Chandrababu Naidu government
-
చంద్రబాబు సర్కారు.. కిక్కు బాక్సింగ్
సాక్షి, అమరావతి: ప్రజలతో తెగ తాగించేందుకు చంద్రబాబు సర్కారు పన్నుతున్న కుట్రలో ఎక్సైజ్ అధికారులు సమిథలవుతున్నారు. ప్రభుత్వ టార్గెట్లు వారికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల లక్ష్యాన్ని చేరేందుకు చివరి రోజు మార్చి 31న అధికారులు నానాపాట్లు పడ్డారు. మద్యం దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేయాల్సిందిగా ప్రాథేయపడ్డారు. 2025–26లో మద్యం అమ్మకాలు రూ.30,200 కోట్ల మార్కు దాటించడం కోసం రాత్రి పొద్దుపోయే వరకు తీవ్ర అవస్థలు పడ్డారు. రూ.35వేల కోట్లు కాలేదు.. రూ.30 వేల కోట్లు దాటాలి మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్నే చంద్రబాబు సర్కారు ప్రధాన ఇంధనంగా చేసుకుందన్నది సుస్పష్టం. 2025–26లో ఏకంగా రూ.35 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ శాఖకు లక్ష్యం నిర్దేశించారు. ప్రతీ వారం సమీక్షించి ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ ఆదేశించింది. మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్ల ద్వారా వేళా పాళా లేకుండా మద్యం అమ్మకాలకు తలుపులు బార్లా తెరచింది.ఎంత చేసినా ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ రూ.27వేల కోట్ల మద్యాన్నే దుకాణాలు, బార్లకు విక్రయించగలిగింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిర్దేశించిన రూ.35వేల కోట్ల మార్కుకు చేరలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు కనీసం రూ.30,200 కోట్లు అయినా దాటించాలని నిర్దేశించారు. ఏం చేస్తారో తెలీదు.. ఇచి్చన టార్గెట్ మేర దుకాణాలు, బార్ల యజమానులతో మద్యం కొనిపించాల్సిందేనని తేల్చి చెప్పారు. తీవ్ర ఒత్తిడికి గురైన ఎక్సైజ్ సిబ్బంది దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు భారీ టార్గెట్లు పెట్టారు. మార్చిలో రూ.3,200 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని స్పష్టం చేశారు. గత ఏడాది మార్చిలో రూ.2,400 కోట్ల మద్యం అమ్మకాలు జరిపారు. సాధారణంగా దానిపై సుమారు 10 శాతం పెంచి లక్ష్యంగా నిర్దేశిస్తారు. అంటే ఈ ఏడాది మార్చిలో రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలు లక్ష్యమని ఎక్సైజ్ అధికారులు భావించారు. కానీ ఆ శాఖ ఉన్నతాధికారులు ఏకంగా రూ.3,200కోట్ల మద్యం అమ్మకాలు సాధించాలని ఆదేశించడంతో జిల్లాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు కంగుతిన్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మార్చి నెలంతా రోజూ సమీక్షలు చేస్తూ మద్యం అమ్మకాలు పెంచేందుకు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో సిబ్బంది సతమతమయ్యారు.చివరి రోజు ఆపసోపాలుఉన్నతాధికారుల ఒత్తిడి భరించలేక మార్చి నెలంతా దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి ఎక్సైజ్ సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. అమ్మకాలు పెంచాలని వేడుకున్నారు. డిమాండ్ మేరకే మద్యం కొనగలమని, అంతుకుమించి కొనలేమని దుకాణాలు, బార్ల యజమానులు తేల్చిచెప్పారు. అయినా సరే ఎక్సైజ్ అధికారులు పట్టు వీడక దుకాణాలు, బార్లపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. మార్చి 30నాటికి రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలే జరిపారు. అంటే మార్చి లక్ష్యం రూ.3,200 కోట్లకు రూ.600 కోట్లు తక్కువ.ఇక ఒక్క రోజు అంటే మార్చి 31(మంగళవారం) మాత్రమే ఉంది. దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క మంగళవారమే రూ.600కోట్ల మద్యం అమ్మకాలు జరపాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం ఉదయాన్నే దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి రోజువారి ఇండెంట్ కంటే ఎక్కువ కొనాలని వేడుకున్నారు. అయితే అవసరానికి మించి కొనుగోలు చేయలేమని కొందరు తేల్చిచెప్పారు. మరి కొందరు తమ వద్ద అందుబాటులో ఉన్న నగదు మేరకే కొంటామని వివరించారు. దీంతో కొందరు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాలు, బార్ల యజమానులపై బెదిరింపులకు దిగారు.తాము చెప్పిన మేర మద్యం కొనకుంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని, తనిఖీలు కఠినంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. మరికొందరు అధికారులైతే అప్పు ఇప్పిస్తామని, రోజువారీ ఇండెంట్ కంటే ఎక్కువ మద్యం కొనాలని దుకాణదారులకు ప్రతిపాదించారు. ఓ అధికారి అయితే ఓ బార్ యజమానికి రూ.25లక్షలు అప్పు ఇచ్చి మరీ కొనుగోలు చేయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మంగళవారం ఇదే పరిస్థితి కొనసాగింది. అయినా సరే మంగళవారం రాత్రి వరకు అనుకున్న లక్ష్యం పూర్తికాలేదు. దీంతో ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ల ద్వారా వెంటపడడం గమనార్హం. దీంతో మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ వ్యవస్థ నిలిచిపోతుందన్నట్టుగా పరిస్థితి తయారైందని ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.40 కోట్లకుపైగా పేద, మధ్య తరగతి కుటుంబాల ఆపద్బాంధవి అయిన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి నిలిచిపోనున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో రెండేళ్లు తిరక్కుండానే ఆస్పత్రుల యాజమాన్యాలు మూడోసారి సమ్మె బాట పట్టాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు బకాయి పడింది. రోజు రోజుకూ పేరుకుపోతున్న బకాయిలతో ఆస్పత్రుల మనుగడ కష్టతరం అవుతోందని కొద్ది నెలలుగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో బకాయిలు తీర్చకపోతే ఏప్రిల్ 1వ తేదీ (బుధవారం) నుంచి సేవలు నిలిపేసి, సమ్మెలోకి వెళతామని వారం కిందటే ‘ఆశ’ అల్టిమేటం జారీ చేసింది. వారితో చర్చలు జరిపి, సేవలు నిలవకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. వెరసి పేద, మధ్య తరగతి ప్రజల ఉచిత వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయి. దగా చేసిన ప్రభుత్వం2024లో అధికారంలోకి వచ్చిన తక్షణమే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేయడం మొదలెట్టారు. ఈ పథకాన్ని రూపుమాపే ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, కేంద్రం అమలు చేసే పీఎంజేఏవై పథకాన్ని వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని లాంటి వారి ద్వారా ప్రకటనలు చేయిస్తూ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారు. మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, విలాసాలు, యోగా డే వంటి ఈవెంట్స్ కోసం మాత్రం రూ.వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రులు నిర్వహించలేకపోతున్నామని గతేడాది యజమానులు రోడ్లెక్కారు. దేశ, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కోసం ప్రైవేట్ వైద్యులు ధర్నా చౌక్లో ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో వారితో చర్చలు జరిపిన ప్రభుత్వం.. బకాయిలన్నింటినీ వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) చేస్తామని నమ్మబలికింది. ఆశ ప్రతినిధులతో చర్చల అనంతరం ఓటీఎస్పై వైద్య శాఖ మంత్రి సైతం ప్రకటనలు చేశారు. డిసెంబర్లోపు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఆ హామీ నెరవేర్చకుండా ప్రభుత్వం దగా చేసింది. బకాయిలు చెల్లించకుండానే బీమా విధానం అమలుకు వైద్య శాఖ టెండర్లు కూడా పిలిచింది. ఈ నేపథ్యంలో బకాయిలపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆస్పత్రుల యాజమాన్యాలు సిద్ధం అయ్యాయి. దీనావస్థలో పేదలు⇒ చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో అత్యధిక శాతం అనధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను ఎత్తేశాయి. జబ్బు బారినపడిన పేదలు చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు వెళితే ఉచిత వైద్య సేవలు అందించలేమని చెప్పేస్తున్నాయి. దీంతో సొంతంగా డబ్బు కట్టి వైద్యం చేయించుకోవడానికి పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ⇒ 2014–19 మధ్య కూడా నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పట్లో చంద్రబాబు అటకెక్కించారు. 2019లో టీడీపీ దిగిపోయే నాటికి రూ.700 కోట్ల మేర బకాయి పెట్టారు.⇒ అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాబు పెట్టిన బకాయిలను చెల్లించింది. అంపశయ్యపై ఉన్న పథకానికి వైఎస్ జగన్ ఊపిరిలూదారు. రూ.25 లక్షల వరకు వైద్య సేవల పరిమితితో పథకాన్ని బలోపేతం చేసి, 325 ప్రొసీజర్లను పథకం పరిధిలోకి తెచ్చారు. శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంతి సమయంలో వారికి ఇల్లు గడిచేలా రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.ఐదు వేల చొప్పున ఆరోగ్య ఆసరా సాయం అందించారు. ఈ సాయాన్ని చంద్రబాబు సర్కారు పూర్తిగా ఎత్తేయడంతో పాటు, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. -
కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
-
అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్
-
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం
-
ఎస్సీ, ఎస్టీలకు షాక్.. ఉచిత విద్యుత్ కట్..!
-
Butta Renuka: ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు.. నీ కుట్రలకు ఎవ్వరూ భయపడరు
-
కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి
-
Magazine Story: బాబు అప్పు ఏపీకి ముప్పు
-
ఖాళీ కుర్చీలు జనాలు లేని సభలు కూటమి పతనం మొదలైంది
-
తీరంలో రణన్నినాదం 'పోర్టు పూర్తయ్యే వరకు పోరాటం'
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/టెక్కలి/ సంతబొమ్మాళి/నందిగాం/ టెక్కలిరూరల్: ఉత్తరాంధ్ర తీరంలో అభివృద్ధికి అత్యంత కీలకమైన మూలపేట పోర్టుపై చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్సీపీ రణభేరి మోగించింది. రెండేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేని ప్రభుత్వ అసమర్థతను తూర్పారపట్టింది. చేసిందేమీ లేకపోయినా పోర్టు ఘనత తమదే అంటూ క్రెడిట్ చోరీకి యత్నిస్తున్న చంద్రబాబు కుయుక్తులను కడిగిపారేసింది. శ్రీకాకుళం జిల్లా నౌపడలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి స్థానిక ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా జనం రాకను ఆపలేకపోయారు. పోర్టు పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. నౌపడ జంక్షన్ వద్ద ముళ్లకంచెలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. చుట్టు పక్కల గ్రామాల వద్ద ఎక్కడిక్కడ టిప్పర్లను అడ్డం పెట్టారు. గ్రామాల శివార్లలో బారికేడ్లు పెట్టారు. ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామాల్లోకి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. వాటిన్నింటినీ ఛేదించుకుని సభకు అశేషంగా హాజరయ్యారు. మూలపేట పోర్టు విషయంలో అధికార పార్టీ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని నేతలు తిప్పి కొట్టారు. ఈ పోర్టు పూర్తయ్యేంతవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.జగన్ హయాంలోనే 70 శాతం పూర్తి మూలపేట పోర్టు పనులలో మెజారిటీ భాగం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.4,362 కోట్ల నిధులను సమకూర్చారు. ఫైనాన్షియల్ క్లోజర్ జరిగింది. రుణాలకు బ్యాంకులతో టైఅప్ పూర్తి చేశారు. భూసేకరణ పూర్తిచేశారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ. 149 కోట్లుఖర్చు చేశారు. వీటితోపాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులనూ తెచ్చారు. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగించడంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ పూర్తిచేశారు కాబట్టి ప్రాజెక్టు 70శాతానికి పైగా పూర్తి అయినట్లే. జగన్ హయాంలో పనులన్నీ వేగంగా జరగడాన్ని గుర్తు చేసుకుంటూ.. మళ్లీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదని స్థానికులు పేర్కొంటున్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ బహిరంగ సభకు హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా ఆంక్షలువైఎస్సార్సీపీ చేపట్టిన ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. మూలపేట పోర్టుకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. కనీసం గ్రామస్తులు రావడానికి వీల్లేని విధంగా ఆంక్షలు పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులెవరూ పోర్టు వైపు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నౌపడ జంక్షన్ నుంచి పాలనాయుడుపేట జంక్షన్ వద్ద, యామల పేటకు వెళ్లే రహదారి వద్ద, రాజపురం జంక్షన్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి బయట వ్యక్తులెవరూ పోర్టు ప్రదేశానికి వెళ్లకుండా బారికేడ్లు, ముళ్ల కంచెలతో మోహరించారు. నౌపడ మూడు రోడ్లు జంక్షన్ నుంచి పోర్టుకు వెళ్లే రహదారిలో టిప్పర్లను అడ్డంగా పెట్టి దాని ముందు బారికేడ్లు పెట్టి ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. మూలపేట గ్రామస్తులు కూడా తమ గ్రామానికి వెళ్లాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. కొందరికి జీడి తోటలకు పరిహారం, పీడీఎఫ్ పరిహారం ఇవ్వలేదని, ఇంటి స్థలాలు కూడా కేటాయించలేదని, నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండానే తరలిస్తున్నారని మూలపేట గ్రామస్తులు వైఎస్సార్సీపీ నేతలకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణి, బూడి ముత్యాల నాయుడు, కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, పసుపులేటి బాలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా పరిషత్ చైర్మన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాసరావు, జల్లిపల్లి సుభద్ర, ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ ఎంపీ సత్యవతి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవి బాబు, నర్తురామారావు, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ఎం. విశ్వేశరరాజు, రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కరణం ధర్మశ్రీ, శంబంగి వెంకట చినప్పలనాయుడు, వాసుపల్లి గణేశ్, అదీప్రాజ్, గొర్లె కిరణ్కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేశ్, మళ్ల విజయప్రసాద్, శోభా హైమావతి, భాగ్యలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, కేకే రాజు, జెడ్పీ మాజీ చైర్మన్, జీసీసీ మాజీ చైర్మన్ గులిపల్లి శోభాస్వాతీరాణి తదితరులు హాజరయ్యారు.బహిరంగ సభలో ప్రసంగిస్తున్న శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వేదికపై వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు జగన్కు పేరొస్తుందన్న కక్షతోనే..ఒక ప్రభుత్వం కొనసాగిస్తున్న పనిని తర్వాత ప్రభుత్వం పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్కు పేరు వస్తుందనే కక్షతో మూలపేట పనులు ఆపేసింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం పోర్టులో రీల్స్ చేసుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ భూ సేకరణ, అనుమతులన్నీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చేసింది. రామ్మోహన్ నాయుడికి సమర్థత ఉంటే, తన శాఖ పరిధిలోని విశాఖ ఎయిర్ పోర్టు పనులను రెండేళ్లుగా ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు..? మీ మామూళ్ల కోసం ఇక్కడి పనులు సాగనివ్వరా..? అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నా మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించలేదు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూలపేట పోర్టు పూర్తయి ఉండేది. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే అధికార పక్షం వారు ఇవాళ ప్రజాసంక్షేమం అంటూ మాట్లాడడం సిగ్గుచేటు. పోర్టు పనులను మేం పరిశీలిస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతోంది? భయంతో ఎంతోకాలం మీరు పరిపాలన చేయలేరు. త్వరితగతిన పోర్టు పూర్తి చేయాలి. – బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత టీడీపీ నేతలను తరిమికొట్టాలి..ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ సిక్కోలు వెనుకబాటును రూపుమాపే ప్రాజెక్టులు తీసుకువచ్చారు. టీడీపీ పాతికేళ్ల పాలనలో ఒక్క శాశ్వత ప్రాజెక్టు అయినా తీసుకురాలేదు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాకు ఏం చేశారో చూపగలరా..? మూలపేట పోర్టుకు అవసరమైన ఆర్థిక వనరులు, అనుమతులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వమే తీసుకువచ్చింది. టీడీపీ రెండేళ్లలో నయాపైసా ఇవ్వలేదు. ఏ రోజైతే జిల్లాలో టీడీపీని ప్రజలు తరిమి కొడతారో, ఆ రోజే వీరు భయపడి పనిచేస్తారు. ప్రైవేటు వ్యక్తులు కడుతున్న భోగాపురం ప్రాజెక్టుకు రామ్మోహన్ నాయుడు టూరిస్టులా వెళ్లి తామే కడుతున్నామని అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు రూ.3.50 లక్షల కోట్లు అప్పు తెచ్చి, అందులో రూ.1000 కోట్లైనా ఈ పేద జిల్లాకు పెట్టారా? వైఎస్ జగన్ పోర్టులు, హార్బర్లతో అభివృద్ధి వికేంద్రీకరణకు రూపకల్పన చేశారు. కానీ టీడీపీ నేతలు జిల్లాలో ఇసుక, మట్టి, రాయి దోచుకుంటున్నారు. ఉద్దానం ప్రాంతానికి ఊపిరి పోసే విధంగా కిడ్నీ ఆస్పత్రి, హిరమండలం నుంచి సుజలధార ప్రాజెక్టుల ఘనత వైఎస్ జగన్కే దక్కింది. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి రెండేళ్లలో ఒక్కశాతం పని చేయలేదుకూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా మూలపేట పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో పునరావాసం, భూసేకరణ, అనుమతులన్నీ పూర్తి చేసి కీలకమైన పనులు చేస్తే, వీరు అడ్డగోలుగా తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడానికి చూశారు. బుడగట్ల పాలెం జట్టీ, భోగాపురం అన్నీ జగన్ చలవే. అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసగించడమే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు తెలిసిన పని. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటూ జిల్లాకు ఏమీ చేయకుండా చంద్రబాబు భజన చేయడం సిగ్గుచేటు. వలస వెళ్లి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాల్లో చనిపోతున్న జిల్లా వాసుల కష్టాలను చూసి, పాదయాత్రలో జగన్ తయారుచేసిన బ్లూ ప్రింట్ ఫలితమే మూలపేట పోర్టు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఛాలెంజ్ చేస్తున్నాను.. జిల్లాకు మీరు తెచ్చిన ఒక్క ప్రాజెక్టు అయినా చూపగలరా?. వైఎస్సార్, జగన్ హయాంలోనే జిల్లాకు వంశధార, రిమ్స్, పోర్టు, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీలు వచ్చాయి. అచ్చెన్నాయుడు గారూ.. అసెంబ్లీలో జగన్ను కాల్చేయాలంటున్నారు.. ఎవరిని కాల్చాలి? సంపదనంతా అమరావతిలో కేంద్రీకరిస్తున్న వారినా? లేక అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన జగన్నా..? – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి వైఎస్ జగన్ చేసి చూపించారుమూలపేట పోర్టు పూర్తయితే టెక్కలి ప్రాంతం ముంబైలా అభివృద్ధి చెందుతుంది. గతంలో భారీ భూసేకరణ సాధ్యం కాదని వాయిదా వేసిన ప్రాజెక్టును వైఎస్ జగన్ ఆచరణాత్మక ఆలోచనతో కేవలం 1,800 ఎకరాలతో సాధ్యమని నిరూపించి పనులు ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ సీఎం చేయని పనిని వైఎస్ జగన్ చేసి చూపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. కనీసం పనుల పరిశీలనకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. మూలపేట పోర్టు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, ఫిషింగ్ హార్బర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో వైఎస్ జగన్ జిల్లాపై ప్రేమను చాటుకున్నారు. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడురెండేళ్లవుతున్నా ఎక్కడి పనులక్కడే..దశాబ్దాలుగా టీడీపీ ఎన్నికల అజెండాగా మాత్రమే ఉన్న పోర్టును వైఎస్ జగన్ పట్టాలెక్కించి 70 శాతం పూర్తి చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రెండేళ్లవుతున్నా మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేని అసమర్థతతో ఉంది. పోర్టు పూర్తయితే వైఎస్ జగన్కు పేరు వస్తుందనే కుళ్లుతోనే పనులు ఆపేశారు. గతంలో టీడీపీ 5 వేల ఎకరాలు దోచుకోవాలని చూస్తే, జగన్ మాత్రం తక్కువ భూమితో, అత్యధిక పరిహారం ఇచ్చి ప్రాజెక్టు సాకారం చేశారు. – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎంవాస్తవ రూపంలోకి తెచ్చింది జగనేచాలామంది నేతల్లా శంకుస్థాపన రాయి వేసి వదిలేయకుండా, రూ.4,362 కోట్ల నిధులతో, నిర్వాసితులకు న్యాయం చేస్తూ పోర్టు పనులను వాస్తవ రూపంలోకి తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వాడుకుని 11 పోర్టులు నిర్మిస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందనే ముందుచూపు జగన్ది. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, శ్రీకాకుళంమాట మీద నిలబడని బాబు‘చెప్పాడంటే చేస్తాడు’ అనే క్రెడిట్ జగన్కే దక్కుతుంది. మాట తప్పడం చంద్రబాబు నైజం. 70 శాతం పనులు పూర్తయ్యాక వచ్చి, ఏమీ చేయకుండా కూర్చున్న కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. – మత్స్యలింగం, అరకు ఎమ్మెల్యేబాబాయి, అబ్బాయ్లదే పాపంవలసల జిల్లా శ్రీకాకుళంలో రూ.4,362 కోట్లతో పోర్టు తెచ్చి, 25 వేల మందికి ఉపాధి, అందులో స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా జగన్ జీఓ తెచ్చారు. కానీ కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న బాబాయి, అబ్బాయిలు క్రెడిట్ జగన్కు వెళ్తుందనే కుట్రతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త జగన్ గెలిస్తేనే జిల్లా అభివృద్ధికిడ్నీ ఆస్పత్రి, మంచినీరు, పోర్టు వంటి ప్రాజెక్టులతో జగన్ జిల్లాకు దిక్సూచిలా నిలిచారు. కూటమి పాలనలో ఒక్క మంచి పనీ జరగలేదు. మళ్లీ జగన్ను గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యం. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యేఅన్నీ అబద్ధాలే..కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధించడం, క్రెడిట్ చోరీ మాత్రమే జరుగుతోంది. 71 శాతం పనులు పూర్తయ్యాయని నిర్మాణ సంస్థే చెబుతుంటే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. 40 ఏళ్లుగా మీ కుటుంబం జిల్లాకు చేసిందేమీ లేదు. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్తబాబు చేసింది శూన్యంశ్రీకాకుళం అభివృద్ధికి కీలకమైన వంశధార, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీ, పోర్టు అన్నీ వైఎస్ జగన్ తెచ్చినవే. 17 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు జిల్లాకు ఇచ్చింది శూన్యం.– చింతాడ రవికుమార్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఈ పోర్టుజిల్లా ప్రజల చిరకాల వాంఛ మూలపేట పోర్టు. ఈ కలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్దే. తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాన్ని వైఎస్ జగన్ మొదలుపెట్టారు. ప్రధానంగా 4 పోర్టుల నిర్మాణం, 8 ఫిషింగ్ హార్బర్స్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన వైఎస్సార్సీపీది. కూటమి నేతలు మూలపేట పోర్టును తామే నిర్మించామని ప్రగల్బాలు పలకడానికి సిగ్గులేదా..? – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుమూలపేట కీలకంమూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాల్సిన అవసరం ప్రతిపక్షాలపై ఉంది. ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న శ్రీకాకుళం జిల్లా నుంచి దీనికి నాంది పలకడం చాలా సంతోషం. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు ఉన్నా ఏ ఒక్క అభివృద్ధి పనికీ శ్రీకారం చుట్టకపోగా గత ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తిచేసేందుకు ముందుకు కూడా రాకపోవడం దారుణం. – బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ -
దేవుడి భూములను దోచి పెడతారా?.. ధ్వజమెత్తిన బీజేపీ
సాక్షి, అమరావతి: దేవాలయాల భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూటమిలో మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నే తూర్పారపట్టింది. ప్రస్తుతం దేవాలయాల భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయంటూ బీజేపీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రైవేటు వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి అనే పేరుతో దేవాలయాలకు చెందిన లక్షన్నర ఎకరాలకు పైగా భూములను సరైన దర్యాప్తు, సర్వే చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం.ఇది హిందూ సమాజానికి, ఆలయాల రక్షణకు తీవ్ర ప్రమాదకరం. ఈ చర్యలతో ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయి’ అని స్పష్టం చేసింది. 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల పేరుతో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే విధానం కూడా పూర్తిగా తప్పు అని చెప్పింది. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవలసిన దుస్థితి వచ్చిందని దుయ్యబట్టింది. ఆలయాల భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా, వాటిని దారి మళ్లించాలి, దోచి పెట్టాలి అనే ధోరణి హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోందని, ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమని పేర్కొంది.ఇది అత్యంత ప్రమాదకరంహిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. అభివృద్ధి పేరుతో హిందూ ఆలయ భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదు. ఈ భూములు ఆలయాలకే చెందాలి. ఇదే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అభిప్రాయం.ఆలయాల భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది’ అని పేర్కొంది. ఈ భూములపై నిష్పక్షపాత, పూర్తి స్థాయి సర్వే చేసి, ప్రైవేటు సర్వే నంబర్లలో కలిసిపోయిన భూములను, ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలని, అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న దేవదాయ శాఖ భూములను దీర్ఘకాలిక లీజులివ్వడం కాకుండా స్వల్పకాలిక లీజులకు ఇవ్వాలని చెప్పింది.గుళ్ల ద్వారా భారీ ఆదాయమొస్తున్నాపండుగలు జరిపేది ఇలాగేనా? దేవాలయాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని బీజేపీ తెలిపింది. ఆలయాల ఆదాయం నుంచి ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్, అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ తీసుకుంటుందని గుర్తు చేసింది. దేవాలయాల ఆదాయం పూర్తిగా అవే ఆలయాల అభివృద్ధికి వినియోగించేలా చట్టపరమైన హామీ ఇవ్వాలని, ఆలయాల పండుగల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్లలో వినతిపత్రాలు హిందూ దేవాలయ భూముల రక్షణ – ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై సోమవారం బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో వినతిపత్రాలు సమరి్పంచినట్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది. ‘ఇది వినతిపత్రం కాదు.. హిందూ సమాజం యొక్క గళం. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటుంది అని భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది’ అని పేర్కొంది. -
టిడ్కో ఇళ్లల్లోనూ కీర్తి చోరుడు.. బాబు ‘హోం’కరింపులు
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా తన ఖాతాలో వేసుకోవడంలో సిద్ధహస్తుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పంపిణీ చేసిన టిడ్కో ఇళ్ల పట్టాలపై ‘2019–20 సంవత్సరంలో నిర్మించిన ఇళ్లు’ అని స్పష్టంగా కనిపించడం చూసి సభలోని వారే ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 21 నెలల్లో రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసిందని, గతేడాది నవంబర్లో 3 లక్షల ఇళ్లను పేదలకు అప్పగించిందని బాబు చెప్పడం విని విస్తుపోయారు.రెండో విడతలో భాగంగా నాయుడుపేట మండలం, పుదూరు నుంచి లక్ష టిడ్కో ఇళ్లతోపాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్టు గొప్పలుపోవడంపై నివ్వెరబోయారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లకు రంగులు వేసి తానే కట్టించినట్టు చెప్పుకోవడం చూస్తుంటే బాబు క్రెడిట్ చోరీలో తనకు తానే సాటి అనేలా ఉందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు ‘కట్టు’కథల కనికట్టు 2015–16 మధ్య చేపట్టిన టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులను నాటి టీడీపీ ప్రభుత్వం దోపిడీకి పరాకాష్టగా మార్చేసింది. ఆ సంవత్సరం కేంద్రం 1,37,533 ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 81 మాత్రమే పూర్తి చేశారు. 2017–18లో 2,39,062 ఇళ్లు మంజూరు చేస్తే 25,818 పూర్తిచేశారు. నాడు చంద్రబాబు రాష్ట్రంలో ఏ నగరంలో లేనంతగా నిర్మాణ ధరలు పెంచి అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు.అయినప్పటికీ మంజూరైన ఇళ్లల్లో ఐదు శాతం కూడా నిర్మాణం పూర్తిచేయనేలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అరకొరగా నిర్మించిన ఇళ్లను హడావుడిగా లబ్ధిదారులకు అప్పగించి ఏదో చేసేసినట్టు బిల్డప్ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2019 మే నాటికి కేంద్ర ప్రభుత్వం 4.91 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 77,350 ఇళ్ల నిర్మాణం కోసం పునాదులు వేసి వాటిలో 20 వేల ఇళ్లు మాత్రమే అందులోనూ 60 శాతం పనులే చేశారు. జగన్ ప్రభుత్వంలోనే 1,77,546 ఇళ్లు పూర్తి 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ హయాంలోనే టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం జరిగింది. ప్రతిచోటా ఇళ్ల నిర్మాణంతో పాటు నూరు శాతం మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించారు. మొత్తం 2,62,212 ఇళ్లు అవసరమని గుర్తించి వాటిలో 1,77,546 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు దాదాపు లక్ష ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ విషయం మున్సిపల్శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు కూడా. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనుల్లో దాదాపు 80 శాతం పూర్తి చేశారు. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన 21 నెలల పాలనలో టిడ్కో ఇళ్లకు ఎక్కడా స్లాబులు వేసిన దాఖలా లేదు. కానీ క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.ఆ 1.5 లక్షల ఇళ్లు గత ప్రభుత్వంలో నిర్మించినవే రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఉచితంగా పంచింది. ఆ ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ రూ.1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు.అంతేకాకుండా జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. కాగా, ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు స్లాబ్ పూర్తయిన, 99 వేల ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. ఇందులో చాలా వరకు తుది దశ నిర్మాణాలూ పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయని పరిస్థితి నెలకొంది. జగన్ హయాంలో పూర్తయితే బాబు షో వైఎస్ జగన్ హయాంలో పూర్తయిన ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. గతేడాది నవంబర్లో పేదలకు 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరిట షో చేశారు. అప్పట్లో అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్లు జగన్ ప్రభుత్వం 2021–22లో కట్టినవే కావడంతో అప్పట్లో బాబు ప్రభుత్వం అభాసుపాలైంది.అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గని బాబు సర్కార్ సోమవారం మరో 2.5 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ పేరిట మరోమారు దు్రష్పచారానికి తెరలేపింది. ఈ 2.5 లక్షల ఇళ్లలో లక్ష గత ప్రభుత్వంలోనే పూర్తి చేసిన టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 1.5 లక్షల ఇళ్లు కూడా గత ప్రభుత్వంలో నిర్మించిన సాధారణ ఇళ్లు కావడం గమనార్హం. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన బాబు నేటికీ ఒక్క గజం స్థలం పేదలకు ఇవ్వలేదు. -
ఖాళీ కుర్చీలు.. బాబు సభ అట్టర్ ఫ్లాప్
-
పడిపోతున్న పల్లీ ధరలు.. పట్టించుకోని బాబు సర్కార్
-
అమరావతి ముందు సింగపూర్ దేనికి పనికిరాదు.. భూములు ఇవ్వండి.. నిండా మునగండి
-
ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం.. మొరాయిస్తున్న 108 వాహనాలు
-
ఆంధప్రదేశ్లో ప్రభుత్వ ‘రియల్’ దందా.. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ పందేరం
-
ఇదేంది సామీ.. సర్కారే ‘రియల్’ దందా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు సర్కార్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా దోచి పెడుతోంది. పర్యాటక ప్రాజెక్టుల పేరుతో కనీసం ఆతిథ్య రంగంలో అనుభవం లేని సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ భూములు కొల్లగొడుతోంది. పర్యాటక విధానం 2024–29 పేరిట ఏకంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కోరినంత భూమిని.. అడిగిన రేటుకు మారు మాట్లాడకుండా కట్టబెడుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అత్యంత ఖరీదైన ప్రభుత్వ, పర్యాటక భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు కోసం తిరుపతి రూరల్ మండలంలోని దామినీడులో ఏకంగా రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన 22 ఎకరాల భూమిని కారు చౌకగా కేటాయించడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది.కారుచౌకగా కట్టబెట్టేలా స్కెచ్పర్యాటక ప్రాజెక్టుల పేరుతో నచ్చినోళ్లకు నచ్చిన చోట విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను చంద్రబాబు సర్కార్ ధారాదత్తం చేస్తోంది. ఇప్పటి వరకు 99 ఏళ్లకు లీజు పేరుతో శాశ్వతంగా భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్న సర్కార్.. తాజాగా మరో అడుగు ముందుకేసి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు (ఎస్ఆర్వో) ప్రకారం రేటుకట్టి.. ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాదాక్రాంతం చేస్తోంది. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టులో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించిన 22 ఎకరాల భూమి విలువ రూ.వెయ్యి కోట్లు పైమాటే. వాస్తవానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ప్రభుత్వ భూములు ఎక్కడా లేవు. ఈ క్రమంలో తిరుపతి రూరల్ మండలం దామినీడులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములకు అత్యంత డిమాండ్ నెలకొంది. అలాంటి చోట ఎకరం బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్ల వరకు ఉంటే చంద్రబాబు మాత్రం రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎస్ఆర్వో రేటుకు అమ్మేస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు భూములు కేటాయించడంతో పాటు పలు రాయితీలు కల్పిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రైవేటు సంస్థ కోరితే.. భూమి అమ్మేస్తారా?దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రెండూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాయి. ఈ సంస్థలు.. భవనాలు నిర్మించి అద్దెకు ఇచ్చి వ్యాపారం చేసుకోవడం, క్రయవిక్రయాలు చేయడం తప్ప ఆతిథ్య రంగంలో హోటళ్ల నిర్వహణ, హాస్పటాలిటీలో ఎటువంటి అనుభవం లేదని తెలుస్తోంది. అలాంటి ఈ సంస్థలు ‘తిరుపతి వన్’ ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కల్చరల్, ఎంఐసీఈ (సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు) డెస్టినేషన్ సెంటర్ను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.1,226.32 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని ఇందుకు 22 ఎకరాల భూమి ఇవ్వాలని కోరాయి. ఈ భూమిని లీజుగా కాకుండా శాశ్వతంగా విక్రయించాలని కోరగా, అందుకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. పెట్టుబడిదారు అభ్యర్థన మేరకు ప్రభుత్వం సబ్ రిజిస్టర్ విలువ ప్రకారం అప్పనంగా భూములు కట్టబెట్టడంపై ఆర్థిక వేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి వన్ ప్రాజెక్టులో భాగంగా ఏడు ఎకరాల్లో ఎంఐసీఈ కాంప్లెక్స్, మరో ఏడు ఎకరాల్లో 300 గదుల వెల్నెస్ జోన్, 250 గదులతో టైమ్ షేర్ సదుపాయం, 4 ఎకరాల్లో రెండు హోటళ్లతో హాస్పటాలిటీ జోన్ (5స్టార్ 200 గదులు, 3 స్టార్ 150 గదులు), 2 ఎకరాల్లో మల్టీప్లెక్స్ జోన్, 2 ఎకరాల్లో కల్చరల్ థీమ్ పార్కు నిర్మిస్తామని చెబుతోంది.రూ.300–400 కోట్ల ప్రోత్సాహకాలు⇒ చంద్రబాబు సర్కార్ తిరుపతి వన్ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని కారు చౌకగా ఇవ్వడమే కాకుండా అనేక ప్రోత్సాహకాల కింద రూ.వందల కోట్లు తిరిగి చెల్లించనుంది. కేపిటల్ సబ్సిడీ కింద రూ.40 కోట్లు ప్రభుత్వమే సంస్థకు ముట్టజెప్పుతోంది. దీంతో పాటు 15 ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, భూమి కొనుగోలు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రీయింబర్స్, ఐదేళ్లు పరిశ్రమ రేట్లకే విద్యుత్, ఐదేళ్లు విద్యుత్ సుంకం రీయింబర్స్.. ఇలా ప్రోత్సాహకాలన్నీ కలిపి ఏకంగా రూ.300–400 కోట్ల వరకు లబ్ధి చేకూరుస్తోంది. ⇒ వాస్తవంగా ఈ ప్రోత్సాహక మొత్తాన్ని చూస్తే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎస్ఆర్వో విలువ ప్రకారం విక్రయించే భూమి రేటు కంటే అధికంగా ఉండటం గమనార్హం. రూ.1,226.32 కోట్ల ప్రాజెక్టుకు ఏకంగా రూ.వెయ్యి కోట్ల భూమి ఇవ్వడమే కాకుండా రూ.300–400 కోట్లు విలువైన ప్రోత్సాహకాలతో కలుపుకుని రూ.1,300–1,400 కోట్లు లబ్ధి చేకూరుస్తోంది.⇒ పైగా పెట్టుబడిదారులకు ఆస్తి భరోసా కల్పించడం ద్వారా ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికన భూమిని కేటాయించడంతో వాళ్లకు దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ను పొందడానికి, అంతర్జాతీయ హాస్పిటాలిటీ, వెల్నెస్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో సహా ప్రపంచ వ్యాప్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి వీలు కలుగుతుందని ఉచిత సలహా ఇస్తోంది. రేపో మాపో అధికారిక సర్వే నిర్వహించి 22 ఎకరాల భూమిని తిరుపతి వన్ ప్రాజెక్టు కోసం అప్పగిస్తామని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు వేలం వేయలేదు?రాష్ట్రంలో ఎక్కడైనా సరే విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విషయంలో చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వ్యవహరిస్తుంది. పొరుగునే ఉన్న తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వేలం నిర్వహించి, ఎక్కువ రేటు ఇచ్చే సంస్థలకు ఆయా ప్రభుత్వాలు భూములను అప్పగిస్తున్నాయి. తద్వారా పోటీ పెరిగి మంచి ధర వస్తుంది. తిరుపతి లాంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరంలో హోటళ్లకు గానీ, భక్తులకు సంబంధించిన వసతుల కోసం గానీ.. ఏ ప్రాజెక్టుల కోసమైనా సరే ఇచ్చే భూములకు వేలం నిర్వహిస్తే మంచి ధర వస్తుందనే విషయం తెలిసీ కూడా ప్రభుత్వం ఏకపక్షంగా, కారుచౌకగా భూములు కట్టబెట్టడం వెనుక అవినీతి, బినామీ బాగోతం దాగి ఉందని ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ డ్రామా.. రాజధాని, ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికే కూటమి సర్కారు పన్నాగం...
-
రెండో విడత పూలింగ్ కోసమే ఈ నాటకం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: అమరావతిపై ఇప్పటికే ప్రజల్ని నిండా ముంచుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. అమరావతి చట్టబద్ధత పేరుతో పెద్ద డ్రామా నడిపించిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘రెండోదశలో మరో 50వేల ఎకరాలు తీసుకునేందుకే తీర్మానం పేరిట అసెంబ్లీలో డ్రామా ఆడారు. అసెంబ్లీలో ఆరుగంటల పాటు కూటమి నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్ధత రాదు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవ సరం లేదా?. అన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను, అమరావతి రైతులను మోసగించటానికి, మభ్యపెట్టడానికే చంద్రబాబు ఈ డ్రామాలు, నాటకాలు’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘అమరావతి రాజధాని అని చెప్పేందుకు ఒక్క అధికారిక పత్రం లేదని చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి చెప్పింది. ఈ విషయం ఈనాడు పత్రికే రాసింది. (ఈ సందర్భంగా ఈనాడు ప్రతిని పేర్ని నాని చదివి వినిపించారు) అందుకే హడావిడిగా కేబినెట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టారు. నిజంగానే అమరావతికి చట్ట బద్ధత కల్పించాలంటే శాసనమండలి అవసరం లేదా? మండలిని ఎందుకు సమావేశ పరచలేదు? ఒక చట్టం కావాలంటే శాసన వ్యవస్థలో భాగమైన మండలి అనుమతి అక్కర్లేదా? ఉభయ సభలు ఆమోదం తెలపకుండా చట్టం ఎలా అవుతుంది? వాస్తుకోసమే అమరావతిని ఎంపిక చేసుకున్నానని చంద్రబాబు చెప్పారు. మరి అలాంటప్పుడు రెండో దశ విస్తరణలో వాస్తు వ్యతిరేక దిశలో ఎందుకు వెళ్తున్నారు? ఇది అరిష్టంకాదా? అమరావతి ఆలోచనను చంద్రబాబు చేసినప్పుడే ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్నారు. ఈ ప్రశ్నలంటికీ చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు కాబట్టే విజయవాడలో బస్సులో పడుకోవాల్సి వచ్చింది. విజయవాడలో ఉండడానికి ఇళ్లు, హోటళ్లు ఉన్నాయి, కాని బస్సులో పడుకున్నారంటే అదికూడా ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన డ్రామానే. బస్సులో పడుకునే ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని చెప్తున్నారు, అది నిజమే, ఎందుకంటే మిగతావాళ్లు వాస్తవానికి దగ్గరగా ఉంటారు. వాస్తవానికి దూరంగా ఉండేది, డ్రామా చేసేది చంద్రబాబు మాత్రమేనని పేర్ని నాని దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...సెల్ఫ్ ఫైనాన్స్ కాదు. మొత్తం అప్పులకుప్ప..అమరావతిలో 29,966 మంది రైతుల వద్ద నుంచి 34,400 ఎకరాలు సేకరించి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు కదా? కానీ, వాస్తవాలు ఏమిటి? 2014–2019 మధ్యలో రూ.5,335 కోట్లు అప్పు తెచ్చారు. హడ్కో నుంచి రూ.1,275 కోట్లు తెచ్చారు. దానికి అసలు, వడ్డీ కలిపి ఏటా రూ.106 కోట్లు చెల్లించాలి. అమరావతి పేరుతో ముంబై వెళ్లి గంట కొట్టి రూ.2 వేల కోట్ల అప్పు తెచ్చారు. పదేళ్లకు బాండ్లు తాకట్టు పెట్టి ఆ అప్పు తీసుకున్నారు. దానికి ఏటా అసలు, వడ్డీ కలిపి రూ.886 కోట్లు చెల్లించాలి. ఆరు బ్యాంకుల నుంచి రూ.2,060 కోట్లు అప్పులు ఇచ్చాయి. దానికి అసలు, వడ్డీ కింద ఏటా రూ.124 కోట్లు 14 ఏళ్ల పాటు చెల్లించాలి. మొత్తం రూ.5,335 కోట్లు 2014–2019 మధ్య అప్పులు చేశారు. ఇంకా 2024–25లో అమరావతి పేరుతో మీరు చేసిన అప్పులు చూస్తే.. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు, నాబ్ఫిడ్ నుంచి రూ.7,500 కోట్లు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.8,887 కోట్లు.. అన్నీ కలిపి మొత్తం రూ.47,387 కోట్లు మంజూరు చేసుకుని, అందులో రూ.13 వేల కోట్లు డ్రా చేసుకున్నారు. ఈ రెండేళ్లలో ఆ డబ్బులో రూ.5,500 కోట్లు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్గా ఇచ్చారు. రూ.2,500 కోట్లు బిల్లులు చెల్లించారు. రూ.960 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించారు. అలాంటి మీరు డైవర్షన్ గురించి, మితిమీరిన అప్పుల గురించి జగన్ని విమర్శిస్తారా? అమరావతి పేరుతో రైతులను ముంచింది, రాష్ట్ర ప్రజలను అప్పుల్లోకి నెట్టింది, మెడకు అప్పుల గుదిబండ వేసింది చంద్రబాబు కాదా?రాజధానికి భూములు కొనేస్తే వేల కోట్ల ఆదా...రైతుల్ని ఏడిపించి ఇలా పూలింగ్ చేసే బదులు ఉండవల్లి నుంచి రోడ్డు వేసుకుని కృష్ణాయపాలెం దాటాక రాజధాని పెట్టుకుంటే ఈ 15 వేల ఎకరాలు, ఎకరం కోటి చొప్పున∙కొన్నా రూ.15 వేల కోట్లు ఖర్చవుతాయి. ప్రభుత్వానికి 7500 ఎకరాలు మిగులుతుంది. ఈరోజుకీ రూ.21 వేల కోట్లు చెట్లు పీకడానికో, పునాదులకో ఖర్చు పెట్టారు. అందుకే ఏకంగా రూ.13 వేల కోట్లు 20 నెలల్లో డ్రా చేసి ఖర్చు పెట్టారు. పెన్షన్లు, కౌలు కింద కూడా కలుపుకుంటే మొత్తం రూ.21 వేల కోట్లవుతోంది. దానికి బదులు రూ.15 వేల కోట్లు తెచ్చి పొలాలు కొనేస్తే, 7500 ఎకరాలు మిగిలేది, మరో నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని నిర్మాణం పూరయ్యేది.అమరావతికి న్యాయం చేసింది జగన్...అమరావతికి వాస్తవంగా న్యాయం చేసింది మాజీ సీఎం జగనే. పశ్చిమ బైపాస్ను తీసుకొచ్చి దారీ తెన్నూ లేకుండా ఉన్న అమరావతికి గుంటూరు, విజయవాడతో లింక్ చేసింది ఆయనే కదా. చంద్రబాబు, పవన్కళ్యాణ్కు అమరావతిలో ఇప్పటికీ సొంత ఇళ్లు లేవు. మూడు ముక్కలాట ఆడారని విమర్శలు చేస్తున్న వారు అమరావతి విలువలు పెంచేస్తే సాధారణ ప్రజలు ఇక్కడికి ఎలా వస్తారు? జన జీవనం లేని రాజధానిగా అమరావతి మిగిలిపోవాలా? పేద వాళ్లకు అమరావతిలో జగన్ ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అడ్డుకుని రద్దు చేశారు. అమరావతిలో పట్టుమని వెయ్యి మంది వచ్చే ఆఫీసు ఒక్కటైనా కడుతున్నారా? బ్యాంకులు ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది ఎంత మందో తెలియదా? అమరావతిలో 5 శాతం కంటే తక్కువ నిధులు ఖర్చు పెట్టారు. దీన్ని పూర్తిగా నిర్మించాలంటే రాష్ట్రం అప్పుల పాలవ్వాలా? రాష్ట్ర విభజన కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ తీర్మానం పెడితే జగన్ ఎక్కడున్నారో తెలియదంటున్న చంద్రబాబుకు.. ఆరోజు ప్లకార్డులతో ఆయన నిరసన తెలియచేసిన విషయం తెలియదా?, (అంటూ ప్రెస్మీట్లో ఆ ఫోటో చూపారు) చివరకు, అమరావతిలో జరిగిన అగ్నిప్రమాదాలనూ మాపైకి నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో కాపలాదారే కాల్చాడని పోలీసులే చెప్పారు. అయినా సరే చంద్రబాబు బురదజల్లుతున్నాడు. 80 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నీచంగా ఆలోచిస్తున్నాడు.ఈ తీర్మానాలు కూడా చేసి పంపండి..ఎలాగో అమరావతిపై రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్లో సవరిస్తున్నారు కాబట్టి పనిలో పనిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కూడా తీర్మానం చేయాలి. కనీసం కేబినెట్ తీర్మానం చేసి పంపినా సరిపోతుంది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు గనుల్ని కేటాయించాలని కేబినెట్ తీర్మానం చేసి పంపాలి. కేంద్రం కట్టాల్సిన దుగ్గరాజపట్నం స్ధానంలో కట్టుకున్న రామాయపట్నం పోర్టుకు ఖర్చుపెట్టిన నిధుల్ని రీయింబర్స్ చేయమని కేంద్రాన్ని అడగండి. కేంద్రం వద్ద మీ పరపతి కేవలం మీ కేసుల కోసమే కాదు వీటి కోసం కూడా వాడండి. మొత్తం మీద ఇవన్నీ కలిపి పార్లమెంట్లో చట్ట సవరణ చేయించాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ భూమిపై పచ్చ రాబందులు
పుల్లంపేట: టీడీపీ నేతల భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. అధికారం అండతో తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో కోట్ల రూపాయల విలువైన 133 ఎకరాల ప్రభుత్వ భూమిపై రాబందుల్లా వాలిపోయారు. పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించేసుకున్నారు. చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేసేశారు. వారి ఆక్రమణలను అడ్డుకున్నందుకు దళితులపై అక్రమంగా కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుల్లంపేట మండలంలోని దళవాయిపల్లి సర్వే నంబర్ 225లో వంద ఎకరాలు, వత్తలూరు సర్వే నంబర్ 1042, 1055లో 24 ఎకరాలు, తిప్పాయిపల్లి సర్వే నంబర్ 1094/6లో 9 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చెట్టు, పుట్టలతో ఉన్న ఈ భూమిని స్థానిక నిరుపేదలైన దళితులు చదును చేసుకుని సాగు చేసుకునేవారు. విలువైన భూములు దళితుల సాగు చేసుకోవటం జీర్ణించుకోలేని టీడీపీలోని పెత్తందారులు వారిపై దౌర్జన్యాలకు తెగబడేవారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ భూములను ఆక్రమించుకున్నారని 15 మంది దళితులపై కేసులు నమోదు చేయించారు. అప్పటి నుంచి టీడీపీ నేతలు, దళితుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకునేవి.వైఎస్సార్సీపీ హయాంలో దళితులకు భూ పంపిణీకి ఏర్పాట్లు2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్లకు 2022లో ఆ పార్టీ నాయకులు ఇరు వర్గాల మధ్య రాజీ చర్చలు జరిపి కేసులు వెనక్కు తీయించుకునేలా కృషి చేశారు. నిరుపేద దళితుల జీవనాధారం కోసం సాగు చేసుకున్న ప్రభుత్వ భూములను వారికే పంపిణీ చేయాలని 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని సాంకేతిక కారణాల కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమైంది. 2024లో ప్రభుత్వం వచ్చిన వెంటనే పంపిణీ చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దళితుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ప్రభుత్వం మనదే కదా అని టీడీపీ నేతలు మళ్లీ రంగంలోకి దిగారు. ముగ్గురు టీడీపీ నాయకులు ప్రభుత్వ భూముల్లోకి చొరబడి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఆపై రాత్రికి రాత్రే భూముల చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ నేతల భూ ఆక్రమణ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు కంచె తొలగించారు. అయినప్పటికీ దళితులపై దౌర్జన్యానికి దిగి... వారిపైనే టీడీపీ నాయకులు కేసులు పెట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడంతోపాటు తమపై దౌర్జన్యానికి దిగారని దళితులంతా కలిసి శనివారం పుల్లంపేట పోలీస్ స్టేషన్కు చేరుకుని న్యాయం చేయమని వేడుకున్నారు. అదేవిధంగా టీడీపీ నేతల దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశారు.ప్రభుత్వ భూమి అమ్మకానికి పెట్టేసిన పోలీసులుపుల్లంపేట మండలం తిప్పాయిపల్లిలోని 9 ఎకరాలను ఓ పోలీసు అధికారి ఏకంగా అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. తొమ్మిది ఎకరాలు రూ.40 లక్షలకు బేరం కుదిరినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?మాది వత్తలూరు హరిజనవాడ. భూమి లేని పేదవాళ్లం. 2012 నుంచి ఆ భూమిలో పంటలు సాగు చేస్తున్నాం. టీడీపీ ప్రభుత్వంలో మాపై కేసులు పెట్టారు. కోర్టుల చుట్టూ తిరిగాము. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక కోర్టులో రాజీపడ్డాం. పంటలు సాగు చేసుకుంటూ వచ్చాం. 2024లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దౌర్జన్యంగా రాత్రికి రాత్రే టీడీపీ నాయకులు భూములను ఆక్రమించి తిరిగి మాపైనే కేసులు నమోదు చేయించారు. ఇదెక్కడి న్యాయం?– నల్ల బ్రహ్మయ్య, పుల్లంపేట మండలంజీవితమంతా పోరాటమే గత 20 ఏళ్లుగా భూమి కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మేము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వమని వేడుకుంటున్నాం. చుట్టుపక్కల గ్రామాల్లో వందలాది ఎకరాల భూములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. పేదవాళ్లు భూమి కావాలంటే ఇన్ని కష్టాలా?– ఎస్.జయమ్మ, వత్తలూరుమాపైనే అక్రమ కేసులుమా నాన్న గారు ఉన్నప్పటి నుంచి భూమి కోసం పోరాడుతున్నాం. ఈ భూమి కోసం పోరాడి పోరాడి మా నాన్న కూడా మరణించాడు. భూమి మాత్రం ఇవ్వలేదు. అక్రమ కేసులు మాత్రం నమోదు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – ఎస్.మహేష్, వత్తలూరు గ్రామం -
బాబు సర్కారు డైవర్షన్ డ్రామా!
