-
40 ఏళ్లు మాత్రమే బతుకుతాను.. డాక్టర్స్ మాటలతో డిప్రెషన్: గీతూ రాయల్
బిగ్బాస్ షో ద్వారా గీతూ రాయల్ చాలా పాపులర్ అయింది. సీజన్ 6లో ఆడుగుపెట్టిన గీతూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. వాస్తవంగా ఆమె టిక్టాక్ వీడియోలతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్లో పలు కొటేషన్లు చెబుతూ యూత్ను ఆకట్టుకుంది. ఆపై బిగ్ బాస్ సీజన్లకు రివ్యూలు చెప్పే స్థాయి నుంచి ఏడో సీజన్లో బిగ్బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించే రేంజ్కు చేరుకుని భారీగా ఫ్యాన్స్ను సంపాధించుకుంది.తాజాగా గీతూ ఒక వీడియోను షేర్ చేసింది.. సుమారుగా 5 నెలల నుంచి తను ఓ సమస్యతో బాధపడుతున్నట్లు అందుకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తను పడుతున్న అనారోగ్యానికి కారణాలు చెప్పింది. నేను గత ఐదు నెలలుగా బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నాను. 'దీనికి కారణం నేను బ్యాంకాక్ వెళ్లిన సమయంలో అనేక రకాల బొద్దింకలు, పురుగులు వంటి ఆహారపదార్థాలు తిన్నాను. అందువల్లే నేనే అనారోగ్యానికి గురైయాను అనుకుంటున్నాను. ఈ క్రమంలో మరో సందేహం కూడా ఉంది. ఒకసారి విజయవాడకు వెళ్లాను.. అక్కడ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేశాను. ఇదీ కూడా కారణం కావచ్చని అనుకుంటున్నాను. ఈ రెండు సంఘటనల తర్వాతే నేను అనారోగ్యానికి గురికావడం జరిగింది. గత ఐదు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. దీంతో చాలా డిప్రెషన్కు గురి కావడం జరిగింది.మొదటగా నాకు ఒక గాయం అయింది. మందులు వాడుతున్నా కూడా అది తగ్గలేదు. ఫైనల్గా ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్తే ఒక పరీక్ష ద్వారా అసలు విషయం తెలిసింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు చెప్పారు. దీనికి రెండేళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రతివారం ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. డాక్టర్లు చెప్పిన మాటలతో బాగా డిప్రెషన్కు వెళ్లిపోయాను. ప్రస్తుతం అయితే కొంతమేరకు బాగానే ఉన్నాను.' అంటూ గీతూ చెప్పింది.అలాంటి పొరపాటు చేస్తే.. 40 ఏళ్లు మాత్రమే బతుకుతానుఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన వారు సరైన ఫుడ్,నిద్ర తప్పక పాటించాలని వైద్యులు సూచించినట్లు గీతూ రాయల్ చెప్పింది. పూర్తిగా డాక్టర్స్ చెప్పిన ప్రకారం లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉందని ఆమె తెలిపింది.. వైద్యుల సూచనలు పాటించకుంటే మరింత అనారోగ్యానికి గురికావడం జరుగుతుందట. ఈ క్రమంలో 40 ఏళ్లకు మించి బతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినట్లు గీతూ పేర్కొంది. ఫైనల్గా తన అనారోగ్య పరిస్థితికి గల కారణాల గురించి ఒక వీడియో ద్వారా పూర్తి వివరాలు పంచుకుంది. -
కమిట్మెంట్ ఇచ్చినా ఛాన్స్లు రావడం లేదు: హిమజ
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బిగ్బాస్ బ్యూటీ హిమజ సినిమా ఛాన్సుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుమారు పదేళ్ల క్రితం సీరియల్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హిమజ 2013లో రామ్ నటించిన శివమ్ సినిమాలో ఛాన్సు దక్కించుకుంది. ఆ తర్వాత నేను శైలజ, శతమానంభవతి, వరుడు కావలెనుతో పాటు తెలుగులో పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది హిమజ. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కొంచెం ఇష్టం కొంచెం కష్టం తో పాటు మరికొన్ని సీరియల్స్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. బిగ్ బాస్ 3 సీజన్లో కంటెస్టెంట్గా మెప్పించిన హిమజ తెలుగు పరిశ్రమలో మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు వస్తున్నప్పటికీ సెలెక్టెడ్ ప్రాజెక్ట్లు చేస్తూ కొనసాగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజకు ఓ ప్రశ్న ఎదురైంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి.. దానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురైంది. అందుకు హిమజ ఇలా చెప్పుకొచ్చారు. 'తెలుగు అమ్మాయిలు ఒకప్పుడు రిజర్వ్డ్గా ఉండేవారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సులు వస్తాయి అనుకోవడం తప్పు.. విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ కూడా ఆఫర్స్ రావడం లేదు. అలా అని అవకాశాలు అందుకున్న వారందరూ కమిట్మెంట్ ఇచ్చినవాళ్లు కాదు. ముంబై నుంచి వచ్చిన వాళ్లకు మాత్రం ఇక్కడ ఆఫర్స్ ఇస్తారు.. వారిలో ఏం నచ్చిందో తెలియదు. ఒక్కోసారి తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్ అయితేనే చేస్తాను అనే వారు కూడా ఉన్నారు. అది చాలా తప్పు. ఫస్ట్ అవకాశం వస్తే తీసుకొని సద్వినియోగం చేసుకుంటే ఏదోరోజు మంచి భవిష్యత్ ఉంటుంది. నా వరకు అయితే హీరోయిన్ మాత్రమే కావాలని రాలేదు. నాకు ఏ అవకాశం వచ్చినా చేస్తాను. నాకు మొదట పనిమనిషి పాత్ర వచ్చింది చేశాను. ఆ తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం నేను హ్యాపీగానే ఉన్నాను. తెలుగు అమ్మాయి అయిన హిమజ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆమెను చూసిన వారు ఎవరైనా సరే హీరోయిన్ మెటీరియల్ అనాల్సిందే. కానీ ఆమెకు ఛాన్సులు అయితే దక్కాయి కానీ హీరోయిన్ను చేయలేకపోయాయి. ఈ క్రమంలో నేను శైలజ, జనతా గ్యారేజ్, వరుడు కావలెను, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్తో మెప్పించింది. -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి 'బిగ్ బాస్' బ్యూటీ సినిమా.. అధికారిక ప్రకటన
బిగ్బాస్ ఫేం దివి హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘లంబసింగి’.‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మించాడు. ఈ మూవీ ద్వారా భరత్ రాజ్ హీరోగా పరిచయం అయ్యాడు. మార్చి 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంతమేరకు మెప్పించింది. ఇప్పుడు ఓటీటీలోకి విడుదల కానుంది. ఈమేరకు హాట్స్టార్ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. పోలీసు-నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే ‘లంబసింగి’. హరిత అనే పాత్రలో హీరోయిన్ దివి ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. తెరపై కొత్త దివిని చూస్తారు. అంతలా మెప్పించిన లంబసింగి చిత్రం ఏప్రిల్ 2 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సినిమా విడుదలైన రెండు వారాలకే ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ ద్వారా దివికి మంచి గుర్తింపు వచ్చింది.నాలుగో సీజన్లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే చిరంజీవి ఆచార్య చిత్రంలో నటించిన దివి పలు వెబ్ సిరీస్లలో కూడా నటించిన విషయం తెలిసిందే. -
'బిగ్ బాస్' నటికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. జైలుకు తరలింపు
కన్నడ నటి, బిగ్ బాస్ బ్యూటీ సోను శ్రీనివాస్ గౌడకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో ఆమె నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. సోనూ గౌడకు ఏప్రిల్ 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సీజేఎం కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 8 ఏళ్ల బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో సోనూ గౌడను బాదరహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. నటి ఏం చెప్పింది..? జువైనల్ జస్టిస్ యాక్ట్, హిందూ దత్తత చట్టాన్ని ఉల్లంఘించినందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు మీడియాతో స్పందించిన సోను శ్రీనివాస్ గౌడ.. ఈ కేసులో చట్టపరమైన విచారణ జరుగుతోందని తెలిపింది. నేను ఒక అమ్మాయిని తీసుకువచ్చాను ఎందుకంటే ఆమెకు ప్రస్తుతం రక్షణ అవసరం, ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందుకే నేను తెచ్చుకున్నాను. నేనే ఆమెను సురక్షితంగానే చూసుకున్నాను. ఏం జరిగింది..? గత మార్చి 2న సోను గౌడ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో, ఆమె ఒక బాలికను తీసుకుని వచ్చింది. అది కూడా తన తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగింది. రాయచూర్కు చెందిన బాలికను దత్తత తీసుకుంటున్నట్లు అందులో సోనూ పేర్కొంది. కానీ హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తికి, దత్తత తీసుకునే బిడ్డకు మధ్య కనీసం 25 ఏళ్ల గ్యాప్ ఉండాలి. ఆపై దత్తత తీసుకున్న వ్యక్తి తన అర్హత గురించి కేంద్ర, రాష్ట్ర అడాప్షన్ అథారిటీకి తెలియజేసిన అనంతరం వారి సమక్షంలోనే దత్తతను అంగీకరించాలి. అలాగే, సోనూ గౌడ ఆ బాలిక తల్లిదండ్రులకు వివిధ సౌకర్యాలను కల్పించినట్లు పేర్కొంది. దీంతో ఇది అమ్మకాల ప్రక్రియగా కనిపిస్తుంది. అంతేకాకుండా పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు. ప్రస్తుతం ఆమెది స్కూల్కు వెళ్లి చదువుకోవాల్సిన వయసు.. కానీ ఆ బాలిక విషయంలో ఇది జరగలేదు. పలువురు ఫిర్యాదు చేయడంతో సోనూ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చిన్నారిని తమ కస్టడీలోకి తీసుకుని ప్రభుత్వ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. -
