Bike ambulance
-
బైక్ అంబులెన్సులు.. ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బైక్ అంబులెన్సులను రూపొందించారు. అత్యవసర సమయాల్లో కరోనా రోగులకు ఉపయోగపడేలా వీటిని తయారు చేశారు. ఆక్సిజన్ సిలిండర్, వీల్ చైర్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ఇందులో ఉంటాయి. పూణేకు చెందిన డసల్ట్ సిస్టమ్స్ కంపెనీ ప్రతినిధి సుహాస్ ప్రీతిపాల్ పర్యవేక్షణలో మెకానికల్ సెకండియర్ చదువుతున్న గుత్తికి చెందిన యశ్వంత్, ఎజాజ్ అహ్మద్ 45 రోజులు శ్రమించి బైక్ అంబులెన్సులను రూపొందించారు. ఇప్పటిదాకా తయారైన పది బైక్ అంబులెన్సులను త్వరలోనే సచివాలయాలకు ఉచితంగా అందజేస్తామని గేట్స్ కాలేజీ ఎండీ గజ్జల రఘునాథ్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఒక్కో అంబులెన్స్ తయారు చేయడానికి దాదాపు రూ.50 వేలు ఖర్చయ్యిందని, కరోనా రోగులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే వీటిని రూపొందించామని విద్యార్థులు యశ్వంత్, ఎజాజ్ అహ్మద్ చెప్పారు. -
Photo Feature: ఆపత్కాలం.. చేయాలి సాయం!
ఆపత్కాలంలో ఎవరికి తోచిన సాయం వారు చేస్తూ సాటివారికి సహాయపడుతున్నారు. కరోనా బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు సిద్దిపేటకు చెందిన శశికర్నంద అనే యువకుడు బైక్ అంబులెన్స్ నడిపిస్తున్నాడు. కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్యం అందించలేమని కింగ్కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రి సిబ్బంది తేల్చిచెప్పారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలోనే బాధితులు పడిగాపులు కాస్తున్నారు. ‘టౌటే’ తుపాను ధాటికి అరేబియా సముద్రంలో మునిగిపోయిన నౌక నుంచి పలువురిని కాపాడటంతో ‘బతుకు జీవుడా’ అంటూ వారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బైక్ అంబులెన్స్ రూపొందించిన డీఆర్డీవో
న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పిఎఫ్), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) సంయుక్తంగా కలిసి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన బైక్ అంబులెన్స్ "రక్షిత"ను నేడు ప్రారంభించారు. మావోయిస్టు ప్రభావిత, కొండ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అత్యవసర తరలింపు కోసం ఈ బైక్ అంబులెన్స్ ను రూపొందించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్కౌంటర్ల సమయంలో ఏదైనా గాయాలు జరిగితే ఈ బైక్లు సిఆర్పిఎఫ్ జవాన్లు, పారామెడిక్స్కు సహాయ పడనున్నాయి అధికారులు తెలిపారు.(చదవండి: ఫేస్బుక్, ట్విటర్కు కేంద్రం షాక్) "ఈ బైక్లు బీజాపూర్, సుక్మా, దంతేవాడ మొదలైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మరింత ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే, పెద్ద అంబులెన్స్లను అడవి లోపలికి తీసుకెళ్లడం సాధ్యం కాదు కాబట్టి" అని సీఆర్పిఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఇటువంటి బైక్లు సిబ్బంది విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రదేశాల్లో ఈ బైక్లు వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్ వెల్లడించింది. ముఖ్యంగా నక్సలైట్ జోన్లలో ఇరుకైన రోడ్లలో వేగంగా చేరుకోవడానికి సీఆర్పిఎఫ్ గమనించిన తరువాత ఈ బైక్ అభివృద్ధి చేసారు. విధులు నిర్వహించే ప్రదేశాల్లో సాధారణ ప్రజల కోసం కూడా వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు చోట్ల ప్రయోగాత్మకంగా వీటిని పరీక్షించారు. సీఆర్పీఎఫ్ సూచనల మేరకు ఈ బైక్ అంబులెన్స్ను రక్షణ పరిశోధన సంస్థ తయారుచేసింది. -
