breaking news
Chandrababu Naidu government
-
Bosta: కాచుకో చంద్రబాబు రంగంలోకి జగన్
-
రాజయ్యపేట మత్స్యకారులకు అండగా YSRCP
-
Garam Garam Varthalu: ఇంగ్లీషు రాదు ఇంగ్లీషు రాదూ
-
చంద్రబాబు DA దాగుడుమూతలు
-
ఇంటింటా దీపాల వెలుగు ఎక్కడ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘మీరూ.. మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఒక్కటైనా ఈ 18 నెలల కాలంలో వెలిగిందా..? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. వైఎస్సార్సీపీ పాలనలో 2019–24 మధ్య ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులని చంద్రబాబును దుయ్యబడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ఇవన్నీ వెలగని దీపాలే కదా... 1. నిరుద్యోగులందరికీ నెలకు రూ.3 వేల చొప్పున భృతి.. 2. ప్రతి అక్కచెల్లెమ్మకూ నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18,000.. 3. 50 ఏళ్లకే పెన్షన్.. నెల నెలా రూ.4 వేలు... 4. పీఎం కిసాన్ కాకుండా, ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000 ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట.. 5. ఎంతమంది పిల్లలున్నా, ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,000 6. ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు 7. అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం..ం 8. ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు.. ⇒ ఇవన్నీ.. వెలగని దీపాలో ంలేక చేశామంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా.. లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా? ⇒ వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత.. ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా! ⇒ మా పాలనలో 2019–24 మధ్యం ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు! -
డీఏపై దొంగాట.. ఉద్యోగులపై బాంబు!
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు నాలుగు డీఏ బకాయిలు ఇవ్వాల్సిన చంద్రబాబు సర్కారు ఒకే ఒక్క డీఏకి పరిమితం చేసి పండుగ పూట తీవ్ర నిరాశకు గురి చేయగా.. చివరకు అందులోనూ మెలిక పెట్టి ఉద్యోగులు, పెన్షనర్లకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఒకే ఒక్క డీఏ.. అది కూడా 21 నెలల బకాయిలను పదవీ విరమణ లేదా వీఆర్ఎస్ తరువాతే ఇస్తామని తొలుత బాంబు పేల్చిన సర్కారు.. దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు భగ్గుమనడంతో అనంతరం సర్దుకుని మరో రెండు సవరణ జీవోలిచ్చింది. వీటిలోనూ మరికొన్ని మెలికలు పెట్టింది. డీఏల జీవోలపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. కూటమి సర్కారు దొంగాటతో తాము ఏమాత్రం ఏమారినా దారుణంగా మోసపోయే పరిస్థితి నెలకొందని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రభుత్వం నాలుగు డీఏలను 16 నెలలుగా పెండింగ్లో పెట్టిందని, చివరకు ఒకే ఒక్క డీఏ ఇస్తామంటూ అందులోనూ మోసపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన 9 ప్రధాన హామీలను విస్మరించి దారుణంగా వంచిస్తోందని, పీఆర్సీ కమిషనర్ను నియమించకపోగా గతంలో ఉన్నవారిని సైతం తొలగించిందని పేర్కొంటున్నారు. ఇక ఐఆర్ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెలుగులు లేవు.. కారు చీకట్లే!వెలుగుల పండుగ దీపావళి నాడు లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాల్లో కారు చీకట్లు నింపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తొలుత రెండు చీకటి జీవోలు 60, 61 జారీ చేసింది. శనివారం ఉద్యోగ సంఘాలతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి సందర్భంగా నాలుగు డీఏలకుగానూ ఒక డీఏ మంజూరు చేస్తున్నామని, ఉద్యోగులు, పెన్షనర్లు పండుగ చేసుకోండంటూ చెప్పుకొచ్చారు. అయితే దీపావళికి ముందు రోజు ఆదివారం అర్ధరాత్రి డీఏ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన ఆ రెండు చీకటి జీవోలను చూసి ఉద్యోగులు, పెన్షనర్లకు నోట మాట రాలేదు. ఉద్యోగులకు గతేడాది జనవరిలో ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం మంజూరు చేస్తున్నట్లు జీవో 60లో ఆర్థిక శాఖ పేర్కొంది. 21 నెలల డీఏ బకాయిలను (01–01–2024 నుంచి 30–09–2025 వరకు) ఉద్యోగుల పదవీ విరమణ లేదా వీఆర్ఎస్ సమయంలో చెల్లిస్తామని జీవోలో స్పష్టం చేసింది. ఇలాంటి జీవోను దేశ చరిత్రలో ఎప్పుడు జారీ చేయలేదని ఉద్యోగ వర్గాలు పేర్కొన్నాయి.చరిత్రలో ఎన్నడూ చూడని జీవో..సాధారణంగా ఉద్యోగుల డీఏ బకాయిలను వారి జీపీఎఫ్కు జమ చేసేలా ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తాయి. దీనికి భిన్నంగా ఉద్యోగుల పదవీ విరమణ లేదా వీఆర్ఎస్ సమయంలో 21 నెలల డీఏ బకాయిలను చెల్లిస్తామని తొలుత ఇచ్చిన జీవోలో పేర్కొనడంపై నివ్వెరపోయారు. డీఏలకే ఇలా చేస్తే పెండింగ్లో ఉన్న రూ.34 వేల కోట్ల బకాయిల పరిస్థితి ఏమిటని మథనపడుతున్నారు. డీఏ బకాయిలను గతంలో ప్రభుత్వాలు ఉద్యోగుల జీపీఎఫ్కు జమ చేశాయని గుర్తు చేస్తున్నాయి. ఇది మోసపూరిత, దగాకోరు సర్కారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీపావళి ముందు రోజు నమ్మించి గొంతు కోశారని, ఇది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తున్నాయి. డీఏ ఉద్యోగుల వేతనంలో భాగమని, అది ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయాన్ని సమతుల్యం చేయడానికి చెల్లించే పరిహారమని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. డీఏ అనేది పదవీ విరమణ బెనిఫిట్ కాదనే విషయాన్ని గుర్తించాలని పేర్కొంటున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులకు చెల్లించే డీఏ ఖర్చును వారి సొంత నిధుల నుంచి భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.పెన్షనర్లపై పిడుగు..ఉద్యోగుల మాదిరిగానే పెన్షనర్లను కూడా చంద్రబాబు సర్కారు నిలువునా మోసం చేసింది. పెన్షనర్లకు గత ఏడాది జనవరిలో ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తొలుత జీవో 61 జారీ చేసింది. పెన్షనర్లకు 21 నెలల డీఏ బకాయిలు (01–01–2024 నుంచి 30–09–2025 వరకు) 2027–28 ఆర్థిక ఏడాదిలో 12 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని అందులో పేర్కొంది. దీనిపై పెన్షనర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు ఆర్థిక సంవత్సరాల తరువాత బకాయిలు చెల్లిస్తామనడం దారుణమని, గతంలో ఏ ప్రభుత్వాలూ ఇలాంటి జీవోలను జారీ చేయలేదని, దీపావళికి డీఏ అంటూ నయ వంచనకు పాల్పడ్డారని పెన్షనర్లు, టీచర్ల సంఘాలు భగ్గుమనడంతో అనంతరం సవరణ జీవోలు వెలువడ్డాయి.తక్షణం సవరించాలి: ఉపాధ్యాయ సంఘాలుముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో చర్చించే సందర్భంలో కనీస ప్రస్తావనకు రాని నిబంధనలను ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ మంజూరు జీవోలు 60, 61లో పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ యుటీఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. పెన్షనర్ల డీఏ బకాయిలను 2027–28లో 12 వాయిదాల్లో చెల్లిస్తామనడాన్ని ఖండిస్తున్నట్లు యూటీఎఫ్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ప్రసాద్ పేర్కొన్నారు. తక్షణం జీవోలకు సవరణలు చేసి ఉద్యోగుల బకాయిలను జీపీఎఫ్కు జమ చేయాలని, పెన్షనర్లకు బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: పీఆర్టీయూగతంలో ఎన్నడూ లేని విధంగా డీఏ బకాయిలను ఉద్యోగి పదవీ విరమణ తరువాత చెల్లిస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పీఆర్టీయూ ఒక ప్రకటనలో తెలిపింది. పెన్షనర్లకు డీఏ బకాయిలను 2027–28లో చెల్లిస్తామనడాన్ని ఖండించింది. సీపీఎస్ గురించి జీవోల్లో ప్రస్తావించకపోవడం సరికాదని, వెంటనే జీవోలను సవరించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది.గతంలో మాదిరిగానే ఇవ్వాలి: ఏపీటీఎఫ్పెన్షనర్లు, ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లింపు విధానం సంప్రదాయానికి భిన్నంగా ఉందని ఏపీటీఎఫ్ ఒక ప్రకటనలో ఖండించింది. వెంటనే జీవోలను సవరించాలని, గతంలో మాదిరిగానే డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది.ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి: ఆప్టాప్రభుత్వ తీరుపై ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, దీనికి తోడు డీఏ జీవో చాలా దారుణంగా ఉందని ఆప్టా అధ్యక్షుడు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షనర్లకు డీఏ బకాయిలను 2027–28లో చెల్లిస్తామనడం సమంజసం కాదన్నారు. సీపీఎస్ ఉద్యోగుల గురించి జీవోలో ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. తక్షణమే డీఏ మంజూరు జీవోలను సవరించాలని డిమాండ్ చేశారు.తరువాత ఇస్తామనడం దారుణం: సచివాలయ అసోసియేషన్ఉద్యోగులకు 21 నెలల డీఏ బకాయిలను పదవీ విరమణ తరువాత ఇస్తామనడం తీవ్ర నిరాశకు గురి చేసిందని రాష్ట్ర సచివాలయ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎప్పుడూ డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తారని, పదవీ విరమణ నాటికి వాయిదా వేయడం ఇదే తొలిసారని తెలిపింది. ఇది ఉద్యోగులకు తీవ్రనష్టం కలిగించే అంశమని, డీఏ జీవోలను సవరించి బకాయిలను వెంటనే జమ చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. బకాయిలు వెంటనే చెల్లించాలి: పెన్షనర్ల అసోసియేషన్పెన్షనర్ల డీఏ బకాయిలను 2027–28లో వాయిదాల్లో చెల్లిస్తామనడం సరికాదని, బకాయిలను నగదు రూపంలో వెంటనే చెల్లించాలని హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఏపీ పెన్షనర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. మిగిలిన మూడు డీఏలను కూడా వెంటనే మంజూరు చేయాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.డీఏ ఉత్తర్వుల్లో మార్పులు.. మళ్లీ మెలికలు 3 వాయిదాల్లో జీపీఎఫ్ ఖాతాలకు చెల్లించేలా ఉత్తర్వులు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏను రిటైర్మెంట్ తర్వాత చెల్లిస్తామని ప్రకటిస్తూ సోమవారం 60, 61 జీవోలిచ్చిన ప్రభుత్వం.. మంగళవారం ఆ ఉత్తర్వులను సవరించింది. ఈమేరకు జీవో నం.62, 63ని జారీ చేసింది. అయితే, సవరించిన జీవోల్లోనూ ఉద్యోగులకు, పెన్షనర్లకు నష్టమే కలిగేలా చేసింది. ఏడాదిలోపు మూడు వాయిదాలలో డీఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ఆ మొత్తాన్ని ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలని జీవోలో సవరణ చేసింది. సీపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏడాదిలోపు మూడు వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్టు పేర్కొంది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం డీఏ అరియర్స్లో 10 శాతం 2026 ఏప్రిల్లో, 30 శాతం ఆగస్టులో, 30 శాతం నవంబర్లో, మిగిలిన 30 శాతం ఫిబ్రవరి 2027లో చెల్లిస్తామని ప్రకటించింది. అయితే, ఓపీఎస్ ఉద్యోగులకు మొత్తం పీఎఫ్ ఖాతాలో, సీపీఎస్ ఉద్యోగులకు 10 శాతం ప్రాన్ ఖాతాలో జమ చేస్తామని, మిగిలిన మొత్తం మూడు విడతలుగా చెల్లిస్తామని పేర్కొంది. రిటైర్ అయిన ఉద్యోగులకు ఆయా నెలవారీ విడతల్లో నగదుగా చెల్లిస్తారు. అయితే, సవరణ ఉత్తర్వులతో ఉద్యోగులకు ఎలాంటి మేలు జరగలేదని, ఇది కేవలం కంటితుడుపు చర్చేనని ఉద్యోగులు, ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. జీవోల సవరణ కంటితుడుపు చర్యే ఉద్యోగ, ఉపాధ్యాయులకు కరువు భత్యం సవరణ ఉత్తర్వులు కంటితుడుపుగా మాత్రమే ఇచ్చినట్టు ఉంది. ఈ ఉత్తర్వులు ఏ ఒక్కరినీ సంతృప్తి పరిచే విధంగా లేవు. ఫిబ్రవరి 2027కు బకాయిల చెల్లింపులు పూర్తయ్యేలా ఉత్తర్వుల్లో తెలపడం అన్యాయం. ఇవ్వాల్సిన హక్కుపై సీలింగ్ విధించడం వల్ల ఉద్యోగులు నష్టపోతారు. ఈ ఏడాది నవంబర్లో బకాయిలు మొత్తం ఓపీఎస్ ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలి. సీపీఎస్ ఉద్యోగులకు 90 శాతం నగదుగా చెల్లించాలి. పెన్షనర్లకు 100 శాతం నగదుగా చెల్లించాల్సిందే. మిగిలిన 3 డీఏలను కూడా వెంటనే ప్రకటించాలి. ఉద్యోగ విరమణ తర్వాత బకాయిలు చెల్లిస్తామన్న నిబంధన సవరణ స్వల్ప ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారంగా కనిపించలేదు. – సీవీ ప్రసాద్, ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు -
ఉద్యోగుల డిఏ పై మరో జీవో జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పై మరో జీవో జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం. డిఏ అరియర్స్ రిటైర్ అయ్యాక చెల్లిస్తామన్న నిబంధన వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం. అరియర్స్ 10 శాతం 2026 ఏప్రిల్ లో చెల్లిస్తామని వెల్లడించింది. 90 శాతం అరియర్స్ 2026 ఆగస్ట్, నవంబర్, 2027 ఫిబ్రవరిలో చెల్లిస్తామని తెలిపింది. ఉద్యోగుల జి పి ఎఫ్ లో జమ చేస్తామని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
RK Roja: నారా నరకాసుర పాలన పోవాలి.. జగనన్న పాలన రావాలి
-
పల్లెలపై బాబు బాంబు 'తాగునీటికీ బాదుడే'!
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గట్టి షాక్ ఇచ్చి ఒకరోజు గడవక ముందే పండగ పూట చంద్రబాబు సర్కారు మరో బాదుడుకు తెర తీసింది! కాకపోతే ఈసారి ఆయన సంధించిన బాంబు పల్లెల్లో పేలనుంది! గ్రామాల్లో తాగునీటి చార్జీల మోత మోగనుంది! దీపావళి కానుకగా.. గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి ఏటా రూ.వెయ్యి కోట్లకుపైగా తాగునీటి చార్జీల వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. సూపర్ సిక్స్, సెవెన్ పేరుతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్తు చార్జీలు, భూముల విలువ పెంపు ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీల మోత, ముక్కు పిండి ఆస్తి పన్ను వసూలుతో తమ నడ్డి విరుస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. అటు ఎన్నికల హామీలను నెరవేర్చకుండా.. ఇటు ఎడాపెడా బాదుడుతో చంద్రబాబు తన ట్రేడ్మార్కు మోసాలను కొనసాగిస్తున్నారని అన్ని వర్గాలు ఆక్రోశిస్తున్నాయి. వైఎస్ జగన్ ఇచ్చిన వాటితోపాటు ఇంకా ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు తమను దగా చేశారని సర్వత్రా చర్చ జరుగుతోంది. బాధ్యత వదిలించుకుని బాదుడు..! రక్షిత తాగునీటి పథకాల ద్వారా గ్రామీణ ప్రజలకు అందించే మంచినీటిపైనా యూజర్ చార్జీలు వసూలు చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల నిర్వహణ, మరమ్మతులకు ఏటా రూ.1,680.29 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఏకంగా రూ.1,036.97 కోట్లు ప్రజల నుంచి యూజర్ ఛార్జీల రూపంలో వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ వ్యయాన్ని ఆయా గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్లకు కేంద్రమిచ్చే ఆర్థిక సంఘం నిధుల నుంచి లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తుండగా.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఆ బాధ్యత వదిలించుకుని యూజర్ చార్జీల రూపంలో ప్రజలపై భారం మోపడానికి సిద్ధపడింది. ప్రజల నుంచి వసూలు చేయనున్న యూజర్ చార్జీల వివరాలు మంత్రివర్గం ఆమోదం.. జీవో జారీ తాగునీటిపై యూజర్ చార్జీల వసూలుకు రెండు నెలల క్రితమే మంత్రివర్గం ఆమోదం తెలుపగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ పాలసీ నోటిఫికేషన్ జారీ అయింది. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి నుంచి యూజర్ చార్జీలు వసూలును లెక్క గట్టారు. రెండు కంటే ఎక్కువ గ్రామాలకు ఒకే రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా జరిగే చోట్ల ప్రతి వ్యక్తిపై సగటున ఏడాదికి రూ. 320 చొప్పున వసూలు చేయనుండగా, గ్రామ పరిధిలో అంతర్గతంగా రక్షిత తాగునీటి పథకం ఉన్నచోట్ల ఏటా రూ.240 చొప్పున యూజర్ చార్జీల భారం పడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీవో రూపంలో ఆదేశాలు వెలువడ్డ నేపథ్యంలో ఇక ఏ క్షణమైనా యూజర్ చార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల నుంచి రూ.1,036.97 కోట్లు వసూలు.. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 3.81 కోట్ల జనాభాలో 60 శాతం మందికి చిన్న తరహా రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల ద్వారానే తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య (ఆర్డబ్ల్యూఎస్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 549 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు నిర్వహణకు ఏటా రూ.518.69 కోట్లు వ్యయం కానుండగా, 29,469 చిన్న తరహా రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు రూ.1,031.42 కోట్లు, సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే పథకాలకు మరో రూ.130.18 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. ఈ నేపథ్యంలో వీటి నిర్వహణకయ్యే మొత్తం ఖర్చు రూ.1,680.29 కోట్లలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్లకు ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.503.67 కోట్లు వ్యయం చేయనున్నట్లు పాలసీ ప్రణాళికలో పేర్కొన్నారు. మిగిలిన రూ.1,176.62 కోట్లలో రూ.1,036.97 కోట్లు ఆయా గ్రామాల్లో నివసించే ప్రజల నుంచి యూజర్ చార్జీల రూపంలో వసూలు చేయనుండగా కేవలం రూ.139.65 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పాలసీ ప్రణాళికలో పేర్కొన్నారు. పంచాయతీల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ పాలసీలో యూజర్ చార్జీల గురించి పేర్కొన్న వివరాలు నిర్వహణ ఖర్చులు పెరిగితే అదనపు భారం.. రక్షిత మంచినీటి పథకాల పరిధిలో పనిచేసే సిబ్బంది నెలవారీ జీతభత్యాలతోపాటు మోటర్ల విద్యుత్ చార్జీలు, బ్లీచింగ్ పౌడర్, నీటి శుద్ధిపై నాణ్యత పరీక్షలు లాంటివి నిర్వహణ వ్యయంలో ఉంటాయని ప్రభుత్వం పాలసీలో పేర్కొంది. పైపులైన్ లీకేజీలు, మోటర్ల మరమ్మతులు, విడిభాగాల కొనుగోలు దీనికి అదనం. భవిష్యత్లో సిబ్బంది వేతనాలు పెరిగినా.. విద్యుత్ చార్జీలు పెరిగినా ఆ మేరకు నిర్వహణ కూడా పెరుగుతుంది. అందుకు అనుగుణంగా యూజర్ చార్జీల భారం ప్రజలపై పడే అవకాశం ఉంది. కేంద్రం వాటా తగ్గితే మరిన్ని తిప్పలు..! ప్రస్తుతం అమలులో ఉన్న 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ ఏడాది రూ.2,099 కోట్లు రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు అందుతాయి. 15వ ఆర్థిక సంఘం గడువు 2026 మార్చి నెలాఖరుతో ముగియనుంది. 2026 ఏప్రిల్ నుంచి 16 ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి వస్తాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సు ల అనంతరం గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసే మొత్తం ఒకవేళ తగ్గినా.. లేదంటే ఆ నిధులను ప్రత్యేక అవసరాలకు మాత్రమే వినియోగించాలని ఏవైనా నిబంధనలు విధించినా.. ఆ మేరకు రక్షిత మంచినీటి పథకాలపై కేంద్రం వాటా కు గండి పడుతుంది. ఆ రకంగా చూసినా ప్రజలపై యూజర్ చార్జీల భారం మరింత పెరిగే వీలుంది. వసూలు బాధ్యత కమిటీలకు.. గ్రామ స్థాయిలో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూపొందించిన పాలసీలో పేర్కొంది. తాగునీటి పథకం నిర్వహణ వ్యయం ఆధారంగా ఎప్పటికప్పుడు యూజర్ చార్జీలను నిర్ణయించడం, వసూలు చేసే బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలు, నిర్వహణ కమిటీలదేనని ప్రభుత్వం పేర్కొంది. రెండు కంటే ఎక్కువ గ్రామాలకు నీటిని సరఫరా చేసే 549 సీపీడబ్ల్యూఎస్ స్కీంల పరిధిలో యూజర్ చార్జీల నిర్ణయం, వసూలు బాధ్యత ఆయా జిల్లా పరిషత్లకు చెందిన ప్రత్యేక స్టాండింగ్ కమిటీకి ఉంటుందని పాలసీ ప్రణాళికలో పేర్కొన్నారు. నూతన పాలసీపై ఇప్పటికే ఎస్ఈ, ఈఈ, డిప్యూటీ ఎంపీడీవోలు, ఏఈ స్థాయి వరకు శిక్షణ పూర్తి అయింది. గ్రామ స్థాయి సిబ్బందికి నవంబర్, డిసెంబర్లో శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భారమైన పన్నులు.. ఆస్తి ఉందన్న ఆనందాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు మిగలనివ్వడం లేదు. కూటమి ప్రభుత్వంలో ఆస్తి పన్నులు భారీగా పెరిగాయి. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలంటూ సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. రోజూ ఆస్తిపన్ను వసూళ్లపై సమీక్షలు చేస్తూ తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ఆస్తి పన్ను వసూలు లక్ష్యాలను చేరుకోలేకపోతే చర్యలు తీసుకుంటామంటూ వారిని హెచ్చరిస్తోంది. పాత బకాయిలు ఉన్నాయంటూ నోటీసులు జారీ చేస్తూ, అన్నీ కలిపి ఒకేసారి కట్టాల్సిందేనంటూ పెనుభారం మోపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో స్థానిక పరిస్థితులను బట్టి పంచాయతీలు ఇంటి పన్ను వసూలు చేసే పరిస్థితులు ఉండగా ఇప్పుడు ప్రతి చోటా వంద శాతం పన్ను వసూలు చేయాలంటూ క్షేత్రస్థాయి సిబ్బందికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక భూముల క్రయ విక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ చార్జీలు నిర్ధారించే భూముల విలువను ఈ ఏడాది ఫిబ్రవరిలో 40 నుంచి 50 శాతం దాకా పెంచారు. దీనివల్ల కొనుగోలుదారులపై చార్జీల భారం అదనంగా పడింది. కేంద్రం ఊరట.. బాబు బాదుడు!ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారాన్ని తగ్గించి ఊరటనిస్తే.. రాష్ట్రంలో మాత్రం కూటమి సర్కారు ప్రజలపై పన్నుల భారం మోపుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దసరా, దీపావళి వేళ చాలా వరకు నిత్యావసరాలపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు లేదంటే తగ్గింపు ద్వారా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చర్యలు చేపడితే.. చంద్రబాబు సర్కారు మాత్రం పండుగ సమయంలో జీవనాధారమైన తాగునీటిపై యూజర్ చార్జీల వసూలు పాలసీని ప్రకటించడం గమనార్హం. వివిధ వస్తువులపై జీఎస్టీని తగ్గించిన కేంద్రం ఆ నిర్ణయాన్ని సెపె్టంబరు 22వ తేదీ నుంచి అమలులోకి తీసుకురాగా.. చంద్రబాబు ప్రభుత్వం అదే రోజు యూజర్ చార్జీల వసూలుకు సంబంధించి ‘‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’ పాలసీ జీవో విడుదల చేసింది. అయితే జీవో నెంబరు 83 వెంటనే ఆన్లైన్లో అందుబాటులో ఉంచకుండా ఆలస్యంగా వెలుగులోకి తెచ్చింది. గ్రామాల్లో ఇంటి పన్ను రూపంలో వసూలు చేసే మొత్తం కంటే నీటిపై ప్రతిపాదిత యూజర్ చార్జీలు చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం. షాకులే షాకులు..విద్యుత్తు చార్జీల వాత.. ఆస్తి పన్ను మోత ⇒ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓట్లేసి గెలిపించండి.. కరెంటు చార్జీలు ఇంకా తగ్గిస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై ఏకంగా రూ.17,348.64 కోట్లు విద్యుత్ చార్జీల భారం వేశారు. ⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ బిల్లులు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే వసూలు చేస్తున్న చార్జీలకు తోడు మరో పిడుగు కూడా సిద్ధంగా ఉంది. మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని ఇటీవల కమిషన్ను కోరాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ప్రజలపైనే భారీగా బండ పడుతుంది. -
ఒక్క డీఏతో ‘పండుగ’ చేసుకోమంటారా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేసి దీపావళి కానుక అంటూ ఒక్క డీఏ ఇచ్చి సరిపెట్టడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమకు రావాల్సిన నాలుగు డీఏల్లో ఒక దాన్ని.. అది కూడా 16 నెలల తర్వాత ఇవ్వడాన్ని గొప్పగా చెప్పుకోవడంపై వారంతా మండిపడుతున్నారు. వాట్సప్ గ్రూపుల్లో చంద్రబాబును దుమ్మెత్తిపోస్తున్నారు. వైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రాగానే 10 రోజుల్లోనే ఇచ్చిన హామీ మేరకు 27% ఐఆర్ ఇస్తే, చంద్రబాబు 2024 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అటకెక్కించారనే చర్చ ఉద్యోగ వర్గాల్లో పెద్దఎత్తున జరుగుతోంది. ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చిన జగన్ ఏ ప్రభుత్వం ఉన్నా ఏడాదికి రెండుసార్లు డీఏ ఇస్తుంది. కానీ నాలుగు డీఏలు పెండింగ్లో ఉంటే చంద్రబాబు ఇప్పుడు ఒకటి ఇవ్వడానికే పెద్ద హడావుడి చేయడం ఉద్యోగ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘ సమావేశం నిర్వహించడం, ఆ తర్వాత సీఎం చంద్రబాబు వారితో సమావేశమవడం వంటి పరిణామాలను చూసి, ఐఆర్, పీఆర్సీసహా తమ డిమాండ్ల పరిష్కారం దిశలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని ఉద్యోగులు ఎదురు చూశారు.కానీ అంత కసరత్తు తర్వాత డీఏ తప్ప ఇతర ఏ ముఖ్యమైన ప్రకటనా లేకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగులు హతాశులయ్యారు. వైఎస్ జగన్ 2019–24 మధ్య ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చారని, చంద్రబాబు 2014–19 మధ్య ఏడు డీఏలు మాత్రమే ఇచ్చారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా డీఏల కోసం పోరాటం తప్పని పరిస్థితి నెలకొందనేది ఉద్యోగ సంఘాల ఆవేదనగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలుగా ఐఆర్ విషయాన్ని పట్టించుకోకపోవడంపై నిరాశ చెందుతున్నారు. పీఆర్సీ ఇచ్చే ఉద్దేశమే లేదా? వెసులుబాటు ఉన్నప్పుడు పీఆర్సీ ఇస్తామనడం, దాని గురించి అడగవద్దనడం ఏమిటని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ రెండు, మూడేళ్ల తర్వాతైనా ఇచ్చే ఉద్దేశం ఉంటే కనీసం కమిషన్ను నియమించేవారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం 12వ పీఆర్సీ కమిషన్ ఉనికిలో లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కోటరీ ఒత్తిడితో పీఆర్సీ కమిషనర్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంద్రబాబు మరొకరిని నియమించలేదు. పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉంటే కనీసం కమిషనర్ను నియమించడానికి అంగీకరించేవారు.కమిషన్ ఏర్పాటైతే పరిశీలన, అధ్యయనం తర్వాత ఏడాదికో, రెండేళ్లకో నివేదిక ఇచ్చేది. ఆ తర్వాత దానిపై ఉద్యోగ సంఘాలతో చర్చలు, ప్రభుత్వం సమాలోచనలు జరిపి ఒక ఏడాది తర్వాతైనా ఆ నివేదికనో, అందులోని కొన్ని అంశాలనో ఆమోదించి, పీఆర్సీ ఇవ్వడానికి వీలవుతుంది. అయితే పరిస్థితి చూస్తుంటే, 2029 ఎన్నికల్లోపు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. బకాయిలపైనా మోసమే ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.34,125 కోట్లు ఎప్పుడు ఎంత ఇస్తారో కూడా చెప్పకపోవడాన్ని బట్టి ఉద్యోగులు ఆ విషయంలోనూ మోసపోయినట్లేనని భావిస్తున్నారు. ఈ బకాయిల్లో పోలీసులకు సంబంధించి ఇవ్వాల్సిన రెండు ఎర్న్డ్ లీవుల్లో ఒకటి ఇవ్వడానికి అంగీకరించారు. దాని విలువ రూ.210 కోట్లు. ఆ మొత్తాన్ని రెండు విడతలుగా నవంబర్, డిసెంబర్లో ఇస్తామని చెప్పారు. అంటే రూ.34 వేల కోట్లకుపైగా బకాయిల్లో రూ.210 కోట్ల బకాయిలను జనవరికి విడుదల చేసేందుకు ఒప్పుకున్నారు.మిగిలిన రూ.33,915 కోట్ల బకాయిలు ఎప్పటికి వస్తాయో ఆ దేవుడేకి తెలియాలనేలా పరిస్థితి ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. పోలీసులకు ఇస్తామన్న ఎర్న్డ్ లీవులపైనా చంద్రబాబు ట్విస్ట్ ఇచ్చారు. రెండు ఎర్న్డ్ లీవ్లు ఇవ్వడానికి గతంలోనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒప్పుకున్నారు. గత సంక్రాంతికే వాటిని ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు ఇస్తానన్న రెండింటిలో ఒక దానికి ఎగనామం పెట్టి ఒకటి ఇవ్వడానికి తలూపడంతో పోలీసులు నివ్వెరపోతున్నారు. సీపీఎస్పైనా కప్పదాటు వైఖరి కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్, జీపీఎస్ విధానాలను సమీక్షించి జీపీఎస్ కంటే మెరుగైన అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తెస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబదీ్ధకరిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టం చేయగా చంద్రబాబు దాన్ని తుంగలో తొక్కారు. మరోవైపు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలపై మళ్లీ పాత విధానం తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఆప్కాస్ను ఎత్తివేయడానికి సిద్ధమవుతుండడంతో వారు లబోదిబోమంటున్నారు. సచివాలయాల ఉద్యోగుల ఆవేదన సచివాలయ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమను వాలంటీర్లుగా మార్చి పింఛన్లు, సర్వేలు వంటి పనులు చేయించుకుంటూనే, ఆ వ్యవస్థ పట్ల సీఎం చంద్రబాబు తక్కువగా మాట్లాడటం వారిని బాధిస్తోంది. పరిపాలనా వ్యవస్థను గడపగడపకూ తీసుకెళ్లేందుకు గత జగన్ ప్రభుత్వం ఈ వ్యవస్థ ద్వారా 1.26 లక్షల మందిని నియమించి చక్కటి ఫలితాలు సాధించగా, ప్రస్తుతం తమకు తగిన సౌకర్యాలు కల్పించకపోవడమే కాకుండా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకు దారితీస్తోంది.ఉద్యోగులంటే చంద్రబాబుకు అలుసా..! ఉద్యోగులపై పెడుతున్న వ్యయాన్ని వైఎస్ జగన్ అనవసరంగా పెంచేశారన్న బాధ ముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మనసులో వారి పట్ల వ్యతిరేకతను నింపుకునే ఎన్నికల్లో ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారని, ఇప్పుడు మాత్రం తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.అనుద్పాతక వ్యయం పెరిగిపోతుందని చెబుతున్న ఆయన, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు అలవికాని హామీలు ఎందుకు ఇచ్చారని, తద్వారా వారిని ఎందుకు మోసం చేశారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమకు చంద్రబాబు చేసిన ద్రోహం తీరనిదని, నమ్మించి గొంతు కోయడంలో ఆయన దిట్టన్న విషయం మరోసారి రుజువైందని ఉద్యోగులు వాపోతున్నారు. -
ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు
-
ఉద్యోగులకు బాబు దగా
నేను రాగానే మంచి పీఆర్సీ ఇస్తాను.. ఇంటీరియం రిలీఫ్ (ఐఆర్) ఇస్తాను.. మీకు రావాల్సిన డబ్బులన్నీ వెంటనే ఇచ్చేస్తాను.. తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇస్తాను.. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సమస్య లేకుండా చేస్తాను.. ఎర్న్డ్ లీవ్లు, సరెండర్ లీవ్లు, ఇతరత్రా బకాయిలన్నీ ఇచ్చేస్తాను.. పోలీసులకు కూడా శని, ఆదివారాలు సెలవు ఇస్తాను.. హోం గార్డుల జీతాలు పెంచుతాను. – ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడుఇతర రాష్ట్రాలు ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయి.. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉద్యోగుల జీతాల ఖర్చు ఎక్కువగా ఉంది.. పైగా ఆర్టీసీ ఉద్యోగులను తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపేశారు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల వల్ల అదనపు ఖర్చు వస్తోంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే బాగోలేదు.. ఖర్చులు పెరిగిపోతున్నాయి.. సీపీఎస్ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.. పీఆర్సీకి మరింత వెసులుబాటు కావాలి.. ఉద్యోగులు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. అయినా దీపావళి కానుకగా ఒక్క డీఏను ఇస్తున్నాం. – అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన దీపావళి కానుక తుస్సుమంది. అప్పుడు కాదు ఇప్పుడు అంటూ ఎన్నికలకు ముందు ఊరించి, లెక్కలేనన్ని హామీలు గుప్పించి.. వారితో ఓట్లు వేయించుకుని.. తీరా గద్దెనెక్కాక హామీల సంగతే మరిచారు. నెల కాదు.. రెండు నెలలు కాదు.. ఏకంగా 16 నెలలైనా ఇచ్చిన హామీలకు దిక్కులేదని ఉద్యోగులు రోడ్డెక్కుతుంటే నాలుగు డీఏలకు గాను ఒకే ఒక్క డీఏ ఇస్తామని.. ఇంతకంటే ఎక్కువగా ఆశించవద్దన్నట్లు చెప్పుకొచ్చారు. ఎప్పటిలాగే ఓ వైపు గత ప్రభుత్వంపై నిందలేస్తూ.. మరో వైపు ఉద్యోగుల ఖర్చు తగ్గిస్తానంటూ షాక్ ఇస్తున్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలన్నీ వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు పూర్తి స్థాయిలో వారిని దగా చేశారు. నమ్మించి ఓట్లు వేయించుకుని నిండా ముంచారు. 16 నెలలుగా ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయకుండా కాలం గడుపుతూ చెవిలో పువ్వు పెట్టారు. రూ.31 వేల కోట్ల బకాయిల మాటే ఎత్తక పోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీల్లో కొన్నయినా అమలు చేస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తుంటే ఒకే ఒక్క డీఏతో సరిపెట్టారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతుంటే ఒక్కటి మాత్రమే ఇస్తానని చెబుతూ ఆ ఖర్చు కూడా దండగేనని ఉద్యోగ సంఘాల సమావేశంలోనే చెప్పడం గమనార్హం. ఇతర రాష్ట్రాలు ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయని, తాను కూడా అదే పని చేస్తానని చెప్పడంతో డీఏ ఏమో గానీ, మున్ముందు తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం 27 శాతం ఐఆర్ ప్రకటించారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ తల్లకిందులైనా పీఆర్సీ అమలు చేశారు. కానీ చంద్రబాబు తాను వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తానని చెప్పి ఆ మాటే మరచిపోయారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి గురించి ఆలోచన కూడా చేయలేదు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నిసార్లు అడిగినా వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. వారి ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతుండడం, వేలాది మంది టీచర్లు రోడ్డెక్కి భారీగా ధర్నా చేయడంతో ఉలిక్కిపడ్డారు. ఎలాగోలా వారి ఆందోళనను తగ్గించడానికి తనకు అలవాటైన రీతిలో మభ్యపెట్టే ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే శనివారం ఉద్యోగ సంఘాల నాయకులతో గంటల తరబడి సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లోనే తమకు అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి చెందిన బాకా నాయకుడితో ఈ సమావేశంలో రెండు డీఏలు ఇస్తే చాలని, ఇంకేమీ వద్దని చెప్పించారు. చివరికి కంటి తుడుపుగా ఒక డీఏ ఇస్తానని, ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదంటూ సూక్తులు చెప్పి తప్పించుకున్నారు. అధికారంలోకి వస్తూనే పీఆర్సీ ఇస్తానన్నారుగా.. నిజానికి ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వచ్చీ రావడంతోనే మంచి పీఆర్సీ ఇస్తానని చెప్పి, ఇప్పుడు దాని గురించి తనకు వదిలేయాలని, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తానని చెప్పడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. నిజానికి ఉద్యోగులు పీఆర్సీ సంగతి దేవుడెరుగు కనీసం రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త కమిషనర్ను నియమించాలని కోరుతుంటే ఆ విషయాన్నే పట్టించుకోలేదు. అధికారంలోకి రాగానే చేస్తానని చెప్పిన మాటను ఆయన నీటి మీద రాతగా మార్చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లిస్తామని చెప్పి దానిపైనా నోరు మెదపలేదు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను తాను వచ్చిన 6 నెలల్లో పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని 16 నెలలుగా పట్టించుకోకుండా ఇప్పుడు మరో 6 నెలల్లో చేస్తానని చెప్పడంతో అది జరిగేది కాదేమోనని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ విషయం సుప్రీంకోర్టులో ఉందని అబద్ధం చెబుతూ తప్పించుకుంటున్నారు. చైల్డ్ కేర్ లీవులు 180 వాడుకోవచ్చని చంద్రబాబు చెప్పినా, నిజానికి అది జగన్ హయాంలోనే అమల్లోకి వచ్చింది. తక్కువ రేటుకు ఇంటి స్థలం ఇస్తామని ఇచ్చిన హామీ ఊసే లేకుండా పోయింది. అన్ని ఉద్యోగాలిస్తే ఎలా! తన ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోగా, జగన్ హయాంలో 1.26 లక్షల శాశ్వత ఉద్యోగాలివ్వడాన్ని చంద్రబాబు తప్పు పట్టడం గమనార్హం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా అంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను ఒకేసారి ఇవ్వడాన్ని ఆయన అనవసరమని చెప్పడం చూసి ఉద్యోగులు విస్తుపోతున్నారు. తద్వారా ఉద్యోగుల పట్ల తనకున్న చులకన భావాన్ని సీఎం బయట పెట్టుకున్నారు. సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతగా మేలు జరిగిందో చంద్రబాబు మరచిపోయారని, లేదా ఉద్దేశ పూర్వకంగా ఆ వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని, ప్రైవేటు ఏజెన్సీల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ స్థానంలో ఆప్కాస్ను ప్రవేశ పెట్టడాన్ని కూడా చంద్రబాబు తప్పు పట్టడం పట్ల ఆయా ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వారి వల్ల వేల కోట్ల రూపాయల వ్యయం పెరిగిపోయిందని చెప్పి వారిని కించపరిచారు. ఇంతా చేసి.. ఇప్పుడు మొక్కుబడిగా ఒక డీఎతో దీపావళి కానుక అంటున్న సీఎం మాటలు, వ్యాఖ్యలను బట్టి తమ పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో..చంద్రబాబు 2018 జూలై నుంచి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవ్వలేదు. కనీసం ఐఆర్ కూడా ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లారు. 2019 మేలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే (10 జూన్ 2019) వైఎస్ జగన్ 27 శాతం ఐఆర్ ప్రకటించారు. 2019 జూలై నుంచి వర్తింపచేసి ఆగస్ట్ ఒకటిన కొత్త జీతాలు ఇచ్చారు. తద్వారా 2019 జూలై నాటికి 30 ఏళ్లు సర్వీస్ ఉన్న ఒక ఉద్యోగికి సుమారుగా రూ.64 వేల బేసిక్ ఉంటే 27 శాతం.. అంటే రూ.17,280 అదనంగా జీతంలో కలిసింది. మరో వైపు కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారినా, జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు 2022లో పీఆర్సీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరహాలో వెంటనే ఐఆర్ ప్రకటించి ఉంటే.. 2024 జూలై నాటికి బేసిక్ సుమారు రూ.72 వేలుగా ఉన్న ఉద్యోగికి.. కనీసం 27 శాతం ఐఆర్ ఇచ్చినా ప్రతి నెల రూ.19,440 అదనంగా జీతం వచ్చి ఉండేది. అలా చేయకపోవడంతో ఆ ఉద్యోగి రూ.3 లక్షలకు పైగా నష్టపోయారు.16 నెలలుగా మోసం, దగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని.. మంచి పీఆర్సీ ఇస్తామని.. పెండింగ్ బకాయిలన్నీ ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. ఐఆర్ ప్రకటించలేదు.. ఉన్న పీఆర్సీ కమిషన్ను రద్దుచేసింది.. కొత్త పీఆర్సీ కమిషన్ను ప్రకటించలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం శనివారం చర్చలకు పిలిస్తే.. ఐఆర్ ప్రకటిస్తారని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు ఇస్తారని.. కొత్త పీఆర్సీ కమిషన్ను ప్రకటిస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆశించారు. కానీ, ఒక్క డీఏను మాత్రమే ప్రకటించింది. ఇది ఉద్యోగులను మోసం చేయడమే. తక్షణమే ఐఆర్ ప్రకటించాలి.. నాలుగు డీఏలు ఇవ్వాలి.. పెండింగ్లో ఉన్న బకాయిలు రూ.32 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి. – కాకర్ల వెంకటరామిరెడ్డి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ దాటవేత వైఖరి దారుణం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతున్నా ఒక్కరోజు కూడా ఉద్యోగ సంఘాలను పట్టించుకోని ప్రభుత్వం శనివారం రోజంతా వారితో చర్చలు జరిపి ఒక్క డీఏ మాత్రమే ప్రకటించి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఒక్క డీఏ ఇవ్వడానికి ఇంత హంగామా ఎందుకు? ఐఆర్ ఊసేలేదు. పీఆర్సీపై ప్రభుత్వం దాటవేత వైఖరిని అవలంబించడం దారుణం. – లెక్కల జమాల్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో–చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉసూరుమనిపించారుఉపాధ్యాయ, ఉద్యోగుల్లో ప్రభుత్వం తీవ్ర నిరాశ నింపింది. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినప్పటికీ నాలుగు డీఏలు పెండింగ్లో ఉండగా కేవలం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించారు. 30 శాతం ఐఆర్ ఊసేలేదు. పీఆర్సీ కమిటీ ప్రస్తావన లేదు. కేవలం రూ.160 కోట్లు మాత్రమే విడుదల చేసి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి ఉసూరుమనిపించారు. దీనిని ప్రభుత్వం దీపావళి కానుక అని గొప్పలు చెప్పుకుంటోంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. వైఎస్సార్టీఏ పక్షాన తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. – పి.అశోక్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్టీఏఉద్యోగవర్గం జీర్ణించుకోలేకపోతోందికొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. ఈరోజు ఉద్యోగ, పెన్షనర్ల సంఘ నాయకులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశాలు జరిపి ఒక్క విడత డీఏ మాత్రమే ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, నాలుగు విడతల డీఏ పెండింగ్ ఉంటే ఒకటి మాత్రమే మంజూరు చేయడం, బకాయిలు ఊసే ఎత్తకపోవడాన్ని ఉద్యోగవర్గం జీర్ణించుకోలేకపోతోంది. దీపావళి పండగకు ఇవి తప్పక ఇస్తారని ఎదురుచూశారు. కానీ, ఒక్క డీఏతో తుస్సుమనిపించారు. – నలమారు చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ ఉద్యోగ–పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడుహామీలిచ్చి అన్యాయం అధికారంలోకి రాగానే డీఏ, ఐఆర్, మంచి పీఆర్పీ ఇస్తామని హామీలిచ్చి ఇప్పుడు ఒక్క డీఏ ఇవ్వడం అన్యాయం. సాధారణంగా అయితే ఆరు నెలలకు ఒకసారి డీఏ ఇవ్వాలి. నాలుగు డీఏలు పెండింగ్లో ఉంటే కేవలం ఒక్క డీఏ ఇవ్వడానికి సీఎం స్థాయిలో చర్చలు ఆశ్చర్యం కలిగించాయి. – వి.రెడ్డి శేఖర్రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి ఎందుకింత మోసం ఉద్యోగ, ఉపాధ్యాయులను ఎందుకింత మోసం చేయడం? పీఆర్సీ వేస్తారని ఆశించాం. ప్రభుత్వం దీనిపై నోరు మెదపకపోవడం అన్యాయం. కనీసం రెండు డీఏలైనా ఇస్తారని అనుకున్నాం. కానీ, ఒక్క డీఏ ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఒక్క డీఏ కోసం రెండ్రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో కాలయాపన చేయడం సమంజసం కాదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేయడం దారుణం. మిగిలిన పెండింగ్ ఎరియర్స్ వెంటనే విడుదల చేయాలి. – జీవీ రమణ, రాష్ట్ర కార్యదర్శి. యూటీఎఫ్పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ పెండింగ్ బకాయిలు చెల్లించాలని సమావేశంలో గట్టిగా పట్టుబట్టాం. రెండు డీఏలైనా ఇవ్వాలని అడిగాం. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులవల్ల ఒక్క డీఏ మాత్రమే ఇస్తున్నామని, సర్దుకోవాలని సీఎం చెప్పారు. పీఆర్సీ కమిటీ వేయాలని డిమాండ్ చేశాం. అందుకు కాస్త సమయం పడుతుందని, త్వరలో చర్యలు చేపడతామన్నారు. ఒక్క డీఏ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు చిరు సంతోషమే మిగిలింది. పీఆర్సీ, ఐఆర్పై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. – బాలాజీ, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంబకాయిల గురించీ పట్టదా? 2023 జూలై నుంచి పీఆర్సీ ప్రకటించాల్సి ఉంది. 30 శాతం మధ్యంతర భృతి అందించి ఉద్యోగులను ఆదుకోవాల్సింది పోయి కంటితుడుపు చర్యగా డీఏ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పెండింగ్ బకాయిలు కూడా సత్వరమే చెల్లించాలని ఏడాదిన్నరగా చేస్తున్న డిమాండ్ పట్టించుకోకపోవడం బాధాకరం. – పిసిని వసంతరావు, అధ్యక్షుడు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరాశ దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు తీపికబురు అందిస్తారని అనుకున్నాం. చివరికి ఒక్క డీఏ ప్రకటించి తీవ్ర నిరాశ కలిగించారు. 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించి 12వ పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించి ఉంటే అందరూ ఆనందించే వారు. కానీ ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరిచింది. – తమ్మినేని చందనరావు, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, శ్రీకాకుళంఅందరిలోనూ అసంతృప్తి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ప్రభుత్వ వాగ్దానాల అమలు కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే, 4 డీఏలకు బదులు కేవలం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడంపై అందరిలోనూ అసంతృప్తి ఉంది. పండుగకు కనీసం రెండు డీఏలైనా ఇస్తే బాగుండేది. ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పండగ వేళ సర్కారు ఉసూరుమనిపించింది. – ఏ సుందరయ్య, ఫ్యోప్టో ఛైర్మన్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ వైఖరి దారుణం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో విఫలమైన ప్రభుత్వం నాలుగు డీఏ బకాయిల్లో కేవలం ఒక్కటి మంజూరుచేసి చేతులు దులుపుకోవడం దారుణం. పీఆర్సీ కమిషన్ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం సరికాదు. ఒక్క డీఏ మంజూరు ద్వారా ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. – కె. నరసింహారావు, గుంటూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ -
ఆ ఉతకని కోటు వేసుకుని డిబేట్లలో.. పేర్ని నాని సెటైర్లు
-
సాక్షి పై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలని డిమాండ్
-
Kannababu: కల్తీ మద్యం 99రూ.. ఎకరం భూమి 99పైసలు.. బాబుపై సెటైర్లు
-
మరోసారి చర్చలు.. తాడో పేడో తేలాల్సిందే..
