black glasess
-
నల్ల కళ్లజోడు నాటకాలు
-
కరుణానిధి కళ్లజోడు కథ ఇదీ!
సాక్షి, చెన్నై: కంటికి తగిలిన గాయంతో 66 ఏళ్లపాటు కరుణానిధి కళ్లజోడును ధరించాల్సి వచ్చింది. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో 1952లో తిరుప్పత్తూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో కరుణానిధి కంటికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా, గాయాన్ని లెక్కచేయకుండా దాల్మియాపురం పేరును కళ్లకుడిగా మార్చాలని నినదిస్తూ సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆరు నెలలు కారాగార జీవితాన్ని అనుభవించారు. ఈ పరిణామాలతో కంటికి తగిలిన గాయం మరింత తీవ్రమైంది. వైద్యులు చికిత్స చేయగా.. అప్పటి నుంచి కళ్లజోడు ధరిస్తూ వచ్చారు. 66 ఏళ్లపాటు కరుణానిధి నల్ల కళ్లజోడు ధరించారు. తొలినాళ్లలో సాధారణ కళ్లజోడు ఉపయోగించినా, తర్వాత విదేశాల నుంచి దిగుమతి చేసిన కళ్లజోడు ఉపయోగించారు. 2010 నుంచి కుర్చీకే పరిమితం 2010లో కరుణకు ఆరోగ్య సమస్యలు తలెత్తి కొంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. తర్వాత నడక కష్టతరంగా మారింది. దీంతో అప్పటినుంచి ఆయన వీల్చైర్కు పరిమితం అయ్యారు. విదేశాల నుంచి కరుణ కోసం ప్రత్యేక సదుపాయంతో కూడిన వీల్చైర్ను దిగుమతి చేశారు. ఈ వీల్చైర్లోనే ఆయన ప్రజల్లోకి వచ్చేవారు. -
సన్ గ్లాసెస్ కష్టాలు..
-
నల్లకళ్లద్దాలు పెట్టుకున్నందుకు నోటీసులు
రాయ్పూర్: నీలి రంగు చొక్కా.. నలుపు రంగు ప్యాంటు.. నల్ల కళ్లజోడు ధరించి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి షేక్ హ్యాండ్ ఇస్తోన్న ఆ వ్యక్తి.. బస్తర్ జిల్లా కలెక్టర్. పేరు అమిత్ కటారియా. చూడటానికి ఠీవిగా అనిపించినా.. ఆయన అలా కళ్లజోడుతో పీఎంను కలుసుకోవడం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. అసలు నల్ల కళ్లజోడు ధరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలంటూ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు కలెక్టర్ అమిత్ కటారియా. ఇంతకీ విషయం ఏమంటే.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వీవీఐపీలను కలిసినప్పుడు సివిల్ సర్వీసు అధిరాలు ఎవరైనాసరే నల్ల కళ్లజోడు ధరించరాదన్నది ప్రోటోకాల్ నియమం. ఆ నియమాన్ని ఉల్లంఘించినందుకే సదరు అధికారికి నోటీసులు. గత శనివారం ఛత్తీస్గఢ్లో పర్యటించిన ప్రధాని మోదీ.. నక్సల్స్ ప్రభావిత బస్తర్ జిల్లాలో భారీ బహిరంగసభలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా 24 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.