సాక్షి, అమరావతి: రాజధానిలో రైతుల సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వాటి నుంచి తప్పించుకునేందుకు మరోసారి సరికొత్త డ్రామాకు తెరలేపింది. ఎన్నెన్నో సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుతంత్రానికి పాల్పడుతోంది. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్ల తర్వాత రాజధానికి చట్టబద్ధత అంశం గుర్తుకొచ్చినట్లు నటిస్తోంది. ప్రజా సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించేలా అమరావతికి చట్టబద్ధత పేరుతో చట్టవిరుద్ధ తీర్మానం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, మేధావులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. శాసన మండలిని హాజరు పరచకుండా అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేయడాన్ని ఇందుకు నిదర్శనంగా ఎత్తి చూపుతున్నారు. ‘రాజధాని పేరుతో సాగుతున్న అవినీతిపై చర్చ జరగాలి.. ఇప్పటిదాకా ఎలా దోచుకున్నారో, ఎలా దోచుకోబోతున్నారో చర్చ జరగాలి.. ఏ రైతుకు ఎక్కడ ఏ ప్లాటు ఇచ్చారో చర్చ జరగాలి.. ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేయడంపై చర్చ జరగాలి.. సమస్యల పరిష్కారం కోసం రాజధాని రైతులు సీఆర్డీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటంపై చర్చ జరగాలి.. ఏడేళ్లు మీరే అధికారంలో ఉన్నా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వక పోవడంపై చర్చ జరగాలి.. రెండవ, మూడవ విడత భూ సేకరణ యత్నాలపై చర్చ జరగాలి.. రాజధాని పేరుతో ఎంత అప్పు చేశారో.. భవిష్యత్తులో ఇంకా ఎంత అప్పు తెస్తారో చర్చ జరగాలి.. ఆ అప్పుల్లోంచి ఎంత దోచుకున్నారో.. దోచుకోబోతున్నారో కూడా చర్చ జరగాలి.. సూపర్ సిక్స్ హామీలపై, కాంట్రాక్టుల్లో కమీషన్లపైనా చర్చ జరగాలి.. రైతులు, విద్యార్థి, ఉద్యోగ వర్గాల సమస్యలపై చర్చ జరగాలి’ అని ప్రజలు, మేధావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని సమస్యలను గాలికొదిలేసి ఒక్క జగన్ను తిట్టడానికే అసెంబ్లీ సమావేశమా? అని నిలదీస్తున్నారు. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం తన వైఫల్యం నుంచి తప్పించుకునేందుకే ఈ ఎత్తుగడ అంటూ మండిపడుతున్నారు. ఇది చట్ట ధిక్కరణేఅమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన తీర్మానం చట్టాన్ని ధిక్కరిస్తున్నట్లుగా ఉందని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు చట్టాలు, రాజ్యాంగం గురించి గొప్పగా చెబుతూనే వాటికి తిలోదకాలు ఇచ్చేలా తీర్మానం చేయడాన్ని ఎత్తి చూపుతున్నారు. రాష్ట్ర శాసన వ్యవస్థలో శాసనసభ, శాసన మండలి భాగంగా ఉంటే, కేవలం శాసనసభలో మాత్రమే ఈ తీర్మానం ఎలా చేస్తారనే ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కరువైంది. సాధారణంగా ఈ రెండు సభలు ఎప్పుడూ సమాంతరంగా జరుగుతాయి. ప్రత్యేక సెషన్ పేరుతో కేవలం అసెంబ్లీని మాత్రమే నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. ఒక సభలో మెజారిటీ ఉండి, రెండవ సభలో లేనప్పుడు.. రెండవ సభను కావాలనే హాజరు పరచకపోవడం చట్టసభల సమగ్రతను దెబ్బ తీయడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఒక అంశానికి పూర్తి స్థాయి చట్టబద్ధత రావాలంటే.. అది బిల్లు రూపంలో ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. తీర్మానం అయినా ఉభయ సభలు చేస్తేనే దానికి నైతికత ఉంటుంది. కేవలం ఒక సభ మాత్రమే తీర్మానం చేస్తే, అది ఆ సభలోని అధికార పార్టీ రాజకీయ తీర్మానంగానే మిగిలి పోతుందనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబు ఇప్పుడు అమరావతి చట్టబద్ధత కోసం అంటూ చేసిన తీర్మానం రాజకీయ తీర్మానంగానే మిగిలిపోయింది. శాసన మండలిని బైపాస్ చేస్తూ చేసిన ఈ తీర్మానం ఒక రాజకీయ గిమ్మిక్కే తప్ప అందరి ఆమోదంతో చేసింది ఎలా అవుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.అమరావతి కుంభకోణాలు బయట పడతాయని భయం రాజధాని అమరావతి ముసుగులో జరుగుతున్న వేల కోట్ల రూపాయల అవినీతిని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు శనివారం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించలేదని స్పష్టమవుతోంది. రాజధాని ముసుగులో 2014–19లోనే ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి, వేల ఎకరాల భూములను తను, తన బినామీల గుప్పిట్లో పెట్టుకున్నారు. కాంట్రాక్టుల ముసుగులో అప్పట్లోనే వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇప్పుడు ఆ భూములకు రేట్లు పెరిగేలా హంగామా చేయడం, నిర్మాణాల పేరుతో రెట్టింపు అంచనాలతో భారీగా కమీషన్లు తీసుకోవడం, ఇందుకోసం భారీగా అప్పులు తెస్తున్న ఉదంతాలన్నీ చర్చకు వస్తాయనే కౌన్సిల్ సమావేశం జరపకుండా కేవలం అసెంబ్లీ సమావేశం మాత్రమే పెట్టి తీర్మానం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్పై బురదజల్లడానికి పోటాపోటీ ఈ తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చ ఆద్యంతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగానే సాగింది. ఆయనపై బురదజల్లి లబ్ధి పొందడానికి చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నించగా.. వారిని బుట్టలో వేసుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడి జగన్పై తిట్ల వర్షం కురిపించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరీ బరితెగించి జగన్పై నోరు పారేసుకోవడం చూసి అధికార పార్టీ నాయకులే ఆశ్చర్యపోయారు. 2019 ఎన్నికల్లో జగన్కు ఓట్లేసి ప్రజలు తప్పు చేశారంటూ ప్రజాభిప్రాయాన్ని సైతం గౌరవించకుండా వారినీ ఆడిపోసుకోవడం చూస్తే అధికార గర్వం అచ్చెన్నాయుడి తలకు ఏ స్థాయిలో ఎక్కిందో అర్థమవుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభలో ఆయన ఇంత అడ్డగోలు భాష మాట్లాడడం వెనుక మంత్రి పదవిని రక్షించుకునే ఆరాటం ఉందని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఆయన మంత్రి పదవి ఊడిపోయేలా ఉండడంతో ఎలాగైనా లోకేశ్ను ప్రసన్నం చేసుకునేందుకు జగన్పై చెలరేగిపోయినట్లు ఎమ్మెల్యేలు చర్చించుకోవడం గమనార్హం. తిన్నింటి వాసాలు లెక్కపెట్టామన్న వసంత, యార్లగడ్డవంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, రెడ్డప్పగారి మాధవిరెడ్డి తదితరులు జగన్ను తిట్టడానికి పోటీ పడ్డారు. వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావులు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు తమ ప్రసంగాల ద్వారా చాటారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉంటూనే చంద్రబాబుకు మద్దతుగా వాదన వినిపించామని నిస్సిగ్గుగా వారిద్దరూ సభలో చెప్పుకోవడం విశేషం. అప్పట్లో తాను అమెరికా వెళ్లినప్పుడు కూడా అమరావతిని స్వాగతిస్తూ పచ్చ పత్రికకు ప్రకటన ఇచ్చినట్లు యార్లగడ్డ సభలో చూపించారు. సభలో ఆద్యంతం చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, ఇతర నేతలంతా వైఎస్ జగన్ అమరావతికి వ్యతిరేకం అన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆయన ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదన్న విషయాన్ని దాచిపెట్టి, కేవలం ఆయనపై అభాండాలు మోపుతూ.. విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఒకరి భుజాలు ఒకరు తడుముకుని బల్లలు చరుచుకున్నారు. స్పీకర్ స్థానంలో తటస్థంగా ఉండాల్సిన చింతకాయల అయ్యన్న పాత్రుడు రాజకీయ ప్రసంగం చేసి సభ ఔన్నత్యాన్ని మరోసారి దెబ్బతీశారు. ఆ 11 మంది ఈసారి కూడా సభకు రాలేదని వైఎస్సార్సీపీపై రాజకీయ విమర్శ చేశారు. పనిలో పనిగా చంద్రబాబును పొగుడుతూ స్వామి భక్తిని చాటుకున్నారు.రాజధాని రైతులను మాయ చేసేందుకే..తమ భూములు తీసుకుని 12 ఏళ్లు దాటినా, ఇంత వరకు ప్లాట్లు ఇవ్వకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వందల ఎకరాలు కట్టబెడుతుండడంపై రాజధాని రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో తీసుకున్న భూముల సంగతి ఇంకా తేల్చకుండానే ఇప్పుడు రెండవ విడత భూ సమీకరణ చేస్తుండడం, మూడవ విడతకు సిద్ధమవుతుండడంపై రాజధాని ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గ్రామ సభల్లో రైతుల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నములుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధానికి చట్టబద్ధత అంటూ రాజధాని రైతులను మాయ చేసేందుకు ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని ఉన్నత స్థాయి ఉద్యోగ వర్గాల సమాచారం. మరోవైపు ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల్లోనూ అంతకంతకూ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వారిని మభ్య పెట్టేందుకు, వారి దృష్టి మళ్లించేందుకు చట్టబద్ధ తీర్మానం పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ఇట్టే తెలుస్తోంది. -
ఓటేసి తప్పు చేశాం... చంద్రబాబుపై తిరగబడుతున్న సొంత నియోజకవర్గ ప్రజలు
-
ఏపీలో గ్యాస్ కొరత... దాన్ని కూడా సంపద సృష్టిగా మార్చిన బాబు
-
వైద్య విద్య అందించలేని తండ్రీకొడుకులు బాబు,లోకేష్ పై AISF నేతలు ఫైర్
-
నీకు పగ జగన్ మీదనా.. జనం మీదనా.. నీ పనికిమాలిన సీనియారిటీ ఎవడికి కావాలి?
-
ఏపీ శాశ్వత రాజధాని అమరావతిగా రేపు అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, అమరావతి: రేపు అధికారంలోకి ఎవరైనా వచ్చి రాజధాని అమరావతిని మార్చుతారేమోననే జాగ్రత్తలో భాగంగానే శనివారం అసెంబ్లీలో ఏపీ రాజధాని అమరావతిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి కె.పార్ధసారథి చెప్పారు. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను మంత్రి పార్ధసారథి మీడియాకు వెల్లడించారు. తీర్మానం అవసరం లేనప్పటికీ మా జాగ్రత్త కోసం తీర్మానం చేస్తున్నామని మంత్రి చెప్పారు. రేపు ఎవరైనా అధికారంలోకి వచ్చి రాజకీయ, ప్రాంతీయ కారణాలతో రాజధాని అమరావతిని మార్చకుండా ఉండేందుకే ఏపీ శాశ్వత రాజధాని అమరావతిగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. 2025 మేలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ రాజధాని అమరావతిగా నెంబర్ 148 తీర్మానం చేసి కేంద్రానికి పంపామని మంత్రి చెప్పారు. అయినప్పటికీ భవిష్యత్లో ఎవరైనా వచ్చి రాజధాని అమరావతిని మార్చాలనే ఆలోచన చేయకుండా ఉండేందుకే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 5లో సవరణలు చేయాలని, సెక్షన్–5లోని ఉప సెక్షన్ (2)లో ఏపీ రాజధాని అమరావతిగా చేర్చాలని, అలాగే రాజధాని ప్రాంతం ఏపీసీఆర్డీఏగా చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. రైతులను నమ్మించి రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయడం కోసమే తీర్మానం చేస్తున్నారా అనే ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ రాజధాని అమరావతి అని హైకోర్టు చెప్పిందని రైతులు నమ్మారన్నారు. రాజధాని విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ ఎప్పుడైనా చేసే అవకాశం సీఆర్డీఏ చట్టంలో ఉందని మంత్రి చెప్పారు. రాజధాని విషయంలో చట్టం ఉంది కదా మళ్లీ తీర్మానం ఎందుకని ప్రశ్నించగా శాశ్వతంగా ఏపీ రాజధాని అమరావతి ఉండాలనే ఉద్దేశంతోనూ, ఎవరు అధికారంలోకి వచ్చినా మార్చడానికి వీల్లేకుండా ఉండేందుకే అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించామన్నారు. శాసన మండలిలో తరువాత తీర్మానం చేస్తారేమోనని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. రాజధానిలో కాంట్రాక్టు సంస్ధల పైపులు అగ్ని ప్రమాదాలకు గురికావడంపై విచారణ జరుగుతోందన్నారు. ఎల్ అండ్ టీ వంటి పెద్ద సంస్ధలు ఇన్సూరెన్స్ కోసం ఇలాంటి పనులు చేస్తాయనుకోవడం లేదని మంత్రి చెప్పారు. పైపులు అగ్నికి ఆహుతి అవ్వాలంటే తగలపెడితే గానీ కావని మంత్రి చెప్పారు. మంత్రివర్గ సమావేశం తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ఇలా..⇒ నంద్యాల జిల్లా నంద్యాల అర్బన్ మండలం నూనెపల్లెలో ప్రభుత్వ భూమి రెండు ఎకరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం 33 సంవత్సరాల లీజు పద్దతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.1000లు లీజు చొప్పున నంద్యాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునికి ఇచ్చేందుకు ఆమోదం. ⇒ గుంటూరు జిల్లా నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్శిటీ భవనాల నిర్మాణాలకు 60 మీటర్ల ఎత్తు వరకు ఆమోదం.⇒ హైకోర్టు సూచన మేరకు 96 కొత్త కోర్టులు ఏర్పాటునకు, ఆ కోర్టులకు అవసరమైన 1730 పోస్టులు సృష్టించడానికి ఆమోదం.⇒ వడ్డెర సంఘాలకు క్వారీ లీజుల్లో ప్రాధాన్యత ఇస్తూ వారికి 15 శాతం క్వారీలు రిజర్వ్ చేసేందుకు, సీనరేజ్ ఫీజులో 50 శాతం రాయితీ ఇచ్చేందుకు ఆమోదం. ⇒ మున్సిపాలిటీల్లో పేరుకు పోయిన ఆస్తి పన్నుపై వడ్డీలో 50 శాతం మాఫీకి ఆమోదం. పన్ను బకాయి మొత్తంతో పాటు 50 శాతం వడ్డీ ఒకే సారి చెల్లిస్తే మిగతా 50 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుంది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 76 సంస్థలు వసూళ్లలో వెనుకబడ్డాయి. సుమారు రూ. 2,409 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో, టాక్స్ కట్టేవారికి భారం తగ్గించి వసూళ్లు పెంచుకోవడానికి ఈ నిర్ణయం.⇒ ప్రస్తుతం దీపం–2 పథకం కింద ఎల్పిజి కనెక్షన్ ఉన్న లబ్ధిదారులు పైప్ గ్యాస్కు (పీఎన్జీకి) మారితే వారికి ఏడాదికి మూడు సిలిండర్లకు ఇస్తున్న సబ్సిడీ రూ.2,400లు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు ఆమోదం. ⇒ రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సంస్థల నియంత్రణ, రిజిస్ట్రేషన్ పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ (రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) రూల్స్, 2026’ ముసాయిదా నోటిఫికేషన్ జారీకి ఆమోదం. ఈ నిబంధనల ద్వారా అన్ని కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. విద్యార్దులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించి, ఆందోళనలు, ఆత్మహత్యలను నివారించడానికి కౌన్సెలింగ్ సేవలు, మానసిక ఆరోగ్య మద్దతును ఈ నిబంధనలు తప్పనిసరి చేస్తాయి.⇒ అలాగే సంస్థలు నాణ్యమైన బోధనతో పాటు కనీస మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి. ⇒ అమరావతిలో చేపట్టే పనులకు సూపర్ విజన్ చార్జీలను ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 2.5 శాతం తగ్గించేందుకు ఆమోదం. ⇒ శ్రీ సత్య సాయి జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్–2 పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ను సిమెంట్ కాంక్రీట్ లైనింగ్తో ఆధునీకరించే పనికి రూ.169.80 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. ⇒ హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్–1 ప్యాకేజీ 36 ఏలో మిగిలిన పనులకు 606.03 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. ⇒ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు భూమి, కాలనీల పునరావాసం కల్పించేందుకు మొత్తం 4520.52 ఎకరాల భూ సేకరణకు ఎకరాకు రూ.12,50,000లు పరిహారం చొప్పున రూ.565.06 కోట్లకు ఆమోదం. ⇒ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, హైదరాబాద్కు అప్పగించిన ’పోలవరం లిఫ్ట్ స్కీమ్’ పనిని కొనసాగించడానికి ఆమోదం. ⇒ పలు విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులకు ఆమోదం. -
మామూళ్ల మత్తు.. ప్రాణాలు చిత్తు
సాక్షి, అమరావతి: మరో ఘోర బస్సు ప్రమాదంతో రాష్ట్రం ఉలిక్కిపడుతూ నిద్ర లేచింది. గురువారం తెల్లవారకుండానే 14 మంది ప్రయాణికుల బతుకులు తెల్లారిపోయాయి. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. రవాణా శాఖ కేంద్రంగా రాష్ట్రంలో అవినీతి సిండికేట్ మరోసారి ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది. ఇవి కేవలం రోడ్డు ప్రమాదంతో సంభవించిన దుర్మరణాలు కావు... బరి తెగించి అవినీతి దందా సాగిస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాకు వత్తాసు పలుకుతున్న ‘రవాణా’ సిండికేట్ చేసిన హత్యలు! రాయలసీమకు చెందిన ప్రభుత్వ కీలక నేత రింగ్ మాస్టర్గా ఉన్న ఈ సిండికేట్ ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి ఏటా వసూలు చేస్తున్న మొత్తం దాదాపు రూ.80 కోట్లు...! ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలకు, నిబంధనలకు విరుద్ధంగా సర్వీసుల నిర్వహణకు ఆ సిండికేట్ వత్తాసు పలుకుతోంది. ఫలితం... తరచూ రోడ్డు ప్రమాదాలు... ప్రయాణికుల దుర్మరణాలు రాష్ట్రంలో సర్వ సాధారణంగా మారిపోయాయి. మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదమే అందుకు తాజా తార్కాణం. అవి దుర్మరణాలు కావు.. రవాణా శాఖలో పచ్చ సిండికేట్ చేసిన హత్యలు...!!స్టీరింగ్ పని చేయని బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్...!మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు (రిజిస్ట్రేషన్ నంబరు ఏఆర్ 20 డి 0487)కు ఈ ఏడాది డిసెంబర్ 9 వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది. రవాణా శాఖే ఆ మేరకు ఎఫ్సీ జారీ చేసింది. ఆ బస్సుకు 2027 జనవరి 8 వరకు పర్మిట్ కూడా ఉంది. తెలంగాణలోని జగిత్యాల నుంచి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలిగిరి వెళుతుండగా ఆ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్ సక్రమంగా పని చేయకపోవడంతోనే ప్రమాదం సంభవించింది. స్టీరింగ్ స్టక్ అయిపోవడం (బిగుసుకుపోవడం)తో బస్సు హఠాత్తుగా నెమ్మదించి కదలకపోవడంతో టిప్పర్ను ఢీ కొట్టింది. ప్రమాదానికి గంట ముందు కూడా ఆ బస్సు స్టీరింగ్ బిగుసుకుపోయింది. యర్రగొండపాలెం వద్ద స్టీరింగ్ను అప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతు చేసి బయలు దేరారు. కానీ గంటలోనే రాయవరం చేరుకునేసరికి స్టీరింగ్ మరోసారి బిగుసుకుపోయి బస్సు హఠాత్తుగా కదల్లేదు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న టిప్పర్ లారీని వేగంగా వచ్చి బస్సు ఢీకొట్టింది. ఆయిల్ ట్యాంకర్ను నేరుగా ఢీ కొట్టడంతో వెంటనే బస్సుకు మంటలు అంటుకుని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి ప్రధాన కారణం బస్సు స్టీరింగ్ బిగుసుకుపోవడమే. నడిపేందుకు అత్యంత ప్రధానమైన స్టీరింగే సక్రమంగా పని చేయని బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ కావడం నివ్వెరపరుస్తోంది. అంటే కనీసం బస్సులను పరీక్షించకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఈ ఉదంతం వెల్లడిస్తోంది. 14 మందిని బలిగొన్న ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన దోషి రవాణా శాఖేనని స్పష్టమవుతోంది. ఏటా రూ.80 కోట్ల మామూళ్ల దందా– రవాణా సిండికేట్కు కీలక నేత రింగ్ మాస్టర్రాయలసీమకు చెందిన ప్రభుత్వ కీలక నేత రింగ్ మాస్టర్గా రవాణా శాఖలో పచ్చ సిండికేట్ దోపిడీ సాగిస్తోంది. భారీ మొత్తంలో మామూళ్లు వసూలు చేస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా అక్రమాలకు వత్తాసు పలుకుతోంది. రాష్ట్రంలో 2,200 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. ఒక్కో స్లీపర్ బస్సుకు దాదాపు 30 బెర్త్లు, హైబ్రీడ్ మోడల్ బస్సుల్లో 20 బెర్త్ల చొప్పున ఉంటాయి. ఇక సాధారణ బస్సుల్లో దాదాపు 50 సీట్ల చొప్పున ఉంటాయి. మొత్తం మీద దాదాపు 75 వేల మంది కెపాటిసీతో రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు బస్సు సర్వీసులను నిర్వహిన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలను పాటించకుండా దోపిడీకి పాల్పడుతున్నాయి. అందుకు వత్తాసు పలుకుతున్న రవాణా శాఖ మాఫియాకు భారీగా ముడుపులు ముట్టజెబుతున్నాయి. రవాణా శాఖ వర్గాలు అనధికారికంగా వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం... ప్రైవేట్ ట్రావెల్స్ ఒక్కో బస్సు సర్వీసులో రోజుకు ఒక సీటు టికెట్ మొత్తం ఈ సిండికేట్కు కమీషన్గా ఇస్తున్నారు. ఆ ప్రకారం 2,200 బస్సుల్లో రోజుకు 2,200 టికెట్ల మొత్తాన్ని రవాణా శాఖ సిండికేట్కు కమీషన్గా చెల్లిస్తున్నారు. ఒక టికెట్ మొత్తం సగటున రూ.వెయ్యి అనుకుంటే రోజుకు రూ.22 లక్షలు కమీషన్గా ముట్టజెబుతున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.6.60 కోట్లు... ఏడాదికి దాదాపు రూ.80 కోట్లు రవాణా శాఖ సిండికేట్ వసూలు చేస్తోంది. అంత భారీ మొత్తం లంచాలుగా చెల్లిస్తుండటంతోనే ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా బరితెగించి దోపిడీకి పాల్పడుతోంది. బస్సుల నిర్వహణలో కనీస నిబంధనలను పాటించడం లేదు. దాంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ప్రయాణికులు దుర్మరణం పాలవుతున్నారు. అవి ఎలా అంటే...⇒ రాష్ట్రంలో 2,200 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో 90 శాతం కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఏపీలో సర్వీసులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టు క్యారియర్లుగా రిజిస్ట్రేషన్ చేయించి నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారియర్లుగా నిర్వహిస్తున్నారు. మార్కాపురం వద్ద ప్రమాదానికి గురైన బస్సు కూడా అరుణాచల్ప్రదేశ్లో కాంట్రాక్టు క్యారియర్గా రిజిస్ట్రేషన్ చేసి నిబంధనలకు విరుద్ధంగా జగిత్యాల నుంచి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలిగిరి వరకు స్టేజ్ క్యారియర్గా నిర్వహిస్తుండటం గమనార్హం.⇒ బస్సుల బాడీల తయారీలో నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా స్లీపర్ బస్సుల విషయంలో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ఆ బస్సులకు ఫిట్నెస్ సక్రమంగా ఉండటమే లేదు.⇒ టికెట్ల ధరలు భారీగా పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. సంక్రాంతి, దసరా సీజన్లో టికెట్ ధరను మూడు నాలుగు రెట్లు పెంచి మరీ దోపిడీ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కూడా నిర్దేశిత టికెట్ ధరలు ఉండవు.ఏటీఎస్ కేంద్రాలూ అంతే...వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ల (ఏటీఎస్) నిర్వాహకులు రవాణా శాఖ సిండికేట్కు భారీగా మామూళ్లు ముట్టజెబుతున్నారు. దాంతో ఆ ఏటీఎస్ సెంటర్లు ఎలా పని చేస్తున్నాయన్నది రవాణా శాఖ పట్టించుకోవడమే లేదు. ఇక కీలక నేత అండ ఉండటంతో ఏటీఎస్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అడిగినంత డబ్బులు ఇస్తే చాలు ప్రైవేట్ వాహనాలను కనీసం పరీక్షించకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం బస్సు స్టీరింగ్, బ్రేకులు, ఇంజన్, బాడీ, హెడ్లైట్లు, వెనుకవైపు లైట్లు, ఆయిల్ సిస్టం, టైర్లు... ఇలా అన్నీ నిశితంగా పరీక్షించాలి. అందుకోసం ఏటీఎస్లో కంప్యూటరైజ్డ్ విధానంలో క్షుణ్ణంగా పరీక్షించి... తగిన ప్రమాణాల మేరకు ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలి. కానీ 50 శాతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాణాలను పాటించడ లేదు. ఏటీఎస్ సెంటర్ల నిర్వాహకులు భారీగా ఫీజులు చెల్లిస్తే చాలు... ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేస్తున్నారు. అందులో రవాణా సిండికేట్కు వాటాలిస్తున్నారు. ఈ అవినీతి బాగోతంతో ప్రయాణికులు తమ ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నా సరే స్టీరింగ్ పని చేయక ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాదమే అందుకు తాజా తార్కాణం.రెండు రోజులు హడావుడి..గతేడాది అక్టోబరులో కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది దుర్మరణం చెందారు. ఆ వెంటనే రాష్ట్రంలో రవాణా శాఖ అధికారులు హడావుడి చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు పేరుతో కొన్నాళ్లు కనికట్లు చేశారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా.. ప్రభుత్వ కీలక నేతను ఆశ్రయించడంతో వెంటనే తనిఖీలు నిలిచిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు. ఆ ఫలితమే... మార్కాపురం జిల్లాలో తాజాగా బస్సు ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఫిట్నెస్ను సక్రమంగా పరీక్షించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
నిర్లక్ష్యం తెచ్చిన విషాదమిది!
రోడ్డు ప్రమాదాలను నివారిస్తామనీ, సురక్షిత ప్రయాణానికి అనువైన చర్యలు తీసుకుంటామనీ ప్రభుత్వం చెప్పే కబుర్లు ఉత్త గాలి మాటలేనని ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా రాయవరం గ్రామ సమీపంలో గురువారం వేకువజామున 5.40 ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన నిరూపించింది. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొనడంతో జరిగిన ఈ విషాదంలో 14 మంది చనిపోగా, మరో 20 మంది వరకూ గాయపడ్డారని చెబుతున్నారు. మరికొంతసేపట్లో గమ్యస్థానం చేరతామని ప్రయాణికులు అనుకుంటున్న తరుణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాల్లో తేలిపోతున్నట్టుగా పరుగులెత్తే ప్రైవేటు బస్సులను పాలకులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఆ వాహనాలకు ఫిట్నెస్ ఉందా? నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్న వ్యక్తికి అసలు లైసెన్సుందా? రహదారి నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే సంగతులులేవీ వారికి అక్కరలేదు. వాహనం సక్రమంగా లేదని బస్సెక్కినప్పటి నుంచి తాము చెబుతూనే వచ్చామనీ, చివరకు స్టీరింగ్ మొండికేయటంతో ప్రమాదం జరిగిందనీ ప్రయాణికులంటున్న మాట! ఇన్ని వందల కిలోమీటర్ల ప్రయాణంలో ఏ ఒక్క అధికారి బస్సును గమనించలేదని ఈ ఉదంతం నిరూపిస్తోంది.దాదాపు రెండేళ్లనుంచి హింస, దౌర్జన్యాలు, అక్రమ కేసులు మినహా ఏపీలో మరేదీ సక్రమంగా చేయడం రాని చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం ఎంతటిదో ఈ ప్రమాదం తేటతెల్లం చేసింది. ప్రమాదం జరిగాక ఏదోరకంగా బయటపడిన ప్రయాణికులు తేరు కోవటానికే కొంత సమయం పట్టింది. ఆ తర్వాత 108 వాహనానికి డజనుసార్లకు పైగా ఫోన్ చేస్తే గానీ ఎవరి నుంచీ స్పందన లేదు. వేకువజాము వేళకు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి బస్సులు వేగంగా వస్తుంటాయి. ఆ సమయంలో భారీ వాహనాలు సైతం అదే రహదారిపై వెళ్లటం ప్రమాదాలకు దారి తీయదా? ముఖ్యంగా క్వారీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలుంటాయి. ప్రమాదాలకు ఆస్కారం ఉండే ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయటం, వేగాన్ని నియంత్రించటం కోసం స్పీడ్గన్ల నిరంతర పర్యవేక్షణ అవసరం. ప్రమాదకరమైన మలుపులున్నచోట చాలా ముందుగానే హెచ్చరిక బోర్డులు అమర్చాలి. ఏవీ సక్రమంగా లేనప్పుడు ఇలాంటి ఉదంతాలను ప్రమాదాలుగా భావించ గలమా? క్వారీ వాహనాలు ట్రాఫిక్ అధికంగా ఉండే సమయంలో జాతీయ రహదార్లపైకి రాకుండా కట్టడి విధించే నిబంధనలున్నాయి. క్వారీలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రమే పని చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. మరి అంత వేకువజామున భారీ లోడ్ వాహనం ఎలా వచ్చింది? అంటే రాత్రంతా అక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరిగాయన్న మాట! స్థానికంగా జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధి కారులంతా ఉంటారు. కానీ ఏం లాభం? జిల్లాల పరిధి పెద్దగా ఉంటే పర్యవేక్షణ కష్ట మవుతుందని భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిన్న జిల్లాలు ఏర్పాటు చేసింది. అయినా ప్రజలకు దిక్కూ మొక్కూ లేని స్థితి ఉన్నదంటే చంద్రబాబు సిగ్గు పడాలి. రాష్ట్రంలో ఏ మూల ఏం జరుగుతున్నదో క్షణంలో తెలిసే టెక్నాలజీ వాడుతున్నా నని ఆయన స్వోత్కర్షలకు పోతుంటారు. కానీ ఈ లోటుపాట్ల విషయం మాత్రం ఆయనకు తెలియదు! వైద్యవిద్యలో పేదవర్గాల పిల్లలకు అవకాశాలు రావాలనీ, అదే సమయంలో ప్రజ లకు మెరుగైన, ప్రామాణికమైన వైద్య సదుపాయాలు అందాలనీ భావించి జగన్ ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన 17 మెడికల్ కళాశాలల్లో మార్కాపురం కాలేజీ కూడా ఒకటి. అందులో ఏడెనిమిది కాలేజీలు ప్రారంభం కాగా, తుది దశలో వున్న వాటిలో మార్కాపురం కాలేజీ కూడా ఉంది. ఈలోగా కూటమి సర్కారు వచ్చిపడి దాన్ని కాస్తా పక్కన పెట్టింది. పర్యవసానంగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు రాలేదు. అది అందుబాటులోకి వచ్చివుంటే బస్సు ప్రమాదం బారినపడిన వారిలో మరికొందరి ప్రాణాలు నిలబడేవి. తమ నిర్వాకంతో బాధిత కుటుంబాలకు చేసిన నష్టంతో పోలిస్తే, ప్రకటించిన పరిహారం రూ. 5 లక్షలు ఏ మూలకు? ప్రభుత్వ చేతగాని తనం, నిర్లక్ష్యం ఇంతమంది మరణానికి దారి తీశాయని బాబు ఇప్పటికైనా గుర్తిస్తారా? -
కడప స్టీల్ పై బాబు నాటకం
-
అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి
-
కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు... మాకు ఆకలేస్తే అడగాల్సింది మిమ్మల్నే కదా..
-
అభివృద్ధి లేదు సంక్షేమం లేదు... లక్షల కోట్లు అప్పు ఏం చేస్తున్నట్టు?
-
ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీని తామే తెచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
క్రెడిట్ చోరీ కాదు.. క్రెడిట్ దోపిడీ: వైఎస్ జగన్
నియోజకవర్గాల పెంపు గుడ్ న్యూస్. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు హర్షణీయం. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సీట్లు గణనీయంగా పెరుగుతాయి. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు వల్ల కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుంది. ఉత్సాహం, పటిమ ఉన్న వారికి ప్రోత్సాహం ఇస్తాం. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. పూర్తి స్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు. వంట నూనె లీటరు రూ.40 పెరిగింది. పప్పులు కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఉచిత గ్యాస్కు దిక్కులేదు. మరోవైపు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బ్లాక్లో అమ్ముతున్నారు. సిలిండర్ రూ.2 వేలు, రూ.3 వేలకు అమ్ముతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఈ పెద్దమనిషి కిరోసిన్ ఇస్తానంటున్నాడు. లీటరు కిరోసిన్ ఇస్తాడంట. పండగ చేసుకోమంటున్నాడు. అసలు కిరోసిన్ స్టవ్లు ఎక్కడున్నాయి? చివరకు గుడ్ల ధర కూడా పడిపోయింది. మొక్కజొన్న కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.2,400 అయితే రూ.1,400కు కూడా అడిగే వాడు లేడు. కోకో, అరటి, శనగ, టమాటా.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతుల పరిస్థితి అగమ్యగోచరం. -వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: చంద్రబాబు క్రెడిట్ చోరీ కాకుండా, ఏకంగా క్రెడిట్ దోపిడీ చేస్తున్నారని.. ఆ దిశలోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. నిజానికి 2022లో తన దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ను కలిశానని, రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అప్పుడే దాదాపు అవగాహన కుదిరిందని చెప్పారు. తగిన భూమి ఇచ్చేందుకు కూడా అంగీకరించామని, అంతే కాకుండా అప్పుడే ఆ కంపెనీ కర్నూలు జిల్లాలో నిర్మాణంలో ఉన్న గ్రీన్కో ప్రాజెక్టులోనూ రూ.4,800 కోట్ల పెట్టుబడికి అవగాహన కుదుర్చుకుందని వెల్లడించారు. అలా తాము తెచ్చిన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తూ అంతా తన ఘనతేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎత్తి చూపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్ధల పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో మనం 151 సీట్లు గెల్చుకున్నా, అద్దంకిలో గెలవలేకపోయామన్నారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో మంత్రిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. చంద్రబాబుకన్నా ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఇప్పటి మంత్రిపై ఉందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో డాక్టర్ అశోక్కుమార్ను తీసుకొచ్చామని.. ఆయన మంచి డాక్టర్ అన్నారు. రాక్షస రాజ్యంలో ఉన్నాం కాబట్టి, చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుందని తెలిసినా, అశోక్ ముందుకొచ్చి, ఐదేళ్ల పోరాటానికి సిద్ధమయ్యారని.. కార్యకర్తలకు తోడుగా నిలబడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. చంద్రబాబు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. కోటలు దాటుతున్న బాబు మాటలు⇒ ‘చంద్రబాబు పాలనంతా వైఫల్యం. కానీ, మాటలు కోటలు దాటుతాయి. కానీ చేతలుండవు. ఆయన చేస్తున్న దాన్ని క్రెడిట్ చోరీ కాకుండా క్రెడిట్ దోపిడీ అనాలేమో. చంద్రబాబు ఇటీవలి క్రెడిట్ దోపిడీ గురించి చెప్పాల్సి వస్తే.. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను తాను తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ.. ఆర్భాటంగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నాడు. చంద్రబాబు క్రెడిట్ దోపిడీకి కనీసం హద్దు ఉండాలి. ఆదిత్య మిట్టల్ను 2022లో నేను దావోస్లో కలిశాను. అప్పట్లోనే ఇక్కడి గ్రీన్కో ప్రాజెక్టులో పెట్టుబడికి కూడా రెడీ అయ్యారు. రూ.4,800 కోట్ల పెట్టుబడితో ఆ ప్రాజెక్టులో వారు భాగస్వాములయ్యారు. కర్నూలు జిల్లాలో కడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లో ఆ పెట్టుబడి పెట్టారు. ⇒ ఇంకా అప్పట్లోనే ఎస్సార్ స్టీల్ని వారు కొనుగోలు చేసి, రూ.1,000 కోట్ల పెట్టుబడితో విస్తరణకు రెడీ అయ్యారు. ఆ మేరకు అగ్రిమెంట్లు కూడా జరిగాయి. అవే కాకుండా, ఇక్కడ కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఆహ్వానించి, వారికి తగిన భూములు చూపాలని అధికారులను ఆదేశించాను. దాంతో అధికారులు కాకినాడ సెజ్లో, మూలపేట, నక్కపల్లిలో భూములు చూపితే, వారికి నక్కపల్లి నచ్చింది. అక్కడ మనకు ఏపీఐఐసీ భూములుంటే, వాటిలో 2,200 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ఆలోగా ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. దాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తూ.. ఒక జూమ్ కాల్తో మిట్టల్ కంపెనీ వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ⇒ అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. విశాఖలో అదానీ డేటా సెంటర్ కూడా అంతే. అది మన హయాంలోనే వచ్చింది. అది కూడా తానే తెచ్చినట్లు చంద్రబాబు ప్రచారం. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం. అదే నక్కపల్లిలో 2023లో బల్క్ డ్రగ్ పార్కును 13 రాష్ట్రాలతో పోటీ పడి తెచ్చాం. కేంద్రం రూ.1,000 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. కానీ, చంద్రబాబు వచ్చాక, ఆ బల్క్ డ్రగ్ పార్క్ పనులు జరగడం లేదు. అడుగులు ముందుకు పడడం లేదు. దాని వల్ల రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాలూ వస్తాయి. అయినా భూముల పేరుతో వివాదాస్పదం చేశారు. దాంతో ఆ పనులు నిల్చిపోయాయి. అలా కొన్ని ప్రాజెక్టులు పని చేయడం లేదు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశానికి హాజరైన అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ శ్రేణులు పోర్టుల్లో పనుల నిలిపివేత⇒ నాడు మన ప్రభుత్వంలో మూడు పోర్టుల పనులు వేగంగా చేశాం. నిధుల సమీకరణ ప్రక్రియ కూడా పూర్తి చేశాం. రామాయపట్నం పోర్టు దాదాపు 80 శాతం పూర్తి చేశాం. మూలపేట పోర్టు పనులు 30 శాతం పూర్తి చేశాం. మచిలీపట్నం పోర్టు 30 శాతం మన హయాంలోనే పూర్తి చేశాం. కానీ, ఈ మూడింటి పనులు ఆగిపోయాయి. ఎందుకంటే, జగన్కు పేరు రాకూడదని పనులు ఆపారు. ⇒ ఇప్పుడు ఆ చుట్టుపక్కల భూములను చంద్రబాబు తన వారితో కొనిపిస్తున్నాడు. అప్పటి వరకు పోర్టుల పనులు ఆపేశారు. ఇప్పటికే భూములు ఇచ్చామని, ఇంకా భూములు లేవని మచిలీపట్నం పోర్టు వద్ద అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా ప్రతి అడుగులోనూ నాకేమిటి అంటూ చంద్రబాబు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆ దిశలోనే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇలాంటి వాతావరణంలో రేపు 2029 ఎన్నికలు జరగబోతున్నాయి.అంతా దగా.. పచ్చి మోసం⇒ ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారు.. ఆ తర్వాత ఏం చేస్తున్నాడన్నది అందరికీ తెలుసు. జగన్ ఇస్తున్నవన్నీ అలాగే అమలు చేయడమే కాకుండా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా ఇస్తానన్నాడు. ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. ⇒ ఇప్పుడు మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇంకా మిగిలినవి కేవలం రెండు మాత్రమే. కానీ ఏ పథకం అమలు చేయడం లేదు. జగన్ ఇచ్చినవన్నీ పోయాయి. అన్నీ ఎగ్గొట్టాడు. చివరకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా మోసాలయ్యాయి. బిర్యానీ కథ దేవుడెరుగు.. ఉన్న పలావు పోయింది. దీని గురించి ప్రజలు ఇంటింటా చర్చించుకుంటున్నారు.జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యం⇒ గుడ్న్యూస్ ఏమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సీట్లు పెరుగుతున్నాయి. అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కు, పార్లమెంటు నియోజకవర్గాలు 25 నుంచి 38కి పెరగనున్నాయి. అలాగే వాటిలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33 శాతం చొప్పున అసెంబ్లీలో 88 సీట్లు, 13 ఎంపీ సీట్లు దక్కనున్నాయి. నాడు మన ప్రభుత్వ హయాంలో మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఇచ్చాం. అందుకోసం చట్టం కూడా చేశాం. ఆ విధంగా మహిళలకు సాధికారత కల్పించాం.⇒ 2029లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు పెరగడం వల్ల కార్యకర్తలు లీడర్లుగా ఎదుగుతారు. నాయకత్వ పటిమ చూపే వారందరికీ జగన్ న్యాయం చేస్తాడు. ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. నాడు మన హయాంలో రెండేళ్లు కోవిడ్ వల్ల కార్యకర్తలపై దృష్టి పెట్టలేకపోయాం. పాలన, బటన్ నొక్కడంపై ఎక్కువగా ధ్యాస పెట్టాల్సి వచ్చింది. మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ప్రజలకు ఇంకా మంచి చేయడమే కాకుండా, కార్యకర్తలకు కూడా మంచి జరుగుతుంది.⇒ జగన్ 2.0లో ప్రజలకు మంచి చేసే కార్యక్రమం మీ ద్వారానే జరుగుతుంది. కాబట్టి, రాబోయేవి చాలా మంచి రోజులు. ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. ఇంకా మిగిలింది మూడేళ్లు. అందులో చివరి ఏడాదిన్నర నేను పాదయాత్రలో ఉంటాను. దాంతో మొత్తం పార్టీ ప్రజల కోసం నేరుగా రంగంలోకి దిగుతుంది. అప్పుడు చంద్రబాబుకు సినిమా చూపిస్తాం. చంద్రబాబు చేసే రెడ్బుక్ పాలన, అన్యాయాలకు టైమ్ దగ్గరకొచ్చింది. ఇంకా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.⇒ ఈ సమావేశంలో బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్, నియోజకవర్గంలో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.అంతా దోచుకో.. పంచుకో.. తినుకో..⇒ మన హయాంలో ఆ ఐదేళ్లలో దాదాపు రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా బదిలీ చేశాం. ఆధార్ నంబర్లు, బ్యాంక్ ఖాతాలతో సహా ఎవరికి, ఎంతిచ్చామో చెప్పగలం. కానీ రెండేళ్లు కూడా కాకముందే చంద్రబాబు చేసిన మొత్తం అప్పులు రూ.3.37 లక్షల కోట్లు దాటాయి. కానీ, జగన్ ఇచ్చిన పథకాలు లేవు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా లేవు. మరి నాడు జగన్ ఎలా చేశాడు.. మరి ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎందుకు చేయడం లేదు.. అన్నదానిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.⇒ చంద్రబాబు ఎందుకు ఇవ్వడం లేదంటే.. ఇప్పుడంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. ఎక్కడ పడితే అక్కడ దోపిడీ. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అదంతా చంద్రబాబు, ఆయన బినావీులు, ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల జేబుల్లోకి పోతోంది. లిక్కర్ మొదలు ప్రతి చోటా దోపిడీ. ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదు. వేలం పాటలు నిర్వహించి, బెల్టు షాపులు నడుపుతున్నారు. మద్యం ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. అంతా మాఫియాకు చేరుతోంది.⇒ ఇసుక, మట్టి, ల్యాటరైట్.. దేన్నీ వదలడం లేదు. మరోవైపు అధిక ధరలకు పీపీఏలతో అవినీతికి పాల్పడుతున్నారు. మనం యూనిట్ విద్యుత్ రూ.2.49కే పీపీఏ చేసుకుంటే, ఇప్పుడు రూ.4.60కి చేసుకుంటున్నారు. మనం రైతులకు ఉచిత విద్యుత్ 25 ఏళ్లు ఇవ్వాలని సంకల్పించి, యూనిట్ విద్యుత్ను రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటే విమర్శించారు. కానీ వీరు ఏకంగా యూనిట్ విద్యుత్ను రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకున్నారు.⇒ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాల్లోనే చదరపు అడుగు నిర్మాణానికి రూ.4 వేలతో ఫైవ్ స్టార్ లెవెల్లో కట్టొచ్చు. కానీ ఇక్కడ ఏకంగా అదే చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. భూములనైతే శనక్కాయలు, బెల్లానికి ఇస్తున్నారు. చంద్రబాబు బంధువు, బాలకృష్ణ అల్లుడికి రూ.5 వేల కోట్ల విలువైన భూములు దోచి పెడుతున్నారు. ఈ రకంగా రాష్ట్ర ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు.పరిపాలన లేదు.. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి⇒ చంద్రబాబు ప్రభుత్వంలో అసలు పరిపాలన అనేది లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఫీజు రీయింబర్స్మెంట్ లేక, పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. బకాయిలతో కలిపి ఈ ఏడాది విద్యా దీవెన, వసతి దీవెనకు సుమారు రూ.10 వేల కోట్లు కావాలి. కానీ ఈ ఏడాది బడ్జెట్లో పెట్టింది రూ.2,600 కోట్లు మాత్రమే. ఆరోగ్యశ్రీకి రూ.3,150 కోట్లు బకాయి పెట్టారు. దీంతో నెట్వర్క్ ఆస్పత్రుల పథకం కింద వైద్యం చేయడం లేదు.⇒ నాడు–నేడు మనబడి లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ లేదు. పిల్లలకు ట్యాబ్లు లేవు. గోరుముద్దలో క్వాలిటీ లేదు. చదువులు పూర్తిగా తిరోగమనంలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోతున్నాయి. విద్య, వైద్యం పరిస్థితి ఇలా ఉంటే.. రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంత దారుణంగా వ్యవసాయం ఉంది. పూర్తి స్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు. -
తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..