విరూపాక్ష సినిమా నేను చేయాల్సింది: అర్జున్
సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్లు చాలానే ఉన్నారు. అయితే కొందరే క్లిక్ అవుతారు. సీరియల్స్కు, సినిమాకు మధ్యలో బిగ్బాస్ ప్లాట్ఫామ్ను వాడుకున్నవాళ్లూ ఉన్నారు. ఇక్కడ క్రేజ్ తెచ్చుకున్నాక పలువురూ సినిమాల్లో బిజీ అవుతుంటే మరికొందరు మాత్రం ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నెగెటివిటీ అయితే బిగ్బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి మరో రకం. ఇతడు నేరుగా సినిమాల్లోనే అడుగుపెట్టాడు. కానీ ఎంత కష్టపడ్డా గుర్తింపే దొరకలేదు. దీంతో బుల్లితెరను ఆశ్రయించాడు. సీరియల్స్ ద్వారా క్లిక్ అయ్యాడు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్ను మరింత క్యాష్ చేసుకునేందుకు బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టాడు. కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వడం అతడు చేసిన పెద్ద పొరపాటు! ఈ షో వల్ల అతడు నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన తెప్ప సముద్రం త్వరలో రిలీజ్ కానుంది. రెండేళ్లు తిరిగాం ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన అర్జున్ అంబటి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'డైరెక్టర్ కార్తీక్ నా స్నేహితుడు. అతడు ఎప్పుడూ సినిమా ప్రపంచంలోనే ఉంటాడు. అతడితో నేను లూప్ అని ఓ వెబ్ ఫిలిం చేశాను. తర్వాత మేమిద్దరం ఓ సినిమా చేద్దామనుకున్నాం. నిర్మాతల కోసం రెండేళ్లు తిరిగాం. కానీ సెట్టవ్వలేదు. అప్పుడు ఓటీటీ లాంటి ప్లాట్ఫామ్స్ కూడా లేవు. ఆ ప్రాజెక్ట్కు శాసనం అని టైటిల్ పెట్టుకున్నాం. తర్వాత అదే విరూపాక్షగా రిలీజైంది. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. నాతో చేసుంటే అంత పెద్ద సక్సెస్ వచ్చి ఉండేది కాదేమో!' అని చెప్పుకొచ్చాడు. చదవండి: 'ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు.. -
8 ఏళ్ల బాలికతో వీడియోలు.. బిగ్ బాస్ బ్యూటీ అరెస్ట్
కన్నడ బిగ్బాస్ సీజన్ -1 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనూ శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో ఆమె అరెస్ట్ కావడం జరిగింది. సదరు బాలికను దత్తత తీసుకున్న సమయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించలేదని బైదరహళ్లిలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ పరిధిలోని అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. సమాజంలో సానుభూతి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసమే ఆ చిన్నారిని సోనూ శ్రీనివాస్ గౌడ దత్తత తీసుకున్నట్లు పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. వెస్ట్ డివిజన్ డిసిపి ఎస్ గిరీష్ వివరిస్తూ.. 'ప్రభుత్వ నింబంధనలు పాటించకుండా ఒక బాలికను సోనూ దత్తత తీసుకున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఒక అధికారి ఫిర్యాదు చేశారు. రాయచూర్కి చెందిన ఆ బాలిక వయసు 8 ఏళ్లు కాగా ఆ చిన్నారితో సోషల్ మీడియాలో రీల్స్తో పాటు.. యూట్యూబ్ కోసం పలు వీడియోలను సోనూ క్రియేట్ చేసింది. దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆ చిన్నారిని పోషిస్తానని ఆమె చెప్పింది. విచారణలో దత్తతకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో మేము అరెస్టు చేశాము.' అని ఆయన తెలిపారు. బిగ్బాస్ ఫేమ్ సోనూ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ తనకు తెలిసిన వరకు దత్తత నియమాలను పాటించానని చెప్పింది. సుమారు 45 రోజుల క్రితం ఆ చిన్నారిని ఆమె తీసుకొచ్చింది. అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న ఆ బాలికను తన తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకొని వచ్చింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ వివరాలను పోలీసుల వద్ద ఆమె పంచుకుంది. అయితే, దత్తత ప్రక్రియలో పారదర్శకతతో పాటు సరైన పత్రాలు ఆమె వద్ద లేవని అధికారులు తెలిపారు. రాయచూర్కు చెందిన ఆ బాలికను దత్తత తీసుకుంటున్నట్లు మార్చి 2న సోనూ ఒక వీడియో ద్వారా ప్రకటించింది. అయితే, హిందూ దత్తత చట్టం ప్రకారం, దత్తత తీసుకున్న వ్యక్తి కుటుంబ వివరాలు పారదర్శకతతో కూడి ఉండాలి. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారి.. ఇంటి వద్దే ఉంచడం నేరం. ఆపై తనకు సంబంధం లేని బాలికతో వీడియోలు చేయడం నేరం. ఇలాంటి విషయాలే సోనూను తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారిని ప్రభుత్వ అనాథ శరణాలయానికి తరలించగా.. పోలీసులు సోనూను విచారిస్తున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హజరు పరచనున్నారు. సోనూ మీద నాన్బెయిలబుల్ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. -
మెగాస్టార్ సాంగ్లో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ.. తొలిసారి ఇలా
గౌహర్ ఖాన్.. బాలీవుడ్లో ఆమె పేరు చాలా పాపులర్. బిగ్బాస్ సీజన్-7 విన్నర్,టీవీ స్టార్,మోడల్,హీరోయిన్ ఇలా పలు రంగాల్లో రాణించిన ఆమె కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్ను 2020లో ప్రేమించి వివాహం చేసుకుంది. గతేడాది పండంటి బిడ్డకు వారు జన్మనిచ్చి జెహాన్ అనే పేరు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు బాబు ఫోటోలను వారు విడుదల చేయలేదు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు పరమ పవిత్రమైన నగరం మక్కా క్షేత్రంలో బాబు ఫోటోను రివీల్ చేసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్తో తెలుగు వారికి గౌహర్ ఖాన్ సుపరిచయమే. ఇందులో 'నాపేరే కాంచనమాల' అనే స్పెషల్ సాంగ్తో అభిమానులను ఓ రేంజ్లో ఆమె అలరించింది. ఈ పాటతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది బాలీవుడ్ బ్యూటీ గౌహార్ ఖాన్. 18 ఏళ్ల వయసులో మోడల్గా కెరీర్ ఆరంభించిన గౌహర్ఖాన్ పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు. యాంకర్గా కెరీర్ను ఆరంభించిన ఆమె పలు సీరియల్స్లోనూ నటించారు. గేమ్, రాకెట్ సింగ్, ఫీవర్, బేగం జాన్ వంటి చిత్రాలతో పాటు తాండవ్ వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరును తెచ్చాయి. ఆమె పెళ్లి నాటికి వారి వయసు గౌహర్ ఖాన్(37), కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్(25). గౌహర్ ఖాన్ కంటే జైద్ దర్బార్ 12 ఏళ్లు చిన్నవాడు కావడంతో వారి పెళ్లి గురించి పలు విమర్శలు వచ్చాయి. కానీ పెళ్లి తర్వాత వారు ఎంతో సంతోషంగా గడుపుతున్నట్లు పలు ఫోటోలతో పంచుకుంటూ వచ్చారు. గతేడాది మే నెలలో ఒక బాబుకు జన్మనిచ్చినట్లు వారు ఎంతో సంతోషంగా ఆ వార్తను పంచుకున్నారు. బాబును తొలిసారిగా పవిత్ర స్థలమైన మక్కాకు తీసుకుని రావడం చాలా సంతోషంగా ఉంది. అతనికి నిరంతర సానుకూలత, ప్రేమ, ఆశీర్వాదం ఇవ్వాలని ఫ్యాన్స్ను వారు కోరారు. View this post on Instagram A post shared by Gauahar Khan (@gauaharkhan) -
21 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. నాన్నకు ఇప్పటికీ కోపమే!