-
Fake Liquor Case: సాక్షి పత్రికపై కూటమి సర్కార్ కుతంత్రం
-
భయపెడితే భయపడే వాడు ఎవడు లేడిక్కడ... YSRCP ఎమ్మెల్సీలు సంచలన కామెంట్స్
-
పచ్చ ఖాకీల తాటాకు చప్పుళ్లకు సాక్షి అదరదు... బెదరదు
-
16 నెలలుగా అమ్మిందంతా నకిలీ మద్యమే..! నిజం ఒప్పుకున్న బాబు సర్కార్
-
సాక్షి గొంతు నొక్కేందుకు మరో ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్: ప్రజల హక్కుల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతున్న ‘సాక్షి’ గొంతుక నొక్కడానికి కూటమి ప్రభుత్వం మరోసారి పోలీసులను ప్రయోగించింది. సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయరెడ్డికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీఎన్ఎస్ఎస్ 179 (1), 94 సెక్షన్ల కింద బుధవారం రెండు వేర్వేరు నోటీసులు జారీ చేశారు. ‘నకిలీ మద్యానికి నలుగురు బలి’ శీర్షికన 2025 అక్టోబర్ 8వ తేదీన సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన వార్తకు సంబంధించి దాఖలైన రెండు అక్రమ కేసుల్లో నెల్లూర్ రూరల్ పోలీస్ స్టేషన్, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు బుధవారం హైదారాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఎడిటర్ ధనంజయరెడ్డికి చెరో రెండు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు కేవలం మూడు రోజుల వ్యవధిలో మూడు సార్లు సాక్షి కార్యాలయానికి రావడాన్ని పరిశీలిస్తే, వారిమీద అధికార పెద్దల ఒత్తిడి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అసమంజస ఆదేశాలు వార్తా కథనానికి సంబంధించి బీఎన్ఎస్ఎస్ 94 సెక్షన్ ప్రకారం పలు డాక్యుమెంట్లు సమర్పించాలని నిర్దేశించారు. వార్తకు సంబంధించి ఎడిటోరియల్ ఫైల్.. ఒరిజనల్ డ్రాఫ్ట్ కాపీ (ప్రింట్ అండ్ డిజిటల్) ఇవ్వాలని కోరారు. దీనితోపాటు వార్తా కథనానికి సంబంధించి ప్రిపరేషన్, ఎడిటింగ్, పబ్లికేషన్లతో సంబంధమున్న రిపోర్టర్లు, కరస్పాండెంట్లు, ఎడిటోరియల్ సిబ్బంది పేర్లు, హోదాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ వార్తా కథనానికి ఆధారాలకు సంబంధించిన మెటీరియల్, నోట్స్, ఫొటోలు, వీడియో ఫుటేజ్, స్టేట్మెంట్లు, ఈ–మెయిల్, మెసేజ్లు వంటి ఇతర ఆధారాలు ఏమున్నా సమర్పించాలని సూచించారు. పబ్లికేషన్ ఆథరైజేషన్ ఆమోదాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించాలని స్పష్టం చేశారు. తద్వారా పత్రిక, మీడియాకు సంబంధించి సోర్స్ బయటకు వెల్లడించాల్సిన పనిలేదని ఆర్నాబ్ గోస్వామి కేసుతోసహా పలు సందర్భాలో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును పోలీసులు పూర్తిగా ఉల్లంఘించారు. కేవలం 12 గంటల గడువు కాగా, పోలీసులకు ఎడిటర్ పూర్తి స్థాయిలో సహకరించినప్పటికీ, ‘‘తాము నిర్దేశించిన సమయంలో అందుబాటులో లేరు’’ అంటూ నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు తాము కోరిన సమాచారాన్ని అంతా కేవలం 12 గంటల లోపు అంటే.. 16వ తేదీన 2:30 గంటలకల్లా హైదరాబాద్ సాక్షి ప్రధాన కార్యాలయంలోకానీ లేదా ఆయా పోలీస్ స్టేషన్లలో కానీ (నెల్లూర్ రూరల్ పోలీస్ స్టేషన్, కలిగిరి పోలీస్ స్టేషన్)లలో సమర్పించాలని స్పష్టం చేశారు. అలాగే ‘‘నిర్దేశించిన సమయంలో అందుబాటులో లేని కారణంగా’’ 16వ తేదీ 10.30 గంటలకు తమ విచారణకు సాక్షి కార్యాలయంలో అందుబాటులో ఉండాలని నెల్లూర్ రూరల్ పోలీసులు 179 (1) నోటీసుల్లో పేర్కొనగా, ఈ సమయాన్ని 2.30 గంటలుగా కలిగిరి పోలీసులు నిర్దేశించడం గమనార్హం.ఈ ప్రశ్నలకు బదులేది?ఒక వార్తా కథనానికి సంబంధించి ఎడిటర్ను సోర్స్ (ఆధారం) వెల్లడించమని పోలీసులు డిమాండ్ చేయడం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కింద పత్రికా స్వేచ్ఛను నేరుగా ఉల్లంఘించడం కాదా?వార్తా కథనానికి సంబంధించి రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లు (నెల్లూరు రూరల్, కలిగిరి) ఒకే రోజున వేర్వేరు నోటీసులు జారీ చేయడం, ద్వంద్వ విచారణ (డబుల్ జియోపార్డీ) లేదా అధికార దురి్వనియోగం కిందకు రాదా?బీఎన్ఎస్ఎస్ 94 కింద డాక్యుమెంట్లు, ఎడిటోరియల్ ఫైళ్లు, రిపోర్టర్ల పేర్లు, ఫోన్ నంబర్లు ఇవ్వమని పోలీసుల ఆదేశం పత్రికా స్వేచ్ఛను అణిచివేసే చర్య కాదా?ఉన్నత న్యాయస్థానాలు పలు తీర్పుల్లో పత్రికా సోర్స్ను వెల్లడించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినప్పటికీ, ఏపీ పోలీసుల చర్య ఆ తీర్పులను తుంగలోతొక్కడం కాదా?కేవలం 12 గంటల గడువులో ‘అంతా సమర్పించాలని’ అంటూ డిమాండ్ చేయడం, సహజ న్యాయ సూత్రమైన ‘సమంజస సమయం ఇవ్వాలి’ అనే నిబంధనను ఉల్లంఘించడం కాదా?సాక్షి పత్రికలో ప్రచురితమైన వార్త ప్రజా ప్రయోజనాలతో ముడిపడి, ప్రజా అవగాహన కోసం ప్రచురితమైనది కాబట్టి, దానిని ఆధారంగా తీసుకుని కేసులు నమోదు చేయడం ప్రజా ప్రయోజన జర్నలిజాన్ని అణిచివేయడం కదా?ఈ చర్య మొత్తం జర్నలిస్టుల స్వేచ్ఛను హరించి భయపెట్టి, లొంగదీసుకునే చర్యగా ఎందుకు పరిగణించకూడదు?ఇది.. మీడియాపై టెర్రరిజం మీడియాను టెర్రరైజ్ చేసే ధోరణులు ప్రజాస్వామ్యంలోని వ్యక్తులందరూ ఖండించాలి. పత్రికా ఎడిటర్లు, విలేకర్లపై పోలీసులుపదేపదే కేసులు నమోదు చేయడాన్ని మీడియాపై టెర్రరిజంగానే పరిగణించాలి. ప్రచురితమైన వార్తకు సంబంధించి సమాచారం పేరిట పత్రికా కార్యాలయానికి నోటీసు ఇవ్వడం తగదు. – జి.ఆంజనేయులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ఇది. ఎడిటర్లు, విలేకర్లను భయభ్రాంతులకు గురి చేసి పత్రికా వ్యవస్థను భయపెట్టాలనే ఆలోచన తప్పు. ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని ఇప్పటికైనా మానుకోవాలి. పత్రికా కార్యాలయాలపైకి పోలీసులు పంపించడం సరికాదు. – శ్రీరాం యాదవ్, ఏపీ మీడియా ప్రొఫెషనల్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాక్షి మీడియాపై దాడి హేయం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై దాడి హేయం. నకిలీ మద్యంలో ప్రభుత్వం ప్రజలకు ఎదుట దోషిలా నిలబడింది. వాస్తవాలను ఎత్తి చూపుతున్న ‘సాక్షి’పై కేసులు పెట్టి అడ్డుకోవాలని చూస్తోంది. ఎడిటర్పై కేసు పెట్టి నోటీసులతో పత్రికా కార్యాలయానికి వెళ్లడం ప్రజాస్వామ్యం దాడిగానే పరిగణించాలి. – ధారా గోపీ, సీనియర్ జర్నలిస్టు మీడియాపై రాజకీయ కక్షలు సరికాదు మీడియాపై రాజకీయ కక్షలు తగవు. సాక్షిలో ప్రభుత్వ వైఫల్యాలపై కథనాలు వచ్చినంత మాత్రాన పత్రిక కార్యాలయాలపై పోలీసులు దాడులు చేయడం, ఎడిటర్ను బెదిరించడం, కార్యాలయంలో సోదాలు నిర్వహించడం సరికాదు. మీడియాపై అధికారుల దాడులు, ఒత్తిళ్లు, వేధింపులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తుంది. – కె.స్వాతిప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీయూడబ్ల్యూజే -
అధికారంలోకి రాగానే 'క్యూఆర్ కోడ్ స్కాన్ ఉష్'
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వ నకిలీ మద్యం బండారం అధికారికంగా బట్టబయలైంది. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం నాణ్యతపై ఎటువంటి భరోసా లేదని తేటతెల్లమైంది. మద్యం సీసాలపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయకుండానే ఇన్నాళ్లూ విక్రయాలు సాగించినట్టు ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. ఏడాదిన్నరలో వేల కోట్ల రూపాయల మద్యం విక్రయించడం ద్వారా నకిలీ మద్యం అమ్మకాలకు రాచబాట పరిచిందనీ స్పష్టమైంది. తీరా నకిలీ బాగోతం బట్టబయలు కావడం.. ప్రభుత్వ ముఖ్య నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతుండటం.. అన్ని వేళ్లూ టీడీపీ వైపే చూపుతుండటంతో గత్యంతరం లేక.. గత ప్రభుత్వంలో అమలైన తరహాలో బాటిల్పై ఉన్న క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి విక్రయించే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తద్వారా నకిలీ మద్యం దందాను కప్పిపుచ్చేందుకు పన్నాగం పన్నింది. అయితే క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేయకపోతే ఏం చేస్తారనే విషయమై స్పష్టత లేదు. అలాగే వీధి వీధిన ఏర్పాటైన బెల్ట్ షాపుల్లో ఈ విధానాన్ని ఏ విధంగా అమలు చేస్తుందనే విషయాన్ని వెల్లడించ లేదు. తద్వారా బెల్ట్ షాపుల ద్వారా ఈ రాకెట్ నడుపుకోవచ్చనే సంకేతాలు ఇస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాదిన్నరగా విక్రయించిన మద్యంలో ఎంత మేర నకిలీ ఉందోనని ఇన్నాళ్లూ తాగిన వారు ఆందోళన చెందుతున్నారు.గత ప్రభుత్వ హయాంలోనే క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానం దశల వారీ మద్య నియంత్రణ, నాణ్యమైన మద్యం అమ్మకాల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశ పెట్టింది. అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి మద్యం సీసాపై ఉన్న క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు.. మద్యానికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడవుతుంది. అది ప్రభుత్వం అధికారికంగా ఆమోదించి సరఫరా చేస్తున్న నాణ్యమైన మద్యమేనా.. మద్యం ఏ డిస్టిలరీలో తయారైంది.. ఎప్పుడు తయారైంది..బ్యాచ్ నంబరు..ఇలాంటి వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. తద్వారా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మద్యం ఉండేలా పటిష్ట విధానాన్ని అమలులోకి తెచ్చింది. మద్యం నకిలీ/కల్తీ చేసేందుకు అవకాశం లేకుండా కట్టడి చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 వరకు ఈ విధానాన్ని పటిష్టంగా నిర్వహించింది. అప్పట్లో ప్రతి ప్రభుత్వ మద్యం దుకాణంలో వినియోగదారులకు వారి ముందే బాటిల్ను క్యూర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే విక్రయించే వారు. 2024లో రాష్టంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తొలగించింది. ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే ఆ విధానం అమలును నిలిపి వేసింది. అపై టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది. క్యూఆర్ కోడ్ స్కాన్ అమలు చేయాలని ఇప్పుడు ఉత్తర్వులు రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా దోపిడీ బయట పడటంతో కూటమి ప్రభుత్వ బాగోతం బట్టబయలైంది. దాంతో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు హడావుడిగా బుధవారం ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సీసాలపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 45 రోజుల్లో ఈ విధానం అమలు చేసేలా రాష్ట్రంలోని 3,336 వైన్ షాపుల్లో, 540 బార్లలో, (త్వరలో రానున్న మరో 300 బార్లలో కూడా) ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అంటే ఏడాదిన్నరపాటు క్యూ ఆర్ కోడ్ స్కాన్ లేకుండానే సాగిన మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు సమ్మతించినట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. సర్కారు రెండు నాల్కల విధానంపై విస్తుపోతున్నారు.నకిలీ మద్యానికి రాచబాటేటీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ లేకుండానే మద్యం విక్రయాలు సాగించింది. ఏడాదిన్నరగా వేల కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ లేకుండానే ఇంత భారీగా మద్యాన్ని విక్రయించినట్టు ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో కేవలం టీడీపీ సిండికేట్ దుకాణాల ద్వారా నకిలీ మద్యం విక్రయాలను అడ్డూ అదుపు లేకుండా చేసేందుకే క్యూ ఆర్ కోడ్ స్కాన్ను తొలగించారని ఎక్సైజ్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం రాకెట్ బయట పడటం గమనార్హం. ఏడాదిన్నరలో విక్రయించిన మద్యంలో నకిలీ ఎంత ఉంటుందన్నది అంచనాలకు అందడం లేదు.ఇదీ సంగతి! ⇒ క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానం అమలు చేయాలని ఇప్పుడు చెప్పడం ద్వారా ఏడాదిన్నరగా రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలు జరిగాయన్నది ప్రభుత్వమే ఒప్పుకుంది. ⇒ రాష్ట్రంలోని మద్యం షాపుల్లో ఏడాదిన్నరగా క్యూ ఆర్ కోడ్ స్కాన్ అన్నదే లేదని తేల్చింది. ⇒ ప్రస్తుతం మద్యం షాపులన్నీ ప్రైవేట్ సిండికేట్ పరిధిలో ఉన్నాయి. వాటిలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని అమలు చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? ⇒ ఊరూరా.. వీధి వీధిన ఉన్న బెల్ట్ షాపుల్లో క్యూ ఆర్ కోడ్ స్కాన్ను ఎలా అమలు చేయిస్తుంది? ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పారదర్శకంగా నాణ్యమైన మద్యం విక్రయాలు జరిగాయని ఒప్పుకున్నట్టే. -
‘సాక్షి’పై కుతంత్రం
సాక్షి, అమరావతి: టీడీపీ సిండికేట్ నకిలీ మద్యం దోపిడీని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పోలీసు జులుంతో బరి తెగిస్తోంది! రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు తెగబడుతోంది. నకిలీ మద్యం దారుణాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధింపు చర్యలకు తెగిస్తోంది. మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మద్యం మాఫియాపై పోరాడుతున్న ‘సాక్షి’పై అధికార మదంతో విరుచుకుపడుతోంది. నకిలీ మద్యం రాకెట్ దారుణాలను వెలుగులోకి తేకుండా కట్టడి చేయాలనే పన్నాగంతో బరితెగిస్తోంది. ఆర్టికల్ 19 (1) కింద రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కులను పాశవికంగా కాలరాస్తూ కుతంత్రాలకు తెగబడుతోంది. హైదరాబాద్లోని సాక్షి పత్రిక ప్రధాన కార్యాలయంలో ఏపీ పోలీసులు బుధవారం దాదాపు 10 గంటలపాటు హల్చల్ చేయడం... ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిని విచారణ పేరుతో వేధించడం ప్రభుత్వ కుతంత్రానికి తార్కాణం. ఇక ఎస్సీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్చార్జిని కూడా వారం రోజులుగా వేధిస్తుండటం సర్కారు కుట్రలను బహిర్గతం చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దోపిడీని బట్టబయలు చేస్తున్న ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం సాగిస్తున్న కుట్రలు ఇలా ఉన్నాయి. నకిలీ మద్యం దారుణాలను బట్టబయలు చేస్తున్నందునే... రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా సాక్షి మీడియా పోరాడుతోంది. అమాయక ప్రజల ప్రాణాలకు పెనుముప్పు కలిగిస్తున్న నకిలీ మద్యం బాగోతాన్ని పూర్తి ఆధారాలతో వెలుగులోకి తెస్తూ ప్రజలను చైతన్య పరుస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తాజాగా అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం మాఫియా దారుణాలను సవివరంగా వెల్లడించింది. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ హక్కుతో ‘సాక్షి’ బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. నకిలీ మద్యం తాగిన అనంతరం సందేహాస్పద రీతిలో నలుగురు మృతి చెందడం రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆ వాస్తవాన్ని సాక్షి పత్రిక ప్రచురించటాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు సహించలేకపోయారు. నకిలీ మద్యం దందాను అరికట్టడంపై కాకుండా.. వాటిని వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు తెగబడ్డారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్, కలిగిరి, పల్నాడు జిల్లా నరసరావుపేటలో అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పత్రికలు ప్రచురించే కథనాలపై ఏదైనా అభ్యంతరం ఉంటే అధికారికంగా వివరణ (రిజాయిండర్) పంపించవచ్చు. ఇంకా కావాలనుకుంటే పరువు నష్టం దావా వేయవచ్చు. అందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. దీనిపై న్యాయస్థానం తుది తీర్పును వెల్లడిస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగపరమైన నిబంధనలను పాటించాలన్న ఆలోచనే లేనట్లుగా కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సాక్షిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఐదు రోజులుగా వేధింపులు.. అనంతరం ప్రభుత్వం పోలీసులను నేరుగా రంగంలోకి దింపింది. ఈ క్రమంలో పోలీసులు ఐదు రోజులుగా నోటీసుల పేరుతో సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఎస్సీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్చార్జ్ను వేధిస్తున్నారు. ఈ నెల 12న తెల్లవారుజామునే విజయవాడ ఆటోనగర్లోని సాక్షి కార్యాలయానికి పోలీసులు చేరుకుని హడావుడి చేశారు. కార్యాలయం తాళాలు తెరవకముందే అక్కడకు వచ్చి నోటీసులు తీసుకోవాలని సిబ్బందిని వేధించారు. ఎడిటర్ హైదరాబాద్ కార్యాలయంలో ఉంటారని చెప్పినా వినిపించుకోకుండా సంబంధం లేని ప్రశ్నలతో బెదిరించేందుకు యత్నించారు. ఇక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్చార్జ్ మస్తాన్రెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు భయానక వాతావరణం సృష్టించారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు నెల్లూరు రూరల్ పోలీసులు, రాత్రి 8.30 గంటలకు కలిగిరి పోలీసులు వెళ్లి నోటీసుల పేరుతో హడావుడి చేశారు. అంతేకాదు.. 12వ తేదీ తెల్లవారు జామునే మరోసారి ఆయన నివాసంలో సోదాల పేరుతో పోలీసులు హంగామా చేశారు. వెంటనే విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాలని ఒత్తిడి చేశారు. ఆరోగ్య సమస్యలతో డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు పది రోజుల సమయం కావాలని ఆయన కోరారు. సరేనని వెళ్లిన పోలీసులు మళ్లీ అదే రోజు అర్ధరాత్రి మళ్లీ మస్తాన్రెడ్డి నివాసానికి రావడం గమనార్హం. రాత్రి 11.15 గంటలకు నెల్లూరు రూరల్ పోలీసులు, అర్ధరాత్రి 1.20 గంటలకు కలిగిరి పోలీసులు ఆయన నివాసానికి వచ్చి రాద్ధాంతం చేశారు. పది రోజుల సమయం ఇవ్వడం కుదరదని.. మర్నాడే అంటే 13వతేదీ ఉదయమే విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు. 13న ఉదయం 10.30 నుంచి 2.30 గంటల వరకు నెల్లూరు రూరల్ పోలీసులు ఆయన్ను విచారించారు. ఏమాత్రం సంబంధం లేని 62 ప్రశ్నలు అడిగారు. ఇక సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కలిగిరి పోలీసులు విచారించారు. 67 ప్రశ్నలు అడగటం గమనార్హం. అంతటితో పోలీసులు శాంతించలేదు. ఈ నెల 17న మళ్లీ విచారణకు రావాలని బుధవారం సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల కుట్రే.. పోలీస్ బాస్ల పర్యవేక్షణ సాక్షి పత్రిక, ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసుల కుట్రను ప్రభుత్వ పెద్దలే నడిపిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఉన్నత స్థాయి ఆదేశాలు, ఒత్తిడితోనే పోలీసులు ఐదు రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో సోదాలు, విచారణకు వచి్చన పోలీసులకు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఏకంగా 30 సార్లు ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. అంటే పోలీసు వేధింపులను ఉన్నత స్థాయిలో ఎంత నిశితంగా పర్యవేక్షిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. అంటే సాక్షి పత్రిక, ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసుల కుట్ర అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే సాగుతోందన్నది తేటతెల్లమవుతోంది.హైదరాబాద్ కార్యాలయంలో పోలీసుల హల్చల్... మరోవైపు హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడి చేసినంత పని చేశారు. ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి వాట్సాప్లో ముందుగా నోటీసులు పంపారు. అసలు వాట్సాప్లో నోటీసులు పంపవద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా, దాన్ని నిర్భీతిగా ఉల్లంఘించి మరీ వాట్సాప్లో నోటీసులు పంపించారు. నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసులు బుధవారం హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కార్యాలయంలో హడావుడి చేసి పాత్రికేయులను బెదిరించే రీతిలో వ్యవహరించారు. అంటే సాక్షి పత్రిక గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ఎంత కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బుధవారం నోటీసుల జారీ, విచారణ పేరుతో సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిని వేధించారు. ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించి అన్ని ఆధారాలు ఇవ్వాలని, న్యూస్ సోర్స్ చెప్పాలని, మరింత సమాచారం కోసం రేపు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. 12 గంటల సమయం ఇచ్చి రేపు హాజరు కావాలన్నారు. పోలీసుల ప్రశ్నావళికి సమాధానం చెప్పేందుకు పది రోజుల సమయం కావాలని ఎడిటర్ ధనంజయరెడ్డి వారితో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో విచారణకు వచ్చేందుకు ఈ నెల 29 వరకు గడువు కోరారు. కేసుల నమోదు పద్ధతి కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి పత్రిక ఎడిటర్పై వరుసగా కేసులు నమోదుచేయడం ఆక్షేపణీయం. ఏదైనా వార్త, కథనంలో తప్పున్నట్లైతే అందుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని, లేదా ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలి. కానీ, ఎడిటర్ను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదుచేయడం పద్ధతికాదు. – తెలకపల్లి రవి, సీనియర్ సంపాదకులు పత్రికా స్వేచ్ఛను హరించడమే.. పత్రికలో ఒక వార్త ప్రచురిస్తే ఆ వార్తకు సంబంధించి ‘న్యూస్ సోర్స్’ను వెల్లడించాలని పోలీసులు బలవంతం చేయలేరు. ఎడిటర్ ధనంజయ్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వరుసగా కేసులు నమోదుచేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. – డాక్టర్ పి. విజయబాబు, సీనియర్ సంపాదకులు ఈ సంస్కృతి మంచిది కాదు పత్రికలో కానీ.. ప్రసార మాధ్యమాల్లో కానీ ఏవైనా వార్తలు ప్రచురించినప్పుడు... వారి మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే కౌంటర్ వివరణ ఇవాలి. న్యాయపోరాటం చేయాలి. అంతేగానీ ఇలా బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదు. గతంలో ఇలాంటి సంస్కృతి లేదు. – గంట్ల శ్రీనుబాబు, జాతీయ జర్నలిస్టుల సంఘం (ఎన్ఏజె) కార్యదర్శి దాడులు సిగ్గుచేటు హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం కావడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడం అత్యంత దుర్మార్గం, సిగ్గుచేటు. – అంజిరెడ్డి, వైఎస్సార్సీపీ ఇంటలెక్చువల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా కలంపై జులుం తగదు.. పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కలి్పంచిన హక్కు. సాక్షి కార్యాలయాలపై దాడులు, ఎడిటర్పై కేసులు అప్రజాస్వామికం. వీటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి దాడులను అన్ని ప్రజా సంఘాలు, జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కలంపై జులుం తగదు. – ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్, సీనియర్ జర్నలిస్ట్, కలింగవార్త ఎడిటర్, రాజాం అప్రజాస్వామికం ప్రభుత్వ విధానాలపై వార్తలు రాస్తున్నారనే అక్కసుతో సాక్షి మీడియాపై పోలీసులతో సోదాలు, దాడులు చేయించడం అప్రజాస్వామికం. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రతిపక్ష పార్టీలు, సమాచార మాధ్యమాలు గొంతుకను వినిపించే హక్కు లేకుండా చేయాలని చూడటం నియంత పాలనే. – జి.శాంతమూర్తి, ఇండియన్ ఇంటిలెక్చ్యువల్ ఫోరం వ్యవస్థాపకుడు, గుంటూరు -
చంద్రబాబు సర్కారు దుర్మార్గాలను సమర్ధంగా ఎదుర్కోవాలి: సజ్జల
-
సైబర్ టవర్స్ శంకుస్థాపన చేసింది ఎవరు.. చంద్రబాబు బండారం మొత్తం బయటపెట్టిన మార్గాని
-
కోనసీమ లంక గ్రామాలను ముంచెత్తుతున్న ఉగ్ర గోదావరి
-
Jogi: ఇవిగో నా రెండు ఫోన్లు.. నా భార్య బిడ్డలపై ప్రమాణం చేసి చెప్తున్నా
-
తిరుపతిలో YSRCP శ్రేణుల ధర్నా
-
Abhinay: ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా పోరాటం ఆపేది లేదు
-
బాబుపై చురకలు.. జగన్ పై పరోక్ష ప్రశంసలు
-
గజదొంగ చంద్రబాబు కరణం ధర్మశ్రీ నాన్ స్టాప్ సెటైర్లు
-
పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మద్యం దుకాణాలు నడుపుతున్నారు: వైఎస్ జగన్
-
పవన్ ప్రశ్నలు బాబు కవరింగ్
-
నీ వల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగం లేదు బాబుని ఏకిపారేసిన రాచమల్లు..
-
Chittoor District : బాధితుడు దినేష్ సెల్ఫీ వీడియో వైరల్
-
అడ్డంగా దొరికిన టీడీపీ.. నకిలీ మద్యం కేసులో బలవంతపు వీడియో డ్రామా!
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసులో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్ వీడియోతో మళ్లీ అడ్డంగా దొరికిపోయింది. వైఎస్సార్సీపీపై బురదజల్లాలని ప్రయత్నించి బుక్కైంది. జోగి రమేష్ను ఇరికించేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది.నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధన్రావు పోలీసుల అదుపులో ఉండగా.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోను ఎల్లోమీడియా ద్వారా టీడీపీ బయటకు వదిలింది. అరెస్టయినప్పుడు ఉన్న దుస్తులతోనే బలవంతంగా జనార్ధన్రావుతో వీడియో రికార్డింగ్ చేయించింది. ఆపై జనార్ధన్రావుతో జోగి రమేష్ పేరు చెప్పించింది.జోగి రమేష్ చెబితేనే చేశానంటూ బలవంతపు స్టేట్మెంట్ ఇప్పిచ్చింది. అయితే,పోలీసుల అదుపులో ఉన్న జనార్ధన్ వీడియో రికార్డ్ ఎవరు చేశారనే దానిపై అనుమానాలు వ్యక్తం కాగా.. దారి తప్పిన కల్తీ మద్యం కేసు విచారణకు నిదర్శనంగా జనార్ధన్ వీడియో నిలిచింది. నకిలీ మద్యం రాకెట్లో టీడీపీ నేతలను కాపాడేందుకు ప్రభుత్వం బరితెగించింది.. నకిలీ మద్యం కేసులో కొత్త డ్రామాకు తెరతీయడం చర్చకు దారితీస్తోంది.నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్ధరావు అరెస్టు అనంతరం, పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు జోగి రమేష్ పేరు ప్రస్తావించలేదు. కావాలని ఇరికించేందుకు కూటమి సర్కార్ కొత్త కథలు అల్లుతోంది. అందుకు నిదర్శనంగా జనార్ధన్రావు దగ్గర ఫోన్ లేనప్పుడు వీడియో ఎవరు రికార్డ్ చేశారు? రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు ఈ వీడియోను ప్రస్తావించలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. -
విజయవాడ ధర్నా చౌక్ లో విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా
-
నారా నకిలీ మద్యంపై YSRCP ఉద్యమం
-
YSRCP రణభేరి కూటమిలో భయం.. భయం
-
‘సాక్షి’పై సర్కారు కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: ప్రజాకంటక పాలనను నిగ్గదీస్తూ.. మోసాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న ‘సాక్షి’ మీడియాపై ఏపీలోని కూటమి సర్కారు అణచివేత చర్యలకు పాల్పడుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని కల్తీ మద్యం పట్టి పీడిస్తున్నా, అమాయకుల ప్రాణాలను హరిస్తున్నా, చోద్యం చూస్తున్న సర్కారు.. క్షేత్రస్థాయి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’పై అక్రమ కేసులు బనాయించి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పిట్టల్లా రాలిపోతున్న ప్రజల ప్రాణాలకు రక్షణ ఏదని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేపోతోంది. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు.. ఎడిటర్కు నోటీసుల పేరుతో విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల దాషీ్టకానికి దిగారు. నకిలీ మద్యం దారుణాలను కప్పిపుచ్చేందుకే సాక్షి ఎడిటర్, విలేకరులపై కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోంది. ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమే కాకుండా ఘోర పాలనా వైఫల్యాలపై ప్రజల పక్షాన, ప్రజా గొంతుకగా నిలదీస్తున్న సాక్షిపై అక్రమ కేసులతో దాడికి తెగబడుతోంది. అధికార పీఠం ఎక్కింది మొదలు పోలీసులను ఉసిగొల్పుతూ.. యథేచ్ఛగా అక్రమ కేసులు బనాయిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ప్రతికా స్వేచ్ఛ.. భావ ప్రకటన స్వేచ్ఛకు అర్థాన్ని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ కక్షసాధింపులకు బరితెగిస్తోంది. ప్రాథమిక హక్కులకు సైతం సంకెళ్లు వేసిన ఎమర్జెన్సీ నాటి దురాగతాలను తలదన్నేలా వ్యవహరిస్తోంది. దేశాన్ని కుదిపివేసిన నకిలీ మద్యం.. – సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసుల అరాచకం ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం బాగోతం బయటపడటం.. అధికార టీడీపీకి చెందిన, అందులోనూ ముఖ్యనేతతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులే సూత్రధారులని బహిర్గతం కావడం యావత్తు దేశాన్ని కుదిపి వేసింది. ఈ ఘటనపై నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తూ కథనాలు ప్రచురిస్తున్న సాక్షిని ఎలాగైనా అడ్డుకోవాలనే దుర్బుద్ధితో టీడీపీ కూటమి సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, నెల్లూరు జిల్లా విలేకరులపై నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్లో బనాయించిన అక్రమ కేసులే ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. అక్రమ కేసును అడ్డుపెట్టుకుని ఆదివారం తెల్లవారకముందే విజయవాడ ఆటోనగర్లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్చల్ చేశారు. గేట్లు తెరవకముందే తెల్లవారుజాము 5 గంటల నుంచి 9 గంటల వరకు అరాచకం సృష్టించారు. విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు సోదాల పేరిట ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడి.. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో అక్రమ కేసు నమోదు చేసిన వెంటనే నోటీసుల పేరుతో సాక్షి కార్యాలయాల్లో పోలీసులు దాడికి తెగబడ్డారు. విజయవాడ ఆటోనగర్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో వీరంగం వేశారు. కార్యాలయం తాళాలు కూడా తెరవక ముందే నోటీసులు తీసుకోవాలంటూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇక కలిగిరిలో మరో అక్రమ కేసు పెట్టడమే కాకుండా సోదాల పేరిట ఏకంగా విలేకరుల ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడి భయభ్రాంతులకు గురి చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాల్సిన పోలీసులు.. దీనిపై కథనాలు రాసిన విలేకరులకు నోటీసులు ఇవ్వడం కూటమి సర్కారు కక్షసాధింపులకు పరాకాష్టగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా నోటీసులు ఇస్తూ.. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోంది. ఆది నుంచి ‘సాక్షి’ ఒక్కటే టార్గెట్.. ప్రజల పక్షాన గొంతుకగా నిలుస్తున్న సాక్షిపై చంద్రబాబు ప్రభుత్వం ఆది నుంచి అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసులను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ప్రజాస్వామ్య హక్కులు, విలువలను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారి ఎక్కడో చోట.. సంబంధం లేని వ్యక్తులతోనూ ఫిర్యాదు చేయించి సాక్షిపైకి పోలీసులను ఉసిగొల్పుతోంది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో– అత్యంత ప్రధానమైన ఆరి్టకల్ 19 (1) (ఏ) ప్రకారం దక్కిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ.. పత్రికా స్వేచ్ఛపై దాడికి తెగబడుతూ దుస్సాహసానికి పాల్పడుతోంది. ఈ అక్రమ కేసులను న్యాయస్థానాలు తప్పుబడుతున్నా చంద్రబాబు సర్కారు తీరు మాత్రం మారట్లేదు. పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో భావ ప్రకటన విషయంలో అందే ఫిర్యాదులకు సంబంధించి కేసుల నమోదు విషయంలో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసు శాఖతోపాటు జిల్లా మేజి్రస్టేట్లకు హైకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయినప్పటికీ రాష్ట్ర పోలీసు శాఖ మాత్రం టీడీపీ పెద్దలకు జీహుజూర్ అనడానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్న ‘‘సాక్షి’’ని అక్రమ కేసులతో వేధించడమే విధానంగా మార్చుకున్నారు. మస్తాన్రెడ్డికి నోటీసులు అందజేస్తున్న పోలీసులు నెల్లూరు బ్యూరో ఇన్చార్జీకి అర్థరాత్రి పోలీసుల నోటీసుఎక్సైజ్ అధికారులతో వరుసగా వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు ఇప్పిస్తూ.. పాత్రికేయులను టెర్రరిస్టుల మాదిరిగా చిత్రీకరిస్తూ, చంద్రబాబు సర్కారు అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తోంది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్చార్జీ చిలకా మస్తాన్రెడ్డికి తాజాగా పోలీసులు అర్థరాత్రి సమయంలో ఆయన ఇంటికి చేరుకుని నోటీసులు ఇచ్చారు. అయ్యప్పమాల ధారణలో ఉన్న ఆయన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ పొద్దున్నే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. జర్నలిస్టుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తూ అర్థరాత్రి సమయంలో ఓ జర్నలిస్టు ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. ఇదేం ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలు చెప్పడం కూడా తప్పేనా? ఇదేం ప్రజాస్వామ్యం? సాక్షి పత్రికపై ఎందుకు అంత క్షకపూరితంగా దాడులు చేస్తున్నారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. – విశ్వసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే సుపరిపాలన అందిస్తే భయమెందుకు? సాక్షి మీడియా, ఎడిటర్, రిపోర్టర్లపై అక్రమ కేసులు పెడుతున్నారంటేనే మీరు ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది. మీరు సుపరిపాలన అందిస్తే మీడియాను చూసి భయపడాల్సిన అవసరం ఏముంది చంద్రబాబూ? – బుర్రా మధుసూదన రావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జీ -
నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..?
సాక్షి, అమరావతి: యావజ్జీవ ఖైదీకి క్షమాభిక్ష నుంచి... తంబళ్లపల్లె టీడీపీ టికెట్ జయచంద్రారెడ్డికి ఇవ్వడం వరకు... ఏ1 జనార్దనరావు అత్యంత ధీమాగా రాష్ట్రానికి తిరిగిరావడం దాక.. నకిలీ మద్యం కేసులో అనేక ప్రశ్నలు...! వీటికి సమాధానాలు వెదుక్కుంటూ పోతే... కీలక నిందితుడు, టీడీపీ నేత సురేంద్రనాయుడుకు ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు బయటపడుతున్నాయి... జంట హత్యల కేసులో 2014 తర్వాత ఆయనకు జీవిత ఖైదు నుంచి క్షమాభిక్ష దక్కిన విషయం విస్తుగొలుపుతోంది... 2024 ఎన్నికల్లో సీనియర్లను కాదని మరీ తంబళ్లపల్లె టీడీపీ టికెట్ను జయచంద్రారెడ్డికి ఇప్పించింది కూడా సురేంద్రనాయుడే అనే స్పష్టం అవుతోంది. ఇంత లోతైన సంబంధాలు ఉన్నందునే... నకిలీ మద్యం వ్యవహారం కుదిపేస్తున్నా... జయచంద్రారెడ్డిపై టీడీపీ నుంచి తూతూమంత్రం సస్పెన్షన్ తప్ప ఇప్పటివరకు అరెస్టు చేయలేదని స్పష్టమవుతోంది. వెరసి ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం డీల్ డొంక కదులుతోంది. ...రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నకిలీ మద్యం మాఫియా దందాలో అన్ని వేళ్లూ ముఖ్యనేతవైపే చూపిస్తున్నాయి. భారీ దోపిడీకి తెగించిన ఈ ముఠాలో పాత్రధారులు జయచంద్రారెడ్డి, టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడులు ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులన్నది బహిరంగ రహస్యం. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం రాకెట్లో జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడుతో ముఖ్యనేతకు ఉన్న ‘క్షమాభిక్ష’ బంధం వారి బాగోతం బయటపెడుతోంది. మొత్తం నకిలీ లిక్కర్ మాఫియాకే అది పునాదిగా నిలిచింది. ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లు దోపిడీకి పక్కాగా పన్నిన పన్నాగం అమలులో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు నకిలీ మద్యం మాఫియాను వ్యవస్థీకృతం చేసేంతగా ఎదిగింది. ఆఫ్రికాలో డిస్టిలరీల... అవే పునాదిగా తనకు ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నట్లు జయచంద్రారెడ్డి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఎన్నికల నాటికే నకిలీ మద్యం దందాకు బీజం పడినట్లు స్పష్టమవుతోంది. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దోపిడీ డీల్తోనే ముఖ్య నేత నుంచి సురేంద్రనాయుడి ద్వారా టీడీపీ టికెట్ పొందినట్లు అర్థమవుతోంది. ఇక వీరు కూటమి అధికారంలోకి రాగానే ముఖ్య నేత పూర్తి అండతో మాఫియాను వ్యవస్థీకృతం చేశారు. జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్రెడ్డి, సురేంద్రనాయుడు, అద్దేపల్లి జనార్దన్రావు తదితరులు ముఠా కట్టి తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు నుంచి మొదలు రాష్ట్రస్థాయిలో నకిలీ మద్యం నెట్వర్క్ ఏర్పాటు చేశారు. అసలు మద్యం ఏదో నకిలీది ఏదో తెలియని స్థాయిలో నకిలీ మద్యం తయారు చేసి పేదలు, మధ్య తరగతి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 2024: ఆఫ్రికా నకిలీ మద్యం డీల్... జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ ముఖ్య నేత ఇచ్చిన క్షమాభిక్షతో దర్జాగా బయటకు వచ్చిన సురేంద్రనాయుడు ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాల్లో టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పారీ్టలో ఆయన చెప్పిందే చెల్లింది. ఈ ప్రభావం ఏస్థాయికి చేరిందంటే 2024 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్కుమార్రెడ్డి, శంకర్యాదవ్ను పక్కనపెట్టి మరీ జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఇప్పించేవరకు వెళ్లింది. తర్వాత జయచంద్రారెడ్డి, గిరిధర్రెడ్డి, తమ అత్యంత సన్నిహితుడు అద్దేపల్లి జనార్దన్తో జట్టు కట్టి ముఖ్యనేతతో ఆఫ్రికా మోడల్నకిలీ మద్యం డీల్ను కుదిర్చారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం మాఫియాను వ్యవస్థీకృతం చేయడం ఐదేళ్లపాటు భారీ దోపిడీకి తెగబడటం... ఇదీ డీల్. నాడు సిండికేట్ దోపిడీ.. నేడు నకిలీ దందా 2014–19లో టీడీపీ ప్రభుత్వం ఉండగా మద్యం సిండికేట్ ద్వారా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. 2024–29లో ఏకంగా నకిలీ మద్యాన్ని అధికారికంగా విక్రయించి అంతకుమించి భారీ దోపిడీకి ముఖ్యనేతలు పన్నాగం పన్నారు. అందుకే సురేంద్రనాయుడు చెప్పినట్టు జయచంద్రారెడ్డికి తొలి జాబితాలోనే తంబళ్లపల్లె టికెట్ కేటాయించారు. గమనించాల్సిన విషయం ఏమంటే.. రాయలసీమలో సీనియర్ టీడీపీ నేతలకూ మొదటి జాబితాలో టికెట్ రాలేదు. జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని పలువురు నేతలు, కార్యకర్తలు ఉండవల్లిలో ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. అదీ ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం డీల్ పవర్..!సురేంద్రనాయుడు ద్వారా కుదిరిన ఆఫ్రికా మోడల్ నకిలీ మాఫియా డీల్ను 2024 ఎన్నికలకు ముందే రుచి చూపించారు. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వపరం చేసింది. మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలపై నియంత్రణ విధించింది. దీంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు, విచ్చలవిడిగా పంపిణీకి మద్యం అందుబాటులో లేదు. కానీ, టీడీపీ కూటమి మాత్రం తమ అభ్యర్థులకు భారీగా మద్యం సరఫరా చేయడం గమనార్హం. దీనివెనుక జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడుతో కూడిన తంబళ్లపల్లె టీడీపీ బ్యాచ్ ఉంది. వీరు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో మద్యం పంపిణీని పర్యవేక్షించారు. అప్పటికే సరిహద్దులకు అవతల కర్ణాటకలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం యూనిట్లు ఏర్పాటు చేశారు. అక్కడినుంచి భారీగా నకిలీ మద్యాన్ని టీడీపీ అభ్యర్థులకు అందజేయగా వారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేశారు. ఆఫ్రికాలో మద్యం వ్యాపారంలో పెట్టుబడులు ఉన్నాయని టీడీపీ తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల అఫిడవిట్లో స్వయంగా పేర్కొన్న భాగం మనం నకిలీ మద్యం పంచామా? రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ కూటమి ఎన్నికల బాధ్యతలు చూసిన పలువురు సీనియర్ నేతలు ప్రస్తుతం నకిలీ మద్యం బాగోతాన్ని గుర్తుచేసుకుంటున్నారు.జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు బ్యాచ్ మా ద్వారా పంపిణీ చేయించింది నకిలీ మద్యమా? అని అవాక్కవుతున్నారు. ‘‘తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాజకీయంగా కనీసం పట్టు లేని జయచంద్రారెడ్డికి ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఎందుకిచ్చారో... సురేంద్రనాయుడు కింగ్ మేకర్గా చక్రంతిప్పడం వెనుక ఉన్నది నకిలీ మద్యం డీల్ అని మాకు ఇప్పుడు తెలుస్తోంది’’ అని పేర్కొంటున్నారు.2014: ముఖ్యనేత... సురేంద్రనాయుడు.. ఇది ‘క్షమాభిక్ష’ బంధంకట్టా సురేంద్రనాయుడు... ముఖ్య నేతతో లోతైన బంధం ఉన్న నాయకుడు. 2002 నాటి దారుణ జంట హత్యల కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఈయనకు 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక క్షమాభిక్ష దక్కింది. జంట హత్యల కేసులో సురేంద్రనాయుడుకు జిల్లా న్యాయస్థానం 2006లో యావజ్జీవం విధించింది. ఈ తీర్పును సురేంద్ర హైకోర్టులో సవాల్ చేసినా, జిల్లా కోర్టు తీర్పునే సమరి్థంచింది. అయితే, ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో టీడీపీ సర్కారు క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తేసి... టీడీపీ సిండికేట్కు మొత్తం కట్టబెట్టిన కూటమి2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ సిండికేట్ ద్వారా సాగిస్తున్న మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్కు కట్టబెట్టింది. పర్మిట్ రూమ్లకు అనుమతులిచ్చింది. 75 వేల బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసినా ఉదాసీనంగా ఉంటోంది. 540 బార్లను (త్వరలో మరో 300 బార్లు కూడా) టీడీపీ సిండికేట్కు కట్టబెట్టింది. ఇలా రాష్ట్రంలో మద్యం నెట్వర్క్ను టీడీపీ సిండికేట్ గుప్పిటపట్టింది. అనంతరం జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్రావు ఆధ్వర్యంలో ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం యూనిట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. టీడీపీ సీనియర్ నేతలకు ప్రాంతాలవారీగా పంపిణీ బాధ్యతలు అప్పగించింది. నకిలీ మద్యాన్ని ప్రభుత్వ లైసెన్స్ పొందిన ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లు, బార్లు, బెల్ట్ షాపుల్లో దర్జాగా విక్రయిస్తూ భారీ దోపిడీకి తెగబడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఏడాదిలోనే రూ.5,280కోట్లు కొల్లగొట్టిన ఈ మద్యం మాఫియా వచ్చే నాలుగేళ్లలో మరో రూ.40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధపడింది. అందులో 30 శాతం వాటా కరకట్ట బంగ్లాకే ముడుపులుగా చెల్లించాలన్నది డీల్. నకిలీ మద్యం కేసు నిందితుడు కట్టా సురేంద్రనాయుడు నేర చరిత్రకు సంబంధించిన పత్రాలు అంటే నకిలీ మద్యం మాఫియా ద్వారా సూత్రధారిగా ఉన్న ముఖ్య నేత కరకట్ట బంగ్లాకు దక్కేదే దాదాపు రూ.13,500 కోట్లు... ఇక ప్రాంతాలవారీగా పంపిణీ బాధ్యతలు చూస్తున్న టీడీపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మద్యం సిండికేట్కు 50 శాతం, నకిలీ మద్యం రాకెట్ పాత్రధారులుగా జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్రావులకు 20 శాతం పంచుకోవాలన్నది డీల్. అందుకే ముఖ్యనేత అండతో రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా బరితెగించి దోపిడీకి పాల్పడుతోందన్నది స్పష్టమవుతోంది.ఎల్లో మీడియాలో అడ్డగోలు రాతలు దందా బయటపడడంతో డైవర్షన్ ప్లాన్ అడ్డంగా దొరికినా ఎదురుదాడి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీనే సురేంద్రనాయుడుకు క్షమాభిక్ష ఇచ్చింది ముఖ్యనేత బండారం బయటపడడంతో ఉక్కిరిబిక్కిరి నకిలీ మద్యం వ్యవహారంలో ముఖ్య నేత, టీడీపీ నాయకుల ప్రమేయం స్పష్టంగా బయటపడడంతో ఎల్లో మీడియా అడ్డగోలు రాతలు రాస్తోంది. తిరుగులేని ఆధారాలతో అడ్డంగా పట్టుబడినా.. తూచ్ అదేమీ లేదంటూ ఎదురుదాడి చేస్తోంది. ఉక్కిరిబిక్కిరి అయి గుక్కతిప్పుకోలేక సంబంధంలేని విషయాలను తెరపైకి తెస్తోంది. తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యరి్థగా జయచంద్రారెడ్డి పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సురేంద్రనాయుడుకు క్షమాభిక్ష ఇచ్చింది ముఖ్యనేతనే అయినా... కొత్త కథలు అల్లుతోంది. అసలు విషయం తొక్కిపెట్టి బురదజల్లాలని చూస్తోంది. మొత్తం దందా బయటపడడంతో.. డైవర్షన్ ప్రణాళిక వేస్తోంది. -
హాస్టళ్లా... నరక కూపాలా?
