breaking news
Chandrababu Naidu government
-
‘అమ్మఒడి’ దొంగలు!
మొన్నటి నిజం..‘‘అమ్మ ఒడి పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశాం.’’ – ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తూ చంద్రబాబు చెప్పిన మాటనేటి అబద్ధం..‘తల్లికి వందనం’ పథకం లోకేశ్ ఆలోచనే..!! – కొత్తచెరువు జెడ్పీ స్కూల్లో చంద్రబాబుసాక్షి, అమరావతి: పిల్లల ఎదుటే పచ్చి అబద్ధాలు..! ఓ రాష్ట్రానికి పెద్దరికం వహించే బాధ్యతలో ఉన్నాననే స్పృహలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు.. బడాయిలు!! రాష్ట్రంలో ఇప్పటిదాకా అసలు ‘‘అమ్మ ఒడి’’ లేనే లేదు..! ఈ పథకాన్ని తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవటాన్ని చూసి యావత్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి నివ్వెరపోతోంది. ఇంత దివాళాకోరుతనమా? అబద్ధం అనే పదానికి డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు.. బాబు పేరు చెబితే చాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా.. ఏకంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాడు – నేడుతో తీర్చిదిద్దిన పాఠశాలలోనే కూర్చుని.. గత ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్ తరగతి సాక్షిగా చంద్రబాబు అబద్ధాలాడటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘పీటీఎం’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ‘అమ్మ ఒడి’ రూపశిల్పి తన తనయుడు నారా లోకేశ్నని కళ్లార్పకుండా బుకాయించారు. అయితే లోకేశ్ కూర్చున్న టేబుల్ మొదలుకుని చంద్రబాబు ఏ పుస్తకంలో చూసి పిల్లలకు పాఠాలు చెప్పారో... ఆ బైలింగ్యువల్ టెక్ట్స్బుక్స్ను కూడా తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని గుర్తు చేస్తున్నారు. మొన్న విశాఖలో యోగా పేరుతో డ్రామా నడపగా తాజాగా పీటీఎం.. గిన్నిస్ రికార్డులు అంటూ నాటకాన్ని రక్తి కట్టించారని వ్యాఖ్యానిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ చంద్రబాబు ఊహకు కూడా తట్టని విప్లవాత్మక సంస్కరణలను వైఎస్ జగన్ విద్యారంగంలో తెచ్చారని పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్, పిల్లలకు ట్యాబ్లు, డిజిటల్ తరగతులు, పౌష్టికాహారంతో నాణ్యమైన గోరుముద్ద లాంటివన్నీ గత ప్రభుత్వం కృషి వల్లే ప్రభుత్వ విద్యా రంగంలో సాకారమయ్యాయని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు చేసిందల్లా.. స్కూళ్లను మూసివేయడం.. బొద్దింకల భోజనం.. ఇంగ్లీషు మీడియం ఎత్తివేత.. సీబీఎస్ఈ, ఐబీ రద్దు.. నాడు – నేడు నిలిపివేతతోపాటు టెన్త్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించకలేకపోవడం.. మూల్యాకనంలో తప్పిదాలు దొర్లటం.. ప్రభుత్వ స్కూళ్లకు ఏడాదిలో ఏకంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు దూరం చేయడం అని విద్యావేత్తలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రపంచంలో అబద్ధానికి బాబే బ్రాండ్ అంబాసిడర్ అనేందుకు ఇదో మరో తార్కాణమని పేర్కొంటున్నారు. నాడు ‘అమ్మ ఒడి’ మార్గదర్శకాల ప్రకారమేనన్న బాబు శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘పీటీఎం’ కార్యక్రమానికి తన తనయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్తో కలసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ‘‘తల్లికి వందనం’’ పథకం మంత్రి నారా లోకేశ్ ఆలోచనల నుంచే పుట్టిందని చెప్పడంతో పిల్లలతోపాటు తల్లితండ్రులు, ఉపాధ్యాయులు నిర్ఘాంతపోయారు. ఇదే చంద్రబాబు ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తూ.. ‘అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పడాన్ని వారంతా గుర్తు చేసుకున్నారు. తల్లికి వందనం.. అమ్మ ఒడి పథకాలు రెండూ ఒకటేనని వల్లె వేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. పేదరికం వల్ల పిల్లలను బడికి పంపకుండా పనులకు పంపుతున్నారని, ఆ పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక రీతిలో ‘అమ్మ ఒడి’ పథకానికి రూపకల్పన చేయడం అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ ఆ పథకాన్ని నవరత్నాల్లో చేర్చి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారు. నోరు తెరిస్తే చాలు.. తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని బడాయి చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ అమ్మ ఒడి లాంటి విప్లవాత్మక పథకాన్ని అమలు చేయాలనే కనీస ఆలోచన కూడా చేయలేదని విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. సదుపాయాలన్నీ జగన్ సర్కారు సమకూర్చినవే..వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నాడు–నేడు పథకం కింద వైఎస్ జగన్ అభివృద్ధి చేశారు. కొత్తచెరువు జెడ్పీ పాఠశాలనూ అదే రీతిలో తీర్చిదిద్దారు. స్వయంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలసి కూర్చున్న కుర్చీలు, డబుల్ డెస్క్ బెంచీలు వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చినవే. అది బహిర్గతమవుతుందనే భయంతో నాడు–నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయ చేశారు. అసలు ఆ పాఠశాలలో అమర్చిన ఫ్యాన్లు, లైట్లు, అధునాతన ఐఎఫ్పీలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవే కావడం గమనార్హం. వైఎస్ జగన్ హయాంలో కొత్తచెరువు జెడ్పీ స్కూల్కు సమకూర్చిన కుర్చీలపై కూర్చొని.. గత ప్రభుత్వం అందచేసిన అధునాతన ఐఎఫ్పీ స్క్రీన్ ముందు నిలబడి.. తల్లికి వందనం పథకం లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పడంతో విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. సీఎం చంద్రబాబు ఇలా అబద్ధాలాడటం ఇదే మొదలు కాదు.. చివర కాదు అంటూ నెట్టింట, సోషల్ మీడియాలో చలోక్తులు విసురుతున్న పోస్టులు వైరల్ అయ్యాయి. హైదరాబాద్ను తానే నిరి్మంచానని.. సెల్ఫోన్, కంప్యూటర్ కనిపెట్టిందీ తానేనని తరచూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవటాన్ని ప్రస్తావిస్తున్నారు.విద్యా విప్లవాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్రాష్ట్రంలో విప్లవాత్మక సంస్కరణలతో విద్యా విప్లవాన్ని 2019లో నాటి సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసే పనులకు నడుం బిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రారంభించారు. సీబీఎస్ఈ సిలబస్ నుంచి ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణాన్ని ఆరంభించారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానాన్ని అమలు చేసి బోధన, విద్యా ప్రమాణాలను సమున్నత స్థాయికి చేర్చారు. టోఫెల్ శిక్షణతో విద్యార్థులను ఆంగ్ల భాషా నైపుణ్యాలతో తీర్చిదిద్దారు. ప్రతి తరగతి గదికి ఐఎఫ్పీ స్క్రీన్లు, అధునాతన టీవీలు అందించి.. డిజిటల్ బోధనను చేరువ చేశారు. బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలు సమకూర్చారు. విద్యార్థులకు మూడు జతల నాణ్యమైన యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, టై, బెల్ట్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలతోపాటు బ్యాగ్ను స్కూలు ప్రారంభించిన మొదటి రోజే జగనన్న విద్యా కానుకగా అందించి తల్లితండ్రులకు చదువుల భారం లేకుండా చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ ఐరాస వరకు వినిపించేలా వెన్నుతట్టి పిల్లలను ప్రోత్సహించారు. వైఎస్ జగన్ ఆవిష్కరించిన విద్యా సంస్కరణలను చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా అడ్డుకుని అంధకారంలోకి నెట్టేసిందని ఉపాధ్యాయవర్గాలే బాహాటంగా విమర్శిస్తుండటం గమనార్హం. ఈ విద్యా ప్రగతి మీది కాదు..కూటమి పాలనలో ఈవెంట్ ఆర్గనైజర్లుగా ఉపాధ్యాయులుమెగా పీటీఎంపై సోషల్ మీడియాలో విమర్శలు కూటమి పాలనలో ఉపాధ్యాయులు ఈవెంట్ ఆర్గనైజర్లుగా మారిపోయారని టీచర్లు వాపోతున్నారు. విద్యార్థులకు చదువు చెప్పడం కంటే ఈవెంట్ల నిర్వహణలోనే గడుపుతున్నట్టు వాట్సాప్ గ్రూపుల్లో గురువారం మెసేజ్లు చక్కర్లు కొట్టాయి. ఏడాది పాలనలో విద్యకు సంబంధించి ఒక్క మంచి పని చేయకుండా గొప్పలు చెప్పుకోవడం వీరికే చెల్లించదని, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అభివృద్ధి చేసిన పాఠశాలలోనే ఇప్పుడు సీఎం చంద్రబాబు, లోకేశ్ కూర్చుని వేడుకలు చేసుకున్నారని సెటైర్లు వేశారు. ‘సీఎం గారూ.. మీరు కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కాదు. మీకు ఎదురుగా ఉన్న ఐఎఫ్పీ ప్యానల్ మీరు ఇచ్చినది కాదు. తరగతి గదిలో ఉన్న ఫ్యాన్లు, లైట్లు మీరు అమర్చినవి కావు. ఆ గ్రీన్ చాక్ బోర్డ్స్ కూడా మీరు ఇచ్చినవి అంతకంటే కాదు. దయచేసి మీ మిగిలిన నాలుగేళ్లలో ఇకనైనా మా పాఠశాలలకు మంచి చేయండి. రికార్డుల కోసం ఇలాంటి ఆర్భాటపు పనికిమాలిన కార్యక్రమాలతో పిల్లలు, టీచర్ల కాలాన్ని వృధా చేయొద్దు. ఉపాధ్యాయులను ఈవెంట్ ఆర్గనైజర్లుగా మార్చేశారు. 16 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు స్కూళ్లకు చేసిందేమిటో సెలవిస్తారా?’ అంటూ నిలదీశారు. మీ ‘పేరెంట్ టీచర్ మీటింగ్’ ఆదేశాలకు జడిసి బోధన, అడ్మిషన్లను పక్కనపెట్టాం. ఫలితంగా ఏ స్వీట్ షాప్లో, బుక్ షాప్లో, ఫ్లెక్సీ షాప్లో చూసినా అయ్యవార్లే.. తుదకు మామిడాకుల కోసం, రంగు కాగితాలు, బ్యానర్లు, అట్టముక్కలు చింపడం, అతికించడం, అధికారుల బాగోగులు చూడటం వల్ల మా జేబుకు చిల్లు పడింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
కూటమి సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ భీమిలి YSRCP సమన్వయకర్త
-
ఒక కేసు పెడితే మూడు కేసులు పెడతాం.. టీడీపీకి దిమ్మతిరిగే వార్నింగ్
-
కొవ్వూరు నియోజకవర్గ కూటమి పార్టీల్లో చీలిక
-
ప్రభుత్వ తీరుపై రైతుల్లో ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసింది: వైఎస్ జగన్
-
వివేచన అవసరమైన కాలమిది!
రాష్ట్ర విభజన జరిగిన గత పదేళ్ళలో రెండు ప్రధాన పార్టీల చెరొక ఐదేళ్ల పాలన తర్వాత, మళ్ళీ బాబు పాలన అంటే, జగన్ సెట్ చేసి వెళ్ళిన వృత్తం పైన బాబు తన చతు రస్రం అయినా ఉంచాలి, లేదు జగన్ చతురస్రం మీద బాబు తన వృత్తం అయినా ఉంచాలి. కానీ ఇద్దరివీ కలవని మార్గాలు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అందుకే ఈ సారూప్యతను ఎన్నిసార్లు ఎటు తిప్పి చూసినా వాటి అంచులు బయటకు ఉంటున్నాయి. నిజానికి ఈ ఇద్దరివీ రెండు వేర్వేరు ‘పబ్లిక్ పాలసీలు’. పదేళ్లనాడు బాబు తనకు తాను పనిమాలా తెచ్చిపెట్టుకున్న సంకటం – ‘అమరావతి’ వీటికి అదనం. వైఎస్సార్సీపీ అనే ఒక యువ రాజకీయ పార్టీ వచ్చి, అది తన తొలి ఐదేళ్ల పాలనలో వేసిన ‘రన్ వే’ మీద టీడీపీ విమానం ‘టేకాఫ్’ అంటే, అందుకు బాబు నలభై ఏళ్ల అను భవం చాలడం లేదు. జగన్ ఇంజినీరింగ్ మారడంతో భవన నిర్మాణం కూడా మారింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు 1991లో మొదలైతే, ఆ తర్వాత మూడేళ్లకే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. తిరిగి 2004లో వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి ‘సంస్కరణల కాలం’ సాగుబడి సమస్యల పరిశీలన బాధ్యతలను తాను మీద వేసుకోకుండా దాన్ని జేఎన్యూ ఎకనా మిక్స్ ప్రొఫెసర్ డా‘‘ జయతీ ఘోష్కు అప్పగించారు. ఆమె ఇచ్చిన ‘రిపోర్ట్’ను ప్రభుత్వ వ్యవసాయ విధా నంగా అమలు చేశారు. దాపరికం లేదు. నిపుణుల నైపుణ్యం వాడుకోవలసిన విధానమది. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక మేధోమథనం ఇంకా చాలా పెద్ద స్థాయిలో జరగాల్సింది. ఖైరతాబాద్ గవర్నర్ బంగళా పక్కనున్న ప్రతిష్టాత్మక పరిశోధన శిక్షణా సంస్థ ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ’ (ఆస్కీ) వంటి సంస్థను ఏపీ ప్రభుత్వానికి ఒక ‘రోడ్ మ్యాప్’ ఇవ్వ మని అడిగి ఉండాల్సింది. అది 46 దేశాలకు చెందిన వందకు పైగా సంస్థలకు సేవలు అందిస్తున్న సంగతి గమనార్హం. దాని సహాయం తీసుకోలేదు. మొదటి ఐదేళ్లు అలా గడిస్తే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘నీతి ఆయోగ్ ‘ పర్యవేక్షణలో 2030 లక్ష్యంగా ‘యూఎన్డీపీ’ జారీ చేసిన– ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ ప్రాతిపదికన తన ‘పబ్లిక్ పాలసీ’ని రూపొందించుకుని; ‘కోవిడ్’ కాలంలో కూడా దాన్ని అమలు చేసింది. వివరం తెలియనివారు దాన్ని ‘సంక్షేమం’ అన్నారు. కొత్త రాష్ట్రంలో పరిపాలన ‘చివరి మైలు’కు చేరడానికి అవసరమైన గ్రామ సచివాలయ వ్యవస్థ ఆ కాలంలో ఏర్పాటు అయింది. ఇలా జరిగిన ప్రతిదీ ఒక ప్రభుత్వ చట్రం పరిధిలో జరగడం వల్ల, ప్రభుత్వం మారి ఏడాది గడిచినా గత ప్రభుత్వాన్ని ఇప్పటికీ ‘ఫైల్స్’లో తప్పు పట్టలేదు. పార్టీలు వేరైనా రాజ్యాంగం ఒక్కటే అయినప్పుడు, స్థూలంగా దాని పరిధిలో పనిచేయడం అనేది మౌలిక సూత్రం.ఈ ఇరువురి భిన్న వైఖరులు నేర్పుతున్న పాఠాలు ఏమిటో ఇప్పుడు గ్రహించవలసి ఉంది. టీడీపీ 2024 ఎన్నికల వరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో – ‘విధ్వంసం’ జరిగిందని అనేది. కానీ అది ఎక్కడ జరిగిందో తెలియదు. విధ్వంసాన్ని ఈ ఏడాది కాలంలో ఇది అని విడమర్చి ప్రజలకు చెప్పాలి కదా? వారంటున్న ‘విధ్వంసం’ వికేంద్రీకరణ అయ్యుండాలి. ఎందుకంటే బాబు అమరావతి కేంద్రంగా నేల తవ్వి పునాదులు వేస్తే, జగన్ గ్రామపాలనకు రాష్ట్ర మంతా పటిష్ఠమైన పునాదులు వేశారు. అందువల్ల అధికారిక అంచెలు (హైరార్కీ) తగ్గాయి. ‘ఆన్ లైన్’ సౌలభ్యంతో కొన్ని ప్రజా సమస్యలు గ్రామ సచివా లయాల్లోనే పరిష్కారం అయ్యాయి. ప్రజాప్రతినిధుల వరకు అవి రాలేదు. అన్ని పార్టీల నాయకులు ఈ కొత్త నొప్పిని మౌనంగా భరించారు. కానీ, ప్రభుత్వం మారాక జరిగింది ఏమిటి? బాబు తన ప్రభుత్వంలో దీన్ని మార్చలేదు సరికదా విస్తరించారు. అందుకు ఈ ఏడాది జూన్ 12న కూటమి ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ జారీ చేసిన ‘జీవో’ 57ని చూడాల్సి ఉంటుంది. ఇది వైసీపీ ప్రభుత్వంలో వెలువడిన జీవో 08. తేదీ: 1.11.’23కి కొనసాగింపు. అందులో అప్పట్లో గత ప్రభుత్వం 77 ‘డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్’ పోస్టులు కొత్తగా మంజూరు చేసింది. అయితే గత నెలలో ఆ 77 మంది అధికారుల పరిధిలోకి గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చి, వీరు డివిజన్ స్థాయిలో జరిగే పంచాతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి పనులు పర్యవేక్షించేలా విస్తృతమైన ‘జాబ్ చార్ట్’తో ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రంగా ఆ యా కార్యాలయాల పోస్టల్ అడ్రెస్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రమంతా గ్రామ, వార్డు సచివాలయాలతో నిర్మించిన పరిపాలనా పరమైన పునాదులకు ఉన్న విశ్వసనీయత వల్ల, ఇప్పుడు వాటి పైన కొత్తగా కట్టే అదనపు భవంతులకు భద్రత హామీ దొరికింది. పాత జిల్లాలు చిన్నవై పర్యవేక్షణ పెరిగింది. పంచాయతీరాజ్ స్థానిక పరిపాలనా వ్యవస్థలతో వైసీపీ తెచ్చిన సచివాలయ వ్యవస్థ ‘ఇంటిగ్రేట్’ అయ్యి రెండింటి మధ్య ఒక ‘ఆర్గానిక్ లింకు’ ఏర్పడింది. పార్టీలు ఏవైనా ‘పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్’ తీసుకునే విధానపర నిర్ణయాలు ప్రభుత్వ పరిపాలన చట్టపరిధిలో ఉన్నప్పుడు, అది ఎవరి ప్రభుత్వం అనే దానితో పని లేకుండా మొక్కకు అంటు కట్టినట్టుగా రెండూ ఒక్కటిగా ఎదుగుతూ విస్తరిస్తుంది. జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ పర్యటన.. వివాదాస్పదంగా పోలీసుల తీరు
సాక్షి,చిత్తూరు : వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వైఎస్ జగన్ పర్యటనలో సెక్యూరిటీని వదిలేసి కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు ఉన్నతధికారులు పనిచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్యార్డును సందర్శించారు. మామిడి రైతుల్ని పరామర్శించారు. వారికి తానున్నాననే భరోసా కల్పించారు. అయితే,ఈ పర్యటనలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపించాయి. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న జగన్కు భద్రత కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. వైఎస్ జగన్ పర్యటనను ముగ్గురు ఎస్పీలు, రేంజి ఐజీ ఆసాంతం ఫాలో అయ్యారు. కానీ జగన్ మామిడి యార్డులోకి వెళ్లేసరికి పోలీసులు సెక్యూరిటీ కనుచూపుమేరలో కనిపించలేదు. జగన్ రైతులను కలిసేందుకు వెళ్తుంటే అడుగు ముందుకు పడడం కష్టమైంది.అదే సమయంలో వైఎస్ జగన్ పర్యటనకు జనాన్ని రానీయకుండా చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఓ సీఐ కార్యకర్త తల పగులకొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. పరామర్శించేందుకు వెళ్లబోయిన మాజీ సీఎంను కారు దిగనీయకుండా ఎస్పీ మణికంఠ అడ్డుపడ్డారు. ఆ తర్వాత కూడా జనాన్ని రానీయకుండా పోలీసులు కుట్ర చేయడం అందుకు ఉదాహరణగా నిలుస్తోంది -
జగనన్న కోసం బారికేడ్లు బద్దలు కొట్టుకొని వచ్చాం
-
మాకు అన్యాయం చేశారు.. కూటమిపై మహిళా పోలీసులు ఫైర్
-
బాబు సొంత జిల్లాలో జై జగన్ నినాదాలతో..
-
గుండె ‘కాయ’కు గాయం!
చిత్తూరు అర్బన్: మామిడి పంట చిత్తూరు జిల్లాకు గుండెకాయ లాంటిది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు మామిడికి అనుకూలం కావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 56 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఈదఫా 39,895 హెక్టార్లలో ఐదు లక్షల టన్నులకుపైగా తోతాపురి దిగుబడి వచ్చినట్లు అంచనా. విస్తారంగా కాసినా రైతన్నల ఆశలు ఎన్నో రోజులు నిలవలేదు. ఏ ఒక్క ఫ్యాక్టరీ కిలోకి రూ.12 మద్దతు ధర చెల్లించలేదు. ప్రభుత్వం నుంచి రూ.4 ప్రోత్సాహకమూ దక్కలేదు. ర్యాంపుల వద్ద రూ.2–3 మాత్రమే పలుకుతున్నాయి.చిత్తూరు, గుడిపాల, తవణంపల్లె, పూతలపట్టు ప్రాంతాల్లో గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రైతులు రాత్రింబవళ్లు మామిడి కాయల లోడ్లతో నిరీక్షిస్తున్నారు. గుడిపాల నుంచి తమిళనాడు సరిహద్దు వరకు కాయల లోడ్ ట్రాక్టర్లు రోజుల తరబడి నిలిచిపోయాయి. దిక్కుతోచని రైతన్నలు రోడ్లపై పారబోస్తున్నారు.. ఉచితంగా పంచి పెడుతున్నారు... కూలీ, రవాణా ఖర్చులూ రాకపోవడంతో చెట్లకే కాయలను వదిలేస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో కడుపు రగిలిపోయిన పలువురు రైతులు మామిడి చెట్లను పూర్తిగా తొలగించేశారు. రైతులపై కేసులు, జరిమానాలు.. రైతన్నలు కన్నెర్ర చేయడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు సర్కారు కుయుక్తులు పన్నుతోంది. చెట్లు కొట్టేస్తున్న రైతులపై వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ఆరుగురు రైతులపై కేసులు నమోదయ్యాయి. వైఎస్ జగన్ హయాంలో తోతాపురి కిలో రూ.23–25 సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2023–24లో తోతాపురి మామిడి కిలో రూ.23–25 వరకు పలికింది. కిలో రూ.15–20కి మించి ఎప్పుడూ తగ్గలేదు. గత ప్రభుత్వం పంట మార్కెట్కు వచ్చే ముందే కార్యాచరణ సిద్ధం చేసి కలెక్టర్ల నేతృత్వంలో గుజ్జు పరిశ్రమల యాజమాన్యం, రైతులు, ఉద్యాన, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులతో కమిటీలు నియమించింది. గుజ్జు పరిశ్రమలతో సమీప తోటలను అనుసంధానం చేశారు. మార్కెట్లో డిమాండ్కు తగినట్టుగా దశల వారీగా కోతలు చేపట్టేలా అవగాహన కల్పించేవారు.దీంతో ఇతర మామిడి రకాలు సైతం 2019–24 మధ్య టన్ను రూ.50 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు పలికాయి. గత ప్రభుత్వంలో 10 లక్షల టన్నుల మామిడి గుజ్జుతో పాటు దాదాపు 2,500 టన్నుల మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేశారు. మామిడి రైతుల కోసం రూ.35 కోట్లతో ప్రత్యేకంగా 1,752 ప్యాక్ హౌస్లు, రూ.40 కోట్లతో 347 కలెక్షన్ సెంటర్లు నిర్మించారు. మరో రూ.22.50 కోట్లతో 200 కలెక్షన్ సెంటర్లు, రూ.10.50 కోట్లతో 525 ప్యాక్ హౌస్లు నిర్మాణం చేపట్టగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యలోనే నిలిపివేసింది.గత ప్రభుత్వ హయాంలో నాణ్యమైన పండ్ల దిగుబడుల కోసం రాయితీతో ఫ్రూట్ కవర్లు అందించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మామిడి రైతులు 21 వేల ఎకరాల్లో కొత్తగా తోటలను విస్తరించగా, మరో 20,585 ఎకరాల్లో తోటలను పునరుద్ధరించగలిగారు. కరోనా విపత్తులోనూ మామిడితో పాటు ఇతర పండ్ల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కేలా గత సర్కారు చర్యలు తీసుకుంది.కిలో రూ.2.50.. చిత్రంలో కనిపిస్తున్న రైతు దామోదర్రెడ్డికి చిత్తూరు పరిధిలోని మాపాక్షి గ్రామంలో ఎనిమిది ఎకరాల మామిడిì తోట ఉంది. ఈసారి వంద టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. ఇప్పటివరకు 60 శాతం పంట మాత్రమే అమ్ముడైంది. ర్యాంపు వద్ద కిలో రూ.2.50 చొప్పున అమ్మేశాడు. భారీగా నష్టం రావడంతో మామిడి చెట్లను కొట్టేసి కొబ్బరి సాగు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు.ఒక్క కాయ కోస్తే ఒట్టు.. ఈ చిత్రంలో ఉన్న మహిళ కృష్ణవేణి సొంతూరు యాదమరి మండలం మార్లబండ. మూడెకరాల తోతాపురి మామిడి తోట ఉన్నా కూలి ఖర్చులు కూడా రాకపోవడంతో ఒక్క కాయ కూడా కోయకుండా వదిలేసింది. కాయలన్నీ రంగు మారి రాలిపోయే దశలో ఉన్నాయి. ర్యాంపుల్లో అడిగితే రూ.2 అంటున్నారని.. అది కూడా డబ్బులు ఇప్పుడు ఇవ్వలేమని చెబుతున్నారని కంటతడి పెడుతోంది.చెట్లపైనే కుళ్లిపోతున్నాయి ఐరాల మండలం కామినాయన పల్లెకి చెందిన సుధాకర్నాయుడు 25 ఏళ్లుగా మామిడి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ధర లేకపోవడంతో కోత కోయకుండా అలాగే వదిలేశారు. దీంతో కాయలు చెట్లపైనే కుళ్లిపోయి రాలిపోతున్నాయి.మానసికంగా కుంగిపోయి.. ఈ ఏడాది ఎక్కువ దిగుబడి రావడంతో సంతోషించా. కానీ పంటను కొనేవారు లేక కాయలు మాగి రాలిపోయాయి. ఫ్యాక్టరీల చుట్టూ తిరిగినా ఒక్క టోకెను సాధించలేకపోయా. ర్యాంపు దగ్గర ధరలు కూలీలకు, బాడుగలకు కూడా సరిపోదు. మానసికంగా కుంగిపోయి 45 ఏళ్ల వయస్సున్న 50 చెట్లను నరికేశా. – రమేష్, సరకల్లు గ్రామం.. తవణంపల్లె మండలం కోత ఖర్చులూ కరువు.. నాలుగు రోజులుగా రేయింబవళ్లు ఫ్యాక్టరీ ఎదుట పడికాపులు కాస్తున్నాం. దోమలు కుట్టి చేతులు కాళ్లు వాచిపోతున్నాయి. మాకు ఏడెకరాల మామిడి తోట ఉంది. ఈ ఏడాది నాలుగు లోడ్లు పంట వచ్చింది. ఫ్యాక్టరీ వద్ద రోడ్ల మీదే సగం కుళ్లిపోతోంది. కోత ఖర్చులు కూడా రావడంలేదు. – హేమంత్, గొల్లపల్లి గ్రామం,చిత్తూరు రూరల్ మండలం ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా? ఐదు రోజులుగా జైన్ కర్మాగారం ఎదుట కష్టాలు పడుతున్నాం. కలెక్టర్ ఆదేశించినా ఎవరూ పట్టించుకోవడంలేదు. మంచినీళ్లు కూడా లేక అవస్థలు పడుతున్నాం. అందరికీ సరిపడా భోజన ఏర్పాట్లు లేవు. రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? – ముని రాజారెడ్డి, వేపంజేరి గ్రామం తమిళనాడు బార్డర్ దాటి క్యూ ఉండాది.. కాయలు తోలుకొచ్చా. నేనొచ్చి రెండ్రోజులు అవుతా ఉండాది. ఇంటికి వెళ్లకపోయేసరికి నా భార్య ఏడుుస్తా ఉండాది. తమిళనాడు బార్డర్ దాటి క్యూ ఉండాది. కాయలు దిగేకి రెండ్రోజులు పట్టేటట్టు ఉండాది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – సుబ్రమణ్యం, పలమనేరు, చిత్తూరు జిల్లా కాయలు కొన్న వ్యాపారి రావట్లేదు.. కాపు వచ్చినప్పుడే తోటను ఓ వ్యాపారికి అమ్మేశా. రూ.20 వేలు అడ్వాన్స్ ఇచ్చారు. కలర్ కాయలు (టేబుల్ రకాలు) మాత్రమే కోశారు. తోతాపురి కోయలేదు. ఫోన్ చేస్తుంటే అదిగో.. ఇదిగో అంటున్నారు. – చంద్రన్, పచ్చనపల్లి గ్రామం, చిత్తూరు మండలం ఈ కష్టాలు ఎప్పుడూ చూడలేదు... నాకు మూడెకరాల మామిడితోట ఉంది. ఇప్పటివరకు రెండు లోడుల కాయలు అన్లోడింగ్ చేయించా. ఇంకా మూడు నాలుగు లోడ్ల కాయలున్నాయి. రేటు ఎంతో చెప్పడం లేదు. ఈ కష్టాలు ఎప్పుడూ చూడలేదు. – గోవిందస్వామి, చిత్తపార, గుడిపాల మండలంరేటు కూడా తెలియకుండా.. పదేళ్ల క్రితం ఏడెకరాల్లో 350 మామిడి మొక్కలు పెట్టా. నీళ్ల ట్యాంకులు, మందులకు రూ.80 వేల వరకు ఖర్చైనాది. ఫ్యాక్టరీ వద్దకు వెళితే టోకెన్లు దొరకలేదు. పది టన్నులు చెట్లపైనే వదిలేశా. 20 టన్నులు ఫ్యాక్టరీకు ఇచ్చేదానికి రెండు రోజులుగా ఇక్కడే ఉన్నా. పండిన పంటను రేటు తెలియకుండానే అమ్ముకుంటున్నది ఒక్క మామిడి రైతే అనుకుంటా..! – కె.మదన్మోహన్ నాయుడు, పెరుమాళ్ల కండ్రిగ, చిత్తూరు మండలం -
Andhra Pradesh: సర్కారు బడికి బైబై!
వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 8 మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎన్రోల్మెంట్ ఎలాగైనా పెంచాలని టీచర్లపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండల కేంద్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 80 మంది విద్యార్థులుండగా దాన్ని ఎంపీఎస్గా మార్చారు. బడులు తెరవగానే విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడంతో అక్కడ ఎన్రోల్ 43కి పడిపోయింది. ఇదే గ్రామంలోని మరో ప్రభుత్వ స్కూల్లో కూడా ఎన్రోల్మెంట్ 60 నుంచి 33కి తగ్గిపోయింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారిపోయింది! ఒక్క ఏడాదిలో ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. మరోపక్క ఉన్న విద్యార్థులు సైతం టీసీలు తీసుకుని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సర్కారు బడులకు ఈ గడ్డు పరిస్థితులు ఎదురు కావడం గమనార్హం. 2024లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 37.10 లక్షల మంది ఉండగా ఇప్పుడు భారీగా తగ్గిపోయారు. ఈ ఏడాది జూలై 4వతేదీ నాటికి 32.46 లక్షల మందికి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలో ఏకంగా 4.64 లక్షల మంది తగ్గిపోయారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 31 నాటికి 34.36 లక్షల మంది విద్యార్థులుండగా.. విద్యా సంవత్సరం ప్రారంభమైన 19 రోజుల్లోనే 1.90 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం దిగజారిన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దలు విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇది చాలదా? ఇంతకంటే ఏం రుజువు కావాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని కక్షపూరితంగా నిలిపి వేయడం.. ఇంగ్లీషు మీడియం రద్దు.. సబ్జెక్టు టీచర్లు కాన్సెప్ట్కు మంగళం.. సీబీఎస్ఈ, ఐబీ విధానం ఔట్... టోఫెల్ శిక్షణ ఎత్తివేత.. ట్యాబ్లు నిలిపివేత.. డిజిటల్ తరగతులకు చెదలు.. ఐరాసను సైతం మెప్పించిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాణాలు దిగజారడం.. బాబు ‘బొద్దింక భోజనం’లా మారిపోయిన గోరుముద్ద లాంటివన్నీ చంద్రబాబు సర్కారు దాదాపు ఐదు లక్షల మంది పిల్లలను సర్కారు చదువులకు దూరం చేసేందుకు కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు. ఏడాదిలో తారుమారు..బాబు ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక విద్యా సంస్కరణలన్నింటినీ కక్షగట్టినట్లుగా రద్దు చేసింది. మనబడి నాడు–నేడు పనులను నిలిపివేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై బాబు సర్కారు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి. దీంతో ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు భారీగా ప్రైవేట్ విద్యాసంస్థల బాట పట్టారు. వీరిలో అత్యధికులు టీసీలు తీసుకుని వెళ్లిపోయిన వారేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆగస్టు చివరి నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో ప్రభుత్వ బడులను విద్యా సంస్కరణలతో ఉన్నతంగా తీర్చిదిద్ది సర్కారు చదువులపై నమ్మకాన్ని పెంచితే కూటమి ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో మొత్తం పరిస్థితిని తారుమారు చేసిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. బడుల విలీనంతో...మాజీ ముఖ్యమత్రి వైఎస్ జగన్పై అక్కసుతో ఆయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వస్తూనే సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను రద్దు చేసింది. 3–5 తరగతుల విద్యార్థులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్ బోధనను నిలిపివేసింది. దీంతోపాటు జీవో నం.117ను రద్దు చేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఈ తరగతులను తిరిగి ప్రాధమిక పాఠశాలల్లోకి తీసుకొచ్చింది. కొత్తగా 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకొచ్చింది. 60 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చింది. ఆ మేరకు విద్యార్థుల సంఖ్య వచ్చే వరకు సమీపంలోని స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేసింది. ఇలా 5 కి.మీ పరిధి వరకు ఉన్న తక్కువ ఎన్రోల్ ఉన్న స్కూళ్లను విలీనం చేసి మొత్తంగా 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు (ఎంపీఎస్) ప్రవేశపెట్టింది. ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4–5 కి.మీ దూరంలోని స్కూల్కు ఒంటరిగా పంపించే ధైర్యం చేయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టమైనా స్కూలు బస్సులున్న ప్రైవేట్ బడుల్లో చేర్పించారు. దీంతో ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో పిల్లలు సగానికి తగ్గిపోయారు. నిర్వీర్యం చేస్తూ నిర్ణయాలు..ప్రజాస్వామ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి, కానీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వచ్చిందే తడవుగా గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నిలిపి వేశారు. 16 రకాల పదార్థాలతో విద్యార్థులకు రుచికరంగా పౌష్టిక విలువలతో అందించిన జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చేసి నాణ్యతను గాలికి వదిలేశారు. సన్నబియ్యం పేరుతో పురుగుల భోజనం పెడుతుండడంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. బొద్దింకల భోజనంగా దీనిమార్చేశారు! రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్లు ఖర్చు చేసి ప్రయోగాలు చేసి సర్కారు చేతులెత్తేసింది. గత ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించారు. 20 వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి దాదాపు 4 వేల స్కూళ్లలో పనులు పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన స్కూళ్లలో పనులను కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. ఇక గతేడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించి యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్ బోధనను తొలగించింది. విద్యా ప్రమాణాల పెంపు కోసం 3–5 తరగతులకు గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సబ్జెక్టు టీచర్ విధానాన్ని రద్దు చేసింది. స్కూళ్ల విలీనంతో బోధనను బలహీనం చేసింది. ఇవన్నీ పిల్లలు, తల్లి దండ్రులకు నమ్మకం పోగొట్టాయి. సీఎం తన యుడు పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ పరిస్థితి ఇంత దయ నీయంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వమే బ్రాండింగ్‘పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత కాదు.. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు... వాటిని కల్పించే పరిస్థితి లేదు... డబ్బున్నవారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవచ్చు.. అక్కడ ఇంగ్లిష్ మీడియం ఉంటుంది.. అన్నీ బాగుంటాయి..!’ అని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవల నారాయణ విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను ఆకాశానికి ఎత్తేశారు. చదువు రాకున్నా నారాయణ స్కూల్లో చదివితే అద్భుతంగా మారిపోతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి ప్రైవేటు విద్యను నెత్తిన పెట్టుకోవడంతో కూటమి సర్కారు పాలనలో ప్రభుత్వ విద్య ప్రగతి కష్టమని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్’ అవార్డులతో సత్కరించింది. ఇందులో 4,168 పురస్కారాలు ప్రకటించగా వాటిల్లో 3 వేలకు పైగా ప్రైవేటు విద్యార్థులకే దక్కాయి. అంటే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల కంటే ప్రైవేటు విద్యా సంస్థల్లోనే విద్యార్థులు అధిక మార్కులు సాధిస్తారని చెప్పినట్లైంది! వైఎస్ జగన్ హయాంలో విద్యా సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. దాంతో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించారు. రెండేళ్లపాటు అత్యధిక మార్కులు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే సాధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గతేడాది పదో తరగతి, ఇంటర్లో ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల విద్యారులే ముందుండడంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు నమ్మకం సన్నగిల్లి టీసీలు తీసుకుని ప్రైవేటు బాటపట్టారు. -
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
-
‘లోకేష్, భరత్లు అసలు నిందితుల్ని తప్పించారు’
సాక్షి, విశాఖ: కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్కు క్యాపిటల్గా మార్చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహా నగరంలోకి ప్రవేశించేసింది. ఎన్నికల ముందు కంటైనర్లో రూ.వేల కోట్ల డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్నే డ్రగ్స్కి అడ్డాగా మార్చేశారు ఇటీవల విశాఖలో కలకలం రేపిన కూటమి నేతల డ్రగ్స్ దందాపై అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలో గంజాయి కొకైన్ ప్రభుత్వం నడుస్తుంది. రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ పేట్రేగిపోతుంది. డ్రగ్స్కు క్యాపిటల్గా విశాఖను తయారు చేశారు. డ్రగ్స్ గంజాయిని కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. ఇటీవల విశాఖలో 25 గ్రాముల కొకైన్ దొరికింది. వెలగపూడి రామకృష్ణ బాబు సీపీ మీద ఒత్తిడి చేసి అసలు దోషులను తప్పించారు.ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పోలీసులు మీద ఒత్తిడి తెచ్చారు. డ్రగ్స్ కేసులో సీఎంవో కూడా ఇన్వాల్ అయింది. మంత్రి లోకేష్, ఎంపీ భరత్ అసలు నిందితులను తప్పించారు. ఎప్పుడూ రాని టీడీపీ ప్రజా ప్రతినిధులు సీపీ కార్యాలయానికి ఎందుకు వచ్చారు. టీడీపీ నేతలు సీపీనీ కలిసిన సీసీ ఫుటేజీ బయట పెట్టే ధైర్యం ఉందా. వైఎస్ జగన్ పాలనలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అక్షయ్, థామస్, కృష్ణ చైతన్య వర్మను అరెస్టు చేసి మిగతా ఇద్దరిని ఎందుకు వదిలేశారు. అక్షయ్ కుమార్ అనే వ్యక్తి తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎంపీకి అత్యంత సన్నిహితుడు.వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ను కూటమి ప్రభుత్వం దెబ్బ తీస్తోంది.వైఎస్ జగన్ పాలనలో 25 వేల కేజీల డ్రగ్స్ దొరికిందని తప్పుడు ప్రచారం చేశారు. తరువాత సీబీఐ విచారణలో అది ఈస్ట్ అని తేలింది. కొకైన్ డ్రగ్స్ వ్యవహారం ఎల్లోమీడియాకు కనిపించలేదా. వాస్తవాలను ఎందుకు ప్రజలకు చూపించడంలేదు. అసలు రాష్ట్రంలో గంజాయి లేనట్లు ఈనాడు చంద్రబాబు భజన చేస్తుంది. డ్రగ్స్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరగాలి.అసలు నిందితులను అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
Electricity Charges: మాట మార్చిన బాబు సామాన్యులకు షాక్ మీద షాక్
-
కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారు: YSRCP నేతలు
-
ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్... బాబుపై బియ్యపు మధుసూదన్ రెడ్డి సెటైర్లు
-
జగనన్న ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా... ఎంపీ తనూజ రాణి సూపర్ స్పీచ్
-
సర్కారు.. కంగారు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మామిడికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోగా, ఆ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండటంతో వారికి అండగా నిలవడం కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రంగంలోకి దిగటంతో కూటమి ప్రభుత్వానికి కునుకు కరువైంది. దీంతో వైఎస్ జగన్ బంగారుపాళెం పర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు కూటమి నేతలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి, మామిడి దిగుబడులను వెంటనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ.. వైఎస్ జగన్ పర్యటనలో రైతులెవ్వరూ పాల్గొనకుండా చూడటానికి నానా తంటాలు పడుతున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొద్ది రోజులుగా ఓ వైపు మామిడి దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక, మరో వైపు ఫ్యాక్టరీ యాజమాన్యాలు సమయానికి కొనుగోలు చేయక పోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల కష్టాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ట్రాక్టర్లు, లారీల్లోనే మామిడి కుళ్లిపోతుండటంతో రైతులు వాటిని రోడ్లపై పారబోసి వెళ్లిపోతున్నారు. మరికొందరు రైతులు ఏకంగా మామిడి చెట్లను కొట్టేసి, వేరే పంటలు సాగు చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఇది కూడా తప్పే అన్నట్లు ఆ రైతులపై కూటమి ప్రభుత్వం కళ్లెర్ర చేస్తోంది. వారిపై కేసులు పెట్టి, అపరాధ రుసుం అంటూ వసూళ్లకు బరితెగించింది. ఈ నేపథ్యంలో రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రైతుల వద్దకు అధికారులు పరుగులుకొద్ది రోజులుగా రైతులు గంగాధర నెల్లూరు, గుడిపాల, బంగారుపాళెం, తవణంపల్లి వద్ద ఉన్న ఫ్యాక్టరీల వద్ద మామిడి దిగుబడులతో రోజుల తరబడి క్యూలో వేచి ఉన్నారు. మొన్నటి వరకు ఫ్యాక్టరీలో మామిడి అన్లోడింగ్ కోసం రోజుకు కేవలం 60 నుంచి 70 ట్రాక్టర్లకు మాత్రమే టోకెన్లు ఇచ్చేవారు. అది కూడా రైతులు వెళ్లి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బతిమలాడాలి. ఈ పరిస్థితిలో మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో అధికారుల జోక్యంతో రోజుకు ఒక్కో ఫ్యాక్టరీ వారు 300 టోకెన్లు ఇవ్వటం ప్రారంభించారు. టోకెన్లు పొందిన వారి ట్రాక్టర్లను నేరుగా ఫ్యాక్టరీలోనికి పంపిస్తున్నారు. రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాల్లో వేచి ఉండటం కంటే.. ఫ్యాక్టరీ లోపల ఉంటే పరిస్థితి తీవ్రత తెలియదనే ఉద్దేశంతో అధికారులు ఇలా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అయినా కి.మీ దూరం మామిడి దిగుబడులతో ట్రాక్టర్లు, లారీలు వేచి ఉండటం గమనార్హం.పర్యటన ఖరారవ్వగానే అంతా హడావుడిమామిడి రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఈనెల 2న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. అదే రోజు సాయంత్రం కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ విషయం తెలుసుకుని మరుసటి రోజే టీడీపీకి చెందిన కొందరు మామిడి రైతులను పిలిపించుకుని మాట్లాడారు. రైతులను ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమే అని ప్రకటించారు. ఆపై కిలో మామిడిని ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.8 చొప్పున కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ మరుసటి రోజు అధికారులు సమావేశమై కిలో మామిడి రూ.8తో కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యానికి సూచించారు.అయితే వారు దాన్ని పట్టించుకోలేదు. ధర ఎంత అనేది చెప్పకుండానే రైతుల వద్ద అంగీకార పత్రంలో సంతకం తీసుకుని మామిడిని కొనుగోలు చేయటం చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు మరోసారి ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో కిలో రూ.8 చొప్పున కాకుండా రూ.6తో కొనుగోలు చేస్తున్నట్లు అంగీకార పత్రంపై రైతుల నుంచి సంతకాలు తీసుకోవటం ప్రారంభించారు. వైఎస్ జగన్ పర్యటన ఖరారు కానంత వరకు కూటమి నేతలకు మామిడి రైతుల ఘోషే వినిపించలేదు.వైఎస్ జగన్ బంగారుపాళెం వస్తున్నారని తెలియటంతో సీఎం సూచన మేరకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ వెంటనే ప్రెస్మీట్ పెట్టి విమర్శలు చేయటం, ఫ్యాక్టరీల వద్దకు వెళ్లటం, రైతులతో మాట్లాడటం వంటి కార్యక్రమాలతో హడావుడి చేస్తున్నారు. మరో వైపు చెట్లను కొట్టేసుకున్న రైతులు వైఎస్సార్సీపీ శ్రేణులంటూ వారిపై కేసులు పెట్టించటం ప్రారంభించారు. -
రెడ్బుక్కు రెడ్ సిగ్నల్!