-
కూటమి వేధింపులు.. IAS, IPSలను కూడా వదలరా!
-
యుద్ధం పేరుతో గ్యాస్ మాటలు... కిరోసిన్ ఇస్తావు సరే... స్టవ్ లు సంగతేంటి
-
బాబుకు బిగ్ షాక్ కరకట్ట ఇల్లును ముట్టడించిన ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్.....
-
అమరావతి ప్లాన్ లో లోపాలు.. ఖజానాపై రూ 1472 కోట్ల భారం
-
రాజధాని మాస్టర్ ప్లాన్లో లోపం... ఆంధ్రప్రదేశ్ ఖజానాపై ఒక వెయ్యి 472 కోట్ల రూపాయలకుపైగా భారం
-
హామీల ఎగవేత అప్పుల మోత
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మార్చేసిన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదనే ఆవిరి చేస్తూ తాజాగా మంగళవారం 7.88 శాతం వడ్డీతో మరో రూ.3,900 కోట్లు బడ్జెట్ అప్పులు చేశారు. దీంతో ఈ ఆర్థిక ఏడాది ఏకంగా రూ.1.04 లక్షల కోట్ల బడ్జెట్ అప్పులతో చరిత్ర సృష్టించారు. తాజా అప్పుతో 22 నెలల పాలనలో చంద్రబాబు బడ్జెట్లో చేసిన అప్పులు ఏకంగా రూ.1,86,164 కోట్లకు చేరాయి.వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు మరో రూ.1,51,057 కోట్లకు ఎగబాకాయి. దీంతో బాబు పాలనలో మొత్తం అప్పులు రూ.3,37,221 కోట్లకు చేరాయి. దొరికిన చోటల్లా ఎడాపెడా అప్పులు చేయడమే నిత్య కృత్యంగా టీడీపీ కూటమి సర్కారు పాలన సాగుతోందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా కొత్తగా ప్రభుత్వ రంగంలో ఆస్తులు సృష్టించేందుకు పైసా వ్యయం చేయడం లేదు. -
ఖజానాపై భారం రూ.1,472.50 కోట్లు
సాక్షి, అమరావతి: అమరావతి పేరుతో ఒకవైపు అంతులేని అప్పులు.. మరోవైపు యథేచ్ఛగా ప్రజాధనం దుర్వినియోగం! రాజధాని నిర్మాణంలో చంద్రబాబు సర్కారు నిర్వాకాలకు ఇది మరో నిదర్శనం! సింగపూర్ సంస్థ సుర్బానా–జురాంగ్ రూపొందించిన రాజధాని మాస్టర్ ప్లాన్లోని లోపాల కారణంగా రాష్ట్ర ఖజానాపై రూ.1,472.50 కోట్ల భారం పడింది. రాజధానిలో 220 కేవీ, 400 కేవీ విద్యుత్ లైన్లను విస్మరించి మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. దీనివల్ల ఇప్పుడు నిర్మాణాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆ విద్యుత్ లైన్లు అడ్డంకిగా మారాయని.. వాటిని మార్చాల్సిందేనని సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించింది. ఆ మేరకు ఆ పనులను ప్యాకేజీల కింద విడగొట్టి.. వాటిని 8.98, 8.99 శాతం అధిక ధరలకు ముఖ్యనేతకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని పనులు మనోళ్లకు అప్పగిస్తే మురికివాడలు నిర్మిస్తారని 2016లో సీఎం చంద్రబాబు మన ఇంజనీర్లను అవహేళన చేశారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరి.. సింగపూర్ సంస్థ రూపొందించిన మాస్టర్ప్లాన్ లోపాల వల్ల ఖజానాపై పడిన భారీ భారం మాటేమిటని ప్రశ్నిస్తున్నారు.తప్పుబట్టిన ‘కాగ్’..217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించే పనులను నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్ సంస్థ సుర్బానా–జురాంగ్కు 2016లో నామినేషన్పై చంద్రబాబు సర్కార్ అప్పగించడాన్ని కాగ్ (కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తప్పుబట్టింది.. మాస్టర్ ప్లాన్ను రూపొందించిన ఆ సంస్థకు రూ.20.28 కోట్లను అప్పట్లో ప్రభుత్వం చెల్లించింది. ఆ ప్లాన్ ప్రకారమే అప్పట్లో రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. కానీ.. రాజధాని ప్రాంతంలో గతంలో 38 కి.మీ.ల పొడవున వేసిన 400 కేవీ విద్యుత్ లైన్, 55 కిమీల పొడవున వేసిన 220 కేవీ లైన్లు నిర్మాణాలకు అడ్డంకిగా మారాయి. ఇది మాస్టర్ ప్లాన్లో లోపాలను బహిర్గతం చేసింది. దాంతో ఆ విద్యుత్ లైన్లను మార్చే పనులకు గతేడాది సీఆర్డీఏ టెండర్లు పిలిచింది.నిబంధనలు తుంగలో తొక్కి..రాజధాని ప్రాంతంలో ఎన్–10 రహదారి నుంచి ఎన్–13–ఈ–11 రహదారుల జంక్షన్ వరకు 220 కేవీ ఎక్స్ట్రా హైవోల్టేజీ(ఈహెచ్వీ) లైన్ అండర్ గ్రౌండ్లో ఏర్పాటుకు సంబంధించి మిగిలిన పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించి ఒక ప్యాకేజీ కింద సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధానిలో ఏపీ ట్రాన్స్కో 18 కి.మీ.ల పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ(డైరెక్ట్ కరెంట్) లైన్స్లో మిగిలిన పనులు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 20 కి.మీ.ల పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ లైన్స్లో మిగిలిన పనుల పూర్తికి రూ.283.57 కోట్ల అంచనా వ్యయంతో మరో ప్యాకేజీ కింద సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 220 కేవీ లైన్ను మార్చే పనులను 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్కు రూ.1,082.44 కోట్లకు కట్టబెట్టింది. అంతేకాదు.. కాంట్రాక్టు విలువ కంటే 8.99 శాతం అధిక ధరకు కోట్ చేసిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్(జేవీ)కి 400 కేవీ లైన్ను మార్చే పనులను రూ.390.06 కోట్లకు అప్పగించింది. కాగా టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2004 నవంబర్ 20న ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. దాని ప్రకారం కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధికంగా కాంట్రాక్టర్లు కోట్ చేస్తే ఆ టెండర్ను రద్దు చేయాలి. మళ్లీ టెండర్ పిలవాలి. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల ఖజానాకు రూ.114.68 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆ మేరకు కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూరింది. ఈ పనులను కాంట్రాక్టర్కు అప్పగిస్తూ గతేడాది మార్చి 19న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.రూ.10,319.11 కోట్లు ప్రయోజనమంటూ వితండవాదన..విద్యుత్ లైన్లను మార్చే పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు. దాంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో వాటికి అనుమతి ఇవ్వాలంటూ ఆర్థిక శాఖకు సీఆర్డీఏ ప్రతిపాదనలు పంపింది. 220 కేవీ లైన్ను మార్చడం వల్ల 271.82 ఎకరాలు, 400 కేవీ లైన్ను మార్చడం వల్ల 244.14 ఎకరాల భూమి మిగులుతుందని.. ప్రస్తుతం ఎకరం మార్కెట్ విలువ రూ.20 కోట్లు పలుకుతోందని.. దీనివల్ల మొత్తం రూ.10,319.11 కోట్ల ప్రయోజనం చేకూరుతుందని ఆ ప్రతిపాదనల్లో సీఆర్డీఏ పేర్కొంది. కానీ.. రాజధానిలో ఎకరం రూ.50 లక్షల చొప్పున ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టడం గమనార్హం. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. విద్యుత్ లైన్లను మార్చే పనులకు అనుమతి కోసం వితండవాదనతో కూడిన ప్రతిపాదనను ఆర్థిక శాఖకు సీఆర్డీఏ పంపిందన్నది స్పష్టమవుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
జ్యూస్ ప్యాకెట్లతో పరుగో పరుగు.. చంద్రబాబు సభలో గందరగోళం
-
చంద్రబాబు దిగిపో.. కూటమికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు
-
శాశ్వత భవనాల నిర్మాణం పేరుతో నారా వారి భారీ స్కాం..?
-
యూట్యూబర్లకు నోటీసులు.. TDP తప్పులను ప్రశ్నిస్తే జైలుకే
-
రైతు నోటమాట లేదు
సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్లో ప్రాంతాన్ని బట్టి.. నాణ్యతను బట్టి కిలో టమాటా రూ.30 నుంచి రూ.60 పలుకుతోంది. టమాటా సాస్ ధర కిలో రూ.120 పైమాటే. కానీ.. వాటిని పండించే రైతులకు కిలోకు రూపాయి నుంచి రూ.3 మాత్రమే దక్కుతోంది. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకుని సాగుచేస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా మిగలడం లేదు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ధర లేక టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది.ధర లేక దిగాలురాష్ట్రంలో 1.55 లక్షల ఎకరాల్లో టమాటా సాగవుతోంది. అత్యధికంగా చిత్తూరులో 85 వేలు, అనంతపురంలో 48 వేలు, కర్నూలులో 8 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో 17 వేల ఎకరాల్లో టమాటా పండిస్తున్నారు. ఎకరాకు 14 టన్నుల చొప్పున ఏటా రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. రాయలసీమలోని 3 జిల్లాల నుంచే 20.36 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయి. నిత్యం చిత్తూరు మార్కెట్కు 300–400 టన్నులు, అనంతపురం మార్కెట్కు 80–100 టన్నులు, కర్నూలు మార్కెట్కు 80–150 టన్నుల చొప్పున వస్తుంటాయి.చిత్తూరు జిల్లా ప్యాపిలి మార్కెట్లో కిలోకు సగటున రూ.1.40 నుంచి రూ.3 దక్కుతుంటే.. ఉరవకొండ మార్కెట్లో కిలో రూ.2–3కు మించి లభించడం లేదు. అనంతపురం జిల్లా కక్కలపల్లి మార్కెట్లో కిలోకు రూ.3–7, పలమనేరు మార్కెట్లో కిలోకు రూ.3–7, మదనపల్లి మార్కెట్లో కిలోకు రూ.7 వరకు దక్కుతోందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ ధరతో పోలిస్తే రైతులకు పదోవంతు కూడా దక్కడం లేదు.గతేడాది కిలో రూ.8కి కొంటామని గతేడాది కూడా ఇదే రీతిలో కిలో రూపాయికి కూడా కొనేవారు లేక టమాటా రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. అప్పట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయిస్తామని ప్రకటించి చేతులెత్తేసింది. ఇదిగో కొంటాం.. అదిగో కొంటామని కాలయాపన చేసింది. చివరకు ఎప్పుడు కొంటారని రైతులు నిలదీస్తే ‘నో ప్రాఫిట్.. నో లాస్’ పద్ధతిన రైతుల నుంచి కొనుగోలు చేస్తామే తప్ప.. కిలో రూ.8కు కొనేందుకు డబ్బులు లేవని మార్కెటింగ్ శాఖ చేతులెత్తేసింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. టమాటా రైతుల దుస్థితిపై కనీసం స్పందించకుండా ఈ టమాటా థర్డ్ క్వాలిటీ అంటూ అధికారులు మాట దాటవేస్తున్నారు.ఐదేళ్లపాటు టమాటా రైతుకు అండగా..గత వైఎస్ జగన్ ప్రభుత్వం టమాటా రైతులకు అన్నివిధాలా అండగా నిలిచింది. మార్కెట్లో ధరలేని ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి మద్దతు ధరకు కొనుగోలు చేసేది. డిమాండ్కు తగిన సరఫరా లేక మార్కెట్లో ధరలు చుక్కలనంటుతున్నప్పుడు కూడా ఇదే రీతిలో మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి గరిష్టంగా కిలో రూ.107కు కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై కిలో రూ.50కే సరఫరా చేసింది. ఇలా రైతులకు అండగా నిలవడంతోపాటు ఇటు వినియోగదారులపై భారం పడకుండా చేసింది. గడచిన ఐదేళ్లలో రికార్డు స్థాయిలో రూ.18.02 కోట్లు ఖర్చు చేసి రైతుల నుంచి 8,459.56 టన్నుల టమాటాను మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలిచింది.కిలోకు రూ.2 ఇస్తున్నారురెండెకరాల్లో టమాటా వేశాను. ఎకరాకు రూ.70 వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. రోజు విడిచి రోజు 2 నెలలుగా మార్కెట్కి రోజుకు టన్ను టమాటా తీసుకొస్తున్నా. కేజీ రూ.3 కంటే తక్కువే పలుకుతోంది. ఈ రోజు కిలోకు రూ.2 ఇస్తున్నారు. గతేడాది ఇలాగే ధరలేక నష్టపోయాం. ఈసారి కూడా ధర లేక నష్టపోతున్నాం. ఉరవకొండ మార్కెట్కు వచ్చే రైతులందరిదీ ఇదే పరిస్థితి. – ఎ.రామాంజనేయులు, షేక్షానిపల్లి, అనంతపురం -
ఏపీలో వంట గ్యాస్ సంక్షోభం
ఉత్తరాంధ్రలోని ఓ గ్యాస్ ఏజెన్సీ నెలకు 17 వేలకుపైగా సిలిండర్లు డెలివరీ చేసేది. నిత్యం 650కిపైగా బుకింగ్లు వచ్చేవి. ఈ నెలలో ఇప్పటి వరకు 10 వేల సిలిండర్లు మాత్రమే డెలివరీ చేసింది. పెండింగ్లో ఇంకా 7 వేల బుకింగ్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో కంపెనీ నుంచి వచ్చే స్టాక్ ఇప్పుడు తగ్గిపోయింది. మరోవైపు ఆందోళనతో బుకింగ్లు డబుల్ అవుతున్నాయి.దీంతో గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. సిలిండర్ బుక్ చేసి 10–15 రోజులవుతున్నా డెలివరీ ఇవ్వలేదని, ఎప్పుడిస్తారని వినియోగదారులు ఫోన్లు చేసి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామని సదరు ఏజెన్సీ డీలర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్రంలో గ్యాస్ ఏజెన్సీ డీలర్లందరిదీ ఇదే పరిస్థితి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట గ్యాస్ సంక్షోభం ముదురుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కొంగ జపం చేస్తోంది. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు పది రోజులైనా సిలిండర్లు డెలివరీ చేయలేక ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నా, ప్రభుత్వం మాత్రం అబ్బే.. అంత సమస్య లేదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. గ్యాస్ కొరతతో హోటళ్లు, హాస్టళ్లు మూతపడేలా చేసింది. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన సర్కార్.. ప్రత్యామ్నాయం చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.వాస్తవానికి గృహ వినియోగ గ్యాస్ బుకింగ్లకు తగ్గట్టు సరఫరా జరగడం లేదు. ఏపీలో 1.61 కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉండగా, గతంలో నెలకు సగటున 70 లక్షలకుపైగా సిలిండర్లు డెలివరీ అయ్యేవి. అంటే రోజుకు 2.5 లక్షలకుపైగా సిలిండర్లు డెలివరీ ఇస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1.80 లక్షలకు పడిపోయింది. మొత్తంగా 60 శాతం కొరత! ఏపీలో గృహ వినియోగ అవసరాల కోసం రోజుకు 4 వేల టన్నుల గ్యాస్ నిల్వలు అవసరం. ప్రస్తుతం ఏపీలో 14 వేల టన్నుల నిల్వ ఉందని, నాలుగు రోజులకు సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, సాధారణ రోజులతో పోలిస్తే ఇప్పుడు ఏజెన్సీలకు సరఫరా చేసే గ్యాస్లో 15–20 శాతం తగ్గుదల ఉంటోంది. ఫలితంగా 40 శాతం వరకు డెలివరీలు పెండింగ్లో ఉంటున్నాయి. మొత్తంగా క్షేత్ర స్థాయిలో 60 శాతం గ్యాస్ కొరత ఉంటే, ప్రభుత్వం మాత్రం కాకి లెక్కలు చూపిస్తూ ప్రజలను మభ్య పెడుతోంది.2025 మార్చిలో ఏజెన్సీలకు సరఫరా చేసిన గ్యాస్కు.. ఈ నెలలో గ్యాస్ స్టాక్లో తీవ్రమైన తగ్గుదల ఉందని డీలర్లు వాపోతున్నారు. పైగా ఉగాది, రంజాన్ సెలవులు రావడంతోపాటు ఆదివారం సెలవును సాకుగా చూపించి, రాష్ట్రంలోని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ కారణంగా వారం రోజుల డెలివరీలను 10 రోజులైనా చేయలేకపోతోంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ ఆదివారం సెలవు తీసుకోని ప్లాంట్లు ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదన్నది అతిపెద్ద ప్రశ్న. ఇంకో వైపు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా తగ్గించి, వాటిని పట్టణ ప్రాంతాలకు మళ్లిస్తోంది. అయినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లోనూ సమయానికి వినియోగదారులకు గ్యాస్ అందట్లేదు. ప్రజలే భారం మోయాలా? సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం చంద్రబాబుకు అలవాటేనని, తాజాగా గ్యాస్ సమస్యలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా గ్యాస్ కొరత లేదు. అక్కడి హోటళ్లు మూత పడలేదు. వినియోగదారులు ఏజెన్సీల ఎదుట క్యూ కట్టలేదు. కానీ, బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్లో మాత్రం గ్యాస్ కోసం ప్రజానీకం అల్లాడుతోంది. ఆహార, వాణిజ్య రంగం కుదేలయ్యే పరిస్థితికి వచ్చింది.ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఉచిత సలహాలు మినహా పేదలకు ఒరగబెట్టింది ఏదీ కనిపించట్లేదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గ్యాస్ కొరత లేదంటూనే రాష్ట్ర వ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వినియోగాన్ని పెంచాలని ఆదేశాలు జారీ చేస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. పైగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగాన్ని ప్రోత్సహించాలంటూ పేదల నెత్తిపై భారం మోపే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి ఒక మధ్య తరగతి కుటుంబం సగటున 14.2 కిలోల సిలిండర్ను నెలన్నరకుపైగా వినియోగిస్తుంది.అంటే, రూ.937 వెచ్చిస్తే దాదాపు 45 రోజులకుపైగా గ్యాస్పై వంట చేసుకోవచ్చు. కానీ, పీఎన్జీ తీసుకుంటే రూ.వేలల్లో కనెక్షన్ ఫీజు ముందుగా కట్టడంతోపాటు నెలకు రూ.1000కిపైగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే, సాధారణ సిలిండర్ కంటే పీఎన్జీ కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఉచిత సలహా ఇస్తుండటం ఆరి్థక వేత్తలను కలవరపెడుతోంది. ‘కిరోసిన్’ లీకులతో కాలక్షేపం చంద్రబాబు సర్కార్ గ్యాస్ కొరత లేదంటూనే పేదలకు ప్రత్యామ్నాయంగా కిరోసిన్ పంపిణీ చేస్తామని లీకులు ఇచ్చింది. తొలుత ఏజెన్సీ ఏరియాల్లో రేషన్ డీలర్ల ద్వారా కిరోసిన్ పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. తీరా చూస్తే ఏపీలో అందుబాటులో ఉన్న కిరోసిన్ నిల్వ కేవలం 2,700 కిలో లీటర్లు మాత్రమే. వాస్తవానికి 1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి లీటరు చొప్పున కిరోసిన్ ఇవ్వాలంటే సుమారు 14,800 కిలో లీటర్లు అవసరం.కానీ, 18 శాతం కూడా పంపిణీకి సిద్ధంగా లేకపోయినా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రకటనలు గుప్పించింది. కిరోసిన్ ఫ్రీ స్టేట్గా మారిన ఏపీని చంద్రబాబు మళ్లీ కిరోసిన్ ఆధారిత రాష్ట్రంగా మార్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 20కి పైగా కిరోసిన్ ఫ్రీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. గ్యాస్ కొరతతో ఏ రాష్ట్రం కూడా కిరోసిన్ వినియోగంపై ఆలోచన చేయట్లేదు. కానీ, ఒక్క ఏపీలో మాత్రమే కిరోసిన్ పంపిణీ మళ్లీ పునఃప్రారంభించాలని చూడటం స్థానికంగా దిగజారిన జీవన ప్రమాణాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఒకవేళ సర్కారు కిరోసిన్ పంపిణీ చేసినా ప్రజలు కిరోసిన్ స్టవ్ల కోసం దుకాణాలకు పరుగుపెట్టాలి. ఆ మేరకు కిరోసిన్ స్టవ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయా? రాష్ట్రంలో ఇదీ పరిస్థితి ⇒ సింగిల్ సిలిండర్ ఉన్న వారు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ⇒ వాణిజ్య గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపి వేయడంతో పది రోజులుగా వ్యాపారాలు చతికిలపడ్డాయి. ⇒ బ్లాక్ మార్కెట్ దందాకు గేట్లు తెరుచుకున్నాయి. రూ.2 వేలు ఉండే ఒక్కో సిలిండర్ను రూ.4 వేల నుంచి రూ.4500 వెచ్చించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ⇒ చిరు హోటల్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది. రూ.వేలు పెట్టి సిలిండర్లు కొనలేక, హోటళ్లను మూసేస్తున్నారు. టీ దుకాణాల్లో ‘స్పెషల్ టీ’ల అమ్మకాలు ఆపేశారు. ⇒ ప్రభుత్వం చాలా చోట్ల హాస్టళ్లకు కూడా సిలిండర్లను సరఫరా చేయించలేకపోతోంది. ⇒ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లకు బ్లాక్ మార్కెట్లో గ్యాస్ కొనగలిగే స్తోమత ఉంటుంది. కానీ, 25 వేల మంది చిరు వ్యాపారులు ఆ భారాన్ని మోయలేక కొందరు దుకాణాలు మూసేయగా, మరికొందరు ప్రత్యామ్నాయ పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రైవేటు హాస్టళ్లు, స్కూళ్లు ఉగాది, రంజాన్ సెలవులను సాకుగా చూపించి విద్యార్థులను ఇళ్లకు పంపించేశాయి.స్టాక్ మేరకు పంపిణీ చేస్తున్నాంమా ఏజెన్సీల్లో స్టాక్ ఉన్నంత మేరకు వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేస్తున్నాం. ఫస్ట్ బుకింగ్.. ఫస్ట్ ప్రయార్టీ ప్రకారం చేస్తున్నాం. గృహ వినియోగదారులు ఎవరి సిలిండర్లను వారే వాడుకోవాలి. వాణిజ్య సిలిండర్లు తొలుత పట్టణాల్లో 30 శాతం మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తాయి. – కె.శ్రీనాథ్రెడ్డి, ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
రాజధాని డిజైన్లకే 401.54 కోట్లు.. షాక్ లో ఇంజనీరింగ్ నిపుణులు
-
డిజైన్లకు ఏకంగా 401 కోట్ల 54 లక్షల రూపాయలు... ‘అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్’ డిజైన్ల వ్యయంలో రికార్డు బద్ధలు కొట్టిన చంద్రబాబు సర్కారు
-
నేడు సీహెచ్వోల మహా ధర్నా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వేధింపులను నిరసిస్తూ, తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)లు సోమవారం విజయవాడలో రాష్ట్రస్థాయి మహా ధర్నాకు దిగబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వారంతా పలుమార్లు నిరసనలు తెలిపారు. గతేడాది ఏకంగా 40 రోజుల పాటు విధులు బహిష్కరించి సమ్మె కూడా చేశారు.అయినా తీరు మార్చుకోని ప్రభుత్వం.. విలేజ్ హెల్త్ క్లినిక్స్లో వైద్య సేవలు అందిస్తున్న సీహెచ్వోలను రాత్రి 8 గంటలకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) హాజరు వేయాలంటూ వేధిస్తోంది. వారికి ఇవ్వాల్సిన నెలవారీ ఇన్సెంటివ్ రూ.5 వేలకు.. రాత్రి 8 గంటల హాజరుతో ముడిపెట్టింది. దీనిపై సీహెచ్వోలు గత కొన్నిరోజులుగా ఆందోళన తెలియజేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ హెల్త్ మిషన్ మార్గదర్శకాల్లో కూడా రాత్రి 8 గంటలకు హాజరు వంటి ప్రస్తావనే లేదని వారు మండిపడుతున్నారు. తమ పని సమయాన్ని, విధులను వెంటనే క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ముఖ్యమైన డిమాండ్లు.. ⇒ అసాధారణమైన పనిభారం నుంచి విముక్తి కల్పించాలి. ప్రస్తుతం అమలు చేస్తున్న న్యూ మేట్రిక్స్ విధానాన్ని రద్దు చేసి.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నెలవారీ రూ.15 వేల ఇన్సెంటివ్ విధానం అమలు చేయాలి. ⇒ అద్దె భవనాల్లో ఉన్న విలేజ్ క్లినిక్స్కు మూడు నెలల అద్దె అడ్వాన్స్ చెల్లించాలి. ⇒ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్వోల సర్వీస్ను క్రమబద్ధీకరించాలి. పెరిగిన జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ⇒ గతేడాది చేపట్టిన 40 రోజుల సమ్మె కాలాన్ని పనిదినాలుగా పరిగణించి.. వేతనాలు, ఇన్సెంటివ్స్ వెంటనే విడుదల చేయాలి. ⇒ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో వెయిటింగ్ హాల్, టెలిమెడిసిన్, డే కేర్ రూమ్స్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి తేవాలి. -
పోరుబాటలో అంగన్వాడీలు
సాక్షి, అమరావతి: వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి అంగన్వాడీలు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓ.సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఏడాది నుంచి వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదన్నారు. విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు.ఆ సమయంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చర్చలకు పిలిచి సీఎంతో మాట్లాడి స్పష్టమైన హామీ ఇస్తామని చెప్పి ఇంత వరకూ స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. ఇప్పుడు ఉద్యమాలు చేస్తే జీతాలు కట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతోందన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదని లేదని.. డిమాండ్స్ సాధనకు మరోసారి పోరుబాట పడతామని సుబ్బరావమ్మ స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.నాగశేషు, ఉపాధ్యక్షురాలు ఎన్సీహెచ్ సుప్రజ, కోశాధికారి బి.లక్షి్మదేవి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర కమిటీ తీర్మానంలో ఆమోదించిన డిమాండ్లు ఇవే..⇒ నెలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి ⇒ హెల్పర్ ప్రమోషన్ గైడ్లైన్స్ జీఓ 5కు సవరణ చేయాలి.⇒ మేలో ప్రీ స్కూల్ పిల్లలకు నెల మొత్తం టేక్ హౌస్ రేషన్ (టీహెచ్ఆర్) ఇచ్చి అంగన్వాడీలకు సెలవులు ఇవ్వాలి⇒ గ్రాట్యుటీకి నిర్ధిష్టమైన గైడ్లైన్స్ ఇచ్చి అమలు చేయాలి -
డిజైన్లకే రూ.401.54 కోట్లు!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల వ్యయమే కాదు.. భవనాల డిజైన్ల (ఆకృతులు) ఖర్చులోనూ చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు బద్ధలు కొడుతోందని ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ నిపుణులు నివ్వెరపోతున్నారు. డిజైన్ల పేరుతో ఒకసారి.. ఆర్కిటెక్చరల్ డిజైన్లకు ఇంకోసారి.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ధారపోయటాన్ని తప్పుబడుతున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం (అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్) డిజైన్ల రూపకల్పన పనులను చంద్రబాబు సర్కారు ఏకంగా రూ.401.54 కోట్లకు కన్సల్టెన్సీలకు అప్పగించటంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) డిజైన్ల రూపకల్పనకు 2016లో నిర్వహించిన టెండర్లలో జపాన్కు చెందిన ‘మకీ’ అసోసియేట్స్ను చంద్రబాబు సర్కార్ తొలుత ఎంపిక చేసింది. ఆ తర్వాత ఆ టెండర్ను రద్దు చేసిన సమయంలో మకీ ఛైర్మన్ పుమిహికో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, టెండర్లలో పారదర్శకత ఉండదని, లోపాయికారీ ఒప్పందాలే ఉంటాయని పుమిహికో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బ తీశాయని పేర్కొంటున్నారు.డిజైన్ల పేరుతో ఒకసారి.. ఆర్కిటెక్చరల్ డిజైన్లకు ఇంకోసారి..రాజధానిలో నేలపాడు వద్ద 1,575 ఎకరాల్లో ‘ఏజీసీ’ని ప్రభుత్వం నిర్మిస్తోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల (హెచ్వోడీ) కోసం 39 అంతస్తులతో నాలుగు టవర్లు, 49 అంతస్తులతో మరో టవర్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఈ ప్రాంగణంలో నిర్మిస్తోంది. ఈ ఏడు భవనాలతోపాటు ఏజీసీ ప్రాంతాన్ని నిర్మించడం కోసం డిజైన్లకు 2016లో చంద్రబాబు సర్కార్ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను తొలుత జపాన్కు చెందిన ‘మకీ’ సంస్థ దక్కించుకుంది. కానీ వాటిని 2016 అక్టోబర్ 24న ఎలాంటి కారణాలు లేకుండా రద్దు చేశారని మకీ సంస్థ ఛైర్మన్ పుమిహికో అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2016 అక్టోబర్ 28న నాటి టీడీపీ సర్కారు మళ్లీ టెండర్లు పిలిచింది. లండన్కు చెందిన ఫోస్టర్ పార్టనర్స్తో కలసి హఫీజ్ కాంట్రాక్టర్ జాయింట్ వెంచర్గా ఏర్పడి రూ.67,86,44,683కు ఏజీసీ మాస్టర్ ఆర్కిటెక్ట్ పనులను దక్కించుకుంది. ఆ సంస్థ రూపొందించిన డిజైన్లు, గ్రాఫిక్లను ప్రదర్శిస్తూ.. రాజధాని నిర్మాణం పూర్తయిందనే రీతిలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ఫోస్టర్ పార్టనర్స్–హఫీజ్ కాంట్రాక్టర్(జేవీ) సంస్థ రూపొందించిన డిజైన్లతోనే భవనాల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు గతేడాది ప్రభుత్వం అప్పగించింది. హైకోర్టు, అసెంబ్లీ భవనాల సమగ్ర ఆర్కిటెక్చరల్ డిజైన్లు రూపొందించే పనులకు 2024 అక్టోబర్ 27న టెండర్ల ద్వారా రూ.136,90,74,000కు హఫీజ్ కాంట్రాక్టర్కు అప్పగించింది. ఏజీసీ ప్రాంతాన్ని జలమార్గం, బ్రిడ్జిలతో తీర్చిదిద్దే పనుల డిజైన్ రూపకల్పనకు 2025 ఆగస్టు 13న నిర్వహించిన టెండర్ల ద్వారా రూ.59,90,00,000కు హఫీజ్ కాంట్రాక్టర్ సంస్థకే కట్టబెట్టింది.లోపాయికారీ ఒప్పందం కాకపోతే మరేమిటి?సచివాలయం, హెచ్వోడీ కార్యాలయాల కోసం ఏజీసీలో నిర్మిస్తున్న ఐదు టవర్లను కళాత్మకంగా తీర్చిదిద్ది ఆర్కిటెక్చరల్ సేవలు అందించే పనులను 2017 మే 2న చంద్రబాబు సర్కార్ నిర్వహించిన టెండర్లలో రూ.112,58,69,400కు జెనిసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. కానీ.. అప్పట్లో ఐదు టవర్ల నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. దాంతో ఆ టెండర్లను 2024 అక్టోబర్ 27న రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లలో కూడా రూ.136,88,40,800కు జెనిసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థే పనులు దక్కించుకోవడం గమనార్హం. దీన్ని బట్టి లోపాయికారీ ఒప్పందం జరిగిందన్నది స్పష్టమవుతోందని ఆర్కిటెక్చర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఏజీసీలో భవనాల నిర్మాణం డిజైన్ల తయారీ పనులనే రూ.401.54 కోట్లకు కన్సల్టెన్సీలకు అప్పగించడం గమనార్హం. ఆర్కిటెక్ట్స్ అందరూ ఫోర్బ్స్ మ్యాగజైన్లా భావించే ‘ఆర్కిటెక్చరల్ డైజెస్ట్’ మ్యాగజైన్ 2017 ఏప్రిల్లో ప్రచురించిన సంచికలో మకీ సంస్థ ఛైర్మన్ పుమిహికో రాసిన వ్యాసంలో వెల్లడించిన అంశాలను పరిశీలిస్తే.. రాజధాని డిజైన్ల తయారీలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు వెల్లడవుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి దుబారా చేస్తున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు. చదవండి: దళిత యువతిపై పెట్రేగిన పోలీసులు -
జగన్ ప్రభుత్వమే బాగుండేది కొంపముంచిన అకాల వర్షాలు కూటమిపై రైతుల ఆగ్రహం
-
టీటీడీ ల్యాబ్ క్రెడిట్ చోరీ
-
బాబు తిరుమల టూర్ లో BR నాయుడు ఎక్కడ?
-
సినిమాలో బ్రహ్మానందం రాజకీయాల్లో చంద్రబాబు...
-
దేశంలో తొలిసారి మిస్టేక్ అఫ్ ఫ్యాక్ట్ కింద కేసులను కొట్టేశారు
-
YSRCP బూత్ కమిటీ సమావేశం.. నేతలకు RK రోజా సూచన
-
తినేది పెరుగన్నం నిమ్మకాయ బద్ద ఆస్తులు మాత్రం 20 లక్షల కోట్లు.. శ్రవణ్ షాకింగ్ నిజాలు
-
మీరు ఎంత అడ్డుకున్నా.. అది జరగినివ్వం బాబుపై నిప్పులు చెరిగిన కాకాణి
-
జాబులు దాచిపెట్టి క్యాలెండర్ విడుదల... ఏపీలో 22 నెలల్లో ఒక లక్ష 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ.. కేవలం 10 వేల 60 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్
-
చంద్రబాబుకు ఈసీ షాక్ పంచాయతీ ఓటర్ల లిస్ట్ తప్పనిసరి!