‘‘ప్రతి బాల్యంలోనూ ఓ నందనోద్యానం ఉంటుంది. అది మెరిసిపోయే రంగులతో అల్లుకున్న మంత్రముగ్ధ నగరి. పిల్ల తెమ్మెరలక్కడ మృదువుగా హత్తుకుంటాయి. ప్రతి ఉదయమూ అక్కడ పరిమళ భరితమే’’ – బాల్యం గురించి ఓ రచయిత్రి అలా వర్ణించారు. బాల్యం ఇలాగే ఉండాలి. ఈ విధంగానే ఎదగాలని చాలామంది కోరుకుంటారు. అందుకే ప్రతి నాగరిక దేశం బాలల హక్కులకు ప్రత్యేక రక్షణను ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగం కూడా అటువంటి ఏర్పాట్లు చేసింది. స్వయంగా తల్లిదండ్రులే తమ పిల్లల్ని స్వల్పంగా దండించినా సహించకుండా జైల్లో పెడతారు స్కాండినేవియన్ దేశాల్లో! ఏ జాతికైనా అమూల్య సంపద బాలలే కనుక మానవత్వం సున్నితత్వమున్న వ్యవస్థలన్నీ బాలల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాయి. ‘మనం చూడలేని కాలానికి మనం పంపించే సజీవ సందేశాలు పిల్లలే’! కనుక వారికా ప్రత్యేక హక్కులుంటాయి.ఆచరణలో ప్రతి బాల్యం నందనోద్యానంలా ఉంటున్నదా? ఏలుతున్నవారు అలా ఉండటానికి అనుమతిస్తున్నారా? అందమైన బాల్యాన్ని అంగడి సరుకుగా మార్చడానికి దోహద పడుతున్న ప్రభుత్వాలనిప్పుడు చూస్తున్నాము. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే పేద పిల్లలకు కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగాలని ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పుడు మోకాలడ్డే ప్రయత్నం చేసిందెవరు? ఆ ప్రయత్నం చేసిన చంద్రబాబు కూటమే ఇప్పుడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఎత్తివేసింది. విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతలు కావనేది ఆయన ఫిలాసఫీ. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. కనుకనే ఆయన మళ్లీ గద్దెనెక్కగానే కొనగలిగినవారికి నాణ్యమైన విద్య... లేనివారికి నాసిరకం విద్యావిధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానపు దుర్మార్గానికి పుట్టిన విషపు పుండే మొన్నటి కురుపాం ఘటన.పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థుల్లో కామెర్ల వ్యాధి ప్రబలిన నేపథ్యాన్ని గమనిస్తే ఒళ్లు జలదరిస్తుంది. లక్షలాదిమంది పేద తల్లిదండ్రులు వారి బిడ్డల భవిష్యత్తుపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏపీ సర్కార్ వమ్ము చేస్తున్న వైనం దిగ్భ్రాంతికరమైనది. కురుపాం ఆశ్రమ పాఠశాలలో ఉంటున్నది ఆరొందల పైచిలుకు బాలికలే కావచ్చు. అన్ని రకాల సంక్షేమ హాస్టళ్ళు, అన్ని రకాల ఆశ్రమ పాఠశాలలూ కలిపి ఏపీలో 3,800కు పైగా ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది పేదవర్గాల పిల్లలు ప్రభుత్వం మీద భరోసాతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటు న్నారు. ప్రస్తుత ప్రభుత్వపు విధానపరమైన వైఖరి ఫలితంగా కొద్దిపాటి తేడాలు తప్ప కురుపాం ఆశ్రమ పాఠశాలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఎక్కడా లేవు. కురుపాం దారుణానికి సంబంధించిన ప్రకంపనలు తగ్గకముందే గుంటూరు జిల్లాలో బీసీ హాస్టల్ విద్యార్థులు సామూహికంగా అస్వస్థులు కావడం నివ్వెరపరిచింది. గత ఏడాది కాలంగా ఈ తరహా వార్తలు అడపాదడపా వెలుగు చూస్తున్నా ఎటువంటి చర్యలూ తీసుకోక పోవడంతో పరిస్థితులిప్పుడు దారుణంగా దిగజారాయి.అసలేం జరిగింది కురుపాంలో? మరొకసారి పునరా లోకనం చేసుకోవాలి. కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరొందల పైచిలుకు విద్యార్థినులుంటున్నారు. సగటున ఇరవై మందికో మరుగుదొడ్డి. వాటి నిర్వహణ కూడా అంతంత మాత్రమే. డ్రైనేజీ ఏర్పాట్లు సరిగా లేక మురుగు నీరంతా ఒక పక్కకు చేరి అక్కడినుంచి బోర్ నీళ్లలో కలిసిపోతున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దసరా సెలవులు ప్రకటించిన తర్వాత సొంత ఊరికి వెళ్లిన అంజలి అనే బాలిక కామెర్ల లక్షణాలతో సెప్టెంబర్ 25న చనిపోయింది. తోయక కల్పన అనే టెన్త్ క్లాస్ చదువుతున్న బాలిక పది రోజులపాటు స్థానిక జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకొని నయం కాకపోవడంతో వైజాగ్ కేజీహెచ్లో చేరింది. సెప్టెంబర్ 29న ఆ బాలిక కూడా కామెర్ల వ్యాధి (హెపటైటిస్ ఏ)తో ప్రాణాలు కోల్పోయింది. అంటే ఆశ్రమ పాఠశాలకు సెలవులు ఇవ్వకముందే కామెర్ల లక్షణాలు బయటపడినట్టు స్పష్టమవుతున్నది.కురుపాంలోనే మరో హాస్టల్లో చదువుతున్న ఇంకో ఇద్దరు బాలురు అక్టోబర్ 5, 6 తేదీల్లో ఇవే లక్షణాలతో చనిపోయారు. గిరిజన బాలికల గురుకులం నుంచి మొత్తం 170 మంది బాలికలకు కామెర్లు సోకి ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో యాభై మంది విశాఖ కేజీహెచ్ దాకా రావలసి వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో బాలికలకు సురక్షిత మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం దానికి రిపేర్ రావడంతో పక్కన పడేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్న సమాచారం ప్రకారం డ్రైనేజీ వ్యవస్థ లేక మరుగుదొడ్ల మురుగు నీరు కలుస్తున్న బోర్ నీటినే బాలికల చేత తాగిస్తున్నారు. వంటకూ వాటినే వినియోగిస్తున్నారు. విద్యార్థుల మెడికల్ రిపోర్టులు కూడా దాన్నే నిర్ధారిస్తున్నాయి. మురుగుతో నీటి కాలుష్యం వల్లనే విద్యార్థులు ‘హెపటైటిస్–ఏ’ వ్యాధికి గురయ్యారని చెబుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నిర్వాహకులు ఏం చేస్తున్నట్టు? పిల్లల చేత మురుగునీళ్లు తాగిస్తూ ఉపాధ్యాయులు మాత్రం మినరల్ వాటర్ తెచ్చుకుని తాగేవారని గిరిజన పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.పిల్లలు తరచూ అస్వస్థతకు గురవుతుంటే నిర్వాహకులు వారిని ఇళ్ళకు పంపించి చేతులు దులిపేసుకోవడమేమిటి? పై అధికారులకు వీళ్లు రిపోర్టు చేయలేదా? చేసినా వారు పట్టించు కోవడం లేదా అన్నది తేలాల్సి ఉన్నది. యథా రాజా తథా ప్రజా అంటారు కదా! పేద పిల్లల ఆరోగ్యం సంగతి ప్రభుత్వానికే పట్టనప్పుడు తమకెందుకని అధికారులు అలక్ష్యంతో ఉంటు న్నారేమో తెలియదు. విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, ఐటీడీఏ, జిల్లా యంత్రాంగాలు, వాటి అధికార శ్రేణులు ఉన్నప్పటికీ ఇన్ని దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి?సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం కోసం అనుసరించ వలసిన ప్రోటోకాల్ను కూడా పాటించకపోవడం విస్మయం కలిగించే విషయం. ఆర్వో ప్లాంట్ చెడిపోతే వెంటనే ఎందుకు బాగు చేయించలేదు? నిర్ణీత కాలానికోసారి తాగునీటికి నాణ్యతా పరీక్షలు చేయడం లేదా? ఒకరిద్దరు పిల్లలు జబ్బుపడిన తర్వాత మిగిలిన పిల్లల విషయంలో వ్యాధి నిరోధక చర్యలు చేపట్టారా, లేదా? కనీసం తాగునీటిని క్లోరినేషన్ చేసినా ఇటువంటి ఘటనలు జరిగేవి కావు కదా!సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య, వసతి సమస్యలపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా వరసగా అనేక దుర్ఘటనలు ఈ ఏడాది కాలంలో రికార్డయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన సంక్షేమ హాస్టళ్ల గురుకులాల్లోనే ఈ కాలంలో 11 మంది విద్యార్థులు అనారోగ్య కారణాలతో చనిపోయారు. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేడ్కర్ సంక్షేమ గురుకులంలో పాచిపోయిన ఆహారం పెట్టడం వల్ల వందమంది విద్యార్థులు అస్వస్థులయ్యారు. ఇటువంటి ఘటనే అదే జిలాల్లోని జ్యోతిబా ఫూలే బీసీ హాస్టల్లో జరిగింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం, అనకాపల్లి జిల్లా రాజగోపాలపురం, నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో కూడా కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు జబ్బుపడిన ఘటనలు జరిగాయి. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని బీసీ హాస్టల్లో కలుషితాహారం తిని 50 మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు. శనివారం నాడు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగి తమ పిల్లల్ని హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు. సంపన్నుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని మర్నాడు తీసుకొచ్చి హాస్టల్ విద్యార్థులకు పెట్టడం ఏపీలో ఇప్పుడో ట్రెండ్గా మారింది. పాచిపోయిన ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురైన ఘటనలు పలుచోట్ల జరిగాయి.తాజాగా కురుపాంలో జరిగిన ఘటన మానవత్వానికే సవాల్ విసురుతున్నది. ఆరొందల మందికి పైగా బాలికలు రోజుల తరబడి మురుగునీళ్లు తాగవలసిన పరిస్థితి ఎవరి పాపం? పక్కనే ఉన్న విశాఖ నగరంలో అతి ఖరీదైన భూముల్ని కారుచౌకగా లుల్లూ భయ్యాలకూ, లల్లూ భయ్యాలకూ కట్టబెడు తున్న సర్కార్, ఏజెన్సీ గిరిజన బిడ్డలకు శుభ్రమైన మంచినీటిని కూడా ఎందుకు నిరాకరిస్తున్నట్టు? చంద్రబాబును పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా పిలవడం ఇటువంటి కారణాల వల్లనే! పేదల సంక్షేమాన్ని ‘పీ–4’కు అప్పగించాలని ఆయన నిర్ణయించారు. సంపన్నుల ఫంక్షన్లలో మిగిలిపోయిన, పాచిపోయిన ఆహారాన్ని పేదలకు పంచడం లాంటిదే ‘పీ–4’ ఫిలాసఫీ. ఇదేనా మన రాజ్యాంగం చాటిచెప్పిన సమానత్వం? ఎటువంటి వివక్షా లేకుండా అన్ని వర్గాల పిల్లలందరూ ఉచితంగా విద్యను అభ్యసించడమే కాదు, వారి ఆరోగ్య సంరక్షణ కూడా ప్రాథమిక హక్కుల్లో భాగమే. కూటమి సర్కార్ హయాంలో సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న ఉదంతాలు కచ్చి తంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలే. జీవించే హక్కును కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తున్నట్టే!కామెర్ల వ్యాధి ప్రబలుతున్నదని తెలిసిన తర్వాత కూడా పాఠశాల నిర్వాహకులు, అధికారులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగానే ఉన్నది. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్లనే విద్యార్థులకు కామెర్ల వ్యాధి సోకిందని సాక్షాత్తూ ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించడం గిరిజన ప్రజానీకాన్ని అవమానించడమే! నలతగా ఉంటున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా వారిని ఇళ్లకు పంపించి పాఠశాల నిర్వాహకులు చేతులు దులుపుకొన్నారు. సరైన వైద్యం అందించకుండా కాలయాపన చేసి, రోజుల తరబడి స్థానిక ఆస్పత్రుల్లో తిప్పి చివరకు మాత్రమే కేజీహెచ్కు తరలించినందువల్లనే కల్పన అనే బాలిక చనిపోయింది. బాలిక మరణానికి కారణం సెరెబ్రల్ మలేరియా అని రాశారట! వైద్యులు చికిత్స చేసింది కూడా దానికేనా? అధికారుల ఒత్తిడికి లొంగి వైద్యులు అలా రాయ వచ్చునా? చనిపోయిన పిల్లలకు పోస్ట్మార్టమ్ ఎందుకు నిర్వహించలేదు? కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పిల్లల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారనే వార్తలు రాగానే వారిని బలవంతంగా డిశ్చార్జి చేయించడానికి అధికారులు ఎందుకు ప్రయాస పడినట్టు? దాచేస్తే సత్యం దాగుతుందా? విద్య, వైద్యం ఉచితంగా అందజేయడం ప్రభుత్వం విధానం కాదనేది కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు వైఖరి. అందువలన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఆయనకు ప్రాధాన్య రంగం కాదు. వారికి పోషకాహారం, వసతి సౌకర్యాలు వారి ఎజెండాలో ఉండవు. ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడటమా? లేక మౌనంగా అవమానాలు దిగమింగి అన్యాయాలను సహించ డమా? ఏ మార్గం అనుసరించాలో పేద–మధ్యతరగతి వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్య – రాజ్యాంగవాదులు నిర్ణయించుకోవ లసి ఉంటుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Aarogyasri: కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగిపోయిన 3 వేల కోట్ల బకాయిలు
-
Venkata Rami: డిఏలు పెండింగ్ విషయంలో బాబు చరిత్ర
-
ABN రాధాకృష్ణను ఏకిపారేసిన పేర్ని నాని
-
ఉల్లి రైతుల కష్టాలపై YSR జిల్లా కలెక్టర్ ను కలిసిన YSRCP నేతలు
-
ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు: వైఎస్ జగన్
రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు రూ.8 వేల కోట్లు. ఇందులో రూ.3 వేల కోట్లను మా హయాంలోనే ఖర్చు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఏటా కేవలం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే.. కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల లాంటి వైద్య కాలేజీల ద్వారా పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. మరి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? అని చంద్రబాబుని అడుగుతున్నా రూ.2 లక్షల కోట్లు అమరావతిలో పెట్టడానికి సిద్ధపడుతూ.. రూ.70 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెబుతున్నారు. మరి కోట్ల మంది పేదలకు మేలు చేస్తూ.. ఉచితంగా వైద్యమందించే మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేమంటూ ప్రైవేటువారికి అమ్మేసే కార్యక్రమం చంద్రబాబు హయాంలో జరుగుతోంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయనకు బుద్ధి రావాలని పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అనకాపల్లిలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘ఇదిగోనయ్యా..! 2022 ఆగస్టు 8న జారీ చేసిన జీవో నం.204. మెడికల్ కాలేజీ నిర్మాణానికి జీవో ఇవ్వలేదంటూ స్పీకర్ పదవిలో ఉంటూ అబద్ధాలు చెప్పినందుకు ఆ పదవికి నువ్వు అర్హుడివేనా? ఆలోచించుకో...! తప్పుడు మాటలు చెబుతూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబుతో చేతులు కలిపినందుకు తలదించుకోవాలి..’ – నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెం మెడికల్ కాలేజీ వద్ద మీడియాతో వైఎస్ జగన్ నర్సీపట్నానికి సంబంధించిన సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉంటూ... చంద్రబాబులా తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతున్నారు. తాను కూడా చంద్రబాబు కంటే నాలుగు ఆకులు తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. స్పీకర్కు చెబుతున్నా... అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయడం ఎంత వరకూ ధర్మమని అడుగుతున్నా. క్షమాపణ చెబుతావా? ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అంటారా.. ఇదిగోనయ్యా.. ఆగస్టు 8, 2022న జారీ చేసిన జీవో నం.204. చంద్రబాబు జూన్ 2024లో అధికారంలోకి రాగా సెపె్టంబర్ 3న ఒక మెమో జారీ చేశారు. మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపాలంటూ మెమో జారీ చేశారు. అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి వదిలేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మెడికల్ కాలేజీలకు నిధులు లేవని చెబుతున్నారు. అయ్యా చంద్రబాబూ..! ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, స్పీకర్కు కూడా చెబుతున్నా. నాబార్డ్ ఫండ్స్ అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టై–అప్ చేశాం. నాబార్డ్ ఫండ్స్ మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కేటగిరీలో ఈ మెడికల్ కాలేజీల్ని చేర్చాం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఉద్దేశించిన వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను రచ్చబండ సాక్షిగా ప్రజలకు వివరిస్తాం. దీన్ని నిరసిస్తూ శుక్రవారం నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని చేపడతాం. నవంబరు 24 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందచేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మేం శ్రీకారం చుట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీల్లో మా హయాంలోనే దాదాపుగా ఏడు కాలేజీలు పూర్తి కాగా ఐదు చోట్ల మా ప్రభుత్వంలోనే తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లను కేటాయిస్తే, మాకు వద్దంటూ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. పేదలకు చేరువలో ఉచితంగా మెరుగైన వైద్యం కోసం ఉద్దేశించిన మెడికల్ కాలేజీల నిర్మాణానికి నాబార్డుతో పాటు కేంద్రం నుంచీ వడ్డీ లేని నిధులను మా ప్రభుత్వంలో టై–అప్ చేశాం. కేవలం ఏటా రూ.1,000 కోట్ల చొప్పున రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ఆ కాలేజీలు పూర్తవుతాయి. అది కూడా చేయలేకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగం బాగుపడలేదు. విశాఖలో షాపులను తొలగించి 32 వేల మందిని రోడ్డున పడేశారు. గిరిజన విద్యార్థుల హాస్టళ్లలో మా ప్రభుత్వం ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. ఈ సర్కారు కనీసం ఫిల్టర్లను కూడా మార్చడం లేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు చెల్లించడం లేదు. విశాఖ స్టీలు ప్లాంటులో 32 విభాగాలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే స్టీలు ప్లాంట్ కార్మీకులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారు..’ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. గురువారం ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరంపాలెం మండలం భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గత ప్రభుత్వం అసలు జీవో ఇవ్వలేదని... దమ్ము, ధైర్యం ఉంటే దాన్ని చూపించాలంటూ స్పీకర్ విసిరిన సవాల్పై ఘాటుగా ప్రతిస్పందించారు. స్థానికంగా ప్రాతినిథ్యం వహిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నత పదవిలో ఉంటూ చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఆయనకు ఆ పదవిలో ఉండేందుకు అర్హత ఉందా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు కోట్లాది మంది పేదలకు మేలు.. చెంతనే సూపర్ స్పెషాల్టీ వైద్యం ఈ రోజు ఇక్కడ వెనుక కనిపిస్తున్నవి నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించిన మెడికల్ కాలేజీ నిర్మాణాలు. ఉత్తరాంధ్రకు మంచి చేస్తూ.. అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు 52 ఎకరాల్లో కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 17 కొత్త మెడికల్ కాలేజీలకు మా హయాంలో శ్రీకారం చుట్టాం. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా ఏడెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు చేరువలో ఉచితంగా అందుతాయి. ఆ ఆధునిక దేవాలయాల వల్ల ఇది సాధ్యమవుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తే ఆ ఏడెనిమిది నియోజకవర్గాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవీ పేదవాడిని దగా చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. పక్కనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సేవలు పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువ రేట్లు వసూలు చేసే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మొత్తంగా 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్వహిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఉచితంగా వైద్యం పేదవాడికి చేరువలో అందుబాటులోకి వస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రుల దగాకు తెర పడుతుంది. మరి ఇలాంటి ఆధునిక దేవాలయాల్ని ఎందుకు మూసేస్తున్నారని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన వైఎస్ జగన్కు అపూర్వ స్వాగతం కోవిడ్ ఇబ్బందుల్లోనూ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి ప్రణాళిక చేశాం.. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేసేస్తే ఇక వారే నడుపుతారు. అంతా ప్రైవేట్ వాళ్లే ఉంటే.. మరి పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? ఈరోజు ఇక్కడ 52 ఎకరాల్లో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. 2022 డిసెంబర్ 30న ఈ కాలేజీకి శంకుస్థాపన చేశాం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులున్నా, సంక్షోభంలో ఉన్నా ఈ కాలేజీకి రూ.500 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక చేశాంఈ కాలేజీ పూర్తయితే 600 బెడ్స్తో పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ.. సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఇక్కడ అందుబాటులోకి వచ్చేవి. ఈ ప్రాంతమంతటికీ ఇక్కడి మెడికల్ కాలేజీ దిక్సూచీగా ఉండేది. పాయకరావుపేట, తూర్పు గోదావరి పరిధిలోని తుని నియోజకవర్గం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇదే మెడికల్ హబ్ అవుతుంది. ఈ రోజు ఏ ఇబ్బంది వచ్చినా.. విశాఖలోని కేజీహెచ్కు వెళ్లాల్సి వస్తోంది. వందల మంది రోగులకు అక్కడ సరిగా వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. మెడికల్ సీట్లను.. బాబు వద్దన్నారు 17 కొత్త మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలు మేం అధికారంలో ఉన్నప్పుడే దాదాపుగా పూర్తయ్యాయి. మేం అధికారంలో ఉండగానే 5 మెడికల్ కాలేజీలు పూర్తై తరగతులు కూడా ప్రారంభించాం. 2023–24లోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దాదాపు 800 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. 3 బ్యాచ్లు అడ్మిషన్లు కూడా పొందాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి పాడేరులో 50 సీట్లతో కాలేజీలో క్లాసులు కూడా మొదలైన పరిస్థితులు కనిపించాయి. పులివెందులలో కూడా 50 సీట్లుతో క్లాసులు ప్రారంభించాలంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇస్తే.. మాకు సీట్లు వద్దు, మెడికల్ కాలేజీ వద్దంటూ చంద్రబాబు వెనక్కి పంపించేశారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 2022 ఆగస్టు 8వ తేదీన జారీ చేసిన జీవో కాపీని చూపిస్తున్న జగన్ ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయలేరా? రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు రూ.8 వేల కోట్లు. ఇందులో రూ.3 వేల కోట్లను చంద్రబాబు అధికారంలోకి వచ్చే సరికే మా హయాంలోనే ఖర్చు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాం. మరి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? అని చంద్రబాబుని అడుగుతున్నా. సంవత్సరానికి కేవలం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే.. కొన్ని కోట్ల మందికి ఆధునిక దేవాలయాల లాంటి వైద్య కాలేజీల ద్వారా పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో 2019 నాటికి ఉన్న మెడికల్ సీట్లు కేవలం 2,360 సీట్లు అయితే మరో 2,550 సీట్లు అదనంగా ఈ 17 కాలేజీల ద్వారా సమకూరుతాయి. అంటే రాష్ట్రంలో మొత్తం 4,910 సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి. ఇటు మన విద్యార్థులకు మెడికల్ సీట్లు.. అటు కోట్లాది మంది పేదలకు చేరువలో సూపర్ స్పెషాల్టీ వైద్యాన్ని ఉచితంగా అందించే ఆధునిక దేవాలయాలివి. ఇవన్నీ చంద్రబాబు దగ్గరుండి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతిలో 50 వేల ఎకరాలు కాదు.. మరో 50 వేల ఎకరాలు సేకరించి.. రూ.2 లక్షల కోట్లు కేవలం అక్కడ కరెంట్, రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తారు. గతంలో 50 వేల ఎకరాలకు ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున మొత్తం రూ.లక్ష కోట్లు కావాలన్నారు. కానీ ఖర్చు చేసింది రూ.4,500 కోట్లు. మళ్లీ ఇవాళ 50 వేలు సరిపోవు.. మరో 50 వేల ఎకరాలు కావాలని తీసుకుంటున్నారు. అంటే ఆ 50 వేల ఎకరాలకు మౌలిక సదుపాయాల కోసం మరో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధ పడుతున్నారు. ఆర్వో ప్లాంట్ ఫిల్టర్లూ మార్చడం లేదు.. ఇవాళ చంద్రబాబు దారుణ పాలన చూస్తే.. కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో 170 మందికి హెపటైటిస్–ఏ వస్తే వారిని పట్టించుకున్న దిక్కులేదు. జాండిస్ సోకినట్లు సెపె్టంబరు 10న గుర్తించినా జాగ్రత్తలు తీసుకోలేదు. కనీసం స్క్రీనింగ్ చేపట్టాలన్న ఆలోచన కూడా చేయకపోవడం దారుణం. ఇద్దరు విద్యారి్థనులు చనిపోయిన తర్వాత స్క్రీనింగ్ చేస్తే.. 170 మందికి పచ్చ కామెర్లున్నాయని తేలింది. నాడు–నేడు మనబడి కింద మన హయాంలో కురుపాం స్కూల్లో ఆర్వో ప్లాంట్ పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం దాని ఫిల్టర్స్ కూడా మార్చడం లేదు. దీంతో అవి నిరుపయోగమయ్యాయి. హాస్టల్ ఆర్వో ప్లాంట్ ఫిల్టర్లు కూడా మార్చలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. నర్సీపట్నం మెడికల్ కాలేజీ పూర్తయితే ఎలా ఉంటుందనే నమూనా ఫొటోను చూపిస్తున్న వైఎస్ జగన్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు.. దారిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నన్ను కలిశారు. నాడు ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కంపెనీని కాపాడతానని కూటమి నేతలు చెప్పారు. చంద్రబాబు వచ్చిన తర్వాత 32 విభాగాలను ప్రైవేటుపరం చేశారు. వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేశారు. ప్రశ్నిస్తే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. జీతాలు కూడా ఇవ్వడం లేదు. వీఆర్ఎస్ డబ్బులూ ఇవ్వడం లేదు. చెరకు రైతుల ఆవేదన పట్టదా? చెరకు కార్మీకులు కూడా నన్ను కలిశారు. 2014–19 మధ్య ప్రభుత్వం ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీని నాశనం చేస్తే మేం అధికారంలో ఉన్నప్పుడు రూ.89 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. ఈరోజు ప్రభుత్వం మరో రూ.35 కోట్లు బకాయి పెట్టింది. రైతుల ఆవేదన చంద్రబాబుకి వినిపించడం లేదు. అందరినీ రోడ్డున పడేస్తున్నారు..! బల్క్ డ్రగ్స్ కంపెనీ కోసం పక్కనే నక్కపల్లిలో 4000 ఎకరాల భూమి ఉన్నా రాజయ్యపేటలో భూముల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. అయినా చంద్రబాబు ఆలకించడం లేదు. మరి వారికి ఎవరు ఊరటనిస్తారు? విశాఖలో చిరు వ్యాపారుల పొట్ట కొట్టారు. 4,500 చిన్న షాపులు తీసేశారు. 32 వేల మంది ఎలా బతుకుతారు? అందరినీ రోడ్డున పడేస్తున్నారు. చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్...! ఈరోజు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయి. విద్యార్థులు, రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం. ఈ–క్రాప్ తెరమరుగైపోయింది. సూపర్సిక్స్, సూపర్ సెవెన్ అంటూ మోసాలు చేస్తున్నారు. అన్ని పథకాలు రద్దు చేసేశారు. దీంతో పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, విద్యార్థుల బతుకులు రోడ్డున పడ్డాయి. అయ్యా చంద్రబాబూ.. ఇప్పటికైనా బుద్ధి, జ్ఞానం ఉంటే మార్పు తెచ్చుకో. ప్రజలకు తోడుగా ఉండు. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. నేటి నుంచి రచ్చబండ.. కోటి సంతకాల సేకరణచంద్రబాబూ.. మీరు చేస్తున్న పనులకు నిరసనగా రేపటి నుంచి (అక్టోబర్ 10) నవంబరు 22 వరకు గ్రామ, వార్డు స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తాం. చంద్రబాబు సూపర్సిక్స్, సెవెన్ పేరుతో చేసిన మోసాలను కూడా రచ్చబండలో తెలియచేస్తాం. ప్రతి గ్రామం నుంచి 500 సంతకాలు, ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేలకు తక్కువ కాకుండా సంతకాలు సేకరిస్తాం. రాష్ట్రం మొత్తం మీద కోటి సంతకాలు సేకరిస్తాం. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాలు, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. ఆ తర్వాత నవంబరు 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఆ మర్నాడు నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు ఆ సంతకాల పత్రాలు లారీల్లో వస్తాయి. ఆ తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని వాటన్నింటినీ సమర్పిస్తాం. మాతో కలిసి వచ్చే వారందరినీ కూడగడతాం. చంద్రబాబు ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోవాలి.వందేళ్లలో ఉత్తరాంధ్రలో వచ్చింది రెండు మెడికల్ కాలేజీలు...జగన్ హయాంలోనే ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు.. ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు... పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్న్మెంట్ మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. ఉత్తరాంధ్రని తీసుకుంటే 1923లో బ్రిటిష్ వాళ్లు కట్టిన కేజీహెచ్ ఏఎంసీ కాలేజీ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ ఏర్పాటు చేశారు. నాన్న పుణ్యాన శ్రీకాకుళంలో రిమ్స్, బ్రిటిష్ వాళ్ల పుణ్యాన కట్టిన కేజీహెచ్ మాత్రమే ఉన్నాయి. అంటే వందేళ్లలో ఉత్తరాంధ్రలో వచ్చింది రెండు మెడికల్ కాలేజీలు మాత్రమే. వైఎస్సార్సీపీ హయాంలో.. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఏకంగా మరో 4 కొత్త మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టాం. విజయనగరం, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాం. ఈ నాలుగింటిలో పాడేరు, విజయనగరం మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే క్లాసులు మొదలయ్యాయి. విజయనగరం కాలేజీ 2023లోనే ప్రారంభమైంది. 2024 ఎన్నికల నాటికి సిద్ధమైన పాడేరు కాలేజీలో కూడా క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ రెండు కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కాగా మరో రెండు కొత్త కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ ఫొటోలు, టీచింగ్ కాలేజీ ఫొటోలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. నర్సీపట్నంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా మన కళ్లకు కనిపిస్తోంది. మరోవైపు పలాసలో మనం నిర్మీంచిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా కళ్లెదుటే కనిపిస్తోంది. ఐదు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు తెచ్చాం. సీతంపేట, పార్వతీపురం మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ దాదాపుగా పూర్తయ్యాయి. ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే కార్యక్రమాలు జరుగుతుంటే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. -
తప్పు ఒప్పుకోండి.. అబద్ధాలు ఆపండి: వైఎస్ జగన్
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆస్పత్రిలో 64 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. 200 కిలోమీటర్ల దూరం నుంచి కేజీహెచ్కు వచ్చారు. ఎంత సీరియస్గా ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారు? అయినా ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మార్గం. గిరిజన విద్యార్థులను పట్టించుకోకపోవడం దారుణం. మరోసారి ఈ తరహా దారుణాలు జరగకుండా సమస్య పరిష్కరించేలా చూడాల్సింది పోయి.. తప్పులు దాచాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చేసిన తప్పులు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు, చికిత్స పొందుతున్న విద్యార్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి. లేదంటే బాధిత కుటుంబాల తరఫున న్యాయ పోరాటం చేస్తాం.కప్పిపుచ్చే కార్యక్రమం ఇకనైనా ఆపండి. హోం మంత్రి వాటర్ కంటామినేషన్ కాదు అని మాట్లాడుతుండటం ఆశ్చర్యం అనిపిస్తోంది. అసలు పచ్చ కామెర్లు నీటి కాలుష్యం వల్లే వస్తాయనే విషయం ఆమెకు తెలీదేమో! ఒకే స్కూల్ నుంచి 170 మందికి ఒకేసారి వచ్చిందంటే దేని వల్ల వచ్చింది? 65 మంది ఒకే స్కూల్కు చెందిన వారు జాండిస్తో ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ప్రభుత్వానికి? నోరు తెరిస్తే అబద్ధాలు ఆడడం అలవాటైపోయింది. - వైఎస్ జగన్సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థులను పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రి పాలైతే తప్పులు దాచాలని చూడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కురుపాంలోని గిరిజన బాలికల వసతి గృహంలో పచ్చకామెర్ల బారిన పడి చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని గురువారం రాత్రి ఆయన విశాఖలోని కేజీహెచ్లో పరామర్శించారు.నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన అనంతరం.. రాత్రి 8.15 గంటలకు కేజీహెచ్లోని పిల్లల వార్డుకు నేరుగా చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న 21 మంది విద్యార్థుల్ని పరామర్శించారు. బాధిత విద్యార్థులు, వారి తల్లులతో మాట్లాడి.. వ్యాధుల బారిన పడటానికి గల కారణాలు, హాస్టల్ వద్ద పరిస్థితులు, చికిత్స అందుతున్న తీరు.. తదితర విషయాలపై ఆరా తీశారు. మొదలైన వివరాల్ని ఆరా తీశారు. అందరికీ భరోసా కల్పించి.. త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. అనంతరం కేజీహెచ్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..నీటి కాలుష్యమని వైద్యులు చెబుతున్నారు..కురుపాంలోని గిరిజన బాలికల వసతి గృహంలో 5, 6, 7 తరగతుల పిల్లలు పచ్చ కామెర్లతో కేజీహెచ్లో చేరారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు నీళ్లు బాగోలేవనే చెప్పారు. వైద్యులు కూడా నీటి కాలుష్యం కారణంగానే వ్యాధులు ప్రబలాయని చెబుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేస్తే వాటర్ కంటామినేషన్ ఎందుకు జరుగుతుంది? అది పని చేయడం లేదు. ఒకే హాస్టల్కు చెందిన దాదాపు 170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వస్తే.. ఇక్కడకు వచ్చిన మంత్రులు, ప్రభుత్వ పెద్దలు దానికి గల కారణాల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అంతేతప్ప.. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వాలి.. అక్కడ తలెత్తిన సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే దానిపై ఆలోచించక పోవడం దారుణం.పరిహారం ఇవ్వకపోతే న్యాయపోరాటంఅభం శుభం తెలియని ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. వారి కుటుంబాలకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చికిత్స పొందుతున్న పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుని 170 మందికి రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలి. ఇది మెడికో లీగల్ కేసు. ఎస్టీ పిల్లలను పట్టించుకున్న పరిస్థితి లేని ప్రభుత్వం ఇది. ప్రభుత్వం వీరికి పరిహారం ఇవ్వకపోతే అవసరమైతే వైఎస్సార్సీపీ వీరి తరఫున కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసి మరీ.. పరిహారం ఇప్పించే కార్యక్రమం చేస్తుంది.దేవుడు కూడా క్షమించడు..తక్షణమే హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతు చేయించండి. బాత్ రూమ్లు రిపేర్ చేయాలి. శానిటేషన్పై దృష్టి పెట్టాలి. వసతుల కల్పనపై శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పుకుని, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం దేవుడు కొద్దో గొప్పొ క్షమిస్తాడేమో. లేకపోతే దేవుడు కూడా క్షమించే పరిస్థితి ఉండదని గుర్తు పెట్టుకోవాలి. దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఇకనైనా ఆపండి. హోం మంత్రి వాటర్ కంటామినేషన్ కాదు అని మాట్లాడుతుండటం ఆశ్చÆý‡్యం అనిపిస్తోంది. అసలు పచ్చ కామెర్లు నీటి కాలుష్యం వల్లే వస్తాయనే విషయం ఆమెకు తెలీదేమో. 65 మంది ఒకే స్కూల్కు చెందిన వారు జాండిస్తో ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ప్రభుత్వానికి? తప్పు ఒప్పుకోమని చెప్పండి. దానికి ప్రాయశ్చిత్తంగా ఏమేం చేయాలో చేయండి. చనిపోయిన ఇద్దరు పిల్లల తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం చేయాలి. పరిహారం ఇవ్వండి. వసతుల మీద ధ్యాస పెట్టండి. పిల్లలు బతికే పరిస్థితి.. చదివే పరిస్థితి ఉండేలా చర్యలు తీసుకోండి.గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడొద్దుఎవరైనా పట్టించుకున్నారా అని ఓ తల్లిని ప్రశ్నిస్తే.. ఎవరూ పట్టించుకోలేదని ఆవేదనతో చెబుతున్నారు. ఇదే పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణం ఆపకుండా కట్టించి ఉంటే ఆ ఆస్పత్రి అందరినీ కాపాడేది. 200 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆస్పత్రికి రాకుండా అక్కడే మెడికల్ కాలేజీ ద్వారా అందరి ప్రాణాలు బాగుపడేవి. దాన్ని నాశనం చేస్తున్నారు. గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పైగా అబద్ధాలు. నీటి కాలుష్యం లేదంటూ అవే అబద్ధాలు చెప్పుకుంటూ మళ్లీ దాని గురించి దుష్ప్రచారాలు చేయడానికి సిగ్గుండాలి’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)కు వైఎస్ జగన్ ఈ బాధ్యత అప్పగించారు.ఆయన ప్రతిపక్ష నేత కాదు..పోలీస్ కమిషనర్ ఓవరాక్షన్విశాఖలో వైఎస్ జగన్ పర్యటనను ఆద్యంతం అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. చివరికి కేజీహెచ్లో కురుపాం ప్రాంతానికి చెందిన పచ్చకామెర్ల బాధిత విద్యార్థుల్ని పరామర్శించేందుకు వచ్చినా.. అడుగడుగునా అవరోధాలు సృష్టించింది. కేజీహెచ్కు ఎవ్వరూ రాకుండా దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. స్వయంగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వచ్చి.. కేజీహెచ్ని ఖాకీ వలయంలో బంధించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో వైఎస్ జగన్ మాట్లాడకూడదనే ఉద్దేశంతో.. పక్కనే ఉన్న సీఎస్సార్ బ్లాక్కు తరలించి.. అక్కడ నిర్బంధించారు.వైఎస్సార్సీపీ నేతలు ఒత్తిడి తేవడంతో ఒక విద్యార్థిని తల్లికి మాత్రమే అనుమతించారు. మీడియాపైనా సీపీ బాగ్చీ చిందులు తొక్కారు. కేజీహెచ్ నుంచి మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ప్రతిపక్షనేత వస్తే మీడియాతో మాట్లాడనివ్వరా.. అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సీపీ మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ఆయన ప్రతిపక్ష నేత కాదని, ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. అలాగైతే.. మీడియా ఆయనతో మాట్లాడకూడదా.. అని అడగ్గానే అక్కడి నుంచి విçసురుగా వెళ్లిపోయారు. కేజీహెచ్ సిబ్బంది, వై§ý ్యులు, రోగుల బంధువులు వైఎస్ జగన్ని చూసేందుకు పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా పెద్ద ఎత్తున పిల్లల వార్డుకు చేరుకున్నారు. వందల మంది పోలీసులతో బందోబస్తు పెట్టినా అభిమానాన్ని ఆపలేక తుదకు చేతులెత్తేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా పాప చనిపోయిందిమా పాప కల్పనకు సరైన ట్రీట్మెంట్ అందలేదు. ప్రభుత్వం తరఫున ఎవ్వరూ పట్టించుకోలేదు. మా పాపను ఇక్కడికి తీసుకు రావడానికి ఎంత కష్టపడ్డామో.. అయినా మంచి వైద్యం అందలేదు. ఎన్నో రోజుల నుంచి బాగోలేకపోయినా హాస్టల్ వాళ్లు చెప్పలేదు. కురుపాం, పార్వతీపురం, విజయనగరం, వైజాగ్.. ఇలా పలు చోట్ల ఆస్పత్రులకు తిప్పాను. ఎక్కడా సరైన ట్రీట్మెంట్ చేయలేదు. ఐసీయూలో పెట్టలేదు. మా పాపకు ఆక్సిజన్ కూడా పెట్టలేదు. ఎవ్వరూ బతికించలేకపోయారు. ఇంత కష్టం వచ్చినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్లే మా పాప చనిపోయింది. – మృతి చెందిన కల్పన తల్లి తోయక జయమ్మ -
అయ్యా చంద్రబాబు గారూ ఇక కాస్కోండి! అక్కడే తేల్చుకుందాం..
-
ఉత్తరాంధ్ర నుండి తిరుగుబాటు మొదలైంది చంద్రబాబు నీకు ఇక చుక్కలే
-
సీఎం డౌన్ డౌన్ నినాదాలతో దద్దరిల్లిన విశాఖ
-
వైద్య కళాశాలల రక్షణకు 'వైఎస్ జగన్' పోరు బాట
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరుకు సిద్ధం అయ్యారు. గత ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమైన నర్సీపట్నం వైద్య కళాశాలను నేడు ఆయన స్వయంగా సందర్శించనున్నారు. తద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలను పరిరక్షించేలా.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి అంకురార్పణ చేయనున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు, మన విద్యార్థుల డాక్టర్ కలను సాకారం చేయడం కోసం గత ప్రభుత్వంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) నిర్వహణ పేరిట ప్రజా సంపద అయిన వైద్య కళాశాలలను పచ్చ కార్పొరేట్ గద్దలకు 66 ఏళ్ల పాటు లీజు పేరుతో కారు చౌకగా, అప్పనంగా బాబు ప్రభుత్వం కట్టబెడుతోంది. రెండు దశల్లో 10 వైద్య కళాశాలలను ప్రైవేట్కు ధారాదత్తం చేసేలా ప్రణాళికలు రచించి, ఇప్పటికే తొలి దశలో నాలుగు కళాశాలలకు టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. ఉన్నత ఆశయానికి తూట్లు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చి, ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను అందుబాటులోకి తెస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ మేరకు జిల్లాల పునర్విభజన చేయడమే కాకుండా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త కళాశాలల నిర్మాణం చేపట్టారు. కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులను హబ్లుగా అభివృద్ధి చేసి, జిల్లా పరిధిలోని ప్రైమరీ, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను అనుసంధానించి.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా నాణ్యమైన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని సంకల్పించారు. వైఎస్ జగన్ విధానంలో ప్రతి వైద్య కళాశాల, బోధనాస్పత్రి పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచేవి. వీటిలో పనిచేసే ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బందిని ప్రభుత్వమే నియమించేది. కళాశాల, ఆస్పత్రిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. ఎక్కడా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల అజమాయిïÙ, వారి లాభార్జనకు ఆస్కారం లేదు. దీంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ జబ్బులకు చికిత్సతో పాటు, అవయవాల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు, రక్త పరీక్షలు, ఇతర డయగ్నోస్టిక్ సేవలు ప్రజలకు పూర్తి ఉచితంగా లభించేవి. దీంతో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి లభించేది. ఈ ఉన్నత ఆశయానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టి, ప్రజలు మళ్లీ కార్పొరేట్ దోపిడీకి గురయ్యేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్కు కట్టబెడుతున్న వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలే ఉండబోవని ప్రభుత్వం రూపొందించిన టెండర్ నిబంధనలే చెబుతున్నాయి. 620 పడకల సామర్థ్యంతో నడిచే బోధనాస్పత్రుల్లో ఒక్కటంటే ఒక్క పడక కూడా ఉచిత వైద్యానికి కేటాయించరు. ఈ కళాశాలల్లో వంద శాతం పడకలతో కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసుకోనున్నాయి. ప్రైవేట్ తరహాలోనే ఫీజుల దోపిడీ ⇒ కొత్త వైద్య కళాశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు ఆరి్థక వనరులు సమకూర్చుకునే లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కంటే ఎంతో తక్కువగా ఫీజులు ఖరారు చేసింది. ⇒ మధ్య తరగతి కుటుంబాల వారు సైతం భరించగలిగేలా ఎంబీబీఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉండే 35 శాతం సీట్లకు రూ.12 లక్షలు, 15 శాతం ఎన్ఆర్ఐ సీట్లకు రూ.20 లక్షల చొప్పున ఫీజుల విధానం ప్రవేశపెట్టారు. ఈ నిధులను కేవలం ఆ వైద్య కళాశాలల అభివృద్ధి కోసమే వెచ్చించేలా ప్రణాళిక వేశారు. అంతకు మించి ప్రైవేట్ కళాశాలల్లో మాదిరిగా విద్యార్థులపై ఫీజుల దోపిడీ లేకుండా చేశారు. ఈ విధానంపై అప్పట్లో కూటమి పార్టీలు, ఎల్లో మీడియా తీవ్ర స్థాయిలో దు్రష్పచారం చేశాయి. ⇒ తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సెల్ప్ ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక తమదైన శైలిలో విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తూ ఏకంగా కళాశాలలనే ప్రైవేట్కు కట్టబెట్టేస్తున్నారు. ⇒ బాబు ప్రవేశపెట్టిన పీపీపీ విధానంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఫీజుల దోపిడీకి లైసెన్స్ ఇచ్చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ బీ కేటగిరి సీటుకు ఏటా రూ.13.20 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకు రూ.39.60 లక్షల ఫీజులు ప్రైవేట్లో వసూలు చేస్తున్నారు. ఇదే ఫీజుల స్వరూపాన్ని పీపీపీకి ప్రభుత్వం ప్రతిపాదించింది. ⇒ ఈ లెక్కన 5 ఏళ్లకు సెల్ఫ్ ఫైనాన్స్ సీటుపై రూ.6 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాలో రూ.98 లక్షల చొప్పున విద్యార్థులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం నడిపే వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఏడాది పాటు హౌస్ సర్జన్గా సేవలు అందించే సమయంలో నెలకు రూ.26 వేల చొప్పున ఏడాదికి రూ.3.12 లక్షల స్టైఫండ్ ఇస్తారు. ఈ నేపథ్యంలో కొత్త వైద్య కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే స్టైఫండ్ సరిగా అందదు. దీనికి తోడు అదనపు ఫీజుల దోపిడీకి గురవుతారు. ⇒ భవిష్యత్లో అందుబాటులోకి వచ్చే పీజీ సీట్లకు సైతం బీ కేటగిరికి రూ.9.93 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకు రూ.57.50 లక్షలు చొప్పున ఫీజులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పైకి మాత్రం విద్యార్థులపై ఎటువంటి భారం ఉండదని ప్రచారం చేస్తుండటం గమనార్హం.కళ్లెదుటే సాక్ష్యం ⇒ ఏపీ విభజన చట్టంలో భాగంగా మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణం చేపట్టింది. 2016–17లో నిర్మాణానికి కేంద్రం శంకుస్థాపన చేసింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టుగా ఏక కాలంలో నిర్మాణాలన్నీ చేపట్టాక ఎయిమ్స్ కార్యకలాపాలు ప్రారంభించలేదు. కేవలం 50 మంది విద్యార్థులతో తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభించింది. ⇒ రెండు బ్యాచ్లకు విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలోనే తరగతులు నిర్వహించారు. మంగళగిరిలో విద్యార్థులకు తరగతుల నిర్వహణకు వీలుగా భవనాలు అందుబాటులోకి వచ్చాకే విద్యార్థులను అక్కడికి తరలించారు. 2016–17లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ నిర్మాణం గతేడాదిలో పూర్తి అయింది. అంటే దాదాపు తొమ్మిదేళ్లు ఎయిమ్స్ నిర్మాణం కొనసాగింది. అయితే వైఎస్ జగన్ చేపట్టిన నిర్మాణాల విషయంలో మాత్రం ఒకేసారి నిర్మాణాలెందుకు పూర్తి చేయలేదన్నట్టుగా బాబు ప్రభుత్వం దాడి చేస్తూ అభాసుపాలవుతోంది. నేడు వైఎస్ జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటనవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (గురువారం) అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్ మీదుగా) వెళతారు. అక్కడ కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా నిర్మాణం నిలిపి వేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. విష జ్వరాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శిస్తారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.15.. 23.. ఏళ్లు ఎందుకు పడుతుంది? ⇒ 17 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తేవడం కోసం కేంద్ర సాయం, స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం, నాబార్డు లోన్ల ద్వారా రూ.8,480 కోట్ల నిధులు గత ప్రభుత్వంలోనే సమకూర్చారు. ఈ క్రమంలో కళాశాలల నిర్మాణానికి నిధుల సమస్య లేదు. ⇒ గత ప్రభుత్వంలో 2023–24లో ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చారు. ⇒ 2024–25లో పులివెందుల, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పాడేరు కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు మొదలయ్యే నాటికే పాడేరు, పులివెందుల వైద్య కళాశాలలను సిద్ధం చేశారు. మిగిలిన మూడు కళాశాలలు సైతం మొదటి ఏడాది తరగతులకు సంబంధించి చిన్న చిన్న వసతులు సమకూర్చాల్సి ఉండింది. ⇒ ఈ చర్యల ఫలితంగానే గతేడాది పాడేరు, పులివెందులకు 50 చొప్పున సీట్లతో అడ్మిషన్లకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. తరగతులు ప్రారంభం అయ్యే నాటికి మిగిలిన సౌకర్యాలు సమకూరుస్తామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే ఆదోని, మదనపల్లె, మార్కాపురం కళాశాలలు కూడా ప్రారంభం అయి ఉండేవి. ⇒ వైఎస్ జగన్ విధానంలో వెళితే కళాశాలలు పూర్తి చేయడానికి 15 ఏళ్లు.. 23 ఏళ్లు పడుతుందని ప్రభుత్వం దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. దేశంలో ఎక్కడైనా ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వ రంగాల్లో వైద్య కళాశాలలను వంద శాతం నిర్మాణం పూర్తి చేశాకే ప్రారంభించరనే వాస్తవాన్ని మరుగున పరుస్తోంది. ⇒ రూ.వందల కోట్ల ప్రజా ధనాన్ని దుబారా చేస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన వైద్య కళాశాలల నిర్మాణానికి మాత్రం నిధులు లేమిని సాకుగా చూపుతుండటంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ⇒ అస్మదీయులకు మేలు చేయడం కోసం సీఎం చంద్రబాబు చేసిన కుట్రలతో రాష్ట్ర విద్యార్థులు రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారు. -
ఆటోలు తిప్పొద్దు..ఫ్లెక్సీలు కట్టొద్దు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు తలపెట్టిన ఉత్తరాంధ్ర పర్యటన, ప్రజా ఉద్యమం కార్యక్రమాలను అడ్డుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు కుటిల యత్నాలు పన్నుతోంది. గురువారం నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ప్రజలను తరలించవద్దంటూ ఆటోవాలాలు, పార్టీ నేతలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలకు పోలీస్స్టేషన్ల నుంచి ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. అనకాపల్లి టౌన్, రూరల్, కశింకోట, యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, నర్సీపట్నం టౌన్, రూరల్, చోడవరం టౌన్ పోలీసుల నుంచి పార్టీ నేతలకు బెదిరింపు కాల్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు, మండల, గ్రామ స్థాయి నాయకులను హౌస్ అరెస్ట్లు చేసేందుకు పథకం వేసినట్లు తెలుస్తోంది. మాకవరపాలెం మండల కేంద్రం ఇప్పటికే వందల మంది పోలీసులతో నిండిపోయింది. విశాఖ విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో ప్రయాణించి నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనాలను పరిశీలించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. అనంతరం ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడనున్నట్లు పార్టీ నేతలు పోలీసులకు సమాచారం అందించారు. అయితే రోడ్డు మార్గంలో అనుమతి ఇవ్వలేమని ఒకసారి.. హెలికాప్టర్లో వెళ్లాలంటూ మరోసారి.. ఫలానా మార్గంలోనే వెళ్లాలంటూ ఇంకోసారి.. ఇలా ఎప్పటికప్పుడు చంద్రబాబు సర్కారు అడ్డంకులు సృష్టిస్తోంది. అయితే వైఎస్ జగన్ పర్యటన ముందుగా ప్రకటించిన ప్రకారం యథాతథంగా సాగుతుందని వైఎస్సార్సీపీ స్పష్టంగా ప్రకటించడంతో చివరకు పలు షరతులు,ఆంక్షలు విధిస్తూ అనుమతించారు. ఎన్ని షరతులు విధించినా జనం వెల్లువలా తరలివస్తారని గ్రహించడంతో ప్రజలను తరలించకుండా అడ్డుకునే యత్నాలకు దిగినట్లు తెలుస్తోంది. ఆటోవాలాలను పిలిపించి గురువారం జగన్ పర్యటనకు జనాలను తరలించవద్దంటూ పోలీసుల ద్వారా సర్కార్ హెచ్చరిస్తోంది.వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు ఫోన్ కాల్స్..ఒకవైపు పర్యటనకు అనుమతి లేదంటూ తొలుత బెదిరింపులకు దిగిన పోలీసులు తర్వాత కొత్త మార్గంలో వెళ్లాలంటూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రజలను తరలించకుండా ఇప్పటికే ఆటోవాలాలను బెదిరించిన పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి వైఎస్సార్సీపీ నేతలకు ఫోన్లు చేయడం గమనార్హం. మీరెక్కడ ఉన్నారు? సీఐ పిలుస్తున్నారు.. వచ్చి కలవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నారు. ఎంత చేసినా జగన్ పర్యటనను, జన వాహినిని అడ్డుకోలేమని గ్రహించడంతో ఫ్లెక్సీల వ్యూహాన్ని ఆశ్రయించారు. జాతీయ రహదారిపై గతంలో ఏర్పాటు చేసిన కూటమి నేతల ఫ్లెక్సీలను తొలగించకపోవడం గమనార్హం. కూటమి నేతల ఫ్లెక్సీలు రోజుల తరబడి అలానే దర్శనమిస్తుండగా.. వైఎస్సార్ సీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 500 మందికి మించి గుమికూడవద్దంటూ ఆంక్షలు విధించడంతోపాటు అసలు ఫ్లెక్సీలు కట్టవద్దంటూ షరతులు విధిస్తున్నారు. అభిమానాన్ని చాటుకునేందుకు కూడా ఆంక్షలేమిటంటూ ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో షరతులు, బెదిరింపులు చూడలేదని పేర్కొంటున్నారు.కళ్ల ముందే కనిపిస్తున్నా...రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 5 నూతన వైద్య కళాశాలలు గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజీలో 50 మంది విద్యార్థులకు సీట్లు కూడా కేటాయించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతులిచ్చినా బాబు సర్కారు కుట్రపూరితంగా అడ్డుకుని వద్దంటూ లేఖ రాసింది. ఇవి రెండూ గత ప్రభుత్వ హయాంలోనే అన్ని వసతులతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండల పరిధిలోని భీమబోయినపాలెం వద్ద రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వైఎస్సార్ సీపీ హయాంలోనే చేపట్టగా ఇప్పటికే 60 శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ఇదంతా కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం రాగానే పనులను పూర్తిగా నిలిపివేసింది. అసలు మెడికల్ కాలేజీలకు అనుమతులే లేవంటూ చంద్రబాబు మొదలు మంత్రుల వరకూ అంతా బుకాయించగా నేషనల్ మెడికల్ కమిషన్ ఈ దుష్ప్రచారానికి చెక్ పెట్టింది. దీంతో ప్రభుత్వ పెద్దలు కొత్త రాగం అందుకున్నారు. పీపీపీ పాట పాడుతూ విలువైన సంపద లాంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెడికల్ విద్య అందుబాటులోకి రావడంతో పాటు పేదలకు చేరువలో సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు అందించే ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి సర్కారు ప్రైవేట్ చేతుల్లో పెట్టి వ్యాపారానికి సిద్ధం కావడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవకుండా...విమానాశ్రయం నుంచి గాజువాక, అనకాపల్లి మీదుగా వైఎస్ జగన్ పర్యటన సాగితే మధ్యలో స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం గుండా వెళుతుంది. అక్కడ భారీ సంఖ్యలో స్టీల్ప్లాంట్ కార్మికులు తరలివచ్చి తమ ఆక్రోశం, ఆవేదనను నేరుగా వైఎస్ జగన్కు విన్నవించే అవకాశం ఉందని కూటమి సర్కారు ఆందోళన చెందుతోంది. దీంతో కుటిల బుద్ధితో రూటు మార్చేసింది. ప్రధాన రహదారి గుండా వెళ్లకుండా ఎన్ఏడీ, పెందుర్తి మీదుగా పర్యటనకు అనుమతిచ్చారు. చంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, గొంతు నొక్కడంపై స్టీల్ప్లాంట్ కార్మికులతో పాటు ప్రజలందరూ మండిపడుతున్నారు. స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలపై కార్మికులు మండిపడుతున్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో 32 విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు (ఈవోఐ) ఆహ్వానించడం గమనార్హం. ఇక స్టీల్ప్లాంట్ కార్మికులకు సుమారు 4 నెలల వేతనం పెండింగ్లో ఉంది. -
అంతా వారే చేశారట!