ముంపు సమస్యపై పోస్టు చేసినందుకు.. భారీ వర్షాలు కురవడంతో రాజమహేంద్రవరంలోని ప్రకాశ్ నగర్ కాలనీలో ముంపు సమస్యపై పులి సాగర్ అనే దళితుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే.. పోలీసులు ఆయన్ను ఓ ఉగ్రవాది మాదిరిగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారు! స్టేషన్కు తరలించి అర్ధనగ్నంగా నిలబెట్టి పచ్చి బూతులు తిడుతూ... కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. ముక్కలుగా కోసి రైలు పట్టాలపై పడేస్తామని, శవం కూడా దొరకదని బెదిరించారు. పులిసాగర్ను అర్ధ నగ్నంగా లాకప్లో ఉంచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్బుక్ వేధింపులకు ఈ ఉదంతం ఓ నిదర్శనం! సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ.. హామీల ఎగవేతపై నిలదీస్తూ పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులను ప్రయోగించి చంద్రబాబు సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండటం... మేజిస్ట్రేట్లు వారిని యాంత్రికంగా రిమాండ్కు పంపుతుండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసుల అరాచకాలకు హైకోర్టు చెక్ పెట్టిందని న్యాయకోవిదులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో సంబంధిత దర్యాప్తు అధికారి... అర్నేష్కుమార్, ఇమ్రాన్ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో, ఇన్నాళ్లూ రెడ్బుక్ రాజ్యాంగంతో చెలరేగిన పోలీసుల్లో వణుకు మొదలైందని వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా రెడ్బుక్ పాశవిక విధానాలను ఏమాత్రం ఉపేక్షించబోమని హైకోర్టు సంకేతాలిచ్చిందంటున్నారు. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేట్లకు తాజాగా హైకోర్టు పరిపాలనా మార్గదర్శకాలను నిర్దేశించిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలను మేజిస్ట్రేట్లందరూ పాటించి తీరాల్సిందేనని, దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. భారత రాజ్యాంగాన్నిఅనుసరించి విధులు నిర్వహించాలి గానీ... లోకేశ్ విరచిత, చంద్రబాబు ప్రవచిత రెడ్బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తే పోలీసులు ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేన్నది హైకోర్టు ఆదేశాలతో స్పష్టమైంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా సాగిస్తున్న ప్రభుత్వ స్పాన్సర్డ్... పోలీసు మార్కు వేధింపులకు హైకోర్టు ఆదేశాలతో అడ్డుకట్ట వేసినట్లైంది. ప్రధానంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో వేధింపులు... దర్యాప్తు ముసుగులో చిత్రహింసలకు పాల్పడుతూ రాష్ట్రంలో అరాచకం సృష్టించడంపై జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లకు అడ్డుకట్ట వేస్తూ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయి. హైకోర్టు అంత క్రియాశీలంగా వ్యవహరించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయేంతగా ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ దిగజారిందన్నది యావత్ దేశానికి అవగతమైంది. ప్రశ్నించే గొంతులపై దాష్టీకం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదిగా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను అమలు చేయని వైనం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్లను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది. ఎంతగా అంటే.. అన్నదాతా సుఖీభవ పథకం ఎప్పుడు ఇస్తారు? అని అడిగితే కేసు...! నిరుద్యోగ భృతి ఇవ్వరా..? అని ప్రశి్నస్తే కేసు...! వీధిలో లైట్లు వెలగడం లేదంటే కేసు...! సూపర్ సిక్స్ పథకాలను ప్రస్తావిస్తే చాలు కేసు..!! ఇలా ఎడాపెడా అక్రమ కేసులతో విరుచుకుపడింది. సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల మేనిఫెస్టో అమలులో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులతో బెదిరింపులకు దిగింది. ఏడాది వ్యవధిలో సోషల్ మీడియా కార్యకర్తలు ఏకంగా 822 మందికి నోటీసులు జారీ చేసింది. 253 అక్రమ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. 86 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్లను అక్రమంగా అరెస్టు చేసింది. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కేసులు నమోదు చేయలేదు. హిట్లర్ దురాగతాలను గుర్తు చేసే రీతిలో చంద్రబాబు అణచివేతలకు పాల్పడ్డారు. అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా దర్యాప్తు పేరిట వేధించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, నిబంధనలను పాటించకుండా బరితెగించి వ్యవహరించారు. వ్యవస్థీకృత నేరాల కింద కేసులు.. సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే 41 ఏ కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలి. కానీ ఆ నిబంధనలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. ఏకంగా వ్యవస్థీకృత నేరాల కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనం. ఉగ్రవాదులు, స్మగ్లర్లపై నమోదు చేయాల్సిన కేసులను సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై బనాయించి కర్కశంగా వ్యవహరించారు. రాత్రికి రాత్రి ఇళ్ల నుంచి లాక్కొచ్చి బలవంతంగా పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్కు తిప్పుతూ.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతిక దాడులకు సైతం వెనుకాడలేదు! కొమ్ముకాస్తే.. కఠిన చర్యలు.. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా సాగిస్తున్న దమనకాండ, అరాచకాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణలపై అక్రమ కేసులు నమోదుకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, మీడియా ప్రతినిధులు, కళాకారుల భావ వ్యక్తీకరణ హక్కుకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే పోలీసుల పట్ల కఠిన చర్యలు చేపడతామని తేల్చి చెప్పింది. కేసుల దర్యాప్తు విషయంలో పాటించాల్సిన విధి విధానాలను పోలీసులకు గుర్తు చేసింది. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో రిమాండ్లు విధించడానికి వీల్లేదని మెజిస్ట్రేట్లకు స్పష్టం చేసింది. ఇకపై అటువంటి కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అది కూడా.. సీఐ, ఎస్సై స్థాయి అధికారులు తమంతట తాముగా కేసులు నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. అటువంటి కేసుల నమోదుకు ముందు అన్ని విషయాలను పరిశీలించి డీఎస్పీ అనుమతి ఇవ్వాలని పేర్కొంది. తద్వారా అక్రమ కేసులు నమోదు చేస్తే ఇకపై డీఎస్పీనే ప్రధానంగా బాధ్యుడవుతారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని తద్వారా న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇక ఈ కేసుల దర్యాప్తు పేరిట పోలీసులు నెలల తరబడి కాలయాపన చేస్తూ నిందితులను వేధిస్తుండటాన్ని కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే అందుకు కారణాలను కచ్చితంగా చెప్పాలి. న్యాయస్థానాలు కూడా ఎడాపెడా రిమాండ్లు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు నిర్దేశించింది. పోలీసులు ఆ కేసుల దర్యాప్తును 14 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దిష్ట కాలపరిమితి విధించింది. తద్వారా సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, మీడియా ప్రతినిధులు, సృజనాత్మక కళాకారులు, ఇతరుల భావ ప్రకటనా హక్కును హైకోర్టు పరిరక్షించింది. వాటికి విఘాతం కలిగించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 50 రోజుల పాటు జైల్లో..ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరెడ్డి దంపతులపై కూటమి సర్కారు తప్పుడు కేసులు బనాయించింది. 50 రోజుల పాటు జైల్లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వారిపై పలు జిల్లాల్లో అక్రమ కేసులు నమోదు చేసింది. పోస్టు పెట్టారని భర్తపై దాడి... భార్య అరెస్టుప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చిలకలూరిపేటకు చెందిన దంపతులు పాలేటి కృష్ణవేణి, రాజ్కుమార్పై పోలీసులు, టీడీపీ గూండాలు వేధింపులకు పాల్పడ్డారు. కృష్ణవేణిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రాజ్కుమార్ను చితకబాది నారా లోకేశ్ చిత్రపటం వద్ద మోకాళ్లపై నిలబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించారు.పోస్టు పెడితే దాడులు.. కేసులు!సూపర్ సిక్స్పై పోస్టు పెట్టినందుకు..సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కె.హనుమంతరెడ్డిని పోలీసులు కిడ్నాప్ చేసి మరీ చిత్రహింసలకు గురి చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం అరవీడుకు చెందిన ఆయన్ను రెండు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు.దివ్యాంగుడిపై పోలీసుల ప్రతాపంటీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నంద్యాల జిల్లా మహానందికి చెందిన తిరుమల కృష్ణపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిర్బంధించారు. దివ్యాంగుడైన కృష్ణను వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.ఒక్కడిపై 21 అక్రమ కేసులు..టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేసిన విశాఖకు చెందిన ఇంటూరి రవికిరణ్ను పోలీసులు అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారు. ఆయనపై వివిధ జిల్లాల్లో ఏకంగా 21 అక్రమ కేసులు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ వేధింపుల తీవ్రతకు నిదర్శనం. ఓ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చినా మరో కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగానే మరో 4 కేసులు బనాయించారు.2018లో పోస్టు.. ఇప్పుడు అక్రమ కేసుచంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, పాశవిక ధోరణి, మానవ హక్కుల ఉల్లంఘనకు తెనాలి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసు ఓ మచ్చు తునక. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రాజకీయ విధానాలను ప్రశ్నిస్తూ 2018లో పోస్టు పెట్టిన ఆళ్ల జగదీశ్ అనే రైతుపై 2024లో అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన్ను అక్రమంగా అదుపులోకి తీసుకుని 2 రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వేధించారు.ఫొటో ఫార్వర్డ్ చేసినందుకు..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓ సోషల్ మీడియా పోస్టును వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశారని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రభావతి అనే మహిళతోపాటు 12 మందిపై కూటమి సర్కారు అక్రమ కేసు నమోదు చేసింది. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.పోసానిపై రెడ్బుక్ వేధింపులుప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని చంద్రబాబు ప్రభుత్వం వేధించిన తీరు అందరినీ నివ్వెరపరిచింది. ఆయనపై ఏకంగా 16 అక్రమ కేసులు నమోదు చేయడం సర్కారు అరాచకాలకు తార్కాణం. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ను హైదరాబాద్లో బలవంతంగా అరెస్టు చేసి రాష్ట్రానికి తరలించి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పతూ వేధించారు. ఆయన కనీసం తన మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించ లేదు. అక్రమ అభియోగాలతో రిమాండ్కు తరలించారు. 24 రోజులు జైల్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్పై విడుదల అయ్యారు.కొమ్మినేనిపై కక్ష సాధింపుప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కక్ష సాధింపులకు పాల్పడింది. సాక్షి టీవీలో ఓ చర్చా గోష్టిలో ఆయన ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకపోయినా అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. నిరాధార అభియోగాలతో రిమాండ్కు పంపించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి టీవీ, కొమ్మినేని శ్రీనివాసరావుపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రాజధాని అప్పుల్లో రూ.991.06 కోట్లు మళ్లింపు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి తెచ్చిన అప్పులో రూ.991.06 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. ఈ నిధులను రాజధాని నిర్మాణ పనుల కోసం అప్పుగా ఇచ్చామని.. వాటిని నిర్మాణ పనులకే వ్యయం చేయాలని.. ఇతర పనులకు మళ్లించకూడదని ఆ బ్యాంకులు ముందే షరతులు విధించాయి. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ మళ్లించిన నిధులను తక్షణమే సీఆర్డీఏ ఖాతాలో జమచేయాలని కమిషనర్ కె. కన్నబాబును ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో అధికారులు ఆదేశించారు. ఇదే అంశాన్ని ఆయన ఆరి్థక శాఖకు చెబుతూ వస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ విడతల వారీగా రూ.245.37 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ఇంకా రూ.745.69 కోట్లను జమచేయలేదు. ‘పోలవరం’ నిధులు కూడా.. ఇలా రాజధాని నిర్మాణం కోసం అప్పుతెచ్చిన నిధులనే కాదు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను కూడా ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమచేయకుండా ప్రభుత్వం ఇదే రీతిలో ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. గత అక్టోబరు 9న పోలవరం ప్రాజెక్టుకు తొలివిడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లించేసింది. ఇది తెలిసి కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తంచేయడంతో చివరికి జనవరి రెండో వారంలో వాటిని ఎస్ఎన్ఏ ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. దాంతో నిర్వాసితులకు పరిహారం, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు, సేకరించిన భూమికి పరిహారం పంపిణీ చేశారు. అలాగే, మార్చి 12న పోలవరం ప్రాజెక్టుకు రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన అడ్వాన్సులో రూ.2,704.81 కోట్లలో రూ.2,504.81 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇతర అవసరాలకు పక్కదారి పట్టించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, సేకరించాల్సిన భూమికి పరిహారం, చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాల్సిన అడ్వాన్సు నిధులను మళ్లీ దారి మళ్లించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు అధికారమా!?: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి: హైకోర్టు విచారణలో ఉన్నప్పటికీ.. దేశ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చి ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) ద్వారా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. ఆ స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన సవాల్ చేశారు. అలాగే, రాష్ట్రంలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా, ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) హోల్డర్లు ఆర్బీఐ డైరెక్ట్ డెట్ మాండేట్ ద్వారా రాష్ట్ర కన్సాలిడేటెడ్ నిధిని పొందవచ్చనే వాస్తవాన్ని అంగీకరించి.. ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు రాష్ట్ర ఖజానాను అప్పగించే స్థాయికి ఎందుకు దిగజారిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన అంశాలు, జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను జతచేస్తూ ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో బుగ్గన ఏమన్నారంటే..ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్ల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. ఆర్థిక క్రమశిక్షణను పాటించడంలేదనే ఆరోపణలు నిరంతరం వస్తున్నప్పటికీ.. వాటిని ప్రభుత్వం విస్మరించడం శోచనీయం. ఈ అంశంపై ప్రజలకు ఎటువంటి వివరణలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎన్సీడీ బాండ్ల జారీలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటాన్ని ప్రస్తావిస్తూ జాతీయ మీడియాలో విస్తృతమైన కథనాలు వస్తున్న నేపథ్యంలో.. ఆ తప్పును ప్రభుత్వం సరిదిద్దుకుంటుందని లేదా వివరణ ఇస్తుందని ఎవరైనా ఆశిస్తారు. కానీ, ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేయడంపై నోరుమెదపకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇది ప్రభుత్వానికి జవాబుదారీతనం లేకపోవడానికి.. పారదర్శకతపై కరువైన చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. నిజానికి.. హైకోర్టులో ఈ అంశం విచారణలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా రెండు విడతలుగా ఎన్సీడీ బాండ్లు జారీచేసి రూ.9 వేల కోట్లు అప్పుచేసింది. ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తుల (రుణదాతలు)కు రూ.1,91,000 కోట్ల విలువైన రాష్ట్ర ఖనిజ సంపదను తాకట్టు పెట్టింది. అంతేకాదు.. ఆ అప్పును ఏపీడీఎంసీ కట్టలేకపోతే ఆర్బీఐలో రాష్ట్రానికి ఉన్న ఖాతా (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి రాష్ట్ర అధికారులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరుగా వారికి రావాల్సిన మొత్తాలను డ్రా చేసుకునే అధికారం కల్పించింది. ఇలా రాష్ట్రంలో ఇంతముందెన్నడూ లేని రీతిలో ప్రైవేటు వ్యక్తులకు ఆర్బీఐలో రాష్ట్ర ఖాతాపై అజమాయిషీ ఇవ్వడం వాస్తవం కాదా? రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇచ్చే స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు వివరణ ఇవ్వాలి. -
పరిశ్రమల పేరుతో రైతుల జీవితాలతో బాబు చెలగాటం: మేరుగు నాగార్జున
-
గిట్టుబాటు ధరల్లేవని మామిడిని రోడ్డు పక్కన పడేస్తున్న రైతులు
-
మీ అధికార పీఠం కింద భూకంపమే.. పుష్ప శ్రీవాణి అదిరిపోయే స్పీచ్
-
పవన్ డబల్ యాక్టింగ్ జయము జయము చంద్రన్నతో
-
చెట్టునే నరకనా... మెడ కోసుకోనా?
ఆంధ్రప్రదేశ్లోని తోతాపురి మామిడి రైతుల హాహాకారాలు ఆ రాష్ట్ర సరిహద్దుల్ని దాటి ప్రతిధ్వనిస్తున్నాయి. కిలోకు పన్నెండు రూపాయలు కనీస ధరగా నిర్ణయించిన ప్రభుత్వం కార్యాచరణపై మాత్రం ముసుగేసింది. ఫలితంగా రెండు రూపాయలకు కూడా కొనే నాథుడు లేక రైతులు మామిడి కాయల్ని రోడ్లపై పారబోస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పారబోయడానికి మనసొప్పని రైతులు రవాణా ఖర్చులు వచ్చినా చాలని హైదరాబాద్ వంటి దూర ప్రాంత మార్కెట్లకు తరలించిన ఉదంతాలు కోకొల్లలు. తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్న ఈ పరిస్థితుల్లో పసిబిడ్డల్లా పెంచుకున్న చెట్లను నరికేయాలో, చేతిలో వున్న కొడవలితో మెడనే నరుక్కోవాలో అర్థం కావడం లేదంటూ ఒక రైతు వాట్సప్లో పెట్టిన మెసేజ్ కంటతడి పెట్టించింది.ఇదొక్క మామిడి రైతుల ఆక్రందనే కాదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతులందరి ఉమ్మడి ఆవేదన ఇదే. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్కు 24 వేలు పలికిన ధర ఇప్పుడు గరిష్ఠంగా ఏడు వేలు దాటకపోవడంతో మిర్చి రైతు కుదేలయ్యాడు. పత్తి ధర పదివేల నుంచి ఐదు వేలకు అంటే సగానికి సగం పడిపోయింది. అప్పుడు 18 వేల దాకా దక్కించుకున్న పొగాకు ఇప్పుడు గరిష్ఠంగా 6 వేలకు పడిపోయింది. పసుపు, కందులు, మినుములు, వేరుశనగ, మొక్కజొన్న, పెసలు, ఉల్లిపాయలు, టమాటా, మామిడిపళ్ళు, అరటి, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ వగైరా వ్యవసాయ ఉత్పత్తుల ధరలన్నీ సగానికి పడిపోయాయి. ఆనాటి జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ధరలు పతనమవకుండా మార్కెట్లో జోక్యం చేసుకునే విధానాన్ని అవలంబించడం సత్ఫలితాలనిచ్చి మంచి ధరలు లభించాయి. రైతన్నకు దరహాసాన్నిచ్చాయి.చంద్రబాబు ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసింది. మొత్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం కాడి పారేసింది. జగన్మోహన్రెడ్డి ఇస్తున్న రైతు భరోసా కంటే అధికంగా ఇస్తానని హామీ ఇచ్చి వరసగా రెండో యేడు కూడా ఎగనామం పెట్టింది. వ్యవసాయ రంగం ఈ ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో లేదు. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని అడిగి తెచ్చుకొని తన కమీషన్ల ప్రాధాన్యాన్ని ఆ ప్రభుత్వం చాటి చెప్పుకున్నది. రెండోసారి అదే ప్రాధాన్యతను అమరావతి రూపంలో నిలబెట్టుకొన్నది. క్వాంటమ్ వ్యాలీ, డీప్ టెక్నాలజీ, ఏఐ వగైరాలన్నీ అమరావతి హైప్ కోసం కైపెక్కించడం తప్ప ఆచరణాత్మకమైన మాటలు కావనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. క్వాంటమ్ వ్యాలీకి అవసరమయ్యే ఎకో సిస్టమ్ అమరావతికి అందుబాటులోకి రావడమనేది ఒక సుదూర స్వప్నమే తప్ప ప్రభుత్వం చెబుతున్నట్టు ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించే స్థితి అసంభవమని నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతిని మభ్యపెట్టడానికి యువతకు జోల పాడటానికి ఇటువంటి పదజాలాన్ని వెదజల్లడం బాబు కాకస్కు వెన్నతో పెట్టిన విద్య. ఈ జోలపాటల మాటున అమరావతిలో జరుగుతున్న అసలు కార్యక్రమమేమిటో చాలామందికి అర్థమైంది. అమరావతి పేరుతో ఇప్పటికే తెచ్చిన అప్పులే కాదు, ఇంకా అవసరమైన అప్పులు తీర్చడానికి భూములు అమ్ముతామనీ, అదో సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటలనీ చెబుతూ వచ్చారు. తొలుత సమీకరించిన భూముల్లో రైతుల వాటా తీసేయగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు పోనూ మిగిలిన భూముల అమ్మకంతో తెచ్చిన అప్పులు తీర్చడం సాధ్యం కాదనే మాట వినిపిస్తున్నది. ఈ తత్వం బోధపడినందువల్లనే ప్రపంచ బ్యాంకు వాళ్లు ఈ మధ్య ప్రభుత్వానికి తాఖీదులు పంపారట! మీరు అమ్మబోయే భూములెన్ని? ఎప్పటిలోగా అమ్ముతారు? వాటి ద్వారా ఎంత డబ్బు సమీకరిస్తారో చెప్పండని వారు అడుగుతున్నారని సమాచారం.ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాల భూసేకరణ ప్రయత్నాలకు రైతులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వంలో కలవరం మొదలైనట్టు కనిపిస్తున్నది. కాకస్ పరంగా ఎంత సంపాదించుకున్నా ప్రభుత్వపరంగా మాత్రం అమరావతి ప్రాజెక్టు ఒక నిరర్థక ఆస్తిగానే మిగిలిపోయే ప్రమాదముందనే హెచ్చరికలు వినబడుతున్నాయి. పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఈ మధ్యకాలంలో బాబు ప్రభుత్వం చేస్తున్న హడావుడి కూడా కమీషన్ల స్టార్టప్ కథేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 80 వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో గేమ్ ఛేంజర్ కాబోతున్నదని ఆయన చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికలో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తయితే ఏడు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకూ, ఇంకో 23 లక్షల ఎకరాల స్థిరీకరణకూ ఉపయోగపడుతుంది. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించి చాలావరకు పూర్తయి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇంకో 14 వేల కోట్లు సరిపోతుందనీ, ఈ పని చేస్తే కూడా అంత ఆయకట్టు అందుబాటులోకి వస్తుందనీ చెబుతున్నారు.అటువంటప్పుడు ఏది తొలి ప్రాధాన్యత కావాలి? 14 వేల కోట్లతో పెండింగ్ పనులు పూర్తి చేయడమా? 80 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టును తలకెత్తుకోవడమా? గోదావరి వరద జలాలను ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అవసరమే కావచ్చు. ఈ ఆలోచన కూడా వాస్తవానికి గత ప్రభుత్వంలో వచ్చినదే. కానీ సత్వరం పూర్తి కావలసిన ప్రాజెక్టులకు పైసా విదల్చకుండా చేపట్టిన ఈ నిర్హేతుకమైన ప్రాధాన్యతాక్రమం దేన్ని సూచిస్తుంది? భారీ ప్రాజెక్టుతో భారీ కమీషన్ల దురాశతోనే ఈ రకమైన ఎంపిక చేసుకున్నారంటే తప్పవుతుందా? రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇప్పించలేకపోయిన ప్రభుత్వం, ఉన్న ఊరిలోనే కల్తీలేని విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెస్తున్న ఆర్బీకేలను మూసి పారేసిన ప్రభుత్వం రైతన్నల కన్నీరు తుడవడానికి భారీ ప్రాజెక్టులను సంకల్పించిందంటే నమ్మశక్యమేనా?ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్టుగా బాబు ఈ ప్రాజెక్టును పూర్తిచేసే అవకాశమే లేనప్పటికీ దీనిపై తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు సిగపట్లకు దిగడం ఒక విశేషం. చంద్రబాబుతో సాన్నిహిత్యం కారణంగానే ఆయన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. దీనిపై గత కొన్ని వారాలుగా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ పంచాయితీలో బీఆర్ఎస్ వాదానిదే పైచేయిగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి ఇతరత్రా కారణాలు కూడా కొన్ని దోహదపడి ఉండవచ్చు. ప్రెస్మీట్లలో కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం రండని తాజాగా కాంగ్రెస్ మంత్రులు సవాల్ విసురుతున్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టునూ పూర్తిచేసిన రికార్డు లేని చంద్రబాబు చిటికెల పందిరిని ఆంధ్ర ప్రజలెవరూ పట్టించుకోకపోయినా తెలంగాణలో అది మంట పుట్టించడం విశేషం.ఒకపక్క అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల రూపంలో భారతీయ రైతును బలిపీఠమెక్కించే సూచనలు పొడసూపుతున్నాయి. వాణిజ్య ఒప్పందం కోసం అమెరికా విధించిన మూడు మాసాల గడువు ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిపోనున్నది. ఈలోగా భారత్తో కనీసం మినీ ఒప్పందమైనా జరగాలని ట్రంప్ పట్టుపడుతున్నారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య గత వారం రోజులుగా చర్చోపచర్చలు జరుగున్నాయి. జన్యుమార్పిడి సోయాచిక్కుడు, మొక్కజొన్నలను, యాపిల్స్ను, డెయిరీ ఉత్పత్తులను తక్కువ సుంకాలతో భారత మార్కెట్లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తున్నది. వందల ఎకరాల భారీ కమతాల్లో పూర్తిగా యంత్రాల సాయంతో, దాదాపు యాభై శాతం సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం దన్నుతో చౌకగా వచ్చే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ సుంకాలతోనే మళ్లీ మార్కెట్లోకి ప్రవేశిస్తే భారతీయ రైతు తట్టుకోగలడా? పైగా భారతీయ వ్యవసాయ రంగంలోకి, ఫుడ్ చెయిన్లోకి జన్యుమార్పిడి ఉత్పత్తులను అనుమతించకపోవడం భారత్ విధానంగా ఉంటూ వస్తున్నది. ఫుడ్ చెయిన్ పరిధిలోకి రాదనే కారణంతో పత్తిలోకి ఇప్పటికే జన్యుమార్పిడి విత్తనాలు ప్రవేశించాయి. రేపోమాపో కుదరనున్న మినీ వాణిజ్యం ఒప్పందంతో ఏం జరగనున్నదని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అమెరికా విధించే గడువుకంటే తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఇంటర్వ్యూలో వాణిజ్య–పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఘంటాపథంగా చెప్పారు. శనివారం నాటి పత్రికలో వచ్చిన ఈ ఇంటర్వ్యూలో ‘మన వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే ఎటువంటి ఒప్పందాన్ని చేసుకోబోమ’ని ఆయన చెప్పారు. మొక్కజొన్న ఉత్పత్తిలో టాప్ ఫైవ్లో ఉన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ట్రంప్ ప్రతిపాదనలు అంగీకరించడం బీజేపీకి కూడా ఆత్మహత్యా సదృశమే.వాణిజ్య చర్చల్లో పాల్గొంటున్న అధికారుల భోగట్టాగా పేర్కొంటూ బ్లూమ్బర్గ్ లాంటి వార్తా సంస్థలు మరో కథనాన్ని చెబుతున్నాయి. కేవలం పశువుల దాణా కోసం, పౌల్ట్రీ దాణా కోసం ఉపయోగపడే విధంగా మొక్కజొన్న, సోయా చిక్కుళ్ల ఉప ఉత్పత్తులను అనుమతించే మినీ ఒప్పందం కుదిరే అవకాశముందని ఈ కథనాల సారాంశం. మినీ రవ్వ రూపంలో వచ్చినంత మాత్రాన అది జన్యుమార్పిడి పంట కాకుండా పోతుందా? పశువుల దాణా, కోళ్ల దాణాలోకి ప్రవేశిస్తే అది ఫుడ్ చెయిన్లో భాగం కాకుండా పోతుందా అనేవి చర్చనీయాంశాలు. రెండుమూడు రోజుల్లో జరిగే మినీ ఒప్పందం అనంతరం, మూడు నాలుగు నెలల్లో జరిగే పూర్తి స్థాయి ఒప్పందం అనంతరం మాత్రమే ఈ అంశంపై ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి దాణా రూపంలో ప్రవేశించినా, ఒంటె గుడారంలోకి కాళ్లు జాపితే ఏం జరుగుతుందో భవిష్యత్తులో అదే జరుగుతుంది. చంద్రబాబు వంటి వ్యవసాయ వ్యతిరేక విధానాలు అనుసరించే పాలకుల కారణంగా పాతికేళ్ల కిందటే మన రైతులు ఉరితాళ్లు పేనుకున్నారు. ఇప్పుడు కొడవళ్లు మెడపైకి చేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో అమెరికా జన్యుమార్పిడి పంట ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే వ్యవసాయం దండగన్న బాబు జోస్యం నిజమవుతుంది. ఈ విషయంలో నిజంగానే ఆయన విజనరీగా నిలబడిపోతారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పచ్చమూకల పైశాచికత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న దారుణాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనపై వైఎస్ జగన్ శుక్రవారం (జులై 4) ఎక్స్ వేదికగా స్పందించారు.‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్బుక్, పొలిటికల్ గవర్నన్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు.గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైఎస్సార్సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్బుక్, పొలిటికల్ గవర్నన్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు… pic.twitter.com/VfNxKZRUlz— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 విషమంగా నాగమల్లేశ్వర్రావు ఆరోగ్యంకూటమి ప్రభుత్వంలో దారుణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మన్నవ గ్రామంలో టీడీపీ అడ్డు అదుపూ లేకుండా పోతున్న ఆగడాల్ని ఆ ఊరి సర్పంచి నాగమల్లేశ్వర్రావు ప్రశ్నించారు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, సర్పంచి నాగమల్లేశ్వర్రావు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. -
సూపర్ సిక్స్ పె లోకేష్ వీడియో చూపించి ఏకిపారేసిన బొత్స..
-
జనాలు నలిగిపోతాన్రు!
జగనైతే ఎవరికీ ఏలోటూ లేకుండా అందరికీ అన్నీ ఏసేటోడు! బడ్డీ కొట్టు పెట్టుకున్నోళ్లకి డబ్బులిచ్చోడు.. ఒక్కడికీ లేదని పించలేదు. సంవత్సరానికి మాకు అన్ని పథకాలూ కలిపి డెబ్బై వేలదాకా వొచ్చేది. చంద్రబాబు వొచ్చాక ఇప్పుడేటీ రాలేదు. జనాలు నలిగిపోతాన్రు. చెప్పుకోకూడదు కానీ టీ సుక్కకి కూడా డబ్బులాడతం లేదు! – మంగలి సత్యం, నాయీ బ్రాహ్మణుడు, తామరాపల్లి, విజయనగరం జిల్లా ‘ఏటి సేసినారు..? రైతు భరోసా పెంచి ఇత్తామన్నారు.. అది అసలే నేదు..! చదువుకున్న కుర్రోళ్లకి డబ్బులేసేటోళ్లు..! వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి పథకాలన్నీ ఒచ్చియి.. అవి ఇప్పుడున్నాయేటి..? ఏయీ నేవు...! గుండికాయల మీద సెయ్యేసి తెలుసుకుంటే.. ఈడు సేసిందేముంది..? ఆడు సేసిందేముంది..? అని తెలుసుకుంతారు! ఒక తల్లికి పిల్లనేదు.. పిల్లకి తల్లీనేదు! ఎవరి చేతిలోనూ డబ్బుల్లేక నకనకనాడిపోతున్రు...! ఇప్పుడే పనీనేదు.. పేదాసాదా అంతా ఉసూరుమని ఏడుత్తాండ్రు! రెండొందలు మూడొందలు వొచ్చీ కరెంటు బిల్లు ఇప్పుడు డబలైపోనాది. కొట్టుమీద కిరాణా సామాన్లు పెరిగాయి.. నూని డబ్బా పెరిగింది.. ఇప్పుడింక బాగైనా బరాయించాల..! చెడ్డయినా బరాయించాల..! మళ్లీ మన టైమొచ్చీదాకా..! మరింకేటి సేత్తాం..!. – జట్టి మంగ, కండేపల్లి, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లానేను పక్కా టీడీపీ అయినా జగన్ పథకాలు టంచనుగా అందాయి ‘కరోనా టైమ్లో కూడా జగన్ ఏ పథకం ఆపలేదు. అయ్యన్నపాలెంలో ఒక కుటుంబానికి ఏటా రూ.లక్ష దాకా వచ్చేది. అప్పుడు జనాలకు సొమ్మాడటంతో కొత్త బట్టలని, ఇంట్లో ఏదైనా సామాన్లని కొనుక్కునేవారు. ఇప్పుడు వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. నేను పక్కా టీడీపీ. అయినా జగన్ పథకాలు మాకు టంచనుగా అందాయి..’ – సోమేశ్వరరావు, టైలర్ షాపు, అయ్యన్నపాలెం, నర్సీపట్నంశివరామకృష్ణ మిర్తిపాటి – ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏడాది పాలన గుండె చప్పుడు ఇది! నిజాలను భరించగలిగే శక్తి ఉంటే పేదల ఆక్రందన అర్థం అవుతుంది! గ్రామాల్లో పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఏరికోరి కష్టాల పాలయ్యామనే ఆక్రోశం ఎవరిని కదిలించినా కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను నిలిపివేయడం.. సూపర్ సిక్స్ హామీలు అమలు కాకపోవడంతో పేదలు నలిగిపోతున్నారు. రైతులు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. ఉచిత పంటల బీమాకు దూరమై.. గిట్టుబాటు ధరలు లభించక అల్లాడుతున్నారు. పిల్లల చదువులు మళ్లీ గుదిబండలా మారుతున్నాయి. ఆర్థిక ఆసరా కోసం ఎదురు చూస్తున్న మహిళలు విసిగిపోతున్నారు. ఏడాది క్రితం దాకా కళకళలాడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో కకావికలమవుతోంది. ఏడాదికే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం బహుశా ఇదేనేమో!ఏం ప్రభుత్వమండీ ఇది! వాహనమిత్ర పథకం అందకపోవడంతో గ్రామాల్లో ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. రోజుకు ఐదారొందలు వస్తే పోలీసులు రూ.మూడు నాలుగొందలు కట్టాలని కేసు రాసేస్తున్నారని ఇక తాము ఎలా బతుకుతామంటూ విజయనగరం జిల్లా తామరాపల్లి జంక్షన్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు 8 వారాల నుంచి ఉపాధి హామీ కూలి డబ్బులు రాకపోవడంతో అప్పులు చేసి బతుకుతున్నామని విజయనగరం జిల్లా పెద్ద బోరబండ గ్రామానికి చెంది ఉపాధి హామీ కార్మి కులు చెబుతున్నారు. ఆఖరికి మూగజీవాల గోడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ‘గొర్రెలకు కూడా మందులిచ్చేటోడు జగన్! ఇప్పుడేవీ లేవు. మట్టి పనుల డబ్బులు 4 నెలలుగా పడలేదు.రైతు భరోసా ఆగిపోయింది. ఎవరికీ ఏవీ లేక జనాలు మండిపోతున్నారు’ అని పురోహితినివలసకు చెందిన నీలబోణి లచ్చుము వాపోయాడు. ‘జగన్ ఉంటే ఏ పార్టీ అయినా కూడా అనుకున్న టైమ్కి అందరికీ అన్ని పథకాలూ వచ్చేవి. ఇప్పుడవన్నీ ఆగిపోయాయి. చంద్రబాబు హామీలు అమలు కావడం లేదు. పథకాలూ రాక, జనాల చేతిలో డబ్బులాడక మా వ్యాపారం సాగడం లేదు’ అని అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేటలో రోడ్డు పక్కన బెల్లం, కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తున్న మాధవి నిర్వేదంగా చెప్పింది! ‘ఏం ప్రభుత్వమండీ ఇది! మాకు ఇంతకుముందు అన్ని పథకాలు వచ్చియి. మా మనవరాలికి అమ్మ ఒడి, మాయావిడికి రూ.18,500 వచ్చియి. ఇప్పుదేదీ లేదు’ అంటూ కోటవురట్లలో చిన్న కిళ్లీ బడ్డీ నడుపుకుంటున్న దాకారపు రవణ దిగాలుగా నిట్టూర్చాడు.అభివృద్ధి.. అప్పుల్లోనే!! వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్, నాడు–నేడుతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టడంతో నిత్యం అభివృద్ధి పనులు జరిగేవి. జగనన్న కాలనీలలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టడంతో గ్రామాలలో ఉపాధి లభించేది. కోవిడ్లోనూ ఈ పనులు నిరాటంకంగా సాగడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు క్షీణించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం డీబీటీ ద్వారా రూ.2.73 లక్షల కోట్లకుపైగా నేరుగా ప్రజల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేసింది.నవరత్నాల సంక్షేమ క్యాలెండర్ను ముందుగానే ప్రకటించి మరీ అమలు చేశారు. సూపర్ సిక్స్ పేరుతో ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు ఒక్క ఏడాదిలో దాదాపు రూ.1.70 లక్షల కోట్లు అప్పులు చేసి కూడా హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమయ్యారు. కూటమి ప్రభుత్వంలో జీఎస్టీ ఆదాయం తగ్గిపోవడం ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందనేందుకు నిదర్శనం. ఎప్పుడో చేత్తానంటే ఎలా అవుతాది?’ ‘జగనున్నప్పుడు రైతు భరోసా ఏసీవోడు! చంద్రబాబు వచ్చిన కాడ నుంచి ఏవీ రావడం లేదు. ఏదో సొంత పొలం వదిలేయలేక తిండి గింజలు పండిస్తున్నాం. అదీనేకపోతే కూడు కోసుపోయి ఉండటమే! చోడవరం పందార ఫ్యాక్టరీకి చెరుకు తోలి ఐదు నెలలైంది ఇప్పటికొచ్చి రూపాయివ్వలేదు. మరి ఏటి తింటారు? మా ఆయన ఉపాధి హామీ మట్టి పనికెళ్లి రెండు నెలలైంది. ఒక్క రూపాయి పడలేదు. మార్చి నుంచి చేసినోళ్లకే లేదు. ఇంక మాకేం పడతాయి? చంద్రబాబుది అంతా మోసమే! ఎప్పుడో చేత్తానంటే ఎలా అవుతాది?’ అంటూ అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం విజయరామరాజు పేటకు చెందిన అచ్చయ్య గోడు వెళ్లబోసుకుంది. 70 ఏళ్ల వయసులో రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు, మామిడి పళ్లు, కొబ్బరిబొండాలు అమ్ముతూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తోంది! ఈ ప్రభుత్వంలో చాలా కష్టంగా ఉంది..! ‘పండిన పంటకు గిట్టుబాటు లేదు. ఒక రైతు భరోసా లేదు. క్రితం ఏడాది నువ్వులు క్వింటా రూ.12 వేలు ఉంది. ఇప్పుడు రూ.8 వేలే. కష్టం తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఏ పథకాలూ లేవు. జగనున్నప్పుడు అమ్మ ఒడి అనో, 45 ఏళ్లు దాటిన ఆడోళ్లకి రూ.18,500 అనో ఏదో డబ్బులు పడేయి. ఇప్పుడు ఏవీ రావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో చాలా కష్టంగా ఉంది..!’ విజయనగరం జిల్లా తెర్లాంలో నువ్వులు నూరి్పడి చేస్తున్న రైతు దంపతులు శ్రీరాములు, లక్ష్మి ఆవేదన ఇదీ!! -
పొగాకు రైతుల వెతలు తీరాలి!
పొగాకు కంపెనీలు బర్లీ పొగాకును కొనుగోలు చేయకుండా రైతుల ఆశలపై నీళ్లుజల్లాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కంపెనీల చేత పొగాకు కొనుగోలు చేయించటంలో విఫలమైంది. అత్యంత శక్తిమంతమైన ఐటీసీ, బ్రిటిష్ అమెరికన్, గాడ్ఫ్రే ఫిలిప్స్, ఫిలిప్ మోరిస్ తదితర పొగాకు కంపెనీలు ఏపీ ప్రభుత్వ మాటను వినలేదు. తమకు అనుకూలమైన ధరకు, కొంత మేరకే పొగాకును కొనుగోలు చేస్తామని భీష్మించుకు కూర్చున్నాయి. గత సంవత్సరం బర్లీ పొగాకును క్వింటాల్కు రూ. 15,000 కు కొన్నారు. ఈ సంవత్సరం వ్యవసాయ ఖర్చులు, కౌలు, కూలీ రేట్లు పెరిగాయి. కనీసం గత సంవత్సరం కొన్న ధరకైనా కొనమని స్వయానా వ్యవసాయ శాఖ మంత్రి లాం ఫారమ్ మీటింగులో అడిగినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం మరొక మెట్టు దిగి రెండు, మూడు వలుపుల హైగ్రేడ్ క్వింటాల్ పొగాకు ధర రూ. 12 వేలు, మొదటి వలుపు లోగ్రేడ్ పొగాకు ధర 6 వేలుగా (ధరలను తగ్గించి) ప్రకటించింది. అయినా కంపెనీలు తమ పట్టు వదల లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పొగాకు కంపెనీలతో మాట్లాడినా ప్రయోజనం లేదు. పొగాకును కొనుగోలు చేయమని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు కలెక్టర్ కార్యాలయాల వద్ద; పర్చూరు, పంగులూరు, చిలకలూరిపేట, యడ్లపాడు, కారంచేడు, యద్దనపూడి, పెదనందిపాడు మరికొన్ని తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. చిలకలూరిపేట, పర్చూరు, పంగులూరు, ఇంకొల్లు, ఒంగోలులో రైతు సదస్సులు జరిపి పొగాకును కొనిపించమని ప్రభుత్వాన్ని కోరారు. చిలకలూరిపేటలో ఐటీసీ కంపెనీ ముందు మే నెల 27, 28 తేదీల్లో నిరసన దీక్ష చేశారు. గుంటూరులో జీపీఐ కంపెనీ ఎదుట జూన్ 5న తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న సమయంలోనే రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డుల ద్వారా హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయించామని ప్రభుత్వం ప్రకటించింది. చరిత్రలో మొట్టమొదటిసారి మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోళ్లు మొదలయ్యాయి. ప్రభుత్వ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుకు దిగటం రైతుల ఆందోళనకు లభించిన విజయం. రైతు ఉద్యమిస్తేనే వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కారమవుతాయని మరోసారి నిరూపితమయ్యింది. అయితే ప్రభుత్వం తన మాట మీద నిలబడి చివరి ఆకు కొనుగోలు చేసేంతవరకూ రైతులు అప్రమత్తంగా ఉండాలి. మొదట 350 కోట్ల రూపాయలను నల్ల బర్లీ పొగాకు కొనుగోలుకు కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత 300 కోట్లన్నారు. చివరకు 270 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. పొగాకు కొనుగోలు చాలా నెమ్మదిగా సాగుతోంది. రైతుల వద్ద పొగాకు చాలావుంది. ఆలస్యం అయ్యే కొద్దీ రైతులకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. అప్పులు పెరిగిపోతున్నాయి. పలు రకాల ఆలోచనలు వస్తున్నాయి. అప్పులు, వడ్డీలే కాకుండా పొగాకు చెడిపోతుంది. బరువు తగ్గుతుంది. ఈ విధంగా కొనుగోలు జరిగితే... రైతుల దగ్గర ఉన్న మొత్తం పొగాకును కొనడానికి ఇంకా రెండు మూడు నెలలు పడుతుంది. ఎక్కువ మంది రైతులు పొగాకు బేళ్ళను కొనుగోలు కేంద్రాలకు తెచ్చుకోవటానికి మార్క్ఫెడ్ అనుమతించటం లేదు. ముందుగానే వాట్సాప్ మెసేజ్ ద్వారా రైతుకు తెలియజేసి కొద్ది మందినే పిలుస్తున్నారు. బయ్యర్ కొద్ది సమయంలోనే 300 బేళ్ళు కొనగలుగుతున్నాడు. స్పీడ్గా కొనగలిగిన శక్తి కలిగిన సిబ్బంది ఉన్నా అతి నెమ్మదిగా ప్రభుత్వం కొంటోంది. పొగాకులో తేమ ఉందని కొనడానికి తిరస్కరిస్తున్నారు. తేమ పరిమితులను సవరించాలి. కొనుగోలు కేంద్రాలు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి. పెదనందిపాడు, ఇంకొల్లు లాంటి చోట్ల కొనుగోలు కేంద్రాలను పెట్టాలి. జిల్లా సరిహద్దులు అడ్డంకిగా ఉండరాదు. దగ్గరగా ఉన్న గ్రామాల రైతులను గుంటూరు పొమ్మనకుండా కంప్యూటర్ సహాయంతో వివరాలను సేకరించి దగ్గరలో అమ్ముకునే అవకాశం ఇవ్వాలి. గోడౌన్లు అందుబాటులో లేకపోతే కొనుగోలు పాయింట్ పెట్టి పొగాకు కొనాలి. కొన్న పొగాకును దగ్గర ఉన్న గోదాములకు తరలించాలి. పొగాకును కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు వెంటనే రావటం లేదు. ఆలస్యం లేకుండా రైతులకు డబ్బులు వచ్చేలా చూడాలి. పొగాకు కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తగ్గిపోయింది. దీంతో నాణ్యమైన పొగాకును తక్కువ ధరకు తీరికగా కొనుక్కుంటున్నారు.మరోవైపు రైతుల ఆందోళన రోజురోజుకూ ఉద్ధృతమౌతున్నది. స్థానిక శాసనసభ్యులు, మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. మూడుసార్లు వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు రైతులతో సమావేశమయ్యారు. అయినా కంపెనీలు వాటి పంథా మార్చుకోలేదు. దేశాధిపతులనే మార్చగలిగిన చరిత్ర ఉన్న మల్టీ నేషనల్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క అనిపించినట్లు లేదు. అటువంటి అభిప్రాయం రాకుండా ప్రభుత్వం చూడాలి. పొగాకు కొనమని కంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. మల్టీ నేషనల్ కంపెనీల పవర్కు ప్రభుత్వం తలొగ్గరాదు.డా‘‘ కొల్లా రాజమోహనరావు వ్యాసకర్త నల్లమడ రైతు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు -
చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన అమరావతి రైతులు
సాక్షి,గుంటూరు: అమరావతి విస్తరణ కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రైతులు షాకిచ్చారు. రాజధాని విస్తరణకు తమ భూముల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.అమరావతి రాజధాని విస్తరణ కోసం కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. రాజధానికి సమీపంలోని 11 గ్రామాల్లో వేలాది ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో తాడికొండ మండలం బేజాత్ పురంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రాజధాని విస్తరణకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని పలువురు రైతులు తేల్చి చెప్పారు. గత చంద్రబాబులో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారంటూ అధికారులను నిలదీశారు. తమ భూముల జోలికి రావొద్దని హెచ్చరించారు.అయితే, అమరావతి విస్తరణ కోసం భూమి ఇవ్వమని రైతులు అధికారులకు చెప్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది.ల్యాండ్ పూలింగ్కురాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే.రాజధాని భూముల్ని అమ్మేందుకు కుట్రమరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు.మండిపడుతున్న అమరావతి రైతులుఇప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు. -
Medical Graduates: ఇంత చదవడవం కంటే అడుక్కోవడం బెటర్
-
Thopudurthi Prakash: ఇదంతా చూస్తుంటే జగన్కి కూడా రక్షణ లేదనిపిస్తుంది..
-
యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఆ విద్యార్థుల కెరీర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంటర్న్షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని.. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణు్ణలైన వారికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? ‘చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ (ఎఫ్ఎంజీ) ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన తరువాత ఇక్కడే ఇంటర్న్షిప్ పూర్తిచేసినా, ఎందుకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా.. ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ.. ఇంటర్న్షిప్ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లాభం చేకూర్చేలా.. ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) నంబర్ ఇవ్వకపోవడం వాస్తవం కాదా? తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే.. ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగా చూస్తూ వారి కెరీర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్లో భాగం కాదా?.విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ?డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా ఇక్కడే.. మన రాష్ట్రంలోనే.. ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటిద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే.. చంద్రబాబు గారూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే వాటిని వద్దు అన్న ప్రభుత్వం దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతి కోసం స్కామ్లు చేస్తూ ఆ కాలేజీలను ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లను కూడా వద్దు అంటూ లేఖరాసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని.. కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే వారికి పీఆర్ నంబర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్ స్టేషన్లో వేశారు. తల్లిదండ్రులపైనా, విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్షిప్ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.వైఎస్ జగన్కు గోడు వెళ్లబోసుకున్న యువ వైద్యులువిదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తిచేసుకున్న యువ వైద్యులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవడంతో తామంతా విజయవాడలోని వైద్య విశ్వవిద్యాలయానికి మంగళవారం వెళ్లామన్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు తమపై దాడి చేశారని యువ వైద్యులు వైఎస్ జగన్కు వివరించారు. ఇక్కడ మెడికల్ సీట్లు రాకపోవడంతో తమ తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకోర్చి, అప్పులు చేసి మరీ తమను విదేశాలకు పంపించారని చెప్పారు. తాము కష్టపడి మెడికల్ కోర్సులు పూర్తిచేశామని, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్ష, ఇంటర్న్షిప్ చేసినా తమకు పర్మినెంట్ నంబర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఎంజీ చేసిన మరికొంతమంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇవ్వడం లేదని, గడువుకు మించి ఇంటర్న్షిప్ పేరిట గొడ్డుచాకిరీ చేయించుకున్నారని యువ వైద్యులు వైఎస్ జగన్కు వివరించారు. యువ వైద్యుల వెంట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర ఉన్నారు. -
బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ!
ఇదో అసాధారణ కేసు.. సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేం జోక్యం చేసుకోం.. కానీ ఇది న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసు.. మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులు కేవలం కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రమే. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే.. జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదు.– సింగయ్య మృతి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఘటనను రాజకీయం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటి ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. సింగయ్యను ఉద్దేశపూర్వకంగానే కారు కింద పడేసి తొక్కించారంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనను హైకోర్టు ఎండగట్టింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై బీఎన్ఎస్లోని కఠిన సెక్షన్ 105 కింద కేసు పెట్టడాన్ని తప్పుబట్టింది. జీవిత ఖైదు పడే ఈ సెక్షన్ కింద జగన్ తదితరులపై ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును తీవ్రంగా ఆక్షేపించింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సాధారణంగా ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో తాము జోక్యం చేసుకోమని, అయితే ఇది జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసని, అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని ప్రకటించింది. మాజీ సీఎం వైఎస్ జగన్తోపాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డిలపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్– ఓ వ్యక్తి మరణానికి కారణమైనప్పటికీ హత్య కానిది) కింద కేసు నమోదు చేయడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జగన్ తదితరులు కేవలం కారులో ప్రయాణిçÜ్తున్న ప్రయాణికులు మాత్రమేనని స్పష్టం చేసింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరి అని, అప్పుడు మాత్రమే ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. అయితే ఫిర్యాదును, అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే, జగన్ తదితరులకు సింగయ్యను చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదంది. సాధారణంగా తాము ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో జోక్యం చేసుకోబోమని, అయితే ఎఫ్ఐఆర్లోని నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవన్న నిర్ణయానికి వస్తే మాత్రం జోక్యం చేసుకోకుండా ఉండలేమంది. జోక్యం చేసుకోకుండా ఉండే విషయంలో ఎలాంటి నిషేధం లేదంది. అలా జోక్యం చేసుకోవాల్సినటువంటి అరుదైన కేసుల్లో ఈ కేసు కూడా ఒకటని, అందువల్ల ఈ కేసులో జోక్యం చేసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. జగన్ తదితరులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల కాపీ బుధవారం అందుబాటులోకి వచ్చింది.దుర్గారావు చెప్పింది ఇదీ...‘ఈ కేసులో నిమ్మకాయల దుర్గారావు అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ కోర్టు పరిశీలించింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఘటన జరిగిన రోజు ఉదయం 10.30–11 గంటలకు మాజీ సీఎం కాన్వాయి తాడేపల్లి వైపు నుంచి జాతీయ రహదారి వైపు వచ్చింది. కారు డ్రైవర్కు సమీపంలో మాజీ సీఎం నిలబడి ఉన్నారు. అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలందరూ ఆయన వైపు పరిగెత్తుకెళ్లారు. దీంతో మాజీ సీఎం కారు నుంచి బయటకు వచ్చి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈ సమయంలోనే కారు ఎడమ వైపు సర్వీసు రోడ్డులోకి తిరిగింది. ఓ వ్యక్తి డ్రైవరు వైపు ఉన్న కారు చక్రం కింద పడ్డారు. వెంటనే కాన్వాయిలో ఉన్న నలుగురు ఆ వ్యక్తిని పక్కకు తీసి చెట్ల కిందకు తీసుకెళ్లారు. ఆ తరువాత కాన్వాయి సర్వీసు రోడ్డులోకి వచ్చింది. అనంతరం గాయపడిన వ్యక్తిని చూసేందుకు వెళ్లా. కొద్దిసేపటికి అంబులెన్స్లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ తరువాత నాకు తెలిసింది ఏమిటంటే గాయపడిన వ్యక్తి మరణించాడు..’ అని దుర్గారావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో తెలిపారు. పోలీసులు దుర్గారావు ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని మొదట పెట్టిన బీఎన్ఎస్ సెక్షన్ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణమయ్యారంటూ)ను సెక్షన్ 105 కింద మార్చారని పేర్కొన్నారు.అలా చనిపోతారని జగన్ తదితరులకు తెలుసని పోలీసులు చెబుతున్నారు...దర్యాప్తులో భాగంగా పోలీసులు మాజీ సీఎం వెంట ఉన్న భద్రతా సిబ్బందిని విచారించారని న్యాయమూర్తి తెలిపారు. వారి వాంగ్మూలాలను నమోదు చేశారని, అనంతరం జూన్ 25న పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ఓ మెమో దాఖలు చేశారన్నారు. టర్నింగ్ తీసుకునే సమయంలో కారును వేగంగా నడపడం వల్ల ప్రజలు కారు కింద పడి మరణిస్తారని డ్రైవర్తోపాటు ఆ కారులో ఉన్న జగన్ తదితరులకు స్పష్టంగా తెలుసునని పోలీసులు ఆ మెమోలో పేర్కొన్నారన్నారు. జగన్ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్కు చెప్పారని, అందువల్లే భారీగా జనాలు ఉన్న చోట కారును వేగంగా నడిపారని పోలీసులు ఆ మెమోలో చెప్పారని తెలిపారు. అయితే సెక్షన్ 105 వర్తించాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల చనిపోతాడని తెలిసి ఉండటం తప్పనిసరని, ఈ కేసులో జగన్ తదితరులకు చంపాలన్న ఉద్దేశం గానీ, తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని తెలిసి ఉండటం గానీ జరగలేదన్నారు. అందువల్ల వారిని సెక్షన్ 105 పరిధిలోకి తీసుకురాలేరని తేల్చి చెప్పారు. -
పత్రికా స్వేచ్ఛ కొందరికే ప్రత్యేకమా?
ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే పదాలు గడచిన మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదాలు. బీఆర్ఎస్ నాయకులపై జుగుప్సాకరమైన థంబ్నైల్స్ పెట్టి వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు మహా టీవీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడి ముమ్మాటికీ ఖండనార్హమే. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదు. ఎవరు ఎవరిపై దాడి చేసినా కచ్చితంగా ఖండించాల్సిందే. ఇదే సమయంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛలు కొందరు ప్రత్యేకమైన జర్నలిస్టులకు, సెలక్టివ్ మీడియా గ్రూపులకు మాత్రమే ఉంటాయా? ఇంకెవరికీ ఉండవా? ఇప్పుడు ఈ ప్రశ్నలు సామాన్య ప్రజానీకాన్ని తొలిచేస్తున్నాయి.మహా టీవీ కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఛోటోమోటా నాయకులు సైతం తీవ్ర స్థాయిలో స్పందించి దాడిని తీవ్రాతి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా సంస్థలపై దాడులు హేయమైన చర్యగా అభివర్ణించారు. సరిగ్గా ఇక్కడే సామాన్య ప్రజానీకం గందరగోళానికి గురవుతున్నారు. ఈ దాడి జరగడానికి మూడు వారాల ముందు ‘సాక్షి’ టీవీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ఒక జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సదరు జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను, చర్చా కార్యక్రమం నిర్వహించిన యాంకర్కూ, ‘సాక్షి’ యాజమాన్యానికీ ముడి పెట్టి ఏపీలో కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ విరుచుకుపడ్డాయి. గతంలో మార్గదర్శిపై ఉండవల్లి అరుణ్ కుమార్ కేసులు వేసినప్పుడు ఇది మీడియాపై దాడి అని రామోజీరావు అంటే... ఇవే రాజకీయ పార్టీలు, నాయకులు స్వరం కలపడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏకంగా యాంకర్గా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టుపై అట్రాసిటీ కేసు కూడా పెట్టి అరెస్ట్ చేసింది. అయితే ఈ సందర్భంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, టీడీపీ మహిళా కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ‘సాక్షి’ పత్రిక ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి దాడులకు పూనుకున్నారు. ఆస్తులు ధ్వంసం చేశారు. కానీ ఈ సంఘటన ప్రజాస్వామ్యం మీద, పత్రికా స్వేచ్ఛ మీద దాడిలా ఎవరికీ కనిపించకపోవడం విచిత్రం. ఏకంగా పదికి పైగా ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తే ఒక్క కేసు లేదు, ఎవరినీ అరెస్ట్ చేయలేదు.అదే తెలంగాణకు వచ్చే సరికి... బీఆర్ఎస్ నాయకులపైనా, ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా జుగుప్సాకరంగా పెట్టిన థంబ్నైల్స్పై ఆగ్రహానికి గురైన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో సదరు టీవీ యాజమాన్యానికి సుద్దులు చెప్పడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. పైగా టీవీ ఛానల్కు అండగా నిలబడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల చర్యను తీవ్రంగా ఖండించారు. సాక్షిపై దాడి విషయంలో సమర్థింపు మాటలు మాట్లాడిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇప్పుడు మహా టీవీపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడి అంటున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు అర్థంకాక సామాన్య ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు.ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి రాజకీయ పార్టీలు సొంతగా మీడియా సంస్థలు కలిగి ఉండటం తగదని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు మీడియా సంస్థలు కలిగి ఉండటం ఈ నాటిది కాదు. కాంగ్రెస్ పార్టీ సొంతగా నేషనల్ హెరాల్డ్ పత్రికను ఎన్నో దశాబ్దాలుగా నడుపుతోంది. వామపక్షాలు సైతం ప్రతి రాష్ట్రంలో ఎప్పటి నుంచో సొంత పత్రికలు నడుపుతున్నాయి. ఇక బీజేపీ ఎంపీలు ఒకరిద్దరికి మీడియా సామ్రాజ్యాలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సంస్థను ప్రారంభించారు. ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియా సంస్థ అయ్యింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు ఎప్పటి నుంచో వార్తా పత్రికలు ఉన్నాయి. విశాలాంధ్ర పేరుతో సీపీఐ, ప్రజాశక్తి పేరుతో సీపీఎం పార్టీలు దశాబ్దాలుగా పత్రికలు నడుపుతున్నాయి. అలాగే 10 టీవీ పేరుతో సీపీఎం, 99 టీవీ పేరుతో సీపీఐలు చెరో శాటిలైట్ న్యూస్ ఛానల్ను ప్రారంభించాయి. ఇప్పుడు ఆ ఛానళ్ళ యాజమాన్యాలు మారినప్పటికీ అందులో పనిచేస్తున్న జర్నలిస్టుల్లో చాలా మంది పార్టీల అనుబంధ సభ్యులే. ‘ఈనాడు’ రామోజీరావు స్వయంగా తాను కాంగ్రెస్కు బద్ద వ్యతిరేకినని న్యాయస్ధానాల్లో చెప్పుకున్నారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మంత్రి వర్గ కూర్పు, తనకు నచ్చని మంత్రులను క్యాబినేట్ నుంచి తీసివేయించే వరకూ ‘ఈనాడు’ ఎంత కీలకంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజలందరికీ చర్విత చరణమే. ఇక ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ టీడీపీ కోసం ఏ విధంగా పనిచేస్తారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాధాకృష్ణ సహాయంతో టీడీపీలో టిక్కెట్లు ఖరారు చేయించుకున్న నాయకులెందరో లెక్కలేదు. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 7 గంటలు అవ్వగానే సాంబశివరావు అనే జర్నలిస్ట్ టీవీ 5 తెరమీదకు వచ్చి ఏడెనిమిది నిమిషాల పాటు ధర్మోపన్యాసం చేస్తూ జగన్ను తిట్టడం, చంద్రబాబును పొగడటం నిత్యకృత్యం అన్న విషయం ప్రేక్షకులందరికీ తెలుసు. సాంబశివరావు అటు వెళ్లిన వెంటనే ఇటు మూర్తి అనే మరో జర్నలిస్టు రాత్రి 9 గంటలకు వచ్చి ఇచ్చే ప్రవచనాలు వర్ణనాతీతం. ఈ ఇద్దరి మధ్యలో రాత్రి 8 గంటలకు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ అనే ఛానల్లో వెంకట కృష్ణ సూక్తిముక్తావళి ఉంటుంది. దీని సారంశం కూడా జగన్ను ఆడిపోసుకోవడం, చంద్రబాబును ఆకాశానికి ఎత్తడం! వీరందరి మధ్యలో మహా టీవీ వంశీ తనదైన శైలిలో న్యూస్ రూమ్లో కూర్చుని దర్బార్లు నడిపిస్తాడు. టీడీపీ సహజీవనం చేసే ఈ మీడియా సంస్థలు అన్నీ ఇప్పుడు ముసుగులు వేసుకుని ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతుంటే నమ్మే పరిస్థితుల్లో తెలుగు సమాజం లేదన్న విషయం అందరూ గుర్తించాలి. – రుద్రుడు ‘ తెలుగు పాఠకుడు -
తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి పించన్ల పంపిణీలో బాబు అబద్ధాలు
-
ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్ బై
-
విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజీవీడు కోర్టు బెయిలిచ్చింది. కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో కొద్ది సేపటి క్రితం విజయవాడ సబ్ జైల్ నుంచి విడుదలయ్యారు. వల్లభనేని వంశీ విడుదలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైఎస్సార్సీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం,మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవ భక్తుని చక్రవర్తిలతో పాటు వైస్సార్సీపీ శ్రేణులు, వంశీ అభిమానులు జైలు వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. -
ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో VRSకు దరఖాస్తు
-
ఛీ..ఛీ.. ఇదేం తిండి!
-
KSR లైవ్ షో: ఐపీఎస్ పోస్టుకు సిధ్ధార్థ్ కౌశల్ గుడ్ బై!
-
బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన సభా వేదికపై అసంతృప్తి గళాలు
-
Singayya Case: ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
-
ఏడాదిలోనే రాష్ట్రాన్ని పతనం అంచులకు చేర్చిన చంద్రబాబు
-
ఈడ్చి పడేశారు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): జాతీయ వైద్యుల దినోత్సవం రోజునే యువ వైద్యులను చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా అవమానించింది. తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ దగ్గర శాంతియుత నిరసన తెలియజేస్తున్న వైద్యులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. విదేశాల్లో వైద్య విద్య చదివిన తమకు మెడికల్ కౌన్సిల్ శాశ్వత రిస్ట్రేషన్ చేయకుండా తాత్సారం చేస్తూ, తమ భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తున్నారని యువ వైద్యులు విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద సోమవారం నుంచి నిరాహార దీక్షకు దిగారు. కాగా 36 గంటల అనంతరం మంగళవారం వీరి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేస్తున్న తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ సంఘ విద్రోహ శక్తులం కాదని, ప్రజలకు సేవ చేయడం కోసం రాష్ట్రంలో సీట్ దక్కక కష్టపడి విదేశాల్లో వైద్య విద్య చదివామన్నారు. వైద్యుల దినోత్సవం అని కూడా చూడకుండా అదే రోజున తమను పోలీసు వాహనాల్లోకి ఈడ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వైద్య శాఖమంత్రి సత్యకుమార్యాదవ్తో పాటు, ఇతర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు. వైద్య విద్యార్థుల అరెస్టును ఖండిస్తున్నాం.. వైద్య విద్యార్థులపై పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది. విద్యార్థులకు పర్మినెంట్ రిస్ట్రేషన్ చేయడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? రూ.కోట్లు ఖర్చు చేసి తమ పిల్లలను విదేశాల్లో డాక్టర్లుగా చదివించుకోవడం నేరమా? తమకు వెంటనే రిస్ట్రేషన్ చేయాలంటూ వారు డిమాండ్ చేయడం, శాంతియుతంగా నిరసన తెలపడం తప్పా? బాధ్యతగా వ్యవహరించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారికి వార్నింగ్ ఇవ్వడమేంటి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
సుపరిపాలన కాదు..‘సూపర్’ మోసపు పాలన
చంద్రబాబు సర్కారు ఏడాది పాలన అంతా కక్షపూరిత చర్యలు, సూపర్ సిక్స్ సహా 143 ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమే లక్ష్యంగా సాగింది.. హామీలిచ్చి ఐదు కోట్ల మంది ప్రజలను వంచించారు.. ప్రశ్నిస్తే రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరిస్తున్నారు.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. పిల్లలకు ఫీజులు లేవు.. యువతకు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగులకు భృతి లేదు.. ఇదా సుపరిపాలన?ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే రూ.1.70 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు... ఇది సుపరిపాలనా?ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన విద్య, వైద్య రంగాలతోపాటు వ్యవసాయాన్ని నీరుగార్చి కోలుకోకుండా చేశారు.. పేదలు అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ అందక అప్పుల పాలవుతున్నారు.. రైతన్నల పరిస్థితి దుర్భరంగా ఉంది.. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు.. ఇన్పుట్ సబ్సిడీ లేదు..పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు.. కనీసం బకాయిలు కూడా చెల్లించకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు... ఇదా సుపరిపాలన?గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఊరిలో విప్లవాత్మక మార్పులకు చిహ్నంగా నిలిచిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, వలంటీర్ వ్యవస్థలు కూటమి సర్కారు కుట్రపూరిత నిర్ణయాలకు నిర్దాక్షిణ్యంగా బలైపోయాయి.. ఇది సుపరిపాలనా?సాక్షి, అమరావతిరాష్ట్రంలో ప్రతి ఇంటినీ, ప్రతి వ్యక్తినీ మోసం చేసిన చంద్రబాబు సర్కారు సుపరిపాలనలో తొలి అడుగు అంటూ నేటి నుంచి ఇంటింటి ప్రచారానికి సిద్ధం కావడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. బాబు ఏడాది పాలనంతా మోసం, దగా, కుట్రలతోనే సాగిందని.. కూటమి ఎమ్మెల్యేలు ఏ మొఖం పెట్టుకుని తమ ఇళ్లకు వస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించి సుపరిపాలన అందించామని చెప్పుకోవడం సిగ్గు చేటని మండిపడుతున్నారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. వైఎస్ జగన్ హయాంలో పండుగలా అమలైన సంక్షేమ పథకాలను రద్దు చేసిన సీఎం చంద్రబాబు పేదల పొట్టగొట్టారు. రెడ్బుక్ రాజ్యాంగంతో పోలీసు వ్యవస్థను ఉండవల్లిలోని తన ఇంట్లో బంధించి శాంతి భద్రతలను దిగజార్చారు. మద్యం దుకాణాలను పచ్చ ముఠాలకు అప్పగించారు. గనులు, ఇసుకతో సహా అన్ని సహజ వనరుల దోపిడీకి తెరతీశారు. ఏడాదిలోనే రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చిన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు సుపరిపాలనకు తొలి అడుగు అంటూ డైవర్షన్ నాటకం మొదలుపెట్టారు. సుపరిపాలనలో తొలి అడుగు వేయకపోగా అధఃపాతాళానికి వేల అడుగులు వేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని ప్రజలు మండిపడుతున్నారు.‘సూపర్’ మోసాలు.. హామీలు బుట్టదాఖలుఅధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు గుప్పించి ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు పీఠమెక్కాక వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారు. సూపర్ సిక్స్ హామీలంటూ నమ్మించి దగా చేశారు. 2023లో రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలైన యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి, రైతులకు అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు, ఆడబిడ్డ నిధి కింద 19 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు ఏడాదికి రూ.18 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. తల్లికి వందనం కింద రూ.15 వేలను ఒక ఏడాది ఎగ్గొట్టి ఇటీవలే తూతూమంత్రంగా విదిలించి చేతులు దులుపుకొన్నారు. ఒక్క సిలిండర్ ఇచ్చి సూపర్ సిక్స్ను సమాధి చేశారు. ‘సంపద సృష్టించాక సంక్షేమం అమలు చేస్తాం’’ అని ఒకసారి.. ‘హామీలన్నీ అమలు చేసేశాం.. చేయలేదని ఎవరైనా అంటే వారి నాలుక మందం అనుకోవాలి...’ అంటూ చంద్రబాబు బుకాయిస్తూ, బెదిరిస్తూ ప్రజలను వంచిస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీల బాధ్యత తనదేనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపకుండా మౌనముద్ర దాల్చారు. నిర్వీర్యమైన విద్య, వైద్యం, వ్యవసాయంవైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి తొలి ఏడాది ఐదు చోట్ల 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం వాటిని కుట్రపూరితంగా అడ్డుకుని ప్రైవేటీకరణ పేరుతో తమ సన్నిహితులకు కట్టబెట్టేందుకు అడుగులు వేస్తోంది. రైతు భరోసా, ఉచిత పంటల బీమా లాంటి పథకాలను ఎగరగొట్టి అన్నదాతలను నడిరోడ్డు మీద నిలబెట్టింది. రెండు నెలలుగా కనీసం ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో అన్నదాతలు ఈ సర్కారుపై మండిపడుతూ రోడ్డెక్కి ధర్నాలకు దిగుతున్నారు. టీడీపీ కూటమి సర్కారు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. యువతకు వెన్నుపోటు..వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి 6.38 లక్షల ఉద్యోగాలను, గ్రామ–వార్డు సచివాలయాల ద్వారా 1.34 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ విడుదల చేయలేదు. ఏడాదిలో ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. గ్రూప్–2 పోస్టులను గ్రూప్–1లో కలపడం, డీఎస్సీలో 50 శాతం అర్హత మార్కుల నిబంధనతో 3 లక్షల మంది అభ్యర్థులకు అవకాశాలను దూరం చేశారు. పైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాటినే ఊడగొడుతున్నారు.రెడ్ బుక్తో టెర్రర్.. దిగజారిన శాంతి భద్రతలుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కక్ష పూరితంగా కేసులు, అరెస్టులు, దౌర్జన్యాలతో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. ఏడాదిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు పెట్టి 500 మందిని జైలుకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలపై 440 కేసులు, జర్నలిస్టులపై 63 కేసులు బనాయించి ప్రశ్నించే స్వరాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో నొక్కేస్తున్నారు. 390 హత్యలు, 766 హత్యాయత్నాలు, 198 లైంగిక దాడులతో రాష్ట్రం భయానక స్థితిలో ఉంది. చంద్రబాబు ఈ టెర్రర్ రాజ్యానికి సారథిగా మారారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అప్పుల్లో సరికొత్త రికార్డు..ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. అప్పులతో రాష్ట్రాన్ని శ్రీలంక మాదిరిగా మారుస్తున్నారని వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మిన చంద్రబాబు ఒక్క సంవత్సరంలోనే రూ.1.70 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. బడ్జెట్ పరిధిలోనే రూ.1.20 లక్షల కోట్ల అప్పులు తేగా బడ్జెట్ బయట రూ.50 వేల కోట్ల అప్పులు తెచ్చారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే అప్పులు తేవడంలో కొత్త రికార్డు సృష్టించారు.మాఫియా ముఠాలతో సహజ వనరుల లూటీవైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శక ఇసుక విధానం ద్వారా ఖజానాకు ఏటా రూ.750 కోట్ల ఆదాయం జమ చేయగా.. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల జేబులు నింపుతూ రూ.వేల కోట్ల ఇసుకను దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్, గ్రానైట్ సహా అన్ని గనులను వ్యవస్థీకృతంగా దోచుకుంటూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. విశాఖలో రూ.2 వేల కోట్ల భూమిని లులూ సంస్థకు, రూ.3 వేల కోట్ల భూమిని ఉర్సా సంస్థకు అప్పనంగా అప్పగించే కుట్ర జరుగుతోంది. ఈ సంస్థలు చంద్రబాబు సన్నిహితులవని ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీతో రాష్ట్రం అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.డైవర్షన్ పాలిటిక్స్... మభ్యపెట్టే కుతంత్రంచంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయ అగ్నిప్రమాదం, ప్రకాశం బ్యారేజ్పై కుట్ర, తిరుమల లడ్డూ వివాదం లాంటి అంశాలతో వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేశారు. తన నిర్వాకాల కారణంగా విజయవాడ వరదల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కుట్ర ఆరోపణలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టే యత్నం చేశారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, సీజ్ ది షిప్ నాటకాలతో ఈ డైవర్షన్కు ఊతమిస్తున్నారు.రద్దుల రాజ్యం... కమీషన్ల పర్వంవైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసిన కూటమి సర్కారు 2.60 లక్షల మందిని రోడ్డున పడేసింది. వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని చెప్పి మొత్తంగా ఆ వ్యవస్థనే ఎత్తివేసింది. ఎండీయూ వ్యవస్థ రద్దుతో 9,280 మంది ఆపరేటర్లు ఉపాధి కోల్పోయారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వ్యవస్థలను రద్దు చేసి టెండర్లను సన్నిహితులకు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానంతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను రద్దు చేసి పేదలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. ఇలా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దెబ్బతీసింది. -
Prasanna Kumar: ఎన్ని కుట్రలు, కుతంత్రాలైనా చేసుకో సింహం నెల్లూరులో దిగుతుంది..
-
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన సభలో నేతల అసంతృప్తి
-
Gadapa Gadapaku Meeting: పార్టీ సమావేశానికి 56 మంది పరిశీలకులు డుమ్మా
-
Asaduddin Owaisi: ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారు
-
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు
-
ఏపీలో ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఫలితాలొచ్చి 45 రోజులైనా ప్రారంభించకపోవడం ఏమిటి?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
దమ్ మారో దమ్.. కోరలు చాపిన గంజాయి మాఫియా
రాష్ట్రంలో ఊరూరా.. వీధి వీధినా.. బెల్ట్ షాపులు ఏర్పాటుచేసి మద్యం ఏరులు పారిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం, అది చాలదు.. అంతకు మించి మత్తులో జోగండంటూ యువతకు గంజాయిని చేరువ చేస్తోంది. గంజాయి క్రయ విక్రయాలు ఊరూరా నిర్విఘ్నంగా సాగేలా తన మాఫియా ముఠాకు అనధికార లైసెన్స్ ఇచ్చేసింది. ఫలితంగా ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ యువతను ఈ మహమ్మారి తన విష కౌగిలిలో బంధిస్తోంది. రాష్ట్రంలో ఏడాదిగా గంజాయి పట్టుబడని రోజే లేదు. సర్కారు నిర్లక్ష్య, స్వార్థపూరిత వైఖరి వల్ల ఎంతో మంది పిల్లలు పిచ్చోళ్లుగా మారిపోతున్న దయనీయ పరిస్థితి నిత్యం కళ్లకు కడుతోంది. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూ స్థాపితం చేసిన గంజాయి భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పైకి తీసింది. సీసా మూత తీసి రాష్ట్రంపైకి విడిచి పెట్టింది. దానిని ఒడిసి పట్టుకున్న టీడీపీ గంజాయి మాఫియా ముఠా దాంతో రాష్ట్రాన్ని కకావికలం చేస్తోంది. ఫలితంగా గంజాయి మత్తు మార్కెట్ గుప్పుమంటూ నగరాల నుంచి పల్లెల వరకు కోరలు చాపింది. దమ్ మారో దమ్.. గంజాయి దమ్ము బిగించి కొట్టండంటూ యువతను ఊగించడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్వాకంతో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్కు తలుపులు బార్లా తెరుచుకున్నాయి. యావత్ దక్షిణాదిలో గంజాయి స్మగ్లింగ్కు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారింది. వెరసి ఆ ముఠా, రాష్ట్రాన్ని రీటైల్ మార్కెట్గా.. యావత్ దక్షిణాదిని హోల్సేల్ మార్కెట్గా చేసుకుని యథేచ్చగా దోపిడీకి పాల్పడుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టీడీపీ సీనియర్ నేతలు కీలక సూత్రధారులుగా, ఏఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతలు పాత్రధారులుగా వ్యవస్థీకృతమైన ఈ గంజాయి మాఫియాకు రాష్ట్ర స్థాయి టీడీపీ అగ్రనేతలు, పెద్దలు రింగ్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రెడ్బుక్ కుట్రల చట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఇరికించి, గంజాయి మాఫియాకు అడ్డు లేకుండా చేసింది. తొలి ఏడాదిలోనే రూ.25 వేల కోట్లు కొల్లగొట్టడం టీడీపీ గంజాయి మాఫియా దోపిడీ స్థాయిని వెల్లడిస్తోంది. రానున్న నాలుగేళ్లలో మరింత భారీ దోపిడీకి కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా టీడీపీ గంజాయి మాఫియా తన నెట్వర్క్ను పక్కాగా విస్తరించిన వైనం విస్తుగొలుపుతోంది.తొలి ఏడాదే రూ.25 వేల కోట్ల దందా చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) దెబ్బకు తోకముడిచి రాష్ట్రం విడిచి పెట్టిన మాఫియా.. గత ఏడాది అల్లూరు సీతారామరాజు(ఏఎస్ఆర్) జిల్లాలో దర్జాగా అడుగు పెట్టింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దులు (ఏవోబీ) ప్రధాన కేంద్రంగా చేసుకుని గంజాయి స్మగ్లింగ్ దందాకు తెరతీసింది. ప్రధానంగా ఒడిశా, చత్తీస్ఘడ్ల నుంచి భారీగా గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఊరూ వాడా రిటైల్ విక్రయాలతోపాటు.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు హోల్సేల్గా భారీగా స్మగ్లింగ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ డీఆర్ఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2024–25లో ఏవోబీ నుంచి రూ.8 వేల కోట్ల విలువైన గంజాయిని కొనుగోలు చేసి అక్రమ రవాణా చేశారు. ఆ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.25 వేల కోట్ల పైమాటే. అంటే కేవలం ఏడాదిలోనే టీడీపీ మాఫియా ఏకంగా రూ.17 వేల కోట్లు అడ్డగోలుగా ఆర్జించిందన్నది స్పష్టమవుతోంది. నెలకు సగటున రూ.2 వేల కోట్లకు పైగా గంజాయి స్మగ్లింగ్ దందాకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర స్థానంగా మారిందన్నది నిగ్గు తేలుతోంది. ఏవోబీలో తలుపులు బార్లా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోసారి గంజాయి స్మగ్లింగ్కు గేట్వేగా మార్చేసింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి స్మగ్లింగ్ దందాను సాగించిన టీడీపీ నేతలే మరోసారి రంగంలోకి దిగారు. ఏవోబీలోని మన రాష్ట్ర పరిధిలో దశాబ్దాలుగా సాగిన గంజాయి సాగును వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా కట్టడి చేసింది. ఆపరేషన్ పరివర్తన్ పేరిట రెండు దశల్లో ప్రత్యేక కార్యాచరణను విజయవంతంగా నిర్వహించింది. 2019 నాటికి రాష్ట్రంలో దాదాపు 12 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 11,800 ఎకరాల్లో గంజాయి సాగును కూకటి వేళ్లతో సహా పెకలించి వేసింది. రూ.150 కోట్లతో గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. 2024 నాటికి రాష్ట్రంలో గంజాయి సాగు 99 శాతం తగ్గిపోవడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. కాగా గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ గంజాయి మాఫియా మరోసారి ఉమ్మడి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో వాలిపోయింది. ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి సాగు దాదాపుగా నిలిచిపోవడంతో టీడీపీ మాఫియా కొత్త ఎత్తుగడ వేసింది. సరిహద్దుకు అవతల ఒడిశా, చత్తీస్ఘడ్లో భారీగా సాగు చేస్తున్న గంజాయిని కొనుగోలు చేసి.. ఏపీ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు భారీ స్మగ్లింగ్కు ఎత్తుగడ వేసింది. అంటే మరో మాటలో చెప్పాలంటే గంజాయి అక్రమ రవాణాకు రాష్ట్రాన్ని గేట్వేగా మార్చేసింది.జవసత్వాలు లేని ఈగల్⇒ గంజాయి, డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెబ్ను ప్రత్యేకంగా నెలకొల్పింది. సెబ్కు పూర్తి స్థాయి చీఫ్గా నిబద్దుడైన వినీత్ బ్రిజ్లాల్ను నియమించి పూర్తి మౌలిక వసతులు కల్పించింది. అందుకే రెండు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ అంతగా విజయవంతమైంది. ఇంతటి ఫలితాలిచ్చిన సెబ్ను చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది.⇒ దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) పేరుతో ఓ విభాగాన్ని నెలకొల్పింది. కానీ ఈగల్ విభాగానికి తగిన మౌలిక వసతులు కల్పించనే లేదు. ఈగల్ చీఫ్గా ఆకే రవి కృష్ణను నియమించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆయన చేతులు మాత్రం కట్టేసిందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఆయన్ను రెడ్బుక్ కుట్రలకు పావుగా వాడుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుండటం గమనార్హం. ⇒ ఈగల్ చీఫ్గా ఉన్న ఆయన్ను కాకికాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అంటూ నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం సిట్ ఇన్చార్జ్గా నియమించింది. మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట తిరుపతికి చెందిన మదన్ అనే కానిస్టేబుల్పై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానిస్టేబుల్ మదన్ ఫిర్యాదుపై విచారణ అధికారిగా కూడా ఆకే రవి కృష్ణనే ప్రభుత్వం నియమించడం గమనార్హం. ⇒ అంటే ఆయనపై ఇతరత్రా పని భారాన్ని పెంచడం ద్వారా గంజాయి స్మగ్లింగ్ కట్టడిపై దృష్టి సారించకుండా అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. గంజాయి స్మగ్లింగ్ కట్టడిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఇప్పటికే గుర్తించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని సమాచారం.డీ అడిక్షన్ కేంద్రాలకు గ్రహణంగంజాయి వ్యసనం బారిన పడిన యువతను తిరిగి సన్మార్గంలో పెట్టేందుకు నెలకొల్పిన డీ అడిక్షన్ కేంద్రాల గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డీ అడిక్షన్ కేంద్రాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీగా నిధులు కేటయించగా, టీడీపీ ప్రభుత్వం మాత్రం అరకొరగానే నిధులు విదిల్చడమే అందుకు నిదర్శనం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డీ అడిక్షన్ కేంద్రాలకు 2021–22లో రూ.3.12 కోట్లు, 2022–23లో రూ.3.99 కోట్లు, 2023–24లో రూ.6.33 కోట్లు చొప్పున వెచ్చించింది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో కేవలం రూ.1.10 కోట్లే కేటాయించడం గమనార్హం. అంటే యువత గంజాయి మత్తులో జోగితేనే తమ మాఫియా అడ్డగోలు దోపిడీ యథేచ్ఛగా సాగుతుందన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఉద్దేశం అని స్పష్టమవుతోంది.మూడు రూట్లు.. ఆరు లారీలు...టీడీపీ మాఫియా తమ ఏజెంట్లను అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలోకి పంపించింది. ప్రధానంగా కేరళ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారిని ఎంపిక చేసుకుని మరీ ఏజెన్సీ ప్రాంతంలో తిష్టవేసేట్టు చేసింది. వారికి ఏజెన్సీలో అద్దె ఇళ్లు, ఇతర సౌకర్యాలను టీడీపీ నేతలే సమకూర్చారు. ఆ ఏజంట్లు ఏఎస్ఆర్ జిల్లాతోపాటు సరిహద్దులకు అవతల ఒడిశా, చత్తీస్ఘడ్లోని గంజాయి సాగు చేసేవారితో సంప్రదింపులు జరుపుతూ భారీగా గంజాయి కొనుగోలు చేస్తున్నారు. దాన్ని యావత్ దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు దర్జాగా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ, కర్ణాటకలో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లా కేంద్రంగా సాగుతున్న వ్యవస్థీకృత మాఫియా బాగోతం బట్టబయలైంది. ఈ విషయంపై తెలంగాణ, కర్ణాటక పోలీసులు ఇప్పటికే ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం టీడీపీ మాఫియా ఏఎస్ఆర్ జిల్లా నుంచి దక్షిణ భారతదేశానికి భారీగా అక్రమ రవాణా చేస్తున్న మూడు ప్రధాన మార్గాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యా సంస్థలే లక్ష్యంగా పచ్చ నెట్వర్క్అంతర్రాష్ట్ర స్థాయిలో అక్రమ రవాణానే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా గంజాయి మార్కెట్ విస్తరణపై టీడీపీ మాఫియా రంగంలోకి దిగింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నేతల ప్రధాన అనుచరులు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని టీడీపీ ద్వీతీయ శ్రేణి నేతలతో ఓ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం గమనార్హం. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతోపాటు ఇతర ఉన్నత విద్యా సంస్థలనే గంజాయి విక్రయ మార్కెట్గా చేసుకున్నారు. అందుకోసం విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర జిల్లా కేంద్రాల్లో స్టాక్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రత్యేకంగా వెండర్లను సైతం ఎంపిక చేసుకున్నారు. పాన్ షాపులు, చిన్న చిన్న హోటళ్లు, సంచార వర్తకులు.. ఇలా పలువురిని తమ నెట్వర్క్లో భాగస్వాములుగా చేసుకుని చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట గంజాయి విక్రేతలను స్థానిక పోలీసులు గుర్తించి అరెస్టు చేస్తుండటం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి మంత్రి లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి వరకు ప్రతి చోటా గంజాయి ప్యాకెట్లను చాకెట్ల మాదిరిగా విక్రయిస్తుండటం విస్మయ పరుస్తోంది.టీడీపీ మాఫియాను కాపాడేందుకు అమాయకులపై అక్రమ కేసులురాష్ట్రంలో టీడీపీ గంజాయి మాఫియాను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేసేందుకు బరితెగిస్తోంది. ఈ కుట్రలో పోలీసులు భాగస్వాములు కావడం విస్మయ పరుస్తోంది. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం లేని ఆరుగురు యువకులను అక్రమ కేసులో ఇరికించడం ద్వారా టీడీపీ నేతలను కాపాడేందుకు పోలీసుల పన్నాగం బట్టబయలైంది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సీఐ, బొమ్మూరు ఎస్సై మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తద్వారా టీడీపీ గంజాయి బ్యాచ్ను కాపాడేందుకే పోలీసులు ఇంతగా బరితెగిస్తున్నారన్నది స్పష్టమైంది.టీడీపీ గంజాయి మాఫియాలో చిన్న మొక్కలివి..⇒ రాయదుర్గంలో ఓ టీడీపీ నేత తన మామిడి తోటలోనే దర్జాగా గంజాయి సాగు చేశారు.⇒ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇటీవల సాగైన గంజాయి వ్యవహారం బట్టబయలైంది. ఇదే నియోజకవర్గంలో ఇరు వర్గాల యువకులు గంజాయి మత్తులో పరస్పరం దాడులు చేసుకున్నారు.⇒ మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో మిత్ అనే పేరుతో చలామణి అయ్యే రూ.3 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.⇒ మొక్కల లోడ్ ముసుగులో ఏకంగా 326 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా తూర్పు గోదావరి జిల్లా కడియంలో పోలీసులు జప్తు చేశారు. ⇒ సూళ్లూరుపేటలో రూ.3.50 లక్షల విలువైన 20 కిలోల గంజాయిని పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. -
బాలికల విద్య భ్రష్టు!
గత శాసనసభ సమావేశాల్లో హైస్కూల్ ప్లస్(ఇంటర్)లలో ప్రవేశాల్లేవని.. ఫలితాలు రావడం లేదని, వాటిని రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ సెలవిచ్చారు. ఈ నెపంతో టీడీపీ కూటమి ప్రభుత్వం పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్)లు రిటైరైన చోట కొత్త వారిని నియమించలేదు. ఇప్పుడు తాజా బదిలీల్లోనూ ఇక్కడ పని చేస్తున్న పీజీటీలను బదిలీ చేశారేగానీ, వారి స్థానంలో కొత్త వారి నియామకాలు చేపట్టలేదు. ఈ స్కూళ్లు విజయవంతమవుతుండటంతో వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బాలికల విద్యను భ్రష్టుపట్టిస్తోంది. గ్రామీణ బాలికలకు స్థానికంగా ఇంటర్ విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోంది. మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఉండాలన్న లక్ష్యంతో 2022లో రెండు విడతల్లో 504 హైస్కూల్ ప్లస్లను ప్రారంభించగా, వాటిలో ఒకటి బాలికల కోసం, మరొకటి కో–ఎడ్యుకేషన్ విధానంలో అందుబాటులోకి తెచ్చారు. అయితే, వైఎస్ జగన్పై అక్కసుతో నాటి ప్రభుత్వంలోని విద్యా సంస్కరణలను ఒకొక్కటిగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇందులో భాగంగా హైస్కూల్ ప్లస్ల్లో పని చేస్తున్న పీజీటీలను ఇటీవల బదిలీల్లో బయటకు పంపి, వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆయా స్కూళ్లల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. జీఓ నంబర్ 117 రద్దులో భాగంగా హైస్కూల్ ప్లస్లను రద్దు చేస్తామని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. ఈ జీఓ ఉపసంహరణ మార్గదర్శకాలు, ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో హైస్కూల్ ప్లస్లను ఇంటర్మీడియట్ బోర్డుకు అప్పగిస్తామని ఒకసారి.. కాంట్రాక్టు టీచర్లను నియమిస్తామని మరోసారి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ దిశగా కూడా చర్యలు తీసుకోక పోవడం చూస్తుంటే వీటిని నిర్వీర్యం చేసి.. ఎత్తేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇట్టే తెలుస్తోంది. కుట్రలో కీలక అడుగు⇒ నిజానికి.. రాష్ట్రంలోని 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్గా గత ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. రెండో విడతలో మరో 210 హైస్కూళ్లతో కలిపి మొత్తం 504 హైస్కూల్ ప్లస్లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, కేజీబీల్లో సైతం ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. 2022–23 విద్యా సంవత్సరంలో 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ⇒ వీటిల్లోని విద్యార్థుల ఇంటర్ తరగతుల బోధనకు సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు 1,850 మందిని పీజీటీలుగా నియమించింది. ఇప్పుడు వీరిలో సగం కంటే ఎక్కువ మందిని కూటమి ప్రభుత్వం బదిలీ చేసి, వారి స్థానంలో ఎవరినీ నియమించకుండా తన కుట్రలో కీలక అడుగు వేసింది. దీంతో ఈ ఏడాది హైస్కూల్ ప్లస్ల్లో చేరిన విద్యార్థులకు బోధనా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లోనూ వాటిల్లో ప్రభుత్వం పీజీటీలను కేటాయించక పోవడంతో అక్కడ బోధన కుంటుబడింది. ఫలితంగా పిల్లలంతా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు వెళ్లేలా ప్రభుత్వమే వెనుక ఉండి తతంగం నడిపిస్తుండటం దుర్మార్గానికి పరాకాష్ట. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని రొట్టవలస హైస్కూల్ ప్లస్లో మ్యాథ్స్, బోటనీ, జువాలజీ పీజీటీలు పదోన్నతిపై ఇతర స్కూళ్లకు బదిలీ అయ్యారు. హరిపురం హైస్కూల్ ప్లస్లోని జువాలజీ పీజీటీ ఏడాది క్రితం రిటైరైనా ఇప్పటిదాకా నియమించలేదు. ఉర్లాం హైస్కూల్ ప్లస్లో నాలుగు పీజీటీ ఖాళీలను భర్తీ చేయలేదు. చిత్తూరు జిల్లాలో 10 హైస్కూల్ ప్లస్లలో 35 పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులున్నా హైస్కూల్ ప్లస్లను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనడానికి ఇలాంటి ఉదాహరణలు ప్రతి మండలంలోనూ కనిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమూల విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాల ప్రశంసలు పొందాయి. స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో విద్యా రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చారు. పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపు దిద్దుకున్నాయి. ఫలితంగా నాడు సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమివ్వడం చూశాం. ఎన్నో జాగ్రత్తలతో విద్యార్థుల యూనిఫాం కిట్ పంపిణీ చేశారు. ⇒ ఇప్పుడివన్నీ గతం. గత ప్రభుత్వంలో విజయవంతంగా అమలైన విద్యా సంబంధిత పథకాలు, కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. పాఠశాలల్లో నాడు–నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఇంగ్లిష్ మీడియంకు మంగళం పాడింది. డిజిటల్ క్లాస్ రూమ్లు, టోఫెల్ క్లాసులకు టాటా చెప్పింది. సబ్జెక్ట్ టీచర్లపై వేటు వేసింది. గోరుముద్దను ఘోరంగా మార్చింది. సీబీఎస్ఈ సిలబస్, ఐబీ, ట్యాబులు అక్కర్లేదంది. ⇒ దీంతో ఫలితాలు పడిపోయాయి. ఫలితంగా ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. తద్వారా ప్రైవేటు యాజమాన్యాలకు మేలుచేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఇట్టే తెలిసిపోయింది.ప్రభుత్వ చదువులపై విశ్వాసం పోతోంది గత ప్రభుత్వం గ్రామీణ పేద విద్యార్థుల కోసం హైస్కూల్ ప్లస్ పేరిట ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చింది. అవి బాగా విజయవంతమయ్యాయి. కానీ, కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ నిర్వీర్యమవుతున్నాయి. వీటిల్లో బోధనకు పీజీటీల్లేరు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు అభద్రతాభావనకు లోనై ప్రభుత్వ చదువులపై విశ్వాసం కోల్పోతున్నారు. హైస్కూల్ ప్లస్లను ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో తేల్చాలి. పీజీటీ ఖాళీలను అర్హతగల స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలి. – వి.రెడ్డి శేఖర్రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ -
మనుగడ కోసం ‘మహా’ కుట్ర!