-
అబద్ధాల జాతర.. కొలువులకు పాతర
ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో. డేటు టైము రాసుకో. జగన్లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను.– 2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో నారా లోకేశ్తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2025 జనవరి ఫస్ట్న జాబ్ కేలండర్ ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్స్.. ఎప్పుడు ఇంటర్వూలు.. ఎప్పుడు ఆఫర్ లెటర్లు ఇస్తాం అన్నది చాలా స్పష్టంగా చెబుతాం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ మేమిస్తాం.– 2024 ఏప్రిల్లో ఉరవకొండలో లోకేశ్ఉద్యోగాలు పెద్ద ఎత్తున కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ భృతికి లింక్ చేస్తాం. కాబట్టి సూపర్–6 హామీలు అయిపోయాయి. గుర్తు పెట్టుకోండి.. ఇంక ఎవడైనా సూపర్–6 అని మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటిగాదు.– 2025 జూన్ 12న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబుఈ రోజు వరకు 18 నెలల కాలంలో నేను దాదాపు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాను. ఈ మొత్తం 23 లక్షల కోట్ల ఉద్యోగాలను తెచ్చింది.’ – జనవరి 26న ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో సీఎం చంద్రబాబురాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3,371 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీలను మరో మూడు నెలల్లో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – మార్చి 4న శాసన మండలిలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్సీన్ కట్ చేస్తే..2024 ఎన్నికలకు ముందు.. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అప్పటి వరకు ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆ మేరకు చంద్రబాబు అండ్ కో సంతకాలు చేసి మరీ ఇంటింటికీ బాండ్లు ఇచ్చారు. అదే విషయాన్ని వారి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ప్రస్తుతం వారు అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతోంది. ఒక్కరంటే ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఈ 22 నెలల్లో నిరుద్యోగులకు రూ.13,200 కోట్లు ఎగ్గొట్టారు.మునుపటికొకడు పంచ పాండవులంటే మంచం కోళ్లులాగా ముగ్గురు అంటూ రెండు వేళ్లు చూపించాడట. ఉద్యోగాల కల్పన విషయంలో చంద్రబాబు సర్కారు తీరు సరిగ్గా అలానే ఉంది. ఉద్యోగాలు పొందిన వారి గురించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఒక్కో చోట ఒక్కో రకంగా నోటికొచ్చినట్లు చెబుతూ పబ్బం గడుపుకుంటుండటం నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమవుతోంది.ఎన్నికలకు ముందు ఇంటింటికీ బాండ్లు⇒ ‘మేం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం’ అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసి మరీ ఎన్నికలకు ముందు ఇంటింటికీ బాండ్లు పంచారు. అదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్–6లో సైతం ప్రథమంగా పేర్కొన్నారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ కేలండర్ కూడా ప్రకటిస్తామన్నారు.⇒ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా 2025 జూన్లో సూపర్–6 హామీలన్నీ అమలు చేసేశామని ప్రకటించేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున గడిచిన 22 నెలలకు ఒక్కో నిరుద్యోగ అభ్యర్థికి రూ.66 వేల చొప్పున రాష్ట్రంలో 20 లక్షల మందికి రూ.13,200 కోట్లు బకాయి పడ్డారు. ఇలా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే నాలుక మడత పెట్టేశారంటే సామాన్య ప్రజలతో పాటు నిరుద్యోగులకు ఎంత దగా చేశారో తెలుస్తోంది. ⇒ ప్రస్తుతం ఈ మాటలన్నీ కలగానే మిగిలిపోయాయి. 20 లక్షల మంది నిరుద్యోగులను దగా చేశారు. ఒక్కరంటే ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. చిన్నా చితక కంపెనీల్లో వాచ్మెన్ ఉద్యోగాలు పొందిన వారిని చూపిస్తూ నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ⇒ ఇటీవల శాసనసభలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ నిరుద్యోగ భృతిపై సమాధానమిస్తూ నిరుద్యోగ భృతి చెల్లించడం లేదని, దానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు యువకులు, నిరుద్యోగులకు చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీలు ఆవిరైపోయాయి. నాడు నిరుద్యోగులకు అరచేతిలో ఉద్యోగాలు చూపెట్టిన ‘ముఖ్య’ నాయకులు ఇప్పుడు కేలండర్ అంటే కాదంటున్నారు. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ కేలండర్ ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. 2025, 2026 జనవరి నెలలు దాటిపోయినా కేలండర్ కాదు కదా.. కనీసం కొత్త నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం లేదు. ఓ పక్క ఏటా దాదాపు 75 వేల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం పొందే వయో పరిమితి దాటిపోయి, అర్హత కోల్పోతుంటే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకపోగా.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన డిగ్రీ, జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ తదితర పోస్టులకు పరీక్షలు నిర్వహించడంపై మీన మేషాలు లెక్కిస్తోంది. ఏఈఈ, ఏఈ వంటి పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వకపోగా, 20 లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తామన్న భృతిని సైతం ఎగ్గొట్టింది. జాబ్ కేలండర్పై నిరుద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగి ఆందోళనలు చేపడితే, వారిపై కేసులు బనాయించి అరెస్టులకు తెగబడుతోంది. జాబ్ కేలండర్ ఇవ్వకుండా ‘ఉగాదికి 10 వేల ఉద్యోగా’లంటూ లీకులిచ్చి నెట్టుకొస్తోంది.10 లక్షల మంది నిరుద్యోగుల ఆశలు గల్లంతుఅధికారంలోకి రాగానే ఏటా జనవరిలో జాబ్ కేలండర్ ఇస్తామన్న చంద్రబాబు హామీ అటకెక్కింది. గత ప్రభుత్వంలో ప్రకటించిన 21 నోటిఫికేషన్లకు సంబంధించి గ్రూప్–1, 2 తప్ప ఇతర ఉద్యోగాలపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ భవితవ్యం ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు. గత 22 నెలలుగా జాబ్ కేలండర్ మాట అటుంచి, ఏపీపీఎస్సీ నుంచి ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంగా మార్చేశారు. ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ (వన్టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్)లో నమోదైన గ్రాడ్యుయేట్లు ఏటా 75 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ అర్హత వయసు దాటిపోయి, అవకాశాలు కోల్పోతుంటే కూటమి ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అంటూ శాసన సభలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఈనాడు కథనం గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో నోటిఫికేషన్తో పాటే పరీక్షలు ఎప్పుడు జరిగేదీ షెడ్యూల్ ప్రకటించి, దాని ప్రకారమే పరీక్షల నిర్వహణ, పోస్టులు భర్తీ చేసేవారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని నీరుగార్చింది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి దాపురించింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి, 2025 డిసెంబర్ నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ ఇటీవల గ్రూప్–2, గ్రూప్–1 నోటిఫికేషన్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. కానీ డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు రెగ్యులర్ నోటిఫికేషన్ ఫలితాలు ఇంకా చీకటిలోనే ఉండిపోయాయి. లీకులతో కాలయాపన రెండేళ్లుగా జాబ్ కేలండర్పై తాత్సారం చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ఉద్యోగాలపై లీకులిస్తూ కాలయాపన చేస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీ చేయాలంటే ముందుగా శాఖల్లో పోస్టుల ఖాళీలను గుర్తించాలి. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే గతేడాది 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు ప్రకటించి, నిరుద్యోగ యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అంతేగాక, ప్రభుత్వం వద్ద నాలుగు శాఖల్లో 1125 ఏఈఈ, ఏఈ ఖాళీలున్నా నోటిఫికేషన్ ఇవ్వలేదు. తాజాగా 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉగాదికి జాబ్ కేలండర్ అంటూ కొత్త ప్రచారం తెరపైకి తెచ్చి నిరుద్యోగులను మరోసారి వంచించే పనికి పూనుకుంది. మోసం చేయడం బాబుకు కొత్త కాదుచంద్రబాబు నిరుద్యోగులను మోసం చేయడం కొత్తేమి కాదు. 2014–19 మధ్య రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆపై నాలుగున్నరేళ్లకు పైగా ఆ ఊసే ఎత్తేలేదు. 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినా, పైసా కూడా ఇవ్వలేకపోయారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో 2019 ఎన్నికలకు ముందు ‘యువనేస్తం’ పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపారు. విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి, సవాలక్ష ఆంక్షలు విధించి, నిరుద్యోగ భృతి పొందే వారి సంఖ్యను భారీగా కుదించారు. తొలుత 12 లక్షలకు పైగా నిరుద్యోగులను భృతికి అర్హులుగా తేల్చగా.. తరువాత 10 లక్షలకు కుదించారు. మళ్లీ అందులో 2.10 లక్షల మందే అర్హులంటూ 1.62 లక్షల మందికే ఇస్తామన్నారు. దీనికి ఈకేవైసీ లింక్ పెట్టి అతి కొద్ది మందికే నిరుద్యోగ భృతి ఇచ్చి మమ అనిపించారు. ఈసారి 20 నెలల్లో ఒక్కరికి కూడా భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.గత ప్రభుత్వంలో ఉద్యోగ జాతర.. ఉద్యోగులకు పండుగ⇒ దేశ చరిత్రలో ఉద్యోగాల కల్పనలో 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ను వైఎస్ జగన్ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిపింది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగాలతో కలిపి 6,31,310 మందికి ఉద్యోగాలు ఇచ్చింది.⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా ఉద్యోగాల నియామకం చేపట్టారు.⇒ భారీ మధ్య తరహా పరిశ్రమల్లో 1.02 లక్షల మందికి, ఎంఎస్ఎంఈ రంగంలో 32,79,970 మందికి ఉపాధి కల్పించి దేశంలో అగ్రగామిగా నిలిపింది.⇒ ఆరు నెలలు తిరక్కుండానే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించారు. ఆప్కాస్ ద్వారా 96 వేల ఉద్యోగాలు కల్పించారు. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. సర్వీస్ కమిషన్ ద్వారా 78 నోటిఫికేషన్లతో 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేశారు.⇒ 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పనితీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ⇒ భారీ మధ్య తరహా పరిశ్రమల్లో 1.02 లక్షల మందికి, ఎంఎస్ఎంఈ రంగంలో 32,79,970 మందికి ఉపాధి కల్పించి దేశంలో అగ్రగామిగా నిలిపింది.⇒ అంగన్వాడీ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, రిసోర్స్పర్సన్లు, మున్సిపల్ కార్మికులకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా వీరి జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి మూడింతలు బడ్జెట్ పెరిగినా లెక్క చేయకుండా లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా 27 శాతం ఐఆర్ ఇచ్చింది. వీటన్నింటిని బట్టి ఉద్యోగులకు మంచి జరిగిందీ అంటే అది గత వైఎస్ జగన్ ప్రభుత్వంలోనేనని ఇట్టే స్పష్టమవుతోంది. -
వక్ఫ్ భూముల జోలికొస్తే.. కూటమికి అంజాద్ బాషా వార్నింగ్
-
బరితెగించిన సీఎం హెరిటేజ్ కు 100 కోట్ల ప్రజా సొమ్ము
-
చచ్చినా సమస్య తీరట్లేదు.. అన్నదాతల ఆత్మఘోష
సాక్షి, అమరావతి/కృష్ణలంక(విజయవాడ తూర్పు): ధాన్యపు సిరులతో గాదెలు నిండాల్సిన ఇంట్లో దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్దయ కారణంగా పెద్ద సంఖ్యలో అన్నదాతలు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలనుæ ఆదుకోవడంతో విఫలమవడంతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రెండేళ్లుగా పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. రైతు ఆత్మహత్యలను కనీసం నమోదు చేసేందుకు కూడా ఈ దయలేని ప్రభుత్వం ఇష్టపడటం లేదు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి.. ఆదుకునే ఆపన్న హస్తం లేకపోవడంతో ఇంట్లో ఒక పూట తింటే రెండో పూట పొయ్యి వెలిగించలేని దుస్థితిలో ఆ రైతు కుటుంబాలు బతుకులీడుస్తున్నాయి. పిల్లలను అర్ధంతరంగా చదువులు మాన్పించి, మూకుమ్మడిగా కూలి పనులకు పోవాల్సిన ఆగత్యం దాపురించింది. కనీసం వైద్యం కూడా చేయించుకోలేని దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నారు. రెండేళ్లుగా పరిహారం కోసం అధికారుల చుట్టూ, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా కనికరించడం లేదు. భర్త చనిపోతే ఇచ్చే వితంతు పింఛన్లకు కూడా అన్నదాతల భార్యలు నోచుకోలేకపోతున్నారు. రూ.వేల కోట్లు ఎగనామం పెట్టే బడా పారిశ్రామిక వేత్తలకు వన్ టైం సెటిల్మెంట్ అంటూ వారు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్న వేళ.. రైతన్నల అప్పులను మాఫీ కాదు కదా, కనీసం వాయిదా వేయించలేక పోతోంది.భూ యజమానులతో పాటు ప్రతి కౌలు రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామంటూ సూపర్ సిక్స్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండేళ్లు గడిచినా పైసా విదిల్చిన పాపాన పోలేదు. కనీసం పంటల బీమా పరిహారం కాదు కదా.. పెట్టుబడి రాయితీ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో 2024–2025లో 150 మంది.. 2025–2026లో ఇప్పటి వరకు ఏకంగా 393 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పోలీసు శాఖ అధికారికంగా ప్రకటించించిన సంఖ్య ఇది. రికార్డుల్లోకి ఎక్కని మృతులు ఇంకెంత మంది ఉన్నారో! బాధితులెవ్వరికీ ఈ ప్రభుత్వం పైసా పరిహారం ఇవ్వలేదు. స్వచ్ఛంద సంస్థలను చూసి సర్కారు సిగ్గు పడాలిరాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన 17 మంది రైతుల కుటుంబాలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ (ఆర్డీఎస్ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాల సభ్యులు తమ గోడు వెళ్లబోసుకున్నాయి. ఆర్డీఎస్ఎస్ ద్వారా ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రూ.8.50 లక్షల ఆర్థిక సాయం అందించారు.రైతులను ఎంతో కొంత ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయే తప్ప ప్రభుత్వంలో మాత్రం చలనం కన్పించడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంఘీభావ సమావేశంలో బాధిత కుటుంబ సభ్యుల ఆక్రందనలు అక్కడున్న వారందరి హృదయాలను కదిలించాయి. స్వచ్ఛంద సంస్థలను చూసి ప్రభుత్వం కొంచెమైనా సిగ్గు తెచ్చుకుంటే మేలని సమావేశానికి హాజరైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.⇒ ఈమె పేరు భూమా సునీత. నంద్యాల జిల్లా రైతు నగరానికి చెందిన ఈమె భర్త సురేష్ రెడ్డి.. ఏడెకరాలు కౌలుకు తీసుకొని రూ.4 లక్షలు అప్పులు చేసి వరి పంట వేశాడు. వర్షాల్లేక పోవడంతో పాటు తెగుళ్ల బారిన పడడంతో పంట పూర్తిగా దెబ్బతింది. చేసిన అప్పులు తీర్చే దారిలేక 2024 అక్టోబర్ 10న ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మట్టి ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేక పోవడంతో ఇరుగు పొరుగు వారు తలో చేయి వేసి అంత్యక్రియలు చేశారు. తండ్రి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. ‘భూ యజమానితో అగ్రిమెంట్ కూడా ఉంది. అయినా మా ఆయనకు కౌలు కార్డు ఇవ్వలేదు. సాయం చేయమని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ను కలిసి వేడుకుంటే ‘కౌలు కార్డు లేదు.. ఏమీ చేయలేం వెళ్లిపోండి అని తిప్పి పంపేశారు. వితంతు పింఛన్ ఇవ్వమని వేడుకున్నా పట్టించుకోలేదు. నాకు ఇద్దరు చిన్నపిల్లలు. అత్త హోటల్ పనికి పోతూ మమ్మల్ని చూసుకుంటోంది’ అని సునీత కన్నీరు మున్నీరవుతోంది.⇒ ఈమె పేరు చింతకుంట సుధారాణి. నంద్యాల జిల్లా పాములపాడు మండలం బానుముక్కల గ్రామం. ఈమె భర్త సుందరరాజు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. వర్షాభావంతో పంట దెబ్బ తినడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక పురుగు మందు తాగి 2025 జనవరి 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నాకు నలుగురు ఆడ పిల్లలు. భర్త చనిపోయే నాటికి గర్భిణిగా ఉన్నాను.వ్యవసాయ అవసరాల కోసం నా భర్త చేసిన రూ.8 లక్షల అప్పుతో పాటు డ్వాక్రాలో మరో రూ.50 వేల అప్పు ఉంది. ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. కనీసం నా భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా నమోదు చేయలేదు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య దగ్గరకు వెళ్లి కనీసం పింఛన్ ఇప్పించాలని వేడుకున్నా వినిపించుకోలేదు. మా అత్త కూలి పనికి వెళుతూ మమ్మల్ని చూసుకుంటోంది. ఎలా బతకాలో అర్థం కావడం లేదు’ అంటూ సుధారాణి కన్నీటి పర్యంతమైంది.పిల్లాడికి వైద్యం చేయించలేకపోతున్నా మా ఆయన సుదర్శన్. ఆరెకరాలు కౌలుకు తీసుకొని వరి వేశాడు. బాబుకు గుండె సమస్య ఉంది. బోల్డెంత ఖర్చవుతుందన్నారు. వ్యవసాయంతో పాటు బాబుకి వైద్యం కోసం రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. వర్షాభావంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేసిన అప్పులు తీర్చేదారి లేక గతేడాది అక్టోబర్ 18న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అత్త, మామలు మా వల్ల కాదని ఇంటి నుంచి పంపించేశారు. అమ్మ వాళ్ల దగ్గరే ఉంటున్నా. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మీకు కౌలు కార్డు లేదు.. పరిహారం రాదు.. అని చెబుతున్నారు. కనీసం పింఛన్ అయినా ఇవ్వమని వేడుకున్నా పట్టించుకోవడం లేదు. ఓ పక్క అప్పులోళ్లు రోజూ ఇంటికి వస్తున్నారు. మరో పక్క బాబుకు వైద్యం ఏ విధంగా చేయించుకోవాలో అర్థం కావడం లేదు. ఎలా బతకాలో కూడా తెలియడం లేదు. – మైలుగాని మమతమ్మ, ఇల్లూరు, గార్లెదిన్నె మండలం, అనంతపురం జిల్లాఎన్ని అర్జీలు పెట్టినా పట్టించుకోలేదు నా భర్త సుర్ల బెన్నయ్య మూడెకరాల్లో పత్తి, టమాటా, పచ్చి మిరప సాగు చేశాడు. వ్యవసాయం కోసం రూ.5 లక్షలు అప్పు చేశాడు. అప్పులోళ్లు ఇంటికొచ్చి రోజూ వేధింపులకు గురిచేయడంతో ఏం చేయాలో తోచక కిందటేడాది ఏప్రిల్ 23వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాపను అప్పు చేసి డిగ్రీ చదివిస్తున్నా. నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టినా పట్టించుకోలేదు. పింఛన్ కూడా ఇవ్వడం లేదు. ఏం చేయాలో ఎలా బతకాలో బోధ పడడం లేదు. – సుర్ల అమ్మాజి, పాములవాక, కోటఉరట్ల మండలం, అనకాపల్లి జిల్లాపింఛన్ కూడా ఇవ్వడం లేదు మా ఆయన పెదరంగన్న ఏడెకరాలు కౌలుకు చేసేవాడు. సాగు కోసం రూ.8 లక్షలు అప్పులు చేశాడు. పంటలు దెబ్బ తినడంతో చేసిన అప్పులు తీర్చే దారిలేక గతేడాది మే 20న పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒక అమ్మాయి దివ్యాంగురాలు. కొడుకు పనికి వెళ్తున్నాడు. అధికారుల చుట్టూ తిరిగినా పైసా పరిహారం రాలేదు. కనీసం పింఛన్ కూడా ఇవ్వడం లేదు. – చాకలి సునీత, మునగాల, గూడురు మండలం, కర్నూలు జిల్లా -
చంద్రబాబు హామీలన్నీ 'మోసాలుగా తేలాయ్': వైఎస్ జగన్
దోచుకో... పంచుకో... తినుకో...! ఈరోజు ప్రతి అడుగులో ఇదే కనిపిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఖజానాకు రానివ్వకుండా.. మీ సొంత జేబులు నింపుకొంటుంటే ఖజానా దివాలా తీయకుండా ఏమవుతుంది? అందుకే మీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితి ఇంత అధ్వాన్నంగా మారింది. – బాబు పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు హామీలన్నీ మోసాలుగా తేలిపోయాయని.. ఒకవైపు జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేస్తూ, మరోవైపు రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికీ మేలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నాడు కోవిడ్ లాంటి పరిస్థితుల్లోనూ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలన్నీ అమలు చేసినప్పుడు.. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మొత్తం రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. రూ.2.73 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా వేశామని గుర్తు చేశారు. ఇప్పుడు రెండేళ్లు తిరగకుండానే చంద్రబాబు ప్రభుత్వం రూ.3.30 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసినా పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పథకాలను ఇంటివద్దకే అందిస్తే.. ఇప్పుడు అంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. సాగుతోందని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డా.. చంద్రబాబు ‘నో యాక్షన్’..! మహిళలపై కూటమి ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నసీర్, కూన రవికుమార్ అఘాయిత్యాలపైనా... బాబు ‘నో యాక్షనే..!’ అంటూ ధ్వజమెత్తారు. మన పాలనకు, బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారని.. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ, పార్టీలో అందరినీ కూడగట్టి ముందుకు సాగుతున్న చుండూరి రవిబాబుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. ఏడాదిన్నరగా ఆయన అంకితభావంతో పని చేస్తున్నారని అభినందించారు. ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి కూడా చాలా చురుగ్గా పని చేస్తున్నారని ప్రశంసించారు. దేవుడి దయ, అందరి ఆశీస్సులుంటే ఆయన ఇంకా ఎదుగుతారని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబుతో పాటు పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టో విశిష్టతను చాటాం... మన హయాంలో చరిత్రలో కనీవిని ఎరుగని మంచి చేశాం. మేనిఫెస్టో విశిష్టతను చాటి చెప్పాం. మేనిఫెస్టో అంటే ఏదో ప్రజలను నమ్మించడానికి కాదు. అదో చెత్త పేపర్ అన్న ముద్ర నుంచి దాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించేలా పని చేశాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఏడాది కాలంలోనే 99 శాతం హామీలను అమలు చేసి ప్రజల్లో గుర్తుండిపోయేలా మంచి పరిపాలన చేశాం. అందుకే ఈరోజుకీ గర్వంగా కాలర్ ఎగరేసుకుని తిరగ్గలం. క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు..రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలన గురించి ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. మనది సుపరిపాలన అయితే.. చంద్రబాబు పాలన మొత్తం అవినీతిమయం. ఎక్కడా దేన్నీ వదలడం లేదు. ప్రజలకు మేలు చేయడం లేదు. నాడు మనం అధికారంలోకి వచ్చినప్పుడు ట్రెజరీ (ఖజానా)లో రూ.100 కోట్లు కూడా లేవు. రెండేళ్లు కోవిడ్తో అంతా అతలాకుతలం. ఒకవైపు ఆదాయం తగ్గింది. మరోవైపు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అలాంటి ఆర్థిక చిన్నాభిన్నం మధ్య మన వైఎస్సార్సీపీ పాలన సాగింది. అయినా కూడా ఏనాడూ ఆ సాకు చూపలేదు. ముందుగానే క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు చేశాం. క్రమం తప్పకుండా బటన్ నొక్కి ప్రజలకు మేలు చేశాం. హామీలన్నీ అమలు చేశాం.రెండేళ్లలోనే రూ.3.30 లక్షల కోట్ల అప్పులు..మన ఐదేళ్ల పాలనలో దాదాపు రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే, అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. ఆ వివరాలన్నీ ఆధార్తో సహా చెప్పగలం. అదే ఈ రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం అప్పులు రూ.3.30 లక్షల కోట్లు దాటాయి. అయినా కూడా హామీల అమలు లేదు. మనం ఇచ్చిన పథకాలన్నీ రద్దయ్యాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయి. బటన్లు లేవు.. ప్రజలకు ఇచ్చిందీ లేదు..! మనం ఐదేళ్లలో చేసిన అప్పులు.. చంద్రబాబు రెండేళ్లలోనే దాటేశారు. మరి ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళుతోంది? ప్రజలంతా దీన్నే చర్చించుకుంటున్నారు. అంతా జేబులు నింపుకొంటున్నారు..దోచుకో... పంచుకో... తినుకో...! ఈరోజు ప్రతి అడుగులో ఇదే కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో ఏదీ జరగడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయాలూ రావడం లేదు. లిక్కర్ మాఫియాతో మొదలు పెడితే ఇసుక, మట్టి, మద్యం, సిలికా, క్వార్ట్జ్, ల్యాటరైట్, గ్రానైట్.. అన్ని వనరులూ దోచేస్తున్నారు. అధిక ధరలకు పీపీఏలు చేసుకుంటున్నారు. అమరావతిలో చదరపు అడుగు రూ.10 – 12 వేల చొప్పున నిర్మాణం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు ఇచ్చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలురానివ్వకుండా, మీ సొంత జేబులు నింపుకుంటుంటే ఖజానా దివాలా తీయకుండా ఏమవుతుంది? ప్రభుత్వ మైండ్సెట్ సరిగా లేదు కాబట్టే..ఈ ప్రభుత్వ మైండ్సెట్ సరిగా లేదు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే.. విద్యా రంగాన్ని నాశనం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసేశారు. పిల్లలకు ట్యాబ్లు లేవు. టోఫెల్ శిక్షణ లేదు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు లేరు. విద్యాదీవెన, వసతి దీవెన లేవు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. పేదలకు ఉచిత వైద్యం లేదు. ఆరోగ్యశ్రీ గాలికెగిరిపోయింది. నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యం చేయడం లేదు. రూ.6 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారు. వీరి మైండ్సెట్.. పేదలు, అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలని కాదు. చివరకు మహిళలకు సున్నా వడ్డీని కూడా చంద్రబాబు ఎగ్గొట్టాడు. మనం అమలు చేసిన చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు... ఇవాళ ఏదీ కనిపించడం లేదు. 31 లక్షల ఇళ్ల పట్టాలు, 20 లక్షల ఇళ్ల మంజూరు... 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం... ఇప్పుడు ఏవీ లేవు. పాలనపై ధ్యాస లేదు. అంతా దోచుకో.. పంచుకో...తినుకో.. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ!హాజరైన ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలుజగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యంఈ ప్రభుత్వంలో చూస్తుండగానే మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇక మిగిలింది రెండు బడ్జెట్లు మాత్రమే. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. ఏడాదికి పైగా నేను ప్రజల్లో ఉంటా. మన కార్యకర్తలంతా ప్రజలకు తోడుగా నిలబడి వారి సమస్యలపై పోరాడాలి. లీగల్ సెల్ను పటిష్టం చేశాం. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది. రాబోయేది మనందరి ప్రభుత్వం. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. ప్రతి ఒక్కటీ వారి ద్వారానే అమలు చేస్తాం.ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ..?టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్... డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఏకైక పార్లమెంట్ సభ్యుడు. పార్లమెంటు చరిత్రలో గతంలో ఇలాంటివి ఎన్నడూ లేవు. ఇది చంద్రబాబు అనుసరించే వైఖరితో మొదలైంది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు? ఏం చేశాడు? అని చూస్తే ఎక్కడా డ్రగ్స్ను నియంత్రించలేదు. ఒక పాలకుడు, నాయకుడికి ఉండాల్సిన గుణాలు చంద్రబాబులో ఎక్కడా కనిపించవు. అందుకే విచ్చలవిడిగా అరాచకాలు జరుగుతున్నాయి. రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశాడని, ఆపై మోసం చేశాడని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ? అని అడుగుతున్నా... నో యాక్షన్...! కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ..? నో యాక్షన్...! మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ మీద ఏం చర్యలు తీసుకున్నావు..? నో యాక్షన్...! టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు? నో యాక్షన్! మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ! అక్కడా నో యాక్షన్! పైగా బాధితురాలి మీద తప్పుడు కేసు, ఉల్టా కేసు పెట్టారు. ఎమ్మెల్యేలు, లీడర్ల కథ దేవుడెరుగు.. కనీసం పీఏల మీద కూడా చర్యలు తీసుకోలేకుండా ఉన్నాడు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ, ఫొటోలతోనూ అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు ఏం చేశాడు..? నో యాక్షన్...! బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్లో పట్టుబడితే నో యాక్షన్... చంద్రబాబు కుమారుడు స్విమ్మింగ్పూల్ వద్ద తాగుతూ, తూగుతూ అమ్మాయిలతో డ్యాన్స్.. నో యాక్షన్..! ఇంకా చంద్రబాబునాయుడు బావమరిది, బాలకృష్ణ ఏమన్నాడు...? అమ్మాయి కనబడితే కడుపైనా చేయాలి... లేదా ముద్దు అయినా పెట్టాలి...అని! ఆయన అంత దారుణంగా మాట్లాడితే, చెంప పగలగొట్టకుండా.. హాహా! అని నవ్వుతారు. వీటన్నింటి మీదా చర్యలు తీసుకోని చంద్రబాబు ఏమన్నారు? తాను అవన్నీ చిన్నప్పుడే అంతకంటే బాగా చేశానని చెప్పుకొచ్చారు!గుండె ధైర్యం.. వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్విలువలు, విశ్వసనీయతే మన పార్టీ పునాదులు‘‘మనమంతా కలసికట్టుగా, ఒక్కటై ఈ పార్టీని నిర్మించుకున్నాం. ఈ పార్టీ జగన్ ఒక్కడిదే కాదు.. వైఎస్సార్ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై, మనమంతా కలసి ఈ పార్టీని నిర్మించుకున్నాం. విలువలు, విశ్వసనీయత అన్న రెండు పదాల మీదే మన పార్టీ పుట్టింది, నడుస్తోంది. మన పార్టీ ఎప్పటికీ విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయతకు పెద్దపీట వేస్తుంది. పోరాటాలు మనకు కొత్త కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్సార్సీపీ ట్రేడ్ మార్క్. మన పార్టీ చరిత్ర, 15 ఏళ్ల ప్రయాణం చూస్తే.. కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నాం. విపక్షంగానే మొదలయ్యాం. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకు మరింత తోడుగా, దగ్గరగా ఉండాలి...’’ -
డ్రగ్స్ మాఫియా అరాచకం
హైదరాబాద్ శివారులో ఒక పెద్ద ఫాంహౌస్... అక్కడొక ఈత కొలను...దాని పక్కనే ఆశీనులైన బడాబాబులు... ముందున్న టేబుళ్లపై ఖరీదైన మద్యం సీసాలు, మాదక ద్రవ్యాలు... జర్మన్ తయారీ రివాల్వర్తో పోలీసులపై కాల్పులు, బెదిరింపులు, వాగ్వాదాలు– క్రైమ్ కథాచిత్రాన్ని తలదన్నే శనివారం నాటి ఈ దృశ్యం మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే కించిత్తు ఆశ్చర్యం కలుగుతుంది. మొన్న జనవరిలో కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పట్టుబడితే, తాజాగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్తోపాటు మరికొందరు దొరికిన వైనం దీన్ని రుజువు చేస్తోంది. వేయి తలల విషనాగు లాంటి మాదక ద్రవ్య మహమ్మారి ఆనుపానులు రాబట్టడానికి, దాన్ని అంతమొందించటానికి పోలీసులు నానా తంటాలూ పడుతున్నారు. కానీ బడి పిల్లలు మొదలుకొని ఆడ మగ తేడా లేకుండా అందరినీ కాటేస్తున్న ఈ విషనాగు వెనక రాజకీయ పలుకుబడి గల కుటుంబాలున్నాయనీ, కనుకనే దాని అదుపు అసాధ్యమవుతున్నదనీ ఈ పరిణామాలు తెలియజెబుతున్నాయి. ఒకరా ఇద్దరా... తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మ, ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ వగైరా 11 మంది ఈ డ్రగ్స్ దందాలో దొరికారు. రెండేళ్ల నాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల ప్రసంగాలను గుర్తుంచుకుని ఇప్పుడు వెల్లడవుతున్న పరిణామాలతో బేరీజు వేసుకుంటే ఆ నేతల వంచన ఏపాటిదో అర్థమవుతుంది. మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందంటూ వారు పెడబొబ్బలు పెట్టారు. ‘మేం వస్తే వంద రోజుల్లో అరికడతామ’ంటూ ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకొచ్చాక అంతవరకూ సాధించిన విజయాలను గుల్లచేశారు. అది మళ్లీ తలెత్తి విస్తరించటానికి అవకాశమిచ్చారు. అప్పటి దుష్ప్రచారమంతా గెలుపు కోసం మాత్రమే కాదు... మాదక ద్రవ్యాలను అరికట్టడం వల్ల కలుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం కోసమని ఆ కూటమి పీఠం ఎక్కింది మొదలు జరుగుతున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇసుక మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నాయి. ‘గంజాయి వద్దు బ్రో...’ అంటూనే మాదక ద్రవ్యాలకు తలుపులు బార్లా తెరిచారు. ఏపీలో మాదక ద్రవ్య చీడను అంతమొందించటానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో విజయవంతంగా అమలు చేసింది. దానికితోడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)ను ఏర్పాటు చేసింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఉండే 11,500 ఎకరాల్లోని గంజాయి సాగును ధ్వంసం చేయడంతోపాటు, గిరిజనులు ఇతర పంటల వైపు మళ్లేలా రూ. 500 కోట్లతో ప్రోత్సాహకాలందించింది. విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ కృషినంతా కూటమి పాలన నీరుగార్చింది. పర్యవసానంగా విద్యాసంస్థల్లో చిల్లరగా... ఫామ్హౌస్ పార్టీలకు టోకుగా గంజాయి, కొకైన్, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వగైరాలు చేరిపోతున్నాయి. ఏడాదికి రూ.5,000 కోట్లు వెనకేసుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దందాకు మూలవిరాట్టులు చంద్రబాబు చుట్టూ ఉండే సీనియర్ నేతల కుటుంబాలవారు కావటంతో ఏపీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మాదక ద్రవ్యాల వ్యాప్తిపై వెల్లడవుతున్న గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి. నిరుడు దేశవ్యాప్తంగా భద్రతా విభాగాలకు రూ. 25,330 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. అంతక్రితంతో పోలిస్తే ఇది 55 శాతం కన్నా అధికం. ఏపీలో వీటికి అలవాటుపడిన వారిలో 10–17 ఏళ్ల మధ్య గలవారి సంఖ్య 3.19 లక్షలు ఉన్నట్టు చెబుతున్నారు. వీటి వెనక డబ్బాశ మాత్రమే కాదు, దాని ఆసరాతో రాజకీయాలను శాసించటం అసలు లక్ష్యం. మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో తెలంగాణ పోలీసులకు అంతో ఇంతో మంచి పేరుంది. కానీ తాజా కేసు తీవ్రత తెలిసి కూడా, నిందితుడిగా ఉండాల్సిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వ్యవహరిస్తేనే ఉగ్రవాదాన్ని మించిన ఈ మహమ్మారి దుంపనాశనం సాధ్యం. -
BR నాయుడి బూతు పురాణం చూసి కూడా.. బాబు, పవన్ నోరు ఎందుకు మెదపట్లే..?
-
బాబు ఆగ్రహం, సీరియస్, వార్నింగ్ అంటూ ఎల్లో హెడ్ లైన్స్.. బాబు మార్క్ నోటీస్ డ్రామా
-
బాబు మీ శేష జీవితం జైలులోనే..! అంత ఈజీగా తప్పించుకోలేరు
-
బాబు ఒక్క పథకానికైనా.. పొట్టి శ్రీరాములు పేరు పెట్టలేదు?
-
పిన్నెల్లి సోదరులను హింసిస్తున్నారు. బాబుపై మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్
-
చంద్రబాబు, లోకేష్ అంతకు అంత అనుభవిస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
-
‘పచ్చ’ మత్తు.. జనం చిత్తు
సాక్షి, అమరావతి: ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుని దొరికి పోవడంతో ఆ పార్టీ పరువు బజారున పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్గా మారిందని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్, గంజాయి మాఫియా చెలరేగిపోతోందని, పచ్చ పార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని నెటిజన్లు సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడి బాగోతాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు అండ్ కో కానీ, ఎల్లో మీడియా కానీ నోరు మెదపడం లేదని ఎత్తి చూపుతున్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దందా బయటపడినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పార్టీని పోలీసులు ఛేదించినా టీడీపీ కూటమి పెద్దలే చిక్కుతున్నారు. టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులే డ్రగ్స్ మత్తులో జోగుతూ దొరుకుతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ దందా సాగిస్తున్నదే టీడీపీ పెద్దలు కావడంతో.. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో డ్రగ్స్ పార్టీల్లో వాళ్లే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రజా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు ఉంటే చాలు.. డ్రగ్స్ దర్జాగా ఫాం హౌస్లకు నడచి వస్తాయన్నది బహిరంగ రహస్యంగా మారింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కడంతో ఆ విషయం మరోసారి నిరూపితమైంది. టీడీపీ కూటమి పెద్దల కనుసన్నల్లో సాగుతున్న డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని కొల్లగొడుతోంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా యావత్ దేశంలో బరితెగించి దందా సాగిస్తోంది. డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడతామని 2024 ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తూండిపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైన డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని అమాంతం కబళించేస్తోంది. డ్రగ్స్: డోర్ డెలివరీ ⇒ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసే డ్రగ్స్ దందా రాష్ట్రంలో వేళ్లూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ దందాకు రాష్ట్రం అడ్డాగా మారిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు తమ దందాకు ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ⇒ కొన్ని నెలల క్రితం ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడకు తరలిస్తున్న ఎండీఎంఏ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో డ్రగ్స్ దందా తీవ్రతకు ఓ నిదర్శనం మాత్రమే. ఆ ఉదంతం రాష్ట్రంలో డ్రగ్స్ దందాలో కేవలం గొరంతేనని.. వాస్తవానికి రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంత ఉందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా, రాష్ట్రంలో మాత్రం ఊరూరా విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, అమృత్సర్ తదితర నగరాల్లోని డ్రగ్స్ మాఫియా ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్ను మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకుంది. ⇒ వివిధ రూపాల్లోని ఎండీఎంఏ డ్రగ్స్ను రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతోపాటు హిందూపూర్, నంద్యాల, నూజివీడు, ఏలూరు, జగ్గయ్యపేట, భీమవరం, రాజమహేంద్రవరం, విజయనగరం వంటి దాదాపు 50 పట్టణాల్లో కూడా డ్రగ్స్ మాఫియా ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పింది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటున్నాయి. ⇒ ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్ను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి డ్రగ్స్ వెండర్స్ (విక్రేతలు)కు అందిస్తున్నారు. ఆ వెండర్స్ వాటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు. డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యా సంస్థలనే తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ పొందిన వెండర్స్ విద్యా సంస్థల ప్రాంగణాలకు సమీపంలోనే వాటిని విక్రయిస్తున్నారు. అందుకోసం ఉన్నత విద్యా సంస్థల సమీపంలోనే బడ్డీ కొట్టులు, స్ట్రీట్ వెండర్స్ రూపంలో డ్రగ్స్ విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారు. విజయవాడలోని ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకే ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసు ద్వారా నూజివీడు మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా నిదర్శనం. కేసుల నమోదు గోరంత.. స్మగ్లింగ్ కొండంత ⇒ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. నామ మాత్రంగా కేసులు నమోదు చేస్తూ కనికట్టు చేసేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్రంలో సాగుతున్న డ్రగ్స్ దందాతో పోలిస్తే నమోదు చేస్తున్న కేసులు 10% మాత్రమేనని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం. ⇒ 2024లో రాష్ట్రంలో 1,600 ఎన్డీపీఎస్ (నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్) కేసులు నమోదయ్యాయి. 2025లో 1,836 కేసులు నమోదు చేసి 46,011 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. వాస్తవానికి రాష్ట్రం మీదుగా సాగుతున్న డ్రగ్స్ దందా.. ఇందుకు పదుల రెట్లు అధికంగా ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మత్తుకు బ్రాండ్ అంబాసిడర్లు పచ్చ బాబులే డ్రగ్స్, గంజాయి దందా సాగించడమే కాదు.. టీడీపీ కూటమి కీలక నేతల కుటుంబ సభ్యులు డ్రగ్స్ మత్తులో మజా చేస్తూ హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకొని అడ్డంగా దొరికారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుదీర్ రెడ్డి డ్రగ్స్ మత్తులో జోగుతూ పోలీసులకు చిక్కారు. గత ఏడాది భీమవరం ఎమ్మెల్యే పి.రామాంజనేయులు కుమారుడు కూడా హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో చిక్కారని జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కావడం గమనార్హం.చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం⇒ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో సమర్థవంతంగా అమలు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)ను ఏర్పాటు చేసి పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ⇒ రాష్ట్రంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో దశాబ్దాలుగా సాగిస్తున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించింది. ఏకంగా 11,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. అందుకోసం రూ.500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని అమలు చేసింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థవంతంగా కట్టడి చేసింది. సెబ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి విస్లృతంగా తనిఖీలు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంది. ⇒ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ డ్రగ్స్పై పట్టు వదిలేసింది. కక్షపూరితంగా సెబ్ను రద్దు చేసింది. కొత్తగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ ఆ వ్యవస్థకు ఎలాంటి మౌలిక వసతులు సమకూర్చలేదు. విస్తృత అధికారాలు కల్పించలేదు. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత కుటుంబం అండదండలు ఉండటంతో ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఉదాసీనంగా ఉంటోందన్న విషయం స్పష్టమైంది. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం కావడంతో పోలీసు శాఖ చోద్యం చూస్తోంది.కబళిస్తున్న నకిలీ మద్యం ⇒ ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల దందానే లక్ష్యం ⇒ డ్రగ్స్ దందాతోపాటు టీడీపీ కూటమి పెద్దలు రాష్ట్రంలో నకిలీ, కల్తీ మద్యం రాకెట్ను వ్యవస్థీకృతం చేశారు. ఏకంగా కుటీర పరిశ్రమ స్థాయిలో ఊరూవాడా యూనిట్లను ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. తొలి ఏడాదే రూ.5 వేల కోట్ల మేర మద్యం దందాకు పాల్పడ్డారు. ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పచ్చ మాఫియా చెలరేగిపోతోంది. ⇒ అన్నమయ్య, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఎన్టీఆర్, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో బయటపడిన నకిలీ మద్యం తయారీ యూనిట్ల నిర్వాహకులు టీడీపీ నేతలే కావడంతో పచ్చ ముఠా బండారం బట్టబయలైంది. ఆ కేసుల్లో పాత్రధారులైన టీడీపీ చోటా నేతలను మాత్రమే ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ నకిలీ మద్యం రాకెట్ సూత్రధారులైన టీడీపీ పెద్దలపై ఈగ వాలనివ్వ లేదు. ⇒ టీడీపీ కీలక నేతలే ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు కాబట్టి.. రాష్ట్రంలో నకిలీ/కల్తీ మద్యం రాకెట్ దందాను టీడీపీ మద్యం సిండికేట్ వ్యవస్థీకృతం చేసింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీల ద్వారా ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది. ⇒ రాష్ట్రంలో ఉన్న 20 మద్యం డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల ఆ«దీనంలోనే ఉండటం సిండికేట్ దందాకు కలసివస్తోంది. అలా సేకరించిన స్పిరిట్ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నారు. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్తో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దాన్ని టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న 4,346 మద్యం దుకాణాలు, దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలు, 540 బార్ల ద్వారా దర్జాగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. -
అప్పుల కుప్పలు.. దాచలేక తిప్పలు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం తన అప్పులపై కూడా పచ్చి అబద్ధాలు చెబుతోంది. ఒక పక్క చంద్రబాబు సర్కారు 22 నెలల పాలనలో బడ్జెట్ అప్పులు ఎంత చేశారనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో పాటు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వాస్తవాలను బహిరంగంగా వెల్లడించినా, బాబు సర్కారు మాత్రం బొంకడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా కాగ్ గణాంకాలను, ఆర్బీఐ లెక్కలను కాదని అవాస్తవాలు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రికార్డు స్థాయిలో బడ్జెట్ అప్పులు చేసినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతే కాకుండా, బాబు తొలి ఆర్థిక ఏడాది పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారి పోయిందని, అప్పు చేయనిదే రోజు గడవడం లేదని ఇదే ఆర్థిక మంత్రికి ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన కాగ్ నివేదిక మొట్టికాయలు వేసింది. ఏడాదిలో అప్పు చేయకుండా గడిచిన రోజులు కేవలం 8 మాత్రమేనని, మిగతా 357 రోజులు అప్పులు చేయనిదే గడవ లేదని ఆ నివేదిక వెల్లడించింది. బాబు సర్కారు తొలి ఏడాది చేసిన అప్పులతో భవిష్యత్ అభివృద్ధి అంధకారమేనని వ్యాఖ్యానించింది. ఇదే విషయాలను ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. దీన్ని జీర్ణించుకోలేని ఆర్థిక మంత్రి కేశవ్ తప్పుడు లెక్కలతో ఎదురు దాడికి దిగారు. చంద్రబాబు సర్కారు 22 నెలల్లోనే బడ్జెట్ అప్పులు రూ.1.82 లక్షల కోట్లు చేసినట్లు కాగ్ నివేదికతో పాటు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి. ఇందుకు కాగ్ నివేదికలు, ఆర్బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చిన అప్పుల గణాంకాలు సాక్ష్యంగా నిలిచాయి.కాగ్ కడిగి పారేసినా మారని వైఖరి⇒ 2024–25 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు సర్కారు బడ్జెట్ అప్పు రూ.81,597 కోట్లు చేసినట్లు కాగ్ గణాంకాలు బహిరంగంగా వెల్లడించాయి. ఈ గణాంకాలు కాగ్ అధికారిక వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరంలో అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నాటికి బడ్జెట్లో రూ.1,00,667 కోట్లు అప్పు చేసినట్లు కాగ్తో పాటు ఆర్బీఐగణాంకాలు స్పష్టం చేశాయి. ⇒ ఈ అప్పులకు సంబంధించి గణాంకాలు కాగ్ వెబ్సైట్తో పాటు ఆర్బీఐ వెబ్సైట్లో బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. చంద్రబాబు సర్కారు 22 నెలల్లో బడ్జెట్ అప్పులు రూ.1,82,264 కోట్లు చేసినట్లు కాగ్, ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా ఆర్థిక మంత్రి కేశవ్ మాత్రం బాబు ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులు కేవలం రూ.1.05 లక్షల కోట్లేనని చెప్పడం ఎవరిని మోసం చేయడానికని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి బాబు సర్కారు గ్యారెంటీ అప్పులు అప్పులకు ఆధారమైన సర్కారు జీవోలు ⇒ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పయ్యావుల కేశవ్ రాజ్యాంగ బద్ధమైన కాగ్, ఆర్బీఐ గణాంకాలను తప్పుగా పేర్కొనడం గమనార్హం. బడ్జెట్ బయట చంద్రబాబు సర్కారు 22 నెలల్లోనే వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో ఎడాపెడా అప్పులు చేసింది. ఇందుకు చంద్రబాబు సర్కారు జారీ చేసిన జీవోలే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ జీవోల గురించి మంత్రి కేశవ్కు తెలియదా? ⇒ రాజధాని పేరుతో, వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో రూ.1,51,057 కోట్ల అప్పులు చేయడానికి పలు జీవోలు జారీ చేశారు. ఈ జీవోలన్నీ తప్పని ఆర్థిక మంత్రి కేశవ్ చెప్పగలరా? మరి బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట కలిపి బాబు సర్కారు చేసిన అప్పులు రూ.3,33,321 కోట్లకు చేరాయి. వాస్తవాలు ఇలా ఉంటే మంత్రి కేశవ్ అప్పులపై ఉద్దేశ పూర్వకంగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. బాబు మెప్పు కోసం మంత్రి కేశవ్ అబద్ధాలు⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై కూడా ఆర్థిక మంత్రి కేశవ్ పచ్చి అబద్ధాలు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట అప్పులు కలిపి రూ.6.32 లక్షల కోట్లేనని ఇటీవల ముగిసిన శాసన మండలి సమావేశాల్లో ఇదే ఆర్థిక మంత్రి కేశవ్ లిఖిత పూర్వక సమాధానంలో చెప్పారు. 2023–24 మార్చి 31 నాటికి వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పు రూ.4,91,734 కోట్లు, బడ్జెట్ బయట అప్పు రూ.1,40,470 కోట్లు అని సమాధానమిచ్చారు. ఈ రెండు కలిపితే జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి మొత్తం అప్పు రూ.6,32,204 కోట్లేనని తెలిపారు. ⇒ ఈ వాస్తవాలు ఇలా ఉండగా, ఇదే మంత్రి కేశవ్ వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.9 లక్షల కోట్ల అప్పులు చేసిందని మీడియాకు ఎలా చెబుతారు? అంటే మండలిలో చెప్పిన అంకెలు తప్పా? లేదా మీడియాతో చెప్పిన అంకెలు తప్పా? ఏది సరైందో కేశవ్ చెప్పాలి. మండలిలో తప్పుడు లెక్కలు చెప్పలేక వాస్తవాలు చెప్పి.. మీడియాలో మాత్రం తప్పుడు లెక్కలు చెప్పినట్లు స్పష్టం అవుతోంది. చట్టసభల్లో ఒకలాగ, మీడియాతో మరోలా మాట్లాడుతూ సదరు మంత్రి తన పరువు తానే తీసుకుంటూ చంద్రబాబు మెప్పు కోసం తహతహలాడుతున్నారనేది స్పష్టం అవుతోంది. -
ఈ రెండేళ్లలో ఉద్యోగులకు చేసిందేమీ లేదు
అనంతపురం అర్బన్ : ‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్ను ప్రభుత్వాలు ప్రకటిస్తూ వచ్చాయి. కానీ, రెండేళ్లవుతున్నా ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల ఊసేలేదు. సరెండర్ లీవులు పెండింగ్.. డీఏలు పెండింగ్. మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది.ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయి కూడా వారికి అందలేదు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చేతగాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచి్చనంత వరకే. ఆ తరువాత చెప్పలేం’.. అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అనంతపురం విచ్చేసిన ఆయన శనివారం ఆ సంఘం కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు దివాకర్రావు, మైనుద్దీన్, కార్యదర్శి సోమశేఖర్ తదితర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు.. ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు., ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ త్వరలో ఇస్తామని గత ఏడాది అక్టోబరు 18న ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని.. అయితే, ఐదారు నెలలు అవుతున్నా ఇప్పటికీ అమలుకాలేదని బొప్పరాజు అన్నారు. దీంతో పీఆర్సీ దూరం చేస్తారనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారన్నారు. జాప్యం చేయకుండా పీఆర్సీ కమిషనర్ను తక్షణం నియమించాలన్నారు. 60 రోజుల్లో నివేదిక ఇచ్చే వెసులుబాటు కల్పించాలన్నారు. తక్షణం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్లకు పైగా బకాయిల ఊసేలేదని అన్నారు. సరెండర్ లీవులు ఇవ్వలేదని, డీఏలూ పెండింగ్ పెట్టారన్నారు. పోలీసులకు ఒక్క సరెండర్ లీవును రెండు విడతలుగా ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు. ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయి.. ఇక పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10 వేల కోట్లు ఉన్నాయని బొప్పరాజు చెప్పారు. బెనిఫిట్లు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని.. కానీ, అవి తీసుకోకుండానే రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులుగా తాము సహకరిస్తున్నామని, అదే స్థాయిలో ప్రభుత్వం సహకరించడంలేదని బొప్పరాజు చెప్పారు.ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిచంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. గత సంక్రాంతి పండుగకు ఇచ్చామంటున్న డీఏ ఇంత వరకు చాలా మందికి అందలేదు. సంస్కరణల పేరుతో ఉపాధ్యాయులను తీవ్రంగా వేధిస్తున్నారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకనం రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి యమలోకంలో ఉన్నట్లు ఉంది. 30 ఏళ్ల పిల్లలు కూడా గుండె నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్లతో చనిపోతున్నారు. – బాజీ పఠాన్, అధ్యక్షులు, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ఏ సమస్యా పరిష్కారం కాలేదుఉపాధ్యాయుల సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు. వాటి కోసం దశల వారీగా ఉద్యమాన్ని చేపడుతున్నాం. కూటమి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఆందోళనలు చేస్తాం. ఈ ప్రభుత్వం ఐఆర్ గురించి పట్టించుకోలేదు. బకాయిలు చెల్లించలేదు. పీఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు అలాగే ఉన్నాయి. పెన్షన్ కార్పొరేషన్ హామీ ఏమైందో తెలీదు. – రఘునాథ్రెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)త్వరలో ఆందోళన ఉధృతంఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మా జీతం కింద దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి వాటిని కూడా మాకు ఇవ్వడంలేదు. పీఆర్సీ, ఐఆర్ గురించి అసలు ప్రస్తావనే చేయకపోవడాన్ని బట్టి అవి ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. ఉపాధ్యాయులను ప్రతి చిన్న విషయానికి వేధింపులకు గురి చేస్తున్నారు. లోపభూయిష్టమైన అసెస్మెంట్ రిజిస్టర్లతో ఇబ్బంది పెడుతున్నారు. త్వరలో ఉధృతంగా ఆందోళన తప్పదు. – ఏఎం గిరిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటమే
సాక్షి, అమరావతి : ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఐఆర్ ప్రకటించకపోతే ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలుత అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శలు చేస్తామని, అనంతపురం జిల్లాతో నిరసనలు ప్రారంభిస్తామన్నారు. తాడేపల్లిలోని సమాఖ్య కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తామని తేల్చిచెప్పారు.ఐఆర్ ప్రకటించి, పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటుచేయాలని, లేనిపక్షంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ కేటగిరీ ఉద్యోగులకు కూడా మంచి జరగలేదని, ఇచి్చన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా అణచివేస్తున్నారని, అనివార్యంగా పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని ఉద్యోగులను ముంచిన ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. \రెండేళ్లయినా ఐఆర్ ఊసేలేదు.. ఉద్యోగులను దారుణంగా వంచించారని, ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా ఉద్యోగులను పట్టించుకోకపోవడంవల్లే విజయవాడ ధర్నాచౌక్ ఉద్యోగుల ధర్నాలతో దద్దరిల్లుతోందన్నారు. ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోవాలని చెప్పారని.. దానితో ఎన్ని పండుగలు చేసుకోవాలని ఆయన ప్రశి్నంచారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఆర్నెల్లకు ఒకటి చొప్పున మొత్తం నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒకటి మాత్రమే ఇచ్చారని.. అది కూడా పూర్తిగా ఇవ్వకుండా కొంత పెండింగ్ పెట్టారని తెలిపారు. అలాగే, ఐఆర్ వెంటనే ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని.. కానీ, రెండేళ్లయినా దాని గురించి మాట్లాడడంలేదన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే చెప్పిన మాట మేరకు ఐఆర్ ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేస్తే ఇప్పటివరకూ కొత్త కమిషనర్ను నియమించలేదని, ఇక పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశి్నంచారు. ఉద్యోగులకు రూ.40 వేల కోట్ల బకాయిలు..ఇక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ ఉన్నాయని.. వాటిని ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో లేదో కూడా తెలీడంలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పోలీసులకు ఐదు ఎస్ఎల్లు పెండింగ్లో ఉన్నాయని.. సీపీఎస్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం చూపించకపోగా కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడంలేదని.. ఉద్యోగులకు కనీసం పదోన్నతులు కూడా ఇవ్వలేదన్నారు.అర్హతలేని వ్యక్తిని సెక్రటరీ జనరల్గా నియమించి అసెంబ్లీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణను నిలిపివేయడం అన్యాయమని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు చెప్పలేని విధంగా ఉన్నాయని, రాజుల కాలంలో బానిసల కంటే దారుణంగా వారితో పనిచేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంత పని ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే 80 మంది ఉద్యోగులు చనిపోయారని.. అయినా వారిపై చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపడంలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మద్యం డాన్గా చెలరేగిపోతున్నారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఆయన తన దందాను టాప్ గేర్లోకి తీసుకువెళ్లారు. ఎక్సైజ్ శాఖ 125 బార్లకు జారీ చేసిన నోటిఫికేషన్ మొదలు ‘కప్పం కట్టండి...బార్ లైసెన్స్ తీసుకోండి’ అని హుకుం జారీ చేశారు. అందుకు విశాఖపట్నంలో ఎక్సైజ్ శాఖ వత్తాసు పలుకుతుండటంతో అడ్డూ అదుపు లేకుండా ఆయన దందా సాగుతోంది. ఒక్కో బార్ లైసెన్స్కు రూ.2 లక్షలు చొప్పున ఇవ్వడంతోపాటు నెలకు రూ.50 వేలు చెల్లించాలన్నది టీడీపీ ఎమ్మెల్యే మాట.తద్వారా బార్ల లైసెన్సుల వ్యవహారంలో ఏకమొత్తంగా రూ.2.50 కోట్లతోపాటు నెలకు రూ.62.50 లక్షల చొప్పున వసూళ్ల దందాకు స్కెచ్ వేశారు. ఇక విశాఖలో ప్రాంతాలవారీగా ప్రజాప్రతినిధులకు వాటాలు ఇస్తుండటంతో వారందరూ సదరు టీడీపీ ఎమ్మెల్యే చెప్పినదానికి సై అంటున్నారు. జిల్లాలో కల్లుగీత కుటుంబాలకు కేటాయించిన బార్ల లైసెన్సుల విషయంలో కూడా ఆయన మాటే చెల్లుబాటు అయ్యే వరకూ లైసెన్సులు ఇవ్వలేదు. ఎక్సైజ్ అధికారికే కప్పం వసూళ్లు, పంపిణీ బాధ్యతలు.. ఇక సదరు టీడీపీ ఎమ్మెల్యే తరఫున కప్పం వసూలు చేసి, వాటాలు పంచే బాధ్యతను ఏకంగా జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి కంటే ద్వితీయ స్థానంలో ఉన్న అధికారికి అప్పగించడం మరో విశేషం. సదరు అధికారి తాను చెప్పినట్టు కప్పం వసూలు చేసే బాధ్యతను కిందిస్థాయి అధికారులకు అప్పగించారు. అందుకు సహకరించని ఇద్దరు ఎక్సైజ్ సీఐలపైనా బదిలీ వేటు వేశారు. కాగా సదరు అస్మదీయ అధికారికి తాజాగా పదోన్నతి లభించింది. పదోన్నతి తీసుకుంటే మరో జిల్లాకు బదిలీ కావాల్సి ఉన్నందున, తనకు పదోన్నతే అక్కర్లేదని ఆయన చెప్పేశారు. మరో జిల్లాలో ఉన్నతాధికారి పోస్టు కంటే విశాఖ జిల్లాలో టీడీపీ మద్యం డాన్కు కుడిభుజంగా ఉండటమే ఎక్కువ లాభసాటిగా ఉంటుందన్నది ఆయన ఉద్దేశం. పెద్దల అండదండలు ఉండడంతో ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ కూడా చోద్యం చూస్తోంది.మాట వినకపోతే... విశాఖలో మొత్తం 125 బార్లకు తొలుత ఎక్సైజ్శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కప్పం చెల్లించేందుకు సమ్మతించిన 55 బార్లకే మొదటి దశలో లైసెన్సులు ఇచ్చారు. రెండోసారి నోటిఫికేషన్ జారీ చేయడంతో మరో 13 బార్లు, మూడోసారి నోటిఫికేషన్తో 27 బార్లకు లైసెన్సులకు పచ్చ జెండా ఊపారు. ఇక మిగిలిన బార్లకు ఎక్సైజ్శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. కప్పం చెల్లించకుండా ఎవ్వరూ బార్లకు లైసెన్సులు దాఖలు చేయడానికి వీలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంటోంది. ⇒ తనను ధిక్కరిస్తూ లైసెన్సుల కోసం అప్లికేషన్ దాఖలుకు యతి్నంచినవారిపై టీడీపీ గూండాలతో దాడులు చేయిస్తూ బెదిరిస్తున్నారు. ⇒ తమకు కాదని లైసెన్సు తెచ్చుకున్నా నగరంలో బార్ ఏర్పాటు చేసేందుకు ఎవరూ స్థలాలు, భవనాలు అద్దెకుగానీ లీజుకుగానీ ఇవ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరికలూ జారీ అయ్యాయి. ⇒ సొంత స్థలాలు, భవనాల్లో బార్లను ఏర్పాటు చేయాలని భావిస్తే ఎక్సైజ్ అధికారులను పంపించి తనఖీలతో వేధిస్తామని కూడా బెదిరిస్తున్నారు. ⇒ దాంతో బార్లకు లైసెన్సులు దాఖలు చేసేందుకే ఔత్సాహికులు హడలిపోతున్నారు. -
మా సహనానికి పరీక్షా?