నకిలీ మద్యం తయారీ రాకెట్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం పక్కా పథకం రచించింది. వేల కోట్ల రూపాయల దందాకు తెరలేపడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఏమాత్రం లేదనేలా వ్యవహారాన్ని రక్తి కట్టిస్తోంది. నకిలీ మద్యం తయారీ యంత్రాలు, స్పిరిట్, రసాయనాలు, వివిధ బ్రాండ్లను పోలిన లేబుల్స్, వేలాది లీటర్ల నకిలీ మద్యం.. వేల సంఖ్యలో సీసాలు, మూతలు పట్టుబడితే ఇదేదో చిన్న వ్యవహారం అనేలా చిన్న చిన్న వారిపై కేసులు పెట్టి చేతులు దులుపుకోజూస్తోంది. లేబుళ్లు సరఫరా చేశారని, సీసాల మూతలు సరఫరా చేశారని.. ఈ కేసులో ఇదే పెద్ద నేరం అన్నట్లు కలరింగ్ ఇస్తోంది. తూతూ మంత్రంగా కేసు నమోదు చేయడం ద్వారా సూత్రధారులు, పాత్రధారులను తప్పించేలా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఇలా చేస్తోందని చెప్పడానికి నిందితుల రిమాండ్ రిపోర్టే నిదర్శనం.సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల కేసులో కీలక సూత్రధారులు, పాత్రధారులను తప్పించి కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టిన టీడీపీ నేతలు భారీగా లాభాలు వస్తుండటంతో ప్రభుత్వ పెద్దల అండతో విజయవాడలోని ఇబ్రహీంపట్నాన్ని మరో అడ్డాగా మార్చారు. నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల ద్వారా సులభంగా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుండటంతో దానిపై కన్నేసిన కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ మద్యం దందా సాగించారు. ఈ దందా ద్వారా కమీషన్ల రూపంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇందులో అత్యధిక భాగం డబ్బు కరకట్ట బంగ్లాకే చేరిందన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని తక్కువ చేసి చూపేందుకు ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్ అధికారులకు దశా, దిశా నిర్దేశం చేశారు. పెద్ద తలకాయల ప్రస్తావన ఏదీ లేకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని కిందిస్థాయి నేతలపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. తాజాగా విజయవాడ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. నకిలీ మద్యం తయారీ వెనుక అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలకు సన్నిహితులైన అద్దేపల్లి జనార్దనరావు, ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహనరావులను ప్రధాన నిందితులుగా చేర్చిన ఎక్సైజ్ అధికారులు.. మొత్తం కథను వీరి చుట్టూనే తిప్పారు. ఇందులో ఎక్కడా ఈ మొత్తం నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్న సూత్రధారులు, ప్రధాన పాత్రధారుల గురించి కనీస స్థాయిలో కూడా ప్రస్తావించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎక్సైజ్ అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్లో మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చారు. ఈ 12 మందిలో అద్దేపల్లి జగన్మోహనరావు (ఏ2), బాదల్ దాస్ (ఏ7) ప్రదీప్ దాస్ (ఏ8)లను మంగళవారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరు పరచగా రిమాండ్కు పంపారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో పలు విషయాలను పొందు పరిచారు. నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల వ్యవహారంలో అద్దేపల్లి జనార్దనరావు (ఏ1), ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహనరావు (ఏ2)లు ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిపారు. టీడీపీ పెద్దలకు సన్నిహితుడైన తన సోదరుడు జనార్దనరావుతో కలిసి నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నట్లు జగన్మోహనరావు అంగీకరించినట్లు పేర్కొన్నారు. నకిలీ మద్యం అమ్మకాల ద్వారా భారీగా లాభాలు వస్తుండటంతో ఆ దందాను విస్తరించినట్లు జగన్మోహనరావు చెప్పినట్లు రిపోర్ట్లో వివరించారు.అక్కడి నుంచి ఇక్కడికి..తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా మద్యం విక్రయాలకు తెర లేపింది. దీన్నే అదునుగా భావించిన అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావు ప్రభుత్వ పెద్దల అండ, సలహాలు, సూచనలతో నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టారు. మొదట మొలకలచెరువు ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టి అమ్ముతూ వచ్చారు. దీని ద్వారా వారు భారీగా డబ్బు ఆర్జించారు. ఇందులో పెద్ద మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలకు కమీషన్ల రూపంలో ఇచ్చారు. వారి ప్రోత్సాహంతో ఈ నకిలీ మద్యం తయారీని భారీగా విస్తరించారు. మొలకలచెరువు తరహాలో ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే విజయవాడతో పాటు వివిధ వైన్ షాపులు, బార్లు, బెల్ట్షాపులకు సరఫరా చేసి, అమ్మకాలు జరిపారు. బెంగళూరుకు చెందిన బాలాజీ (ఏ3) ఫేక్ సీల్లు, స్పిరిట్, కారమిల్, ఇతర పదార్థాలు కలిపి మద్యం తయారీ చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. హైదరాబాద్కు చెందిన రవి (ఏ4) ఫేక్ లేబుల్స్ సరఫరా చేశారు. ఆరుగురు కూలీలు సయ్యద్ మాజి, కట్టారాజు, బాదల్ దాస్, ప్రదీప్ దాస్లు, మిధిన్ దాస్, అనంత దాస్ ఈ నకిలీ మద్యం తయారీలో ఉన్నారు. వీరికి అధిక జీతాలు ఇస్తామని ఆశ చూపి, నకిలీ మద్యం తయారీలో వారిని వాడుకున్నారు. ఖాళీ పెట్ బాటిల్స్ను గన్నవరం మండలం సూరంపల్లెలో తయారు చేయించారు. దాని యజమాని శ్రీనివాసులరెడ్డిని ఏ11 నిందితునిగా, విజయవాడలోని శ్రీనివాస వైన్స్లో పనిచేసే అంగలూరి కళ్యాణ్ను ఏ12 నిందితునిగా చేర్చారు. కళ్యాణ్ ద్వారా నకిలీ మద్యాన్ని పెద్ద మొత్తంలో అమ్మినట్లు అధికారులు గుర్తించారు. అచ్చం ఒరిజనల్ బాటిల్స్ మాదిరి తయారు చేసి, అలాగే స్టిక్కర్లు అతికించి ఎలాంటి అనుమానం రాకుండా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మారు. ప్రధానంగా ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, క్లాసిక్ బ్లూ విస్కీ, కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా విస్కీ.. బ్రాండ్లకు నకిలీ తయారు చేశారు. ఏకంగా విజయవాడలోనే పెద్ద డెన్ను ఏర్పాటు చేసి ధైర్యంగా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మారంటే ఇందుకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.ఎన్నికల తర్వాత నుంచి నకిలీ మద్యం జోరు2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత గోవా మద్యం పేరుతో పలువురు అధికార పార్టీ నేతలు ఈ నకిలీ మద్యం దందాకు తెర లేపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అద్దేపల్లి జనార్దనరావు పలు చోట్ల మద్యం సిండికేట్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని బ్రాందీ షాపులు, బార్లు, బెల్ట్ షాపులకు నకిలీ మద్యం సరఫరా జరిగినట్లు తేలడంతో మద్యం ప్రియుల్లో ఆందోళన మొదలైంది. అయితే నకిలీ మద్యం తయారీ విషయం ప్రజల్లోకి వెళ్లటంతో, ప్రభుత్వం దాని తీవ్రతను తక్కువ చేసి చూపించేందుకు నానా తంటాలు పడుతోంది. నామ మాత్రపు కేసులు పెట్టి ఈ నకిలీ మద్యం కేసు నుంచి టీడీపీ నాయకులను రక్షించేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఇప్పటికే నకిలీ మద్యం తాగి పలుచోట్ల అనారోగ్యం పాలైన మందుబాబులు అందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఊదరగొట్టి, నకిలీ మద్యంతో ఆరోగ్యాలతో చెలగాటం అడుకోవటం సరికాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అప్పుల్లో రికార్డు సృష్టించిన చంద్రబాబు
-
జోగి రమేష్ పై మరో అక్రమ కేసు
-
YV Subba Reddy: చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న రెండు అతి పెద్ద మోసాలు ఇవే..
-
మద్యం ఆదాయం బాబు మాఫియాకే: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ దుకాణాలన్నీ మూసివేసిన సీఎం చంద్రబాబునాయుడు ఆయన మాఫియాకు సంబంధించిన ప్రైవేటు దుకాణాలను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. ఊరూరా 70 వేలకుపైగా బెల్టు షాపులను నెలకొల్పి పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మరీ మద్యం దుకాణాలకు వేలం పాటలు నిర్వహించారని దుయ్యబట్టారు. వేలం పాటలు పాడి డబ్బులు వసూలు చేసి.. మంత్రులకు ఇంత, ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైన పెద్దబాబుకు, చిన్నబాబుకు ఇంత.. అంటూ మొత్తం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను వారి నియంత్రణలోకి తీసుకున్నారన్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రాణాలను హరిస్తున్నారన్నారు. కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీతో ఒకవైపు భారీగా దోపిడీ చేస్తూ మరోవైపు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారులు ర్యాండమ్గా జరిపిన దాడుల్లో నకిలీ మద్యం తయారీ డంపులు భారీగా బహిర్గతమయ్యాయన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి సర్కారు ప్రజా కంటక పాలనపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా, అంతు లేకుండా సాగుతున్న కల్తీ మద్యం విషయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ నిర్దేశించారు. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పార్టీ పరంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేస్తామన్నారు. సమావేశంలో జగన్ ఏమన్నారంటే.మద్యం మాఫియా నెట్వర్క్ఇవాళ మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతోంది. మొత్తం వ్యవస్థను తమ కంట్రోల్లోకి తీసుకున్న తరువాత ఎమ్మార్పీకి మించి మద్యం అమ్ముతున్నారు. వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూముల్లో పెగ్గుల రూపంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నారు. వేలంపాటలో గ్రామాల్లో బెల్ట్ షాపులు పొందిన నిర్వాహకులు ఒక్కో బాటిల్పై రూ.20 నుంచి రూ.30 వరకు ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. మరోవైపు డిస్టిలరీల నుంచి మద్యం సేకరణలో అక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ డిస్టిలరీల నుంచి కాకుండా బాగా డబ్బులిచ్చే (కమీషన్లు) డిస్టిలరీల నుంచి మద్యం సేకరిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన డిస్టిలరీలకు ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్లకు సంబంధించిన సరుకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఇవన్నీ వీళ్ల సొంత ఆదాయం పెంచుకునే ఎత్తుగడలు.నకిలీ లిక్కర్ తయారీదారులు, విక్రేతలు అందరూ టీడీపీ వాళ్లేనని వివరిస్తూ నిందితుడు కట్టా సురేంద్రనాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్తో ఉన్న ఫొటోలను చూపిస్తున్న వైఎస్ జగన్ నకిలీ మద్యంతో బరి తెగింపు.. బాబు పరిపాలనలో రాక్షసయుగంబాధ కలిగించే విషయం ఏమిటంటే.. వీళ్ల డబ్బు ఆశ ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే.. ప్రజలు ఏం తాగినా పర్వాలేదు... చనిపోయినా పర్వాలేదు.. తమ జేబుల్లోకి డబ్బులు ఇంకా ఎక్కువగా రావాలనే తలంపుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షసయుగం నడుస్తోంది. భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల ద్వారా పరిపాలన సాగిస్తున్నారు. నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఆ మాఫియాను కంట్రోల్ చేసే కొందరు కేబినెట్ మంత్రులు, ప్రముఖ రాజకీయ పదవుల్లో ఉన్నవారు, పెద్దబాబు, చినబాబు ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఏకంగా ఫ్యాక్టరీలు నెలకొల్పి క్వాలిటీ లేని లిక్కర్ తయారు చేసి వారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా షాపుల్లోకి, బెల్ట్ షాపుల్లోకి నేరుగా పంపిస్తున్నారు.ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ.. పరిశ్రమను స్థాపించి యంత్ర పూజ...మరో విషయం ఏమిటంటే.. ఇవాళ ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం బాటిల్. అది తాగి మనుషులు చనిపోతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జనార్దన్రావు, సురేంద్రనాయుడు ఈ నకిలీ మద్యం దందా నడుపుతున్నారు. వీళ్లపై పర్యవేక్షణ బాధ్యతలు మంత్రి రాంప్రసాద్రెడ్డికి అప్పగించారు. ములకలచెరువులో ఏకంగా పరిశ్రమను స్థాపించి పెద్ద సంఖ్యలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్యాంక్, క్యాన్లు, బాటిళ్లు, మూతలు, బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ లేబుళ్లు అన్నీ అక్కడ ఉన్నాయి. చివరకు దసరాకు అక్కడ యంత్ర పూజ కూడా చేశారు. అంటే అంత పకడ్బందీగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో బయటపడిన నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలోని యంత్రాలు, మద్యం బాటిళ్ల ఫొటోలు చూపిస్తున్న వైఎస్ జగన్ ఒక్కో ఏరియా పంచుకున్నారు.. ఇబ్రహీంపట్నంలో రెండు భారీ డంప్లుఅధికార పార్టీ అండతో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు నెలకొల్పి ఒక్కొక్కరు ఒక్కో ఏరియా పంచుకున్నారు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న జనార్దన్రావు, సురేంద్రనాయుడు.. నారా లోకేశ్, చంద్రబాబుతో కలసి ఫొటోలు కూడా దిగారు. ఇక్కడ తయారైన నకిలీ సరుకు రాయలసీమలో మద్యం షాపులు, బెల్ట్షాపులకు పంపిణీ చేసే బాధ్యతను మంత్రి రాంప్రసాద్రెడ్డి సూçపర్వైజ్ చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేందుకు ఇబ్రహీంపట్నంలో ఏకంగా రెండు చోట్ల భారీగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. రాయలసీమ నుంచి రవాణా చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇబ్రహీంపట్నంలోనే యూనిట్ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్లే బాటిళ్లు, లేబుల్స్, మూతలు తయారు చేసుకుంటూ బ్రాండ్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కార్టన్ బాక్సుల్లో స్పిరిట్ నింపిన డ్రమ్స్, ఖాళీ సీసాలు, బాటిళ్లను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారట. నర్సీపట్నంకు చెందిన నేత ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసుకుంటారు. ఈయన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడు. ఏలూరుకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే బాగా దౌర్జన్యం చేస్తాడని ఆయనకు ఉమ్మడి గోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించారు. పాలకొల్లులో మరో పరిశ్రమ.. అక్కడ కూడా మిషన్, క్యాన్లు, బాటిళ్లు, లేబుల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. అమలాపురంలో కూడా మిషన్లు, కల్తీ మద్యం, బాటిల్స్, లేబుల్స్, మూతలు, స్పిరిట్ అన్నీ అమర్చుకున్నారు. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్, అనకాపల్లి జిల్లా పరవాడలో పరిశ్రమ ఏర్పాటు చేశారు. నకిలీ మద్యానికి అమాయకులు బలి..ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులోని ఓ మద్యం షాపులో లిక్కర్ తాగిన కొద్దిసేపటికే షేక్ చిన్న మస్తాన్ మరణించాడు. జూపూడి వైన్ షాప్లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ కిలేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు చనిపోయాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని వైన్ షాపులో మద్యం సేవిస్తూ బెల్దారీ పెద్దన్న అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. నకిలీ మద్యానికి అమాయకులు బలి అవుతున్నారు (ఆ ఫొటోలను పీపీటీలో చూపారు).అనకాపల్లి జిల్లా పరవాడలో నకిలీ మద్యం తయారీ నిందితుడు రుత్తల రాము శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడని తెలిపే ఫొటో చూపిస్తున్న వైఎస్ జగన్ దాడుల్లో వేలాదిగా నకిలీ బాటిళ్లు స్వాధీనం..రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారి పోతున్నారంటే.. సొంత ఆదాయాలు పెంచుకునేందుకు రాష్ట్ర ఖజానాను లూటీ చేయడంతో సరిపెట్టుకోకుండా అమాయకుల జీవితాలతో చెల గాటమాడుతున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేస్తున్నారో ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఇబ్రహీంపట్నంలోని గోడౌన్లలో దాడులు చేసి నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్లు, పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో 3,325 లీటర్ల స్పిరిట్ను సీజ్ చేశారు. అందులో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 725 బాటిల్స్, క్లాసిక్ బ్లూ 44 బాటిల్స్, కేరళ మాల్ట్ 384 బాటిల్స్, మంజీరా బ్లూ 24 బాటిల్స్.. ఇలా మొత్తం 1,300 బాటిళ్లను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. లేబుల్స్ లేని 136 కేసులు, 6,578 బాటిల్స్, ఓఏబీ లేబుల్స్ 6,500, ఖాళీ బాటిల్స్ 22 వేలు, ఖాళీ కార్టూన్లు 6, ఒక మిషన్, రెండు పైపులను సీజ్ చేశారు. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.నకిలీ మద్యంపై ఆందోళన ఇలా..ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యంపై పార్టీ పరంగా నిరసనలు తెలియచేయాలి. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం వద్దు, మా ప్రాణాలను కాపాడాలని, అయ్యా చంద్రబాబు... మా ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని నియోజకవర్గ కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద ప్లకార్డులతో ఆందోళనలు చేయాలి. ఇందులో మహిళా విభాగాన్ని కూడా భాగస్వామిగా చేయాలి. మద్యం సేవించే వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, పేదల ప్రాణాలతో ఆటలాడతారా అంటూ కల్తీ మద్యంపై నిరసనలు తెలియచేయాలి. నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలి.నాడు.. పరిమిత వేళల్లో క్వాలిటీతో విక్రయాలు..మన ప్రభుత్వ హయాంలో క్వాలిటీ లిక్కర్ ప్రఖ్యాతి గాంచిన డిస్టిలరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్ జరిగేది. అది కూడా అంతకు ముందు ప్రభుత్వం ఎంపిక చేసిన 20 డిస్టిలరీల నుంచే సేకరించాం. పూర్తి క్వాలిటీ చెక్ తర్వాత, దారి తప్పకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాలకు వచ్చేవి. అప్పుడు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది కాబట్టి ఇష్టారీతిన కాకుండా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పరిమితంగా విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. మద్యం షాపులను 2,934కి తగ్గించాం. అక్రమ పర్మిట్ రూములతోపాటు 43 వేల బెల్టుషాప్లను పూర్తిగా రద్దు చేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే షాపులు నడిపించడం వల్ల ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదు. నాడు సరఫరా చేసిన లిక్కర్ బాటిళ్ల మీద క్యూఆర్ కోడ్ ఉండేది. వాటిని స్కాన్ చేసి అమ్మేవారు. అందువల్ల క్వాలిటీ నూటికి నూరు శాతం ఉండేది. -
Perni Nani: ఏమయ్యా ఎక్సైజ్ మినిస్టర్ బతికే ఉన్నావా? డబ్బు కోసం ఏ గడ్డేనా..!!
-
AP ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య ఘాటు వ్యాఖ్యలు
-
ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య ఘాటు వ్యాఖ్యలు!
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం వల్ల కలిగే ప్రయోజం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన.. ఉచితాలను అలవాటు చేయకూడదంటూ మాట్లాడారు. ‘‘ప్రభుత్వాలు విద్యా, వైద్యంపై ఖర్చు చేయాలి. అంతేకానీ ఉచితాలు అలవాటు చేయకూడదు. విద్య వల్ల పేదవాడు సంపన్నులయ్యే అవకాశాలు ఉన్నాయి. వైద్యం ప్రతి మనిషికి అవసరమైనది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేత పత్రం రూపంలో ప్రజలకు తెలియపరచాలి. ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు., ఎంత తిరిగి చెల్లిస్తున్నారు అన్నది ప్రకటించాలి. .. అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలి. సభలో లేని వారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదు. అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సభలో ఎలా నడుచుకొవాలో ట్రైనింగ్ ఇవ్వాలి. పార్టీ ఫిరాయిస్తే చర్యలు తీసుకోవాలి.. న్యాయస్థానాలు ప్రజా ప్రతినిధులపై కేసులను రెండు సంవత్సరాలలో తీర్పులు ప్రకటించాలి. కోర్టులు తక్కువైతే, జడ్జిలు తక్కువ సంఖ్యలో ఉంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అని నెల్లూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యలు చేశారు. -
తలకాయ బాదుకుంటాడు.. జుట్టు పీక్కుంటాడు.. బాబు, పవన్ను ఇచ్చిపడేసిన పేర్ని నాని
-
ఒక్క రూపాయి ఐఆర్ ఇవ్వలేదు.. ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేస్తున్న బాబు
-
రానున్న మూడు నెలల్లో కూటమి రూ.11,900 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు బడ్జెట్లో రూ.11,900 కోట్ల అప్పు చేయనుంది. ఈ మేరకు సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల రుణాల సమీకరణ క్యాలెండర్ను ఆర్బీఐ నోటిఫై చేసింది.ఇందులో భాగంగా మంగళవారం ఏపీ రూ.1,900 కోట్లు అప్పు చేయనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. నవంబర్ 4న రూ.5,000 కోట్లు, డిసెంబర్ 2న మరో రూ.5,000 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. -
టీడీపీ నేతల కల్తీ మద్యంపై జూపూడి సెటైర్లు
-
విజయవాడ దద్దరిల్లేలా ధర్నా.. ప్రభుత్వానికి APGEF ఛైర్మన్ వార్నింగ్
-
ఆఫ్రికా టు ఆంధ్రా!
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో అంతా తానై చక్రం తిప్పుతున్న ఓ కీలక నేత అండతోనే నకిలీ మద్యం మాఫియా రాష్ట్రంలో రెక్కలు విప్పుకుందని తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలో నకిలీ మద్యం తయారీ రాకెట్ సూత్రధారిగా భావిస్తున్న తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డికి ఆ ‘కీలక’ నేతతో ఉన్న సంబంధం వల్లే ఇంత భారీ స్థాయిలో యథేచ్ఛగా ప్లాంట్ స్థాపించినట్లు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును ప్రకటించే వరకు ఆయనకు రాజకీయంగా పెద్ద గుర్తింపు లేదు. అయితే అంతకు కొద్ది రోజుల ముందు ‘మద్యం’ వ్యాపారానికి సంబంధించిన పలు విషయాలను ఈయన ‘కీలక’ నేతతో చర్చించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీ అధికారంలోకి వస్తే స్థానికంగా మద్యం తయారీతోపాటు గోవాలో ఖాయిలా పడిన మద్యం పరిశ్రమను లీజుకు తీసుకుని వ్యాపారం చేయొచ్చని.. భారీ స్థాయిలో డబ్బు ఆర్జించవచ్చని లెక్కలతో సహా చెప్పడంతోనే టికెట్ ఇచ్చారన్న ప్రచారం ఉంది. అందువల్లే టీడీపీని ఎంతో కాలం నమ్ముకుని ఉన్న, ఆ పార్టీలో గట్టి పట్టున్న నేతగా పేరున్న శంకర్ యాదవ్ను కాదని చివరి క్షణంలో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయక ముందు నుంచి సౌత్ ఆఫ్రికాలో జయచంద్రారెడ్డి మద్యం వ్యాపారంలో ఉన్నారని ఆయన వర్గీయులే చెబుతున్నారు. ఆ అనుభవంతో రాష్ట్రంలో ‘మద్యం’ వ్యాపారం చేసే ‘స్కెచ్’ను ‘కీలక’ నేతకు ఇచ్చినట్లు సమాచారం. మొన్న ములకలచెరువులో బట్టబయలైన నకిలీ ప్లాంట్ తీరుతెన్నులు, ఇన్నాళ్లూ సాగించిన అక్రమ వ్యాపారం తీరు చూస్తుంటే ‘కీలక’ నేత అండదండలు లేకుండా ఇంత భారీగా దందా నడిపించడం అసాధ్యమని ఎక్సైజ్, పోలీసు వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది. ఈ నకిలీ మద్యం దందా సవ్యంగా సాగేందుకు ‘కీలక’ నేత ఆదేశాలతో అన్నమయ్య జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతతో జయచంద్రారెడ్డి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ములకలచెరువు తరహాలో విజయవాడ ప్రాంతంలో ఒకటి, కర్ణాటకలో కూడా మరో నకిలీ మద్యం ప్లాంట్ నడుస్తున్నట్లు సమాచారం. అయితే శనివారం నుంచి వీటిని తాత్కాలికంగా బంద్ చేసినట్లు తెలిసింది.జనార్దనరావును ముందు పెట్టి దందాకళ్లకు కనిపిస్తున్న ఆధారాలు, ఈమధ్య కాలంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈ కేసులో ఏ–1గా కేసు నమోదైన అద్దేపల్లె జనార్దనరావును ముందు పెట్టి.. జయచంద్రారెడ్డి కథ నడిపించారని స్పష్టమవుతోంది. జయచంద్రారెడ్డిది ములకలచెరువు సొంత మండలం. విజయవాడకు చెందిన జనార్దనరావుతో జయచంద్రారెడ్డికి కాలేజీ రోజుల నుంచే స్నేహం ఉంది. తిరుపతిలో చదువుకుంటున్న రోజుల్లో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం జయచంద్రారెడ్డి సొంత మండలంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రారంభించే స్థాయికి వచ్చింది. జయచంద్రారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. చంద్రబాబు చేతుల మీదుగా బి–ఫాంను స్వీకరించే సమయంలోనూ జనార్దనరావు పక్కనే ఉన్నాడు. పైగా ఆ సమయంలో జనార్దనరావు చంద్రబాబుతో చాలా సేపు మాట్లాడినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం రాకెట్పై ఆ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీడీపీలో చేరిన రోజు జయచంద్రారెడ్డితో జనార్దనరావు (ఫైల్) అధికారమే అండగా..ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ నడిపేందుకు ఎక్కడో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంకు చెందిన వ్యక్తికి సాధ్యం అవుతుందా? ఒకవేళ సాధ్యమైనా ఇంతటి ప్రమాదకరౖమెన నకిలీ మద్యం తయారీకి బలమైన స్థానికుల సహకారం లేకుండా సాహసం చేయగలడా? ఇలాంటి పనికి స్థానికులు భవనాలను లీజుకు ఇస్తారా? జయచంద్రారెడ్డి అధికార టీడీపీ ఇన్చార్జి కావడం, ‘కీలక’ నేత అండతో, అధికార బలంతో, వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చని ఇక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఒకవేళ జయచంద్రారెడ్డికి సంబంధం లేకుంటే నకిలీ మద్యం వ్యాపారం ఏ ఇబ్బంది లేకుండా సాగడానికి సహకరించినదెవరో అధికారులు ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదు? నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించడం కూలీలకో, అధికారం లేని వ్యక్తులకో సాధ్యమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే జయచంద్రారెడ్డి పీఏ రాజేష్ నకిలీ మద్యం కేసులో ఐదో నిందితుడు కావడం ఆయన పాత్ర ఉందని నిర్ధారిస్తోంది. సాధారణ వ్యక్తి అయిన రాజేష్కు మద్యం దుకాణం నిర్వహించే స్థాయి లేదు. పాల వ్యాను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమతా లేదు. ఈ లెక్కన కీలక సూత్రధారుల్లో జయచంద్రారెడ్డి కూడా ఒకరని స్పష్టమవుతోంది. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని జయచంద్రారెడ్డి మాత్రం ఓ వీడియో విడుదల చేయడం తెలిసిందే.ఆ మంత్రికి భయం పట్టుకుందినకిలీ మద్యం తయారీ రాకెట్లో టీడీపీ నేతల ప్రమేయం లేదని ఇంత వరకు ప్రభుత్వం కానీ, టీడీపీ వర్గాలు కాని ఖండించలేదు. శుక్రవారం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాయలసీమకు చెందిన ఓ మంత్రి ముందుండి పరిస్థితిని చక్కబెడుతున్నారని సమాచారం. టీడీపీ నేతల ప్రమేయం బయటకు వస్తే దాని ప్రభావం తనపై పడుతుందన్న భయంతో ఆ మంత్రి మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ మంత్రి 2సార్లు ములకలచెరువులో జయచంద్రారెడ్డి ఇంటికి అనధికారికంగా వచ్చారని స్థానిక టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. -
డ్రైవర్ అన్నలకు బాబు బురిడీ
సాక్షి, అమరావతి: ‘అంతన్నాడింతన్నాడే గంగరాజు...’ అని ఉత్తరాంధ్రలో ఓ జానపద గీతం బాగా పాపులర్. ప్రస్తుతం చంద్రబాబు పనితీరూ అలానే ఉంది. మేనిఫెస్టోలో అంత చేస్తాం.. ఇంత చేస్తాం.. అని హామీలు ఇచ్చిన ఆయన తీరా అధికారంలోకి రాగానే మరోసారి తన ట్రేడ్ మార్కు శైలిలో బురిడీ కొట్టిస్తున్నారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ అని చెప్పి తీరా అమలులోకి వచ్చేసరికి కొందరికే అంటూ టోకరా వేశారు. మేనిఫెస్టోను యథాతథంగా ఏనాడూ అమలు చేయని చంద్రబాబు మరోసారి తన ట్రాక్ రికార్డును కొనసాగించారు. ఈసారి ఆయన్ను నమ్మి మోసపోయిన బాధితుల జాబితాలో పేద డ్రైవర్లు కూడా చేరారు. మొదటి ఏడాది పథకాన్ని అమలు చేయకుండా పూర్తిగా ఎగవేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది సరికొత్త మోసానికి తెరతీసింది. దరఖాస్తు చేసేందుకే అవకాశం లేకుండా నిబంధనల చట్రం బిగించి, ఏకంగా 80 శాతం మందికి పథకం అందకుండా చేసింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు ఎంతో చేసిందని చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా ద్వారా సొంత డబ్బా కొట్టుకోవడం విస్మయ పరుస్తోంది. ఇవ్వని హామీ నెరవేరుస్తున్నామని గొప్పలు చెబుతుండటం నివ్వెరపోయేలా చేస్తోంది.ఇద్దరూ బురిడీ బాబులేప్రతి ఎన్నికల ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే చంద్రబాబు.. 2024 ఎన్నికల ముందు అదే పన్నాగాన్ని అమలు చేశారు. బ్యాడ్జి ఉన్న ప్రతి డ్రైవర్కు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామని టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మాటలతో బూరెలు వండటంలో తన తండ్రిని మించిపోయేలా లోకేశ్ హామీలు గుప్పించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్థిక సహాయం పథకం లబ్ధిదారులయ్యేందుకు బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారని ఆయన 2023లోనే ప్రకటించారు. అంటే కనీసం 13 లక్షల మందికి ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన చెప్పారు. ఈ రెండేళ్లలో మరో రెండు లక్షల మంది బ్యాడ్జి పొంది ఉంటారని రవాణా శాఖ వర్గాలే చెబుతున్నాయి. అంటే ప్రస్తుతం 15 లక్షల మంది అర్హులు ఉన్నారని లెక్క తేలుతోంది. ఆ ప్రకారం 15 లక్షల మందికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.2,250 కోట్లు ఆర్థిక సహాయం చేయాలి.ఇదీ టీడీపీ మేనిఫెస్టో బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్కు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న భాగం ఏకంగా 80 శాతం ఎగవేతమేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తామన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా... ‘డ్రైవర్ అన్నల సేవలో..’ అంటూ కేవలం రూ.436 కోట్లే ఇచ్చింది. అందుకోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కింది. బ్యాడ్జి ఉంటే చాలు పథకం వర్తింపజేస్తామన్న చంద్రబాబు.. తీరా ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చే సరికి ఏకంగా 18 నిబంధనలు పెట్టారు. తద్వారా బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు కనీసం దరఖాస్తు చేసేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లు, రేషన్ సరుకులు డెలివరీ వాహనాలు.. ఇలా లక్షలాది మందికి పథకం అందకుండా ఆంక్షలు విధించారు. లోకేశ్ చెప్పినట్టు 2023లోనే 13 లక్షల మంది బ్యాడ్జి ఉన్న వారు ఉంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘డ్రైవర్ అన్నల సేవలో’ పథకాన్ని 2.9 లక్షల మందికే పరిమితం చేసి, ఏకంగా 12 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఈ 2.9 లక్షల మందిలో కూడా తుదకు ఎంత మందికి ఎగ్గొడతారో అని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో.. పథకానికి సంబంధించి అర్హత నిబంధనల పేరుతోనే ఏకంగా 10 లక్షల మందికి కోత విధించారు. ఇక దరఖాస్తు చేసిన 3,21,531 మందికి కూడా పథకాన్ని వర్తింప చేయలేదు. వారిలో కూడా 2,90,669 మందినే అర్హులుగా ప్రకటించారు. దాంతో ఈ పథకం కింద ఆర్థిక సహాయం రూ.436 కోట్లకే సరిపెట్టారు. ఇస్తామని ఎన్నికల్లో చెప్పింది రూ.2,250 కోట్లు కాగా, ఇచ్చింది కేవలం రూ.436 కోట్లే. అంటే ఇచ్చిన హామీలో 80 శాతం కోత విధించారన్నది స్పష్టమవుతోంది. అదీ చంద్రబాబు మార్కు బురిడీ అంటే అని మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేశారు. తొలి ఏడాది పూర్తిగా ఎగవేత మేనిఫెస్టోను అమలు చేయకుండా అడ్డదారులు వెతకడంలో తనది మాస్టర్ మైండ్ అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు అందరికీ ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్న ఆయన.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అంటే 2024లో ఆ పథకం ఊసే ఎత్త లేదు. తొలి ఏడాది డ్రైవర్లకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదు. ఆ విధంగా ఒక ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది పథకం అమలు చేస్తామంటూనే ఏకంగా 18 నిబంధనలు విధించి అర్హుల జాబితాలో భారీగా కోత విధించారు. మేనిఫెస్టోను సక్రమంగా అమలు చేయకుండా మోసం చేయడంలో చంద్రబాబు ట్రేడ్ మార్క్ అంటే ఇదే మరి. ఇప్పటికే భారీగా ఆదాయం కోల్పోతున్న ఆటో డ్రైవర్లుచంద్రబాబు ప్రభుత్వ విధానాలతో ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇక్కట్లలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆదాయం భారీగా పడిపోయింది. ఆటోల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకం ద్వారా అయినా కాస్త ఊరట లభిస్తుందని ఆశించిన డ్రైవర్లకు నిరాశే మిగిలింది. ఏకంగా 10 లక్షల మందిని ఈ పథకానికి అనర్హులుగా చేసి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పథకాన్ని సక్రమంగా అమలు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంమేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేయడం అంటే ఏమిటో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు చేతల్లో చూపించింది. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సి కేబ్, రేషన్ వాహనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ‘వైఎస్సార్సీపీ వాహన మిత్ర’ పథకాన్ని అందించింది. మొదటి ఏడాది అని ఎగవేయలేదు. చివరి ఏడాది ఎన్నికల నియమావళి అని సాకుతో తప్పించుకోలేదు. అధికారంలోకి రాగానే పథకం అమలు చేసింది. కోవిడ్ సమయంలోనూ క్రమం తప్పకుండా అందించింది. చివరి ఏడాది ఎన్నికల నియమావళి అమలులోకి రావడానికి ముందే వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సహాయం అందించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే ఏమిటో వైఎస్ జగన్ చేతల్లో చూపించారని డ్రైవర్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విరమించకపోతే ఉద్యమం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోకుంటే ఉద్యమం తప్పదని పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ సమితి హెచ్చరించింది. శనివారం పాలకొల్లులోని పూలపల్లి అంబేడ్కర్ భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘పాలకొల్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ’ అంశంపై నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఇందులో భాగంగా 17 మెడికల్ కళాశాలలను జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం గత ప్రభుత్వం రూ.2,400 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంకా దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అరకొర పనులు చేపట్టిందని కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ వాటిని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించామని కబుర్లు చెబుతూ ప్రజలకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పీపీపీ అంటూనే వైద్యకళాశాలలు ప్రైవేటుపరం కావని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. పీపీపీ పద్ధతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకే కాకుండా ఓసీ కులాల్లోని పేద విద్యార్థులకూ నష్టం కలిగిస్తుందన్నారు.వైద్యం, విద్య రెండూ ప్రభుత్వ రంగాల్లో ఉంటేనే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే విద్య, వైద్యం రెండూ ఖరీదయ్యాయని, మరింత ఖరీదు కాకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సీపీఎం నేత జేఎన్వీ గోపాలన్, దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్కుమార్, సంచార జాతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్ర వీరన్న, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు జవ్వాది శ్రీనివాసరావు, జేవీవీ జిల్లా నాయకుడు యర్రా అజయ్కుమార్, దగ్గులూరు సర్పంచ్ పేరయ్య, పట్టణ జేఏసీ చైర్మన్ గుడాల హరిబాబు తదితరులు మాట్లాడారు. -
విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టే కుట్ర
సాక్షి, విశాఖపట్నం: విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టేసి.. ప్రజలకు ప్రధాన అవసరాల్ని దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో కుట్ర పన్నుతోందని ‘పీపుల్స్ ఫర్ ఇండియా’ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రజారోగ్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ప్రజారోగ్య వేదిక, పీపుల్ ఫర్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శనివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. విలువైన ప్రజాధనాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే చంద్రబాబు వైఖరిపై ప్రజా ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించారు.ఐదేళ్ల తర్వాత పదవిలో ఉంటామన్న గ్యారెంటీ లేదు ఐదేళ్ల తర్వాత గెలుస్తామో లేదో అన్న గ్యారెంటీ అధికారంలో ఉన్న వాళ్లకి లేదు. ఐదేళ్లలోనే 50 ఏళ్ల రాజకీయ జీవితంలో సంపాదించాల్సిందంతా సంపాదించేయాలన్న తొందరతోనే రాజకీయ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బలవుతున్నారు. కాబట్టి.. ప్రజలే ముందుకు రావాలి. నిరసనల్ని ఉద్యమంగా మార్చి.. ప్రజావ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. – ఎంవీఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్సీప్రజాధనాన్ని ప్రైవేట్కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రజాధనాన్ని ప్రైవేట్కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్వో ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్వో -
సారీ చెప్పకుండా... సంబరాలా?
నవరాత్రి ఉత్సవాలు మొదలుకొని దీపావళి పండుగ ముగిసే వరకూ ఈ నెల రోజుల సీజన్ను ఎన్డీఏ సర్కార్ హైజాక్ చేసింది. జీఎస్టీ పేరుతో వసూలు చేస్తున్న పన్నులను హేతుబద్ధీకరణ చేయడం వల్ల పేద, మధ్య తరగతుల ప్రజలకు బాగా ఆదా అవుతుందనీ, అందువల్ల ఈ సీజన్ను పొదుపు ఉత్సవంగా పాటించాలనీ దేశ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలను కూడా ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ దీంతో పాటు మరో అంశాన్ని కూడా జోడించింది. అయితే దాన్ని అధికారిక కార్యక్రమాల్లో కలపకుండా పార్టీ వేదికల ద్వారా ప్రచారం చేసుకోవాలని సంకల్పించారు. వసూలు చేసిన కరెంటు బిల్లుల్లో యూనిట్కు 13 పైసల చొప్పున తిరిగి వినియోగదారులకు జమ చేస్తారట! దీన్నే ట్రూ–డౌన్ అంటున్నారు. ఇది చరిత్ర ఎరుగని మహత్కార్యం అన్నట్టు ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేశారు.నిజంగా ఇవి సంబరాలు చేసుకోదగిన సందర్భాలేనా? ఒంటినిండా వాతలు పెట్టి అక్కడక్కడా ఆయింట్మెంట్ రాస్తే ఉపశమనం లభించినట్టేనా! ఆ బాధితుడు అందుకు కృతజ్ఞతగా ఎగిరి గంతేసి పండుగ చేసుకోవాలా? జీఎస్టీని హేతుబద్ధం చేస్తున్నారంటే ఎనిమిదేళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం నిర్హేతు కమైనదని అంగీకరించినట్టే కదా! ఈ ఎనిమిదేళ్లుగా సాధారణ ప్రజల రక్తాన్ని తాము జలగల్లా పీల్చుకున్నామని పరోక్షంగా చెప్పినట్టే కదా! ఈ హేతుబద్ధీకరణ వలన ప్రజలకు రెండున్నర లక్షల కోట్ల మేరకు లబ్ధి జరుగుతుందని ప్రధానమంత్రి ప్రకటించారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇందులో మళ్లీ కొన్ని మెలికలున్నాయి. అందువల్ల ప్రభుత్వం చెబుతున్నంత స్థాయిలో ఉపశమనం కలుగదనే వాదన ఉన్నది. పాప్కార్న్ మీద జీఎస్టీ 5 శాతం మాత్రమే అన్నారు. కానీ బ్రాండెడ్ అయితే 12 శాతం, షుగర్ కోటెడయితే 18 శాతం జీఎస్టీ ఉంటుంది. జీవిత బీమా ప్రీమియం మీద జీఎస్టీ లేదన్నారు. కానీ అది వ్యక్తిగత బీమాలకు మాత్రమే వర్తిస్తుంది. గ్రూప్ బీమాకు జీఎస్టీ కట్టాల్సిందే. ఇలాంటివి చాలా ఉన్నాయి.స్థూలంగా పన్ను రేట్లు తగ్గడం వలన అదే నిష్పత్తిలో విని మయం కూడా పెరిగి ప్రభుత్వ ఖజానాకు వాటిల్లే నష్టం నామమాత్రంగానే ఉండబోతున్నదని ఎస్బీఐ ఇదివరకే అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే ఈ నవరాత్రి వేడుకల్లో వివిధ అంశాలవారీగా 25 శాతం నుంచి 100 శాతం వరకు గతంతో పోలిస్తే అమ్మకాలు పెరిగాయని అధికార వర్గాలను ఉటంకిస్తూ పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ ఎనిమిదేళ్లలో అమలు చేసిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధానం వల్ల ప్రజలకు జరిగిన నష్టమెంత అనేదానిపై మాత్రం ఎటువంటి సింహావలోకనం అధికారికంగా జరగలేదు. జీఎస్టీ అమలుకు ముందు సంవత్సరం అంటే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు జీఎస్టీ పరిధిలో ఉన్న పరోక్ష పన్నుల ద్వారా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వా లకు సమకూరిన ఆదాయం సుమారు 12 లక్షల కోట్లని అంచనా. ఇదే ఆదాయం 2024–25 నాటికి 22 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇందులో ఏటికేడు సహజంగా వుండే వృద్ధి కొంత ఉండవచ్చు. కాని సింహభాగం వృద్ధి మాత్రం జీఎస్టీ ద్వారా సాధ్యమైనదే.అయితే ఇంత భారీ పెరుగుదలకు కారణమెవరు? దేశంలో ఈ పదేళ్లలో శరవేగంగా పుట్టుకొచ్చిన బిలియనీర్లూ, మిలియ నీర్లా? కానేకాదు. సాధారణ పేద మధ్య తరగతి ప్రజలు కడుపు కట్టుకొని ఖజానాకు ముడుపు కట్టిన ఫలితమే ఈ అసాధారణ పెరుగుదల. ఆదాయాల్లో, ఆస్తిపాస్తుల్లో అట్టడుగున ఉండే 50 శాతం మంది పేద ప్రజలు జీఎస్టీలో 64 శాతం చెల్లిస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. వీరికంటే ఎగువన ఉండే 40 శాతం మంది జీఎస్టీ చెల్లింపుల వాటా 33 శాతం. ఇక అగ్రశేణి పది శాతం సంపన్నుల సంగతి. ఈ పదేళ్లలో వీరి సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని అనేక అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పది శాతం కుబేరులు సమష్టిగా మోస్తున్న జీఎస్టీ భారం కేవలం మూడు శాతం. యాభై శాతం మంది పేదలు 64 శాతం చెల్లిస్తుంటే 10 శాతం పెద్దలు 3 శాతం చెల్లిస్తున్నారనేది ఈ జీఎస్టీ రాజ్లో ఒక కఠిన వాస్తవం. అధికాదాయం కలిగిన వారు చెల్లించడానికి జీఎస్టీ కాకుండా వేరే పన్నులున్నాయని వాదించవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ పన్ను, అధికాదాయంపై సర్ఛార్జ్, కేపిటల్ గెయిన్స్ అంతా కలిపి సమకూరింది 11,56,000 కోట్లు. అదే సమయంలో 50 శాతం పేదలు జీఎస్టీ రూపంలో చెల్లించింది 22 లక్షల కోట్లలో 64 శాతం. అంటే సుమారు 14 లక్షల కోట్లు. మన సమాజంలో త్యాగమెవరిదో, భోగమెవరిదో చెప్పడానికి ఈ అంకెలు అద్దం పడతాయి. ఈ జీఎస్టీ కాలంలోనే దేశ ప్రజల ఆదాయాల్లో పెరుగుతున్న అసమానతలపై ఆక్స్ఫామ్ లాంటి సంస్థలు ఏటేటా సవివర మైన నివేదికలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ విష యాలకు మరో కొత్త పార్శ్వం తోడైంది. కార్తీక్ మురళీధరన్ అనే ఆర్థికవేత్త శనివారం నాటి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ఒక వ్యాసం రాస్తూ ఆదాయాల పరంగా ఇండియాను మూడు ఇండియా లుగా పేర్కొన్నారు. గతంలో లోహియా, ఫెర్నాండెజ్ వంటి సోషలిస్టులు గ్రామీణ భారత్, అర్బన్ ఇండియాలుగా రెండుగా విభజించి మాట్లాడేవారు. ఇప్పుడది మూడుకు చేరింది. ఇండస్ వ్యాలీ రిపోర్ట్ను ఉటంకిస్తూ కార్తీక్ మురళీధరన్ ఈ ప్రస్తావన చేశారు. ఇందులో ఒకటవ ఇండియా పది శాతం జనాభా గల సంప న్నులది. వీరి తలసరి ఆదాయం 15 వేల డాలర్లు. తర్వాత శ్రేణిలోని రెండో ఇండియా 20 శాతం మంది ప్రజలది. వీరి తలసరి ఆదాయం 3 వేల డాలర్లు. ఇక 70 శాతం మంది భారతీయుల ఆదాయం వెయ్యి డాలర్లు. వాళ్లే మూడో భారత్. ప్రపంచ బ్యాంకు వర్గీకరణ ప్రకారం 13,936 డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం వున్న దేశం అధికాదాయం గల దేశం కింద లెక్క. 14 కోట్లకు పైగా జనాభా ఉన్న మన ఫస్ట్ ఇండియా ఈ శ్రేణిలోకి వస్తుంది. 4,496 డాలర్ల నుంచి 13,935 డాలర్ల మధ్యన తలసరి ఆదాయం ఉండే దేశాలను అప్పర్ మిడిల్ ఆదాయం గల దేశంగా ప్రపంచ బ్యాంకు పరిగణించింది. మూడు ఇండియాల్లో ఒకటి కూడా ఈ శ్రేణిలోకి రాలేదు. లోయర్ మిడిల్ క్లాస్లోకి మన 20 శాతం జనాభా (సుమారు 30 కోట్లు) ఉన్న ఇండియా చేరింది. 1,136 డాలర్ల నుంచి 4,495 డాలర్ల తలసరి ఆదాయమున్న దేశాలు ఈ లోయర్ మిడిల్ క్లాసులోకి వస్తాయి. 1,135 డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయమున్న దేశాలు ప్రపంచ బ్యాంకు దృష్టిలో అల్పాదాయ దేశాలు, అంటే పేద దేశాలు. ఇందులోకి మన 70 శాతం (సుమారు వంద కోట్లు) జనాభా వస్తుంది. అంటే మన దేశంలోని వంద కోట్లమంది జీవన ప్రమాణాలు ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశాల ప్రజలతో ఇంచుమించు సమానమన్నమాట. ఇదిగో ఈ నిరుపేదలే గడచిన ఒక్క సంవత్సరంలో వసూలైన జీఎస్టీలో (22 లక్షల కోట్లు) అత్యధిక భాగాన్ని చెల్లించారు. ఈ ప్రజలకు ఇప్పుడు కొంత ఉపశమనం కలిగించడాన్ని స్వాగతించవలసిందే. కానీ ఈ ప్రభుత్వమే చెబుతున్నట్టు ఎనిమిదేళ్ల ‘నిర్హేతుక’ విధానానికి పేదలు చెల్లించిన మూల్యం సంగతి? కనీసం క్షమాపణలైనా చెప్పరా? పైగా పండుగ చేసుకోమనడం ఒక క్రూర పరిహాసం.ఇటువంటి పరిహాసాలు చేయడం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నాయకుడు చంద్రబాబుకు పరిపాటి. కరుడుగట్టిన పేద ప్రజల వ్యతిరేకిగా ఆయనది చెక్కుచెదరని ట్రాక్ రికార్డు. గడిచిన ఎన్నికలకు ముందు ఆయన చేసిన అనేక బూటకపు వాగ్దానాల్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తామనేది ఒకటి. కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 15,450 కోట్ల మేరకు ట్రూ–అప్ పేరుతో జనాన్ని బాదారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆమోదించిన దానికంటే విద్యుత్ కొను గోలు – పంపిణీ మీద ఎక్కువ వ్యయమైతే ఈఆర్సీ అనుమతితో పెరిగిన వ్యయానికి అనుగుణంగా ట్రూ–అప్ ఛార్జీలు వసూలు చేస్తారు. వివిధ కారణాల వల్ల ఆమోదించిన వ్యయం కంటే తక్కువ ఖర్చయినప్పుడు ఆ మిగులును వినియోగ దారులకు రీఫండ్ చేయవలసి ఉంటుంది. తొలి రోజుల్లో బాదేసిన 15,545 కోట్ల బాదుడుకు తోడు మరో విడత 2,700 కోట్ల బాదుడుకు ప్రతిపాదనలు పంపించారు. ట్రూ–డౌన్ చేయవలసిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో 1,800 కోట్ల బాదుడుకే ఈఆర్సీ అనుమతించింది. అ సొమ్మును అప్పటికే వసూలు చేసినందున 900 కోట్లు వినియోగదారులకు రీఫండ్ చేయాలని ఆదేశించింది.ఇప్పటికే వినియోగదారులపై ట్రూ–అప్ పేరుతో బాదేసి వసూలు చేస్తున్న మొత్తం 15,545 కోట్లు, ట్రూ–అప్కు అదనపు ప్రతిపాదన 2,700 కోట్లు. వెరసి 18 వేల కోట్ల పైచిలుకు. ఇందులో 900 కోట్లను రీఫండ్ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. మొత్తం బాదుడులో ఇది ఐదు శాతం. వినియోగదారుని జేబు లోంచి రూపాయి లాగేసుకొని ఓ ఐదు పైసలు చేతిలో పెట్టి ఎంజాయ్ చేయాలని చెబుతున్నారు. మొదట్లో ఇదో గొప్ప వరంలాగా యెల్లో మీడియా, ‘దేశం’ పెద్దలు తెగ హడావుడి చేశారు. కానీ ఈఆర్సీ ఆదేశాల సంగతి బయటపడేసరికి జీఎస్టీ ఉత్స వాలలో కలపకుండా విడిగా పార్టీ వేదికల ద్వారా ఇదో అద్భుత చర్యగా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించారు. చంద్రబాబు స్వయంగా ఇది కనీవినీ ఎరుగని కార్యక్రమంగా వర్ణించు కున్నారు. ఎన్నికల హామీకి అనుగుణంగా చార్జీలను తగ్గిస్తు న్నామనీ, ఇది తమ సమర్థ నిర్వహణ ఫలితమనీ కూడా ఆయన చెప్పుకొన్నారు. వంద రూపాయలు పెంచి ఐదు రూపాయలు తగ్గించడమా ఎన్నికల హామీని నెరవేర్చడమంటే? దీన్ని సమర్థవంతమైన నిర్వహణగా పరిగణించాలా?ప్రజలకు ఇటువంటి షాకులివ్వడం పండుగ చేసుకో మనడం చంద్రబాబు సర్కార్కు అలవాటే. ఈ పదహారు మాసాల కాలంలోనే ఆయన సర్కార్ చేసిన గాయాలు పేద, మధ్య తరగతి ప్రజల నిలువెల్లా కనిపిస్తున్నాయి. చేసిన నమ్మక ద్రోహాలకు ఊరూరా శిలాఫలకాలు వేయవచ్చు. ఏటా సమారు 32 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ‘ఆడబిడ్డ’ పథ కాన్ని పూర్తిగా ఎత్తివేసి, ప్రతి నిరుద్యోగికి నెలకు 3 వేల రూపా యలు ఇస్తామన్న హామీని ఎగవేసి, మిగిలిన హామీలను అర కొరగా, అదీ ఏడాది ఆలస్యంగా ప్రారంభించి సూపర్ సిక్స్ను అమలుచేశామని చెప్పుకోగలిగిన ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది అనుకోవాలి.ఈ పదహారు మాసాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ కొలువులు తీసి ‘నరేగా’ పథకాన్ని నీరుగార్చి గ్రామీణ ఉపాధిని దెబ్బతీసినందువల్ల జరిగిన నష్టమెంత? పేద ప్రజలు కోల్పోయిన ఆదాయ మెంత? లెక్కతీయాలి కదా! ప్రజారోగ్యాన్ని పడకేయించిన కారణంగా, ఆరోగ్యశ్రీని కోమాలోకి పంపినందువల్ల, ఆరోగ్య ఆసరా గొంతు నులిమిన ఫలితంగా, అంబులెన్స్ సర్వీసులకు పెట్టిన పంచర్ల పాపం వలన పేద మధ్య తరగతి ప్రజలకు జరిగిన, జరుగుతున్న నష్టమెంత? వైద్య వ్యాపారులకు ఒన గూరిన లాభమెంత? విద్యారంగంలో గేమ్ ఛేంజర్ వంటి ‘నాడు–నేడు’ అనే బృహత్తర కార్యక్రమాన్ని నిలిపివేసి, పేద విద్యార్థులు అందుకున్న ఉన్నతమైన వసతులను ఊదిపారేసినందువల్ల ఐదున్నర లక్షలమంది పేద మధ్యతరగతి వర్గాల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లను వదిలేశారు. ఫలితంగా విద్యా వ్యాపారులకు కలిగిన లాభమెంత? పేద ప్రజలకు కలిగిన నష్టమెంత? జగన్ ప్రభుత్వం కొనసాగి వుంటే అప్పటికే పూర్తయిన పది లక్షల ఇళ్ళకు అదనంగా మరో పది లక్షలు పూర్తయ్యేవి. ఆ కుటుంబాల కలలను కాల్చేసినందుకు వారి గుండెల్లో గూడుకట్టుకున్న విషా దపు విలువెంత? 30 లక్షల మంది నడివయసు స్త్రీల చేయూతను లాగేసినందువల్ల ఆ మహిళలు చేస్తున్న ఆక్రందనను ఎలా ఉపశ మింపజేస్తారు! ఇటువంటి పర్యవసానాలు ఈ పదహారు మాసాల పాలన ఫలితంగా ఎన్నో ఉన్నాయి. అన్ని లెక్కలూ వేసి లాభపడ్డవాళ్ళను పండుగ చేసుకోమంటే బాగుంటుంది. గాయ పడిన వారితో గేమ్స్ ఆడటం అమానుషం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Auto Drivers: ఉచిత బస్సుతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటున్న డ్రైవర్లు
-
పండగపూట.. పండుటాకులకు షాక్!