మొదట్లో బిగ్బాస్ షోలో కేవలం సెలబ్రిటీలే ఎక్కువగా కనిపించేవారు. సీరియల్, సినిమా, మోడలింగ్కు చెందినవారినే ఎక్కువగా తీసుకువచ్చేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న జనాలకు సైతం బిగ్బాస్ ఆఫర్ ఇస్తున్నారు. అలా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నోరా ముస్కాన్ మలయాళ బిగ్బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. తాజాగా ఆమె హౌస్లో తన కష్టాలను ఏకరువు పెట్టింది. వేరేవేరే పేర్లతో.. 'నా అసలు పేరు సైబాల్ సదత్. పొన్నుస్ అనే నిక్నేమ్తో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశాను. కానీ అదేం పేరని మా ఫ్రెండ్ ఏడిపించడటంతో నోరాగా మార్చుకున్నాను. నా అసలు పేరు వాడితే ఎక్కడ మా పేరెంట్స్కు తెలిసి పెద్ద గొడవ అవుతుందోననే ఇలా పేరు మార్చుకున్నాను. నాకు 21 ఏళ్ల వయసులోనే పెళ్లయింది. కానీ మా బంధం వర్కవుట్ కాకపోవడంతో విడాకులు అడిగాను. నేను విడాకులు తీసుకోవడం నా తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదు. నా భర్త కూడా విడాకుల ప్రక్రియ మరింత ఆలస్యం కావాలనే చూశాడు. విడాకులు తీసుకుంటే తప్పా? ఎందుకని అందరూ డివోర్స్ను పెద్ద తప్పులా చూస్తారు? ఇద్దరు మనుషులు కలిసుండలేనప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవాలనుకోవడంలో తప్పేముందో అర్థం కాదు. పైగా ఇక్కడ కూడా తప్పంతా అమ్మాయిదే అన్నట్లు మాట్లాడతారు. ఇక నాకు ఎప్పుడైతే విడాకులు మంజూరయ్యాయో అప్పుడే నేను స్వతంత్రంగా, నా కాళ్లపై నేను నిలబడాలనుకున్నాను. అలా సోషల్ మీడియాను ఉపయోగించి ఇన్ఫ్లూయెన్సర్గా ఎదిగాను. దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కూడా కొన్నాను. మా నాన్న పట్టించుకోవట్లే కానీ మా నాన్నకు ఇదంతా ఇష్టం లేదు. ఇలా సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడం తనకు ఏమాత్రం నచ్చలేదు. ఇప్పటివరకు నా ఇంటివైపే రాలేదు. ఈ మూడేళ్లలో మా నాన్నను కలిసిందే లేదు. ఏదేమైనా నేను వాళ్లను నిందించడం లేదు. వాళ్ల ఆలోచనా విధానం వేరు. కానీ ఎవరూ నా ప్రయాణాన్ని ఆపలేరు' అని చెప్తూ ఎమోషనలైంది సైబాల్. చదవండి: చాలా సింపుల్గా స్టూడియోలో కూతురి పెళ్లి చేసిన వెంకటేశ్.. ఫోటోలు వైరల్ -
డైరెక్టర్ సూర్యకిరణ్ మృతిపై సుజిత ఎమోషనల్
టాలీవుడ్ రచయిత, దర్శకుడు సూర్య కిరణ్ (48) మార్చి 11న కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇప్పటికే సూర్యకిరణ్ గురించి ఆయన సన్నిహితులు పలు విషయాలను పంచుకుని బాధపడ్డారు కూడా. తాజాగా ఆయన సోదరి సుజిత రియాక్ట్ అయ్యారు. సూర్య కిరణ్కు సోదరి సుజిత అంటే చాలా ఇష్టం.. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అదే విధంగా అన్నయ్య పట్ల సుజిత కూడా అమితమైన ప్రేమను చూపించేవారు. అలాంటిది నేడు సూర్యకిరణ్ లేడన్న నిజాన్ని తట్టుకోలేక ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 'ఆయన నా అన్నయ్య మాత్రమే కాదు.. నా హీరో, నాకు తండ్రి కూడా.. ఇండస్ట్రీలో నీ టాలెంట్కు, నీ మాటలకు నేను ఎప్పుడూ అభిమానినే. మరో జన్మంటూ ఉంటే.. అప్పుడైనా నీ కలలన్నీ సాకారం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.' అంటూ సుజిత ఎమోషనల్ అయ్యారు. పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన సుజిత తర్వాత సినిమాలు, సీరియల్స్లోనూ నటించి పెద్ద నటిగా ఎదిగారు. చిన్నప్పుడు వారు తండ్రిని కోల్పోవడంతో ఒక నాన్నలా తమ కుటుంబాన్ని సూర్యకిరణ్ పోషించారని గతంలో సుజిత చెప్పారు. ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్లో నటిస్తూ హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. తమ మధ్య 8 ఏళ్లు గ్యాప్ ఉండటంతో ఎంతో ప్రేమగా అన్నయ్య చూసుకునేవారని ఆమె పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Sujithar (@sujithadhanush) -
నేను ప్రేమించిన వాడు రోడ్డున పడ్డాడు: హీరోయిన్
పెరగడం, విరగడం ఈ రెండూ చిత్ర పరిశ్రమలో సహజం. ఉన్నత స్థాయికి ఎదగడం, పాతాళంలోకి తొక్కివేయడం అనేవి చాలా జరుగుతుంటాయి. అలా నటిగా తొలి చిత్రంతో వెలిగిపోయిన హీరోయిన్ కిరణ్ రాథోడ్ గుర్తుందా? ఆమె ఇప్పుడు జీవితంలో చాలా కోల్పోయి మళ్లీ నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. జెమిని చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన నటి కిరణ్. ఆ చిత్రం విజయంతో ఈమె పేరు మారుమ్రోగింది. అవకాశాలు వరుస కట్టాయి. అలా కమలహాసన్, అజిత్, విజయకాంత్, ప్రశాంత్ వంటి స్టార్ హీరోలతో జత కట్టారు. ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు. చాలా కాలం తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒకటి రెండు చిత్రాల్లో నటించారు. ఐటమ్ సాంగ్స్లోనూ నటించారు. ఈమె గురించి చాలా వదంతులు దొర్లాయి. కాగా ఇటీవల ఒక టీవీ చానల్లో పాల్గొన్న కిరణ్ తన నట జీవితం, వ్యక్తిగతం గురించి తెలుపుతూ కథానాయకిగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తన ప్రియుడు చెప్పిన మాటలు విని సినిమాలకు దూరం అయ్యానని చెప్పారు. అయితే అదే తాను చెసిన పెద్ద తప్పు అని ఆ తరువాత తెలుసుకున్నానన్నారు. దీంతో మళ్లీ నటించడానికి సిద్ధం కాగా కొందరు తనను తప్పుగా వాడుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అడ్జెస్ట్మెంట్ కావాలని అన్నారని బహిరంగంగానే చెప్పారు. అలాంటి సమయంలో తన ప్రేమికుడు వదిలేశాడని చెప్పారు. అందుకు కారణం తమ మధ్య చిన్న సమస్యలేనని చెప్పారు. ఒకసారి అతను తనను కొట్టారని, దాన్ని తాను సహించలేకపోయానని తెలిపారు. ఆ తరువాత అతనికి ఫోన్ చేసి రమ్మని పిలిచి కోపంతో కసి తీరా గట్టిగా కొట్టానని చెప్పారు. అప్పుడు అతడు చిరిగిన బట్టలతో రోడ్డున పడ్డాడని చెప్పారు. ఈ కారణంగానో ఏమో కొందరు తనను తప్పుగా ఉపయోగించుకోవాలని చూశారని, మరి కొందరు రాత్రి వేళల్లో ఫోన్ చేసేవాళ్లని చెప్పారు. వారంతా తప్పుడు వాళ్లని తాను అర్థం చేసుకున్నానన్నారు. తనకు మంచి స్నేహితులు లేరని కిరణ్ చెప్పారు. ఇలాంటి పలు కారణాల వల్ల తాను సినిమా అవకాశాలను కోల్పోయానని చెప్పారు. అలాగే తనకు పెళ్లి అయ్యిందని, పిల్లలు పుట్టారని పుకార్లు పుట్టించారని, తాను పెళ్లే చేసుకోలేదని స్పష్టం చేశారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఆమె కంటెస్టెంట్గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్ ఇండియా నుంచి పలు సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చాన్సుల కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. -
సూర్యకిరణ్ ఈ ఒక్క తప్పు చేయడం వల్లే మరణించారు: సీనియర్ నటి
టాలీవుడ్ రచయిత, దర్శకుడు సూర్య కిరణ్ (48) మార్చి 11న కన్నుమూశారు. పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆయన మరణించారు. నేడు చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయిన సూర్యకిరణ్ మరణించడంతో ఆయన సన్నిహితులు షాక్కు గురయ్యారు. బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్లో కంటెస్టెంట్గా కొనసాగిన విషయం తెలిసిందే. అదే సీజన్లో కంటెస్టెంట్గా ఉన్న సీనియర్ నటి కరాటే కళ్యాణి ఆయన మృతి పట్ల పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హీరోయిన్ కళ్యాణిని ప్రేమ పెళ్లి చేసుకున్న సూర్యకిరణ్ పలు మనస్పర్దలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన చాలా వరకు కుంగిపోయాడని కరాటే కళ్యాణి తెలిపారు. 'భార్యతో విడిపోయిన తర్వాత ఇక తనకు జీవితంలో ఏమీ మిగలలేదని ఆయన అనుకునే వాడు.. ఈ క్రమంలో ఎక్కువగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో ఆయన లివర్ బాగా దెబ్బతింది. ఈ క్రమంలో ఆయనకు పచ్చ కామెర్లు రావడంతో దానిని ఆయన గుర్తించలేకపోయాడు. ఆపై ప్రతి రోజూ మద్యం సేవించడంతో ఆ సమస్య ఎక్కువ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినా ఉపయోగం లేకుండా పోయింది. సూర్య కిరణ్ నుంచి భార్య విడిపోయిన తర్వాత ఆమె మళ్లీ ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆశించాడు. అది ఎప్పటికీ జరగదేమో అనే ఆలోచనలతో రాత్రంతా మద్యం,సిగరెట్స్ తాగుతూ గడిపేవాడు. జాండిస్ ఉన్న సమయంలో ఎక్కువగా మద్యం తీసుకోవడం వలనే సూర్యకిరణ్ మరణించారని కరాటే కళ్యాణి తెలిపారు. (మాజీ సతీమణి కళ్యాణితో సూర్యకిరణ్) టాలీవుడ్లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సూర్యకిరణ్ 'మాస్టర్ సురేష్' పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించాడు. సూర్యకిరణ్ టి.ఎస్.మణి, రాధాలకు చెన్నైలో జన్మించారు. వీరి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆయన సోదరి సుజిత కూడా బుల్లితెరతో పాటు పలు సినిమాల్లో నటిగా రాణిస్తున్నారు. -
బిగ్బాస్ విన్నర్ ఓవరాక్షన్.. యూట్యూబర్ను దారుణంగా కొడుతూ..