కొండ కోనల్లోనూ ఆరోగ్య భాగ్యం
సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఫీడర్ (బైక్) అంబులెన్స్లు మరిన్ని రానున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ఇటీవల జరిపిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈమేరకు ఆదేశించారు. దీంతో ఈ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల ద్వారా వైద్యసేవలు మరింత అందుబాటులోకి తీసుకురానున్నారు. 108, 104లతో పాటు ఫీడర్ అంబులెన్స్ల సంఖ్య పెంచాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. దీంతో ఇప్పటి వరకు 15 ఉన్న బైక్ అంబులెన్స్లు రెట్టింపు కానున్నాయి. సీతంపేట, కొత్తూరు, పాలకొండ, వీరఘట్టం, పాతపట్నం, మందస పీహెచ్సీల పరిధిలో 108 అంబులెన్స్లు 6 ఉండగా వీటి అనుసంధానంగా ఫీడర్ అంబులెన్స్లు 15 ఉన్నాయి. ఎం.సింగుపురం, ఎంఎస్పల్లి, ఎస్జే పురం, భామిని, బుడంబోకాలనీ, అల్తి, సిరిపురం, బాలేరు, నేలబొంతు, పాలవలస, లబ్బ, కరజాడ, చిన్నబగ్గ, శంబాం, పెద్ద పొల్ల గ్రామాల్లో బైక్ అంబులెన్స్లు నడుస్తున్నాయి. వీటితోపాటుగా మరో 15 కొత్తవి కావాలని వైద్యాధికారులు ప్రతిపాదించారు. అలాగే మరో రెండు 108 వాహనాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇవి వస్తే మారుమూల గ్రామాలన్నింటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇదీ పరిస్థితి... ప్రస్తుతం ఉన్న బైక్ అంబులెన్స్లు గతేడాది డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు 6,072 మందికి వైద్యసేవలు అందించాయి. ఎపిడమిక్ సీజన్లో డయేరియా, మలేరియా కేసులు నమోదవుతుంటాయి. ఇంకా అనుకోని ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటాయి. గర్భిణులకు అత్యవసర వైద్య సేవలు అవసరం. ఈ తరుణంలో అపర సంజీవినిగా పేరుగాంచిన 108లు మారుమూల కొండలపై ఇరుకు రహదారులకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అత్యవసర సమయాల్లో రోగులను పీహెచ్సీలకు తరలించడానికి ఫీడర్ అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చాయి. కొండ ప్రాంతాల మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్లు వెళ్లలేని గ్రామాలకు వెళ్లి రోగులను నేరుగా ఆసుపత్రులకు గాని 108 అందుబాటులో ఉండే ప్రదేశానికి తీసుకువస్తాయి. గర్భిణులకు ఫీడర్ అంబులెన్స్లో సుఖ ప్రసవం అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్లు అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్లు ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పటికే 15 నిర్వహిస్తున్నాం. మరో 15 కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది. కొత్తవి వచ్చిన వెంటనే సేవలు ప్రారంభిస్తాం. బైక్ అంబులెన్స్లు సకాలం లో సంబంధిత పీహెచ్సీలు, సీహెచ్సీల్లో రోగులను చేర్చడానికి ఉపయోగకరంగా ఉంటాయి. –ఈఎన్వీ నరేష్కుమార్, డిప్యూటీ డీఎఅండ్హెచ్వో మాలాంటి మారుమూల గిరిజనులకు ఉపయోగం మాలాంటి మారుమూల గిరిజన గ్రామాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గర్భిణులకు పురిటి నొప్పులు వంటివి వచ్చినపుడు ఏదో ఒక అంబులెన్స్ రావాలని ఫోన్లు చేస్తుంటాం. వాటి రాక కోసం ఎదురు చూస్తుంటాం. వాటికి ముందే బైక్ అంబులెన్స్లు వస్తే సకాలంలో వైద్యం అందుతుంది. –ఎస్.రజిని, కోసిమానుగూడ -
డోలీలకు చెక్ పడేనా ..!