పింఛన్ డబ్బులో కోత వేశారు పింఛనుపైనే ఆధారపడి జీవిస్తున్నా. ఇంటి పన్ను వసూలు కోసం ఈ నెల పింఛన్ల డబ్బుల్లో కోత విధించారు. మార్చి నెల వరకు గడువున్నా ఇప్పుడే ఇంటి పన్ను వసూలు చేశారు. నెలంతా ఆ డబ్బులే నాకు ఆధారం. ఏ పని చేయలేని పరిస్థితి. పింఛను సొమ్ముతోనే కుటుంబ పోషణ, మందులు కొనుక్కోవాలి. – రామన్నదొర, దివ్యాంగుడు, గోపవరం జగన్ హయాంలో ఇంటికే పెన్షన్లు, పథకాలు.. ఒకటో తారీఖు వచ్చిందంటే పండుగ! బాబు పాలనలో ఇంటింటికీ అగచాట్లు, కోతలు, పన్ను పోటు.. ఒకటే తేదీ అంటే వణుకే! సాక్షి, అమరావతి, నెట్వర్క్: గత ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఇంటివద్దే ఆత్మగౌరవంతో పింఛన్లు అందుకున్న అవ్వాతాతలు, దివ్యాంగులను ఇప్పటికే రోడ్డుకీడ్చి దురవస్థ పాలు చేసిన చంద్రబాబు సర్కారు.. పండుగ పూట వారికి మరో షాక్ ఇచ్చింది. పండుటాకులకు ఒకచేతితో పింఛన్లు ఇస్తూ మరోచేతితో వాటిని ఇంటి పన్నుల కింద జమ చేసుకుంటోంది. బుధవారం పింఛన్ల పంపిణీలో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఈ ఏడాది ఇంటి పన్నులు 100 శాతం వసూలు చేయాలని కూటమి సర్కారు ఆదేశించడంతో పింఛన్ల డబ్బుల నుంచి దాన్ని మినహాయించుకుంటున్నారు. పింఛన్ డబ్బులే తమకు జీవనాధారమని, నెలంతా వాటితోటే గడపాలని, మందులకూ అవే దిక్కని వృద్ధులు ఆక్రోశిస్తున్నారు. గత ప్రభుత్వంలో అవ్వాతాతలకు గుడ్ మార్నింగ్ చెప్పి మరీ ఇంటి వద్దే పెన్షన్లు ఇచ్చిన వలంటీర్ల వ్యవస్థను కక్షపూరితంగా రద్దు చేసిన చంద్రబాబు సర్కారు సచివాలయాల వ్యవస్థను కూడా పూర్తిగా నీరుగార్చింది. సామాజిక పెన్షన్లకు ఎడాపెడా కోతలు పెట్టింది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో గరిష్టంగా ఇచ్చిన పింఛన్ల సంఖ్య ఏకంగా 66.34 లక్షలు కాగా కూటమి సర్కారు ఈ ఏడాది సెపె్టంబర్ 1న డబ్బులు పంపిణీ చేసిన పింఛన్లు కేవలం 61,93,363 మాత్రమే కావడం గమనార్హం. అంటే ఏడాదిన్నరలో దాదాపు నాలుగున్నర లక్షల మంది పింఛన్లకు కోత వేసినట్టు స్పష్టమవుతోంది. ఇక దివ్యాంగుల పరిస్థితి మరీ దారుణం. వైకల్య శాతం పేరుతో దాదాపు లక్ష దివ్యాంగ పింఛన్లను చంద్రబాబు ప్రభుత్వం ఎగరగొట్టింది. దేశంలో ఏ పాలకుడూ ఇంత నిర్దయగా వ్యవహరించిన దాఖలాలు లేవని దివ్యాంగులు ఆర్తనాదాలు చేసినా కూటమి సర్కారు పట్టించుకోలేదు. వంద శాతం వసూళ్లకు పింఛన్లే టార్గెట్..! గ్రామాల్లో ఈ ఆర్థిక ఏడాది ఇంటి పన్ను వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దీంతో సాధారణంగా గ్రామాల్లో పంటలు వచ్చాక డిసెంబరు నుంచి మార్చి వరకు జరిగే ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని అధికార యంత్రాగం ఆగస్టు నుంచే ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను డిమాండ్ రూ.702 కోట్లతో పాటు పాత బకాయిలు మరో రూ.233 కోట్లు కలిపి మొత్తం రూ.935 కోట్లుగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నుంచే కొత్తగా యజమానికి జారీ చేసే ఇంటి పన్ను నోటీసు, పన్ను చెల్లింపు ప్రక్రియ ఆన్లైన్లో కొనసాగేలా పంచాయతీరాజ్ శాఖ వెబ్పోర్టల్ తెచ్చింది. నోటీసు అందుకున్న 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, జిల్లాల వారీగా ఏ రోజు ఎంత మేర ఇంటి పన్ను వసూలు జరిగిందో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పాత బకాయిలు రూ.233 కోట్లు నెల రోజుల్లో వసూలు చేయాలని ఆదేశించారు. దీంతో ఇంటి పన్ను వసూలుకు పెన్షన్ల పంపిణీ సరైన సమయంగా భావించారు. అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారులకు 1వ తేదీన పింఛను ఇవ్వగానే ఆ డబ్బును ఇంటిపన్ను కింద లాగేసుకుని రశీదు చేతిలో పెడుతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం చిత్తూరు జిల్లావ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అవస్థల నడుమ ఆలస్యంగా సాగింది. వేకువజామున లబ్ధిదారుల ఇంటివద్దకు వెళ్లి ఇవ్వాల్సి ఉండగా ఉదయం 11 వరకు సచివాలయాల్లో పంపిణీ ప్రారంభించలేదు. ఇంటింటికి వెళ్లి తాము పంపిణీ చేసేందుకు వలంటీర్లం కాదంటూ నిరసన వ్యక్తం చేశారు.అల్లూరి జిల్లా తామరపల్లి పంచాయతీ గోపవరంలో బంధం కుమారికి పింఛన్ నుంచి ఇంటిపన్ను మినహాయించుకుని చేతిలో పెట్టిన రశీదు పెన్షన్ డబ్బులిచ్చి.. పన్ను రశీదు చేతిలో పెట్టారు సచివాలయ ఉద్యోగి పింఛను డబ్బులు ఇచ్చిన వెంటనే ఇంటి పన్ను రశీదు ఇచ్చి బలవంతంగా వసూలు చేశారు. పింఛన్లు డబ్బుల నుంచి ఇంటి పన్ను వసూలు చేయడం దారుణం. నెలంతా ఎదురు చూసే డబ్బులకు కోత పెట్టడం అన్యాయం. ఇంటి పన్నులు గతం కంటే ఎక్కువగా వస్తున్నాయి. – బోరగ చిన్నలమ్మ, వృద్దురాలు, గోపవరంఇచ్చినట్టే ఇచ్చి... ఇటు పింఛను డబ్బులిచ్చి అటు ఇంటి పన్ను అంటూ రూ.710 వసూలు చేశారు. పింఛను డబ్బులపైనే ఆధారపడి జీవించే మాలాంటి వారి నుంచి బలవంతంగా వసూలు చేయడం అన్యాయం. నెమ్మదిగా ఇంటి పన్ను చెల్లిద్దామనుకుంటే పింఛను డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కున్నారు. గతంలో ఇంటి పన్ను రూ.400 మాత్రమే రాగా ఇప్పుడు బాగా పెరిగింది. – బంధం సముద్రలమ్మ, వితంతువు ,గోపవరంఅల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం తామరపల్లి పంచాయతీ పరిధిలోని గోపవరంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పంపిణీ చేసిన సామాజిక పెన్షన్లలో బుధవారం కోత విధించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే పన్ను రశీదులు చేతిలో పెట్టారని పింఛనుదారులు వాపోయారు. పింఛను డబ్బులనే నమ్ముకుని నెలంతా గడిపే వారికి కోత విధించడంతో దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. తామరపల్లి పంచాయతీ పరిధిలో వివిధ రకాల పింఛనుదారులు 261 మంది ఉండగా పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారుల వద్ద డబ్బులు ఉంటాయి కాబట్టి వాటిని రాబట్టాలని జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించినట్లు చెబుతున్నారు. ఏజెన్సీ అంతటా పన్నులు వసూలు చేయాలని నిర్దేశించినట్లు పేర్కొంటున్నారు. – రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)పింఛన్ కోసం పడిగాపులు రాజుపాలెం: వెల్ఫేర్ అసిస్టెంట్ అత్యుత్సాహం పింఛనుదారులను ముప్పతిప్పలు పెట్టింది. కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసేవరకు వెళ్లింది. ఉదయం 6 నుంచి 10 వరకు అటుఇటు తిరిగిన పింఛన్దారులు గందరగోళానికి గురయ్యారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీకృష్ణ గ్రీన్ అంబాసిడర్ ద్వారా 10 గంటలకు పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్లు ఇస్తామని దండోరా వేయించారు. దీంతో పింఛన్దారులు పెద్దఎత్తున చేరుకున్నారు. ఇన్చార్జి ఎంపీడీవో పగడాల ముక్కంటి హుటాహుటిన అనుపాలెం చేరుకుని సిబ్బందిని పురాయించి పింఛన్ల పంపిణీ చేపట్టారు. -
Venkatramiereddy: బాబు హామీలన్నీ పచ్చి అబద్దాలే..
-
చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ ను విడిచి వెళ్ళేది లేదు
-
కేవలం పైశాచిక ఆనందం కోసమే YSRCP నేతలపై కేసులు
-
ప్రశ్నిస్తానన్న పవన్ ఏమైపోయాడు.. మా పోరాటం ఆగదు
-
ప్రశ్నిస్తే అక్రమ కేసులు ప్రభుత్వంపై రామ సుబ్బారెడ్డి ఫైర్
-
మహిళలకు బాబు మోసం!
సాక్షి, అమరావతి: హామీలతో మభ్యపుచ్చిన చంద్రబాబు సర్కారు మరోసారి మహిళలను దారుణంగా దగా చేస్తోంది. ఇప్పటికే మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను పూర్తిగా రద్దు చేసిన కూటమి ప్రభుత్వం 1.80 కోట్ల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి.. కోటి మందికిపైగా పొదుపు మహిళలకు సున్నా వడ్డీని ఎగరగొట్టింది. తాను అధికారంలోకి వస్తే సున్నా వడ్డీని రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తామన్న ఎన్నికల హామీపై సీఎం చంద్రబాబు ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ మోసాలు ఇంతటితో ఆగడం లేదు. ఒకపక్క ఎన్నికల హామీలను నెరవేర్చకుండా.. మరోపక్క ఆర్బీఐ, చట్ట నిబంధలనకు విరుద్ధంగా ‘స్త్రీనిధి’కి ఎసరు పెడుతున్నారు. స్త్రీనిధి నుంచి మహిళలకు హక్కుగా రావాల్సిన డబ్బులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి తిరిగి వసూలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికీ.. ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఓ ఇంట్లో 18 ఏళ్లు దాటిన మహిళలు ఇద్దరు ఉంటే ఏటా రూ.36 వేల చొప్పున ఇవ్వాలి.. అదే నలుగురు ఉంటే రూ.72 వేలు ఇవ్వాల్సి ఉండగా ఈ పథకాన్ని ఎగరగొట్టింది. ఆడబిడ్డ నిధి పథకాన్ని 16 నెలలు దాటినా అమలు చేయలేదు. మరోవైపు.. వైఎస్సార్ సీపీ హయాంలో ఐదేళ్లపాటు పొదుపు సంఘాల మహిళలకు అమలు చేసిన సున్నా వడ్డీ పథకం సైతం కూటమి సర్కారు వచ్చాక నిలిచిపోయింది. గత ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలు తీసుకునే రుణాలపై రూ.3 లక్షల వరకే సున్నా వడ్డీ అమలు చేసిందని, తాము అధికారంలోకి వస్తే సున్నా వడ్డీ రూ.10 లక్షల దాకా వర్తింపజేస్తామంటూ చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కూటమి నేతల హామీ మేరకు ఈ పథకం అమలుకు ఏటా సుమారు రూ.ఆరు వేల కోట్ల దాకా అవసరమని అంచనా. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా ఏప్రిల్లో ఈ పథకాన్ని అమలు చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా 2024 ఏప్రిల్లో నిధుల విడుదల నిలిచిపోగా అనంతరం కూటమి సర్కారు ఆ ఏడాది డబ్బులను మహిళలకు బకాయి పెట్టింది. రెండేళ్లకు సంబంధించి ఒక్క సున్నా వడ్డీ పథకం ద్వారానే బకాయిలతో కలిపి సుమారు రూ.7,000 కోట్ల మేర రాష్ట్రంలోని కోటి మందికి పైగా పొదుపు సంఘాల మహిళలకు చెల్లించాల్సి ఉన్నా చంద్రబాబు సర్కారు పైసా ఇవ్వలేదు. ఇక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 1.80 కోట్ల మంది మహిళలు ఏటా రూ.18 వేలు చొప్పున సాయం పొందేందుకు అర్హులని అంచనా. ఈ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడంతో మహిళలు ఏటా రూ.32,400 కోట్లు దాకా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ హయాంలో అన్ని సంక్షేమ పథకాలను మహిళలు కేంద్రంగా సంతృప్త స్థాయిలో అమలు చేసి మహిళా సాధికారతకు బాటలు వేశారు. మహిళలకు నేరుగా పథకాలు అందచేయడంతో రూ.1.89 లక్షల కోట్ల మేర డీబీటీ విధానంలో ప్రయోజనం పొందారు. వైఎస్ జగన్ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేసిన రూ.1.70 లక్షల కోట్ల రుణాలు కాకుండా స్త్రీనిధి ద్వారా దాదాపు మరో రూ.13,172 కోట్లు రుణాలు పొదుపు సంఘాల మహిళలకిచ్చింది. ఇక సున్నా వడ్డీ ద్వారా గత ప్రభుత్వ హయాంలో 3.86 కోట్ల మంది మహిళలు దాదాపు రూ.ఐదు వేల కోట్ల మేర ప్రయోజనం పొందారు. ‘స్త్రీనిధి’కి ఎసరు..ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మహిళలను మోçసం చేస్తున్న చంద్రబాబు సర్కారు మరో మోసపూరిత ఎత్తుగడకు తెర తీసింది. పొదుపు సంఘాల మహిళలు తమ హక్కుగా రుణాలను పొందే ‘స్త్రీనిధి’ డబ్బులను.. ఆర్బీఐ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా ‘ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మీ’ ‘ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ’ పథకాలకు మళ్లించేందుకు సిద్ధమైంది. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు– షాదీ తోఫా పథకాల ద్వారా అర్హులకు పూర్తి ఉచితంగా ఆర్థిక సహాయం అందజేస్తే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పేర్లు మార్చిన ఆ పథకాలకు పొదుపు సంఘాల మహిళలకు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం మాత్రమే ఇవ్వనుంది. దానిపై నాలుగు శాతం వడ్డీతో కలిపి అసలు వసూలు చేసేందుకు సమాయత్తమైంది. గత ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా రూ.427.27 కోట్ల మొత్తాన్ని ఆయా లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధానంలో అర్హులకు అందచేయడం గమనార్హం. వడ్డీకి తెచ్చిన డబ్బులు.. అంతకంటే తక్కువకు ఇవ్వాలట!ఈ ఆర్థిక ఏడాది దాదాపు రూ.ఐదు వేల కోట్లను స్త్రీనిధి సంస్థ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత నిధులు తక్కువగా ఉండే స్త్రీనిధి సంస్థ.. ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులనే 11 శాతం వడ్డీకి పొదుపు మహిళలకు రుణంగా ఇస్తూ ఉంటుంది. మండల సమాఖ్య పేరిట ఉండే దాదాపు రూ.1,000 కోట్ల సీఐఎఫ్ (కామన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్) నిధులను ఇటీవల బలవంతంగా స్త్రీనిధి బ్యాంకులో జమ చేయించారు. బ్యాంకుల నుంచి స్త్రీనిధి సంస్థ ఏడు శాతం వడ్డీకి తెచ్చుకునే నిధులతో పాటు మండల సమాఖ్య నుంచి జమ అయిన నిధుల నుంచి ఒక్కో పథకానికి రూ.500 కోట్లు చొప్పున ఏటా రూ.వెయ్యి కోట్లు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మీ, ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ పథకాల లబ్ధిదారులకు రుణంగా ఇప్పించేలా ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేగానీ.. ఆయా పథకాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎటువంటి ఆర్థిక సాయం అందించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వడ్డీకి తెచ్చే డబ్బులను అంత కంటే తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడమంటే ఎలాంటి సంస్థ అయినా నష్టాల పాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ రెండు పథకాలకు తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల స్త్రీనిధి సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్లి మూతపడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 12 ఏళ్లుగా పేద మహిళల సంక్షేమం కృషి చేస్తున్న సంస్థను బలి పెట్టే యత్నాలను తప్పుబడుతున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో త్వరలో ఓ కార్యక్రమం నిర్వహించి పథకాల అమలుపై సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన చేయనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గతంలోనే ఈ అంశాలను వెలుగులోకి తెచ్చింది. స్త్రీనిధి సంస్థను నీరుగార్చే యత్నాలను బహిర్గతం చేసింది. దీంతో ఈ ఏడాది మార్చిలో ఆ పథకాల అమలును ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది.బాబు మోసంతో అప్పుల ఊబిలోకి..జగన్ హయాంలో సంఘాలు పునరుజ్జీవం..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచి సున్నా వడ్డీ పథకం అమలు జరుగుతుండగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014–19 మధ్య అర్ధారంతంగా ఆగిపోయింది. దీంతో పొదుపు సంఘాల వ్యవస్థ కుదేలైంది. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని 2014 ఎన్నికల ముందు ప్రకటించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా.. సున్నా వడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారు. ఫలితంగా పొదుపు సంఘాలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎన్పీఏలు (నిరర్థక ఆస్తులు)గా మారాయి. చంద్రబాబు హయాంలో ఒక దశలో 18.36 శాతం సంఘాలు ఎన్పీఏలుగా ముద్రపడ్డాయి. అనంతరం వైఎస్ జగన్ హయాంలో పొదుపు సంఘాలు పునరుజ్జీవమయ్యాయి. నాడు ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు.. 2019 పోలింగ్ నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకు ఉన్న అప్పు మొత్తం రూ.25,571 కోట్లను ‘ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో తిరిగి మహిళలకు నేరుగా చెల్లించడంతో పాటు సున్నా వడ్డీ పథకాన్ని క్రమం తప్పకుండా అమలు చేశారు. తద్వారా పొదుపు మహిళలు ఎప్పటికప్పుడు రుణాలను తిరిగి సకాలంలో చెల్లించే పరిస్థితులు ఏర్పడడంతో నాడు ఎన్పీఏల సంఖ్య కేవలం 0.17 శాతానికి తగ్గిపోయింది.(నోట్: 2018–19 మధ్య టీడీపీ సర్కారు కేవలం రూ. 895 కోట్లు మాత్రమే స్త్రీనిధి ద్వారా పొదుపు సంఘాల మహిళలకు రుణం ఇవ్వగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని రెట్టింపు కంటే ఎక్కువకు పెంచింది. అంతేకాకుండా.. అంతకు ముందు పొదుపు సంఘాల మహిళలకు 13 శాతం చొప్పున వడ్డీకి రుణాలు ఇస్తుండగా అప్పటి సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకొని ఆ రుణాలపై వడ్డీని రెండు శాతం తగ్గించి 11 శాతానికే అందించే ఏర్పాటు చేశారు) -
మద్యం సిండికేట్కు డబ్బుల్ ధమాకా!
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2014–19లో ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి, అడ్డగోలు దోపిడీకి సహకరించిన నాటి టీడీపీ ప్రభుత్వం.. ప్రస్తుతం అదే తరహాలో వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నును (ఏఆర్ఈటీ) దొడ్డి దారిలో తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ.. మరోవైపు సిండికేట్ దోపిడీకి వత్తాసు పలికే ఈ పన్నాగానికి మంత్రివర్గ ఉప సంఘం ద్వారా రాజ ముద్ర వేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో టీడీపీ మద్యం సిండికేట్ ఆడిందే ఆటగా సాగుతోంది.అందుకోసం బార్ల టెండర్ల ప్రక్రియను హైజాక్ చేసింది. ప్రభుత్వ పెద్దల పన్నాగంతోనే రాష్ట్రంలో 840 బార్లకు ఉద్దేశ పూర్వకంగా టెండర్లు దాఖలు చేయకుండా డ్రామా నడిపింది. రెండు దశల నోటిఫికేషన్ తర్వాత కూడా 540 బార్లకే లైసెన్సులు ఖరారు చేసి, మరో 300 బార్ల లైసెన్స్ ప్రక్రియ పెండింగ్లో ఉండేట్టు చేసింది. తద్వారా బార్లకు లైసెన్సులు దాఖలు చేసేందుకు ఎవరూ సుముఖంగా లేరనే అభిప్రాయాన్ని కృత్రిమంగా సృష్టించింది. అదే తడవుగా టీడీపీ సిండికేట్ తమ అడ్డగోలు దోపిడీకి డిమాండ్లను తెరపైకి తెచి్చంది. బార్లకు సరఫరా చేసే మద్యం ధరలపై ఏఆర్ఈటీ తొలగించాన్నది వాటిలో ప్రధాన డిమాండ్.మంత్రి మండలి సమావేశంలోనే తుది నిర్ణయం⇒ రాష్ట్రంలో బార్లకు దరఖాస్తులు దాఖలు చేసేందుకు పెద్దగా ఆసక్తి వ్యక్తం కావడం లేదని నమ్మించేందుకు సిండికేట్తో కలిసి చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా కథ నడిపించింది. ఎవరూ ముందుకు రావట్లేదన్న సాకుతో బార్ల యజమానులకు మరిన్ని వెసులుబాటులు కలి్పంచాల్సిన అవసరం ఉందని ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనను తెరపైకి తెచి్చంది. ⇒ బార్లకు సరఫరా చేసే మద్యంపై ప్రస్తుతం 15 శాతం ఏఆర్ఈటీ విధిస్తున్నారు. ఎందుకంటే బార్లలో ఎంఆర్పీకే మద్యం విక్రయించాలన్న నిబంధన లేదు. బార్లు ఇష్టానుసారం రేట్లకు విక్రయిస్తాయి. అందుకే 15 శాతం ఏఆర్ఈటీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధించింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి దాదాపు రూ.500 కోట్ల ఆదాయం వస్తోంది. కాగా ప్రస్తుతం టీడీపీ సిండికేట్కు అడ్డగోలు ప్రయోజనం కలిగించేందుకు ఆ 15 శాతం ఏఆర్ఈటీని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ⇒ అదే ప్రధాన అంశంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ విధానంపై మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. సోమవారం సమావేశమైన ఈ మంత్రివర్గ ఉప సంఘం మద్యం దుకాణాలపై సర్దుబాటు ముసుగుతో బార్లపై ఏఆర్ఈటీని తొలగించే విధంగా సిఫార్సు చేయాలని భావిస్తోంది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఏఆర్ఈటీ తొలగింపుపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ⇒ కాగా, ఏఆర్ఈటీ తొలగిస్తే ఖజానాకు ఏటా రూ.500 కోట్లు గండి పడుతుంది. రానున్న నాలుగేళ్లలో టీడీపీ మద్యం సిండికేట్కు రూ.2 వేల కోట్లు అడ్డగోలుగా ప్రయోజనం కలగనుందన్నది స్పష్టం అవుతోంది. ⇒ అంతేకాకుండా బార్లలోనూ చీప్ లిక్కర్ అమ్మకాలకు పచ్చ జెండా ఊపే విషయాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో చీప్ లిక్కర్ వాటా 30 శాతంగా ఉంది. నెలకు సగటున రూ.3 వేల కోట్ల మద్యం విక్రయాలు సాగుతుంటే అందులో రూ.900 కోట్లు మేర చీప్ లిక్కర్ ద్వారానే వస్తోంది. చీప్ లిక్కర్ అమ్మకాలు మరింత పెంచడం ద్వారా సిండికేట్ అడ్డగోలు దోపిడీకి మరింత సహకరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నది స్పష్టమవుతోంది.మద్యం ధరలపై నియంత్రణ మాత్రం లేదు బార్లపై 15 శాతం ఏఆర్ఈటీ తొలగింపు దిశగా సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం.. ఆ బార్లలో మద్యం ధరలపై మాత్రం ఎటువంటి నియంత్రణ విధించాలని భావించడం లేదు. ఉదాహరణకు రూ.100 ఎంఆర్పీ ఉన్న మద్యం బాటిల్పై 15 శాతం ఏఆర్ఈటీ విధించి బార్లకు ప్రస్తుతం రూ.115తో విక్రయిస్తున్నారు. బార్లు కనీసం రూ.130కి పైగానే విక్రయిస్తున్నాయి. ఏఆర్ఈటీ 15 శాతం తొలగించాక ఆ బాటిల్ను ఎంతకు విక్రయించాలనేది ప్రభుత్వం నిర్దేశించడం లేదు.అంటే బార్లు ఇప్పటి వరకు విక్రయిస్తున్న రీతిలోనే రూ.130 కంటే ఎక్కువగానే విక్రయించవచ్చు. ఈ లెక్కన ఒక్కో బాటిల్పై ఖజానాకు రూ.15 నష్టం.. టీడీపీ సిండికేట్కు రూ.30 లాభం. ప్రస్తుత అమ్మకాల పరిణామం ప్రకారం.. టీడీపీ సిండికేట్ ఏటా రూ.500 కోట్ల చొప్పున రానున్న నాలుగేళ్లలో రూ.2 వేల కోట్లు కొల్లగొట్టనుంది. ఆ ప్రకారం ఏఆర్ఈటీ తొలగింపుతో రూ.2 వేల కోట్లు, ఎంఆర్పీ కంటే అధిక ధరలతో రూ.2 వేల కోట్లు వెరసి.. రానున్న నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు దోపిడీకి పాల్పడుతుందన్నది స్పష్టమవుతోంది. -
అసెంబ్లీలో వైఎస్ జగన్, చిరంజీవిపై బాలకృష్ణ పిచ్చి వ్యాఖ్యలు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే... అంబేద్కర్ విగ్రహం ముందే కిరోసిన్ పోసుకుని
-
ఏలూరులో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనకు దిగిన PHC వైద్యులు
-
RDపై కూటమి కుట్రలు
-
Amarnath: ప్రభుత్వం చేతకానితనం వల్ల రెండు ప్రాణాలు బలి
-
నెల్లూరు కలెక్టరేట్ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన
-
మిథున్ రెడ్డిపై ఆరోపణలకు ఆధారాలు చూపలేదన్న కోర్టు
-
మసిపూసి.. అక్రమ అరెస్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసిందన్నది స్పష్టమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు కూటమి ప్రభుత్వ కుతంత్రంలో భాగంగానే ఆయన్ను సిట్ అరెస్టు చేసిన విషయం విదితమే. అందుకు ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ పీఎల్ఆర్ కంపెనీ సాధారణ లావాదేవీలకు కుట్ర పూరితంగా సిట్ వక్ర భాష్యం చెప్పింది. పీఎల్ఆర్ కంపెనీ నిర్మాణ కాంట్రాక్టులను సబ్ కాంట్రాక్టు చేసేందుకు డికార్ట్ కంపెనీ 2019లో ఒప్పందం చేసుకుంది.కాంట్రాక్టు పనుల బ్యాంకు గ్యారంటీ, ఈఎండీ కోసం రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తి అనంతర పరిణామాల్లో డికార్ట్ కంపెనీ సబ్ కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగింది. దాంతో ఆ కంపెనీ తమకు చెల్లించిన రూ.5 కోట్లను పీఎల్ఆర్ కంపెనీ వాపసు చేసింది. ఇదంతా బ్యాంకు బదిలీ ద్వారానే పూర్తి పారదర్శకంగా జరిగిన సాధారణ లావాదేవీ. ఆ అధికారిక రికార్డులను కూడా పీఎల్ఆర్ కంపెనీ సమరి్పంచింది. (2014–24 వరకు) కంపెనీకి చెందిన రికార్డులను కూడా సిట్ అధికారులు పరిశీలించారు.అయినా సరే కూటమి ప్రభుత్వ కుట్రలో భాగంగానే మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. తద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు సిట్ యతి్నంచింది. కాగా మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో సిట్ అభియోగాల్లో పస లేదన్నది స్పష్టమైంది. మిథున్ కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ కంపెనీకి డికార్ట్ లాజిస్టిక్స్ అనే కంపెనీ రూ.5 కోట్లు బదిలీ చేయడం మద్యం కుంభకోణం కోసమేనని సిట్ నిరాధార అభియోగాలు మోపింది. ఈ ఆరోపణలను మిథున్ రెడ్డి, పీఎల్ఆర్ కంపెనీ ఆధారాలతో సహా తిప్పికొట్టినా సిట్ పదే పదే అదే అభియోగం ఆధారంగానే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసింది. ఇదీ అసలు వాస్తవం అసలు వాస్తవాలను మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు పూర్తి ఆధారాలతో న్యాయస్థానానికి నివేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఎందుకు కేసు పెట్టరు?⇒ ఈ అక్రమ కేసు కుట్రలో చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొన్న రాజ్ కేసిరెడ్డితో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి అనే వాస్తవాన్ని ఉద్దేశ పూర్వకంగానే విస్మరిస్తోంది. మంత్రి లోకేశ్కు బినామీగా పేరుపడిన ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార వ్యవహారాలపై అందుకే సిట్ దృష్టి సారించడం లేదు. ⇒ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు చేశారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ఫ్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ.. హైదరాబాద్లోని ఒకే చిరునామా (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. ⇒ ఈ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ( ్చఛిఛిౌun్టటఃఠీటజ్చిnఠిజీజీnజట్చpట్జౌ్ఛఛ్టిట. ఛిౌఝ)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన కేశినేని చిన్ని.. మంత్రి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అన్నది బహిరంగ రహస్యం. అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని చేశారు. ⇒ కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్కు విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్ బండారం బట్టబయలవుతుంది. రాజ్ కేసిరెడ్డితోపాటు ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులపై సిట్ నమోదు చేసింది అక్రమ కేసేనన్నది బయట పడుతుంది. ఇదంతా చంద్రబాబు రెడ్బుక్ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు మొత్తం కుట్ర బహిర్గతమవుతుంది. -
బాబు కుట్రలు.. పవన్ డ్రామాలు..! బట్టబయలు చేసిన చిరు
-
Manohar: టన్నుల కొద్దీ విధ్వంసం మీరు సృష్టించి... జగన్ పేరు చెప్పడానికి సిగ్గు లేదా
-
ఈఆర్సీ నిర్ణయం సర్కారుకు చెంపపెట్టు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) తలంటితే సిగ్గు పడాల్సింది పోయి ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు సర్కారు దివాళాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ఈఆర్సీ ఆదేశాలతో వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిన రూ.923.55 కోట్లను తాను ఎంతో ఉదారంగా ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుగా లేదా? అని ప్రశి్నంచారు.అనుమతి లేకుండా విద్యుత్ చార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వానికి ఈఆర్సీ నిర్ణయం చెంప పెట్టు లాంటిదన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కాకాణి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలు ఇంకా తగ్గిస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఏడాదిలోనే ప్రజలపై రూ.19 వేల కోట్ల భారాన్ని మోపారని ధ్వజమెత్తారు. ట్రూ డౌన్ చంద్రబాబు ఘనతగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అనుమతించిన ధరకు మించి కొనుగోలు 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ట్రూ అప్ చార్జీలకు డిస్కంలు ఈ ఏడాది జూలైలో అనుమతి కోరగా ఏపీఈఆర్సీ రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇచి్చందన్నారు. కూటమి సర్కారు ఏపీఈఆర్సీ అనుమతించిన ధరకు మించి విద్యుత్ కొందన్నారు. ఏపీఈఆర్సీ యూనిట్ రూ.5.27కు కొనమని చెబితే.. ఈపీడీసీఎల్ రూ.5.84 చొప్పున, సీపీడీసీఎల్ రూ.5.86 చొప్పున, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.5.89 చొప్పున వెచి్చంచి విద్యుత్ కొన్నట్లు వెల్లడించాయన్నారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.34,517 కోట్లకు అనుమతి ఉంటే రూ.45,476 కోట్లు వెచి్చంచామని డిస్కంలు చెప్పాయన్నారు. ప్రసార, పంపిణీ నష్టాలు 10.17 శాతమని డిస్కంలు ప్రతిపాదిస్తే ఈఆర్సీ మాత్రం 9.87 శాతానికే అంగీకరించిందన్నారు. 2024–25కి సంబంధించి ప్రతి నెలా యూనిట్కు 0.40 పైసలు చొప్పున డిస్కమ్లు ఇప్పటికే రూ.2,787.18 కోట్లు వసూలు చేశాయన్నారు. అనుమతించిన మొత్తం పోనూ మిగిలిన రూ.923.55 కోట్లను ఈ ఏడాది నవంబర్ నుంచి ట్రూ డౌన్ చేయాలని ఈఆర్సీ ఆదేశించిందన్నారు. కూటమి సర్కారు 2024 నవంబర్ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల అదనపు భారం మోపిందన్నారు. -
మెగాస్టార్కు ఇంత అవమానమా?
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శాసనసభ సాక్షిగా ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్ తమ రాజకీయ డ్రామాలో భాగంగానే ఆదివారం హైదరాబాద్లో ఇరువురూ కలుసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో దానిని కవర్ చేసుకునేందుకు, రాజీ కుదుర్చుకునేందుకే చంద్రబాబు పరామర్శ పేరుతో హైదరాబాద్లోని పవన్కళ్యాణ్ ఇంటికి వెళ్లినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు సభలోనే ఉన్న చంద్రబాబుగానీ, జనసేన ఎమ్మెల్యేలుగానీ కనీసం స్పందించలేదు. పవన్కళ్యాణ్ అయితే.. చిరంజీవికి జరిగిన తీవ్ర అవమానంపై ఇప్పటివరకూ నోరువిప్పకపోగా ఆదివారం తన ఇంటికొచ్చిన చంద్రబాబుకు పుష్పగుచ్ఛంతో ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. ఇదంతా చూస్తుంటే చిరంజీవిని ఉద్దేశపూర్వకంగా అవమానించినట్లుగా ఉందని చిరు అభిమానులు, కాపు సంఘాల నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి.. ఈ ఏడాది రెండు, మూడుసార్లు పవన్ అనారోగ్యానికి గురైనప్పటికీ అప్పుడెప్పుడూ ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించని చంద్రబాబు ఈసారి హైదరాబాద్కు ప్రత్యేకంగా వెళ్లి మరీ పలకరించడాన్ని చూస్తుంటే ఇదంతా రాజకీయ డ్రామానేనని వారు ఆరోపిస్తున్నారు. పైగా.. పవన్కళ్యాణ్ గతంలో అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సమయంలో.. చంద్రబాబు ఓ అధికారిక సమావేశంలో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్తో పవన్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ.. తాను పలకరిద్దామని ఫోన్చేసినా ఆయన అందుబాటులోకి రాలేదని బాబు అప్పట్లో వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలను చిరు అభిమానులు, కాపు నేతలు గుర్తుచేస్తున్నారు. పవన్పై చిరు అభిమానులు, కాపు వర్గీయుల్లో అసంతృప్తి.. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ వ్యాఖ్యల ఎపిసోడ్లో పవన్కళ్యాణ్ వ్యవహారశైలిపై చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గీయుల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడల్లా పవన్కళ్యాణ్ ఆయనకు ఏదో విధంగా అండగా ఉంటున్నారన్న వ్యాఖ్యలు ఆ వర్గీయుల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే.. బాలకృష్ణ కామెంట్లపై ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవి స్పందిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారుగానీ పవన్కళ్యాణ్ ఇప్పటివరకు ఈ అంశంపై కనీసం నోరువిప్పలేదని.. ఇది పరోక్షంగా బాబుకు మేలు చేయడమేనని వారు గుర్తుచేస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్నందున పవన్కళ్యాణ్ స్పందించలేదని అనుకున్నా.. డీఎస్సీ నియామకాల అంశంలో లోకేశ్ను అభినందిస్తూ పవన్ ప్రకటన జారీచేశారు. అంతేకాకుండా తమిళనాడులో విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపైనా విచారం వ్యక్తంచేశారు. కానీ చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యల అంశంలో మౌనం దాల్చడంపై ఆ వర్గీయుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఎమ్మెల్సీ కాకముందు వరకు చిరంజీవిపై ఎవరు విమర్శలు చేసినా విరుచుకుపడే నాగబాబు కూడా టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యాక ఆయన కూడా తన నోటికి తాళాలు వేసుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి. పవన్ త్వరగా కోలుకోవాలని.. ఇక పవన్ నివాసానికి చంద్రబాబు రాకపై జనసేన పార్టీ ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. పవన్కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు పరామర్శించారని పేర్కొంది. ఈ సందర్భంగా.. మెగా డీఎస్సీ నియామకాలపైనా, అక్టోబరు 16న ప్రధాని రాష్ట్ర పర్యటనపైన, 4న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయంపైనా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిపింది. టీడీపీపై కాపుల్లో వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే.. బాలకృష్ణ తాజా వ్యాఖ్యలతో చిరంజీవి అభిమానులు, కాపు సామాజికవర్గాల్లో టీడీపీపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే చంద్రబాబు పవన్కళ్యాణ్ను పరామర్శించారన్న చర్చ కూడా జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్కళ్యాణ్ ఇందుకు తనవంతుగా బాబుకు తోడ్పాటు అందిస్తున్నారని చర్చించుకుంటున్నారు. అలాగే, చంద్రబాబే స్వయంగా వచ్చి తనను పరామర్శించారన్న సానుభూతి కాపు సామాజికవర్గంలో కలిగించాలన్నది వీరిరువురి వ్యూహమని వారంటున్నారు. -
‘ఈఆర్సీ’.. సీరియస్! సర్కారుకు 'షాక్'
సాక్షి, అమరావతి: ఎడాపెడా విద్యుత్తు చార్జీలతో వినియోగదారులను బాదేస్తున్న చంద్రబాబు సర్కారుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గట్టి షాక్నిచ్చింది! విద్యుత్తు చార్జీల వాతలతో ప్రజల నుంచి ఇప్పటికే వసూలు చేసిన సొమ్ములో దాదాపు రూ.వెయ్యి కోట్లు తిరిగి వారికి వెనక్కి చెల్లించాలని ఆదేశించింది. చార్జీల మోత మోగించిన చంద్రబాబు సర్కారుకు ఏపీఈఆర్సీ ఇలా గట్టిగా మొట్టికాయలు వేస్తే అదేదో ప్రభుత్వం దయతలచి ఔదార్యంగా ఇస్తున్నట్లు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి అంటే 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయగా అందులో రూ.923.55 కోట్లను వినియోగదారులకు వెనక్కి చెల్లించాలని ఏపీఈఆర్సీ తాజాగా ఆదేశించింది. అయితే ఇదంతా కూటమి సర్కారు గొప్పతనంగా, అసలు ట్రూ డౌన్ చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఊరట అంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని నెత్తికెత్తుకుంది. ప్రజలపై ఇప్పటి వరకూ రూ.17,348.64 కోట్లు విద్యుత్ చార్జీల భారం వేసిన కూటమి ప్రభుత్వాన్ని భుజానకెత్తుకుని కీర్తించడంపై ఇంధన రంగ నిపుణులు, వినియోగదారులు విస్తుపోతున్నారు. తొలి ఏడాదికి అంటే 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయగా అందులో రూ.923.55 కోట్లను వినియోగదారులకు వెనక్కి చెల్లించాలని ఏపీఈఆర్సీ తాజాగా ఆదేశించింది. అయితే ఇదంతా కూటమి సర్కారు గొప్పతనంగా, అసలు ట్రూ డౌన్ చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఊరట అంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని నెత్తికెత్తుకుంది. ప్రజలపై ఇప్పటి వరకూ రూ.17,348.64 కోట్లు విద్యుత్ చార్జీల భారం వేసిన కూటమి ప్రభుత్వాన్ని భుజానకెత్తుకుని కీర్తించడంపై ఇంధన రంగ నిపుణులు, వినియోగదారులు విస్తుపోతున్నారు.కూటమి చెంప చెళ్లుమనిపించేలా ఏపీఈఆర్సీ ఆదేశాలు..గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేసిన కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏపీఈఆర్సీ అనుమతించిన దానికి మించి అధిక రేట్లకు కరెంట్ కొనుగోలు చేసింది. ఈ విషయం ఏపీఈఆర్సీ తాజా ఆదేశాల ద్వారా రుజువైంది. యూనిట్ రూ.5.27కు కొనమని ఏపీఈఆర్సీ చెబితే ఏపీఈపీడీసీఎల్లో యూనిట్ రూ.5.84 చొప్పున, ఏపీసీపీడీసీఎల్లో రూ.5.86 చొప్పున, ఏపీఎస్పీడీసీఎల్లో యూనిట్ రూ.5.89 వెచ్చించి కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసింది. అందువల్లనే 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు (ట్రూ అప్)ను డిస్కంలు ప్రతిపాదించాల్సి వచ్చింది. దీన్ని తీవ్రంగా ఆక్షేపించిన ఏపీఈఆర్సీ డిస్కంలు అడిగినదానికి ఆమోదం తెలపకుండా రూ.895.12 కోట్లను తగ్గించాల్సిందేనని తేల్చి చెప్పింది. రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతినిచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రజలను విద్యుత్ బిల్లులతో బాదుతూ ఇప్పటికే రూ.2,787.18 కోట్లను అదనంగా వసూలు చేసేసింది. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీఈఆర్సీ వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేసిన అదనపు చార్జీలను అక్టోబర్ నెల వినియోగం నుంచి అంటే నవంబర్లో ఇచ్చే బిల్లు నుంచి 12 వాయిదాల్లో వెనక్కి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఏపీఈఆర్సీ ఆదేశాలు కూటమి సర్కారు చెంప చెళ్లుమనిపించేలా ఉన్నాయని విద్యుత్ రంగ నిపుణులు, వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఏడాదికి బాబు సర్కారు వసూలు చేసిన మొత్తం రూ.2,787.18 కోట్లను తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే, ఇదంతా చంద్రబాబు కూటమి సర్కారు ఇచ్చిన ఊరట అంటూ టీడీపీ కరపత్రం ఈనాడు నిస్సిగ్గుగా తప్పుడు కథనాన్ని అచ్చేసింది.కూటమి ప్రభుత్వం వసూలు చేసిన రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలంటూ ఏపీఈఆర్సీ ఇచ్చిన ఆదేశాలు బాబు బాదుడే బాదుడు..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం.. తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15,485.36 కోట్ల చార్జీల భారాన్ని వేసి బాదుడుకు శ్రీకారం చుట్టింది. అయితే అదనంగా వసూలు చేసిన రూ.2,787.18 కోట్లలో తాజాగా రూ.1,863.64 కోట్లకు మాత్రమే ఈఆర్సీ నుంచి అనుమతి లభించింది. అదే రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలని ఏపీఈఆర్సీ ఆదేశించకుంటే ప్రజలపై దాదాపు రూ.19 వేల కోట్ల భారం మోపినట్లయ్యేది! అంతేకాదు.. మరో పిడుగు కూడా సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాల్సిందిగా ఇటీవల కమిషన్ను కోరాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ఆ భారమంతా ప్రజలపైనే పడుతుంది.జగన్ ప్రభుత్వంలో..జనంపై భారం పడకుండాటీడీపీ కూటమి ప్రభుత్వం అదనంగా వసూలు చేసిన దానిలో కొంత మొత్తాన్ని తిరిగి ప్రజలకు ఇచ్చేయాల్సిందేనని ఏపీఈఆర్సీ ఆదేశిస్తే.. అదేదో తాము దయతలచి ఇస్తున్నట్లుగా ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. వాస్తవానికి విద్యుత్తు రంగంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వినియోగదారులపై ఏమాత్రం భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, చౌకగా కొనుగోళ్లు, ఇంధన పొదుపు లాంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల 2019–24 మధ్య విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. దీంతో ఆ ఐదేళ్లలో మొత్తం రూ.4,434.5 కోట్లను మిగిల్చినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అధికారికంగానే వెల్లడించింది. డిస్కంలు ఖర్చులు తగ్గించుకుని మిగిల్చిన డబ్బులను ట్రూ డౌన్ చేశాయి.⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2019–20 నుంచి 2023–24 వరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) రూ.1,974.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) 2020–21 నుంచి 2023–24 వరకూ రూ.1,400 కోట్ల మేర ఖర్చులు మిగిల్చాయి. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లను ట్రూ డౌన్ చేశాయి. ఈ డబ్బులను 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు సర్దుబాటు చేశాయి. అంటే వాటి రెవెన్యూ గ్యాప్ భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. తద్వారా బకాయిలు తగ్గించుకున్నాయి. దీంతో ఆ మేరకు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం కూడా తగ్గింది.⇒ ఏపీ ట్రాన్స్కో విద్యుత్ లైన్లను వినియోగించుకోవడంలోనూ గత ప్రభుత్వంలో డిస్కంలు రూ.1,059.75 కోట్లు మిగిల్చాయి. విద్యుత్ ప్రసార వ్యవస్థ వినియోగానికి ఏపీఈఆర్సీ అనుమతించిన టారిఫ్ కంటే తక్కువగా డిస్కంలు వినియోగించాయి. ఇది ఏపీఈపీడీసీఎల్లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్లో 247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్ఆర్లో సర్దుబాటు చేశారు. ఇలా గత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలపై రూ.4,434.51 కోట్ల మేర ట్రూ అప్ భారం తగ్గింది. -
విద్యుత్ చార్జీలపై బాబు సర్కారుకు మొట్టికాయలు
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) మొట్టికాయలు వేసింది. అదనంగా వసూలు చేసిన చార్జీలను విద్యుత్ వినియోగదారులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకోసం విద్యుత్ చార్జీలను ట్రూ డౌన్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తంలో రూ.923.55 కోట్లను ప్రజలకు వెనక్కి ఇవ్వాలని డిస్కంలను ఆదేశించింది. 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు (ట్రూ అప్) చార్జీలను డిస్కంలు ఈ ఏడాది జూలైలో ప్రతిపాదించాయి.ఇందుకు ఏపీఈఆర్సీ నుంచి అనుమతి కోరాయి. వీటిపై విచారణ జరిపిన ఏపీ ఈఆర్సీ డిస్కంలు చెప్పిన లెక్కలు, విద్యుత్ కొనుగోలు వ్యయంలో భారీ వ్యత్యాసాన్ని గుర్తించింది. డిస్కంలు అడిగిన దానికి యథాతథంగా ఆమోదం తెలపకుండా రూ.895.12 కోట్లు తగ్గించి.. రూ.1,863.64 కోట్లకు అనుమతినిచ్చింది. అలాగే గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో విద్యుత్ను అధిక ధరలకు కొనుగోలు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేసిన కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏపీ ఈఆర్సీ అనుమతించిన దానికి మించిన ధరకు విద్యుత్ కొనుగోలు చేసింది.ఏపీ ఈఆర్సీ యూనిట్కు రూ.5.27కు కొనమని చెబితే.. ఈపీడీసీఎల్ యూనిట్ రూ.5.84 చొప్పున, సీపీడీసీఎల్ రూ.5.86 చొప్పున, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.5.89 వెచ్చించి విద్యుత్ కొన్నట్టు ప్రతిపాదనలో తెలిపాయి. కాగా.. ఏపీ ఈఆర్సీ యూనిట్కు రూ.0.8 పైసల నుంచి రూ.0.15 పైసలు వరకూ తగ్గించి అనుమతించింది. విద్యుత్ కొనుగోలు ఖర్చు కూడా రూ.34,517 కోట్లకు అనుమతి ఉంటే.. రూ.45,476 కోట్లు వెచ్చించామని డిస్కంలు చెప్పాయి. ఇందులో రూ.44,624 కోట్లకు ఏపీ ఈఆర్సీ ఆమోదం తెలిపింది. కాగా.. ప్రసార, పంపిణీ (ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్) నష్టాలు 10.17 శాతమని డిస్కంలు ప్రతిపాదిస్తే ఈఆర్సీ మాత్రం 9.87 శాతానికే అంగీకరించింది.ఇప్పటికే వసూలు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతి నెలా యూనిట్కు రూ.0.40 పైసలు చొప్పున అదనంగా డిస్కంలు వసూలు చేశాయి. ఎస్పీడీసీఎల్ రూ.1,106.56 కోట్లు, సీపీడీసీఎల్ రూ.614.86 కోట్లు, ఈపీడీసీఎల్ రూ.1,065.76 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.2,787.18 కోట్లు వసూలు చేసేశాయి. ఈ మొత్తం నుంచి అనుమతించిన రూ.1,863.64 కోట్లు పోగా.. మిగిలిన రూ.923.55 కోట్లను ఈ ఏడాది నవంబర్ నెల బిల్లు నుంచి ట్రూ డౌన్ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. అంటే ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికంటే అదనంగా వసూలు చేశారని, దానిని 12 సమాన వాయిదాల్లో ప్రతి నెలా విద్యుత్ బిల్లుల్లో యూనిట్కు రూ.0.13 పైసల చొప్పున సర్దుబాటు చేయాలని అదేశించింది. ఈఆర్సీ నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారడంతో పాటు వినియోగదారులకు కాస్త ఊరట కలిగించనుంది.రాగానే బాదుడు మొదలు‘మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తాం’ అని ఎన్నికల ముందు ప్రతి ప్రచార సభలోనూ చంద్రబాబు అండ్ కో చెప్పింది. అధికారంలోకి రాగానే ఆ హామీని గాలికొదిలేశారు. చార్జీలు పెంచం అని నేనెప్పుడు చెప్పానంటూ నిస్సిగ్గుగా మాట మార్చేశారు. ఓ వైపు ‘సూపర్సిక్స్’ అంటూ హామీలిచ్చి వాటిలో ఒక్కటీ అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు ఇలా విద్యుత్ చార్జీల పేరుతో వారిని దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ చార్జీల రూపంలో రూ.15,485 కోట్ల భారాన్ని మోపింది.2024 నవంబర్ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా.. ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్కు రూ.0.40 చొప్పున అదనంగా వసూలు చేయడం ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టారు. అలా ఈ ఏడాది మార్చి వరకూ జనం డబ్బును అదనపు చార్జీల పేరుతో దోచేశారు. అందులో రూ.1,863.64 కోట్ల విద్యుత్ చార్జీలకు ఆమోదం తెలపడంతో కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ వినియోగదారులపై వేసిన మొత్తం విద్యుత్ చార్జీల బాదుడు రూ.17,348.64 కోట్లకు చేరింది. -
ఈ దుర్యోధన దుశ్శాసన పర్వంలో...