హిందీ బిగ్బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ ఓ యూట్యూబర్పై దాడి చేశాడు. తన మనుషులను వెంటేసుకుని షాపింగ్మాల్కు వెళ్లి సాగర్ ఠాకూర్ అలియాస్ మాక్స్టర్న్ను చితకబాదాడు. మొదటగా తనను కలిసేందుకు వచ్చాడేమోననుకుని పలకరించడానికి ముందుకు వెళ్లాడు సదరు యూట్యూబర్. కానీ అతడు దగ్గరకు వెళ్లగానే ఎల్విష్.. తన చెంప చెళ్లుమనిపించాడు. కాలితో తన్నాడు. 10 మందితో కలిసి దాడి అతడు తిరిగి దాడి చేద్దామనుకునేలోపు ఎల్విష్ మనుషులు సాగర్ను చితకాబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ పోలీసులు ఎల్విష్ యాదవ్పై కేసు నమోదు చేశారు. 'ఎల్విష్ నన్ను కలవాలనుకుంటున్నాడని తెలిసినప్పుడు ఏదో మాట్లాడతాడనుకున్నాను. కానీ 10 మందిని వెంటేసుకుని వచ్చి నాపై దాడి చేశాడు. బూతులు మాట్లాడుతూ.. వారు తాగి ఉన్నారు. బూతులు మాట్లాడుతూ కొట్టారు. ఎల్విష్ నా వెన్నెముక విరగ్గొట్టాలని చూశాడు. మార్చి 8న ఈ ఘటన జరిగింది. అతడు వెళ్లిపోతూ నన్ను చంపేస్తానని బెదిరించాడు' అంటూ మరో వీడియో రిలీజ్ చేశాడు యూట్యూబర్. కాగా సాగర్ ఠాకూర్.. గతంలో ఎల్విష్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని, ఆ కోపంతోనే ఇలా దాడి చేశాడని తెలుస్తోంది. అటు ఎల్విష్.. పామువిషంతో రేవ్ పార్టీ చేసుకున్నాడంటూ గతేడాది చివర్లో అతడిపై కేసు కూడా నమోదైంది. ఇంతలోనే మరోసారి చీప్గా ప్రవర్తిస్తూ కేసులో ఇరుక్కున్నాడు. Full-Kalesh b/w You tuber Elvish Yadav and Real Maxtern yesterday night (With Audio) pic.twitter.com/s8DMjB1qOV — Ghar Ke Kalesh (@gharkekalesh) March 8, 2024 Real Maxtern Reply after this Kalesh Incident:pic.twitter.com/7ubeQZMvSV https://t.co/fjhAGtWCE5 — Ghar Ke Kalesh (@gharkekalesh) March 8, 2024 చదవండి: చెఫ్ అవతారంలో మన గ్లోబల్ స్టార్.. ఉపాసన వీడియో వైరల్! -
షణ్ముక్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా..?
యూట్యూబర్, బిగ్బాస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ ఈ మధ్య గంజాయి కేసులో దొరికిపోయిన తర్వాత రోజూ పలు కథనాలు వస్తూనే ఉన్నాయి. వాస్తవంగా షణ్ముక్ అన్నయ్య సంపత్పై ఓ యువతి ఫిర్యాదు చేసి పోలీసులతో పాటుగా వారి ఫ్లాట్కు వెళ్లింది. ఆ సమయంలో షన్ను గంజాయి సేవిస్తూ ఉన్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందర్భంలో తీసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అక్కడ తన సోదరుడి ప్రియురాలిపై షన్ను ఫైర్ అయ్యాడు. నేనే డిప్రెషన్లో ఉన్నానంటూనే.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వ్యాఖ్యలు చేశాడు. దీనిని బట్టి చూస్తే అతను ఏదో మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్రెషన్లోనే షణ్ముక్ గంజాయి సేవిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదక ద్రవ్యాలకు ఎలా అడిక్ట్ అవుతున్నారు..? మాదక ద్రవ్యాల సరఫరా మన చుట్టూ ఒక చెయిన్లా సాగుతుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండే కిళ్లీ దుకాణాలు, కాఫీ షాపుల ద్వారా కూడా వీటి సరఫరా సాగుతూనే ఉంటుంది. సెలబ్రిటీలను హైక్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని చెబుతూ మొదలైన ఈ వ్యవహారం క్రమంగా వారిని డార్క్ వెబ్కు కనెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత డెలివెరీ బాయ్స్ ద్వారా నేరుగా వారి ఇంటికే సరఫరా చేసే వరకూ కథ చేరుతుంది. ఇదే విషయాన్ని గతంలో పోలీసు శాఖ వారు వివిధ సందర్భాల్లో చెప్పారు. ఎలాంటి వారు బానిసలుగా మారుతున్నారు..? ఆర్థిక సమస్యలు, ప్రేమ విఫలం, ఒత్తిడి, మోసాలు, విరక్తి.. ఇలా కారణం ఏదైనా కావొచ్చు.. తాత్కాలిక సమస్యల్ని ఎదుర్కోలేక చాలా మంది క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే త్యజిస్తున్నారు. స్టార్ హోదా.. డబ్బు.. అభిమానులు.. గొప్ప పేరు ఉన్న సినీ నటులు కూడా ఆత్మహత్య చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. నాటి సిల్క్స్మిత నుంచి బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ వరకూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడిన తారలెందరో ఉన్నారు. తాజాగా పోలీసుల ముందు షణ్ముక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. గంజాయి లాంటివి తీసుకునేటప్పుడు స్కిజోపెర్నియాలాంటి తీవ్రమైన మానసిక సమస్యలు కనిపించడంతో పాటు వారి మూడ్లో మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి. మత్తు పదార్థాలను ఇంజెక్షన్లు ద్వారా తీసుకోవడం వల్ల హెచ్ ఐ వి లాంటి వి వచ్చే ముప్పు కూడా ఉందని వైద్యులు చెబుతున్న మాట. డిప్రెషన్లో ఉన్నానని షణ్ముఖ్ ఎందుకు అన్నారు షణ్ముక్ ఇంటికి వెళ్లిన సమయంలో అతను ఇలాంటి మాటే అన్నాడు.. తను పూర్తిగా డిప్రెషన్లో ఉన్నట్లు చెప్పాడు. కొంత సమయం పాటు తన అన్నయ్య ప్రియురాలిపై ఫైర్ అయ్యాడు. వాస్తంగా షణ్ముక్ తన కెరియర్ను చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాడు. ఒక సాధారణ యూట్యూబర్గా ప్రారంభమైన తన జీవితం.. బిగ్ బాస్ వరకు తీసుకోచ్చింది. ఆయన తీసిన షార్ట్ ఫిలింస్కు బాగా చదువుకున్న యువకులే ఎక్కువగా అడిక్ట్ అయ్యారు.. వాటిలో కంటెంట్ కూడా మధ్యతరగతి వర్గాలకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అంతలా యూత్ను ఆకర్షించిన షన్ను ఇప్పుడు డిప్రెషన్కు చేరుకునే స్థాయికి ఎందకు చేరుకున్నాడో తెలియదు. కానీ షన్ను వ్యక్తిగత జీవితంలో ప్రేమించిన అమ్మాయి దూరం కావడం వల్లే ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్లాడని కొందరు చెబుతున్న మాట. మరికొందరేమో బిగ్ బాస్ నుంచి వచ్చాక భారీగా ఆఫర్లు వస్తాయని అనుకుంటే కెరియర్ పరంగా మునపటి కంటే మరింత డౌన్ కావడమని చెబుతున్నారు. ఈ రెండు కారణాలతోనే షన్ను తీవ్ర నిరాశకు గురి కావడం జరిగిందని చెబుతున్నారు. డ్రగ్స్కు బానిసై పడి లేచిన కెరటాన్ని గుర్తు చేసుకోండి అమెరికా వెటరన్ స్విమ్మర్ ఆంటోనీ ఇర్విన్ ఎంతో మందికి స్పూర్తి.. 2004లో సిడ్నీ ఒలింపిక్స్లో 19 ఏళ్లకే బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంకేముంది విపరీతమైన క్రేజ్ తన సొంతమైంది. లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డాడు. మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచేవాడు. ఇష్టరీతిన బైక్ రైడింగ్ చేస్తూ పట్టుబడటం, అధికారులు హెచ్చరించి వదిలిపెడితే.. మళ్లీ తనకు నచ్చినట్లుగా జీవితాన్ని లీడ్ చేశాడు. చివరకు వింత వ్యాధి(టోరెట్ సిండ్రోమ్)తో నిత్యం అవస్థపడేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇర్విన్.. ఆత్మహత్యాయత్నం చేసినా ప్రాణాలతో బయటపడ్డాడు. భగవంతుడు తనకు పునర్జన్మ ప్రసాదించాడని మళ్లీ స్విమ్మర్గా అవతారమెత్తాడు. 2016 రియో ఓలింపిక్స్లో పాల్గొని రెండు స్వర్ణాలు కైవసం చేసుకుని లేటు వయసులో స్వర్ణం కొల్లగొట్టిన అమెరికన్ స్విమ్మర్గా రికార్డులకెక్కాడు. డ్రగ్స్కు ఫుల్స్టాప్ పెట్టి ప్రస్తుతం కూడా రేసులో ఉన్నాడు. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్థుల్లా చూడటం మానేసి, వారిని డీఅడిక్ట్ చేసేందుకు సహకారం అందించాల్సిన అవసరముంది. దీనికి తల్లి తండ్రులు, డాక్టర్లు, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేని వారే ఎక్కువగా ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతారని పలువురు వైద్యులు తెలిపారు. -