సుభద్రాదేవి గర్భంతో ఉన్న సమయంలో ఒకసారి అర్జునుడు ఆమెకు యుద్ధరంగంలో పద్మవ్యూహానికి సంబంధించిన జ్ఞానాన్ని బోధిస్తున్నాడట! ఆమె నిద్రలోకి జారుకోవడాన్ని గమనించకుండా అర్జునుడు చెప్పడం కొనసాగిస్తుండగా గర్భస్థ శిశువైన అభిమన్యుడు ఊ... కొడుతూ వింటున్నాడట! పద్మ వ్యూహంలో ఎలా ప్రవేశించాలనే ఉపదేశాన్ని పూర్తిచేసి, ఎలా నిర్గమించాలనే కథను అర్జునుడు ప్రారంభిస్తాడు. అదే సమయంలో కృష్ణపరమాత్ముడు ప్రత్యక్షమై సుభద్ర నిద్రపోతు న్నది... ఇక చాల్లే అని ఆపించాడట! ఆ రకంగా అభిమన్యుడు పద్మవ్యూహ ప్రవేశాన్ని గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే క్షుణ్ణంగా నేర్చుకోగలిగాడు. భారత రామాయణాది ఇతిహాసాలు, పురా ణాలు మన సంస్కృతిలో భాగం కనుక, వాటికి సంబంధించిన కథలన్నీ నమ్మాలనే కట్టుబాటు ఉన్నది కనుక ఈ కథను కూడా మనం నమ్ముతాము.ఈ కాలంలో కూడా అంతకు మించిన వండర్ టెలీపతీ ఉన్నదనే సంగతి నిన్ననే తెలిసింది. ‘ఏపీ పోలీస్–హ్యాకథాన్ –25’ అనే పేరుతో నిన్న గుంటూరులో ఒక టెక్నాలజీ సదస్సు జరిగింది. సందర్భం ఏదైనా సరే, టెక్నాలజీకి ఆది మధ్యాంతాలు తానేనని చెప్పుకోవడం చంద్రబాబు ఆనవాయితీ. అదే ఒరవడిని ఇక్కడ కూడా కొనసాగించారు. దేశంలో ఆటోలు, మోటార్ బైక్ల ఊబరైజేషన్ కోసం రూపొందించిన ‘ర్యాపిడో’ వృత్తాంతాన్ని ఆయన సభికులకు వివరించారు. ఆ యాప్ను రూపొందించిన వ్యక్తి తండ్రి గతంలో తెలుగుదేశం పార్టీ కార్య కర్తగా ఉండేవారట! అందువల్ల బాబు దగ్గరికి వస్తూపోతూ ఆయన చెప్పే సంగతులన్నీ వినేవారట. అలా విన్న ఫలితమే ఆయన కుమారుడు ర్యాపిడో యాప్ను డెవలప్ చేయడానికి కారణమైందట! చంద్రబాబు చేసిన జ్ఞానబోధ తండ్రి తలలోంచి తరంగయానం చేసి కుమారుడి మేధను తేజోమయం చేసిందన్నమాట!ఇటువంటి విడ్డూరాలను శషభిషలేమీ లేకుండా చెప్పు కోవడం చంద్రబాబుకు పరిపాటే! భారతదేశానికి ఐటీని పరి చయం చేసిందీ, సెల్ఫోన్ తీసుకొచ్చిందీ తానేనని చెప్పు కోవడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఎవరూ మరిచి పోకుండా ఉండడానికి ఆయన మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తూనే ఉంటారు. కలామ్ను రాష్ట్రపతిని చేసిందీ, వాజ్పేయికి జ్ఞానో దయం కలిగించి ‘స్వర్ణ చతుర్భుజి’ పథకానికి శ్రీకారం చుట్టించిందీ తానేనని కూడా ఆయన చెప్పుకున్నారు. సత్య నాదెళ్ల,పీవీ సింధు విజయాల వెనుక తన పాత్ర, కోవిడ్కు వ్యాక్సిన్ కనిపెట్టడం వెనుక తన దూరదృష్టీ వగైరాల గురించి పలు సందర్భాల్లో ఆయన నొక్కి వక్కాణించారు. ఇటువంటి వాగాడంబరాన్ని చూసి చాలామంది చాలారకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఎటువంటి అనుమానమూ అవసరం లేదు. ఆయన పూర్తి స్వస్థతతోనే ఇలా మాట్లాడుతుంటారు. ఉద్దేశ పూర్వకంగానే ఆయన ఈ హాస్యరసాన్ని పండిస్తుంటారు.ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైపోతుందనే గోబెల్స్ సూత్రాన్ని ఆయన తన పొలిటికల్ ఫిలాసఫీకి పునాదిగా భావిస్తారు. తాను వందసార్లు చెబితే వెయ్యిసార్లు రీసౌండ్ ఇచ్చేందుకు యెల్లోమీడియా ఉండనే ఉన్నది. ఈ సూత్రాన్ని ప్రత్యర్థులను అప్రతిష్ఠ పాల్జేయడానికీ, తనను ప్రమోట్ చేసు కోవడానికీ రెండు వైపులా పదునున్న కత్తిలా ఆయన వాడుతుంటారు. ఇప్పుడీ కత్తిని దూయడం బాగా ఎక్కువైంది. తనకి ప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న అఖండ ప్రజాదరణ ఆయనకు కలవరం కలిగిస్తున్నది. ఇంచుమించు తన రాజకీయ అనుభవంతో సమానమైన వయసున్న జగన్ మాస్ ఇమేజ్ ఎన్ని జన్మలెత్తితే తనకు లభించాలి? లభించదు! అందుకే ఆయనపై దాడి. ఆయన వ్యక్తిత్వంపై కనీవినీ ఎరుగని దాడి. కోడికత్తి, తల్లీ – చెల్లీ, బాబాయ్–గొడ్డలి అనే పసలేని పదబంధాలతో అరిగిపోయిన రికార్డుల్నే ఆశ్రయిస్తూ చేస్తున్న అనైతిక దాడి. మద్య నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఒక మంచి పాలసీకి సైతం అవినీతి మరక అంటించేందుకు ఆపసోపాలు పడుతూ చేస్తున్న అసహ్య కరమైన దాడి.ఏడాది గడిచిపోయింది. జగన్ వ్యక్తిత్వ హననం కోసం ఎక్కుపెట్టిన దాడులు, ఆయన పార్టీ శ్రేణుల్ని చెల్లాచెదురు చేయడానికి పెడుతున్న కేసులు, చేస్తున్న అరెస్టులు ఫలిత మిస్తున్న సూచనలేవీ కనిపించడం లేదు. పైపెచ్చు ఎదురుదాడి మొదలైంది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక గళం వీధివీధినా ప్రతిధ్వనిస్తున్నది. ఇక వ్యక్తిత్వ హనన కార్యక్రమమొక్కటే సరిపోదని, ఇంకేదో పెద్ద దాడే జరపాలని భావిస్తున్నట్టు పలు వురు అనుమానిస్తున్నారు. జగన్పై ఏదో దారుణమైన కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రజలు బహిరంగంగానే శంకిస్తున్నారు. ఈ అనుమానాలను నిజం చేస్తూ జగన్ను ఉద్దేశించి ‘ఆ భూతం తిరిగి రాదు, భూస్థాపితం చేస్తాన’ని ముఖ్యమంత్రి చెబు తున్నారు. టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. పెట్టుబడిదారు లతో జరిగే సమావేశాల్లో చెబుతున్నారు. పోలీసు అధికారుల సమావేశాల్లోనూ అదే రాజకీయ ఉపన్యాసం. కలెక్టర్ల మీటింగ్ లోనూ అదే తరహా సంస్కారహీనమైన ప్రసంగం.‘జగన్ మళ్లీ వస్తే ఎలా’ అని పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎప్పుడు ప్రశ్నించారో తెలియదు. జగన్ హయాంలో పారి పోయిన కంపెనీలేమిటో చెప్పరు. కూటమి వచ్చాక రూపాయికి ఎకరం ఇస్తామంటే తప్ప పరుగెత్తుకొచ్చిన ఇతర కంపెనీలేమిటో చెప్పరు. నిజానికి వాస్తవాలను పరిశీలిస్తే పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. కూటమి నేతల కప్పం డిమాండ్లకు బెదిరి‘ఇండియా సిమెంట్స్’ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. చెట్టినాడు, భవ్య సిమెంట్లు లంచాలివ్వలేక లాకౌట్లు ప్రకటించాయి. నవీన్ జిందాల్పై తప్పుడు కేసు పెట్టి వేధిస్తే జెఎస్డబ్లు్య కంపెనీ రాష్ట్రాన్ని వదిలేసి మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నది. మామూళ్ళ కోసం కూటమి నేతలు యూబీ కంపెనీ లారీలను అడ్డుకున్న ఖ్యాతి ఢిల్లీ సర్కార్ను కూడా తాకింది. గ్రీన్టెక్ రీమిక్స్లో, కోకాకోలా ప్లాంట్లో స్థానిక ఎమ్మెల్యేలు లంచాలు డిమాండ్ చేసి రచ్చ కెక్కారు. రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కోసం ఎమ్మెల్యే లారీలను అడ్డుకొని గబ్బు లేపాడు. కూటమి పాలనలో ఇటువంటి ఘటనలను డజన్లకొద్దీ ఉదాహరించవచ్చు.ఇక రూపాయికి ఎకరం కోటా పెట్టుబడిదారులను మిన హాయించి కూటమి సర్కార్ తెచ్చిన పెట్టుబడులు ఏమున్నాయి? ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్ ఎనర్జీ కోసం లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు జగన్ హయాంలోనే ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు, భూ బదలాయింపులు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. జగన్ హయాంలో ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరి గాయి. ‘అవి మా ఘనతే’నని ఇప్పుడు కూటమి సర్కార్ ప్రక టించుకుంటున్నది. జగన్మోహన్రెడ్డి దావోస్లో ఆదిత్య మిట్టల్తో సమావేశమై స్టీల్ ప్లాంట్ స్థాపనకు ఒప్పందం చేసుకుంటే అది కూడా బాబు తన జేబులో వేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఏపీలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగం పారి శ్రామికవేత్తలను భయకంపితులను చేస్తున్నది. రాష్ట్రానికి రావడా నికి వారు నిరాకరిస్తున్నారు. కాని, జగన్కు భయపడి పరిశ్ర మలు వెళ్ళిపోయాయనే తప్పుడు ప్రచారాన్ని మాత్రం కూటమి నేతలు హోరెత్తిస్తున్నారు. యెల్లో మీడియా గగ్గోలు పెడు తున్నది.జగన్ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఒకటికి రెండు సార్లు అనగానే, ఓ వృద్ధ నేత జగన్ తల నరుకుతానంటూ బీపీ పెంచుకుంటాడు. ఒకరి తర్వాత ఒకరు చొప్పున కూటమి నేతలు ఇటువంటి ప్రకటనలే చేస్తారు. జగన్మోహన్రెడ్డి జనంలోకి వెళ్తున్నప్పుడు ఆయనకు ఇవ్వాల్సిన జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను నిరాకరించడం ద్వారా కూటమి సర్కార్ తన ఉద్దేశాన్ని బయటపెట్టుకుంటున్నది. ఆయనొక విశేష ప్రజా దరణ కలిగిన మాస్ లీడర్. ఆయన బయటకు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ స్థాయిలో ఆయన వెంట నడుస్తా రన్నది అనేకమార్లు రుజువైంది. పోలీసులకు ప్రత్యేకంగా చెప్ప వలసిన పని లేదు. రాప్తాడు హెలిప్యాడ్ను అసంఖ్యాక జన సమూహం చుట్టుముట్టిన విజువల్స్ను టీవీల్లో చూడలేదా? ఆయన రోడ్డు ప్రయాణాల్లో వాహనాన్ని చుట్టుముట్టి కారు బానెట్పైకి కూడా ఎగబాకడం కనిపించలేదా? ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోతే ఆయనంటే గిట్టని శక్తులు సమూహంలో చొరబడి ఆయన సమీపానికి చేరుకునే అవకాశం లేదా? అటువంటిదేదో జరగాలనే ఉద్దేశం లేకపోతే ఆయన భద్రతను ఎట్లా ఉపేక్షిస్తారు? ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, కుట్రపూరిత నిర్లక్ష్యం!ఈ వ్యవహారంపై పోలీసులు చెబుతున్న కహానీ చిత్రంగా ఉన్నది. మేము వందమందికి మాత్రమే అనుమతిచ్చాము, కానీ వాళ్ళు వేలాదిమంది వెళ్లారని పోలీసుల అభియోగం. ప్రజలు వేలాదిగా తరలిరావాలని జగన్మోహన్రెడ్డి గానీ, ఆయన పార్టీ వాళ్ళు గానీ దండోరా వేయలేదే? వార్త తెలిసిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వాళ్ళను అడ్డుకోవడానికి రెంటపాళ్ల చుట్టూ ఇరవై చెక్పోస్టులు పెట్టి పోలీసుల్ని మోహరించారు కదా! నియంత్రించగలిగారా? రోడ్డు మీద అడ్డుకుంటే చేలల్లోంచి, చెలకల్లోంచి, వంకల్లోంచి, డొంకల్లోంచి తండోప తండాలుగా జనం చేరుకోలేదా? చెక్పోస్టుల్లో మోహరించిన పోలీసు సైన్యాన్ని జగన్ భద్రత కోసం కేటాయిస్తే అవాంఛనీయ సంఘటనలేమీ జరగవు కదా! అవాంఛనీయ ఘటనలు జరగా లన్నదే ప్రభుత్వ ఉద్దేశమైనపుడు, అందుకోసమే కుట్ర చేస్తున్నప్పుడు ఈవిధంగా ఆలోచించడం కూడా కుదరని పని.ఈ కార్యక్రమంలో ఒక వైసీపీ అభిమాని దురదృష్టకర మరణాన్ని కూడా కుట్రపూరిత కథకు ఉపయోగించుకోవడం రోత పుట్టించే చర్య. మరో కారు కింద పడి గాయాలైన సింగయ్య మృతి చెందాడని ప్రకటించిన ఎస్పీ, మూడు రోజుల తర్వాత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ప్లేటు మార్చిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గమనించారు. ఒక ఫేక్ వీడియోను సృష్టించి జగన్ ప్రయాణించే కారు కిందనే పడి సింగయ్య మర ణించాడనే కథను ప్రచారం చేశారు. మూడు నాలుగు రోజుల పాటు యెల్లో మీడియా దీనిపై వీరంగం వేసింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకురాలు మాత్రం కూటమి తానా అంటే తందానా అనే స్థాయికి దిగజారిపోయారు. సింగయ్య మరణంపై ఎస్పీ ముందుగా చెప్పిన ప్రకారం నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్కు వర్తించే సెక్షన్లపై కేసులు పెట్టారు. జగన్మోహన్రెడ్డి కారును రంగంలోకి దించిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ప్రమాదం చేసినట్టు సెక్షన్లు మార్చారు. తమ పార్టీ కార్యకర్తను జగన్మోహన్రెడ్డితో పాటు అందులో ఉన్న వాళ్లంతా హత్య చేసే ఉద్దేశంతో కారు ఎక్కించారట! వాహనం ప్రమాదం చేస్తే అందులో ఉన్న ప్రయాణికులు ఎట్లా బాధ్యత వహిస్తారని ఉన్నత న్యాయస్థానమే చీవాట్లు వేయవలసి వచ్చింది. సాక్ష్యాధా రాలతో మళ్ళీ వస్తామని ప్రభుత్వ లాయర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మరి ఏ సాక్ష్యాలున్నాయని కూటమి నేతలు, యెల్లో మీడియా నిపుణులు వీరంగం వేశారో?జగన్ భద్రతపై కూటమి సర్కార్ కపట నాటకమాడు తున్నది. ఒక ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన భద్రతను ఇస్తున్నామని హోంమంత్రి చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డి కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఒంటరిగా పోటీలోకి దిగిన ఆయన పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి. మూడు పార్టీల కూటమికి 55 శాతం ఓట్లు పడ్డాయి. అవన్నీ నిజంగానే పడ్డాయని వాదన కోసం ఒప్పుకుందాం. 2024 ఎన్నికలపై పరిశోధన చేసిన వోట్ ఫర్ డెమోక్రసీ (విఎఫ్డీ) అనే సంస్థ అనేక అనుమానాలు వ్యక్తం చేసిన సంగతిని వదిలేద్దాం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి ఎనిమిది గంటలకు తుది ప్రకటన చేసిన తర్వాత, వారం రోజుల పిదప అనూహ్యంగా పన్నెండున్నర శాతం ఓట్లు పెరిగిన మాయాజాలాన్ని కూడా వదిలేద్దాం. ఈవీఎమ్లలో ఎన్నికలు జరిగితే నూటికి నూరుపాళ్లు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నదని ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు ఎంతోమంది చెబుతున్న విషయాన్ని పక్కనపెడదాం. ఈవీఎమ్లతో జరుగుతున్న ఎన్ని కల్లో అక్రమాలు జరుగుతున్నాయనీ, అందుకు సాక్ష్యాలున్నా యనీ అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ చెబుతున్న మాటల్ని కూడా పెడచెవిన పెడదాం. అయినా మూడు పార్టీలకు కలిసి వచ్చిన ఓట్లు 1 కోటీ 53 లక్షలు. జగన్ ఒక్కడికే 1 కోటీ 33 లక్షల ఓట్లు పడ్డాయి. తేడా ఇరవై లక్షలు. వారంరోజుల తర్వాత అనూహ్యంగా పెరిగిన ఓట్లు 49 లక్షలని విఎఫ్డీ ప్రకటించింది. అయినా, జగన్ కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనా? ఇటు వంటి సాకులతో జగన్ భద్రతను ప్రమాదంలో పడేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తే, ఆయనకు పార్టీ కార్యకర్తలే రక్షణ కవచమవుతారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సింగిల్గా అయితే సీన్ సితారే
ఎవరెన్ని అనుకున్నారు.. భారీ మెజారిటీతో గెలిచాం అని లోలోన చంకలు గుద్దుకుంటున్నప్పటికి.. కూటమి నాయకులకు మాత్రం ఇంకా వైఎస్ జగన్ అంటే భయం పోలేదు. జగన్కు జనంలో ఉన్న మాస్ ఇమేజ్ కూటమి నాయకులకు నిద్రలేకుండా చేస్తుంది. జగన్ ఇల్లు దాటడం లేదని ఓవైపు అంటూనే ఆయన వీధిలోకి వస్తే జనసంద్రం ఎలా ఉంటుందో చూసి లోలోన టీడీపీ, జనసేన నాయకులు కుళ్ళు కుంటున్నారు.మొన్న ఏదో మూడు పార్టీల మధ్య పొత్తు కలిసి వచ్చి అలా గెలిచేసారు కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేం అని సాక్షాత్తు కూటమి నాయకులే ఒప్పుకుంటున్నారు. ఓకే కాంబినేషన్తో మళ్లీ మళ్లీ వస్తే సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదని వాళ్ళే అంగీకరిస్తున్నారు. అన్నిటికి మించి మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే తప్ప విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ అలవోకగా అధికారాన్ని చేపడతారని తెలుగుదేశానికి వంతపాడే మీడియా సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి.నిత్యం వైఎస్ జగన్ను ఆడిపోసుకునే ఓ చానల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే కూటమికి చావు దెబ్బ తప్పదని అంగీకరించారు. మరోవైపు సూపర్ సిక్స్ హామీలు ఏవి అమలు చేయకుండా కేవలం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా హైప్ తెచ్చుకొని తెచ్చుకొని అంతా బాగుందని చెప్పుకుంటాను కూటమి నాయకులకు.. దాని పెయిడ్ మీడియాకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో అన్న విషయం స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారాలు లేని అభాండాలు వేసి రకరకాల మాయలు చేసి గెలిచిన కూటమి నాయకులు ఇప్పటికే ప్రజల్లో చులకన అయ్యారు.హామీలు ఎగ్గొట్టడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దండాలు దోపిడీలు రౌడీయిజం ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అరాచకం మినహా ఇంకేమీ పనులు చేయకపోవడంతో ప్రజలకు సైతం ప్రభుత్వం మీద అసహ్యం మొదలైంది. మొదటి ఏడాదిలోనే ఇంత వెగటు పుడితే రానున్న నాలుగేళ్లలో ఇది మరింత ముదిరి కూటమి నాయకులను తన్ని తరిమేసే పరిస్థితికి వస్తుందని వారికి అర్థమైంది. ఒకసారంటే వీరి మాటలు ప్రజలు నమ్మారు కానీ మళ్ళీ మళ్ళీ అవే హామీలు అవే మోసకారి మాటలు చెబితే ప్రజలు నమ్మి నెత్తిన పెట్టుకోరు అనే విషయం కూటమి నాయకులతో పాటు ఆ మీడియాకు సైతం ఎప్పటికే అర్థమైంది.అంతేకాకుండా ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేల్లో కూడా దాదాపుగా 50 శాతం మంది ఎమ్మెల్యేలకు రెండోసారి గెలిచే అవకాశం లేదని తేలడంతో వారు ఇప్పుడు బిత్తిరి చూపులు చూస్తున్నారు. ఏదైతేనేం ఉన్న ఈ నాలుగేళ్లు ఉన్న కాడికి దండుకుందాం అనే టార్గెట్తో చాలామంది ఎమ్మెల్యేలు సహజం వనరులతో పాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దందా చేస్తూ సొమ్ములు వెనకేస్తున్నారు.ఈ పరిస్థితి కూడా కూటమి మీడియాకు తెలుసు.. అందుకే తాజాగా జరిగిన డిబేట్లో ఓ యాంకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పలేక చెప్పలేక కుమిలిపోతూ చెప్పారు. కూటమి పొత్తులో లేకపోతే వైఎస్ జగన్ నిలువరించడం అసాధ్యం అని యాంకర్తో పాటు రఘురాం కృష్ణంరాజు సైతం అంగీకరించారు. ఏడాదిలోనే వారి పాలనపై వారికే నమ్మకం కోల్పోవడంతో.. ప్రజల ఇప్పుడు వైఎస్ జగన్పై దృష్టిసారించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు మరింత వివరించి వారి మద్దతు కూడగట్టుకునేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా సమాయత్తం అవుతున్నాయి..* సిమ్మాదిరప్పన్న -
కూటమి ఎన్నికల హమీలను అమలు చేసేలా ప్రజలతో కలిసి పోరాడతాం: బొత్స
-
జగన్ అభిమన్యుడు కాదు రాజశేఖర్ రెడ్డి కొడుకు: Sake Sailajanath
-
కూటమి అధికారంలోకి వచ్చాక తల ఎత్తుకొని తిరిగేపరిస్థితి లేదు: కౌన్సిలర్లు
-
కూటమి ఓడిపోతుందని వాళ్ళ సర్వే సంస్థలే చెబుతున్నాయి : మిథున్ రెడ్డి
-
ఇదే కనుక జరిగితే నీటి సరఫరా, విద్యుత్ బంద్..
-
CPI Narayana: ముందు తీసుకున్న భూములకు న్యాయం చేయండి..
-
అంగన్వాడీ అక్కచెల్లెళ్లల్లారా అని అరిచాడు..ఇప్పుడేమైపోయాడో కూడా తెలియదు
-
CPI Narayana: చంద్రబాబు నీకు చేతనైతే వారిని అరెస్ట్ చేయండి
-
అరాచక పాలనను అడ్డుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడాదికిపైగా టీడీపీ కూటమి సర్కారు సాగిస్తున్న రెడ్బుక్ అరాచక పాలన, అప్రజాస్వామిక విధానాలు, కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసుల బనాయింపు, ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనంపై వైఎస్సార్సీపీ నేతల బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేసింది. గురువారం విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ను కలసిన వైఎస్సార్ సీపీ బృందం ఈ అరాచకాలపై జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విన్నవించింది. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, ప్రభుత్వమే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్కు వివరించింది. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో దారుణంగా విఫలం కావడం, ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండటంతో ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీసిందని.. ప్రతి ఘటననూ వక్రీకరిస్తూ తమపై ఎదురుదాడికి దిగుతోందని గవర్నర్ దృష్టికి తెచి్చంది. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడైన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు భద్రత కల్పించకుండా బాధ్యతారాహిత్యంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని నివేదించింది. ఈమేరకు శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, బూసినె విరూపాక్షి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు గవర్నర్ను కలిశారు. అనంతరం శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ రాజ్భవన్ బయట మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని గవర్నర్ కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి,మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ,చిత్రంలో వైఎస్సార్సీపీ నాయకులు ఇది నిరంకుశ ప్రభుత్వం: బొత్స సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేస్తున్న అఘాయిత్యాలు, మాజీ సీఎం వైఎస్ జగన్కు కల్పించాల్సిన భద్రతను విస్మరించడం, ఆయన పర్యటనల సందర్భంగా అక్రమ కేసులు బనాయిస్తున్న వైనాన్ని గవర్నర్ దృష్టికి తెచి్చనట్లు బొత్స వెల్లడించారు. ‘ఇవి అప్రజాస్వామికం.. గతంలో ఎవరూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్కు వివరించాం. ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఒక వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదానికి వైఎస్ జగన్కు చెందిన కాన్వాయ్ వాహనాలు కారణం కాదు.. వేరే ప్రైవేటు వాహనం ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సాక్షాత్తూ పల్నాడు జిల్లా ఎస్పీ చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ ప్రమాదంలో సింగయ్య గాయపడటంతో పోలీసులే అతడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత హఠాత్తుగా పోలీసుల తీరు మారింది. ఈ సంఘటన వైఎస్ జగన్ ప్రయాణించిన కారు ఢీకొనడం వల్లే జరిగిందంటూ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కారులో ప్రయాణిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఆ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. ఈ ప్రభుత్వం ఎంత అరాచకాలకు పాల్పడుతోందో దీని ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతోంది. ఏదో ఒక విధంగా వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఉంది. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని అడ్డుకోవాలని చూడటం అవివేకం. వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఆయన పర్యటనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆయన ఎక్కడకు వెళ్లినా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారనే సమాచారం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ప్రభుత్వం వద్ద లేవా? దానికి తగిన విధంగా ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదు? పైగా జరిగిన ప్రతి దానిని వక్రీకరిస్తూ మాపైనే ఎదురు దాడి చేస్తున్నారు. సత్తెనపల్లి సంఘటనపై మీకు మానవత్వం లేదా? అని టీడీపీ నేతలు ప్రశ్నించడం చూస్తుంటే ఇంతకంటే ఎదురు దాడి ఉంటుందా అనిపిస్తోంది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ చుట్టూ వందల మంది ప్రజలు ఉన్నారు. ఆయనకు పోలీస్ భద్రత కల్పిస్తే అంత మంది ఆయన ప్రయాణిస్తున్న కారుకు అత్యంత సమీపంలోకి ఎలా వస్తున్నారు? సింగయ్య నిజంగానే వైఎస్ జగన్ వాహనం కింద పడితే ఆ కారుకు ముందు ఉండాల్సిన పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు, అందులోని పోలీసులు, రోప్ పారీ్టలు ఎందుకు చూడలేదు? ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఏ సమాచారం ప్రకారం మొదట వివరాలను వెల్లడించారు? ఈ కుట్రనే గవర్నర్ దృష్టికి తీసుకొచ్చాం’ అని బొత్స పేర్కొన్నారు. ప్రజలే మీ నార తీస్తారు..! ఈ సందర్భంగా ఓ విలేకరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాలని బొత్సను కోరగా ఘాటుగా బదులిచ్చారు. ‘పవన్ కళ్యాణ్ ఎవడి నార తీస్తారు..? ఎవరి మక్కెలు ఇరగదీస్తారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? పనికిమాలిన మాటలు మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అందరి నార తీస్తారని గుర్తుంచుకోండి. ఒక ఎమ్మెల్యేగా జగన్కు భద్రత ఇచ్చామని హోంమంత్రి అనిత చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం. తెలివి తక్కువ మాటలు వెనక్కి తీసుకోవాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం ఎమ్మెల్యే కాదు.. ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? గతంలో చంద్రబాబు తన పర్యటనల సమయంలో భద్రత కావాలని ఎందుకు అడిగారు?’ అని బొత్స ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్.. ‘ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోంది. ప్రజలకు ఇచి్చన వాగ్దానాలను అమలు చేయలేక దృష్టి మళ్లించేందుకు ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతోంది. ప్రజల తరఫున బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని మేం ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం. స్వాతంత్య్రం వచి్చన తరువాత ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని బొత్స ధ్వజమెత్తారు. -
ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవే టురంగ శ్రామికుల పని గంటల్ని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రామికులు రోజుకు గరిష్ఠంగా 8 గంటలు పని చేసేవారు. కొత్త ఆంధ్ర ప్రదేశ్లో దాన్ని 9 గంటలకు పెంచారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని 10 గంటలకు పెంచారు. పెట్టుబడుల్ని భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కార్మిక శక్తి చౌకగా లభిస్తున్న ఆంధ్రప్రదేశ్లో పని గంటల్ని కూడా పెంచితే పరిశ్రమలు నెలకొల్పేందుకు కార్పొరేట్ సంస్థలు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ సంస్థల అధినేతలు వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని కోరు తున్నారు. వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు, కార్మిక చట్టాలను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.ఇక్కడో విచిత్రం ఉంది. 10 గంటల పనిదినం అనేది ప్రైవేటు రంగ శ్రామికులకు మాత్రమే! ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పనివేళలు 10 నుండి 6 గంటల వరకు 8 గంటల పనిదినంగానే కొనసాగు తాయి. ప్రభుత్వమే ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది మధ్య వివక్ష చూపడానికి సిద్ధపడింది. ఈ వివక్ష పని గంటలతో మాత్రమే ఆగడం లేదు. జీత భత్యాల్లోనూ అసాధారణ వ్యత్యాసం రూపంలో ఉంది. ప్రైవేటు శ్రామికుల పని గంటలు పెంచిన ప్రభుత్వం కనీస వేతనాలను పెంచాలనే కనీస ఆలోచన చేయలేదు.వారానికి ఆరు రోజులు, రోజుకు 8 గంటలు అనే ప్రమాణానికి అనేక చారిత్రక, సామాజిక, శారీరక ధర్మాల కారణాలున్నాయి. యుక్త వయస్సు దాటిన ప్రతి మనిషి మొదటగా, ఆహారం, నిద్ర, మైథునాల వంటి శరీర ధర్మాల్ని పాటించాల్సి ఉంటుంది. ఆ పిదప కుటుంబం, బంధుమిత్రులు, కళాసాహిత్య, రాజకీయ ఆసక్తుల వంటి సామాజిక ధర్మాలను పాటించాల్సి ఉంటుంది. ఆ తరువాత, బతుకు తెరువు కోసం ఓ వృత్తిని ఎంచుకుని పనిచేయాల్సి ఉంటుంది. వీటిల్లో ప్రతీదీ ముఖ్యమైనదే కనుక ఒక రోజులో ఉండే 24 గంటల్లో ఈ మూడు ధర్మాలకు సమానంగా చెరో 8 గంటలు కేటాయించాలనే ప్రమాణం ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. అయితే, అత్యాశాపరులుగా మారిన కార్పొరేట్ సంస్థల్ని సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు కార్మికుల్ని వేధించడానికి సిద్ధపడు తున్నాయి. ఇదొక అమాన వీయ పరిణామం.ప్రజల సౌకర్యాలను పెంచడానికి రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యా, ఆరోగ్య సదుపాయాలు, అల్పా దాయ వర్గాలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి సంక్షేమ పథకాలు వగైరాలను ప్రభుత్వాలు నిరంతరం అభివృద్ధి చేస్తుండాలి. వీటికయ్యే ఖర్చును కూడా ప్రభు త్వాలు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తాయి. ఈ వ్యవస్థను నిర్వహించడానికి ఒక కార్య నిర్వాహక వర్గం కూడా కావాలి. దానినే మనం సామాన్య భాషలో ‘ప్రభుత్వ ఉద్యోగులు’ అంటున్నాం. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థ నిర్వహణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఇది ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందంటే ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల రెవెన్యూ మొత్తాన్ని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చుపెట్టేస్తున్నారు. ఏపీ ఎన్జీవో సంఘం 20వ మహాసభలు 2017 నవంబరు 4న తిరుపతిలో జరిగాయి. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి ఆర్థిక మంత్రి యన మల రామకృష్ణుడు ఆ వేదిక మీద నుండే ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ప్రభు త్వానికి ప్రజల నుండి పన్నుల రూపంలో వస్తున్న మొత్తం ఆదాయంలో 94 శాతం ప్రభుత్వ ఉద్యోగ జీత భత్యాలు, పెన్షన్లకు సరి పోతున్నదన్నారు.ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రజల నుండి పన్నుల్ని వసూలు చేస్తుంది. అందులో ఓ నాలుగో వంతు (25 శాతం) నిర్వహణ ఖర్చులకు కేటా యించినా 75 శాతం రాష్ట్ర అభివృద్ధి కోసం వెచ్చించాలి. కానీ అలా జరగడం లేదు. వసూలు చేస్తున్న పన్నుల్లో 94 శాతం ఉద్యోగుల జీత భత్యాల కోసం పోతోంది. దానితో, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్పులు చేయాల్సి వస్తున్నది.ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత అమ రావతిలో రాజధాని నిర్మాణం మొదలెట్టినపుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ను వదిలి రావ డానికి సిద్ధపడలేదు. వారి విషయంలో ప్రభుత్వం బుజ్జగింపు ధోరణిని ప్రదర్శించింది. పని దినాల్ని వారా నికి 5 రోజులకు తగ్గించింది. పనివేళల్ని రోజుకు అరగంట తగ్గించింది. వారు రోజూ హైదరాబాద్ నుండి వచ్చిపోవడానికి వీలుగా ఒక ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేశారు. 12796 నంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మంగళగిరి వస్తుంది. 12795 నంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 5 గంటల 46 నిమిషాలకు మంగళగిరి రైల్వేస్టేషన్లో బయలు దేరు తుంది. మంగళగిరిలో రైలు దిగి 10 గంటల లోపు సచివాలయానికి చేరుకోవడం, అలాగే, ఆఫీసులో 5.30 నిమిషాలకు బయలుదేరి మంగళ గిరిలో ట్రైన్ ఎక్కడమూ అసాధ్యం. కనీసం ఉదయం, సాయంత్రాల్లో అర గంట పని సమయాన్ని తగ్గించా ల్సిందే!సచివాలయ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కలుగ జేసి పదేళ్ళు దాటుతోంది. ఈ సౌకర్యాన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ జూన్ 20న కొత్త జీవో ఒకటి జారీ చేశారు. ప్రభుత్వానికి తన ఉద్యోగులంటే ఎందుకింత ప్రేమ, ప్రైవేటు శ్రామికులంటే ఎందుకింత ద్వేషం? ఎవరికయినా రావలసిన సందేహమే!డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులుమొబైల్: 90107 57776 -
చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తాం: గుడివాడ అమర్నాథ్
-
సింగయ్య మృతి ఘటనపై ఫేక్ వీడియోతో బాబు మార్క్ కుట్ర
-
కూటమి పాలనలో రెడ్ బుక్ పాలన సాగుతోంది : సీదిరి అప్పలరాజు
-
రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే.. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం
-
ఫేక్ వీడియోతో బాబు మార్క్ కుట్ర!
సింగయ్యను పచ్చ బ్యాచ్ చంపేసిందా? వరుస పర్యటనలతో జనంలోకి దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిలువరించడానికే కూటమి ప్రభుత్వం ఇలా పన్నాగం పన్నిందా? జగన్, పార్టీ నేతలపై దొంగ కేసులు బనాయించింది ఇందుకేనా? తాజాగా బయటికి వచ్చిన వీడియోలు, వైద్యులు రాసిన శవ పంచనామా, పోలీసులు తీసుకున్న దొంగ సాక్షి వాంగ్మూలం... అన్నీ చూస్తే అవుననే భావించాల్సి వస్తోంది. 4 టన్నుల బరువున్న వాహనం మీద ఎక్కితే బతుకుతారా? ఇది గుద్దితే బాధితుడు కాలుపై కాలు వేసుకుని పడుకునే అవకాశం ఉందా? లేదని ఎవరికైనా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి, మడుగులొత్తే పోలీసులకు అర్థం కాదు. ఎందుకంటే జగన్మోహన్రెడ్డిని ఏదో రకంగా కేసులో ఇరికించడమే వారి కుట్ర కాబట్టి.. సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించిందో, చంద్రబాబు ప్రభుత్వం అంతకంటే దుర్మారంగా వ్యవహరించింది. వైఎస్ జగన్ను ఈ కేసులో ఇరికించేందుకు పక్కా కుట్ర పన్ని.. పోలీసుల ద్వారా వ్యవహారం నడిపించింది. ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్తో సంబంధం లేని వాహనం ఢీకొట్టడం వల్లే సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని స్వయంగా జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్కు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. మూడు రోజుల తర్వాత సోషల్ మీడియాలో వచి్చన ఒక ఫేక్ వీడియో ఆధారంగా జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డాడంటూ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మాట మార్చారు. కాన్వాయ్ వాహనం నడుపుతున్న ప్రభుత్వ డ్రైవర్ రమణారెడ్డి ఏ1గా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ2గా, ఆయన పీఏ కె.నాగేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజినిలను ఈ కేసులో చేర్చారు. అయితే పోలీసులు, ఎల్లో మీడియా చెబుతున్న, చూపిస్తున్న వీడియో విశ్వసనీయతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 4 టన్నుల బరువున్న వాహనం ఎక్కితే కాలు మీద కాలు వేసుకుని మాట్లాడుతాడా?మామూలు ఫార్చూనర్ వాహనం రెండు వేల కిలోలు ఉంటుంది. అదే బుల్లెట్ప్రూఫ్ వాహనమైతే 3.5 టన్నుల బరువు ఉంటుంది. అందులో ఉన్న మనుషులతో కలిపి 4 టన్నులు ఉంటుంది. ఇంత బరువున్న వాహనం ఒక మనిషి మెడపై నుంచి వెళితే స్పాట్లోనే నుజ్జునుజ్జుగా మారి చనిపోతాడు. అలాంటిది ఆ వాహనం కిందే పడ్డాడని చెబుతున్న సింగయ్య స్వల్ప గాయాలతో అరగంటకు పైగా స్పృహలోనే ఉండటంతో పాటు కాలుమీద కాలేసుకుని పడుకుని తనను ఆసుపత్రికి తీసుకువెళ్లమని అడుగుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. స్థానికులు ప్రైవేటు వాహనంలో అతడ్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా పోలీసులు ఒప్పుకోలేదు. దాదాపు 30 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చే వరకు ఆగి.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు. అప్పటికి కూడా అతను స్పృహలోనే ఉన్నాడు. అతని వంటిపై స్వల్ప గాయాలే కనపడుతున్నాయి. వీడియో కూడా అతను కారు టైరు కింద పడినంత వరకే ఉంది. ఆ తర్వాత అతన్ని బయటకు తీసిన వీడియో ఎందుకు బయటకు రాలేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి, ఏఐ టెక్నాలజీతో ఈ వీడియోను సృష్టించినట్లు స్పష్టం అవుతోంది. చిన్న గాయాలకే చనిపోయాడా? మృతుడి శరీరంపై చిన్న చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని మార్చురీలో వైద్యులు నోట్ చేశారు. ఎడమ బుగ్గ, దవడ, కుడి కంటి కింద, ఛాతిపై కుడి వైపు, కుడి మోచేయి వెనుక నుంచి అరచేయి వెనుక భాగం వరకు, మోకాళ్ల వద్ద దోక్కుపోయి తోలు లేచిన గాయాలు ఉన్నాయని వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు. ఇంత చిన్న గాయాలు ఉన్నప్పుడు అతను అదే రోజు చనిపోయే అవకాశం లేదని, సింగయ్య వంటిపై చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి, హైకోర్టు న్యాయవాది కోటేష్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీన్నిబట్టి ఇది కుట్ర అని స్పష్టంగా తెలుస్తోంది. దుర్మార్గానికి పరాకాష్టపోలీసులు తీసుకున్న సాక్షి వాంగ్మూలం దారుణంగా ఉంది. సింగయ్య వాహనం కింద పడిన తర్వాత కూడా డ్రైవర్ను కారులో ఉన్న జగన్మోహన్రెడ్డితో పాటు మిగిలిన వారు ఆపకుండా పోనీయమంటూ ఆదేశాలు ఇచ్చినట్లుగా రాశారు. అసలు వీఐపీ వెహికల్లో ఉన్న వారు డోర్ గ్లాస్లు వేసిన కారులో ఏం మాట్లాడారో బయటి వారికి ఎలా తెలుస్తుంది? సంఘటన జరిగిన సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు ఫుట్ రెస్ట్ ప్లేట్పై నిలబడి బయటి ప్రజలకు అభివాదం చేస్తుండటం ఆ ఫేక్ వీడియోలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సాక్షుల పేరుతో అబద్ధపు వాంగ్మూలాలు సృష్టించి ఈ కేసును బనాయించినట్లు కనపడుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వేలాది మంది ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో మమేకమైన తీరు స్పష్టంగా కనిపిస్తుంటే.. ఆయన కారు కింద ఓ వ్యక్తి పడినప్పటికీ.. వాహనం పోనివ్వమని చెప్పారంటూ ఎఫ్ఐఆర్లో రాయడం దుర్మార్గానికి పరాకాష్ట. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. -
'బాబు ష్యూరిటీ'.. ఇంటింటికీ వంచన
చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం.. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి(పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది.. అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఆ వివరాలన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే గత ఏడాది వడ్డీతో సహా బాకీ, ఈ ఏడాది ఇవ్వాల్సింది ఎప్పుడిస్తారని నిలదీయండి.ఏడాది గడిచింది. హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకొనిపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వాటిపై పోరాడాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. అప్పుడే మనం సత్తా చూపగలం. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో కలిసి వారి కోసం పని చేయాలి.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఇంటింటికీ ఆ హామీలను అమలు చేస్తానంటూ సంతకాలతో పంపించిన బాండ్లు గుర్తు చేస్తూ.. వాటిని ఏ మాత్రం అమలు చేయని చంద్రబాబు మోసాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. దాని వల్ల ప్రతి కుటుంబం ఎంతెంత నష్టపోయింది? ఇంకా ఎంత నష్టపోతోంది? అన్న విషయాలపై అందరికీ అవగాహన కల్పించేలా ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..) పేరుతో ఐదు వారాల బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ’ కార్యక్రమానికి సంబంధించి సమావేశంలో క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించి.. రాష్ట్రంలో ఇంటింటికీ దాన్ని చేర్చే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై విస్తృతంగా చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్. ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదురాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం పూర్తయింది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. ఇంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ఈ వ్యతిరేకత మ«ధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్బుక్ పాలన చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మన ఐదేళ్ల పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా పథకాలు అందించాం. ఎవరు, ఏ పార్టీ అని చూడకుండా మంచి చేశాం. కానీ, కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో కనిపిస్తోంది ఏమిటంటే.. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తున్న పరిస్థితులు మాత్రమే. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చేసి చూపాం. కానీ, చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యవంతం చేయండి ఈ సంవత్సరంలో చంద్రబాబు పాలనతో ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతుంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అందేవి అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు ఇచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. అసలు చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇంటింటికీ బాండ్లు పంపించి ఎలా నమ్మించాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? వీటన్నింటిపై గ్రామ గ్రామాన తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’. అదే తెలుగులో.. ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ జరిగింది.చంద్రబాబు పచ్చి మోసాలను వివరించడమే లక్ష్యంచంద్రబాబు పచ్చి మోసాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం.. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది.. అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఆ వివరాలన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది బాకీ వడ్డీతో సహా.. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలో.. అది ఎప్పుడు ఇస్తారో అడగండి. ఇవి కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారన్నది పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారన్నది ప్రస్తావించాలి. ఇంకా రైతు భరోసా మొదలు ఉచిత బస్సు వరకు అమలు కాకపోవడంపై ఇటీవల నా ప్రెస్ కాన్ఫరెన్స్లోని మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చంద్రబాబు దగా, మోసాలపై ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని మీరంతా బాగా పని చేసి విజయవంతం చేశారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు. మొన్నటి యువత పోరు కార్యక్రమం కూడా బాగా జరిగింది. ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వారికి కూడా నా అభినందనలు. జగన్ చేస్తున్నవే కాకుండా అంతకు మించి ఇస్తానన్నాడుఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా.. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్ కాల్ ఇప్పించారు. దాంతో ఓటీపీ కూడా ఇప్పించారు. దాన్ని ఎంటర్ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? ఐదేళ్లలో మొత్తం ఎంత వస్తుంది? అన్న పూర్తి గణాంకాలతో కూడిన బాండ్ కూడా ఇప్పించారు. ఆ బాండ్పై ఏమని ఉందంటే.. ‘చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను..’ అని ఉంది. ఇంకా వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫొటోలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ ఆ కుటుంబంలో సభ్యులు, పథకాల వల్ల వారికి ఏడాదికి, అయిదేళ్లకు అందే నగదు వివరాలను కూడా వివరించారు.సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు ప్రలోభాలు.. పచ్చి మోసంపై నిలదీయండి⇒ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్ నుంచే ఆ మొత్తం అందుతుంది.. అంటూ బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం. అందుకే ప్రజలంతా డిమాండ్ చేయాలి. మాకు జూన్ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మీరు చెప్పినదాని ప్రకారమే మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తున్నావు?అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి.⇒ అలా బాండ్లు ఇచ్చి కూడా అన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు, మరో వైపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్.. ఇప్పటికి ఆరు త్రైమాసికాలు పెండింగ్. ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4,200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మరో వైపు వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు పెండింగ్. ⇒ ఇంకా ఆరోగ్యశ్రీ. ఈ పథకం కోసం నెలకు రూ.300 కోట్లు అవసరం. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా, నేతన్న నేస్తం.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం మొత్తం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేనే లేదు.ఐదు వారాల కార్యక్రమంవీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో.. అదే తెలుగులో ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ.. అనే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఐదు వారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తొలుత జిల్లా స్థాయిలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే చంద్రబాబు మేనిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. ఆ స్కాన్ ఎలా చేయాలో వారు చూపుతారు. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ.. ఆ స్థాయి నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్. నాలుగో దశలో గ్రామ స్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలి. ఈ ప్రక్రియలో ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు అప్పటికి పూర్తి కాకపోయి ఉంటే.. దాన్నీ పూర్తి చేయాలి.అందమైన అబద్ధంతో దగా– కురసాల కన్నబాబు, మాజీ మంత్రిక్యూఆర్ కోడ్, ఆ స్కానింగ్.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం తదితర అంశాలను వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వివరించారు. గ్రామాల్లో రచ్చబండ నిర్వహించడం ద్వారా, ఇంటింటా ఈ కార్యక్రమం చేయాలన్నారు. ఈ రోజు ఇక్కడ మొదలైన ఈ కార్యక్రమం ఐదు వారాల్లోగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ చేరాలని కోరారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ.. అంటూ ఒక అందమైన అబద్ధాన్ని సృష్టించి, ప్రచారం చేసి, ప్రజలను పచ్చి దగా చేస్తూ, అందంగా మోసగించిన విధానాన్ని ఇంటింటా వివరించాలన్నారు. -
కర్నూలులోని కేశవరెడ్డి పాఠశాలలో విద్యార్ధి సంఘాల ఆందోళన
-
ఆ రోజు YSR ఆ పని చేసుంటే... సతీష్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్
-
బాబుకు షాకిచ్చిన హైకోర్టు
-
మీ ఇంటికి TDP నేతలు రాగానే వీటన్నింటిపై నిలదీయాలి: YS జగన్
-
Vidadala Rajini: ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అదే
-
నేనే కనిపెట్టానని చెప్పుకునే టెక్నాలజీ తోనే.. బాబు బండారం ప్రజలకు అర్థమయ్యేలా...
-
YSRCP Leaders: మీ ఆటలు ఇంకా ఎన్ని రోజులో కాదు.. చంద్రబాబుకు సీరియస్ వార్నింగ్..
-
‘చినబాబు సర్వీసు’ కమిషన్!
నారా చంద్రబాబునాయుడు..! వైఎస్ జగన్మోహన్రెడ్డి..! వీరిద్దరిలో విజనరీ నాయకుడు ఎవరంటే ఏం చెబుతారు? రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది..! దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అమరావతే రాజధానిగా ఉండాలని అంతా భావిస్తున్నారు..! దీన్ని ఎలా భావిస్తున్నారు? ఈ ప్రశ్నలు వేసింది ఏ బహిరంగ సభలోనో.. ఏ రాజకీయ నాయకుడో కాదు.. తాజాగా గ్రూప్–1 ఇంటర్వ్యూలో అభ్యర్థులను బోర్డు అడిగిన ప్రశ్నలివీ!! సాక్షి, అమరావతి: గ్రూప్–1 ఇంటర్వ్యూలు దారి తప్పాయి! రాష్ట్రంలోని అత్యుత్తుమ సర్వీసుల్లో.. ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పాటించాల్సిన కనీస నిబంధనలను పక్కనబెట్టిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) రాజకీయ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలా మారిపోయింది! రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సర్వీస్ కమిషన్ ఓ రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడంపై ఇంటర్వ్యూలకు హాజరవుతున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నడూ లేనివిధంగా కమిషన్లో ఇతర సభ్యులను పక్కన పెట్టడం.. చివరి నిమిషంలో ఓ సభ్యుడిని తీసుకురావడం.. ఇంటర్వ్యూల నిర్వహణకు మూడు బోర్డులకు బదులుగా ఒకే ఒక్క బోర్డుకు పరిమితం కావడం.. లాంటివన్నీ గుంభనంగా సాగుతున్న వ్యవహారాలకు నిదర్శనమని మండిపడుతున్నారు. దీనిపై న్యాయ వివాదాలు రేకెత్తితే ప్రక్రియ అంతా మళ్లీ మొదటికొస్తుందని, అడ్డగోలు నిర్ణయాలు లీగల్గా చెల్లుబాటు కావని పేర్కొంటున్నారు. పారదర్శకంగా ఉండాల్సిన కమిషన్ చరిత్రలో తొలిసారి అత్యంత జూనియర్ సభ్యుడిని తాజాగా గ్రూప్–1 ఇంటర్వ్యూ బోర్డులో నియమించడం గమనార్హం. అది కూడా ఆదివారం నియామక ఉత్తర్వులిచ్చి సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయించి మంగళవారం నుంచి బోర్డులోకి తీసుకున్నారంటే గ్రూప్–1 ఇంటర్వ్యూలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బోర్డులో సభ్యులుగా ఉన్నవారు ఆ రోజు మొత్తం జరిగే ప్రక్రియలో పూర్తిగా ఉండాలి. కానీ ఓ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మధ్యాహ్నం తరువాత వెళ్లిపోయారు. ఇంటర్వ్యూ ముంగిట ఇదేం తీరు?2023 గ్రూప్–1 నోటిఫికేషన్కు సంబంధించి ఇంటర్వ్యూల కోసం స్పోర్ట్స్ కేటగిరీలో 42 మందిని, జనరల్ కేటగిరీలో 182 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 23 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్తోపాటు సభ్యుల్లో కనీసం ఒక్కరైనా ఉండాలి. ఒక మానసిక నిపుణుడు, సబ్జెక్టు నిపుణుడుగా ఏదైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పాల్గొనడం తప్పనిసరి. కానీ ఇప్పుడు ఇవేమీ లేకుండా అంతా గుట్టుగా జరిగిపోతున్నాయి. ఇంటర్వ్యూలకు తొలుత మూడు బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీపీఎస్సీ.. చివరికి కూటమి ప్రభుత్వంలో ఓ కీలక మంత్రి ఆదేశాలతో ఒకే ఒక్క బోర్డుకు కుదించినట్లు సమాచారం. ఒక్క బోర్డు ఉంటే ప్రభుత్వ పెద్దల అభీష్టం మేరకు ఎంపిక జరుగుతుందనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. తద్వారా ప్రతిభకు తీరని అన్యాయం జరుగుతుందని, సంవత్సరాల తరబడి తదేక దీక్షతో సిద్ధమై ఇంటర్వ్యూ వరకు వచ్చిన అభ్యర్థుల తలరాత మారిపోతుందని ఆక్రోశిస్తున్నారు.మంత్రి సేవలో తరిస్తున్న ఏపీపీఎస్సీ కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు రాష్ట్రాలలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేక సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని 315 ఆర్టికల్ నిర్దేశిస్తోంది. 316, 317 నిబంధనల్లో కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం, పదవీ కాలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే చైర్మన్.. కమిషన్లో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్తోపాటు సభ్యుల్లో సీనియర్ను తప్పనిసరిగా నియమించాలి. వీరిద్దరితోపాటు సబ్జెక్టు నిపుణులు, వర్సిటీ వీసీ లేదా ప్రొఫెసర్ ఉంటారు. ఒకటికి మించి ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు సీనియారిటీ ప్రకారం ముందున్న సభ్యుడిని ఆ బోర్డుకు చైర్మన్గా నియమిస్తారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీపీఎస్సీ ఓ మంత్రి సేవలో తరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు బోర్డుల స్థానంలో కేవలం ఒకటే..వారం క్రితం గ్రూప్–1 ఇంటర్వ్యూల కోసం 3 బోర్డులు ఏర్పాటు చేస్తూ కమిషన్లో ఫైల్ పెట్టారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోర్డు సభ్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. అయితే ఈనెల 23న ఇంటర్వ్యూలు అనగా ముందు రోజు సీన్ మొత్తం మారిపోయింది. మూడు బోర్డుల స్థానంలో కేవలం ఒకే ఒక్క బోర్డు ఏర్పాటు చేశారు. ఉన్న సభ్యులను కాదని ఆగమేఘాలపై కొత్త సభ్యుడిని నియమించారు. ఈమేరకు ఆదివారం ఉత్తర్వులిచ్చి సోమవారం సాయంత్రం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంగళవారం ఇంటర్వ్యూ బోర్డులో కూర్చోబెట్టారు. సోమవారం రోజు బోర్డులో ఉన్న సీనియర్ సభ్యుడిని హఠాత్తుగా తొలగించి అత్యంత జూనియర్ను అప్పటికప్పుడు నియమించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో తన ప్రమేయం ఏదీ లేదని, ప్రభుత్వంలో కొందరు పెద్దల నుంచి తనపై తీవ్ర ఒత్తిడి ఉందని దీన్ని ప్రశ్నించిన ఇతర సభ్యుల వద్ద చైర్మన్ వాపోయినట్లు తెలిసింది. దీన్నిబట్టి చినబాబు కనుసన్నల్లో ఎంపిక ప్రక్రియ సాగుతున్నట్లు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.సీనియర్ సభ్యులను పక్కనపెట్టి..టీడీపీ హయాంలో 2015–19 మధ్య నియమితులైన ఏపీపీఎస్సీ సభ్యులు వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ కొనసాగారు. వీరు బోర్డులో కీలక బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు 2018 గ్రూప్–1 ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్గా ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ 2015 నవంబర్ 27 తేదీన నియమితులై 2021 నవంబర్ 26 వరకు పూర్తికాలం కొనసాగారు. గతంలో టీడీపీ ప్రభుత్వం నియమించిన ఆరుగురు సర్వీస్ కమిషన్ సభ్యుల్లో ప్రొఫెసర్ జి.రంగజనార్ధన నాలుగేళ్ల ఐదు నెలలు కొనసాగిన అనంతరం జేఎన్టీయూ వైస్ చాన్సలర్గా అవకాశం రావడంతో సభ్యుడిగా రాజీనామా చేశారు. మిగిలిన ఐదుగురు సభ్యులు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గత టీడీపీ సర్కారు నియమించిన సభ్యుల్లో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్, సేవారూప, రామరాజు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనూ కొనసాగారు. వీరిలో ప్రొఫెసర్ పద్మరాజు, విజయకుమార్ 2018 గ్రూప్–1 అభ్యర్థులకు 2022లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ఇంటర్వ్యూలకు రెండు బోర్డుల్లో చైర్మన్లుగా వ్యవహరించారు. ప్రొఫెసర్ పద్మరాజు సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆరేళ్లు కాలాన్ని పూర్తి చేసిన అనంతరం నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా గత ప్రభుత్వంనియమించింది. అయితే గత ప్రభుత్వంలో నియమితులైన సభ్యులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం గ్రూప్–1 ఇంటర్వ్యూలకు పూర్తిగా దూరం పెట్టడంతోపాటు ఓ కొత్త సభ్యుడిని నియమించి ఆయనకు అవకాశం ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తలరాతలు తారుమారు...టీడీపీ హయాంలో సర్వీస్ కమిషన్ తీరు వివాదాల పుట్టగా మారింది. ముఖ్యంగా అప్పట్లో ఉదయ్భాస్కర్ చైర్మన్గా తీసుకున్న నిర్ణయాలు వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలను తల్లకిందులు చేశాయి. ఇంటర్వ్యూ బోర్డులో కమిషన్ సభ్యులతో పాటు ఉన్నతస్థాయి అధికారి ఒకరు, సబ్జెక్టు నిపుణులు ఒకరు ఉండాలి. కానీ ఇవేవీ పాటించకుండా టీడీపీ ప్రభుత్వం ఒక్క బోర్డునే ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్ మాత్రమే ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్గా వ్యవహరించారు. ఇంటర్వ్యూలో తుది మార్కులు వేసేది చైర్మన్ కావడంతో అన్నీ తానై చక్కబెట్టినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. గత టీడీపీ ప్రభుత్వంలో డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల్లో ఆయన ఇదే విధానాన్ని అనుసరించారు. ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. 2018 గ్రూప్–2 పరీక్షల నిర్వహణ కూడా వివాదాస్పదమైంది. ఇదే రీతిలో ఇప్పుడు గ్రూప్–1 ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారనే ఆందోళన రేకెత్తుతోంది. పేలవమైన ప్రశ్నలు.. గత ప్రభుత్వ విధానాలపై స్టేట్మెంట్లు ఇస్తూ బోర్డు సభ్యులు రాజకీయ నేతల మాదిరిగా వ్యవహరించడం ఏమిటని అభ్యర్థులు మండిపడుతున్నారు. టీడీపీ పెద్దల మెప్పు కోసం గ్రూప్–1 ఇంటర్వ్యూ బోర్డును రాజకీయ వేదికలా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మళ్లీ 2019కి ముందున్న పరిస్థితి తప్పదా? వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు బోర్డు సభ్యులు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్లు, ఒక సబ్జెక్టు నిపుణుడు (యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు మాత్రమే) ఉండేలా చర్యలు తీసుకుని పారదర్శకంగా వ్యవహరించింది. 2022లో గ్రూప్–1 ఇంటర్వ్యూలకు మూడు బోర్డులను ఏర్పాటు చేశారు. సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. గతంలో టీడీపీ సర్కారు వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం న్యాయ వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పనితీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకున్నట్లు గుర్తించగా, గత సర్కారు చొరవతో వివాద రహితంగా ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాంటిది ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వివాదాలకు తెరతీసి మళ్లీ 2019కి ముందున్న పరిస్థితినే తీసుకొస్తోందని నిరుద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి...ఇప్పటికే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన సీఎం చంద్రబాబు సర్కారు తమను సైతం వదలడం లేదని గ్రూప్–1 ఇంటర్వ్యూ అభ్యర్థులు రగిలిపోతున్నారు. టెన్త్ పరీక్షలు జరుగుతుండగానే ప్రశ్నపత్రాలు వాట్సాప్లో ప్రత్యక్షం కావడం.. ఆపై మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో ఘోర వైఫల్యాలు.. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థుల నుంచి ఏకంగా 66 వేల దరఖాస్తులు రావడం లాంటివి కూటమి సర్కారు నిర్వాకాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు. -
అమరావతిలో మరోసారి భారీ ఎత్తున భూ సమీకరణ.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్
సాక్షి,విజయవాడ: అమరావతి కోసం కూటమి ప్రభుత్వ మళ్ళీ భూ సమీకరణ చేపట్టేందుకు సిద్ధమైంది. భూ సమీకరణ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే అమరావతి కోసం 54 వేల ఎకరాల భూముల సేకరణ చేపట్టిన కూటమి ప్రభుత్వం.. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున భూ సమీకరణకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
CPM Srinivas Rao: జగన్ రప్ప రప్ప అంటే తప్పు పట్టిన పవన్.. తాట తీస్తా అంటున్నావ్.. ఇది ఏ భాష
-
తండ్రి 420.. కొడుకు 840... అబద్ధాలు: Perni Nani
-
‘ఏడాదిలోనే చంద్రబాబు చేసిన అప్పు అక్షరాల రూ.1.62 లక్షల కోట్లు’
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత చిత్తశుద్ధితో అమలు చేశారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.‘ఓట్ల కోసం కూటమి నేతలు,ఎల్లో మీడియా వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు 420 అబద్ధాలు,లోకేష్ 840 అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు,పవన్,లోకేష్ సొంత డబ్బా కొట్టుకోవడం.. వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేశారు. వైఎస్ జగన్ పాలనలో ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ రూ.14లక్షల కోట్లు అప్పులు చేశారని.. చంద్రబాబు,లోకేష్ తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. చంద్రబాబు తొలి ఏడాదిలోనే రూ.1.62 లక్షల కోట్లు అప్పు చేశారు’అని ఆరోపించారు. -
Lakshmi Parvathi: దరిద్రపు పరిపాలన.. తండ్రికొడుకుని ఒక్కటే అడుగుతున్న
-
స్టీల్ ప్లాంట్ లో రెండు విభాగాలు ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయం
-
ఏపీలో కూటమి ప్రభుత్వం మోసాలపై గర్జించిన యువత
-
YS Jagan: ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికెళ్లడం తప్పా?