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి రాగానే పీఆర్సీ వేస్తామన్నారు.. అంతకు ముందే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. తీరా గద్దెనెక్కాక ‘మీరెవరు?’ అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? ఉద్యోగులను ఇంత దారుణంగా వంచిస్తారా?’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతలు శనివారం చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. రెండేళ్లవుతున్నా పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. బకాయిల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్ను ప్రకటిస్తూ వచ్చాయి. రెండేళ్లవుతున్నా ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు, పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయిల ఊసేలేదు. సరెండర్ లీవులు పెండింగ్.. డీఏలు పెండింగ్. మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. ఉద్యోగులందరూ ఆర్థికంగా నష్టపోతున్నారు. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయం. రిటైర్ అయిన ఉద్యోగులు వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందుకోకుండానే కన్ను మూస్తున్నారు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చేతగాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచ్చినంత వరకే. ఆ తర్వాత చెప్పలేం’ అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కానేకాదని, ముంచిన ప్రభుత్వం అని ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటం తథ్యం అని స్పష్టం చేశారు. ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటమేసాక్షి, అమరావతి : ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఐఆర్ ప్రకటించకపోతే ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలుత అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శలు చేస్తామని, అనంతపురం జిల్లాతో నిరసనలు ప్రారంభిస్తామన్నారు. తాడేపల్లిలోని సమాఖ్య కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. ఐఆర్ ప్రకటించి, పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటుచేయాలని, లేనిపక్షంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ కేటగిరీ ఉద్యోగులకు కూడా మంచి జరగలేదని, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా అణచివేస్తున్నారని, అనివార్యంగా పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని ఉద్యోగులను ముంచిన ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాకర్ల వెంకట్రామిరెడ్డి రెండేళ్లయినా ఐఆర్ ఊసేలేదు.. ఉద్యోగులను దారుణంగా వంచించారని, ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా ఉద్యోగులను పట్టించుకోకపోవడంవల్లే విజయవాడ ధర్నాచౌక్ ఉద్యోగుల ధర్నాలతో దద్దరిల్లుతోందన్నారు. ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోవాలని చెప్పారని.. దానితో ఎన్ని పండుగలు చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఆర్నెల్లకు ఒకటి చొప్పున మొత్తం నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒకటి మాత్రమే ఇచ్చారని.. అది కూడా పూర్తిగా ఇవ్వకుండా కొంత పెండింగ్ పెట్టారని తెలిపారు. అలాగే, ఐఆర్ వెంటనే ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని.. కానీ, రెండేళ్లయినా దాని గురించి మాట్లాడడంలేదన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన మాట మేరకు ఐఆర్ ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేస్తే ఇప్పటివరకూ కొత్త కమిషనర్ను నియమించలేదని, ఇక పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు రూ.40 వేల కోట్ల బకాయిలు..ఇక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ ఉన్నాయని.. వాటిని ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో లేదో కూడా తెలీడంలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పోలీసులకు ఐదు ఎస్ఎల్లు పెండింగ్లో ఉన్నాయని.. సీపీఎస్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం చూపించకపోగా కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడంలేదని.. ఉద్యోగులకు కనీసం పదోన్నతులు కూడా ఇవ్వలేదన్నారు. అర్హతలేని వ్యక్తిని సెక్రటరీ జనరల్గా నియమించి అసెంబ్లీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణను నిలిపివేయడం అన్యాయమని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు చెప్పలేని విధంగా ఉన్నాయని, రాజుల కాలంలో బానిసల కంటే దారుణంగా వారితో పనిచేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంత పని ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే 80 మంది ఉద్యోగులు చనిపోయారని.. అయినా వారిపై చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపడంలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ రెండేళ్లలో ఉద్యోగులకు చేసిందేమీ లేదుఅనంతపురం అర్బన్ : ‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్ను ప్రభుత్వాలు ప్రకటిస్తూ వచ్చాయి. కానీ, రెండేళ్లవుతున్నా ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల ఊసేలేదు. సరెండర్ లీవులు పెండింగ్.. డీఏలు పెండింగ్. మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయి కూడా వారికి అందలేదు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చేతగాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచ్చినంత వరకే. ఆ తరువాత చెప్పలేం’.. అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అనంతపురం విచ్చేసిన ఆయన శనివారం ఆ సంఘం కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు దివాకర్రావు, మైనుద్దీన్, కార్యదర్శి సోమశేఖర్ తదితర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు.. ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు., ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ త్వరలో ఇస్తామని గత ఏడాది అక్టోబరు 18న ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని.. అయితే, ఐదారు నెలలు అవుతున్నా ఇప్పటికీ అమలుకాలేదని బొప్పరాజు అన్నారు. దీంతో పీఆర్సీ దూరం చేస్తారనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారన్నారు. జాప్యం చేయకుండా పీఆర్సీ కమిషనర్ను తక్షణం నియమించాలన్నారు. 60 రోజుల్లో నివేదిక ఇచ్చే వెసులుబాటు కల్పించాలన్నారు. తక్షణం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్లకు పైగా బకాయిల ఊసేలేదని అన్నారు. సరెండర్ లీవులు ఇవ్వలేదని, డీఏలూ పెండింగ్ పెట్టారన్నారు. పోలీసులకు ఒక్క సరెండర్ లీవును రెండు విడతలుగా ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు. ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయి.. ఇక పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10 వేల కోట్లు ఉన్నాయని బొప్పరాజు చెప్పారు. బెనిఫిట్లు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని.. కానీ, అవి తీసుకోకుండానే రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులుగా తాము సహకరిస్తున్నామని, అదే స్థాయిలో ప్రభుత్వం సహకరించడంలేదని బొప్పరాజు చెప్పారు.ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిచంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. గత సంక్రాంతి పండుగకు ఇచ్చామంటున్న డీఏ ఇంత వరకు చాలా మందికి అందలేదు. సంస్కరణల పేరుతో ఉపాధ్యాయులను తీవ్రంగా వేధిస్తున్నారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకనం రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి యమలోకంలో ఉన్నట్లు ఉంది. 30 ఏళ్ల పిల్లలు కూడా గుండె నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్లతో చనిపోతున్నారు. – బాజీ పఠాన్, అధ్యక్షులు, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ఏ సమస్యా పరిష్కారం కాలేదుఉపాధ్యాయుల సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు. వాటి కోసం దశల వారీగా ఉద్యమాన్ని చేపడుతున్నాం. కూటమి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఆందోళనలు చేస్తాం. ఈ ప్రభుత్వం ఐఆర్ గురించి పట్టించుకోలేదు. బకాయిలు చెల్లించలేదు. పీఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు అలాగే ఉన్నాయి. పెన్షన్ కార్పొరేషన్ హామీ ఏమైందో తెలీదు. – రఘునాథ్రెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)త్వరలో ఆందోళన ఉధృతంఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మా జీతం కింద దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి వాటిని కూడా మాకు ఇవ్వడంలేదు. పీఆర్సీ, ఐఆర్ గురించి అసలు ప్రస్తావనే చేయకపోవడాన్ని బట్టి అవి ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. ఉపాధ్యాయులను ప్రతి చిన్న విషయానికి వేధింపులకు గురి చేస్తున్నారు. లోపభూయిష్టమైన అసెస్మెంట్ రిజిస్టర్లతో ఇబ్బంది పెడుతున్నారు. త్వరలో ఉధృతంగా ఆందోళన తప్పదు.– ఏఎం గిరిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
ఏపీ బడ్జెట్ లో చంద్రబాబు తప్పుడు లెక్కలు ఆధారాలతో బయటపెట్టిన బుగ్గన
-
ఏలూరు జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ కష్టాలు... అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
-
వ్యవ‘సాయానికి’ ఉరి!
రైతులకు అన్నీ కష్టాలే.. ఐదేళ్లుగా నేను ఎకరా భూమిలో కౌలు సాగు చేస్తున్నాను. రెండేళ్లుగా పెట్టుబడి సాయం అందట్లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా సాయం అందింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే మిగిలాయి. చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాను. ఈ ఏడాదిలో ఈ విడతలోనైనా వస్తుందేమో అని ఆశతో ఎదురు చూశాను. కానీ నా ఆశ నిరాశగానే మారింది. నష్టాలే తప్ప లాభం లేదు. భవిష్యత్తులో కౌలుకు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. – పినిశెట్టి అచ్చెంనాయుడు, కేజేపురం, మాడుగుల మండలం, ఉమ్మడి విశాఖ జిల్లాసాక్షి, అమరావతి: అన్నదాతా సుఖీభవ.. అంటూ చంద్రబాబు ప్రభుత్వం రైతన్నలను నిలువునా మోసగిస్తోంది. ‘అధికారంలోకి రాగానే కేంద్రం ఇచ్చే దాంతో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం’ అంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీకి తూట్లు పొడుస్తోంది. తొలి ఏడాది నిస్సిగ్గుగా రూ.20 వేలు ఎగ్గొట్టింది. రెండో ఏడాది అరకొర సాయంతో చేతులు దులుపుకుంటోంది. భూ యజమానులకు రెండు విడతల్లో రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందించిన ప్రభుత్వం.. మూడో విడతగా శుక్రవారం మరో రూ.4 వేలు జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. భూ యజమానులకు రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.26 వేలు ఎగ్గొట్టడమే కాకుండా, కౌలు రైతులకైతే పైసా సాయం చేయకుండా పూర్తిగా మొండి చేయి చూపిస్తూ ఏకంగా రూ.6,400 కోట్లు ఎగ్గొట్టింది. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులుండగా.. 2024–25లో 9.25 లక్షల మందికి, 2025–26లో 8.24 లక్షల మందికి మాత్రమే సీసీఆర్సీలు (కౌలు రైతు గుర్తింపు కార్డులు) జారీ చేశారు. ఈ లెక్కన చూసినా తొలి ఏడాది 9.25 లక్షల మందికి రూ.20 వేల చొప్పున రూ.1,850 కోట్లు, రెండో ఏడాది 8.24 లక్షల మందికి రూ.1,648 కోట్లు జమ చేయాల్సి ఉండగా, అది కూడా చేయలేదు. మొత్తంగా అన్నదాతలకు రూ.21,273.28 కోట్లు ఎగ్గొట్టింది. మరో వైపు ఐదేళ్ల పాటు పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి.. సున్నా వడ్డీకి చాప చుట్టేసి.. ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం పెట్టింది. విత్తు నుంచి విఫణి వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయి పట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. మరో వైపు గత రెండేళ్లలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోయినా ఆదుకున్న పాపాన పోలేదు. అయినా సరే నిస్సిగ్గుగా తామేదో రైతులను ఉద్దరిస్తున్నట్టు అన్నదాత సుఖీభవ వారోత్సవాల పేరిట సంబరాలు నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మందికి ఎగనామంసూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేల పెట్టుబడి సాయం అందించాలి. 2023–24లో అర్హత పొందిన 53,58,366 మందికి రూ.20 వేల చొప్పున ఏటా రూ.10,716.73 కోట్లు జమ చేయాలి. కానీ 2024–25 తొలి బడ్జెట్లో ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. అదిగో ఇదిగో అంటూ తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టేసింది. పాత బకాయిలతో కలిపి 2025–26 బడ్జెట్లో రూ.21,433.46 కోట్లు కేటాయింపులు జరపాల్సి ఉండగా, కేవలం రూ.6,300 కోట్లతో సరిపెట్టింది. గతంలో వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే పెట్టుబడి సాయం అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తొలి ఏడాది ఎగ్గొట్టి, రెండో ఏడాది తనకు నచ్చినప్పుడు రూ.5 వేల చొప్పున 2 విడతల్లో రూ.10 వేలు జమ చేసింది. వాస్తవానికి 2023–24 అర్హుల జాబితా ప్రకారం 53.58 లక్షల మందికి జమ చేయాల్సి ఉండగా, పలు సాకులతో 46.85 లక్షల మందికి కుదించింది. అంటే దాదాపు 7 లక్షల మందికి కోత పెట్టింది. మరో వైపు భూ యజమానులతో పాటు తొలి ఏడాది కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండో ఏడాది వాస్తవ సాగుదారులకు పంగనామాలు పెట్టింది. రైతు కూలీలు, కౌలు రైతులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కృష్ణాజిల్లా పామర్రు, ఉయ్యూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ మూడో విడతలోనూ కోతలే⇒ నిజానికి ఏటా భూ యజమానులతో పాటు కౌలుదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2019–20లో 46.69 లక్షల మందికి లబ్ధి చేకూర్చగా, 2023–24కు వచ్చేసరికి లబ్ధిదారుల సంఖ్య 53.58 లక్షలకు పెరిగింది. ఇలా ఐదేళ్లలో ఈ పథకం కింద రూ.34,288.17 కోట్ల లబ్ధి చేకూరింది. ఆ లెక్కన గడిచిన రెండేళ్లలో లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిపోయింది. ⇒ ఆరు దశల వడపోత అనంతరం లబ్ధిదారుల సంఖ్య 46.86 లక్షలకు కుదించారు. పైగా వీరిలో 1.16 లక్షల మంది అటవీ సాగుదారులున్నారు. ఆ లెక్కన వెబ్ల్యాండ్ డేటా ప్రకారం తొలి రెండు విడతల్లో లబ్ధి పొందిన భూ యజమానుల సంఖ్య కేవలం 45.70 లక్షల మంది మాత్రమే. ⇒ చనిపోయిన రైతుల స్థానంలో గతంలో వారి వారసులకు పెట్టుబడిసాయం అందించేవారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. తొలి విడతలో తామిస్తామన్న రూ.20 వేల చొప్పున రూ.10,716.73 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండో ఏడాది 46.86 లక్షల మందికి రూ.ఐదు వేల చొప్పున రెండు విడతల్లో రూ.4,685.84 కోట్లు జమ చేసింది. కాగా పీఎం కిసాన్ కింద కేంద్రం జమ చేసే సొమ్ములను కూడా తమ ఖాతాలో వేసుకొని అసెంబ్లీ సాక్షిగా రూ.6,309.44 కోట్లు జమ చేశామని నిస్సిగ్గుగా ప్రకటించుకుంది.⇒ జగన్ హయాంలో అర్హత ఉండీ లబ్ధి పొందని వారు ఎవరైనా ఉంటే వెతికి వెతికి సాయం అందించేవారు. కానీ నేడు అన్నదాత సుఖీభవ తమకు జమ కాలేదంటూ వేలాది మంది గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. శుక్రవారం నుంచి మూడో విడత పంపిణీ కార్యక్రమంలో రూ.4 వేల చొప్పున రూ.1,874.34 కోట్లు జమ చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాయంతో కలిపి 2025–26 సీజన్లో రూ.6,560.18 కోట్లు జమ చేసినట్టవుతుంది. వాస్తవానికి రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున రూ.21,433.46 కోట్లు జమ చేయాల్సి ఉండగా, ఏకంగా రూ.14,873.28 కోట్లు నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది.సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి రైతుకూ ఏడాదికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామంటూ తెలుగుదేశం కరపత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన , తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో వ్యవసాయరంగానికి ఇచ్చిన హామీలు కౌలు రైతులకు రూ.6,400 కోట్లు ఎగనామం⇒ భూ యజమానులతో పాటు సామాజిక వర్గాలకు అతీతంగా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులతో పాటు దేవదాయ, ధర్మాదాయ భూ సాగుదారులందరికీ ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ఊరూవాడ విస్తృతంగా ప్రచారం చేసింది. ఆచరణకు వచ్చేసరికి తొలి ఏడాది భూ యజమానులతో పాటు కౌలు రైతులకు ఎగ్గొట్టారు. ⇒ రెండో ఏడాది తొలివిడత సాయం పంపిణీ వేళ.. ఖరీఫ్–2025 సీజన్లో పంట నమోదు (ఈ క్రాప్) ప్రామాణికంగా కౌలు రైతుల డేటా ధ్రువీకరణ చేపట్టి, ఆ తర్వాత అర్హత పొందిన వారికి రెండు విడతలు కలిపి జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడత సాయం పంపిణీ సమయంలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావచ్చిందని, త్వరలోనే జమ చేస్తామంటూ వారిని మభ్యపెట్టారు. ⇒ కనీసం చివరి విడతలోనైనా తమకు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుందేమోనని రాష్ట్రంలోని కౌలు రైతులందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలను ఆడియాశలు చేస్తూ వారి నోట్లో మట్టికొట్టారు. దేవదాయ భూ సాగుదారులనూ మోసం చేశారు. సీసీఆర్సీలతో సంబంధం లేకుండా కౌలు సాగుదారులందరికీ పథకాన్ని వర్తింప చేయాలంటే రెండేళ్లలో రూ.6,400 కోట్లు జమ చేయాలి. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిండా ముంచారు. అటకెక్కిన ఉచిత పంటల బీమా⇒ గత ప్రభుత్వ హయాంలో సాగైన ప్రతీ పంటను ఈ క్రాప్లో నమోదు చేసేవారు. ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా ఉచిత పంటల బీమా పరిహారంతో పాటు వైపరీత్యాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేవారు. కానీ నేడు ఈ క్రాప్ నిర్వీర్యమైపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టికొట్టారు. ⇒ 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు జూన్ 2024లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా 2023–24 సీజన్కు సంబంధించి రూ.1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలొడ్డింది. ⇒ ఖరీఫ్ 2024 సీజన్లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.834.44 కోట్లతో పాటు రబీ 2024–25, ఖరీఫ్–2025 సీజన్లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్లో ఏపీని కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ఇలా గడిచిన మూడు సీజన్లలో రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం రైతులకు అందకుండా దగా చేసింది.⇒ దాదాపు 12 లక్షల మంది రైతులకు రెండేళ్లలో రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీని ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు ఆరున్నర లక్షల మందికి రూ.1,000 కోట్లకు పైగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.రెండేళ్లలో రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీకి ఎగనామంఏ ఒక్క పంటకూ దక్కని మద్దతు ధర⇒ మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. ధాన్యం మొదలు పత్తి, మిరప, పొగాకు, టమాటా, ఉల్లి, మినుము, పెసలు, కంది, శనగ, జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇలా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోయినా ఆదుకోలేదు.ధరల స్థిరీకరణ నిధికి మంగళం⇒ వైఎస్ జగన్ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. తద్వారా ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని, వ్యాపారుల మధ్య పోటీ పెంచి రైతులకు మద్దతు ధర కల్పించే వారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,577 కోట్ల మేర పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు.అప్పుల ఊబిలో రైతులు⇒ చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో 21 నెలల్లో రూ.35 వేల కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2024–25లో దాదాపు 150 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడగా, 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర పోలీస్ శాఖే అధికారికంగా వెల్లడించింది. రైతులను చేయి పట్టుకుని నడిపించిన ఆర్బీకేలు నిర్వీర్యంఇది నమ్మించి మోసం చేయడమే నాలుగు ఎకరాల ఆలయ మాన్యం భూమిని కౌలుకు సాగు చేస్తున్నాను. డ్రిప్ సహాయంతో వేరుశనగ, టమాటా పంట వేశాను. పంట దిగుబడి రాక, పెట్టుబడులు తలకు మించిన భారమై రెండేళ్లుగా రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్క పైసా కూడా సహాయం అందించలేదు. మొదటి ఏడాది ఆశలు వదులుకున్నాం.ఈ ఏడాది అయినా నగదు జమ చేస్తుందని ఆశించిన మాకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. కౌలు రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారు. ఇది నమ్మించి మోసం చేయడమే. – కురుబ రాము, కోనాపురం, ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లా కౌలు రైతులను గుర్తించాలి కూటమి ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల ఊసే లేకుండా పోయింది. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు ఎగనామం పెట్టారు. రెండో ఏడాది గడుస్తున్నా కౌలు రైతు గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ప్రస్తుతం రబీ సీజన్లో సైతం 1.5 ఎకరాల్లో మినుము పంట సాగు చేశా. ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అధిక వర్షాలతో పంట సరిగా చేతికందక అప్పులపాలయ్యా. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కౌలు రైతులను గుర్తించి అన్నదాత సుఖీభవ మంజూరు చేయాలి. – సుబ్బరాయుడు, మీరాపురం, కమలాపురం మండలం, వైఎస్సార్ కడప జిల్లాకౌలు రైతులకు మొండిచేయి ప్రతి ఏడాది మూడెకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. ప్రస్తుత ప్రభుత్వంలో కౌలు రైతుల్లో కొందరికే గుర్తింపు కార్డులు ఇచ్చారు. చాలా మందికి ఇవ్వలేదు. గుర్తింపు కార్డులు ఇచ్చిన వారికి కూడా పెట్టుబడి సాయం కింద అందజేసే అన్నదాత సుఖీభవ వర్తింప చేయక పోవడం అన్యాయం. నాలాంటి కౌలు రైతులకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందడం లేదు. గత ప్రభుత్వంలో కౌలు రైతులకు సైతం రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. – పట్టాభయ్య, యానాదివెట్టు, వరదయ్యపాళెం మండలం, తిరుపతి జిల్లా ధరలేక తెగనమ్ముకున్నా నాకు రెండు ఎకరాల సొంత భూమి ఉంది. ఏటా రెండు కార్లు వరి పండిస్తున్నాను. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేది. అప్పట్లో పుట్టి (850 కేజీలు) రూ.22 వేలకు అమ్ముకున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024, 2025లో వేసిన ఎడగారుకు గిట్టుబాటు ధర లభించక పుట్టి రూ.14 వేలు చొప్పున తెగనమ్ముకున్నాను. పుట్టికి రూ.8 వేలు చొప్పున 5 పుట్లకు ఏటా రూ.40 వేలు నష్టపోయాను. రెండేళ్లల్లో నాలుగు పంటలకు రూ.1.60 లక్షలు నష్టపోయాను. రైతులకు గిట్టుబాటు ధర కలి్పంచలేని ఈ ప్రభుత్వాలు ఎందుకు? మేనిఫెస్టోలో ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు?– గుడిపాటి ప్రభాకర్నాయుడు, యనమదల, చేజర్ల మండలం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మద్దతు ధర అడియాశే చంద్రబాబు కూటమి పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చాక దళారులు, మిల్లర్లు దోచేశారు. గత ఖరీఫ్ సీజన్లో మూడెకరాల్లో వరి సాగు చేశాను. వరిలో తేమ శాతం సాకుగా చూపి 75 కిలోలు బస్తాకు రూ.300పైగా దోచేశారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం, అధికారుల్లో చలనం లేదు. రైతు పక్షాన నిలబడలేదు. పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా దళారులు, మిల్లర్లు మిలాకత్ అయ్యి రైతులను అడ్డంగా దోచుకున్నారు. ఆఖరికి రవాణా వాహనాలు కూడా మేమే చూసుకోవాల్సి వచ్చింది. పేరుకేమో రైతు సంక్షేమ ప్రభుత్వం. వాస్తవంలో మాత్రం రైతు గోడు పట్టించుకోవటం లేదు. – కొండవీటి వెంకట సుబ్బారావు, మంతెన, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా చాలా అన్యాయం నేను నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాను. కానీ నాకు అన్నదాత సుఖీభవ పథకం రాలేదు. ఇదేమని ప్రశ్నిస్తుంటే అధికారులు సమాధానం చెప్పడం లేదు. కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పుడు మాకు వర్తించలేదు. వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు ఆగిపోయింది. అసలు కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారా.. ఇవ్వరా తేల్చి చెప్పండి. – అమర లింగడు, కాగువాడ గ్రామం, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా వడ్డీకి అప్పుతెచ్చి పంటల సాగు నేను రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి, అపరాల పంటలు సాగు చేస్తున్నాం. జగన్ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి సాయం అందలేదు. అన్నదాత సుఖీభవ పథకం సాయం కోసం సచివాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. – దివిలి శ్రీను, తోడుగెడ్డ, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా రెండేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గరగా రెండేళ్లవుతోంది. ఇప్పటి వరకు రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ సమయానికి అందేది. – అనుసూరి గోవిందు, ఉండూరు, రామచంద్రపురం మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మొత్తంగా రూ.40 వేలు జమ చేయాలిపీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయం కౌలు రైతులకు తొలి ఏడాది ఎలాగూ ఎగ్గొట్టారు. రెండో ఏడాది అయినా ఇస్తారనుకుంటే దగా చేశారు. కనీసం మూడో విడతతో కలిపి అయినా ఇస్తారనుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. గతేడాది ఎగ్గొట్టిన బకాయిలతో పాటు మొత్తంగా రూ.40 వేలు జమ చేయాలి. – వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీ కౌలు రైతుల సంఘంఇతని పేరు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కలవకూరు గ్రామం. ఇతనికి నాలుగు ఎకరాల పొలం ఉంది. కొంత వరి పంట, మరి కొంత మొక్కజొన్న సాగు చేస్తుంటాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వేసిన పంట నష్టపోయి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. ఎకరాకు 25 బస్తాలు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. కొనుగోలు చేసిన నాథుడే లేదు. కూటమి ప్రభుత్వం క్వింటా రూ.1,800కు కొనుగోలు చేస్తుందని చెప్పిందే కానీ ఆ ధరతో కొనలేదు. దీంతో చివరకు రూ.1300కే దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. మొక్కజొన్న దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. మద్దతు ధర క్వింటా రూ.2,300తో ప్రభుత్వం కొనలేదు. దళారులకు రూ.1600కే అమ్ముకున్నాడు. దాంతో అప్పుల పాలయ్యాడు. వర్షాలకు పంట దెబ్బతిన్నా నష్ట పరిహారం ఇంత వరకు అందలేదు. ఇతని పేరు శేఖర్రెడ్డి. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పి.లింగాపురం గ్రామం. 2025ృ26 ఖరీఫ్ సీజన్లో ఎనిమిది ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ప్రస్తుతం రబీ సీజన్కు ఎనిమిది ఎకరాల్లో మొక్కజొన్న, 13ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశాడు. ఖరీఫ్లో నాలుగు ఎకరాల్లో సాగుచేసిన పత్తిపంటకు రూ.6 వేల ప్రీమియం చెల్లించి పంటల బీమా చేయించాడు. 2025 ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అధిక వర్షాలతో పత్తిపంట దెబ్బతిని దిగుబడి ఎకరాకు మూడు క్వింటాళ్లే వచ్చింది. పత్తిపంట దెబ్బతిన్న విషయాన్ని రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సిబ్బందికి తెలపటంతో పంట ఫొటోలు తీసుకొని వెళ్లి ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటిదాకా ఒక్కరూపాయి కూడా బీమా డబ్బులు మంజూరు చేయలేదు. జగన్ పాలనలో పైసా ప్రీమియం చెల్లించకపోయినా రూ.50 వేల వరకు పంటనష్ట పరిహారం మంజూరైంది.ఇతని పేరు తామరపల్లి ముసలయ్య. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడుపాలెం శివారు పెద్దిరెడ్డిపాలెం స్వగ్రామం. 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నాడు. ఏటా పంట సాగు ఖర్చు రూ.లక్ష వరకు అవుతోంది. గత ప్రభుత్వంలో ఏటా పెట్టుబడి సాయం అందేది. ఈ ప్రభుత్వం వచ్చాక మరింతగా పెట్టుబడి సాయం అందుతుందని ఎదురు చూశాడు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అయినా ఇస్తారనుకుంటే రూపాయి కూడా ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు మూడో విడతలో అయినా సాయం అందుతుందని ఎంతగానో ఆశలు పెట్టుకున్నా, నిరాశే ఎదురైందని నిట్టూరుస్తున్నాడు. ఇలాంటప్పుడు కౌలు రైతుగా గుర్తింపు కార్డు ఇచ్చినా ఏం ఉపయోగం? అని ప్రశ్నిస్తున్నాడు. -
కుటుంబానికి బాబు కానుక!
సాక్షి, అమరావతి: సంపద సృష్టించకుండా.. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా.. సహజ వనరులను పచ్చ ముఠాలకు అప్పగించి ఇసుక, సిలికా, గ్రానైట్, క్వార్ట్జ్ దోపిడీకి తెర తీసిన చంద్రబాబు సర్కారు మరింత బరి తెగించింది! బినామీలకు 99 పైసలకే భూములను పందేరం చేస్తూ, నిర్మాణ వ్యయం కింద చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఖజానా నుంచి దోచిపెట్టి ఎదురు చెల్లిస్తూ, బంధు గణానికి విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన భూమిని రాసిచ్చిన ప్రభుత్వ పెద్దలు తాజాగా అన్ని విలువలకు తిలోదకాలిచ్చేశారు! దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన కూడా చేయని రీతిలో నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్కు ప్రయోజనాలు కలి్పస్తూ తాజాగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తండ్రి, కుమారుడి సాక్షిగా హెరిటేజ్కు చేకూర్చిన లబ్ధి ఇలా ఉంది..! ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందంటూ.. తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాదికి ముందు తన కుటుంబానికి సీఎం చంద్రబాబు తీపి కబురు వినిపించారు! ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్ధ హెరిటేజ్కు ప్రభుత్వం నుంచి భారీ రాయితీలు, సబ్సిడీలను కల్పిస్తూ శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని కేబినెట్ నిర్ణయాలు వెల్లడించే మీడియా సమావేశంలో మంత్రి పార్ధసారధి దాటవేయగా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో మాత్రం తెలియచేసింది.తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపెంట గ్రామంలోని హెరిటేజ్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్ గ్రెడేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద మెగా ప్రాజెక్టు హోదా పొందిన ఈ హెరిటేజ్ డెయిరీ అప్ గ్రెడేషన్ వల్ల ఉత్పత్తుల తయారీ భారీగా పెరగనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫ్లేవర్డ్ పాలు 131 శాతం, పనీర్ 400 శాతం, నెయ్యి ఉత్పత్తి ఏకంగా 566 శాతం పెరగనుంది. సభ సాక్షిగా అబద్ధాలు...!‘‘హెరిటేజ్ మా కుటుంబ సంస్థ. మా కుటుంబ సభ్యులు దాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్థి చేకూరలేదు. ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరుకోలేదు. ఈ సంస్థ పెట్టినప్పుడే మేం ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రభుత్వం నుంచి ఏదీ ఆశించకూడదన్నదే మా విధానం. దానికి కట్టుబడే ఇప్పటి వరకు నడుచుకున్నాం..!’’ తాజా బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గంభీర ఉపన్యాసం ఇదీ! ఒకపక్క ప్రభుత్వం నుంచి ఆయాచిత ప్రయోజనాలు పొందుతూ అసెంబ్లీలో మాత్రం హెరిటేజ్కు ఎటువంటి లబ్ధి చేకూర్చడం లేదంటూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.సుమారు రూ.100 కోట్ల రాయితీచంద్రగిరి మండలం కాశీపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్ను రూ.209.68 కోట్లతో అప్గ్రెడేషన్ చేసే ప్రతిపాదనను మెగా ప్రాజెక్టుగా ఆమోదిస్తూ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద చంద్రబాబు సర్కారు భారీ రాయితీలను కల్పించింది. ప్రత్యక్షంగా 35 మందికి మాత్రమే ఉపాధి కల్పించనున్నారు. ఐదేళ్లపాటు 100 శాతం ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, యూనిట్కు రూపాయి చొప్పున విద్యుత్తు రాయితీ, అప్గ్రెడేషన్ టెక్నాలజీపై సబ్సిడీ పేరుతో పెట్టుబడిపై 50 శాతం వరకు అంటే సుమారు రూ.100 కోట్ల వరకు రాయితీల రూపంలో వెనక్కి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో చివర కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లుగా సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్ స్వయంగా పాల్గొన్న కేబినెట్ అజెండాలో చివరి అంశంగా హెరిటేజ్ను చేర్చి భారీ ప్రయోజనాలకు ఆమోద ముద్ర వేయించుకోవడం గమనార్హం. -
ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టి మరి ... బాబు అప్పుల చిట్టా ఆధారాలతో చూపించిన పేర్ని నాని
-
బాబు సంపద పెంచేందుకు హెరిటేజ్ కి భారీ రాయితీలు
-
ముగ్గురిని కంటే 25 నలుగురైతే 50 వేలు.. ఇప్పుడు మనం ఏం చేయాలంటే..
-
ముగ్గురిని ఎందుకు కనలేదు... చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
-
బాబు కేబినెట్ భేటీకి ఆరుగురు మంత్రులు డుమ్మా..
-
ఫిషింగ్ హార్బర్లపై బాబు కన్ను.. త్వరలో ఏపీ కూడా ప్రైవేటు వారికే..!
-
చంద్రబాబుకు బిగ్ షాక్ సొంత సర్వేలో 40 MLAల అవినీతి
-
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోయాయి
-
పవన్ కల్యాణ్.. ఇదేనా అభివృద్ధి? డ్రైనేజీ నీటిలో దిగి కాకినాడ ప్రజల నిరసన
-
రోడ్లు గుంతలపై చంద్రబాబు కామెంట్స్ సునీల్ డైలాగ్ తో కేతిరెడ్డి సెటైర్లు
-
హామీలపై నోరు మెదపరేమి? : వైఎస్ జగన్
మహిళలకు మళ్లీ మోసం.. సూపర్ సిక్స్, సెవెన్ అని మోసం చేశావ్.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మళ్లను అన్ని విధాలా దగా చేశావ్.. మహిళలకు అందించిన పథకాలన్నీ రద్దు చేశావ్. ఆఖరికి సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా దారుణంగా వంచించావ్.. ఇప్పుడు మరోసారి మభ్యపెడుతున్నావ్.. మహిళలకు ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలుఅధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఐఆర్’ ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. పీఆర్సీ ప్రస్తావనే లేదు. నాలుగు పెండింగ్ డీఏలు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ కింద ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీపడ్డారు. చివరికి ఆశ వర్కర్లు, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలనూ నెరవేర్చకుండా పోలీసులతో దాడి చేయించారు.నెయ్యిపై దుమారం రేపి.. స్కామ్లుతిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్లు చేస్తున్నారు. ఇదేనా తాట తీయడం? తాట తీస్తామని డైలాగులు చెప్పడం కాదు.. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి నేతల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు నీకే ఫిర్యాదు చేసింది బాబూ! టీటీడీ చైర్మన్ ఓ మహిళను మోసం చేసి వీడియోలు, ఫొటోలతో దొరికిపోతే ఏం చేశావ్ బాబూ? కేజీబీవీ ప్రిన్సిపాల్పై టీడీపీ ఎమ్మెల్యే కూన వేధింపుల మీద చర్యలేవి? – మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఉద్యోగులకు మీరు బకాయి పడిన నిధులు ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నేను అడిగిన ప్రశ్నలకు.. 16 రోజులపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదెందుకు?’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్లీ అడుగుతున్నా.. ఇప్పటికే మూడు బడ్జెట్లు పెట్టారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చీ రాగానే 2024 జూన్ నుంచే అమలులోకి వస్తాయన్నారు. హామీల పేరిట బాకీ పడ్డ సొమ్ములు ఎప్పుడిస్తావు? అని అడిగితే మాత్రం నోరు మెదపడం లేదు’ అంటూ నిలదీశారు. గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఆటలు.. పాటలు.. స్కిట్లతో కాలక్షేపం చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలు ప్రదర్శిస్తూ.. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలను గుర్తు చేస్తూ.. ఆ హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులను వివరిస్తూ.. ప్రజలకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా చూపుతూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అన్నదాత సుఖీభవ.. నిలుపునా మోసం⇒ పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రూ.20 వేలు ఇస్తామన్నాడు (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే రూ.6 వేలు కాకుండా ప్రతి ఏటా రైతుకు రూ.20 వేలు ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను ప్రదర్శించారు). తొలి ఏడాది ఎగ్గొట్టాడు. రెండో ఏడాది రూ.20 వేలకు గాను అప్పుడో రూ.ఐదు వేలు.. అప్పుడో రూ.ఐదు వేలు ఇచ్చాడు. అంటే రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. మా హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తే చంద్రబాబు ప్రభుత్వంలో వారి సంఖ్యను 46.85 లక్షల మందికి కుదించేశారు. దాదాపు 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. పైగా కౌలు రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఈ బాకీ సొమ్ములు ఎప్పుడిస్తావు అని అడిగితే అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదు. ⇒ 2023–24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున ఇన్సూ రెన్స్ ప్రీమియం కట్టి ఉంటే.. కేంద్రం ఇవ్వాల్సింది జత చేసేది. ఆ వెంటనే రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా పరిహారం చెల్లించేవి. ఈ పెద్దమనిషి 2024 జూన్లో ప్రీమియం డబ్బులు కట్టక పోవడంతో రైతులు రూ.1,324 కోట్లు నష్టపోయారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. చంద్రబాబు నిర్వాకాల వల్ల 2023–24, 2024–25 సీజన్లలో రూ.3,500 కోట్ల మేర బీమా పరిహారం నష్టపోయారు. ఇది ఎప్పుడు ఇస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ అక్టోబర్లో మోంథా తుపాన్తో నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని అడిగితే వీళ్ల నోటి నుంచి ఒక్క మాట రాదు. ⇒ మా ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు పెట్టి.. రూ.7,500 కోట్లు వెచ్చించి అండగా నిలిచాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరాలో సాగైన ప్రతి పంటను ఈ–క్రాప్లో నమోదు చేసేవాళ్లం. ఏ రైతుకు అయినా తాను వేసిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా పర్యవేక్షిస్తూ ధరలు పడిపోయినా ప్రతిసారీ ఆదుకున్నాం. పైగా ప్రతీ ఆర్బీకేలో ప్రతి పంటకు నిర్దేశించిన మద్దతు ధరలతో బోర్డులు పెట్టి దళారుల వెన్నులో వణుకు పుట్టించేవాళ్లం. అంతకంటే తక్కువ రేటుకు కొనేందుకు సాహసిస్తే.. వెంటనే స్పందించేవాళ్లం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. ఇంత దారుణమా.. రైతులంటే ఇంత చులకనేంటయ్యా.. అని అడిగితే సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు.ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు⇒ గతేడాది వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, శనగలు, మిర్చి, టమాటా, చీనీ, పత్తి అన్ని పంటలకు ధరలు పడిపోతే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మళ్లీ మిర్చి, శనగ, అరటి, మొక్కజొన్న పంటలకు ధరలు పడిపోయాయి. నెల క్రితం క్వింటా రూ.26 వేలున్న మిర్చి.. ఈ రోజు రూ.18 వేలకు పడిపోయింది. శనగ కనీస మద్దతు ధర రూ.5,875.. రైతులకు రూ.5 వేలకు మించి రావడం లేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 అయితే, రైతులు కేవలం రూ.1400–1500కు అమ్ముకుంటున్నారు. ఈ ఒక్క పంటపైనే రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు.⇒ అరటి ఈ ఏడాది కూడా టన్ను రూ.5 వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో టన్ను రూ.30 వేలు పలుకగా, ఈ రోజు రూ.5 వేలకు తెగనమ్ముకుంటున్నారు. టమాటా కిలో రూ.2కు అమ్ముకోవాల్సి వస్తోంది. బత్తాయి, పుచ్చకాయ, మస్క్మెలన్, సజ్జలు ఇలా అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి రైతులకు తోడుగా నిలవాల్సింది పోయి బడ్జెట్లో రూ.300 కోట్లు పెట్టారు. ఇంత తక్కువ ఎందుకు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు.⇒ రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆటలు, పాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. అసెంబ్లీలో వీళ్ల ప్రవర్తన చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో ఉందంటే.. వందలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. వీరికి పరిహారం ఎప్పుడు ఇస్తారని అడిగితే అసెంబ్లీలో ఒక్క మాట చెప్పలేదు. కనీసం వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల కష్టాలపై అసెంబ్లీలో చర్చించడం, వారికి భరోసా కల్పించడం మచ్చుకైనా చేయలేదు. మరో 7.46 లక్షల పింఛన్లు కోత వేయబోతున్నారు⇒ 2024 ఎన్నికల షెడ్యూల్ నాటికి మార్చిలో మేము ఇచ్చిన పింఛన్ల సంఖ్య 66,34,372. ఈ నెలలో ఇచ్చిన పింఛన్ల సంఖ్య 60,69,664. అంటే ఇప్పటికే 5,64,708 పింఛన్లు కట్ చేశారు. 2026 ఫిబ్రవరిలో 60,96,108 మందికి పింఛన్లు ఇస్తే.. మార్చిలో 60,69,664 మందికి ఇచ్చారు. అంటే ఈ ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ఇలా ప్రతీ నెలా పింఛన్లు కట్ చేసూ్తనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.⇒ కొత్త పింఛన్ల మంజూరు కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మా హయాంలో ప్రతి ఆర్నెల్లకోసారి జూన్, డిసెంబర్లలో పింఛన్లు అప్డేట్ చేసే వాళ్లం. ఈరోజు ఆ పరిస్థితి కన్పించడం లేదు. కనీసం మార్చిలో ఇచ్చిన పింఛన్ల సంఖ్యను బట్టి చూసినా ఈ ఏడాది బడ్జెట్లో రూ.31,554 కోట్లు పెట్టాలి. కానీ బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.27,719 కోట్లు. అంటే మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని, బడ్జెట్లో ఎందుకు తగ్గించి చూపిస్తున్నారో చెప్పాలని అడిగాం. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా లేదు.తల్లికి వందనం పేరిట దగా⇒ తల్లికి వందనం కింద చదువుకునే ప్రతీ పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్నారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు పథకాన్ని కత్తిరించారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ఈ–యూడైస్) ప్రకారం 2023–24లో బడికి వెళ్లే పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. కానీ ఇచ్చింది 67 లక్షల మందికే.తల్లికీ వంచనే.. యూడైస్ ప్లస్ ప్రకారం 87,41,885 మంది పిల్లలకు తల్లికి వందనం కింద రూ.13,112 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.8,456.48 కోట్లు మాత్రమే ⇒ పైగా ఏ ఒక్కరికి రూ.15 వేలు ఇవ్వలేదు. కొంత మందికి రూ.8 వేలు, మరికొంత మందికి రూ.9 వేలు, ఇంకొంత మందికి రూ.10 వేలు, అక్కడక్కడా అతి కొద్ది మందికి రూ.13 వేలు చొప్పున ఇచ్చారు. మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులతో పాటు రెండో ఏడాది ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారని అడిగితే సమాధానం లేదు. ⇒ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. తీరా ఇప్పుడు షరతులు పెట్టారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే కేవలం 5 రకాల సర్వీసులకే పరిమితం చేశారు. ఎందుకు ఈ మాదిరిగా షరతులు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు. ⇒ దీపం పథకం కింద ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్కే ఇచ్చి మిగిలిన రెండు సిలిండర్లు డబ్బులు ఎగ్గొట్టారు. గ్యాస్ కంపెనీల డేటా ప్రకారం రాష్ట్రంలో కోటి 59 లక్షల కనెక్షన్లున్నాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్కు రూ.855 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలి. అంటే మూడేళ్లకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ తొలి ఏడాది రూ.786 కోట్లు ఖర్చు చేశారు. రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్లో రూ.2,199 కోట్లుగా చూపించారు. ఇచ్చారో లేదో కూడా తెలియదు. ఈ బడ్జెట్లో రూ.2,600 కోట్లు పెట్టారు. మరి రూ.12 వేల కోట్లకు గానూ ఇచ్చింది సగం కూడా లేదు. ఈ పథకం కింద మహిళలకు రూ.6,144 కోట్లు బాకీ పడ్డారు. ఈ సొమ్ములు ఎప్పుడు ఇస్తారని అడిగితే నోరు మెదపడం లేదు.నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమైంది?⇒ యువగళం పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఏటా రూ.36 వేల చొప్పున మూడేళ్లకు ప్రతి నిరుద్యోగికి బాకీపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారో చెప్పమంటే నోరు మెదపడం లేదు. ఆడబిడ్డలకూ తీవ్ర అన్యాయం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలు 1,78,99,440 మంది ఉండగా.. ఒక్కరికి కూడా ఆడబిడ్డ నిధి కింద ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు ⇒ సూపర్ సిక్స్లో రెండో కీలకమైన హామీ..18 ఏళ్లు నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పేరిట నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వీరిలో 60 ఏళ్లు పైబడిన వారిని తీసేస్తే 1,78,99,440 మంది అర్హులు. వీరికి ప్రతి నెలా రూ.1,500.. ఏడాదికి రూ.18 వేలు చొప్పున మూడేళ్లకు బాకీ పడ్డ రూ.54 వేలు ఎప్పుడు ఇస్తారని అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా చేయలేదు. ⇒ మరో ముఖ్యమైన హామీ.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ పథకం. ఈ పథకం కింద నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు..ఇలా మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఎప్పుడు ఇస్తారని అడిగితే కనీసం మాట్లాడటం లేదు.ప్రతినెలా 25 వేలకు పైగా పింఛన్ల కోత వైఎస్ జగన్ 2024 మార్చిలో 66,34,372 మందికి పింఛన్లు ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో పింఛన్లు ఇచ్చినది 60,69,664 మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. ఆరోగ్యశ్రీ పథకం నడవాలంటే బకాయిలతో కలిపి రూ.7,150 కోట్లు కావాలి. బడ్జెట్లో రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించిన చంద్రబాబు గతంలో రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్లైనా లేదు. పిల్లల చదువులెలా సాగుతాయి? ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద బకాయిలతో కలిపి మొత్తం రూ.10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలా అయితే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. పెన్షన్లు కటింగ్...50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ హామీని నెరవేర్చకుండా మూడేళ్లలో ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. మరోవైపు సామాజిక పెన్షన్లు ఇప్పటికే 5,64,708 కట్ చేశారు. ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్ చేశారు. ప్రతీ నెలా పింఛన్లు కట్ చేస్తూనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛనూ ఇవ్వలేదు. పింఛన్ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులను బట్టి మరో 7,45,993 పింఛన్లు కట్ చేయబోతున్నామని చెప్పకనే చెబుతున్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇంకెప్పుడు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు పచ్చ పత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన అన్నదాతకు దగా...పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామన్నాడు. రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. కౌలు రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి తూట్లు పొడిచారు. రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆటపాటలు, స్కిట్లతో కాలక్షేపం చేశారు. ఇళ్లపై దొంగ మాటలు..మేం 31 లక్షల పట్టాలిచ్చి 21 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశాం. 10 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులను చంద్రబాబు మళ్లించడంతో ఈ పథకం ఆగిపోయింది. కనీసం మేం మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతుంటే త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని దొంగ మాటలు చెబుతున్నారు. ఈ రెండేళ్లలో ఒక్క అక్క చెల్లెమ్మకైనా గజం స్థలం ఇచ్చారా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు.ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి?జగన్కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు నచ్చదు. కనీసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకూ థ్యాంక్స్ చెప్పరు. సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? సర్వే పరికరాలు, కోర్ స్టేషన్లు, రోవర్స్ ఎవరు తీసుకొచ్చారు? విమానాలు, హెలికాప్టర్లలో సర్వేలు ఎవరి హయాంలో జరిగాయి? ఓఆర్ఐ రికార్డులు, సర్వే అనంతరం హద్దుల్లో పాతడానికి కోట్ల హద్దు రాళ్లు ఎవరి హయాంలో సమకూర్చారు? పాస్బుక్లో క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్ హద్దు నిర్ణయం ఎవరి హయాంలో ప్రారంభమైంది? -
15 వేల మాట దేవుడెరుగు.. తల్లికి వందనం డబ్బులు ఎక్కడ అని అడిగితే..
-
టీడీపీ ఏడాదిలో చేసిన అప్పులు.. ఆధారాలతో బయట పెట్టిన వైఎస్ జగన్
-
బాబు సర్కార్ అప్పుల దూకుడు.. రోజుకు ₹505 కోట్లు అప్పు..!
-
సర్కారు వైద్యానికి సుస్తీ!