మహాభారత కథలోని గాంధారీ సుతుల్లో ఒకడికి దుశ్శాసను డనే పేరు పెట్టారు వేదవ్యాస మహర్షి. శాసనాన్ని ఖాతరు చేయనివాడని దాని అర్థం. విడమర్చి చెప్పాలంటే సంఘం కట్టుబాట్లను లెక్క చేయనివాడు, పరిపాలనా నియమాలంటే పట్టింపులేనివాడు. ఒక్క మాటలో సంఘ విద్రోహి. నేటి ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇటువంటి దుశ్శాసనుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ‘గజానికో గాంధారీసుతుడు... గాంధీ పుట్టిన దేశంలో’ అనే డైలాగ్ చాలా కాలం నుంచే తెలుగునాట బాగా పాపులరయింది. ఇప్పుడీ తొండ ముదిరి ఊసరవెల్లిగా మారింది. శాసనాలు చేయవలసిన వారు, పాలకులుగా ఎన్నికైనవారు కూడా దుశ్శాసనావతారాలు ఎత్తుతున్నారు. రాజ్యాంగ నియమాలకూ, చట్టాల సంరక్షణకూ కాపుకాయవలసిన కంచే చేను మేస్తున్నది. ఈ పరిణామానికి కలత చెందినవారు ‘మన స్వాతంత్య్రం మేడిపండు, మన ప్రజా స్వామ్యం రాచపుండై’ందని కన్నీరు పెడుతున్నారు.పౌరుల ప్రాథమిక హక్కులకు అండగా నిలబడవలసిన రక్షకభటులే, వాటి భక్షక భటులుగా మారడంపై ఏపీ హైకోర్టు నిన్న ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది. సవీందర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టును మఫ్టీ పోలీసులు అరెస్ట్ చేసి, తాము అరెస్టు చేయలేదని సాక్షాత్తూ ఉన్నత న్యాయ స్థానాన్నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. హైకోర్టులో ఆ విధంగా బుకాయించిన పోలీసులు అదే రోజు సాయంత్రం ఆయన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అది కూడా హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసే విధంగానే! రిమాండ్ రిపోర్టులోనూ అతని అరెస్ట్ సమయాన్ని రకరకాలుగా నమోదు చేసి హైకోర్టుకు అడ్డంగా దొరికి పోయారు. గడచిన సంవత్సర కాలంగా పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులపై కనీసం డజను సార్లు హైకోర్టు హెచ్చరికలు చేసింది. అయినా తీరు మారని పోలీసుల వైఖరిపై ఆగ్రహంతో ఉన్న న్యాయస్థానం సవీందర్ రెడ్డి సతీమణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై చేసిన విచారణలో కూడా వారి దొంగాట తేటతెల్లమవడంతో తీవ్రంగా స్పందించింది. ఈ అరెస్ట్ వ్యవ హారంపై సీబీఐ జాయింట్ డైరెక్టర్ విచారణ జరపాలని ఆదేశించింది. రాజ్యాంగం 226వ అధికరణం కింద సంక్రమించిన అధికారం మేరకు ఈ ఆదేశాన్నిస్తున్నామని న్యాయస్థానం స్పష్టం చేసింది.పౌరుల ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం నుంచి గానీ, మరోవిధంగా గానీ ప్రమాదం వాటిల్లిందని హైకోర్టు భావించినప్పుడు జోక్యం చేసుకునే అధికారాన్ని అధికరణం 226 కల్పిస్తున్నది. దాన్ని ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో ప్రాథమిక హక్కులకు రక్షణ లేదనే అభిప్రాయం న్యాయ స్థానానికి కలిగిందని భావించవచ్చు. ఇటువంటి కేసులోనే గతంలో కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్ రాజీనామా చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎమర్జెన్సీ సమయంలో కేరళ పోలీసులు రాజన్ అనే యువకుడిని నక్సలైట్ సంబంధాలు న్నాయనే అనుమానంతో మఫ్టీలో వెళ్లి అపహరించారు. అరెస్ట్ చూపలేదు. చిత్రహింసలు పెట్టి అతడిని చంపేశారు. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే రాజన్ తండ్రి కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.హోంమంత్రి ఆదేశాలతోనే తన కుమారుణ్ణి పోలీసులు అపహరించారని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో కరుణాకరన్ హోంమంత్రిగా ఉన్నారు. రాజన్ను తాము అపహరించలేదని కోర్టులో పోలీసులు తప్పుడు అఫిడవిట్ వేశారు. అప్పటికే రాజన్ను చంపేసిన ఆధారాలు జన సామాన్యంలో ప్రచారంలో ఉన్నాయి. ఎమర్జెన్సీ తర్వాత ముఖ్యమంత్రి పీఠమెక్కిన కరుణాకరన్ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్లైన్ విధించి ఫలానా రోజులోగా రాజన్ను హాజరు పరచాలని ఆదేశించింది. చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేక పోవడం, ప్రజాగ్రహం వెల్లువెత్తడం, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో గద్దెనెక్కి నెల తిరక్కుండానే కరుణాకరన్ రాజీనామా చేయవలసి వచ్చింది. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన పోలీసు అధికారుల ప్రాసిక్యూషన్కు కూడా హైకోర్టు ఆదేశించింది. అదే తరహాలో ఇప్పుడు సవీందర్రెడ్డి కేసులో కూడా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం పోలీ సులు చేశారని స్పష్టమైంది.ఏపీ ప్రభుత్వం పోలీసుల్ని ఉసిగొల్పుతున్నది ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్టులపైనే కాదు, రాజకీయ ప్రత్యర్థులపైన మాత్రమే కాదు – ‘సాక్షి’ వంటి మీడియా సంస్థపై కూడా! దేశంలో మిలియన్ కాపీల సర్క్యులేషన్ దాటిన అగ్రశ్రేణి దినపత్రికల సంఖ్య అన్ని భాషల్లో కలిపి డజన్కు మించి లేదు. వాటిలో ‘సాక్షి’ ఒకటి. ఈ లెక్క ‘సాక్షి’ చెప్పేది కాదు. దిన పత్రికల సర్క్యులేషన్ల లెక్కలు తీసే ‘ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్’ (ఏబీసీ) అనే ప్రామాణిక సంస్థ చెప్పే లెక్క. అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థ కార్యాలయాల్లో అర్ధరాత్రి చొరబడి అల్లరి చేయడం, ఎడిటర్ ఇంట్లో దూరి సోదాలు చేయడం, ఎడిటర్తో సహా సీనియర్ సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూడటాన్ని ఎలా అర్థం చేసు కోవాలి? ఈ వైఖరిని ఫాసిజమనాలా? నాజీయిజమనాలా? అధికారం తలకెక్కడమనుకోవాలా అనేది ప్రజలే నిర్ణయిస్తారు.ఇక పవిత్రంగా ఉండవలసిన శాసనసభల నిర్వహణ తీరు ఎంత శోభాయమానంగా ఉన్నదో కనిపిస్తూనే ఉన్నది. మార్గ దర్శకంగా ఉండవలసిన రూల్ బుక్ అమలులో ఉన్నదా అటక మీద ఉన్నదా అర్థం కాని పరిస్థితి. అన్ రూలీ కామెంట్స్ విశృంఖలతకు అడ్డు చెప్పే పరిస్థితే లేదు. గురువారం నాటి సభలో చంద్రబాబునాయుడు బావమరిదీ ప్లస్ వియ్యంకుడు, సినీ నటుడైన బాలకృష్ణ ఆంగిక వాచికాభినయాలు చూసిన వారికి దిగ్భ్రాంతి కలిగించాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడైన జగన్ను ఉద్దేశించి తూలిన మాట కేవలం అన్ పార్లమెంటరీ మాత్రమే కాదు. పత్రికల్లో రాయడానికి కూడా అభ్యంతరకరమైనది. ఆయనట్లా య«థేచ్ఛగా మాట తూలుతుంటే పాలకపక్ష సభ్యులు హర్షధ్వానాలు చేయడం, నవ్వడం, ముఖ్యమంత్రితో సహా పెద్దలెవరూ వారించకపోవడం, సభా ధ్యక్ష స్థానంలో ఉన్నవారు కూడా మిన్నకుండటం చూసిన తర్వాత మెదళ్లను తొలిచే మొదటి ప్రశ్న: రూల్ బుక్ ఎక్కడ?సభలో లేని ప్రతిపక్ష నేతనుద్దేశించి అవమానకరమైన రీతిలో కామెంట్లు చేస్తూ, వాటికి హర్షామోదాలు వ్యక్తం చేస్తున్న కూటమి సభ్యులు మరోపక్క ప్రతిపక్ష నేత హోదా లేకుండానే జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం వెనుక ఉన్న గూడుపుఠాణీ అర్థం కావడం లేదా? ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా రన్నింగ్ కామెంటరీతో అవమానించాలనే ఎత్తుగడ కాదా? లేకుంటే బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్ను రికార్డుల నుంచి తొలగించా లని సభ్యులెవరూ ఎందుకు కోరలేదు? స్వయంగా సభాధ్యక్షులే అప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేదు? అలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు గతంలో కోకొల్లలుగా లేవా?బాలకృష్ణ మాట్లాడటానికి ముందు బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసమే పనిచేసే నాయకులు కొందరున్నారని అందరికీ తెలిసిందే! వారిలో కామినేని శ్రీనివాస్ ముఖ్యులు. ‘సినిమా పరిశ్రమ నుంచి మాట్లాడటానికి వచ్చినవాళ్లను కలవకుండా జగన్ అవమానించారు, చిరంజీవి గట్టిగా అడగడంతో వచ్చి కలిశార’ని శ్రీనివాస్ ఆరోపించారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ జగన్పై అభ్యంతరకర పదప్రయోగం చేశారు. పనిలో పనిగా చిరంజీవిపై తనకున్న వ్యతిరేకతను కూడా బయటపెట్టుకున్నారు. ‘ఎవడూ’ గట్టిగా నిలదీయలేదంటూ ఆయన్ను కూడా అవమానించే విధంగా మాట్లాడారు. దీనిపై స్పందించిన చిరంజీవి... జగన్ తమను సాదరంగా ఆహ్వానించారనీ, ఆయనతో తాము జరిపిన చర్చల ఫలితంగానే అప్పట్లో తన సినిమా, బాలకృష్ణ సినిమాతోపాటు పరిశ్రమకు మేలు జరిగిందనీ ఒక లేఖ ద్వారా తెలియజెప్పారు. ఈ వివరణ తర్వాత విధిలేని పరిస్థితుల్లో కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్య లను రికార్డుల నుంచి తొలగించాలని శనివారం నాడు కోరవలసి వచ్చింది. కానీ, జగన్ను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ అలా కోరలేదు. సభా నాయకుడు గానీ, సభాధ్యక్షులు గానీ అటువంటి నిర్ణయం తీసుకోలేదు. జగన్ను అవమానించాలనే ఎత్తుగడతో పాలక కూటమి పని చేస్తున్నదనడానికి ఇవి నిదర్శనాలే కదా!ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే చిరంజీవిపైన బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను జనసేన నేతలు ఎవ్వరూ ఖండించకపోవడం! పవన్ కల్యాణ్ జ్వరంతో విశ్రాంతి తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. మిగిలిన వారెందుకు మాట్లాడలేదని జనంలో చర్చ మొదలైంది. ఆ సమయంలో సభలో ఉన్న జనసేన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేశ్ కూడా ఏమీ స్పందించలేకపోయారు. పైగా ఎఫ్డీసీ ఆహ్వాన పత్రికలో తన పేరును తొమ్మిదో పేరుగా ‘ఎవడు’ వేశాడని దుర్గేశ్ పట్ల కూడా బాలకృష్ణ దురుసుగానే మాట్లాడారు. సినిమా రంగంలో స్వశక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న చిరంజీవి ప్రస్థానంపై తొలినుంచీ బాలకృష్ణకు ఎంతో కొంత అసహనం ఉన్నదనే విషయం దాచేస్తే దాగేది కాదు.మహానటుడిగా విశ్వవిఖ్యాతి గాంచిన తండ్రిగారు ముఖ్య మంత్రి అయిన తర్వాతనే సోలో హీరోగా బాలకృష్ణ సినిమా కెరీర్ ప్రారంభమైంది. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినా అవి సోలో హీరో పాత్రలు కావు. దాదాపు బాలకృష్ణ నటజీవితంతో సమాంతరంగానే చిరంజీవి ప్రయాణం సాగింది. సినిమా పరిశ్రమలో ఎవరి అండాదండా లేకుండా, కేవలం స్వయం ప్రతిభతో దూసుకెళ్లి ఎనభయ్యో దశకం చివరి నాటికే అగ్రహీరోగా చిరంజీవి ఎదిగిపోయారు. అప్పటినుంచి ఆయన రాజకీయాల్లో ప్రవేశించే వరకు దాదాపు పదిహేను పదహారేళ్ల పాటు చిరంజీవికి గట్టి పోటీగా బాలకృష్ణే కాదు, మరే హీరో కూడా నిలవలేకపోయారు. కారణం ఏదైనాగానీ, చిరంజీవి ప్రస్తావన వచ్చిన సందర్భాల్లో వెటకారంగానో, అసహనంగానో, అతిశయంతోనో బాలకృష్ణ స్పందించడం జనం గమనించారు. ‘రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఏమయ్యాడు?’ ‘మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు’ అంటూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘లేపాక్షి ఉత్సవానికి చిరంజీవిని పిలుస్తున్నారా’ అని ఎవరో అడిగితే ‘ఎవర్నో తెచ్చి నెత్తిన పెట్టుకుంటామా?’ అని రుసరుస లాడారు. పవన్ కల్యాణ్ అభిమానుల్ని ‘అలగా జనం’గా సంబోధించడం కూడా వివాదాస్పదమైంది.అసెంబ్లీలో జగన్ను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన అభ్యంతర కరమైన వ్యాఖ్యల తర్వాత బాలకృష్ణ ‘సైకో సర్టిఫికెట్’ ఉదంతం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలకృష్ణ జరి పిన కాల్పుల్లో నిర్మాత బెల్లంకొండ సురేశ్, ఆస్థాన జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. ఆ కేసు సందర్భంగా తనకు మానసిక పరిస్థితి బాగాలేదనే ఒక ‘సైకియాట్రీ’ సర్టిఫికెట్ను కోర్టుకు సమర్పించారు. ఈ సర్టిఫికెట్ను ఏర్పాటు చేసిన డాక్టర్ కాకర్ల సుబ్బా రావును ఆ తర్వాత కాలంలో ఏబీఎన్ ఛానల్ అధిపతి రాధా కృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో బాలకృష్ణకు మీరు సాయం చేశారట గదా?’ అని రాధాకృష్ణ ప్రశ్నించారు. ‘అవును సాయం చేశాను. చాలా పెద్ద సాయం. అతడిని (బాలకృష్ణను) ఎలా బయటపడేయాలా అని ఆలోచిస్తే ‘సైకియాట్రీ’ ఆలోచన వచ్చింది. ఇద్దరు నిపుణులతో చర్చించి, ఆ సమయంలో అలా చేయకపోయి ఉంటే తనను తాను కాల్చుకునే పరిస్థితి ఉండేది అనే విధంగా సర్టిఫికెట్ ఇచ్చాం. లేకపోతే ఈ కేసులలో బయట పడేవాడు కాద’ని డాక్టర్ కాకర్ల స్పష్టం చేశారు.ఇప్పుడు ఇంకో సమస్య ముందుకు వస్తున్నది. బాలకృష్ణకు సైకో సర్టిఫికెట్ను వైద్యులు ఇచ్చిన మాట నిజం. దాన్ని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పరిగణనలోకి తీసుకొని వెంటనే బెయిల్ మంజూరు చేసిన సంగతి నిజం. భారత రాజ్యాంగం 326వ అధికరణం ప్రకారం మతిస్థిమితం లేని వాళ్లకు ఓటు హక్కును నిరాకరించవచ్చు. ఓటు వేసే హక్కే లేనప్పుడు పోటీచేసే అవకాశం ఎలాగూ ఉండదు. ఆర్టికల్ 102 (1బి) ప్రకారం మతిస్థిమితం లేని ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించవచ్చు. అయితే ఇందుకు మెడికల్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు. ఆమేరకు న్యాయస్థానం నిర్ధారించాలి. బాలకృష్ణ కేసులో మెడికల్ సర్టిఫికెట్ ఉన్నది. దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకున్న ఉదంతం కూడా ఉన్నది. ఆ తర్వాత కాలంలో చికిత్స అనంతరం ఆయన మానసిక స్థితి మెరుగైందని మళ్లీ ఓ మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నారా? అది న్యాయస్థానం దృష్టికి కూడా వెళ్లిందా అనే విషయాలపై సమాచారం లేదు. ఒకవేళ అటువంటిదేమీ జరక్కపోయుంటే ఎవరైనా పిటిషన్ వేస్తే బాలకృష్ణ శాసనసభ్యత్వం రద్దవుతుందా అనే విధంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. ఏదో అవసరార్థం సర్టిఫికెట్లు తప్ప బాలకృష్ణకు మతిస్థిమితం లేదని ఎవ్వరూ అనుకోరు. కాకపోతే ఆ ప్రచారంలో ఆయనకూ, ఆయన పార్టీ అధినేతలకూ ఓ సౌలభ్యం ఉన్నది. ఆ ముసుగులో ఎవరినైనా ఏమైనా అనేయవచ్చు. అధినేతలు అనలేని మాటలు బాలయ్య నోట అనిపించవచ్చు. ఇప్పుడు జరిగింది కూడా అదే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Dadisetti Raja: బాలకృష్ణ ఒక పిచ్చోడు..
-
కేసులో నిజాలు బయటికి రావాలంటే సిబిఐతో విచారణ జరగాలన్న కోర్ట్
-
Jogi: చంద్రబాబుకు వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలు చేయడం అలవాటే
-
Bhumana: తిరుమలలో చంద్రబాబు ఆయనను ఆయన పొగుడుకోవడమే సరిపోయింది
-
కూటమి పాలనలో కొత్త పెన్షన్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు: బొత్స
-
‘చిరు’.. ఎవడు?
శాసనసభ వేదికగా మెగాస్టార్ చిరంజీవిని ఎమ్మెల్యే బాలకృష్ణ దారుణంగా అవమానించారు. చిరంజీవిని ఉద్దేశించి ‘ఎవడు..?’ అంటూ తూలనాడుతూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. కాగా అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలను విదేశాల్లో ఉన్న చిరంజీవి తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నాడు తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత కొద్దిరోజులకు సినీ ప్రముఖులతో కలసి మరోసారి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి పరిశ్రమ సమస్యలపై చర్చించానని పేర్కొన్నారు. నాడు.. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ రేట్లు పెంచడానికి ఆ సమావేశమే కారణమైందని స్పష్టం చేశారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ వాడు.. వీడు.. సైకో..! అంటూ బాలకృష్ణ దుర్భాషలాడటాన్ని బట్టి ఆయన మానసిక స్థాయిపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.సాక్షి, అమరావతి: ‘వాడెవడు....?’ఇదీ చిరంజీవిని ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ గురువారం శాసనసభలో చేసిన వ్యాఖ్య! మెగాస్టార్ చిరంజీవిపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా తీవ్ర కలకలం సృష్టించాయి. బావ చంద్రబాబు మనసులో మాటనే బావమరిది బాలకృష్ణ వెల్లడించారన్నది స్పష్టమైంది. అందుకే సభలో అధికార కూటమి సభ్యులు ఎవరూ వ్యతిరేకించ లేదు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దీనిపై కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సీఎం చంద్రబాబు కూడా మౌనముద్ర దాల్చి బాలయ్య వ్యాఖ్యలను పరోక్షంగా సమర్థించారు. తద్వారా చిరంజీవి గురించి టీడీపీ అధికారిక విధానమే అదని శాసనసభ వేదికగా సంకేతాలిచ్చారు. బాలకృష్ణ వ్యాఖ్యలు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి. చంద్రబాబు, బాలకృష్ణ గతంలో చిరంజీవిని అవమానించిన ఉదంతాలను అందరూ గుర్తు చేస్తున్నారు. కాపు సామాజిక వర్గాన్ని దూషించిన మాటలను ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ హయాంలో చిరంజీవిని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాదరంగా ఆహ్వానించి గౌరవించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వెరసి బాలకృష్ణ శాసససభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలయ్య తీరుపై చిరు అభిమానులు, కాపు సామాజికవర్గం రగిలిపోతోంది.బాబు మనసులో మాట బాలయ్య నోట.. రాజకీయ వ్యూహంతోనే చిరుపై అభ్యంతరకర వ్యాఖ్యలుమెగాస్టార్ చిరంజీవిని పదే పదే అవమానించడం టీడీపీ విధానమన్నది మరోసారి స్పష్టమైంది. 2024 ఎన్నికల ముందు గత్యంతరం లేక కుట్రపూరిత మౌనం వహించిన చంద్రబాబు, బాలకృష్ణ ప్రస్తుతం ఏరు దాటాక చిరంజీవిని బోడి మల్లన్నను చేశారు. అందుకే సందర్భం కాకపోయినా సరే బాలకృష్ణ శాసనసభ వేదికగా చిరంజీవిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి అనే కనీస గౌరవం కూడా లేకుండా ‘వాడెవడు..?’ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఈ శాసనసభ సమావేశాల్లో ఇప్పటివరకు మాట్లాడని బాలకృష్ణ గురువారం హఠాత్తుగా లేచి చిరంజీవిని అవమానించడం వెనుక టీడీపీ రాజకీయ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. లేదంటే చర్చ సినిమా రంగం అభివృద్ధి అంశం వరకే పరిమితమై ఉండేది. సినిమా రంగంపై చర్చ కాదని, చిరంజీవిని మరోసారి అవమానించడమే తమ లక్ష్యమని బాలకృష్ణ ద్వారా టీడీపీ చాటి చెప్పింది.అభ్యంతరం చెప్పని బాబు... వారించని డిప్యూటీ స్పీకర్బాలయ్య వ్యాఖ్యలకు టీడీపీ కూటమి అధికారిక ముద్రముందస్తు వ్యూహంతోనే చిరంజీవిని అవమానించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు యావత్ అధికార కూటమి తమ వ్యవహారశైలి ద్వారా స్పష్టం చేసింది. అందుకే బాలకృష్ణ వ్యాఖ్యలపై శాసనసభాపక్ష నేత హోదాలో చంద్రబాబు కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆయన సభలోనే ఉన్నప్పటికీ అసలు ఆ విషయమే పట్టనట్లుగా వ్యవహరించారు. ఇక చిరంజీవిని అవమానిస్తూ బాలకృష్ణ మాట్లాడుతుంటే యావత్ అధికార కూటమి సభ్యుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు. కొందరు టీడీపీ సభ్యులు ముసిముసిగా నవ్వుతూ కనిపించడం గమనార్హం. తద్వారా ఆ వ్యాఖ్యలను అధికార కూటమి సభ్యులు బహిరంగంగానే సమర్థించారు. ఇక స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలను అడ్డుకునేందుకు, వారించేందుకు కనీసం ప్రయత్నించ లేదు. ఆయన మైక్ను కట్ చేయనూ లేదు. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, సభలో లేనివారి గురించి మాట్లాడటం సరికాదని వారించలేదు. అంతేకాదు.. బాలకృష్ణ తన ప్రసంగం ముగించిన తరువాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ ‘వెరీ గుడ్ సర్..’ అని అభినందించడం గమనార్హం. అంటే చిరంజీవిని అవమానించడం టీడీపీ అధికారిక విధానమేనని శాసనసభ సాక్షిగా విస్పష్టంగా ప్రకటించారు.మానసిక రోగిగా సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలయ్య2004లో ఇద్దరిపై రివాల్వర్తో కాల్పులుకేసు నుంచి తప్పించుకునేందుకే మెంటల్ సర్టిఫికెట్తాజా పరిణామాల నేపథ్యంలో బాలకృష్ణ మానసిక రోగి అనే విషయం మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2004లో హైదరాబాద్లో తన సన్నిహితులైన నిర్మాత బెల్లంకొండ సురేశ్, సిద్ధాంతి సత్యనారాయణ చౌదరిలపై ఆయన రివాల్వర్తో కాల్పులు జరిపారు. తన భార్య వసుంధర పేరుతో లైసెన్స్ ఉన్న రివాల్వర్తో తన నివాసంలోనే ఈ కాల్పులకు తెగబడ్డారు. అప్పట్లో ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు బాలకృష్ణ అప్పటికప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. తరువాత ఆయన మానసికస్థితి సరిగా లేదని అప్పటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు సర్టిఫికెట్ జారీ చేశారు. ఆయన ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. అమెరికాలో స్థిరపడ్డ కాకర్ల సుబ్బారావును ఆహ్వానించి హైదరాబాద్లోని నిమ్స్ డైరెక్టర్గా నియమించింది ఎన్టీ రామారావే. ఆ అనుబంధంతోనే బాలకృష్ణను కాల్పుల కేసు నుంచి తప్పించేందుకు మెంటల్ సర్టిఫికెట్ జారీ చేయడానికి ఆయన సహకరించారని పరిశీలకులు చెబుతున్నారు. తనకు ఇంతగా సహకరించిన కాకర్ల సుబ్బారావును సైతం తరువాత బాలకృష్ణ అవమానించారు. బసవతారకం ట్రస్ట్ నుంచి ఆయన్ను తొలగించారు. టీడీపీ అనుకూల చానల్ ఇంటర్వ్యూలో కాకర్ల సుబ్బారావు వెల్లడించిన అంశాల వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.గతంలోనూ చిరంజీవికి ఎన్నోసార్లు అవమానంజనసేన, కాపు సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు అదే బాబు, బాలయ్య విధానంచంద్రబాబు, బాలకృష్ణ గతంలో కూడా చాలాసార్లు చిరంజీవిని అవమానించారు. 2014–19లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చిరంజీవిని అవమానించిన ఉదంతాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఓ కార్యక్రమంలో చంద్రబాబు, బాలకృష్ణ మొదటి వరుస కుర్చీల్లో కూర్చుని ఉండగా.. చిరంజీవి ఓ మూలన నిలబడే కార్యక్రమాన్ని వీక్షించిన దృశ్యాలు వైరల్గా మారాయి. మెగాస్టార్ చిరంజీవికి కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా ఇవ్వకుండా నిలబెట్టడం విభ్రాంతి కలిగించింది. ఇక గతంలో పలు బహిరంగ సభల్లో పీఆర్పీ, జనసేన పార్టీల కార్యకర్తలను, కాపు సామాజికవర్గాన్ని బాలకృష్ణ దూషిస్తూ మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జనసేన పార్టీ కార్యకర్తలను ఓసారి ‘అలగా జనం..’ అని బాలకృష్ణ దూషించారు. మరోసారి ‘సంకర జాతి... కొడుకులు..’ అని కూడా పరుష పదజాలంతో దుర్భాషలాడిన వైనాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. చిరంజీవి మాతృమూర్తి గురించి కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ శాసనసభలో అవమానకరంగా మాట్లాడారు. ఇలా ప్రతిసారి... సందర్భం కాకపోయినా దాన్ని సృష్టించి మరీ చిరంజీవిని, ఆయన కుటుంబాన్ని అవమానించడం చంద్రబాబు, బాలకృష్ణతోపాటు యావత్ టీడీపీ అధికారిక రాజకీయ విధానంగా మారిందన్నది సుస్పష్టం. -
‘ఉద్యోగులను చంద్రబాబు వేధిస్తున్నారు’
తాడేపల్లి : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా మోసం చేశారని, వారికి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానన్న చంద్రబాబు హామీ ఉష్ కాకి అయిందని, 25 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. పైగా జగన్ నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్టు చంద్రబాబు బిల్డప్ ఇచ్చుకుంటున్నారని మండిపడ్డారు.అభ్యర్థులు కష్టపడి చదివి, ఉద్యోగం సాధిస్తే చంద్రబాబు తన గొప్పగా భజన చేసుకుంటున్నారని చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. మెరిట్ లిస్టులో ఉన్న కొందరికి ఉద్యోగాలు రాకపోవటానికి కారణం ఏంటి?అని ప్రశ్నించారు. దీనికి అధికారులు సరైన సమాధానమే చెప్పటం లేదన్నారు. ఫలితంగా తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు కలుగుతున్నాయని, జగన్ హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు. రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను జగన్ హయాంలో వచ్చాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలతో కలిపితే ఆరు లక్షల మందికి అవకాశం కల్పించారని, అయినా జగన్ ప్రచారం చేసుకోలేదని చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.అయితే సీఎం చంద్రబాబు ఏమీ చేయకుండానే విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని, ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డీఎ, ఐఆర్, పిఆర్సీ గురించి ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారని, పండుగలన్నీ వెళ్తున్నాయిగానీ ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదుని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వాలంటీర్ల పనులను కూడా సచివాలయ సిబ్బందితో ఎందుకు చేయిస్తున్నారని చంద్రశేఖరరెడ్డి ప్రశ్నించారు. సెలవు రోజులు, రాత్రి సమయాల్లో కూడా పనులు చేయిస్తూ వేధిస్తున్నారని, ఉద్యోగులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని దసరాలోపు ఉద్యోగులకు మేలు చేకూర్చకపోతే వారంతా రోడ్డెక్కటం ఖాయమని చంద్రశేఖరరెడ్డి హెచ్చిరించారు. -
Kancharapalem: కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిరు వ్యాపారుల నినాదాలు
-
ఈ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: వైఎస్ జగన్
ఈ పెద్దమనిషి ఎన్నికలప్పుడు ఏం చెప్పి వచ్చాడు.. వచ్చాక ఏం చేస్తున్నాడు? అప్పట్లో సంపద సృష్టిస్తానని పదే పదే ప్రతి మీటింగ్లో చెప్పారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాత్రమే కాదు.. జగన్ చేసినవన్నీ కూడా చేస్తూ.. ఇంకా ఎక్కువే ఇస్తానన్నాడు. ఈ రోజు పరిస్థితి చూస్తే.. సంపద సృష్టించడం అంటే.. కేవలం తనకు, తన మనుషులకే సంపద సృష్టించడం అని తేటతెల్లం అయింది. రాష్ట్రానికి సంపద సృష్టించడం దేవుడెరుగు.. స్కామ్లు చేస్తూ ఉన్న సంపద ఆవిరి చేస్తున్న పరిస్థితి. మన ప్రభుత్వంలో అమలు చేసిన స్కీములన్నింటినీ రద్దు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు గాలికెగిరిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.ప్రభుత్వం అనేది మంచి విద్యా వ్యవస్థను, ప్రతి పేదవాడికి అందుబాటులో మంచి వైద్య వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని అనుకుంటాం. రైతుకు అండదండగా ఉంటుందనుకుంటాం. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఎలాంటి వివక్ష లేకుండా ఉండాలని, అలాంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు. ఓట్లు వేసినప్పుడు ఎవరైనా ఇవన్నీ కోరుకుంటారు. కానీ ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్.. ఇలా ఏది తీసుకున్నా, కనపించేది తిరోగమనమే. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. చంద్రబాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ అని ప్రజలకు అర్థమైందన్నారు. సంపద సృష్టించి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేస్తానని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక స్కామ్లు చేస్తూ, ఉన్న సంపదను ఆవిరిచేస్తూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సైతం రద్దు చేశారని మండిపడ్డారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేయకపోయినా, అమలు చేసినట్లు గోబెల్స్ ప్రచారం చేస్తూ విజయోత్సవాలు జరిపిస్తున్నారని దెప్పిపొడిచారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్య బట్టారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం తన అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రీజినల్ కో–ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శుల (పార్లమెంటు)ను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశా నిర్దేశం చేశారు. సజావుగా ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా దక్కవని చంద్రబాబుకు తెలుసని.. అందుకే సజావుగా ఎన్నికలు జరపడని.. కాబట్టి మీరందరూ ఇంకా గట్టిగా నిలబడి, పోరాడాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో వ్యతిరేకత ⇒ ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి, ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారు. ⇒ ఇప్పుడు రాష్ట్రంలో ఎవరిని కదిలించినా ‘ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్’ అంటున్నారు. ఇది నిజంగా వాస్తవం. పథకాలు మాయమైపోయాయి ⇒ ఈమధ్య ఈ పెద్ద మనిషి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో విజయోత్సవ సభ పెట్టబోతున్నప్పుడు వాళ్ల పాంప్లెట్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్కు, ఈ అడ్వర్టైజ్మెంట్కు మధ్య స్పష్టమైన తేడా ఉంది. కొన్ని పథకాలను ఎగ్గొట్టేశారు. ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంశాలు మారిపోయాయి. ⇒ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, ఏడాదికి రూ.18 వేలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ మొన్నటి అడ్వర్టైజ్మెంట్లో కనిపించలేదు. ⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేసేశామంటూ అడ్వర్టైజ్మెంట్స్లోని అంశాలను మార్చేసి అన్నీ చేసేశాం అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ స్థాయిలో మోసం చేసే వారు ప్రపంచ చరిత్రలో మరొకరు ఉండరు. ఇంటింటికీ బాండ్లు, సంతకాలతో ప్రతిజ్ఞలు⇒ ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ బాండ్లు పంపించారు. బాండ్లకు సంబంధించి ప్రతి ఫోన్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఆడబిడ్డ నిధి కింద ఇంత, తల్లికి వందనం కింద ఇంత, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, యువగళం (నిరుద్యోగ భృతి) కింద నెలకు రూ.3 వేలు, ఏడాదికి రూ.36 వేల చొప్పున.. ఆ కుటుంబానికి ఏటా ఇంత మొత్తం ఇస్తామంటూ బాండ్లు ఇచ్చారు.⇒ ఇంకా ‘చంద్రబాబు నాయుడు అనే నేను అధికారంలోకి వచ్చాక, భవిష్యత్ గ్యారెంటీలోని హామీలను త్రికరణ శుద్ధితో నెరవేరుస్తానని, ఎలాంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది’.. అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు, వారి సంతకాలతో కూడిన ప్రతిజ్ఞా పత్రాలు ఇంటింటికీ పంపించారు. వాస్తవంగా ఏం చేశారంటే..⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో కొన్నింటిని కొద్దో గొప్పో అమలు చేసినా, వాటిని కూడా అందరికీ ఇవ్వకుండా కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత పీఎం కిసాన్తో కలిపే రూ.20 వేలు ఇస్తామన్నారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఆ తర్వాత రెండేళ్లకు కలిపి రూ.40 వేలకు గాను రూ.5 వేలే ఇచ్చారు. ⇒ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు. రెండేళ్లకు కలిపి ఆరు సిలిండర్లకు ఇచ్చింది ఒక్కటే. అది కూడా కొందరికే. రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. కానీ అది కొన్ని బస్సులకే పరిమితం చేశారు. మనం ఇచ్చిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. చివరికి 30 లక్షల మంది పిల్లలకు కట్ చేశారు. రూ.15 వేలు ఇస్తానన్నది కాస్తా రూ.13 వేలు చేశారు. అదీ పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి రూ.10 వేలు, ఇంకొందరికి రూ.9 వేలు, మరి కొందరికి రూ.8 వేలు మాత్రమే ఇచ్చారు. ఇలా చంద్రబాబు పాలనలో ప్రతి అడుగులోనూ మోసం, అబద్ధమే కనిపిస్తోంది. రైతులకు అంతులేని కష్టాలు⇒ వ్యవసాయానికి సంబంధించి ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. యూరియా దొరకని దుస్థితి. మార్కెట్లో బ్లాక్ చేసేశారు. రేట్లు పెంచేశారు. దళారీలతో ఈ ప్రభుత్వం చేతులు కలిపినందువల్లే ఈ దుస్థితి. ప్రైవేటుకి కోటా పెంచేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు వచ్చే సరుకును వీళ్ల కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ అనేది కనపడకుండా పోయింది. రైతన్నకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయిన పరిస్ధితి. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం కట్టలేదు. మన ప్రభుత్వ ఐదేళ్లలో ఏనాడన్నా ఇలాంటి పరిస్థితి రైతు చూశాడా? ⇒ మన ప్రభుత్వంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు రావడమే కాకుండా, రైతులకు ఆర్బీకేల ద్వారా, ఈ క్రాప్ ద్వారా మద్దతు ధర కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. ఇంకా జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్టేషన్) కింద అదనంగా ఎకరాకు దాదాపు రూ.10 వేలు ఇచ్చిన పరిస్థితులు మన ప్రభుత్వంలో కనిపించాయి.ఈ ధాన్యం ప్రజలు తినరట.. ⇒ రైతులు పండించిన ధాన్యం తినే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు చెప్తాడు. అందుకే ధాన్యానికి గిట్టుబాటు ధర లేదంటున్నాడు. ఈ ధాన్యమంతా ఇథనాల్ (లిక్కర్లో వినియోగించే) తయారు చేసే దానికి వాడతారంటున్నాడు. అంటే రాబోయే రోజుల్లో కూడా ధాన్యం సేకరణలో నా విధానం ఇదేనని చెబుతున్నట్టేగా? ధాన్యానికి ఇంకెప్పుడూ గిట్టుబాటు ధర రాదు.. పండించడం మానేయండి.. అని చెబుతున్నాడు. ⇒ కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, అరటి, టమాటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా ఏ పంటకూ ఈ రోజు గిట్టుబాటు ధర లేదు. కారణం.. దగ్గరుండి ఆర్బీకే వ్యవస్థను, ఈ క్రాప్ను నిర్వీర్యం చేయడమే.⇒ నాడు మన ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటూ రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కొనుగోలులో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా నిలిచాం. అధ్వానంగా విద్యా రంగం ⇒ విద్యా రంగంలో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్ చదువులు గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నీరుగారిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లిష్ మీడియం చదువులు పిల్లలకు ఎండమావి అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే.. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతే ఆ త్రైమాసికానికి వెంటనే మన ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను మన ప్రభుత్వం గొప్పగా అమలు చేసింది.⇒ 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంతే.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఫినిష్. అప్పటి నుంచి ఈ సెప్టెంబరు వరకు 7 క్వార్టర్స్కు సంబంధించి, ఒక్కో క్వార్టర్కు రూ.700 కోట్లు.. ఇలా మొత్తం రూ.4900 కోట్ల బకాయిలు ఉన్నాయి. కానీ, ఈ పెద్దమనిషి రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ⇒ గత ఏడాది ఏప్రిల్లో ఎన్నికల కోడ్ వల్ల జగనన్న వసతి దీవెన ఆగిపోయింది. వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా ఇవ్వడం లేదు. అలా వసతి దీవెన కింద ఈ ప్రభుత్వం రూ.2,200 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది సున్నా. ఈ రోజు పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి. వైద్య రంగం నిర్వీర్యం⇒ ఆరోగ్యశ్రీలో మన ప్రభుత్వంలో రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడు దర్జాగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఆ రోజు 3 వేలకు పైగా ప్రోసిజర్లకు వైద్యం ఉచితంగా అందించాం. ఈ పెద్ద మనిషి ఆరోగ్యశ్రీకి గత 16 నెలలుగా బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నడపాలంటే ప్రతి నెలా రూ.300 కోట్లు అవసరం. ఈ 16 నెలల్లో దాదాపు రూ.4 వేల కోట్లు బకాయి పెట్టారు. దాంతో నెట్వర్క్ ఆస్పత్రులు బోర్డు తిప్పేశాయి. పేదవాడు వైద్యం కోసం ఈరోజు ప్రైవేట్ ఆçస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. ⇒ రోగికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో డాక్టర్లు సూచించినంత కాలం రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల చొప్పున ఇచ్చి మన ప్రభుత్వంలో గొప్ప సహాయంగా ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశాం. సంవత్సరానికి రూ.450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలల్లో అయ్యే ఖర్చు దాదాపు రూ.600 కోట్లు ఉంటుంది. కానీ చంద్రబాబు ఈ పథకానికి ఇచ్చింది సున్నా. అమరావతికి రూ.2 లక్షల కోట్లట! ⇒ చంద్రబాబు ప్రాజెక్టు రిపోర్టు ప్రకారమే అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లు కావాలంటున్నాడు. మొదటి దఫా 50 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున మౌలిక వసతుల కల్పనకు ఖర్చవుతుందంటున్నారు. ఇది రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ కోసం మాత్రమే. గత చంద్రబాబు ప్రభుత్వంలో వీటి కోసమే రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాడు. ఇంకా రూ.95 వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు చేస్తారు? ⇒ ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారని ప్రజలు ప్రశ్నిస్తుంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇంకా 50 వేల ఎకరాలు కావాలంటున్నాడు. ఈ 50 వేల ఎకరాలకు మరో లక్ష కోట్లు కావాలని ఎస్టిమేషన్ వేశాడు. మొత్తంగా రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? రూ.5 వేల కోట్లు ఖర్చు చేయడానికి డబ్బు లేదట! చంద్రబాబూ అసలు నీవు మనిషివేనా? ఇక లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అంతులేని అవినీతి.. యథేచ్ఛగా దోపిడీ⇒ కూటమి పాలనలో అవినీతి లేనిది ఎక్కడో చెప్పాలి. మద్యం, ఇసుక, లాటరైట్, బాక్సైట్, క్వార్ట్›జ్, సిలికా, మట్టి దేన్నీ వదలడం లేదు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్లు. కుట్టుమిషన్ల నుంచి మొదలు పెడితే.. ఎకరా భూమి 90 పైసలే. మన ప్రభుత్వంలో రూ.2.40 చొప్పున యూనిట్ విద్యుత్ కొనుగోలు చేస్తే, వీళ్లు అదే యూనిట్ రూ.4.60తో కొనేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏది చూసినా స్కామ్లే. ⇒ మన హయాంలో ప్రభుత్వ ఖజానాకు ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రోజు ఖజానాకు రూపాయి కూడా రావడం లేదు. ఇసుక రేటు మాత్రం మన హయాంలో కన్నా డబుల్ అయ్యింది. ఆ ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. జీఎస్టీ ఎందుకు తగ్గుతుందంటే.. రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గబట్టే కదా? ⇒ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇది మనం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 57 శాతం. కొత్తగా స్కీమ్లు లేవు, పాత స్కీమ్లన్నీ రద్దు చేశారు. మరి ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది.. ఎవరి జేబుల్లోకి పోతోంది?మెడికల్ కాలేజీల అమ్మకం అత్యంత హేయం⇒ ఈ రోజు చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టాడు. బుద్ధి, జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని ఆలోచన చేస్తాడా? అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఎక్కడైనా మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వాలే ఎందుకు నడుపుతాయో అందరూ ఆలోచించాలి. గవర్నమెంట్ వాటిని నడపకపోతే నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో పేదలు తమ పిల్లలను చదివించగలిగే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఆస్పత్రులు లేకపోతే పేదలకు ఉచితంగా వైద్యం అందడం సాధ్యమేనా?. గవర్నమెంట్ బస్సులు నడపకపోతే ప్రజలు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించగలరా? అందుకోసమే దేశ వ్యాప్తంగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్కూళ్లు, ఆసుపత్రులు, బస్సులు నడుపుతున్నారు.⇒ ఆ రోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ టీచింగ్ ఆస్పత్రిని తీసుకువచ్చాం. అంటే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకువచ్చాం. ఈ టీచింగ్ ఆస్పత్రుల్లో పనిచేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ మెడికల్, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సులు, వివిధ సేవలు చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉంటారు. అంతమంది అందుబాటులో ఉంటారు కాబట్టి పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుంది. అలాంటి గొప్ప విప్లవాన్ని మన ప్రభుత్వంలో తీసుకువచ్చాం. ⇒ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. మన పిల్లలు చాలా మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి కూడా ప్రైవేట్తో పోలిస్తే తక్కువ రేటుకే సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఇది రెండో అడ్వాంటేజ్. ఇలాంటి కార్యక్రమాన్ని.. చంద్రబాబు స్కామ్ల కోసం దుర్వినియోగం చేస్తూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేక చేతులెత్తేశాడు. ⇒ రూ.8 వేల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి మన హయాంలోనే ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. మరో రెండు కాలేజీలు పులివెందుల, పాడేరు చంద్రబాబు ప్రభుత్వం రాకముందే ప్రారంభోత్సవానికి సిద్ధం చేశాం. వాటికి కూడా అనుమతులు వచ్చాయి. దాదాపుగా 17 కాలేజీలను మనం మొదలుపెట్టి వాటిలో 7 కాలేజీలను పూర్తి చేయగలిగాం. ఇంకో రూ.5 వేల కోట్లు అంటే, ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ఈ కాలేజీలన్నీ పూర్తి అవుతాయి కదా.. కానీ చంద్రబాబు అందుకు సిద్ధంగా లేరు. -
తాబేదారుల కోసమే మెడికల్ కాలేజీల పీపీపీ: బొత్స
సాక్షి, అమరావతి: ‘‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్కు అప్పగిస్తే వాళ్లేమైనా ఇంట్లో డబ్బులు తెచ్చి కాలేజీలు, ఆస్పత్రులను నిర్వహిస్తారా? ప్రజారోగ్యాన్ని ప్రైవేటు చేతుల్లో పెట్టడం అంటే పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేయడమే’’ అని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజారోగ్యాన్ని ప్రైవేటుపరం చేస్తే బాధ్యత వహించేది ఎవరు? అని ప్రభుత్వ తీరును సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల స్వార్థం, వాళ్ల తాబేదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. దీనిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వ విధానం’పై బుధవారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో బొత్స మాట్లాడారు. ‘ప్రపంచంలో ఎక్కడైనా ప్రజారోగ్యం, విద్య ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. మన దగ్గర ఉన్న డబ్బు, బడ్జెట్తో ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కొలవడం చాలా దురదృష్టకరం. కోవిడ్ లాంటివి వస్తే పీపీపీ మోడ్లో ఉన్న ప్రైవేటు కళాశాలలు చూడవు. ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. అందుకే విపత్కర పరిస్థితుల్లో ప్రతి జిల్లాలో ప్రభుత్వ కళాశాల ఉంటే, ప్రజలకు మెరుగైన వైద్యం దక్కుతుందని వైఎస్ జగన్ ఆలోచించారు. కానీ, దానిని కూటమి ప్రభుత్వం డబ్బుతో కొలుస్తోంది’’ అని తూర్పారపట్టారు. బాబుది ప్రైవేటు జపమే.. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ప్రైవేటీకరణతోనే మొదలుపెడతారని బొత్స దుయ్యబట్టారు. ఆయనకు ప్రభుత్వ సంస్థలంటే చిన్న చూపని చెప్పారు. విద్య, వైద్యం కమర్షియల్ కాదని ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవని, వాటిని ప్రైవేటుపరం చేయడం తగదని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీలోకి తీసుకెళ్తే చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని తెలిపారు. ప్రజారోగ్యంపై ఆమాత్రం ఖర్చు పెట్టలేరా? ‘‘ప్రజారోగ్యానికి రూ.10 వేల కోట్లు లేదంటే రూ.20 వేల కోట్లు అవుతాయి. ఆమాత్రం ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? విద్య, వైద్యంలో మూడో వ్యక్తి ప్రమేయం ఉంటే అనర్థం. పేదలకు నష్టం కలిగే ఈ విధానానికి మా పార్టీ పూర్తిగా వ్యతిరేకం. దీనిపై ఎంతవరకైనా పోరాడతాం. ఏ సంస్థ తీసుకున్నా.. మేం అధికారంలోకి వచ్చాక రద్దు చేసి వెనక్కి తీసుకుంటాం’’ అని బొత్స స్పష్టం చేశారు. వాకౌట్ చేసి శాసన మండలి నుంచి బయటకు వస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కమర్షియల్.. సంక్షేమం మధ్య పోలికా? ‘‘పీపీపీ మోడ్ అంటే 33 ఏళ్లకు అద్దెకిస్తున్నాం అంటున్నారు. మరో 33 ఏళ్లకు వెసులుబాటు ఇచ్చారు. అంటే, 66 ఏళ్లు ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టారు. అద్దె ఇంట్లో ఉన్నవాడు ఆ ఇంటిని ఎలా చూస్తాడు..? గంగవరం పోర్టుకు ప్రభుత్వాస్పత్రులకు పోలికా..? అవి కమర్షియల్ ప్రాపర్టీస్.. ఇవి ప్రజల ఆస్పత్రులు. భేషజాలకు పోకుండా.. ప్రజా శ్రేయస్సు, సంక్షేమం దృష్ట్యా మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆ«దీనంలోనే నడపాలి’’ అని డిమాండ్ చేశారు.సభలో గందరగోళంతొలుత ఆరోగ్య మంత్రి సత్యకుమార్ చర్చను ప్రారంభిస్తూ దేశంలో హైవేలు, విద్యా సంస్థలు పీపీపీ మోడ్లోనే చేస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ, పీపీపీకి తేడా తెలియకుండా మెడికల్ కాలేజీలపై వైఎస్సార్సీపీ వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సభ్యులకు పంచిన ప్రకటనలో లేనివారి పేర్లను ప్రస్తావించి ఆరోపణలతో సుదీర్ఘ ఉపన్యాసం చేయడంపై వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బొత్స స్పందిస్తూ... స్వల్పకాలిక చర్చలో సభ్యులు మాట్లాడాక మంత్రి ఎంతసేపు సమాధానం చెప్పినా తమకు అభ్యంతరం లేదన్నారు. దానికిముందే సుదీర్ఘ ప్రసంగంతో పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారని, సభకిచి్చన ప్రకటనలో ఆ పేర్లు పెట్టి మాట్లాడాలని సూచించారు. దీంతో టీడీపీ సభ్యులు వెనక్కితగ్గారు.కన్నబిడ్డను పెంచలేమని అమ్ముకుంటారా?‘‘కావాల్సిన అనుమతులన్నీ వచ్చి నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగించడం అంటే పుట్టిన బిడ్డను పెంచలేమని అమ్ముకోవడమే. ప్రజారోగ్యం బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడమే’’ అని ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు దుయ్యబట్టారు. ‘వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వ విధానం’పై బుధవారం శాసన మండలిలో స్వల్పకాలిక చర్చలో వారు మాట్లాడారు. ‘‘రూ.లక్షల కోట్లతో రాజధాని అమరావతి నిర్మాణానికి సిద్ధమైన ప్రభుత్వం రూ.వేల కోట్ల ప్రజా సంపద అయిన వైద్య కళాశాలలను కాపాడలేదా? ఎవరి స్వార్థం.. ఎవరి జేబులు నింపేందుకు.. ఏ పెత్తందార్లకు దోచిపెట్టేందుకు పీపీపీని తీసుకొస్తున్నారు? నాణ్యమైన విద్య, వైద్యం ప్రజల హక్కు. ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. దాన్నుంచి తప్పించుకునే ప్రభుత్వాన్ని ఏమనాలి?’’ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు దుయ్యబట్టారు. కుంభా రవిబాబు, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, సిపాయి సుబ్ర మణ్యం, కల్పలత, ఇజ్రాయిల్, సూర్యనారాయణరాజు, మాధవరావు మాట్లాడుతూ మెడి కల్ కాలేజీల ప్రైవేటీకరణ సరికాదని పేర్కొన్నారు. దీనికి డబ్బులు లేవని సాకు చెప్పడం ఏమిటని విమర్శించారు. అమరావతిలో ఒక్క రోడ్డు ఖర్చు సాటి రాదు కదా అని ప్రశ్నించారు. -
కార్యకర్తలకు అండగా నిలబడతాం: వైఎస్ జగన్