-
హోరెత్తిన ‘యువత పోరు’
సాక్షి, అమరావతి: ఉద్యోగాల భర్తీ అంటూ ఉత్తుత్తి హామీతో... నిరుద్యోగ భృతి పేరిట నయవంచనకు పాల్పడిన కూటమి ప్రభుత్వంపై యువత, విద్యార్థులు కన్నెర్రజేశారు. అరొకరగా నిధులు విడుదల చేస్తూ.. విద్యా దీవెన, వసతి దీవెనపై కపట ప్రేమ చూపుతున్న సర్కారు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిలదీశారు. మాట తప్పి... వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. పోలీసుల అణచివేత చర్యలను ఎదుర్కొంటూ ముందుకు కదిలారు. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు ఏడాదైనా నెరవేర్చలేదని నిప్పులు చెరిగారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అప్పటివరకు యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అంటూ కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రచారానికే పరిమితమైంది. విద్యా దీవెన కింద రూ.4,200 కోట్లు, వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు... మొత్తం రూ.6,400 కోట్లకు గాను, రూ.750 కోట్లు విదిలించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెనలను క్రమంతప్పకుండా ఠంఛనుగా అందించి పిల్లల చదువులకు అండగా నిలిచింది. 2024 జనవరి వరకు నిధులను క్లియర్ చేసింది. జనవరి నుంచి మార్చి వరకు త్రైమాసికం బిల్లులు ఏప్రిల్లో ప్రాసెస్ చేసి మేలో విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయి. అప్పటినుంచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆరు క్వార్టర్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ సోమవారం ‘యువత పోరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు కదంతొక్కారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు వందలాది మంది ప్లకార్డులు చేతబట్టి ‘బాబు వచ్చాడు... వాలంటీర్లను రోడ్డుపై నిలబెట్టాడు, ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు తొలగించాడు.. నిరుద్యోగ భృతి ఎప్పుడు?.. గ్రూప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇంకెప్పుడు... ప్రతి నిరుద్యోగికి రూ.36 వేలు నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలి.. ఫీజులు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం... వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి’ అని నినదించారు. 20లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని మండిపడ్డారు. వలంటీర్లను రోడ్డున పడేయడంతో పాటు ఇంటింటికి నిత్యావసర సరకులు అందిస్తున్న రేషన్ వాహనాలను నిలిపివేసి ఆపరేటర్ల జీవనోపాధిపై దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీ, యువకులతో కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన యువతతో కార్యక్రమం విజయవంతమైంది. కాకినాడలో ‘యువత పోరు’ ర్యాలీలో కదం తొక్కిన యువత, విద్యార్థులు ⇒ విజయవాడ ధర్నాచౌక్లో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత పోరు చేపట్టారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, ఇతర అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ⇒ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ధర్నాచౌక్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మేరుగుమాల శ్రీకాళేశ్వరరావు (కాళీ) అధ్యక్షతన జరిగిన యువత పోరులో మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), సింహాద్రి వికాస్, పలువురు అనుబంధ విభాగాల నాయకులు ప్రసంగించారు.ఆంక్షల నడుమ..⇒ ప్రకాశం జిల్లాలో యువత పోరుపై అడుగడుగునా పోలీసులు అంక్షలు విధించారు. కలెక్టరేట్ వద్ద ఉదయం నుంచే భారీగా బలగాలను దించారు. అంబేడ్కర్ భవనానికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలూ రాకపోకలు సాగించకుండా కట్టడి చేశారు. అయినా జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంబేడ్కర్ భవనం వద్ద జరిగిన సభలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైనా హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్న నిరుద్యోగులు, విద్యార్థులు ⇒ రాష్ట్రంలో బెదిరింపులు, భయపెట్టడం, అక్రమ కేసులు, నెలల తరబడి జైళ్లలో ఉంచేలా కక్షసాధింపు రాజకీయాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ధ్వజమెత్తారు. ఏలూరులో యువత పోరులో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. రిక్షా తొక్కుతూ..శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో యువతీ, యువకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం తీరుపై రిక్షా తొక్కుతూ పరిస్థితిని చాటి చెప్పారు. కలెక్టరేట్ వరకు ప్రభుత్వ తీరుపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ తీశారు. ‘తూర్పు’న కదం తొక్కిన యువతరాజమహేంద్రవరంలో కలెక్టరేట్కు వెళ్తున్న యువత పోరు భారీ ర్యాలీని బొమ్మూరు సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారికి, యువజన సంఘం నేతల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమలాపురంలో పోలీసులను దాటి మరీడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వైఎస్సార్సీపీ యువత పోరుకు తొలుత అనుమతి ఇచ్చిన పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అనుమతి లేదని చెప్పారు. కలెక్టరేట్కు బయలుదేరిన ఆందోళనకారులను పోలీసులు మూడుసార్లు అడ్డుకున్నారు. కలెక్టరేట్ సమీపాన బారికేడ్లు, రోప్ పార్టీలతో నిలువరించారు. మహిళా నేతలు, కార్యకర్తలను సైతం పోలీసులు వెనక్కు నెట్టేశారు. ఆగ్రహించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులను నెట్టుకుని ముందుకు వచ్చారు. నంద్యాల కలెక్టరేట్ వద్ద ఆందోళనకు భారీగా తరలివచ్చిన యువత ⇒ కాకినాడ సిటీ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయం, జెడ్పీ సెంటర్, ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. యువకులు, విద్యార్థులు మూకుమ్మడిగా కలెక్టరేట్కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ⇒ వైఎస్సార్ కడప జిల్లా కేంద్రం కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కోటిరెడ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లె, మహావీర్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకూ చేరింది. అనంతరం డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ⇒ నంద్యాలలో యువత పోరుకు నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం, డోన్, శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ⇒ తిరుపతిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఉదయ్వంశీ, నగర అధ్యక్షుడు దినేష్రాయల్, విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్రెడ్డి, చెంగల్రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యిమందికి పైగా యువత, విద్యార్థులు యువత పోరులో పాల్గొన్నారు.శ్రీకాకుళంలో జడివానలోనూ...⇒ శ్రీకాకుళంలో జడివానకు పార్టీ శ్రేణులు యువతతో కలిసి నిరసన ర్యాలీ చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో జిల్లా పరిషత్ ఏరియా దద్దరిల్లింది. జనమంతా వానలోనే ర్యాలీగా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గరి నుంచి బయల్దేరారు. గంటకుపైగా నిరసన తెలిపారు. గ్రీవెన్స్సెల్లో వినతిపత్రం అందజేశారు. ⇒ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఓవైపు వర్షం, మరోవైపు పోలీసు ఆంక్షల వలయంలోనూ యువత పోరును విజయవంతం చేశారు. తమకు కావల్సింది యోగాంధ్ర కాదు.. ఉద్యోగాలంటూ నినదించారు. ⇒ ఉమ్మడి విశాఖ జిల్లాలో యువత పోరు హోరెత్తింది. వర్షానికి వెరవకుండా గర్జించింది. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా యువత తగ్గలేదు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టరేట్లు దద్దరిల్లాయి.⇒ పాడేరులో జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో యువత వర్షం సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.పల్నాడులో లాఠీ ప్రతాపంపల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో వందలాది విద్యార్థులు, యువత శాంతియుత ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు వీధి రౌడీల్లా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ నమ్మక ద్రోహన్ని ప్రశ్నించేందుకు జిల్లా నలుమూలల నుంచి యువత, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనగా... వారిపై లాఠీలు ఝళిపించారు. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. తొలుత వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు బయల్దేరిన ర్యాలీని ఎస్పీ ఆఫీసు ఎదుట బారికేడ్లతో అడ్డుకున్నారు. నాయకులతో పాటు 50 మందిని మాత్రమే కలెక్టరేట్ వైపు అనుమతిస్తామని చెప్పారు. దీనికి వైఎస్సార్సీపీ నాయకులు అంగీకరించడంతో బారికేడ్లను తెరిచారు. ఈ సమయంలో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు బారికేడ్ల వద్ద ఉన్నవారిపై లాఠీలతో విరుచుకుపడడంతో యువత పరుగులు తీశారు. పారిపోయే ప్రయత్నంలో కిందపడినవారి పైనా పోలీసులు దాడి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు పి.గౌతమ్రెడ్డిలు దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.⇒ గుంటూరు జిల్లా కలెక్టరేట్కు ర్యాలీగా వచ్చిన విద్యార్థులు, యువతను లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవటంతో వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని చెప్పడంతో పది మంది ముఖ్య నేతలను వినతిపత్రం అందజేసేందుకు అనుమతించారు. ⇒ బాపట్లలో భారీ నిరసనలతో కలెక్టరేట్ కిక్కిరిసిపోయింది. పోలీసులు ఆంక్షలు విధించినా యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అక్కడే బైఠాయించారు. రథం బజారు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. -
సింగయ్య మృతి కేసులో కూటమి దొంగాట!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య కేసులో కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆడిస్తున్న దొంగాట చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోనే గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆగమేఘాలపై మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ జగన్ను చూసేందుకు వచ్చిన సింగయ్య ఆయనపై పూలు వేసేందుకు రోడ్డుపైకి వచ్చినప్పుడు ప్రైవేటు వాహనం ఢీకొందని ప్రకటించారు.ఆసుపత్రికి తరలిస్తుండగా సింగయ్య మృతి చెందాడని చెప్పారు. ఈ ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాన్వాయ్కు 50 మీటర్ల ముందు ఉన్న టాటా సఫారి ఏపీ26 సీవీ 0001 వాహనం తగలడంతో సింగయ్య గాయపడ్డాడని చెప్పారు. ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ రోజే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఆ వాహన డ్రైవర్ను తాడేపల్లి స్టేషన్కు, తర్వాత ఎస్పీ కార్యాలయానికి, చివరగా నల్లపాడు పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. తాను ర్యాష్గా డ్రైవ్ చేసిన మాట నిజమేనని, వైఎస్ జగన్ను ఫొటోలు తీసేందుకు ముందుకు వచ్చానని, ప్రమాదం జరిగిన విషయం తనకు తెలియదని ఆ వాహన డ్రైవర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత వాహనాన్ని సీజ్చేసి, డ్రైవర్కు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కథ మార్చేశారు మూడు రోజులు తిరిగేసరికి పోలీసులు మొదట్లో చెప్పిన కథను మార్చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహనమే ఢీకొట్టిందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆ వాహనం డ్రైవర్ రమణారెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని పేర్లు చేర్చి సెక్షన్లు కూడా మార్చారు. మళ్లీ ఇదే ఐజీ, ఎస్పీ మీడియా ముందుకు వచ్చి కూటమి పెద్దలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారు.డ్రైవర్ రమణారెడ్డిని విచారించడంతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతా సిబ్బందిని కూడా పిలిచి ఆ సమయంలో ఎక్కడ ఉన్నారంటూ విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణమని మొదట గుంటూరులోని నల్లపాడు స్టేషన్లోనే ముందుభాగంలో ఉంచిన ఏపీ 26 సీవీ 0001 వాహనాన్ని రాత్రికి రాత్రి స్టేషన్ వెనక్కి మార్చేశారు. దానిని ఎవరూ గుర్తుపట్టకుండా నంబర్ ప్లేట్లను కూడా తొలగించారు. ఆ వాహనం యాక్సిడెంట్కు కారణం కానప్పుడు.. ఆ వాహనాన్ని వదిలేయకుండా స్టేషన్ వెనుక దాచడం కూటమి పెద్దల దొంగాటను బయటపెట్టింది. -
చంద్రబాబే యమకింకరుడు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రచార కండూతికి గోదారమ్మ సాక్షిగా 29 మంది భక్తుల ప్రాణాలు బలి...! టీడీపీ అధినేత సభలకు జనం వెల్లువెత్తినట్లు చూపించే కనికట్టుకు 8 మంది అమాయకులు హరీ...! బాబు సభలో చీరల పంపిణీకి మహిళలు భారీగా వచ్చారని నమ్మించే మాయాజాలానికి ముగ్గురు మృత్యువాత... చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో తిరుపతిలో ఆరుగురు.. సింహాచలంలో ఏడుగురు దైవ సన్నిధిలో దుర్మరణం. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ‘పాద’ఘట్టం కింద నలిగిపోయిన ప్రాణాలు అనేకం..! గతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొనిఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రభుత్వ వైఫల్యాలతో అర్ధాంతరంగా ముగిసిన జీవితాలు ఎన్నో..! కానీ అవి ఏదో ప్రమాదవశాత్తూ జరిగిన దుర్ఘటనలు కావు. పరోక్షంగా చంద్రబాబు చేసిన హత్యలే!! అందుకు బాధ్యుడిని చేస్తూ హత్యానేరం కింద కేసులు పెడితే ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు అడుగు పెడితే చాలు... యమపాశం పట్టుకుని యమకింకరుడు వచ్చినట్టుగా సామాన్యులు హడలిపోయే పరిస్థితులు కల్పించిన ఆ ఉదంతాలు ఇవిగో..పుష్కరాల్లో తొక్కిసలాట సమయంలో మృతదేహాలను పేర్చిన దృశ్యం(ఫైల్)గోదావరి పుష్కరాలు... బాబు ప్రచార దాహానికి 29 మంది బలి చంద్రబాబుకు లేని జనాదరణ ఉన్నట్టు... ఆయన వస్తే జనం భారీగా తరలి వస్తారని మభ్యపుచ్చేందుకు వేసిన ఎత్తుగడ గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొంది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిరోజు భారీగా వచ్చే భక్తులు కేవలం తనను చూసేందుకు వస్తున్నట్లు డ్రోన్ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించి కనికట్టు చేయాలని చంద్రబాబు భావించారు. తమ ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్కు ఈ ప్రత్యేక కాంట్రాక్టు అప్పగించారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమైన 2015 జూలై 15 ముందు రోజు అంటే 14వతేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్కు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.నాటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు పుష్కర ఘాట్ల గేట్లను మూసివేశారు. మరోవైపు వేలాది మంది భక్తులు రాత్రంతా పుష్కర ఘాట్లో పడిగాపులు కాశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి తదితరులు జూలై 15న ఉదయం 8 గంటలకు పుష్కర ఘాట్లో స్నానానికి వచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం వారు స్నానాలు ఆచరించిన వెంటనే ఘాట్ వద్ద ఒక్క గేటును మాత్రమే అధికారులు హఠాత్తుగా తెరిచారు. పెద్ద సంఖ్యలో తోసుకుని వచ్చే భక్తులు చంద్రబాబు కోసం వస్తున్నట్టుగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ప్రచారం చేసుకోవాలని కుట్ర పన్నారు.రాత్రంతా వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా రావడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుని 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి ఇన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇదేమీ ప్రమాదవశాత్తూ జరిగింది కాదు. పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈ విషాదం చోటు చేసుకుంది. అంటే ఇవన్నీ ఆయన చేసిన హత్యలే! మరి ఆనాడు చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు పెట్టారా...? దీనిపై విచారణకు నియమించిన కమిటీ కాలయాపన చేయడం మినహా భక్తుల దుర్మరణానికి కారకుడైన చంద్రబాబును బాధ్యుడిని చేసిందా? కందుకూరులో తొక్కిసలాట క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం (ఫైల్) ఎన్నికల ప్రచార ఆర్భాటానికి ఎనిమిది ప్రాణాలు హరీ..! పోలీసులు వారించినా కందుకూరు ఇరుకు రోడ్డులో సభతన సభలకు జనం రావడం లేదన్న వాస్తవం చంద్రబాబును తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. కొందరి ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. తన కార్యక్రమాలకు జనం భారీగా వచ్చినట్టుగా నమ్మించాలని ఆయన ఎత్తుగడ వేశారు. దీని ఫలితం.. కందుకూరులో 8 మంది సామాన్యుల మృత్యువాత! 2022 డిసెంబరు 29న చంద్రబాబు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. తన కార్యక్రమానికి భారీగా జనం వచ్చినట్లు చూపించాలని ఉద్దేశపూర్వకంగా ఓ ఇరుకైన రోడ్డులో సభ నిర్వహించారు. ఆ రోడ్డులో సభ నిర్వహించవద్దని పోలీసులు ఎంత వారించినా టీడీపీ నేతలు ఖాతరు చేయలేదు.ఆ రోడ్డుకు ఇరువైపులా చంద్రబాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మరింత ఇరుకుగా మారిపోయింది. కనీసం చంద్రబాబు ప్రసంగించే వాహనాన్ని అయినా ఆ రోడ్డు వద్ద వెడల్పుగా ఉన్న జంక్షన్లో నిలపాలని పోలీసులు సూచించినా పట్టించుకోలేదు. ఆ ఇరుకైన రోడ్డులోకే చంద్రబాబు వాహనాన్ని హఠాత్తుగా తీసుకెళ్లారు. దాంతో అలజడి రేగి తొక్కిసలాట జరిగింది. జనం పక్కన ఉన్న కాలువలో ఒకరిపై ఒకరు పడిపోయారు. అమాయకులు మృత్యువాత పడ్డారు. చంద్రబాబు సభకు జనం భారీగా వచ్చినట్టు చూపించేందుకు వేసిన ఎత్తుగడ 8 మందిని బలితీసుకుంది. మరి దీన్ని దుర్ఘటన అంటారా...? చంద్రబాబు చేసిన హత్యలే కదా!! మరి అందుకు ఆయనపై హత్యానేరం కింద కేసు పెట్టాలి కదా? అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. తిరుపతి తొక్కిసలాటలో కింద పడిన భక్తులు తిరుపతిలో ఆరుగురు భక్తుల దుర్మరణంచంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో ఎనిమిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. దాదాపు ఏడు లక్షల మంది భక్తులు తరలి వచ్చే వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీకి సంబంధించి కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఈ ఏడాది జనవరి 9వతేదీ తెల్లవారు జామున ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించగా ముందు రోజు మధ్యాహ్నం నుంచే భక్తులు భారీగా తిరుపతి చేరుకున్నారు.వేచి ఉండేందుకు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో తీవ్ర చలిలో రోడ్లపైనే గంటల తరబడి నిరీక్షించారు. రాత్రి 8 గంటల సమయంలో టికెట్లు జారీ చేస్తున్నామంటూ హఠాత్తుగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ⇒ 2018 మార్చి 31న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట రాముల వారి కల్యాణం సందర్భంగా టెంపరరీ షెడ్ గాలికి కుప్ప కూలిన ఘటనలో నలుగురు మృతి చెందగా 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తొక్కిసలాటలో మరణించిన మహిళ (ఫైల్) గుంటూరులో చీరలు పంపిణీ... ముగ్గురు మహిళలు మృత్యువాతచంద్రబాబు తన ప్రచారార్భాటంతో మహిళలనూ వదిలిపెట్టలేదు. 2023 జనవరి 1న గుంటూరులో ఆయన సభ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ పేరిట కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున చీరలు పంచుతామంటూ మహిళలను తరలించి కొద్దిమందికి మాత్రమే ఇచ్చి ఆ కార్యక్రమం ముగిస్తున్నట్టు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ నేతలు ప్రకటించారు. దాంతో ఉన్న కొద్ది చీరలు తీసుకునేందుకు మహిళలు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట సంభవించింది. చంద్రబాబు ప్రచారార్భాటం కోసం వేసిన చీప్ ట్రిక్తో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరి ఆ రోజు ముగ్గురు మహిళల మృతికి చంద్రబాబును బాధ్యుడిగా చేస్తూ ఆయనపై హత్యానేరం నమోదు చేయాలి కదా? అని పరిశీలకులు ప్రశి్నస్తున్నారు. అప్పన్న చందనోత్సవంలో తీవ్ర నిర్లక్ష్యం... ఏడుగురు భక్తుల దుర్మరణంపవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపశృతులు చోటు చేసుకుంటున్నా... దైవ సన్నిధిలో భక్తుల ప్రాణాలు పోతున్నా చంద్రబాబు సర్కారు అదే నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించింది. సింహాచలం లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా నాసిరకంగా నిరి్మంచిన గోడ కుప్ప కూలడంతో ఈ ఏడాది ఏప్రిల్ 30న ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే బాబు గద్దింపు ఇదీ..!ఏం కుంభమేళాలో చనిపోవడం లేదా..? జగన్నాధ రథ యాత్రలో చనిపోవడం లేదా..? యాక్సిడెంట్లలో చనిపోవడం లేదా...? బాబు కాన్వాయ్ ఢీకొని ఇద్దరు మృతిగతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని ఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. 2015 జూలై 15న నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని పోలవరం పంచాయతీ యడ్లగూడెంకు చెందిన యడ్లపాటి మంగమ్మ (70) మృతి చెందింది. 2016 ఫిబ్రవరి 17న సీఎం చంద్రబాబు కాన్వాయ్ వాహనం ఢీకొని విజయవాడలో నాగేంద్ర వరప్రసాద్ అనే ఉద్యోగి మృతి చెందారు. యనమలకుదురుకు చెందిన ఆయన సైకిల్పై కార్యాలయానికి వెళ్తుండగా వేగంగా వచ్చిన చంద్ర బాబు కాన్వాయ్ బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలైన వరప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. -
సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ కుట్ర పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసు నమోదుకు తెగబడింది. ఓ వైపు తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న వ్యతిరేకత.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో టీడీపీ కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసింది. వైఎస్ జగన్ ఇటీవలి సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాలకు వక్రభాష్యం చెబుతూ అక్రమ కేసుల నమోదుకు బరితెగించింది. సింగయ్య అనే వ్యక్తి ఓ అనుమతిలేని ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి చెందినట్టు స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించిన తరువాత.. మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం తన నక్కజిత్తులను ప్రదర్శించింది. అందుకోసం యావత్ పోలీసు శాఖను కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. ఏకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహన డ్రైవర్గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ రమణారెడ్డిని ఏ1గా.. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు తాజా తార్కాణం. ఈ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు భిన్నంగా తాజాగా బీఎన్ఎస్ 105(1), 49 కింద కేసు నమోదు చేస్తామని గుంటూరు ఎస్పీ సతీశ్ ఆదివారం చేసిన ప్రకటనే నిదర్శనం. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పక్కాగా పన్నాగాన్ని అమలు చేసింది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లలో కుట్ర పూరిత నిర్లక్ష్యం నుంచి ... తాజాగా అక్రమ కేసు నమోదు వరకు శకుని మాయోపాయాన్ని తలపించేట్టుగా చంద్రబాబు కుతంత్రం ఇలా సాగింది.అడుగడుగునా భద్రతా వైఫల్యంమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య పడి మృతి చెందడం వాస్తవమే అయితే ఆ కేసులో మొదటి ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది. ఎందుకంటే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన ఆయన పర్యటనలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశ పూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నది స్పష్టమైంది. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం బయట పడింది. వైఎస్ జగన్ తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. రూట్ మ్యాప్తో పాటు ఇతర వివరాలు అందించారు. ఆ మేరకు పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. జడ్ ప్లస్ భద్రత ప్రకారం వైఎస్ జగన్ వాహనం ముందు ఎస్కార్టు వాహనాలు ఉండాలి. ఆయన వాహనానికి ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు విధులు నిర్వహించాలి. ఆ రోప్ పార్టీ భద్రతా వలయాన్ని దాటుకుని ఎవరూ వాహనం సమీపానికి రాకుండా కట్టడి చేయాలి. కానీ వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో పోలీసులు ఈ భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించనే లేదు. ఆయన వాహనానికి ముందున సమీపంలో ఎస్కార్టు వాహనం లేదు. ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు లేనే లేరు. దాంతో వైఎస్సార్సీపీ అభిమానులే కాదు... అభిమానుల ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు, ఆగంతకులు కూడా వైఎస్ జగన్ వాహనంపైకి ఎగబడ్డారు. ఓ యువకుడు ఏకంగా వాహనం బానెట్పైకి ఎక్కి మరీ హల్ చల్ చేశాడు. జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం బానెట్పైకి ఓ యువకుడు ఎక్కినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగించింది. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం. అందువల్లే అక్కడ ప్రమాదం జరిగింది. అందుకు బాధ్యత పోలీసులదీ.. రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే ఏ1గా అంటే ప్రధాన ముద్దాయిగా చేర్చాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ వాహనం డ్రైవర్ రమణారెడ్డి (ఏఆర్ కానిస్టేబుల్)తోపాటు ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం విస్మయ పరుస్తోంది. అంటే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే ఆ ప్రమాదాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదుకు తెగబడిందన్నది స్పష్టం అవుతోంది.అది జగన్ను భూస్థాపితం చేస్తానన్న చంద్రబాబు కుట్రేమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఇటీవల మీడియా చానళ్ల ఇంటర్వ్యూల్లోనే తన కుట్ర లక్ష్యాన్ని ప్రకటించారు. ఆయన తన కుట్ర కార్యాచరణను చేపట్టారన్నది కూడా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన భద్రత పట్ల పోలీసులు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు ఆయన కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు పోలీసులు ఆయన పర్యటనలో భద్రతా ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే హెలీప్యాడ్ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమానులతోపాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలికాఫ్టర్ వద్దకు చొచ్చుకు వచ్చేందుకు ఉద్దేశ పూర్వకంగా అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో ఇటువంటి పరిస్థితే తలెత్తి హెలికాఫ్టర్కు సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో వైఎస్ జగన్ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి రోడ్డు మార్గంలో వెళ్లినా సరే పోలీసులు కనీస భద్రతా ఏర్పాట్లు కల్పించ లేదు. నిబంధనల ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గతంలో సమకూర్చింది. ఆ వాహనం కొద్ది దూరం వెళ్లే సరికే మొరాయించింది. ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకున్న వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించించింది. హైకోర్టు అనుమతితో వైఎస్సార్సీపీ సొంత నిధులతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుగోలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా తన కుట్రలకు పదును పెడుతూనే ఉంది.జగన్కు జనాదరణతో బెంబేలెత్తే అక్రమ కేసులువైఎస్ జగన్ జిల్లా పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లా వెళ్లినా దారిపొడవునా వేలాది మంది జనం తండోప తండాలుగా తరలి రావడంతో ప్రభుత్వ పెద్దలను కలవర పరుస్తోంది. దాంతోనే జగన్ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఆ కుట్రలను ఛేదిస్తూ మరీ భారీ సంఖ్యలో జనం ప్రభంజనంగా పోటెత్తుతుండటంతో చంద్రబాబుకు కంటగింపుగా మారింది. దాంతో వైఎస్ జగన్ పర్యటనలకు వచ్చే వారిపై, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కనీసం అక్రమ కేసుల భయంతోనైనా ఆయన పర్యటనలకు జనం రాకుండా అడ్డుకోవచ్చన్నది ప్రభుత్వ కుతంత్రం. అందుకు ఇటీవల వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన అనంతరం పెట్టిన అక్రమ కేసులే తాజా తార్కాణం. పుష్ప సినిమాలో ‘రప్పా రప్పా’ అనే డైలాగ్తో కూడిన ఫ్లెక్సీని ఓ టీడీపీ కార్యకర్త వైఎస్ జగన్ పర్యటనలో ప్రదర్శించారు. ఆయన టీడీపీకి చెందిన వాడని.. టీడీపీ గుర్తింపు కార్డు కూడా ఆయన వద్ద ఉందన్నది ఫొటోలు, ఇతర ఆధారాలతో బయట పడింది. అయితే టీడీపీ నేతలే ఆ యువకుడిని వైఎస్ జగన్ పర్యటనలోకి పంపించి తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్ని ఉండాలి. లేదా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదన్న ఆగ్రహంతో ఆ యువకుడే ఆ ఫ్లెక్సీని ప్రదర్శించి ఉండాలి. అంతేగానీ ఆ ఫ్లెక్సీ వ్యవహారంతో వైఎస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నది తేలిపోయింది. అయినా సరే ఆ టీడీపీ కార్యకర్త ప్రదర్శించిన ఫ్లెక్సీకి వక్రభాష్యం చెబుతూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ యువకుడితోపాటు సత్తెనపల్లి వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. తాజాగా వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనం కింద పడి ఒకరు మరణించారని.. అదీ మూడు రోజుల తర్వాత చెబుతూ కేసు నమోదు చేస్తున్నట్టు గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అంటే వైఎస్ జగన్ పర్యటనల్లో వెల్లువెత్తుతున్న ప్రజాదరణను తట్టుకోలేక ఈర్షా్యద్వేషాలతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగిన ఎస్పీ సతీశ్!ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి గుంటూరు ఎస్పీ సతీశ్ తలొగ్గినట్టు స్పష్టమవుతోంది. బాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న ఆయన సరైన నిర్ధారణ లేకుండా అధికారిక ప్రకటన చేయరు. గుర్తు తెలియని ప్రైవేటు వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఆయన ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ప్రకటించారు. ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ వాహనం ఢీకొనడంతో సింగయ్య మృతి చెందారని చెప్పారు. ఆ సమయంలో ఐజీ సర్వశ్రేష్ట్ర త్రిపాఠి కూడా ఆయన పక్కనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం నమోదు చేయాలని భావిస్తున్న అక్రమ కేసుకు ఎస్పీ ప్రకటన అడ్డంకిగా మారింది. అందుకే ఎస్పీ సతీశ్ ప్రకటనపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతో 18 రాత్రికే గుంటూరు పోలీసుల వైఖరిలో మార్పు కనిపించింది. కానీ ఆ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఎస్పీ ఆదివారం మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రయా ణిస్తున్న వాహనం ఢీ కొనడంతో సింగయ్య మృతి చెందార న్నారు. అంటే ప్రభుత్వ పెద్దలు ఎస్పీపై ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చారో అన్నది తేటతెల్లమైందని నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ వైఫల్యంతోనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేలో కూడా అదే విషయం వెల్లడైనట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్ జగన్ ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు. సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? ఏడాదిలోనే పదేళ్లకు సరిపడా అప్పులు చేసి రాష్ట్రాన్ని తిరోగమనపథంలోకి తీసుకుపోయారు.. ఇక అభివృద్ధి ఎలా సాధ్యం? రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా వైఫల్యానికి బాధ్యత చంద్రబాబుదే.. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలు పూర్తిగా కుదేలైనా ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి సాగిస్తున్న అవినీతి, అక్రమాలతో రాష్ట్రం కుదేలైందని వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మరోవైపు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ ఎత్తుగడ బెడిసికొట్టింది. లక్షలాది మంది విద్యార్థులు, ఇతరులను బలవంతంగా రప్పించి సరైన వసతులు కల్పించలేకపోవడంతో వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పరిణామాలతో బెంబేలెత్తిన చంద్రబాబు అత్యవసరంగా ఏదో డైవర్షన్ రాజకీయం అవసరమని గుర్తించారు. అందుకే వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనను వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేసేలా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు.గుంటూరు ఎస్పీ ప్రకటనలు నాడు–నేడుబాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న అధికారి చేసే ప్రకటనకు అత్యంత విశ్వసనీయత ఉంటుంది. ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలా తమ కుట్రలో భాగస్వాములను చేస్తోందనడానికి గుంటూరు ఎస్పీ సతీశ్ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలే తార్కాణం. జూన్ 18 : వైఎస్ జగన్ పర్యటనలో అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొని సింగయ్య మృతి చెందారు. అది కాన్వాయ్లోని వాహనం కాదు. ప్రైవేట్ వాహనం (ఏపీ 26 సీఈ 0001) ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు కేసు నమోదు చేశాం. ఆ మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. (ఆ వాహనం వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్ అనుచరుడు గొట్టిపాటి హరీశ్కు చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు టీడీపీ అనుకూల పత్రికలు కూడా ప్రచురించాయి).జూన్ 22 : వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొనడంతోనే సింగయ్య మృతి చెందారు. ఆ వాహన డ్రైవర్ రమణారెడ్డితోపాటు అందులో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజినీ, వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వర రెడ్డిలపై కేసు నమోదు చేశాం. ఆ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని సెక్షన్లను సవరిస్తూ బీఎన్ఎస్ 105(1), 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.అబద్ధపు వాంగ్మూలం కోసం డ్రైవర్పై ఒత్తిడి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసు నమోదు కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఆయన వాహనం డ్రైవర్గా వ్యవహరించిన రమణారెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తోంది. ఆ డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగి. ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగంలో కానిస్టేబుల్గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనానికి డ్రైవర్గా ఆయన్ను ప్రభుత్వమే కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రమణారెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాన్ని వక్రీకరిస్తూ తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తున్నట్టుగా సమాచారం. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఆయన్ను ఈ కేసు నుంచి తప్పిస్తామని.. అంతేకాకుండా పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలిసింది. -
అబ్రకదబ్ర.. సూపర్ సిక్స్ ఇచ్చేశా.. మాయాఫెస్టోతో నయ వంచన!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలతో చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు అంతకంటే రెండింతలు అధికంగా సంక్షేమం అందిస్తామని వాగ్దానం చేశారు. వాటిని నమ్మిన ప్రజానీకం ఓట్లేసి టీడీపీ కూటమిని గెలిపించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా మేనిఫెస్టో అమలుపై దృష్టి పెట్టడం లేదు. పైగా సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేసేశామని.. కాదూ కూడదని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారికి నాలుక మందం తప్ప మరొకటి కాదంటూ సీఎం చంద్రబాబు బెదిరింపులకు దిగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని గుర్తు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోకు నాటి సీఎం వైఎస్ జగన్ సిసలైన నిర్వచనం చెప్పారని ప్రశంసిస్తున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చాక, మద్య నిషేధాన్ని ఎత్తేయడం.. 1999, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపడమేనని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ప్రజలను జాగృతం చేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.వైఎస్ జగన్ చెప్పినట్లే.. ఎన్నికల మేనిఫెస్టోను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారని, హామీల అమలు పూచీ నాదంటూ గ్యారంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వాటిపై నోరు మెదపడం లేదని ఎత్తి చూపుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయక పోవడం ద్వారా ఏడాదిలోనే ప్రజలకు రూ.81,397.83 కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. మిగతా హామీలను తుంగలో తొక్కడం ద్వారా అంతే స్థాయిలో సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారని ప్రజానీకం మండిపడుతోంది. ఏడాదిలో ఏమీ చేయకపోగా, ఎంతో చేసేసినట్లు సంబరాలకు సిద్ధమవడాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది.బీసీలకు వెన్నుపోటు⇒ బీసీలే టీడీపీకి వెన్నెముక అంటూ పదే పదే చెప్పే సీఎం చంద్రబాబు.. ఆ వర్గాల ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి వెన్నుపోటు పొడిచారు. బీసీ వర్గాల ప్రజల స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.పది వేల కోట్లు వ్యయం చేస్తామని హామీ ఇచ్చారు. అంటే.. ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున స్వయం ఉపాధికి వ్యయం చేయాలి. కానీ.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన ఈ పథకానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేయాలి. కానీ..ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ⇒ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి దాకా అమలు చేయలేదు. పవర్ లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారే గానీ అమలు చేయలేదు. ⇒ నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని అమలు చేయలేదు. దేవాలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ.25 వేలు ఇస్తామన్న హామీని గాలికి వదిలేశారు. ⇒ వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్.. రాయల్టీ, సీనరేజీ చార్జీల్లో మినహాయింపు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదు. రజకులకు దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహకం, విద్యుత్ చార్జీల రాయితీ ఇస్తామన్న హామీ అమలు జాడే లేదు.⇒ వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది ఆ సాయం అందించకుండా రూ.265 కోట్లు ఎగ్గొటా్టరు. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని తుంగలో తొక్కారు.మహిళలకు మోసం ⇒ 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, చేయకుండా మహిళలకు మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో వంచించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ.. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు.⇒ అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారు.⇒ ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని, విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు ఇస్తామని.. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తామంటూ ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా అమలు చేయలేదు.ఎస్సీ, ఎస్టీలకు నమ్మకద్రోహంఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తోంది. సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని నమ్మబలికి.. వాటిని ఇతర పనులకు మళ్లిస్తూ అన్యాయం చేస్తోంది. చివరకు గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయకపోవడమే అందుకు నిదర్శనం.రైతులకు తీరని ద్రోహంవ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని 2014లో హామీ ఇచ్చి వాటిని మాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో అన్నదాతలకు ద్రోహం చేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ.. వరి నుంచి కోకో వరకూ ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించలేదు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రైతు భరోసాగా కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇస్తామని ప్రకటించి మొదటి ఏడాది రూ.10,716.53 కోట్లు్ల ఎగ్గొట్టారు.ఉద్యోగులకూ మోసం సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని 2014లో హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో ద్రోహం చేస్తున్నారు. మెరుగైన పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ చైర్మన్ను రాజీనామా చేయించారు. ఇప్పటికీ తిరిగి చైర్మన్ను నియమించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటిదాకా ఐఆర్ ఊసే లేదు. అలవెన్స్ పేమెంట్స్పైన కూడా పునఃపరిశీలన చేస్తామని హామీ ఇచ్చి, నాలుగు డీఏలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. వెరసి ఉద్యోగులకు రూ.20 వేల కోట్లకుపైగా బకాయిపడ్డారు.⇒ వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేసి 2.60 లక్షల మంది వలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేసి వారికి ద్రోహం చేశారు.కాపులకు రూ.3 వేల కోట్లు బకాయి ⇒ కాపు సామాజిక వర్గంపై చంద్రబాబుది కపట ప్రేమేనన్నది మరోసారి స్పష్టమైంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపు సంక్షేమం కోసం రానున్న ఐదేళ్లలో కనీసంగా రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి.. కాపుల సాధికారత, అభివృద్ధి కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అంటే.. ఏడాదికి రూ.3 వేల కోట్లు చొప్పున ఖర్చు చేయాలి.కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అంటే.. ఇప్పటికే కాపులకు రూ.3 వేల కోట్లు బకాయిపడ్డారు. 2025–26 బడ్జెట్లోనూ కాపులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఇచ్చిన హామీకి దిక్కే లేదు.ముస్లిం మైనార్టీలకు దోఖా ⇒ హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం అందిస్తామని, మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు, అర్హత ఉన్న ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. వాటిని ఇప్పటి దాకా అమలు చేయలేదు. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం ఇప్పటికీ చేపట్టలేదు. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాలు కేటాయిస్తామన్న హామీకి దిక్కేలేదు. ⇒ నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని, రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న హామీ అమలు జాడే లేదు.⇒ క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని, చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తామని.. శ్మశాన వాటికలకు స్థల కేటాయింపు, జెరూసలెం యాత్రికులకు సాయం అందిస్తామంటూ ఇచ్చిన హామీని ఇప్పటి దాకా అమలు చేయలేదు.విద్యార్థుల జీవితాలతో చెలగాటం కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆరు త్రైమాసికాలకు సంబంధించి రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద మరో రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక డాక్టర్ అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు.గాల్లో దీపంగా ప్రజారోగ్యం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని, అన్ని మండల కేంద్రాలలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని.. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. కానీ.. ఆ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గత ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నీరుగార్చేశారు.ఈ పథకం కింద చికిత్స అందించడానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. కానీ.. గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకున్న వారికి రూ.3,600 కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్న వారు విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు వంతున ఆరోగ్య ఆసరా కింద గత ప్రభుత్వం ఇచ్చేది. ఆరోగ్య ఆసరాకు ఏటా రూ.400 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ రూ.3600 కోట్లు, ఆరోగ్య ఆసరా రూ.400 కోట్లు మొత్తం రూ.4000 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు.విద్యుత్ చార్జీల బాదుడు రూ.15,485 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలను తగ్గించకపోగా భారీగా పెంచేశారు. విద్యుత్ చార్జీల రూపంలో ఏడాదిలోనే రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు.అగ్రవర్ణ పేదలకు అన్యాయం ⇒ వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ బ్రాహ్మణులకు యువగళం కింద నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఏడాదిగా ఒక్కరికీ ఇవ్వకుండా వంచించారు. ⇒ ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించి, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదు. ⇒ భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం చేయలేదు. ⇒ కమ్మ, రెడ్డి, వెలమ తదితర అగ్ర కుల కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి.. వారి సాధికార, అభివృద్ధికి చర్యలు చేపడతామన్న హామీని తుంగలో తొక్కారు. చెదురుతున్న సొంతింటి స్వప్నం గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఏడాదిగా ఏ ఒక్కరికీ సెంటు స్థలం ఇవ్వలేదు. కొత్తగా ఇళ్లు మంజూరు చేయలేదు. పేదల సొంతింటి స్వపాన్ని చిదిమేస్తున్నారు.నత్తనడకన సాగునీటి ప్రాజెక్టులు పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామని, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార–నాగావళి అనుసంధానం వంటి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని.. ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకే కుదించి ఆ ప్రాజెక్టును బ్యారేజ్గా మార్చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. గాలేరు–నగరి ఆపేశారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు తగ్గించి లైనింగ్ చేస్తున్నారు. రూ.1400 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం శీతకన్ను వేసింది.బాదుడే బాదుడు ⇒ పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తామన్న∙హామీ నిలుపుకోలేదు. ⇒ మద్యం ధరలను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఊరూరా.. వాడవాడన బెల్ట్షాపులు వెలిశాయి. ⇒ రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి.. పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే ఎండీయూ వ్యవస్థను రద్దు చేశారు. 9,260 ఎండీయూ యూనిట్లు రద్దు చేశారు. దాంతో ఎండీయూ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు 20 వేల మంది రోడ్డున పడ్డారు. రేషన్ కోసం దుకాణాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి తెచ్చారు. -
అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అప్పుల కోసం టీడీపీ కూటమి సర్కారు మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేందుకు బరి తెగించిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) జారీ చేసే ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ (సంచిత నిధి)పై అజమాయిషీ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్నప్పటికీ.. ఏపీఎండీసీకి ఎన్సీడీ బాండ్ల జారీకి అనుమతి ఇవ్వడం సరికాదన్నారు.ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని స్పష్టం చేస్తూ ఆదివారం ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. అందులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మరోసారి ఉల్లంఘించింది. అప్పుల కోసం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి జూన్ 24న ఎన్సీడీ బాండ్ల జారీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. శాసనసభ ఆమోదం తీసుకున్న అంశాలకు మాత్రమే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రభుత్వం నిధులు తీసుకోవచ్చు. కానీ.. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు తీసుకునేలా ప్రైవేట్ పార్టీలను అనుమతించడం రాజ్యాంగంలోని 203, 204 అధికరణ (ఆరి్టకల్)లను ఉల్లంఘించడమే. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి ఏపీఎండీసీకి అనుమతి ఇవ్వడం రాజ్యాంగంలోని అధికరణ 293(1)ని ఉల్లంఘించడమే.ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత అంతకంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడమంటే దారుణం. దీనికి అదనంగా రూ.1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఖనిజ సంపదను ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు తనఖా పెట్టారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు విచారణలో ఉంది. ప్రతివాదులకు కౌంటర్లు దాఖలు చేయమని హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలిసింది. హైకోర్టు విచారణలో ఉన్నప్పుడు బాండ్ల జారీని కొనసాగించడానికి ఏపీఎండీసీని ప్రభుత్వం అనుమతించడం సరి కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టడమే. భారత రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడమే’’. -
మళ్లీ అదే రాజ్యాంగ ఉల్లంఘన
సాక్షి, అమరావతి: అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరోసారి అదే తప్పు చేసేందుకు బరితెగించింది. హైకోర్టులో కేసు నడుస్తున్నా సరే లెక్క చేయకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రెండోసారి ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్ల జారీకి సిద్ధమైంది. గత నెలలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులిస్తూ బాండ్లు విడుదల చేసి రూ.3,489 కోట్లు సమీకరించింది. అయితే.. ఇది జరగడానికి ముందే కూటమి ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలను అడ్డుకోవాలని హైకోర్టులో పలువురు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. విషయం కోర్టు పరిధిలో ఉన్నా సరే.. మే 8న ప్రభుత్వం బాండ్లు జారీ చేసింది. తాజాగా ఈ నెల 24న రెండోసారి జారీకి ఏర్పాట్లు చేసింది. ఈ బాండ్లు కొనేవారికి రాష్ట్ర ఖజానాపై హక్కు కల్పించడమే కాకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్తు ఆదాయాల పైనా ప్రత్యేక హక్కు ఇచ్చింది. రూ.2 వేల కోట్ల బేస్ వాల్యూతో బాండ్లు జారీచేయగా... రూ.3,489 కోట్ల బాండ్లను పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు.అత్యధిక వడ్డీ భారం మే 8న 9.30 శాతం వడ్డీ రేటుతో ఏపీఎండీసీ బాండ్లు జారీ చేసింది. ఇది చాలా ఎక్కువ రేటు. రాష్ట్ర ఖజానాపై డైరెక్ట్ డెబిట్ హామీ ఇవ్వడంతో పాటు ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత కూడా ఇంత ఎక్కువ వడ్డీ అంటే దారుణమే. బాండ్లు కొనుగోలు చేసినవారికి అన్ని రకాల ప్రయోజనాలు సమకూర్చి కూడా ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.⇒ మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 6.71 శాతం వడ్డీ రేటుతో స్టేట్ డెవలప్మెంట్ లోన్ (ఎస్డీఎల్) తీసుకుంది. కానీ, అదే నెలలో దీనికంటే 2.59 శాతం ఎక్కువ వడ్డీ రేటుకు ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ చేశారు. ఇది ప్రభుత్వ ఖజానాపై అతి భారమైన అప్పుగా నిలిచి అనేక జవాబు లేని ప్రశ్నలను లేవనెత్తింది.⇒ గతంలో ఏపీ సీఆర్డీఏ (ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ), ఏపీ ఎస్బీసీఎల్ (ఏపీ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్)లు ఎటువటి తాకట్టులు లేకుండానే తక్కువ వడ్డీ రేటుకు ఎన్సీడీ బాండ్లు జారీ చేసి డబ్బు సమకూర్చుకున్నాయి. కానీ, ఇప్పుడు ఖనిజాభివృద్ధి సంస్థ రూ.1.91 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ గనులను తాకట్టు పెట్టి కూడా అధిక వడ్డీకి అప్పు తీసుకోవడం గమనార్హం. ⇒ రూ.లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టిన తర్వాత కూడా అంత ఎక్కువ వడ్డీ భారాన్ని రాష్ట్రం నెత్తిన మోపడంపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఎస్డీఎల్ లోన్తో సమానమైన వడ్డీ రేటు ఇవ్వాల్సి ఉండగా... ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఎక్కువ వడ్డీ రేటుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ అప్పు ద్వారా... బాండ్లు కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు ఎక్కడా లేని భద్రత, అధిక వడ్డీలు, ప్రత్యేక సదుపాయాలు దక్కుతుండగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం తీవ్ర నష్టం కలుగుతోంది. హైకోర్టులో కేసున్నా...ఏపీఎండీసీ బాండ్ల వ్యవహారంపై ఇప్పటికే ఒక పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. మే 7న కోర్టు దీనిపై ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. కేసు న్యాయ విచారణలో ఉన్నా లెక్కచేయకుండా ప్రభుత్వం మళ్లీ అదే తరహాలో బాండ్ల జారీకి ఏర్పాట్లు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ‘కోర్టులో విచారణ జరుగుతున్న అంశంపై ముందుకెళ్లడం తప్పు. ఒకసారి ఆ తప్పు చేసి మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడం నైతికంగా, నైతికంగా సరికాదు‘ అని ఒక న్యాయ నిపుణుడు వ్యాఖ్యానించారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను తాకట్టు పెట్టి నేరుగా అప్పు తీసుకోవడం ఆర్టికల్ 293 (1) ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కూడా శాసనసభ పర్యవేక్షణ లేకుండా ప్రభుత్వ ఖర్చులకు డబ్బు సమకూర్చుకోవడం ఆర్టికల్స్ 203, 204 ప్రకారం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.దేశ ఆర్థిక వ్యవస్థపై నీలి నీడలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల కుంపటి వ్యవహారం దేశంలో అమలవుతున్న ఫిస్కల్ కన్సాలిడేషన్ రోడ్మ్యాప్పై మాయని మచ్చగా మారుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అన్ని రాష్ట్రాలు ఇదే విధమైన అప్పుల విధానాన్ని అనుసరిస్తే కేంద్ర–రాష్ట్ర ఆర్థిక సమతుల్యత ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కీలక ప్రశ్నలు–రాష్ట్రం పేరు మీద కాకుండా.. రాష్ట్ర ఖజానా ఆధారంగా అప్పు తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?–డైరెక్ట్ డెబిట్ మాండేట్ ద్వారా ఖజానాను అందుబాటులో పెట్టడం ఎంతమేరకు చట్టబద్ధం?–హైకోర్టులో కేసు నడుస్తుండగానే మళ్లీ అదే విధంగా బాండ్ల జారీకి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?–ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్ ఆదాయాలను కూడా తాకట్టు పెట్టడం న్యాయం?–రూ.1.90 లక్షల కోట్ల విలువైన 436 ఖనిజ వనరులను తాకట్టు పెట్టి అధిక వడ్డీ రేటుకు అప్పు తేవడం మన రాష్ట్రానికి మంచిదా? -
అంతులేని యోగ సంపద!
