుకొచ్చింది. రాశిక శెట్టి.. కన్నడ బిగ్బాస్ 12వ సీజన్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సందేహం చిత్రంలో యాక్ట్ చేసింది.చదవండి: రామాయణ సినిమా రిజెక్ట్ చేశా: రణ్బీర్ కపూర్ -
నేనేదో అనుకున్నా.. పెళ్లి అంత ఈజీగా జరగలేదు: పునర్నవి
జీవితంలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అని చెప్పుకునేవి కొన్ని ఉంటాయి. అలాంటి జాబితాలో పెళ్లి మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పెళ్లిని తాను సింపుల్గా చేసుకోవాలనుకున్నానని, కానీ రెండు కుటుంబాల కలయికతో ఎంతో ప్రత్యేకంగా జరిగిందంటోంది బిగ్బాస్ బ్యూటీ, నటి పునర్నవి భూపాలం. మార్చి 21న ప్రియుడు, ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మను పెళ్లాడింది పునర్నవి. తాజాగా ఆ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.నేనేదో అనుకున్నా..వివాహం అంటే సింపుల్గా, సైలెంట్గా అయిపోవాలి.. అత్యంత ఆత్మీయుల మధ్యలో ఈ తంతు పూర్తయిపోవాలని ఒకప్పుడు అనుకునేదాన్ని. కానీ, ఇక్కడ మా ప్రేమ మా మనసుల్ని మాత్రమే కాదు, రెండు కుటుంబాల్ని కలిపింది. వారి ఆచారాలు, సాంప్రదాయాలు, ప్రేమానురాగాల మధ్య సాదాసీదాగా కంటే భిన్నంగా, ప్రత్యేకంగా వివాహం జరిగింది.పెళ్లంటే ఏంటి?అయినా కూడా నావరకు ఈ పెళ్లంటే ఏంటి? అని పదేపదే ఆలోచిస్తూనే ఉన్నాను. ఇది కేవలం ఒక ఆర్భాటం కాదు, ప్రపంచమంతా చూసేలా జీవితంలో ఒకసారి చేసుకునే వేడుక మాత్రమే కాదు, ఇది మన అంతర్గతంగా జరిగే ఒక అద్భుత అనుభవం. స్త్రీ, పురుష శక్తుల కలయిక.. శివుడు, శక్తి (అమ్మవారు) మనలోనూ, మన మధ్యలోనూ ఉన్న అనుభూతి. కొన్నిసార్లు బయట శబ్ధాలు నా గొంతుకంటే పెద్దగా అనిపించాయి. తెలియని ప్రశాంతతకానీ, అతడిని చూసిన ప్రతిసారి ఏదో తెలియని ప్రశాంతత. సడన్గా ఆ శబ్ధం వినిపించకపోయేది. నేను చేయగలను అనుకున్నాను. అతడిని నా భాగస్వామిగా ఎంచుకుంటున్నాను అని నాకు నేను మరోసారి చెప్పుకున్నప్పుడు మనసు శాంతించింది. ఇద్దరం కలిసి నడుద్దాం.. అలాగే ఒకరికొకరం ఎదగడానికి అవకాశం ఇద్దాం. మన మధ్యలోని అనుబంధాన్ని కొనసాగిద్దాం.. ఇదే నాకు అన్నింటికన్నా ఎంతో ముఖ్యమైనది.పెళ్లి సులభంగా జరగలేదుసమయం వచ్చింది కాబట్టి మా పెళ్లి జరగలేదు, నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టే ఈ వేడుక జరిగింది. నేను ఊహించినంత సులభంగా ఈ పెళ్లి జరగలేదు. కానీ, ఎంతో నిజాయితీగా, అందంగా, అర్థవంతంగా వివాహం జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొన్న పునర్నవి.. ఉయ్యాల జంపాల, పిట్టగోడ, సైకిల్ వంటి పలు చిత్రాల్లో నటించింది.చదవండి: డోర్ తీసి చీర మార్చుకో.. స్టార్ నిర్మాత చెంప చెళ్లుమనిపించా: నటి -
నా బిడ్డను ఎవరూ ముద్దుపెట్టుకోవద్దు.. ఇది నా రూల్: మెరీనా
నటి, బిగ్బాస్ ఫేం మెరీనా అబ్రహం గతేడాది తల్లిగా ప్రమోషన్ పొందింది. పెళ్లయిన 8 ఏళ్లకు పేరెంట్స్ కావడంతో మెరీనా- రోహిత్ జంట ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది జనవరిలో పాపకు మొదటి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిపారు. అయితే తన బిడ్డపై ప్రేమను కురిపించడం వరకు ఓకే కానీ అతిగా ముద్దు చేయడం నచ్చడం లేదంటోంది మెరీనా. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ షేర్ చేసింది.ఇదంతా డ్రామా కాదునా పాప కోసం నేను కొన్ని హద్దులు గీసుకున్నాను, దయచేసి వాటిని గౌరవిస్తారనుకుంటున్నాను. తనకు చాక్లెట్లు ఇవ్వొద్దని చెప్పానంటే ఎవరూ ఇవ్వడానికి వీల్లేదు. నా పాపను ముద్దు పెట్టుకోకండి అని చెప్పినప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండండి. ఇదంతా డ్రామా కాదు, యాటిట్యూడ్ అంతకన్నా కాదు.. ఇది పిల్లల్ని పెంచే పద్ధతి. ఏదో ఒకసారి అలా చేస్తే ఏమవుతుంది? అందులో అంత ప్రమాదకరం ఏముందని మీరు అనుకోవచ్చు. .నేనొకటే చెప్తున్నా..మీరంతవరకే ఆలోచించారు. కానీ నేను దాని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. తను అనారోగ్యానికి గురైతే బెంగపడేది నేను.. జాగ్రత్తగా చూసుకునేది నేను. కాబట్టి నేనొకటే చెప్తున్నా.. నా బిడ్డను మీరంతగా ఇష్టపడితే, నా మాటల్ని గౌరవించండి, నాకు సహకరించండి, నేను పెట్టిన రూల్స్ను అతిక్రమించకండి. నా బిడ్డ రక్షణే నాకు అన్నింటికన్నా ముఖ్యం అని రాసుకొచ్చింది.ఎందుకు భయం?పెద్దలు చిన్నపిల్లలకు ప్రేమతో ముద్దుపెడతారు. కొన్నిసార్లు అది ఇన్ఫెక్షన్కు దారి తీసే ప్రమాదం ఉంది. అలాగే పిల్లలు తినే చిరుతిండి వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మెరీనా.. తన కూతురికి అటువంటివి అలవాటు చేయొద్దని కోరుతోంది. మెరీనా- రోహిత్ ఇద్దరూ తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో జంటగా పాల్గొన్నారు.చదవండి: చిరంజీవి కొత్త సినిమా ప్రారంభమయ్యేది అప్పుడే.. -
ప్రియుడిని పెళ్లాడిన పునర్నవి.. ఫోటోలు వైరల్
బిగ్బాస్ ఫేమ్, నటి పునర్నవి భూపాలం పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మతో ఏడడుగులు వేసింది. తన పెళ్లిలో ఫ్రెండ్స్ గ్యాంగ్తో దిగిన సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు పునర్నవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గతేడాది డిసెంబర్లోనే తన ప్రియుడిని పరిచయం చేసింది పునర్నవి. హేమంత్ వర్మకు ఎస్ చెప్పానంటూ ఫోటోలు షేర్ చేసింది. సినిమాఫిబ్రవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా.. నెల తిరిగేలోపు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. పునర్నవి.. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా నటించింది. ఆ తర్వాత కూడా పిట్టగోడ, మనసుకు నచ్చింది, సైకిల్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పైచదువుల కోసం లండన్ వెళ్లిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉండేది.చదవండి: కోర్ట్ జంట బ్యాండ్ మేళం ట్రైలర్ -
సైలెంట్గా వస్తారు.. స్పెషల్గా ఉండిపోతారు: రవికృష్ణ
చెన్నైలో ఓ సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన రవికృష్ణ తర్వాత నటుడిగా మారాడు. మొగలి రేకులు సీరియల్తో నటుడిగా సెన్సేషన్ అయ్యాడు. అనంతరం బిగ్బాస్ షోతో గుర్తింపు పొందాడు. ఈ షో తర్వాత సినిమా ఛాన్సులు ట్రై చేశాడు. పలు చిత్రాల్లో నటించాడు. విరూపాక్ష సినిమాతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. లవ్ మీ: ఇఫ్ యు డేర్, దండోరా.. ఇలా పలు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.ప్రేమలో..విజయవాడకు చెందిన ఇతడు ఆమె కథ అనే సీరియల్ చేస్తున్న సమయంలో నటి నవ్య స్వామితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఏ షోకి వెళ్లినా జంటగా కలిసే వెళ్లేవారు. అయితే ప్రేమలో ఉన్నామని మాత్రం ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు. కానీ నవ్య బర్త్డే రోజు మాత్రం తనతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అందమైన క్యాప్షన్ ఇస్తుంటాడు. మంగళవారం (మార్చి 17న) నవ్య బర్త్డే. మనకు తెలియకుండానే స్పెషల్ఈ సందర్భంగా ఆమెతో కలిసి దిగిన రెండు పిక్స్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఓయ్ స్వామి.. హ్యాపీ బర్త్డే. ఇలాగే క్రేజీగా, అందంగా జ్ఞాపకాలను కూడబెట్టుకుంటూ ఉండాలి. కొందరు మన జీవితాల్లోకి అనుకోకుండా వస్తారు. కానీ, మనకు తెలియకుండానే ఎంతో ప్రత్యేకంగా మారిపోతారు. అలాంటి అరుదైనవారి జాబితాలో నువ్వు కూడా ఒకదానివి! అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారని అడుగుతున్నారు. విజయ్-రష్మిక జోడీలాగే మీ జంట కూడా అద్భుతంగా ఉంటుందని, త్వరగా వివాహం చేసుకోమని కోరుతున్నారు. View this post on Instagram A post shared by Ravi krishna (@ravikrishna_official) చదవండి: పీలింగ్స్ చూశారు.. దీనికేమైందని అంత రాద్ధాంతం?: నటి -
దేవుడు నాకిలా రాసిపెట్టాడు: పవన్ ఎమోషనల్
బిగ్బాస్ షోలో కొందరు ఎంత బాగా ఆడినా సరే ఎక్కువ హైలైట్ అవరు. అండర్ రేటెడ్ కంటెస్టెంట్గానే మిగిలిపోతారు. డిమాన్ పవన్ కూడా అదే కోవకి చెందుతాడు. అగ్నిపరీక్షను నెగ్గి తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో సామాన్యుడిగా అడుగుపెట్టాడు. కానీ రీతూతో ఫ్రెండ్షిప్ కాస్త హద్దులు దాటడంతో అతడిపై విమర్శలు వచ్చాయి. బిగ్బాస్తో గుర్తింపువీరి లవ్ ట్రాక్ను కొందరు ఇష్టపడితే మరికొందరు అసహ్యించుకున్నారు. ఫలితంగా అతడి లవ్ ట్రాక్ తన కష్టాన్ని కప్పేసింది. మాటల్లో మెచ్యూరిటీ చూపించే అతడు రీతూ ఎలిమినేట్ అయ్యాక ఫుల్ హుషారుగా ఆడటం మొదలుపెట్టాడు. దీంతో సీజన్ సెకండ్ రన్నరప్గా నిలిచాడు. తన తండ్రి టంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నప్పటికీ, ఎన్నడూ అది చెప్పి సింపతీ సాధించాలనుకోలేదు.తొలిసారి విమానంఫైనల్స్లో మాత్రం తండ్రి చికిత్స కోసం రూ. 15 లక్షల క్యాష్ప్రైజ్ అందుకుని బయటకు వచ్చాడు. కానీ పవన్ ఆశలు అడియాసలయ్యాయి. ఇటీవలే పవన్ తండ్రి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. ఈ క్రమంలో తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. జీవితంలో తొలిసారి విమానం ఎక్కుతున్నట్లు తెలిపాడు. ఇది నా జీవితంలో ఫస్ట్ ఫ్లైట్.. అమ్మానాన్నతో లేదా బెస్ట్ఫ్రెండ్స్తో లేదంటే ఏదైనా ముఖ్యమైన కారణముంటేనే విమానం ఎక్కాలనుకున్నాను. దేవుడు నాకిలా రాసిపెట్టాడుఎందుకంటే అది నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి. దురదృష్టవశాత్తూ మా నాన్నతో నేనెప్పటికీ విమానం ఎక్కలేను. దేవుడు నాకిలా రాసిపెట్టాడు.. మా నాన్న కోసం నేను తొలిసారి ఫ్లైట్ ఎక్కి కాశీ వెళ్లబోతున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకం అని పవన్ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Uppala Pavan Kumar (@demon_pavan) చదవండి: పురుషులే బాధితులా? హీరో భార్య కౌంటర్ -
నామకరణ ఫంక్షన్.. చెల్లి కోసం వితికా సర్ప్రైజ్
హీరోయిన్, బిగ్బాస్ బ్యూటీ వితికా షెరుకు ఎవరైనా నచ్చారంటే వారికోసం ఏమైనా చేస్తుంది. భర్త కోసం ఇల్లు కట్టి గిఫ్ట్ ఇచ్చింది. చెల్లికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఘనంగా సీమంతం చేసింది. స్నేహితురాలు, మెగా డాటర్ నిహారిక ఉండే ఇంట్లో ఆమెకోసం ఓ గదిని ప్రత్యేకంగా అలంకరించి సర్ప్రైజ్ చేసింది. ఇలా ఎప్పుడూ నా అనుకునేవారికోం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది.కృతికాకు పండంటి బాబుఇకపోతే 2025 డిసెంబర్లో వితికా పెద్దమ్మగా ప్రమోషన్ పొందింది. నటి సోదరి కృతికా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆ పిల్లవాడి నామకరణ వేడుక జరిగింది. ఆ విషయాన్ని వితికా సిస్టర్స్ ఆలస్యంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. బాబుకు జైవీర్ కార్తికేయ అని నామకరణం చేసినట్లు కృతిక కొన్ని ఫోటోలు రిలీజ్ చేసింది. వితిక అయితే.. ఊయల ఫంక్షన్ కోసం దగ్గరుండి డెకరేషన్ చేయించింది. నామకరణ వేడుకపూలతో వెంకటేశ్వస్వామిని ఆవిష్కరించింది. అది చూసి కృతిక ఆశ్చర్యపోయింది. తనకోసం ఇంత కష్టపడిందా? అని తెగ సంతోషపడిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నీలాంటి అక్క దొరికినందుకు కృతిక చాలా అదృష్టవంతురాలు అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వరుణ్ సందేశ్- వతిక 'ధర్మస్థల నియోజకవర్గం', 'డియర్ ఆస్ట్రోనాట్' సినిమాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) -
'అవకాశాలు తర్వాత.. బరువు తగ్గు'.. ఏడ్చుకుంటూ వెళ్లా!
నటి సంభావన సేత్.. భోజ్పురి సినిమాల్లో ఎన్నో ఐటం సాంగ్స్ చేసింది. హిందీలోనూ నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్పెషల్ సాంగ్స్లో స్టెప్పులేసింది. అటు బుల్లితెరపై బిగ్బాస్, రాజ్ పిచ్లే జనం కా, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్కె ఖిలాడీ 4 ఇలా అనేక రియాలిటీ షోలలో పాల్గొంది.రెండో సీజన్లో పార్టిసిపేషన్అయితే తనకు ఓ స్టార్ హీరో అవకాశాలిస్తానని చెప్పి ఆ తర్వాత తన ఆశలపై నీళ్లు చల్లాడంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంభావన సేత్ మాట్లాడుతూ.. నేను హిందీ బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాను. నాలుగో సీజన్లో స్టేజీపై పర్ఫామెన్స్ చేశాను. అప్పుడు నటుడు రవికిషన్.. నేను భోజ్పురిలో మంచి పేరున్న డ్యాన్సర్ అని సల్మాన్ ఖాన్కు పరిచయం చేశాడు. ఫోన్ నెంబర్ కూడా..అందుకాయన.. ఇప్పుడే చూశాగా.. డ్యాన్స్ చాలా బాగా చేస్తోందని మెచ్చుకున్నాడు. నేను కొంత ధైర్యం తెచ్చుకుని తన సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగాను. వెంటనే ఆయన తప్పకుండా ఇస్తానన్నాడు. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. షో అయిపోయిన కొంతకాలానికి నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. అప్పుడతడు కాస్త చిరాకుగా ఉన్నాడు. కానీ బానే మాట్లాడాడు. ఏడ్చుకుంటూ వెళ్లా.సినిమా అవకాశం ఇస్తానన్నారు కదా అని గుర్తు చేశాను. అందుకు సల్మాన్.. నాకు గుర్తు లేదు కానీ మీరు కాస్త బరువు తగ్గాలి.. మరో విషయమేంటంటే ఇండస్ట్రీలో నేనెవర్నీ ప్రమోట్ చేయను అని ముక్కుసూటిగా చెప్పాడు. ఆ మాటలు నన్నెంతో బాధపెట్టాయి. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. కానీ, ఇప్పటికీ నేను సల్మాన్ ఖాన్ అభిమానినే అని చెప్పుకొచ్చింది.చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే? -
రూ.50 లక్షల ప్రైజ్మనీ.. మూణ్నెళ్లయినా ముట్టలే!
బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో తన ఆటతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల మనసు గెల్చుకుని ఏకంగా ట్రోఫీ అందుకున్నాడు. విన్నర్గా రూ.50 లక్షల ప్రైజ్మనీ గెల్చుకున్నాడు. అయితే షో పూర్తయి మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఆ డబ్బు ముట్టలేదట!ఇదెప్పుడూ ఉండేదే..ఈ విషయాన్ని అతడు తాజాగా తన యూట్యూబ్లో వెల్లడించాడు. గౌరవ్ ఖన్నా మాట్లాడుతూ.. షోలో ప్రకటించిన ప్రైజ్మనీ, కారు.. ఇవన్నీ నా చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోంది. టీవీ ఇండస్ట్రీలో ఇలాంటి ఆలస్యాలు ఎప్పుడూ ఉండేవే.. రెండు నెలల్లో..కానీ తప్పకుండా నాకు ఇస్తానన్నవి ఇచ్చి తీరతారు. అందుకు కనీసం రెండు నెలలైనా పడుతుంది అని చెప్పుకొచ్చాడు. కాగా గౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా షో విజేతగా నిలిచి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. ఆ వెంటనే బిగ్బాస్లో అడుగుపెట్టి అక్కడ కూడా విజయ దుందుభి మోగించాడు.చదవండి: నా పెళ్లికి ముందు అన్న ఇచ్చిన సలహా: అల్లు శిరీష్ -
ఆ ఫోన్ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూసేవాళ్లు చాలామంది! ఆ ఛాన్స్ దొరక్క ఇక జీవితంపై ఆశలు వదిలేసుకుని తనువు చాలించాలనుకున్నాడు నాగమణికంఠ. అలాంటి సమయంలో బిగ్బాస్ షో నుంచి పిలుపు వచ్చింది. మళ్లీ గుండె నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని షోలో అడుగుపెట్టాడు. ఒక్క పాటతో ఫుల్ ట్రోల్ అయ్యాడు. కానీ, తర్వాత నెమ్మదిగా ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బీబీ జోడీ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు.రెండేళ్లపాటు..ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ.. మనలో వచ్చే నెగెటివ్ ఆలోచనలను అక్కడే చంపేయాలి. రెండేళ్లపాటు నేనేం సంపాదించలేదు, ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. ఇక అయిపోయిందిరా భయ్ అనుకున్నాను. ఆ 10 నిమిషాల్లో నాకు ఫోన్కాల్ రాకపోయుంటే నా జీవితం ముగిసిపోయేది. సరిగ్గా అదే సమయంలో బిగ్బాస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఏడ్చేసిన సదాఅప్పుడు కన్నీళ్లు తుడుచుకుని ఇంటర్వ్యూకి వెళ్లాను అని పేర్కొన్నాడు. నీ వెనక ఇలాంటి గతం ఉందని తెలీదు, నాకు చాలా బాధగా అనిపిస్తోందంటూ నటి సదా కన్నీళ్లు పెట్టుకుంది. కాగా నాగమణికంఠ సీరియల్ నటుడు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుంది. కానీ, అతడిని తండ్రిగా స్వీకరించలేకపోయాడు. బిగ్బాస్ షోతో గుర్తింపుఇంతలో తల్లి క్యాన్సర్తో 2019లో మరణించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసిన అతడు మంచి ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. కూతురు పుట్టడంతో తల్లే తిరిగి వచ్చిందని సంతోషించాడు. కానీ, భార్యాభర్తల మధ్య కలహాలు మొదలవడంతో ఇండియాకు ఒంటరిగా తిరిగొచ్చేశాడు. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్తో గుర్తింపు పొందాడు. -
నేనెంత లక్కీ.. కన్నీళ్లాగడం లేదు: తనూజ ఎమోషనల్
సెలబ్రిటీలు జనాల అభిమానాన్ని, కోపాన్ని అస్సలు తట్టుకోలేరు. వారి ప్రేమాభిమానాలు చూసి ఆనందభాష్పాలు రాలుస్తారు. కోపంతో దారుణంగా విమర్శించినప్పుడు ఎందుకిలా చేస్తున్నారని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటారు. నటి, తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ రన్నరప్ తనూజ పుట్టస్వామి కూడా ఇప్పుడు సంతోషంతో ఏడ్చేసింది.నేనెంత అదృష్టవంతురాలినో..ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. తనను ఎంతగానో ఇష్టపడే ఓ మహిళా అభిమాని తనకోసం డైరీ రాసిందని, దాన్ని చదువుతున్నానని పేర్కంది. నేనెంత అదృష్టవంతురాలినో కదా.. నాకు పుస్తకాలు చదవడమంటే ఇష్టం. ఈసారి ఎంతో ప్రత్యేకమైన పుస్తకాన్ని చదువుతున్నాను. నా యోగక్షేమాలు కోరుకునే వ్యక్తి నాకోసం స్పెషల్గా రాసిన డైరీ చదువుతున్నాను. నాకు మాటలు రావడం లేదు. నన్ను అర్థం చేసుకున్నారునమ్ముతారో, లేదో.. ఇది చదువుతూ ఉంటే కన్నీళ్లు ఆగడం లేదు. మనల్ని లోతుగా అర్థం చేసుకునేది మన కుటుంబసభ్యులు మాత్రమే.. కానీ, నా విషయంలో.. ఎంతోమంది జనం నన్ను అర్థం చేసుకున్నారు, అక్కున చేర్చుకున్నారు.. నా మంచి కోసం ప్రార్థిస్తున్నారు. నా జీవితానికి ఇది చాలు అని తనూజ ఆనందం వ్యక్తం చేసింది. తనకోసం డైరీ రాసిన వందన అనే అమ్మాయికి ఐ లవ్యూ చెప్పింది.చదవండి: ప్రేమలో కోర్ట్ హీరోహీరోయిన్.. వాళ్ల స్పందన ఇదే! -
సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటాను: బిగ్బాస్ కంటెస్టెంట్
సెలబ్రిటీలు ఏం చేసినా, చేయకపోయినా విమర్శలపాలవుతూనే ఉంటారు. హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్ 1 విన్నర్ దివ్య అగర్వాల్ పరిస్థితి కూడా ఇంతే! తరచూ ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటుంది. ఆస్తి చూసే అపూర్వ పడగోయంకర్ను పెళ్లి చేసుకుందని కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలపై తాజా ఇంటర్వ్యూలో నటి స్పందించింది.ఏమైనా అనుకోండిదివ్య అగర్వాల్ మాట్లాడుతూ.. నన్ను గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసమే సంబంధం పెట్టుకోవడం) అని పిలవాలనుకుంటే పిలుచుకోండి.. అవసరమైతే డైమండ్ డిగ్గర్ అని కూడా పిలవండి. నాకు మాత్రం నా జీవితంలో సరైన భాగస్వామి దొరికాడు. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నాకు దొరికిన అత్యంత విలువైన బంగారం ఆయనే!అవేం లేవుగాఅయినా జనం కాస్తయినా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. నేనేమైనా లంబోర్గినిలో తిరుగుతున్నానా? జుహు బీచ్ దగ్గర బంగ్లాలో ఉంటున్నానా? నాకంటూ ఓ ప్రైవేట్ జెట్ ఉందా? ఇవన్నీ లేవే.. నేను ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తాను. మరెందుకు నాపై అంత కోపం, ద్వేషం? ఆడవాళ్లు కేవలం డబ్బు చూసే పెళ్లి చేసుకుంటారని ఎందుకు తప్పుగా అనుకుంటారు?పెళ్లిఆ పెళ్లికి కారణమైన ప్రేమను చూడరా? నేనెప్పుడూ సింపుల్గానే ఉండాలనుకుంటాను, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను. అంతెందుకు.. నేను సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా కొంటుంటాను అని చెప్పుకొచ్చింది. దివ్య- అపూర్వ 2024 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఓటీటీలో ఫంకీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే? -
అణిగిమణిగి ఉండాలి.. ఓవరాక్షన్ చేస్తే తీసేస్తారు: అషూ
టిక్టాక్ ద్వారా జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి. డబ్ స్మాష్, రీల్స్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. ఓటీటీలో ప్రసారమైన బిగ్బాస్ నాన్స్టాప్లోనూ పాల్గొని మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది.ఇప్పటివరకు ఎన్నో చేశా..ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎప్పుడూ అభిమానులతో టచ్లో ఉండే ఈ బ్యూటీ తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్ సిరీస్లో నటించింది. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్ విన్నర్ నిఖిల్ మళయక్కల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ ప్రెస్మీట్లో అషూ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో స్టేజ్ పర్ఫామెన్స్లు, క్యారెక్టర్ రోల్స్, హోస్టింగ్.. ఇలా అన్నీ చేశాను. హీరోయిన్ అంటుంటే..తొలిసారి హీరోయిన్గా చేశాను. షూటింగ్లో అందరూ హీరోయిన్గారు అని పిలుస్తూ ఉంటే ఏంటి? నన్నేనా? అని ఆశ్చర్యపోయాను అంది. ఈ సమావేశంలో ఓ విలేకరి అషూను ఓ ప్రశ్న అడిగాడు. నిర్మాత ప్రవీణగారి ప్రాజెక్ట్ అంటే బోణీ బాగానే ఉంటుంది. మరి హీరోయిన్గా సినిమాలు కొనసాగిస్తారా? అని ప్రశ్న సంధించాడు.ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా..అందుకు అషూ స్పందిస్తూ.. ఆర్టిస్టులు ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా ప్రొడక్షన్ హౌస్ ఓనర్లు, నిర్మాతలు వారిని తీసేయడానికి వెనుకాడరు. సెట్లో అయినా, ఇంట్లో అయినా కొంచెం అణిగిమణిగి ఉండాలి అంది. దీంతో వెంటనే నిర్మాత మైక్ అందుకుని.. ఎవరూ అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పని వాళ్లు చేసుకుంటూ పోతే ఎవరూ ఇబ్బందిపెట్టరు. సెట్కు వచ్చినప్పటినుంచి, బయటకు వెళ్లేవరకు ఇది నా పని అని అంకితభావంతో పని చేస్తే మిమ్మల్ని ఎవరూ టచ్ కూడా చేయరు అని క్లారిటీ ఇచ్చింది.చదవండి: త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందంటే? -
టీటీడీ చైర్మన్ వీడియో కంటే మేము చేసింది పెద్ద తప్పా..?
దివ్వెల మాధురి, బిగ్బాస్ ఫేమ్ తనూజపై టీటీడీ చర్యలు తీసుకోనుంది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నందుకు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేక్ను తిరుమలకు తీసుకెళ్లడం అక్కడ వేడుకలు చేయడం నిబంధనలకు విరుద్ధమని టీటీడీ పేర్కొంది. కొండపై ఇలాంటి వేడుకలు నిషేధమని తెలిపింది. అయితే, తాజాగా దువ్వాడ శ్రీనివాస్తో పాటుగా ముధురి వివరణ ఇచ్చారు. కొండపై తాము కట్ చేసిన కేక్ ఎగ్లెస్ అని అందుకు సంబంధించిన బిల్ను ఆయన షేర్ చేశారు.తిరుమల కొండపై తనూజ బర్త్డే సందర్భంగా తాము కేక్ కట్ చేసింది వాస్తవమేనని దువ్వాడ శ్రీనివాస్ ఇలా అన్నారు. 'ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావడంతో తన పుట్టినరోజు నాడు దర్శనం చేసుకోవాలనుకుంది. దీంతో మాతో పాటుగా తిరుమల వచ్చింది. అయితే, తనకు చెప్పకుండానే మేము కేక్ తిరుపతిలో కొన్నాం. అది పూర్తిగా ఎగ్లెస్ కేక్. మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. ఆయన పేరు పెట్టుకుని బతికే నేను ఎట్టి పరిస్థితిల్లోనూ తప్పు చేయను. నా మొదటి తలనీలాలు ఎడుకొండలవాడి సన్నిధిలోనే ఇచ్చాను. ఇప్పటికి వందసార్లకు పైగానే స్వామిని దర్శించుకున్నాను. ప్రయాణంలో కూడా మేము తినే ఆహారం పూర్తిగా శాఖాహారమే ఉంటుంది. అయితే, అక్కడ కేక్ కట్ చేయకూడదనే నిబంధనలు నాకు తెలియవు. తెలిసింటే ఆ పొరపాటు చేయం. కానీ, కొన్ని మీడియా ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.' అని ఆయన అన్నారు.బీఆర్ నాయుడి వీడియో సంగతేంటి..?టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి వీడియో టాపిక్ను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి విషయాలను హైలెట్ చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మేము కేక్ కట్ చేసినందుకే కేసు పెట్టండని చెబుతున్నారు. మరి బీఆర్ నాయుడు చేసిన పనికి ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. తన వీడియో తానే చూసి ఏ తప్పు కనిపించలేదని అంటున్నాడు. అలాగే తాము కేక్ కట్ చేసిన వీడియోలో ఏం తప్పు ఉందని అన్నారు. మాకు తెలియక కేక్ కట్ చేశాం.. క్షమించమని స్వామిని వేడుకుంటాం. కానీ, నువ్వు చేసిన పనికి ఏం చేస్తావ్.. నీ వీడియో టాపిక్ను డైవర్ట్ చేసేందుకే మాపై కేసులు పెడతావా అంటూ ఆయన ప్రశ్నించారు. View this post on Instagram A post shared by Divvala Madhuri (@madhuri_srinivasduvvada) -
భార్యను కొట్టిన మాస్క్ మ్యాన్.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు
మాస్క్ మ్యాన్.. బిగ్బాస్ కంటే ముందే ఈ పేరు బాగా ఫేమస్ అయింది. బిగ్బాస్ 9లో అడుగుపెట్టాలంటే అగ్నిపరీక్ష దాటాలని సామాన్యుల కోసం ఓ షో ఏర్పాటు చేశారు. అందులో మాస్క్ మ్యాన్ పాల్గొన్నాడు. తన పేరు హరిత హరీశ్ అని తెలిపాడు. భార్యపై ఉన్న ప్రేమతో ఇల్లాలి పేరునే తన పేరులో చేర్చుకున్నట్లు తెలిపాడు. అది విని భార్యంటే ప్రేమ, గౌరవం బాగానే ఉందని అందరూ అనుకున్నారు.కోపమొస్తే కొట్టేస్తావా?కానీ, అంతలోనే ఒకసారి భార్యపై చేయి చేసుకున్నానని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఎంత కోపం వస్తే మాత్రం కొట్టేస్తావా? ఆడదానిపై చేయెత్తుతావా? అని తిట్టిపోశారు. అలా నెగెటివిటీతోనే బిగ్బాస్ 9వ సీజన్లో సామాన్యుడిగా అడుగుపెట్టాడు. తన ముక్కుసూటితనం, మొండితనం, కోపం వల్ల ఎక్కువమందిని ఆకర్షించలేకపోయాడు.కాళ్లు పట్టుకుని క్షమాపణలుఅయితే ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి వస్తున్నాడు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో భార్య హరితతో కలిసి హరీశ్ పాల్గొన్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో మాస్క్ మ్యాన్ మాట్లాడుతూ.. మగాడు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాడని చెప్పి ఆడవారిపై చేయత్తడం చాలా తప్పు అంటూ భార్య కాళ్లు నమస్కరించాడు. అలా అప్పటి వివాదానికి ఇలా ఫుల్స్టాప్ పెట్టాడు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కపుల్ రియాలిటీ షో మార్చి 15న ప్రారంభం అవుతోంది. ఇది మా టీవీతో పాటు హాట్స్టార్లో ప్రసారం కానుంది. చదవండి: తండ్రి మరణించిన పదేళ్లకు ఆయన కల నెరవేర్చిన కూతురు -
తనూజ బర్త్డే.. బంగారు కానుకిచ్చిన మాధురి
ముద్దమందారం సీరియల్తో తెలుగువారికి దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి. ఇటీవల తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షోలో ఎంతోమంది స్నేహితులను సైతం సంపాదించుకుంది. వారిలో దివ్వెల మాధురి ఒకరు. బిగ్బాస్ షోలో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన మాధురి.. మొదట తనూజపై విరుచుకుపడింది.బిగ్బాస్ షోలో క్లోజ్కట్ చేస్తే వారం తిరగకముందే అందరికంటే ఎక్కువ తనూజతో క్లోజ్ అయిపోయింది. మాధురి కటౌట్ చూసి భయపడ్డ తనూజ ఆమెను ముద్దుగా మ్యాడీ అని పిలుస్తూ ప్రేమగా పెత్తనం కూడా చెలాయించింది. అప్పటినుంచి వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇక నేడు (మార్చి 5న) తనూజ 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరుపుకుంటున్న మొదటి బర్త్డే ఇది! మై స్వీట్ హార్ట్ దీంతో దివ్వెల మాధురి తనకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. తనతో కేక్ కట్ చేయించి, చీరగాజులు పెట్టింది. అలాగే బంగారు చెవికమ్మలను బహుమతిగా ఇచ్చింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్డే బంగారా.. మై స్వీట్ హార్ట్ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకుంటున్న తొలి బర్త్డే! నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగివచ్చావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు తనూజ థాంక్యూ మ్యాడీ అని కామెంట్ పెట్టింది. View this post on Instagram A post shared by Divvala Madhuri (@madhuri_srinivasduvvada) చదవండి: గర్భధారణలో కష్టాలు.. తనే నా మిరాకిల్ బేబీ: ప్రియాంక చోప్రా -
కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా!
ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పా? అంతమాత్రానికే ఇలా నాకు నరకం చూపించాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు యూట్యూబర్, హిందీ బిగ్బాస్ 17 ఫేమ్ అనురాగ్ దోభల్. కులాంతర వివాహం చేసుకున్న కారణంతో తన కుటుంబం తనను వెలేసిందని, ఇక తనకు చావే దిక్కని వాపోయాడు. ఈ మేరకు యూట్యూబ్లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.చిన్నప్పటినుంచి కష్టాలు'గత కొన్నినెలలుగా నా జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జీవితం ఇంత దుర్భరంగా మారుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. 14 ఏళ్ల వయసులోనే నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆ తర్వాత నా పేరెంట్స్ వారికి నచ్చిందే చదవాలని నాపై బలవంతం చేశారు. నేనేమో నా కలల్ని నిజం చేసుకోవడం కోసం డబ్బు కూడబెట్టేందుకు కష్టపడ్డాను. ట్యూషన్స్ చెప్పాను. నాకన్నా నా పేరెంట్స్ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను.పెళ్లి ఇష్టం లేదుసోషల్ మీడియా ద్వారా రితిక అనే అమ్మాయిని కలిశాను. తను నా అభిమాని అని పేర్కొంటూ రెండుమూడేళ్లపాటు మెసేజ్లు చేసింది. అలా ఒకరోజు ఆమె మెసేజ్కు రిప్లై ఇచ్చాను. అలా తనతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరం రెండేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. వారం రోజుల్లో పెళ్లి అనగా వేడుకకు రామని చెప్పేశారు. ఎంతగానో బతిమాలాను. బంధువులందరి ముందు చేతులెత్తి వేడుకున్నాను. వార్నింగ్కాళ్లు పట్టుకుని క్షమించమని అడిగాను. అయినా వారి మనసు కరగలేదు. మేము సంతోషంగా లేము, మిమ్మల్నీ సంతోషంగా ఉంచము అని వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని టార్చర్ పెట్టారు. నా దగ్గరున్నదంతా లాక్కున్నారు. పెళ్లయ్యాక ఇంట్లో కూడా అడుగుపెట్టనివ్వలేదు. చచ్చిపోవాలనుకున్నాను. నాకేదైనా అయితే అందుకు నా ఇంట్లోవాళ్లే కారణం.బోరుమని ఏడ్చిన బిగ్బాస్ కంటెస్టెంట్ఇప్పుడు రితిక కూడా నన్ను వదిలేసింది. నేను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాను. ఈ బాధను ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావట్లేదు. బహుశా ఈ వీడియో తర్వాత నేను కనిపించనేమో! ఐదు రోజులుగా ఏమీ తినలేదు. ప్రశాంతంగా నిద్రపోవాలనుంది. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. కానీ బయటవాళ్లు చెప్పిందే నమ్మారు. నన్ను దూరం పెట్టారు. నేను చనిపోయాక అయినా నా బిడ్డను ఆదరించండి అని బోరుమని ఏడ్చాడు. ఇదే తన చివరి వ్లాగ్ అని అనురాగ్ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. అనురాగ్ భార్య గతేడాది సెప్టెంబర్లో గర్భం దాల్చింది.చదవండి: చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నా: బండ్ల గణేశ్ -
ఒంటరితనం భరించలేకపోతున్నా.. తోడు కావాలి!