సాక్షి, నెట్వర్క్: సర్కారు వైద్యానికి సుస్తీ చేసింది. నయం చేయలేని రోగంతో ప్రభుత్వ ఆస్పత్రులు కునారిల్లుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుపేదలు వైద్యం కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఏ ఆస్పత్రిలోనూ తగినన్ని పడకలు లేవు. ఒకే పడకపై ఇద్దరు నుంచి ఏడుగురు పేషెంట్లు కనిపిస్తున్నారు. ఆస్పత్రి పరిసరాలు, బాత్రూమ్లు దుర్గంధభూయిష్టంగా ఉన్నాయి. కనీస పారిశుద్ధ్యం కనిపించలేదు. అత్యవసర చికిత్స కోసం పేషెంట్లు ఆదరాబాదరాగా వస్తే.. స్ట్రెచర్లు కాదు కదా కనీసం వీల్చైర్లో తీసుకెళ్లే దిక్కు కూడా లేదు. కొన్ని ఆస్పత్రులలో వీల్చైర్లు ఉన్నా సిబ్బంది లేరు. రోగి వెంట వచ్చే కుటుంబ సభ్యులే వారిని తీసుకెళ్లడమో మోసుకెళ్లడమో చేస్తున్నారు. వీల్చైర్లు, స్ట్రెచర్లే కాదు ముఖ్యమైన పరికరాలూ లేవు. ఉన్నా పనిచేయని స్థితిలో ఉన్నాయి. రిపేర్లు చేయించేవారు లేరు. సిబ్బంది కొరతతో పాటు వైద్యుల కొరత కూడా ఆస్పత్రులను వేధిస్తోంది. నెలల తరబడి ఈ ఖాళీలు భర్తీ కావడం లేదు. చచ్చీచెడీ వైద్యం చేయించుకున్నా మందులకు ఠికాణా ఉండడం లేదు. బయట కొనుక్కోండి అని సిబ్బంది చెబుతుంటే పేదలు బిక్కమొహం వేస్తున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో కనిపించిన విషయాలివీ.. ప్రాణాధారమైన పరికరాలెక్కడ?విజయవాడ జీజీహెచ్లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. వెంటిలేటర్లు కొనాలని ఆరు నెలలుగా వైద్యులు కోరుతున్నా, ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీంతో ప్రాణాపాయంలో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జీజీహెచ్లో సిటీస్కాన్ పరికరం ఆరు నెలలకుపైగా మూలన పడింది. పట్టించుకునే నాథుడే లేడు. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఏరియా వైద్యశాలలో కూడా సీటీస్కాన్ పరికరం లేదు. బయటకు పంపిస్తున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఒకే ఒక ఎక్స్రే యూనిట్ ఉంది. వందలమంది రోగులు గంటల తరబడి అక్కడ క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది.వైద్యులే కాదు సాధారణ ఉద్యోగులకూ కొరతే..విజయవాడ జీజీహెచ్లో నాల్గో తరగతి ఉద్యోగుల(ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ) కొరత తీవ్రంగా ఉంది. దీంతో రోగులను ఒకచోట నుంచి మరో చోటుకు తరలించాలన్నా, క్యాజువాలిటీ నుంచి ఐసీయూకు తరలించాలన్నా రోగుల బంధువులే తీసుకెళ్లాల్సిన దయనీయ స్థితి నెలకొంది. కనీసం 350 మంది ఉండాల్సిన ఉద్యోగులు కేవలం 96 మంది మాత్రమే ఉన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రిలో రోజు 1,200 నుంచి 1,300 వరకు ఓపీ ఉంటుంది. ఇన్ పేషెంట్లు సుమారు 500 మంది ఉంటారు. తగినంత మంది ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు లేరు. వీల్ చైర్లు, స్ట్రెచర్లో రోగులను తరలించడం ఇబ్బందిగా మారింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సర్వజనాస్పత్రిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మేదరమెట్లకు చెందిన నలబోతుల కోటమ్మ అనే మహిళను 11 ఏళ్ల ఆమె కుమారుడు కోటయ్య వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని తోసుకుంటూ తీసుకెళ్లడం కనిపించింది. గుంటూరు జీజీహెచ్లో మందుల కోసం క్యూ లైన్లో బారులు తీరిన రోగులు, వృద్ధులు పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. అత్యవసర సమయాల్లోనూ, ఆదివారాల్లోనూ మత్తు డాక్టర్ అందుబాటులో ఉండకపోవడం సమస్యగా మారిందని రోగులంటున్నారు. ఏలూరు జీజీహెచ్, మెడికల్ కళాశాలకు సంబంధించి 51కిపైగా ఖాళీలు ఉన్నాయి. ఇక గుండెపోటు వస్తే వైద్యం చేసే నాథుడే లేడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం ఏరియా ఆస్పత్రిలో నాల్గవ తరగతి ఉద్యోగుల కొరత ఉంది. 18 మందికిగాను కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. జీడీ వర్కర్లు ఎనిమిది మందికి ముగ్గురు ఉన్నారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు. ప్రధానంగా సివిల్ సర్జన్ ఆర్ఎంఓ, డిప్యూటీ సివిల్ సర్జన్ రేడియాలజీ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, మైక్రో బయాలజీ, ఈఎన్టీ, నర్సింగ్ సూపరింటెండెంట్ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసే వారు సైతం లేకపోవడంతో ఈ విభాగం తాళం వేసే ఉంటోంది. దీంతో ఈ సేవలకు కూడా రోగులు బయటకు వెళ్లాల్సి వస్తోంది. విజయనగరం జిల్లా సర్వజనాస్పత్రిలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ సేవలు అందడం లేదని రోగులు చెబుతున్నారు. బంధువులే రోగులను ఎక్స్రే, స్కానింగ్, వైద్య పరీక్షల కోసం వీల్ చైర్, స్ట్రెచర్లపై తరలిస్తుండడం కనిపించింది.ఇద్దరు నుంచి ఏడుగురు రోగులకు ఒకే పడక..పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో 150 పడకలు ఉంటే.. ఇన్ పేషెంట్లు 286 మంది ఉన్నారు. దీనివల్ల ఒకే పడకపై ఇద్దరిని సర్దుబాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. రోగులు, వారి బంధువులు వేచి ఉండేందుకు సరిపడా సౌకర్యాలు లేవు. కుర్చీలు కూడా లేక కిందే కూర్చోవాల్సిన పరిస్థితి. గర్భిణులకూ ఇవే ఇక్కట్లు. గుంటూరు జీజీహెచ్లో తుప్పు పట్టిన మంచాలపై, పరుపులు సైతం చిరిగిపోయిన మంచాలపై రోగులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం ఏరియా ఆస్పత్రిలో 100 పడకలుండాలి కానీ నలభై బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కూడా చాలా బెడ్లను ఆస్పత్రి కారిడార్లలో ఉంచారు. విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రిలో వార్డుల్లో పడకలు చాలక రోగులకు వరండాలోనే చికిత్స అందిస్తున్నారు. గత ఫిబ్రవరి 7న పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఇడ్లీ, నిల్వ చట్నీ తిని అస్వస్థతకు గురికావడంతో వారిని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ బెడ్లు చాలక ఒకే మంచంపై ఏడుగురిని కూర్చోబెట్టి చికిత్స అందించిన దుస్థితి సర్కారు నిర్లక్ష్యానికి అద్దంపట్టింది. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో ఒకే బెడ్పై ఏడుగురు విద్యార్థులను కూర్చోబెట్టి చికిత్స చేస్తున్న దృశ్యం (ఫైల్) మందుల్లేవ్.. బయట కొనుక్కోండి..విజయవాడ జీజీహెచ్లో కార్డియాలజీ, న్యూరాలజీకి సంబంధించిన కొన్ని రకాల మందులు అందుబాటులో లేవు. దీంతో రోగులు బయట కొనుగోలు చేస్తున్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు ఏరియా వైద్యశాలలో చాలా రకాల మందులు అందుబాటులో లేవు. బయట కొనుక్కోమని సిబ్బందే సలహా ఇస్తున్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో జలుబు, దగ్గు మందులు కూడా లేవు. కాకినాడ జీజీహెచ్లో మందుల కొరత వేధిస్తోంది. అత్యవసర కేటగిరికి చెందిన మందులు కూడా లేకపోవడం రోగులకు ప్రాణ సంకటంగా మారుతోంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మందులు లేవంటూ చీటి రాసి బయట తెచ్చుకోమంటున్నారని రోగులు చెబుతున్నారు.సాయం పట్టని సిబ్బందితీవ్ర అస్వస్థతతో అచేతనంగా కుటుంబ సభ్యుల సాయంతో ఆస్పత్రికి వచ్చిన ఈ వృద్ధురాలి పేరు పి.నాగమణి. శ్వాస సరిగ్గా ఆడటం లేదనీ.. మూత్ర సమస్యతో బాధపడుతోందంటూ కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్కు ఉదయం 10.45కి తీసుకొచ్చారు. కుమార్తె క్యాజువాలిటీలోకి వెళ్లి సిబ్బందికి సమస్య వివరించారు. చాలాసేపటి తర్వాత ఆమె చేతికి స్ట్రెచర్ ఇచ్చి పంపించారు. నాగమణి కుటుంబసభ్యులే ఆటోలోంచి వృద్ధురాలిని లేపి స్ట్రెచర్పై పడుకోబెట్టి.. క్యాజువాలిటీలోకి తీసుకెళ్లాల్సి వచ్చింది.మనవరాలిని ఎత్తుకుని తాత అవస్థలు పాడేరు మండలం కుజ్జెలి గ్రామానికి చెందిన గబ్బాడ గంగన్న గాయపడిన తన మనవరాలు శైలజను చంకన ఎత్తుకుని ఎక్స్రే గది వద్ద చాలా అవస్థ పడ్డాడు. ఎక్స్రే గది వద్ద రోగుల తాకిడి అధికంగా ఉండడంతో గంగన్న కూడా సుమారు గంటన్నర పాటు క్యూలైన్లో నిరీక్షించాల్సి వచ్చింది.ఆస్పత్రులా.. డంపింగ్ యార్డులా..పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాల పరిసరాలు దుర్గంధభూయిష్టంగా మారాయి. ఆస్పత్రిలోని డ్రైనేజీలలో నీరు ముందుకు కదలక పాచిపట్టి కనిపిస్తున్నాయి. వాడిన నీరు బయటకు వెళ్లే మార్గం లేదు. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో బ్లడ్బ్యాంకు వైపు వెళ్లే ప్రాంతాల్లో నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అవసరమైన టాయిలెట్లు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. ఉన్న టాయిలెట్లు రిపేర్ల పేరుతో తాళాలు వేసి ఉంచుతున్నారు. దీంతో రోగులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కాపురం జీజీహెచ్ పరిసరాల్లో మురుగునీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతోంది. అనంతపురం సర్వజన ఆస్పత్రిలోనూ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.వీల్చెయిర్లు, స్ట్రెచర్లు లేవు..గుంటూరు జీజీహెచ్ ఓపీ విభాగంలో రోగులు చికిత్స పొందేందుకు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వీల్చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో లేవు. రోగుల సహాయకులే రోగులను తరలించాల్సి వస్తోంది. కడపలోని జీజీహెచ్ (రిమ్స్) ఓపి వద్ద వీల్ చైర్, స్ట్రెచర్లు లేకపోవడంతో రోగుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.వార్డు బాయ్ కూడా లేరు..మా నాన్న సింహాచలం తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే కేజీహెచ్లో అడ్మిట్ చేశాం. టెస్టులకు, స్కానింగ్కు వెళ్లాలంటే మేమే తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఎవరూ సాయం చెయ్యడం లేదు. వీల్ చెయిర్ ఇస్తున్నారు. అక్కడ వార్డు బాయ్ లేరని చెప్పారు.– సాయికృష్ణ, దత్తిరాజేరు, విజయనగరం జిల్లామందులకు రూ.450 ఖర్చు అయ్యిందికొంత కాలంగా విపరీతమైన దగ్గు వస్తోంది. నోటి నుంచి రక్తం సైతం పడుతోంది. ఏరియా ఆసుపత్రికి వచ్చాను. పరీక్షించిన డాక్టర్ నాలుగు రకాల మందులు రాయగా అందులో ఒకటే ఇచ్చి మూడు బయట తీసుకోమన్నారు. ప్రైవేట్ దుకాణంలో రూ.450 ఖర్చు చేసి కొన్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక మందులు కొనుక్కోవలసిరావడం మా వంటి పేదలకు భారంగా మారింది. – షేక్ షఫీ, రోగి, నరసరావుపేటస్కానింగ్ బయట చేయించుకురమ్మన్నారుమాది మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం వాకపల్లి గ్రామం. 100 కి.మీ. బస్సులో ప్రయాణించి ఎన్టీఆర్ ఆస్పత్రికి వచ్చాను. 15 రోజులుగా ఎపెండిక్స్ నొప్పితో బాధపడుతున్నా. స్కానింగ్ రాశారు. బయట చేయించుకుని నాలుగురోజుల తర్వాత రమ్మన్నారు. నొప్పి భరించలేకపోతున్నా. చనిపోవాలనిపిస్తుంది. ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చూపించుకుంటాను. – టి.చరణ్, వాకపల్లి గ్రామం, విశాఖజిల్లావైద్యం చేయలేం.. వెళ్లమన్నారు..ఇంటి దగ్గర ప్రమాదవశాత్తూ కిందపడ్డా. 55 ఏళ్ల వయసులో నడవలేని స్థితిలో హిందూపురంలోని జిల్లా ఆస్పత్రికి తెల్లవారుజామునే వచ్చాను. అత్యవసర విభాగంలోకి వెళ్తే.. స్కానింగ్ చేయించుకోవాలని చెప్పారు. ఉదయం 11 గంటలు దాటినా.. పట్టించుకునే వారే కనిపించలేదు. డ్యూటీ డాక్టర్ వచ్చే వరకు వేచి ఉండాలన్నారు. చివరకు ఇక్కడ వైద్యం చేయలేమని చెప్పి వెళ్లిపోమన్నారు. – అడవన్న, నేతులపల్లి, సత్యసాయి జిల్లాపట్టించుకునే దిక్కులేదు..నాకు నెల రోజుల కిందట మెదడుకు సంబంధించి శస్త్ర చికిత్స జరిగింది. పరీక్షలు చేయించుకునేందుకు శ్రీకాకుళం నగరంలోని రిమ్స్ ఆస్పత్రికి వచ్చాం. ఓ ప్రైవేట్ ట్యాక్సీలో వచ్చిన నన్ను దింపేందుకు ఆస్పత్రి సిబ్బంది ఎవరూ లేరు. కనీసం స్ట్రెచర్ అయినా దొరుకుతుందన్న ఆశతో మా వాళ్లు వెతుకులాడారు. ఫలితం లేదు.. సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులెవరూ అందుబాటులో ఉండరని ఎవరో చెప్పారు. చేసేది లేక వెనక్కు వెళ్లిపోయాం. – కుమ్మరి రాజారావు, పాలవలస, శ్రీకాకుళం జిల్లా -
రాష్ట్రాన్ని ముంచేలా చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ భారీ అప్పు
-
చంద్రబాబు ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల అల్టీమేటం
సాక్షి,ఎన్టీఆర్: విజయవాడ ఆరోగ్యశ్రీ పథకంపై ఆసుపత్రులు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయకపోతే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ (UHC) లో భాగస్వామ్యం చేయబోమని స్పష్టంగా ప్రకటించాయి.ఆసుపత్రుల సంఘాలు ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశాయి. బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ పథకంలో కొనసాగడం అసాధ్యమని స్పష్టం చేశాయి. 2007 నుండి పాత రేట్లనే ప్రభుత్వం అమలు చేస్తోందని ఆసుపత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. హెల్త్ ప్యాకేజీలను పెంచకుండా, కేవలం 25 లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించాయి. ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వం పాత ప్యాకేజీలను కొనసాగిస్తోందని విమర్శించాయి.ప్రభుత్వం 31వ తేదీ లోపు కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలని ఆసుపత్రులపై ఒత్తిడి తెస్తోందని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు వెల్లడించాయి. బకాయిలు చెల్లించకపోతే ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశాయి. ఆసుపత్రులు ఓటిఎస్ (One Time Settlement) కింద మూడు వేల కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. బకాయిలు చెల్లించకపోతే యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో భాగస్వామ్యం చేయబోమని స్పష్టంగా ప్రకటించాయి.మొత్తంగా, ఆరోగ్యశ్రీ పథకంపై ఆసుపత్రులు ప్రభుత్వానికి గట్టి అల్టీమేటం జారీ చేశాయి. పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించాయి. -
భూకబ్జా ఆరోపణలపై బుగ్గన రియాక్షన్
-
KSR LIVE Show: దేవుడికే భూములు అమ్మిన బడా వ్యాపారి బాబు
-
తల్లికి వందనం మోసం భారీ షాక్ ఇచ్చిన చంద్రబాబు
-
Punyasheela: వేంకటేశ్వర స్వామికే భూములు అమ్మిన కేటుగాడు
-
వెంకన్న ఆలయానికి భూములడిగితే కోట్లు వసూలు చేస్తారు
-
రైతన్నపై రుణపాశం!
సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కకపోవడం.. ఏ దశలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మోసపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ బకాయిల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం రాష్ట్రంలో సాగు రంగం దుస్థితి, రైతన్నల కడగండ్లకు నిదర్శనంగా నిలుస్తోంది. పెట్టుబడి సాయం అందకపోవడం.. ఎరువుల కోసం నరకయాతన.. ఉచిత పంటల బీమా అటకెక్కడం.. ఇన్పుట్ సబ్సిడీ ఎగిరిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 20 నెలలుగా పెద్ద ఎత్తున రైతుల బలవన్మరణాలు కలవరపరుస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిల్లో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు వెల్లడించారు. 55 శాతం రైతు కుటుంబాలకు రుణ సదుపాయంగతేడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.3,75,254.59 కోట్లు కాగా ఇందులో పంట రుణ బకాయిలు రూ.2,01,744.41 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.1,73,510.18 కోట్లుగా ఉన్నాయి. గత డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.31,34,807.42 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో పంట రుణ బకాయిలు రూ.16,34,219.07 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.15,00,588.35 కోట్లు ఉన్నాయి. నేషనల్ రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో 55 శాతం వ్యవసాయ కుటుంబాలు క్రెడిట్ సౌకర్యాన్ని పొందుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బ్యాంకులకు ప్రాధాన్యతా రంగ రుణ లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లాంటి పథకాలతో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పంకజ్ చౌదరి చెప్పారు. ఇక తెలంగాణలో వ్యవసాయ రుణ బకాయిలు మొత్తం రూ.1,75,960.56 కోట్లుగా ఉన్నాయి. ఇందులో పంట రుణాలు రూ. 95,167.98 కోట్లు, టర్మ్ రుణాలు రూ. 80,792.58 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కాగా రూ.5,06,290.45 కోట్ల వ్యవసాయ రుణ బకాయిలతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది.అన్నదాతల నోట్లో మట్టి..చంద్రబాబు పాలనలో గత 20 నెలల్లో రాష్ట్రంలో రైతన్నలు అన్ని విధాలుగా మోసపోయారు. తామ అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీని తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.30 వేలు ఎగ్గొట్టి రూ.10 వేలతో సరిపెట్టారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉండగా 6,72,428 మందికి పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.21,433.46 కోట్లు పెట్టుబడి సాయంగా అందించాల్సి ఉండగా కేవలం రూ.4,685.84 కోట్లు విదిల్చారు. రైతులకు మొత్తం రూ.16,748 కోట్లు సాయాన్ని ఎగ్గొట్టారు.ఉచిత పంటల బీమాను అటకెక్కించి.. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిచంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టికొట్టారు. 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు 2024 జూన్లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా రూ.1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలొడ్డారు. 2024 ఖరీఫ్ సీజన్లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.834.44 కోట్లతో పాటు రబీ 2024–25, ఖరీఫ్–2025 సీజన్లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్లో ఏపీని కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ఇలా రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం రైతులకు అందకుండా చంద్రబాబు సర్కారు దగా చేసింది. మరోవైపు దాదాపు 12 లక్షల మందికి రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీ సొమ్మును ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు ఆరున్నర లక్షల మందికి రూ.వెయ్యి కోట్లకు పైగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.దక్కని ‘మద్దతు’... ఆత్మహత్యలు..మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ఎత్తేశారు. ధాన్యం మొదలు పత్తి, మిరప, ఉల్లి, చీనీ, పొగాకు, టమాటా, పసుపు, పెసర, మినుము, కంది.. ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక అల్లాడుతున్నా ఆదుకున్న దాఖలాలు లేవు. రైతులకు పైసా సాయం చేసిన పాపాన పోలేదు. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు వరుస వైపరీత్యాలతో సాగు, దిగుబడులు తగ్గిపోయి భారీగా నష్టం వాటిల్లింది. గత 20 నెలల్లో దిగుబడులు తగ్గిపోవడం, మద్దతు ధర కోల్పోయి దాదాపు రూ.35 వేల కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. మరోవైపు రైతు ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది దాదాపు 150 మందికి పైగా చనిపోగా 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు రాష్ట్ర పోలీస్ శాఖే అధికారికంగా వెల్లడించడం రాష్ట్రంలో రైతన్నల దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. -
కానుకలూ గోవిందా..! పరకామణిలో దొంగలు పడ్డారు
సాక్షి, అమరావతి: నెయ్యి రేట్లు పెంచి.. అనుకూల డెయిరీలకు దోచిపెట్టి.. శ్రీవారి సొమ్మును నీకింత.. నాకింత అని పంచుకున్న తీరు గురించి జనం చర్చించుకుంటుండగానే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏడుకొండల వాడికి జరుగుతున్న మరో అన్యాయం గురించి బట్టబయలయ్యింది. పరంధాముడి పరకామణిని దొంగలు కొల్లగొడుతున్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. భక్తులు శ్రీవారికి కానుకలుగా సమర్పించే బంగారం, వెండి వస్తువులను దర్జాగా చోరీ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్లో అధికారంలోకి రాగానే మొదలైన ఈ దొంగతనాల వ్యవహారం 2025 జనవరిలో బయటపడింది. అయినా నామమాత్రపు కేసుతో సరిపుచ్చారు. తెరవెనుక ఉన్న ముఠాపై కూపీ లాగలేదు. కోటి రూపాయల బంగారం, వెండి చోరీ జరిగినట్లు గుర్తించినా కేవలం 555 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు చూపించి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. ఈ చోరీకి పాల్పడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్యకు వెంటనే బెయిల్ రావడానికి ప్రభుత్వమే పరోక్షంగా సహకరించింది. దీంతో ప్రభుత్వంలోని పెద్దలు తమ పేర్లు బయటకు రాకుండా ఉండడం కోసమే ఈ వ్యవహారాన్ని మమ అనిపించేశారన్న విమర్శలున్నాయి.. టీటీడీ, పోలీసులు ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లకుండా ఆపిందెవరు? పెంచలయ్య వెనకున్న ముఠా ఎవరు? పెంచలయ్యను కాపాడుతున్న ప్రభుత్వ పెద్దలెవరు? పెంచలయ్యే కోటి రూపాయలు కొల్లగొట్టాడంటే.. పరకామణిలో ఉన్న ఇంకెంతమంది ఇంకెన్ని కోట్ల విలువైన కానుకలు కైంకర్యం చేసి ఉంటారు? వీరందరినీ నడిపించిన ఆ ‘గోల్డ్ బాబు’ ఎవరు? చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరకామణిలో భారీ చోరీ కథా కమామీషు ఇదీ.. నిందితుడు పెంచలయ్య చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... టీటీడీ పరకామణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వి.పెంచలయ్య స్వామివారికి భక్తులు కానుకగా సమర్పించిన బంగారు బిస్కెట్ను చోరీ చేస్తుండగా విజిలెన్స్ అధికారులు 2025, జనవరి 11న రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పరకామణిలో కానుకలను తరలించే ట్రాలీకి ఓ కన్నం చేసి అందులో 100 గ్రాముల బిస్కెట్ను జార విడిచాడు. అనంతరం ఆ బిస్కట్ను తీసుకునేందుకు యత్నిస్తుండగా విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. తిరుమల పోలీసులు అతన్ని 2025, జనవరి 12న అరెస్టు చేసి న్యాయస్థానం అనుమతితో రిమాండ్కు తరలించారు. పోలీసులు పెంచలయ్య నివాసంలో సోదాలు చేయగా విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2024, సెప్టెంబరు నుంచి అతను పరకామణిలో తరచూ దొంగతనాలు చేస్తున్నట్టు వెల్లడైంది. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను తిరుపతిలోని ప్రముఖ కార్పొరేట్ నగల దుకాణాలకు తీసుకువెళ్లి వాటిని మార్పిడి చేసేవాడు. ఆ విధంగా 2024 సెప్టెంబరు నుంచి 2025 జనవరి మధ్యలో చాలాసార్లు శ్రీవారి నగలను దొంగిలించి బంగారు దుకాణాల్లో మార్పిడి చేసి అంతే విలువైన ఇతర నగలను తీసుకున్నాడు. అంతేకాదు తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను తిరుపతిలోని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకున్నాడు. అందుకు సంబంధించిన వోచర్లు, ఇతర పత్రాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కానీ పెంచలయ్య ఏ స్థాయిలో పరకామణిలో దొంగతనాలకు పాల్పడ్డాడు... ఎంత విలువైన బంగారు నగలను అప్పటికే దొంగిలించాడు అనేది అంతుచిక్కడం లేదు. దీనిపై పోలీసులు పూర్తి వివరాలను కూడా వెల్లడించక పోవడం గమనార్హం. పెంచలయ్య రూ.కోటి విలువైన 555 గ్రాములు బంగారం, 157 గ్రాముల వెండి కానుకలను దొంగతనం చేసినట్టు... వాటిని రికవరీ చేసినట్టు ప్రకటించి పోలీసులు చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత పెంచలయ్యకు కొద్ది రోజుల్లోనే బెయిల్ వచ్చింది. అతని బెయిల్ను టీటీడీ గట్టిగా వ్యతిరేకించలేదని తెలుస్తోంది. తద్వారా అతని బెయిల్కు పరోక్షంగా సహకరించారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. నాడు రూ.76వేల దొంగతనంపై చంద్రబాబు రాద్దాంతం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రవి కుమార్ అనే పరకామణి ఉద్యోగి విదేశీ కరెన్సీని దొంగతనం చేస్తుండటంతో విజిలెన్స్ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పరకామణిలో వ్యవహరాలను సీసీ కెమెరాల్లో పర్యవేక్షించడం ద్వారా ఈ దొంగతనాన్ని వెంటనే గుర్తించి అడ్డుకట్ట వేశారు. రవి కుమార్ భారతీయ కరెన్సీలో రూ.76వేల విలువైన అమెరికన్ డాలర్లను దొంగతనం చేసేందుకు యత్నించినట్టు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రిమాండ్కు పంపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీటీడీ అంతటితో సరిపెట్ట లేదు. రవి కుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయించింది. పరకామణిలో రూ.76వేల దొంగతనానికి ప్రాయశ్చిత్తంగా రవి కుమార్కు చెందిన రూ.15కోట్ల ఆస్తులను టీటీడీ పేరిట రాయించింది. తద్వారా ఎవరైనా శ్రీవారి పరకామణిలో చోరీకి పాల్పడితే ఎంత తీవ్రంగా స్పందిస్తామన్నది చేతల్లో చూపించింది. ఆ ప్రక్రియ అంతా లోక్ అదాలత్ ద్వారా న్యాయబద్దంగా నిర్వహించింది. అయినా సరే దీనిపై చంద్రబాబు నానా రాద్దాంతం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నేతలపై దు్రష్పచారం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.76వేల దొంగతనానికి రూ.15కోట్ల ఆస్తులను టీటీడీకి రాయించి ఇస్తే...మరి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అధికారికంగా పేర్కొన్న దాదాపు రూ.కోటి విలువైన బంగారం, వెండి దొంగతనానికి పరిహారంగా ఎన్ని వందల కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రాయించి ఇవ్వాలని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో పరకామణిలో భారీ స్థాయిలో బంగారు, వెండి ఆభరణాల దొంగతనం చేసిన బాగోతం బయటపడితే ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు. ఆ కేసును సమగ్రంగా విచారించకుండా పోలీసు శాఖను ప్రభావితం చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పెంచలయ్య అపహరించిన బంగారు బిస్కెట్ ఎందుకీ ఉదాసీనత? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టులో టీటీడీ ఓ అఫిడవిట్ను దాఖలు చేసింది. పరకామణిలో దొంగతనాలను నిరోధించేందుకు మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు పటిష్ట వ్యవస్థను నెలకొల్పుతామని పేర్కొంది. మరి 2024 సెప్టెంబరు నుంచి 2025 జనవరి వరకు పెంచలయ్య పరకామణిలో ఎలా దొంగతనాలకు పాల్పడ్డాడు...? అంటే హైకోర్టుకు చెప్పినట్టుగా పరకామణిలో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయలేదన్నది స్పష్టమవుతోంది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంటే పరకామణిలో దొంగతనాలకు పరోక్షంగా సహకరిస్తున్నారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెంచలయ్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపకుండా కప్పిపుచ్చేందుకు పోలీసులు పరిమితం కావడం గమనార్హం. సూత్రధారుల పాత్రను కప్పిపుచ్చేందుకేనా....!తిరుమల పరకామణిలో దొంగతనాల వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం విస్మయపరుస్తోంది. 2024 సెపె్టంబరు నుంచి వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడని గుర్తించినా సరే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించనే లేదు. పరకామణిలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు నిర్వహిస్తున్న ఆర్గోస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో అతన్ని ఎవరు చేర్పించారు? శ్రీవారి హుండీ కానుకలను దొంగతనం చేసిన సొమ్ముతో అతను కొనుగోలు చేసిన ఆస్తులు ఏమిటి? ఎవరెవరి పేరున ఆ ఆస్తులు ఉన్నాయి? తదితర విషయాలపై పోలీసులు కనీసం దృష్టి సారించనే లేదు. అంతేకాదు పెంచలయ్య శ్రీవారి బంగారు కానుకలను తిరుపతిలోని కార్పొరేట్ బంగారు ఆభరణాల దుకాణాలకు తీసుకువెళ్లి ఇచ్చేవాడు. అందుకు సమాన విలువ కలిగిన నగలను ఆ దుకాణాల నుంచి తీసుకునేవాడు. ఈ మేరకు బంగారు ఆభరణాల దుకాణాల నుంచి తీసుకున్న ఇన్వాయిస్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే బంగారు నగలను మార్పిడి దందాకు పాల్పడ్డాడు. అయినా సరే పెంచలయ్య తీసుకువస్తున్న నగలు ఎక్కడివనే విషయాన్ని బంగారు దుకాణాల యజమానులుగానీ, ప్రతినిధులుగానీ ప్రశ్నించనే లేదు. ఒక్క పెంచలయ్యేనా... ఈ తరహా ఇంకెంతమంది శ్రీవారి బంగారు కానుకలను ఆ దుకాణాల్లో మార్పిడి చేస్తున్నారో అని సామాన్యులకు కూడా సందేహం రావడం సహజం. కానీ పోలీసులు మాత్రం ఆ దిశగా దర్యాప్తు చేయనే లేదు. అంతేకాదు చోరీ చేసిన శ్రీవారి బంగారు కానుకలను తిరుపతిలోని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టాడు కూడా. మరి అందుకు సహకరించిన బ్యాంకు అధికారుల పాత్ర ఏమిటన్నది కూడా పోలీసులు సందేహించకపోవడం గమనార్హం. ఆ విషయాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తే పరకామణి దొంగతనాల వెనుక ఉన్న ముఠా బాగోతం బట్టబయలవుతుంది. ఇప్పటివరకు ఎంత భారీస్థాయిలో శ్రీవారి కానుకలను కొల్లగొట్టారన్నది కూడా బయటపడుతుంది. తిరుమల–తిరుపతిలో దోపిడీ ముఠా బాగోతం వెలుగులోకి వస్తుంది. అందుకే అంత సమగ్రంగా దర్యాప్తు చేయకుండా పోలీసులను ప్రభుత్వ పెద్దలే కట్టడి చేసినట్టు సమాచారం. దాంతో పోలీసులు కేవలం పెంచలయ్య వరకే దర్యాప్తును పరిమితం చేశారు. అది కూడా కేవలం 555 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి ఆభరణాలకే పరిమితమై కేసును సరిపుచ్చారు. అంతకుమించి పోలీసులు దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. పోలీసుల పంచనామా నివేదికలో పేర్కొన్న ప్రకారం... పరకామణి నుంచి చోరీ చేసినట్టు పెంచలయ్య అంగీకరించిన కానుకలు ఇవీ... (గ్రాముల్లో) ఈ జాబితాలో 1 నుంచి 13వరకు ఉన్నవి పెంచలయ్య పరకామణిలో నుంచి నేరుగా దొంగిలించిన బంగారు వస్తువులు. 14 నుంచి 24 వరకు ఉన్నవి పరకామణిలో దొంగిలించిన బంగారు వస్తువులను తిరుపతిలోని బంగారు దుకాణాల్లో మార్పిడి చేసి తీసుకున్న బంగారు ఆభరణాలు పరకామణి దొంగతనాల కేసును సీబీఐకి అప్పగించాలిచంద్రబాబు ముఖ్యమంత్రి, బీ ఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచీ తిరుమల పరకామణిలో బంగారం చోరీ దర్జాగా సాగుతోంది. రూ. కోటి విలువైన బంగారం, వెండి దొంగతనం చేసినట్టు ఇప్పటికి బయటపడింది. ఇంకా సమగ్రంగా దర్యాప్తు చేస్తే పరకామణిలో దొంగతనాల బండారం మొత్తం బయటపడుతుంది. ఈ దొంగతనాల వెనుక ఎవరు ఉన్నారు... ఎవరి ప్రోద్బలంతో దొంగతనాలు జరుగుతున్నాయన్నది నిగ్గు తేలుతుంది. దొంగతనం చేసిన బంగారు కానుకలను నగల దుకాణాల్లో దర్జాగా విక్రయిస్తున్నారంటే వెనుక ఎంతటి పెద్దల పాత్ర ఉందన్నది స్పష్టమవుతోంది. అందుకే ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయకుండా కూటమి ప్రభుత్వ పెద్దలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. కేవలం పెంచలయ్య వరకే దర్యాప్తును పరిమితం చేసి అసలు సూత్రధారులకు వత్తాసు పలుకుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పరకామణి దొంగతనాల కేసును సీబీఐకి అప్పగించాలి. -నాగార్జున యాదవ్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి -
ముగ్గురిని కనమని నీ కొడుకు లోకేష్ కు ఎందుకు చెప్పలేదు
-
చీకటి కాలం.. దుశ్శాసన పర్వం
సాక్షి, అమరావతి: మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలమని, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత కూడా లేదని నిప్పులు చెరిగారు. మూడు రోజులుగా చంద్రబాబు సర్కారు ప్రజలకు మూడు డ్రామాలు చూపించిందని, అసెంబ్లీలో ఒక డ్రామా.. పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా.. ఈ రెండింటికీ కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడు ట్రూప్ ఇంకో డ్రామా ఆడిందంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం ఆయన పోస్టు చేశారు. ‘నేను నేరుగా చంద్రబాబునాయుడిని అడుగుతున్నా.. జనాభాలో 50 శాతం ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల ముందు మీరిచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు సక్రమంగా అమలు చేయకపోయినా, అన్నీ చేసేసినట్లు విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, పట్టపగలు డ్రామాలాడిన మీకు మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత ఉందా?’ అని నిలదీశారు. ఈ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా 19–59 మధ్య వయసున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి, 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం కోటి 80 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1,500 అంటే సంవత్సరానికి రూ.18 వేల చొప్పున ఒక్కో అక్కచెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54 వేల చొప్పున బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ 50 ఏళ్లకే పింఛన్ మరో హామీ. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.4 వేలు చొప్పున ఒక్కొక్కరికి ఏటా రూ.48 వేలు ఇవ్వాలి. మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ బడికి వెళ్లే ప్రతి పిల్ల వాడికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద ఇస్తామన్నారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రాష్ట్రంలో యూడీఐఎస్ఈ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్–యూడైస్) ప్రకారం 2023–24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగరగొట్టారు. చివరకు 67.27 లక్షల మందికి మాత్రమే.. అది కూడా కొందరికి రూ.8 వేలు.. రూ.9 వేలు.. రూ.10 వేలు, మరి కొంత మందికి రూ.13 వేలు ఇచ్చారు. మరి వీళ్లందరికీ మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారు? ఎగ్గొట్టిన మొదటి ఏడాది డబ్బులు ఎప్పుడిస్తారు? ⇒ సూపర్ సిక్స్లో ఉచిత గ్యాస్ చిన్న హామీ. ఇక్కడ కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 1.59 కోట్లు. వీరికి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855 చొప్పున మూడు సిలిండర్లకు ఏడాదికి రూ.3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం రూ.786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్లో రూ.2,199.99 కోట్లు కేటాయించారు. 2026–27లో బడ్జెట్లో ఈ పథకానికి పెట్టింది రూ.2,601 కోట్లు. అంటే మొత్తంగా రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారూ?⇒ ఉచిత బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని మహిళలకు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్కు పోవచ్చు.. శ్రీకాకుళం వాళ్లు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు.. మధ్యలో కనకదుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే.. కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది ఆర్నెల్ల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలు పెట్టారు. చేసిన ఖర్చు రూ.1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గాను రూ.2,460 కోట్లు కేటాయించారు. అంటే రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు గారూ?⇒ సూపర్ సిక్స్లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇలా వంచనగా మార్చటం వల్ల ప్రతి కుటుంబాన్ని, అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతను, మొత్తంగా మన రాష్ట్రంలో ఇంటింటి భవిష్యత్తును మీరు ఎంతగా దెబ్బతీశారో అర్థమవుతోందా?⇒ అక్కచెల్లెమ్మల పేరిట వాళ్లకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం. అందులో 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తి చేశాం. చంద్రబాబునాయుడు అక్కచెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈ రోజుకు కూడా ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. దీని కోసం ఒక్క గజం కూడా స్థలం కొనలేదు. ఉన్న ఇళ్ల నిర్మాణాలను గాలికొదిలేశారు. మరి ఆ ఇళ్ల నిర్మాణాలను అక్కచెల్లెమ్మలకు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు? ⇒ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకానికి మూడు బడ్జెట్లలో అతీగతీ లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పారు. పెంచడం సంగతి దేవుడెరుగు.. మామూలుగా ఇంతకు ముందు ఇస్తున్నట్టు ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.4,969 కోట్లు ఇచ్చాం. మీరు వచ్చి మూడు బడ్జెట్లు పెట్టారు. ఇప్పటికి ఒక్క పైసా కూడా సున్నా వడ్డీ కింద ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ⇒ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,189 కోట్లు.. వైఎస్సార్ ఆసరా కింద 78,94,169 మందికి రూ.25,570 కోట్లు.. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మందికి రూ.2,029 కోట్లు.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.1,876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించింది అంటే, వారి సాధికారత ఎక్కడైనా జరిగింది అంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ పథకాలన్నీ మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. మరి మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఉందా?⇒ మీ పాలనలో ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం అనే పథకమే లేదు. మీకు కాపుల్ని మభ్య పెట్టి.. వారి ఓట్లు కొల్లగొట్టే ప్యాకేజీ పథకాలు బాగా తెలుసుగానీ, కాపు నేస్తంగా ఒక్క రూపాయి కూడా ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన చరిత్ర మీకు కానీ, మీకు మద్దతిస్తున్న వారికి కానీ లేదు.⇒ ఇలా ఇవ్వక పోవటం కూడా మీకున్న విజన్లో భాగమే అని నమ్మించగల ఎల్లో మీడియా మీ చేతిలో ఉంది కాబట్టి.. ఇదీ గొప్ప ఎంపవర్మెంట్ అని పత్రికల్లో రాయించటం, టీవీల్లో వేయించటమే ఇక మిగిలింది!⇒ అక్కచెల్లెమ్మల కాపురాల్లో చిచ్చుపెట్టేలా వీధికో బెల్టుషాపు, ఊరికో మద్యం షాపు, బారు తెరవటమే మీకు తెలిసిన మహిళా సాధికారత. అదే మీకు తెలిసిన మహిళా భద్రత.⇒ దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ను కూడా నిర్వీర్యం చేశారు. చివరికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ చైర్మన్.. అత్యాచార ఆంధ్రప్రదేశ్ను నిర్మించారు. పసి పిల్లల్ని, ఆడపిల్లల్ని, చివరికి ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళల్ని మీరు, మీకు మద్దతిస్తున్న వాళ్లు పెంచి పోషిస్తున్న కామాంధులంతా ఎలా చిదిమేస్తున్నారో చూసి కూడా మీకు సిగ్గనిపించడం లేదా?⇒ మా పాలనలో 90 శాతం అక్కచెల్లెమ్మల పేరిట డీబీటీ పథకాలే. మేం ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ అక్కచెల్లెమ్మల పేరుమీదే. దేశ చరిత్రలో తొలిసారిగా.. మేం ఇచ్చిన వేల కొద్దీ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వాటా వారికే.⇒ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులుగా అవకాశం ఇచ్చింది కూడా మా పాలనలోనే. అందుకే మా పాలన మహిళా సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ⇒ ఇప్పటి పరిస్థితి ఏమిటంటే.. మహిళాభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలం. రాష్ట్రంలో నడుస్తున్నదంతా దుశ్శాసన పర్వం. -
నారా వారి నిర్వాకానికి 'నారీ విలాపం'!
నాడు: మహిళలకు స్వర్ణయుగం. అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబంతో పాటు రాష్ట్రం ప్రగతి బాట పడుతుందని వైఎస్ జగన్ ప్రత్యేకంగా పథకాలు అందించారు. ఆర్థిక సాధికారతతోపాటు రాజకీయంగానూ ఎదిగేలా ప్రోత్సాహం అందించారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకే దక్కేలా చట్టం చేసి మరీ అమలు చేశారు. వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ పథకాలతో పాటు మహిళల పేరిటే ఇళ్ల పట్టాలు అందించి పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను సైతం చేపట్టారు. పొదుపు మహిళలకు అండగా నిలిచారు. ‘చేయూత’ ద్వారా మహిళా సాధికారతకు వైఎస్ జగన్ ప్రభుత్వం బాటలు వేసింది. మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించి తమ కాళ్లపై తాము నిలదొక్కుకునేలా వారి ఉత్పత్తులను అమూల్, రిలయన్స్, ఐటీసీ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్ లాంటి ప్రముఖ సంస్థలతో అనుసంధానించి, రుణాలు అందచేసి తోడ్పాటునిచ్చారు. తద్వారా మహిళలను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలిపారు.నేడు: 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు వరాల వల విసిరారు. జగన్ ఇచ్చిన వాటి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని నమ్మబలికారు. మహిళల ఓట్లు కొల్లగొట్టారు. అధికారం చేపట్టాక వారిని విస్మరించారు. ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేయకుండా మహిళలకు మొండి చేయిచూపారు. ఒక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎగ్గొట్టడం ద్వారానే మహిళలకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర బకాయి పడ్డారు. గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలను చంద్రబాబు ఇవ్వకపోగా, తాను ఇస్తానన్న వాటిని సైతం ఎగ్గొట్టారు. దీంతో చంద్రబాబును నమ్మి మోసపోయామని, 20 నెలలుగా ప్రతి అడుగులోనూ మోసమేనని, దేశంలో ఏ రాజకీయ నాయకుడూ ఇలా మోసాలు చేసి, హామీలను నెరవేర్చానని నిస్సిగ్గుగా బుకాయించరని మహిళలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ పాలన స్వర్ణ యుగమని, మహిళలను మహరాణులుగా చేశారని గుర్తు చేసుకుంటున్నారు.సాక్షి, అమరావతి: నారా వారి నిర్వాకానికి నారీలోకం విలపిస్తోంది! చంద్రబాబు ఎన్నికల మోసాలు.. సూపర్ సిక్స్ హామీల ఎగవేత.. ఓటు బ్యాంకు రాజకీయాలు.. మహిళా దినోత్సవం సాక్షిగా మరోసారి బట్టబయలయ్యాయి. ప్రధానంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు మూడు బడ్జెట్లలోనూ కేటాయింపులు జరపని చంద్రబాబు అమరావతిలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో సైతం ఆడబిడ్డ నిధి, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ, 50 ఏళ్లకే పెన్షన్, పెళ్లి కానుక.. తదితర పథకాల ఊసెత్తకపోవడం గమనార్హం. 2024 ఎన్నికల ముందు మేనిఫెస్టో పేరుతో ఇంటింటికి బాండ్లు, కరపత్రాలు పంచి పెట్టిన చంద్రబాబు ఇప్పుడు మహిళలను నయవంచన చేశారని ఆక్రోశిస్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అటకెక్కించడంతోపాటు చంద్రబాబు కనీసం తానిచ్చిన హామీలను సైతం నెరవేర్చకుండా దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి బకాయిలు రూ.97,200 కోట్లు ప్రతి అక్క చెల్లెమ్మకు మూడేళ్లలో రూ.54,000 ఎగవేత..! సూపర్ సిక్స్లో అతిముఖ్యమైన హామీ.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున చంద్రబాబు ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తానన్నారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు మహిళలు 1.80 కోట్ల మంది ఉన్నారు. హామీ ప్రకారం ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.18 వేల చొప్పున ఏటా మొత్తం రూ.32,400 కోట్లు చెల్లించాలి. కానీ ఈ పథకానికి మూడు బడ్జెట్లలో కేటాయించింది సున్నా. మూడేళ్లకు కలిపి అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు బకాయి పడ్డ సొమ్ము అక్షరాలా రూ.97,200 కోట్లు. ప్రతి అక్కచెల్లెమ్మకు ఈ స్కీమ్ కింద మూడేళ్లలో రూ.54 వేలు ఎగరగొట్టారు! సున్నా వడ్డీకి శూన్యం.. మహిళలకు రూ.15 వేల కోట్లు బాకీ పొదుపు మహిళల సున్నా వడ్డీకి మూడు బడ్జెట్లలోనూ అతీగతి లేదు. స్వయం సహాయ సంఘాలకు వడ్డీలేని రుణాలను రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచుతామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చకపోగా గత ప్రభుత్వంలో అమలు చేసిన దాన్ని కూడా నిలిపివేశారు. గత ప్రభుత్వంలో కోటి మందికిపైగా పొదుపు మహిళలు సున్నా వడ్డీ ద్వారా దాదాపు రూ.ఐదు వేల కోట్ల మేర లబ్ధి పొందారు. మూడు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించకుండా సున్నా వడ్డీ కింద పొదుపు మహిళలకు చంద్రబాబు ఏకంగా రూ.15 వేల కోట్లు మేర ఎగ్గొట్టారు! ఇక చంద్రబాబు ప్రభుత్వంలో పొదుపు సంఘాల పరపతి గణనీయంగా క్షీణించింది. నాబార్డ్ డేటా ప్రకారం 2023–24లో మహిళల పొదుపు రుణాలు రూ.49,626 కోట్లు కాగా చంద్రబాబు హయాంలో 2025–26 (డిసెంబర్ వరకు) రూ.30,698 కోట్లకు పడిపోయింది. మహిళలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పరపతి తగ్గిపోతోంది. 50 ఏళ్లకే పింఛన్.. వంచన ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బకాయి సూపర్ సిక్స్లో ఇచ్చిన మరో హామీ 50 ఏళ్లకే పింఛన్. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున సంవత్సరానికి రూ.48 వేలు ఇవ్వాలి. ఈ లెక్కన ఏడాదికి మొత్తం రూ.9,600 కోట్లు అవుతుంది. దీని ప్రకారం మూడేళ్లలో మొత్తం రూ.28,800 కోట్లు కేటాయించాల్సి ఉండగా మూడు బడ్జెట్లలో ఇచ్చింది సున్నా. ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు మేర చంద్రబాబు బాకీ పడ్డారు. అసలు కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్నవాటికే కోత పెడుతున్నారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 66,34,372 కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 60,96,108 మందికే ఫించన్లు ఇచ్చారు. అంటే ఏకంగా 5,38,264 పింఛన్లు కట్ చేశారు. మరోవైపు 2014లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 39 లక్షల పింఛన్లు మాత్రమే ఉండగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ సంతృప్త స్థాయిలో అందచేస్తూ 66 లక్షలకుపైగా పింఛన్లు ఇచ్చింది. మళ్లీ చంద్రబాబు వచ్చిన రెండేళ్లకే పింఛన్లు 66 లక్షల నుంచి 60 లక్షలకు తగ్గిపోవడం గమనార్హం. తల్లులకు బాబు దగా.. మూడేళ్లలో రూ.24,504 కోట్లు ఎగవేత తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. ఈ పథకానికి ఒక్కొక్కరికీ ఏటా రూ.15 వేల వంతున ఏడాదికి మొత్తం రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో కేవలం 67.27 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. రెండేళ్లలో తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా బకాయిపడ్డారు. ఇక తాజా బడ్జెట్లో రూ.8457.07 కోట్లు మాత్రమే ప్రతిపాదించి ఏకంగా రూ.4,655.75 కోట్ల మేర కోతలు పెట్టారు. తద్వారా మూడేళ్లలో పిల్లలకు రూ.24,504 కోట్ల మేర చంద్రబాబు ఎగ్గొట్టారు! ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఉచిత బస్సు, గ్యాస్.. తుస్సు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. తొలి ఏడాది హామీని పూర్తిగా ఎగ్గొట్టారు. ఇక రెండో ఏడాది ఆర్నెల్ల తరువాత ఆగస్టు నుంచి అరకొరగా మొదలుపెట్టి రూ.1,040 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఇక ఈ స్కీమ్ కోసం మూడో బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.1,420 కోట్లు. అంటే మూడేళ్లలో రూ.9,600 కోట్లకు గానూ రూ.2,460 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే మహిళలకు ఉచిత బస్సులో ఏకంగా రూ.7,140 కోట్లు బాకీ పడ్డారు. అంతేకాదు.. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. ఇక ఉచిత గ్యాస్ కూడా మోసమే. రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1.59 కోట్లు కాగా ఏటా మూడు సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.3,990 కోట్లకుపైగా ఇవ్వాలి. ఇలా మూడేళ్లకు మొత్తం లబ్ధిదారులకు రూ.6,143 కోట్లు బాకీ పడ్డారు.అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల హామీ ఏమైంది..? చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాల కోసం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి మూడు బడ్జెట్లలోనూ పైసా కేటాయించలేదు. ఒక్కరికి కూడా సెంటు భూమి పట్టా ఇవ్వలేదు. పైగా వైఎస్సార్సీపీ హయాంలో 10 లక్షల ఇళ్లు పూర్తి కాగా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న మిగతా వాటిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించి 10 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేశారు. ఆడబిడ్డలకు రక్షణ కరువు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. గంజాయి, బ్లేడ్బ్యాచ్లు చెలరేగిపోవడంతో రాష్ట్రంలో రోజుకి నలుగురు, ఐదుగురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రోజుకు 50 నుంచి 60 మందిపై లైంగిక వేధింపుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలపై నేరాలు 10 శాతం పెరగగా.. హోంమంత్రి అనిత ఇన్చార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలోనూ నేరాలు పెరిగాయని, లోకేశ్ నియోజకవర్గంలోనూ మహిళలపై నేరాలు పెరిగాయని పోలీస్ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. మదనపల్లెలో గంజాయి మత్తులో ఓ క్రూరమృగం ఏడేళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడి డ్రమ్ములో పడేయడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. అరవ శ్రీధర్ అనే కూటమి ఎమ్మెల్యే తనను ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్లు చేయించినట్లు బాధితురాలు మొర పెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరించింది. పలువురు టీడీపీ, జనసేన ప్రజా ప్రతినిధులు మహిళలకు లైంగిక వేధింపులకు దిగడం రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు, సర్కారు వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.జగన్ పాలనలో మహిళలకు స్వర్ణయుగంవైఎస్ జగన్ నవరత్నాల పాలన మహిళలకు స్వర్ణయుగంగా సాగింది. అమ్మ కడుపులోని బిడ్డ నుంచి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వ వరకు ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి వైఎస్ జగన్ పథకాలను అమలు చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మహిళలకు పలు పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీతో ఏకంగా రూ.2,83,866.34 కోట్లు అందించారు. చట్టం చేసి మరీ 50 శాతం పదవులు.. నామినేటెడ్ పోస్టుల నుంచి కేబినెట్ వరకు మహిళలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, హోం, వైద్య ఆరోగ్య, పర్యాటక శాఖల మంత్రులుగా మహిళలకు పట్టం కట్టారు. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్ట్ పనుల్లో కూడా మహిళలకు 50 శాతం కేటాయిస్తూ చట్టం చేసి మరీ అమలు చేశారు. అక్క చెల్లెమ్మల పేరిటే ఇళ్లు.. స్థలాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతగూడు ఉండాలన్న సంకల్పంతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేశారు. అక్క చెల్లెమ్మల పేరిట స్థిరాస్తిని సమకూర్చడం దేశంలోనే సరికొత్త చరిత్ర. సొంత ఇళ్లు లేని అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా భూముల కొనుగోలు కోసం రూ.11,871 కోట్లు, ఇళ్ల నిర్మాణాలకు రూ.20,338 కోట్లు ఖర్చు చేశారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3 వేల కోట్లతో కలిపి మొత్తం రూ.35,209 కోట్లు వెచ్చించి అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు కట్టించి ఇచ్చి లక్షాధికారులను చేశారు. ఇదే విషయాన్ని సాక్ష్యాత్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో లోక్సభ సమావేశాల్లో లిఖిత పూర్వకంగా వెల్లడించడం గమనార్హం.మహిళా రక్షణకు పెద్దపీట.. మహిళల రక్షణ, భద్రత కోసం వైఎస్ జగన్ పలు వినూత్న చర్యలు చేపట్టారు. ప్రధానంగా దిశ బిల్లు తెచ్చి దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లతో అక్క చెల్లెమ్మలకు రక్షణ కవచంలా నిలిచారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒక మహిళా పోలీస్ను నియమించారు. ఏ మహిళకు ఆపద వచ్చినా సమాచారం అందుకున్న నిమిషాల వ్యవధిలోనే పోలీసులు రంగంలోకి దిగి అండగా నిలిచేలా దిశ యాప్ ద్వారా చర్యలు చేపట్టారు. -
కంపెనీ పెట్టెయ్.. భూములు కొట్టెయ్!
