breaking news
Chittoor District Latest News
-
ప్రతి కుటుంబంలో సంక్రాంతులు నిండాలి
చిత్తూరు కలెక్టరేట్ : సంక్రాంతి పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి కుటుంబంలో సంతోషం నింపే పండుగ సంక్రాంతి అని అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 19 నుంచి డీఈడీ తృతీయ సెమిస్టర్ పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి డీఈడీ తృతీయ సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపడుతున్నారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు సంబంధిత పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. జనగణనకు సన్నాహక చర్యలు చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అనుసరించి జిల్లాలో జనగణన 2027లో చేపట్టేందుకు అధికారులు సన్నాహక చర్యలు ప్రారంభించారు. జిల్లాలో జనగణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. జనాభాను క్రమపద్ధతిలో లెక్కించి, ప్రతి పౌరిడి సమగ్ర సమాచారాన్ని సేకరించి నమోదు చేసేందుకు జనగణనకు పరిధుల నిర్ణయం, అధికారులకు విధుల కేటాయింపు ప్రక్రియను త్వరలో పూర్తి చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో చార్జి సెన్సస్ అధికారులుగా మున్సిపల్ కమిషనర్లను, గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్లను నియమించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 21న ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్, 23న ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు నిర్దేశించిన సమయం కంటే అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 19 నుంచి దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ చిత్తూరు కలెక్టరేట్ : దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సైన్స్ ఫెయిర్కు రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇందులో చిత్తూరు జిల్లాలోని రామకుప్పం జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న జుల్ఫా అనే విద్యార్థిని, రోజారాణి గైడ్ టీచర్ రూపొందించిన సైన్స్ ప్రాజెక్టుతో దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ లో పాల్గొననున్నారు. ఆన్లైన్ కోర్సులు పూర్తిచేయాలి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు ఆన్లైన్ కోర్సులను కచ్చితంగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు నిషిత ఎఫ్ఎల్ఎన్, నిషిత ఈసీసీఈ (నిషిత 4.0) ఆన్లైన్ కోర్సులను తప్పనిసరిగా పూర్తిచేయాలన్నారు. సంవత్సరానికి 50 గంటల నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి ఆన్లైన్ కోర్సుల పూర్తికి టార్గెట్ విధించారు. కోర్సును గత ఏడాది డిసెంబర్ 3న ప్రారంభించారు. కోర్సు ఈ ఏడాది మార్చి 10వ తేదీన ముగుస్తుందన్నారు. కోర్సుల్లో నమోదు, పూర్తి చేసుకోవడం పై అమలు చేయాల్సిన మార్గదర్శకాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపారు. ఫేషియల్ అటెండెన్స్తోనే వేతనాలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ స్టడీ లీవ్లో బీఈడీ, బీపీఈడీ కోర్సులు చేస్తున్న టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్ కచ్చితత్వం చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వులను పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇకపై స్టడీ లీవ్లో ఉంటూ కోర్సులు చేస్తున్న టీచర్లు కచ్చితంగా ఫేషియల్ అటెండెన్స్ వేస్తేనే వేతనాలు మంజూరు చేయనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