దాదాపు 40 సినిమాలు చేసిన కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధి 2023లో మరణించాడు. అతడి మరణంతో ఎంతగానో కుంగిపోయింది కమెడియన్ రెండో భార్య, నటి రేణు సుధి. అయితే రానురానూ ఆ బాధ నుంచి తేరుకుంటూ తనకిష్టమైన వ్యాపకాలపై శ్రద్ధ పెట్టింది. రీల్స్ చేయడం, సాంగ్స్లో యాక్ట్ చేయడం, రకరకాలుగా ఫోటోషూట్స్ చేయడంతో సోషల్ మీడియాలో తన పేరు మారుమోగిపోయేది. బిగ్బాస్ షోతో గుర్తింపుకొందరైతే వితంతువై ఉండి ఈ పిచ్చి చేష్టలేంటి? సుధికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావ్ అని విమర్శించారు కూడా! అలా ట్రోలింగ్ బారిన పడ్డ సమయంలో మలయాళ బిగ్బాస్ ఏడో సీజన్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ వచ్చిన క్రేజ్తో రెండు, మూడు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. తాజాగా రేణు సుధికి భాగస్వామి కావాలనిపిస్తోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. తోడు కావాలిఒంటరితనం భరించలేకపోతున్నాను. నాకు ఒక పార్ట్నర్ కావాలనిపిస్తోంది. నన్ను అర్థం చేసుకుని, నా బాగోగులతో పాటు పిల్లల్ని చూసుకునే తోడు కావాలనిపిస్తోంది అని రాసుకొచ్చింది. గతంలో కూడా రేణు మళ్లీ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటానంది. అప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు వదిలేసి అతడితో మరో ఇంట్లో స్థిరపడతానంది. అలాగే తన పేరు పక్కన ఉన్న సుధిని చెరిపేస్తానంది.రెండో పెళ్లిమిమిక్రీ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న కొల్లం సుధిని మొదటి భార్య వదిలేసింది. అప్పటికే వీరికి కుమారుడు రాహుల్ సంతానం. భార్య వదిలేశాక సింగిల్ పేరెంట్గా చాలా ఇబ్బందులు పడ్డాడు సుధి. కొన్నేళ్ల తర్వాత అతడికి రేణుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు రితుల్ సంతానం. రేణుకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం! -
ఖరీదైన హీల్స్ ధరించిన హీరోయిన్.. చెప్పుల ధర వేలల్లో కాదు!
'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది నిక్కీ తంబోలి. కాంచన 3, తిప్పరా మీసం వంటి చిత్రాల్లో నటించినా తనకు పెద్ద గుర్తింపు రాలేదు. దాంతో ఐటం సాంగ్స్పై ఫోకస్ చేసింది. హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచింది. లేటెస్ట్ రియాలిటీ షో ద 50లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది.గోవా ట్రిప్తాజాగా ఆమె ద 50 షోలోని సహకంటెస్టెంట్లతో వెకేషన్కు వెళ్లింది. ఈ గోవా ట్రిప్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నిక్కీ బ్లూ కలర్ పొట్టి డ్రెస్లో తళుక్కుమని మెరిసింది. అయితే అందరి దృష్టి మాత్రం తను ధరించిన హీల్స్పైనే పడింది. కారణం ఏంటో తెలుసా? ఆ హీల్స్ డాల్స్ అండ్ గబ్బానా అనే లగ్జరీ బ్రాండ్కు చెందిన చెప్పులు.చెప్పుల ధర ఎంతంటే?ఆ హీల్స్ ధర అక్షరాలా లక్ష 46 వేలని తెలుస్తోంది. నిక్కీ తంబోలికి మేకప్ దగ్గరినుంచి అలంకరణ వరకు అన్నీ ఖరీదైనవి వాడటం బాగా అలవాటు. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు అర్బాజ్ పటేల్ కూడా ధ్రువీకరించాడు. తను వాడే మాయిశ్చరైజర్ ధర రూ.75 వేలు, సీరమ్ రూ.50 వేలు అని తెలిపాడు. View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) చదవండి: అప్పటిదాకా నా కొడుకు సినిమా చూడను: సునీల్ శెట్టి -
ఉసురు తగులుతుంది.. ఇచ్చిపడేసిన తనూజ
బిగ్బాస్ షో వల్ల పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా అంతే వస్తుంది. వాళ్లు ఏం చేసినా, చేయకపోయినా ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటారు. వారికి సంబంధం లేని విషయాల్లో కూడా బిగ్బాస్ కంటెస్టెంట్ల పేరు ఇరికించి విమర్శిస్తుంటారు. తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ రన్నరప్, నటి తనూజ విషయంలో ఇదే జరిగింది.తనూజ కోసం నిలబడ్డ పవన్'ముద్ద మందారం' సీరియల్తో ఫేమస్ అయిన తనూజకు ఆ సీరియల్ నటీనటులతో మంచి అనుబంధం ఉంది. ముద్ద మందారం సీరియల్ హీరో పవన్ సాయి కూడా తనకు మంచి మిత్రుడు. తనూజ బిగ్బాస్లో ఉన్నప్పుడు ఆమె కోసం స్టేజీపైకి కూడా వచ్చాడు. అయితే పవన్ విడాకులకు తనూజయే కారణమని కొందరు ఆమెను విమర్శిస్తున్నారు.ఉసురు తగులుతుందితాజాగా తనూజ తన ఫ్యాన్స్తో చిట్చాట్ చేయగా ఓ నెటిజన్ పవన్ సాయి విషయాన్ని ప్రస్తావించాడు. పవన్ సాయి భార్య కర్మ నిన్ను వదిలిపెట్టదు, ఆమె ఉసురు నిన్ను వెంటాడుతుంది అని శాపనార్థాలు పెట్టాడు. అందుకు తనూజ గట్టి కౌంటర్ ఇచ్చింది. నీ కర్మ కూడా నిన్ను వెంటాడకముందే నీపై నువ్వు ఫోకస్ చేసుకోవడం మంచిది. నా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నేను చాలా బాగున్నాను. నా కర్మఫలం బాగుంది కాబట్టే నా జీవితంలో అంతా మంచే జరుగుతోంది.కౌంటర్ ఇచ్చిన తనూజఅయినా ఇలా ముఖం కూడా చూపించకుండా ఫేక్ ఐడీలతో ఇలాంటి మెసేజ్లు పెట్టడానికి కొంచెం కూడా సిగ్గులేదా? నీకు ఎవరి ఉసురు వెంటాడకుండా చూసుకో.. అని ఇచ్చిపడేసింది. చివర్లో తనను విమర్శించేవాళ్లకు కౌంటరిచ్చింది. డియర్ హేటర్స్.. మీరు నా ప్రశాంతతని పాడు చేయలేరు. నన్ను రెచ్చగొట్టేందుకు మీరు చేసిన ప్రయత్నాలు ఫలించవు. అయినా మీరు ప్రశాంతంగా ఉండండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.చదవండి: విజయ్తో విడాకులు... సంగీత ఎవరో తెలుసా? -
ప్రేయసి ముఖం పచ్చబొట్టు! నటుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ నటుడు కరణ్ కుంద్రా గుండె నిండా తేజస్వి ప్రకాశ్ నిండి ఉంది. ఆమె అంటే కరణ్కు పంచప్రాణాలు. అందుకే తాజాగా అతడి ఛాతీపై తేజస్వి ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ప్రియురాలిపై అతడు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యారు.టాటూ నిజమైనదా?ఈ క్రమంలో కరణ్ ఇది శాశ్వత పచ్చబొట్టు కాదని వెల్లడించాడు. తేజస్వి నటించిన సైకో సయ్యా.. వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఈ తాత్కాలిక టాటూ వేయించుకున్నానని వివరణ ఇచ్చాడు. తనకు సపోర్ట్గా నిలబడేందుకు ఇలా టాటూతో కనిపించానన్నాడు.బిగ్బాస్ షోలో మొదలైన లవ్హిందీ బిగ్బాస్ 15వ సీజన్లో కరణ్- తేజస్వి ప్రకాశ్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన ఏడాదికే అంటే 2022లోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడింది. అప్పటినుంచి పెళ్లిని దాటవేస్తూనే ఉన్నారు. మధ్యలో ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చినా అదంతా ఉత్త ప్రచారమే అని తేలిపోయింది. ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడల్లా.. మాది ఫెవికాల్ బంధమని కరణ్-తేజస్వి ఎన్నోసార్లు రుజువు చేశారు.చదవండి: ప్రేయసితో బిగ్బాస్ షణ్ను ఎంగేజ్మెంట్ -
ప్రేయసితో బిగ్బాస్ షణ్ముఖ్ ఎంగేజ్మెంట్
ఒకప్పుడు కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ ద్వారా యూట్యూబ్లో సెన్సేషన్ అయ్యాడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత బిగ్బాస్లో అడుగుపెట్టి మరింత పాపులర్ అయ్యాడు. తర్వాత పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన షణ్ను ఈ ఏడాది ప్రారంభంలో ఓ గుడ్న్యూస్ చెప్పాడు. తను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. అమ్మాయి ముఖం చూపించకుండా, పేరు చెప్పకుండా కేవలం V అనే అక్షరాన్ని మాత్రమే వెల్లడించాడు.ఎంగేజ్మెంట్తాజాగా ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు వైష్ణవి చోడిశెట్టి. తనొక ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 25న అంటే ఈరోజు తన నిశ్చితార్థం జరిగిందని ఫోటోలు షేర్ చేశాడు. దేవుడు ఈ రకంగా ప్లాన్ చేశాడు.. అయిపాయె అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోల్లో షణ్ముఖ్ - వైష్ణవి ఇద్దరూ బంగారు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కెరీర్షణ్ముఖ్ సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే బిగ్బాస్ షోలో అడుగుపెట్టాడో అంతా తలకిందులైంది. ఈ రియాలిటీ షోలో నటి సిరి హన్మంత్తో లవ్ ట్రాక్ నడిపాడు. ఇది జనాలకు మింగుడుపడలేదు. ఎందుకంటే అప్పటికే షణ్ను.. దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నాడు. ఆల్రెడీ ప్రేమలో ఉండగా మళ్లీ ఈ పిచ్చిపనులేంటి? అని అందరూ విమర్శించారు.తీరా షో నుంచి బయటకు వచ్చాక దీప్తితో బ్రేకప్ కూడా అయింది. ఇంతలో డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. మరోపక్క అమ్మకు క్యాన్సర్.. చాలాకాలం పాటు డిప్రెషన్తో కుంగిపోయాడు. కానీ నెమ్మదిగా దాన్నుంచి బయటపడి తిరిగి కెరీర్పై ఫోకస్ పెట్టాడు. అలా ప్రేమకు నమస్కారం అని ఓ సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) చదవండి: రష్మికకు మూడోసారి.. విజయ్కు మాత్రం తొలిసారి -
ఇంకా అదే బాధలో ఉన్న ఇమ్మాన్యుయేల్
బిగ్బాస్ ట్రోఫీ సాధించాలంటే గేమ్స్ గెలవడం కాదు, ప్రేక్షకుల మనసు గెలవాలి. అప్పుడే టైటిల్ కొట్టడం సాధ్యమవుతుంది. అది ఇమ్మాన్యుయేల్కు బాగా తెలుసు. అందుకే షోలో అడుగుపెట్టిన మొదటి క్షణం నుంచి అందర్నీ నవ్విస్తూ, అన్ని ఆటల్లోనూ టఫ్ కాంపిటీషన్ ఇస్తూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.గెలుపు తథ్యం అనుకుంటే..అతడి ఆట, మాట, తీరు అన్నీ చూసిన నాగార్జున ప్రతివారం ఇమ్మూపై ప్రశంసల వర్షం కురిపించేవాడు. గోల్డెన్ స్టార్ బ్యాడ్జ్ ఇచ్చేవాడు. ఇంట్లోకి వచ్చినవాళ్లందరూ కూడా ఇమ్మూని ఆకాశానికి ఎత్తేయడంతో తనకు తిరుగులేదనుకున్నాడు. ట్రోఫీ గెలుస్తానని నమ్మకంగా ఉన్నాడు.ఫైనల్స్లో నాలుగో స్థానంకానీ అనూహ్యంగా ఇమ్మూ, తనూజ మధ్య ఉన్న పోటీ.. షో చివరాఖరకు వచ్చేసరికి తనూజ వర్సెస్ కల్యాణ్గా మారిపోయింది. పవన్ కూడా ఇమ్మూని వెనక్కు నెట్టి రేసులో ముందుకు వచ్చాడు. దాంతో ఫైనల్స్లో ఇమ్మూ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కల్యాణ్ ట్రోఫీ గెలవగా తనూజ రన్నరప్, పవన్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. అసలు గెలవకపోడమే అనంతమైన బాధ అంటే ఏకంగా నాలుగో స్థానంలో ఉండటంతో ఇమ్మాన్యుయేల్ తట్టుకోలేకపోయాడు. విన్నర్గా ఎందుకు చూడరు?తాజాగా బీబీ ఉత్సవం ప్రోమోలో తనకు అన్నింటికన్నా పెద్ద బాధ ఏంటో బయటపెట్టాడు. తల్లితో పాటు స్టేజీపైకి వచ్చిన ఇమ్మూ.. కమెడియన్లను విన్నర్గా చూడరనే విషయం నాకు తెలుసు. కానీ ఎందుకు చూడరు? మనం గేమ్స్ ఆడితే చూస్తారుగా అనుకున్నాను. నా నమ్మకం నిలబడలేదు. అలా అని ఓడిపోయినందుకు కొంచెం కూడా బాధపడలేదు. కానీ, అమ్మానాన్న ఇద్దరూ క్యారేజీ కట్టుకుని బైక్పై 90 ఊర్లు తిరిగారు. నాకు ఓటేయమని పాంప్లెట్లు పంచారు. హీరో చేతుల మీదుగా సన్మానంఇప్పటికీ నా మైండ్లో అదే తిరుగుతోంది అంటూ ఏడ్చేశాడు. అటు ఇమ్మూ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం హీరో నిఖిల్.. స్టేజీపైకి వచ్చి ఇమ్మూ తల్లికి శాలువా కప్పి సన్మానం చేశాడు. అలాగే ఇమ్మాన్యుయేల్కు బిగ్బాస్ 9 ఆల్రౌండర్ అనే ట్రోఫీని అందించాడు. ఏదేమైనా ఎంత కష్టపడ్డా తనకు విజయం దక్కలేదన్న బాధ ఇమ్మూ మనసులో ఇప్పటికీ అలాగే ఉంది!చదవండి: హీరోయిన్ కళ్లలో కళ్లు పెట్టి చూడాలంటే సిగ్గేసింది: బాలీవుడ్ హీరో -
తొలిసారి కూతురి ఫోటో షేర్ చేసిన అర్జున్
సీరియల్ నటుడు, తెలుగు బిగ్బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అర్జున్- సురేఖ దంపతులు 2025 జనవరి 9న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కూతురికి అర్ఖ అని నామకరణం చేశారు. తన పేరులోని ఆర్.. సురేఖ పేరులోని ఖ అక్షరాలు తీసుకుని అర్ఖ అని వచ్చేలా పేరు పెట్టామని వెల్లడించాడు.తొలిసారి కూతురి ఫోటోఅయితే పాప ఫోటోలు మాత్రం వీరు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. తాజాగా అర్జున్- సురేఖ దంపతులు తమ ఏడో పెళ్లిరోజు సందర్భంగా ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. అందులో వారి కూతురి ముఖాన్ని తొలిసారి చూపించారు. ఇక సురేఖ భర్త గురించి చెప్తూ ఎమోషనలైంది. ఏడేళ్ల క్రితం.. మేము జీవితాంతం కలిసుండాలని, ఒకరి చేయి మరొకరు వడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నాం. మాకెంతో స్పెషల్కష్టాలు, సంతోషాలు, పాఠాలు.. ఇలా అన్నింటిలో ఒకరికొరం తోడుగా నిలిచి బలంగా ఎదిగాము. మా ప్రేమకు ప్రతిరూపం, మా జీవితంలో అత్యంత మధురమైన అధ్యాయం మా కూతురు అర్ఖ. ఇద్దరం నుంచి ముగ్గురంగా మారిన మా ప్రయాణం ఎంతో అపురూపమైనది. ఈ ఫోటో మాకెంతో స్పెషల్. ఎందుకంటే మా చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న తొలి ఫోటో ఇదే!జీవితాంతం కలిసిమెలిసుండాలినాకు భాగస్వామిగా ఉన్నందుకు, అండగా నిలబడినందుకు, నా కూతురికి ప్రేమగల తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ అర్జున్. మనం ఇలాగే జీవితాంతం సంతోషంగా, కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మధురమైన పెళ్లిరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని రాసుకొచ్చింది.బిగ్బాస్తో గుర్తింపుతెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లో వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. అతడితోపాటు వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు వెనువెంటనే ఎలిమినేట్ అయిపోయారు. కానీ, అర్జున్ మాత్రం కడవరకు నిలబడ్డాడు. టాస్కుల బాహుబలిగా పేరు తెచ్చుకున్నాడు. గ్రాండ్ ఫినాలేలో టాప్ 6లో చోటు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by Surekha Reddy🦋 (@ambati_surekha) చదవండి: -
'అందుకేగా నిన్ను పెళ్లి చేసుకుంది' రూమర్స్కు చెక్ పెట్టిన నటి
హిందీ బిగ్బాస్ సీజన్ 1 ఓటీటీ విన్నర్ దివ్య అగర్వాల్, భర్త అపూర్వ పడ్గోయంకర్ మధ్య విభేదాలు తలెత్తాయని, వీరు విడిపోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్కు ఫుల్స్టాప్ పెట్టింది దివ్య. పెళ్లిరోజు సందర్భంగా భర్తతో కలిసున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.హ్యాపీ యానివర్సరీ మై లవ్నువ్వు నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటావ్.. అందుకేగా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. నేనేంటో, ఎలాంటిదాన్నో నీకు బాగా తెలుసు. నన్ను అది మార్చుకో, ఇది మార్చుకో అని నువ్వెప్పుడూ చెప్పలేదు. నన్ను నన్నుగా ఇష్టపడ్డావు. హ్యాపీ యానివర్సరీ మై లవ్.. ఇలాంటి పెళ్లిరోజులు మనమెన్నో జరుపుకోవాలి. నా ప్రతి ఆలోచన తనకు తెలుసు, కాబట్టి తనకు నాగురించి ఎటువంటి భయం లేదు అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ హ్యాపీ యానివర్సరీ అని కామెంట్లు చేస్తున్నారు.అసలేమైంది?దివ్య ఇటీవలే ద 50 అనే రియాలిటీ షోకి హాజరైంది. అయితే ఈ షోలోని మరో కంటెస్టెంట్ భవ్య సింగ్.. దివ్యపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమె భర్తతో కలిసుండటం లేదని ఆరోపించింది. తను షోకి వచ్చినప్పటికీ భార్య కోసం అపూర్వ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని, ఇక్కడే వారి దాంపత్య జీవితం ఎలా ఉందో తెలిసిపోతుందని విమర్శలు గుప్పించింది. దీంతో దివ్య దంపతులు విడిపోతున్నారంటూ రూమర్స్ రాగా వాటిని నటి టీమ్ కొట్టిపారేసింది. ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. View this post on Instagram A post shared by Divyaa Agarwal (@divyaagarwal_official) -
లగ్నపత్రిక షేర్ చేసిన పునర్నవి
'ఉయ్యాల జంపాల' సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది పునర్నవి భూపాలం. కొన్ని సినిమాలు చేసినా అవేవీ వర్కవుట్ కాలేదు. అయితే తెలుగు బిగ్బాస్ మూడో సీజన్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. రాహుల్తో లవ్ ట్రాక్తో బాగా ఫేమస్ అయింది. కానీ షో ముగిసిన తర్వాత రాహుల్- పునర్నవి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎవరి కెరీర్లో వారు బిజీ అయ్యారు.పెళ్లికి వేళాయెకొంతకాలం క్రితం రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యాడు. ఇప్పుడు పునర్నవి కూడా పెళ్లికి రెడీ అయింది. ఈ మధ్యే తన ప్రియుడిని పరిచయం చేసింది. హేమంత్ వర్మ ప్రపోజల్కు ఎస్ చెప్పానంటూ అతడితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. తాజాగా వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. లగ్న పత్రికఈ రోజు పునర్నవి - హేమంత్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో లగ్నపత్రిక రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలను పునర్నవి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో నీలిరంగు చీరలో పునర్నవి అందంగా మెరిసిపోతోంది. అయితే తను సింగిల్గా దిగిన పిక్స్ మాత్రమే అభిమానులతో పంచుకుంది.చదవండి: 6 సార్లు శివాజీగా మెప్పించిన యాక్టర్.. ఒక్క సంఘటనతో సంచలన నిర్ణయం -
బిగ్బాస్ కంటెస్టెంట్తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన నటి
కన్నడ సీరియల్ నటి, బిగ్బాస్ ఫేమ్ నమ్రత గౌడ పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం ఊపందుకుంది. బిగ్బాస్ కంటెస్టెంట్ కార్తీక్ మహేశ్తోనే ఏడడుగులు వేయనుందని గాసిప్. రియాలిటీ షో ముగిసిన తర్వాత కూడా ఇద్దరూ తరచూ జంటగా కనిపించడంతో ఇది నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. కానీ, తన పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటోంది నమ్రత.రహస్యంగా పెళ్లి చేసుకోనుఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. నా రిలేషన్షిప్, పెళ్లి గురించి ఏవేవో ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాబట్టి దానిపై మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుంటే ఆ విషయం అందరికీ చెప్తాను. దాన్ని రహస్యంగా ఉంచాల్సిన పని లేదు. నా పెళ్లి చీర కోసం ఏదో కొత్త రంగు సృష్టిస్తున్నారట. ఇది మరీ విడ్డూరంగా ఉంది. మా మధ్య ఉన్నది స్నేహమేఏదేమైనా ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు అని కుండబద్ధలు కొట్టింది. కాగా కన్నడ బిగ్బాస్ పదో సీజన్లో నమ్రత, కార్తీక్ పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ఉన్న చనువు చూసి ప్రేమాయణం నడుపుతున్నారని అభిమానులు ఫీలయ్యారు. అయితే తమ మధ్య ఉన్నది స్నేహమే అని ఈ జోడీ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం వీరి చనువు చూస్తుంటే ఫ్రెండ్షిప్లా లేదని అభిప్రాయపడ్డారు.చదవండి: తల్లి కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగే హీరో -
ఎన్నిసార్లు అనుకున్నానో.. ఇన్నాళ్లకు కుదిరింది: రీతూ
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో ఇద్దరు ఫైర్బ్రాండ్స్ ఉన్నారు. వాళ్లే రీతూ చౌదరి, తనూజ పుట్టస్వామి. తనపై మాటలదాడికి దిగినవారికి కౌంటర్స్ ఇవ్వడంలో రీతూ దిట్ట అయితే టాస్క్స్ ఆడటంలో, మెచ్యూర్డ్గా ప్రవర్తించడంలో తనూజ దిట్ట. వీళ్లిద్దరి స్నేహం చూస్తుంటే ప్రేక్షకులకు భలే ముచ్చట వేసేది. ఫ్రెండ్తో ఎంజాయ్సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా బిగ్బాస్ హౌస్లో ఒకరికోసం ఒకరు నిలబడ్డారు. నిజమైన మిత్రులు అనిపించుకున్నారు. ఇకపోతే షో అయిపోయి కొన్ని నెలలు కావొస్తుండగా తాజాగా తొలిసారి ఈ మిత్రులిద్దరూ కలుసుకున్నారు. ఫిబ్రవరి 16 రాత్రి షాపింగ్ చేస్తూ, నచ్చిన ఫుడ్ లాగిస్తూ, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను రీతూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎన్నిసార్లు అనుకున్నామో!బిగ్బాస్ అయిపోయాక ఒకసారి బయటకు వెళ్లి ఇద్దరం కలిసి కాఫీ తాగుతూ కాలక్షేపం చేయాలని షోలో ఉండగానే అనుకున్నాం. చాలాసార్లు ఇలాంటి ప్లాన్స్ వేసుకున్నాం. మొత్తానికి ఆరోజు రానే వచ్చింది. మేమిద్దరం కలుసుకున్నాం. నవ్వుకున్నాం, మనసారా మాట్లాడుకున్నాం, ఆనందంగా గడిపాం. ఇది నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) చదవండి: -
భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్లోకి..: సామ్రాట్
వినాయకుడు, పంచాక్షరి, దేనికైనా రెడీ, ప్రేమకావాలి, దూసుకెళ్తా వంటి పలు సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సామ్రాట్ రెడ్డి. తర్వాత సడన్గా వెండితెరపై కనిపించడం మానేశాడు. తెలుగు బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హర్షితను పెళ్లి చేసుకున్నాక వైవాహిక జీవితంలో ఇబ్బందులతో వార్తల్లో నిలిచిన సామ్రాట్ తన జీవితంలోని అనేక విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.అందుకే బ్రేక్నటుడు సామ్రాట్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకానొక సమయలో హీరోయిన్తో పెళ్లిపీటలపై కూర్చోవడం.. తీరా పెళ్లి క్యాన్సిల్ అవడం.. ఇలాంటి పాత్రలే తరచూ వచ్చాయి. దీంతో నాకు బోర్ కొట్టేసి బ్రేక్ తీసుకున్నాను. హర్షితను పెళ్లి చేసుకున్న కొంతకాలానికే నాపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇవన్నీ ఉట్టి ఆరోపణలు మాత్రమే!కావాలనే నా ప్రతిష్ట దిగజార్చిందిపెళ్లి వర్కవుట్ కాలేదంటే దాన్ని చాలారకాలుగా డీల్ చేయొచ్చు. పరస్పర అంగీకారంతో లేదా తనవైపు నుంచి విడాకులు పంపించి విడిపోవచ్చు. కానీ ఆమె తప్పు దారి ఎంచుకుంది. నేను నటుడినన్న కారణంతో నా పరువు తీయాలనుకుంది. ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. అదే సమయంలో నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మరింత కుంగిపోయాను. బిగ్బాస్ ఆఫర్ఒక్కసారిగా మా కుటుంబం చిన్నాభిన్నమైంది. మా ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నేను రెండురోజులు జైలుకు వెళ్లివచ్చాను. నాపై లేనిపోని అభాండాలన్నీ వేశారు. అది నా కెరీర్ను కూడా దెబ్బతీసింది. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. అప్పుడు బిగ్బాస్ ఆఫర్ వచ్చింది. వెళ్లకూడదనుకున్నాను. కానీ నాపై పడ్డ నిందలు తొలగించుకోడానికి బిగ్బాస్కు వెళ్లాను. చాలా బాధలు అనుభవించి రాటు తేలిపోయాను. మరో పెళ్లి చేసుకోనుమొదటి పెళ్లి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవితంలో మరో పెళ్లి చేసుకోనని ఇంట్లో చెప్పాను. కానీ, బిగ్బాస్ తర్వాత అంజనా శ్రీలిఖితను కలిశాను. చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకుందామని అడిగాను. కానీ, ఆమె ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. వాళ్లను ఒప్పించేందుకు తను చాలాదూరం వెళ్లింది. అలా 2020లో పెళ్లి జరగ్గా 2022లో పాప పుట్టింది. మొదటిది పెద్దలు కుదర్చిన పెళ్లయితే రెండోది ప్రేమ వివాహం. లిఖిత నా జీవితంలోకి వచ్చాక సంతోషంగా ఉన్నాను అని సామ్రాట్ రెడ్డి చెప్పుకొచ్చాడు.చదవండి: 4 రోజుల్లో రిలీజ్.. హే భగవాన్ టైటిల్ ఛేంజ్ -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివజ్యోతి
యాంకర్, బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి గుడ్న్యూస్ చెప్పింది. తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 12న బేబీ జన్మించగా రెండు రోజులు ఆలస్యంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ పోస్ట్కు ఓ అందమైన ఫోటో జత చేసింది. అందులో శివజ్యోతి కుర్చీలో కూర్చుని నవ్వులు చిందిస్తుండగా ఆమె భర్త గంగూలీ బిడ్డను ఎత్తుకున్నాడు. ఈరోజు (ఫిబ్రవరి 14న) శివజ్యోతి బర్త్డే సందర్భంగా బేబీ రాకను వెల్లడించారు.ఇద్దరి గుండెచప్పుడు ముగ్గురిగా..తనకు ఇంత అందమైన బహుమతిచ్చిన శివజ్యోతికి గంగూలీకి కృతజ్ఞతలు తెలిపాడు. 'హ్యాపీ బర్త్డే, చిన్ని. నీ 33వ పుట్టినరోజుకు ఎంతో అందమైన బహుమతిని తీసుకొచ్చావ్. మన ఇద్దరి గుండెచప్పుడు ఇప్పుడు ముగ్గురిగా మారింది. మాకు పుట్టింది పాప? బాబు? అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు శివజ్యోతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Ganguly Mantri (@ganguly_manthri) చదవండి: కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ -
ఇదే నా జీవితంలో పెద్ద అద్భుతం: శివజ్యోతి ఎమోషనల్
యాంకర్, బిగ్బాస్ ఫేమ్ శివజ్యోతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టినా, మంచి జరిగినా, చెడు జరిగినా అన్ని అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమెకు తొమ్మిది నెలలు నిండాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.థాంక్యూనా చిన్న పాప లేదా బాబుకు ఈ పోస్ట్ అంకితం.. ఈ తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీ ఇంత ఆనందంగా, అందంగా, అద్భుతంగా సాగనిచ్చినందుకు థాంక్యూ.. ఒక్కరోజు లేదా ఒక్కసారి కూడా నువ్వెప్పుడూ నన్ను టెన్షన్ పెట్టలేదు. కొన్నిసార్లు అసౌకర్యానికి లోనయినప్పటికీ అది ఈ జర్నీలో భాగమే.. దాన్ని కూడా నేను ఆస్వాదించాను. మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు నేను, నాన్నా నీకెప్పుడూ రుణపడి ఉంటాం. సేఫ్ డెలివరీనువ్వు మంచి బిడ్డగా ఉంటావని తెలుసు. నువ్వు మా జీవితాల్లోకి వస్తుండటమే అతి పెద్ద ఆశీర్వాదం, అలాగే అద్భుతం కూడా! నిన్ను ఎప్పుడెప్పుడు పొత్తిళ్లలోకి తీసుకోవాలా? అని ఎదురుచూస్తున్నాను. ఈ 9 నెలల జర్నీలాగే డెలివరీ కూడా సేఫ్గా అవుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అమ్మా, నాన్నా అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తప్పకుండా అంతా మంచే జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) చదవండి: నాకు జరిగినట్లుగా నా కూతురికి జరగనివ్వను: రణ్బీర్ కపూర్ -
అర్ధరాత్రి రోడ్డుపై కారు ఆపి.. శ్రీహాన్ మంచి మనసు
కొన్నిసార్లు మన చుట్టూ ఏం జరిగినా చూసీచూడనట్లు పోతాం. కానీ, మానవత్వంతో ఆలోచించి ఒక్క నిమిషం కేటాయిస్తే కొన్ని ప్రమాదాలను నివారించవచ్చంటున్నాడు బిగ్బాస్ ఫేమ్, నటుడు శ్రీహాన్. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్ రన్నరప్గా నిలిచిన శ్రీహాన్.. మా ఆవారా జిందగీ, వర్జిన్ బాయ్స్ సినిమాల్లో నటించాడు.పూటుగా తాగేసి..తాజాగా అతడు తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. రాత్రిపూట రోడ్డుపై కారులో వెళ్తున్న శ్రీహాన్ మార్గమధ్యలో ఓ వ్యక్తి పూటుగా తాగేసి పడి ఉండటాన్ని గమనించాడు. నాకెందుకులే అని వెళ్లిపోకుండా కారు ఆపేసి మత్తులో ఉన్న అతడిని లేపి రోడ్డు దాటించాడు.రెండు నిమిషాల పనిదీనిగురించి శ్రీహాన్ మాట్లాడుతూ.. పెద్దాయన తాగేసి రోడ్డుపై పడి ఉన్నాడు. ఆయనకే సమస్యలున్నాయో, ఎందుకు తాగాడో మనకు అనవసరం. కానీ, వాహనాలు అన్నీ అతడి పక్కనుంచే వెళ్తున్నాయి. పైగా అతడి చేయి, కాలు రోడ్డుపై ఉంది. ట్రాఫిక్ ఎక్కువున్నప్పుడు కార్లకు, పెద్ద వాహనాలకు రోడ్డుపై ఉన్న అతడు కనిపించడు. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఏదైనా జరిగితే..రోడ్డు అవతలివైపు జనాలు నిలబడి చూస్తున్నారంతే! ఒకటీరెండు నిమిషాల సమయం కేటాయిస్తే అతడికి ఎటువంటి హాని జరగకుండా కాపాడవచ్చు. రేపు పొద్దున ఏదైనా జరగరానిది జరిగితే అది రీల్స్లో చూసి అయ్యో, పాపం అనుకోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పుకొచ్చాడు. వీడియోలో టైం, డేట్ తప్పుగా ఉంది, దాన్ని పట్టించుకోవద్దని కోరాడు. ఈ వీడియో చూసిన అభిమానులు మంచి పని చేశావంటూ శ్రీహాన్ను మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) చదవండి: అల్లు అర్జున్ సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న స్రవంతి -
'అల్లు అర్జున్' సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ స్రవంతి
యాంకర్ స్రవంతి సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన కష్టాన్ని నమ్ముకుని ఇప్పుడు స్టార్ యాంకర్గా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తుంది. పలు ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, టెలివిజన్ షోలకు యాంకరింగ్ చేస్తూ అందరికీ దగ్గరైంది. 2009లోనే తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ సరైన గుర్తింపు లేక ఛాన్స్ల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే, పుష్ప విడుదల సమయంలో అల్లు అర్జున్తో ఆమె చేసిన ఒక ఇంటర్వ్యూ తన జీవితాన్నే మార్చేసింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి చెబుతూ శ్రవంతి ఎమోషనల్ అయింది.2021లో పుష్ప సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ను యాంకర్ స్రవంతి ఇంటర్వ్యూ చేసింది. ఆమె కెరీర్లో అతిపెద్ద స్టార్ను కలవడం అదే తొలిసారి. తర్వాత ఆ ఇంటర్వ్యూ సోషల్మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమెకు వెంటనే బిగ్బాస్-5లో ఛాన్స్ దక్కింది. అనంతరం తన కెరీర్ పూర్తిగా ఉన్నత స్థానానికి చేరుకుంది. కేవలం బన్నీని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ దక్కడంతోనే తనకు గుర్తింపు వచ్చిందని ఆమె చెబుతుంది. అల్లు అర్జున్ను ఎప్పటికీ మరిచిపోలేనని అంటూ ఆమె ఇలా చెప్పుకొచ్చింది.'పుష్ప సినిమా విడుదలకు ముందు అల్లు అర్జున్తో ఇంటర్వ్యూ చేశాను. అప్పటి వరకు నా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇంటర్వ్యూ యూట్యూబ్లో షేర్ చేయగా మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అలా నాకు మంచి గుర్తింపు దక్కింది. దీంతో వెంటనే బిగ్బాస్-5లో ఛాన్స్ వచ్చింది. ఒక రకంగా అల్లు అర్జున్ వల్ల నా జీవితమే మారిపోయింది. అందుకే ఆయనపట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సైమా అవార్డ్స్లో బన్నీని కలిశాను. సైమా వేదికపై అవార్డ్ అందుకునేందుకు బన్నీ పేరును నేనే పిలిచాను.. అప్పడు నా గతాన్ని గుర్తుచేసుకుని బన్నీని చూడగానే తెలీయకుండానే కన్నీళ్లు వచ్చాయి. నాకు ఆయన చాలా సాయం చేశారు. ప్రతి పుట్టినరోజు నాడు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్తాను. ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటే అందుకు ప్రధాన కారణం అల్లు అర్జున్ మాత్రమే..' అంటూ శ్రవంతి చెప్పింది.అందరూ అనుకుంటున్నట్లు అల్లు అర్జున్లో ఎలాంటి గర్వం ఉండదని స్రవంతి చెప్పారు. కానీ, కొందరు పనికట్టుకుని విమర్శించడం సాధరణమే అన్నారు. రెగ్యూలర్గా చాలామంది ఫ్యాన్స్ ఆయన ఇంటికి వెళ్తుంటారు. వారందరితో కలిసి ఫోటోలు దిగుతారు. ఇతరులను ఆయన ఎప్పడు కూడా చులకన చేసి చూడరు. ఇలా బన్ని గురించి స్రవంతి చెప్పింది.అల్లు అర్జున్ చేసిన సాయం తలుచుకుని కళ్ల నీళ్లు పెట్టుకున్న యాంకర్ స్రవంతి@alluarjun @urs_sravanthi 📹https://t.co/lj4Z1Wb4Z0 pic.twitter.com/5j49D2T4ca— greatandhra (@greatandhranews) February 11, 2026 -
బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా: ప్రిన్స్ యావర్
దగ్గరి బంధువే తనను నిండా ముంచాశాడని ఇటీవలే ఓ వీడియో రిలీజ్ చేశాడు బిగ్బాస్ కంటెస్టెంట్, మోడల్ ప్రిన్స్ యావర్. అయితే కుటుంబ సభ్యుల బలవంతం వల్ల అతడి కూతుర్ని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నానని చెప్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ప్రిన్స్ యావర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎవర్నీ నమ్మడానికి లేదు. నేను నా దగ్గరి బంధువు చేతిలోనే మోసపోయాను. బలవంతంగా నిశ్చితార్థంఅతడు నన్ను ఓ ఫంక్షన్కు రమ్మని బలవంతం చేశాడు. అక్కడికి అతడి కూతురు కూడా వచ్చింది. ఆమెకు నేనంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే నా నెంబర్ తీసుకుంది. అలా ఇద్దరం తరచూ ఫోన్ మాట్లాడుకునేవాళ్లం. ఆమెకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ! నా కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల తనను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. కానీ పెళ్లి మాత్రం జీవితంలో సెటిలయ్యాక చేసుకుంటానన్నాను. అందులో తప్పేముంది?మోసంఆమె తండ్రి.. ల్యాండ్లో రూ.30 లక్షలు పెడితే రూ.50 లక్షలు తిరిగిస్తానన్నాడు. అంత సొమ్ము నా దగ్గర లేదు. అయినా తనను నమ్మి నేను కష్టపడి సంపాదించిన డబ్బునంతా ఇచ్చేశాను. నా దగ్గరున్న రూ.18 లక్షలు, నా స్నేహితుడిని అడిగి మరో రూ.5 లక్షలు.. అంటే మొత్తం రూ.23 లక్షలు ఇచ్చాను. బదులుగా రూ.40 లక్షలిస్తానన్న అతడు తర్వాత మాట మార్చేశాడు. నెలలు గడుస్తున్నా పైసా ఇవ్వలేదు. నా బ్రదర్కి రూ.7 లక్షలు ఇచ్చానంటున్నాడు. డిప్రెషన్నాకు ఒక్కమాటైనా చెప్పకుండా వేరేవాళ్లకు ఎలా ఇస్తాడన్నది నా ప్రశ్న. నా డబ్బు నాకు తిరిగివ్వకపోగా తన కూతురిని అడ్డుపెట్టుకుని సింపతీ డ్రామాలు ఆడుతున్నాడు. నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నాడు. వాళ్ల వల్ల నేను 8 నెలలుగా డిప్రెషన్లో ఉన్నాను. మానసిక ప్రశాంతతను కోల్పోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అని ప్రిన్స్ యావర్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారో చెప్పిన కరీనా కపూర్ -
జీవితంలో సంతోషంగా లేను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా!