రాష్ట్రంలో ఎక్కడ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా డిజిటల్ బుక్లో నమోదు చేస్తాం. రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పని చేస్తుంది. ఒకటి డిజిటల్ బుక్ పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫొటోలు, ఆధారాలు కూడా అప్లోడ్ చేయొచ్చు. రెండోది ఐవీఆర్ఎస్ విధానం. ఫోన్ నంబర్ 040–49171718 ద్వారా కూడా కార్యకర్తలు ఫిర్యాదు చేయొచ్చు. ఇవన్నీ డిజిటల్ బుక్లో రికార్డు అవుతాయి. రేపు మనం అధికారంలోకి రాగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని చట్టం ముందు నిలబెడతాం.చంద్రబాబు తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిదీ డైవర్షన్ చేస్తున్నాడు. ఒక ఇష్యూ పెద్దది అవుతుందంటే చాలు.. దాన్ని బ్రేక్ చేయడం, డైవర్ట్ చేయడం.. ఆ టాపిక్ డైవర్ట్ చేసే క్రమంలో గుడులు, బడులు, రకరకాల ఆరోపణలు కనిపిస్తాయి. రకరకాల మనుషులపై బురద జల్లే పరిస్థితులు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో మీరంతా గట్టిగా నిలబడితే ఏ ఎన్నికలు వచ్చినా చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావు.–వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడతామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందని చెప్పారు. డిజిటల్ బుక్లో నమోదు చేసిన అంశాల మీద రేపు మనం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ‘అన్యాయం చేసిన వాళ్లు రిటైర్ అయినా.. రాష్ట్రంలో లేకపోయినా.. సప్త సముద్రాల అవతల ఉన్నా అందరినీ పిలిపిస్తాం.. చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా, ఈరోజు అన్యాయానికి గురైన వ్యక్తికి సంతోషం కలిగేలా అడుగులు వేస్తాం’ అని హామీ ఇచ్చారు. వాళ్లేదో రెడ్ బుక్ అంటున్నారని.. రేపు డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో వాళ్లందరికీ అర్థం కావాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీని స్థాపించి 14 ఏళ్లయ్యిందని.. పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం కార్యకర్తలేనని పునరుద్ఘాటించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒక్కటే ఒక వైపు.. మిగిలిన పార్టీలన్నీ మరో వైపు ఉన్నా, 40 శాతం ఓట్లతో మనం గట్టిగా నిలబడటానికి కార్యకర్తలే కారణమని స్పష్టం చేశారు. ‘ప్రతి కార్యకర్త డేటా నా దగ్గర ఉంటుంది. రేపు పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్లకు మంచి జరుగుతుంది. వారి ద్వారా ప్రజలకూ మేలు జరుగుతుంది. వారి చేతుల మీదుగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి మంచి జరుగుతుంది’ అని తేల్చి చెప్పారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రసంగిస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుబంధ విభాగాలు కీలకం ⇒ ఇప్పటికే పార్టీ ఆర్గనైజింగ్ థీమ్, స్ట్రక్చర్ను చూస్తే.. ఈ 16 నెలల్లోనే ఎంతో డెవలప్ చేశాం. రీజినల్ కో ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్లు ఉన్నారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులను నియమించాం. నియోజకవర్గ ఇన్చార్జులు ఉన్నారు. వీరంతా జిల్లా కమిటీలు, మండల కమిటీలను బలోపేతం చేస్తూ అడుగులు వేస్తున్నారు. ⇒ వీరితో పాటు అనుబంధ విభాగాలు పని చేస్తున్నాయి. ఈ అనుబంధ విభాగాలను జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గాలకు, మండల స్థాయిలో అనుబంధ విభాగాల అధ్యక్షులు, వారికి సంబంధించిన కమిటీలు, గ్రామానికి సంబంధించి విలేజ్ కమిటీలతో పాటు ఏడు అనుబంధ విభాగాలను ఎంపిక చేసి బలోపేతం చేయాలి. వీరంతా కూడా ఎక్స్ అఫిషియో కింద గ్రామ కమిటీలో ఉంటారు.⇒ అలా కమిటీలు వేసుకున్న తర్వాత వాళ్లను మనం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. వీరందరికీ ఐడీ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి. ఎప్పుడైతే ఈ ఐడీ కార్డు వాళ్ల జేబుల్లోకి వెళ్తుందో.. వాళ్లందరి డేటా నా వద్ద ఉంటుంది. వాళ్లను సాక్షాత్తు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుర్తిస్తున్నాడు. ⇒ ఈ రోజు గ్రామ స్థాయిలో పార్టీని లీడ్ చేసే వారిని.. రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుపెట్టి.. వారి ద్వారా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేస్తాను. అందరికీ ఒకటే చెబుతున్నా. ముందు మీ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి కమిటీలు వేయండి. తర్వాత మండల స్థాయిలో కమిటీలు.. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో అనుబంధ కమిటీల అధ్యక్షులను నియమించండి. తర్వాత మండల స్థాయిలో అనుబంధ కమిటీల అధ్యక్షులను నియమించండి. వాళ్లు వాళ్ల కమిటీ సభ్యులను తీసుకుంటారు. వాళ్లను మీ పర్యవేక్షణలో గ్రామాలకు పంపించండి. ప్రతి గ్రామానికీ మీరు కూడా వెళ్లండి. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ గురించి వివరించండి. వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన పార్టీ నేతలు గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటుకు టార్గెట్⇒ తుది దశలో గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలి. ఆ గ్రామంలో ఎవరు రైతు అధ్యక్షుడు.. ఎవరు మహిళా అధ్యక్షురాలు.. ఎవరు స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు.. ఎవరు సోషల్ మీడియా అధ్యక్షుడు.. ఎవరు బీసీ అధ్యక్షుడు.. ఎవరు ఎస్సీ అధ్యక్షుడు.. అనే పేర్లను ఎంపిక చేయండి. అనుబంధ సంఘాల అధ్యక్షులు వారి కమిటీ సభ్యులను ఎంపిక చేసుకోవాలి.⇒ తర్వాత పేర్లను ఎంట్రీ చేస్తే.. వారంతా మన డేటాలో రిజిస్టర్ అవుతారు. ప్రతి కార్యకర్తను ఆ రకంగా ఎంపవర్ చేయగలగాలి. ఆ స్థాయిలో మీరు బలపడ్డారంటే.. మీరు గ్రామంలోకి వెళ్లగానే యూత్ అధ్యక్షుడి పేరు చెబుతారు. స్టూడెంట్ అధ్యక్షుడి పేరు చెబుతారు.. బీసీ అధ్యక్షుడి పేరు చెబుతారు.. సోషల్ మీడియా అధ్యక్షుడి పేరు చెబుతారు.. ఎస్సీ అధ్యక్షుడి పేరు, రైతు అధ్యక్షుడి పేరు, మహిళా అధ్యక్షురాలి పేరు చెబుతారు. మొత్తంగా గ్రామ పార్టీ అధ్యక్షుడితో కలిపి ఎనిమిది మంది పేర్లు మీరు టక టకా చెప్పగలుగుతారు. ఇలా చెప్పగలిగితే మీరు ఎలక్షన్ ఇంజినీరింగ్ చేసినట్లే. ⇒ రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఈ కమిటీలన్నీ చురుగ్గా పని చేస్తాయి. ఒక్క ఫోన్ కాల్తో పార్టీ ఇచ్చే మెసేజ్తో ఏ కార్యక్రమమైనా గ్రామంలో విసృ్త్తతంగా చేపట్టగలుగుతారు. ఆర్గనైజేషన్ అంటే ఇది. ఇప్పటికైనా మీరొక టైం పెట్టుకోండి. డిసెంబర్ 15 కల్లా నాకు వారి పేర్లు ఇవ్వండి. దీనివల్ల మీరే విన్ అవుతారు. గ్రామాల్లోకి వెళ్లగలుగుతారు. ప్రతి గ్రామంలో ఆర్గనైజేషన్ మీ ఆధ్వర్యంలో నిలబడుతుంది. డిజిటల్ బుక్ నమూనా కార్యకర్తలే పార్టీకి బలం⇒ మన పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు అయ్యింది. మనది యంగ్ పార్టీ. ఈ స్థాయిలో ఉన్న పార్టీ దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీని నడిపించింది, పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం కార్యకర్తలే. ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకోబట్టే మనం బలంగా ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ ఒక్కటే ఒక వైపు, మిగిలిన అన్ని పార్టీలూ మరో వైపు ఉన్నాయి. అయినా 40 శాతం ఓట్లతో గట్టిగా నిలబడ్డామంటే కార్యకర్తలే కారణం.⇒ ఈ రోజు మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం కూడా ఇదే. నేను ఈ గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తను.. ఈ గ్రామంలో నేను మహిళా విభాగం అధ్యక్షురాలిని.. ఈ గ్రామంలో నేను రైతు విభాగం అధ్యక్షుడిని.. యువత అధ్యక్షుడిని.. సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిని.. ఈ గ్రామంలో నేను అనుబంధ విభాగం అధ్యక్షుడిని.. అంటూ గ్రామ స్థాయిలో మన పార్టీని ఓన్ చేసుకొని ఆ బాధ్యతలను భుజస్కందాలపై వేసుకొని వాళ్ల కమిటీలు వాళ్లే వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా.. వాళ్ల నాయన తలుచుకున్నా కూడా వైఎస్సార్సీపీపై పోటీకి పనికి రాకుండా పోతాడు. అలాంటి గుర్తింపు ఇవ్వాలి. ప్రతి అభ్యర్థీ గెలవాలన్నదే నా తాపత్రయం. ఈసారి కచ్చితంగా గెలవాలి.డిజిటల్ బుక్ ఆవిష్కరణ⇒ రాష్ట్రంలో అన్యాయానికి గురైన మన కార్యకర్తల కోసం మీ సమక్షంలో డిజిటల్ బుక్ను లాంచ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్లో నమోదు చేస్తాం. రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పని చేస్తుంది. ⇒ ఒకటి డిజిటల్ బుక్ పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చు. అందుకోసం వెబ్సైట్లోకి ఎంటరై మీ ఫోన్ నంబర్ టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే లొకేషన్, కెమెరా పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఇవ్వగానే, మీకు జరిగిన అన్యాయాన్ని అడుగుతుంది. ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసేందుకు సౌలభ్యం ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన డేటా.. ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అవుతుంది. ఇది ఒక పద్ధతి. ⇒ రెండోది ఐవీఆర్ఎస్ విధానం. ఫోన్ నంబర్ 040–49171718 ద్వారా కూడా అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈ నంబర్కు ఫోన్ చేసి డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. మీరు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. ఫోన్ చేసిన వారు తాము ఏ నియోజకవర్గం వారో చెప్పాలి. తర్వాత ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో.. వివరాలు చెప్పాలి. ఆ విధంగా ఆ నంబర్కు ఫోన్ చేయగానే దశల వారీగా సమాచారం తీసుకుంటారు. -
అమృత కలశంలో అభాండాల విషం
ప్రజలకు నిశ్శబ్దంగా సేవ చేసేవారు ఒకరు. సేవ చేస్తున్నాము అని పెద్దగా అరుస్తూ ప్రకటించుకునేవారు మరొకరు. కొండంత చేసినా గోరంత కూడా చెప్పుకోని సంస్కారం ఒకరిది. గోరంత కూడా చేయకుండానే కొండంత చేశామని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పత్రికా ప్రక టనలు ఇచ్చుకునే దగాకోరు సంస్కారం మరొకరిది. మొదటి వారు మాజీ ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, మరొకరు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి ప్రభుత్వం అని ప్రత్యేకంగా చెప్పకపోయినా అందరికీ తెలుసు. అయినప్పటికీ – అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల ఆరంభ సందర్భంలో పలు వాస్తవాలను మరొక్కసారి మీ ముందు ఉంచుతున్నాను.బాబుది అదే నీతి, అదే రీతి!తన అయిదు సంవత్సరాల పాలనలో హిందూ ధర్మానికి, హైందవ ధర్మ ప్రచారానికి, ధర్మ రక్షణకు జగన్మోహన్రెడ్డి చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. కాని ఆయన ప్రచారం కోరుకోలేదు. కరోనా కాలంలో ప్రపంచంలోని ప్రతి వ్యవస్థా స్తంభించి పోయింది కాని, రాష్ట్రంలో ఏ హిందూ దేవాలయంలోనూ పూజలు ఆగలేదు, జగన్ ఆగనివ్వలేదు. అధికారంలో ఉన్నపుడు వందల ఆలయాలు కూల్చిన చంద్రబాబు, దైవ పూజను కాలికి బూట్లు తీయకుండానే చేసే చంద్రబాబు; సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టి, శాలువా కప్పుకుని మైకు ముందు ఊగితే చాలు అనుకునే ‘పవన’స్వామి... జగన్ పాలనలో హైందవ ధర్మానికి ఏదో అన్యాయం జరిగిందని అరుస్తున్నారు. మల మూత్రాలు, మద్యమాంసాల మధ్య సాక్షాత్తు మహావిష్ణువు విగ్రహం పడి ఉందయ్యా అంటే, ఆ తప్పును గుర్తించి సరిచేసుకోక, చెప్పిన వాడిది తప్పు. వెంటనే జైల్లో పెట్టండి అని పోలీసులను పురమాయిస్తున్నారు. అబద్ధాలు చెప్పే వాడికి అందలాలు, నిజం చెప్పే వాడికి అరదండాలు వేయడం అన్నది ఆది నుంచీ చంద్రబాబు నీతి, రీతి!హైందవ ధర్మానికి స్వర్ణయుగంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలం వేద సంస్కృతికీ, హైందవ ధర్మానికీ స్వర్ణయుగం. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాలన, జగన్ మోహన్రెడ్డి పాలన చిరస్మరణీయం అన్నది ప్రజావాక్కు. గత అయి దేళ్లు ప్రతి పక్షంలోనూ, ఇపుడు ప్రభుత్వంలోనూ చంద్రబాబు చేస్తున్న ఒకే ఒక్క పని... జగన్ను తిట్టడం! జగన్ చేసిన మంచి పనుల మీద బకెట్లతో కాక ఓ నదీ ప్రవాహంలా విషాన్ని చల్లడం! హిందూధర్మం మరింత వెలిగింది, తిరుమల తిరుపతి దేవస్థానం దేదీప్యమానమైందీ నిస్సందేహంగా జగన్ వల్లనే, ఆయన పరిపాలనా కాలంలోనే! తిరుమలలో ‘శ్రీవాణి ట్రస్టు’ ద్వారా స్వామి వారి దర్శనానికి అంకురార్పణ చేసింది జగనే. తద్వారా శ్రీవారి శీఘ్ర దర్శనం, దేశవ్యాప్తంగా శి«థిలమై ఉన్న హైందవ దేవాలయాల పున రుద్ధరణ జరిగింది. బాబుకు అది అర్థం కాక ‘శ్రీవాణి ట్రస్టు’పై అనేక ఆరోపణలు చేశారు. చేయించారు. తాను అధికారంలోకి వస్తే శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తామని ఎన్నికల హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్టు రద్దు మాటఅటుంచి, మరిన్ని ఎక్కువ టికె ట్లను అమ్ముతున్నారు. ఆలయాలలో దీపాలు వెలిగించి ఆరాధించిన వారు జగన్. విస్తరణ పనుల పేరుతో వందల ఆలయాలను కూల్చిన మనిషి చంద్రబాబు. ఎవరు నిజమైన హైందవ ధర్మ రక్షకులు? ఇప్పుడేదీ గో సంరక్షణ?!జగన్ హయాంలో దేవస్థానం గోశాల సంరక్షణ జరిగింది. గోవులు ఆరోగ్యంగాను, ఆనందంగాను ఉన్నదీ అప్పుడే. గో సంత తిని మరింత అభివృద్ధి చేయాలని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విరాళాల కింద గిర్, కాంక్రీజ్, సాహిపాల్, పుంగనూరు,ఒంగోలు జాతులకు చెందిన గోమాతలను తిరుపతి గోశాలకు తీసుకురావడం జరిగింది. వాటి సంరక్షణకు, సంతతికి వృద్ధికి పక్కా ప్రణాళికలు తయారుచేసి అమలు చేయడం మొదటిసారి జరిగింది. తెలుగు రాష్ట్రాలలోని వివిధ గోశాలలను గుర్తించి అనేక గోశాలలకు మేత, నిర్వహణ వ్యయం అందించింది జగనే. ఈ కూటమి ప్రభు త్వంలో, ఈ ధార్మిక మండలి పాలనలో దేవస్థానం గోశాలలో ఎన్ని గోవులు ఆకలితో, అనారోగ్యంతో మరణించాయో అందరికీ తెలుసు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారు నవనీత ప్రియుడు. అందుకే నిత్యం ఆయనకు నవనీత సేవ జరుగుతుంది. జగన్ ముఖ్యమంత్రి కావటానికి ముందు ఆ సేవ అత్యంత యాంత్రికంగా జరిపేవారు. దాన్ని పూర్తిగా మార్చివేశారు జగన్. ప్రతినిత్యం శ్రీవారి సేవకుల సహాయంతో మజ్జిగ చిలికించి, వెన్న తీసి అప్పుడే తీసిన నవనీతాన్ని ఆ నవనీత చోరుడికి ఆరగింపుగా అందించడం ఎంత ధార్మిక కార్యం!వేదంలా ఘోషించిన అలిపిరితిరుమల ఆస్థాన మండపంలో జాతీయ వేదసభ నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులను ఆహ్వానించాం. వేద వ్యాప్తికి, రక్షణకు, హైందవ ధర్మ పరిరక్షణకు అవసరమైన కార్యక్రమాలను, సలహాలను వారి నుంచి స్వీకరించాం. అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం చేయదగ్గ కార్యక్రమాలు ఎన్నో వారు వివరించారు. ఈ ఘనత జగన్ది కాదా? వేదమూర్తి, వేద స్వరూపుడు అయిన శ్రీవారికి నిత్యం వేదఘోష వినిపించాలని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద శ్రీవేంకటేశ్వర దివ్యానుగ్రహ హెూమం ప్రారంభించాం. యువత వక్రమార్గం పట్టకుండా సక్రమ మార్గంలో సరైన హిందువుగా జీవించాలని శ్రీవారి గోవింద కోటి రాసినవారికి శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించాం. గోవిందనామ కోటి రాసి ఆలయ సంబంధిత అధికారికి అందజేస్తే వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా శ్రీవారి బ్రేక్ దర్శనం లభించేలా చేశాం. వంద కీర్తనలకు బాణీలువేదాలు, పురాణాలు అందరికీ అర్థం అయ్యే భాషలో ముద్రించ డానికి ప్రత్యేక ప్రాజెక్టులు ఏర్పాటు చేశాం. గతంలో నేను దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే వ్యాఖ్యానంతో, ప్రతి పదార్థంతో కూడిన భారతాన్ని, భాగవతాన్ని ముద్రించాం. దేవ స్థానం గ్రంథాలలో అత్యంత అధికంగా అమ్ముడు పోతున్నవి అవే. సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమయ్య శ్రీవారిపై 32 వేల సంకీర్తనలు రచించారు. అందులో కేవలం పదివేల కీర్తనలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఎస్.వి. భక్తి ఛానల్, ఇతర పండి తులు, సంగీతకారుల సహాయంతో నూతనంగా దాదాపు 100 కీర్తన లకు బాణీలు కట్టించి వెలుగులోనికి తెచ్చాం. ఆంజనేయస్వామి జన్మస్థలం మీద ప్రజలలో అనేక వాదాలు, అపోహలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని పండిత పరిషతు ఏర్పాటు చేశాం. వారు వేలాది గ్రంథాలు, శాస్త్రాలు, వేదాలు, భౌగోళిక అంశాలు పరిశీలించారు. ఆంజనేయుని జన్మ స్థలం తిరుమలలోని అంజనాద్రి అని నిర్ధారించారు. ఆ ప్రాంతంలో బాల ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశాం. జీవన భృతికి పారాయణంరాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, గిరిజన తండాలకు చెందిన వారికి శ్రీవారి బ్రహ్మోత్సవాలలోను, వైకుంఠ ఏకాదశి సందర్భంగాను ఉచిత దర్శనం కల్పించాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ వేదం వినిపించాలనే, బ్రాహ్మణ కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే మహత్తర సంకల్పంతో 700 మందికి పైగా వేద పారాయణ దారులను నియమించాలని సంకల్పించాం. దాని ద్వారా 700 పేద బ్రాహ్మణ కుటుంబాలకు జీవన భృతి ఏర్పడుతుంది. గ్రామ గ్రామాన వేదం వర్ధిల్లి, ధర్మరక్షణ జరుగుతుంది. కాని ఈ కూటమి ప్రభుత్వం, ఈ ధర్మకర్తల మండలి ఈ నియామకాలకు అడ్డుపుల్ల వేసింది. సనాతన ధర్మరక్షణ కంకణాబద్ధుడైన ‘పవనానందుడు’ దీనిపై మాట్లాడకపోవడం, 700 మంది పేద బ్రాహ్మణ కుటుంబాల నోరు కొట్టడం ఏ ధర్మరక్షణో ఆయనే చెప్పాలి.కూటమి వచ్చాక నత్తనడకతిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగులకు సైతం ఇంటిస్థలాలు ఇచ్చి తీరాలన్నది జగన్ సంకల్పం. నేను రెండవసారి అధ్యక్షుడిగా ఉండగా ప్రభుత్వం నుంచి దాదాపు 1200 ఎకరాల స్థలం తీసుకొని తి.తి.దే విశ్రాంత ఉద్యో గులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాం. తి.తి.దే.లోని కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగుల జీతం 5 వేల నుంచి 20 వేల వరకు పెంచి వారి కుటుంబాలకు ఆనందం పంచాం. 2021లో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల నిమిత్తం రూ. 320 కోట్లతో పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తలపెట్టాం. అత్యవసరంగా పూర్తి చేయవలసిన ఆ పను లను ఈ కూటమి ప్రభుత్వం నత్తనడక నడిపిస్తోంది. రాయలసీమ ప్రజలందరికి అందుబాటులో ఉన్న అత్యా ధునిక వైద్యశాల ‘స్విమ్స్’ ఆధునికీకరణకు గాను రూ. 200 కోట్లు మంజూరు చేశాము. న్యూరాలజీ, కార్డియాలజీ విభా గాలకు ప్రత్యేక భవనాల నిర్మాణం ప్రారంభించాం. మాట తప్పని మనిషి జగన్జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమలలోని స్థానికులు గుండె మీద చేయి వేసు కుని హాయిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వారికి ప్రతీది సమస్యే. వారిపై ప్రతి ఒక్కరూ ఆధిపత్యం చలాయించేవారే. మొదటిసారి కరోనా వచ్చినపుడు తిరుపతి వీధుల్లో వేలమంది కూలీలు, అనాధలు, చిరు వ్యాపారులు, వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారు ఆకలికి అల్లాడుతూ రోడ్డుమీద మిగిలి పోయారు. జగన్ ఆదేశాల మేరకు దాతల సహాయంతో నిత్యం రెండు పూటలా దాదాపు 50 వేల ఆహార పొట్లాలు అందించి వారిని ఆదుకున్నాం. ఆకలి విలువ తెలిసిన, మాట తప్పని మనీషి జగన్. వాలంటీర్లకు జీతం రెట్టింపు చేస్తా అని వాగ్దానం చేసి, గెలిచాక మొండిచేయి చూపిన మోసపూరిత స్వభావి చంద్రబాబు. మనసున్న మనిషిగా, హైందవ ధర్మరక్షణ కార్యకర్తగా జగన్ చేసిన వేలాది కార్యక్రమాలు ఆయన చెప్పుకోలేదు. కానీ జనం మరచి పోలేదు. ఏమి చేయకుండానే ఎగిరెగిరి పడడం, అవతలి వారు చేసిన మంచికి మసి పూయడం చంద్రబాబు లక్షణం. అసత్య ప్రచారాలకు మీడియాను వాడుకోవడానికి హైందవ ధర్మక్షేత్రానికి ‘అసభ్యభాషా పద పండిత పంచ శస్త్రుడిని‘ అధిపతిని చేశారు. చివరికి దేవుడినీ, దేవుడి ప్రసాదాన్నీ తన అసత్యాలకు బాసట చేయాలనుకున్నారు. న్యాయస్థానం అక్షింతలు వేసినా దులుపుకుపోతున్నారు.గారడీని నిజమనుకుని, మాటల వలకు చిక్కి, సనాతన ధర్మరక్ష కుడి ఊపుల నటనకు ఊతం ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కాదనుకు న్నామని ఈ రోజు రాష్ట్ర ప్రజలు రోదిస్తున్న మాట సత్యం. ఈ సంద ర్భంగా మహాకవి దాశరథి వాక్యాలు మరోసారి స్మరించుకుందాం.‘‘మంచితనము కలకాలం నిలచి యుండును వంచన ఏనాటికి నశించి తీరును’’భూమన కరుణాకరరెడ్డివ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
దీన్ని చూస్తే కొంచమైనా సిగ్గుగా లేదా చంద్రబాబు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబుకు అన్నా రాంబాబు సవాల్
-
YS Jagan: డిజిటల్ బుక్ ఏంటో చూపిస్తాం Get Ready..
-
Botsa: చరిత్ర హీనుడుగా మిగిలిపోతావ్.!
-
YSRCP పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవు: వైఎస్ జగన్
-
ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్ PRC లేనట్లే!
-
జగన్ వస్తే భయం.. అసెంబ్లీలో చంద్రబాబు స్కెచ్
-
చిరు వ్యాపారులపై కూటమి జులుం.. GVMC కార్యాలయం వద్ద YSRCP భారీ నిరసన
-
ఏపీలో మెడికల్ కాలేజీలు, సర్కారీ వైద్యానికి చంద్రగ్రహణం
-
చిరు వ్యాపారుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: YSRCP
-
ప్రతిపక్ష నేత తన సొంత ఖర్చులతో ఎక్కడికెళ్తే మీడియాకేంటని ప్రశ్నలు
-
వ్యాపారుల జీవితాలను చీకటిమయం చేస్తున్న కూటమి ప్రభుత్వం
-
OG సినిమా కోసం మరో జీవో ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
-
108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందటంపై జగన్ ఆందోళన
-
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు రూ.3,70,897 కోట్లే
ఆర్థిక మంత్రి.. అసెంబ్లీ సాక్షిగా..అప్పులపై చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా అసెంబ్లీ సాక్షిగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ నిజాలను చెప్పాల్సి వచ్చింది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి బడ్జెట్తోపాటు గ్యారెంటీ కలిపి మొత్తం అప్పు రూ.3,06,952.26 కోట్లుగా ఉందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3,70,897 కోట్లేనని అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై చట్టసభ సాక్షిగా చంద్రబాబు సర్కారు అబద్ధాలు మరోసారి బట్టబయలయ్యాయి! వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులు రూ.14 లక్షల కోట్లు... రూ.10 లక్షల కోట్లు... అంటూ నోటికొచ్చినట్లు పదేపదే నిస్సిగ్గుగా చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని శాసనసభ సాక్షిగా స్వయంగా ఒప్పుకుంది! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన మొత్తం అప్పులు రూ.3,70,897 కోట్లు మాత్రమేనని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ వేదికగా సోమవారం లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాక ముందు.. నాడు టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు రూ.3,06,952.26 కోట్లు అని కూటమి ప్రభుత్వం సభ సాక్షిగా ప్రకటించడం గమనార్హం. ఆగస్టు నాటికే రూ.44,364.06 కోట్లు అప్పు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో రూ.1,03,656.50 కోట్లు బడ్జెట్ అప్పులు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందులో ఆగస్టు నెలాఖరు నాటికి రూ.44,364.06 కోట్లు అప్పు చేసినట్లు వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు మంత్రి కేశవ్ సోమవారం అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. వైఎస్సార్సీపీ దిగిపోయే నాటికి మొత్తం అప్పులు రూ.6,77,849.80 కోట్లు.. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2024 జూన్ 12 నాటికి బడ్జెట్ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కలిపి మొత్తం రూ.6,77,849.80 కోట్లు మాత్రమే అప్పులు ఉన్నట్లు మంత్రి కేశవ్ తన సమాధానంలో వెల్లడించారు. ఇందులో 2014–15 నుంచి 2018–19 వరకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న బడ్జెట్ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీతో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కలిపి రూ.3,06,952.26 కోట్లు ఉన్నాయన్నారు. ఆ తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడ్జెట్తో పాటు గ్యారెంటీతో కలిపి రూ.3,70,897.54 కోట్లు మాత్రమే అప్పులు చేసిందని ఆర్థిక మంత్రి కేశవ్ లిఖిత పూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. ఈ గణాంకాలన్నీ అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఫైనాన్స్ ఖాతాల నుంచి చెప్పినట్లు మంత్రి కేశవ్ పేర్కొన్నారు. 2024లో ఆర్థిక శాఖపై సమీక్ష సందర్భంగా రాష్ట్ర అప్పులు రూ.14లక్షల కోట్లు అని ప్రకటించిన సీఎం చంద్రబాబు సీఎంగా ఉంటూ అబద్ధాలా బాబూ..? బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ పదే పదే సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని శాసనసభ సాక్షిగా ఆర్థిక మంత్రి లిఖిత పూర్వక సమాధానంతో మరోసారి తేటతెల్లమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2024 జూన్ 12 నాటికి ఐదేళ్లలో బడ్జెట్లోనూ, బడ్జెట్ బయట గ్యారెంటీలతో చేసిన మొత్తం అప్పు కేవలం రూ.3,70897.54 కోట్లేనని ఆర్థిక మంత్రి కేశవ్ సమాధానంతో వెల్లడైంది. 2024లో తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు అని పేర్కొన్న భాగం వాస్తవాలు ఇలా ఉంటే ఇప్పటికీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలోనూ, బయట పదేపదే గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిదంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతుండటం, సాక్షాత్తూ గవర్నర్తోనూ ఆయన ప్రసంగంలో అబద్ధాలు పలికిస్తుండటం విస్తుగొలుపుతోంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ అవాస్తవాలు చెప్పడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్సీపీ చేయని అప్పులు చేసినట్లు బుకాయించడం ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కా? 'సిగ్గు సిగ్గు'
చేతుల్లో ప్లకార్డులు... మెడలో నల్ల కండువాలు...! ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దంటూ ముక్తకంఠంతో నినాదాలు...!పేదలు, మధ్య తరగతికి ఉచిత వైద్యం దూరం చేస్తారా? అంటూ ప్రశ్నిస్తూ...! చంద్రబాబు సర్కారు నిర్వాకాన్ని నిలదీస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు కదంతొక్కారు...! ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కు కట్టబెడతారా? సిగ్గుసిగ్గు అంటూ నిప్పులు చెరిగారు..!చంద్రబాబు సంపద సృష్టికర్త కాదు దోపిడీకర్త... సీఎంవా? దళారీవా? అంటూ ధ్వజమెత్తారు...! ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు సోమవారం తొలుత నిరసన తెలిపిన ఆ పార్టీ ఎమ్మెల్సీలు తర్వాత శాసనమండలిలో గట్టిగా గళమెత్తారు.! ప్రజారోగ్యం ప్రైవేట్ పరమా? ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ మండలిని హోరెత్తించారు...! సాక్షి, అమరావతి: సిగ్గు సిగ్గు... ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రయివేట్పరమా? ప్రజారోగ్యం ప్రైవేట్కా..? ఇదేమి రాజ్యం... ఇదేమి రాజ్యం... దొంగల రాజ్యం... దోపిడి రాజ్యం అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిని హోరెత్తించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తక్షణం రద్దు చేయాలంటూ సోమవారం కూడా శాసనమండలిలో ఆందోళన కొనసాగించారు. నల్ల కండువాలు ధరించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనగా వచ్చిన వారు నిరసనకు దిగారు. ఈ అంశంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు మొండితోక అరుణ్కుమార్, సిపాయి సుబ్రహ్మణ్యం, కుంభా రవిబాబు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభ ప్రారంభం కాగానే చైర్మన్ కొయ్యే మోషేన్రాజు తిరస్కరించారు. దీంతో చర్చకు పట్టుబడుతూ తొలుత పోడియం ముందు, తర్వాత పోడియం ఎక్కి నినాదాలు చేశారు. పదేపదే ఒకే అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడం సరికాదని, చర్చకు తాము సిద్ధమని, సంబంధిత మంత్రులు అందుబాటులో లేనందున, మరోసారి చర్చిద్దామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్, చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ అన్నారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై లఘు చర్చకు బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకపోవడం సరికాదన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయం రద్దు కావాల్సిందేనని తేల్చిచెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని బీఏసీలో నిర్ణయం తీసుకున్నాక.. అది ఎప్పుడు చర్చకు పెట్టాలనేది ప్రభుత్వ ఇష్టమని అన్నారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన నడుమ చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ప్రైవేటీకరణ రద్దుకు వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనలు, టీడీపీ సభ్యుల వాగ్వాదంతో రెండు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చాక సభను వాయిదా వేశారు. కొద్దిసేపు విరామం ప్రకటించిన చైర్మన్ మోషేన్రాజు తన చాంబర్లో వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యులతో చర్చించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సోమవారం చర్చించేలా బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. సభ ముగిసేలోపు చర్చిస్తామని మంత్రులు బదులిచ్చారు. దీంతో చైర్మన్ మోషేన్రాజు బీఏసీ సమావేశాన్ని నిర్వహించారు. ఆ అంశంపై బుధవారం చర్చించేలా వైఎస్సార్సీపీ, టీడీపీతో చర్చించి బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.ప్రైవేటీకరణను వెంటనే విరమించండిప్లకార్డులతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసన ర్యాలీప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే విరమించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు... సోమవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమీపంలోని పూర్వపు కియా షోరూం సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ‘‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. మండలిలో చర్చ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని బొత్స విమర్శించారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ది అని ప్రశంసించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ముద్దు, ప్రైవేటీకరణ వద్దు... అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్సీలంతా ప్లకార్డులతో అసెంబ్లీ ప్రధాన గేట్ వరకు ర్యాలీగా వచ్చారు. ‘‘జీవో 590ను వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం. సామాన్యుడుకి ఉన్నత చదువు దూరం.. చంద్రబాబూ నువ్వు ముఖ్యమంత్రివా? దళారీవా? ముడుపుల కోసం ప్రజల ఆస్తులు అమ్మేస్తారా? సిగ్గు సిగ్గు.. సంపద సృష్టికర్త కాదు దోపిడీకర్త’’ అంటూ మండిపడ్డారు. -
ఏపీ అప్పులపై అసెంబ్లీలో కూటమి బండారం బట్టబయలు
-
యూరియా.. యాతన
కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన నువ్వుల శ్రీనివాసరావు పదెకరాలు కౌలుకు చేస్తున్నారు. ఈ సీజన్లో ఎంటీయూ 1318 రకం వరి పంట సాగు చేశారు. తొలి విడతలో అతికష్టమ్మీద మూడు కట్టల యూరియా మాత్రమే దొరికింది. రోజుల తరబడి పడిగాపులు కాసినా రెండో విడతలో నిరాశే మిగిలంది. దీంతో చేసేది లేక అధిక ఖర్చు అయినా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. అదే యూరియా దొరికితే ఎకరాకు రెండు కట్టల చొప్పున రూ.533తో సరిపోయేది. కాంప్లెక్స్ ఎరువులు వాడుతుండటంతో రూ.3 వేల దాకా ఖర్చు అవుతోంది. అంటే దాదాపు ఆరు రెట్లు అదనపు భారం పడింది. పైగా ఒక్కో సొసైటీలో ఒక్కో ధర. లోడింగ్, రవాణా ఖర్చులు దీనికి అదనం. గతంలో ఎరువులకు ఎకరాకు రూ.3 వేలు ఖర్చయితే ప్రస్తుతం రూ.8 వేలకు పైగా ధారపోయాల్సి వస్తోందని ‘సాక్షి’ ఎదుట రైతు వాపోయాడు.ఎన్టీఆర్ జిల్లా పురుషోత్తపట్నానికి చెందిన రైతు మైనేని దుర్గాప్రసాద్ 17 ఎకరాలు కౌలుకు తీసుకొని 1318 వరి వేశారు. రెండో విడతగా కట్ట యూరియా కోసం నాలుగుసార్లు పనులు మానుకుని వచ్చినా మీ టోకెన్ నెంబర్ రాలేదంటూ తిప్పి పంపిస్తున్నారు. బయట మార్కెట్లో బస్తా రూ.300 నుంచి రూ.500 దాకా అడుగుతున్నారు. పైగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు పురుగుల మందులు అంటగడుతున్నారు. యూరియా దొరక్కపోవడంతో చేసేది లేక 20ః20 వేశాడు. ఈ ప్రభుత్వం అదునుకు యూరియా కూడా అందించలేకపోతోందని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆక్రోశిస్తున్నాడు. ఈ ప్రభావంతో ఈసారి దిగుబడులు తగ్గిపోతాయని తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.సాక్షి, అమరావతి: ఒకపక్క యూరియా కరువు.. మరోవైపు ఏ పంటకూ మద్దతు ధరలు లేక అన్నదాతలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని దయనీయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యూరియా కోసం క్యూలైన్లు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఆత్మగౌరవాన్ని దిగమింగుకుని రోజుల తరబడి పడిగాపులు కాసినా అరకట్ట దొరకడం గగనంగా మారింది. ఎంత తిరిగినా యూరియా దొరక్క ఖరీదైన కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుతో పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు.. దిక్కులు చూస్తోంది. అటు పెట్టుబడి సాయం అందక.. ఇటు ఉచిత పంటల బీమాకు దూరమై రైతన్నలు అల్లాడుతున్నారు. పంట నష్టపోతే కనీసం కరువు సాయం కూడా అందని దుస్థితి నెలకొంది. వరి ప్రస్తుతం పొట్ట దశకు చేరుకున్న తరుణంలో రెండో విడతగా ఇవ్వాల్సిన యూరియా కోసం కటకటలాడుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో యూరియా కోసం తమ అగచాట్లను అన్నదాతలు మొర పెట్టుకున్నారు. కూటమి సర్కారు నిర్లక్ష్యం, అసమర్థతపై మండిపడుతూ గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇంతటి దయనీయ పరిస్థితులు లేవని చెబుతున్నారు.పనులు వదిలేసి సొసైటీల వద్ద పడిగాపులు..గత ప్రభుత్వ హయాంలో గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా కావాల్సినంత యూరియా అందుబాటులో ఉండేది. కియోస్క్లో బుక్ చేసుకున్న 24 గంటల్లోనే తమ కళ్లాలకు సరఫరా చేసేవారు. ఫలితంగా లోడింగ్, అన్లోడింగ్తో పాటు రవాణా ఖర్చుల రూపంలో బస్తాకు రూ.20–50 వరకు ఆదా అయ్యేది. ఆ ఐదేళ్లలో ఏ ఒక్క రోజూ విత్తనాలు, యూరియా కోసం ఎక్కడా క్యూలైన్లు కనిపించిన దాఖలాలు లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎంత కావాలంటే అంత యూరియా దొరికేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాదిగా పరిస్థితి మారిపోయింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాకు మంగళం పాడారు. సబ్సిడీ విత్తనాలకూ కోత పెట్టారు. మరోవైపు ఎరువుల సరఫరాను సొసైటీలకు పరిమితం చేశారు. దీంతో ఎరువుల కోసం సీజన్లో పొలం పనులు మానుకుని మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి దాపురించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దాదాపు 10 రోజుల పాటు పొలం పనులు వదిలేసి సొసైటీల వద్ద పడిగాపులు కాస్తేగానీ అరకట్ట దొరకడం గగనమైపోయింది. టీడీపీ కూటమి నేతల సిఫార్సు మేరకు సరఫరా జరుగుతుండటంతో సన్న, చిన్న కారు రైతులు అల్లాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సీసీ ఆర్సీ కార్డులున్న వారు సైతం యూరియా దొరక్క ప్రైవేటు వ్యాపారుల వద్ద నిలువు దోపిడికి గురవుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో నూటికి 70–80 శాతం మంది కౌలు రైతులే. వీరంతా రెండో విడతలో కూడా యూరియా దొరక్క యాతన అనుభవిస్తున్నారు. బాపట్ల జిల్లా ఆవులవారిపాలెంలో యూరియా కోసం రైతుల పడిగాపులు (ఫైల్) పక్కదారి పట్టిన యూరియా..వ్యవసాయ సీజన్లో 10 శాతానికి మించి పనులు సాగని జూన్, జూలైలోనే దాదాపు 35 శాతం యూరియా అమ్మకాలు జరగడం చూస్తే అదంతా నల్ల బజారుకు చేరిపోయిందని అర్ధమౌతుంది. డిమాండ్ సాకుగా చేసుకుని టీడీపీనేతలు యూరియాను అధికధరలకు అమ్ముకున్నారు. వరి పొలాలకు యూరియా ఇవ్వాల్సిన తరుణంలో సర్కారు చేతులెత్తేసింది. పెద్ద ఎత్తున నిల్వలు పక్కదారి పట్టినా కళ్లప్పగించి చూసింది. దీంతో కట్ట యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా సరఫరాలో అలసత్వాన్ని ఎండగడుతూ రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టే వరకు చంద్రబాబు సర్కారు మేలుకోలేదు. పరిస్థితి చేయి దాటిపోవడంతో అదునుకు యూరియా దొరక్క రైతులు ఖరీదైన కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. యూరియా కట్ట రూ.266.50 కాగా సొసైటీల్లోనే రూ. 25 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.500 వరకు గుంజుతున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో బస్తా రూ.600–700 వరకు పిండుతున్నట్లు రైతులు చెబుతున్నారు. బలవంతంగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు అవసరం లేని పురుగు మందులను అంటగడుతుండడంతో ఎకరాకు రూ.5 వేలకు పైగా అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో సొసైటీలను పరిశీలించగా చాలా చోట్ల యూరియా నిల్వలే లేవు. డిమాండ్కు సరిపడా లేక రైతులు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్న పరిస్థితులు కనిపించాయి.అదునుకు అందకపోతే..శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాతో పాటు ఉత్తర కోస్తాలో ఎకరాకు 75–80 కేజీలు యూరియా అవసరం. గిరిజన ప్రాంతాల్లో 55–69 కిలోలు వినియోగించాలి. వర్షాధార ప్రాంతాల్లో మూడు విడతల్లో 100–125 కేజీలు, నీటిపారుదల ప్రాంతాల్లో నాలుగు విడతల్లో 80–90 కిలోల చొప్పున పంటలకు యూరియా వేస్తారు. వర్షాధార ప్రాంతాల్లో విత్తే సమయంలో తొలి విడతగా, 30–35 రోజుల మధ్య రెండో విడత, మిగిలింది 50–55 రోజుల మధ్య వేస్తారు. నీటిపారుదల ప్రాంతాల్లో నాట్లు వేసిన 7–10 రోజుల్లో తొలి విడత, 25–30 రోజుల్లో 2వ విడత, 45–50 రోజుల మధ్య మూడో విడత, చివరగా 60–65 రోజుల మధ్య నాలుగో విడత యూరియా అవసరం ఉంటుంది. తొలిదశలో యూరియాతో పాటు డీఏపీ లేదంటే కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. రెండో విడతలో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువు 20–25 కేజీలు వేస్తారు. చివరి రెండు దశల్లో యూరియా ఎక్కువగా అవసరం ఉంటుంది. మూడో దశకు యూరియా అందకపోతే పంట ఏపుగా ఎదగదు. దుబ్బులో పిలకలు తగ్గిపోతాయి. చివరి దశలో యూరియా అదునుకు ఇవ్వకుంటే కంకి సైజు తగ్గిపోవడం, గింజ బరువు తగ్గిపోవడం జరుగుతుంది. 3, 4వ దశల్లో నత్రజని అందకపోతే దిగుబడి గణనీయంగా 5–10 బస్తాల వరకు తగ్గిపోతుంది.రెండో దశలోనూ కటకట..ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకుంది. కృష్ణా డెల్టా పరిధిలో ఎకరాకు దాదాపు రెండు బస్తాల యూరియా వాడతారు. రెండో విడతలోనూ మెజార్టీ రైతులకు యూరియా అందకపోవడంతో చేసేది లేక కాంప్లెక్స్ ఎరువులను వినియోగించారు. యూరియాలో 46 శాతం నత్రజని ఉంటుంది. అదే కాంప్లెక్స్ ఎరువు (20ః20)లో 20 శాతం మాత్రమే నత్రజని, 20 శాతం ఫాస్పేట్ ఉంటాయి. తీవ్ర కొరత కారణంగా రెండు మూడు విడతల్లో 20 కేజీల చొప్పున వేయాల్సిన యూరియాకు బదులుగా 20ః20 కాంప్లెక్స్ ఎరువులను వినియోగించారు. యూరియాలో ఉండే నత్రజని కోసం దాదాపు 60 కేజీల కాంప్లెక్స్ ఎరువులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 20 కేజీల యూరియాకు రూ.135 ఖర్చవుతుండగా, 60 కేజీల కాంప్లెక్స్ కోసం దాదాపు రూ.1,600 వరకు వెచ్చించాల్సిన అగత్యం తలెత్తింది. ఈ లెక్కన 2–3 విడతల్లో 45 కేజీల యూరియా బస్తాకు కేవలం రూ.266.50 ఖర్చు చేస్తే సరిపోయేది. కానీ కాంప్లెక్స్ ఎరువుల వినియోగం వల్ల దాదాపు రూ.3,200 వ్యయం అయింది. అంటే ఐదారు రెట్లు అదనంగా రైతుల నెత్తిన భారం పడింది. అయినప్పటికీ పంట ఎదుగుదల కానరాక ఈసారి దిగుబడులు తగ్గిపోతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. కనీసం ఎకరాకు 5 బస్తాలకు పైగా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరియా కోసం తోపులాట..తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి పీఏసీఎస్ పరిధిలో యూరియా పంపిణీ గందరగోళంగా మారింది. యూరియా వచ్చినట్లు తెలియడంతో చౌటపల్లి, గానుగపాడు, జీకొత్తూరు, తదితర గ్రామాల రైతులు ఆదివారం ఉదయం ఆరు గంటలకే సొసైటీ వద్దకు పోటెత్తారు. పోలీసులు తొమ్మిది గంటల సమయంలో అక్కడికి చేరుకోగా మూడు గంటల పాటు రైతులు పడిగాపులు కాశారు. క్యూలైన్లు ఏర్పాటు చేసేలోపే పీఏసీఎస్ సిబ్బంది టోకెన్ల పంపిణీ ప్రారంభించడంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. పోలీసులు, సహకార సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంపై తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార అధికారికి సిఫారసు చేశారు.శ్రీకాకుళం జిల్లా మజ్జిలిపేటలో యూరియా కోసం బారులు తీరిన రైతులు (ఫైల్) పలుకుబడి ఉన్న వాళ్లకే ఇస్తున్నారునాకు సొంతంగా అరకెరం భూమి ఉంది. కౌలుకు ఏడెకరాలు తీసుకొని ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసా. యూరియా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందిపడ్డాను. యూరియా దొరక్క కాంప్లెక్స్ వాడుతున్నాం. సొసైటీలో ఎకరాకు అరకట్టకు మించి ఇవ్వడం లేదు. ఇది ఏ మూలకు సరిపోతుంది. ఊర్లో పలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తున్నారు. మాలాంటి బక్క రైతులను పట్టించుకునేవారు కరువయ్యారు..బహిరంగ మార్కెట్లో యూరియా దొరకడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అదును యూరియా కూడా అందించడం ఈ ప్రభుత్వం చేతకావడం లేదు. – తెన్నేటి శ్రీనివాసనాయక్, తెన్నేరు, కృష్ణా జిల్లాఅరకట్ట ఏ మూలకు సరిపోతుందిఆరుకట్టలు. పురుషోత్తపట్నం నుంచి మంతెన తీసుకెళ్తున్నారు.ఎకరాకు అరకట్ట ఇచ్చారు. చాలడం లేదు. 33 ఎకరాల సొంత భూమి భూమి ఉంది. ఉదయం నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తే..ఆరు కట్టలు ఇచ్చారు. మూడు విడతల్లో కట్ట వెయ్యాలి. కానీ అరకట్టే ఇస్తున్నారు. అమ్మోనియా వేస్తునాం.– కిరణ్..పురుషోత్తçపట్నం, కృష్ణా జిల్లాఅందరికీ సరిపెట్టాలంటున్నారు20 ఎకరాలు..10 కట్టలు ఇచ్చారు. ఒక కోటా వేసాం. అధిక వర్షాలకు పంట మునిగిపోయింది. పంట పోయింది. మళ్లీ నాట్లు వేసాం. రెండో విడతలో యూరియా దొరక్క అగచాట్లు పడుతున్నాం. ఎకరాకు అరకట్ట ఇస్తున్నారు,. చాలా ఇబ్బంది ఉంది. అడిగితే అందరికి సరిపెట్టాలి కదా అంటున్నారు.2వేలకు పైగా అదనంగా ఖర్చు 15 ఎకరాల్లో వరి వేశా. 11 కట్టలిచ్చారు. పైగా సొసైటీలోనే కట్ట రూ.270 తీసుకుంటున్నారు. రెండో విడత యూరియా దొరక్క 20ః20 వేసాం. బస్తాకు రూ.1350 చొప్పున రెండు బస్తాలు వేయాల్సి వచ్చింది. దాదాపు 2వేలకుపైగా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.– పిన్నబోయిన కొండలరావు, కృష్ణా జిల్లారైతులకు బాబు ఎగ్గొట్టిన బకాయిలిలా..⇒ కేంద్రంతో నిమిత్తం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్లో హామీ ఇచ్చారు. దీన్ని తుంగలో తొక్కి 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున రూ.10,716 కోట్లు తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.5 వేల చొప్పున రూ.2342.92 కోట్లతో సరిపెట్టారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే దాదాపు 7 లక్షల మందికి కోతపెట్టారు.⇒ ఎన్నడూ లేని విధంగా గడిచిన 15 నెలల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయి 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఏ ఒక్కరికీ పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు.⇒ ఎన్నికల కోడ్ కారణంగా ఉచిత పంటల బీమా పథకం కింద 2023–24 సీజన్కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం సొమ్ములు కంపెనీలకు చెల్లించలేదు. ఫలితంగా ఆ సీజన్లో కరువు, వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు.⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్–2024–25 ఉచిత పంటల బీమా పథకం కింద రైతుల తరపున చెల్లించాల్సిన రూ.833.92 కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదు.⇒ రబీ–2024–25 సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిన అమలు చేసిన ఫసల్ బీమా కోసం ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన రూ.88.09 కోట్లు ఇప్పటి వరకు కంపెనీలకు జమ చేయలేదు. ఈ కారణంగా దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా బీమా పరిహారం నేటికీ రైతులకు అందని పరిస్థితి నెలకొంది.⇒ 2023–24 సీజన్కు సంబంధించి ఎన్నికల కోడ్తో పాటు వివిధ సాంకేతిక కారణాలతో 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు.⇒ సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి 2024 సీజన్లో 6.31లక్షల మందికి జమ చేయాల్సిన రూ.132 కోట్లు నేటికీ జమ చేయలేదు.⇒ 2024–25 సీజన్లో వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి 4.50 లక్షల మందికి చెల్లించాల్సిన మరో రూ.650 కోట్లు ఇప్పటికీ జమ చేయలేదు. ఈ విధంగా దాదాపు రూ.23,584 కోట్లు కూటమి సర్కారు రైతులకు ఎగ్గొట్టింది.మద్దతు ధర కరువు..సీజన్ ఆరంభంలోనే ధరల పతనం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నెల్లూరులో మాసూళ్లకు వచ్చిన సన్నరకాలకే మద్దతు ధర కరువైంది. మద్దతు ధర ప్రకారం పుట్టికి (850 కేజీలు) రూ.19,720 దక్కాల్సి ఉండగా రూ.14వేల నుంచి రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. అదీ కూడా కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏ పంటకూ కనీస మద్దతు ధరలు దక్కడం లేదు. మార్కెట్లో జోక్యం చేసుకొని ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. ఉల్లి కిలో 50 పైసలకు పడిపోయింది. జీ–9 రకం అరటి టన్ను రూ.4–6 వేలకు పడిపోగా చీని (బత్తాయి) ధర టన్ను రూ.6–12వేలకు పతనమైంది. ఉల్లి రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా క్వింటా రూ.1,200 చొప్పున తమ వద్ద ఉల్లిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే వారిని మభ్యపుచ్చేందుకు హెక్టార్కు రూ.50 వేల సాయం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి రెండో విడతలో 7 లక్షల మందికి కోతపెట్టింది. ఉచిత పంటల బీమాను అటకెక్కించి బీమా ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపింది. ఏడాదిగా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం ఎగ్గొట్టడంతో రైతులకు దక్కాల్సిన రూ.2 వేల కోట్లకుపైగా పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. కరువు బారిన పడి నష్టపోయిన రైతులకు పైసా పరిహారం ఇవ్వలేదు. కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. సున్నా వడ్డీ రాయితీకి చాప చుట్టేసింది.గత ప్రభుత్వం ఆదుకుంది ఇలా..వైఎస్సార్సీపీ హయాంలో 39.01 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906 కోట్ల విలువైన 3.60 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించి అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమే కాదు.. ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి కనీస మద్దతు ధరలు దక్కేలా చర్యలు తీసుకుంది. సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలోనే పంటల ధరలను పర్యవేక్షించింది. టమాటా, ఉల్లి, బత్తాయి, పొగాకు, పత్తి తదితర పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారుల్లో పోటీని పెంచింది. ఇలా ఐదేళ్లలో రికార్డు స్థాయిలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి అండగా నిలిచింది. -
Skill Development Case: అసలు నిందితుడు చంద్రబాబే..!