కుప్పం రూరల్: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కుప్పం – మల్లానూరు రైల్వే స్టేషన్ల మధ్య గోపనపల్లి వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రమేష్ కథనం.. కుప్పం మండలం, గోపనపల్లి గ్రామానికి చెందిన లోకనాథన్ (49) మంగళవారం రాత్రి గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కాగా లోకనాథన్ మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కానిస్టేబుల్ రమేష్ తెలిపారు. ప్రమాదంలో భార్య మృతి భర్త పరిస్థితి విషమం తవణంపల్లె: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో భార్య మృతిచెందగా.. భర్త పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన మండలంలోని తెల్లగుండ్లపల్లె బ్రిడ్జి కింద తిరుపతి– బెంగళూరు హైవే సర్వీస్ రోడ్డులో చోటుచేసుకుంది. తవణంపల్లె ఎస్ఐ డాక్టర్ నాయక్ కథనం.. మండలంలోని కర్నంవాండ్లవూరుకు చెందిన కె.మురగయ్య(66), భార్య కె.బుజ్జమ్మ(45) మోటారు సైకిల్ టీవీఎస్ సూపర్ ఎక్స్ల్(ఎపి 03 బిబి 5464)లో సొంత పనిపై చిత్తూరు వెళ్తూ తిరుపతి– బెంగళూరు హైవే సర్వీస్ రోడ్డును దాటుతున్నారు. ఇంతలో తెల్లగుండ్లపల్లె దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య బుజ్జమ్మ తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త మురగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. బుజ్జమ్మ మృతదేహాన్ని శవపరీక్ష కోసం చిత్తూరు ప్రధాన ఆస్పత్రికి తరలించి, మృతురాలు అల్లుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. గుర్తు తెలియన వాహనాన్ని పట్టుకోవడానికి సీసీ కెమెరాల ఫుటేజీలని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
భోగి మంటల్లో పీపీపీ జీఓ కాపీల దహనం
చిత్తూరు కార్పొరేషన్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీఓ కాపీల జిరాక్స్లను భోగిమంటల్లో వేసి వైఎస్సార్సీపీ నాయకులు నిరసన తెలిపారు. బుధవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. బోగి మంటల చుట్టూ గొబ్బెమ్మలతో మహిళ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు పీపీపీ పేరుతో దోచుకో.. బినామీలకు పంచుకో.. జనాన్ని పిండుకో బాబు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు రూ.1,750 కోట్లు వెచ్చిస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అదే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.1,500 కోట్లు లేవా..? అని ప్రశ్నించారు. కేవలం మాజీ సీఎం జగనన్నకు మంచి పేరు వస్తుందని భావించి కళాశాలల ప్రైవేటీకరణకు పూనుకోవడం బాధాకరమన్నారు. పేద బిడ్డలను వైద్య విద్యకు దూరంగా చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. అందని ద్రాక్షగా ఉన్న వైద్యవిద్యను అందరికీ అందించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 70 శాతం వరకు వైద్య కళాశాలలను నిర్మించిందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే వాటిని ప్రైవేటుపరం చేసి తమ వక్రబుద్ధిని చూపించిందన్నారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేశారని గుర్తుచేశారు. సర్పంచ్లు రజనీకాంత్, మధుసూదన్రాయల్ మాట్లాడుతూ ఉచితంగా విద్య, వైద్యాన్ని అందించాల్సిన ప్రభుత్వం వాటిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూస్తోందన్నారు. రాబోయే రోజుల్లో విద్య సైతం పూర్తి స్థాయిలో ప్రైవేటుపరం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. బినామీలకు కట్టబెట్టడానికే పీపీపీ విధానం ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో నాయకులు సూర్యప్రతాప్రెడ్డి, హరీషారెడ్డి, అంజలిరెడ్డి, గిరిధర్రెడ్డి, మధురెడ్డి, అమర్నాథరెడ్డి, మనోజ్రెడ్డి, కౌసర్, బిందు, శాంతి, ప్రతిమారెడ్డి, వెంకటేష్, నౌషద్, నవాజ్, నూతన్ప్రసాద్, సెల్వ, సోము, నాగేంద్ర పాల్గొన్నారు. -
వదల బొమ్మాళి!