బిగ్బాస్ అగ్నిపరీక్ష ద్వారా పాపులర్ అయింది శ్రీజ దమ్ము. పేరుకు తగ్గట్లుగానే షోలో తన దమ్ము చూపించి తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో అడుగుపెట్టింది. కానీ మొదట్లో ఓవర్ యాటిట్యూడ్ చూపించి విమర్శలపాలైంది. అయితే తన ముక్కుసూటితనం, ఆటతీరు వల్ల అభిమానులను సైతం సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోలింగ్ ఇతరత్రా విషయాలను పంచుకుంది.ట్రోలింగ్శ్రీజ దమ్ము మాట్లాడుతూ.. మా నాన్న జీవీఎంసీ (మహా విశాఖ నగర పాలక సంస్థ) ఉద్యోగి (పారిశుద్ధ్య కార్మికుడు). నేను బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఓసారి చీర దోపుకుని చెత్త బ్యాగులు పట్టుకెళ్లాను. దానికి విపరీతంగా ట్రోల్ చేశారు. తడిచెత్త, పొడిచెత్త అమ్ముకునేలా ఉంది.. సరిగ్గా సరిపోయింది అని విమర్శించారు. అది చూసి నేను నవ్వుకున్నాను. అందుకు సంతోషంకానీ, మా నాన్న చేసే పని అదే కావడంతో ఇంట్లో వాళ్లు బాధపడ్డారు. ఏదేమైనా బిగ్బాస్కు వెళ్లి నాకంటూ ఓ పేరు సంపాదించుకున్నందుకు హ్యాపీ. కానీ ప్రేక్షకుల ఓట్ల ద్వారా కాకుండా వైల్డ్ కార్డ్స్తో గేమ్ ఆడించి బయటకు పంపించినందుకు బాధగా అనిపించింది. నాకే ఎందుకిలా జరుగుతుందని ఏడ్చాను. ఇప్పుడు తల్చుకున్నా బాధనిపిస్తుంది.నేను పెళ్లి చేసుకునేవాడు..పార్టీలు, పబ్బులకెళ్తా.. కానీ, మందు మాత్రం తాగను. నాకు కాబోయే భర్త తాగుడుకు బానిసైతే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా.. ఇంకా నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మంచి హైట్ ఉండాలి, జుట్టుండాలి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలి. రేపు నేను ఉద్యోగం చేసినా, చేయకపోయినా, ఖాళీగా ఉన్నా అతడే అన్నీ చూసుకునేలా ఉండాలి. నాకయితే ప్రేమపెళ్లి చేసుకోవాలని ఉంది. నేనంటే పడి చచ్చిపోయేవాడు కావాలి.నా జీవితం నా ఇష్టంనా డ్రెస్సింగ్పై వచ్చే ట్రోల్స్ పట్టించుకోను. నేను షార్ట్ వేసుకుంటా.. టీషర్ట్ వేసుకుంటా.. నీకెందుకు? నా జీవితం నా ఇష్టం. నాకు నచ్చినట్లుగా బట్టలు వేసుకుంటాను. ఇకపోతే సొంతింటి కల ఒక్కటే నాకున్న పెద్ద డ్రీమ్. ఇంతవరకు నేనెప్పుడూ సంతోషంగా లేను. ఏదో లైఫ్ ముందుకెళ్తుందా? అంటే వెళ్తుందంతే! ప్రశాంతమైన జీవితం దొరికితే సంతోషంగా ఉంటాను. అలా అని డిప్రెషన్లో లేను. బిగ్బాస్ కోసం రూ.2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేశా.. ఇప్పుడుమ మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను అని శ్రీజ చెప్పుకొచ్చింది.చదవండి: సర్వం మాయ బ్లాక్బస్టర్ హిట్.. తండ్రికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన దర్శకుడు -
ఏడేళ్లుగా మంచానికే పరిమితం.. హైదరాబాద్లో ముమైత్ ఖాన్
మహేష్ బాబు పోకిరి సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..' అంటూ ముమైత్ ఖాన్ ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్తో తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. బిగ్బాస్లో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ, హైదరాబాద్లో విలైక్ అనే అకాడమీని స్థాపించి మేకప్కు సంబంధించిన కోర్సులను నేర్పిస్తోంది. అయితే, తనకు జరిగిన ప్రమాదం గురించి ఆమె మరోసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ముమైత్ ఖాన్ తన జీవితం గురించి పేర్కొంది. 2016లో ఓ రోజు తన ఇంట్లోనే కాలు జారి కింద పడింది. ఆ సమయంలో తన తల.. మంచం అంచులకు బలంగా తగిలింది. పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆస్పత్రికి వెళ్లలేదు. కానీ తల నొప్పి తీవ్రమవడంతో ఆస్పత్రికి వెళ్లింది. మూడు రోజులుగా ఆమెకు మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజులపాటు ముమైత్ కోమాలో ఉంది. ఆ తర్వాత ఆమె ఆ గాయం నుంచి కోలుకుంది. అయితే, డాక్టర్లు సలహా మేరకే తాను ఇండస్ట్రీకి దూరం కావలసి వచ్చిందని ముమైత్ ఖాన్ తెలిపింది.తన మెదడులో కూడా కొన్ని నరాలు దెబ్బ తినడం వల్ల ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని వైద్యులు చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకుంది. వైద్యులు సూచించిన మందులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల తన బరువు కూడా పెరిగిందని పేర్కొంది. సుమారు 7ఏళ్ల పాటు మంచానికే పరిమతం అయ్యానని ఆమె తెలిపింది. అయితే, తాను గతేడాదిలోనే పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నానని తెలిపింది. View this post on Instagram A post shared by Mumtaz Khan (@mumait) -
భర్త మోసం చేశాడన్న 'వడాపావ్ గర్ల్'.. వీడియో రిలీజ్
ఢిల్లీ వీధుల్లో వడాపావ్ అమ్ముతూ ఫేమస్ అయింది చంద్రికా దీక్షిత్. సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన ఈ అమ్మాయి హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్లోనూ పాల్గొంది. తాజాగా.. భర్త యుగం గేరాపై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కింది. భర్త మోసం చేస్తున్నాడంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో చంద్రిక మాట్లాడుతూ.. ఎప్పుడూ గొడవలు, కొట్లాటలేనా అని అడుగుతున్నారు. రెండు నెలలుగా నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకేం తెలుసు? నావల్ల కావట్లే..అన్నింటినీ మౌనంగా భరిస్తున్నాను. నా బాధేంటో మీకు చెప్పనా? అటు పిల్లాడిని, ఇటు ఇంటిని.. అన్నింటినీ మ్యానేజ్ చేసుకుంటున్నాను. అన్ని బాధ్యతలు నేనే నిర్వర్తిస్తున్నాను. అయినా అతడు (భర్త) ఇలా చేస్తుంటే నేనేం చేయాలి? (ఫోన్లో చాటింగ్ స్క్రీన్షాట్, భర్తతో క్లోజ్గా ఉన్న ఓ అమ్మాయి ఫోటోలు చూపిస్తూ) ఈ అమ్మాయి ఎప్పుడూ నా భర్త చుట్టూనే తిరుగుతోంది. నా భర్త, నా ఇల్లు అని ఏదేదో అంటోంది. ఈ ఫోటోలు నన్ను చిత్రవధ చేస్తున్నాయి. నా మెదడును పని చేయనివ్వడం లేదు. నావల్ల కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది.గుర్తుపెట్టుకో..దీనిపై ఆమె భర్త యుగం గేరా స్పందించాడు. నీకు అవసరమైంది నువ్వు చూపించావు. నా తప్పు ఉందని నేను ఒప్పుకుంటున్నాను. కానీ, అదేమంత పెద్ద తప్పు కాదు. సాక్ష్యాల గురించి మాట్లాడుతున్నావ్.. అలాంటివి నాదగ్గర చాలా ఉన్నాయి. నేను అనుకుంటే చాలా చేయగలను. కానీ నేనేమీ చేయను. ఇంకోటి.. నీ రెస్టారెంట్ నావల్లే నడుస్తుందన్న విషయం గుర్తుపెట్టుకో అని కౌంటరిచ్చాడు. కాగా చంద్రికా.. ఆర్టిస్ట్ యుగం గేరాను పెళ్లి చేసుకుంది. యుగం గేరా.. చంద్రిక కంటే రెండుమూడేళ్లు చిన్నవాడు. ఈ దంపతులకు కుమారుడు రుద్ర సంతానం. View this post on Instagram A post shared by Chandrika Gera (@chandrika.dixit) చదవండి: అందుకే పిల్లల్ని కనలేదు: ప్రముఖ నటి -
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
బిగ్బాస్ షో లోపల ఉన్న కంటెస్టెంట్ల కోసం బయట ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఓ పట్టాన అయిపోవు. షో అయిపోయాక కూడా అవతలి కంటెస్టెంట్పై విషం చిమ్ముతూనే ఉంటారు. ఏం పని చేసినా కూడా విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ఈ అనవసరపు ట్రోలింగ్ వల్ల తాను మానసిక వేదన అనుభవిస్తున్నానంటోంది తెలుగు బిగ్బాస్ 7 రన్నరప్ , నటి తనూజ పుట్టస్వామి.ఎవరి జీవితాల్లో వారు బిజీఈ మేరకు తనూజ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. చాలాకాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీతో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను నిందించడం ఆపండి. మీ అందరిలాగే నాకూ ఓ జీవితం ఉంది. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నా బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఎవరి జీవితాల్లో వారందరూ బిజీ అయిపోయాం.పీఆర్ టీమ్ లేదుప్రతిదానికి పీఆర్(డబ్బులు పెట్టి ఒక టీమ్ నడపడం) అనడం మానేయండి. నాకు పీఆర్ టీమ్ అంటూ ఏదీ లేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నారంతే! ఈరోజుకూ నాపై తీవ్రమైన నెగెటివిటీ వస్తోంది. ప్రతిరోజు అసభ్యంగా దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నేను ఒకర్ని టార్గెట్ చేశానని, ఒకర్ని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నరకం అనుభవిస్తున్నా..అవతలివారిపై మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను. కానీ, నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసా? నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? ప్రతిరోజు చెండాలమైన మాటలంటున్నారు. నా క్యారెక్టర్ను తప్పుపడుతున్నారు, అవమానిస్తున్నారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా క్యారెక్టర్ను వక్రీకరిస్తుంటే మహిళగా భరించలేకపోతున్నాను. నోటికొచ్చిన మాటలనడం మీకు చిన్న విషయమేమో! గుండె నిండా బాధనన్ను మాత్రం ఎంతో బాధిస్తున్నాయి. గుండె లోతులో గాయాలు చేస్తున్నాయి. ఈ బాధనంతా భరిస్తూ ఎక్కడికని వెళ్లను? ఎవరితో పంచుకోను? అందుకే.. మౌనాన్ని ఆశ్రయించాను. నా తప్పు ఉందని కాదు, ధైర్యాన్ని కూడదీసుకునేందుకు నిశ్శబ్ధంగా ఉంటున్నాను. మీలాగే నాకూ ఓ కుటుంబం ఉంది. మీరు నా గురించి వాగే చెత్తవాగుడు, చెత్త కామెంట్స్ నా కుటుంబసభ్యులు కూడా చదువుతారు. అప్పుడు వాళ్లెంత బాధపడతారు? మానసికంగా చిత్రవధఅసభ్య కామెంట్లు పెట్టే ఫేక్ అకౌంట్స్ ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. నేనే కాదు, నాకు సపోర్ట్గా నిలబడ్డవారిని కూడా ద్వేషిస్తున్నారు. ఒకర్ని మానసికంగా చిత్రవధ చేస్తే ఏమొస్తుంది? ఒకరిపై విషం చిమ్మితే ప్రశాంతంగా ఉండొచ్చనుకుంటున్నారా? ఇక్కడ నేనెవర్నీ కిందకు లాగాలనుకోవడం లేదు. డ్రామా క్రియేట్ చేయాలని అసలే అనుకోవట్లేదు. నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా, గౌరవంగా జీవించాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. మరి ఇకమీదటైనా ఈ ట్రోలింగ్ తగ్గుతుందేమో చూడాలి!తనూజ వర్సెస్ కల్యాణ్బిగ్బాస్ 7 షోలో తనూజ, పవన్ కల్యాణ్ మంచి ఫ్రెండ్స్లా ఉన్నారు. కానీ బయట మాత్రం వారి అభిమానులు రెండుగా విడిపోయారు. మా కంటెస్టెంటే గొప్ప అని ఎప్పుడూ తగువులాడేవారు. ఈ క్రమంలోనే అవతలి కంటెస్టెంట్ను విమర్శించేవాళ్లు! చివరకు కల్యాణ్ ట్రోఫీ గెలవడంతో తనూజ వల్లే గెలిచాడని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో తనూజకు వ్యతిరేకంగా ఉన్నవారు ఆమెను ట్రోల్ చేశారు.చదవండి: ఈ వారం ఓటీటీలో సంక్రాంతి సినిమాలు.. డోంట్ మిస్ -
రూ.30 లక్షలు మోసపోయా.. డిప్రెషన్, చచ్చిపోవాలనుకున్నా!
బంధువును నమ్మి డబ్బులిచ్చి మోసపోయానంటున్నాడు బిగ్బాస్ కంటెస్టెంట్, మోడల్ ప్రిన్స్ యావర్. తన డబ్బు ఇవ్వమని అడిగితే.. పెద్ద పెద్దవార్ల పేరు చెప్పి బెదిరిస్తున్నాడంటూ ఓ వీడియో షేర్ చేశాడు. అందులో ప్రిన్స్ యావర్ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ బలవంతం చేయడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. నా బంధువుల్లో ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడు. స్థలం విషయంలో రూ.30 లక్షలు ముంచేశాడు. అయితే నా ఫ్యామిలీతో మాట్లాడి రూ.23 లక్షలు తిరిగిస్తానని నన్ను ఒప్పించాడు.పైసా ఇవ్వడం లేదు15 రోజుల్లో ఇచ్చేస్తానన్నాడు. కానీ, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తిరిగివ్వలేదు. అన్ని చోట్లా నన్ను బ్లాక్ చేశాడు. అతడి స్నేహితుడికి ఫోన్ చేస్తే నువ్వేం చేయలేవంటూ రివర్స్లో నన్నే బెదిరిస్తున్నారు. పెద్దవాళ్ల పేర్లు చెప్పి భయపెడుతున్నారు. అందులో కేటీఆర్ సర్ పేరు కూడా ఉంది. ఈ వీడియో కేటీఆర్ సర్ దగ్గరికి చేరాలని కోరుకుంటున్నాను. ఆయన వెనకాల ఇంత జరుగుతుందని కేటీఆర్ సర్కు తెలియదనే అనుకుంటున్నాను. చచ్చిపోదామనుకున్నాఇకపోతే అతడు చేసిన మోసం వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. భయంకరమైన ఆలోచనలు వచ్చాయి. చచ్చిపోవాలనుకున్నాను. కానీ, నాకు నా అభిమానులున్నారు. వారికోసం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన విరమించుకున్నాను. నాలా ఇంకెవరూ మోసపోకూడదు అని చెప్పుకొచ్చాడు. ప్రిన్స్ యావర్.. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతకుముందు సీరియల్స్ కూడా చేశాడు. పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు. View this post on Instagram A post shared by Yawar Ahmed (@princeyawar) చదవండి: మీరే నా బలం.. 30 ఏళ్లర్నీపై కిచ్చా సుదీప్ ఎమోషనల్ -
బిగ్బాస్ తర్వాత పని దొరకదు, డిప్రెషన్: ఆర్జే కాజల్
బిగ్బాస్ షోలో పార్టిసిపేట్ చేసినవాళ్లు ఒక్కసారిగా సెలబ్రిటీలు అయిపోతారు. కానీ ఆ ఫేమ్ కొంతకాలమే ఉంటుంది. పైగా దానివల్ల అవకాశాలు వస్తాయా? అంటే అదీ అంతంతమాత్రమే! చాలా తక్కువమందికి మాత్రమే బిగ్బాస్ కలిసొస్తుంది. విన్నర్స్తో సహా అనేకమందికి షో వల్ల ఎటువంటి ఫాయిదా ఉండదు. అదే బల్లగుద్ది చెప్తోంది నటి ఆర్జే కాజల్.బిగ్బాస్ సెలబ్రిటీస్ఈమె తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్లో పాల్గొంది. బిగ్బాస్ నిజస్వరూపం ఇదేనంటూ తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో కాజల్ మాట్లాడుతూ.. బిగ్బాస్ సెలబ్రిటీస్.. జనాలు వాళ్లను సెలబ్రిటీలనే పిలుస్తారు. కానీ, అసలు బిగ్బాస్ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొంతమందికి వాళ్ల రెగ్యులర్ వర్క్స్, సినిమాలు, షోస్, అవార్డ్స్ బానే ఉంటాయి. కానీ చాలామంది విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి?ఎక్కడికి వెళ్లినా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే అడుగుతారు. దానికి ఇబ్బందిగానే ఏమీ లేదని బదులిస్తారు. బద్ధకం వల్లనో, టాలెంట్ లేకనో కాదు అవకాశాలు రాక! బిగ్బాస్ తర్వాత ఫుల్ బిజీ, ఫుల్ వర్క్ అని అందరూ అనుకుంటారు, కానీ అది మూడు, నాలుగు నెలల వరకు మాత్రమే పరిమితం. దానికి తోడు బిగ్బాస్ ట్రామా, డిప్రెషన్! ఇంతకుముందు చేసుకున్న పని మనస్ఫూర్తిగా చేసుకోలేక, కెరీర్లో ఎదుగుదల లేక, ముందుకెళ్లలేక, వెనకడుగు వేయలేక సతమతమవుతూ ఉంటారు. జీవితాంతం ఎదురుచూపులుయాక్టర్స్ పరిస్థితి మరీ దారుణం.. ఆ బిగ్బాస్ సీజన్లో నిన్ను చాలామందే చూశారు, కొత్త ముఖాలు కావాలి అంటారు. చాలామంది ప్రధాన పాత్రల కోసం జీవితాంతం ఎదురుచూస్తూనే ఉంటారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోతారు. ఇంకొందరు సోషల్ మీడియా, యూట్యూబ్తో సరిపెట్టుకుంటారు. రోడ్డుమీదకెళ్తే అందరూ గుర్తుపడతారు, సెల్ఫీలడుగుతారు. ఫేమ్ వల్ల ఏదీ మారదుకానీ పని విషయానికి వచ్చేసరికి మాత్రం ఎంతమంది ఫాలోవర్లున్నారు? ఎంత రీచ్ ఉంది? అని డబ్బు దగ్గర బేరాలడతారు. బతకడం కోసం కొందరు తక్కువ డబ్బు ఇచ్చినా కాదనలేక చేసుకుంటూ పోతారు. కొంతమంది వేరే కెరీర్ ఎంచుకుంటారు. మరికొందరు సైలెంట్గా మాయమైపోతారు. బిగ్బాస్ వల్ల రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవచ్చు కానీ ఫేమ్ ఒక్కటే కెరీర్ను నిర్మించదు. బిగ్బాస్ వల్ల ఏదీ మారిపోదు. అది కేవలం ఫేమస్ రియాలిటీ షో. అంతే! అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by RJ Kajal️️️️️️ (@kajalrj) చదవండి: ఐశ్వర్యరాయ్ తొలి సంపాదన ఎంతో తెలుసా? -
యాక్సిడెంట్తో అనాథగా.. రెండుసార్లు బ్రేకప్.. కీర్తి నేపథ్యం
హాయిగా ఆడుతూ పాడుతూ జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన సమయంలో కష్టాలు, కన్నీళ్లతో సావాసం చేసింది. నటిగా జర్నీ మొదలుపెట్టినప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే చేయి లేకున్నా స్వయంకృషితో ఎదిగింది. కాళ్లలోని ఐరన్ రాడ్స్ తన ముందడుగును ఆపలేకపోయాయి. నా అనేవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా కెమెరా ముందు మాత్రం బలవంతంగా నవ్వు పులుముకునేది. తనే కీర్తి భట్. ప్రియుడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న కారణంగా వార్తల్లో ఉన్న కీర్తి గురించే ప్రత్యేక కథనం.యాక్సిడెంట్తో జీవితం తలకిందులుకీర్తి భట్ కన్నడ అమ్మాయి. 2017లో జరిగిన ఓ యాక్సిడెంట్లో కుటుంబాన్ని కోల్పోయింది. తల్లిదండ్రులు, అన్నవదిన అందరూ దూరమయ్యారు. తీవ్ర గాయాలపాలైన కీర్తి కొన ప్రాణంతో బయటపడింది. కొంతకాలం కోమాలో ఉండి కోలుకుంది. అయితే యాక్సిడెంట్ వల్ల తను తల్లయే అదృష్టాన్ని కోల్పోయింది. ఎవరూ లేని అనాథగా బతుకు వెల్లదీస్తూనే తన కెరీర్ను తనే నిర్మించుకుంది. ఫస్ట్ లవ్అలాంటి సమయంలో ఓ వ్యక్తి తనను ప్రేమ పేరుతో వెంబడించాడు. అతడి ప్రేమ నిజమేననుకుంది, కరిగిపోయింది. ఇకపై తాను అనాథ కాదనుకుని పొంగిపోయింది. అతడి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించింది. కానీ అదంతా కపట ప్రేమ అని కొంతకాలానికే అర్థమైపోయింది. తన డబ్బును వాడుకుంటున్నారని ఆల్యంగా తెలుసుకుంది. తాను నటించే సీరియల్ హీరోతో షోకి వెళ్లినా ప్రియుడు, అతడి తల్లి అనుమానించేవారు. ఆఖరికి కీర్తి దత్తత తీసుకున్న పాప కూడా కన్నకూతురేనేమో అని డీఎన్ఏ టెస్టుకూ సిద్ధపడ్డారు.బిగ్బాస్ షోఇక భరించలేకపోయింది. అతడి ప్రేమకు దండం పెట్టేసి ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చింది. ఇంతలో తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్ నుంచి ఆఫర్ వచ్చింది. బిగ్బాస్కు వెళ్లేముందు దత్తత తీసుకున్న పాప కూడా చనిపోయేసరికి ఆమె గుండె ముక్కలయింది. ఆ బాధను దిగమింగుకుని బిగ్బాస్లో అడుగుపెట్టింది. ఆరో సీజన్లో ఫస్ట్ లేడీ కెప్టెన్గా నిలిచింది. ఫినాలేలో సెకండ్ రన్నరప్గా నిలిచింది. ఎంగేజ్మెంట్బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక హీరో, దర్శకుడు విజయ్ కార్తీక్ రూపంలో తనకు తోడు దొరికింది. తను ఎప్పటికీ తల్లి కాలేదని తెలిసినా.. కీర్తియే తనకు చిన్నపాప అంటూ అతడి కుటుంబం అంతా ప్రేమగా చూసుకుంది. ఈ సంతోషం జీవితాంతం ఇలాగే ఉండాలనుకుంది. 2023లో కీర్తి- విజయ్ నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో బ్రేకప్ చెప్పుకున్నారు. పరస్పర అంగీకారంతో విడిపోయామని కీర్తి అంటుంటే.. నా దగ్గర డబ్బుల్లేవని మరొకర్ని చూసుకుంటుందని విజయ్ కార్తీక్ ఆరోపించాడు.బ్రేకప్అతడి ఆరోపణలకు తోడు సోషల్ మీడియాలో తనపై వదంతులు సృష్టిస్తుండటంతో కీర్తి మనస్తాపానికి గురైంది. తనకేదైనా జరిగితే అసత్య ప్రచారం చేస్తున్నవారే బాధ్యులు అని మండిపడింది. ఏదేమైనా ఈ బాధలో నుంచి కీర్తి బయటకు వచ్చి మళ్లీ మామూలు జీవితం గడపాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కీర్తి.. మనసిచ్చి చూడు, మధురానగరిలో, కార్తీక దీపం వంటి సీరియల్స్లో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: అదే నన్ను కుంగదీస్తోంది.. నాకేదైనా జరిగితే..: కీర్తి భట్ -
నాకేదైనా జరిగితే అందుకు వారే బాధ్యులు: కీర్తి భట్
కన్నడ నటి, బిగ్బాస్ ఫేమ్ కీర్తి భట్ మూడేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకుంది. దర్శకుడు, హీరో విజయ్ కార్తీక్ తోటతో ప్రేమలో ఉన్న ఆమె అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇద్దరూ ఎంగేజ్మెంట్ అయ్యాక ఒకేచోట కలిసున్నారు. కానీ పెళ్లి ఊసు మాత్రం పక్కన పెట్టేశారు. ఈ ఏడాదైనా వెడ్డింగ్ గురించి శుభవార్త చెప్తారనుకుంటే విడిపోయామని బ్రేకప్ న్యూస్ చెప్పారు.కీర్తి మోసం చేసిందంటూ..అది విని అభిమానులు షాక్కు గురయ్యారు. కీర్తిని తల్లిలా చూసుకుంటానన్న విజయ్ కార్తీక్ ఎందుకింత మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతడు సోషల్ మీడియా వేదికగా కీర్తియే తనను వదిలేసి మరో కొత్త జీవితం ప్రారంభించిందన్నాడు. తన దగ్గర డబ్బు లేదనే వదిలేసి మరో వ్యక్తిని చూసుకుందని చెప్పాడు.కీర్తిపై ట్రోలింగ్దీంతో చాలామంది కీర్తిని విమర్శిస్తున్నారు. తల్లి కాలేదని తెలిసినా పెళ్లికి ముందుకు వచ్చి అంత బాగా చూసుకున్న వ్యక్తిని డబ్బు కోసం వదిలేయడం కరెక్ట్ కాదని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో కీర్తి భట్ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఒకరు చెప్పిన మాటల్ని విని అదే కరెక్ట్ అనుకుని నన్ను తప్పు పట్టడం సరి కాదు. మీరు నా గత పోస్ట్ చూస్తే.. అందులో ఎక్కడా అవతలివారి బలహీనతల్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించలేదు.నా వల్ల కావట్లేదునాపై యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీలలో లేనిపోని ఊహాగానాలు, కథలు అల్లుతూ ఏవేదో ప్రచారం చేస్తున్నారు. అది నన్ను మరింత బాధపెడుతోంది. నిజంగా నావల్ల కావడం లేదు. ఎవరైతే నాపై నిందలు వేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారో వారి పేర్లు అన్నీ రాసిపెట్టుకున్నాను. నా జీవితంలో ఏదైనా జరగరానిది జరిగితే అందుకు వారే బాధ్యులు అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: అత్తారింట్లో ఇంకా ఆ ప్రయోగం చేయలేదు: శోభిత -
అప్పుడు ఐదో నెల ప్రెగ్నెంట్.. నాపై భర్త అఘాయిత్యం!
కేరళలో ఇటీవల విషాదకర ఘటన జరిగింది. బస్సులో దీపక్ అనే వ్యక్తి తనను అసభ్యంగా తాకాడంటూ ఓ యువతి చేసిన వీడియో కారణంగా అతడు తనువు చాలించాడు. ఏ తప్పూ చేయకపోయినా తన పరువు తీసిందని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై మలయాళ బిగ్బాస్ కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్రీదేవి గోపీనాథ్ స్పందించింది.కఠిన శిక్ష విధించాలి'దీపక్ చావుకు కారణమైన అమ్మాయిని అరెస్టు చేసినందుకు సంతోషంగా ఉంది. తనకు కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ ఒక్క ఘటన కారణంగా ఆడజాతి మొత్తాన్ని తిడుతున్నారు. ఆడవారికి, మగవారికి విడివిడిగా బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అట్టముక్కలతో, వైర్లు చుట్టుకుని బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అందరు మగవాళ్లు చెడ్డవారు కాదు, అలాగే అందరు ఆడవాళ్లు చెడ్డవారు కాదు! ఆడవాళ్లకు రక్షణేది?ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందు పదహారేళ్ల అబ్బాయి 14 ఏళ్ల అమ్మాయిని హత్యాచారం చేశాడు. అలా అని దీపక్ చావును నేను తక్కువ చేయడం లేదు. అతడికి జరిగింది మరెవరికీ జరగకూడదు. కానీ ఆడవాళ్లకు కూడా రక్షణ ఎక్కడుంది? తండ్రులు, సవతి తండ్రులు, అంకుల్స్, ఫ్రెండ్స్, సమాజంలోని ఎంతోమంది చేతిలో మహిళలు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. ఈ రాక్షసులు చిన్న పిల్లల్ని కూడా వదలడం లేదు.ఐదు నెలల గర్భిణీగా ఉన్నప్పుడు..దీపక్ కేసులో అరెస్టయిన అమ్మాయిని కూడా అత్యాచారం చేయాలని ఓ ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నాడు. అది అతడి మానసిక స్థితిని తెలియజేస్తుంది. నేను ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా భర్త నాపై అత్యాచారం చేశాడు. దయచేసి ఎవరూ నోటికొచ్చినట్లు మాట్లాడకండి.. ఏదైనా అనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆడవాళ్లందరినీ రాక్షసులుగా చిత్రీకరించకండి' అని శ్రీదేవి కోరింది.చదవండి: 2009లో ఇండస్ట్రీలో.. ఇన్నాళ్లకు నటిగా లాంచ్: స్రవంతి -
హైట్తోనే సమస్య.. డేటింగ్పై 'బిగ్బాస్ దివి' కామెంట్స్
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ షో ద్వారా చాలామంది ఫేమ్ తెచ్చుకున్నారు. అలా నాలుగో సీజన్లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ ఆమె బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన బ్రేకప్ లవ్ స్టోరీతో పాటు మరోసారి డేటింగ్ ప్లాన్లో ఉన్నానని చెప్పి షాకిచ్చింది. అయితే, ప్రస్తుతానికి తనకు సరైన జోడీ దొరకడం లేదని తెలిపింది. ప్రధానంగా తన హైట్ సమస్యగా మారిందని పేర్కొంది.బిగ్బాస్ దివి సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన లవ్ బ్రేకప్ గురించి ఇలా చెప్పింది. 'ఒకప్పుడు బ్రేకప్ వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. కొంత కాలం పాటు కలిసి ఉన్న వ్యక్తి దూరం అయితే ఎవరిలోనైనా సరే చాలా బాధ ఉంటుంది. నేను కూడా చాలారోజుల పాటు ఏడ్చాను. మరోకరు మన జీవితంలోకి వచ్చేవరకు ఆ డిప్రెషన్ కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ఆ బ్రేకప్ తర్వాత నేను ఒక నటిగా మారాను. సినిమా, ఫోటో షూట్ ఛాన్స్లు వచ్చాయి. చాలా ప్రాజెక్ట్లతో బిజీ అయిపోయాను. దీంతో త్వరగానే కోలుకున్నాను. అయితే, ప్రస్తుతం నేను డేటింగ్ చేసేందుకు ప్లాన్లో ఉన్నాను. కానీ, నాకు నచ్చిన వ్యక్తి దొరకడం లేదు. కొందరు దొరికినప్పటికీ వారితో నేను కనెక్ట్ కాలేకపోతున్నాను. ప్రస్తుతం సింగిల్గానే ఉంటున్నాను. నా హైట్కు తగిన అబ్బాయి దొరకాలంటే కనీసం ఆరు అడుగులు ఉండాలి. ప్రస్తుతం ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏదీ సెట్ కావట్లేదు. నాకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా తెలియడం లేదు.' అని దివి పేర్కొంది.బ్రేకప్ ఎందుకు అయిందంటే..దివి గతంలో తన బ్రేకప్ స్టోరీని చెప్పింది. విడిపోవడానికి కారణం కూడా ఇలా తెలిపింది. 'బీటెక్ చదివే రోజుల్లోనే మేం ప్రేమించుకున్నాం. ఎంటెక్ వరకు ఇద్దరం రిలేషన్లో ఉన్నాం. పెద్దలతో మాట్లాడిన తర్వాత పెళ్లికి కూడా అంగీకరించారు. ముహూర్తం కూడా పెట్టుకున్నాం. కానీ ఇంతలోనే అతడి తమ్ముడి.. అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. అయితే నా బాయ్ ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు నా కళ్ల ముందే చనిపోయాడు. ఎందుకంటే అతడి చివరి రోజుల్లో నేను దగ్గరే ఉన్నా. అలానే చనిపోయిన తర్వాత వాళ్ల ఇంటి దగ్గర చివరి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యే వరకు నా బాయ్ ఫ్రెండ్కి తోడుగా ఉన్నాను''ఈ సంఘటన జరిగిన తర్వాత అతడు సొంతూరిలోనే తల్లదండ్రులకు తోడుగా ఉండిపోయాడు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండాల్సి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. అయితే తనతో పాటు నన్ను కూడా ఊరికి తీసుకెళ్లపోతే నా కెరీర్ నాశనమవుతుందని అనుకున్నాడు. ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. ఒకవేళ ఇది ముందే తెలుసుంటే అతడితో పాటు నేను వాళ్ల ఊరికి వెళ్లిపోయేదాన్నేమో' అని దివి తన ట్రాజెడీ ప్రేమకథ గురించి బయటపెట్టింది. View this post on Instagram A post shared by Divi (@actordivi) -
బిగ్బాస్ సోనియా కూతురి బారసాల ఫంక్షన్
బిగ్బాస్ కంటెస్టెంట్, నటి సోనియా ఆకుల 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకుంది. యష్ వీరగోనిని ప్రేమించి పెళ్లాడింది. ఈ వేడుకకు బిగ్బాస్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. కాగా సోనియా- యష్ దంపతులు పెళ్లయిన ఏడాదికే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. 2025 డిసెంబర్ 8న వీరి ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టింది. తనకు శిఖ వీరగోని అని నామకరణం చేశారు.నిద్రలేని రాత్రులుతాజాగా కూతురి బారసాల ఫంక్షన్ ఫోటోలను సోనియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. '28 డిసెంబర్ 2025.. 21 రోజుల ఫంక్షన్ ఎంత అద్భుతంగా గడిచిందో.. నీ చిన్ని పాదాలు, నాకు నిద్రలేని రాత్రులు, వెల్లివిరిసిన ఆనందాలు.. మాటల్లో చెప్పలేంతన సంతోషాన్ని మా కుటుంబంలోకి తీసుకొచ్చావు. ఇప్పుడు జీవితం మరింత ప్రకాశవంతంగా మారింది. ఇల్లు నిండుగా కనిపిస్తోంది' అంటూ పాపను ఎత్తుకున్న ఫోటోలను షేర్ చేసింది. తొలిసారి ఊయలలోసోనియా దంపతులిద్దరూ కలిసి పాపను తొలిసారి ఊయలలో వేశారు. అయితే చిన్నారి ముఖాన్ని మాత్రం చూపించలేదు. పాపను చూపించొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా మూడునెలలవరకు చూపించకూడదనే ఆగాం.. వచ్చే నెలలో చూపిస్తాను అని సోనియా బదులిచ్చింది. నార్మల్ డెలివరీయా? సీ సెక్షనా? అని మరో నెటిజన్ అడగ్గా సీ సెక్షన్ జరిగిందని పేర్కొంది. సోనియా.. జార్జ్రెడ్డి, కరోనా వైరస్, ఆశ ఎన్కౌంటర్ సినిమాల్లో నటించింది. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో పాల్గొంది. View this post on Instagram A post shared by Soniya Yash (@soniya.yashofficial) చదవండి: విడాకులు తీసుకున్న బుల్లితెర జంట -
మైత్రీ మూవీస్ చేతిలో బిగ్బాస్ 'అమర్దీప్' సినిమా
బిగ్బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. తాజాగా ఈ మూవీ నుంచి 'నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ' అంటూ సాగే లవ్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా.. కృష్ణ మాదినేని రచించారు. సింగర్ గోల్డ్ దేవరాజ్ ఆలపించారు. అయితే, ఈ సాంగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా సాంగ్ ఉంది. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిలా అమర్దీప్ కనిపిస్తారు. -
చెట్లమందులు వాడా.. చాలా గలీజ్గా ఫీలయ్యా: శివజ్యోతి
బిగ్బాస్ కంటెస్టెంట్, యాంకర్ శివజ్యోతి త్వరలోనే తల్లి కాబోతోంది. తను గర్భం దాల్చిన దగ్గరి నుంచి రెండు సార్లు సీమంతం చేసుకోవడం వరకు ప్రతి విషయాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది. డెలివరీకి దగ్గర్లో ఉన్న ఆమె తన ప్రెగ్నెన్సీపై ఉన్న అనేక అనుమానాలకు, అపోహలకు చెక్ పెడుతూ ఓ వీడియో షేర్ చేసింది.లేనివారికే తెలుసు ఆ బాధఅందులో శివజ్యోతి మాట్లాడుతూ.. ముందుగా అందరికీ ఓ మాట చెప్పాలనుకుంటున్నా.. ఎవరికైనా పిల్లలు లేకపోతే పిల్లలెప్పుడు? పెళ్లి కాకపోతే పెళ్లెప్పుడు? ఉద్యోగం లేనివాళ్లను ఏం చేస్తున్నావ్? వంటి ప్రశ్నలు అడగకండి. ఎందుకంటే అది లేనివారికే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. 2015లో మా పెళ్లి జరిగింది. అంటే పదేళ్లవుతోంది. దయచేసి అడగకండిమొదట్లో కెరీర్పై ఫోకస్ చేశాం. ఆ సమయంలో పిల్లలెప్పుడు అని అడిగితే నాకు కావాల్సినప్పుడు కంటాను అని ధైర్యంగా ఆన్సరిచ్చేదాన్ని. మూడేళ్లుగా నేను పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ సమయంలో ఎవరైనా అడిగినప్పుడు మాత్రం చాలా గలీజ్గా ఫీలయ్యేదాన్ని. కాబట్టి ఎదుటివాళ్ల పర్సనల్ విషయాలు అడగకండి.బిగ్బాస్ నుంచి రాగానే లాక్డౌన్బిగ్బాస్ ముందు వరకు కూడా మా ఇద్దరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే.. 2019లో నేను బిగ్బాస్ నుంచి రాగానే లాక్డౌన్ వచ్చింది. దాంతో పిల్లల ఆలోచనను రెండేళ్లు పోస్ట్పోన్ చేసుకున్నాం. ఆ తర్వాత మేము ఓ ఇల్లు కొని దాన్ని మాకు నచ్చినట్లుగా డిజైన్ చేయించుకుని గృహప్రవేశం చేశాం.. 2023 డిసెంబర్ నుంచి పిల్లలు కావాలనుకున్నాం. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం.మొక్కని దేవుడు లేడురెండున్నరేళ్లు రకరకాల టెస్టులు చేయించుకున్నాను. చెట్లమందులు ప్రయత్నించాను. మొక్కని దేవుడు లేడు. అయితే నేను ఐయూఐ, ఐవీఎఫ్ ఏది ఎంచుకున్నాను? అని అడుగుతున్నారు. అవేవీ కాదు, వెంకటేశ్వర స్వామి వ్రత ఫలితంతో సహజంగానే గర్భం దాల్చాను. ఒకవేళ ఇది జరగకపోతే ఐయూఐ, ఐవీఎఫ్ చేయించుకునేదాన్ని. అందులో అనుమానమే లేదు అని చెప్పుకొచ్చింది. శివజ్యోతి తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొంది.చదవండి: బోర్డర్ 2 ఫస్డ్ డే కలెక్షన్స్ -
ఆ ఇద్దరే బిగ్బాస్ షో విజేతలు! మరో సర్ప్రైజ్ ఏంటంటే?