‘అంతులేని కథ’ అనే ఒక సినిమా ఉంది. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ’70వ దశకంలో సంచలన చిత్రం. ఓ కుటుంబ యజమాని తన బాధ్యతల్ని వదిలేసి పారిపోతాడు. పెళ్లీడొచ్చిన పెద్ద కూతురు ఆ భారాన్ని తన భుజాలమీదేసుకుని బండి నడిపిస్తుంది. అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత పారిపోయిన పెద్దమనిషి ఇంటికి ఉత్తరం రాస్తాడు. ఇన్నేళ్లూ తాను కష్టపడి సంపాదించిన అంతులేని సంపదతో తిరిగొస్తున్నానని ఆ ఉత్తరంలో చెబుతాడు. ఇల్లంతా పండుగ వాతావరణం. ఆ రోజు రానే వచ్చింది. ఆయన దిగనే దిగాడు. కాకపోతే కాషాయ దుస్తుల్లో, సన్యాసి వేషంలో! షాక్ తిన్న కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి తన ఉత్తరంలో రాసిన సారాంశాన్ని వివరిస్తాడు. తన ఉద్దేశంలో సంపద అంటే భక్తి సంపద, జ్ఞాన సంపద, తపః సంపద, మోక్ష సంపద... ఇవి దండిగా సంపాదించానని చెబుతాడు.ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని ఒక గొప్ప ఈవెంట్గా మలుచుకునేందుకు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ అక్కరకొచ్చింది. ప్రధానిని పిలుచుకున్నారు. 3 లక్షల మందితో విశాఖ తీరంలో ఆసనాలు వేయించి, గిన్నిస్ బుక్ సంస్థ నుంచి ప్రపంచ రికార్డు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. గతంలో ఎవరూ చేయని ఘనమైన కార్యాన్నే గిన్నిస్ బుక్ వాళ్ళు రికార్డులోకి ఎక్కిస్తారు. ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని తాపేశ్వరం స్వీట్ షాప్ వాళ్లు 29,465 కిలోల బరువు ఉన్న లడ్డూను తయారు చేసినందుకు షాపు యజమాని పోలిశెట్టి మల్లిబాబుకు గిన్నిస్ బుక్లో చోటు దొరికింది. రామ్ సింగ్ అనే జైపూర్ వాసి నాలుగున్నర మీటర్ల పొడవైన మీసాలు పెంచి ఈ ఘనత సాధించాడు. ఆంటోనీ విక్టర్ అనే మరో భారతీయుడు చెవుల మీద ఏడు ఇంచుల పొడవైన వెంట్రుకల్ని పెంచాడు. ఇదేమీ చిన్న ఫీట్ కాదు కదా! అందుకే గిన్నిస్ బుక్లోకి ఎక్కింది.అట్లాగే చేతి వేళ్లకు ఉన్న గోళ్ళను ఎనిమిదిన్నర మీటర్లు పెంచి ఒకరు, తలకాయతో 46 టాయిలెట్ సీట్లను పగలగొట్టి మరొకరు, 459 స్ట్రాలను ఒకేసారి నోట్లో కుక్కి ఇంకొకరు ఈ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఈ విశిష్ట ఘనతలు ఆంధ్రప్రదేశ్కు రెండు లభించాయి. ఒకే ప్రదేశంలో మూడు లక్షల మందికి పైగా యోగా చేసినందుకు ఒకటి, 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసినందుకు మరొకటి! గిన్నిస్ రికార్డుల కోసం ఎక్కువ మందితో ఒకే చోట డాన్సులు చేయించడం, డ్రమ్స్ వాయించడం, పాటలు పాడించడం వంటి కార్యక్రమాలను సాధారణంగా పెద్ద పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల వాళ్ళు చేస్తుంటారు. ఇది మరీ పెద్ద రికార్డు కనుక స్వయంగా ప్రభుత్వమే తన భుజాల మీదకు ఎత్తుకుంది. డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా వెళ్లాలని తాఖీదులు వెళ్లాయి. స్వచ్ఛంద సంస్థలని బలవంతంగా రంగంలోకి దింపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ హాజరయ్యే బాధ్యతను ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. వేలాది బస్సులను ఏర్పాటు చేశారు. టీ షర్టులను, మ్యాట్లను ఉచితంగా అందజేశారు. ఐదు లక్షలు టార్గెట్గా పెట్టుకుంటే, అటెండెన్స్ మూడు లక్షల మార్కు దాటింది. కార్యక్రమం విజయవంతం కావడం, ఒకేసారి రాష్ట్రానికి విశిష్టమైన రెండు గిన్నిస్ రికార్డులు లభించటం సహజంగానే ముఖ్యమంత్రిని మిక్కిలి సంతోషపరిచింది. కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. విశాఖపట్నం అంటే తనకెంతో ఇష్టం కనుక ఈ ఘనత విశాఖకు లభించేలా చేశానని అర్థం వచ్చేలా మాట్లాడారు. హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు తను విశాఖలోనే బస్సులో కూర్చుని అజమాయిషీ చేసిన సంగతిని గుర్తు చేశారు. ముంబయ్ని మించి, విశాఖలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమం సందర్భంగా ప్రధాని సమక్షంలో ఆయనను చరిత్ర సృష్టించిన వ్యక్తిగా పొగిడిన బాబు – మీడియా సమావేశంలో ఆయనకు మరిన్ని పొగడ్తలు తగిలించారు. ఒక ప్రభుత్వం ఏడాది పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు సహజంగా ఫోకస్ కావాల్సిన అంశాలు, చర్చనీయాంశాలు కావలసిన సంగతుల స్థానాన్ని ఇటువంటి మెగా ఈవెంట్ ఆక్రమించడం కూడా బాబు ఆనందానికి ఇంకో కారణం కావచ్చు. సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డును తెచ్చిపెట్టిన గిరిజన బాలలు విశాఖలో ఆకలితో అలమటించారని, పడుకునేందుకు, కనీస అవసరాలకు చోటు దొరక్క అగచాట్ల పాలయ్యారని వస్తున్న వార్తలు, తన ఆనందానికి భంగం కలిగించడం ఆయనకు ఇష్టంలేదు. అందుకే ఆ ఘటనపై విచారమూ లేదు... విచారణా లేదు.ప్రభుత్వం ఏడాది పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చనీయాంశం కావలసిన అంశాలను ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొన్న జనం ముందుకు, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో గణాంకాల సహితంగా నిరూపించారు. ఆయన సొంత గణాంకాలు కావవి! ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల గణాంకాలతోనే జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారు. ఏడాది కాలంలోనే లక్షా అరవై వేల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించారు. ఏడాదిగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని నిలిపివేయడంపై నిలదీశారు. ప్రభుత్వ బడుల్లో అందుతున్న నాణ్యమైన విద్యకు బ్రేకులు వేయడంలోని ఔచిత్యం ఏమిటని అడిగారు. ‘ఫీజు రీయింబర్స్మెంట్’, ‘ఆరోగ్యశ్రీ’ బకాయిల ఎగవేతపై, రైతాంగాన్ని కష్టాల కడలిలో ముంచడంపై తూర్పారబట్టారు. అన్నింటినీ మించి ‘‘ఎన్నికల బాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీయండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి ఇంటింటికీ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసింది. ‘‘చంద్రబాబు నాయుడు – పవన్ కల్యాణ్ అను మేము రాష్ట్ర ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ష్యూరిటీ పత్రంలో పేర్కొన్న హామీలను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అని పేర్కొంటూ వారిద్దరూ ఆ పత్రాలపై సంతకాలు చేశారు. ఆ పత్రంలో కుటుంబ యజమాని పేరు, తండ్రి పేరు, వయసుతోపాటు కుటుంబ సభ్యుల సంఖ్యను, తాము హామీ ఇస్తున్న పథకాల్లో ఆ కుటుంబానికి వర్తించే వాటిని పేర్కొన్నారు. ఆ పథకాల కింద వారికి మొదటి ఏడాది జరిగే లబ్ధిని, ఐదేళ్లలో జరిగే లబ్ధిని కూడా పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న కోటీ నలభై లక్షల కుటుంబాలకు ఈ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసినట్టు సమాచారం. జూన్ 2024 నుంచి ఈ హామీలు వర్తింపచేస్తామని కూడా ఈ పత్రంలో స్పష్టంగా రాశారు. ఆ లెక్కన ప్రమాణ పత్రాల సాక్షిగా ఏపీ ప్రజలకు ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం 81 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయి పడిందని అంచనా.ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేసినప్పుడు బాధ్యత గల ప్రభుత్వాలు దానికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. సమాధానం ఇవ్వకపోగా ప్రతిపక్ష నేత పిలుపునిచ్చినట్టుగా ఎవరైనా నిలదీస్తే తాట తీస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం ఒక విడ్డూరం. పైగా అసలు కథను వదిలేసి ‘రప్పా రప్పా’ అనే ఓ పిట్ట కథను పట్టుకొని జగన్ మోహన్ రెడ్డి అనని మాటల్ని ఆయనకు ఆపాదించి మీడియాలో తెలుగుదేశం పార్టీ వీరంగం వేసింది. ఆ మీడియాలోనే చదివిన వాళ్లకు, చూసిన వాళ్లకు ఏం అర్థమవుతుంది? రెండున్నర గంటల మీడియా సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి ‘రప్పా రప్పా’ అనే అంశంపైన మాత్రమే మాట్లాడారని అనుకుంటారు కదా! ఇదే తెలుగుదేశం పార్టీకి కావలసింది. ప్రతిపక్ష నేత లేవనెత్తిన అంశాలు జనంలోకి వెళ్ళకూడదు, చర్చ జరగకూడదు.ఒకవేళ కూటమి పెద్దల ఖర్మ కాలి, ఈ ప్రమాణ పత్రాలను తీసుకుని కోటి కుటుంబాల వారు తమకు బకాయిలు ఇప్పించాలని కోర్టుల మెట్లెక్కితే? కోర్టులు ఎలా స్పందిస్తాయనేది పక్కన పెడదాం. ప్రభుత్వం మోసం చేసిందంటూ కోటి కాదు, పది లక్షల కుటుంబాల వారు ఒకేసారి ఫిర్యాదులు చేసినా అదే పెద్ద రికార్డు! దాని ముందు గిన్నిస్ రికార్డులు, పిన్నిస్ రికార్డులు అన్నీ బద్దలు కావాల్సిందే! ఇదిగో జనం నుంచి ఇటువంటి సామూహిక ఫిర్యాదులు రాకుండా వారి ఆలోచనలను హైజాక్ చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, గిన్నిస్ బుక్ను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్నది. యోగా అనేది సర్వరోగాలకూ, సకల సమస్యలకూ ఏకైక దివ్యౌషధం అన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడారు.‘రోజు ఒక గంట యోగా చేయండి. అదే పదివేలు’ అని ముఖ్యమంత్రి పిలుపునిస్తున్నారు. యోగాపై విశాఖ డిక్లరేషన్ కూడా త్వరలో విడుదల చేస్తారట! బిల్గేట్స్ ఫౌండేషన్తో కలిసి పని చేస్తున్నామని, యోగా–నేచురోపతి గేమ్ ఛేంజర్లుగా మారబోతున్నాయని ఆయన ప్రకటించారు. ఇక అల్లోపతి అటకెక్కినట్టేనా? యోగాభ్యాసాల్లో చేయించే ఎక్సర్సైజుల్లో చాలా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు గతంలో పాఠశాలల్లో ఉన్న డ్రిల్ పీరియడ్లలో నేర్పించినవే. ఇప్పుడు మైదానాలు, స్పోర్ట్స్ టీచర్లు, స్పోర్ట్స్ పీరియడ్లను ఎత్తేశారు కాబట్టి, ఎవరింటి దగ్గర వాళ్లు గంటసేపు యోగా చేయమంటున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ దివంగతులైన రోజు జూన్ 21. అదే రోజును ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించడం కేవలం కాకతాళీయమే కావచ్చు.కానీ, ఈ ప్రకటన తర్వాత యోగా గురువులు తామరతంపరగా పుట్టుకొస్తున్నారు. యూట్యూబ్ల ద్వారా పాఠాలు చెబుతున్నారు. అందులో రోగాల స్పెషలిస్టులు కూడా బయలుదేరారు. నడుము నొప్పికి సేతుబంధాసనమట! సంతానం కలగాలంటే భుజంగాసనమట! ఇలానే కడుపునొప్పికి, గ్యాస్ మంటకు, దగ్గుకు, ఆయాసానికీ చివరికి ఎయిడ్స్కు, క్యాన్సర్కు కూడా యోగా చిట్కాలు చెప్పే గురువులు తయారయ్యారు. వీటన్నిటినీ వైద్యశాస్త్రం ఆమోదిస్తుందా, వీళ్ళందరికీ శరీర నిర్మాణ శాస్త్రంపై అవగాహన ఉన్నదా అనేవి ప్రశ్నార్థకాలు. ఆమధ్య ‘టెలిగ్రాఫ్ ఇండియా’ ఒక పరిశీలనాత్మక వ్యాసం రాసింది. అందులో ‘అష్టాంగ యోగా’ను ఆచరిస్తున్న వారిలో 62% మంది మోకాలి నొప్పులు, పిక్క కండరాల సమస్యలను ఎదుర్కొంటున్నారట! ఏ వయసు వారు ఎటువంటి ఆసనాలు వేయవచ్చు? ఆసనాలు వేసే సరైన పద్ధతి ఏమిటనే అవగాహన శాస్త్రీయంగా కల్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి. యూట్యూబ్ సందేశాలు విని, పునర్ యవ్వనం ప్రాప్తిస్తుందని నమ్మి ముసలాళ్లు కూడా వజ్రాసనం వేసి కూర్చుంటే మోకాలి చిప్పలు దెబ్బతినవా? ఈ వేలం వెర్రిని నియంత్రించుకోకుంటే దుష్ఫలితాలు కూడా ఉంటాయని గ్రహించాలి.పిల్లలు పాఠశాల మైదానాల్లో నేర్చుకునే జిమ్నాస్టిక్స్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ వంటి క్రీడలకు, ఇంటి దగ్గర ఇరుకు గదుల్లో అభ్యసించే యోగా సరైన ప్రత్యామ్నాయమేనా అనేది కూడా ఆలోచించాలి. యోగాభ్యాసం ద్వారా శారీరక చురుకుదనం, మానసిక పరిపక్వత దేదీప్యమానమవుతుందనే అభిప్రాయం నిజమైతే దీన్ని ప్రమోట్ చేసే పద్ధతి గిన్నిస్ బుక్ ప్రదర్శనల ద్వారా కాదు. యోగాభ్యాసం ఫలితంగా ఫలానా అథ్లెట్ ఫలానా కప్పు గెలుచుకొచ్చారని, ఫలానా క్రీడా జట్టు ఫలానా టోర్నమెంట్ గెలిచిందని ఉదాహరించాలి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఫలానా వ్యక్తులు ఫలానా ఆవిష్కరణలు చేశారని, నోబెల్ బహుమతి గెలిచిన వారి మేధ వెనుక యోగాభ్యాసం ఉన్నదనేటటువంటి పాఠాలు ఎక్కువ మోటివేట్ చేస్తాయి. కాకపోతే అటువంటి ఉదాహరణల కోసం కాస్త కష్టపడి శోధించాలి.‘సకల సమస్యలకు యోగానే మందు’ అనే ప్రచారాన్ని ముందుకు తెస్తున్న చంద్రబాబు లాంటి వాళ్లు ‘‘ప్రభుత్వ బడుల్లో టోఫెల్ పాఠాలెందుకు, సీబీఎస్ఈ ఎందుకు, ఐబి ఎందుకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు? యోగా ఉందిగా! ‘ఆరోగ్యశ్రీ’ ఎందుకు, ‘ఫ్యామిలీ డాక్టర్’ ఎందుకు? యోగా చేయండి చాలు!’’ అనే ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉన్నది. ‘అంతులేని కథ’లో సదరు సన్యాసిరావు సంభాషించిన జ్ఞాన సంపద, భక్తి సంపద, తపః సంపద మాదిరిగానే! ఇక ఆంధ్ర దేశంలో యోగ సంపద కూడా దినదిన ప్రవర్ధమానం కావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
నన్ను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే..గుమ్మనూరు జయరాంకు వెంకట్రామిరెడ్డి ఛాలెంజ్
-
ఏపీలో రైతుల అవస్థలపై ప్రభుత్వ నిలదీసిన YSRCP నేతలు
-
రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
-
చంద్రబాబు యోగా డే పేరుతో హైడ్రామా చేస్తున్నారు: Sajjala
-
ఆ జన ప్రభంజనాన్ని చూసే మాట్లాడుతున్నావా.. బాబుకు కౌంటర్
-
ఆంధ్రప్రదేశ్తో చర్చలకు సిద్ధం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తమకెలాంటి భేషజాలు లేవని, ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడితో ముఖాముఖి చర్చలు జరిపే అంశంపై ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే చర్చలకు తానే స్వయంగా చంద్రబాబును ఆహ్వానించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. ‘గోదావరి జలాలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం చాలా ముఖ్యం. తెలంగాణ హక్కులను హరించే ఏ ప్రతిపాదనలనైనా వివిధ వేదికలపై అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఏపీ చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మేము వివాదాలు కోరుకోవడం లేదు. అదే సమయంలో మా హక్కుల విషయంలో రాజీ పడబోము..’అని సీఎం స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు గురువారం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏపీతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం.. ‘తెలంగాణ, ఏపీ మధ్య గోదావరి, కృష్ణా జలాల పంపిణీయే ప్రధాన సమస్య. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం టెక్నికల్, అపెక్స్, అధికారుల కమిటీలున్నాయి. సమస్యలపై రెండు రాష్ట్రాల అధికారులు, మంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. అలా కాకుండా బనకచర్ల ప్రాజెక్టుపై పీఎఫ్ఆర్ (పీ ఫీజబిలిటీ రిపోర్ట్)ను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం అందజేయడంతో వివాదం మొదలైంది. సమస్య ఏదైనా చర్చల ద్వారా పరిష్కారం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్సంబంధాలు కోరుకున్నట్లే, తెలంగాణ కూడా ఏపీతో సత్సంబంధాలు కోరుకుంటోంది..’అని సీఎం అన్నారు. ముందు మా ప్రాజెక్టులు పూర్తికావాలి.. ‘మోదీ సీట్లో కూర్చోవాలంటే చంద్రబాబు సహకారం కావాలి. బాబు మళ్లీ ఏపీలో గెలవాలంటే ఆయనకు గోదావరి నీళ్లు కావాలి. అయితే ఎవరి కోసమో మా హక్కులను వదులుకోలేము. లిటిగేషన్లు, వివాదాలతో ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. తెలంగాణలో మా ప్రాజెక్టులు పూర్తయి, పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాతే.. ఏపీ తమ ప్రాజెక్టుల గురించి ఆలోచించాలి..’అని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయం చేస్తోంది బీఆర్ఎస్సే.. ‘తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పదేళ్ల పాటు నీళ్లు, నిధులు, నియామకాలు అనే మోసపూరిత సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసింది. ఇప్పుడు అదే జలాలను ఆ పార్టీ సంజీవనిగా భావిస్తోంది. కృష్ణా–గోదావరి జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావులే గోదావరి జలాలపై ఏపీకి అన్ని హక్కులు రాసిచ్చి తెలంగాణకు అన్యాయం చేశారు..’సీఎం ఆరోపించారు. కిషన్రెడ్డికి కేటీఆర్ ప్రైవేట్ ట్యూటర్ ‘కిషన్రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రైవేట్ ట్యూటర్. ఆయన ఏం చెబితే అదే చేస్తారు. కేంద్రానికి కేటీఆర్కు మధ్య లైజనింగ్ ఆఫీసర్. నేను కేంద్ర మంత్రులను కలుస్తానని, తనతో కలిసి రావాలని కిషన్రెడ్డికి ముందే లేఖ ద్వారా సమాచారం ఇచ్చా. అయినా ఆయన రాలేదు. నేను కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోర్లాల్ ఖట్టర్లను కలవడానికి ముందే.. కేటీఆర్ డైరెక్షన్ మేరకు కిషన్రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు..’అని రేవంత్రెడ్డి విమర్శించారు. -
బాబు ష్యూరిటీ బాండు.. మోసం గ్యారంటీకి బ్రాండ్
సాక్షి, అమరావతి:‘చంద్రబాబునాయుడు అనే నేను రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘‘భవిష్యత్తుకు గ్యారెంటీ’’లోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ ఇదీ బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారెంటీ పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతకంతో ఆ పార్టీ జారీ చేసిన ష్యూరిటీ బాండ్. ఇందులో పథకాలను 2024 జూన్ (ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల) నుంచే అమలు చేస్తామని కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ బాండ్ పేపర్లతో ఇంటింటికీ వెళ్లిన టీడీపీ క్యాడర్... ఆ ఇంటిలో మొత్తం ఎందరు ఉన్నారు...? మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? అనే వివరాలు, వారి పేర్లు తీసుకుని... వీరికి ఏ పథకం కింద ఎంతెంత వస్తుంది..? అని లెక్కలేసి మరీ చెప్పారు. బాండ్ పేపర్లను మొబైల్ ఫోన్లకూ పంపారు. వీటిని నమ్మి ప్రజలు ఓట్లేయడంతో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైంది. కానీ, సూపర్ సిక్స్ సహా వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాలేదు. దీంతో ప్రతి ఇంట ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులను ఎక్కడికక్కడ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ ఇచ్చిన బాండ్లు మోసాలకు నకళ్లుగా మారిన వైనాన్ని ఏకరవు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, సీఎం చంద్రబాబు మాత్రం ‘‘సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసేశా.. ఎవరైనా సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నిõÜ్త వారి నాలుక మందం తప్ప మరోటి కాదంటూ’’ ముందుగానే బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని... వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తానని, అంతకు రెండింతలు సంక్షేమం సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఇస్తామంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నమ్మబలికారు. వైఎస్ జగన్ కంటే ఎంత ఎక్కువ ఇస్తాం అనేది రసీదు రూపంలో చెప్పారు. ఇక ఈ హామీల అమలు పూచీ నాదంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారు. చంద్రబాబు తానా అంటే తందానా అనే ఎల్లో మీడియా సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలపై విస్తృత ప్రచారం చేసింది. అప్పటికీ చంద్రబాబును నమ్మి ఓట్లేస్తే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపినట్లేనంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, నాటి సీఎం వైఎస్ జగన్ ప్రజలను హెచ్చరించారు. కానీ.. చంద్రబాబు మాటలు, పవన్ కళ్యాణ్ గ్యారంటీలు.. ఎల్లో మీడియా కథనాలు నమ్మి ఓట్లేసి టీడీపీ కూటమిని గెలిపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది.. సూపర్ సిక్స్ అతీగతీ లేదు.. పైగా హామీల అమలుపై ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పు.. సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా’ అంటూ దబాయిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన మెహరాజ్ బేగం షేక్కు ఐదేళ్లలో జరగబోయే లబ్ధికి సంబంధించి ఇచ్చిన హామీ ‘త్రి’కరణశుద్ధిగా మాట తప్పారు.. సూపర్ సిక్స్, ఎన్నికల హామీల అమలుపై ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు సంతకంతో ఉన్న బాండ్ పేపర్లు పంపిణీ చేసి వివరాలు నమోదు చేశారు టీడీపీ నేతలు. టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లుగా మిస్డ్ కాల్ ఇప్పించారు. వారి ఫోన్ నుంచి ఓటీపీ కూడా తీసుకున్నారు. ప్రతి ఇంటి యజమాని లేదా ఆయన భార్య ఫోన్ నంబరు తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్సైట్లోకి ఎక్కించారు. ఎన్నికల సభల్లోనూ భారీగా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ‘త్రి’కరణశుద్ధిగా మాట తప్పారు. ఈ మోసంపైనే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ కూటమి నేతలను ప్రశ్నించేందుకు ప్రతి గడప ఎదురుచూస్తోంది.మహానాడు నుంచే మహా మోసానికి నాంది సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే.. అంటే 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వీటితోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి, తద్వారా ఒక కుటుంబానికి ఐదేళ్లలో చేకూరే ప్రయోజనంపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా నామకరణం చేశారు. మహానాడు అనంతరం ఎన్నికల ప్రచారం ముగిసేవరకు నియోజకవర్గాల టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి.. కుటుంబసభ్యుల పేర్లు ఆరా తీసి, ‘‘టీడీపీ మేనిఫెస్టో.కామ్’’ వెబ్సైట్లో ఆ వివరాలు నమోదు చేశారు. ఆ తర్వాత కుటుంబ యజమాని లేదా ఆయన భార్య ఫోన్ నంబరు తీసుకుని టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్సైట్ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీని టీడీపీ మేనిఫెస్టో.కామ్ వెబ్సైట్లో నమోదు చేసి.. ఆ కుటుంబానికి సూపర్ సిక్స్ సహా వివిధ పథకాల కింద ఏటా చేకూరే లబ్ధి... ఐదేళ్లకు ఒనగూరే ప్రయోజనం ఎంతనో వివరించారు. తర్వాత టీడీపీకీ మద్దతు ఇస్తున్నట్లు వెబ్సైట్కు మిస్డ్ కాల్ ఇప్పించారు. ఆ వెంటనే.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల ద్వారా చేకూర్చే ప్రయోజనానికి గ్యారంటీ ఇస్తూ వారి ఫోన్ నంబర్కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. బాండ్లను కుటుంబ సభ్యుల ఎదుటే డౌన్లోడ్ చేయించారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఈ హామీలను అమలు చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ సహా హామీలన్నీ 2024 జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని బాండ్లలో తేల్చిచెప్పారు.ఇది కాదా మోసం..? 2024 జూన్ నుంచే పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు... కూటమి ప్రభుత్వం వచ్చిన సరిగ్గా ఏడాది తర్వాత తల్లికి వందనం పథకం అమలు చేశారు. కానీ, ఇందులో 87,41,885 మందికి రూ.15 వేల వంతున ఇవ్వాల్సి ఉండగా 54,94,703 మందికి మాత్రమే రూ.13 వేల చొప్పున జమ చేస్తామని ప్రకటించారు. అంటే 32,47,182 మందికి ఎగనామం పెట్టి తల్లికి వందనం పథకాన్ని మహా మోసంగా మార్చారు. ఈ పథకంపై మీడియాతో మాట్లాడుతూ పీ–4కు ఆడబిడ్డ నిధి, స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ భృతిని అనుసంధానం చేశానని... 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ ప్రకారం చూస్తే.. చంద్రబాబు మాటల్లోనే సూపర్ సిక్స్ సూపర్ మోసంగా మారిందని స్పష్టమవుతోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం దొరకొట్టాల గ్రామానికి చెందిన పసాది సాలమ్మకు జరగబోయే లబ్ధికి సంబంధించి కూటమి నేతలు ఇచ్చిన బాండ్ ఆ బాండ్లు... మోసాలకు సాక్ష్యాలు ఏడాదిలో రూ.81,397.83 కోట్లు ఎగవేత ⇒ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ బాండ్లలో గ్యారంటీ ఇచ్చిన హామీల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో ‘మోసపోయాం’ అంటూ ప్రతి ఇంట ప్రజలు నిట్టూర్చుతున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్లు.. ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న బాండ్లను తీసుకుని.. ఏడాదిలో సూపర్ సిక్స్ పథకాల కింద తమ కుటుంబానికి ఎంతమేరకు ప్రభుత్వం ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. ⇒ సూపర్ సిక్స్లో భాగంగా.. 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు బాకీ పడ్డారు. ⇒ పీఎం కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ, తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ⇒ సూపర్ సిక్స్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18ృ59 ఏళ్ల మధ్య వయసు వారు 1.80 కోట్ల మంది. వీరికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. మొదటి ఏడాది ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే.. మహిళలకు రూ.32,400 కోట్లు బాకీపడ్డారు. ⇒ దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. తొలి ఏడాది ఒక సిలిండర్కు రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ప్రకారం రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు.⇒ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనేది మరో హామీ. దీనికోసం నెలకు రూ.275 కోట్ల చొప్పున ఆర్టీసీకి ఇవ్వాలి. తొలి ఏడాది ఈ హామీ అమలు చేయలేదు. అంటే... ఉచిత బస్సు రూపంలో మహిళలకు రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు. ⇒ 50 ఏళ్ల నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పింఛను ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పింఛనుగా ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఇది ఇవ్వలేదు. రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ⇒ తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలను బడికి పంపిస్తే అంతమందికి రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని బాబు వాగ్దానం చేశారు. యూడీఐఎస్ఈ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యూడైస్) ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతున్నారు. రూ.15 వేల చొప్పున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ, తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ⇒ పంటల బీమా పరిహారం ఇవ్వకుండా రాష్ట్రంలోని 53 లక్షల మంది రైతులకు టోపీ పెట్టిన మొత్తం రూ.1,385 కోట్లు. ఇక మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద ఎగ్గొట్టిన మొత్తం రూ.265 కోట్లు. ఇలా ఏడాది కాలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.81,397.83 కోట్లు బకాయి పడిందని ప్రజలు లెక్కలు వేస్తున్నారు. బాకీపడిన ఈ మొత్తంతో పాటు ఈ ఏడాది ఇవ్వాల్సినవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.బాబూ... ఇదిగో మీరిచ్చిన బాండు..! ఇంటి వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల నిలదీతకు ప్రజలు సిద్ధం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలును 2024 జూన్ నుంచే ప్రారంభిస్తామంటూ బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట ప్రతి ఇంటా ఇచ్చిన బాండ్ల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో ఇంటింటా ఆగ్రహం పెల్లుబుకుతోంది. బాండ్లు చూపి చంద్రబాబును నిలదీయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుపై ఇప్పుడు ప్రతి ఇంట చర్చ సాగుతోంది. టీడీపీ నేతలు ఇచ్చిన బాండు ప్రకారం తమ ఇంటికి గత ఏడాది కాలంలో రావాల్సిన మొత్తంపై లెక్క వేసుకుని.. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని తమ ఇంటి వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. -
Kuppam: మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి,గుంటూరు: చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్.హెచ్.ఆర్.సీ. సీరియస్ అయ్యింది. సుమోటోగా కేసు విచారణకు తీసుకుంది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఏపీ సీఎస్,డీజీపీని ఆదేశించించింది.తన భర్త చేసిన అప్పులు తీర్చలేదని నారాయణపురంలో మహిళను టీడీపీ కార్యకర్త, కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేశారు. ఈ అమానవీయ ఘటనను సాక్షిటీవీ వెలుగులోకి తెచ్చింది. నేషనల్ మీడియా సైతం వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. A video from #Kuppam surfaced where a woman was tied to tree after her husband failed to repay loan of 80,000. Police had registered a case & accused taken in custody.#AndhraPradesh CM @ncbn orders strict action against those who attacked the woman. pic.twitter.com/D3nID4char— Aneri Shah Yakkati (@tweet_aneri) June 17, 2025‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను’‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను. చివరకు వికలాంగురాలైన నా కుమార్తెకు వచ్చే రూ.6 వేల పింఛన్ సైతం వాళ్లే లాక్కుంటున్నారు. అయినా వాళ్ల ధనదాహం తీరలేదు. చివరకు నన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి బాకీ తీర్చాలంటూ దాడి చేశారు’ అని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు... శిరీష అనే మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన ఘటన విదితమే. మేం బాగా బతికినోళ్లమే‘నా భర్త పేరు తిమ్మరాయప్ప. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేం బాగా బతికినోళ్లమే. మాకు జేసీబీ కూడా ఉండేది. తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు నా భర్త రూ.16 లక్షలు అప్పులు చేశాడు. జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాం. మిగిలిన అప్పులు తీర్చేందుకు నారాయణపురానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నాం. వారికి ప్రతినెలా నూటికి రూ.5 నుంచి రూ.30 వరకు వడ్డీలు చెల్లించాం. వడ్డీలు అయితే కట్టాం కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది.’ అని తెలియజేసింది.నా భర్తను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడంతోనే వెళ్లిపోయాడు‘అసలు మొత్తం చెల్లించాలని 6 నెలల క్రితం నా భర్త తిమ్మరాయప్పను చెట్టుకు కట్టేసి గ్రామస్తుల మధ్య తీవ్రంగా అవమానించారు. దీన్ని తట్టుకోలేక నా భర్త గ్రామం నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వికలాంగురాలైన నా పెద్ద కుమార్తె, కుమారుడు, మరో కుమార్తెను మా అమ్మ వద్ద వదిలి నేను బెంగళూరు వెళ్లాను. అక్కడ కూలీ పనులు చేసి కొద్దికొద్దిగా అప్పు తీరుస్తున్నాను. వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో నా తాళిబొట్టును కూడా అమ్మి అప్పు కట్టాను. అయినా వారి ధనదాహం తీరలేదు.వికలాంగ పెన్షన్ను కాజేశారుమా పెద్ద కుమార్తెకు నెలనెలా వచ్చే వికలాంగ పెన్షన్ రూ.6 వేలను కూడా మూడు నెలల నుంచి మునికన్నప్ప కుటుంబమే తీసుకుంటోంది. దీంతో నా పిల్లలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి తిరిగొచ్చాను. స్కూలు నుంచి టీసీలు తీసుకుని పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తుంటే మునికన్నప్ప కుటుంబ సభ్యులు నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కొడుకు పక్కనే ఏడుస్తున్నా వాళ్లు కనికరించలేదు. పోలీసులు రాకపోతే నా గతి ఏమయ్యేదో’ అంటూ శిరీష బోరున విలపించారు. -
ప్రజలకు సేవ చేయడమే మేం చేసిన తప్పా
-
కక్ష కట్టి.. అక్రమ కేసు పెట్టి..
సాక్షి, నరసరావుపేట: ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆంక్షలు విధించినా... వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన అనుకున్నదాని కంటే ఎక్కువ విజయవంతం కావడంతో కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు. అక్కసుతో వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా వివిధ కారణాలు చూపి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. వీటి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతుండడం గమనార్హం. ⇒ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ షేక్ అమీనుద్దీన్ అక్రమ కేసు కట్టారు. గుంటూరు–హైదరాబాద్ హైవేలో కంటెపూడి సమీపంలో విధులు నిర్వర్తిస్తుండగా అంబటి ర్యాలీగా వచ్చారని, అనుమతులు లేవని చెప్పినా వినిపించుకోకుండా ఇనుప స్టాప్ బోర్డును నెట్టేశారని, అది నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు గన్మెన్ చిలకా గోపి కాలుపై పడి రక్తస్రావమైందని ప్రస్తావించారు. గోపి ఫిర్యాదుతో అంబటి, మరికొందరి పై 189(2), 223(ఏ), 121(1), 132, 324(4), రెడ్విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ⇒ వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకపోయినా.. పెద్దఎత్తున ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చి బైక్ ర్యాలీలు చేశారని వైఎస్సార్ సీపీ నేత గజ్జల సు«దీర్భార్గవ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ నాగమల్లేశ్వరరావు అక్రమ కేసు నమోదు చేశారు. ప్రజా రవాణాకు ఆటంకం, బారికేడ్ల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తి నష్టానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరు వైఎస్సార్సీపీ నేతల పేర్లు చేర్చేందుకు పోలీసులపై కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.నాగమల్లేశ్వరరావు తండ్రిపైనా.. రెంటపాళ్ల వీఆర్వో బూసిరాజు లక్ష్మి ఫిర్యాదు మేరకు నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు, గజ్జల సు«దీర్ భార్గవ్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఇరుకు సందులో ఎక్కువమందితో విగ్రహావిష్కరణ వద్దని పోలీసులు నోటీసులిచ్చినా పెద్దసంఖ్యలో జనం వచ్చేలా చేసి వారి జీవితాలను ప్రమాదంలో పడేశారని పేర్కొన్నారు. భారీ సౌండ్తో డీజే, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఫ్లెక్సీలు ప్రదర్శించారని... టీడీపీ నాయకుల అంతు చూస్తాం అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించాడని బొల్లెద్దు రవితేజపై సత్తెనపల్లి టౌన్ టీడీపీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 352, 351(2) రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్లను ఎఫ్ఐఆర్లో పొందుపర్చారు. ⇒ వైఎస్ జగన్ పర్యటనలో అభిమానులు గజ్జల ఆసుపత్రి వద్ద రోడ్డుపై డీజే పెట్టడంతో ఇబ్బందిపడ్డామని సత్తెనపల్లికి చెందిన నూర్బాషా జానీబాబు ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. డీజే సౌండ్ ఆపమన్నందుకు గుర్తుతెలియని నలుగురు తనౖపె దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
బాండ్లు చూపి బాబును నిలదీయండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలను కనీసం రిబ్బన్ కూడా కత్తిరించకుండానే.. మొత్తం హామీలు అమలు చేసేశానని చెబుతున్నాడు. అబ్రకదబ్ర.. ఛూమంతర్ అంటూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా 143 హామీలు అమలు చేసేశానని ఊదరగొడుతున్నాడు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్పై ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటూ ముందే బెదిరిస్తున్నాడంటూ ఎత్తి చూపారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా కూడా చంద్రబాబు చెబుతున్న పచ్చి అబద్ధాలను.. నిజాలుగా నమ్మించేలా ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్ని అబద్ధాలు చెప్పి, మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏడాదిగా తాను ఏం చేశానన్నది చెప్పేందుకు ఇంటింటికీ తన ఎమ్మెల్యేలు, నాయకులను పంపుతానంటున్నాడని దుయ్యబట్టారు. ‘ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను, బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన బాండ్లను దగ్గర పెట్టుకోండి. వాటిని చూపి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉందో వడ్డీతో సహా చెల్లించాలని నిలదీయండి’ అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో..’ అంటే చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చుకుందాం’ అంటూ వైఎస్సార్సీపీ దాన్ని మీకు అందుబాటులోకి తెస్తుందని.. దాని కోసం మీరు క్యూఆర్ కోడ్ వినియోగిస్తే చాలు డౌన్లోడ్ అవుతుందని ప్రజలకు సూచించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా అన్ని హామీలు 2024 జూన్ నుంచి అమలు అవుతాయని.. మీ ఖాతాలో డబ్బులు జమ అవుతుందని చంద్రబాబు త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతూ మీకు ఇచ్చిన బాండ్లను.. మీ ఇంటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాగానే చూపి.. అవి తమకు ఎప్పుడిస్తారని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని హామీలను అమలు చేస్తుందేమో చూద్దామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే.. మీ తరఫున మీతో కలిసి పోరాడటానికి వైఎస్సార్సీపీ, తాను సిద్ధమని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయాలంటూ కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమానికి ప్రణాళిక రచిద్దామని ప్రజలను చైతన్య పరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..జగన్ కంటే ఎక్కువ ఇస్తానని మోసం చేస్తావా?⇒ చంద్రబాబు ఎన్నికలకు ముందు జగన్ చేస్తున్నవే కాకుండా అంత కంటే ఎక్కువ చేస్తామన్నారు. ‘మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవీ ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాను’ అంటూ 2024 ఏప్రిల్ 11న చంద్రబాబు హామీ ఇచ్చారు (చంద్రబాబు మాట్లాడిన వీడియోను ప్రదర్శించి చూపారు). ఇప్పుడు వాటన్నింటినీ అమలు చేసేశానని చెబుతున్నాడు. ⇒ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తామన్నారు. ఎంత మందికి ఇచ్చారు? రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.56 కోట్ల మంది ఉన్నారని టీడీపీ అఫీషియల్ గెజిట్ ‘ఈనాడు’లో 2025 ఏప్రిల్ 17న కథనాన్ని ప్రచురించారు. కోటిన్నరకు పైగా ఉపాధి లేని యువత ఉంటే.. వారికి ఒక్కపైసా కూడా ఇవ్వకుండా అన్నీ చేసేశానని చెప్పడం మోసం కాదా? ⇒ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామని ఎగ్గొట్టలేదా? దీపం, ఉచిత బస్సు అనేవి చిన్న పనులు. కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.59 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీళ్లందరికీ ఉచిత గ్యాస్ ఇవ్వాలి అంటే సిలిండర్కు రూ.877 చొప్పున మూడు సిలిండర్లకు రూ.4,109 కోట్లు ఖర్చు అవుతుంది. తొలి ఏడాది బడ్జెట్ కేటాయింపు రూ.865 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.3,244 కోట్లు ఇవ్వకుండా మోసం చేయలేదా? అక్కడా మళ్లీ మోసమే.. కనీసం ఒక్క సిలిండర్కైనా పూర్తిగా ఇవ్వాలంటే రూ.1,370 కోట్లు అవుతుంది. అలాంటిది రూ.865 కోట్లే ఇచ్చారు. ఒక్క సిలిండర్ను కూడా సరిగా ఇవ్వలేదు. దీపం పథకం బోగస్! ⇒ మహిళలకు ఉచిత బస్సు అన్నింటికంటే చాలా సులభం. నెలకు రూ.275 కోట్లు ఆర్టీసీ వాళ్లకు ఇస్తే ఏడాదికి రూ.3 వేల కోట్లతో పథకం అమలవుతుంది. మా కడపలో మహిళలు విశాఖపట్నం వెళ్లి చూసి రావొచ్చని ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. పండుగ పేర్లు మారిపోతున్నాయి తప్ప బస్సు రావట్లేదు. గతేడాది ఉగాది నుంచి ఈ ఏడాది ఉగాది వరకు పండుగలు వెళ్లిపోతే.. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ఉచిత బస్సు అమలుకు అధ్యయనంతో పనేముంది? ఆర్టీసీకి డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా? అప్పుడు కడప వాళ్లు విశాఖ వెళ్తారు.. అనంతపురం వాళ్లు అమరావతి చూసుకోవడానికి విజయవాడకు వస్తారు. దుర్గమ్మ దర్శనం చేసుకుని వెళ్తారు. ఇంకేమైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఇటు రాయలసీమ వాళ్లు, అటు ఉత్తరాంధ్ర వాళ్లు కొంచెం సేద తీరుతారు. ⇒ 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు అవుతుంది. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది కూడా ఎగరగొడుతున్నారు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్నవి పీకేశారు. చంద్రబాబు ఎన్నికలకు వెళ్లే నాటికి మార్చిలో 66,34,742 పింఛన్లు ఉంటే.. ఈ నెలలో ఇచ్చింది 61.48 లక్షల మందికి మాత్రమే. సంవత్సరం తిరిగే లోగా 5 లక్షల పింఛన్లు తగ్గించేశారు. వీటికి అదనంగా 50 ఏళ్లు నిండిన వాళ్లకు పింఛన్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి మహిళలను మోసం చేశారు.⇒ ప్రధాన మంత్రి పీఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. మడమ తిప్పను.. మాట తప్పను అన్నావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు ఇస్తుంది కాబట్టి నేను రూ.6,500 ఇస్తానని చెప్పావు. ఇది ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మేము సంవత్సరానికి ఇప్పుడిచ్చేది కాకుండా రూ.20 వేలు ఇచ్చేలా తెలుగుదేశం పార్టీలో నిర్ణయం చేశామని చంద్రబాబు చెప్పాడు. (చంద్రబాబు మాట్లాడిన ప్రసంగం వీడియోను ప్రదర్శించారు). కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.20 వేలు ఇస్తానని ఊదరగొట్టి ఏడాదిలో ఒక్కపైసా ఇవ్వలేదు. రాష్ట్రంలో 53,58,666 మంది రైతులకు రూ.20 వేలు చొప్పున ఇస్తే రూ.10,716 కోట్లు మేలు జరిగేది. ⇒ తల్లికి వందనం పేరిట తల్లులను వంచన చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్నాడు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోమని ఎన్నికల్లో పదేపదే చెప్పారు. ‘ఎంత మంది పిల్లలున్నా ఒక్కొక్కరికీ రూ.15 వేలు.. ఆంక్షలు లేవు.. కటింగ్ లేదు.. పూర్తిగా ఇచ్చే బాధ్యత మాది అన్నారు (చంద్రబాబు ఈ మేరకు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు). కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ యూడైస్ డేటా ప్రకారం రాష్ట్రంలో 2023–24లో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. మరి 87.41 లక్షల మంది పిల్లలకు రూ.15 వేల చొప్పున రూ.13,111 కోట్లు ఇవ్వాలి. ఇస్తామంటోంది కేవలం రూ.8,700 కోట్లు. అది కూడా చివరికి వచ్చే సరికి ఏ మేరకు ఇస్తారో చూడాలి. అందరికీ ఇచ్చిన తర్వాత గాని తెలియదు ఎంత మందికి ఇచ్చారో.. ఎంత మందికి ఎగనామం పెట్టారో. ఈ లెక్కలు చూసినా 30 లక్షల మందికి కోత పెట్టారు. మేము గట్టిగా నిలదీస్తే రూ.15 వేలు కాదు రూ.13 వేలే ఇచ్చేది.. అందులో 67 లక్షల మందికి ఇస్తున్నామని ప్లేటు ఫిరాయించారు. మళ్లీ 67 లక్షల్లో ప్రస్తుతానికి 54 లక్షల మందికే ఇస్తున్నామంటున్నాడు. ఎన్నికలప్పుడు చెప్పిన నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు పోయింది. ఇప్పుడు కొందరికి మాత్రమే రూ.13 వేలు అని తేలింది. ఇది మోసం కాదా చంద్రబాబూ? ప్రశ్నిస్తే నాలుక మందమంటావా?రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు నిండిన 2,10,58,615 మంది మహిళలు ఉన్నారు. వీళ్ల అడ్రస్లతో సహా వివరాలు ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి. ఇందులో 60 ఏళ్లు నిండిన వాళ్లను తీసేస్తే.. 1.80 కోట్ల మంది మహిళలు ఉంటారు. వీళ్లందరిలో ఎంత మందికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున ఇచ్చారు? తొలి ఏడాది ఎగ్గొట్టాక.. ఇప్పుడు పీృ4 జపం చేస్తున్నాడు. నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవరో శ్రీమంతులతో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తానని డ్రామాలు చేయడానికి సిగ్గులేదా?ఇన్నిన్ని అబద్ధాలు, మోసాలు చేస్తున్న ఈ పెద్దమనిషి ఇప్పుడు ప్రతి ఇంటికీ తన ఎమ్మెల్యేలను, తన పార్టీకి సంబంధించిన నాయకులను పంపిస్తాడట. అప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, చంద్రబాబు ఇచ్చిన బాండ్లను అందరూ దగ్గర పెట్టుకుని చూపించండి. ఆ మేనిఫెస్టో ప్రకారం ఏడాదిగా మీకు రావాల్సిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేస్తూ నిలదీయండి. మీ వద్ద ఆ మేనిఫెస్టో లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకునేలా వైఎస్సార్సీపీ త్వరలో రిలీజ్ చేస్తుంది. దాన్ని దగ్గర పెట్టుకుని మీకు ఏమేం రావాలో చెబుతూ ప్రశ్నించండి. కనీసం వారికి అప్పుడైనా సిగ్గు వచ్చి అమలు చేస్తారేమో చూద్దాం. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపించి ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం గురించి వివరిస్తున్న వైఎస్ జగన్ ఉన్న పథకాలను భ్రష్టు పట్టించారు⇒ ఒకవైపున ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టించారు. అప్పట్లో ప్రతి తల్లికి అమ్మ ఒడి పేరుతో సాయం అందించి, పిల్లలను బడులకు పంపించేలా ప్రోత్సహించాం. 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి 83–84 లక్షల మంది పిల్లలను బడుల బాట పట్టించాం. ఇప్పుడు నిబద్ధత లేకుండా మోటివేషన్ కార్యక్రమాలను భ్రష్టు పట్టిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ విద్యా రంగాన్ని దెబ్బ తీసి, మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణలు నాశనం చేశాడు. ⇒ మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఇంగ్లిష్ మీడియం బడులు, 3వ తరగతి నుంచి టోఫెల్ చెప్పే పీరియడ్లు పోయాయి. సబ్జెక్టు టీచర్ విధానం, రోజుకొక రుచికరమైన మెనూ, చిక్కీతో సహా ఇచ్చే గోరుముద్ద పోయింది. నాడు–నేడు పనులు ఆగిపోయాయి. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ, అక్కడి నుంచి ఐబీ వరకు ప్రయాణం నిలిచిపోయింది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేవి. ఇప్పడు అవీ లేవు. తొలిసారిగా మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడులు ప్రైవేటు బడుల కంటే మెరుగైనవిగా నిలిచాయి. స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు కనిపించేవి. ఇప్పడు విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. చివరికి పదో తరగతి పరీక్షల పేపర్లు సక్రమంగా దిద్దలేని అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ⇒ మా ప్రభుత్వ హయాంలో పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే వాళ్లం. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన అందించేవాళ్లం. ఇదంతా క్రమం తప్పకుండా జరిగేది. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఈ జూన్ దాటితే ఆరు త్రైమాసికాలు బకాయిలు పెట్టారు. ఎన్నికల కోడ్తో పెండింగ్ పడినప్పటి నుంచి ఆరు త్రైమాసికాలు రూ.4,200 కోట్లు, ఏప్రిల్ (2024)లో ఇవ్వాల్సిన వసతి దీవెన రూ.1100 కోట్లు, ఈ ఏడాదికి మరో రూ.1,100 కోట్లు మొత్తం రూ.2,200 కోట్లు వెరసి రూ.6,400 కోట్లు చెల్లించాల్సి ఉంటే.. ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు మాత్రమే. ⇒ ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను వెయ్యి నుంచి 3,300కు పెంచి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని, మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దరి చేర్చాం. మధ్య తరగతి ప్రజలు అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి లేకుండా వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేశాం. నెలకు ఆరోగ్యశ్రీ కింద రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే, చంద్రబాబు వచ్చిన ఏడాదిలో రూ.3,600 కోట్లు పెండింగ్ పెట్టేశారు. ఆరోగ్య ఆసరా కింద పేషెంట్ ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఇచ్చే వాళ్లం. దీనికి మరో రూ.400 కోట్లు అవుతుంది. ఇలా.. చంద్రబాబు ఏడాదిలో రూ.4 వేల కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యం చేయలేక చేతులు ఎత్తేశాయి. ఇప్పుడు పేదలు నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇవ్వకుండానే చంద్రబాబు.. అబ్రక దబ్రా అంటూ మాయ చేస్తున్నాడు. గట్టిగా అడిగితే నాలుక మందం అంటూ బెదిరిస్తున్నాడు. ⇒ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోలు, గిట్టుబాటు ధర.. ఇలా అన్నీ రద్దయ్యాయి. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.బాబు బాదుడే బాదుడుచంద్రబాబు నిజంగా కొన్ని చేశారు. ఏడాదిలో రూ.15 వేల కోట్లు కరెంటు చార్జీలు బాదాడు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు పెంచి పేదలను బాదేశాడు. అన్ని పన్నులు పెంచడంతో ఇంటి అద్దెల బాదుడు.. హెరిటేజ్ కోసం అమూల్ను చంపేసి పాలరేట్ల బాదుడు.. ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలు తీసేసి.. సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం మానేశాడు. ఫలితంగా పప్పుల ధరలు పెరగడంతో.. రకరకాలుగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మొదలెట్టాడు. చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు అల్లాడిపోతుంటే.. నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం పెరిగి ప్రజలు కిందాపైనా పడుతున్నారు. ఏడాదిలో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు.. ఏకంగా 3 లక్షలకుపైగా ఉద్యోగాలు తీసేశాడు. 2.60 లక్షల మంది వలంటీర్లు, 20 వేల మంది రేషన్ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్ల ఉద్యోగాలు హుష్ కాకి! బెవరేజస్ కార్పొరేషన్లో పని చేస్తున్న 15 వేల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలు పోయాయి.ఉద్యోగులకు రూ.20 వేల కోట్ల బకాయిప్రభుత్వ ఉద్యోగస్తులకు మేలు జరిగిందా అంటే అదీ లేదు. వస్తూనే ఐఆర్ ఇస్తానన్నాడు. అదీ పాయే. ఉన్న పీఆర్సీని రద్దు చేశాడు. కొత్త పీఆర్సీ వేయలేదు. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని సాగదీస్తూ వస్తున్నాడు. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్ పెట్టాడు. జూలై 1వ తేదీ వస్తే నాల్గో డీఏ పెండింగ్. వైఎస్సార్సీపీ హయాంలో తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ను తీసేసి ఓపీఎస్ తీసుకొస్తా అన్నాడు. ఆ విషయంలోనూ వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలే రూ.20 వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఎవరైనా అడిగితే తోకలు కత్తిరిస్తా.. భూ స్థాపితం చేస్తా అంటున్నాడు. ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి మాత్రం ఆయన, ఆయన ఎల్లో మీడియా రకరకాల స్కెచ్లు వేస్తున్నారు.ఇలా ఇంటింటా మోసం..మెహరాజ్ బేగం షేక్ అని ముస్లిం మహిళ. ఈమెకు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ అని యూనిక్ ఐడీ కోడ్ ఇచ్చారు. మీ సంక్షేమ వివరాల కోసం అంటూ ఓ వెబ్ సైట్ లింక్ ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాశారు. ఆమె ఐడీ కోడ్, వయసు, కులం, వృత్తి, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఇద్దరు, 18 సంవత్సరాల కంటే పైబడి వయసున్న మహిళలు ఇద్దరు, నిరుద్యోగ యువతీ యువకులు సున్నా, నియోజకవర్గం రాజంపేట, కింది స్కీములు వర్తిస్తాయని రాశారు. ఆడబిడ్డ నిధి రూ.1500 చొప్పున ఇద్దరికి ఏడాదికి అందే సాయం రూ.36 వేలు, తల్లికి వందనం కింద ఇద్దరికి రూ.30 వేలు,.. మొత్తంగా ఏడాదిలో మీకు రూ.66 వేలు, ఐదేళ్లలో అందే మొత్తం రూ.3.3 లక్షలు అని స్పష్టంగా చూపించారు. ఇంకా మహాశక్తి దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం జూన్ 2024 నుంచి ప్రారంభం అని రాశారు. మీ మద్దతు తెలపడానికి మిస్డ్ కాల్ ఇవ్వండి అని రాశారు. మిస్డ్ కాల్ ఇప్పించి ఓటీపీ పంపించారు. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ.. బెనిఫిట్ డీటెయిల్స్.. అభినందనలు... రూ.3 లక్షల 30 వేలు పొందేందుకు.. మీ కుటుంబం అర్హత పొందింది’ అని మెసేజ్ పెట్టారు. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని కూడా రాశారు. చంద్రబాబు నాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని ఏకంగా బాండ్ ఇచ్చాడు. ఇలా రాష్ట్రంలో ఇంటింటా చేశారు. అందుకే ఏడాది కాలంగా మీకు ఎంత బాకీ ఉన్నారో వడ్డీతో కలిపి ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు మీ ఇంటికి వచ్చినప్పుడు.. ఇదిగో బాండు.. ఇదిగో ఎస్ఎంఎస్ అని చూపి డిమాండ్ చేయండి. ఏడాది అయింది.. మా అవసరాలు చాలా ఉన్నాయి.. ఇబ్బందులు పడుతున్నాము.. మా బాకీ ఎప్పుడిస్తావని గట్టిగా నిలదీయండి. అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారని ఆశిద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే మీ తరఫున పోరాటం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. అందరం కలిసి మళ్లీ ధర్నా చేద్దాం.. మళ్లీ కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమం చేద్దాం. సంపద సృష్టి కాదు.. ఆవిరిసాక్ష్యాధారాలతో కడిగిపారేసిన వైఎస్ జగన్ఆవిరయ్యే సంపదంతా చంద్రబాబు అండ్ కో జేబుల్లోకిమా హయాంలో జీఎస్డీపీలో అప్పుల శాతం 4.08% చంద్రబాబు పాలనలో ఏడాదిలోనే అది ఏకంగా 5.12% వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రూ.3,32,671 కోట్ల అప్పుబాబు ఏడాది పాలనలోనే రూ.1,61,301 కోట్ల అప్పుఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎగవేయడానికి చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రకరకాల స్కెచ్లు వేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నాడు. ఆయన కళ్లెదుటే సంపద ఆవిరి అవుతోంది. ఆ సంపద చంద్రబాబు జేబులోకి, ఆయనకు సంబంధించిన వారి జేబుల్లోకి పోతోంది’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపద పెరగకపోగా.. ఆదాయంతోసహా అన్నీ తగ్గుతున్నాయంటూ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలను ఎత్తిచూపుతూ చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర జీఎస్డీపీలో మా హయాంలో అప్పుల శాతం 4.08% అయితే.. చంద్రబాబు ఏడాది పాలన కాలంలో అది ఏకంగా 5.12 శాతానికి చేరుకుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు చూస్తే, మా హయాంలో అది 2.65 శాతం అయితే (అప్పుడు రెండేళ్లు కోవిడ్ ఉంది), ఇప్పుడు ఏకంగా 3.61 శాతానికి పెరిగింది’ అని చెప్పారు. ‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఏడాది కాలంలోనే దారుణంగా అప్పులు చేశారు. మా హయాంలో ఐదేళ్లలో అన్నీ కలిపి రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే.. చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేసిన మొత్తం అప్పులు రూ.1,61,301 కోట్లు. అంటే మా ఐదేళ్ల హయాంతో పోలిస్తే ఏకంగా 48.5% అప్పు చేశాడు’ అని వివరించారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే..చంద్రబాబు గజదొంగల ముఠా దోచుకుంటోందిరాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఖజానాకు రాకుండా చంద్రబాబు, ఆయనకు చెందిన గజ దొంగల ముఠా పంచుకుంటోంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం(ట్యాక్స్, నాన్ ట్యాక్స్) రూ.14,644 కోట్లు ఉంటే.. 2025 ఏప్రిల్, మే నెలల్లో అది రూ.14,580 కోట్లుగా ఉంది. నిజానికి ఈ ఏడాది 10–12 శాతం పెరగాల్సిందిపోయి.. 0.44 శాతం తగ్గింది. 2024–25లో కూటమి ప్రభుత్వ సొంత ఆదాయం రూ.96,227 కోట్లు కాగా, 2023–24లో రూ.93,354 కోట్లు. అంటే ఆదాయాల వృద్ధి కేవలం 3.08 శాతం మాత్రమే. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ పెరుగుదల ఏకంగా 12.04 శాతం ఉంది. దీంతో పోలిస్తే.. సంపద సృష్టించడం తనకు తెలుసని చెప్పే చంద్రబాబు సాధించింది అత్యల్పం. ఇదీ చంద్రబాబు గారి పనితీరు. దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబూ?ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు చెప్పే అబద్ధాలు. తానెప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తినీ తాకట్టు పెట్టలేదని ఈ మధ్య చాలా గట్టిగా, గంభీరంగా చెప్పాడు (వీడియో ప్రదర్శించారు). ఏపీఎండీసీ జీవో నంబర్ 69 ద్వారా ఏపీఎండీసీకి సంబంధించిన 436 మైన్స్ ప్రాజెక్టులను తాకట్టు పెడుతూ, వాటి విలువ రూ.1.91 లక్షల కోట్లుగా చూపిస్తూ ఏప్రిల్ 24న పర్మిషన్ ఇచ్చాడు. దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబూ? ఏపీఎండీసీ ఇష్యూ చేసిన బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాడు. ఎస్డీఎల్ (స్టేట్ డెవలప్మెంట్ లోన్లు. సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ కింద ఆర్బీఐ ఇస్తుంది) కోసం ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్దకు పోతుంది. ఆ లిమిట్స్ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దాని కన్నా ఇంకా ఎక్కువ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేస్తున్నాడు. -
సూపర్ సిక్స్ ఏమో కానీ.. చంద్రబాబు కొన్ని ఐతే చేశాడు నిజం ఒప్పుకోవాలి..