పలమనేరు: పలమనేరు నియోజకవర్గంలో వరుసగా టీడీపీ నేతల ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తూ భారీ చోరీలకు పాల్పడుతున్నారు. వీరంతా కోస్తా ప్రాంతానికి చెందిన వారే. రెక్కీ నిర్వహించడం, ఆపై ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి డబ్బు, బంగారంతోపాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం అలవాటుగా చేసుకున్నారు. వీరు టీడీపీ నేతల ఇళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ విషయం పోలీసులకు సైతం అంతుపట్టడం లేదని సమాచారం. ఇప్పటిదాకా చోరీలు ఇలా.. బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుత జిల్లా నాయకురాలైన మండలంలోని కొలమాసనపల్లికి చెందిన ముంజులారెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. దీన్ని ఏదో సాధారణ దొంగల చోరీనేనని అందరూ అనుకున్నారు. ఆపై గతేడాది జూలై 15న పలమనేరు పట్టణంలోని టీడీపీ సీనియర్ నేత ఆర్వీ బాలాజీ ఇంట్లో 210 గ్రాముల బంగారం చోరీ జరిగింది. అప్పట్లో ఇదో సంచలనంగా మారింది. ఇలా ఉండగా రూరల్ మండలం, సాకేవూరు గ్రామానికి చెందిన రామూర్తి నాయుడు పట్టణంలోని రాధాబంగ్లాలో నివాసముండే ఇంట్లో గత ఆగస్టు 30న చోరీ జరిగింది. ఇందులో 540 గ్రాముల బంగారు, 336 గ్రాముల వెండితో కలిపి రూ.40 లక్షల భారీ చోరీ జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు రామూర్తి నాయుడి కేసులో తూర్పు గోదావరికి చెందిన అడపాల శివను గతంలో అరెస్ట్ చేశారు. ఇక బాలాజీ కేసులో గుంటూరు జిల్లా, పల్నాడుకు చెందిన రాయపాటి వెంకయ్యను ఇటీవలే అరెస్ట్ చేశారు. ఏఎంసీ చైర్మన్ ఇంట్లో.. ఇటీవల పెను రాజకీయాల మధ్య పలమనేరు ఏఎంసీ చైర్మన్గా రాజన్న ఎంపికయ్యారు. గంగవరం మండలం, ఆలకుప్పంలోని ఆయన నివాసంలో రెండ్రోజుల క్రితం దొంగలు పట్టపగలే సీసీ కెమెరాలను ధ్వంసం చేరి చోరీ చేశారు. ఇంట్లో రూ.12లక్షల విలుజేసే బంగారు, వెండిని దోచుకెళ్లారు. ఇవన్నీ కోస్తా దొంగల పనేనా? ఈ చోరీల్లో ఇప్పటి దాకా పోలీసులు పట్టుకున్న దొంగలు కోస్తా జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. తాజాగా రాజన్న ఇంట్లో చోరీ చేసిన దొంగలు సైతం గుంటూరు జిల్లాకు చెందిన ఆరితేరిన దొంగల ద్వారానే ఇక్కడ రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. దీంతోనే కావాలని అక్కడి దొంగలు పలమనేరు నియోజకవర్గంలోని టీడీపీ బడా నేతల ఇళ్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో..! మరోవైపు పట్టణంలోని ముగ్గురు టీడీపీ నేతలు, బైరెడ్డిపల్లి మండలానికి చెందిన ఇరువురు, వీకోటకు చెందిన ఇరువురు ఇళ్లల్లోనూ చోరీలు జరిగే అవకాశం ఉందనే చర్చ ఆ పార్టీ నేతల్లో నిద్ర లేకుండా చేస్తోంది. ఇలా ఉండగా కేవలం కోస్తా జిల్లాలకు చెందిన దొంగలు ఎందుకు ఈ ప్రాంతంలోని టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారనే విషయంపై పోలీసులకు సైతం అంతుపట్టడం లేదు. -
● అప్పుడు పెద్దపండగ వస్తా ఉండాదంటే బ్యాంకులో దుడ్డు పడేది ● ఊర్లో ప్రతి రైతు మొహంలో సంతోషం కనిపించేది ● మెడికల్ కాలేజీలకు డబ్బుల్లేవని ప్రైవేటుకా? ● ఎన్టీఆర్ బొమ్మకు రూ.1,700 కోట్లా? ● ఏం బాగలేదునా.. ఊర్లో కళ తప్పినాది ● సంక్రాతి నేపథ్యంలో సొంతూరికి వచ్