బిగ్బాస్ షోకు ఒకేసారి రెండు భాషల్లో శుభం కార్డు పడింది. ఆదివారం (జనవరి 18న) నాడు అటు తమిళ బిగ్బాస్ 9, ఇటు కన్నడ బిగ్బాస్ 12వ సీజన్ ముగిసింది. తమిళ బిగ్బాస్ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన దివ్య గణేశ్ విజేతగా నిలిచింది. తమిళ బిగ్బాస్ తొమ్మిదో సీజన్ అక్టోబర్ 5న మొదలైంది. విజయ్ సేతుపతి హోస్ట్గా వ్యవహరించిన ఈ సీజన్లో మొత్తం వైల్డ్కార్డ్స్తో కలిపి 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. రూ.50 లక్షల ప్రైజ్మనీదివ్య గణేశ్, శబరీనాథన్, విక్కాల్స్ విక్రమ్, అరోరా సిన్క్లయర్.. నలుగురే ఫైనలిస్టులుగా నిలిచారు. ఉత్కంఠగా జరిగిన ఈ సీజన్లో అందర్నీ వెనక్కు నెట్టి దివ్య గణేశ్ లేడీ విన్నర్గా నిలిచింది. బిగ్బాస్ ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకుంది. అలాగే ఒక కారును సైతం గెలుపొందింది.కన్నడ బిగ్బాస్కన్నడ బిగ్బాస్ 12వ సీజన్ విషయానికి వస్తే.. గతేడాది సెప్టెంబర్ 28న ప్రారంభమైంది. వరుసగా పన్నెండవ సారి కూడా హీరో కిచ్చా సుదీప్ ఈ సీజన్కు హోస్టింగ్ చేశాడు. ఈ సీజన్లో కమెడియన్ గిల్లి నాట (నటరాజ్), రక్షిత, అశ్విని, కావ్య, రాఘవేంద్ర, ధనుష్ టాప్ 6గా ఫైనల్స్లో అడుగుపెట్టారు.హోస్ట్ సర్ప్రైజ్వీరిలో అందర్నీ వెనక్కునెడుతూ గిల్లి నాట టైటిల్ విజేతగా నిలిచాడు. ఇతడు రూ.50 లక్షల ప్రైజ్మనీతో పాటు ఒక ఎస్యూవీ కారును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, హీరో కిచ్చా సుదీప్ అతడికి మరో రూ.10 లక్షలు గిఫ్ట్ ఇస్తూ ఆ గెలుపును మరింత స్పెషల్గా మార్చేశాడు. View this post on Instagram A post shared by Vijay Television (@vijaytelevision) View this post on Instagram A post shared by Colors Kannada Official (@colorskannadaofficial) -
అటు మోడ్రన్గా.. ఇటు అమ్మవారి వేషంలో..
గడిచిన కాలం మళ్లీ రాదంటారు. కుదిరితే గడిచిన కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను నెమరేసుకుని ఏదో కాస్త సంతోషపడటమే! అందుకు 2016 ట్రెండ్ బాగా ఉపయోగపడుతోంది. సడన్గా అందరూ పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016లో జీవితం ఎలా ఉందో గుర్తు చేసుకుంటూ అప్పటి వేడుకలను, జ్ఞాపకాలను ఫోటోల రూపంలో షేర్ చేస్తున్నారు. అలా బిగ్బాస్ బ్యూటీ పై ఫోటో షేర్ చేసింది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?2016 నాటి మెమొరీస్బుల్లితెర నటి ప్రియాంక జైన్.. ఓవైపు మోడ్రన్ డ్రెస్లో సెల్ఫీలు, మరోవైపు అమ్మవారి వేషధారణ. ఇంకో ఫోటోలో అయితే రెండు జడలు వేసుకుని పిండి రుబ్బుతోంది. ఈ ఫోటోల్లో ప్రియాంక మరీ చిన్నపిల్లలా కనిపిస్తోంది. ఇకపోతే.. మౌనరాగం సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది ప్రియాంక జైన్. జానకి కలగనలేదు సీరియల్తో మరింత పాపులరైంది.ప్రియుడితో..తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొనగా టాప్ 5గా నిలిచింది. మౌనరాగం సీరియల్ సహనటుడు శివకుమార్తో ప్రేమలో పడగా.. వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. 2024 ఏప్రిల్లో వీరిద్దరూ హైదరాబాద్లో ఓ చోట భూమి కొన్నారు. గతేడాది మంచి ముహూర్తం చేసుకుని ఇంటిపనులు మొదలుపెట్టారు. ఈ లెక్కన ఈ ఏడాది కొత్తింట్లోకి వీరు జంటగా గృహప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
బిగ్బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టింది. రీతూ మాట్లాడుతూ.. బిగ్బాస్ హౌస్లో ఉండగా చాలా జరిగాయి. అటు హౌస్లో ఫైర్ స్ట్రామ్స్ (వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు) వచ్చి రీతూ బ్యాడ్ అనేవారు. పవన్ను వాడుకుంటోంది అన్నట్లుగా కామెంట్స్ చేశారు. ఎందుకిలా అంటున్నారని నాకు చాలా బాధసింది. మరోపక్క బయట (హీరో ధర్మ మహేశ్తో సంబంధం అంటగడుతూ) నన్ను మరింత దారుణంగా చిత్రీకరించారు. అదొక్కటే సంతృప్తిఇవన్నీ చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది. ఎలిమినేట్ అయి నేను బయటకు వచ్చేస్తే బాగుండనుకుంది. నేను బిగ్బాస్ హౌస్లో ఉండగా తోటి ఆర్టిస్టులెవరూ నాకు సపోర్ట్ చేయలేదు. నాకు ఓటు వేయమని అమ్మ ఫోన్ చేసి అడిగితే కూడా మీడియాలో రీతూ క్యారెక్టర్ బ్యాడ్ అని వస్తోందని కామెంట్ చేశారంట. నన్ను ఇంత చెడ్డదానిలా చిత్రీకరించినా, నెగెటివ్ క్యాంపెయిన్ చేసినా ప్రేక్షకులు నన్ను నమ్మి ఓట్లేశారు. నన్ను నన్నుగా ప్రేమించారు. ఆ విషయంలో సంతోషంగా అనిపించింది.డబ్బు లేకపోయినా పర్లేదునాకు కాబోయేవాడి విషయానికి వస్తే.. అందం గురించి పట్టించుకోను. అర్థం చేసుకుంటే చాలు, డబ్బు లేకపోయినా పర్లేదు కానీ ఉన్నదాంట్లో మంచిగా చూసుకోవాలి. నేను హైపర్ యాక్టివ్ కాబట్టి తనకు ఓపిక, సహనం ఎక్కువుండాలి. ప్రతి అమ్మాయిని గౌరవించాలి. పెళ్లయ్యాక ఎవరూ పని మానేయకూడదు. ఇద్దరం కలిసి పని చేసుకోవాలి. అలాగే మా అమ్మ, అన్నను బాగా చూసుకోవాలి అని చెప్పింది.దేవుడిపై నమ్మకంచిన్నప్పుడు నేను సాయిబాబాను ఎక్కువ నమ్మేదాన్ని. నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఒక బిజినెస్ కోసం నాన్న ఉన్న డబ్బంతా ఒకతడి చేతిలో పెట్టాడు. అంతా సవ్యంగా జరిగేలా చూడమని బాబాకు మొక్కాను. ఉపవాసాలున్నాను. అయినా ఆ డబ్బు తిరిగి రాలేదు. నాన్న ఏం చేసుకుంటాడో అని భయమేసింది. బాబాకు మొక్కినా ఫలితం లేకపోయేసరికి ఆయనపై నమ్మకం పోయింది. నాన్న చనిపోయాక అసలు భగవంతుడిని నమ్మడమే మానేశాను. అదేంటో కానీ కొంతకాలం క్రితం సడన్గా నా నోటి నుంచి ఓం నమఃశివాయ అనే మంత్రాలు వచ్చేవి. దాంతో జీవితంలో మొదటిసారి అరుణాచలం వెళ్లాను. నావల్ల కాదుఅక్కడి వెళ్లాక నా ఆలోచన విధానమే మారిపోయింది. జీవితాన్ని చూసే కోణం మారిపోయింది. నేను, మా అమ్మ, అన్న ఎప్పుడూ కలిసే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను. ఏదైనా చెడు జరిగితే నాకే జరగాలి కానీ, వాళ్లకేదీ జరగకూడదు. ఎందుకంటే నాన్నను కోల్పోవడమే నాకు తీరని లోటు.. మళ్లీ ఉన్నవాళ్లను దూరం చేసుకుని ఒక్కదాన్ని బతకడం నా వల్ల కాదు. నేను బిగ్బాస్కు వెళ్లడం, ఇల్లు కొనడం, సక్సెస్ అవడం, కారులో తిరగడం.. ఇవన్నీ నాన్న కోరికలు. అవన్నీ నెరవేరే సమయంలో నాన్న లేడన్న బాధ ఉంది అని చెప్పుకొచ్చింది. -
భర్త వల్లే సినిమాలకు దూరం? హీరోయిన్ ఏమందంటే?
ఒకప్పుడు గ్లామర్తో అల్లాడించిన హీరోయిన్ సనా ఖాన్ ఆరేళ్ల క్రితమే సినిమాలకు గుడ్బై చెప్పేసింది. 2020 అక్టోబర్లో సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నెల రోజులకే గుజరాత్కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్ను పెళ్లి చేసుకుంది. దీంతో భర్త బలవంతం వల్లే సినిమాలు మానేసిందన్న ప్రచారం జరిగింది.నేనే కోరుకున్నా..తాజాగా ఈ రూమర్పై సనాఖాన్ స్పందించింది. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నా పెళ్లి. వివాహం తర్వాతే నేను పూర్తిగా మరో కొత్త వ్యక్తిగా మారిపోయాను. ఆ మార్పు నేను ఎప్పటినుంచో కోరుకున్నదే.. అయితే నేను సినిమాలు మానేయడం, హిజాబ్తోనే బయటకు రావడం చూసి జనాలు ఏవేవో అనుకున్నారు. నా భర్త వల్లే..గతంలో హిజాబ్ లేకుండా కూడా బయట తిరిగేది.. ఇప్పుడేమో ఇంత మార్పేమిటో.. నా భర్తే నన్ను మార్చేశాడు అనుకున్నారు. కానీ, అది నిజం కాదు. మన ఇష్టం లేనిదే మనల్నెవరూ మార్చలేరు. నా భర్త నన్ను గైడ్ చేశాడంతే.. పైగా నేను ప్రశాంతత కోరుకున్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఇలా ఎన్ని సంపాదించుకున్నా చివరకు మానసిక ప్రశాంతత కోరుకుంటాం కదా.. నేనూ అదే ఎంచుకున్నాను.అందుకే సినిమాలు వదిలేశా..ఇండస్ట్రీలో నా చుట్టూ ఉన్నవారు సరిగ్గా లేకపోతే నేను తప్పటడుగులు వేసే ఆస్కారం ఉంది. అందుకే ఇండస్ట్రీని వదిలేశాను. వీటన్నింటికన్నా నాకు నా భర్త ప్రేమ, అనుబంధమే ముఖ్యమనిపించింది. సాధారణంగా పెళ్లిలో అమ్మాయి తరపువారికే ఎక్కువ ఖర్చులుంటాయి. కానీ అందుకు భిన్నంగా నా భర్త కుటుంబమే ఎక్కువ పెళ్లి ఖర్చును భరించింది అని చెప్పుకొచ్చింది.సినిమాహీరోయిన్ సనా ఖాన్.. గగనం, కత్తి, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ 6వ సీజన్లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ఆరేళ్ల క్రితం అంటే 2020లో సినిమాలకు గుడ్బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాతి నెలలో ముఫ్తీ అనాజ్ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.చదవండి: 8 ఏళ్లుగా అవకాశాల్లేవ్.. నా మతం వల్లేనేమో! -
నా క్యారెక్టర్పై నింద.. వాష్రూమ్లో ఏడ్చేదాన్ని: రీతూ
రీతూ చౌదరి.. విపరీతమైన నెగెటివిటీతో తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో పాల్గొంది. డిమాన్ పవన్తో లవ్ ట్రాక్ వల్ల మరింత వ్యతిరేకత మూటగట్టుకుంది. అయితే ఆమె చూపించే ప్రేమ నిజమైనదని రానురానూ ప్రేక్షకులే ఓ అంచనాకు వచ్చారు. ఏ కష్టం వచ్చినా ఫ్రెండ్ కోసం నిలబడే విధానం చూసి ముచ్చటపడ్డారు. బిగ్బాస్లో ఉండగా రీతూపై ఆరోపణలుఅవతలి వ్యక్తి దిగజారుతూ మాట్లాడినా సహనం కోల్పోకుండా కౌంటరిచ్చిన ఆమె వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అలా నెగెటివిటీని పాజిటివిటీ మల్చుకుని బిగ్బాస్ నుంచి బయటకు వచ్చింది రీతూ చౌదరి. అయితే ఆమె బిగ్బాస్ హౌస్లో ఉండగా హీరో ధర్మ మహేశ్ భార్య గౌతమి తనపై సంచలన ఆరోపణలు చేసింది. నెగెటివిటీపై స్పందించిన రీతూధర్మ మహేశ్తో క్లోజ్గా ఉండేదని, అర్ధరాత్రి ఇంటికి వచ్చేదని, సీసీ కెమెరా వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయంటూ ఆరోపించింది. ఈ వివాదం కూడా రీతూపై కొంత నెగెటివిటీకి కారణమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ తనపై జరిగిన ట్రోలింగ్ గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. బిగ్బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్స్గా వచ్చిన ఫైర్ స్ట్రామ్ కంటెస్టెంట్లు డిమాన్ పవన్కు నాతో మాట్లాడొద్దని చెప్పేవారు. ఓటేయమని ఫోన్ చేస్తే..రీతూ బ్యాడ్.. నీకర్థం కావట్లేదు, ఆమె నిన్ను వాడుకుంటుంది అన్న టైపులో మాట్లాడేవారు. అదంతా చూసి అమ్మ చాలా బాధపడింది. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా అందర్నీ చూసి చాలా బాధగా అనిపించేది. ఇతర కంటెస్టెంట్లకు చుట్టాలందరూ ఫోన్ చేసి మాట్లాడుతుంటారు కదా.. మాకెవరూ చేయరు, అలా మాకెవరూ లేరు కూడా! పాపం మా అమ్మ.. నాకు ఓటు వేయండి అని ఎవరికైనా ఫోన్ చేస్తే కూడా.. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదంటున్నారు, మేము ఓటు వేయం అన్నారు. నన్ను నాశనం చేయాలని చూస్తే..నాపై లేనిపోని నిందలు, ఆరోపణలు చేసినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. మమ్మీ.. అవన్నీ లైట్ అని సర్దిచెప్పి వాష్రూమ్లో కూర్చుని ఏడ్చేదాన్ని. నా ఏడుపుకు కారణమైన వారికి ఏదో ఒకటి అవకుండా లేదు. నన్ను నాశనం చేయాలని చూస్తే కర్మ అనుభవిస్తారు. శివుడు నా ఎదుట ప్రత్యక్షమైతే మా మమ్మీ, అన్నయ్య కంటే ముందు నన్ను తీసుకెళ్లమని చెప్తాను అంటూ రీతూ భావోద్వేగానికి లోనైంది.చదవండి: ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? క్యాన్సర్నే జయించింది -
కూతురి ఫస్ట్ బర్త్డే.. బిగ్బాస్ జంట ఎమోషనల్
బుల్లితెర జంట, బిగ్బాస్ ఫేమ్ మెరీనా అబ్రహం- రోహిత్ సాహ్ని గతేడాది పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. ఎనిమిదేళ్ల దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయి జన్మించింది. తనకు టియారా అని నామకరణం చేశారు. తాజాగా తమ కూతురి మొదటి పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితం పరిపూర్ణంఈ సందర్భంగా టియారా రాకతో తమ జీవితాల్లో వచ్చిన మార్పులు చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మెరీనా మాట్లాడుతూ.. తొలిసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నా ప్రపంచమే మారిపోయింది. నన్ను మరింత స్ట్రాంగ్గా, అలాగే సాఫ్ట్గా, పరిపూర్ణంగా మార్చేశావు. మా జీవితాలను ఎంతో అద్భుతంగా మార్చావు. నా ప్రపంచమే నువ్వయిపోయావు అని పేర్కొంది.లవ్యూ టియారా: రోహిత్'టియారా.. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చాక నిన్ను చూసిన మొదటిరోజు ఇంకా నా కళ్ల ముందే ఉంది. భగవంతుడు ఎంతో అందమైన బహుమతిని నీ రూపంలో ఇచ్చాడు. మమ్మల్ని నీ పేరెంట్స్గా ఎంచుకున్నందుకు థాంక్యూ.. వి లవ్యూ టియారా' అని రోహిత్ ఎమోషనలయ్యాడు.సీరియల్, సినిమాఅమెరికా అమ్మాయి సీరియల్తో ఆకట్టుకుంది. సిరిసిరి మువ్వలు, ప్రేమ వంటి సీరియల్స్లో యాక్ట్ చేసింది. ఓ సినిమా సమయంలో రోహిత్తో పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో జంటగా పార్టిసిపేట్ చేసింది. మెరీనా మధ్యలోనే ఎలిమినేట్ అవగా రోహిత్ మాత్రం ఫైనల్స్ వరకు వెళ్లాడు. సీరియల్స్కు దూరమైన వీరిద్దరూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉన్నారు. రోహిత్ హీరోగా ఓ సినిమా కూడా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Rohit Sahni (@rohitsahniofficial) చదవండి: భారీగా పడిపోయిన రాజాసాబ్ కలెక్షన్స్ -
నావాడిని కలిసానోచ్.. ఫోటో షేర్ చేసిన రోహిణి!
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది నటి రోహిణి. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ధారావాహికలో రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించింది. నటిగా, కమెడియన్గా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెండితెరకు తన ప్రయాణాన్ని కొనసాగించింది. నావాడిని కలిశా..మత్తు వదలరా, బలగం, హను-మాన్ వంటి సినిమాలతో పాటు సేవ్ ది టైగర్స్, ఎల్జీఎమ్ (లెట్స్ గెట్ మ్యారీడ్) వెబ్సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. మధ్యలో తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొంది. ఆటతో, మాటతో, కామెడీతో ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా రోహిణి ఓ అబ్బాయితో క్లోజ్గా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. నావాడిని కలిశాను అంటూనే ఓ ట్విస్ట్ ఇచ్చింది. షాకయ్యారా?ఇంతమంచి హ్యాండ్సమ్ అబ్బాయిని ఇచ్చిన చాట్జీపీటీకి థాంక్యూ అని రాసుకొచ్చింది. అయితే ఫస్ట్ ఈ ఫోటో చూడగానే అభిమానులే కాదు బుల్లితెర సెలబబ్రిటీలు కూడా రోహిణి ప్రియుడు అని పొరబడ్డారు. తర్వాత క్యాప్షన్ చూసి ఏఐ (కృత్రిమ మేధ) మాయాజాలమా.. అని నోరెళ్లబెడుతున్నారు.నిజమైతే బాగుండు యాంకర్ అరియానా అయితే సీరియస్గా అక్కా.. ఒక్క క్షణం నిజమే అనుకున్నా.. చాలా సంతోషంగా ఫీలయ్యా అంది. అందుకు రోహిణి స్పందిస్తూ.. నిజమైతే బాగుండు అని రిప్లై ఇచ్చింది. సింగర్ గీతామాధురి.. ఈ అబ్బాయి ఎక్కడున్నాడో వెతికేద్దాం అని ఫన్నీగా కామెంట్ పెట్టింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) చదవండి: అది సవాల్గా అనిపించింది: ఆషికా రంగనాథ్ -
'బిగ్బాస్' చరిత్రలో కంటెస్టెంట్స్ నీచమైన పని.. ఇద్దరిపై రెడ్ కార్డ్
బిగ్బాస్ చరిత్రలో తొలిసారి ఇద్దరు కంటెస్టెంట్స్ ఒకేసారి రెడ్ కార్డ్ జారీ చేశారు. దీంతో తక్షణమే వారు హౌస్ను విడిచి వెళ్లాల్సి వచ్చింది. తమిళ బిగ్బాస్-9లో జరిగిన ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది. హౌస్ట్ విజయ్ సేతుపతి వారిద్దరిపై విరుచుకుపడ్డారు. రెడ్ కార్డ్ ఇస్తున్నట్లు ప్రకటించగానే ఇతర కంటెస్టెంట్స్తో పాటు ప్రేక్షకులు కూడా సంబరాలు చేసుకున్నారు. బిగ్బాస్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. బిగ్బాస్ తమిళ్ ఇప్పటికే 90రోజులు పూర్తి చేసుకుంది. మరో వారంలో ఫైనల్ జరగనుంది. ఈ క్రమంలో టికెట్ టు ఫినాలే ఏపిసోడ్ జరిగింది. కార్ టాస్క్లో భాగంగా నటి సాండ్రాను బలవంతంగా బయటకు నెట్టినందుకు పార్వతి, కమ్రుదిన్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వారిద్దరూ కలిసి సాండ్రాను కాలితో తన్నారు. దీంతో ఆమె కారు నుంచి దూరంగా పడిపోయింది. ఆ తర్వాత కూడా సాండ్రా కాలు కారు డోర్ మధ్య ఇరుక్కుపోయింది. అప్పుడు కూడా వారు కనికరం చూపలేదు. దీంతో ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ దాడి తర్వాత సాండ్ర చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తీవ్రమైన ఆందోళన తనలో కనిపించింది. దీంతో ప్రేక్షకులు కూడా పార్వతి, కమ్రుదిన్ల తీరుపై విరుచుకుపడ్డారు. ఇక ఇతర హౌస్మెట్స్ అయితే, ఏకంగా వారి మొఖంపై ఉమ్మేసినంత పనిచేశారు. టైటిల్ రేసులో ఉన్న వినోథ్, దివ్యలు కలిసి వారిని కడిగిపారేశారు. అయితే, శనివారం జరిగిన ఎపిసోడ్లో హౌస్ట్ విజయ్ సేతుపతి వారికి రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు ఏకంగా సంబరాలు జరుపుకున్నారు. కోందరైతే ఏకంగా కేకులు కట్ చేశారు. బిగ్బాస్ షో చాలా భాషలలో టెలికాస్ట్ అవుతుంది. కానీ, ఇప్పటి వరకు మహిళా కంటెస్టెంట్ ఎవరూ కూడా రెడ్ కార్డ్ అందుకోలేదు. తొలిసారి పార్వతిపై బిగ్బాస్ జారీ చేశాడు.ఈ క్రమంలో ఇతర కంటెస్టెంట్స్ ఎవరూ వారిద్దరికీ సెండాఫ్ ఇవ్వలేదు. హౌస్ట్ విజయ్ సేతుపతి కూడా వారిని స్టేజీపైకి పిలిచి కనీసం ఒక్కమాట కూడా మాట్లడలేదు. హౌస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి పంపించేశారు. బిగ్బాస్ చరిత్రలో ఇంతటి అవమానకరమైన రీతిలో ఎవరూ కూడా ఎదుర్కోలేదు. గేమ్ కోసం ఒక స్త్రీని ఇలా బయటకు లాగి, కాళ్ళతో తన్నడం ఏంటి అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బిగ్బాస్ ప్రేక్షకులు మాత్రం వారికి తగినశాస్తి జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు.VIJAY SETHUPATHI GAVE RED CARD 🔥🔥- see the audience reaction 😍😍😍ONE OF THE BEST GOOSEBUMPS SCENE IN BB HISTORY#BiggBossTamil9 #VijaySethupathi pic.twitter.com/JRScBbZidh— RMVA (@LovelyRmva) January 3, 2026Sandra's acting level TOP notch 🙄😳She is still continuing same actingIt was not at all a Big accident ,...How she got these much panic because of What ? that push from the Car ?? Not Possible#biggboss9tamil #biggbosstamil9 #biggbosstamil pic.twitter.com/WE5zROcih8— Crick_info (@Stock_indianse) January 3, 2026Vikram didn’t flinch for more than 20 seconds !! I said this that day itself, everyone utilised this situation. #Scamdra #VJParvathy pic.twitter.com/HYu23K3YQz— Trithi 🕉️ (@scribblynotes_2) January 4, 2026 -
నర్సు నుంచి హీరోయిన్ రేంజ్కు.. పెళ్లి కబురు చెప్పిన బ్యూటీ
మానవ జీవితంలో వివాహ బంధం చాలా ప్రవిత్రమైంది. అది అందంగా అమరడం ఒక వరం. పెళ్లి అనేది కొందరికి సరైన సమయంలో జరుగుతుంది. మరి కొందరికి కొంచెం ఆలస్యం కావొచ్చు. అయితే 99 శాతం మందికి జీవితం వివాహబంధంతో పరిపూర్ణం అవుతుంది. ఇకపోతే తమిళ నటి జూలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. సుమారు ఏడేళ్ల క్రితం చెన్నై మెరినా బీచ్ వద్ద జరిగిన జల్లికట్టు పోరాటంలో గొంతు కలిపి జూలీ పాపులర్ అయింది. మొదట ఆమె ఒక సాధారణ నర్సు.. జల్లికట్టు ఉద్యమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో తమిళ బిగ్బాస్-1 షోలో ఛాన్స్ రావడం అలా మరింత గుర్తింపు పొందారు. బిగ్బాస్ నుంచి బయటకువచ్చిన తరువాత సినిమా రంగం ఆహ్వానం వచ్చింది. అలా కొన్ని చిత్రాల్లో నటించిన జూలీ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ అయ్యారు. ప్రముఖ మోడల్గా రాణిస్తున్న ఈ బ్యూటీ ప్రముఖ హీరోయిన్లను మించి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి జూలీకి ఇప్పుడు కల్యాణ ఘడియలు వచ్చేశాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లో, ప్రేమ వివాహమో తెలియదుగానీ, మహ్మద్ జక్రీమ్ అనే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ బిగ్బాస్ గేమ్ షోలో కలిసి పాల్గొన్నారన్నది గమనార్హం. వీరి నిశ్చితార్థం వేడుక ఇటీవల జరిగింది. ఆ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జూలీ, మహ్మద్ జాక్రీన్ల వివాహం ఈ నెల 16వ తేదీ ఉదయం చైన్నై, సెంథామస్లోని సెయింట్ పేట్రిక్ చర్చిలో జరగనుంది. అదే రోజు సాయంత్రం వీరి వివాహ రిసెప్షన్ జరగనుందని తెలిసింది. View this post on Instagram A post shared by Julie (@mariajuliana_official) -
బిగ్బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?
కొందరు బిగ్బాస్ సెలబ్రిటీలు బయటకు రాగానే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఏదైనా ఈవెంట్కు వెళ్లినా, ఫంక్షన్కు వెళ్లినా చుట్టూ బాడీగార్డులను వెంటేసుకుని వెళ్తుంటారు. గతంలో బిగ్బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. సోనియా-యష్ పెళ్లికి కూడా బాడీగార్డులను వెంటేసుకునే పోయాడు. నిన్నగాక మొన్న బిగ్బాస్ 9 విన్నర్ పవన్ కల్యాణ్ పడాల పదిమంది బాడీగార్డులతో ఓ ఈవెంట్కు హాజరయ్యాడు. 150 మంది బాడీగార్డులా?అయితే ఓ హిందీ కంటెస్టెంట్ మాత్రం ఏకంగా 150 మంది బాడీగార్డులను పెట్టుకుందంటూ ఓ వార్త వైరలవుతోంది. తను మరెవరో కాదు, తాన్య మిట్టల్. గొప్పలు చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందీ లేడీ కంటెస్టెంట్. పూటకో చీర కడతానని బిగ్బాస్ హౌస్కు దాదాపు 800 చీరలు తీసుకెళ్లింది. అలాగే 50 కిలోల నగలు కూడా పట్టుకెళ్లింది. లగ్జరీకి పెద్ద పీట వేసే ఈ బ్యూటీ తనకు 150మంది బాడీగార్డులున్నారన్న రూమర్పై తాజాగా స్పందించింది.అందులో నిజం లేదుతాన్య మిట్టల్ మాట్లాడుతూ.. నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. ఇది కావాలని పుట్టించారు. నా కింద 150 మంది సిబ్బంది పనిచేస్తారని మాత్రమే చెప్పాను. దానికి బిగ్బాస్ హౌస్లోని ఓ కంటెస్టెంట్ జైషా ఖాద్రి.. వాళ్లందర్నీ నా బాడీగార్డ్స్ అని సరదాగా అన్నాడు. అంతకుమించి ఏమీ లేదు. అలా అని బాడీగార్డ్స్ లేరని చెప్పను. నాకంటూ కొంత సెక్యూరిటీ సిబ్బంది ఉంది.అబద్ధం చెప్పనుఎందుకంటే నాకు బట్టల పరిశ్రమ, ఫార్మా ఫ్యాక్టరీ, గిఫ్ట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించలేను. కానీ, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అబద్ధాలాడాల్సిన అవసరం నాకసలే లేదు అని పేర్కొంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాన్య మిట్టల్.. హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొని మూడో రన్నరప్గా నిలిచింది. ప్రముఖ దర్శకనిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్లోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది.చదవండి: ప్రేయసిని పరిచయం చేసిన బిగ్బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ -
ప్రేయసిని పరిచయం చేసిన 'షణ్ముఖ్ జశ్వంత్'
షణ్ముఖ్ జశ్వంత్.. ఈ పేరు ఒకప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్. పలు వెబ్ సిరీస్లతో పాటు కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ ద్వారా బాగా క్లిక్కయ్యాడు. దీంతో టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్న సమయంలోనే బిగ్బాస్ ఆఫర్ వచ్చింది. అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న ఇతడు బిగ్బాస్లో మాత్రం సిరి హన్మంత్తో లవ్ ట్రాక్ నడిపాడు. దీంతో ఇతడిపై విపరీతమైన నెగెటివిటీ రావడంతో లవ్కు బ్రేకప్ చెప్పాడు. అయితే, ఇప్పుడు తన కొత్త ప్రేయసిని తన అభిమానులకు పరిచయం చేశాడు.బిగ్బాస్ తర్వాత కూడా షణ్ముఖ్ అనేక వివాదాలు చుట్టూ తిరిగాడు. అతనిపై ఏకంగా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. ఆపై యాక్సిడెంట్ వంటి వివాదంతో వార్తల్లో నిలిచాడు. అయినప్పటికీ మళ్లీ వెబ్ సిరీస్లు, సినిమాలపై దృష్టి పెట్టి తన కెరీర్ను గాడిలో పడిలే చేసుకున్నాడు. ఇక తాజాగా కొత్త ఏడాది సందర్భంగా షణ్ముఖ్ తన ప్రేయసిని పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియాలో తన ఫోటోలను పంచుకున్నాడు. కానీ, ఆమె ముఖం కనిపించకుండా తనతో దిగిన పలు ఫోటోలను షేర్ చేశాడు. 'Happy Birthday V… This is Gods plan' అంటూ ఒక అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఆ యువతి పేరు ‘V’ అనే అక్షరంతో ప్రారంభమవుతుందన్న క్లూ ఇచ్చాడు. అయితే, ఆమె ఎవరో అనేది మాత్రం ప్రస్తుతానికి వెళ్లడించలేదు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
ఎంతో బాధపెట్టా.. ఇకపై ఏ కష్టం రానివ్వనని మాటిస్తున్నా!