నేను అలాంటి చిత్రాల్లో నటించలేదు.. కిరణ్ రాథోడ్ ఆవేదన
హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది కిరణ్ రాథోడ్. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేనుతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో రంగప్రవేశం చేసింది. కాగా ఈమెకు రజనీకాంత్ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో దీన్ని వదులుకోక తప్పలేదు. ఇప్పటికీ దీని గురించి బాధపడుతూ ఉంటుంది కిరణ్. ఈమె బాలీవుడ్ నటి రవీనా టండన్ కజిన్ కూడా! తమిళంలో కమల్ హాసన్, అజిత్ కుమార్, విక్రమ్ సహా ప్రముఖ హీరోలతో నటించిన కిరణ్.. సినిమా ఛాన్సులు పీక్లో ఉన్నప్పుడే ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. చాలా కాలం తర్వాత తెలుగు బిగ్బాస్-7లో కనిపించిన కిరణ్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఒక యూట్యుబ్ ఛానల్ కోసం ఆమెను నటి షకీల ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఆమె పలు విషయాలను పంచుకున్నారు. (ఇదీ చదవండి: వంద కోట్ల స్టార్ హీరో పుట్టినరోజు.. తెరపైకి పాత ఫోటోలు.. ఎవరో గుర్తుపట్టారా?) చాలా ఏళ్లుగా తనపై వస్తున్న రూమర్స్ గురించి కిరణ్ ఇలా చెప్పారు. 'నేను ఇప్పటి వరకు ఎలాంటి అశ్లీల చిత్రాల్లో నటించ లేదు. కానీ మీడియా నాపై ఎందుకు అలాంటి వార్తలను ప్రచారం చేసిందో తెలియదని కిరణ్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేసింది.' తమిళ్లో జెమిని సినిమా తర్వాత ఓవర్నైట్ స్టార్ అయిన కిరణ్ తర్వాత చాలా సినిమాల్లో నటించినా కూడా పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. వాడి వల్లే సినిమా ఛాన్సులు తగ్గాయి గతంలో నేనొకరిని ప్రేమించాను. అతడితో నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాను. కానీ అతడు సరైనవాడు కాదని ఆలస్యంగా తెలుసుకున్నాను. అతడిని పెళ్లి చేసుకుని ఉండుంటే కచ్చితంగా నన్ను చంపేసేవాడే! అలాంటివాడి కోసం ఆఫర్లు వదిలేసుకున్నాను. తర్వాత ప్రేమించినవాడు కూడా మంచోడు కాదు. తనతోనూ బ్రేకప్ అయింది. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉంటున్నాను. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల నా జీవితం నాశనమైంది. ఇప్పుడు నేను నటించాలనుకుంటున్నాను. కానీ నాకు ఎవరూ ఆఫర్లు ఇవ్వడం లేదు. ఏవరైనా ఆఫర్లు ఇస్తే తప్పకుండా మళ్లీ నటిస్తాను. అని చెప్పుకొచ్చింది కిరణ్ రాథోడ్. సినిమా ఆఫర్లు ఇచ్చి రాత్రికి ఫోన్ చేస్తారు ప్రేమించిన వాడు దూరం అయ్యాడు.. చేతిలో సినిమాలు లేవు. అలాంటి సమయంలో కొందరు సినిమా ఛాన్స్ ఉందని కాల్ చేస్తారు. మీకు మంచి పాత్ర ఉందని కూడా ఆఫర్ చేశారు. ఎవరైతే ఆఫర్లు ఇస్తామని చెప్పారో మాట్లాడిన అదే రోజు రాత్రి మళ్లీ ఫోన్ చేస్తారు. తనతో గడపాలంటూ ఫ్లాట్కు రమ్మంటారు. అలా ప్రతిరోజూ చాలామంది రాత్రి అయితే కాల్స్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నాకు అర్థం అయింది. ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు ఎవరూ స్నేహితులు లేరు.. ఎవరూ సాయం చేయరు. అని తన పాత రోజులను గుర్తు చేసుకుంది. యాప్లో గ్లామర్ ఫోటోలు, వీడియోలు సినిమా అవకాశాలు లేకపోవడంతో అదే సమయంలోనే నేనొక యాప్ని ప్రారంభించాను. అందులో నా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాను. అది చూసి నిర్మాతలు, దర్శకులు ఆఫర్లు ఇస్తారనుకున్నాను. కానీ వారితో పాటు మరికొందరు డబ్బులిస్తామంటూ కమిట్మెంట్ అడిగారు. ప్రత్యేకంగా ఇక్కడ ఒకరి పేరు చెప్పనవసరం లేదు.. ఆ సమయంలో ఇలా చాలా మంది కాల్ చేశారు. తర్వాత దానిని ఆపేశాను. ఇప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆకర్షణీయమైన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నాను. కానీ ఎలాంటి ఆఫర్లు రాలేదు.. ఇప్పుడు కూడా కొన్ని తప్పుడు కాల్స్ వస్తూనే ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. నేను శృంగార నటిని కాదు ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసేది నేనొక్కదాన్నే కాదు. చాలా మంది నటీమణులు చేస్తారు. కానీ నేను పోస్ట్ చేస్తే మాత్రం మీడియా మొత్తం నన్ను టార్గెట్ చేస్తుంది. ఎందుకో తెలియదు, నేను ఎలాంటి శృంగార చిత్రాల్లో నటించలేదు, వీడియోలు చేయలేదు. నాకిష్టమైన బట్టలు వేసుకుని వీడియోలు పోస్ట్ చేస్తాను. కానీ కొందరు మాత్రం కమిట్మెంట్ కోసం ఇతరులను ఆహ్వానిస్తున్నారా..? అంటూ కామెంట్లు చేస్తారు. ఇంటర్నెట్లో వస్తున్న వ్యాఖ్యలు తనను బాధిస్తున్నాయని నటి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కిరణ్పై ఆరోపణలు సినిమా ఛాన్సులు తగ్గిన తర్వాత కిరణ్ పేరుతో ఒక యాప్ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం చేస్తోందని ఆమెపై రూమర్స్ వచ్చాయి. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి. ఆ యాప్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్ తన రెండు గ్లామరస్ ఫొటోలను పంపుతుంది. అదేవిధంగా ఆమెతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాల్సిందేనట. వీడియో కాల్లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.15 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందే అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.. వాటి గురించి తొలిసారి కిరణ్ రియాక్ట్ అయ్యారు. View this post on Instagram A post shared by KEIRA RATHORE (@kiran_rathore_official) -
మూడు వందలకు పైగా పెళ్లి సంబంధాలు.. అన్నీ రిజెక్ట్ చేశా: నటి