గుడిపాల మండలం, నంగమంగళం గ్రామంలో.. గ్రామస్తుల మాట–మంతి ‘అవునా, ఇపుడు ప్రజలకు ఏది అవసరమో దాన్ని ప్రైవేటు చేసేస్తా ఉండారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే ప్రైవేటుకు ఇస్తామంటా ఉండారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అంటారు.. కానీ ఎన్టీఆర్ బొమ్మ పెట్టేదానికి రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. పేదలు డాక్టర్లయ్యేదానికి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను మెయింటెన్ చేయరనా..? విడ్డూరంగా ఉండాది. రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా కోవిడ్ సమయంలో జగన్ అందించిన సేవలు బతికున్నంత వరకు మర్చిపోలేమునా. కానీ దాన్ని చెప్పుకునేదాంట్లో ఆయన ఇంట్రెస్ట్ చూపీలేదు. ఇపుడు ఏమీ చేయకపోయినా పబ్లిసిటీకి మాత్రం రూ.కోట్టు ఖర్చు పెడతా ఉండారు.’ – శ్రీనివాసులు, వ్యాపారం, హైదరాబాద్. ‘నువ్వు చెప్పేది నిజమే శీనా, ఇంతకుముందు పతీ నెలా పదో తేదీలోపు వ్యాను (104)వచ్చేది. ఇక్కడే పరీక్షలు చేసి.. బీపీ, షుగర్తో పాటు ఏ ఇబ్బంది ఉన్నా మందులు ఇచ్చేవాళ్లు. ఇప్పుడా ఊసేలేదు. పీహెచ్సీలో మందులు ఉండవు. ఇంతకుముందు ఇచ్చిన పట్టా పాసుపుస్తకమే మళ్లీ ఇస్తా ఉండారు. దానికి రూ.వెయ్యి ఇవ్వాలి. సచివాలయాల్లో ప్రజలకు కావాల్సిన సేవలు ఏదీ అందేదిలేదు. అడిగితే సర్వే డ్యూటీకి వెళతా ఉండాము అని చెబుతున్నారు. ఏది కావాలన్నా ఆరు కి.మీ దూరం ఉన్న మండలాఫీసుకు పోవాల్సిందే.’ – కలై అరసి, మాజీ ఎంపీటీసీ -
సంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి
వి.కోట: తెలుగువారి సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా సంక్రాతి పండుగ నిలుస్తుందని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మండలంలోని తన స్వగ్రామమైన కొత్తూరులో భోగి మంటలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భోగి, సంక్రాంతి పండుగలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి జెడ్పీ చైర్మన్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. జెడ్పీ చైర్మన్ సతీమణి భాగ్యమ్మ, తనయులు నరేంద్ర, అమరనాథ్ పాల్గొన్నారు. -
సబ్సిడీలో ఈ–సైకిళ్లు
చిత్తూరు అర్బన్: మహిళా సంఘాలు, నగర ప్రజలకు సబ్సిడీతో ఈ–సైకిళ్లను (బ్యాటరీ సైకిళ్లు) ఇవ్వనున్నట్లు చిత్తూరు పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) సీఎంఎం గోపి తెలిపారు. ఈ–కామర్స్ ప్లాట్ఫామ్స్పై రూ.36 వేలు ఉన్న సైకిల్ను కలెక్టర్ చొరవతో ప్రజలకు రూ.24 వేలకే అందిచనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలో 800 మంది సైకిళ్ల కోసం నగదు చెల్లించి, బుకింగ్స్ చేసుకున్నారని తెలిపారు. ముందుగా బుకింగ్ చేసుకున్న వాళ్లకు రూ.7 వేల విలువచేసే యాక్ససరీస్ ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపారు. రూ.5 వేలు డౌన్పేమెంట్ చెల్లించి సైకిల్ తీసుకోవచ్చన్నారు. ఆసక్తి గల వారు చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మెప్మా విభాగంలో సంప్రదించాలన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రతులతోనే భోగి మంటలు