దగ్గరగా ఉన్నప్పుడు కాదు, దూరంగా ఉన్నప్పుడే ప్రేమ విలువ తెలుస్తుందంటారు. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ విషయంలోనూ ఇదే నిజమైంది. అతడు కమెడియన్గా స్థిరపడటానికి ముందే ఓ అమ్మాయి తనను ప్రేమించింది. ఇమ్మూ కూడా తనతో చాటింగ్ చేస్తూ, ఫోన్లు మాట్లాడుతూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. చచ్చినా, బతికినా తనతోనే కలిసుండాలని నిర్ణయించుకున్నాడు.బిగ్బాస్ షోలో రియలైజేషన్కానీ ఇమ్మూ కమెడియన్గా ఫేమస్ అవడంతో షూటింగ్స్లో ఎక్కువ బిజీ అయ్యాడు. ఆ సమయంలో ప్రియురాలికి సరిగా టైమ్ ఇవ్వకపోగా చిరాకు, అసహనం, కోపం అన్నీ తనపైనే చూపించాడు. తానెంత తప్పు చేశాడన్నది తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్కు వెళ్లాక రియలైజ్ అయ్యాడు.బహుమతిగా బిగ్బాస్ ట్రోఫీ..ప్రేయసిని ఎంతో బాధపెట్టానని అర్థం చేసుకుని రోజూ రాత్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకోసం బిగ్బాస్ ట్రోఫీ గెలిచి దాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. కానీ, అది కుదర్లేదు. అయితే షో నుంచి బయటకు వచ్చాక మాత్రం తనను కలిసి ప్రేమ కబుర్లు చెప్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.ఎంతో బాధపెట్టా..వేస్ట్ అమ్మా (ఇమ్మూ తన ప్రియురాలిని ప్రేమగా వేస్ట్ ఫెలో అని పిలుచుకుంటాడు).. నా జీవితంలోకి వచ్చినందుకు, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థాంక్యూ.. నిన్ను నేను చాలా బాధపెట్టాను. కానీ, ఈ సంవత్సరం నుంచి మనం ఇంకా స్ట్రాంగ్ ఉండి.. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఇప్పటినుంచి నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నా..! నేను అడగకుండానే దేవుడు నాకు ఇచ్చిన పెద్ద బహుమతి నువ్వే.త్వరలోనే పరిచయం చేస్తా..నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నాకు ఎల్లప్పుడూ అండగా నిలబడ్డందుకు, అపారమైన ప్రేమను పంచినందుకు థాంక్యూ సో మచ్.. ఐ లవ్యూ సో మచ్ నా బుజ్జి ఫెల్లో.. నువ్వే నా సర్వస్వం.. హ్యాపీ న్యూ ఇయర్.. అని రాసుకొచ్చాడు. అతడి ప్రియురాలి పేరు రుచి అని తెలుస్తోంది. అయితే ఇమ్మూ షేర్ చేసిన ఫోటోలో ఆమె ముఖం దాచుకుంది. ఇది చూసిన అభిమానులు వదినను ఎప్పుడు చూపిస్తావ్? అని అడుగుతున్నారు. అందుకు ఇమ్మాన్యుయేల్.. త్వరలోనే చూపిస్తానని రిప్లై ఇచ్చాడు. View this post on Instagram A post shared by Nanduri Emmanuel (@jabardasth_emmanuel) చదవండి: మురారి క్లైమాక్స్.. పస్తులుండి మరీ ఆరోజు షూటింగ్.. దటీజ్ మహేశ్ -
నా పేరు, మనీ ఉపయోగించుకుని వదిలేశాడు.. బిగ్బాస్ 'ఇనయా' కన్నీళ్లు
కొన్ని కథలను వెండితెరపై చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెడుతారు. ఒక్కోసారి అలాంటి జీవితాలే మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇదే కోవలో నటి, బిగ్బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా లైఫ్ ఉంది. సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకెక్కింది ఇనయ. తర్వాత బిగ్బాస్ షోలోనూ అడుగుపెట్టింది. తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొని బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఇనయ సుల్తానా.. ఆ తర్వాత ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే, తనతో బ్రేకప్ అయిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ క్రమంలో ప్రియుడు చేసిన మోసాన్ని బయటపెట్టింది.సినిమాల మీద పిచ్చితో కన్నవారిని, ఇంటిని వదిలేసి సింగిల్గా తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఇనయా.. గౌతమ్ కొప్పిశెట్టి అనే యువకుడితో ప్రేమలో పడింది. అతను యోగా ట్రైనర్, జిమ్ కోచ్ అని సమాచారం. తనతో కొద్దిరోజులు ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పినట్లు పేర్కొంది. అయితే, తనను ప్రియుడు మోసం చేశాడని ఆమె పేర్కొన్నారు. ఫిజికల్గా కూడా కలిశాం..'స్నేహంతో మొదలైన మా పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలం పాటు నాతో బాగానే ఉన్నాడు. మా ప్రేమ విషయం రెండు కుటుంబాలకు తెలుసు.. అందుకే సోషల్మీడియా ద్వారా అందరికీ తనను పరిచయం చేశాను. నాకు ఎవరూ లేరనుకున్న సమయంలో అతను పరిచయం అయ్యాడు. ఆపై ప్రేమలో పడ్డాం. కానీ, అతను కేవలం నా మనీ, పేరును మాత్రమే ఉపయోగించుకోవాలనుకున్నాడు. తనతోనే జీవితం అనకున్నాను కాబట్టి ఫిజికల్గా కూడా కలిశాం. అతని కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను. తను వ్యాపారం చేస్తానంటే భారీగా డబ్బు సాయం చేశాను. చివరకు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న గొల్డ్ గాజులు కూడా తనకోసం అమ్మేశాను. దేవుడా.. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు (కన్నీళ్లు)..ఇప్పటికే ఎన్నో లక్షల రూపాయాలు ఇచ్చాను. నా బ్యాంక్ అకౌంట్ జీరో అయ్యాక వదిలేశాడు. ప్రస్తుతం రూ. 5 లక్షలకు పైగానే అప్పులో ఉన్నాను. ఎలాంటి పనిచేయకుండా ఇంట్లోనే ఉంటాడు. నేను షూటింగ్ వెళ్తున్నా సరే ఒకటే గొడవలు. నాపై అనుమానం పెంచుకున్నాడు. ప్రతిరోజు నరకంగా నా జీవితం మారింది. కేవలం మనీ కోసం మాత్రమే నన్ను ఉపయోగించుకున్నాడు. నేను ఏం చేసినా సరే తప్పుగానే చూస్తాడు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా ఉండాలి అనిపించింది. విడిపోయాక రెండు నెలలు చాలా బాధపడ్డాను. ఇప్పుడు అలవాటు అయిపోయింది.మదం సినిమాలో అతనితోనే ఇంటిమేట్ సీన్.. ఆరోజే చచ్చిపోయానుమదం సినిమాలో ఇనయా కీలకమైన పాత్రలో నటించింది. జనవరి 1న ఈ మూవీ విడుదల కానుంది. ఇందులోఆమె చాలా బోల్డ్గా కనిపించనుంది. అయితే, ఇదే మూవీలో తనను మోసం చేసిన ప్రియుడు కూడా నటించాడని ఆమె తెలిపింది. తనతో బ్రేకప్ అయిన తర్వాత ఒక ఇంటిమేట్ సీన్లో ఇద్దరం కలిసి నటించామని ఆమె ఇలా చెప్పింది. మదం సినిమాలో మూడు ఇంటిమేట్ సీన్లు నాతోనే ఉన్నాయి. ఒక సీన్లో నా పర్సనే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని మొదట ఓకే చెప్పాను. తర్వాత మేము బ్రేకప్ అయ్యాం. అయితే, సినిమా కోసం అతనితోనే ఇంటిమేట్ సీన్లో నటించాను. ఆరోజు ఒక మనిషిగా చచ్చపోయాను. ఆరోజు నిద్ర కూడా పట్టలేదు. ఎందుకు బతుకుతున్నానా అనే ప్రశ్న కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. అని ఇనయా చెప్పింది. -
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్లో మధుర జ్ఞాపకం: తనూజ
సీరియల్ నటి తనూజ పుట్టస్వామి బిగ్బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ రన్నరప్గా నిలిచిన ఆమె తాజాగా తన మంచి మనసు చాటుకుంది. షో అయిపోగానే తన ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన చిన్నపాటి పార్టీలో సందడి చేసిన ఆమె తాజాగా అనాథాశ్రమానికి వెళ్లింది. ఈ మేరకు ఒ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.చిన్నారులతో సరదాగాఅందులో చిన్నారులతో కలిసి ముచ్చటించింది. వారు డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టింది. తర్వాత పిల్లలందరికోసం పాట పాడింది. కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించింది. అనంతరం వారికి భోజనం వడ్డించింది. ఓ చిన్నారికి గోరుముద్దలు పెడుతూ తనూ వారితో కలిసి భోజనం చేసింది.మధురమైన జ్ఞాపకంవాళ్లందరినీ తన ఫ్యామిలీగా అభివర్ణించింది. 'నా కుటుంబాన్ని చూసి ఎన్నాళ్లయిందో! వాళ్ల ప్రేమలు, చిరునవ్వులు, జ్ఞాపకాలు.. మమ్మల్ని మళ్లీ ఒక్కటి చేశాయి. చాలాకాలం తర్వాత వారితో మళ్లీ కాలక్షేపం చేశాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోతుంది' అని తనూజ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) చదవండి: అభిమానుల అత్యుత్సాహం.. కిందపడ్డ విజయ్ -
డబ్బుల కోసం అలాంటి పని చేశా.. పేరు మార్చుకున్నా : అరియానా
అరియానా గ్లోరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆర్జీవీని ఇంటర్వ్యూలో చేసి బోల్డ్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా, ఆ క్రేజ్తోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా ఎంపికైంది. బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొని..తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చన తర్వాత పలు వెబ్ సిరీస్లు, సినిమాలతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బీజీ అయిపోయింది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్తో పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.అందుకే పేరు మార్చుకున్నానా అసలు పేరు అరియానా(Ariyana Glory) కాదు. మా అమ్మనాన్నలు నాకు అర్చన అని పేరు పెట్టారు. అయితే కష్టాలు ఎక్కువ అవ్వడంతో నేనే పేరు మార్చుకున్నా. అరియానా పేరుతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను.అనుకోకుండా అవకాశం.. మన జీవితంలో ఏం జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. నేను అనుకోకుండా యాంకర్ అయ్యాను. ఒక రోజు నేను, మా చెల్లి టీవీ చూస్తుంటే.. యాంకర్స్ కావలెనన్న ప్రకటన వచ్చింది. అది చూసి నేను ఆడిషన్స్కి వెళ్లాను. అదృష్టం కొద్ది సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి చిన్న చిన్న అవకాశాలతో ఈ స్థాయికి చేరుకున్నాను.ఒకేసారి ఐదారు జాబులు చేశాడబ్బుల కోసం నేను రకరకాల జాబులు చేశా. లైన్లో నిలబడి పన్నీరు చల్లేందుకు కూడా వెళ్లాను. అప్పుడు నాకొచ్చే జీతం రూ. 1800 మాత్రమే. రూమ్ రెంట్ రూ. 3000. ఒకసారి అద్దె కట్టేందుకు డబ్బులు జమ చేయగా.. ఓ అమ్మాయి దొంగతనం చేసింది. దీంతో చాలా ఇబ్బంది పడ్డా. డబ్బులు సరిపోకపోవడంతో ఒకేసారి ఐదారు జాబులు చేశా. ఇప్పుడు నేను బెటర్ పొషిషన్లో ఉన్నాను.ఈ క్షణమైనా చనిపోవడానికి రెడీఇక నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘మా అమ్మ నన్ను క్రిస్టియన్లా పెంచింది. కానీ ఈ మధ్య నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం పెరిగింది. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే.. నన్ను తీసుకెళ్లిపో అని చెబుతా. దేవుడే వచ్చి అడిగాక ఇంకేముంది?. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికిప్పుడు చనిపోయినా నాకు ఓకే’ అని అరియానా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది. -
మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక!
ప్రముఖ నటుడు శక్తి కపూర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. జుడ్వా, చల్ మేరే భాయ్, హమ్ సాత్ సాత్ హే, హలో బ్రదర్, కహీ ప్యార్ నా హోజాయే.. ఇలా అనేక చిత్రాల్లో నటించారు. అయితే 2005లో శక్తి కపూర్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ప్రలోభాలకు గురి చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సల్మాన్.. శక్తి కపూర్తో కలిసి నటించడం ఆపేశాడు.అవమానభారం2011లో శక్తికపూర్ హిందీ బిగ్బాస్ ఐదో సీజన్లో అడుగుపెట్టాడు. ఈ షోకి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రియాలిటీ షో సమయంలో సల్లూ భాయ్.. శక్తిని పెద్దగా పట్టించుకోలేదు. అతడిని కావాలనే పక్కనపెట్టేశాడు. దీంతో శక్తికి అవమానంతో తలకొట్టేసినట్లయింది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయన సల్మాన్పై ఎదురుదాడికి దిగాడు. ఆడవాళ్లను కొడతాడని నింద వేశాడు. అలా ఇద్దరి మధ్య అగాథం ఏర్పడింది.ఎవరితోనూ గొడవల్లేవ్దాదాపు 15 ఏళ్ల తర్వాత తమ మధ్య పరిస్థితులు చక్కబడ్డాయంటున్నాడు శక్తికపూర్. ఇప్పుడు తనకెవరితోనూ గొడవలు లేవు అని చెప్తున్నాడు. మద్యపానానికి కూడా దూరంగా ఉంటున్నానన్నాడు. మందు మానేసి ఐదేళ్లవుతోందని చెప్పాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మందుబాబులకన్నా ఆరోగ్యంపై ఫోకస్ చేసేవాళ్లే ఎక్కువున్నారు. గతంలో అయితే చాలామంది స్టార్స్ తాగి మరీ సెట్స్కు వచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నాడు. శక్తి కపూర్ వందలాది సినిమాల్లో నటించగా ఆయన కుమారుడు సిద్దాంత్ నటుడిగా, శ్రద్దా కపూర్ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన దేవర నటి -
బిగ్బాస్ బజ్: సంజనాను ఆంటీ అన్న శివాజీ
బిగ్బాస్ ట్రోఫీ గెలుస్తానని తనూజ కాన్ఫిడెంట్గా ఉండేది. కానీ అది నిజం కాలేదు. టికెట్ టు ఫినాలే నాదే అని శపథం చేసిన పవన్.. మాట నిలబెట్టుకోలేకపోయాడు. అయితే సంజనా మాత్రం ఆత్మధైర్యంతో అనుకున్నది సాధించింది. బిగ్బాస్లో అడుగుపెట్టడానికి ముందే టాప్ 5 అని ఫిక్సయిపోయింది. అందుకోసం 100 రోజులకు సరిపడా బట్టలు రెడీ చేసుకుంది.గుడ్డు దొంగతనంతప్పోఒప్పో ఏదైనా ముఖం మీదే మాట్లాడేది. తను మాట్లాడింది తప్పని తెలుసుకున్నప్పుడు బేషరతుగా క్షమాపణలు చెప్పేది. ఒక్క గుడ్డు దొంగతనంతో సీజన్ 9పై బజ్ క్రియేట్ చేసింది. ఎన్నో అవమానాలు, గొడవల తర్వాత వెరీ గుడ్డు కంటెస్టెంట్గా ఫైనల్స్లో ఐదో స్థానంలో బయటకు వచ్చింది. ఫినాలే అయిపోయినవెంటనే బిగ్బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఏ ఆంటీ కూడా టాప్5కి రాలేదుఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. తెలుగు బిగ్బాస్ చరిత్రలో ఏ ఆంటీ కూడా టాప్5కి రాలేదు. ఫైనల్స్కు వరకు ఉంటాననుకున్నారా? అని అడిగాడు. అందుకామె ఉంటాననుకున్నాను.. అందుకే కదా 15 వారాలకు సరిపడా డ్రెస్సులు బెంగళూరు నుంచి ప్యాకింగ్ చేసుకుని వచ్చాను అని బదులిచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. మన అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా.. చిన్న ఇంట్లో అయినా.. ఎక్కడైనా సంతోషంగా బతకొచ్చు. కానీ, మర్యాదకు భంగం కలిగితే ఎలా బతకగలం? నన్ను ఇలా గుర్తుపెట్టుకోవాలి2020లో నాపై పడ్డ నింద కారణంగా అందరూ నన్ను గుర్తు పెట్టుకోవద్దు.. బిగ్బాస్ 9లో టాప్ 5కి వెళ్లింది.. ఆవిడ సంజనా.. అని నన్ను గుర్తించాలి. నా పిల్లలు నన్ను అలాగే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పింది. ఇక ప్రోమోలో శివాజీ ఆమెను ఆంటీ అనడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అతడికంటే సంజనా వయసులో చిన్నదని, ఆమెను పట్టుకుని ఆంటీ అంటాడేంటని ఆగ్రహిస్తున్నారు. -
బిగ్బాస్ ప్లాన్ సక్సెస్.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్!
బిగ్బాస్ షోను ఇష్టపడేవాళ్లు, తిట్టేవాళ్లు.. ఇద్దరూ ఉన్నారు. తిడుతూనే చూసేవాళ్లు మూడోరకం! అయితే ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలకు పెద్దపీట వేస్తారు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఒకరిద్దరు కామనర్లను దింపుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు కూడా సోషల్ మీడియాలో సుపరిచితులైనవారే ఉంటారు! అయితే ఈసారి ఏకంగా ఏడుగురు మంది సామాన్యులు హౌస్లో అడుగుపెట్టారు. కాకపోతే అంత ఈజీగా కాదు, అగ్నిపరీక్షను దాటుకుని వచ్చారు.అగ్నిపరీక్షఎన్నడూ లేనిది ఈసారి షో ప్రారంభమవడానికి ముందు బిగ్బాస్ అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించారు. దీనికోసం పెద్ద ప్రక్రియే జరిగింది. ముందుగా షోకి రావాలనుకునేవారు ఒక నిమిషం వీడియో షూట్ చేసి బిగ్బాస్ టీమ్కు పంపారు. వేలల్లో వచ్చినవాటిని ఫిల్టర్ చేసి వందల్లో ఎంపిక చేస్తారు. వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ఎగ్జామ్ ఇలా అన్నీ పెట్టి చివరకు 40 మందిని ఎంపిక చేశారు.అలాంటివారికి నో ఛాన్స్వారిలో నుంచి మంచి కంటెస్టెంట్లను జల్లెడ పట్టాల్సిన బాధ్యతను నవదీప్, బిందుమాధవి, అభిజిత్కు అప్పజెప్పారు. ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్ చేసింది. బిగ్బాస్కు రావాలన్న పిచ్చితో కొందరు పాదయాత్రలు చేస్తారు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తారు. అలాంటివారికి షోలో చోటు లేదని అగ్నిపరీక్ష షోలో కరాఖండిగా చెప్పేశారు. ఆ కేటగిరీలో వచ్చిన అందర్నీ నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు.తొలిసారి ఏడుగురు కామనర్స్మిగతావారి టాలెంట్, ఎక్స్ప్రెషన్స్, నాలెడ్జ్.. ఇలా అన్నింటినీ పరిశీలించి ఓ లిస్ట్ ఫైనల్ చేస్తారు. అలా కొందరు జడ్జిలను మెప్పించి, మరికందరు ప్రేక్షకుల ఓట్ల ద్వారా తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టారు. వాళ్లే ప్రియ, శ్రీజ, దివ్య, కల్యాణ్, పవన్, మనీష్, హరీశ్. వీరిలో కల్యాణ్ ఏకంగా టైటిల్ విన్నర్ కాగా పవన్ సెకండ్ రన్నరప్గా నిలిచాడు. సామాన్యుడి చేతికి ట్రోఫీసామాన్యుడు బిగ్బాస్కు వెళ్లడం కాదు, ఏకంగా ట్రోఫీ ఎత్తగలడని కల్యాణ్ నిరూపించాడు. అయితే అగ్నీపరీక్ష రెండో సీజన్ కోసమే అతడికి కప్పు కట్టబెట్టారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అగ్నిపరీక్ష ఫస్ట్ సీజన్పై పెద్దగా బజ్ లేదు. ఇప్పుడు కల్యాణ్ గెలుపు వల్ల అగ్నీపరీక్ష రెండో సీజన్పై భారీ హైప్ క్రియేట్ అయింది. బిగ్బాస్ ప్లాన్ సక్సెస్ఈసారి ఎవరు వస్తారు? ఎవర్ని తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. కామనర్స్ను ఏదో కొన్నాళ్లపాటు హౌస్లో ఉంచి పంపించేయకుండా.. వారికి టాలెంట్ ఉంటే చివరి వరకు ఉంచుతారన్న నమ్మకం కుదిరింది. ఈ లెక్కన ఈసారి అగ్నిపరీక్షకు అప్లికేషన్లు భారీగా పోటెత్తే అవకాశముంది. అదే గనక నిజమైతే బిగ్బాస్ ప్లాన్ వర్కవుట్ అయినట్లే! ఈ అగ్నిపరీక్ష రెండో సీజన్ 2026 సెకండాఫ్లో ప్రారంభం కానుంది.చదవండి: వినాయకన్కు తీవ్ర గాయం.. కాస్త లేట్ అయ్యుంటే పక్షవాతం! -
ప్రమోషన్ పొందిన వితికా షెరు
బిగ్బాస్ ఫేం, నటి వితికా షెరు గుడ్న్యూస్ చెప్పింది. పెద్దమ్మగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించింది. వితికా చెల్లెలు కృతికా తాజాగా పండంటి కుమారుడికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. బాబు పుట్టిన శుభవార్తను అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. హీరోయిన్గా కెరీర్తెలుగమ్మాయి వితిక హీరోయిన్గా టాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టింది. సినిమాలు చేస్తున్న సమయంలోనే హీరో వరుణ్ సందేశ్తో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జంటగా బిగ్బాస్ షో మూడో సీజన్కు సైతం వెళ్లొచ్చారు. పెళ్లయిన తర్వాత కూడా చెల్లి కృతికకు పెళ్లి చేసే బాధ్యతను తనే తీసుకుంది వితికా.చెల్లి పెళ్లి చేసిన వితికాఅక్కగా దగ్గరుండి 2022లో చెల్లి పెళ్లి చేసింది. కొద్ది నెలల క్రితమే కృతిక గర్భం దాల్చగా ఇటీవల తనే ఘనంగా సీమంతం కూడా చేసింది. ఇది చూసినవాళ్లంతా ఇలాంటి అక్క ప్రతి ఇంట్లో ఉండాలని వితికాపై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే కృతిక - కృష్ణ దంపతులకు మంగళవారం (డిసెంబర్ 23న) బాబు పుట్టగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) -
టాప్ 2లో నా పక్కన ఇమ్మూ... తనూజతో ఆ బాండ్ లేదు!
అగ్నిపరీక్షలో కల్యాణ్ అందరికీ నచ్చాడు. కానీ బిగ్బాస్ 9వ సీజన్ ప్రారంభంలో ఎవరికీ నచ్చలేదు. కారణం.. ఆట పక్కనపెట్టి అమ్మాయిలపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. నాగార్జున కూడా అతడి తీరును ఎండగట్టాడు. ఇక ప్రియ, శ్రీజ ఎలిమినేషన్ తర్వాత కల్యాణ్కు బెస్ట్ ఫ్రెండ్లా మారి అన్నీ చూసుకుంది తనూజ. అతడి కోసం గేమ్స్లో కలబడింది, నిలబడింది.కల్యాణ్ కోసం నిలబడ్డ తనూజటికెట్ టు ఫినాలేలో ఇమ్మాన్యుయేల్ను పక్కనపెట్టి కల్యాణ్కే సపోర్ట్ చేసింది. అతడినెవరైనా టార్గెట్ చేస్తే వాళ్లను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి మరీ కల్యాణ్ కోసం టవర్ గేమ్లో చేయి నొప్పిని లెక్కచేయకుండా కష్టపడి ఆడింది. చాలా గేమ్స్లో అతడికే ప్రాధాన్యత ఇచ్చింది. కేవలం టాస్కులపరంగానే కాకుండా మాటలతోనూ సపోర్ట్ చేసింది. అతడి గెలుపును తన విజయంలా భావించి ఎన్నోసార్లు సంతోషించింది.చివరి ప్రాధాన్యతబిగ్బాస్ ఫినాలే స్టేజీపై కూడా కల్యాణ్ ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే ముందుగా ప్రియ, శ్రీజకు ప్రాధాన్యం ఇచ్చాడు. చివరగా తనూజ గురించి మాట్లాడుతూ.. కల్యాణ్గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించిందే తనూజ అని ఒప్పుకుంటున్నా అని అందరిముందు చెప్పాడు. కానీ, బిగ్బాస్ బజ్లో, బయట ఇంటర్వ్యూలలో మాత్రం మాట మార్చాడు. టాప్ 2లో ఇమ్మూ..బజ్లో మాట్లాడుతూ.. ఫైనల్స్లో స్టేజీపై నా పక్కన ఇమ్మూ అన్న ఉంటాడనుకున్నాను. తనకు ఎక్కువ ఓట్లు వస్తాయనుకున్నా.. అయినా ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారన్నది మనకు తెలిదు. తను నాలా ఆలోచిస్తాడు, నాకు, ఇమ్మూ అన్నకు మధ్య బాండింగ్ బాగుంటుంది. మళ్లీ తనూజ, నాకు మధ్య ఆ బాండింగ్ లేదు అన్నాడు. మరో ఇంటర్వ్యూలో.. తనూజ గేమ్ పరంగా సపోర్ట్ ఇవ్వలేదు, ఉట్టి మాటలతోనే సపోర్ట్ చేసిందన్నాడు.బాగానే డ్రామాలు చేస్తున్నావ్..ఇది చూసిన తనూజ అభిమానులు కల్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తనూజ నీ పక్కన లేకపోతే స్క్రీన్స్పేస్ కూడా దక్కేది కాదంటున్నారు. ఫ్రెండ్స్ను, నాన్న(భరణి)ని పక్కనపెట్టి మరీ నీకు కెప్టెన్సీ, టికెట్ టు ఫినాలేలో సపోర్ట్ చేస్తే కనీస కృతజ్ఞత లేదంటూ తిట్టిపోస్తున్నారు. క్రెడిట్ తనూజకు ఇవ్వొద్దని శ్రీజ ఏమైనా చెప్పిందా? అందుకే ఇలా మాట మార్చేశావా? అని అడుగుతున్నారు. ఈ ట్రోలింగ్ చూసిన కల్యాణ్.. వెంటనే మెట్టు దిగొచ్చాడు. టికెట్ టు ఫినాలేలో తనూజ తనకోసం ఆడిందని చెప్పాడు. అయినప్పటికీ తనూజ ఫ్యాన్స్ శాంతించలేదు. ఒక్కోదగ్గర ఒక్కో మాట మాట్లాడుతూ బాగానే డ్రామాలు చేస్తున్నావ్.. అని మండిపడుతున్నారు. -
బిగ్బాస్ బజ్: కల్యాణ్ పడాల నెక్స్ట్ టార్గెట్ అదే!
ఒక సామాస్యుడు బిగ్బాస్ ట్రోఫీ గెలిచినట్లు చరిత్రలోనే లేదు. కానీ ఆ చరిత్రను తిరగరాశాడు కామన్ మ్యాన్ పవన్ కల్యాణ్ పడాల. సీఆర్పీఎఫ్ జవాన్గా అగ్నిపరీక్షలో అడుగుపెట్టాడు. అక్కడ తన టాలెంట్తో జడ్జిలను మెప్పించి తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టాడు.21 మందిని వెనక్కు నెట్టి..హౌస్లో టైంపాస్ చేసేసరికి ఎక్కువరోజులు ఉండడులే అని అంతా అనుకున్నారు. కానీ నాగార్జున ఇచ్చిన వార్నింగ్తో కల్యాణ్ అలర్ట్ అయి గేమ్పై ఫోకస్ పెట్టాడు. గేమ్ కోసం ఏదైనా చేసేవాడు. అలా తెలుగు బిగ్బాస్ సీజన్ 9లో పాల్గొన్న 21 మంది వెనక్కు నెట్టి బిగ్బాస్ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లిపోయాడు.కేక్ కటింగ్బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే బజ్ ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సి ఉంటుంది. తాజాగా బజ్లో శివాజీతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో శివాజీ మాట్లాడుతూ.. తననే తాను చెక్కుకున్న శిల్పి అని పొగిడాడు. తన గేమ్ ఛేంజ్ అవడానికి కారణం దివ్య అని గుర్తు చేశాడు. నీలో స్పిరిట్ రగిలించిందే తను అనడంతో కల్యాణ్ దివ్యకు కృతజ్ఞతలు తెలియజేశాడు.గ్రేట్ యాక్టర్ అవాలనుకుంటున్నాఎలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నావ్? అన్న శివాజీ ప్రశ్నకు కల్యాణ్ మాట్లాడుతూ.. స్టార్, హీరో అని కాకుండా గ్రేట్ యాక్టర్ అవాలనుకుంటున్నాను. నాలుగు నెలల క్రితం నేనెవరికీ తెలియదు. మా ఊర్లోనే ఎవరికీ తెలీదు. అలాంటిది ఈ అవకాశం ఇచ్చి అగ్నిపరీక్ష నుంచి బిగ్బాస్ వరకు నన్ను ప్రోత్సహించిన అందరికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు. -
బిగ్బాస్ ఓటమి తర్వాత తనూజ ఫస్ట్ పోస్ట్
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ హోరాహోరీగా జరిగింది. అసలు సిసలైన పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరిగింది. ఇద్దరికీ భారీగా ఓట్లు పడ్డాయి. చాలా తక్కువ పర్సంటేజ్తో తనూజ ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. ఓటమి తర్వాత తనూజ సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టింది.అందులో ఏం రాసిందంటే..బిగ్బాస్ సీజన్కు 9కి థాంక్స్.. ఈ జర్నీ అంత ఈజీ కాదు. కానీ బిగ్బాస్ ఇంటి లోపల నేనెన్నోసార్లు నవ్వాను, ఏడ్చాను, కిందపడ్డాను. తిరిగి లేచి నిల్చున్నాను. ప్రతిసారి బలంగా నిలబడ్డాను. ప్రతి టాస్కు నిజాయితీగా ఆడాను. నాకెదురైన సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. పరిస్థితులు ఎంత కఠినంగా మారినా సరే నేను నాలాగే ఉన్నాను. మీ ప్రేమే నా నిశ్శబ్ధాన్ని శక్తిగా మార్చింది. అదే అతిపెద్దక్సెస్మీరు వేసిన ఓట్లే నా గొంతుకగా వినిపించాయి. మీరు నాపై పెట్టుకున్న నమ్మకమే అతి పెద్ద విజయం. ఈరోజు నేను బిగ్బాస్ హౌస్ను వీడానేమో కానీ.. దీనిద్వారా మీతో ఏర్పరుచుకున్న బంధాన్ని మాత్రం జీవితాంతం కొనసాగిస్తాను. ఇది ముగింపు కాదు.. కొత్త అధ్యాయానికి ప్రారంభం. మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను. గుణపాఠం నేర్చుకున్నా..మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ జర్నీలో నేను ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, ప్రేమను కూడబెట్టుకున్నాను. మీ ప్రతి ఓటు, మీ సపోర్ట్, నాకోసం చేసిన ప్రార్థనలు అన్నీ కూడా నాకెంతో విలువైనవి.నిజమైన ఫైటర్మీలో ఒకరిగా హౌస్లో అడుగుపెట్టాను. ఇప్పుడు మీ అందరినీ నా మనసులో నింపుకుని బయటకు వచ్చేశాను. బిగ్బాస్ 9కి ముగింపు పలుకుతున్నాను అని తనూజ (Thanuja Puattaswamy) రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు నిజమైన ఫైటర్వి అని కొనియాడుతున్నారు. నీ జర్నీతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేశావు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) -
బిగ్బాస్: 3 రోజుల్లో రూ.2.5 కోట్లు అందుకున్న ఏకైక నటి!
దేశవ్యాప్తంగా బిగ్ బాస్ ప్రారంభమై దాదాపు పాతికేళ్లు కావస్తోంది. హిందీతో మొదలుకుని ఈ రెండున్నర దశాబ్ధాల గమనంలో ఒకటొకటిగా పలు ప్రాంతీయ భాషలకు ఈ రియాల్టీ షో విస్తరించిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ షో సూపర్ హిట్ అవడం, సీజన్ సీజన్కూ రేటింగ్స్ పెంచుకుంటూ పోతోంది. తాజా తెలుగు బిగ్బాస్ సీజన్ ముగిసి విజేత ఎవరో కూడా తేలిపోయింది. ఈ నేపధ్యంలోనే విజేతతో పాటు పాల్గొనేవారికి అందే పారితోషికాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.ఓ వైపు ఆదరణతో పాటు ఆదాయం కూడా పెంచుకుంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కూడా ఆ మేరకు పారితోషికాలు అందిస్తోంది. అయితే సహజంగానే అత్యధిక వ్యూయర్షిప్ కారణంగా హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్నవారికే అత్యధిక ఆదాయాలు అందుతాయి అనే మనం భావిస్తాం కానీ... ఈ విషయంలో తెలుగు బిగ్ బాస్ కూడా థీటుగానే పోటీపడుతోంది. ఇప్పటి దాకా మన దేశం నుంచి బిగ్ బాస్లో పాల్గొని అత్యధిక రెమ్యునరేషన్స్ పొందిన వారిలో ది గ్రేట్ ఖలీ గా పిలవబడే మాజీ రెజ్లర్ దలీప్ సింగ్ రానా ముందున్నారు. (చదవండి: పోరాడి ఓడిన తనూజ.. భారీ పారితోషికమే ముట్టింది!)ఆయన బిగ్బాస్ 4వ సీజన్లో వారానికి దాదాపు రూ.50లక్షలు అందుకున్నారు. అదే విధంగా బిగ్ బాస్ 12వ సీజన్లో పాల్గొన్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కూడా దాదాపు అంతే మొత్తాన్ని దక్కించుకున్నారు. కరణ్వీర్ బోహ్రా. తహసీన్ పూనావాలా ఇటీవల గౌరవ్ ఖన్నా తదితర తారలు కూడా దాదాపుగా వారానికి రూ.20లక్షలు దాకా అందుకుని అత్యధిక ఆదాయం పొందిన వారుగా నిలిచారు(చదవండి: బిగ్ బాస్ బిగ్ రివ్యూ - ఆరంభం అదుర్స్, ముగింపు ముదుర్స్)వీరందరినీ అలా ఉంచితే భారతేశపు బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకున్న రికార్డ్ ఒకే ఒక నటికి దక్కింది. ఆమె కూడా భారతదేశానికి చెందని నటి కావడం విశేషం. అలా బిగ్ బాస్ లో ఎవరికీ దక్కనంత ప్రైజ్ మనీని అందుకున్న ఏకైక కంటెస్టెంట్ పమేలా ఆండర్సన్. ఈ అందాల భామ అమెరికాకు చెందిన హాలీవుడ్ నటి. పాతికేళ్ల క్రితం బే వాచ్ అనే షో ద్వారా విశ్వవ్యాప్తంగా ఆమె గ్లామర్ సెన్సేషన్ సృష్టించింది. మన దేశంలోనూ ఆమెకు ఉన్న పాప్యులారిటీ బిగ్ బాస్ షోలో ఆమెకు రెడ్ కార్పెట్ పరిచింది. ఆమె సీజన్ 4లో కేవలం మూడు రోజుల పాటు కనిపించినందుకు ఏకంగా రూ.2.5 కోట్లు సంపాదించినట్లు సమాచారం, తద్వారా తక్కువ కాలం పాటు పాల్గొని ఎక్కువ ఆదాయం ఆర్జించిన నటిగా ఆమె చెరిగిపోని రికార్డును నెలకొల్పింది. హిందీ బిగ్ బాస్ ఆ సీజన్లో అత్యధిక టిఆర్పీలు కూడా అందుకుంది. -
లేడీ సెలబ్రిటీలు తస్మాత్ జాగ్రత్త.. మీ గతి కూడా ఇంతే!
అనుకుంటే అయిపోద్ది సామీ అంటుంటారు. అనుకోవడమే కాదు, గెలుపు కోసం అలుపెరగకుండా కష్టపడినా సరే లేడీ కంటెస్టెంట్లు విన్నర్ కాలేకపోతున్నారు. తెలుగు బిగ్బాస్ మొదటి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు ఇదే తంతు. పోనీ విన్నర్ క్వాలిటీస్ ఉన్న బలమైన కంటెస్టెంట్లు రాలేదా? అంటే అది తప్పుమాటే అవుతుంది.గీతామాధురి, శ్రీముఖి, తనూజ.. వీళ్లంతా బలంగా నిలబడ్డవాళ్లే.. గొంతెత్తి ప్రశ్నించినవాళ్లే! గెలుపు కోసం నిరంతరం శ్రమించినవాళ్లే! కానీ ఏం లాభం? విజయం వాకిటవరకు వచ్చి వెనక్కు వెళ్లిపోతున్నారు, కాదు కాదు ప్రేక్షకులే వాళ్లను కర్కశంగా వెనక్కు పంపించేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే సీజన్స్లో అయినా బిగ్బాస్ ట్రోఫీని ఒక మహిళ గెలుస్తుందా? అన్న సందేహం తలెత్తక మానదు.సింపతీకే ఓటుతెలుగు బిగ్బాస్ మొదటి సీజన్లో కామెడీతో నవ్వించి, టాస్కులతో అదరగొట్టి చలాకీగా, హుషారుగా కనిపించిన హరితేజ సెకండ్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. తర్వాతి సీజన్లో గాత్ర మాధుర్యంతో మెప్పించింది గీతామాధురి. అంతేనా.. చాలా మెచ్యూర్డ్గా, బ్యాలెన్స్డ్గా ఆడుతూ కౌశల్కు గట్టి పోటీనిచ్చింది. ప్రేక్షకులు ఆమె మాటతీరుకు మురిసిపోయారు.. కానీ ట్రోఫీ ఇచ్చేందుకు మాత్రం ఇష్టపడలేదు. సింపతీ, సెంటిమెంట్తో కొట్టిన కౌశల్కు టైటిల్ కట్టబెట్టారు. దీంతో గీతా రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది.పోరాడినా ఫలితం దక్కలేదుమూడో సీజన్లో యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టగానే విన్నర్ నడిచొస్తుందనుకున్నారు. బిగ్బాస్ కోసం ఆమె చేతిపై పచ్చబొట్టు కూడా వేయించుకుంది. బయట ఎంత చలాకీగా ఉందో.. హౌస్లోనూ అంతే చలాకీగా ఉంది. కామెడీ చేస్తూ టాస్కులు ఆడుతూ తనవల్ల అయినంతవరకు పోరాడింది. అయినా జనాలకు ఆమెను గెలిపించబుద్ధి కాలేదు. సింగర్ రాహుల్ ట్రోఫీ గెలవగా శ్రీముఖి రన్నరప్ స్థానానికి పరిమితమైంది.ఇన్నాళ్లకు సరైన కంటెస్టెంట్!ఆ తర్వాత ట్రోఫీని గెలిచేంత బలమైన కంటెస్టెంట్లు ఎవరూ హౌస్కి రాలేదు. దాదాపు ఆరు సీజన్ల తర్వాత మళ్లీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అడుగుపెట్టింది. తనే తనూజ పుట్టస్వామి. అందంతో పాటు తెలివి ఆమె సొంతం. తనకు గుర్తింపునిచ్చిన తెలుగు ప్రేక్షకులకు గుండెలో గుడి కట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా వీరి వల్లే ఇక్కడున్నానని పదేపదే నొక్కి చెప్పింది. తెలుగు ప్రేక్షకులను తన సెకండ్ ఫ్యామిలీగా భావించింది.ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా..మొదటి రోజు నుంచే మాస్క్ లేకుండా తను తనలాగే ఉంది. కోపం, చిరాకు, అసహనం, బాధ, కన్నీళ్లు, అలక.. అన్నీ చూపించింది. వేటినీ దాచుకోలేదు. బంధాలకు పెద్దపీట వేసింది. అదే సమయంలో అబ్బాయిలకు ఎక్కువ చనువు ఇవ్వకుండా హద్దుల్లో పెట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా పద్ధతైన సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించింది. ఏ ఆటైనా ఆడతానని ముందుకు వచ్చింది. సీజన్ విజయానికి కారకురాలుఓడినా సరే గెలిచేవరకు శ్రమించింది. డబుల్ ఫేస్ లేకుండా అద్దంలా స్వచ్ఛంగా తనేంటో చూపించింది. మాస్టర్మైండ్తో ఆటను తిప్పింది. తెలుగు బిగ్బాస్ 9 విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. తను లేకపోతే ఈ సీజనే లేదు అన్నంతగా ప్రభావితం చేసింది. అయినా తనను విజయం వరించలేదు. ఇది తనూజ అభిమానులకే కాదు, ఎంతోమంది నెటిజన్లకు సైతం నచ్చలేదు. సీజన్ 9ను తన భుజాలపై మోసిన తనూజకు అన్యాయం జరిగిందంటున్నారు. లేడీ సెలబ్రిటీలు జాగ్రత్తఅమ్మాయిలను విజేతగా చూడటం మన జనాలకు నచ్చదా? ఇంకేం చేస్తే వారిని గెలిపిస్తారు? అసలు ఇంతకంటే ఇంకేం చేయగలరు? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇకముందు రాబోయే లేడీ సెలబ్రిటీలను సైతం హెచ్చరిస్తున్నారు. టీఆర్పీ కోసం మిమ్మల్ని వాడుకుంటారే తప్ప ట్రోఫీ మాత్రం ఇవ్వరని.. అది దృష్టిలో పెట్టుకుని షోకి రావాలా? వద్దా? అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని చెప్తున్నారు. బిగ్బాస్ ఓటీటీ సీజన్ (ఓటీటీ సీజన్లో బిందుమాధవి గెలిచింది) మినహా తొమ్మిది సీజన్లలో ఒక్క లేడీ విన్నర్ లేకపోవడం నిజంగా విచారకరమే! -
Bigg Boss: బిగ్ రివ్యూ - ఆరంభం అదుర్స్, ముగింపు ముదుర్స్
బిగ్ బాస్ దాదాపు 9ఏళ్ళ క్రితం తెలుగులో అడుగుపెట్టిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. స్టార్ మా ఛానల్ రేటింగ్స్ ను ఆకాశానికి ఎత్తేసింది ఈ కార్యక్రమం. బిగ్ బాస్ ప్రోగ్రాంకి ముఖ్యంగా ఆ క్రేజ్ ఎలా వచ్చిందంటే దాని చుట్టూ వచ్చే వివాదాలే ముఖ్యకారణం. వివాదం లేని సీజన్ ఇప్పటిదాకా జరగలేదు. తాజాగా ఈ బిగ్ బాస్ 9వ సీజన్ పూర్తి చేసుకుంది. మరి ఈ సీజన్ ఎలా గడిచిందో ఈ బిగ్ రివ్యూ లో చూద్దాం.బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu ) ఆరంభం అదుర్స్ ముగింపు ముదుర్స్ అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 7 న అట్టహాసంగా ప్రారంభమైన ఈ షో 22మంది కంటెస్టెంట్లతో మూడు నెలలకు పైగా ప్రేక్షకులను అలరించింది. ప్రముఖ నటులు నాగార్జున ముందు చేసిన 6 సీజన్లతో పాటు ఈ సీజన్ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించి తనదైన శైలిలో షోకు ఆయువుపట్టుగా మారారు. ఈసారి హౌస్ లోకి సెలబ్రిటీ స్టేటస్ లేని వాళ్ళను 7 మందిని పంపడం విశేషం. అందులోనూ సెలబ్రిటీ కాని వ్యక్తి అయిన కళ్యాణ్ పడాల ట్రోఫీ కూడా గెలుచుకోవడం మరో విశేషం. మునుపటి సీజన్లతో పోలిస్తే ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య మసాలాలు కాస్త మోతాదుకు మించి జరిగాయని చెప్పవచ్చు.అంతేకాదు అభ్యంతరకర పదజాలంతో సీజన్ లోని ఒకటి రెండు ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్లు విపరీత ధోరణి తో మితిమీరి పోయారు. అయితే ఇప్పటి ఓటిటి కాలం ప్రేక్షకులకు ఇదేమంత పెద్ద విషయం కాదు. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్ల బాండింగులకు కొదవే లేదు. దాదాపుగా కుటుంబంలో ఎన్ని బంధాలైతే ఉంటాయో అంతకన్నా ఎక్కువే హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య భారీగానే నడిచాయి. వాటిలో తనూజ, దివ్య, భరణి మధ్య నడిచిన బంధంతో పాటు డెమోన్ పవన్, రీతూ మధ్య నడిచిన ప్రేమాయణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సీజన్ లో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే ఎప్పూడూ తన గంభీర వదనంతో సుపరిచితుడైన బిగ్ బాస్ ఎన్నడూ లేని విధంగా తన కంటెస్టెంట్ లో ఒకరిని హౌస్ లో ఉండమని వేడుకోవడం.సంజన విషయంలో జరిగిన ఈ ఘటన సీజన్ కే హైలైట్ గా నిలిచింది. ఘనంగా ప్రారంభించిన ఈ సీజన్ పేలవంగా ముగించారు. మామూలుగా ప్రతి సీజన్ ముగింపు దశలో చూపే హడావిడి ఈ సీజన్ లో బాగా తగ్గిందని చెప్పవచ్చు. ప్రతి సీజన్ ఆఖర్లో బయటకు వెళ్ళిన కంటెస్టెంట్లను హౌస్ లోకి ఆఖరున పిలిచి పండుగ కోలాహలంతో నింపేవారు. కాని ఈ సీజన్ లో ఆ ఊసే లేదు. అంతేకాకుండా ఫినాలే కప్పును పెద్ద సెలబ్రిటీతో విన్నర్ కు ప్రెజెంట్ చేసే ఆనవాయితీని కూడా ఈ సారి టీం పక్కన పెట్టేసింది. సెలబ్రిటీలు ఈ సారి దొరకలేదో ఏమో కాని ఫినాలేలో రోబోలతో కూడా ఒక ఎలిమినేషన్ అనౌన్స్ చేయించారు. ఏది ఏమైనప్పటికీ ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఆరంభం అదుర్స్ ముగింపు ముదుర్స్.- హరికృష్ణ ఇంటూరు -
ఛీ కొట్టినవారితో చప్పట్లు.. కల్యాణ్ విజయానికి కారణాలివే!