కన్నడ బుల్లితెర నటి వైష్ణవి గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్కు టచ్లో ఉంటుంది. వైష్ణవి గౌడకు ఇప్పటి వరకు 300 వరకు పెళ్లి సంబంధాలు వచ్చినట్లు ఆమె చెప్పి అందరినీ షాక్కు గురిచేసింది. జీ కన్నడ ఛానెల్లో ప్రసారమయ్యే సీతారాం సీరియల్లో మెరిసిన వైష్ణవికి ఎన్ని పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయో తెలుసా? అంటూ కన్నడ సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతుంది. కన్నడ బిగ్ బాస్ నందు ఈ సీజన్లో పాల్గొన్న వైష్ణవి ఎలిమినేట్ అవుతున్న సమయంలో.. మీకు ఎన్ని లవ్ ప్రపోజల్స్, పెళ్లి సంబంధాలు వచ్చాయని హీరో కిచ్చా సుదీప్ అడుగుతాడు. అందుకు సమాధానంగా వైష్ణవి కూడా కొంత సమయం ఆలోచించి దాదాపు 200 నుంచి 300 ప్రపోజల్స్ వచ్చాయని చెప్పింది. ఇది విన్న సుదీప్, 'అయ్యో.. వీటిలో ఒక్క ప్రపోజల్ కూడా మీకు కనెక్ట్ కాలేదా..? అని అడిగాడు. లేదని చెప్పేసిన ఈ బ్యూటీ ఇక నుంచి భవిష్యత్లో ఎలాంటి ప్రపోజల్స్ చూడాలని అనిపించలేదని తెలిపింది. 'నేను ఎప్పుడూ నా మనసుకు నచ్చిన పనే చేస్తాను.. కాబట్టి నా మనస్సు ఇప్పట్లో ఏ ప్రపోజల్ను చూడడానికి ప్రేరేపించలేదు. ఒకరిని ప్రేమించడం అంటే వాళ్ల మొహం చూడడం అనవసరం. ప్రేమ అంటూ చూడకుండానే మొదలు అవుతుంది. అని ఆమె చెప్పుకొచ్చింది. ఒకరి మొఖాన్ని చూడకుండా ప్రేమలో ఎలా పడుతావు అంటూ సుదీప్ షాక్ అయ్యాడు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ టాపిక్ వైరల్ అవుతుంది. -
ఫిబ్రవరి 28న పెళ్లి.. మౌనిక తట్టుకోలేకే అలా చేసింది: గీతూ రాయల్
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు సంపత్ వినయ్ను అరెస్ట్ చేయడానికి వెళ్తే అతడి తమ్ముడు, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ పోలీసులకు దొరికిపోయాడు. సంపత్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని డాక్టర్ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సంపత్ను అరెస్ట్ చేసేందుకు అతడి గదికి వెళ్లగా అక్కడ షణ్ముఖ్ గంజాయితో రెడ్హ్యాండెడ్గా దొరకడంతో పోలీసులు అతడిని తీసుకెళ్లారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 2021లోనే రోకా.. తాజాగా ఈ కేసుపై బిగ్బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'నేను, షణ్ముఖ్ బాగానే మాట్లాడుకునేవాళ్లం. కానీ అతడు బిగ్బాస్ షోలో ఉన్నప్పుడు నేనిచ్చిన రివ్యూల వల్ల అతడి కుటుంబానికి, నాకు మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది. షణ్ను అన్నయ్య సంపత్ వినయ్ ప్రేయసి మౌనిక నాకు మంచి స్నేహితురాలు. తను నా ఫీమేల్ క్రష్ కూడా! మౌనిక, సంపత్ చాలా ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారు. వీరికి 2021లోనే రోకా జరిగింది. ఏడాది తిరిగేలోగా పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పింది. ఈ నెలాఖరున పెళ్లి.. ఇంతలోనే.. కానీ అంతలోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పెళ్లికి గ్యాప్ తీసుకున్నారు. అంతా సద్దుమణిగాక గతేడాది నవంబర్లో పసుపు దంచడం వంటి పెళ్లి పనులు మొదలుపెట్టేశారు. లగ్నపత్రికలు పంచారు, కళ్యాణమండపం కూడా బుక్ చేశారు. ఫిబ్రవరి 28న పెళ్లి జరగాల్సి ఉంది. వారం రోజుల్లో పెళ్లి ఉందనగా సంపత్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడట! ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో లైఫ్ పంచుకోవాలనుకోవడం నాకైతే నచ్చలేదు. డిప్రెషన్లోకి వెళ్లింది అది ఏ అమ్మాయైనా తట్టుకోలేదు. అందుకనే తనలా చేసి ఉంటుంది. ఏదైనా ఉంటే ఇద్దరూ మాట్లాడుకుని విడిపోవాలి. పైగా ఆమె అతడికి ఇంటికి వెళ్తే లోపలికి రానివ్వకపోవడం కరెక్ట్ కాదు. మౌనిక చాలా సెన్సిటివ్.. తన గురించి ఆలోచిస్తేనే బాధేస్తోంది. ఆ మధ్య తను డిప్రెషన్లోకి కూడా వెళ్లింది' అని చెప్పుకొచ్చింది. చదవండి: అందరూ ప్రార్థించండి.. వేడుకుంటున్న పాయల్ -
షణ్ముఖ్పై కేసు నమోదు.. గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ
బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్, అతని సోదరుడు సంపత్ వినయ్ కేసులో కీలక మలుపు తిరిగింది. కొంత సమయం క్రితం షణ్ముఖ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా షణ్ముఖ , సంపత్ కలిసి గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. షణ్ముఖ్ సోదరుడు సంపత్పై యువతీ ఫిర్యాదు చేయడంతో ఈ బండారం బయటపడింది. షణ్ముఖ్ ఇంట్లో కూడా 18 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో షణ్ముఖ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 'సంపత్ను నాకు మొదట పరిచయం చేసింది షణ్ముఖ్నే.. మా పరిచయం ప్రేమగా మారాక సంపత్ వినయ్ పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నన్ను బలవంత పెట్టగా.. చేతికి రింగ్ పెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నామని నమ్మించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఒకసారి గర్భం కూడా తీయించాడు. ఈ విషయం సంపత్ పేరెంట్స్ అప్పారావుకి చెప్పా. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే.. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలకు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. సంపత్కి మరో యువతి తో పెళ్లి అయ్యిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా.'అని తెలిపింది. -
ప్రిన్స్ యావర్తో లవ్? క్లారిటీ ఇచ్చిన బిగ్బాస్ బ్యూటీ
బిగ్బాస్ షోలో పాల్గొంటే పాపులారిటీ ఎంతొస్తుందో.. నెగెటివిటీ కూడా అదే స్థాయిలో వస్తుంది. చిన్నచిన్న పొరపాట్లను, తప్పులను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ కంటెస్టెంట్లను ట్రోల్ చేస్తుంటారు. అయితే ఇలాంటి షోలో ఎటువంటి నెగెటివిటీ లేకుండా బయటకు రావడం చాలా కష్టం. కానీ బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో ఫుల్ పాజిటివిటీతో బయటకు వచ్చింది నయని పావని. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టిన ఈమె ఒక్క వారంలోనే బయటకు వచ్చేసింది. కానీ బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. షో నుంచి బయటకు వచ్చాక బిగ్బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్తో తరచూ రీల్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ వస్తోంది. ఇది చూసిన జనాలు.. వీళ్ల మధ్య ఏదో ఉందని అనుమానించడం మొదలుపెట్టారు. తాజాగా ఆమె అభిమానులతో చిట్చాట్ చేయగా ఓ వ్యక్తి నువ్వు ప్రిన్స్ యావర్తో ప్రేమలో ఉన్నావా? అని అడిగేశాడు. ఈ ప్రశ్న వినీవినీ విసుగెత్తిపోయిన నయని.. అరేయ్, ఏంట్రా మీరు? ఇంకో ప్రశ్నే లేదా? మా మధ్య ఏం లేదు అని ఎన్నిసార్లు క్లారిటీ ఇవ్వాలి అని రిప్లై ఇచ్చింది. దీంతో వారి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. #NayaniPavani Clarifies Relation with #Yawar pic.twitter.com/KR5B1jT93x — BigBoss Telugu Views (@BBTeluguViews) February 21, 2024 చదవండి: ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేశా.. రెండోది త్వరలోనే.. -
బిగ్బాస్ విన్నర్ రైతుబిడ్డకు ఊరట.. ఇకపై..
