-
48 గంటలపాటు అంటిపెట్టుకొని ఉంది
సిమ్లా: ట్రెక్కింగ్లో భాగంగా పర్వతారోహణకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువతీయువకుల జాడను కనిపెట్టడంతో వారి పెంపుడు శునకం ఎంతగానో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు అది అక్కడే ఉండి అరుస్తూ సాయం కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసింది. హిమాచల్ ప్రదేశ్లోని బిర్ బిల్లింగ్లో ఈ ఘటన జరిగింది. పంజాబ్లోని పఠాన్కోట్కు చెందిన 30 ఏళ్ల అభినందన్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ప్రణీత వాలా సోమవారం బిర్ బిల్లింగ్ వద్ద ట్రెక్కింగ్కు బయల్దేరారు. ట్రెక్కింగ్ చేసి తిరుగుపయనంలో కిందకు దిగి వస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. అపస్మారకస్థితిలో గంటలకొద్దీ సమయం మంచులో కూరుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ వేళ వీరితోపాటు పెంపుడు శునకం వెంట వచి్చంది. వీరు పడిపోవడంతో గమనించి ఘటనాస్థలికి పరుగున వచ్చింది. 48 గంటలపాటు అక్కడే సాయం కోసం అరుస్తూ నిల్చుంది. గాలిస్తున్న సహాయక బృందాలు ఎట్టకేలకు వీరి జాడను గుర్తించాయి. ఆ ప్రాంతంలో జర్మన్ షెపర్డ్ జాతి శునకం ఒకటి ఆపకుండా అరుస్తుండటంతో అటుగా వెళ్లి వీరి జాడను కనిపెట్టగలిగామని సహాయక బృందం తెలిపింది. -
అమ్మో.. స్మృతీ ఇరానీ ఎంత డేర్ చేశారు!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇన్స్టాగ్రమ్లో చేరి కొద్ది రోజులే అవుతున్నా ఆమె ఫోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు మాత్రం తెగ క్రేజ్ను సంపాధించుకుంటున్నాయి. ప్రస్తుతం టెక్స్టైల్స్ విభాగ మంత్రిగా పనిచేస్తున్న ఆమె ఆ శాఖకు సంబంధించిన అంశాలకంటే తన వ్యక్తిగత అంశాలు ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అంశాలే పంచుకుంటున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆమె పంచుకున్నవి ఒక ఎత్తయితే, తాజాగా పంచుకున్న వీడియో మరొక ఎత్తు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మృతి ఇరానీ నిజంగా ఎంత డేరింగ్ మహిళ అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆమె హిమాచల్ ప్రదేశ్లోని బిర్ బిల్లింగ్ ప్రాంతంలో పారాగ్లిడింగ్కు వెళ్లారు. వందల ఎత్తులో ఎగురుతూ సరదాగా గడిపారు. పారాగ్లిడింగ్కు వెళ్లే వారిలో సాధారణంగా కాస్తంత భయం, బెరుగు కంగారు కనిపిస్తుంది. కానీ, ఆమె మాత్రం చాలా ఉల్లాసంగా ఈ వీడియోలో కనిపించారు. అయితే, ఈ వీడియో చూసిన కొందరు వేరే విధంగా కూడా కామెంట్లు చేశారు. #tbt Take off from the paragliding capital of India Bir Billing... And then there might be some who wud be wondering "Did she have to land!!!!"
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ప్లాస్టిక్ బాటిల్స్తో టీ షర్ట్స్..ఏకంగా రూ. 80 కోట్ల టర్నోవర్..!
రూ.12 కోట్ల వంతెన..ప్రారంభానికి ముందే ఫసక్..వీడియో వైరల్
క్యాన్సర్తో భార్య మృతి.. నిమిషాల్లో ఐపీఎస్ భర్త సూసైడ్
T20 World Cup 2024: ఆ మూడు టీమ్లు ఒకవైపు.. పూరన్ ఒక్కడు ఒకవైపు..!
రాజమౌళి సినిమాను త్రిష తిరస్కరించిందా.. కారణం ఆ హీరోనేనా..?
‘నింద’ స్క్రీన్ప్లే కొత్తగా ఉంటుంది: వరుణ్ సందేశ్
నిరాశపరచనున్న నైరుతి రుతు పవనాలు.. సాధారణ వర్షపాతం
నా కుటుంబం జోలికి వస్తే ఇలాగే చేస్తా: పాక్ స్పీడ్స్టర్
రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల
రేపు పులివెందులకు వైఎస్ జగన్
Advertisement