తప్పులు చేయని మనిషంటూ ఉండడు. కానీ ఆ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే జీవితంలో ముందుకు వెళ్తాడు. బిగ్బాస్ షోలోనూ ఇదే వర్తిస్తుంది. అగ్నిపరీక్షలో కల్యాణ్ దూకుడు, అతడిలోని కసి చూసి.. ఇలాంటి కంటెస్టెంట్ కదా బిగ్బాస్కు కావాల్సింది అనుకునేలా చేశాడు. అతడి ఆట, మాట తీరు చూసి విన్నర్ మెటీరియల్ అని ముందుగానే ఫిక్సయిపోయారు.(Kalyan Padala Bigg Boss Winning Reasons)అంతా తలకిందులుకట్ చేస్తే బిగ్బాస్ 9కి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. పిక్నిక్కు వచ్చినట్లు ఓ మూలన కూర్చునేవాడు. ఏదో కరువులో ఉన్నట్లు అమ్మాయిలను ఓరగా చూస్తూ అదే పెద్ద పనిగా పెట్టుకున్నాడు. ఇతడు చేసిన పనులకు మూడోవారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయేవాడే! కానీ నాగార్జున చెప్పిన హింట్లను గ్రహించాడు. ఎప్పుడూ ఆడాళ్ల చేతులు రాస్తూ కూర్చోవడమేనా? అని నాగ్ గడ్డి పెట్టడంతో తేరుకున్నాడు. ఇలాగే ఉంటే నీ ఆట ముగిసిపోతుందని వార్నింగ్ ఇవ్వడంతో అలర్ట్ అయ్యాడు.రూటు మార్చాడుఅప్పటికే వరుసగా కామనర్లు ఎలిమినేట్ అవుతుండటంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. ఆట, మాట, తీరు అన్నీ మార్చుకున్నాడు. అగ్నిపరీక్షలో కనిపించిన కల్యాణ్ను తిరిగి చూపించాడు. నాలుగోవారం నుంచి విజృంభించి ఆడాడు. టాస్కులు వస్తే గెలిచేవరకు వేటాడాల్సిందే అన్నంత కసిగా ఆడాడు. అందరితోనూ కలిసిపోయాడు. మనింటి కుర్రాడే అన్నంతగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.జనాలకు కనెక్ట్..తనకు ఇష్టమైనవాళ్లు ఎలిమినేట్ అయినా, బాధపడుతున్నా అస్సలు తట్టుకునేవాడు కాదు. వాళ్లకు ఏదైనా బాధ వచ్చిందంటే ఇతడే ఎక్కువ ఏడ్చేవాడు. అలా కల్యాణ్ స్వభావానికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఎన్నో అవమానాలు పడ్డ కల్యాణ్ పడ్డచోటే లేచి నిల్చున్నాడు. ఛీ కొట్టినవారితోనే శెభాష్ అనిపించేలా చేసుకున్నాడు. తనూజతో పోటీపడేవాళ్లే లేరా? అన్న సమయంలో అందరికీ ఓ ఆశాదీపంలా కనిపించాడు.కలిసొచ్చిన ప్రచారంకల్యాణ్ కోసం సోషల్ మీడియాలో బోలెడంత సింపతీ ప్రచారం జరిగింది. సోల్జర్ అని, పేదవాడు అని రకరకాలుగా ప్రచారం చేశారు. అది అతడికి బాగా కలిసొచ్చింది. అయితే హౌస్లో మాత్రం అతడెప్పుడూ ఆ కార్డులు బయటకు తీసి వాడుకోవాలని చూడలేదు. కానీ బిగ్బాస్ మాత్రం కుదిరినప్పుడల్లా అతడు జవాన్ అని గుర్తు చేశాడు. 'జై జవాన్' అన్న నినాదం అతడి విజయంలో కీలక పాత్ర పోషించింది. -
ఇది సార్ తనూజ బ్రాండు! ఎంత సంపాదించిందంటే?
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ముఖం తనూజ పుట్టస్వామి. సీరియల్ నటిగా అందరికీ తను సుపరిచితురాలే! ఆమె హౌస్లో అడుగుపెట్టినప్పుడే విన్నర్ కదిలిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అరుపులు, కేకలు, ఏడుపులు చూసి ఈమేంట్రా బాబూ ఇలా ఉందని తల పట్టుకున్నారు. రానురానూ అవన్నీ తన ఎమోషన్స్ అని, తను నటించకుండా తనలాగే ఉందని జనాలు పసిగట్టారు. మనింటి అమ్మాయిఇంట్లో అమ్మలా వండిపెట్టడం, అక్కలా ఆజమాయిషీ చేయడం, చెల్లిలా అల్లరి చేయడం, అన్నింట్లో తానే ఆడతానంటూ ముందుకు రావడం, అలగడం.. ఇవన్నీ జనాలకు కనెక్ట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా తన డ్రెస్సింగ్ సెన్స్కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎప్పుడూ పద్ధతిగానే కనిపించేది. కొన్నిసార్లు మోడ్రన్ దుస్తులు వేసుకున్నా ఏరోజు కూడా గ్లామర్ షో చేయలేదు. అబ్బాయిలను హద్దుల్లో ఉంచుతుంది.ఫ్రెండ్ కోసం స్టాండ్అతి చనువుకు, లవ్ ట్రాక్కు ఛాన్సివ్వలేదు. అదే సమయంలో సెలబ్రిటీ అన్న గర్వం చూపించకుండా అందరితో ఇట్టే కలిసిపోయింది. స్నేహితుడిగా భావించిన కల్యాణ్ క్యారెక్టర్ను వక్రీకరించినప్పుడు అండగా నిలబడింది. తానే తప్పూ చేయలేదని అడ్డంగా వాదించింది. ఫ్రెండ్ రీతూని సేవ్ చేసి తనకు అండగా నిల్చుంది. ఇలా తను ఇష్టపడేవారికి తోడుగా ఉంది. తనలో ఉన్న ఓ గొప్ప లక్షణం. ఎంతటి శత్రువునైనా మిత్రువుని చేసుకుంటుంది. శత్రువు కూడా మిత్రువే!వైల్డ్కార్డ్గా వచ్చిన మాధురి, ఆయేషా.. తనూజపై నిప్పులు చెరిగి తొక్కేయాలని చూశారు. కానీ చివరకు తనూజ చేతిలో మాధురి పూర్తిగా బెండ్ అయిపోయింది. ఆయేషా ఫ్రెండ్ అయిపోయింది. భరణి నాన్నతో బంధం, మధ్యలో దివ్య రాక.. గొడవలు, దూరం.. వీటన్నింటివల్ల నలిగిపోయినా తిరిగి నిలదొక్కుకుంది.గెలిచేవరకు పోరాటంఅవసరమైనప్పుడు తనూజ అందరి సపోర్ట్ తీసుకున్న మాట వాస్తవం. కానీ హౌస్లో అందరూ ఏదో ఒక సందర్భంలో మిగతావారి సపోర్ట్ తీసుకున్నారు. అయితే తనూజనే ఎక్కువ హైలైట్ చేశారు.. షో మొదలైనప్పటినుంచి తనూజ చుట్టూనే గేమ్ అంతా సాగిందని బిగ్బాసే స్వయంగా ఒప్పుకున్నాడు. ఆమె ఎన్నోసార్లు మైండ్ గేమ్ ఆడింది. ఇమ్మాన్యుయేల్తో సమానంగా ఈ సీజన్ను తన భుజాలపై మోసింది. చాలా టాస్కుల్లో చివరి వరకు వచ్చి ఓడిపోయేది. అయినా గెలిచేవరకు పోరాడతా అన్న కసితో ముందడుగు వేసేది. పారితోషికం ఎంత?ఎవరితో గొడవలు జరిగినా సరే.. వాళ్ల గురించి చెడుగా మాట్లాడటం.. వెనకాల గోతులు తవ్వడమనే పనులు ఏరోజూ చేయలేదు. కానీ తనపై సోషల్ మీడియాలో ఎక్కడలేని నెగెటివిటీ.. ఫలితంగా టాప్ 2లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. పోరాడి ఓడినా తలెత్తుకుని సగర్వంగా బయటకు వచ్చింది. తనూజ వారానికి రూ.2.50 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 వెనకేసింది.చదవండి: తెలుగు బిగ్బాస్లో చరిత్ర సృష్టించిన కల్యాణ్ -
బిగ్బాస్ 9 విన్నర్గా కల్యాణ్.. రూ.50 లక్షలు సొంతం!
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ ముగిసింది. 105 రోజుల యుద్ధానికి తెర పడింది. నేడు (డిసెంబర్ 21న) జరిగిన గ్రాండ్ ఫినాలేలో సంజనా ఐదో స్థానంలో, ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలవగా పవన్ సెకండ్ రన్నరప్గా నిలిచాడు. తనూజపై కామనర్ పవన్ కల్యాణ్ పడాల గెలిచాడు. బిగ్బాస్ షోలో అడుగుపెడ్తే చాలనుకున్న స్టేజీ నుంచి సీజన్ ట్రోఫీని ముద్దాడే స్థాయికి ఎదిగాడు. సామాన్యుడు తల్చుకుంటే జరనిదంటూ ఏమీ ఉండదని నిరూపించాడు. అతడి సంకల్ప బలానికి, ప్రేక్షకుల అభిమాన బలం తోడైంది. ఫలితంగా విజేతగా నిల్చాడు. సెలబ్రిటీ తనూజను ఓడించి మరీ విజయ పతాకం ఎగరవేశాడు. అతడి గెలుపును సామాన్యులందరూ తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తొలిసారి తెలుగు బిగ్బాస్ ట్రోఫీని అందుకున్న సామాన్యుడిగా చరిత్రకెక్కాడు.రెమ్యునరేషన్ ఎంత?సామాన్యులందరికీ ఒకటే రెమ్యునరేషన్ ఫిక్స్ చేసింది బిగ్బాస్ టీమ్. అలా అందరిలాగే కల్యాణ్కు సైతం ప్రతి వారానికి రూ.70,000 అందాయి. పదిహేను వారాలకుగానూ రూ.10.50 లక్షలు సంపాదించాడు. ట్రోఫీతోపాటు రూ.50 లక్షలు కూడా కైవసం చేసుకునేవాడే! కానీ, పవన్ రూ.15 లక్షల సూట్కేస్ తీసుకోవడంతో మిగిలిన రూ.35 లక్షలు తన సొంతం చేసుకున్నాడు. రాఫ్ టైల్స్ వారు మరో రూ.5 లక్షలు గిఫ్టిచ్చారు. అలా మొత్తంగా రూ.50 లక్షలకుపైగా సంపాదించాడు. డబ్బుతో పాటు మారుతి సుజుకికి చెందిన విక్టోరిస్ కారును సైతం తన సొంతం చేసుకున్నాడు. ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు విలువ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంది. -
సూట్కేస్ తీసుకున్న పవన్.. మొత్తం ఎంత వెనకేశాడంటే?
బిగ్బాస్ 9 నుంచి డీమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు, కాదు తనంతట తానే తలెత్తుకుని బయటకు వచ్చాడు. అగ్నిపరీక్ష పోటీలో గెలిచి షోలో అడుగుపెట్టినప్పుడు అసలు ఇతడికి ఎలా అవకాశమిచ్చారని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ తన ఎంపిక ఏదో అల్లాటప్పా కాదని పవన్ నిరూపించాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన బెస్ట్ ఇచ్చాడు. సూట్కేస్తో బయటకురెండుసార్లు కెప్టెన్ కూడా అయ్యాడు. ఏకంగా టాప్-3లో చోటు దక్కించుకున్నాడు. తెలివిగా మాస్ మహారాజ రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్ అంతా పవన్ను తొక్కేసిన బిగ్బాస్.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. మీ విల్ పవర్, ఫిట్నెస్ మాత్రమే కాదు, గెలుపు కోసం చివరివరకూ పోరాడే తత్వం మిమ్మల్ని నిజమైన యోధుడిగా మార్చేశాయి. ముందు తొక్కేసి తర్వాత పొగడ్తలుకామనర్గా అడుగుపెట్టిన పవన్ యోధుడిగా మారారు. అమాయకమైన చిరునవ్వు వెనకున్న డీమాన్ ఏంటో అందరికీ చూపించారు. నామినేషన్లలో ఎంతమంది మాటలతో దాడి చేసినా, మీరు మౌనంగా నిలబడ్డారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు' అని చెప్పుకొచ్చాడు. ఓ దశలో రీతూతో బంధం కారణంగా డీమాన్ ఆటతీరుపై చాలానే విమర్శలు వచ్చాయి. టాస్కుల బాహుబలికానీ వాటిని తట్టుకుని నిలబడ్డాడు. రీతూ ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోయిన తర్వాత డీమాన్ అసలు గేమ్ బయటపడింది. పంచ్లేస్తూ కామెడీ చేయడం, టాస్కుల్లో బాహుబలిలా ఆడటం, గేమ్పై ఫుల్ ఫోకస్ లాంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ స్పీడ్ ముందు నుంచి ఉండుంటే కచ్చితంగా విన్నర్ అయ్యేవాడే అని కూడా మాట్లాడుకున్నారు. ఏదేమైనా సెకండ్ రన్నరప్గా బయటకు వచ్చాడు.సంపాదన ఎంతంటే?ఇతడి రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. కామనర్స్ అందరికీ ఒకే పారితోషికం ఇచ్చారు. అలా డీమాన్కి కూడా వారానికి రూ.70 వేల పారితోషికం ఇచ్చేలా డీల్ కుదిరింది. ఓవరాల్గా 15 వారాలకుగానూ రూ.10.50 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. దీనికి రూ.15 లక్షలు తోడవడంతో మొత్తం రూ.25 లక్షలకు పైగా సంపాదించాడు. మొత్తానికి పవన్కు ఈ షోతో డబ్బుకు డబ్బు, పేరుకు తగ్గ గుర్తింపు వచ్చింది. -
ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?
కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుంటారు.. ఏదీ? రాదే? అందరికంటే ఎక్కువ కష్టపడిన ఇమ్మాన్యుయ్యేల్ను నాగార్జున సీజన్ అంతా ఆకాశానికెత్తారు. గోల్డెన్ స్టార్.. ప్రేక్షకుల సపోర్ట్ నీకే అంటూ మురిపించారు. గెలుపు గురించి ఢోకా లేదు, తడిగుడ్డ వేసుకుని పడుకో అన్నచందంగా బీబీ టీమ్ బిల్డప్ ఇచ్చింది. ట్రోఫీని ముద్దాడటమే ఆలస్యం అని గంపెడాశతో ఉన్న ఇమ్మాన్యుయేల్ను చివరకు నట్టేట ముంచారు. తప్పెవరిది?విన్నర్ కాదు కదా రన్నర్వి కూడా కాలేవంటూ నాలుగో స్థానంలో పడేశారు. అతడు పడ్డ కష్టానికి, వచ్చిన నాలుగో ర్యాంక్కు అసలు సంబంధమే లేదు. ఇక్కడ తప్పెవరిది? బిగ్బాస్ టీమ్దా? ప్రేక్షకులదా? పోనీ ఇమ్మూ కేవలం కామెడీ మాత్రమే పంచాడా? అంటే కానే కాదు. తనకున్న తెలివితేటలు అమోఘం. నాగార్జున ఏం అడుగుతాడు? ఈ వారం జరగనుంది? అని ముందే ఊహించేవాడు. అతడు లెక్క ఎప్పుడూ తప్పవలేదు. తను ఊహించిందే జరిగింది. సంజనాను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తిసంజనా గుడ్డు దొంగతనం చేసినప్పుడు అందరూ కయ్యిమని అరుస్తూ ఆమెను నానామాటలు అంటుంటే ఇమ్మూ (Emmanuel) ఒక్కడే ఆమె గేమ్ప్లాన్ అర్థం చేసుకున్నాడు. తాను తిట్లుపడ్డా తప్పులేదు, కానీ ప్రేక్షకుల్ని ఎలాగైనా అలరించాలన్న ఆమె కసిని గమనించి ఫిదా అయ్యాడు. చంటిపాపను, కొడుకును వదిలేసి వచ్చిన ఆమెకు కొడుకయ్యాడు. ప్రేమను పంచాడు. ఆమె తప్పులు చేసినప్పుడు వారించాడు. కెప్టెన్సీ త్యాగంమాటలు తూలినప్పుడు హెచ్చరించాడు. నాగార్జున ముందు కూడా తప్పును తప్పే అని వాదించాడు. కానీ, తనను ఎలిమినేషన్ నుంచి కాపాడుకునే ఛాన్స్ వచ్చినప్పుడు క్షణం ఆలోచించకుండా కెప్టెన్సీని త్యాగం చేశాడు. కావాలంటే కెప్టెన్సీని మళ్లీ సంపాదిస్తానన్న ధైర్యం, అమ్మ కావాలన్న తపన.. రెండూ అతడిలో కనిపించాయి. ఎమోషనల్, తెలివితేటలు, మంచితనం, స్నేహబంధం వంటివెన్నో ఉన్నా అతడిలో కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. ఆటను చేజేతులా నాశనం చేసుకున్నాడా?మొదట నామినేషన్ అంటే భయం. ఆ భయమే తన ఓటమికి పునాది వేసింది. సీజన్ మొత్తంలో అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచిన ఇమ్మూ.. తన సత్తా ఏంటో చూపించాడు. టాస్కుల మాస్టర్గా పేరు తెచ్చుకున్న అతడు టికెట్ టు ఫినాలేలో మాత్రం కల్యాణ్తో చేతులు కలిపాడు. ఇది అతడికి మరో మైనస్గా మారింది. సింగిల్ సింహంలా ఎన్నో గేమ్స్ ఆడి గెలిచిన ఇమ్మూ చివరికొచ్చేసరికి ఇలా మరొకరితో జోడీ కట్టి పక్కవాళ్లను ఓడించాలని చూడటం చాలామందికి నచ్చలేదు. మరోసారి రుజువైంది!కానీ ఇంతమాత్రానికే అతడిని నాలుగో స్థానంలో పెట్టడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఏదేమైనా ఇక్కడ ఇమ్మాన్యుయేల్ ఓడిపోలేదు.. అందరూ కలిసి అతడిని ఓడించారు. కమెడియన్లు ప్రాణం పెట్టి ఆడినా, కట్టే కాలేవరకు నవ్విస్తామన్నా వాళ్లను కేవలం జోకర్స్లాగే చూశారు. ఇప్పుడు అందరిలో జోకర్గానే నిలబెట్టారు. కమెడియన్స్ కప్పు గెలవలేరని మరోసారి రుజువు చేశారు! -
బిగ్బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్కు తన్నుకొచ్చిన దుఃఖం
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్కు మరికొద్ది గంటల్లో శుభం కార్డు పడనుంది. ఈ గ్రాండ్ ఫినాలే కోసం ఎంతోమంది గెస్టులు బిగ్బాస్ స్టేజీపైకి రానున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో మంగ్లీ, పాయల్ రాజ్పుత్ వంటి పలువురు తారలు డ్యాన్స్ పర్ఫామెన్స్తో అల్లాడించారు. అలాగే ఛాంపియన్, అనగనగా ఓ రాజు సినిమా హీరోహీరోయిన్లు కూడా సందడి చేశారు.బిగ్బాస్ హౌస్లో శ్రీకాంత్హీరో శ్రీకాంత్ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లి ఒకర్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి టీషర్ట్పై అన్సేఫ్ అని రాస్తారో వారు ఎలిమినేట్ అయినట్లు లెక్క! ఇక్కడ అందరికంటే ఎక్కువ కల్యాణ్ భయపడ్డాడు. తాను వెళ్లిపోతున్నానేమో అని ఊహించి ఏడుపు ముఖం పెట్టాడు. కానీ కొంత షూటింగ్ నిన్ననే అయిపోవడంతో ఫస్ట్ సంజనా ఎలిమినేట్ అయినట్లు లీక్స్ వచ్చాయి. రోబో ఎలిమినేట్!తర్వాత రోబోను పంపించగా ఆ రోబో ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించింది. ప్రోమో చూస్తుంటే మాత్రం ఓపక్క టెన్షన్, మరోపక్క ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. ఇక ఈ సీజన్ దేశంలోనే టాప్ 1లో ఉందన్నారు నాగార్జున. బిగ్బాస్ 9 ట్రోఫీని చూపించేటప్పుడు మగువా మగువా.. పాట బీజీఎమ్ వేశారు. అంటే తనూజ గెలుస్తుందని ఏమైనా హింట్ ఇచ్చారా? అని నెటిజన్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఆ ప్రోమో మీరూ చూసేయండి..& -
కష్టానికి విలువ లేదు.. కమెడియన్ రోహిణి ఆవేదన
అసలు సిసలైన విందు అంటే ఎలా ఉంటుంది? అన్నం, భిన్న రుచుల కూరలు, పెరుగు, ఒక స్వీటు, ఒక హాటు.. ఇలా అన్నీ కలిస్తేనే కదా ఒక ఫుల్ ప్యాకేజ్ మీల్లా ఉండేది. బిగ్బాస్ షో కూడా అంతే! ఇక్కడ ఏది తక్కువైనా జనాలకు ఎక్కదు. ప్రేక్షకులు కోరుకునేది గొడవలే... అలా అని కేవలం గొడవలు మాత్రమే పడతామంటే అందరికీ బీపీలు పెరిగిపోతాయి. అందరికీ నచ్చేది ఒక్కరేఓన్లీ లవ్ ట్రాక్స్ అంటే యూత్కు నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్కు అంతగా ఎక్కదు. అందరికీ నచ్చేది.. అందర్నీ అక్కున చేర్చుకునేది ఒక్క కమెడియన్ మాత్రమే! చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందర్నీ నవ్వించగలడు. ఒత్తిడి నుంచి కాసేపైనా బయటకు తీసుకురాగలడు. అందుకే టీవీలో, ఓటీటీలో బోలెడన్ని కామెడీ షోలు వస్తున్నాయి. కానీ వీటి వెనక బోలెడంత హంగామా, ప్రాక్టీస్ ఉంటుంది. బిగ్బాస్లో కామెడీ అంత ఈజీ కాదు!మరి బిగ్బాస్లో? అప్పటికప్పుడు సహజంగా నవ్వించాలి. ఎవర్నీ నొప్పించకుండా, అందర్నీ మెప్పించేలా కామెడీ పంచాలి. అవినాష్, రోహిణి, తేజ.. ఇలా పలువురూ తెలుగు బిగ్బాస్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు నవ్వుల్ని పంచారు. కేవలం కామెడీని నమ్ముకోకుండా ఆటలోనూ శివంగి అని నిరూపించింది రోహిణి. ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచి తన దమ్ము చూపించాడు ముక్కు అవినాష్. నాలుగో స్థానం..కానీ, వీళ్లెవరూ ట్రోఫీని అందుకోవడం కాదుకదా.. కనీసం రన్నరప్ కూడా అవలేకపోయారు. ఈసారి మాత్రం ఆ లోటును ఇమ్మాన్యుయేల్ తీర్చబోతున్నాడని బలంగా ఫిక్సయ్యారు. కానీ ఇమ్మూ నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయినట్లు లీక్స్ బయటకు వచ్చాయి. అది జీర్ణించుకోలేక ఇమ్మూ స్టేజీపై బోరుమని ఏడ్చాడట.. ఈ విషయంపై కమెడియన్ రోహిణి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్మూ గురించి తెలిసి ఎంతో నిరాశచెందాను. నువ్వే రియల్ విన్నర్అతడి విషయంలో బిగ్బాస్ టీమ్, ప్రేక్షకులు.. ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. బిగ్బాస్ 9 సీజన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. కష్టపడినా విలువ ఉండదు, దానికి తగ్గ ఫలితం రాదు. మీ దృష్టిలో ఎంటర్టైనర్స్కు ఏ స్థానం ఉందో మళ్లీ నిరూపించారు. ఇమ్మూ.. ఈ సీజన్కు నిజమైన విజేత నువ్వే.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది. బిగ్బాస్కో దండం అన్నట్లుగా చేతులెత్తి జోడిస్తున్న ఎమోజీలను జత చేసింది. -
Bigg Boss: టైటిల్ గెలిచినా.. స్టార్డమ్ రాలేదు?
‘బిగ్బాస్’ షోతో కెరీర్ పరంగా ఎదగాలి.. కంటెస్టెంట్స్ ఆలోచన ఇది. కంటెస్టెంట్స్ అంతా సెలబ్రిటీలే కాబట్టి వారి ఇమేజ్తో షోని సక్సెస్ చేసుకోవాలి.. ‘బిగ్బాస్’ స్ట్రాటజీ ఇది. ఇందులో ఇప్పటి దాకా బిగ్బాస్ యూనిట్ గెలుస్తూ వచ్చింది. ఎందుకంటే ఎనిమిది సీజన్స్లో విన్నర్స్ కానీ, కంటెస్టెంట్స్ కానీ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత పెద్దగా సాధించిందేమీ లేదు. వాళ్ల కెరీర్కి షో ప్లస్ అయిందీ లేదు.బిగ్బాస్ 1విన్నర్గా శివ బాలాజీ విజేతగా నిలిచాడు. నిజానికి బిగ్ బాస్లో పాల్గొనే నాటికే శివ బాలాజీ హీరోగా ప్రేక్షకులకు సుపరిచితం. 'అనగనగా ఒక రోజు', 'చందమామ' వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్తో మరింతగా ఆడియన్స్కి దగ్గరైయ్యాడు. ఆ సీజన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. కానీ… ఆ తర్వాత శివ బాలజీ కెరీర్లో పెద్ద మార్పు అయితే రాలేదు. కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు, కానీ హీరోగా బ్రేక్ రాలేదు. ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నట్లు, షో అతనికి మరింత పాపులారిటీ ఇచ్చినా, అవకాశాలు పెరగలేదు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్పై ఫోకస్ చేస్తున్నాడు.బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ పరిస్థితి అయితే మరీ దారుణం. షో జరిగినన్ని రోజులు కౌశల్ పేరు మారుమోగింది. కౌశల్ ఆర్మీ పేరుతో యువత హల్చల్ చేశారు. బిగ్బాస్ షోలో ఏ కంటెస్టెంట్కు రాన్నంత ఇమేజ్ కౌశల్కు వచ్చింది. బిగ్బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతడికి వరుస ఆఫర్స్ వస్తాయని ఆశించారు. కానీ, షో తర్వాత అతని పేరు క్రమంగా మరుగున పడింది. టాలీవుడ్లో పెద్ద అవకాశాలు రాలేదు. కొన్ని వెబ్ సిరీస్లు, చిన్న రోల్స్ చేశాడు, కానీ స్టార్డమ్ రాలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినా, కెరీర్ మలుపు తిరగలేదు. నేడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాడు, కానీ ఇండస్ట్రీలో హైలైట్ కాలేదు.సింగర్ రాహుల్ సిప్లిగంజ్కి ఈ షో కాస్త ఉపయోగపడింది. బిగ్బాస్ 3 విన్నర్గా నిలిచిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. బెంజ్ కారు కొనేదాకా ఆయన ఆర్థిక స్థాయి వచ్చింది. కానీ బ్రేక్ వచ్చే స్థాయిలో కెరీర్ పరంగా అద్భుతాలు ఏం జరగలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయనకు ఇంకాస్త పేరు అయితే వచ్చింది. కానీ అటు సింగర్గాను, ఇటు యాక్టర్గానే అంత బిజీ అయితే కాలేదు.బిగ్బాస్ 4 విన్నర్ అభిజిత్ పరిస్థితి కూడా అంతే . హీరోగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో ఫేమస్ అయిన అభిజిత్, షోలో తన ఇంటెలిజెన్స్, స్ట్రాటజీతో విన్నర్ అయ్యాడు. షో అతనికి మరింత పాపులారిటీ ఇచ్చినా, కెరీర్లో మార్పు రాలేదు. కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు, కానీ హీరోగా హిట్ రాలేదు. ఫిలిం ఇండస్ట్రీలో అతని పేరు ఇప్పుడు తక్కువగా వినిపిస్తోంది.బిగ్బాస్ 5 విజేతగా వీజే సన్నీకి కూడా ఈ షో పెద్దగా ఉపయోగపడలేదు.సీరియల్ యాక్టర్గా ఫేమస్ అయిన సన్నీ, షోలో తన హ్యూమర్, టాస్క్ పెర్ఫార్మెన్స్తో గెలిచాడు. షో తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా ట్రై చేశాడు, కానీ అవి వర్కౌట్ కాలేదు. పేరు పెద్దగా వినిపించడం లేదు. సీరియల్స్కు తిరిగి వచ్చాడు.సీజన్ 6 విన్నర్గా సింగర్ రేవంత్ నిలిచాడు. సింగర్గా ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన రేవంత్, షోలో తన వాయిస్, పర్సనాలిటీతో ఆకట్టుకున్నాడు. షో తర్వాత అతని సింగింగ్ కెరీర్ మెరుగుపడింది – 'కల్కి 2898 AD' వంటి సినిమాల్లో సాంగ్స్ పాడాడు. కానీ, పెద్ద స్టార్డమ్ రాలేదు. సింగర్గా కొనసాగుతున్నాడు, షో అతనికి మధ్యస్థంగా ఉపయోగపడింది. బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ పరిస్థితి కూడా అంతే.'రైతు బిడ్డ'గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్, షోలో అనూహ్య ఫాలోయింగ్ సంపాదించాడు. కానీ, షో తర్వాత అతని ఇమేజ్ డ్యామేజ్ అయింది – కాంట్రవర్సీలు, లీగల్ ఇష్యూస్ వచ్చాయి. సినిమా అవకాశాలు రాలేదు, పేరు నెగెటివ్గా మారింది.బిగ్బాస్ 8 విన్నర్గా నిలిచిన నిఖిల్కి కూడా ఈ షోతో పెద్దగా ఒరిగిందేమి లేదు. షో తర్వాత కూడా ఆయన అదే సీరియల్స్లో కొనసాగుతున్నాడు. కానీ హీరోగా బ్రేక్ రాలేదు. కెరీర్లో పెద్ద మార్పు లేదు.బిగ్ బాస్ తెలుగు విన్నర్ల చరిత్ర చూస్తే, షో అందరికీ పబ్లిసిటీ ఇస్తుంది, కానీ దీర్ఘకాలిక కెరీర్ బూస్ట్ చాలా మందికి రాలేదు. రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ వంటి వారికి కాస్త ఉపయోగపడినా, మిగతా వారు సీరియల్స్ లేదా చిన్న రోల్స్కు పరిమితమయ్యారు. కాంట్రవర్సీలతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నవారు కూడా ఉన్నారు. మరికొంతమందికి ఈ షో తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి. మరి సీజన్ 9లో ఎవరు విన్నర్ అవుతారు? వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. -
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్దే గెలుపు!