గెలుపోటములు సహజమే.. కష్టసుఖాలూ కామనే.. కానీ రెండూ ఒకేసారి వస్తే తట్టుకోవడం, తట్టుకుని నిలబడటం చాలా కష్టం. పల్లవి ప్రశాంత్కు ఇటువంటి పరిస్థితే ఏర్పడింది. తనను తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్ విజేతగా ప్రకటించడంతో ఫుల్ ఖుషీ అయ్యాడు ప్రశాంత్. కానీ ఫినాలే ఎపిసోడ్ జరిగిన కొద్ది క్షణాలకే గందరగోళం సృష్టించాడు. స్టూడియో బయట పరిస్థితి బాలేదు, వెనకనుంచి వెళ్లిపో అని పోలీసులు చెప్తున్నా పట్టించుకోకుండా లెక్క చేయలేదు. ప్రశాంత్ రాకతో వీరంగం అప్పటికే అభిమానులు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు, బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తూ నానా వీరంగం సృష్టిస్తుండగా ప్రశాంత్ అక్కడికి చేరుకోవడంతో అక్కడి జనాలు మరింత రెచ్చిపోయారు. ఈ వ్యవహారంలో ప్రశాంత్, అతడి సోదరుడితో పాటు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాలుగు రోజులపాటు జైల్లో ఉన్న ప్రశాంత్ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. రెండు నెలలుగా పోలీసుల ఎదుట హాజరు బెయిల్లోని కండీషన్ ప్రకారం రెండు నెలలుగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు పోలీసుల ఎదుట హాజరు నుంచి రిలీఫ్ ఇవ్వాలని ప్రశాంత్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై బుధవారం నాడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. ప్రశాంత్, ఆయన సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. చదవండి: అనసూయ గ్లామర్ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి.. -
ఏంటీ కీర్తి..? కుమారి ఆంటీ ఫుడ్ గురించి అంత మాట అనేశావ్..!
సోషల్ మీడియా ప్రభావంతో స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి బాగా పాపులర్ అయింది. మధ్యాహ్నం 12 అయితే చాలు కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కోసం జనాలు బారులు తీరుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కావడం.. పోలీసులు హెచ్చరించడం వంటివి కూడా జరిగాయి. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం రియాక్ట్ అయ్యే వరకు ఆమే ఫేమస్ అయింది. చివరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమయం వచ్చినప్పుడు తాను కూడా అక్కడ భోజనం చేస్తానని చెప్పారు. అంతలా రెండు రాష్ట్రాల్లో కుమారీ ఆంటీ ఫుడ్ ఫేమస్ అయింది. హైదరాబాద్లోని ఎందరో యూట్యబర్స్, నెటిజన్లు ఫుడ్ తిని తమ అభిప్రాయాలను సోషల్మీడియా ద్వారా షేర్ చేయడం చూశాం.. తాజాగా బిగ్బాస్ ఫేమ్, సీరియల్ నటి కీర్తి భట్ తనకు కాబోయే భర్త విజయ్ కార్తీక్తో పాటు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి భోజనం రుచి చూశారు. ఆపై వారి అభిప్రాయాన్ని యూట్యూబ్లో పంచుకున్నారు. మేము కుమారి ఆంటీనే చూద్దమని వస్తే.. ఆ సమయంలో ఆంటీ లేదని కీర్తి తెలిపింది. వైట్ రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తిందామని తీసుకున్నాం. కానీ తమకు నచ్చలేదని కీర్తి తెలిపింది. ఎక్కువగా కారం ఉండటం వల్ల అంత రుచిగా లేదని వారు తెలిపారు. పక్కనే ఉన్న మరో రోడ్సైడ్ హోటల్లో భోజనం చేశామని వారు తెలిపారు. అది కొంచెం బెటర్ అని వారిద్దరూ తెలిపారు. కుమారీ ఆంటీ ఫుడ్కు అసలు ఎందుకు అంత హైప్ వచ్చిందో తెలియదు. ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం వైట్ రైస్, నాలుగు చికెన్ ముక్కలు వేసి రూ. 170 తీసుకున్నారు. ఆ ధరకు ఫుడ్ ఏ మాత్రం వర్త్ కాదు. మాకు నచ్చలేదు. కుమారి ఆంటీ కంటే నేను చాలా బాగా చేస్తాను.' అని కీర్తి తెలిపింది. అందరూ ఫుడ్ బాగుంది అంటే మేము కూడా తిందామని అక్కడికి వచ్చినట్లు వారు తెలిపారు. ఇదీ తమ అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. ఆమె వ్యాపారానికి నష్టం చేయాలని తమ అభిప్రాయం కాదని చెప్పుకొచ్చారు. ఆమె వ్యాపారం మరింత మంచిగా జరిగి ఆపై ఒక పెద్ద హోటల్ ఆమె పెట్టాలని కోరుకుంటున్నట్లు కీర్తి తెలిపింది. అంతే గానీ తమ అభిప్రాయాన్ని ఎవరూ తప్పుగా తీసుకోకండి అని చెప్పింది. -
ప్రశాంత్కు ఇబ్బందిగా మారిన 'బిగ్బాస్' ప్రైజ్ మనీ.. వాళ్లను మోసం చేశాడా?
బిగ్బాస్ 7 ముగిసిపోయి ఇప్పటికి రెండు నెలలు దాటింది. ఈ సీజన్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. రైతుబిడ్డ ట్యాగ్లైన్తో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు. తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ప్రత్యర్థులను ఎదుర్కుంటూ ఒక్కోమెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకున్నాడు. విజేతగా నిలుస్తే వచ్చే ప్రైజ్ మనీని పేద రైతులకు ఉపయోగిస్తానని పలుమార్లు చెప్పాడు. ఇప్పుడా విషయంపై సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ప్రశాంత్ కూడా రియాక్ట్ అయ్యాడు. రైతుల పేరుతో గెలిచి.. అమ్మాయిలతో ఎంజాయ్ అందరూ అనుకున్నట్లే ప్రశాంత్ విజేతగా నిలిచాడు.. రోజులు గడుస్తున్నా అతను ముందుగా చెప్పినట్లు ప్రైజ్ మనీ నుంచి రైతులకు సాయం చేసినట్లు కనిపించలేదు. అంతేకాకుండా పలు టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. బిగ్బాస్ స్నేహితులతో పార్టీలలో కనిపిస్తున్నాడు. పలు షాప్స్ ఓపెనింగ్స్కు అతిథిగా వెళ్తున్నాడు... ఇలా నిత్యం బిజీగా మారిపోయిన పల్లవి ప్రశాంత్.. రైతులకు తన ప్రైజ్ మనీ ఇస్తానని ఇచ్చిన మాట మరిచిపోయాడంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. కొందరైతే ఏకంగా రైతుల పేరుతో గెలిచి వారికి ఇచ్చిన మాటను తప్పడమే కాకుండా అమ్మాయిలతో బుల్లితెరపై బాగానే ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సాయం చేసే ఆలోచన ఉంటే ఎప్పుడో చేసేవాడు.. ఆ డబ్బు కూడా అతనికి చేరడమే కాకుండా ఖర్చు కూడా అయిపోయి ఉంటుంది. ఆ డబ్బు గురించి ఇక అందరూ మరిచిపోండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. అతను కూడా పేదరికంతో ఉన్నాడని అతని భవిష్యత్ కోసం ఆ డబ్బు ఉపయోగించుకోవాలని తెలుపుతున్నారు. వాస్తవంగా అమర్దీప్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ప్రశాంత్కు రైతుబిడ్డ అనే సింపతీ ఎక్కువగా ఉపయోగపడటంతో విజేతగా నిలిచాడు. ఇప్పుడు అదే ట్యాగ్లైన్ ప్రశాంత్కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ రియాక్షన్ తాజాగా ఈ విషయంపై ప్రశాంత్ ఇలా రియాక్ట్ అయ్యాడు. 'ప్రాణం పోయిన ఇచ్చిన మాట మరువను. నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నిరూపేద రైతు కుటుంబాల కోసం ఇచ్చిన మాట ప్రకారం బిగ్బాస్ ప్రైజ్ మనీతో త్వరలో మీ ముందుకు వస్తాను.' అని ప్రశాంత్ చెప్పాడు. ప్రశాంత్కు వచ్చేది ఎంత బిగ్బాస్ విజేతకు రూ. 50 లక్షల ప్రైజ్మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్కేసు తీసుకోవడంతో రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈరేంజ్లో కోతలు ఉంటాయా? అంటే నిజంగానే ఉంటుందట. బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు రూ.50 లక్షల ప్రైజ్మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందన్నాడు. ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ ఇచ్చిన మాట ప్రకారం ప్రైజ్ మనీ పంచితే.. ఆయనకు అదనంగా వచ్చిన మారుతి బ్రెజా కారు, రూ. 15 లక్షల విలువ చేసే వజ్రాభరణం మిగిలినట్లు అవుతుంది. ప్రశాంత్కు బిగ్బాస్ నుంచి ఒక వారానికి రూ. లక్ష రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అంటే 15 వారాలకు సుమారుగా రూ.15 లక్షలు ఈ రూపంలో దక్కినట్లు అని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
ఏడాది కిందట నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన హీరోయిన్
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఎందరో ఇంట్ల పెళ్లి బాజాలు మోగనున్నాయి. సెలబ్రిటీలు కూడా బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పెడుతూ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు, రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ రెడ్డి వాలంటైన్స్ డే రోజే పెళ్లి చేసుకోగా రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 21న ప్రియుడితో మెడలో మూడు ముళ్లు వేయించుకోనుంది. నిశ్చితార్థం అయిన ఏడాదిన్నరకు పెళ్లి తాజాగా మరో బ్యూటీ ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. నారాయణ అండ్ కో సినిమా హీరోయిన్ ఆరతి త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 26న వైవాహిక బంధంతో ఒక్కటి కానున్నట్లు తెలిపింది. కాగా ఈ జంట గతేడాది ఫిబ్రవరి 16న నిశ్చితార్థం చేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత అదే రోజు తమ పెళ్లి తేదీని వెల్లడించడం విశేషం. అప్పటినుంచే లవ్.. మోడల్, నటి ఆరతి.. మలయాళ బిగ్బాస్ కంటెస్టెంట్ డాక్టర్ రాబిన్ రాధాకృష్ణన్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన రాధాకృష్ణన్ను ఇంటర్వ్యూ చేసింది ఆరతి. అప్పుడు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఆరతి హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది. View this post on Instagram A post shared by Dr Robin Radhakrishnan (@dr.robin_radhakrishnan) చదవండి: విశ్వక్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకు నాగచైతన్య హీరోగా.. -
రక్తం కారుతున్నా అలాగే నడుస్తూ.. మూడుసార్లు ఆత్మహత్యాయత్నం!