కురుపాం: రహదారి సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు బైక్ అంబులెన్స్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు గిరిజనుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా డోలీల ద్వారా మైదాన ప్రాంతాలకు వచ్చి వైద్యసేవలు పొందేవారు. ఇకపై అలాంటి కష్టాలు ఉండకూడదని ప్రభుత్వం యోచిస్తోంది. రహదారులున్న గ్రామాలకు 108 వాహనం ద్వారా సేవలందిస్తుండగా, వాహనం వెళ్లలేని గ్రామాలకు బైక్ అంబులెన్స్ ద్వారా సేవలందించాలని అధికారులు, పాలకులు నిర్ణయించారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం పరిధిలో బైక్ అంబులెన్స్ సేవలు అమలు చేయగా, సత్ఫలితాలు వచ్చాయి. జిల్లాలో కూడా ఇటువంటి సేవలు అందించాలని గిరిపుత్రులు కోరుతున్నారు. ఇక జిల్లా విషయానికొస్తే అధికారుల కృషి వల్ల ఏజెన్సీ ప్రాంతంలోని కొన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కలిగింది. అయినప్పటికీ కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ గిరిజన మండలాల్లో సుమారు 300 గిరిజన గూడలకు నేటికీ రహదారి సౌకర్యం లేదు. ఇటువంటి గ్రామాలకు బైక్ అంబులెన్స్ ద్వారా సేవలందిస్తే ఎన్నో అకాలమరణాలను నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనారోగ్యం సోకితే అంతే.. ఏజెన్సీలోని గిరిశిఖర గ్రామాల్లో ఎవరికి అనారోగ్యం సోకినా అంతే సంగతి. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులకు సకాలంలో వైద్యసేవలందక ఎంతోమంది మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. ఆయా గ్రామాలకు 108 వాహనం వెళ్లలేకపోవడంతో నలుగురు మనుషులు డోలీ కట్టి రోగిని అందులో కూర్చోబెట్టి మైదా న ప్రాంతంలోని ఆస్పత్రికి తీసుకువచ్చేవారు. సకాలంలో ఆస్పత్రికి రాకపోతే ఇక అంతే సంగతి. ఇటువంటి గ్రామాలకు బైక్ అంబు లెన్స్ సౌకర్యం కల్పిస్తే సుదూర ప్రాంతాల వారికి సకాలంలో వైద్యసేవలు అందుతాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పం దించి త్వరితగతిన ఏజెన్సీ ప్రాంతంలో బైక్ అంబులెన్స్ సేవలు అందించాలని అడవి బిడ్డలు కోరుతున్నారు. బైక్ అంబులెన్స్ సేవలు అందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. రహదారి లేని గ్రామాలకు అంబులెన్స్ సకాలంలో చేరుకుని వైద్యసేవలు అందిస్తుంది. – ఆరిక గయామి, తిత్తిరి ఎంపీటీసీ సభ్యురాలు -
రాష్ట్రంలో సరికొత్త 108 అంబులెన్స్ బైక్లు
-
బైక్ అంబులెన్స్
నగరాల్లో పెరుగుతున్న ట్రాఫికర్.. అంబులెన్స్లోని క్షతగాత్రుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. సకాలంలో అంబులెన్స్ రాక, వచ్చినా ఆస్పత్రికి చేరుకోలేక ఎందరో ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. బెంగళూర్లో టూ వీలర్ అంబులెన్స్ తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ బైక్ అంబులెన్స్లో ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు అత్యవసర పరిస్థితుల్లో అందించాల్సిన మందులు, ఆక్సిజన్ సిలిండర్ను కూడా అందుబాటులో ఉంచారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటుకుని.. నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి చేర్చాలంటే.. ఇంతకంటే బెటర్ ఆప్షన్ లేదంటున్నారు బెంగళూరువాసులు.