బిగ్బాస్ షో.. వంద రోజుల యుద్ధానికి తెర దించే సమయం ఆసన్నమైంది. ఫైనల్ ఓటింగ్స్ నిన్నటితో ముగిశాయి. ఈసారి కామనర్ గెలుస్తాడా? లేదా తనూజ గెలిచి లేడీ విన్నర్గా చరిత్ర సృష్టించనుందా? ఆన్లైన్ పోల్స్ ఏమని చెప్తున్నాయి? ఓటింగ్ ట్రెండ్ ఎటువైపు బలంగా ఉంది ఓసారి చూసేద్దాం..టాప్ 5 ఫైనలిస్టులుతెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ మొదలైనప్పుడు విన్నర్ మెటీరియల్లా ఒక్కరూ కనిపించడం లేదని జనాలే అనుకున్నారు. అలాంటి సమయంలో తనూజ తన రియల్ ఎమోషన్స్ చూపిస్తూ.. కసిగా గేమ్ ఆడుతూ విన్నర్ రేసులో ముందుకొచ్చింది. కమెడియన్గా నవ్విస్తూనే, టాస్కుల్లో దులిపేస్తూ నేనున్నానంటూ ముందుకు దూసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. కామనర్గా వచ్చిన కల్యాణ్ గెలిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అది సరిపోదుమొన్నటిదాకా రీతూతో గొడవ వల్ల కనిపించకుండా పోయిన డిమాన్ పవన్ ఫైనల్ వీక్లో మాత్రం తన టాలెంట్ అంతా చూపిస్తున్నాడు. కానీ కప్పు గెలిచేందుకు ఇది సరిపోదు. గేమ్స్ అందరూ ఆడతారు.. కానీ ఆడించడం తెలిసుండాలి... స్కోప్ లేని దగ్గర కూడా కంటెంట్ క్రియేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది సంజనా. అలా ఫైనల్స్లో చోటు దక్కించుకున్న ఆమె టాప్ 5లో చివరి స్థానంతోనే సరిపెట్టుకోనుంది.ఓట్లు గుద్దిపడేసిన అభిమానులుటాప్ 5లో ఉన్న ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా హౌస్లో కష్టపడ్డారు. వారికోసం బయట అభిమానులు కూడా బీభత్సంగానే కష్టపడ్డారు. మిస్డ్ కాల్స్, హాట్స్టార్లో ఓటింగ్తో దుమ్ము లేపారు. గత సీజన్స్ కంటే కూడా ఈసారి ఎక్కువ ఓటింగ్ నమోదైనట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వారం ప్రారంభం నుంచి శుక్రవారం వరకు కూడా సంజనా చివరి స్థానంలోనే ఉంది. పవన్కు పెరిగిన ఓటింగ్మూడు, నాలుగు స్థానాలు మాత్రం మారుతూ వచ్చాయి. పవన్లో హుషారు చూసి అతడికి ఓట్లు గుద్దిపడేశారు. దీంతో అప్పటిదాకా మూడో స్థానంలో ఉన్న ఇమ్మూ సడన్గా నాలుగో స్థానానికి పడిపోయాడు. కానీ వీకెండ్ వచ్చేసరికి ఇమ్మూ మళ్లీ ఒక మెట్టు పైకి ఎగబాకినట్లు వినికిడి. అసలు సిసలైన విన్నర్ పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరుగుతోంది. వీళ్లిద్దరికీ హోరాహోరీగా ఓట్లు నమోదయ్యాయి.ఈ ఇద్దరి మధ్యే పోటీఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్పల్పంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో తనూజకు భారీగా ఓట్లు పడగా.. తర్వాత కల్యాణ్కు సడన్గా ఓటింగ్ రేంజ్ పెరిగిందంటున్నారు. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరు విన్నర్, మరొకరు రన్నర్గా నిలవనున్నారు. ప్రతి సీజన్లో విన్నర్, రన్నర్ మధ్య గొడవలు జరిగాయి. కానీ, ఈ సీజన్లో మాత్రమే ఇద్దరూ కలిసికట్టుగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉన్నారు. వైరం పెట్టుకోకుండా ముందుకు సాగారు.తనూజపై అక్కసువాళ్లిద్దరూ బాగానే ఉన్నా.. వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో బద్ధ శత్రువుల్లా కొట్టుకున్నారు. ఇక ఆడవారికి ఆడవాళ్లే శత్రువు అన్నట్లు తనూజపై చివరి వారంలో కొందరు సెలబ్రిటీలు విషం కక్కారు. అది కూడా ఆమెకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా పోల్స్లో కల్యాణ్ గెలిచే ఆస్కారం ఉందంటున్నారు. కొన్ని పోల్స్ మాత్రమే తనూజ గెలుపు తథ్యమని చెప్తున్నాయి. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు!ఓటింగ్లో కూడా కల్యాణ్ బుల్లెట్ స్పీడ్లో దూసుకెళ్లాడని టాక్! మరి ఇదే నిజమై కల్యాణ్ కప్పు గెలుస్తాడా? లేదా తనూజ కోరుకున్నట్లుగా టైటిల్ ఆమె వశమవుతుందా? అనేది రేపటి గ్రాండ్ ఫినాలేలో చూడాలి! ఇది బిగ్బాస్ హౌస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. కొన్నిసార్లు లెక్కలు తారుమారు కూడా అవొచ్చు! -
కల్యాణ్ పడాల తలకు కట్టు... అతడికేమైంది?
బిగ్బాస్ హౌస్లో ఫైనలిస్టులు ఐదుగురు సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఈరోజు వారిని పలకరించేందుకు దాదాపు ఐదారుగురు సెలబ్రిటీలు హౌస్లో అడుగుపెట్టనున్నారు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ప్రమోషన్స్లో భాగంగా శివాజీ, లయ, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ మొదటగా వచ్చారు. బుల్లితెర యాంకర్స్తర్వాత రాజాసాబ్ కోసం నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బుల్లితెరను ఏలుతున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు, క్వీన్ శ్రీముఖి అడుగుపెట్టారు. ఈ మేరకు వరుస ప్రోమోలు వదులుతున్నాడు బిగ్బాస్. బీబీ జోడీ రెండో సీజన్ మొదలు కాబోతోంది.. ఈ సీజన్ నుంచి కూడా జంటలు రావాలని కోరుకుంటున్నా అని ప్రదీప్ అనగానే కల్యాణ్.. వస్తాం అన్నా అంటూ సంతోషంగా ఆన్సరిచ్చాడు. ఎలాగో ఈ షోలో పవన్-రీతూ జంటగా కనిపించడం ఫిక్స్! కల్యాణ్ తలకు కట్టుమరి తనూజ- కల్యాణ్ కూడా జోడీగా వస్తారా? లేదా? అనేది చూడాలి! ఇక శ్రీముఖి వచ్చినప్పుడు ఇమ్మూ చేసిన కామెడీ అయితే నెక్స్ట్ లెవల్. పుష్ప స్కిట్లో భాగంగా కల్యాణ్.. తనూజను గిల్లేశాడు. ఈ ప్రోమోలో కల్యాణ్ తలకు కట్టుతో కనిపించాడు. అయితే అతడికి పెద్ద గాయం ఏమీ అవలేదు. నిధి వచ్చినప్పుడు కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించింది. అప్పుడు కల్యాణ్ తలకు చిన్న దెబ్బ తగలడంతో కట్టు కట్టారు. కాబట్టి అభిమానులు కంగారుపడాల్సిన అవసరం లేదు. -
'బ్లాక్ అండ్ వైట్ బోర్'.. మరో లగ్జరీ కారు కొన్న లవ్ బర్డ్స్
బిగ్బాస్ 7 ఫేమ్ శుభ శ్రీ రాయగురు కాబోయే భర్తతో కలిసి షికార్లు తిరుగుతోంది. ఈ ఏడాది జూన్లో మనోభావాలు పాప.. నిర్మాత, నటుడు అజయ్ మైసూర్ను ఎంగేజ్మెంట్ చేసుకుంది. వీరిద్దరూ మేజెస్టీ సాంగ్లో జంటగా నటించారు. ఆ పాటతోనే ప్రేమలో పడి జంటగా కలిసుండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లెప్పుడన్నది మాత్రం ఇంకా చెప్పనేలేదు.లగ్జరీ కారు కొనుగోలుఅయితే కొన్ని వారాల క్రితమే ప్రియుడి కోసం ఆస్ట్రేలియా చెక్కేసిందీ బ్యూటీ. అక్కడ కాబోయే భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ కొత్త కారు కొన్నారు. ఇప్పటికే అజయ్ దగ్గర 20కి పైగా కార్లున్నట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా మరో లగ్జరీ కారు చేరింది. అదే మెర్సిడిస్ బెంజ్ AMG45S స్పెషల్ ఎడిషన్. ఇకనైనా మారండిఈ మోడల్ కారు ఆస్ట్రేలియాలో కేవలం 20 మాత్రమే అందుబాటులో ఉండగా అందులో ఒకదాన్ని అజయ్ జంట సొంతం చేసుకుంది. అదే విషయాన్ని అజయ్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంటూ.. ఇకనైనా బోర్ కొట్టే బ్లాక్ అండ్ వైట్ కార్లకు స్వస్తి పలికి కలర్ఫుల్ కార్లను కొనుగోలు చేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. వీళ్లు కొన్న కారు గ్రీన్ కలర్లో ఉంది. దీని ధర కోటికి పైనే ఉంటుందంటున్నారు. కాగా అజయ్.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, 10th క్లాస్ డైరీస్, హ్యాంగ్మ్యాన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రైవేట్ సాంగ్స్, పలు షార్ట్ ఫిలింస్లో నటించాడు. View this post on Instagram A post shared by Ajay Mysore (@ajay_mysore__) -
బిగ్బాస్ 9కి ప్రాణం పోసింది.. సంజనా రియల్ గేమర్!
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్పై ఎటువంటి బజ్ లేనప్పుడు షోకి ప్రాణం పోసింది సంజన గల్రానీ. గప్చుప్గా గుడ్డు దొంగతనం చేసి అందదరూ గొడవపడేలా చేసింది. ఒక్కక్కరి నిజస్వరూపాలు బయటపడేలా చేసింది. తనను తాను మోటివేట్ చేసుకుంటూ ఫినాలేలో అడుగుపెట్టింది. అన్నింటికీ ధైర్యంగా నిలబడే సంజనా.. గార్డెన్ ఏరియాలో కొడుకు ఫోటోను చూడగానే ఏడ్చేసింది. కన్నీళ్లు పెట్టుకున్న సంజనాఅరగంటలో వస్తానని అబద్ధం చెప్పి బిగ్బాస్ హౌస్లో 100 రోజులు ఉన్నానని సారీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు మరో జీవితాన్నిచ్చిన బిగ్బాస్ను గాడ్ ఫాదర్గా అభివర్ణించింది. తర్వాత బిగ్బాస్ మాట్లాడుతూ.. టాప్ గేర్లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. దాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మీ ధైర్యమే..సీజన్ 9 మొదటి కెప్టెన్గా నిలిచి ఆరంభం నుంచి ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు. మొదటి వారం నుంచి 15వ వారం వరకు ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి అనేలా ఆడారు. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు(ఇమ్మాన్యుయేల్)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. ఇంట్లో అందరికీ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. మీ ప్రతి ఎమోషన్ ఎలాంటి పరదా లేకుండా ప్రేక్షకులకు చూపాలన్న మీ నిర్ణయం, ధైర్యం వారిని మీకు మరింత చేరువ చేసింది. ఎవరికీ అర్థం కాని గేమర్అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? ఎవరి గుర్తింపు వారి చేతుల్లోనే ఉందని బలంగా నమ్మారు. టాస్కులో పోటీపడ్డా, సంచాలక్గా ఉన్నా, వంటగదిలో ఉన్నా, బెడ్ రూమ్లో కబుర్లు చెప్తున్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు. సంజనా సైలైన్సర్గా, సంజూ బాబాగా, మమ్మీగా ఎవరికీ అర్థం కాని గేమర్గా వివిధ పాత్రల్లో ప్రతి నిమిషం వినోదాన్ని పంచేందుకు ప్రయత్నించారు. మొండిధైర్యం మీ సొంతంఆటలో మిగతావారు మీకన్నా బలంగా ఉన్నా, వారికి మిగతావారి మద్దతు ఉన్నా మీరెప్పుడూ అధైర్యపడలేదు. ఎవరి మీద ఆధారపడి ఆడటానికి ఈ ఇంట్లోకి రాలేదు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్నిక్కడి వరకు తీసుకొచ్చింది. ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం. అదే మీ కన్నీళ్లకు కారణంమీ దూకుడు మనస్తత్వం, మీ కత్తుల్లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేశాయి. అప్పుడు మీ మనసుకు దగ్గరైనవారితో అభిప్రాయభేదాలు వచ్చాయి. అది మీ మనసును ఎంతో బాధపెట్టింది. మీ కన్నీటికి కారణమైంది. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని ఏదో ఒకరోజు మీ బాబు, ఐదు నెలల పాప చూసి ఎంతో గర్వపడతారు అని పొగిడాడు. తర్వాత జర్నీ వీడియో చూపించగా సంజనా ఉప్పొంగిపోయింది. అందులో తన అల్లరి, ప్రాంక్స్.. సీక్రెట్ రూమ్కు వెళ్లిరావడం.. గొడవలు.. ఇలా అన్నీ చూపించారు. -
సల్మాన్ ఒక్క ఎపిసోడ్కు అందుకునేది.. నాగ్కు మొత్తం సీజన్కు అందుతుంది..
నాటకీయ నామినేషన్ల నుంచి ఊహించని ఎలిమినేషన్ల వరకు, బిగ్ బాస్ అనే రియాల్టీ షో వీక్షకుల్లో ఎల్లప్పుడూ కుతూహలాన్ని రేకెత్తిస్తూ ఆదరణను కాపాడుకుంటూ వస్తోంది. ఈ షో విజయానికి దాని కాన్సెప్ట్తో పాటు దాని హోస్ట్లు కూడా ప్రధాన కారణమే అనేది నిస్సందేహం. ఆధిపత్యం చెలాయించే ప్రవర్తనతో సల్మాన్ ఖాన్ కావచ్చు, సహజసిద్ధమైన కూల్ అట్రాక్షన్తో నాగార్జున కావచ్చు, పెద్దరికపు ఆప్యాయత కనబరిచే మోహన్లాల్ కావచ్చు...దేశంలో పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షోకు తమదైన ప్రత్యేకతను తీసుకువచ్చారనేది వాస్తవం. అయితే ఆ పెద్ద ఇల్లును అంత బాధ్యతగా నిర్వహిస్తున్న, ఈ సెలబ్రిటీ హోస్ట్ లు తాజా సీజన్లో అందుకున్న పారితోషికం వివరాలు చూద్దామా?సహజంగానే అత్యంత భారీ స్థాయిలో వీక్షకులు ఉంటారు కాబట్టి బిగ్ బాస్ హిందీ వెర్షన్ హోస్ట్గా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అందరిలోనూ ముందున్నారు. సుమారు 15 వారాంతాల్లో హోస్ట్గా ఆయన వ్యవహరిస్తారు. మొత్తం 13 సీజన్ల పైగా ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సల్మాన్ ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేశారని వార్తలు వచ్చినప్పటికీ సల్మాన్ దాన్ని కొట్టిపారేశారు. అందుతున్న నివేదికల ప్రకారం, సల్మాన్ ప్రారంభంలో వారానికి సుమారు రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నారు, ఆ తర్వాత దానిని ఎపిసోడ్కు రూ. 25 కోట్లకు పెంచారు. తాజా సీజన్ బిగ్ బాస్ 16 కోసం ప్రతి ఎపిసోడ్కు రూ. 43 కోట్లకు చేరినట్లు సమాచారం. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ తమిళ బిగ్బాస్ రియాలిటీ టీవీ షో 7వ సీజన్కు తీసుకున్న పారితోషికం రూ. 130 కోట్లు అని సమాచారం. అయితే, గత రెండు సీజన్లకు హోస్ట్గా విజయ్ సేతుపతి కొనసాగుతున్నారు. తను కూడా సుమారుగా రూ. 50 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.హిందీ వెర్షన్ విజయం తర్వాత, బిగ్ బాస్ కన్నడ వెర్షన్ 2013లో ప్రారంభమైంది. కన్నడ షో మొత్తం 11 సీజన్లకు కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్ సంజీవ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గత 2015లో కలర్స్ ఛానెల్తో అతను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఐదేళ్లకు గాను ప్రారంభంలో రూ. 20 కోట్లు పారితోషికం తీసుకున్నారట. అభిమానులు అతని పారితోషికాన్ని సల్మాన్తో పోల్చడం ప్రారంభించారు. ఇటీవలి సీజన్కు అతని పారితోషికం బాగా పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.దక్షిణాన కేరళలో, మోహన్లాల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ... దాని నాటకీయ ఎలిమినేషన్లు షాకింగ్ ట్విస్ట్లతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దీని విజయంలో మోహన్లాల్ హోస్టింగ్ నైపుణ్యం ప్రధాన ఆకర్షణగా ఉంది, ఈ మలయాళ వెర్షన్ 2018లో ప్రారంభమై వేగంగా ప్రజాదరణ పొందింది. సీనియర్ నటుడు మోహన్లాల్ మొదటి సీజన్కు రూ. 12 కోట్లు, ఆయన తాజా సీజన్కు సుమారు రూ. 24 కోట్లు అందుకున్నారని అంచనా.తెలుగు వారి అభిమాన హీరో అక్కినేని నాగార్జున వరుసగా బిగ్బాస్ ఆరవ సీజన్కు హోస్ట్గా వ్యవహరించారు. నివేదికల ప్రకారం, ఆయన తొలిదశలోప్రతి ఎపిసోడ్కు రూ. 12 లక్షలు చొప్పున మొత్తం సీజన్కు రూ. 12 కోట్లను అందుకున్నారు.అయితే తాజా సీజన్కు ముందు ఆయనకు రూ. 15 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే, తాజా సీజన్ కోసం ఆయన తన ఫీజును అమాంతం 30 కోట్ల రూపాయలకు పెంచినట్లు సమాచారం. ఫరెవర్ కూల్గా, అదే సమయంలో ఖచ్చితత్వంతో వ్యవహరిస్తూ హౌస్లోని వారిని సమన్వయం చేయడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనూ నాగ్ విజయవంతం అవడంతో... ఈ షో పాప్యులారిటీకి ఆయన కీలకంగా మారారు. -
విన్నర్ రేంజ్ ఎలివేషన్...మీసం మెలేసిన కల్యాణ్
బిగ్బాస్ షోలో హౌస్మేట్స్ ఫైనల్ వీక్ను సరదాగా గడిపేస్తున్నారు. కాఫీ పంపిస్తే డిమాన్ పవన్కు చీర కట్టి అందంగా రెడీ చేసి డ్యాన్స్ వేయిస్తాం అన్నారు. అన్నట్లుగానే పవన్ను అమ్మాయిగా ముస్తాబు చేసి ఓ ఆటాడుకున్నారు. తర్వాత కల్యాణ్ జర్నీ వీడియో ప్లే చేశారు. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేయండి..ఆడవేషం కట్టిన పవన్ఆడవేషంలో ఉన్న పవన్ డ్యాన్స్తో ఎపిసోడ్ ఉత్సాహంగా మొదలైంది. వీళ్ల జోష్ చూసిన బిగ్బాస్ కాఫీ పౌడర్తో పాటు ఏకంగా మటన్ పంపించాడు. తర్వాత కల్యాణ్ గార్డెన్ ఏరియాలో తన కటౌట్ చూసుకుని మురిసిపోయాడు. బిగ్బాస్ మాట్లాడుతూ.. మీది ఒక సామాన్యుడి కథ.. కానీ సామాన్యమైన కథ కాదు. జీరో దగ్గర మొదలైన కథ.. కానీ, జీరోగా ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమను పొందే అవకాశం లభిస్తుంది. దాన్ని మీరు అగ్నిపరీక్షను దాటి సొంతం చేసుకున్నారు.ఓనర్గా మొదలై...ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్నిచ్చారు. ఓనర్గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం.. మొదట్లో సులువుగా అనిపించినా పోనుపోను ఎన్నో కఠినమైన పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిని దాటితేకానీ, మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు నిరూపిస్తే కానీ.. ముందుకు కదల్లేని పరిస్థితిలో ఒకరి స్నేహం మీకు బాసటగా నిలిచింది.కుంగదీసినా తేరుకున్నారుమీ తప్పొప్పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది. ధైర్యాన్ని నింపింది. వారికోసం ఎలాంటి త్యాగాలైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. మీతో ప్రయాణం మొదలుపెట్టినవారందరూ ఒక్కొక్కరిగా ఇంటినుంచి బయటకు వెళ్లిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసినా తేరుకున్నారు. తప్పులను సరిచేసుకున్నారు. సరైన దిశలో నడవడమే విజయాన్ని అందించే మార్గమని చూపించారు. గుండె బలంతో..బుద్ధి బలాన్ని, భుజ బలాన్ని మించినది గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కోవారం నింపుకుంటూ కెప్టెన్గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకు మరింత వేగాన్ని జత చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపింది. మీలోని యోధుడిని నిద్ర లేపింది. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమ అయిన మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ సరి చేసుకుంటూ చివరి కెప్టెన్గా నిలిచారు.ఎంతోమందికి దిక్సూచిలా..అంతేక కాక ఫస్ట్ ఫైనలిస్టుగా నిలిచి ఒక కామనర్ తల్చుకుంటే ఏం చేయగలడో ప్రపంచానికి తెలిసేలా చేశారు. లక్ష్మణ్ రావు- లక్ష్మీల కొడుకు కల్యాణ్ అనే మాట ఇప్పటివరకు! కానీ వీళ్లు కల్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని, కాలర్ ఎగరేసే గర్వాన్ని అందించారు. గొప్ప కలలు కనేందుకు, వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్కు దిక్సూచిలా నిలిచి, స్ఫూర్తినిచ్చిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.. అంటూ జర్నీ వీడియో చూపించాడు. అది చూసిన కల్యాణ్ ఆనందంతో మీసం మెలేశాడు. అయితే తనూజ జర్నీ వీడియోలో హైప్ ఇచ్చే మూమెంట్ ఒక్కటి కూడా లేదు.. కానీ కల్యాణ్ వీడియో మొత్తం హైప్తో నిండిపోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
నా భార్య 4 రోజులు తినకుండా ఏడ్చింది: సుమన్
బిగ్బాస్ హౌస్లో సుమన్ను ఇష్టపడనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల దగ్గర నుంచి హౌస్మేట్స్ వరకు అందరికీ అతడంటే ఇష్టమే! తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ నవ్విస్తాడు. సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే అతడి వైఖరికి అందరూ ఫిదా అవుతారు. కాకపోతే ఆటలో పెద్దగా సత్తా చూపించకపోయేసరికి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఫ్యామిలీ వీక్లో సుమన్ కోసం అతడి భార్య ఇంట్లోకి వచ్చింది. వచ్చీరావడమే తనూజకు దూరంగా ఉండమని చెప్పింది. మాట మార్చేసిన సుమన్ఇది ఎపిసోడ్లోనూ టెలికాస్ట్ అయింది. కానీ, ఇప్పుడేమో తన భార్య అలా అనలేదని మాట మార్చేశాడు సుమన్. తనూజకు దూరంగా ఉండమని మీ భార్య ఎందుకు చెప్పింది? అని ఓ విలేకరి అడిగాడు. ఆ ప్రశ్నకు సుమన్ స్పందిస్తూ.. దూరంగా ఉండమని చెప్పలేదు. తనూజవాళ్లు బాగా ఆడుతున్నారు. మీరింకా బాగా ఆడండి అని చెప్పిందంతే! అంతే తప్ప జాగ్రత్త అని చెప్పలేదు. 4 రోజులు ఏడుస్తూనే..మీరు బాగా ఆడుతున్నారు, ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టి వాళ్లలా ఆడమని నా భార్య సలహా ఇచ్చింది. అది బయటకు తప్పుగా వెళ్లింది. దానివల్ల ఆమె నాలుగురోజులపాటు తినకుండా ఏడుస్తూ కూర్చుంది. నేను తప్పుగా ఏం చెప్పాను? అని చాలా బాధపడింది అన్నాడు. ఈ కామెంట్స్ విన్న జనాలు.. ఎపిసోడ్లో అందరం చూశాం.. ఎందుకు కవర్ చేయాలని చూస్తున్నావ్? ఆమెది ఏ తప్పూ లేకపోతే ఎందుకు ఏడవడం? అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: పిల్లాడికి అబద్ధం చెప్పి బిగ్బాస్కు.. ఏడ్చేసిన సంజనా -
గేమ్ నీ చేతుల్లోకి తీసుకున్నావ్.. డ్రామా క్వీన్!
పెళ్లి చేసుకునే వయసొచ్చినా సరే అమ్మానాన్నను వదిలేసి ఉండాలంటేనే ఏడుస్తున్నారు కంటెస్టెంట్లు. కానీ సంజనా మాత్రం గుండె రాయి చేసుకుని పిల్లాడిని, చంటిబిడ్డను వదిలేసి వచ్చింది. తన గుండె ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుని తీరాల్సిందే! ఏ రోజు కూడా పిల్లల పేర్లు ఎత్తి సింపతీ కోసం ప్రయత్నించలేదు. ఈ విషయంలో ఆమెను కచ్చితంగా ప్రశంసించాల్సిందే! నేడు ఆమె జర్నీ వీడియో చూపించనున్నాడు బిగ్బాస్. అరగంటలో వస్తానని..ఈ మేరకు ఓ ప్రోమో వదిలాడు. అందులో సంజనా.. తన కొడుకు ఫోటో చూసి ఏడ్చేసింది. మమ్మీ ఇంట్లో లేనందుకు సారీ.. అరగంటలో వస్తానని చెప్పి 100 రోజులైనా ఇంటికి రాలేదు.. సారీ అని కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్బాస్ మాట్లాడుతూ.. టాప్ గేర్లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన ప్రయాణంలో.. మీలో ఉన్నంత డ్రామా ఉంది. సీజన్ 9 మొదటి కెప్టెన్గా గెలిచి ప్రారంభం నుంచే ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు.తనకంటూ ఓ మార్క్ఇంట్లో ఏది జరిగినా అది మీవల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు (ఇమ్మాన్యుయేల్)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? టాస్కుల్లో మీరు పోటీపడినా.. సంచాలకులుగా ఉన్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు.మొండిధైర్యంఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని చూసి ఏదో ఒకరోజు మీ బాబు ఎంతో గర్వపడతాడు అని చెప్పాడు. సీజన్పై ఆసక్తి క్రియేట్ చేసిందే సంజనా మరి! తనకు ఆ మాత్రం ఎలివేషన్ ఇవ్వాల్సిందే! -
'పోతారు.. మొత్తం పోతారు' ఇక పవన్ను ఆపడం కష్టమే!
డిమాన్ పవన్ను అగ్నిపరీక్షలో చూసినవారంతా ఇతడు బిగ్బాస్కు సెలక్ట్ కాకపోయినా ఏం పర్లేదనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా తెలుగు బిగ్బాస్ తొమ్మిదవ సీజన్లో అడుగుపెట్టాడు. అసలు ఇతడేం చేస్తాడనుకునేవారికి తన కండబలం, బుద్ధిబలం కలగలిపిన వీరుడినని నిరూపించాడు. వరుసగా రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు. అయితే రీతూతో లవ్ ట్రాక్ వల్ల కాస్త నెగెటివ్ అయ్యాడు. ఓటింగ్లో దుమ్ము రేపుతున్న పవన్ఎప్పుడూ గొడవపడటం, కలిసిపోవడం.. ఇదంతా చూసేవారికి చాలా చిరాకు పుట్టించింది. కానీ రీతూ ఎలిమినేట్ అయిన వెంటనే తనలో మరో యాంగిల్ చూపించాడు. పంచ్లు వేస్తూ కామెడీ చేస్తున్నాడు. టాస్కుల్లో బాహుబలిలా ఆడుతున్నాడు. ఫైనల్లో నాలుగో స్థానంలో ఉంటాడనుకున్న పవన్ ఇప్పుడేకంగా ఓటింగ్లో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ ఫైర్ ముందు నుంచి ఉండుంటే ఏకంగా విన్నర్ అయ్యేవాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బిగ్బాస్ అతడి గురించి ఏమన్నాడో చూద్దాం..నిజమైన యోధుడివి"మీ విల్పవర్, ఫిట్నెస్.. మీ వ్యక్తిత్వంలో ఎంత ముఖ్యమో.. అలాగే ఒక బలమైన పోరాటానికి ఎంత అవసరమనేది మీ ప్రయాణామే నిరూపిస్తోంది. ఎవరితో తలపడ్డా, ఏ పోటీలో నిలబడ్డా.. గెలుపు గురించి మాత్రమే తపించే తత్వం ఒక నిజమైన యోధుడి గుణం. కామనర్గా అడుగుపెట్టిన ఈ పవన్ అమాయకమైన చిరునవ్వు వెనక ఉన్న డిమాన్ చేసే విధ్వంసం ఏంటో వాళ్లు దగ్గరుండి చూశారు. నామినేషన్లో మీపై ఎంతమంది మాటలతో దాడి చేసినా మీరు మౌనంగానే నిల్చున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు. చెమటోడ్చి గెలిచారుఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకున్నవాడు తన జీవితాన్ని అదుపులో పెట్టుకోగలడని మీకు తెలుసు. పవన్ మీరెవరివైపు ఉంటే వారికి కొండంత బలం.. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం. మాటల కన్నా చేతలు బలమైనవని నమ్మిన మీరు మీ చేతుల్లోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయం వైపు నడవడానికే ఉపయోగించి సఫలమయ్యారు. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. ప్రతి ఒక్కటి మీరు మీ చెమటోడ్చి చివరి వరకు పోరాడి గెలిచినదే! మనసు మాత్రం..మీకోసం ఎవరూ నిలబడకపోయినా మీకోసం మీరు వన్ మ్యాన్ ఆర్మీలా నిలబడ్డారు. అయితే మీ మనసు మాత్రం మీకోసం తపించే మరొకరి (రీతూ) వెంట చక్కర్లు కొట్టింది. ఈ ఇంట్లో మీ గెలుపును పంచుకోవడానికి, ఓటమి నుంచి బయటకు రావడానికి ఆ బంధం తోడ్పడింది. మీలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకే గాక, మీక్కూడా పరిచయం చేసింది. కానీ, టాస్కుల్లో అయినా, తన మనుషుల్ని ప్రేమించడంలో అయినా పవన్ తీరు ఒక్కటే అనే మాట మీ ప్రయాణాన్ని బరువుగా మార్చింది. మిమ్మల్ని అమాంతం మోకాళ్లపై కూర్చోబెట్టింది.పట్టువదలని పవన్ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు మీ మనసు ఎంత నొచ్చుకుందో నాక్కూడా తెలుసు. కానీ, తన కోరిక కూడా మీ గెలుపే అనే విషయం మీలోని యోధుడిని తట్టిలేపింది. కర్తవ్యం వైపు నడిపించింది. సంచాలకుల తప్పు వల్ల కెప్టెన్సీ కోల్పోయినా రెట్టింపు ఉత్సాహంతో దాన్ని తిరిగి సంపాదించిన పట్టువదలని పవన్ సత్తాను మరోసారి అందరికీ గుర్తు చేశారు. పోతారు.. మొత్తం పోతారుస్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ కామనర్గా మదలై టఫెస్ట్ కాంపిటీటర్గా తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోదుడిగా టాప్ 5లో ఒకరిగా నిలిచారు" అని చెప్పాడు. అయితే మీ మనసంతా రీతూనే అని చెప్తుంటే పవన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. జర్నీ వీడియో అంతా కూడా రీతూతో కలిసున్న క్షణాలే ఉన్నాయి. తను ఎదుర్కొన్న అవమానాలు, ఆడిన ఆటలు, అమ్మ వచ్చిన జ్ఞాపకాలను చూసి ఎమోషనలయ్యాడు. చివర్లో 'పోతారు.. మొత్తం పోతారు' అనే నాని డైలాగ్తో పవన్ రేంజ్ పెంచేశాడు బిగ్బాస్.చదవండి: సీజన్ అంతా మీ చుట్టూనే.. తనూజపై బిగ్బాస్ ప్రశంసలు -
సీజన్ అంతా తనూజ చుట్టూనే.. బిగ్బాసే ఒప్పుకున్నాడు!
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. టాప్ 5లో చోటు కోసం అలుపెరగని పోరాటం చేసిన హౌస్మేట్స్ దిల్ ఖుష్ చేసేందుకు జర్నీ వీడియోలు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ ఏవీ అయిపోయింది. తనూజ, పవన్ జర్నీ వీడియోలను ప్లే చేస్తూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు బిగ్బాస్. ఆ విశేషాలను గురువారం (డిసెంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం...నటనపై ప్రశంసలుముందుగా తనూజ టాలెంట్ను వర్ణించాడు బిగ్బాస్. తెరపై మీ నటన, మీరు పలికించిన భావాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. మిమ్మల్ని వారింట్లో కూతురిగా మార్చారు. గొప్ప నటిగా పాత్రల్లో మీరు పరకాయ ప్రవేశం చేసే తీరుకు అది నిదర్శనం. కానీ, బిగ్బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం. నటనకు ఆస్కారం లేని చోటు.. మనుషుల్ని ఎలాంటి పరదా లేకుండా చూపించే వేదిక. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని టాప్ 5లో నిల్చుని మీరెంత చిచ్చరపిడుగో నిరూపించారు.గేమ్ అంతా మీ చుట్టూనే..నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం.. అందరితో కలిసి అల్లరిచేసే విధానం మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగిందంటే అతిశయోక్తి కాదు. ఈ ఇంట్లో అందరూ మీతో కలిసిపోయినవారు లేదా కలబడ్డవారు. భావోద్వేగాల గని మీరు. మనుషుల్ని మీవైపు తిప్పుకోవడంలో, ఆటను మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి మీరు. నిందలతో నొచ్చుకున్న మనసుఈ రణరంగంలో ఎంతమంది బలమైన, తెలివైన యోధులున్నా ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. వంటగది నుంచే ఇంటిని గెలిచినతీరు ఆటలో ఎంత బలమైనవారో స్పష్టం చేస్తుంది. రీల్, రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. బంధాలను, బాధ్యతలను సమంగా మోశారు. కేవలం బంధాల పునాదులపై ఆటాడుతారని, అందరి మద్దతు కోసం పాకులాడతారని నిందించినప్పుడు మీ మనసెంతగానో నొచ్చుకుంది. అది మీ వ్యక్తిత్వంబంధాలకు అతీతులెవరూ లేరని మీకనిపించింది. నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్నా మనసును రాయి చేసుకుని అవసరమైనప్పుడు అది పక్కనపెట్టి ఆట ముందుకు తీసుకెళ్లారు. చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం.. కదనరంగంలో విరుచుకుపడే శివంగిలాంటి ధీరత్వం.. కత్తికి రెండువైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. జర్నీ వీడియోమిగతా వారి ఆట టాస్కులో మాత్రమే బయటకు వస్తే మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత బలంగా ముందుకు సాగుతూ వచ్చింది. ఈ ఇంట్లో, ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబసభ్యురాలిగా మారి అందరి ప్రేమను పొందిన విధానమే తనూజను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఎన్నో భావాలతో, బంధాలతో నిండిన మీ ప్రయాణం ఓసారి చూద్దాం.. అంటూ జర్నీ వీడియో ప్లే చేశారు.షాకైన తనూజఅందులో భరణితో నాన్న బంధాన్ని చూపించారు. అలాగే కల్యాణ్తో స్నేహాన్ని లవ్ట్రాక్ అన్న లెవల్లో చూపించారు. ఇదంతా చూశాక తనూజ సంతోషం పట్టలేకపోయింది. ఇదంతా ఒక కలలా ఉంది. ఎక్కడో పుట్టిపెరిగిన నన్ను ఇక్కడ నిలబడేలా చేసిన నా ఆడియన్స్కు థాంక్యూ అంటూ స్టేజీని ముద్దాడింది. కల్యాణ్తో.. వీడియో మొత్తం మనిద్దరిదే ఉందిరా, షాకైపోయానంది. అది తాను ముందే ఊహించానన్నాడు ఇమ్మాన్యుయేల్. తర్వాత పవన్ జర్నీ వీడియో ప్లే చేశారు. -
#Demonpavan: పోరాడి గెల్చావ్.. అసలైన యోధుడివి
బిగ్బాస్ ఫైనల్ వీక్ అంతా పిక్నిక్ హాలీడేలా సాగిపోతుంది. ఫైనలిస్టుల జర్నీ వీడియోలతో కాస్త ఎమోషనల్గానూ ఉంటుంది. ఇప్పటికే నిన్నటి ఎపిసోడ్లో ఇమ్మాన్యుయేల్ జర్నీ చూపించారు. నేడు తనూజ, పవన్ జర్నీ చూపించనున్నారు. ఈ మేరకు తాజాగా పవన్ కోసం ఓ ప్రోమో వదిలారు.యోధుడిగా నిలబడ్డావ్'మీరు ఎవరివైపు ఉంటే వారికి కొండంత బలం.. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం.. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. చెమటోడ్చి, చివరి వరకు పోరాడి గెలిచారు. స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ టఫెస్ట్ కాంపిటీటర్గా, తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా టాప్ 5లో నిలబడ్డారు' అని పొగిడాడు. సీజన్ అంతా తిట్టు పడ్డ పవన్.. ఎట్టకేలకు బిగ్బాస్ నోటితో పొగడ్తలు అందుకుని శెభాష్ అనిపించాడు. అతడి ఫుల్ జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
ఇమ్మూని ఆకాశానికెత్తిన బిగ్బాస్.. ఇది కదా జర్నీ అంటే!