సాక్షి, అమరావతి: ముక్కుతూ మూలుగుతూ రూ.లక్ష మూలధనంతో ఏర్పాటైన నెలలు నిండని కంపెనీలు రూ.వందల కోట్ల పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తాయట! సత్తాలేని సంస్థలకు ఆగమేఘాలపై ఖరీదైన భూముల సంతర్పణ! పెట్టుబడుల ముసుగులో చంద్రబాబు సర్కారు భూముల పందేరం ఇదీ! తాజాగా ఎన్ఏఎన్ గ్రీన్మెట్, స్కై స్టోరేజ్ సంస్థలకు కూటమి ప్రభుత్వం ఇదే విధంగా భూములను కేటాయించింది. మూడు నెలల క్రితం కేవలం రూ.లక్ష మూలధన పెట్టుబడితో ముంబై కేంద్రంగా ఏర్పాటైన ఎన్ఏఎన్ గ్రీన్మెట్ లిమిటెడ్కు నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద 21.36 ఎకరాలను కేటాయిస్తూ పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వేదాంత గ్రూపు సమీప బంధువులైన అనన్య అగర్వాల్, నైవేద్య అగర్వాల్ 2025 నవంబర్10న ఎన్ఏఎన్ గ్రీన్మెట్ ప్రైవేట్ లిమిటెడ్ను నెలకొల్పారు. కంపెనీని ఏర్పాటు చేయడం.. రాష్ట్ర ప్రభ్వుత్వంతో చర్చలు జరపడం.. ఎస్పీసీ, ఎస్పీబీ, మంత్రివర్గం ఆమోదం పొందడం.. ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యే విధంగా ఫైళ్లు శరవేగంగా పరిగెత్తాయంటే దీని వెనుక ఉన్న శక్తిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాయుడుపేటలో రూ.కోట్లు పలుకుతున్న భూమిని ఎకరం కేవలం రూ.30 లక్షలు చొప్పున కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కారు చౌకగా భూమితో పాటు పెట్టుబడిలో 60.38 శాతం రాయితీల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. స్కై స్టోరేజ్ సొల్యూషన్స్.. వేర్ హౌసింగ్, లాజిస్టిక్ సేవలను అందించేలా స్కై స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2025 డిసెంబర్ 5న విశాఖ కేంద్రంగా ఏర్పాటైంది. కేవలం రూ.లక్ష మూలధనంతో పవన్ ప్యాలెస్, దొడపర్తి, అక్కయ్యపాలెం, విశాఖ చిరునామాతో సిదార్థ అగర్వాల్, యోగేష్ శాంతిలాల్ పటేల్లు దీన్ని నెలకొల్పారు. ఈ కంపెనీ ఏర్పాటైన రెండు నెలల్లోనే అనకాపల్లిలో 15 ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరం రూ.80 లక్షలు చొప్పున తక్కువ ధరకు ఏపీఐఐసీ భూమిని కేటాయించింది. నాయుడుపేటలో ఎన్ఏఎన్ గ్రీన్మెట్ లిమిటెడ్కు అత్యంత విలువైన భూమిని ఎకరం రూ.30 లక్షలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ⇒ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ లిమిటెడ్కు ఎకరా రూపాయి చొప్పున విశాఖ జిల్లా తర్లువాడ వద్ద 30 ఎకరాలు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సెమి కండక్టర్స్ పాలసీ కింద తొలి కంపెనీగా ప్రత్యేకంగా గుర్తిస్తూ ఎకరా రూపాయికే భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు పెట్టుబడిలో 40 శాతం వరకు ప్రోత్సాహకాల రూపంలో తిరిగి ఇవ్వనున్నారు. సిగాచీ ఇండస్ట్రీస్కు గుట్టపాడు క్లస్టర్లో ఎకరా రూ.30 లక్షలు చొప్పున 94.70 ఎకరాలు కేటాయించారు. వీటితోపాటు 45.02 శాతం రాయితీలు ఇవ్వనున్నారు. ⇒ వారీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్కు కూటమి సర్కారు అనకాపల్లిలో సుమారు 300 ఎకరాలు ఎకరా రూ.50 లక్షలు చొప్పున కేటాయించింది. 59.73 శాతం ఫిక్స్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ⇒ పల్నాడు జిల్లా కొండవీడు వద్ద 12.31 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు అర్షథాతు గ్రీన్ నానోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎకరానికి రూ.5 లక్షల క్యాపిటల్ సబ్సిడీతోపాటు ఆ భూమిని 22 ఏ నుంచి తొలగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ⇒ సిఫి ఇన్ఫినిటీ స్పేసెస్ ఐటీసెజ్కు కేటాయించిన భూములకు సకాలంలో నగదు చెల్లింపులో విఫలం కాగా ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించేందుకు 90 రోజుల గడువు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.⇒ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్కు నెల్లూరు జిల్లా దత్తులూరు వద్ద 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ⇒ రేమాండ్ అనుబంధ కంపెనీ జేకే మైనీకి కేటాయించిన భూములకు ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనిట్కు పెట్టుబడిలో 40 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో 28.05 ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 14.28 ఎకరాలను కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. -
కబ్జాల గీతం.. సర్కారు తాళం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తన బంధువులకు, బినావీులకు ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు, 99 పైసలకు కట్టబెడుతుండటంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి, వాటిని సక్రమం చేసుకునేందుకు మంత్రి లోకేశ్ తోడల్లుడు, సినీనటుడు బాలకృష్ణ అల్లుడు, విశాఖపట్నం టీడీపీ ఎంపీ భరత్కు చెందిన ‘గీతం’ సంస్థ బరితెగించి అన్ని అడ్డదారులూ తొక్కుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ అండతో జీవీఎంసీలో దౌర్జన్యం చేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవిఎంసీ) సమావేశంలో ఎలాంటి చర్చ లేకుండానే తను ఆక్రమంచిన రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించుకుంది. ఈ బరితెగింపు, దౌర్జన్యంపై యావత్ ప్రజా సంఘాలు, రాష్ట్ర ప్రజలు ఓ వైపు మండిపడుతుండగా.. ఆ స్థలాన్ని ‘గీతం’ తన ఆధీనంలోకి తీసుకుని చదును చేసే పనులు మొదలు పెట్టడం కలకలం రేపుతోంది. తీర్మానం మేరకు ఇంకా జీవో విడుదల కాకముందే అధికారం అండ చూసుకుని గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూములను సొంతం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశంలో అధికార బలాన్ని ప్రయోగించి, దాడులకు తెగబడి ఆ భూముల క్రమబద్ధీకరణకు తీర్మానాన్ని ఆమోదించుకున్న వైనంపై ఓ వైపు ఇంకా చర్చ జరుగుతూనే ఉండగా, ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పైగా గతంలో ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ ప్రభుత్వం పాతిన బోర్డులను సైతం పీకేశారు. లారీల్లో ఎర్రమట్టిని తరలించి కబ్జా భూముల్లో చదును చేసే (లెవలింగ్) పనులు చురుగ్గా చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో అక్రమంగా ‘గీత’ దాటి చేపడుతున్న పనుల వైపు రెవెన్యూ యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదు. కొద్దిపాటి జాగాలో వ్యాపారం చేసుకుని పొట్టపోసుకునే చిరు వ్యాపారులపై ఆపరేషన్ లంగ్స్ పేరిట ప్రతాపం చూపిన ప్రభుత్వం.. రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిలో గీతం పనులు చేస్తున్నా, అడ్డు చెప్పడానికి సాహసించడం లేదు. ఇప్పటికి ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న ఈ భూములు తమవే అన్నట్లు గీతం వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం కాపాడితే.. ఈ ప్రభుత్వం ధారాదత్తంఅధికారికంగా గీతం యూనివర్సిటీ కోసం కేటాయించిన భూముల్లో మాత్రమే కాకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లోకి సైతం గీతం ఆక్రమణల పర్వం మొదలైంది. ఈ ఆక్రమణలన్నీ సక్రమం చేసుకునేందుకు 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ‘గీతం’ పావులు కదిపింది. ఇందులో భాగంగా గీతం ఆక్రమణ చెరలో ఉన్న భూముల్ని సదరు వర్సిటీకి ఎలినేషన్ కింద బదలాయించేందుకు సన్నాహాలు చేశారు. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ భూ కుంభకోణాలపై చర్యలకు ఉపక్రమించింది. ఇలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకంగా 2 వేల ఎకరాల మేర భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంరక్షించింది. వీటి విలువ రూ.6 వేల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇందులో భాగంగా గీతం భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 40.51 ఎకరాలకుపైగా ఆక్రమించుకున్న స్థలాల్ని దశల వారీగా స్వాధీనం చేసుకున్నారు. భూమిని ఆక్రమించి చేపట్టిన రక్షణగోడ, గార్డెన్, గ్రావెల్ బండ్ నిర్మాణాల్ని అప్పట్లో గత ప్రభుత్వం తొలగించింది. ఇది ప్రభుత్వ స్థలం అంటూ బోర్డులను పాతింది. ఇంకా ఆక్రమిత భూములున్నాయని రెవెన్యూ అధికారులు చెప్పడంతో.. గీతం యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. మిగిలిన 14 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి కోర్టులో విచారణ పెండింగ్లో ఉంది. తుది తీర్పు వచ్చే వరకు ఆ భూముల్లో ఎలాంటి కొత్త చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. గీతం చెరలో ఉన్న భూములు ఆక్రమించినవేనని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో వేసిన ‘సిట్’ కూడా స్పష్టం చేసింది. కబ్జా భూముల్లో లెవలింగ్ పనులు చేపట్టిన దృశ్యం బోర్డులను సైతం పీకేసి.. బలం లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీకి చెందిన మేయర్ను అధికార చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా తొలగించింది. కేవలం గీతం భూముల కోసమే మేయర్ పీఠాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేజిక్కించుకుందని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. కౌన్సిల్ సమయం ముగుస్తున్న సమయంలో హడావుడిగా ఎజెండాలో చివరి అంశంగా గీతం భూముల విషయాన్ని చేర్చి, ఆమోదం పొందేలా ఒత్తిడి తెచ్చిందని స్పష్టం అవుతోంది. సీఎం, లోకేశ్ పేషీ నుంచి జీవీఎంసీపై ఒత్తిడి నేపథ్యంలో ఆ భూముల్ని గీతం వర్సిటీకి క్రమబద్ధీకరించి, బదలాయింపు ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందుకోసం కౌన్సిల్ సమావేశంలో పక్కాగా రౌడీయిజానికి దిగడం.. ఎటువంటి చర్చ, ఓటింగ్ లేకుండానే అన్ని అంశాలు ఆమోదం పొందినట్లుగా ఎజెండాను మేయర్ స్వయంగా చదివి ప్రకటించడం తెలిసిందే. జీవీఎంసీ తీర్మానం తర్వాత అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేయాల్సి ఉంటుంది. అయితే అప్పటి వరకు వేచి చూడలేమంటూ ‘గీతం’ ఈ భూముల్లో బరితెగించి లెవలింగ్ పనులు పెద్ద ఎత్తున చేస్తోంది. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులను సైతం పీకేసింది.పప్పు బెల్లాలకు భూ పందేరాలురాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల బంధువులు, బినామీలకు భూ పందేరాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. పప్పు బెల్లాలకు, 99 పైసలకే భూములిచ్చేస్తున్నారు. పైగా ఎకరం 99 పైసలకు కాదు.. ఆయా సంస్థలకు కావాల్సిన మొత్తం భూమిని 99 పైసలకే ఇస్తామని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. రెండు మూడు నెలల క్రితం కంపెనీలు పెట్టి.. వాటి పేరుతో భూ దోపిడీ సాగిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సైతం భూములు కేటాయించిన ఘనత ఒక్క చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది. -
ఏపీ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘన
చంద్రబాబు నాయుడు రాజకీయ ఎజెండాలోకి ఇప్పుడు కొత్త మాటలు కావాలి. రికార్డులు అరిగేలా పదేపదే పాడేసిన పాత పాటలు ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. ఇరవై మాసాల్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకుందామంటే ‘క్రెడిట్ చోరీ’ దొంగాట వెక్కిరిస్తున్నది. ‘సంపద సృష్టి’ అనే మాటకు యెల్లో నిఘంటువు అర్థం ‘రుణ సమీకరణ’ అని తేలిపోయింది. తన రాజకీయ వారసత్వం కొనసాగాలంటే తుప్పు పట్టిన అస్త్రతూణీరం అక్కరకు రాబోదని అర్థమైంది. కొత్త బాణాలు కావాలి. అరువు తెచ్చుకున్న నయా తత్వాలు పాడేందుకు సరికొత్త బాణీలు కావాలి. వాటినెలా సాధించాలి? కిం కర్తవ్యం అన్న ప్రశ్నకు ఒకే ఒక మార్గాంతరం ఆయనకు కనువిప్పు కలిగించినట్టుంది.‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అంటూ మతాన్ని పులిమేసుకోవడం మొదలుపెట్టారు. మతాన్ని రాజ కీయాలతో ముడిపెట్టకూడదన్న రాజ్యాంగ స్ఫూర్తినీ, సర్వోన్నత నాయ్యస్థానాల ఆదేశాలనూ ఆయన గణించదలుచుకోలేదు. మనుగడకు మరో మార్గం లేదేమో! ‘ఉదర పోషణార్థం బహుకృత వేషం’ అన్న నానుడి చందంగా అవసరార్థం మత వేష ధారణ. ఆషాఢభూతిని ఆదర్శంగా తీసుకునేవారికి మతమైనా, రాజకీయమైనా ఒకటే. మతం కూడా రాజకీయమే. ఈ కొత్త వేషంలో ఆయనకింకో సౌలభ్యం ఉన్నది. తాను ప్రవచించే తాజా తాత్విక ధారలో కరిగి, జనం ఐహిక విషయాలు వదిలేయాలి. ఆ ట్రాన్స్లో మైమరిచిపోవాలి. ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేశానంటే తలలూపాలి. ఇరవై మాసాల్లో ఆరు లక్షల ఉద్యోగాలిచ్చేశానంటే నమ్మేయాలి. తన పేరును పఠించ గానే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులుగా పరుగెత్తుకొని వచ్చా యంటే నిజమే అనుకోవాలి. ఇంకో ఇరవై లక్షల ఉద్యోగాలను చిటికేసి ఇచ్చేస్తానంటే మహాప్రసాదమని మురిసిపోవాలి.చంద్రబాబు, ఆయన పార్టీ, కూటమి కలిసి మత ఎజెండాను ముందు పెట్టుకొని రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తు న్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా దాడి చేస్తున్నారు. అందుకోసం చట్టసభలను కూడా వేదికలుగా చేసుకోవడానికి తెగించడం తీవ్రంగా ఆందో ళన కలిగిస్తున్నది. ‘‘... శాసనము ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతా చూపుతాననీ...’’ అంటూ ప్రమాణాలు చేసి చట్టసభల్లో ప్రవేశించిన నేతలు ఒట్టు తీసి గట్టుమీద పెట్టి రాజ్యాంగం పట్ల విద్రోహపూరితంగా మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ఉభయ సభల్లో ఈవారం చోటు చేసుకున్నాయి. శాసన మండలిలో గౌరవ సభాధ్యక్ష స్థానాన్ని ఉద్దేశించి రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు విజ్ఞులందరికీ దిగ్భ్రాంతిని కలిగించాయి. ‘మీరు క్రిస్టియన్! మీ నాయకుడు క్రిస్టియన్. వెంకటేశ్వర స్వామిపై కక్ష కట్టారు. యేసు మాత్రమే దేవుడా... వెంకటేశ్వరస్వామి కాదా?’... ఈ రక మైన వాచాలతతో ఆయన చెలరేగి పోయారు. శాసనసభలో మంత్రులు మాట్లాడే మాటలను ప్రభుత్వ వాణిగానే పరిగణిస్తారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. తాను ఒక మతానికి ప్రతి నిధి అన్నట్టుగా వకాల్తా పుచ్చుకొని మాట్లాడినట్టుగా ఆయన భాషావేశం, భావాభినివేశం తేటతెల్లం చేస్తున్నాయి. ఇది సంపూ ర్ణంగా రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన. శాసనసభ్యునిగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా రాజ్యాంగానికి ఆయన అవిధేయతను ప్రకటించినట్టే పరిగణించాలి.భారత్ను లౌకిక (సెక్యులర్) రిపబ్లిక్గా మన రాజ్యాంగ పీఠిక ప్రకటించింది. లౌకికత్వమనేది రాజ్యాంగ మౌలిక స్వరూ పంలో భాగమనీ, అది అనుల్లంఘనీయమైన ప్రాథమిక హక్కు అనీ సర్వోన్నత న్యాయస్థానం వివిధ తీర్పుల్లో ప్రకటించింది. ఏ మతాన్నీ అధికారిక మతంగా రాజ్యాంగం గుర్తించలేదు. అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్నీ, సమాదరణనూ ప్రకటించింది. మత, కుల, ప్రాంత, లింగభేదాల ఆధారంగా ఎటువంటి వివక్షా లేదని ప్రాథమిక హక్కుల్లోని 15వ అధికరణం స్పష్టం చేసింది. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఒక మతం పట్ల ప్రత్యేక అభిమానంతో వ్యవహరిస్తే అది రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినట్టేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై 356వ అధిక రణం కింద చర్య (ప్రభుత్వ బర్తరఫ్) తీసుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మతాన్ని రాజకీయాలతో ముడి వేయడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.గౌరవ సభాధ్యక్షులు తాను క్రిస్టియన్ కాదు, హిందువునని చెప్పినందువలన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని అచ్చెన్నాయుడు మండలిలో చెప్పారు. అంటే సభాధ్యక్ష స్థానంలో హిందూయేతర వ్యక్తి కూర్చుని ఉంటే అతని మీద నిందలు మోపవచ్చునా? సభాధ్యక్షుడు క్రిస్టియన్ అయ్యుంటే తన మాటలను వెనక్కు తీసుకునేవాడిని కాదనే అర్థం ఆయన స్పందనలో ధ్వనించింది. ఇది కచ్చితంగా మత విద్వేష ప్రకటన. మత విషయాల్లో రాజ్యాంగ యంత్రాంగం తటస్థ పాత్ర పోషించాలన్న రాజ్యాగ స్ఫూర్తిని అవహేళన చేశారు. శాసన సభ్యునిగా తాను చేసిన ప్రమాణాన్ని గాలికొదిలి రాజ్యాంగ అవిధేయతకు ఆయన పాల్పడ్డారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానాల తీర్పులను కూడా ఆయన ఖాతరు చేయలేదు.శాసన మండలిలో అచ్చెన్నాయుడు ప్రహసనం గురువారం నాడు చోటుచేసుకున్నది. శుక్రవారం నాడు శాసనసభలో స్వయానా ముఖ్యమంత్రే అచ్చెన్న పాటకు కోరస్ అందు కున్నారు. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక భారతదేశ చరిత్రలో బహుశా పార్లమెంట్లో గానీ, రాష్ట్రాల శాసనసభల్లో గానీ ఏ ప్రధానీ, ఏ ముఖ్యమంత్రీ ఈ తరహాలో మాట్లాడి ఉండరు. ‘ఏసుక్రీస్తుకయితే క్షమాపణ చెబుతారా... వెంకటేశ్వర స్వామికి మాత్రం చెప్పరా’’ అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తిరుమలలో ఆధ్యాత్మికవేత్తలూ, వేద పండితులూ వద్దువద్దని వారిస్తున్నా వినకుండా వేయికాళ్ల మండపాన్ని కూల్చేసిన చంద్రబాబే ఈ ప్రశ్న వేశారు. ఆధ్యాత్మిక సుధలను అనుదినం ప్రవర్ధితం చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ ప్రభుత్వం ప్రారంభించిన ఎస్వీబీసీ భక్తి ఛానల్ ఎందుకూ, డబ్బులు దండ గని ఈసడించుకున్న చంద్రబాబే వెంకన్నకు క్షమాపణ చెప్పరా అని ప్రశ్నిస్తున్నారు. ‘50 కోట్ల ఖర్చుతో భగవద్గీత పుస్తకాలు అచ్చేశారు. ఏముంది అందులో, ఆ పుస్తకాలను చూస్తే మొహాన ఉమ్మేస్తార’ని చెబుతున్న టీటీడీ బోర్డు అధ్యక్షుని మీద ఈగ వాలకుండా కాపుకాస్తున్న ముఖ్యమంత్రే ఈ ప్రశ్న వేస్తున్నారు.దేవుని మీద నిజమైన భక్తి విశ్వాసాలు ఉన్నవారు ఎవరైనా తనకు తెలిసో, తెలియకో తన వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అపచారం జరిగిందని భావిస్తే తప్పనిసరిగా క్షమాపణ కోరు తారు. దేవుడిపై నమ్మకం ఉండేవారు శివుడూ, వేంకటేశ్వరుడూ, ఏసుక్రీస్తూ, అల్లా అనే తేడాలు చూడరు. అన్ని రూపాల్లోని అన్ని విశ్వాసాల్లోని దైవత్వాన్ని ఆరాధిస్తారు. ‘మీ దేవుడూ, మా దేవుడూ’ అనే మీమాంస భక్త వేషధారులకుంటుందేమో గానీ భక్తి విశ్వాసాలు కలవారికి ఉండదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి శాసనసభ సాక్షిగా ఒక మతం తరఫున వకాల్తా పుచ్చుకొని రాజ్యాంగం నిర్దేశించిన ‘రాజ్య తటస్థత’ నియమాన్ని బాబు ఉల్లంఘించారు.రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే కాదు... సత్యదూరమైన విషయాన్ని ప్రశ్నగా సంధించి ఆయన సభను తప్పుదోవ పట్టించారు. ఏడుకొండల స్వామికి క్షమాపణ చెప్పవలసింది ఎవరు? ప్రభుత్వం ప్రచారం చేసినట్టు జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ స్పష్టం చేసినా కూడా ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని వాదిస్తున్నారు కదా! ఆ నెయ్యి శాంపుల్స్ ఎప్ప టివి? చంద్రబాబు ముఖ్యమంత్రయిన కొన్నాళ్ల తర్వాత టీటీడీ నాణ్యతా పరీక్షలో విఫలమైన నాలుగు ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలివి. పరీక్ష ఫెయిలైన ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. ఆ శాంపిల్స్ను పరీక్ష కోసం బాబు నియమించిన ఈవో శ్యామలరావు ఎన్డీడీబీకి పంపించారు. వెనక్కు మళ్లిన ట్యాంకర్లు ఎన్నడూ లేని విధంగా బాబు ఏలుబడిలోనే తొలి సారిగా డెయిరీ లేబుళ్లు మార్చుకొని తిరుమలకు వెళ్ళాయి.కూటమి పాలనా కాలంలో, కూటమి నియమించిన ఈవో పంపించిన నెయ్యి శాంపిల్స్లో కల్తీ జరిగి ఉంటే అందుకు ఎవరు బాధ్యత వహించాలి? నాణ్యతా పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు మళ్లీ తిరుమలలోకి ప్రవేశించాయంటే అందుకు ఎవరిని నిందించాలి? వైసీపీ పాలనా కాలం నుంచే టీడీడీలో నాణ్యతా పరీక్షలకు ఏర్పాట్లున్నాయి. అప్పుడు కూడా చాలా సార్లు పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కు మళ్లాయని రికార్డులు చెబుతున్నాయి. అయినా, 2024 జూలై తర్వాత వచ్చిన శాంపిల్స్ను పరీక్షించి అంతకుముందు కాలంలో కల్తీ జరిగిందని తీర్పులు చెప్పడం ఎలా కుదురుతుంది? ఈ ఆరోపణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? ‘మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి’ అన్నాడట వెనుకటికి ఒకాయన! కూటమి తీరు ఆ విధంగానే ఉన్నది.ఆదాయ వనరుల్లేని వేలాది చిన్న దేవాలయాల్లో దీప ధూప నైవేద్యాలకు నిధులనూ, అర్చక స్వాములకు భృతినీ ఏర్పాటు చేసిన రాజశేఖరరెడ్డి మీద, తిరుమలేశుని వైభవానికి దిగంతాల దాకా ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో వేలాది ఆలయాలను నిర్మించిన జగన్మోహన్రెడ్డి మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి కూటమి సర్కార్ పడరాని పాట్లు పడుతున్నది. ‘బట్ట కాల్చి మీదేస్తాం’ అనే బరితెగింపు ధోరణి ఇది. ఏడు కొండలూ తిరుమలేశునికే చెందుతాయని వైఎస్సార్ సర్కార్ ఇచ్చిన జీవోను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పిందెవరు? ఆ వీడియోలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. అవి ఫేక్ వీడియోలని ఇంకా ప్రకటించలేదెందుకో? ఏ హిందూ పీఠాధి పతులు చెప్పారని తిరుమలలోని వేయికాళ్ల మండపాన్ని కూల్చి వేశారు? వెంకటేశ్వరుని సేవకు ఆధ్యాత్మిక ఛానల్ ఎందుకు, డబ్బులు దండగన్నది ఎవరు? హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో ఏమున్నదని ఎవరి హయాంలోని టీటీడీ అధ్యక్షుడు హేళన చేశారు? ‘దళిత గోవిందం’ పేరుతో శ్రీవేంకటేశ్వర మహాత్మ్యాన్ని దళితవాడల్లో వినిపించిన పాలకు లపై హిందూ వ్యతిరేక ముద్ర వేయాలని చూడటం ఎంత దిగజారుడుతనం?... ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్లు!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
జగన్ను ఎదుర్కొనే ధైర్యం లేకే ఈ కుట్ర.. బాబు స్కామ్ల చరిత్ర..
-
6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట... లైవ్ లో చంద్రబాబు వీడియో చూపిస్తూ..!
-
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి
-
ఊర్లోకి వస్తే చంపేస్తాం.. పల్నాడులో రెడ్ బుక్ పడగ
-
KSR Show: మతం పేరుతో క్షుద్ర రాజకీయం.. కదం తొక్కిన మహిళలు
-
పచ్చటి కొండ కొల్లగొట్టు
పచ్చనేతలు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. అది అటవీశివారు గ్రామం.. ఆ ఊళ్లో కొండపై పచ్చనేతల కళ్లుపడ్డాయి.. రాళ్లు, కంకర, మట్టి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. పచ్చటి కొండను కొల్లగొడుతున్నారు.. కాపాడాలని స్థానికులు కోరుతున్నా.. మామూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నారు. ఫలితంగా ఆ ఎత్తైన కొండ కరిగిపోయింది. మిగిలిన హెచ్చుతగ్గులు చదునైపోయి రికార్డులు పుడుతున్నాయి. అయినా అడిగేవారు లేక.. అడ్డుకునే వారు రాక ప్రకృతి ప్రసాదితమైన కొండ మాయమైంది. సాక్షి, టాస్క్ ఫోర్స్: బాబు సర్కారులో పచ్చనేతలు కొండలను చదును చేసి.. పొలాలుగా మార్చేస్తున్నారు. అయినా అడిగేవారు కరువయ్యారు. వివరా ల్లోకి వెళితే.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపా ళెం మండలం నెరబైలు గ్రామ రెవెన్యూ లెక్క దాఖ లా సర్వే నంబర్ 160914లో ఉన్న 1.10 ఎకరాల గుట్టను గత పది రోజులుగా భారీ యంత్రాలతో ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే విలువైన మట్టిని బయటకు తరలించగా కొండ మొత్తం కరిగి పోయింది. ఆ నేలను చదును చేసి పంట పొలాలుగా తీర్చుతుర్చున్న ఘటనపై పలుసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఎత్తైన కొండ కళ్లముందే కరిగించేస్తున్నా అధికారులు స్పందించక పోగా ఆ భూముల కు అక్రమ మార్గంలో ఆక్రమణ దారుల పేరిట రికార్డులు సృష్టించేందుకు సాయం చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దీని వెనుక టీడీపీ మండలస్థాయి నేతలిద్దరితో పాటు గ్రామానికి టీడీపీ సాను భూతి పరులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. పల్లె రోడ్లు ఛిద్రం కొండను తవ్వి మట్టి యథేచ్ఛగా తరలిస్తుండడంతో పల్లె రోడ్లు ఛిద్రమవడంతోపాటు చుట్టు పక్కల పొలాలు సైతం దెబ్బతింటున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను లొంగతీసుకుని ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తుండడంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎత్తైన కొండలు, గుట్టలను తవ్వి పొలాలుగా మార్చుకోవడం, ఆపై రికార్డులు తయారు చేయడం నిరంతర ప్రక్రియగా మార్చుకోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతుండగా అన్ని రాజకీయ పారీ్టలు పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అధికారులపై న్యాయ పోరాటం ప్రకృతి వనరులను ధ్వంసం చేసే భూ ఆక్రమణ దారులకు అండగా నిలుస్తున్న స్థానిక రెవెన్యూ అధికారులపై న్యాయ పోరాటం చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులందరికీ ఫిర్యాదులు చేశామని, భూ ఆక్రమణలు, ప్రకృతి వనరులను కాపాడడంలో మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. -
చర్చలేకుండా డైవర్షన్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై అధికారపక్షం అసలు చర్చే జరగనివ్వలేదు. శాసనమండలిలో గురువారం కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు పదేపదే అడ్డుతగులుతూ చర్చను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం కల్తీ నెయ్యి పేరుతో అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, దానిపై చర్చిద్దామంటే సభ నుంచి ఆ పార్టీ సభ్యులు పారిపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. అశ్లీల వీడియోల్లో ఉన్నది తానేనని బీఆర్ నాయుడు అంగీకరించిన తర్వాత కూడా ఆయన్ను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి చంద్రబాబు ఎందుకు భయపడిపోతున్నారని ప్రశ్నించారు. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్టు కోసమే కల్తీ నాటకాన్ని తెరపైకి తెచ్చారని బయటపడడంతో అధికారపక్షం ఇరుకున పడిపోయింది. గురువారం తిరుమల లడ్డూపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతుండగా అడ్డుపడి అచ్చెన్నాయుడు లేచి సమస్యను పక్కదారిపట్టించేందుకు ప్రయత్నించారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ పోడియంలోకి దూసుకు వచ్చారు. ఈ నిరసన కార్యక్రమం మధ్యనే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్టేట్మెంట్ను చదివేసి మమ అనిపించారు. వైఎస్సార్సీపీ సభ్యుల నిరసనతో సభను చైర్మన్ అయిదు నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే విధమైన పరిస్థితి కొనసాగడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.చర్చకు దూరంగా పలాయనం..కల్తీ ఆరోపణలపై చర్చిద్దామంటే అధికారపక్షం పూర్తిగా పలాయనం చిత్తగించింది. దానిపై చర్చ జరగనీయకుండా రకరకాల వాదనలతో సమస్యను డైవర్ట్ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశారని ఆధారాలతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మండలిలో నిరూపించారు. ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్కి టీటీడీ నిధులు దోచిపెట్టడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా చేయడానికి కాంట్రాక్టు దక్కించుకుందని వారు పేర్కొన్నారు. ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్ అనుబంధ సంస్థేనని ఒకసారి, కాదు.. అక్కడ హెరిటేజ్ ఉత్పత్తులు మాత్రమే తయారవుతాయని మరోసారి.. హెరిటేజ్ వెబ్సైట్ను మార్చడమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ సభ్యులు వివరించారు. హెరిటేజ్ ఆధ్వర్యంలో ఏఆర్, ఇందాపూర్, సంగం, ప్రీమియర్ ఆగ్రో, భోలేబాబా డెయిరీలతో ఏర్పడిన డెయిరీ సిండికేట్ గుట్టును బయటపెట్టడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వం చర్చలో పాల్గొనకపోవడమంటే హెరిటేజ్ అవినీతిని అంగీకరించినట్లేనని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. కల్తీ జరగలేదని సీబీఐ సిట్ చార్జిషీట్లో పేర్కొనడాన్ని బట్టి రాజకీయ స్వార్థం కోసమే తిరుమల శ్రీవారిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగారని ప్రజలు అర్ధంచేసుకున్నారని వారు వివరించారు. సమాధానం చెప్పలేకే డైవర్షన్..రాజకీయ లబ్ధి, హెరిటేజ్ వ్యాపార ప్రయోజనాల కోసం చంద్రబాబు ఘోరమైన కుట్రచేశారని తేలిపోయింది. దానిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఏఆర్ డెయిరీ పేరుతో వచ్చిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపితే దాన్ని వైష్ణవి డెయిరీ పేరుతో తిరిగి రప్పించి లడ్డూ తయారీకి ఎలా వాడారని అడిగితే దానికి దేవదాయ శాఖ మంత్రి నుంచి సమాధానం లేదు. టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టిన ఇందాపూర్ డెయిరీపై సస్పెన్షన్ ఎత్తివేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. భోలేబాబా డెయిరీకి టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చింది కూడా చంద్రబాబే. వీటిలో దేనికీ సమాధానం చెప్పలేక కూటమి సభ్యులు వేరే అంశాలను లేవనెత్తి సభను డైవర్ట్ చేశారు.టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలి..టీటీడీ పవిత్రతను దెబ్బతీసిన బీఆర్ నాయుడు చైర్మన్ పదవికి అనర్హుడు. అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ‘ఆ వీడియోలో తప్పేముందని.. ఆమె కుటుంబంతో 30 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఆ వీడియోలు, చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్కు బాధిత మహిళ రాసిన లేఖలపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం. పవన్ నిజంగా హిందువైతే బీఆర్ నాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలి.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. -
‘ఆశ’యమే ఆగ్రహజ్వాలై
చంద్రబాబు సర్కారు నిరంకుశత్వంపై ఆశా కార్యకర్తలు గర్జించారు. ఆశయ సాధన కోసం రణన్నినాదం మోగించారు. ప్రభుత్వ విధానాలు, వెట్టిచాకిరీ, బానిసత్వంపై నిప్పులుగక్కారు. బెజవాడలో మండుటెండనూ లెక్కచేయక నిరసన గళమెత్తారు. పది డిమాండ్లతో బాబు కూటమికి అల్టిమేటం ఇచ్చారు. సర్కారు వెన్నులో వణుకుపుట్టించారు. సాక్షి, అమరావతి: ఆశా కార్యకర్తలు విజయవాడలో గురువారం చేపట్టిన ధర్నా జయప్రదమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వర్కర్లు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవులు ఇవ్వకుండా, కనీసం మానవత్వం లేకుండా రేయింబవళ్లూ సర్వేల పేరుతో వేధించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా మభ్యపెడుతోందని మండిపడ్డారు. ఎన్నిసార్లు వినతులు సమర్పించినా సమస్యలను పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. అనేక రకాల విధులు అప్పగించి తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న చంద్రబాబు సర్కారు తమను బానిసలుగా చూస్తోందని దుమ్మెత్తిపోశారు. పనిభారం తీవ్రమై, చాలీచాలని జీతంతో నరకం అనుభవిస్తుంటే, ప్రభుత్వ వైఫల్యాలను తమపై నెట్టి సర్కా రు మానసిక క్షోభకు గురిచేస్తోందని ఆవేదన వెళ్లగక్కారు. అందుకే ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఆత్మగౌరవం గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తమ ఆత్మగౌరవాన్ని పెంచిందని ఆశా కార్యకర్తలు చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే గౌరవ వేతనాన్ని రూ.పదివేలకు పెంచారని గుర్తుచేసుకున్నారు. కానీ, చంద్రబాబు ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి రాగానే నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలి.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనం పెంచాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.10 వేలు అసలు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రవాణా ఖర్చులకు రూ.3 వేలు నుంచి రూ.4 వేలు ఖర్చుచేయాల్సి వస్తోందనిన్నారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలని, పనిభారం తగ్గించి వెట్టిచాకిరీ, బానిసత్వం నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా కార్యకర్తలుగా మార్చాలని, ఖాళీలను భర్తీ చేయాలని, టీఏ, డీఏలు, ఏఎన్ఎం–జీఎన్ఎం శిక్షణ పొందిన వారికి పర్మినెంట్ పోస్టు, రూ.10 లక్షల బీమా, నాణ్యమైన మొబైల్స్, యూనిఫామ్ ఇవ్వడంతోపాటు విధినిర్వహణలో మృతి చెందిన వారికి దహన సంస్కార ఖర్చులుగా రూ.20వేలు ఇవ్వాలనే 10 రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఇదిలా ఉంటే ఆశా కార్యకర్తల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆశా కార్యకర్తలు ఆశాల పోరాటం వాయిదా ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హా మీ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళ న, పోరాటాలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చర్చల్లో రమణకుమారి, కమల, వాణిశ్రీ, సత్యవతి, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి ఆశా కార్యకర్తలకు ఇచ్చే గౌరవ వేతనం పెంచాలి. అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్నాం. ధరలు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. కనీస వేతనం రూ.26వేలకు పెంచాలి. పనిభారం తగ్గించాలి. సెలవులు మంజూరు చేయాలి. వేధింపులు ఆపాలి. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి. – ఎ.కమల, భవానీపురం, విజయవాడఉద్యోగ భద్రతేదీ? మా బతుకులకు ఉద్యోగ భద్రత లేదు. సెలవులు ఇవ్వడం లేదు. వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నాం. సెలవులు, మెడికల్ లీవులు ఇవ్వాలి. పనిభారం తగ్గించాలి. ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులు భర్తీ చేయాలి. కనీస వేతనాన్ని రూ.26వేలకు పెంచాలి. ఉద్యోగ భ««ద్రత కల్పించాలి. – బి.సరళ, చింతలపూడి ఎలా బతకాలి? కనీస వేతనాలు ఇవ్వకుండా మాతో అన్ని రకాల పనులు చేయిస్తున్నారు. ముఖ్యంగా యాప్ల పేరుతో సర్వేల భారం మోపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదు. ఆ నెపాన్నీ తమపైనే మోపి వేధింపులకు పాల్పడుతున్నారు. సిమ్లు సైతం పనిచేయకపోవటంతో సొంత డబ్బుతో రీచార్జి చేయించుకుని పని చేయాల్సి వస్తోంది. ఇచ్చే రూ.పదివేలలో రవాణా, ఇతర విధుల ఖర్చులకే నలభైశాతం ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇక మిగిలి వాటితో ఎలా బతకాలి? – సీహెచ్ పద్మ, కాకినాడసెలవుల్లేవు.. లాస్ ఆఫ్ పేనే ఏఎన్ఎం శిక్షణ పూర్తిచేసుకున్న ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం సెలవు కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా చాకిరీ పనిచేయిస్తున్న పభుత్వం కనీస వేతనం ఇవ్వటం లేదు. ఆన్లైన్ సర్వేలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు వెల్నెస్ సెంటర్లోనే కూర్చోమని చెప్పటం ఇబ్బందిగా ఉంది. సెలవులు లేకపోవటం వల్ల శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పుడు లాస్ ఆఫ్ పే భరించాల్సి వస్తోంది. – ఎం.రాధ ధవళేశ్వరం -
చంద్రబాబు, పవన్కు ఉండవల్లి లేఖ
-
హెరిటేజ్ కోసం కొన్న కెమికల్స్.. వివరాలను బయటపెట్టే దమ్ముందా..?
-
‘లడ్డూ’పై బాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. శాసన మండలిలో చర్చకు అడుగడుగునా అడ్డుపడ్డ మంత్రులు
-
దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యతని.. సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసి కూడా ఆరోపణలున్న వ్యక్తినే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్ట, పవిత్రతను చంద్రబాబు కాలరాశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్ నాణ్యత లేదంటూ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి టీటీడీకి రావడం.. రిజెక్ట్ చేసిన వాటిని అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ సిట్ ఛార్జిషీట్లో స్పష్టం చేయడం ఆందోళనకరమన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేపుతూ.. నెయ్యి ధరల విషయంలో తప్పుడు ప్రచారం చేసి లాభాలు ఆర్జించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. దేవుడిపై భక్తి ఉన్న వారు ఎవరైనా ఇలా చేస్తారా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వాల తొలి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్ తీరును సాక్ష్యాధారాలతో ఎండగడుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ బుధవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..దేవుడిపై బాబుకు భక్తి, శ్రద్ధ, భయం లేదని మరోసారి రుజువైంది..దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అది అత్యంత నిష్టతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కళంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ చంద్రబాబు గారికి లేఖ రాస్తూ.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పని కోసం ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి, ఆలయ ప్రతిష్ట, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుకు భక్తీ లేదు.. శ్రద్ధ అంతకన్నా లేదు. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.టీటీడీకి నెయ్యి సరఫరాను సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు..ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నారు. మరోవైపు 2014–19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278– రూ.330 ఉంది. 2019–24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే ఉంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ.. తన హెరిటేజ్కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డెయిరీకి కిలో నెయ్యి రూ.658లకు 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు.. శ్రద్ధ లేదు.. నిష్ట లేదు.. నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది.. లడ్డూ తయారీలో వాడింది బాబు హయాంలోనే..లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ(నాణ్యత) బాగోలేదని ఈ చంద్రబాబు గారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా.. మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం.. ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ–సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు.. ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. -
సమాధానం చెప్పలేక సత‘మతం’!