-
ఎల్లో మీడియా, బాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
తిరోగమన‘మే’
సాక్షి, అమరావతి: ఈ ఏడాది మే నెలలోనూ రాష్ట్ర సంపద తిరోగమనంలోనే సాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర సంపద పెంచడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచడంలో మాత్రం గణనీయ ప్రగతి కనబరుస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలైన ఏప్రిల్, మే నెల వరకు కాగ్ వెల్లడించిన బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే జీఎస్టీతోపాటు ఆమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం తగ్గిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లోనే ఏకంగా రూ.22,505 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. జీఎస్టీ, అమ్మకం పన్ను తగ్గిపోతోందంటే ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోందనడానికి బలమైన సంకేతమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే జీఎస్టీ, అమ్మకం పన్నుల్లో వృద్ధి నమోదవుతుందని, లేదంటే ఆదాయం తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం మే నెల వరకు వచ్చిన జీఎస్టీ ఆదాయం కన్నా.. ఈ ఏడాది మే నెల వరకు వచ్చిన ఆదాయం రూ.350 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను కూడా రూ.136 కోట్లు పడిపోయింది. పన్నేతర ఆదాయమూ రూ.49 కోట్లు తగ్గిపోయింది. కేంద్ర నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులూ ఏకంగా రూ.1300 కోట్లు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నా.. గ్రాంట్లను తీసుకురావడంలో విఫలమైంది. ఇతర రాష్ట్రాల్లో పెరుగుదల.. ఇక్కడ తగ్గుదల సాధారణంగా జీఎస్టీ, అమ్మకం పన్నుల్లో ఏటా ఎంతో కొంత పెరుగుదల కనిపిస్తుంటుంది. అయితే ఈ ఏడాది ఎలాంటి విపత్కర పరిస్థితులు లేకున్నా.. జీఎస్టీ, పన్నుల ఆదాయం తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమేనని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ రాబడి మిగతా రాష్ట్రాల్లో పెరుగుతుండగా రాష్ట్రంలో తగ్గుతోందని, దీనికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మరో పక్క ఈ ఏడాది ఏప్రిల్, మే రెండు నెలల్లోనే రూ.22,505 కోట్లు అప్పు తెచ్చినా.. మూలధన వ్యయం మే నెల వరకు రూ.2,242 కోట్లు మాత్రమే చేయడం కూడా ఆందోళన కలిగించే అంశమనే వాదన వినిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మేనెల వరకు విద్య, వైద్య, సంక్షేమం తదితర సామాజిక రంగాలపై చేసిన వ్యయంతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా రూ.6,184 కోట్లు తగ్గిపోయింది. సామాజిక రంగ వ్యయమూ సాధారణంగా గతం కన్నా పెరగాలి. అయితే అందుకు భిన్నంగా తగ్గిపోవడం గమనార్హం. సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రబాబు గత ఆర్థిక సంవత్సరం సంపద సృష్టించకపోగా రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపారు. ఈ ఆర్థిక సంవత్సరమూ రెండు నెలల్లోనే భారీగా అప్పులు చేశారు. ఇదే విషయాన్ని కాగ్ గణాంకాలూ స్పష్టం చేస్తున్నాయి. -
YS Jagan: ఊరి నుండి వెళ్లిపొమ్మని లేదంటే కాల్చి చంపుతాం అంటూ..
-
జనం గుండె ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వనిస్తోంది : రోజా
సాక్షి,గుంటూరు: వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల చేరుకున్నారు. రెంటపాళ్లలో కూటమి నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన వేళ కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకుల్ని సృష్టించింది. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది. భారీ కేడ్లు, చెక్ పోస్టులతో వైఎస్ జగన్ అభిమానుల్ని, వైఎస్సార్సీపీ శ్రేణుల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ వైఎస్ జగన్పై తమకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని అభిమానులు, శ్రేణులు నిరూపించారు.తమ అభిమాన నాయకుడు రెంటపాళ్లకు వస్తున్నారనే సమాచారంతో సత్తెనపల్లితో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ అభిమానులు,పార్టీ శ్రేణులు రెంటపాళ్లవైపు కదిలారు. జనప్రభంజనంలా తరలివచ్చారు. వెల్లువలా వచ్చిన ప్రజలతో సత్తెనపల్లి నియోజకవర్గం జనసంద్రంలా మారింది. ప్రభుత్వం ఆంక్షలు సైతం వైఎస్ జగన్పై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈ క్రమంలో వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనపై అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదికగా స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ జగన్ అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన తరంగాలను ఆపలేకపోయారు.“రోడ్లు మూసేశారా? మాకేం!”“పోలీసులు అడ్డుపడుతున్నారా? మాకేం!”మన గుండెల్లో ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వని మారుతోంది.మన నరాల్లో ప్రవహించే రక్తం, జననేతను ఒక్కసారి చూడాలనే తపనతో ఉప్పొంగుతోంది.అందుకే..పొలాల గట్లే రోడ్లయ్యాయి,పొలాల బాటలే ఎర్ర తివాచీలయ్యాయి,ముళ్ల దారులే హైవేలయ్యాయి.అభిమానులు పోటెత్తారు!“తగ్గేదేలే!” అంటూజగన్ను ఒక్క చూపైనా చూడాలన్న ఆశతోఇలా బయలుదేరారు… వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ @ysjagan అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన… pic.twitter.com/StMxCxf2az— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 -
FIR కూడా లేకుండా అరెస్టు.. పోలీసుల తీరుపై చెవిరెడ్డి ఫైర్
-
జగన్ గుంటూరు పర్యటనపై YSRCP నేతలు..
-
బాబు అరాచకం.. సిట్ గూండాయిజం
సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు ఊరి మీద పడి బీభత్సం సృష్టించిన తీరును తలపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పనితీరు. దర్యాప్తు ముసుగులో గూండాగిరీకి బరితెగించమని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్ర వేసి రాష్ట్రం మీదకు వదలినట్టుంది సిట్ అరాచకం. అందుకే బెదిరింపులు, వేధింపులు, కిడ్నాపులు, చిత్రహింసలతో చెలరేగిపోతోంది. చివరకు పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగి కానిస్టేబుల్ను కూడా విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేయడం సిట్ దాష్టీకానికి పరాకాష్టగా నిలుస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్బాబు, ఆయన బృందం అధికారిక రౌడీయిజం చలాయిస్తోంది. మరోవైపు గతంలో ఎన్నికల కమిషన్ నమోదు చేసిన కేసును వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి అక్రమ అరెస్టుకు తెగబడింది. లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరు పరచి, ట్రాన్సిట్ వారెంట్పై బుధవారం విజయవాడకు తీసుకురానున్నారు. అనంతరం వారిద్దరినీ విజయవాడ న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. తద్వారా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసేందుకు కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్బుక్ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా అరాచకానికి తెగబడుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో తాజా అంకమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు.. ఆయన కుమారుడు మోహిత్రెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు. ఈ అక్రమ కేసులో తాజాగా వెంకటేశ్ నాయుడు(ఏ34), బాలాజీ కుమార్ యాదవ్ (ఏ35), యద్దాల నవీన్ (ఏ36), హరీశ్ (ఏ37), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (ఏ38), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (ఏ39)లను నిందితులుగా చేరుస్తూ సిట్ విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. ఏకంగా సుప్రీం ఆదేశాలు, హెచ్చరికలు బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ బేతాళ కుట్ర ఇలా సాగుతోంది.పోలీసు శాఖలో చిరుద్యోగులపై కూడా థర్డ్ డిగ్రీ!చివరకు పోలీసు శాఖలోని కింది స్థాయి ఉద్యోగులను కూడా దర్యాప్తు పేరుతో వేధించి భౌతికంగా హింసించడం సిట్ దాష్టీకానికి నిదర్శనం. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ అక్రమ కేసులో ఇరికించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పని చేసిన గిరి అనే ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ను కొన్ని రోజులపాటు సిట్ ఆఫీసులో నిర్బంధించారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెబితే తాను నగదు తరలించే వాహనానికి భద్రత కోసం వెళ్లానని చెప్పాలని వేధించారు. ఆయన్ను కొట్టి మరీ ఒప్పించినట్టు తెలుస్తోంది. సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించారని సమాచారం. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా చేసిన ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ అధికారులు తిరుపతి నుంచి విజయవాడ తీసుకువచ్చారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయన్నూ వేధించారు. దాదాపు రూ.250 కోట్ల నగదును అక్రమంగా తరలించేందుకు తాను ఎస్కార్టుగా వెళ్లినట్టు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశారు. అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు మదన్ రెడ్డి సమ్మతించకపోవడంతో సిట్ అధికారులు ఆయనపై పోలీసు మార్కు ప్రతాపం చూపించారు. ఆయన ముఖం, వీపుపై తీవ్రంగా కొట్టారు. అంటే పోలీసుకే పోలీసు మార్కు ట్రీట్మెంట్ రుచి చూపించారు. సిట్ అధికారులు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మదన్రెడ్డి ఆసుపత్రిలో చేరారు. సిట్ అధికారులు కొట్టడంతో తనకు తగిలిన గాయాల ఫొటోలతో సహా ఆయన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లకు ఫిర్యాదు చేయడంతోపాటు పూర్తి ఆధారాలతోసహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు విచారణకు స్వీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.కోర్టును తప్పుదారి పట్టించే ఎత్తుగడఈ కేసులో మంగళవారం సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్ నాయుడులను సిట్ నిందితులుగా చేర్చనేలేదు. కానీ వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. నిందితులుగా చేర్చక పోయినా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం సిట్ బరితెగింపే. సొంత కంపెనీ పనిపై చెవిరెడ్డి మంగళవారం ఉదయం కొలంబో వెళ్లి.. తిరిగి బుధవారం సాయంత్రం వచ్చేలా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేశ్ నాయుడులను అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి (ఏ38), వెంకటేశ్ నాయుడు (ఏ34)తోపాటు మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. అంటే బెంగళూరు విమానాశ్రయంలో వారిని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులే కారు. అయినా సరే వారిపై లుక్ అవుట్నోటీసు జారీ చేసి వారిని అడ్డుకోవడం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే. ఇదిలా ఉండగా, తాను ఎప్పుడు పిలిచినా సిట్ విచారణకు రావడానికి సిద్ధమని ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించారు. తన కోసం చిన్న చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని, వేధించొద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ఆయన ఎక్కడికో పారిపోతున్నట్లు సిట్ రహస్యంగా లుక్ అవుట్ నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం వారిని బెంగళూరులోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్పై ఆంధ్రప్రదేశ్కు తరలించాలి. ఆ సమయంలో ఏ కేసులో వారు నిందితులుగా ఉన్నారని అక్కడి న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. అందుకే సిట్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం తర్వాత హడావుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు పేర్లను నిందితులుగా చేరుస్తూ విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేయడం గమనార్హం.బండారం బయట పడుతుందనే..రెడ్బుక్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చెవిరెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఎందుకంటే చంద్రగిరిలో ఆయన బలమైన రాజకీయ నేతగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం కూడా చంద్రగిరితోపాటు ఒంగోలు లోక్సభ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారు. దాంతో చెవిరెడ్డిపై కూటమి ప్రభుత్వం రెడ్బుక్ కుట్రకు తెగబడింది. అందుకోసం తిరుపతి, చంద్రగిరిలో ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయించేందుకు యత్నించారు. అక్రమంగా పోక్సో కేసు పెట్టారు. అందుకోసం నిరక్షరాస్యుడైన ఓ వ్యక్తితో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని ఆయన ఫిర్యాదు చేసినట్టుగా అక్రమ కేసు నమోదు చేశారు. కానీ పోలీసుల కుట్ర తెలుసుకున్న ఆ వ్యక్తి కోర్టులో అసలు విషయం వెల్లడించారు. తాను చెవిరెడ్డి్డపై ఫిర్యాదు చేయలేదని, పోలీసులే తనతో ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని వారికి నచ్చినట్టుగా అబద్ధపు ఫిర్యాదు రాసుకున్నారని చెప్పడంతో పోలీసుల కుట్ర బెడిసి కొట్టింది. దీంతో ఆయనపై మద్యం అక్రమ కేసు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అందుకోసం ఆయన వద్ద గతంలో గన్మెన్గా పనిచేసిన గిరి, మదన్ రెడ్డి అనే ఏఆర్ కానిస్టేబుళ్లను వేధించి,హింసించి అబద్ధపు వాంగ్మూలం కోసం బలవంతం చేశారు. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేశ్ నాయుడు, ఆయన సతీమణిని సిట్ అధికారులు విచారణ పేరిట హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. తిరుపతికి చెందిన బాలాజీని వేధించి లొంగదీసుకునేందుకు యత్నించారు. తనను చిత్రహింసలకు గురి చేశారని ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో తమ కుట్ర పూర్తిగా బట్టబయలవుతుందని భావించిన సిట్ అధికారులు వెంటనే చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు పావులు కదిపారు.మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకే..గన్మెన్లను పిలిచి అబద్ధపు స్టేట్మెంట్ల కోసం చిత్రహింసలురాజకీయ కక్షసాధింపులకు పోలీసులను వాడుకుంటున్నారుతప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం ప్రభుత్వ అవివేకంవైఎస్సార్సీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆగ్రహంసాక్షి,అమరావతి/సాక్షి, టాస్క్ఫోర్స్: లిక్కర్ అక్రమ కేసులో కుట్రపూరితంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఇరికించాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్లుగా పనిచేసిన గిరి, మదన్రెడ్డిలను సిట్ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారని విమర్శించారు. మదన్రెడ్డి ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోహిత్రెడ్డి ప్రదర్శించారు. మద్యం అక్రమ కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్టు అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వనందుకు మదన్రెడ్డిని దారుణంగా హింసించారని ధ్వజమెత్తారు. దీనిపై ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారంటేనే సిట్ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందన్నారు. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడతారని హెచ్చరించారు.ఈ ప్రశ్నలకు బదులేదీ?మద్యం అక్రమ కేసులో ప్రతిపక్ష నేతలందరినీ ఇరికించడానికి సిట్ అనుసరిస్తున్న విధానం, అరెస్టు చేసిన వారిపై తెస్తున్న ఒత్తిడి, తప్పుడు స్టేట్మెంట్లకు వారు ఎంచుకున్న మార్గాన్ని నిలదీస్తూ మోహిత్రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నావళిని సంధించారు. వీటికి నిజాయతీగా సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు.⇒ ఏడాదిగా విచారణ చేస్తున్న సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజ్ కేసిరెడ్డి నుంచి డబ్బులు అందాయని గానీ, దానిని ప్రజలకు పంచారనిగానీ ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజే చెప్పడంలో అర్థం ఏమిటీ..? అది నిజం కాదు కనుకే కదా..? ⇒ 20 ఏళ్ల సర్వీసున్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పణంగాబెట్టి పోలీసు అధికారులపై అబద్ధాలు చెప్పగలరా..? ఒక్క క్షణం అందరూ ఆలోచించండి.. అలాంటిది ఒక హెడ్ కానిస్టేబుల్ విచారణ సమయంలో తనకు జరిగిన అన్యాయం, తనపై జరిగిన దాడిని తన లేఖ ద్వారా డీజీపీకి విన్నవించుకోవడంపై అతను అబద్ధాలు చెబుతున్నారని అనడం సిట్ దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?⇒ మదన్రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలిపించి అతను చెప్పినట్టు స్టేట్మెంట్ రాయకుండా, సిట్ చెప్పినట్టు రాయాలని, చెప్పమన్నట్టు చెప్పాలని ఒత్తిడి చేయడం, తప్పుడు స్టేట్మెంట్పై సంతకం పెట్టాలని బలవంతం చేయడం వల్లే కదా అతడు చనిపోతానన్నది. కాదని చెప్పగలరా?⇒ ఒక హెడ్కానిస్టేబుల్ తనకంటే పైస్థాయి అధికారులు (సిట్ అధికారుల) ముందే విచారణ సమయంలో మీ అందరి పేర్లూ రాసి తాను చనిపోతాను అన్నాడంటే.. ఆ హెడ్ కానిస్టేబుల్ను సిట్ అధికారులు శారీరకంగా, మానసికంగా ఎంత చిత్రవధ చేసి ఉంటే అంత మాట అనగలడు. ఎవరైనా కాదని చెప్పగలరా?⇒ సిట్ విచారణకు వచ్చే వరు ఎంత నిజాయతీగా చెబుతున్నా.. ఎవరినో మెప్పించడానికి, తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించడానికి ప్రతిరోజు కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది సిట్ కాదా..?⇒ ‘‘సిట్ కార్యాలయంలో ఎంతో పారదర్శకంగా విచారణ జరుగుతోంది, ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. ఎవరినీ టార్చర్ చేయడం లేదు’’ అని సిట్లో పనిచేసే ఏ ఒక్క అధికారి అయినా భగవంతుని ముందు ప్రమాణం చేయగలరా? ⇒ సిట్ రాయమన్నట్టు రాసి, చెప్పమన్నట్టు కోర్టులో మెజిస్ట్రేట్కు చెప్పిన గిరి అనే కానిస్టేబుల్కు ఆగమేఘాలపై రాత్రికి రాత్రి ఇప్పుడు అతనికి వస్తున్న జీతానికి అదనంగా 60 శాతం పెంచి ఆక్టోపస్లో ఉద్యోగం ఇచ్చారంటేనే సిట్ అధికారుల నిజాయతీ, నిబద్ధత, పారదర్శకత ఏపాటిదో స్పష్టంగా అందరికీ తెలుస్తోంది కదా.. అది వాస్తవం కాదా?⇒ సిట్ తన పారదర్శకత, నిబద్ధతను నిరూపించుకోవడానికి మీలోనే ఒక పోలీసు అధికారితో విచారణ చేయిస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయి? నిజాయతీ, నిబద్ధతలను నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలి. అలా చేయాలని సిట్ అధికారులు కోరగలరా..?⇒ సత్యమేవ జయతే.. అంటున్నారు.. నిజమే ఏదో ఒకరోజు తప్పకుండా సత్యమే జయిస్తుంది. ఆ రోజు తప్పు చేసిన సిట్ అధికారులందరికీ న్యాయస్థానం శిక్ష విధించి సత్యాన్ని, ధర్మాన్ని కాపాడుతుంది.. రాసి పెట్టుకోండి.. అంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. -
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మహిళపై పచ్చ సైకోల అరాచకంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు.. ‘మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?. సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే.తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబు.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు..@ncbn గారూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప… pic.twitter.com/GDVWPB65AZ— YS Jagan Mohan Reddy (@ysjagan) June 17, 2025 -
కుప్పం నియోజకవర్గంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై స్పందించిన డీఎస్పీ
-
మార్గదర్శకాలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
-
Chandrasekhar Reddy: ఈ రాష్ట్రం మీ అబ్బ సొత్తు కాదు..
-
విధ్వంసకాండకు తెరతీసేలా జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
చంద్రబాబుపై RK రోజా పంచులు
-
సత్యాన్ని వధించి ధర్మాన్ని చెరలో పెట్టిన కూటమికి ఎదురు దెబ్బ
-
వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై బయటపడ్డ కూటమి కుట్ర
-
కడుపు మండిన మామిడి రైతులు
కాణిపాకం: కడుపు మండిన తోతాపురి మామిడి రైతులు సోమవారం కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి కొనలేమంటూ కంపెనీలు చేతులెత్తేయడంతో చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారులపై నిరసన తెలిపారు. చిత్తూరు, జీడీనెల్లూరు, బంగారుపాళ్యం, తవణంపల్లి మండలాల్లోనూ రైతులు ఆందోళనలు చేశారు. చిత్తూరు గంగసాగరం ఫ్యాక్టరీలో మామిడి కొనుగోలుకు టోకెన్లు జారీ చేస్తున్నారని ప్రకటించడంతో మామిడి రైతులు ఆదివారం అర్థరాత్రి నుంచే అక్కడ పడిగాపులు పడ్డారు.సోమవారం ఉదయం 5 గంటల సమయానికి వందలాది రైతులు టోకెన్ల కోసం గుమిగూడారు. టోకెన్లు పంపిణీ చేయకపోగా గేట్లు మూసివేయడంతో రైతులు కర్మాగారాన్ని చుట్టుముట్టారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. ఇద్దరు మహిళా రైతులు స్పృహతప్పేలా ఉండడంతో రైతులంతా హాహాకారాలు చేశారు. దీంతో ఫ్యాక్టరీ సిబ్బంది మహిళా రైతులను లోపలకు అనుమతించారు. పోలీసులు రైతులను అదుపు చేసే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అరకొరగా టోకెన్లు పంపిణీ చేసి మళ్లీ వచ్చేనెల 5న ఇస్తామంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం బోర్డు పెట్టింది. దీంతో రైతులు ఉసూరు మన్నారు.గంగాధర నెల్లూరు మండలంలోని ఫ్యాక్టరీ వద్ద కూడా టోకెన్లు ఇస్తారంటూ ప్రచారం చేయడంతో రెండు, మూడు రోజులుగా రైతులు మామిడి కాయలతో పడిగాపులు పడ్డారు. సోమవారం ఉదయానికీ ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. బంగారుపాళ్యం మండలంలోనూ ఫ్యాక్టరీ టోకెన్లు ఇవ్వలేదని తిరుపతి– బెంగళూరు జాతీయ రహదారిపై రైతులు నిరసనకు దిగారు. తవణంపల్లి మండలంలోనూ ఫ్యాక్టరీ నిర్వాహకులు మామిడి కొనలేమని బోర్డు పెట్టేసింది. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించినట్టు రూ.8కి మామిడి కాయలు కొనలేమని, రూ.5కూ కష్టమేనని ఫ్యాక్టరీలు చేతులెత్తేశాయి. -
పేరుకు వందనం.. భారీ కోతలతో బంధనం
ఏ నెలా 100 యూనిట్లు దాటలేదు నేను, నా భర్త కూలి పనులు చేసుకుంటూ చిన్న ఇంట్లో జీవిస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఎనిమిది, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. తల్లికి వందనం డబ్బులొస్తే ఫీజుల అవసరం తీరుతుందనుకున్నా. నాకు డబ్బులు పడలేదు. సచివాలయానికి వెళ్తే 300 యూనిట్లు దాటి కరెంటు వాడటం వల్ల డబ్బులు రాలేదని చెప్పారు. మాకు ఎప్పుడూ కనీసం 100 యూనిట్లు కూడా రాలేదు. అలాంటిది 300 యూనిట్లని ఎలా చెప్పారంటూ సచివాలయ సిబ్బందిని అడిగాం. తామేమీ చేయలేమంటున్నారు. గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అమ్మ ఒడి తీసుకున్నాను. – ఆరుగుల అరుణ, భీమవరపుకోట, కాకినాడ జిల్లా‘తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని సక్రమంగా అమలు చేయలేదు.. మేము అలా కాదు.. అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం.. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం’ అని ఎన్నికల ముందు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ అండ్ కో ఊరూరా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఆ మేరకు అమలు చేయలేక అంకెల గారడీ చేస్తున్నారు. కొంత మందికి మాత్రమే ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు కనికట్టు చేస్తున్నారు. నిజంగా అందరికీ ఇచ్చి ఉంటే ఊరూరా మహిళలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నట్లు? స్కూళ్ల చుట్టూ, సచివాలయాల చుట్టూ, విద్యుత్ ఆఫీసుల చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నట్లు? సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరుతో కనికట్టు చేస్తోంది. కొంత మందిని మాత్రమే అర్హుల జాబితాలో ప్రకటించి.. మిగతా తల్లులందరికీ పంగనామాలు పెట్టింది. అర్హుల జాబితాతోనే 30 లక్షల మందికి పైగా ఎగ్టొట్టిన సర్కారు.. తను చెప్పుకుంటున్నట్లు 54 లక్షల మందిలో సగానికి సగం తెగ్గోయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కరెంట్ బిల్లును, ఇతర నిబంధనలను ఆయుధంగా ఎంచుకుంది. నెలలో 300 యూనిట్లకు మించి వాడారంటూ ఏకపక్షంగా నిర్ణయించి అనర్హత వేటు వేసింది. ప్రతి నెలా సగటున 300 యూనిట్లకు మించి వినియోగించక పోయినా, వినియోగించినట్లు నెపం మోపి పథకాన్ని కట్ చేసింది. పలు జిల్లాల్లో ఏకంగా స్కూళ్లకు స్కూళ్లనే జాబితా నుంచి ఎత్తేసింది. రోజుకు రూ.233 వేతనంతో పని చేసే అంగన్వాడీ ఆయాల పట్ల కూడా ప్రభుత్వ ఉద్యోగులంటూ కనికరం లేకుండా వ్యవహరించింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు భగ్గుమంటున్నారు. ఏడాది విద్యుత్ బిల్లులను నెలవారీగా లెక్క తీసినా 300 యూనిట్లలోపు వచ్చిన వారిని కూడా అనర్హుల జాబితాలో చేర్చడంపై తల్లులు మండిపడుతున్నారు. ఇదేం అన్యాయమంటూ సోమవారం విద్యుత్ కార్యాలయాలకు పోటెత్తారు. కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంతో పాటు పెద్దాపురం నియోజకవర్గంలో సైతం తల్లులు ఆగ్రహంతో విద్యుత్ కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అవాస్తవ కారణాలతో అనర్హులుగా తేల్చి, పలువురిని తల్లికి వందనానికి దూరం చేశారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటూ అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల నిరసన సంఖ్యను కుదించేందుకే ఇలా.. కొందరి పేరున అసలు విద్యుత్ మీటర్లే లేవు. మరికొందరి పేరున 4 నుంచి 10, 15 విద్యుత్ మీటర్లు ఉన్నట్లు రికార్డయ్యాయి. వాటిని చూపి తల్లికి వందనం లేకుండా చేశారని పలువురు తల్లులు విద్యుత్ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఒకే మీటర్ ఉన్నప్పటికీ, తమ పేరిట ఇన్ని మీటర్లు ఎలా ఉంటాయని నిలదీశారు. తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం ఇలా చేసి ఉంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం, సామర్లకోట, తుని, కాకినాడ, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతరం, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లోని సబ్ స్టేషన్ల వద్ద తల్లులు స్టేట్మెంట్ల కోసం బారులు తీరి కనిపించారు. అయితే ఏడాది స్టేట్మెంట్ కావాలని అధికారులు కోరుతుండగా, విద్యుత్ అధికారులు మాత్రం ఆరు నెలల స్టేట్మెంట్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. కేంద్ర స్కూళ్లపై కోపమా?తిరుపతి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో పీఎం శ్రీ పాఠశాలలు 2, రేణిగుంటలో 1, ఏర్పేడు ఐఐటీలో 1, వెంకటగిరిలో 1 మొత్తం 5 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 30 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో సైతం సెంట్రల్ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఒక్క విద్యారికీ తల్లికి వందనం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి మేనిఫెస్టోను బీజేపీ నేతలు పట్టుకోలేదని ఇలా కక్ష సాధిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తిరుపతి జిల్లా తిక్కవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 310 మంది విద్యార్థులు ఉండగా, వారిలో ఒక్కరికి కూడా తల్లికి వందనం నగదు బదిలీ కాలేదు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 134 మంది విద్యార్థులు ఉన్నారు. అర్హుల జాబితాలో ఒక్కరి పేరు కూడా లేదు. పిఠాపురం సబ్ స్టేషన్ వద్ద స్టేట్మెంట్ల కోసం గుమిగూడిన ప్రజలు అన్ని జిల్లాల్లోనూ ఇదే తీరు⇒ తమకు తల్లికి వందనం వర్తింపజేయాలని కోరుతూ సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ గ్రీవెన్స్సెల్కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విద్యార్థులందరూ స్థానికులేనని, ఒక్కరికీ కూడా పథకం వర్తింప చేయలేదని కలెక్టర్ కి విన్నవించారు. ⇒ నంద్యాల జిల్లా గడివేముల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 355 మందిలో ఏ ఒక్క విద్యార్థికి తల్లికి వందనం వర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్ఎం విక్టర్ ఇమ్మానియల్ను నిలదీశారు. తమకు తెయదని, పైనుండి జాబితాలు వచ్చాయన్నారు. ⇒ చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీ ఆయమ్మకు రూ.7 వేలు, కార్యకర్తకు రూ.11,500 జీతం చెల్లిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పడానికి టీడీపీ కూటమికి సిగ్గులేదా అని అంగన్వాడీ సంఘం జిల్లా నేతలు లలిత, షకీలా ప్రశ్నించారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు చిత్తూరు కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం అందజేశారు. ⇒ అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపేయాలని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) నగర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓకు అందజేశారు. ⇒ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అప్కాస్ ఉద్యోగులందరికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని అప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు జి.చిన్నబాబు తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్.జయచంద్ర, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.సుమన్లతో కలిసి సోమవారం తిరుపతి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.25 వేలు కంటే తక్కువ జీతం పొందే ఉద్యోగులందరికీ అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నాయకులు ప్రకటించారని, అయితే నేడు చిరుద్యోగులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంపై తీవ్ర నిరాశకు లోనవుతున్నారని తెలిపారు. ⇒ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ మండల కో–ఆర్డినేటర్ల పిల్లలకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం వర్తింపజేయక పోవడం తగదని యూనియన్ నాయకుడు చల్లా కామేశ్వరరావు అన్నారు. పథకం వర్తింపజేయాలని కోరుతూ సోమవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. తమకు కటింగ్స్ పోను రూ.11,342 మాత్రమే వేతనం ఇస్తున్నారని, అది కూడా ఆరేడు నెలలకు చెల్లిస్తున్నారని చెప్పారు. ⇒ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చిరుద్యోగులమైన తమకు కూడా అమలుచేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.ఇద్దరు పిల్లలైతే.. 66 మందిగా నమోదు.. ప్యాపిలి: నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన దాసరి శోభకు ఇద్దరు పిల్లలు. వీరికి తల్లికి వందనం కింద రూ.26 వేలు జమ కావాల్సి ఉంది. అయితే ఆమెకు 66 మంది పిల్లలు ఉన్నట్లు జాబితాలో నమోదు చేశారు. ఈ నిర్లక్ష్యంతో శోభకు తల్లికి వందనం వర్తించలేదు. దీంతో కంగుతిన్న ఆమె గత రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. శోభ తన ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం తీసుకుని సోమవారం ఎంఈఓ కార్యాలయం, స్టేట్ బ్యాంకు అధికారులను సంప్రదించింది. వివరాలను పరిశీలించిన ఎంఈవో వెంకటేశ్ నాయక్.. జరిగిన పొరపాటును సరిదిద్దుతామన్నారు. కూటమి ప్రభుత్వం మోసం చేసింది మా పిల్లలు ముగ్గురు స్థానిక జెడ్పీ పాఠశాలలో చదువుతున్నారు. మాకు ఎలాంటి పొలాలు లేవు. కరెంటు బిల్లు చాలా తక్కువ. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. జాబితాలో మా పిల్లల పేర్లు చూపడం లేదు. సిబ్బందిని అడిగితే ఏమీ తెలియదంటున్నారు. కూటమి ప్రభుత్వం తల్లితండ్రులను మోసం చేస్తోంది. ఎన్నికలప్పుడు చెప్పిందొకటి, ఇప్పుడు చేస్తున్నది మరొకటి. – సాల్మన్, గడివేముల, నంద్యాల జిల్లాఒక్క నెలలో 300 యూనిట్లొస్తే ఆపేస్తారా? తాపీ మే్రస్తిగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు ఇల్లు తప్ప వేరే ఆస్తులేవీ లేవు. మా కుమార్తె మాధవి అనంత భార్గవి 7, కుమారుడు జశ్వీర్ 5 తరగతులు చదువుతున్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడితో ఏటా రూ.15 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేసేవారు. తల్లికి వందనం పేరిట ఒక్కొక్కరికి రూ.15 వేలు వేస్తామని చంద్రబాబు చెబితే సంతోషించాం. మే నెల కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటిందని తల్లికి వందనం తీసేశారు. ఇలా ఒక్క నెలనే పరిగణనలోకి తీసుకుంటే ఎలా? – నున్న ఉమావాణి శ్రీదేవి, భీమశంకరం, కరప, కాకినాడ జిల్లాకావాలనే ఇలా చేశారు మా పెద్దమ్మాయి లక్ష్మి పదో తరగతి పూర్తి అయ్యింది. రెండో కుమార్తె వసంత 8వ తరగతిలోకి వెళ్తోంది. మూడో కుమార్తె గంగోత్రి ఆరో తరగతిలోకి వెళ్తోంది. కుమారుడు విజయ్కుమార్ నాలుగో తరగతిలోకి ప్రవేశిస్తున్నాడు. నలుగురు పిల్లల్లో ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో డబ్బులు పొందాను. సచివాలయం అధికారులను అడిగితే మీరు ఇన్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారని చెబుతున్నారు. మాకు మెట్ట భూమి పది ఎకరాల్లోపే ఉన్నప్పటికీ అదే సాకుతో పథకం ఆపేశారు. ఎందుకిలా కావాలనే చేశారో అర్థం కావడం లేదు. – ఉలిగమ్మ, బిలేహాల్ గ్రామం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా ఈ నెల బిల్లు 68 యూనిట్లు వచ్చింది మే నెలకు సంబంధించి మాకు కరెంట్ బిల్లు 68 యూనిట్లు వచ్చింది. వేడి మండిపోయే మే నెలలోనే 68 యూనిట్లు వస్తే తక్కిన సమయంలో ఎన్ని యూనిట్లు వస్తాయి? అటువంటిది 300 యూనిట్లు దాటిందని తల్లికి వందనం పథకంలో అనర్హులుగా పేర్కొనడం అన్యాయం కాదా? మాలాంటి వారికి కూడా పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోతే ఎలా? – వేల్పుల మరియమ్మ, సీఎం కాలనీ, కుక్కునూరు, ఏలూరు జిల్లాఇల్లే లేదు.. ఏడు కనెక్షన్లట మాకు 10, 8 తరగతులు చదివే ఇద్దరు కొడుకులు ఉన్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం ద్వారా నగదు అందింది. ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద అర్హులం కాదని చెప్పారు. ఎందుకో తెలుసుకోవడానికి సచివాలయంలో వెళ్లి అడిగాము. నా పేరుతో ఏడు విద్యుత్ కనెక్షన్లు నమోదై ఉన్నాయని సిబ్బంది తెలిపారు. సొంత ఇల్లే లేని నాకు ఏడు విద్యుత్ కనెక్షన్లు ఎక్కడివని ప్రశ్నించగా విద్యుత్ కార్యాలయంలో సంప్రదించాలని సిబ్బంది చెప్పారు. – బైసాని సత్యనారాయణ, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా ఇడ్లీ పిండి అమ్ముకునే మాకూ ఎగ్గొట్టారు..మా అమ్మాయి లేఖన ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది. గతంలో అమ్మ ఒడి డబ్బులు సక్రమంగా పడ్డాయి. ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు అందుతాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మాకు ఆ డబ్బులు జమ కాలేదు. విషయం ఏమిటా అని ఆరా తీస్తే అద్దె ఇంటిలో ఉంటూ ఇడ్లీ పిండి అమ్ముకుంటూ జీవనం సాగించే మాకు ఏడు కరెంటు మీటర్లు ఉన్నాయని చెప్పారు. ఇలా అసంబద్ధమైన కారణాలు చూపి అనర్హులమనడం సరికాదు. – దాసిరెడ్డి నాగజ్యోతి, నరసాపురం, పశ్చిమగోదావరి జిల్లా -
రేపు రెంటపాళ్లకి వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఈనెల 18న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నట్లు మాజీ మంత్రి, ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెంటపాళ్లలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతల పేరుతో పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నా కూడా ఈ ప్రభుత్వం జీరి్ణంచుకోలేకపోతోంది.అసలు వైఎస్ జగన్ ఇంటి గడప దాటి బయట కాలు పెడితేనే చంద్రబాబు, లోకేశ్కి వణుకు పుడుతోంది. నిద్ర పట్టడం లేదు. పొగాకు రైతులను పరామర్శించడానికి పొదిలి వెళితే అలజడి సృష్టించడానికి కొంతమంది మహిళలను అడ్డుపెట్టుకుని రాళ్ల దాడికి దిగారు. మా కార్యకర్తలు, అమాయక రైతుల మీద టీడీపీ గూండాలతో దాడులు చేయించారు. తిరిగి మా నాయకులపైనే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు’ అని చెప్పారు. పర్యటనను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం ‘ఇటీవలే వ్యాపారి గుత్తా లక్ష్మీనారాయణ పోలీసుల వేధింపులు భరించలేక విషం తాగి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక మా నాయకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే వారికి భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారు. ఆయన వెళ్లి పరామర్శిస్తే కూటమి దుశ్చర్యలు ప్రపంచానికి తెలిసిపోతాయనే భయంతో వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకోవాలని చూస్తున్నారు.ఇది అప్రజాస్వామికం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు, లోకేశ్ కుట్రలు పన్నుతున్నారు. పర్యటనలను అడ్డుకోవాలని చూస్తే సహించబోం. ప్రతిపక్ష నేత పర్యటనలను అడ్డుకోవడం, అలజడి సృష్టించేందుకు యతి్నంచడం కూటమి ప్రభుత్వానికే మంచిది కాదు.’’ అని అంబటి హితవు పలికారు. -
చంద్రబాబు ఇలాకా కుప్పంలో దారుణం
-
Malladi Vishnu: జగన్ అంటే నమ్మకం.. బాబు అంటే మోసం
-
శ్రీసత్యసాయి జిల్లా పెడపల్లిలో ఘటన
-
మీరు కట్ చేసే 2వేలు ఎవరి ట్యాక్స్.. లోకేష్కు గుడివాడ దిమ్మతిరిగే కౌంటర్
-
Rachamallu Siva Prasad: నీ అవినీతి గురించి చెప్పి చెప్పి నాకు ఆయాసం వస్తుంది
-
బాబు కుర్చీ కోసం చేసిన హామీలు తప్ప ఉషశ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు
-
సూపర్ సిక్స్ కాదు.. ఫస్ట్ బాల్కే కూటమి అవుట్: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, హైదరాబాద్: సూపర్ సిక్స్ అని గొప్పగా చెప్పుకునే సీఎం చంద్రబాబు ప్రజల దృష్టిలో మొదటి బాల్కే అవుట్ అయ్యారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశానంటూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజలకు న్యాయం చేస్తే.. హామీలను అమలు చేయకుండానే నెరవేర్చేసినట్టు కూటమి సర్కార్ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు తగ్గి, ఆదాయం పెరిగితే.. కూటమి ఏడాది పాలనలో ఆదాయం తగ్గి, అప్పులు పెరిగాయనే విషయాన్ని ఆధారాలు, గణాంకాలతో సహా వివరించారు. వాస్తవాలను దాచిపెట్టి, అద్భుతమైన పాలనను అందించామని.. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించనని చంద్రబాబు బెదిరించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తాను వెల్లడించిన గణాంకాలు వాస్తవం కాదు అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే..తల్లికి వందనం మహామోసంతల్లికి వందనం పథకం ప్రారంభం.. ఏడాది పాలన పూర్తి సందర్భంగా చంద్రబాబు మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలను మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశామంటూ, దానిపై మాట్లాడినే నాలుక మందం అంటూ ప్రతిపక్షంతో పాటు ప్రజలకు కూడా హెచ్చరికలు చేశారు. ఎన్నికల ముందు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున 87 లక్షల మందికి ఇస్తామని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు అందులో 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. అదికూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద 2.07 కోట్ల మందికి నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. 53.50 లక్షల మందికి రైతు భరోసా కింద రూ.20 వేల చొప్పున ఇస్తామన్నారు. ఇందుకు ఏడాదికి రూ.10 వేల కోట్లకు పైగా అవసరం కాగాజజ కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. ఉద్యోగం రాని యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 1,54,047 మందికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని ఊదరగొట్టారు. వాటిని ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున ప్రతిపక్షంగా వాటినే వైఎస్సార్సీపీ అడుగుతోంది. వాటికి సమాధానంగా అన్ని సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాశానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది.బడ్జెట్, వ్యయాలు.. సంక్షేమ లెక్కలివి– వైఎస్సార్సీపీ 2023–24లో బడ్జెట్ రూ.2,35,780 కోట్లు. 2024–25లో కూటమి ప్రభుత్వ బడ్జెట్ రూ.2,45,076 కోట్లు. అంటే మా కంటే కూటమి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు బడ్జెట్లో ఎక్కువగా పెట్టింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదికి జీతాల కోసం వెచ్చించింది రూ.52 వేల కోట్లు. పెన్షన్లు రూ.21,500 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.29,500 కోట్లు. ఇవన్నీ కలిపితే మొత్తం రూ.1,03,000 మా ప్రభుత్వ హయాంలో చేసిన వ్యయం. మూలధనం పెట్టుబడి కింద చేసిన వ్యయం రూ.23,300 కోట్లు. మొత్తం బడ్జెట్ రూ.2,35,780 కోట్లలోనే జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు చేసిన వ్యయాలను తీసేస్తే మిగిలిన నిధులు సుమారుగా రూ.1,09,000 కోట్లు. ఈ నిధుల నుంచే వైఎస్ జగన్ ప్రకటించిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశాం.– కూటమి ప్రభుత్వంలో జీతాల కోసం ఖర్చు చేసింది రూ.59 వేల కోట్లు, పెన్షన్లు రూ.27 వేల కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.31 వేల కోట్లు. ఇవన్నీ కలిపితే కూటమి హయాంలో చేసిన వ్యయం మొత్తం రూ.1,18,000 కోట్లు. ఈ ప్రభుత్వంలో చేసిన మూలధన పెట్టుబడి వ్యయం రూ.19వేల కోట్లు. బడ్జెట్లోంచి జీతాలు, వడ్డీలు, పెన్షన్లకు చేసిన వ్యయం తీసేస్తే మిగిలిన నిధులు మొత్తం రూ.1,07,000 కోట్లు. మరి ఇన్ని నిధులు ఉండి కూడా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చంద్రబాబు వివరణ ఇవ్వాలి. కేవలం కూటమి ప్రభుత్వంలో హామీల్లో అమలు చేసింది రూ.వెయ్యి పెన్షన్ పెంచడం తప్ప మరొకటి కనిపించడం లేదు.సంపద సృష్టి అంటే ఇదేనా?– అప్పులపై చంద్రబాబు ఎన్నికల ముందు అనేక అబద్ధాలు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన నాటికి ఏపీకి ఉన్న అప్పు రూ.1,40,717 కోట్లు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే 2019 నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులు రూ.3,90,247 కోట్లు. అంటే టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,49,350 కోట్లు. సీఏజీఆర్ ప్రకారం చూస్తే 22.63 శాతం ఎక్కువగా అప్పులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే 2024 నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులు రూ.7,21,918 కోట్లు. అంటే ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో చేసిన అప్పులు కేవలం రూ.3,32,671 కోట్లు. వైఎస్సార్సీపీ హయాంలో సీఏజీఆర్ 13.5శాతం మాత్రమే. ఇవన్నీ కాగ్ నివేదికలో ఉన్న లెక్కలు. వీటిని వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ హయాంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేశారు. శ్రీలంక, కంబోడియాగా ఏపీని మార్చేస్తున్నారంటూ దిగజారుడు ప్రచారం చేశారు. – వైఎస్సార్సీపీ పాలనలో 2022–23లో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.1,57,768 కోట్లు. 2023–24లో రూ.1,73,767 కోట్లు. ఆ రెండేళ్లలో ఆదాయం చూస్తే 10శాతం పెరిగింది. ఆ ఏడాది అప్పులు చూస్తే 19 శాతం మాత్రమే పెరిగాయి. కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే అప్పులు 30 శాతం పెంచితే.. ఆదాయం మాత్రం కేవలం 3 శాతం మాత్రమే పెరిగింది. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి?. 2024 ఏప్రిల్ నాటికి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,500 కోట్లు అయితే, 2025 ఏప్రిల్లో నాటికి వచ్చిన రాష్ట్ర జీఎస్టీ రూ.2,652 కోట్లు. అంటే.. 24 శాతం తక్కువగా వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి సంబంధించిన పన్ను ఆదాయం 2024లో రూ.7,483 కోట్లు కాగా, 2025లో వచ్చిన ఆదాయం రూ.6,569 కోట్లు. అంటే 12 శాతం ఆదాయం పడిపోయింది. పన్నేతర ఆదాయం ఏప్రిల్ 2024లో రూ.442 కోట్లు అయితే, 2025 ఏప్రిల్ నాటికి రూ.345 కోట్లు. అంటే 22 శాతం తక్కువ. ఏప్రిల్ 2024లో పన్ను, పన్నేతర ఆదాయం కలిపి లెక్కిస్తే రూ.7,925 కోట్లు కాగా, 2025 ఏప్రిల్ నాటికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.6914 కోట్లు. అంటే 12 శాతం తక్కువ.ఉద్యోగుల సొమ్మును వాడేశారుఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏల అమలు ఏదీ. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మొత్తం పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.32,997 ఉంది. అందులో ఏపీ భాగం 19,138 కోట్లు. 2014–19 నాటికి రూ.76,516 కోట్లు. అంటే టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన రూ.57,378 కోట్ల సొమ్మును అదనంగా వాడుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.76,038 కోట్లు. అంటే మేం ఉద్యోగుల సొమ్మును వాడుకోకపోగా రూ.478 కోట్లను మేం తిరిగి జమ చేశాం. కానీ.. ఉద్యోగుల విషయం మా ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు.ఏడాదిలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకతప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటున్న పవన్కళ్యాణ్ ఈ విషయాలపై ఎందుకు దీనిపై మౌనంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని దుకాణాలు వెలవెలబోతుంటే.. ఒక్క మద్యం దుకాణాలు మాత్రమే కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో వ్యాపారాల కోసం కాల్మనీ నుంచి ఫైనాన్స్ తీసుకుని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏడాది కూటమి పాలనపై కేకే సర్వేలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమైందని తేలింది. ఏడాది పాలన తరువాత కూటమి ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తోంది. ఏడాదిలో ఎన్నో అరాచకాలు చేశారు. చివరకు ప్రశ్నించే జర్నలిస్ట్లను కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి, వేధించారు. -
బకాయిల మోత.. విద్యార్థులకు వాత
ఉన్నత చదువుల కోసం, ఆరోగ్యం కోసం పేదలు అప్పులపాలు కాకూడదనే గత ప్రభుత్వ స్ఫూర్తికి కూటమి సర్కారు గండికొట్టింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో ఇటు విద్యార్థులు–తల్లిదండ్రులతో పాటు అటు కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. నాణ్యమైన విద్య మిథ్యగా మారిపోయింది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన విద్యా రంగ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాల దుస్థితి దినదిన గండంగా తయారైంది. ‘ఫీజు రీయింబర్స్మెంట్’ బకాయిలు కొండలా పేరుకు పోవడంతో కళాశాలల మనుగడ, విద్యార్థుల భవిష్యత్తు పెను ప్రమాదంలో పడింది. ప్రభుత్వం సకాలంలో ‘ఫీజు’ చెల్లింపులు చేయక పోవడం యావత్ కళాశాలల ఉనికికే ప్రశ్నార్థకమైంది. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో దాదాపు రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, రూ.2,200 కోట్లు హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు (వసతి దీవెన).. మొత్తంగా రూ.6,400 కోట్లు పెండింగ్ పెట్టింది. వాస్తవానికి అధిక శాతం కళాశాలలు విద్యార్థుల ఫీజులపైనే ఆధారపడి నిర్వహణను చేపట్టడంతో తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయి. అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించలేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిణామాల ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన బోధన లభించడం లేదు. అధునాతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా కళాశాలలు అప్గ్రేడ్ అవలేక మూస పద్ధతిలోనే కొనసాగడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యాలు ఉన్నప్పుడు నైపుణ్యం కలిగిన సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. అరకొర సిబ్బందితో బోధనను సాగించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులకు కోలుకోలేని నష్టం కలుగుతోంది. విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ కింద అందించే మొత్తాన్ని కూడా నిలిపి వేయడంతో పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య భారంగా మారింది. గతంలో వసతి దీవెన కింద ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసినప్పుడు కళాశాలల హాస్టల్లో విద్యార్థులు సకాలంలో చెల్లింపులు చేసేవారు. ఆ విధంగానూ కళాశాలలు ఆర్థికంగా బలంగా ఉండేవి. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యను భ్రష్టు పట్టించింది. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థను తీవ్రంగా నాశనం చేసింది. విద్యార్థులు హాయిగా కళాశాలలకు వెళ్లి చదువుకునే వాతావరణాన్ని దెబ్బ తీసింది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు సైతం కంటిమీద కునుకు లేకుండా ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. విద్యా సంవత్సరం ముగిసినా ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేయక పోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తులు చేసినా ఫలితం శూన్యమేనని మండి పడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయని పక్షంలో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. త్వరలో కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ పూర్తిగా దిగజారిన విద్యా రంగ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వాస్తవానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రైవేటు కళాశాలల మనుగడను దృష్టిలో పెట్టుకుని ‘క్వార్టర్’ (మూడు నెలలు) ప్రాతిపదికన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలయ్యేలా షెడ్యూల్ను అమలు చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా చెల్లింపులు చేయడంతో పారదర్శకతతో పాటు యాజమాన్యాల నుంచి జవాబుదారీ తనాన్ని ప్రోత్సహించింది. కానీ, కూటమి ప్రభుత్వం క్వార్టర్ను కాస్తా.. ఆరు నెలలకు ఒకసారికి మార్చింది. తల్లుల ఖాతాల్లోకి బదులు కళాశాలలకు నేరుగా ఫీజులు చెల్లిస్తామని చెప్పింది. కానీ, విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ ఫీజులు చెల్లించక పోవడంతో ప్రైవేటు కళాశాలల నిర్వహణ దెబ్బతిని ఉన్నత విద్య ప్రమాదంలో పడుతోంది.గాడి తప్పిన షెడ్యూల్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేసిన చరిత్ర దేశంలో వైఎస్ జగన్కే దక్కుతుంది. అంతకు ముందు వరకు ప్రభుత్వం నుంచి అరకొర చెల్లింపులు ఉండటంతో పేదింటి బిడ్డలు ఉన్నత చదువుల కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. కానీ, 2019 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐదేళ్లు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిన చదువులు ఏడాదిగా కుదుపులకు గురవుతున్నాయి. విద్యార్థుల చదువులను బాధ్యతగా తీసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం రాజకీయ ధోరణితో అంధకారంలోకి నెడుతోంది. 2024 మార్చి వరకు షెడ్యూల్ ప్రకారం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు విడుదలయ్యాయి. ఆ వెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో విద్యార్థులకు క్రమం తప్పకుండా చెల్లించే ఫీజులను కూటమి నాయకులు కుట్రలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఫీజుల చెల్లింపుల షెడ్యూల్ విధానాన్ని నాశనం చేసింది. ఈ క్రమంలో 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటిదాక మొత్తంగా ఆరు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, ఏప్రిల్–మేలో ఇవ్వాల్సిన వసతి దీవెన (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) నిధులను విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ఈ ఏడాదీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా లక్షలాది మంది పేదింటి విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. అప్పులు చేసి సర్టిఫికెట్లు, పరీక్షలకు హాల్ టికెట్లు తీసుకుంటున్న దుస్థితి కనిపిస్తోంది.రూ.6,400 కోట్ల బకాయిలు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల చెల్లింపుల కింద కూటమి ప్రభుత్వం సుమారు రూ.6,400 కోట్లు బకాయిలు పెట్టింది. ఇందులో విద్యార్థుల హాస్టల్ ఖర్చుల కింద రూ.2,200 కోట్ల చెల్లింపులకు మంగళం పాడేసింది. అసలు ఎక్కడా ఆ ఊసే ఎత్తడం లేదు. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్పై అడపాదడపా మాట్లాడుతూ.. సకాలంలో చెల్లింపులు చేసేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటోంది. కానీ, ఇప్పటికీ రూ.4,200 కోట్ల వరకు బకాయిలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలనను మొదటి నుంచి ప్రారంభిస్తామంటే చట్టాలు, రాజ్యాంగం అంగీకరించవు. అందుకే ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా కొనసాగించాల్సిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే 2014–19లో టీడీపీ హయాంలో16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1,778 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణ బాధ్యతగా భావించి చెల్లింపులు చేసింది. బడ్జెట్లోనూ విద్యకు లోటే ఒక విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వెచ్చించాలి. కానీ, 2024–25కు నిధులు ఏమీ విదల్చక పోగా, 2025–26 విద్యా సంవత్సరానికి బడ్జెట్లో రూ.3,900 కోట్లు కేటాయించాల్సి ఉంటే కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసింది. విద్యార్థుల భవిష్యత్తుకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. టీడీపీ ప్రభుత్వ బకాయిలతో కలిపితే మొత్తం రూ.18,663.44 కోట్లు ఉన్నత విద్య కింద ఉచిత చదువులకు ఖర్చు పెట్టింది. -
నవ్విపోదురు గాక..!