కొన్ని ఫుడ్ ట్రీట్స్, ఇంటినుంచి సర్ప్రైజ్లు అందుకునేందుకు బిగ్బాస్ సరదా గేమ్స్ పెడుతూ వస్తున్నాడు. ఇందులో గెలిచిన పవన్కు ఇంటినుంచి వీడియో సందేశం రాగా తనూజకు ఫ్యామిలీ ఫోటో అందింది. మరి ఈసారి ఆ సర్ప్రైజ్ ఎవరు గెల్చుకున్నారో బుధవారం (డిసెంబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..సంజనాకు వీడియో మెసేజ్బాల్స్ విసిరే గేమ్లో కల్యాణ్ గెలిచి ఒక స్టార్తోపాటు స్వీట్ పొందాడు. ప్లేయర్ ఆఫ్ దిడేగా సంజనాను ఎంపిక చేయడంతో తన చెల్లెలు, హీరోయిన్ నిక్కీ గల్రానీ వీడియో మెసేజ్ ప్లే చేశారు. ఇక ఇమ్మాన్యుయ్యేల్ జ్యోతిష్యుడిగా మారి హౌస్మేట్స్ జాతకాలు చెప్పడంతో అందరూ పడీపడీ నవ్వారు. తర్వాత ఫైనలిస్టుల కోసం గ్రాండ్ జర్నీ వీడియోలు ప్లాన్ చేశారు. ముందుగా ఇమ్మాన్యుయేల్ వంతు వచ్చింది. గార్డెన్ ఏరియాలో తను ఆడిన టాస్కులు, వాటి ఫోటోలు చూసి ఎమోషనలయ్యాడు. అసలైన ఎంటర్టైనర్ఇక బిగ్బాస్ మాట్లాడుతూ.. బాధ, నిరాశ, ఓటమి.. ఎమోషన్స్ నుంచి మనుషులు పారిపోవాలని చూస్తారు. కానీ, అది సాధ్యం కాదు. వాటి నుంచి తేరుకునేందుకు మనుషులు కోరుకునేది ఆనందం. తనమన బేధం లేకుండా ఆనందాన్ని అందరికీ పంచేవారే ఎంటర్టైనర్స్. చిన్నప్పటినుంచి కష్టాలను అనుభవించినవారికే చిరునవ్వు బలమేంటో బాగా తెలుసు. అదే బలంగా మీరు ముందుకు సాగారు. నీ ఆటతో మిగతావారి ఆటస్థాయి పెంచారు. ఇమ్మూపై బిగ్బాస్ ప్రశంసలుఇంటిసభ్యులు మీకు దగ్గరైనవారి మీద మాటలదాడికి దిగినప్పుడు మీరు మాటమార్చలేదు, అలా అని వారి తోడు వీడలేదు. మీ ఆటలో, భావాల్లో నిజాయితీగా ఉన్నారు. మంచివైపే నిల్చున్నారు. మీకు దగ్గరైనవాళ్లు చేసింది తప్పనిపించినప్పుడు అంతే ధీటుగా నిలదీశారు. ఇంట్లో ఎన్ని జరిగినా ఆటపై ఏకాగ్రత కోల్పోలేదు. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలనేది ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు.అమ్మ కల నెరవేరిందిప్రేక్షకుల మనసు గెలిచేందుకు, గొప్ప మనిషిగా ఎదిగేందుకు జుట్టు అక్కర్లేదు, గొప్ప చదువులూ, ఆడంబరాలు అక్కర్లేదు. వ్యక్తిత్వం ఒక్కటే అవసరం. ఇది మరోసారి మీ ప్రయాణంతో రుజువైంది. కమెడియన్గా అడుగుపెట్టిన మీరు హీరోగా రావాలన్న మీ అమ్మ కల నిజమైంది అని బిగ్బాస్ చెప్పడంతో ఆనందభాష్పాలు కార్చాడు. తర్వాత తన జర్నీ చూసుకుని ఓపక్క సంతోషిస్తూనే.. మరోపక్క గుక్క పెట్టి ఏడ్చాడు. కట్టకాలే వరకు అందర్నీ నవ్విస్తూనే ఉంటానని మాటిచ్చాడు. -
నవ్వులపాలైన చోటే పవన్కు చప్పట్లు.. ఏడ్చేసిన తనూజ
టాప్ 5 కంటెస్టెంట్లకు చిన్న చిన్న గేమ్స్ పెడుతూ.. వారికి కొన్ని సర్ప్రైజ్లు ఇస్తున్నాడు బిగ్బాస్. అయితే బిగ్బాస్ ఇస్తున్న సర్ప్రైజ్ కంటే పవన్ ప్రవర్తన, దూకుడే అన్నింటికన్నా పెద్ద సర్ప్రైజింగ్గా ఉంది. ఏ గేమ్ ఇచ్చినా ఈజీగా గెలిచేస్తున్నాడు.. అందరితో సరదాగా కలిసిపోయి జోకులేస్తున్నాడు. మంగళవారం (డిసెంబర్ 16) నాటి ఎపిసోడ్లోనూ అదే జరిగింది. ఆ విశేషాలు ఓసారి చూసేద్దాం..అదరగొట్టేసిన పవన్బిగ్బాస్ బెలూన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో పవన్ను పక్కకు తప్పించి మిగతా అందరూ గేమ్ ఆడారు. ఈ ఆటలో తనూజ- కల్యాణ్ గెలిచారు. ఎక్కువ గేమ్స్ గెలిచిన పవన్ను హౌస్మేట్స్ ప్లేయర్ ఆఫ్ ది డేగా ప్రకటించారు. దీంతో అతడి అన్న వీడియో మెసేజ్ వచ్చింది. అగ్నిపరీక్షలో నిన్ను చూసి ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు నిన్ను మెచ్చుకుంటున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విని పవన్ ఉప్పొంగిపోయాడు.తనూజ గెలుపుమరుసటి రోజు పిక్ ద బోన్ అనే గేమ్ ఇచ్చాడు. ఇందులోనూ మళ్లీ పవనే గెలిచాడు. దీంతో అతడికి మళ్లీ ఓ స్టార్ వచ్చింది. అంతేకాకుండా.. మటన్ ఫ్రాంకీ పంపడంతో పవన్ ఆవురావురుమని ఆరగించాడు. అనంతరం బిగ్బాస్ టవర్ గేమ్ పెట్టాడు. ఈ ఆటలో ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరిలో తనూజ గెలిచి ఓ స్టార్ అందుకుంది. అలాగే తనకోసం బిగ్బాస్ పంపిన డ్రైఫ్రూట్ రబిడీని ఆరగించింది.తనూజకు చెల్లి పెళ్లి ఫోటోఅనంతరం ధమాకా కిక్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. గతంలో ఈ టాస్క్లోనే ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయకుండా కింద పడిపోయాడు పవన్. అప్పుడందరూ పగలబడి నవ్వారు. కానీ, ఈసారి మాత్రం అందరికంటే ఎక్కువ హైట్లో (ఏడున్నర అడుగులు) తన చెప్పును కాలితో అతికించి శెభాష్ అనిపించుకున్నాడు. ఒక స్టార్, తందూరీ చికెన్ గెలుపొందాడు. తర్వాత ప్లేయర్ ఆఫ్ ద డేగా తనూజను ప్రకటించారు. దీంతో ఆమెకు ఇంటినుంచి చెల్లి పెళ్లి ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో తనూజను కూడా ఎడిట్ చేసి పెట్టారు. అది చూడగానే తనూజ కుటుంబాన్ని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. -
నా కుటుంబం కన్నా తెలుగు ప్రేక్షకుల ప్రేమే ఎక్కువ!: తనూజ
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ చివరి వారం సరదాగా, భావోద్వేగంగా సాగిపోతుంది. చిన్న చిన్న టాస్కులిస్తుంటాడు బిగ్బాస్. అలాగే వారి జర్నీ వీడియోలు వేసి ఏడిపించేస్తాడు. తాజాగా బిగ్బాస్ జర్నీ అంటే మీ దృష్టిలో ఏంటో చెప్పమని హౌస్మేట్స్ను ఆదేశించాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు.ఒక్కవారంలో అంతా అయిపోయిందా?అందులో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. బయట ఎన్ని కామెడీ షోలు చేయలేదు? సింపుల్గా నవ్వించేయొచ్చు అనుకున్నాను. కానీ వచ్చిన మొదటివారమే మర్యాద మనీష్తో కామెడీ గురించి ఒక పెద్ద గొడవ జరిగింది. ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న కోట ఒక్కవారంలో కూలిపోయిందా? అని నిద్రపట్టలేదు. ఆ సమయంలో మా మమ్మీ (సంజనా) పరిచయమైంది. ఊరికనే ఏడ్చేస్తానని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అన్నాడు.ఏడ్చేసిన డిమాన్ పవన్డిమాన్ పవన్ మాట్లాడుతూ.. బిగ్బాస్కు వచ్చేముందు కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నాను. అమ్మానాన్నను సరిగా చూసుకోలేకపోతున్నాను. అన్న, నాన్నపై ఆధారపడుతున్నాను అని చాలాసార్లు ఏడ్చాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనూజ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ కన్నా తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ప్రేమను పంచారు. ఉన్నదాంట్లో సంతోషంగా గడపాలని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నాను అంది.టాప్ 5 ఎమోషనల్కల్యాణ్ మాట్లాడుతూ.. బిగ్బాస్ అంటే కావాలనిపించే కష్టం. భోజనం, నిద్ర, మనుషులు ఏదీ కరెక్ట్గా ఉండదు. అయినా ఇది మనకు కావాలనిపిస్తుంది అన్నాడు. అలా అందరూ బిగ్బాస్ జర్నీని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. -
టాప్ 5 ఛాన్స్ మిస్.. భరణి ఎలిమినేషన్కు కారణాలివే!
బిగ్బాస్ హౌస్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మొదట్లో కామనర్స్ను అసహ్యించుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు కామనర్స్ టాప్ 5లో ఉన్నారు. భరణి మెచ్యూరిటీ, ఆటను మెచ్చుకున్నారు. కానీ మధ్యలో ట్రాక్ తప్పడంతో ఆయన్ను ఆరువారాలకే ఎలిమినేట్ చేశారు. కామనర్ శ్రీజ, భరణిలో ఒకర్ని మళ్లీ తీసుకొస్తే.. జనం శ్రీజ ఓవరాక్షన్ తట్టుకోలేక భరణికి ఓటేశారు. అలా ఎనిమిదో వారం హౌస్లోకి వచ్చిన భరణి ఫైనల్స్కు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. పద్నాలుగో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అందుకు గల కారణాలేంటో చూద్దాం...నలిగిపోయిన భరణిభరణి మొదట ఎలిమినేట్ అయిందే బంధాల వల్ల! అటు తనూజ, ఇటు దివ్య మధ్య నలిగిపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడండి అని నాగార్జున వార్నింగ్ ఇచ్చినా పరిస్థితి మారలేదు. బంధాల వల్ల తనను తాను కోల్పోయినవాడిలా మిగిలిపోయాడు. ఎలిమినేషన్ తర్వాత తప్పొప్పులు తెలుసుకున్నాడు. స్ట్రాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు. బంధాలు అడ్డు కాకూడదని భావించాడు. తనూజ, దివ్యను కాస్త దూరం పెట్టాడు.ఫ్యామిలీ వీక్తో మార్పుకానీ దివ్య ఫెవికాల్లా అతడికి అతుక్కుపోయింది. ఓపక్క సపర్యలు చేస్తుంది, మరోపక్క వెళ్లిపోమని నామినేషన్ చేస్తుంది. కానీ అతడిని ఆజమాయిషీ చేయడమే ఎవరికీ నచ్చలేదు. కొన్నివారాలపాటు భరణి దాన్ని మౌనంగానే భరించినా అది అతడి చేతకానితనంగా మారిపోయింది. అతడి అభిమానులకు అది నచ్చలేదు. ఫ్యామిలీ వీక్లో ఇంటిసభ్యులందరూ కూడా.. నీపై పెత్తనం చెలాయిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావని కడిగిపారేశారు. దీంతో అప్పటినుంచి దివ్యను దూరం పెట్టాడు. కొన్నిసార్లు సంబంధం లేకపోయినా కోప్పడ్డాడు.విమర్శలుభరణి ధోరణి చూసిన వారికి అతడు సహజంగా ఉండట్లేదన్న అనుమానం మొదలైంది. మొదట్లో రేలంగి మామయ్యలా ఉన్న భరణి.. సెకండ్ ఎంట్రీలో మాత్రం ఫైర్ చూపించాడు. ఆ ఫైర్ మాటల్లో ఉంది కానీ గేమ్లో మాత్రం పెద్దగా చూపించలేకపోయాడు. అతడిని రికమండేషన్తో ఫైనల్కు తీసుకెళ్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా పలు కారణాల రీత్యా ఆయన్ను ఫినాలేకు ఒక వారం ముందు పంపించేశారు.చదవండి: కప్పు నువ్వే గెలవాలి: భరణి -
నేనంత దుర్మార్గుడిని కాదు, నువ్వే కప్పు గెలవాలి: భరణి
బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సుమన్, భరణి డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఒకే వారం వెళ్లిపోయారు. ఇప్పుడు హౌస్లో టాప్ 5 మిగిలారు. వీరిలో ఒకర్ని విజేతగా ప్రకటించే బాధ్యతను ప్రేక్షకుల చేతిలో పెట్టాడు బిగ్బాస్. ఈ మేకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విషయం కాస్త పక్కనపెడితే ఆదివారం (డిసెంబర్ 14) ఎపిసోడ్లో ఏం జరిగిందో హైలైట్స్లో చూసేద్దాం..ప్రైజ్మనీతో ఏం చేస్తారు?బిగ్బాస్ 9వ సీజన్ ప్రైజ్మనీని రూ.50 లక్షలుగా ప్రకటించారు. ఈ ప్రైజ్మనీ మీ సొంతమైతే ఏం చేస్తారని నాగ్ అడిగాడు. భరణి వృద్ధాశ్రమానికి సాయం చేస్తానన్నాడు. ఇమ్మాన్యుయేల్.. తన ఇంటి అప్పు తీర్చేయడంతో పాటు ప్రియురాలిని బాగా చదివిస్తానన్నాడు. అలాగే తన అక్క పిల్లల చదువు, బాగోగులు అన్నీ చూసుకుంటానన్నాడు. డిమాన్ పవన్.. తండ్రికి క్యాన్సర్ ఉందని, ఆ ట్రీట్మెంట్ కోసం డబ్బు వాడతానన్నాడు. అలాగే అమ్మానాన్న కోసం ఓ ఇల్లు కడతానన్నాడు.విరాళంగా ఇస్తా..ప్రైజ్మనీని హౌస్మేట్స్లో ఒకరికి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావ్? అని అడగ్గా.. కల్యాణ్కు రూ.25 లక్షలు ఇస్తానన్నాడు. ఇద్దరం కామనర్స్ కాబట్టి తనతో పంచుకుంటానన్నాడు. తర్వాత సంజనా.. మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) సంఘానికి కొంత విరాళం ఇస్తాను. కాళ్లు లేని పిల్లల కోసం కృత్రిమ కాళ్లు కొనిస్తాను, నా పిల్లల కోసం రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అంది. తనూజ పేద పిల్లల చదువుకు సాయం చేస్తానంది.బంగారం కొనిస్తాకల్యాణ్.. అనాథాశ్రమంలో ఒకరిద్దరిని దత్తత తీసుకుని వాళ్ల బాగోగులు చూసుకుంటాను. మా అమ్మకు వీలైనంత ఎక్కువ బంగారం కొనిస్తాను అని చెప్పాడు. తర్వాత తనూజను సెకండ్ ఫైనలిస్ట్గా, పవన్ను మూడో ఫైనలిస్ట్గా, ఇమ్మాన్యుయేల్ను నాలుగో ఫైనలిస్ట్గా ప్రకటించారు. చివరగా భరణి, సంజన మిగిలారు. వీరిలో భరణి ఎలిమినేట్.. సంజనా ఐదో ఫైనలిస్ట్ అని ప్రకటించగానే ఇమ్మూ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. నాన్న దగ్గర ఆశీర్వాదంభరణి వెళ్లిపోయేముందు తనూజ అతడి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. గతంలో ఒకసారి ఎలిమినేట్ అయి మళ్లీ హౌస్లోకి వచ్చిన భరణి.. ఈసారి బాగానే ఆడాడు. కానీ, ఫైనల్స్లో అడుగుపెట్టేందుకు అది సరిపోలేదు. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు. స్టేజీపైకి వచ్చిన భరణి.. టాప్ 5లో ఉన్న ఐదుగురు ఫైటర్స్ అని ప్రశంసించాడు. కళ్యాణ్కు సైనికా, వందనం అంటూ సెల్యూట్ చేశాడు. కప్పు గెలవాలిసుమన్, కల్యాణ్ను ఏ రోజూ నామినేట్ చేయలేదు. కప్పు గెలిచే అర్హత నీకుంది అని బూస్ట్ ఇచ్చాడు. తనూజ.. నిన్ను కొన్నిసార్లు బాధపెట్టి ఉండవచ్చు. కానీ, నీకివ్వాల్సిన ప్రాధాన్యత నీకిచ్చాను. నాన్నా అని దగ్గరకు వస్తే దూరం తోసేంత దుర్మార్గుడిని కాదు. నువ్వు, దివ్య, సుమన్.. నాకు బెస్ట్ బెడ్డీస్ అన్నాడు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పిన భరణి.. తనూజ మాత్రం కప్పు గెలవాలని కోరాడు. -
ఇది సుమన్కు మాత్రమే సాధ్యం.. మళ్లీ జరగదు, జరగబోదు!
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. ఈ ట్యాగ్లైన్తోనే సీజన్ మొదలైంది. ఈ ట్యాగ్తోనే సీజన్ ముగింపు కాబోతోంది. కామనర్ కల్యాణ్, సెలబ్రిటీ తనూజలలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ కాబోతున్నారు. సీజన్ ముగింపుకు చేరుకోవడంతో హౌస్లో డబుల్ ఎలిమినేషన్ ప్రకటించారు. అందులో భాగంగా సుమన్ను ఎలిమినేట్ చేశారు.. నేటి ఎపిసోడ్లో భరణిని పంపించేయనున్నారు.ఒక్క కారణం..సుమన్ ఇన్ని వారాలు కొనసాగడమనేది కొంత ఆశ్చర్యకరమనే చెప్పవచ్చు. ఎందుకంటే అతడు బలంగా గేమ్ ఆడింది లేదు, కన్నీళ్లు పెట్టుకుని డ్రామాలు చేస్తూ సింపతీకి ప్రయత్నించిందీ లేదు, కంటెంట్ కోసం ఓవరాక్టింగ్ చేసిందీ లేదు. అయినా 14 వారాలు హౌస్లో ఉన్నాడు. అందుకు గల ఏకైక కారణం అమాయకత్వం.నవ్విస్తాడనుకుంటే..సినిమాల్లో కమెడియన్గా నవ్వించిన సుమన్ శెట్టి బిగ్బాస్ హౌస్లో కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా సైలెంట్గా ఉండిపోయాడు. సాధారణంగా అలా ముఖం పక్కకు తప్పుకుని కూర్చుంటే జనాలు వాళ్లను వీలైనంత త్వరగా హౌస్ నుంచి పంపించేస్తారు. కానీ, సుమన్ను ఎన్నో ఏళ్లుగా అభిమానించినవాళ్లకు అతడిని పంపించేసేందుకు మనసొప్పలేదు. అతడి ముఖంలో, ఆటలో, ప్రవర్తనలో అమాయకత్వాన్ని చూశారు.ఒక్క స్టెప్పేస్తే చాలువీలైనంత వరకు ఎవర్నీ నొప్పించకుండా మాట్లాడేవాడు. మాట్లాడింది తక్కువసార్లే అయినా.. అందులోనూ నీతి, నిజాయితీ వైపు నిలబడ్డ తీరుకు ఫిదా అయ్యారు. ఆయన ఒక్క స్టెప్పేస్తే చాలు.. జనం హాయిగా నవ్వుకునేవారు. తన బలం తనకు తెలియదన్నట్లు టికెట్ టు ఫినాలే రేసులో సుమన్ బాగా ఆడాడు. కానీ, అది సరిపోదు.. అంతా వదిలేసి చివర్లో కసితో ఆడితే ఏం లాభం.. అందుకే ఎలిమినేట్ అయ్యాడు.అందుకే 14 వారాలుకేవలం అమాయకత్వంతో 14 వారాలు హౌస్లో ఉండటం సుమన్ శెట్టి (Suman Shetty) కి మాత్రమే సాధ్యమైంది. ఆయన స్థానంలో ఎవరున్నా బిగ్బాస్ షోకి మీరు సెట్టవరు అని ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా పంపించేసేవారు. సుమన్ను మాత్రం ఆరాధించారు, అభిమానించారు. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు, జరగబోదు కూడా అన్నది సోషల్ మీడియాలో నెటిజన్ల వాదన! -
మనసులు గెలిచిన తనూజ.. విన్నర్ అవడం ఖాయం!
ప్రతి సీజన్లో ఒకే ఒక్క టికెట్ టు ఫినాలే ఉంటుంది. కానీ తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో మాత్రం రెండో టికెట్ టు ఫినాలే ప్రవేశపెట్టడం.. దానికోసమే ఈ వారమంతా టాస్కులు ఆడించడం జరిగింది. తీరా ఫైనలిస్ట్ అయ్యే అవకాశం చేతిదాకా వస్తే తనకు అక్కర్లేదని తిరస్కరించింది తనూజ. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్ 12వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..బుర్ర ఉపయోగించిన భరణిలీడర్ బోర్డులో చివర్లో ఉన్న భరణి.. తన సగం పాయింట్స్ ఒకరికి ఇచ్చేయాలన్నాడు బిగ్బాస్. సంజనాకు పాయింట్స్ ఇచ్చేస్తే తనకు ఫినాలేకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయని భావించి బుర్ర ఉపయోగించిన భరణి.. తనూజకు ఇచ్చాడు. కానీ, ఆ పాయింట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు నా కూతురివి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇమ్మూ గెలుపుతర్వాత మిగిలిన ముగ్గురు సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్.. కీ టూ సక్సెస్ అనే గేమ్ ఆడారు. ఇందులో ముగ్గురూ కష్టపడ్డారు. సంజనా మాటలు జారడంతో ఇమ్మూ ఎమోషనలయ్యాడు. ఈ గేమ్లో ఇమ్మూ గెలవగా, సంజనా రెండో స్థానంలో, తనూజ మూడో స్థానంలో నిలిచింది. తర్వాత గేమ్లో అందరూ కలిసి సంజనాను ఆడకుండా సైడ్ చేశారు. చివరి గేమ్లో తనూజ విజయంఅలా ఇమ్మూ, తనూజకు బాల్ గేమ్ ఇచ్చారు. ఈ గేమ్లో ఇమ్మూ కాలు బెణకడంతో మెడికల్ రూమ్కు వెళ్లొచ్చాడు. నొప్పితో ఆడి మరీ ఇమ్మూ ఈ గేమ్ గెలిచాడు. అనంతరం తనూజ, సంజనా, ఇమ్మూకి చిట్టచివరి టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచినవారికి ఏకంగా 300 పాయింట్లు వస్తాయని బంపర్ ఆఫర్ ప్రకటించాడు బిగ్బాస్. ఈ గేమ్లో తనూజకు దెబ్బ తగిలిగినప్పటికీ పట్టించుకోకుండా ఆడి గెలిచింది. తనూజతో డీల్చివరి గేమ్లో ఎక్కువ పాయింట్స్ రావడంతో తనూజ ఏకంగా విజేతగా నిలిచింది. అన్ని గేమ్స్ గెలుచుకుంటూ వచ్చి చివర్లో ఓడిపోయానని ఇమ్మూ కంటతడి పెట్టుకున్నాడు. ఫైనల్గా లీడర్బోర్డులో 750 పాయింట్స్తో తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉండగా.. ఇమ్మూ 520, సంజనా 320 పాయింట్లతో తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. అనంతరం తనూజను బిగ్బాస్ కన్ఫెషన్ రూమ్కు పిలిచాడు.టికెట్ టు ఫినాలే అక్కర్లేదన్న తనూజమీ దగ్గరున్న రూ.3 లక్షలతో ఇమ్యూనిటీ కొనుగోలు చేసి సెకండ్ ఫైనలిస్ట్ అవొచ్చన్నాడు. ఆ డబ్బంతా విన్నర్ ప్రైజ్మనీ నుంచి కట్ చేస్తానన్నాడు. ఈ ఆఫర్ను తనూజ రిజెక్ట్ చేసింది. ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. అలా ఈ ఆఫర్ను రిజెక్ట్ చేసి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇది తనూజ విన్నింగ్ ఛాన్స్ను మరింత రెట్టింపు చేసే ఎపిసోడ్ అనే చెప్పవచ్చు. -
గేమ్లో సడన్గా కిందపడ్డ ఇమ్మూ.. మెడికల్ రూమ్కు!
టాస్కులు గెలవాలంటే కండబలం ఉండాలంటారు. కానీ, అదేం అవసరం లేదని, ఆత్మవిశ్వాసం ఉంటే చాలని నిరూపించాడు ఇమ్మాన్యుయేల్. తనకు ఇచ్చిన ప్రతి టాస్కులోనూ అద్భుతంగా ఆడాడు. అందరినీ వెనక్కు నెడుతూ మెజారిటీ గేమ్స్ అతడే గెలిచాడు. అందుకే ఇప్పుడు సెకండ్ టికెట్ టు ఫినాలే రేసులోనూ ధృడంగా నిలబడ్డాడు.నేనూ మనిషినే..కానీ శారీకరంగా, మానసికంగా ఇమ్మూ అలసిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సంజనాతో గొడవపడ్డాడు. గేమ్లో మీరు ఫస్ట్ వచ్చి నాది లాగారు... ఎందుకు నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారు అని ఆవేదన చెందాడు. అటు గేమ్లో ఓడిపోయినందుకో ఏమో కానీ సంజనా బాధ తట్టుకోలేక ఏడ్చేసింది. నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. వారం రోజుల నుంచి నన్ను ఏం పోట్రేట్ చేయాలని చూస్తోంది. వారం నుంచి నా వైపు ఒక్కసారైనా చూసిందా? అని ఎమోషనలయ్యాడు.నొప్పితో విలవిలతర్వాత లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సంజనాను అందరూ ఏకాభిప్రాయంతో తొలగించినట్లు కనిపిస్తోంది. అలా ఫైనల్గా ఇమ్మూ, తనూజ బాల్స్ గేమ్ ఆడారు. అయితే ఈ ఆటలో ఇమ్మూ కాలు బెణికి కిందపడిపోయాడు. నొప్పి తట్టుకోలేక గేమ్ కాసేపు ఆపమని కోరాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని మెడికల్ రూమ్కు తీసుకెళ్లారు. ఇక ఈ గేమ్లోనే తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయింది. కాకపోతే తను ప్రేక్షకు ఓట్లతోనే కొనసాగాలనుకుంటున్నానంటూ ఇమ్యూనిటీని తిరస్కరించింది. -
సెకండ్ ఫైనలిస్ట్గా తనూజ.. కానీ ఓ ట్విస్ట్!
బిగ్బాస్ హౌస్లో సెకండ్ ఫైనలిస్ట్ కోసం పోటీలు నడుస్తున్నాయి. ఇప్పటికే కల్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. సెకండ్ ఫైనలిస్ట్ పోటీలో భరణి, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజనా మిగిలారు. తాజా ప్రోమోలో తక్కువ పాయింట్లతో చివర్లో ఉన్న భరణి ఆటలో నుంచి అవుట్ అయిపోయాడు.భరణి కంటతడిదీంతో కన్నీళ్లు పెట్టుకున్న భరణి.. తన దగ్గరున్న పాయింట్స్ సగం తనూజకు ఇచ్చేశాడు. చివరకు ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరికి పెట్టిన పలు గేమ్స్లో చివరకు తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే తనూజ తాను డైరెక్ట్గా ఫైనల్స్లో అడుగుపెట్టేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.తనూజ గొప్ప నిర్ణయంప్రేక్షకుల ఓట్ల ప్రకారమే తాను ముందుకు సాగుతానంది. ఈ వారం జనాలు తనను సేవ్ చేస్తేనే ఫైనల్స్కు వెళ్తానని, ఇమ్యూనిటీ వద్దని తిరస్కరించిందని సమాచారం. ఇదే నిజమైతే తనూజకు నేటి ఎపిసోడ్ మరింత ప్లస్ అవడం ఖాయం. కాకపోతే ఈ సెకండ్ ఫైనలిస్ట్ అనే అవకాశం భరణి, సంజనాలలో ఒకరికి వచ్చుంటే వారికి ఎంతో ఉపయోగపడేది. చదవండి: నీ ఏడుపు ఫేక్.. ప్రేక్షకుల కామెంట్స్తో తనూజ షాక్ -
మీ ఏడుపు ఫేక్.. ప్రేక్షకుల కామెంట్స్తో తనూజ షాక్!
లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సుమన్ ఆటలో అవుట్ అయ్యాడు. అతడి దగ్గరున్న రూ.1 లక్షలో సగం, తన స్కోర్లో సగం ఎవరికైనా పంచొచ్చని బిగ్బాస్ చెప్పాడు. ఆయనకు వెంటనే భరణి పేరు తట్టింది.. కానీ, భరణి మాత్రం సంజనాకు ఇవ్వమని సలహా ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు. ఇంకా హౌస్లో ఏమేం జరిగాయో గురువారం (డిసెంబర్ 11వ) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..భరణిని సైడ్ చేశారుఅలా సుమన్ ఇచ్చిన పాయింట్ల దెబ్బకు సంజనా లీడర్ బోర్డులో మూడో స్థానంలోకి వచ్చింది. ఇక తర్వాత గేమ్లో మెజారిటీ ఇంటిసభ్యులు కలిసి భరణిని పక్కనపెట్టి గేమ్ ఆడారు. అలా జోకర్ గేమ్లో ఇమ్మూ, సంజనా గెలవగా మిగతావాళ్లు ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేకపోయారు. లీడర్ బోర్డులో చివర్లో ఉన్న పవన్.. తన దగ్గరున్న రూ.1,50,000 అలాగే 150 పాయింట్లలో సగం ఒకరికి ఇచ్చి ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు బిగ్బాస్. మళ్లీ భరణి టార్గెట్అతడు తన పాయింట్స్ అన్నీ తనూజకు ఇవ్వడంతో ఆమె లీడర్ బోర్డులో టాప్లో నిలిచింది. ఇక నెక్స్ట్ గేమ్లో ఒకర్ని తీసేయాలని బిగ్బాస్ చెప్పగానే మెజారిటీ ఇంటిసభ్యులు మళ్లీ భరణిని తీసేశారు. మిగిలిన సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్ బ్యాలెన్స్ గేమ్ ఆడారు. ఈ ఆటలో ఇమ్మూ గెలవగా తనూజ, సంజనా తర్వాతి స్థానాల్లో వచ్చారు.ఓట్ అప్పీల్అయితే లీడర్ బోర్డులో మాత్రం తనూజ ఫస్ట్ ర్యాంక్లో ఉండగా.. ఇమ్మూ సెకండ్, సంజనా మూడో స్థానంలో ఉన్నారు. దీంతో బిగ్బాస్ ఓట్ అప్పీల్ కోసం తనూజతో పాటు ఇంకెవరు ముందుకు రావాలనే నిర్ణయాన్ని తనూజ చేతిలో పెట్టాడు. అలా తనూజ.. సంజనాను ఎంచుకుంది. వీరిద్దరూ గార్డెన్ ఏరియాలో ప్రేక్షకులను కలుసుకున్నారు. ప్రేక్షకులు తనూజకే ఓటేయడంతో ఆమె ఓట్ అప్పీల్ చేసుకుంది. తెలిసో తెలియక తప్పు చేసుంటే క్షమించమని కోరింది. మీ ఏడుపు ఫేక్తర్వాత జనాలడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మీ ఏడుపు నిజమనిపించదు, ఫేక్ అని ఓ వ్యక్తి అనగా.. నేను కావాలని ఎమోషనల్ అవను, అది దానంతటదే వస్తుంది, ఇక్కడ ఏదీ ఫేక్గా ఉండదు అని చెప్పింది. భరణి నాన్న.. వైల్డ్కార్డ్స్ వచ్చాక భరణి సర్ ఎందుకయ్యారు? అన్న ప్రశ్నకు తనూజ.. మా మధ్య అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది. సింపతీకాకపోతే మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని వచ్చినప్పుడు ఆ నాన్న అనే పిలుపు చూసేవారికి సింపతీగా కనిపిస్తోంది. ఆయనకు ఎటువంటి ఇబ్బంది రావొద్దనే నాన్న అనే పిలుపును పక్కనపెట్టాను అని క్లారిటీ ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్ను ముఖం మీదే ఫ్రెండ్ కాదని ఎలా అంటావని నిలదీశాడో వ్యక్తి. దానికి తనూజ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. వాడికి సపోర్ట్ చేయలేదా? అని రివర్స్లో అంటే.. మీరెక్కడ చేశారు మేడమ్? మీరే అందరి సపోర్ట్ తీసుకుంటారు అని దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ఆ మాటకు తనూజ ముఖం వాడిపోయింది. -
బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ.. లుక్ అదిరింది!
బిగ్ బాస్ గేమ్ షోతో బాగా పాపులర్ అయింది దివి. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. బిగ్బాస్ సీజన్ 4 తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. బిగ్బాస్ షో పుణ్యమా అని చిరంజీవి కంటపడింది. గాడ్ ఫాదర్లో ఓ చిన్న రోల్ చేసి మెప్పించింది. ఆ తర్వా త ‘పుష్ప 2’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ఇక ‘లంబసింగి’తో హీరోయిన్గా మారిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు కానీ.. దివి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దివి. ఆమె ప్రధాన పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.‘కర్మస్థలం’ అంటూ వదిలిన పోస్టర్లో దివి కదనరంగంలో దూసుకుపోతోన్నట్టుగా కనిపించడం, చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్లో యుద్ధం చేస్తున్న సైనికులు ఇలా ప్రతీ ఒక్క డీటైల్ను పోస్టర్లో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్లు చెబుతున్నారు.తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. -
'బిగ్బాస్'ను తాకిన కులం, ప్రాంతపు రంగు
బిగ్బాస్ గేమ్ అంటేనే అందులోని కంటెస్టెంట్స్కు చాలా స్ట్రాటజీలు ఉంటాయి. కొందరైతే ముందుగానే బిగ్బాస్ టీమ్తో డీల్ సెట్ చేసుకుంటారు. తను ఎన్నివారాలు ఉండాలో దానికి తగినట్టు స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారు. కానీ, కొందరు మాత్రం తమ పీఆర్ టీమ్స్తో ప్రేక్షకులను ముందుగా రెచ్చగొడతారు. ఆపై కులం, మతం, ప్రాంతం పేరుతో తమ కంటెస్టెంట్స్ కోసం నెట్టింట ట్రోలింగ్కు దిగుతారు. తెలుగు బిగ్బాస్ తొమ్మిదవ సీజన్లో కూడా అదే జరగుతోంది. టాప్ 2పై ట్రోలింగ్కన్నడ అమ్మాయి అంటూ తనూజపై తీవ్రమైన ట్రోలింగ్ కొనసాగుతుంది. మరోవైపు కల్యాణ్ మా కులపోడు అంటూ కొందరు భుజాన ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడి పీఆర్ టీమ్ దానిని వైరల్ చేస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్పై కూడా ట్రోలింగ్ జరుగుతుంది. దీంతో కుల, ప్రాంతీయ జాడ్యం బిగ్బాస్ను కూడా తాకింది. కల్యాణ్ మా కులపోడు అంటూ ఇప్పటికే తన సామాజిక వర్గం పెద్దలు రంగంలోకి దిగారు. వేరేవాాళ్లను తొక్కితేనే..అతనిపై కామన్ మ్యాన్, ఆర్మీ మ్యాన్, తెలుగు వాడు అంటూ పీఆర్ టీమ్స్ వైరల్ చేస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్బాస్లో ఒక కంటెస్టెంట్ను పైకి లేపాలంటే వేరే కంటెస్టెంట్లపై దుష్ప్రచారాలు చేయాలి. ఇప్పుడు ఈ సీజన్లో కూడా అదే ఫార్ములా పాటిస్తున్నారు.కమ్యూనిటీ పేరెత్తితే ఏమైంది?బిగ్బాస్ టైటిల్ రేసులో కల్యాణ్, తనూజ ఉన్నారు. ఆమె కన్నడ అమ్మాయి కావడంతో తన భాష, ప్రాంతం గురించి చర్చ మొదలైంది. ఇది కేవలం ఒక గేమ్ అనే సోయి కూడా చాలామందికి లేదు. ఇక్కడ ప్రాంత, కుల, భాషాభేదాలు అవసరం లేదు. ఆటను ఆటగా చూడాలనే ఆలోచన ఎవరికీ లేదు. గతంలో మెహబూబ్ కూడా కమ్యూనిటీ వోటింగు చర్చకు తెరలేపాడు. లాస్ట్కు తనే ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు.ఐపీఎల్లో ఇలాంటివేం లేదేఇక్కడ కన్నడ, తెలుగు అనే ప్రాంతీయతతో పనేంటి..? ఐపీఎల్ మాదిరి బిగ్బాస్ కూడా ఒక గేమ్లా అనుకోవడమే బెటర్. ఐపీఎల్లో నగరాల పేర్లతో టీమ్స్ ఉన్నాయి. అనేక దేశాల నుంచి క్రికెటర్లు ఆయా జట్టులో ఉన్నారు. అక్కడ మనం ప్రాంతం, దేశం, కులం, భాష అనే తేడా లేకుండా చూస్తున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఇలాంటి అభిప్రాయం రాదేమో..గత సీజన్ల నుంచి ఇదే ట్రోలింగ్ఇక్కడ చెప్పుకోవాల్సింది మరొక పాయింట్ ఉంది. కన్నడ, కన్నడ అంటూ తనూజ గేమ్ను టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా యష్మి, శోభా శెట్టి, ప్రేరణ, నిఖిల్, పృథ్వి వంటి వారు కూడా ఇదే ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. వీళ్లందరూ కూడా చక్కగా తెలుగు మట్లాడుతారు. వాళ్లు అవకాశాలు అందిపుచ్చుకుని నటించేది, ఆధారపడి జీవిస్తుంది తెలుగు గడ్డపైనే.. వారికి ఆధారం కూడా తెలుగు సీరియళ్లే.. వాళ్లందరూ ఇదే విషయం పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. గేమ్ పక్కట్టి..కానీ, సోషల్మీడియాలో ఆవేశం, దూకుడు, పిచ్చి కూతలతో పీఆర్ టీమ్స్ వారిని ట్రోలింగ్ చేస్తున్నాయి. గత సీజన్లో శోభాశెట్టి, ప్రియాంక, అమర్దీప్లను స్టార్మా బ్యాచ్ అని ముద్రవేసి శివాజీ టార్గెట్ చేశారు. బయట తన పీఆర్ టీమ్ ఆటతో పనిలేకుండా ఆ గ్రూప్పై ఇలాంటి ఎదురుదాడితోనే విరుచుకుపడింది. పీఆర్ టీమ్లకు గేమ్తో పనిలేదు. ఇదేం బాగోలేదుకేవలం ఆడవాళ్లను అవమానించేందుకే ఉన్నామనేలా సెకనుకొక కామెంట్తో రెచ్చిపోతున్నారు. తమ కంటెస్టెంట్లో పాజిటివ్ను వెతుక్కుని హైలైట్ చేసుకోవడానికి బదులు అవతలివారిని నెగెటివ్ చేయడంపైనే స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. కానీ, ఇలా కుల, ప్రాంతీయ బేధాలు తీసుకురావడం ఏమాత్రం సబబు కాదని బిగ్బాస్ ఆడియన్స్ ఫీలవుతున్నారు. View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) Mana Telaga Caste vadu kabatti Kalyan ki votes veyyandi ani beg chesukuntunnaru Caste Card use chesi ...🤮🤮Matladuthundhi Telaga Community President anta 👇👇#BiggBossTelugu9 #KalyanPadala pic.twitter.com/RIwmqK9pga— Arachakame (@Arachakame) December 7, 2025