సాక్షి, అమరావతి: పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చార్జిషీట్లో సీబీఐ తేల్చేసినా, కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు నిర్ధారించినా పశ్చాత్తాపం లేదు..! కనీసం చట్టసభలోనూ కూటమి సర్కారు స్పందించలేదు! 2014–19 మధ్య టీటీడీకి కిలో రూ.278కే నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీకి ఇప్పుడు ఏకంగా కిలో రూ.658 చొప్పున సరఫరా కాంట్రాక్టు అప్పగించడంపైనా జవాబు లేదు! ఇటీవల వరకు హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా చూపించిన ఇందాపూర్ డెయిరీని గుట్టు చప్పుడు కాకుండా కో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేయడంపైనా నోరు విప్పలేదు! చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీటీడీ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్లను దొడ్డి దారిన రప్పించి తిరిగి అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూల తయారీకి వాడినట్లు సాక్షాత్తూ సీబీఐ తేల్చేసినా సమాధానం లేదు! ప్రభుత్వ టెండర్లలో హెరిటేజ్ ఎప్పుడూ పాల్గొనలేదంటూ చంద్రబాబు చెబుతున్న మాటల్లో నిజం లేదని.. మండలి సాక్షిగా విపక్షం ఆధారాలను బహిర్గతం చేస్తే సమాధానం అంతకంటే లేదు!!చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేతిరుమల లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు, సీబీఐ చార్జిషీట్లో తేల్చేయడం.. ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ వ్యాపార అనుబంధం.. నెయ్యిపై రాజకీయ, ఆర్థిక కుట్రలు బహిర్గతం కావడం.. ఇదంతా చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్కు లబ్ధి చేకూర్చేందుకేనని తేటతెల్లం కావడం.. టీడీపీ కూటమి సర్కారుకు దుర్బుద్ధి లేకుంటే దీనిపై చట్టసభలో చర్చకు ఎందుకు జంకుతోందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చర్చించుకోవడం.. శాసన మండలి చైర్మన్ న్యాయం వైపు గట్టిగా నిలబడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చర్చకు ఒప్పుకున్నట్లు నటిస్తూనే చంద్రబాబు సర్కారు డ్రామాలాడటం పట్ల హైందవ ధార్మిక సంస్థలు, హిందూ సమాజం తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇన్ని రోజులూ మొహం చాటేసిన చంద్రబాబు సర్కారు కుట్ర బుద్ధితో టాపిక్ డైవర్షన్ రాజకీయాలకు తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వయంగా అధికార పక్షమే ఇన్ని రోజులు సభను అడ్డుకున్న దాఖలాలు దేశ చరిత్రలో లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూపై శాసన మండలిలో బుధవారం చర్చ మొదలు కాగానే మంత్రులు అడ్డుపడటం.. మతం ప్రస్తావన తేవడం.. ఎస్సీ వర్గానికి చెందిన మండలి చైర్మన్పై వ్యక్తిగత విమర్శలు చేయడం అంతా వ్యూహం ప్రకారం లడ్డూపై చర్చకు భయపడి పక్కదారి పట్టించేందుకేనని మండలి సాక్షిగా బహిర్గతమైందని పేర్కొంటున్నారు. లడ్డూపై సభలో చర్చ జరిగితే చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుంభకోణం కుట్రలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో టీడీపీ తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్ను ఎంచుకుందని స్పష్టం చేస్తున్నారు. వెబ్సైట్లో తీసేస్తే హెరిటేజ్కు, ఇందాపూర్కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా? ఒక పరిశ్రమ మరో పరిశ్రమతో కలసి వ్యాపారం చేస్తోందంటే వెబ్సైట్లో తీసేస్తే అయిపోతుందా? అంటూ వ్యాఖ్యానించిన మంత్రి అచ్చెన్న దీన్ని కవర్ చేసుకునేందుకే ‘మతం’ ప్రస్తావన తెచ్చారని విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మొత్తం 19 నిమిషాలు మాట్లాడితే అందులో 12 సార్లు అడ్డుపడ్డారంటే అధికారపార్టీ ఏ స్థాయిలో భయపడిందో చెప్పేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.బాబూ.. హిందూ సమాజం నిన్ను క్షమించదు..!రాజకీయ కుట్రతో ప్రారంభమైన నెయ్యి వ్యవహారం ఆర్థిక కుట్రగా ఎలా మారిందో విపక్ష సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, తూమాటి మాధవరావు సాక్ష్యాధారాలతో శాసన మండలిలో ఎండగట్టారు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును హిందూ సమాజం క్షమించబోదని చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్పై నమ్మకం లేకనే వైవీ సుబ్బారెడ్డి సీబీఐ దర్యాప్తు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని గుర్తు చేశారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్కు ఇందాపూర్ డెయిరీతో ఉన్న సంబంధాలను సాక్ష్యాధారాలతో వివరించారు. హెరిటేజ్ వెబ్సైట్లో ఇన్నాళ్లూ తమ తయారీ సంస్థగా చూపించిన ఇందాపూర్ డెయిరీని ఆరోపణలు రాగానే హఠాత్తుగా కో–మాన్యుఫాక్చర్గా మార్చడంతో పాటు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్తో రాజీనామా చేయించిన వైనాన్ని వివరించారు. 2016లో టీటీడీ నాణ్యత పరీక్షల్లో ఇందాపూర్ డెయిరీ ఫెయిల్ అయ్యిందని, ఇప్పుడు అదే ఇందాపూర్కి రూ.680కి నెయ్యి సరఫరా అప్పగించడం వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం దాగి ఉందన్నారు. ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీలను టీడీపీ ప్రభుత్వమే అనుమతించిందని, వారి హయాంలోనే ఏఆర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేనందున నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరిస్తే వాటిని ఎవరి ఒత్తిడి మేరకు సంగం డెయిరీతో సంబంధం ఉన్న వైష్ణవీ డెయిరీ ద్వారా అనుమతించారో చెప్పాలంటూ నిలదీశారు. కల్తీ నెయ్యి సరఫరా టీడీపీ హయాంలో జరిగితే వైఎస్సార్ సీపీకి ఏం సంబంధమంటూ ప్రశ్నించారు. ఎన్డీడీబీ రిపోర్టు, సీబీఐ చార్జిషీటులో ఎక్కడా కూడా జంతుకొవ్వు కలిసిందని లేకపోయినా 120 కోట్ల మంది హిందువుల విశ్వాసాన్ని హేళన చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు. సీబీఐ చార్జిషీటులో టీటీడీ జీఎం ఫిర్యాదును ప్రస్తావిస్తే, అదే నివేదిక అంటూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు. హెరిటేజ్ ప్రభుత్వ టెండర్లలో ఎప్పుడూ పాల్గొనలేదంటూ శాసన సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. టీటీడీకి పాలపొడి సరఫరా టెండర్లలో పాల్గొందని పేర్కొన్నారు. ఒకసారి టీటీడీకి హెరిటేజ్ పాలపొడి సరఫరా చేయగా బిల్లులు ఆగిపోతే ఒత్తిడి తెచ్చి ప్రత్యేకంగా రిజల్యూషన్తో డబ్బులు తీసుకున్న వైనాన్ని ఆధారాలతో వివరించారు. హెరిటేజ్ మజ్జిగ సరఫరాకు సంబంధించి కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలను కూడా సభ ముందుంచారు. చంద్రబాబు కుటుంబంతో కలసి గత ఐదేళ్లలో పలుదఫాలు తిరుమల వెళ్లి ప్రసాదం తిన్నారని మరి ఎప్పుడైనా లడ్డూ కల్తీ జరిగిందని ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్లి బాగుందంటూ తిరుమల లడ్డూలు తిన్న కూటమి నేతలు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. ఇందాపూర్ కోసం నిబంధనలు మార్చామని స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యుడే స్వయంగా శాసనసభలో వెల్లడించారని గుర్తు చేశారు. కేవలం గేదె పాలను మాత్రమే సేకరిస్తున్న సంగం డెయిరీ ఆవు నెయ్యి ఎలా సరఫరా చేస్తుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ⇒ ఒకానొక దశలో తమ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని కోరిన తూమాటి మాధవరావుపై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి దాడి చేసే యత్నం చేశారు. ఇంత గందరగోళ పరిస్థితుల మధ్యలో కూడా విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు పూర్తి ఆధారాలతో చంద్రబాబు కుట్రను మండలి సాక్షిగా బయటపెట్టారు.⇒ అంతకుముందు స్వల్పకాలిక చర్చ కంటే ముందు మంత్రి స్టేట్మెంట్ ఇస్తారంటూ అధికారపార్టీ సభ్యులు చర్చ జరగకుండా అడ్డుకున్నారు. అయితే సభలో కొత్త సంప్రదాయాలకు అవకాశం లేదని, నిబంధనల ప్రకారమే చర్చ తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుందంటూ చైర్మన్ చర్చను ప్రారంభించారు. టీడీపీ తరపున అనురాధ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డితో పాటు వైఎస్ జగన్పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. -
నెల్లూరులో మైనర్ బాలికలపై ఆగని లైంగిక దాడులు
-
మీకు సిగ్గనిపించడం లేదా..? బాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
హామీలు అమలు చేయమంటే అంగన్వాడీలపై దౌర్జన్యమా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని శాంతియుత నిరసన తెలిపిన అంగన్వాడీలను ప్రభుత్వం దౌర్జన్యంగా పోలీసులతో అరెస్టులు చేయించడాన్ని వైఎస్సార్టీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. విజయవాడలో అంగన్వాడీలను పాశవికంగా అరెస్టు చేయడాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కాల్వపల్లి చిన్నమ్మ, ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళ తప్పుబట్టారు.ఈ మేరకు మంగళవారం ప్రకటన చేస్తూ.. అంగన్వాడీ మహిళల పట్ల మగ పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన తీరుపై హోంమంత్రిగా ఉన్న మహిళ సమాధానం చెప్పాలన్నారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మహిళల ఆగ్రహానికి గురయ్యారన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనను అణచివేసేందుకు ప్రయత్నించి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరుఅంగన్వాడీ మహిళల అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చంద్రబాబు ప్రభుత్వాన్ని అంగన్వాడీ యూనియన్ నేతలు హెచ్చరించారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ యూనియన్ల నాయకులు లక్ష్మీదేవి. జైని, రత్నకుమారి, లలితమ్మ, సుజాత తదితరులు విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీలు నిద్రమత్తులో ఉండగా ప్రభుత్వం దుర్మార్గంగా అక్రమ అరెస్టులకు పాల్పడిందన్నారు.అరెస్టు చేసిన వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి అంగన్వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్లో పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే, శాంతియుతంగా ధర్నా చేసిన అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించాయి. అంగన్వాడీలు నిద్రిస్తుండగా తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డాయి. -
భూ దాహం తీరనిది!
సాక్షి, అమరావతి: ఇప్పటికే 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణ పనులను చేపట్టిన ప్రభుత్వం.. రెండో దశలో 50 గ్రామాల పరిధిలో 1,75,347.43 ఎకరాల్లో (709.57 చదరపు కిలోమీటర్లు) రాజధానిని విస్తరించడానికి ‘మాస్టర్ ప్లాన్’ రూపకల్పనకు ఫిబ్రవరి 16న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో బిడ్ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. అదే రోజున సాంకేతిక, గురువారం ఆర్థిక బిడ్ను తెరిచి అర్హత సాధించే కన్సల్టెన్సీకి మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలు అప్పగించనుంది. తొలి దశ, రెండో దశ కలుపుకుంటే మొత్తం 926.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి వందేళ్ల సమయం పట్టొచ్చునని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో రాజధాని విస్తరణకు ఇంకెన్ని వందల ఏళ్లు పడుతుందని సామాజిక, ఆర్థిక వేత్తలు, సిటీ ప్లానర్లు నిలదీస్తున్నారు. దేశంలో మహా నగరాలైన గ్రేటర్ హైదరాబాద్ 650 కి.మీ, గ్రేటర్ చెన్నై 438, బృహత్ బెంగళూరు 741, గ్రేటర్ ముంబై విస్తరించింది 603.4 చదరపు కిలోమీటర్లలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆ మహా నగరాలను ఎవరూ నిర్మించలేదని, వాటంతట అవే మహా నగరాలుగా అభివృద్ధి చెందాయని స్పష్టం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు రూ.47,438 కోట్లు అప్పు తెచ్చారని.. నగర నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.లక్షల కోట్ల అప్పు తేవాల్సి ఉంటుందని.. ఇది రాష్ట్రాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతి రాజధాని 2,29,095.43 ఎకరాల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 11 ఏళ్లుగా ప్రాథమిక దశను దాటని రాజధాని ⇒ రాజధానిపై ముందే వందిమాగధులు, బినామీలకు లీకులు ఇచ్చి, ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి కారుచౌకగా భూములు కాజేసిన తర్వాత 2015లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ⇒ ఇందులో ప్రభుత్వ, అటవీ భూమి పోనూ 34,390 ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సమీకరించింది. పల్లపు ప్రాంతం.. కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రభావిత ప్రాంతమైన ఆ భూమిలో రాజధాని నిర్మించడానికి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అవుతుందంటూ అప్పట్లో కేంద్రానికి సీఎం చంద్రబాబు డీపీఆర్ సమర్పించారు. ⇒ కానీ.. 11 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. 2014–19 మధ్య రాజధాని నిర్మాణానికి రూ.5,500 కోట్లు వ్యయం చేసినా, శాశ్వత నిర్మాణం ఒక్కటంటే ఒక్కటీ కట్టలేదు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకున్నారని.. షాపూర్జీ పల్లోంజీ నుంచి సీఎం వ్యక్తిగత కార్యదర్శి కమీషన్లు తీసుకుని, ఐటీ శాఖకు పట్టుబడటాన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కార్కు అప్పట్లో ఎంత చిత్తశుద్ధి ఉందన్నది స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ⇒ 2024 జూన్ 12న మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చి ఇప్పటికే 21 నెలలు పూర్తయింది. రాజధాని నిర్మాణ పనుల కోసం రూ.47,387 కోట్లు అప్పు తెచ్చి.. సుమారు రూ.60 వేల కోట్ల అంచనాతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ.. పనుల పురోగతిని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు సాగడం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. తొలి విడత సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని, ఆ పదేళ్లు కౌలు చెల్లిస్తామని సీఆర్డీఏ చట్టం ద్వారా హామీ ఇచ్చారు. కానీ.. ఆ మేరకు హామీ అమలు చేయలేదు. దాంతో రైతులకు కౌలు చెల్లింపును మరో ఐదేళ్లు పొడిగించారు.పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం ⇒ రాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి ప్రభుత్వం డీపీఆర్లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు.⇒ ప్రస్తుత ధరల ప్రకారం 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ⇒ ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందల ఏళ్లు పడతాయి? ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది? ఇంకెన్ని రూ.లక్షల కోట్ల అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులతో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తొలి విడతకు మూడింతలు.. ⇒ రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే చిన్న మున్సిపాలిటీగా మిగిలి పోతుందని, భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూ సమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసి చెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు.. వెరసి ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల్లో (82.9 చదరపు కిలోమీటర్లు) భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ⇒ వాటితోపాటు గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడికొండ మండలాలు, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లోని 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ⇒ ఇందులో ఏడు గ్రామాల్లోని 20,494 ఎకరాలను తొలుత భూ సమీకరణ చేసి.. ఆ తర్వాత అవసరమైనప్పుడు మిగతా భూమిని విడతల వారీగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణా నది నుంచి దక్షిణాన అవుటర్ రింగ్ రోడ్డు వరకు.. తూర్పున చెన్నై–కోల్కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతంలో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ⇒ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు 6 నెలలు గడువుగా నిర్దేశించింది. తొలుత భూ సమీకరణ చేస్తున్న ఏడు గ్రామాల్లో వివరణాత్మక ప్రణాళిక.. ఆ తర్వాత మిగిలిన 43 గ్రామాల్లో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. రహదారులు, వరద నీటి నియంత్రణ, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఆ పనులకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం.. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించగా సీఆర్డీఏకు మిగిలే భూమిని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వంటి నమునాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ వంటి మార్గాలను అన్వేషిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. -
కూటమి మోసంపై నిరుద్యోగుల కన్నెర్ర!
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి సర్కారు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోగా... ఉద్యోగాలను పెద్ద ఎత్తున కల్పించినట్లు పచ్చి అబద్ధాలను ప్రచారం చేసుకుంటోంది. ఏపీ శాసన సభలో ఫిబ్రవరి 25న విద్యాశాఖ మంత్రి లోకేష్ తప్పుడు ఉద్యోగ కల్పన గణాంకాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,587 జాబ్ మేళాలు జరిపి, 1,08,747 ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, సీడాప్ ద్వారా 74 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అందులో 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 క్లస్టర్లను గుర్తించినట్లు సభలో ప్రకటించారు. అనేక సదస్సులు జరిపి 770 ప్రాజెక్టులతో ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగినట్లు గొప్పగా తెలిపారు. ఐదు లక్షల మంది నిరుద్యోగులకు పారా మెడికల్ శిక్షణ ఇచ్చి వారందర్నీ విదేశా లకు పంపాలని ప్రభుత్వం భావిస్తుందని అసెంబ్లీలో చెప్పు కొచ్చారు. నిజానికి లోకేష్ ప్రకటించిన గణాంకాలన్నీ వాస్తవ విరుద్ధ మైనవే! 1,587 జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 ఉద్యోగాలు కల్పిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను, బహిర్గతం చేయాలి కదా! ఆ పని చేయలేదు. నిరుద్యోగుల్ని వంచించే కుట్ర ఇది. అధికారం చేపట్టక ముందు రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని లోకేష్ నెత్తీ, నోరు బాదుకున్నారు. అధికారం చేపట్టగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ, సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనీ ‘యువగళం’ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇది జరగకుంటే తన చొక్కా కాలర్ పట్టుకుని నిలదీసి అడగండని నిరుద్యోగ యువతకి మాటిచ్చారు. అధికారం చేపట్టి ఇరవై నెలల సమయం అవుతున్నా ఈ హామీ ఏమయ్యింది?ఉద్యోగాలిచ్చేంత వరకూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతి చెల్లిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ప్రతీ నెల మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అన్నారు. కానీ చిల్లిగవ్వ కుడా చెల్లించలేదు. రాష్ట్రంలో 1.75 లక్షల కుటుంబాలున్నాయి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు దాదాపు రెండేళ్లకి కలిపి రూ. 14,400 కోట్లు నిరుద్యోగ భృతికి బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. 2026 బడ్జెట్ కూడా కలుపుకొంటే మొత్తం రూ. 21,600 కోట్లు చెల్లించాలి. అంటే రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ప్రభుత్వం డెబ్భై రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి బాకీ ఉందన్నమాట.వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా కల్పించారు. సుమారు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఒకేసారి 1.30 లక్షల శాశ్వత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కల్పించారు. 2.66 లక్షల వాలంటీర్ల నియామకాలు చేపట్టారు. ఆప్కాస్ ద్వారా 96 వేల ఉద్యోగాలిచ్చారు. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఉద్యోగుల్ని జగన్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. భారీ పరిశ్రమలలో లక్ష మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) రంగంలో 32 లక్షల 79 వేల 970 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం 40 లక్షల 13 వేల 552 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించింది. ఇప్పటికైనా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగ భృతి చెల్లించాలి. లేకపోతే యువత ఉద్యమిస్తుంది.– ఎ. రవిచంద్ర ‘ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగంరాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ -
అంగన్వాడీలపై ఆటవిక దాడి!
2000 జూలై 26..సమైక్యాంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో వేతనాలు పెంచాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమానవీయంగా గుర్రాలతో తొక్కించి, బాష్ప వాయువు ప్రయోగించి, అక్రమ అరెస్టులకు దిగింది.2026 మార్చి 3..విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని విజయవాడలో.. హామీలు నెరవేర్చాలని, వేతనాలు పెంచాలని శాంతియుతంగా నిరసన తెలిపి టెంటులో రోడ్డుపై నిద్రిస్తున్న అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు తెల్లవారుజామున విరుచుకుపడింది. పోలీసులతో ఈడ్చేసి అక్రమంగా అరెస్టులు చేసింది. మహిళల పట్ల చంద్రబాబు మార్కు దౌర్జన్యం, పాతికేళ్లుగా మారని బాబు తీరుకు ఈ రెండు ఘటనలు నిదర్శనం!సాక్షి, అమరావతి, నెట్వర్క్: నమ్మించి నయవంచన చేయడంలో తాను ఏమాత్రం మారలేదని సీఎం చంద్రబాబు అంగన్వాడీల విషయంలో రుజువు చేసుకున్నారు! 2024 ఎన్నికల ముందు వేతనాల పెంపు కోసం ఉద్యమించిన అంగన్వాడీలను కలిసిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని నమ్మబలికారు. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తానని టీడీపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టారు. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు వేతనాలు పెంచుతారని, డిమాండ్లు పరిష్కరిస్తారని అంగన్వాడీలు ఆశ పడ్డారు. కానీ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ చెల్లింపు లాంటి హామీలకు అతీగతీ లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు. తాజాగా అంగన్వాడీలు ‘ఛలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో వారిని మరోసారి మోసగించేందుకు.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ రెండు రోజుల ముందు మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, బాలవీరాంజనేయులు తదితరులతో ప్రకటనలు గుప్పించారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు చొరవ చూపని చంద్రబాబు మంత్రి అచ్చెన్నను రంగంలోకి దించి చర్చల పేరుతో మభ్య పెట్టారు. ఈ క్రమంలో అంగన్వాడీ నాయకులకు మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ చేసి ప్రభుత్వం మంగళవారం రోజు చర్చలకు పిలుస్తుందని సమాచారం ఇచ్చినట్లు యూనియన్ నేతలు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని భావించిన అంగన్వాడీలు రాత్రి ధర్నా టెంట్లోనే రోడ్డుపై నిద్రకు ఉపక్రమించారు. అయితే నమ్మించి దగా చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు తెల్లవారుజామున పోలీసులను ప్రయోగించి అంగన్వాడీలను దౌర్జన్యంగా ఈడ్చేశారు! మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్వాడీ మహిళలను ఈడ్చి పారేసిన తీరు దుశ్శాసన పర్వాన్ని తలపించింది. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసిన పోలీసులు కిష్కింధకాండను తలపించారు!!విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు ఉద్యమంపై ఉక్కుపాదం..దుర్వాసన వెదజల్లే డ్రైయిన్.. ముసురుకున్న దోమల నడుమ పట్టు వదలకుండా, నిరసన చేపట్టిన టెంట్లోనే.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన అంగన్వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీలు నిద్రిస్తున్న టెంట్లలోకి చొరబడిన వందలాది మంది పోలీసులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. అంగన్వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించే లోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించేశారు. చుట్టూ రోప్ పార్టీ (తాడుతో వలయం) ఏర్పాటు చేసుకున్న పోలీసులు.. అంగన్వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా దిగ్బంధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం టాయిలెట్స్కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబీ రాణి, సుబ్బరావమ్మ వాపోయారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా ఏలూరులో భారీ ర్యాలీ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు తాము చేసిన తప్పేమిటని సత్తెనపల్లి టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట ఆక్రోశించారు. అరకొర వేతనాలు, అదనపు బాధ్యతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమకు వేతనాలు పెంచాలని కోరడం మినహా ఏం నేరం చేశామని నిలదీశారు. పోలీసుల దాడిలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ఎడమ చేయి విరిగిందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గమైన చర్యలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ మహిళలకు ఇచ్చిన గిఫ్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. వేతనాలు పెంచి న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. ఈడ్చేసిన మగ పోలీసులు..టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో యాక్షన్లోకి దిగిన పోలీసులు కేవలం 30 నిమిషాల్లో నిరసన దీక్ష టెంట్ను కకావికలం చేసి అంగన్వాడీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. మగ పోలీసులు అంగన్వాడీ మహిళలను ఇష్టానుసారంగా పట్టుకుని ఈడ్చేసి వ్యాన్ల్లోకి ఎక్కించారు. కనీసం మహిళల వ్యక్తిగత ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా గంటల తరబడి వ్యానుల్లోనే మగ్గిపోవడంతో నరక యాతన ఎదుర్కొన్నారు. విజయవాడ నుంచి పోలీస్ వ్యాన్ల్లో సుమారు 60 నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాల్లోని మారుమూల చోట్లకు తరలించి అక్కడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి చంద్రబాబు మార్కు దౌర్జన్యాన్ని ప్రత్యక్షంగా చూపించారు.నెల్లూరులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమన్న మహిళలు..చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు శాంతియుతంగా నిరసన తెలిపిన అంగన్వాడీలు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున చంద్రబాబు సర్కారు అక్రమ అరెస్టులకు దిగడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. అన్ని జిల్లాల్లో రోడ్లపైకి చేరుకుని నిరసన తెలిపారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను తరలించిన సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున బైఠాయించారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో అరెస్టు చేసిన కార్యకర్తలను ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, చాట్రాయి లాంటి మారుమూల ప్రాంతాలకు తరలించగా స్థానిక అంగన్వాడీలు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అణచివేత విధానాలను అనుసరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తీరుకు నిరసనగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో అంగన్వాడీలు నల్ల బ్యాడీ్జలతో నిరసన తెలిపారు.కర్నూలులో కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్తున్న అంగన్వాడీలు బాబు మారలేదు.. అంగన్వాడీలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులతో కబురు పంపించిన చంద్రబాబు మరోవైపు పోలీసులను ప్రయోగించి అక్రమ అరెస్టులు చేయడం పట్ల సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ యూనియన్ల రాష్ట్ర కీలక నేతలు కె.సుబ్బరావమ్మ, జె.లలిత, వీఆర్ జ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు మారాడనుకున్నామని, అయితే ఆయన ఏమాత్రం మారలేదని రుజువైందన్నారు. దీనికి పర్యవసానం అనుభవించక తప్పదని హెచ్చరించారు. అరెస్టులకు భయపడేది లేదని, జిల్లాల్లో నిరసన ఉద్యమాన్ని కొనసాగించాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. పోలీసుల లాఠీలు, అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈమేరకు మూడు యూనియన్ల నేతలు సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు.‘సాక్షి’ కెమెరా లాక్కున్న పోలీసులుచంద్రబాబు సర్కారు ఆదేశాలతో స్వామి భక్తి ప్రదర్శించిన పోలీసులు రెచ్చిపోయి అంగన్వాడీ మహిళలను అరెస్టు చేస్తున్న దృశ్యాలను ఎవరూ చిత్రీకరించకుండా జాగ్రత్త పడ్డారు. అంగన్వాడీల వద్ద సెల్ఫోన్లు లాక్కున్నారు. పోలీసుల దమనకాండను చిత్రీకరిస్తున్న ‘సాక్షి’ కెమెరామెన్ను దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించి కెమెరా గుంజుకున్నారు. -
‘రాష్ట్ర ప్రభుత్వమే నేరాల్ని ప్రోత్సహిస్తుంది’
ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వమే నేరాల్ని ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు. మంగళవారం బుగ్గన.. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సంస్కృతులను తెచ్చారు. జోగి రమేష్ ఇంటిపై దాడి వీడియోలు చూస్తే అర్ధమవుతుంది. దాడి చేస్తున్న వారికి పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారు. పెట్రోల్, యాసిడ్ బాంబులతో దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు. అధికారపార్టీ తరపున మహిళలు కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ దాడులు చేయడం ఎప్పుడైనా చూశామా?దాడులను మహిళలు లీడ్ చేయడం ఓ కొత్త రకం సాంప్రదాయం. ఎవరో ఒకరు వెనుక ఉండి కోచింగ్ ఇస్తే తప్ప మహిళలు ఇలా చేయరు. నిజంగా పొరపాటు జరిగితే చర్యలు తీసుకోవడానికి కోర్టులు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు మీరు ఏం నేర్పిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కేసు లేకపోయినా కేసును ...ఆధారాలను సృష్టిస్తున్నారు.ఈ సంస్కృతి ఇక్కడితో ఆగిపోతుందా .. అసలు రాష్ట్రాన్ని ఎటు వైపు తీసుకు వెళ్తున్నారు. మీరు చెప్పుకునే దశాబ్ధాల రాజకీయం దేనికి ఉపయోగపడుతుంది.దాడులు చేసిన వారి పై ఏం చర్యలు తీసుకున్నారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కానీ మీరేం చేశారు..అంబటి పై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితుల పై కేసులు పెట్టడమేంటి. ఎవరూ ఏమీ చూడటం లేదని మీరు అనుకుంటున్నారు ...కానీ ప్రజలు అంతా గమనిస్తున్నారు. మీ అనుభవాన్ని మంచి కోసం ఉపయోగించండి తప్పుడు కేసుల కోసం కాదు’ అని సూచించారు. -
బాబుకు అంగన్వాడీలు వార్నింగ్.. వాష్ రూమ్ కి వెళ్తామన్నా విడిచిపెట్టకుండా..
-
టెంట్లు పీకేసి, కుర్చీలు విరగొట్టి.. అంగన్వాడీలను ఈడ్చుకెళ్లిన పోలీసులు
-
విశాఖ తీర రక్షణకు తూట్లు!
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘమైన తీరప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం పగబట్టింది. అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు అభివృద్ధి పేరుతో తీరాన్ని విచ్చిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను సడలించడం, జోన్లు మార్చడం వంటి చర్యలతో తీరప్రాంత సమతుల్యతను దెబ్బతీస్తోంది. పర్యాటక ముసుగులో న్యాయస్థానాల హెచ్చరికల్ని కూడా బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన వారికి ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతోంది. గతంలో పర్యావరణవేత్తలు, ప్రజలు పోరాడి కాపాడుకున్న తీరప్రాంతాలను ఇప్పుడు కమర్షియల్ హబ్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నగరంలోని సాగరతీర ప్రాంతాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరితో ఉందో అర్థమవుతోంది. తన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్ల కోసం పర్యావరణ అనుమతులను సైతం వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలను పక్కనపెట్టి అడ్జస్ట్మెంట్లతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. భీమిలి తీరంలో సీఆర్జెడ్ మాయాజాలం విశాఖ–భీమిలి తీరప్రాంతంలో సీఆర్జెడ్ జోన్ల మారి్పడి (రీక్లాసిఫికేషన్)పై చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం.. సీఆర్జెడ్–3 కేటగిరీలో ఉన్న ప్రాంతాలు తక్కువ నిర్మాణాలు కలిగి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. సముద్రమట్టం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక్కడి ఇసుకదిబ్బలు, చిత్తడినేలలు వంటివి అలల తాకిడిని, తుపాన్లను అడ్డుకునే సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. సీఆర్జెడ్–2 కేటగిరీలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో భారీ కాంక్రీట్ కట్టడాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవచ్చు.విశాఖ–భీమిలి బీచ్ వెంబడి సీఆర్జెడ్–3 పరిధిలో 500 ఎకరాలకుపైగా భూములున్నాయి. వీటిలో భారీ కాంక్రీట్ నిర్మాణాలకు వీలులేదు. ఇప్పుడు ఈ భూముల్ని సీఆర్జెడ్–2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. ఈ భూముల్లో మెజారిటీ వాటా ప్రభుత్వ నేతలదే కావడంతో.. మార్పిడి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విశాఖని గ్లోబల్ సిటీగా మారుస్తామనే సాకుతో తీరప్రాంత మాస్టర్ప్లాన్పై సమీక్షలు మొదలుపెట్టారు. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య మాస్టర్ప్లాన్ సవరణల పేరుతో అంతర్గత కసరత్తు జరిగింది. ఆ సమయంలోనే సీఆర్జెడ్–3లోని భూముల్ని సీఆర్జెడ్–2 కిందకు చేర్చి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి మార్పులు చేసెయ్యాలని ప్రభుత్వం ఆరాటపడిపోతోంది. పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అన్న మంత్రి దుర్గేష్ నిబంధనల్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు అభివృద్ధికి అవే అడ్డంకి అనటం ఆందోళన కలిగిస్తోంది. పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అంటూ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కూడా అసెంబ్లీలో నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి కోసం కాకుండా.. బీచ్రోడ్డుని సీఆర్జెడ్–2లోకి తీసుకురావాలని కోరారు. పర్యావరణ కంటే.. ప్రాఫిట్ ముఖ్యంవీటిని పరిశీలిస్తే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కంటే ప్రాఫిట్కే పెద్దపీట వేస్తోందని స్పష్టమవుతోంది. ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటే.. నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. తీరంలో ఇసుక దిబ్బలు, ఖాళీ ప్రదేశాలు సహజ సిద్ధమైన బఫర్ జోన్లుగా పనిచేసి ఉప్పెనలు, తుపాన్ల తీవ్రతను తగ్గిస్తాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వాణిజ్య విస్తరణకు తెరతీస్తే.. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు విశాఖను బలి చేయడమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ విధ్వంసాన్ని మాత్రమే కోరుకుంటోంది తప్ప.. అభివృద్ధిని కాదంటూ పర్యావరణవేత్తలు, కూటమి పారీ్టల ప్రతినిధులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆత్మహత్యా సదృశ్యమే.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఓవైపు గ్రేట్ గ్రీన్వాల్ వంటి కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు పర్యాటకశాఖ దానికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం. కేవలం రూ.4,098 కోట్ల పెట్టుబడులు, 2,800 హోటల్ గదులు వంటి తాత్కాలిక ఆరి్థక ప్రయోజనాల కోసం, శాశ్వత పర్యావరణ రక్షణ కవచాలైన సీఆర్జెడ్–3 నిబంధనలను సడలించి తీరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చాలని చూడటం ఆత్మహత్యా సదృశ్యమే. ఇప్పటికే జీవీఎంసీ, ఏపీపీసీబీ పర్యవేక్షణ లోపంతో సముద్రజలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పుడు అదనపు కట్టడాలకు అనుమతినిస్తే విశాఖ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అభివృద్ధి అంటే ప్రకృతిని ధ్వంసం చేయడంకాదు, భావితరాలకు సురక్షితమైన తీరాన్ని అందించడమే. ప్రభుత్వం సీఆర్జెడ్ పునర్వర్గీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. – బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన ప్రతినిధి, పర్యావరణవేత్త తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది విశాఖపట్నం తీరప్రాంతంలో సీఆర్జెడ్–3 నిబంధనలను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండటం గర్హనీయం. కేవలం పర్యాటక అభివృద్ధి, వాణిజ్య విస్తరణ పేరుతో చేస్తున్న ఈ మార్పువల్ల సాగరతీరంలోని ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు వంటి సహజ రక్షణ కవచాలు ధ్వంసమైపోతాయి. భవిష్యత్తులో తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది. ప్రభుత్వం తాత్కాలిక లాభాల కోసం మత్స్యకారుల జీవనోపాధిని పణంగా పెడుతోంది. ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న విశాఖకు ఇది మరో పెద్దదెబ్బ. చట్టబద్ధమైన పర్యావరణ రక్షణలను అడ్డంకులుగా చూడటం బాధ్యతారాహిత్యం. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందే. – వై.రాజే‹Ù, వీఎస్ కృష్ణ, మానవహక్కుల ఫోరం ప్రతినిధులు -
రూ.6,000 కోట్లు ఔట్.. ‘పారి’.. శ్రమ!
సాక్షి, అమరావతి: ‘‘మీ కప్పాలు కట్టలేం.. మీ బెదిరింపులు భరించలేం.. మీ భూములు వద్దు.. మీకో దండం..!’’ అంటూ పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలేసి పారిపోతున్నాయి! రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని తీసుకోకుండా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ముఖంమీదే విసిరి కొట్టి పారిశ్రామికవేత్తలు పరుగులు తీస్తున్నారు! చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వెనక్కి ఇచ్చేసి వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తోందో ఊహించవచ్చని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాజాగా పలు కంపెనీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు ఇచ్చిన జీవోలే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరిన హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి టీడీపీ కూటమి సర్కారు వచ్చాక ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన అజాద్ ఇండియా మొబిలిటీ, జ్యూపిటర్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్, జిన్ఫ్రా ప్రెసిషన్స్ వరకు ఒకేసారి నాలుగు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో మన రాష్ట్రం ఏకంగా రూ.6,096 కోట్ల విలువైన పెట్టుబడులను కోల్పోయిందని స్పష్టం చేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరిట పారిశ్రామికవేత్తలను బెదిరించడం.. తాము చెప్పినంత కప్పం కట్టకుంటే యూనిట్లను పనిచేయనివ్వకుండా అడ్డుకుంటూ ఏపీ అంటేనే భయపడే పరిస్థితిని కల్పించారని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వస్తూనే రెడ్బుక్ రాజ్యాంగానికి పని కల్పిస్తూ పారిశ్రామికవేత్తలపై తప్పుడు కేసులు, కథనాలు ప్రచురిస్తూ జిందాల్, అదానీలపై తమ అనుకూల పత్రికలు, ఎల్లో మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం కథనాలను ప్రచారం చేసిందని గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూపు నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణ పనులను తమకు కమీషన్లు ఇవ్వకుండా ఎలా మొదలు పెడతారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు సంస్థ కార్యాలయంపై రాళ్ల దాడి చేసి యంత్ర సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు సిబ్బందిని గాయపర్చారు. ఇక అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతలు ఎంతగా బరితెగించారో వేరే చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా లాంటి కంపెనీలైతే కూటమి నేతల వసూళ్లపై నేరుగా కేంద్రానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోందని పారిశ్రామిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ‘సీమ’ దాకా సేమ్ సీన్..శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు బృందం యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ యాజమాన్యాన్ని ఒక్కో లారీకి రూ.వెయ్యి చొప్పున నెలకు సుమారు రూ.1.50 కోట్లు కప్పం కట్టాలని డిమాండ్ చేసింది. అనకాపల్లి జిల్లాలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మామూళ్లు ఇవ్వాలని బెదిరింపులకు దిగడంతో కోకోకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో సిమెంట్ కంపెనీలు మామూళ్లు, వాటాలు ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యేలు ముడిసరుకు రవాణా, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తరలించే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బహిరంగా బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. ఆరీ్టపీఎస్ బూడిద తరలింపు కాంట్రాక్టు తమకు కావాలంటే తమకు కావాలంటూ కొట్టుకోవడంతో ఈ పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై అదేపార్టీకి చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో ఇండియా సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు బీజేపీకి చెందిన ఎంపీ అదే పారీ్టకి చెందిన ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు చేశారంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. బైబై చెప్పేసిన కోకోకోలా.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద రూ.1,200 కోట్లతో శీతల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటుకు హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ 2023 మే 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గత ప్రభుత్వం దీన్ని పరిశీలించి 50.04 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు పలు రాయితీలను ప్రకటిస్తూ 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం కూటమి నేతల కప్పాల వసూళ్లతో జంకిన కోకోకోలా పెట్టుబడుల ప్రతిపాదనను ఉపసంహరించుకొని తెలంగాణకు తరలిపోయింది. తమకు కేటాయించిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని, తమ కంపెనీ పేరిట భూ సమీకరణ చేయవద్దని మొర పెట్టుకుంటూ కోకోకోలా కంపెనీ లేఖ రాసింది. 2026 ఫిబ్రవరి 27న కోకోకోలాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. తొలి ఒప్పందానికే దిక్కులేదు.. బాబు సర్కారు అధికారం చేపట్టిన తరువాత 2024 నవంబర్ 19న పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తొలి సమావేశం జరిగింది. రూ.85,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటిలో ఒక్క ఎలీజీ ఎల్రక్టానిక్స్ మినహా మరే ప్రాజెక్టు ఇంతవరకు పట్టాలు ఎక్కకపోగా ఆమోదం పొందిన ప్రతిపాదనలు సైతం వెనక్కి వెళ్లిపోయాయి. వడ్డీతో సహా ‘ఆజాద్’ వసూలు..! శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లి వద్ద ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.1,046 కోట్ల పెట్టుబడితో 2,381 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. కానీ ఇప్పుడు ఆజాద్ మొబిలిటీ పెట్టుబడుల ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోవడమే కాకుండా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో 2026 ఫిబ్రవరి 18న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈఎండీ కింద అజాద్ మొబిలిటీ చెల్లించిన రూ.2.51 కోట్లు 2024 ఆగస్టు 30 నుంచి వడ్డీతో సహా చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది.జిన్ఫ్రా.. పరుగో పరుగు! రాష్ట్రంలో రూ.1,150 కోట్లతో 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్లో ఉపయోగించే బైమాడ్యులర్ చార్జ్ సిస్టమ్స్తో పాటు ట్రిపుల్ బేస్ ప్రొపెలెంట్, సింగిల్ బేస్ ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ జిన్ఫ్రా ప్రెసిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదన సమర్పించింది. ఎస్ఐపీబీ 7వ సమావేశంలో కూటమి సర్కారు దీన్ని ఆమోదించింది. అనంతపురం జిల్లా తమ్మి సముద్రంలో ఎకరా రూ.8.3 లక్షలు చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ 2025 జూన్ 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు ఈ కంపెనీ రాష్ట్రంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగంతో బెంబేలెత్తి వెనక్కి వెళ్లిపోయింది. తమకు కేటాయించిన భూములను రద్దు చేయాలంటూ లేఖ రాసింది. దీంతో జిన్ఫ్రాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ 2026 ఫిబ్రవరి 27న పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. కంపెనీ విజ్ఞప్తి మేరకు భూ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాల్కో మిథాని యూనిట్ ప్యాకప్...!కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ రాష్ట్రానికి కొత్త పీఎస్యూ ప్రాజెక్టులను తేకపోగా గతంలో ఏపీకి వచ్చిన వాటిని కూడా చంద్రబాబు సర్కారు వెళ్లగొడుతోంది. రెండు కేంద్ర ప్రభుత్వ రంగ కీలక సంస్థలు నాల్కో, మిథాని కలిసి నెల్లూరు జిల్లాలో రూ.5,500 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ నెలకొల్పేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గత ప్రభుత్వంలో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నాల్కో ప్రకటించింది. 2024–25 వార్షిక నివేదికలో ఈ ప్రాజెక్టు గురించి నాల్కో స్పష్టంగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీ కూటమి పెద్దలు దీనిపై కనీసం స్పందించకపోవడం పట్ల అధికారులు విస్తుపోతున్నారు. ప్రైవేటు కంపెనీలకు సొంత ఇనుప గనులను కేటాయించేందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్న రాష్ట్ర మంతులు కీలకమైన కేంద్ర ప్రాజెక్టు ఏపీ నుంచి వెనక్కు వెళ్లిపోతున్నా పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జారుకున్న ‘జూపిటర్..’ అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,700 కోట్ల పెట్టుబడితో 2,216 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనకు ఎస్ఐపీబీ 6వ సమావేశంలో ఆమోదం లభించింది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు 142 ఎకరాలను కేటాయిస్తూ 2025 మే 23న జీవో ఎంఎస్ నెంబర్ 85 జారీ అయింది. ఎకరం కేవలం రూ.50 లక్షల చొప్పున రాయితీ ధరకు భూమిని కేటాయించారు. కానీ ఏడాది తిరగకుండా ఆ భూములు తమకొద్దని.. రూపాయి కూడా చెల్లించేది లేదని జూపిటర్ కుండబద్ధలు కొట్టింది. తమ పేరు మీద భూ కేటాయింపులను రద్దు చేయాలని కోరింది. దీంతో జూపిటర్కు కేటాయించిన 142 ఎకరాలను రద్దు చేస్తూ ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. -
నిర్బంధాల కంచె దాటి.. అంగన్వాడీ ఉద్యమవేడి
పోలీసులను ప్రయోగించి అంగన్వాడీ యూనియన్ నేతలను చంద్రబాబు ప్రభుత్వం గృహాల్లోనే నిర్బంధించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను పిలిచి మరీ విజయవాడ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ‘ఎక్కువ మంది వెళ్తే ఊరుకునేది లేదు.. తప్పదనుకుంటే నలుగురైదుగురు వెళ్లండి’ అంటూ ఐసీడీఎస్ అధికారులు ఆంక్షలు పెట్టారు. అయినా నిర్బంధాల కంచెను పెకలించుకుని అంగన్వాడీలు పోరుబాట పట్టి.. న్యాయం కోసం నినాదాల పొలికేక పెట్టారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా చంటి బిడ్డలను చంకనెత్తుకుని కొందరు.. చేతి సంచిలో అన్నం క్యారేజీలు పెట్టుకుని మరికొందరు విజయవాడ తరలివచ్చి నిరసన గళమెత్తారు. సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఉద్యమంతో బెజవాడ మరోసారి ఎరుపెక్కింది. ఆంక్షల కంచెను పెకలించుకుని.. మండేఎండను సైతం లెక్కచేయక కదం తొక్కి మరీ ఉద్యమ వేడిని రగిలించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ సంఘాల చలో విజయవాడ పిలుపునందుకుని సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు నగరానికి ఉవ్వెత్తున తరలివచ్చారు. అంతా విజయవాడ ధర్నా చౌక్కు చేరుకుని ‘ధర్నా’గ్రహానికి దిగారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తరలివచ్చిన అంగన్వాడీలతో ఐలాపురం జంక్షన్, రైల్వేస్టేషన్, బస్టాండ్, బందర్ రోడ్, ఏలూరు రోడ్ వంటి ప్రధాన రహదారులు కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గం ధర్నా చౌక్లో ఆందోళన సందర్భంగా జరిగిన సభలో మూడు యూనియన్ల ముఖ్య నాయకులు కె.సుబ్బరావమ్మ, బేబీరాణి, ఎన్సీహెచ్ సుప్రజ, జె.లలిత, వీఆర్ జ్యోతి తదితరులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు, ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఆందోళన విరమించేది లేదని అల్టీమేటం ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మీక సంఘాలు అంగన్వాడీల పోరాటానికి సంఘీభావం ప్రకటించాయి. కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లను తాత్కాలిక జైళ్లుగా మార్చేసి.. ఒకవైపు అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నామని మంత్రులతో ప్రకటనలు చేయించిన చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు అంగన్వాడీల ఆందోళనను విఫలం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డింది. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు(హౌస్ అరెస్టుల)తో తీవ్రమైన ఆంక్షలు పెట్టింది.విజయవాడలో అంగన్వాడీలు అడుగుపెట్టకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డులో వేలాది మందిని అదుపులోకి తీసుకుని కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లలో నిర్బంధించి వాటిని తాత్కాలిక జైళ్లుగా మార్చేశారు. ఇబ్రహీంపట్నం, గన్నవరం, పెనమలూరు పరిసరాల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ తదితర ప్రాంతాల్లో యూనియన్ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఛలో విజయవాడకు బయలుదేరుతున్న వారిని రైల్వే స్టేషన్లలోనే నిలిపివేశారు.విశాఖలోని పలు ప్రాంతాల నుండి బయలుదేరుతున్న కార్యకర్తలను, సీఐటీయూ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశి్చమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు వంటి ప్రాంతాల్లో రైళ్లలో విజయవాడకు వస్తున్న వారిని రైల్వే స్టేషన్లలోనే అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోనూ పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు వచ్చే వారిపై ఎక్కడికక్కడ పోలీస్ నిఘా పెట్టారు. శ్రీకాకుళంలో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుంచి విజయవాడ వచ్చే ప్రధాన రహదారులపై పోలీసులు తనిఖీలు చేపట్టి పలువురు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులు సైతం ఇచ్చారు. అనేక జిల్లాల్లో చెక్పోస్టులు పెట్టి తనిఖీలు చేసి అడ్డుకోవడం గమనార్హం. ఎలాంటి ఆంక్షలు విధించినా.. భారీ సంఖ్యలో అంగన్వాడీలు చేరుకోవడంతో చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ధర్నా చౌక్లోనే వంటా వార్పు.. రోడ్డుపైనే నిద్ర చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోడంతో సోమవారం రాత్రి కూడా అంగన్వాడీలు నిరసన కొనసాగించారు. ధర్నా చౌక్లోనే వంటా వార్పు చేపట్టి రోడ్లపైనే భోజనాలు చేశారు. అక్కడే నిద్రించి నిరసన తీవ్రతను చూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం దాదాపు 20 నెలలపాటు ఎదురు చూశామని, ఇకపై ఓర్పు వహించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మంగళవారం నాటికి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, అసెంబ్లీ సమావేశాలు ముగిసే నాటికి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం నెలకు రూ.32 వేలు ఇవ్వాల్సి ఉన్నా.. కనీసం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. వేతనం పెంపుతోపాటు మిగిలిన డిమాండ్స్ కూడా అమలు చేయకపోతే ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ఉద్యమాన్ని చేపడతామని, రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని మూడు యూనియన్ల నేతలు హెచ్చరించారు.కీలక డిమాండ్లు ఇవీ..అంగన్వాడీలు ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు ఉంచారు. వేతనాల పెంపుపై ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ సౌకర్యం కలి్పంచాలి. యాప్ల ద్వారా ఆన్లైన్ పని భారాన్ని తగ్గించి, రిజిస్టర్ల నిర్వహణను సరళతరం చేయాలి. పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలను పెంచాలి. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నందున అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. -
Sunil Naik : లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి బీహార్ ఝలక్
-
నువ్ మనిషివే కాదు.. ఒక నీచమైన.. నిన్ను తిట్టడానికి నా దగ్గర మాటలు కూడా లేవు
-
రాష్టంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే.. నోటీసిలిచ్చుకుంటూ ఉంటారా..
-
జనం చనిపోతుంటే.. డ్యాన్స్ లు, ఆటలు కావాలా మీకు
-
ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి..? కల్తీ పాలు, కలుషిత నీటిపై జగన్ ఫైర్
-
బాబు సర్కార్ కు బీహార్ సర్కార్ షాక్
-
కొవ్వు ఆరోపణలు.. చర్చ అంటే కూటమిలో వణుకు
-
ఎలా ముంచావో అందరికి తెలుసు.. హేరిటేజ్ బాగోతాన్ని బయటపెట్టిన లక్ష్మి పార్వతి