-
పాత్రికేయ కుతంత్రం
చంద్రబాబు కుట్రల ముందు నక్క జిత్తులు ఎందుకూ పనికిరావు... ఈనాడు పత్రిక కట్టుకథలకైతే శకుని కుతంత్రాలు కూడా తీసికట్టే...అలాంటి ఇద్దరూ కుమ్మక్కై బరితెగిస్తే ఎలా ఉంటుందో తెలుసా...?అబద్ధానికి ప్రతిరూపంలా... దుర్మార్గానికి నిలువుటద్దంలా నిలుస్తుంది...అడ్డగోలుతనానికి అక్షర రూపంలా... ఓ నిలువెత్తు సాక్ష్యంలా కనిపిస్తుంది..మద్యం అక్రమ కేసులో చంద్రబాబు– ఈనాడు ఇలానే పన్నాగాలు పన్నుతున్నారు.. సిట్ను అడ్డం పెట్టుకుని... సిగ్గులేకుండా అవాస్తవాలు అచ్చోస్తున్నారు...సాక్షి, అమరావతి: నక్కజిత్తులను తలదన్నే చంద్రబాబు, శకుని కుతంత్రాలను మించిన ఈనాడు పత్రిక తోడుదొంగల మాదిరి మద్యం అక్రమ కేసులో కట్టుకథలు వండివారుస్తున్నారు. చంద్రబాబు విషపు రాజకీయాలను కొమ్ముకాసే రామోజీ కుటుంబ విష పుత్రిక ఈనాడు అంతకంతకూ బరితెగిస్తోంది. రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారే తమ ‘బాబు’కు గొడుగు పడుతూ అసలు నైజం చాటుకుంటోంది. నిత్యం ఉషోదయాన అసత్యాలను ప్రవచించడమే ఏకైక విధానంగా చేసుకున్న ఈనాడు... ఈ కోవలోనే ‘వైఎస్ అనిల్రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు’ శీర్షికన శనివారం ఓ అబద్ధపు కథనాన్ని అచ్చోసింది. పాత్రికేయ విలువలకు పాతరేస్తూ... అవాస్తవాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది.⇒ మద్యం అక్రమ కేసులో సిట్ సోదాలు నిర్వహించిన రెండు కంపెనీల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి గతంలో డైరెక్టర్గా ఉన్నారంటూ∙అసత్యాన్ని ఈనాడు నిస్సిగ్గుగా ప్రచురించింది. ఆ రెండు కంపెనీల్లో వైఎస్ భారతి ఏనాడూ డైరెక్టర్గా లేరని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) రికార్డులు స్పష్టం చేస్తున్నా... పచ్చ పత్రిక మాత్రం ఉద్దేశపూర్వకంగా అబద్ధపు కథనాన్ని వదిలింది. చంద్రబాబు ప్రభుత్వం కుట్రలో ప్రధాన పాత్రధారిగా అసత్య కథనాలతో తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించింది. వైఎస్ అనిల్రెడ్డి కంపెనీల్లో జగన్ సతీమణి భారతి డైరెక్టర్గా ఉన్నారని మొదటి పేజీలో విషం చిమ్మిన ఈనాడు బాబు, ఈనాడు క్షుద్ర రాజకీయానికి పరాకాష్టవైఎస్ జగన్ సతీమణి భారతిపై దుష్ప్రచారంమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు, ఈనాడు సాగిస్తున్న కుట్ర పరాకాష్టకు చేరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని మద్యం స్కాంను ఉన్నట్టుగా చూపించేందుకు సాగిస్తున్న వారి కుతంత్రాలు మరింత పదునెక్కాయి. ఈసారి ఏకంగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి దిగి కుట్రను పతాకస్థాయికి తీసుకెళ్లారు. మద్యం అక్రమ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్రెడ్డికి చెందిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతోలపాటు మరో ఆరు కంపెనీల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు. అయితే, ఇదే అవకాశంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వ డైరెక్షన్లో... వైఎస్ భారతిపై దుష్ప్రచారం చేసేందుకు ఈనాడు బరితెగించింది. ⇒ షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ భారతి 2020 వరకు డైరెక్టర్గా ఉన్నారని ఈనాడు నిస్సిగ్గుగా అవాస్తవ కథనం ప్రచురించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అక్రమ నిధులు మళ్లించేందుకు 2019లో ఆ కంపెనీలను ఏర్పాటు చేశారని కూడా చెప్పుకొచ్చింది. అబద్ధాల విష పుత్రిక అయిన ఈనాడు... పాత్రికేయ విలువలు కాలరాస్తూ అసత్య కథనాన్ని శనివారం ప్రధాన ఎడిషన్ మొదటి పేజీ, రెండో పేజీ ప్రచురించింది. వైఎస్ జగన్ సతీమణి భారతి గతంలో డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో సిట్ సోదాలు అని ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఆ కంపెనీల్లో వైఎస్ భారతి డైరెక్టర్గా ఏనాడూ లేరుస్పష్టం చేస్తున్న ఆర్వోసీ రికార్డులుఅసలు వాస్తవం ఏమిటంటే... వైఎస్ అనిల్రెడ్డికి చెందిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి ఏనాడూ డైరెక్టర్గా లేనే లేరు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) డిన్ (డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్)ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఓ వ్యక్తి గతంలో ఏయే కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు...? ప్రస్తుతం ఏ కంపెనీల్లో ఉన్నారనే విషయాలు తెలుసుకోవచ్చు. ఆర్వోసీ రికార్డులు ఓపెన్ డాక్యుమెంట్లే. వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంటాయి. అయినా సరే, ఈనాడు కుట్రపూరితంగా అబద్ధపు కథనాన్ని ప్రచురించింది. ఆ రెండు కంపెనీల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి 2020 వరకు డైరెక్టర్గా ఉన్నారని పచ్చి అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించింది.పక్కా కుట్రతోనే దుష్ప్రచారంచంద్రబాబు డైరెక్షన్లో ఈనాడు పక్కా పన్నాగంతోనే మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై అవాస్తవ కథనం ప్రచురించింది. ఆర్వోసీ కేటాయించే డిన్తో రికార్డులు పరిశీలిస్తే ఒక వ్యక్తి గతంలో, ప్రస్తుతం ఏఏ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారన్నది వెల్లడవుతుంది. ఒకే ఇంటి పేరు, ఒకే పేరుతో ఉన్న వ్యక్తుల పట్ల కూడా సందేహం రాకుండా ఉండేందుకు అందరి పేర్లతో పాటు వారి తండ్రి, భర్త పేర్లు, వయసు వంటి వివరాలు అందులో పొందుపరుస్తారు. కానీ, షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ భారతి డైరెక్టర్గా ఉండేవారు అని దురుద్దేశపూర్వకంగానే ఈనాడు కథనం రాసింది. ఆర్వోసీ రికార్డులను పరిశీలిస్తే ఆ రెండు కంపెనీల్లో గతంలో డైరెక్టర్ గా వ్యవహరించినది వైఎస్ అనిల్రెడ్డి తల్లి భారతి అని తెలుస్తుంది. ఆమె వయసు, ఆమె భర్త పేరు కూడా ఆ రికార్డుల్లో ఉన్నాయి. డైరెక్టర్గా వ్యవహరించింది వైఎస్ జగన్ సతీమణి భారతి కాదు వైఎస్ అనిల్రెడ్డి తల్లి వైఎస్ భారతి అని స్పష్టంగా ఉంటుంది. కానీ, ఈనాడు చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు కుట్రపూరితంగా వ్యవహరించింది. ఆ రెండు కంపెనీల్లో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి 2020 వరకు డైరెక్టర్గా వ్యవహరించారని అవాస్తవ కథనం ప్రచురించింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసింది.దుష్ప్రచారం... దుమ్మెత్తిపోయడం...ప్రత్యర్థిని దొంగదెబ్బ తీసేందుకు దుష్ప్రచారం... విషం కక్కుతూ దుమ్మెత్తిపోయడం చంద్రబాబు, ఈనాడు సారథ్యంలోని పచ్చముఠాకు వెన్నతో పెట్టిన విద్య. వారం రోజుల వ్యవధిలోనే వారు చేసిన దుష్ప్రచారం చూస్తే ఈ విషయం మరింత స్పష్టం అవుతుంది. ఉమ్మడి ఏపీలో నమోదైన ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైఎస్ జగన్ అసలు నిందితుడే కాకపోయినా.. ఆయనను ప్రధాన నిందితుడిగా(ఏ1) పేర్కొంటూ ఈ నెల 13న ఈనాడు అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూసింది. చంద్రబాబు కుట్రలో భాగంగా 2010–11 నాటి ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసును తెరపైకి తెచ్చింది. ఆ కేసులో వైఎస్ జగన్ నిందితుల జాబితాలోనే లేరు. కానీ, ప్రధాన నిందితుడు (ఏ1) అంటూ ప్రముఖంగా ప్రచురించింది. ఇదే కేసులో ఏ–7 హైదరాబాద్కు చెందిన న్యాయవాది, చిన్నాచితక వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పుకొచ్చింది. వైఎస్ జగన్ తరఫున సునీల్ రెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, విదేశాలకు నిధులు తరలించారని అవాస్తవాలు, అభూత కల్పనలను ప్రచురించింది. ఇలాంటి కథనాన్ని ప్రచురించే ముందు ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు పూర్వాపరాలు తెలుసుకోవాలని అయినా ప్రయత్నించలేదు. కనీసం ఆ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ను పరిశీలించినా నిజాలు వెల్లడవుతాయి. అయితే, కేవలం చంద్రబాబు చెప్పినట్టు వైఎస్ జగన్పై బురదజల్లడమే లక్ష్యం అయిన ఈనాడు అవేమీ పట్టించుకోలేదు. ఇక ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో 14 మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ జాబితాలో వైఎస్ జగన్ పేరు లేనే లేదు. తాజాగా మద్యం అక్రమ కేసులో సిట్ తనిఖీలు చేసిన కంపెనీల్లో వైఎస్ భారతి డైరెక్టర్గా ఉన్నారంటూ విషపు రాతలు కూడా ఈ తరహాలోనివే. గతంలో డైరెక్టర్గా ఉన్నారనే అసత్యాన్ని ఈనాడు అచ్చోసింది.ఇదంతా చూస్తుంటే ఈనాడు క్షుద్ర పాత్రికేయం స్పష్టం అవుతోంది. అబద్ధం అని తెలిసి కూడా దానిని ప్రజల్లోకి వదలడం దాని విష ప్రచారానికి అద్దంపడుతోంది.ఈనాడుపై న్యాయపరమైన చర్యలుసాక్షి, అమరావతి: తన ప్రతిష్ఠకు భంగకరంగా అవాస్తవ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. సిట్ సోదాలు నిర్వహించిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో తాను 2020 వరకు డైరెక్టర్గా ఉన్నట్లు ఈనాడు ఇచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం అని వైఎస్ భారతి స్పష్టం చేశారు. ఈ మేరకు ఈనాడు ప్రచురణ సంస్థ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ పత్రిక ఏపీ ఎడిషన్ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుకు తన న్యాయవాదుల ద్వారా శనివారం నోటీసులు పంపించారు. ⇒ భారతిరెడ్డి ఎడుగూరి సందింటి అనే పేరు గల మరో మహిళ ఆ కంపెనీల్లో డైరెక్టర్గా వ్యవహరించారని, తాను కాదని ఆమె వెల్లడించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ప్రకారం ఆమె గుర్తింపు నంబరు (డిన్–డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్) 02584220 కాగా, తన డిన్ 01580536 అని తెలిపారు. సిట్ సోదాలు నిర్వహించిన కంపెనీలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని వైఎస్ భారతి తేల్చి చెప్పారు. కానీ, ఆ రెండు సంస్థల్లో తాను డైరెక్టర్గా ఉన్నట్లు, అక్రమ నిధులను మళ్లించినట్లు ఈనాడు దురద్దేశపూర్వకంగా అవాస్తవ కథనాన్ని ప్రచురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు కథనం తన ప్రతిష్ఠకు భంగం కలిగించేదిగా ఉంది అని వైఎస్ భారతి తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై ఈనాడు పత్రిక తక్షణం వివరణను ప్రచురించాలని డిమాండ్ చేశారు. అవాస్తవ కథనాన్ని ప్రచురించినంత ప్రాముఖ్యతతో అదే (మొదటి) పేజీల్లో తన వివరణను రెండు రోజుల్లో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే ఈనాడు ఉద్దేశపూర్వకంగానే తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించిందని భావించాల్సి వస్తుందన్నారు. అవాస్తవ కథనాన్ని ప్రచురించినందుకు న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు. నిన్న.. ఎమ్మాఆర్ కేసులో అసలు నిందితుడే కాకపోయినా వైఎస్ జగన్ ఏ1 అంటూ ఈనాడు అచ్చోసిన అబద్ధం చంద్రబాబు అవినీతి కేసులను కప్పిపుచ్చేందుకే...టీడీపీ కూటమి ప్రభుత్వం ఇంతగా బరితెగించి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై ఎందుకు దుష్ప్రచారం చేస్తోందంటే... చంద్రబాబు అవినీతి దందాను కప్పిపుచ్చేందుకే అనే సమాధానం ఠక్కున వస్తుంది. ఎందుకంటే మద్యం, ఇసుక, ఇతర ఖనిజాల దందాలో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. 2014–19 టీడీపీ హయాంలో మద్యం విధానం ముసుగులో టీడీపీ సిండికేట్ బరితెగించి దోపిడీ చేసింది. రెండు చీకటి జీవోలతో బార్లు, మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు తొలగించింది. తద్వారా రూ.5,200 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగించి రూ.20 వేల కోట్లు కొల్లగొట్టింది. వెరసి రూ.25 వేల కోట్లు దోపిడీ చేసింది. ఈ వాస్తవాన్ని సీఐడీ గతంలోనే ఆధారాలతో సహా నిగ్గు తేల్చి... చంద్రబాబు, అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్పైన ఉన్నారు. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్యం, ఇసుక, ఖనిజాల దందాకు చంద్రబాబు తెరతీశారు. టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా 4,700 మద్యం దుకాణాలు కేటాయించడంతో పాటు అంతే సంఖ్యలో పర్మిట్ రూమ్లకు అనుమతినిచ్చింది. అనధికారికంగా ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. 924 బార్లు ఏకపక్షంగా టీడీపీ సిండికేట్కు కట్టబెడుతున్నారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా దోపిడీ చేస్తున్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్ రాకెట్ రాష్ట్రంలో చెలరేగిపోతోంది. ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ నేతల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ ఖజానాకు గండిపడి... టీడీపీ ప్రజాప్రతినిధులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విక్రయాల ద్వారా రూ.700 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రాగా, టీడీపీ కూటమి ప్రభుత్వంలో రూపాయి కూడా రాలేదు. కానీ టీడీపీ ప్రజాప్రతినిధులు రోజూ వేల లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తున్న అవినీతి దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మద్యం విధానంపై అక్రమ కేసుతో వేధింపులకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.చంద్రబాబు, సిట్, ఎల్లో మీడియా తొలినుంచీ అదే కుట్రవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి దర్యాప్తు పేరిట చంద్రబాబు సర్కారు తొలినుంచీ కుట్రపూరితంగానే వ్యవహరిస్తోంది. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో న్యాయస్థానాలను సైతం తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది.⇒ మద్యం విధానంతో గాని అసలు ఏపీ ప్రభుత్వ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లను ఈ అక్రమ కేసులో ఇరికిస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతోంది. అక్రమ కేసు కాబట్టి ఎలానూ నిరూపించలేరు... ఈలోగా ఈనాడు, ఇతర ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేసి వారి పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీయొచ్చన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం.⇒ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ సంస్థ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప పేర్లను మద్యం అక్రమ కేసుతో ముడిపెట్టింది. వారిని అక్రమంగా అరెస్టు చేసి జైలు పాల్జేసింది. తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపింది. అంతటితో చంద్రబాబు కుట్రలకు తెరపడలేదు. మాజీ మంత్రులు కాకాణి గోవర్థన్రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్లను తెరపైకి తెచ్చింది.⇒ సిట్ కుట్రలు ఇంకా కొనసాగాయి... హైదరాబాద్కు చెందిన న్యాయవాది నర్రెడ్డి సునీల్రెడ్డి, సజ్జల భార్గవ్ పేర్లను కూడా సిట్ కుట్రపూరితంగానే ఈ కేసుతో ముడిపెట్టింది. ఇక వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులను తీవ్రం చేసింది. ఇలా రోజుకో పేరును తెరపైకి తెస్తూ వైఎస్ జగన్ తరఫున వ్యవహారాలు చక్కబెడుతున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రతి రోజూ అవాస్తవ కథనాలను వండి వారుస్తోంది.⇒ మద్యం అక్రమ కేసులో ఒక్కో పాత్రను తెస్తూ కుతంత్రాలు పన్నుతోంది కూటమి ప్రభుత్వం. ముందుగా ఎవరో ఒకరిపై బురదజల్లడం, సోదాలు, అరెస్టులు చేయడం.. వారితో సంబంధాలు ఉన్నాయని 10 మందిని అరెస్టు చేయడం పనిగా పెట్టుకుంది. దొంగ డాక్యుమెంట్లు, నగదును చూపెడుతూ దుష్ప్రచారం సాగిస్తోంది. ఎవరిని అరెస్టు చేయాలనుకున్నా, ఎవరి కంపెనీలు, నివాసాల్లో తనిఖీలు చేయాలన్నా సరే... వారు వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితులు అంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం, అనంతరం సిట్ అధికారులు రంగంలోకి దిగడం... ఇలా పక్కా పన్నాగంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ లెక్కన ఈనాడు రామోజీరావు కుటుంబం, టీడీపీ ఎంపీ భరత్ కుటుంబం యావత్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. మరి ఈనాడు–ఈటీవీ సంస్థలు, రామోజీ ఫిలింసిటీ, గీతం విద్యా సంస్థలు చంద్రబాబువే అవుతాయా...!? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు కూడా చంద్రబాబు పచ్చ తానులో ముక్కలే. మరి వారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబువేనా!? టీడీపీ కూటమి ప్రభుత్వం, ఈనాడుతో పాటు ఎల్లో మీడియా వైఎస్ జగన్ విషయంలో అదే రీతిలో వాదిస్తున్నాయి మరి. ఇక రెడ్బుక్ కుతంత్రాలకు పరాకాష్టగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పేరును కూడా ఈ అక్రమ కేసు ఉచ్చులోకి లాగేందుకు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అందుకే వైఎస్ భారతికి ఏమాత్రం సంబంధం లేకపోయినా షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఆమె గతంలో డైరెక్టర్గా వ్యవహరించారనే తప్పుడు కథనాన్ని కుట్రపూరితంగానే ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. -
గద్దల రాజ్యం ప్రైవేట్ లిమిటెడ్!
‘‘నెహ్రూ ఒక ఫ్యూడల్. ఆయనకు బాగా డబ్బులున్నాయి. లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆయన ఏ గేట్ దగ్గరికి వెళ్తే అక్కడికో కారు వచ్చేది. ఆయన అనుసరించిన విధానాల వలన సింగపూర్తో మనం పోటీపడలేక పోయాము. సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ పోటీదారి ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చేశారు. నెహ్రూ వల్ల మనం సింగపూర్తో పోటీపడలేకపోయాము.’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆయనకు బాకా ఊదే మీడియాలో రిపోర్టయింది.బ్రిటిష్ వలస పాలన సంకెళ్లు తెగగొట్టడానికి మొట్ట మొదటిసారిగా లాహోర్ కాంగ్రెస్ సభలో ‘పూర్ణ స్వరాజ్’ శంఖా రావం చేసినవాడు నెహ్రూ. తొలి ప్రధానిగా పంచవర్ష ప్రణాళి కలు వేసి నవభారత సౌధ నిర్మాణానికి ఇటుకలు పేర్చిన వాడాయన. అంతర్జాతీయ వేదికపై రష్యా – అమెరికా కూటము లకు దీటుగా ప్రవర్ధ స్వతంత్ర దేశాలను కూడగట్టి ‘అలీనోద్య మా’న్ని నిర్మించిన ప్రపంచస్థాయి నేత నెహ్రూ. అటువంటి నెహ్రూ గురించి ఐఏఎస్ శిక్షణ పొందిన వారికి తాను చెప్పేది తప్ప ఇంకేమీ తెలియకపోవచ్చనుకోవడం బాబు ఆత్మవిశ్వాసా నికి ఓ మచ్చుతునక అనుకోవాలి.ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అనేక గేట్లుంటాయి. ఆయన ఏ గేటులోంచి బయటికి వస్తారో తెలియదు గనుక ప్రతి గేటు దగ్గరా ఒక కారుండేదని బాబు చెబుతున్నారు. అంత డబ్బున్న వాడు గనుక ఆయన ‘ఫ్యూడల్’ అంటున్నారు. బాగా డబ్బున్న వాళ్లను ‘ఫ్యూడల్స్’ అనాలేమో! ఈ థియరీ ప్రకారం బోలెడంత డబ్బున్న ఎలాన్ మస్క్, అంబానీ వంటి వాళ్లంతా పెద్దపెద్ద ఫ్యూడల్స్ అనుకోవాలి. బాబు ప్రేమించే సింగపూర్లో పెద్దసంఖ్యలో బిలియనీర్లు, మిలియనీర్లు ఉన్నారు కాబట్టి అక్కడున్నది ఫ్యూడల్ వ్యవస్థేమో! సరే, ఈ జ్ఞానామృత సేవనాన్ని పక్కన బెడితే... నిజంగానే నెహ్రూ సంపన్నుడు. ఆయన తండ్రి మోతీ లాల్ నెహ్రూ ఒక విజయవంతమైన న్యాయవాదిగా రెండు చేతులా ఆర్జించారు. అలహాబాద్ (ప్రస్తుత ప్రయాగ్రాజ్)లో ప్యాలెస్ లాంటి ‘ఆనందభవన్’ను నిర్మించుకున్నారు. అనంతర కాలంలో ఆ ప్యాలెస్ స్వాతంత్య్రోద్యమానికీ, కాంగ్రెస్ కార్యకలా పాలకూ కేంద్ర స్థానంగా మారింది.లండన్లో నెహ్రూ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రతిష్ఠాత్మకమైన హారో స్కూల్లో జరిగింది. కాలేజీ చదువు ట్రినిటీ కాలేజీలో! ఇది కేంబ్రిడ్జి యూనివర్సిటీలో భాగం. ఆక్స్ఫర్డ్ కాదు. తర్వాత బారిస్డర్ శిక్షణ కూడా నెహ్రూ తీసుకున్నారు. చంద్రబాబు చెప్పిన ‘గేటుకో కారు’ అనే చందమామ కథను ఎక్కడి నుంచి సంగ్రహించారో తెలియదు. ప్రామాణిక గ్రంథాల్లో ఈ కథ ఎక్క డైనా ఉన్నదేమో అది చదివినవాళ్లే చెప్పాలి. బాబు జ్ఞానబోధ విన్న ఐఏఎస్లు, అధికారులంతా చరిత్ర ప్రసిద్ధిగన్న నెహ్రూ ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ పాఠాన్ని చదివే ఉంటారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి అర్ధరాత్రి జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ స్వాతంత్య్రో ద్యమ లక్ష్యాల సాధన కోసం భారత్ మేల్కొంటున్నది. పేదరికం లేని, అసమానతలకు తావు లేని, రోగాలు రొష్ఠులెరుగని, అజ్ఞా నాన్ని పారదోలే వ్యవస్థను నిర్మించుకోవడమే జాతి లక్ష్యమ’ని నెహ్రూ ప్రకటించారు. ఇందులో ‘ఫ్యూడలిజం’ ఎక్కడ ఉన్నదో, పెత్తందారీతనమెక్కడ ఉన్నదో అధికారులే వెతికి పట్టుకోవాలి. సువిశాలమైన, వైవిధ్యభరితమైన, బహుళ సంస్కృతుల నిలయ మైన, అత్యధిక జనాభా కలిగిన భారత్ అభివృద్ధి గమనాన్ని ఒక చిన్న సిటీ స్టేట్ సింగపూర్తో పోల్చడం ఏ రకంగా విధాయకమో విజ్ఞులైన అధికారులు గ్రహించే ఉంటారు.ప్రభుత్వ ఉద్దేశాలను వివరించడానికి, ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కార్యోన్ముఖులను చేయడానికి కలెక్టర్ల సమావేశాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇటువంటి అధికారిక సమావేశాలను రాజకీయ వేదికలుగా మార్చడం తగునా? దేశ తొలి ప్రధానిని కించపరిచే ఉపన్యాసాలు చేయడం సమంజసమేనా? నెహ్రూ అమలు చేసిన డెమోక్రటిక్ సోషలిస్టు విధానాలు ప్రైవేట్ వ్యాపా రులకు ఊడిగం చేసే నేటి పాలకులకు నచ్చకపోవచ్చు. కానీ, వారసత్వంగా వచ్చిన విలాసవంతమైన జీవితాన్ని కాలదన్ను కొని స్వాతంత్య్రోద్యమంలో ఒక ముఖ్య సేనానిగా పాల్గొని పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపిన త్యాగధనుడిగానైనా ఆయన్ను గుర్తించి గౌరవించాలి కదా! ‘సంఘ్ పరివార్’కు ఆది నుంచి నెహ్రూతో సిద్ధాంతపరమైన విభేదాలున్నాయి. చాలా కాలంగా అధికారంలో ఉండి అన్ని హంగులూ అమర్చుకున్నందువల్ల నెహ్రూ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని కేంద్ర సర్కార్ పెద్దయెత్తున చేపట్టింది.వాళ్లను సంతృప్తి పరిచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములు ఒకరితో ఒకరు పోటీపడు తున్నట్టున్నారు. బీజేపీ వాళ్లను మించి వీర సనాతనవాదిగా చలామణీ కావడానికి ఇటీవల పవన్ కల్యాణ్ పడిన పాట్లను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. నెహ్రూ విధానాల మీద నిందా ప్రచారం చేయడానికి బీజేపీ వాళ్లు రకరకాల వేదికల్ని ఉపయోగించుకున్నారే గాని, చంద్రబాబు మాదిరిగా ఐఏఎస్ల సమావే శాన్ని మాత్రం ఉపయోగించుకున్నట్టు లేదు. ఈ రకంగా బాబు వాళ్లకు ఓ కొత్త దారిని చూపించాడనుకోవాలి. చంద్రబాబు పార్టీతో అంటకాగే అలవాటున్న ఆంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండించకపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.ఇంతకూ బాబు చెబుతున్నట్టు దేశంలో అభివృద్ధి రాహిత్యా నికి కారణమైన నెహ్రూ విధానాలేమిటి? రెండు శతాబ్దాల వలస దోపిడీ అనంతరం భారత్ ఆర్థికంగా చిక్కి శల్యమైంది. యూరప్ పారిశ్రామిక విప్లవం తర్వాత దేశంలో కొత్తగా పరిశ్రమలు రాకపోగా పాతకాలపు పరిశ్రమలు, చేతివృత్తులు మూల పడ్డాయి. బ్రిటన్కు ముడిసరుకుల పంపిణీ చేసే దేశంగా మిగిలి పోయింది. ఫలితంగా స్వదేశీ పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి చెందలేదు. అందువల్ల భారీ పరిశ్రమల్ని, రైల్వేలు, నీటిపారు దల ప్రాజెక్టుల వంటి వాటిని ప్రభుత్వమే తలకెత్తుకోవలసి వచ్చింది. స్వదేశీ పెట్టుబడిదారీవర్గం నిర్వహించగలిగిన పరిశ్ర మల స్థాపనకు వారికి అనుమతులివ్వడం జరిగింది. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం పక్కపక్కనే పనిచేయడం వల్ల ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రత పెరిగింది. మెరుగైన వేతనాలు, సౌకర్యాలు పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ఒక కొత్త మధ్యతరగతి వర్గం తయారైంది.కాలక్రమంలో ప్రైవేట్ రంగంలో పరిశ్రమల స్థాపనకు లైసెన్స్రాజ్, రెడ్ టేపిజమ్ ఆటంకంగా మారాయనే విమర్శలు మొదలయ్యాయి. నిజంగానే ఆ కాలంలో (1947–1991) ఆర్ధిక వృద్ధి రేటు నాలుగు శాతానికి మించి పెరగలేదు. ఫలితంగా ఉద్యోగాల కల్పన మందగించింది. అయితే ఇందుకు ప్రభుత్వ రంగం కారణం కాదు. కాలానుగుణంగా ప్రభుత్వాలు వ్యవహ రించి ఎగుమతి దిగుమతుల్లో ప్రొటెక్షనిస్టు పద్ధతులను సంస్కరించి, కొంతమేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించి, లైసెన్స్ రాజ్ – రెడ్ టేపిజాలను నియంత్రించి ఉంటే సరిపోయేదనే అభిప్రాయాలున్నాయి. కానీ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత విచ్చలవిడిగా ప్రైవేటీకరణ చేయడమే అభివృద్ధి రహస్యమన్నట్టుగా కొందరు దళారీ రాజకీయవేత్తలు పరుగులు తీస్తున్నారు. వీళ్లకు చైనా విజయగాథ వినిపించదు. ప్రభుత్వ రంగమే ఆధిపత్యం వహిస్తూ ప్రభుత్వ నియంత్రణకు లోబడి ప్రైవేట్ పెట్టుబడి పనిచేస్తున్న ఈ ఆర్థిక వ్యవస్థ సృష్టించిన అద్భుతాలు చంద్రబాబు వంటి వారికి కనిపించవు.ప్రైవేటీకరణ అనేది భారీగా కమీషన్లు పిండుకునే కామ ధేనువుగా సంస్కరణానంతర కాలపు రాజకీయవేత్తల్లో కొందరికి కనిపించింది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే (1995–2004) ఏకంగా 56 ప్రభుత్వ రంగ సంస్థ లను కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. ఇందులో 20 సంస్థల్లోనే 400 కోట్లు వెనకేసుకున్నారని ఆ రోజుల్లోనే సీపీఎం పార్టీ ఆధారాలతో సహా నిరూపించింది. ఇది పాతికేళ్ల కిందటి సంగతి. ఇప్పుడా విలువ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆల్విన్ భూములు, రిపబ్లికన్ ఫోర్జ్, నిజాం షుగర్స్ నాలుగు యూనిట్లు, మరో అరడజన్ షుగర్ మిల్లులు, నూలు మిల్లులు అస్మదీయులకు కారుచౌకగా కట్టబెట్టిన జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు వైఖరిలో ఏ మార్పూ రాలేదు. ఇప్పుడు ఏకంగా పది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఆయన తెగబడ్డారు.ఒక్కో కాలేజీకి ఖరీదైన 50 ఎకరాల స్థలంతోపాటు నిర్మా ణాలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఏటా ఐదువేల రూపా యల నామమాత్రపు ధరకు 66 ఏళ్లపాటు వాటిని బినామీలకు లేదా కమీషన్లకు కట్టబెట్టబోతున్నారు. ఇది ప్రైవేటీకరణ కాదు. పీపీపీ మోడల్ అని ప్రభుత్వ పెద్దలు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. పేరులోనే తేడా! సారం మాత్రం ఒకటే. ఆ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉన్నట్టయితే పేద, మధ్యతరగతి విద్యార్థులు వారి డాక్టర్ చదువుల కలను సాకారం చేసుకొని ఉండేవారు. ఇప్పుడు లక్షలు పోసి కొనగలిగిన వారికే మెడికల్ సీట్లు. అనుబంధంగా ఏర్పడే పెద్దాసుపత్రుల్లో పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా ఉన్నత స్థాయి వైద్యం లభించేది. ఇప్పుడా వైద్యాన్ని కూడా కొనుక్కోవాలి. ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యను కూడా ఎన్డీఏ ప్రభుత్వం, యెల్లో మీడియా అభివృద్ధికర చర్యగా ప్రచారం చేసుకోవడాన్ని బరితెగింపు వ్యవహారంగానే పరిగణించాలి.ఆర్థిక సంస్కరణల తర్వాత పెరిగిన జీడీపీ వృద్ధి రేటు గురించి, ఉద్యోగాల గురించి పుంఖానుపుంఖాలుగా ప్రచార సాహిత్యం అందుబాటులో ఉన్నది. నిజమే, జీడీపీ వృద్ధి రేటు అంతకుముందున్న 4 శాతం నుంచి 6 శాతానికి ఎగబాకింది. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం వల్లనే ఇది సాధ్యమైందనే దండోరా కూడా వేస్తున్నారు. మరి పెరుగుతున్న ఆర్థిక అసమాన తల సంగతి? అసమానతలు పెరగడం అభివృద్ధికి సూచిక అను కోవాలా? మానవాభివృద్ధి సూచీలో మనం ఎక్కడున్నాం? స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో, 1950 దశకం ఆరంభంలో మన దేశంలో ఉన్న అగ్రశ్రేణి 1 శాతం (జనాభాలో) శ్రీమంతుల సంపద మొత్తం జాతి సంపదలో 13 శాతంగా ఉండేది. మూడు దశాబ్దాల తర్వాత (1982) అది 5 శాతానికి పడిపోయింది. ఈ ఒక్కశాతం శ్రీమంతులకు వారి దిగువశ్రేణిలో మరో 10 శాతం సంపన్నులను కలిపితే జాతి సంపదలో వారి వాటా 37 శాతంగా (1952) ఉండేది. మూడు దశాబ్దాల తర్వాత అది 30 శాతానికి తగ్గింది. అదే సమయంలో జనాభాలోని అట్టడుగు 50 శాతం జనాభా వాటా స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 5 శాతంగా ఉంటే ముప్పయ్యేళ్ల తర్వాత అది 9 శాతానికి ఎగబాకింది. ఇది అభివృద్ధి నిరోధక పరిణామం?!ప్రైవేటీకరణల కాలం లెక్కలు కూడా చూద్దాం. ఈ లెక్క లన్నీ ప్రపంచ అసమానతల డేటా బేస్ (డబ్ల్యూఐడీ)లోవి. ఇప్పుడు మన అగ్రశ్రేణి ఒక్క శాతం శ్రీమంతుల సంపద జాతి సంపదలో 40 శాతానికి చేరింది. ఇది కదా అభివృద్ధి! వీరికి తర్వాత శ్రేణిలోని పది శాతం సంపన్నులను కూడా కలిపితే వారి ఉమ్మడి సంపద 66 శాతానికి చేరుకున్నది. ఇక మిగిలిన అట్టడుగు 50 శాతం జనాభా ఉమ్మడి వాటా జాతి సంపదలో 3 శాతానికి పడిపోయింది. రెండు శతాబ్దాల బ్రిటిష్ వలస దోపిడీ అనంతరం ఈ వాటా 5 శాతంగా ఉండేది. ఈ పరిణామాన్ని కూడా అభివృద్ధే అందామా?తెలుగువారి సెంటిమెంట్స్తో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్ర సర్కార్ పూర్తిగా సహకరిస్తున్నది. తాజాగా 22 కీలక విభాగాలను ప్రైవేటీకరించడమే దానికి తార్కాణం. పాడి రైతులకు మేలు చేస్తున్న ‘అమూల్’కు పొమ్మనకుండా పొగబెట్టారు. ప్రభుత్వ రంగంలో ఉన్న 22 టూరిజం హోటళ్లను ప్రైవేటీకరిస్తున్నారు. ఆ శాఖ పరిధిలో ఉన్న పదివేల కోట్ల ఆస్తు లను కూడా కట్టబెడుతున్నారు. ఇకమీదట రాష్ట్ర పరిధిలోని రోడ్లను కూడా పీపీపీ మోడ్లో అభివృద్ధి చేస్తారట! అంటే పల్లె రోడ్ల మీద కూడా టోల్ కట్టాలన్నమాట. దేవాలయాల భూముల్ని కూడా వదిలిపెట్టడం లేదు. కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే సిద్ధాంతకర్తలు గద్దెలపై కూర్చున్నారు. జాతి సంపదలో నానాటికీ తమ వాటాను కోల్పోతున్న పేద ప్రజల కోసం ‘ఇంటికో జోలె’ పథకాన్ని అమలు చేస్తారట. దానికి ‘నాలుగు పీ’ల పథకంగా నామకరణం చేశారు. కొంతమంది సంపన్నుల ఇళ్లను వారికి కేటాయిస్తారు. కేటాయించిన ఇళ్ల ముందే పేదలు అడుక్కోవాలి. బౌండరీలు దాటకూడదు. పేదల జీవితాలను, ఆత్మగౌరవాన్ని కూడా ప్రైవేటీకరిస్తున్నారు. బహుజనులారా... బహుపరాక్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలి: అవినాష్ రెడ్డి
-
Visakha: కూటమి ప్రభుత్వంపై వీధి వ్యాపారుల మండిపాటు
-
పవన్ OG సినిమా టికెట్కి ఉన్న విలువ రైతు ప్రాణాలకు లేదా?
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయకపోతే... ఉషశ్రీ చరణ్ ఉగ్రరూపం
-
ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జనాగ్రహం... చంద్రబాబు కూటమి సర్కార్ నిర్ణయంపై వెల్లువెత్తిన నిరసన
-
Ambati: ప్రభుత్వానికి చాలా థాంక్స్ ఈ కార్యక్రమాన్ని మీరే సక్సెస్ చేశారు
-
Vidadala: కూటమి ప్రభుత్వం వల్ల సర్కార్ వైద్యం ప్రజలకు దూరమవుతుంది
-
Perni Nani: ఇంట్లో పడుకుంటే పని అవ్వదూ... విలేకర్ ప్రశ్నకు పేర్ని నాని సమాధానం అదుర్స్
-
Perni Nani: పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు
-
ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఆందోళనలు ఆగవని YSRCP హెచ్చరిక
-
తన బినామీలకు దోచిపెట్టడానికే బాబు కుట్రలు
-
ఎవరి సొమ్ము.. ఎవరి సొత్తు.. బాబును రఫ్ఫాడించిన పేర్ని కిట్టు
-
KSR Live Show: ప్రభుత్వ మెడికల్ కాలేజీల చరిత్రలో చీకటి రోజు
-
Watch Live: ఛలో మెడికల్ కాలేజ్
-
17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట
-
మీలాంటి దుష్ట శక్తులనుండి ప్రజలను కాపాడాలని ఆ అప్పన్న స్వామిని వేడుకుంటున్నా
-
గుర్తుపెట్టుకో.. మేమే నిన్ను గెలిపించాం.. మేమే వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తాం
-
భావ ప్రకటన స్వేచ్ఛను బంధిస్తారా?
పత్రికా స్వేచ్ఛకు సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రత్యేకించి ప్రస్తావించక పోయినప్పటికీ, 19(1)(ఎ) అధికరణం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను పొందుపరిచారు. తద్వారా పాత్రికేయులు, రచ యితలు, కవులు, కళాకారులు, సృజనాత్మక నిపుణులు తమ భావా లను నిర్ద్వంద్వంగా స్పష్టం చేసే హక్కులు పొందారు. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తున్నప్పటికీ సహేతుకమైన విమర్శ లను సాదరంగా ఆహ్వానించాల్సిందే. అర్థవంతమైన సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనం వహించాలి. పత్రికలు సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధిగా నిలబడాలి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేర వేయాలి. మీడియా ప్రచురించిన వార్తల్లో వాస్తవాలను గ్రహించి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పాలనలో దిద్దుబాట్లకు శ్రీకారం చుట్టాలి. అంతేగానీ తాము చేసేదంతా మంచేననీ, దాన్నెవరూ ప్రశ్నించకూడదనీ ప్రభుత్వాలు భావిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన విస్తుగొలిపేలా ఉంది. ‘ఫలానా ప్రమోషన్లలో అవినీతి జరిగిందని’ ఎవరో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘సాక్షి’ పత్రిక రాసిన వార్త మీద పోలీసులు కేసు నమోదు చేయడం; ఎడిటర్, రిపోర్టర్లకు పోలీసులు నోటీసులు జారీ చేసి పోలీసు స్టేషన్లో ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి సహేతుకమైన సంకేతం. ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం నిర్ద్వంద్వంగా నియంతృత్వ పోకడే. ప్రతిష్ఠాత్మక ‘ఇండియా టుడే’ మీడియా గ్రూపు కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ సైతం ఈ చర్యల పట్ల ధర్మాగ్రహం వ్యక్తం చేశారంటే సమస్య తీవ్రత ఎంతటిదో అర్థమ వుతుంది. ‘పీ4 పథకం ముఖ్య నేత పిచ్చికి పరాకాష్ట’ అనీ, ‘ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పరులే’ననీ రాసిన పత్రిక మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే సదరు పత్రిక రాసి నవి వాస్తవాలని ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనా? మరెందుకు కొన్ని పత్రికల పట్ల పక్షపాత వైఖరి?నిస్సందేహంగా మీడియాకు ‘లక్ష్మణ రేఖ‘ అవసరమే. అయితే ఇది స్వీయ నియంత్రణ రేఖ కావాలే కానీ, భావప్రకటన కుత్తుక మీద కత్తిలా ఉండకూడదు. మీడియాను బందిఖానాలో ఉంచాలను కుంటే రౌడీలు రాజ్యమేలతారు. అది మరింత ప్రమాదకరం!– ప్రొ‘‘ పీటా బాబీవర్ధన్జర్నలిజం విభాగ పూర్వాధిపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
ప్రజల గొంతు వినిపించకూడదా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించాలన్న తపన, ఆలోచన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఏ కోశానా∙లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. అందుకే మనకు మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నుంచి వారంలోనే ఐదుగురు మనవైపు వచ్చి కూర్చున్నారు. అలా ఇంకొందరిని లాక్కుని, చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేద్దామని చాలా మంది సలహా ఇస్తే నేను వద్దన్నాను. విపక్షం గొంతు వినాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఆ మేరకు వారికి అవకాశాలు ఇచ్చాం. సభలో వారు చెప్పింది విన్నాం. కానీ, ఈ రోజు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుంటోంది’ అని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైందన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. అన్న సందేహం ప్రజలకు కలుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వంపై ఇంత తక్కువ వ్యవధిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఎత్తిచూపారు. ఈ సమయంలో శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మనకు తగిన సమయం కేటాయించడం ఇష్టం లేకనే వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని స్పష్టం చేశారు. మొత్తం సభ్యులతో కలిపి కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే ఇచ్చే అతి తక్కువ సమయంలో ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావిస్తామని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు అవసరమైన సమగ్ర సమాచారం సిద్ధంగా ఉన్నప్పటికీ, మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదు కాబట్టే.. సభకు హాజరుకావడం లేదని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వారే డబుల్ యాక్షన్ చేయాలనుకుంటున్నారు⇒ అసెంబ్లీలో అధికార పక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటోంది. ‘నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా’ అన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని ఏడిపించేది ఈ ప్రభుత్వమే. మళ్లీ వారు ఏడుస్తున్నారని, వారి తరఫున తామే ఏడుస్తామంటూ డబుల్ రోల్ ప్లే చేస్తామంటోంది ఈ ప్రభుత్వమే. ఇలా రెండు వైపులా యాక్షన్ చేస్తోంది. నిజం చెప్పాలంటే వారు ఏడ్చినట్లు నటించినంత మాత్రాన ప్రజల్లో సానుభూతి రాదు. విపక్షంగా మనం ప్రజా సమస్యలు లేవనెత్తితేనే అందులో నిజాయితీ ఉంటుంది.⇒ నాడు చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదు. ఆయన్ను ఎవరూ ఏమీ అనకున్నా.. బయటకు వెళ్లి ఏడ్చాడు. నేను రికార్డులన్నీ చూశాను. మన సభ్యులు ఎవరూ ఏమీ అనలేదు. అయినా అబద్ధాలు చెప్పి, సభకు రాలేదు. అదే మనం జాయింట్ సెషన్లో గవర్నర్ అడ్రస్ సమయంలో అటెండ్ అయ్యాం. ఏటా అలా వెళ్తున్నాం. గవర్నర్ ఎదుట మన సమస్య ప్రస్తావించి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పి వస్తున్నాం.⇒ అసెంబ్లీలో ప్రజల గొంతు వినపడాలనే తపన ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే మనకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని అనుకుంటోంది. ఇటీవల నేను ప్రెస్మీట్లో మూడు అంశాలపై గంటన్నర మాట్లాడాను. అలా మనకు అసెంబ్లీలో కూడా అవకాశం ఇస్తేనే, ప్రజా సమస్యలు ప్రస్తావించగలం. అలా కాకుండా మనల్ని ప్రతిపక్షంగా గుర్తించకుండా, ఒక ఎమ్మెల్యే మాదిరిగా కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఇస్తే ఏం మాట్లాడగలం?⇒ నిజానికి సభలో ఉన్నవి నాలుగే నాలుగు పార్టీలు. అందులో మూడు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా అధికారంలో ఉన్నాయి. ఇక మిగిలిన ఒకే ఒక పార్టీ మనది విపక్షం. కానీ దాన్ని గుర్తించబోమని ఈ ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే సభలో ప్రజల గొంతు వినడం ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి. అందుకే సభకు వెళ్లకుండా ఇక్కడ ప్రెస్మీట్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించాం.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం ⇒ రాష్ట్రంలో కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఏడు త్త్రెమాసికాలు పెండింగ్. మొత్తం ఏడు క్వార్టర్లు.. అంటే దాదాపు రూ.4,900 కోట్లు బకాయి ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చింది రూ.900 కోట్లే.⇒ వసతి దీవెన గత ఏడాది రెండు దఫాలు, ఈ ఏడాది మరో దఫా పెండింగ్ ఉంది. ఈ పథకం కింద మరో రూ.2,200 కోట్లు బకాయి పడ్డారు. అలా ఈ రెండు పథకాలకే రూ.6,200 కోట్లు బకాయి పడ్డారు. కాలేజీలు కూడా చేతులెత్తేసే పరిస్థితులు వచ్చాయి. స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నాశనం అయ్యింది. ట్యాబులిచ్చే కార్యక్రమం ఆగిపోయింది. సీబీఎస్ఈని రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ ఎగిరిపోయింది. స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఆగిపోయాయి. పిల్లలకు ఇచ్చే చిక్కీలు కూడా ఆపేశారు.⇒ వైద్య రంగం పరిస్థితి చూస్తే మరింత ఘోరంగా ఉంది. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీని ఆపేశారు. ఆరోగ్య శ్రీకి రూ.3,500 కోట్లకు పైగా బకాయి పడ్డారు. దీంతో ఈ పథకం కింద వైద్యం చేయలేమని ఆస్పత్రుల్లో బోర్డులు పెట్టేస్తున్నారు. ఆరోగ్య ఆసరా కింద రూ.600 కోట్లు బకాయి పడ్డారు.⇒ మన ప్రభుత్వంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఏడు కాలేజీలు పూర్తి చేశాం. మనం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ పనులు మొదలుపెట్టాం. దాని వల్ల అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలందుతాయి. నిరుపేద పిల్లలకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి.⇒ రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మొత్తం బ్లాక్ మార్కెట్. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మన ప్రభుత్వం హయాంలో మార్కెట్లో జోక్యం చేసుకుని రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏమీ లేవు. ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు. అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లకు రూ.40 వేలకుగాను కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. ఎక్కడికక్కడ దోపిడీ.. నీకింత.. నాకింతశాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వ్యవస్థల్లో ఇంత లంచాలు ఎప్పుడూ చూడలేదు. ఎక్కడికక్కడ సిండికేట్లుగా మారి వసూళ్లు చేస్తున్నారు. పెదబాబుకు ఇంత, చిన బాబుకు ఇంత అని పంచుతున్నారు. లిక్కర్ను ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇసుక ఎక్కడా ఉచితంగా లభించడం లేదు. ఇంకా లేటరైట్, క్వార్ట్జ్, సిలికా.. దేన్నీ వదిలి పెట్టడం లేదు. చివరకు ఫ్లైయాష్ కూడా అమ్మేసుకుంటున్నారు.అన్నింటా విఫలమైనా నిస్సిగ్గుగా సూపర్ హిట్ సభఈ ప్రభుత్వం అన్నింటా దారుణంగా విఫలమైనా.. ఇటీవల సూపర్ సిక్స్.. సూపర్ హిట్ పేరుతో కార్యక్రమం చేశారు. ఆ సభ సందర్భంగా ఇచ్చిన అడ్వర్టయిజ్మెంట్ను, ఎన్నికల నాటి యాడ్తో పోల్చి చూస్తే పూర్తిగా మారిపోయింది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు. 50 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్ రూ.4 వేలు ఈ ప్రకటనలో లేవు. పథకాలు కూడా మారిపోయాయి.వీటన్నింటిపై గట్టిగా నిలదీయండిమనకు కౌన్సిల్లో మంచి బలం ఉంది. రాజకీయంగా ఎదగడానికి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలకు ఇది మంచి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. మిగిలింది మరో రెండున్నర ఏళ్లు మాత్రమే. మరో అసెంబ్లీ సెషన్ తర్వాత.. చూస్తుండగానే మరో ఏడాది గడుస్తుంది. కాబట్టి, మీరు కౌన్సిల్లో గట్టిగా నిలబడండి. గట్టిగా మాట్లాడండి. ప్రజా సమస్యలు లేవనెత్తండి. ప్రభుత్వాన్ని కింది అంశాలపై నిలదీయండి.⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వైఫల్యం⇒ రీ వెరిఫికేషన్ పేరిట దివ్యాంగులకు ఇబ్బందులు.. పెన్షన్ కోతలు.⇒ ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు⇒ యూరియా సహా ఎరువుల కొరత, రైతుల అగచాట్లు⇒ పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం⇒ రైతుల ఆత్మహత్యలు⇒ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ⇒ పేదలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు లాక్కోవడం⇒ ఆరోగ్య శ్రీ బంద్.⇒ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ⇒ ప్రభుత్వంలో అడుగడుగునా అవినీతి, దోపిడీ⇒ ఉద్యోగస్తుల సమస్యలు, డీఏలు, పీఆర్సీలు, ఐఆర్, సరెండర్ లీవ్స్ తదితర బకాయిలు, వారిపై వేధింపులు⇒ పులివెందుల జెడ్పీటీసీ బైపోల్లో ప్రజాస్వామ్యం ఖూనీ⇒ అమరావతిలో తొలి విడత రైతులకు ఏమీ చేయకుండానే రెండో విడత ల్యాండ్ పూలింగ్⇒ అసైన్డ్ అన్న పదం తొలగింపు.. మళ్లీ బినామీల పేర్లతో కొనుగోలు⇒ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం⇒ 15 నెలల్లోనే రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల బాదుడురాష్ట్ర ఆదాయానికి దారుణంగా గండిరాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. అదంతా అధికార పార్టీ నేతల జేబుల్లోకి పోతోంది. ఇసుక అమ్మకం ద్వారా మన హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాగా, ఇప్పుడు అది రావడం లేదు. మద్యం ఆదాయం మన హయాంలో ప్రభుత్వానికి వచ్చేది. కానీ, ఇప్పుడేం జరుగుతోంది? వీళ్లే బెల్టు షాప్లు పెట్టించి, ఎక్కువ రేట్లకు అమ్మి అంతా జేబుల్లో వేసుకుంటున్నారు. హార్బర్లలో వాళ్లే పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు. మండలిలో మనకు మంచి బలం ఉంది కాబట్టి ప్రజల కోసం గట్టిగా పోరాటం చేయాలి.మెడికల్ కాలేజీలను కాపాడుకోవాలిమెడికల్ కాలేజీలు అనేవి తరతరాల ఆస్తి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. పైగా అందులో ఫీజులు దారుణంగా ఏకంగా ఏటా రూ.57 లక్షలకు పెంచేస్తున్నారు. ఆ కాలేజీలు తన అత్తగారి సొత్తు అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మేస్తున్నారు. అవి ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదలకు ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలి. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషించాలి. చంద్రబాబు తన వాళ్లకు కట్టబెట్టడానికి ఏమైనా చేస్తాడు. -
Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం
-
మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? : వైఎస్ జగన్
-
Auto Drivers: ఎందుకు మేమంటే అంత చులకన చంద్రబాబుపై డ్రైవర్లు ఫైర్