ప్రియాంక సింగ్.. సెలబ్రిటీలు సైతం కుళ్లుకునేంత అందం ఈమె సొంతం. పుట్టుకతో అబ్బాయి అయినా తనలో ఆడ లక్షణాలు ఉండటం, అలా కనిపించేందుకే ఎక్కువ ఇష్టపడటంతో ఆపరేషన్ చేయించుకుని మరీ అమ్మాయిగా మారింది. బిగ్బాస్ షో ద్వారా జనాలకు మరింత చేరువైన ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టింది. సర్జరీ చేయించుకున్నా.. ప్రియాంక మాట్లాడుతూ.. చిన్నప్పుడు అక్క స్కూలు నుంచి రాగానే తన డ్రెస్సులు వేసుకునేదాన్ని. రానురానూ నాకు అమ్మాయిలాగే ఉండాలనిపించింది. పదో తరగతి తర్వాత హైదరాబాద్ వచ్చాను. మేకప్ ఆర్టిస్టుగా చేశాను. జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేశాను. బయట షోలు చేశాను. ఆ డబ్బుతో సర్జరీ చేయించుకున్నాను. అప్పుడు విపరీతమైన నొప్పితో బాధపడ్డాను. ఆస్పత్రిలో పట్టించుకునేవాళ్లే లేరు. ఓపక్క రక్తస్రావం అవుతున్నా.. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి గేటు వరకు నడుచుకుంటూ వెళ్లాను. బ్యాంకు బ్యాలెన్స్ జీరో.. సర్జరీ నుంచి కోలుకునేలోపే ఆర్థరైటిస్తో ఏడాదిపాటు మంచానికే పరిమితమయ్యాను. 90 కిలోల దాకా పెరిగాను. దానికి చికిత్స చేయించుకునేసరికే నా బ్యాంకు బ్యాలెన్స్ జీరో అయింది. అక్కడి నుంచి మళ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడిదాకా వచ్చాను. అమ్మాయిగా మారాలని చాలామంది అనుకుంటారు. కానీ సర్జరీ వల్ల చాలా నొప్పి భరించాల్సి ఉంటుంది. హార్మోన్ థెరపీ కూడా కచ్చితంగా చేయించుకోవాలి. ఇప్పుడైతే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే పెళ్లిపై ఆసక్తి లేదు. చర్మం కాలిపోయింది నా జీవితంలో మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాను. పదో తరగతి అయ్యాక.. ఊర్లో అందరూ ఏదైతే అన్నారో అదే మాట నాన్న నోటి వెంట నుంచి వచ్చేసరికి తట్టుకోలేకపోయాను. అప్పుడు కిరోసిన్ పోసుకుని కాల్చుకున్నాను. ఆ సమయంలో 60 శాతం వరకు చర్మం కాలిపోయింది. దానికి చికిత్స తీసుకున్నాను. తర్వాత లవ్లో ఫెయిలైనప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. సర్జరీ అయ్యాక ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఆ బాధ భరించలేక మరోసారి నిద్రమాత్రలు మింగాను. అయినా సరే మళ్లీ బతికి బయటపడ్డాను. మందు తాగేదాన్ని.. నా కోసం ఏదో మంచిది రాసిపెట్టుంది, అందుకే దేవుడు బతికిస్తున్నాడనుకున్నాను. భగవంతుడిని నమ్ముతాను. నేను మందు తాగడమనేది బ్రీజర్తో మొదలుపెట్టాను. మందు, సిగరెట్ తాగేదాన్ని. కానీ అవి మానేశాను. సినిమాల విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాను. హాట్స్టార్లో హీరోయిన్గా లాంచ్ కాబోతున్నాను. చిన్న చిన్న సినిమాలతో పాటు హీరోయిన్గా కూడా చేస్తున్నాను. ఎప్పటికైనా ఫుడ్ బిజినెస్ చేయాలనుంది' అని చెప్పుకొచ్చింది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి! - పోడూరి నాగ ఆంజనేయులు -
బిగ్బాస్ ఫైనలిస్టుని సన్మానించిన ఎస్ఐకి బదిలీ
యశవంతపుర: బిగ్బాస్ రియాలిటీ షో లో ఫైనల్స్కు చేరిన వర్తూరు సంతోష్ను బెంగళూరులో ఎస్ఐగా పని చేసే తిమ్మరాయప్ప సన్మానించారు. ఇది సబబు కాదంటూ పోలీసు కమిషనర్ దయానంద.. ఆ ఎస్ఐని వర్తూరు పీఎస్ నుంచి ఆడుగోడికి బదిలీ కానుక ఇచ్చారు. బిగ్బాస్లో పేరుగాంచిన సంతోష్కు అనేక మంది అభిమానులు ఉన్నారు. గతంలో మెడలో పులిగోరు వేసుకోవడంతో అతనిపై కేసు కూడా అయి జైలుకెళ్లి వచ్చాడు. అలాంటి వ్యక్తికి యూనిఫాంలో ఉన్న ఎస్ఐ గంధమాల వేసి మైసూరు పేటాతో సత్కరించడం, ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ కాగా అనేకమంది ఎస్ఐని తప్పుబట్టారు. -
రెండోసారి ఆడపిల్ల.. సంతోషంలో నటి.. ఘనంగా ఫంక్షన్
పర్ల్ మానే.. మొదట్లో పాటల ప్రోగ్రామ్కు, తర్వాత వంట ప్రోగ్రామ్, డ్యాన్స్ షో.. ఇలా దాదాపు అన్ని రకాల కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరించింది. యాంకర్గా వచ్చిన గుర్తింపుతో సినిమా ఛాన్సులూ అందుకుంది. సహాయ నటిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ మలయాళ బిగ్బాస్ షోలోనూ పాల్గొని ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. ఈమె తెలుగులో ఓ సినిమాలో నటించింది. నాగశౌర్య 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో వైదేహి అనే పాత్రలో యాక్ట్ చేసింది. బిగ్బాస్ షోలో లవ్ ఇకపోతే ఈమె బిగ్బాస్ షోలో బుల్లితెర నటుడు శ్రీనిష్ అరవింద్తో లవ్లో పడింది. షో అయిపోగానే పెళ్లి కూడా చేసుకున్నారు. 2019లో పెళ్లి పీటలెక్కగా 2021లో నీల అనే కూతురు జన్మించింది. ఈ ఏడాది జనవరి 13న మరోసారి కూతురు పుట్టింది. తాజాగా ఈ పాపకు నామకరణం చేశారు. రెండో కూతురికి 'నితారా శ్రీనిష్' అన్న పేరు ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. పాప పుట్టి 28 రోజులు.. 'నితారా శ్రీనిష్ జన్మించి 28 రోజులవుతోంది. ఇది తన బారసాల. మా మనసులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి. మీ ఆశీర్వాదాలు కావాలి..' అంటూ ఫ్యామిలీ ఫోటోలను పర్ల్ మానే, శ్రీనిష్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు నటి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీ కుటుంబం చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pearle Maaney (@pearlemaany) View this post on Instagram A post shared by Pearle Maaney (@pearlemaany) చదవండి: 'దేవర'లో ఎన్జీఆర్కు జోడీగా శ్రుతి మరాఠే.. ఇన్స్టాలో వెరీ పాపులర్
Pagination
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..
చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
Advertisement