‘‘ఆరు సూపర్ సిక్స్ హామీలూ పూర్తయ్యాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా సూపర్ సిక్స్ అని మాట్లాడితే, వారికి నాలుక...’’ అంటూ వాక్యం మధ్యలో చంద్రబాబు కాస్త విరామం పాటించారు. ఆ ప్రెస్ మీట్ను టీవీల్లో చూస్తున్న వాళ్లకు నాలుకను కోసేస్తా అంటారేమో అనే అనుమానం రావడం సహజం. ఎందుకంటే, గత ఏడాదికాలంగా హామీల అమలు గురించి గట్టిగా ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం, ఏదో వంకతో జైలుకు పంపించడం అందరూ గమనిస్తూనే ఉన్నారు గనుక! చంద్రబాబు పాటించిన వాక్య విరామంలో గట్టి హెచ్చరికను పంపించే ఉద్దేశం కూడా ఉండవచ్చు. విరామం తర్వాత వాక్యాన్ని ‘మందం’ అనే మాటతో ముగించారు. అంటే ఇకముందు ఎవరైనా సరే సూపర్ సిక్స్ అమలు కాలేదని మాట్లా డితే వారి నాలుక మందం అనుకోవాలి. వాక్య విరామ హెచ్చరిక కూడా వారికి వర్తిస్తుందనుకోవాలి.సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ‘తల్లికి వందనం’ నిధుల విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని కూడా 2025–26 అకడమిక్ ఇయర్ కోసం విడుదల చేశారు. బకాయి పడిన గత సంవత్సరం నిధులు హుష్ కాకే! మిగిలిన ఐదు పథకాల సంగతి? వాటినెప్పుడు అమలు చేశారు? దీపం పథకం కింద ఏటా ఇవ్వాల్సిన మూడు ఉచిత సిలిండర్ల బదులు రెండు ఇచ్చారు. సరే, అది కూడా అమలైంది. ‘అన్నదాత సుఖీ భవ’ కింద రైతుకు ఇస్తానన్న రూ. 20 వేల నగదు సాయానికి కూడా ఓ అంటకత్తెర కథ చెప్పారు. ఈ నెల 20న కేంద్రం విడుదల చేసే రెండు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక విడత విడుదల చేస్తామని చెప్పారు. కేంద్రం మూడు విడతల్లో విడుదల చేసే ఆరు వేలకు మరో 14 వేలను మూడు విడతల్లో కలిపి అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బకాయి పెట్టిన గతేడాది సొమ్ము అటకెక్కినట్టే! మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణానికి ఆగస్టు 15న ముహూర్తం పెట్టినట్టు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాలి.సూపర్ సిక్స్లో భాగంగా ఉన్న మరో రెండు అతి కీలకమైన పథకాలను మాత్రం దేవుడి ఖాతాలో వేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. పందొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ.1500 చొప్పున ఏటా 18,000 రూపాయలను జమ చేస్తా మని కూటమి ఇచ్చిన ఎన్నికల హామీ. ఇప్పుడు దాన్ని పీ–ఫోర్ అనే పథకంతో లింక్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఆడబిడ్డల అదృష్టాన్ని డబ్బున్న వారి ఔదార్యంతో ముడి వేశారన్నమాట. ఎన్నికల హామీ ప్రకారం ఈ పథకానికి దాదాపు ఏటా 35 వేల కోట్లు అవసరమని అంచనా. ఇంతటి ఔదార్యాన్ని పి–ఫోర్ పథకం ద్వారా పిండుకోవాలట! ఇది అయ్యే పనేనా?సూపర్ సిక్స్లో మరో ముఖ్యమైన హామీ నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంది. పన్నెండు నెలలు బకాయి పెట్టారు. ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంతో జత చేస్తామని చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది? నైపుణ్య శిక్షణ ఎంతమందికి ఇస్తారు? అందులో ఈ మూడు వేల రూపాయలు పోషించే పాత్రేమిటి? అనే మీమాంసలనవసరం. ఈ పథకానికీ పాడె కట్టినట్టే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో యాభ య్యేళ్లు నిండిన ప్రతివారికీ పెన్షన్ అమలు చేస్తామని మరో కీలకమైన వాగ్దానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దాని గురించి ఏడాది గడిచిపోయినా ఇప్పటికీ మాటా లేదు, ముచ్చటా లేదు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను విశ్లేషిస్తే ఒక్క మొదటి యేడాదికే రూ. 80 వేల కోట్లకు పైగా వాగ్దాన భంగానికి పాల్పడినట్టు తేలింది.ఎన్నికల ప్రచారం సందర్భంగా కూటమి నాయకులు ఫ్లాగ్ షిప్గా పెట్టుకున్న సూపర్ సిక్స్లోనే అరకొరగా రెండు, అత్తెసరుతో మరో రెండు ప్రకటించారు. భారీగా వ్యయమయ్యే ఇంకో రెండు పథకాలకు తిలోదకాలొదిలేశారు. ఫ్లాగ్షిప్ సంగతే ఇట్లా ఉంటే మిగతా మేనిఫెస్టో హామీల గురించి చర్చించడానికేముంటుంది? మోసం చేశారని ఆవేశపడటం తప్ప. మేనిఫెస్టో మీద, దాని హామీల మీద చర్చ జరగడం కూడా కూటమి సర్కార్ సహించడం లేదు. మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశామని వారు చెబుతున్నారు. అందరూ అదే చెప్పాలి. ఇందుకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదు. పత్రికల్లో గానీ, టీవీల్లో గానీ, సోషల్ మీడియాలో గానీ ఇందుకు భిన్నమైన సమాచారం రాకూడదు. వస్తే రెడ్బుక్ నోరు తెరుస్తుంది. రెడ్ బుక్ ఆదేశాలతో దాదాపు వెయ్యిమంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు నమోదయ్యాయి. పలువురిని అరెస్టు చేశారు. పలు కుటుంబాలు ఇంకా వేధింపులకు గురవు తున్నాయి. 70 మంది పాత్రికేయులపై కేసులు పెట్టారు. పదిమందిపై దాడులు చేశారు. ప్రత్యర్థి రాజకీయపక్షంపై జరుగుతున్న దాడులను ఇక్కడ ప్రస్తావించడం లేదు. వారిపై జరుగుతున్న హత్యాకాండ జోలికెళ్లడం లేదు. వారి ఆస్తుల విధ్వంసం గురించి కూడా చెప్పడం లేదు. కేవలం పాత్రికేయులపై, సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న దమనకాండను గురించి మాత్రమే ఈ నివేదన. వారి కలాలకూ, గళాలకూ బిగిస్తున్న శృంఖలాలను గురించి మాత్రమే ఈ ఆవేదన.నాలుగున్నర దశాబ్దాలు పాత్రికేయ అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఈ భయానక పాలనకు ఒక స్పష్టమైన ఉదాహరణ. పత్రికా రంగంలో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కొమ్మినేని.రెండు పత్రికల్లో స్టేట్ బ్యూరో చీఫ్గా పనిచేశారు. ఢిల్లీ బ్యూరోకు నాయకత్వం వహించారు. ఒక పత్రికలో ఒకే సమ యంలో సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జిగా నేను, స్టేట్ బ్యూరో చీఫ్గా కొమ్మినేని కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ అనుభవంతో చెప్పగలిగిన మాట ఒక్కటే. పాత్రికేయ వృత్తి పట్ల, ఆ వృత్తిలో పాటించవలసిన ప్రమాణాల పట్ల పూర్తిస్థాయి నిబద్ధత కలిగిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు. న్యూస్ ఛానెళ్ల పర్వం ప్రారంభమైన తర్వాత దాదాపు పద్దెనిమిదేళ్లుగా మూడు టీవీ చానెళ్లలో కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో వర్తమాన రాజకీయాలపై చర్చా గోష్ఠులు నిర్వహిస్తున్నారు. ఈ తరహా చర్చా కార్యక్రమాల్లో అత్యంత సంయమనం పాటిస్తూ హద్దుమీరకుండా, చర్చ పక్క దారి పట్టకుండా తన నియంత్రణలో నడిపించే వారిలో అగ్ర గణ్యుడు కొమ్మినేని.అమరావతి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాడని కొమ్మినేని మీద, వార్తా విశ్లేషకుడు కృష్ణంరాజు మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సెక్షన్ కూడా ఒకటి. పెరుగుతున్న వేశ్యల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉన్నదనే ఒక నివేదికను కృష్ణంరాజు ప్రస్తావించారు. ఈ తరహా వార్తలు గతంలో యెల్లో మీడియాలో కూడా వచ్చినవే. ఈ ప్రస్తావన సందర్భంగా అమరావతిని ఉద్దేశించి కృష్ణంరాజు మాటల్లో దొర్లిన ఒక అనుచిత వ్యాఖ్యానాన్ని షో నిర్మాహకుడైన కొమ్మినేనికి కూడా ఆపాదించి ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మహిళల ప్రదర్శనలనూ, సాక్షి మీడియాపై దాడులనూ ప్రభుత్వం ఆర్గనైజ్ చేసింది. కొమ్మినేని, కృష్ణంరాజు, సాక్షి మీడియాలపై కేసులు నమోదు చేశారు. కొమ్మినేనిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినప్పుడు అట్రాసిటీ కేసుపై మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధం లేని కేసులు పెట్టడంపై ఎస్పీకీ, డిఎస్పీకి మెమోలు కూడా ఇచ్చారు. ఆ సెక్షన్ తొలగించి రిమాండ్కు పంపారు.సుప్రీంకోర్టులో కొమ్మినేనికి ఊరట లభించింది. తాను చేయని వ్యాఖ్యలకు యాంకర్ను ఎలా బాధ్యుల్ని చేస్తారని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ లాయర్లను ప్రశ్నించింది. ఈ కేసులో కూడా ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లోద్రా వంటి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసే లాయర్లనే కూటమి ప్రభుత్వం మోహరించింది. కొమ్మినేనికి వెంటనే బెయిల్ లభిస్తే మిగతా పాత్రి కేయుల్లో ప్రభుత్వం పట్ల భయం మిగలదనే సందేహం కావచ్చు. ఆ బెయిల్ను అడ్డుకునేందుకు భారీ గానే ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. విశ్లేషకుని వ్యాఖ్యానానికి కొమ్మినేని నవ్వాడు గనుక ఆయన కూడా శిక్షార్హుడేనని కూటమి లాయర్లు చేసిన వాదన సుప్రీంకోర్టులో నవ్వుల పాలైంది. కొమ్మి నేనిని వెంటనే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.విఫల పాలనతో ప్రజామోదం కోల్పోతున్నప్పుడు అసంతృప్తిని చల్లార్చడానికి నియంత పాలకులు ఎక్కువగా నిర్బంధాన్నే నమ్ముకుంటారు. విమర్శకులు నవ్వినా, తుమ్మినా, దగ్గినా కూడా తిరుగుబాటు సంకేతంలాగానే వారికి కనిపించవచ్చు. నవ్వులే కాదు పువ్వులు కూడా వారిని భయపెడతాయి, వారి నీడలు కూడా వారిని భయపెడతాయి. ఈ భయం నుంచి బయటపడాలంటే వారి ముందున్న మార్గం ఒకటే. తాము ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ధైర్యంగా ప్రభుత్వ కార్యా లయాల్లో అంటించుకోవాలి. ఇదిగో ఇన్ని హామీలను అమలు చేశామని ఇంటింటికీ వెళ్లి వైసీపీలాగా ధైర్యంగా చెప్పగలగాలి. లేకుంటే రాబోయే మూడునాలుగేళ్లూ నిర్భంధ కాండనే నమ్ము కోవాల్సి వస్తుంది. నిర్బంధకాండలో ఎవరూ నిలబడలేరని చరిత్ర చెబుతున్నా పాలకులకు చెవికెక్కదు. ఎంతమందిని భయపెట్టాలనుకున్నా, ఎంతమందిని జైలుకు పంపినా, ఎంత హత్యాకాండ కొనసాగించినా రాబోయే మార్పును ఆపడం సాధ్యం కాదు. ‘నువ్వు అన్ని పువ్వులనూ కోసి పారేయవచ్చు, కానీ వచ్చే వసంతాన్ని ఆపడం నీ తరం కాదు...’ చిలీ దేశానికి చెందిన సుప్రసిద్ధ స్పానిష్ కవి పాబ్లో నెరూడా చెప్పిన నిత్య సత్యాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. మందీ మార్బలంతో పత్రికా కార్యాలయంపై దండెత్తడం, అక్షరాన్ని దహనం చేసే ప్రయత్నం చేయడం ఎంత అవివేకమైన చర్యలో చరిత్ర తప్పక నిరూపిస్తుంది. టీవీలో ఓ యాంకర్ నవ్వు, ఇన్స్టాలో ఓ యువ కుడి సెటైర్, వేదికపై ఓ గాయకుడి పాట, పొలంలో ఓ రైతన్న ఆగ్రహం... ఇలాంటివన్నీ తనకు నచ్చలేదని కేసులు పెడుతూ పోతే జనానికి కొన్ని కామెడీ పాత్రలు గుర్తుకొస్తాయి. నవ్వి పోదురు గాక నాకేటి... అనుకుంటే ఇంకేమీ ఉండదు మరి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తల్లికి వందనం పథకంపై చంద్రబాబుకు సూటి ప్రశ్నలు
-
మేము మాట్లాడితే బూతులా...? బాబు బ్యాచ్ ని ఏకిపారేసిన పుణ్యశీల
-
రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా?: YS జగన్
-
ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి
-
Ambati Rambabu: నాకు అంత దమ్మూ లేదు.. డబ్బూ లేదు...
-
బాబు సర్కార్ ఇప్పటికైనా.. దేవులపల్లి అమర్ వార్నింగ్
-
Podili Tour: జనాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేక పోయాడు..
-
సూపర్ సిక్స్ అమలు చేసేశాను: చంద్రబాబు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప ఇంకొకటి కాదని అన్నారు. తల్లికి వందనం పథకం అమలుపై గురువారం ఆయన ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పిన మాట మేరకు.. నలుగురు పిల్లలున్న వారికి కూడా ఇస్తున్నామని తెలిపారు. 67 లక్షల మంది పిల్లలకు రూ.13 వేలు చొప్పున వారి తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. మిగతా రెండు వేల రూపాయలు స్కూళ్ల నిర్వహణకు వినియోగిస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకానికి అమ్మ ఒడి మార్గదర్శకాలనే అమలు చేస్తున్నామని చెప్పారు. పీ–4కు ఆడబిడ్డ నిధి, స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ భృతి అనుసంధానం చేశామన్నారు. ఈ నెల 20న కేంద్రం రైతులకు డబ్బులు వేస్తుందని, అదే రోజు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్రం తొలి వాయిదా ఇస్తుందన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తామని, దీంతో సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసినట్లేనని తేల్చి చెప్పారు. తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై దళితులను బహిరంగంగా లాఠీలతో కొట్టిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్ జగన్ ఎలా వెళ్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘దేవతల రాజధాని అమరావతిని వేశ్యల నగరం అంటారా... ఎంత కొవ్వు ఎక్కింది.. మీడియా ఏం చేస్తోంది.. ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికే జగన్ 15 వేల మందితో పొగాకు రైతుల దగ్గరకు వెళ్లి రౌడీయిజం చేశారు. పొగాకు క్వింటా రూ.12 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నాం. రాజకీయ ముసుగులో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తే ఉపేక్షించేది లేదు. తీవ్రవాదులపైనే పోరాటం చేసిన వాడిని. ప్రజల భద్రత విషయంలో రాజీపడను. ఏం చేయాలో చేసి చూపిస్తా’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోందని మంత్రి లోకేశ్ అన్నారు. 60 శాతం కుటుంబాలకు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. -
తల్లికి వందనం మహా మోసం!
తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం. – ఎన్నికలప్పుడు నారా చంద్రబాబు నాయుడుఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం సక్రమంగా అమలు చేయడం లేదు.. రేపు కూటమి ప్రభుత్వం రాగానే మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తాం. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం. – ఎన్నికలప్పుడు నారా లోకేశ్విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ వివరాలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ గణాంకాలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూ.8,745 కోట్లే. అంటే 1/3 విద్యార్థులకు పంగనామాలు పెడుతున్నామని జీవో సాక్షిగా చెప్పారు.ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతుంటే ఆ ఇంట్లో మరెవ్వరికీ తల్లికి వందనం ఇవ్వం అని తేల్చి చెప్పింది. అసలు కూటమి ప్రభుత్వ పాలనలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలవుతున్నాయా! ఎప్పుడొస్తుందో తెలియని.. అసలు వస్తుందో రాదో తెలియని ఫీజు రీయింబర్స్మెంట్పై నెపం మోపి తల్లికి వందనం పథకాన్ని వారికి రద్దు చేయడం దుర్మార్గం కాదా?ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని గురువారం అన్ని దినపత్రికల్లో (సాక్షి మినహా) ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. నేడే తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేస్తామని కూడా ఘనంగా చాటుకున్నారు. మీ మాటలు నమ్మి డబ్బులు పడతాయని లక్షలాది మంది తల్లులు రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. తీరా సవాలక్ష నిబంధనలు పెట్టి, నగదు జమ చేయడానికి ఇంకో నెల గడువు తీసుకున్నారు. మీరు చెప్పిన పిల్లల సంఖ్యలో ఇంకా కోత వేయడానికే కదా ఈ గిమ్మిక్కులు! దీన్ని ఏమనాలి? మోసం అనాలా.. లేక దగా అనాలా? వీరందరూ అనర్హులు⇒ ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నట్లయితే, అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు.⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికీ పథకం రద్దు. ⇒ కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు.⇒ కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు.⇒ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. పట్టణాలల్లో 1000 చ.అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ⇒ ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం రాదు.⇒ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు వేతనం పొందుతున్న వారికి పథకం రాదు. ⇒ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీృమెట్రిక్, పోస్ట్ృమెట్రిక్ స్కాలర్షిప్ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి, మిగిలిన నగదును మాత్రమే ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లిస్తారు. ⇒ సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులొస్తే పథకాన్ని ఆపేస్తారు.సాక్షి, అమరావతి: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాకిచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. సవాలక్ష నిబంధనలు విధించి.. ఇంకా కోత కోయనుంది. మిగిలిన వారికి కూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. గురువారమే నిధులు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం.. వచ్చే నెలకు వాయిదా వేసింది. కేవలం విధివిధానాలు మాత్రమే విడుదల చేసి అనేక కఠిన నిబంధనలతో లబ్ధిదారులకు కోత పెట్టే ప్రక్రియకు పూనుకుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి.. అభ్యంతరాలు ఉన్న వారిని తొలగించనున్నారు. అర్హులుగా తేలిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వచ్చే నెలలో రూ.13 వేలు మాత్రమే జమ చేస్తారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు (26, 27 జీవోలు) విడుదల చేసింది. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇచ్చే రూ.13 వేలకు అనేక నిబంధనల ఆంక్షలు పెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26) నుంచే ఈ పథకం వర్తిస్తుందని, ఈ ఏడాది హాజరుతో సంబంధం లేకుండా అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికీ పథకం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తీరా తల్లులపై ఫీజుల భారం మోపింది. ఇచ్చేది 54,94,703 మందికే.. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్–6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం 67,27,164 మందికి ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ప్రకటించినా, ప్రస్తుతం ఇచ్చేది 54,94,703 మందికేనని తేల్చింది. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరికల అనంతరం లబ్ధిదారులను పరిశీలించనున్నట్టు పేర్కొంది. ఒకటో తరగతిలో 5,87,265 మంది, జూనియర్ ఇంటర్లో 5,32,485 మంది చేరుతారని అంచనా వేశారు. రికార్డుల్లో తప్పులున్నవారు 21,860 మంది, కుటుంబ వివరాలు లేని వారు 90,851 మంది ఉన్నట్లు అంచనా. వీరి వివరాలు తీసుకుని తర్వాత లెక్క సరిచేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ కులాలకు చెందిన 15 కార్పొరేషన్ల ద్వారా గుర్తించిన 54,94,703 మంది విద్యార్థుల వివరాలను స్థానిక గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. నిబంధనలు అన్నీ సరిపోతే.. ఇతరులెవరైనా ఫిర్యాదు చేయకపోతే వచ్చే నెల 5న ఆయా విద్యార్థులకు సంబంధించి 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ చేస్తారు. ఈ విద్యా సంవత్సరం 75 శాతం హాజరు ఉన్న వారికే 2027లో పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. నాలుక మడతేసిన లోకేశ్!వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మఒడి అమలులో కఠిన నిబంధనలు పెట్టిందని ఎన్నికలప్పుడు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ నీతులు వల్లించారు. కానీ ప్రస్తుతం తల్లికి వందనం అమలు నిబంధనలు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వారు చెప్పిన ప్రకారం ఇప్పటికే రెండేళ్ల కాలానికి విద్యార్థులకు తల్లికి వందనం వేయాలి. కానీ తేదీల మతలబుతో మాయ చేసి 2026కు ఇప్పుడు ప్రకటించారు. అదీ 67,27,164 మంది లబ్ధిదారులని చెప్పి, ఇచ్చేది మాత్రం 54,94,703 మందికేనని.. కండిషన్స్ అప్లై అన్నారు. గత ప్రభుత్వంలో 75 శాతం హాజరు నిబంధన పెట్టినా పేదల పక్షపాతి అయిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుతో సంబంధం లేకుండా పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ చేశారు. అయితే నాటి నిబంధనలను తప్పుబట్టిన లోకేశ్.. ఇప్పుడు తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకు కోత పెట్టారు. ఇప్పుడు అర్హులైన వారికి రూ.13 వేలు మాత్రమే ఇస్తామని, మరో రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిధికి జమ చేస్తామంటున్నారు. ఎన్నికల ముందు చెప్పిందేమిటి.. చేసిందేమిటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా లోకేశ్ను నిలదీస్తున్నారు. పైగా ఈ పథకాన్ని 2024 జూన్/జూలైలో విద్యార్థులకు ఇవ్వాల్సింది ఎగవేశారు. 2025 జూన్లో ఇవ్వాల్సిన పథకాన్ని ఇప్పుడు ప్రకటించి 2026కు కూడా ఇదే అని చెబుతున్నారు. పైగా ఒక ఇంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ పొందే విద్యార్థులుంటే తల్లికి వందనం వర్తించదని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో గ్రాడ్యుయేషన్ చదువుకునే వారు ఎందరుంటే అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. అమ్మ ఒడి కూడా ఇచ్చారు. ఇంత పక్కాగా అమలు చేసిన అమ్మ ఒడిపై తీవ్ర విమర్శలు చేసిన లోకేశ్.. ఇప్పుడు ఇన్ని కండిషన్లతో తల్లికి ఎగనామం పెట్టినట్టు కాదా.. అని ప్రజలు నిలదీస్తున్నారు. -
కూటమి సంవత్సర పాలన పై ఏపీ ప్రజల రియాక్షన్
-
అందుకే కాకాణిపై కేసులు.. పేర్నినాని కీలక వ్యాఖ్యలు
-
మానసికంగా ఆ రోజే చచ్చిపోయా.. కానీ... పేర్నినాని ఎమోషనల్
-
సాగుకు శాపం.. 'బాబుదే ఈ పాపం': వైఎస్ జగన్
గత ఏడాది పొగాకు కేజీ ధర రూ.366. ఈ ఏడాది అది పెరగాల్సింది పోయి కనీసం రూ.200 కూడా సగటు ధర దక్కడం లేదు. ఖర్మకాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రేటు దారుణంగా పడి పోయింది. మొన్న మిర్చి పంట సమయంలోనూ చంద్రబాబు ఇదే డ్రామా చేశారు. క్వింటా రూ.11,781తో కొంటామన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబును అడుగుతున్నా.. ఎన్ని కేజీలు కొన్నారు? ఎంత మంది రైతుల నుంచి మిర్చి కొన్నారు? లెక్కలు చెప్పండి. నిజం ఏమిటంటే, చంద్రబాబు ప్రభుత్వం మిర్చి ఒక్క క్వింటా కూడా కొనలేదు. – వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో వ్యవసాయ రంగం తిరోగమనంలో కొనసాగుతోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం రైతులకు శాపంగా పరిణమించిందన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగి పోయాయని, ఇటీవల ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే పర్చూరులో ఒకరు, కొండపిలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పొగాకు రైతులను ఆదుకోవాలని, వారికి గిట్టుబాటు ధర వచ్చేలా, మార్క్ఫెడ్ను వెంటనే రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. అక్కడ అధికారులు, రైతులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా, రైతులకు కనీస మద్దతు ధర కంటే రూ.300 తక్కువ చెల్లించిందని చెప్పారు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, పెసలు, రాగులు, మొక్కజొన్న, కోకో, వేరుశనగ, చీనీ, పొగాకు ఇలా.. ఏ పంట తీసుకున్నా రైతన్నకు రాష్ట్రంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోందన్నారు. అదే ఏడాది క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగిందని గుర్తు చేశారు. ఒక్క ఏడాదిలోనే అది పూర్తిగా దిగజారిందని చెప్పడానికి జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలే నిదర్శనం అని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ రైతు భరోసా లేదుగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఇచ్చిన పెట్టుబడి సాయం చంద్రబాబు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్దమనిషి చంద్రబాబు, మోదీ ఇచ్చే రూ.6 వేలు కాకుండా, మరో రూ.20 వేలు ఇస్తానని చెప్పి, గత ఏడాది మొత్తం ఎగరగొట్టాడు. ఈ ఏడాది మోదీ ఇవ్వాల్సిన రూ.6 వేలు ఇచ్చేసినా, చంద్రబాబు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టారు. అంత దుర్భర పరిస్థితుల మధ్య రాష్ట్రంలో వ్యవసాయం సాగుతోంది.ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీకి మంగళం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసే నాటికి ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చే సంప్రదాయం ఉండేది. ఈ రోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేశారు. రైతులు ఎలా నష్టపోయినా, ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట వేసిన తర్వాత, పంట నష్టపోతామన్న భయం రైతులకు లేకుండా, ప్రతి పంటకు ఉచిత పంటల బీమా అమలు చేశాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ద్వారా ఉచిత పంటల బీమా అమలు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. వ్యవసాయంలో అన్నీ నీరుగార్చారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా అమలు చేసిన పంటల ఈ–క్రాప్ వ్యవస్థను, దళారులు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతను పరిశీలించి, వాటి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ, రాష్ట్రంలోని 146 రూరల్ నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా రైతులకు గ్రామంలోనే అవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేసి, మళ్లీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులకు అవకాశం కల్పించింది. మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా, ఆర్బీకే వ్యవస్థ ద్వారా దళారీలకు తావు లేకుండా చేసి, రైతులకు కనీస మద్దతు ధర అందించాం. జీఎల్టీ (గన్నీ బ్యాగులు, లేబర్, రవాణా చార్జీలు) కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చాం. అదే ఈ రోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యాన్ని రూ.300 తక్కువకు కొనుగోలు చేశారు. రైతు దళారీలకు అమ్ముకున్నాడు. అదే మా ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్లో పోటీ తత్వాన్ని తెచ్చి, రైతులను ఆదుకున్నాం.కేంద్రం ప్రకటించని వాటికీ ఎమ్మెస్పీ కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి, టమాటా వంటి పంటలకు కూడా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించాం. ఆర్బీకేలలో వాటిపై పోస్టర్లు ఏర్పాటు చేసి అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ను కూర్చోబెట్టి.. ప్రతి పంట ఈ–క్రాప్ చేసి.. ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే.. అక్కడ సీఎం యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా వెంటనే ఆ పంటకు సంబంధించిన రేట్లు అప్డేట్ చేయించాం. ఆ వెంటనే ప్రభుత్వం కూడా స్పందించేది. ఆ మేరకు మార్కెటింగ్ శాఖ రంగ ప్రవేశం చేసి, ఎమ్మెస్పీకి పంటలు కొనుగోలు చేసేది. ఈ రోజు అవన్నీ గాలికెగిరిపోయిన పరిస్థితుల్లో వ్యవసాయం నడుస్తోంది.పొగాకుకు మద్దతు ధర పొగాకు పంటనే తీసుకుంటే.. మా ప్రభుత్వం చివరి సంవత్సరం (2023–24)లో కూడా కేజీ రూ.360 చొప్పున క్వింటా రూ.36 వేలకు వర్జీనియా పొగాకు అమ్ముడుపోయింది. లోగ్రేడ్ పొగాకు కూడా క్వింటా రూ.24 వేలకు తగ్గకుండా అమ్ముడుపోయింది. కానీ, ఈరోజు పరిస్థితి ఏమిటనేది మనమే వెళ్లి చూశాం. ఈరోజు జగన్ వస్తున్నాడని.. ఏం మాట్లాడుతాడోనని.. అల్లరవుతామేమేనని వీరంతా సిండికేట్ అయ్యి కాస్తో.. కూస్తో కొంత రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. కేవలం 40 మిలియన్ టన్నులు మామూలుగా ఈ ప్రొక్యూర్మెంట్ మార్చిలో మొదలుపెట్టి జూన్ నాటికి పూర్తి చేయాలి. ఆ మేరకు ఈ ఏడాది 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే చేశారు. అలాగే ఈరోజు రేటెంత అని చూస్తే హైగ్రేడ్ బ్రైట్ క్వాలిటీ రేటు సగటున కేవలం కిలో రూ.220 నుంచి రూ.260 మధ్య అమ్ముడుపోతోంది. హైగ్రేడ్ క్వాలిటీ రూ.240కి కూడా రావడం లేదు. ఈరోజు నేను వచ్చాను కాబట్టి రూ.280కి కొంటున్నారు. ఇంక లోగ్రేడ్ చూస్తే కొనే నాథుడే లేడు. దాన్ని రూ.160 నుంచి రూ.180కి కొంటున్నారు. ఆ ధర నచ్చక రైతులు నలభై శాతం స్టాక్ వెనక్కు తీసుకెళ్తున్నారు. అదే మా ప్రభుత్వ హయాంలో ఇదే హైగ్రేడ్ క్వాలిటీ కేజీ రూ.366కు అమ్ముడు పోయింది. అంటే క్వింటా రూ.36 వేలకు పైగా కొన్నారు. ఇప్పుడు జూన్ నెల మధ్యకొచ్చాం. సీజన్ అయిపోతున్నా 220 మిలియన్ టన్నులు కొనాల్సి ఉంటే, కొనుగోలు చేసింది కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే. పక్కనే ఉన్న కర్ణాటకలో కేజీ రూ.360కి కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రైతులకు కనీసం యావరేజ్ రేటు రూ.200 కూడా దక్కడం లేదంటే, వారు ఎంత దయనీయ పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్లాక్ బర్లీ పొగాకు గత ఏడాది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు అమ్ముడుపోతే, ఈరోజు ఆ ధర రూ.6 వేల నుంచి రూ.9 వేలు దాటడం లేదు. దీంతో పొగాకు రైతు ఎకరాకు రూ.80 వేలు నష్టపోతున్న దుస్థితి కనిపిస్తోంది.నాడు పొగాకు రైతుకు స్వర్ణయుగం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా 2020లో పొగాకు వేలం (ఆక్షన్) ప్రక్రియలోకి మార్క్ఫెడ్ను రంగంలోకి దింపింది. అలా మార్కెట్లో పోటీ పెంచి, ఏకంగా రూ.140 కోట్లు ఖర్చు చేసి కార్టల్ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా చూశాం. అదే ఈ రోజు రైతు సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న తపన, తాపత్రయం ఎక్కడా లేదు కాబట్టే రైతులు తీవ్రంగా నష్టపోతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. రూ.4 లక్షల పరిహారం ఘనత మాదేపొగాకు, ఇతర పంటలకే కాకుండా, మిర్చి రైతుకు కూడా రూ.4 లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాదే. ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి, గిద్దలూరు, మార్కాపురంలో రైతు ఏనాడూ భయపడేవాడు కాదు. ఏ పంట వేసినా.. వరదలొచ్చినా, తుపాన్ వచ్చినా, కరువొచ్చినా.. ఇన్సూరెన్స్ కట్టామా లేదా అనే దిగులు రైతుకు ఉండేది కాదు. వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత పంటల బీమా డబ్బులు కట్టేది. పంట వేసిన ప్రతి ఎకరా కూడా ఆటోమేటిక్గా ఈ–క్రాప్ జరిగేది. ఉచిత పంటల బీమా కింద 54.55 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.7,800 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించి ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలబడింది. మిర్చి పంటకు ఎకరాకు రూ.80 వేల చొప్పున, పప్పు ధాన్యాలకు ఎకరాకు రూ.6 వేల చొప్పున నష్టపరిహారం ఇప్పించాం. అలా ఐదు ఎకరాలున్న మిర్చి రైతుకు ఏకంగా రూ.4 లక్షల పరిహారం ఇచ్చాం.రైతులను మోసం చేశారు చంద్రబాబు సీఎం అయ్యాక రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయం దండగ అనే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ‘ఈ సంవత్సరం 20 శాతం పొగాకు ఎక్కువగా పండించండి.. మేము కొనుగోలు చేస్తాం’ అని పొగాకు బోర్డు హామీ ఇచ్చింది. గతేడాది బ్యారన్కి 35 క్వింటాళ్లకు పర్మిషన్ ఇస్తే ఈసారి 42.5 క్వింటాళ్లకు పర్మిషన్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతోనే రైతులు సాగు విస్తీర్ణం పెంచారు. పంటను కొంటామని హామీ ఇవ్వడంతో సాగు విస్తీర్ణం 30 శాతం పెరిగింది. ఒకవైపు రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. మరోవైపు వాతావరణం సహకరించక దిగుబడి తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పొగాకు రేటు పెంచాలి. కానీ రైతు ఖర్మకాలి చంద్రబాబు సీఎం అయ్యాడు. ఆ దెబ్బకు రేటు దారుణంగా పడి పోయింది. గత ఏడాది కేజీ ధర రూ.366 కాగా, అది పెరగాల్సింది పోయి, కనీసం రూ.200 కూడా సగటు ధర దక్కడం లేదు. ఇతర పంటలదీ అదే దుస్థితి నిన్న (మంగళవారం)నే మా ఆఫీస్కు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వచ్చి కోకో పంట గురించి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కోకో కిలో గింజల ధర రూ.1,050 ఉండేది. ఇప్పుడు రూ.370, రూ.360 మాత్రమే అని రైతులు చెప్పారు. అలాగే పామాయిల్ ధర గత ప్రభుత్వ హయాంలో గరిష్టంగా రూ.23,360, కెర్నిల్ నట్స్కు రూ.29,360 ధర ఉంటే.. ఇప్పుడు రూ.18,606కి పడిపోయింది. ఈ ప్రభుత్వం ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించాలి. వెంటనే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టాలి. ఆ దిశలో మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి, పోటీతత్వం పెంచి ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే కచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం.ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదాంపొగాకు రైతులకు వైఎస్ జగన్ భరోసాఅన్నదాతలు, అధికారులతో ముఖాముఖిపొదిలి/కొనకనమిట్ల: పొగాకు రైతులు అధైర్య పడొద్దని, ధరలు పెంచి కొనుగోలు చేసే వరకు పోరుబాటలో ఉంటామని.. ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. పోరుబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. పంట ఉత్పత్తి, ధరలు, రైతుల పరిస్థితిపై తొలుత వేలం అధికారులతో మాట్లాడారు. వేలం అధికారి గిరిరాజ్కుమార్ పొదిలి వేలం కేంద్రం పరిధిలోని వివరాలను వైఎస్ జగన్కు వివరించారు. ‘4,390 మంది రైతులు 2,601 బ్యారన్ల కింద పొగాకు సాగు చేస్తున్నారు. 8,534 హెక్టార్లలో పొగాకు సాగు చేపట్టాల్సి ఉండగా, 11,031 హెక్టార్లలో సాగు చేశారు. 11.10 మిలియన్ కిలోల అమ్మకాలకు బోర్డు అనుమతి ఇవ్వగా, 18 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగిందని అంచనా వేస్తున్నాం. బ్రైట్ రకం కిలో రూ.265, మీడియం రూ.225, లో గ్రేడ్ రూ.180 సగటు ధరగా కొనుగోలు చేస్తున్నాం. బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లోనూ 25% ఉత్పత్తి పెరిగింది. బయ్యర్లు లోగ్రేడ్ రకం పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవటంతో రిజక్షన్ బేళ్ల సంఖ్య అధికంగా ఉంది’ అని తెలిపారు. ‘లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతుల వద్ద పొగాకు అధికంగా నిల్వ ఉంది. సగటు ధర పూర్తిగా తగ్గిపోయింది. రిజక్షన్ బేళ్ల సంఖ్య పెరిగింది. అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అంటూ రైతులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రైతులు ధైర్యం వీడొద్దని, రైతుల పట్ల వ్యతిరేక విధానాలతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు, రైతులకు మేలు జరిగేలా మార్క్ఫెడ్ను రంగంలోకి దించేంత వరకు పోరుబాటతో రైతులకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వస్తున్నారని కూటమి ప్రభుత్వ పెద్దలు, పొగాకు బోర్డు అధికారులు రైతులను బలవంతంగా బయటకు పంపించారు. రైతులు లేకుండానే ఏకపక్షంగా ధర నిర్ణయించేశారు. జగన్ వస్తున్నారని బుధవారం తిరస్కరణ శాతాన్ని తగ్గించడం గమనార్హం.