నగరి : ప్రజలకు భోగి భాగ్యాలను నింపాలని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆకాంక్షించారు. బుధవారం నగరిలోని తన నివాసంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి భోగి సంబరాలు జరుపుకున్నారు. భోగి మంటల చుట్టూ కుటుంబ సభ్యులతో కలిసి భోగి పాటలతో నృత్యాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సమయంలో కుటుంబ సభ్యులతో పంచుకుంటే మరింత ఆనందంగా ఉంటుందని, ఆయుష్షు కూడా పెరుగుతుందన్నారు. బంధువుల మధ్య బంధుత్వాలు పెంచే పండగే సంక్రాంతి అన్నారు. పల్లె వాతావరణంలో పండుగలు జరుపుకోవడం భావితరాలకు మనం సంస్కృతిని చాటిచెప్పడమే అన్నారు. గత పాలనలో సంక్రాంతి కాంతులు ప్రజల్లో కనిపించేదన్నారు. సంక్రాంతి అంటేనే రైతుల పండగని, అయితే ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పంటలకు బీమాతోపాటు గిట్టుబాటు ధర లేదన్నారు. విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. పేదలకు వైద్యవిద్యను దూరం చేస్తూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రతులను కాలుస్తూ ప్రజలు భోగిమంటలు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త ఆర్కేసెల్వమణి, కుమారుడు కృష్ణకౌసిక్, సోదరుడు రామ్ప్రసాద్రెడ్డి, కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
సీపీఎం సీనియర్ నేత వీరవర్మ మృతి
తిరుపతి కల్చరల్: సీపీఎం సీనియర్ నేత అవనిగడ్డ వీరవర్మ(84) బుధవారం ఉదయం స్విమ్స్ అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉద్యమంలో సీపీఎం అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేశారు. చివరి శ్వాస విడిచేంత వరకు పార్టీ కోసం తపించేవారని సైద్ధాంతిక నిబద్ధతను కనబరిచారని సీపీఐ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలిపారు. ఏవీ వర్మ పార్థివదేహాన్ని వైద్యపరిశోధన నిమిత్తం గురువారం ఉదయం ఎస్వీ మెడికల్ కళాశాలకు అప్పజెప్పనున్నట్లు ఆయన తెలిపారు. ఏవీ వర్మ మృతికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నర్సింగరావు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర నేత పి.సోమయ్య, సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి కే.నేతాజీ, నగర కార్యదర్శి నళినీ కాంత్ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు. ఏవీ వర్మకు ఘన నివాళి ప్రముఖులు మాజీ మంత్రి చింతామోహన, సీనియర్ పాత్రికేయుడు రాఘవ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, సీపీఎం చిత్తూరు జిల్లాకార్యదర్శి గంగరాజు, సీపీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత, సీపీఎం నేతలు మాధవ్, వేణుగోపాల నాగార్జున, వెంకటేశం, గుణశేఖర్, నరేంద్ర, ఎన్డీ.శ్రీను, అర్జున్, ఆదిశేషారెడ్డి, చంద్ర, వెంకటేష్లతో పాటు వర్మ కుమార్తెలు అవనిగడ్డ కల్యాణి, వనజ, పద్మజ, ఆయన మృత దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. కాగా పార్టీ కార్యకర్తలు, ప్రజల దర్శనార్థం ఆయన మృతదేహాన్ని సీపీఎం కార్యాలయం వద్ద గురువారం ఉంచనున్నట్లు తెలిపారు. -
మనీ మార్నింగ్ అంటూ మోసం..
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మనీ మార్నింగ్ చెప్పండి..దండిగా డబ్బులు సంపాదించవచ్చునని ఓ నిర్వాహకులు మోసం చేశారని చిత్తూరు నగరం, దొడ్డిపల్లికి చెందిన గుణసుందరం, జీడీ నెల్లూరు పాచిగుంటకు చెందిన భాగ్యరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడీఎంఎస్ అనే టీంలో చేరితే కోట్లు సంపాదించవచ్చని, ఈ బైక్ కూడా కొనుక్కోవచ్చని ఆ టీం లీడర్ బాలాజీ అనే వ్యక్తి మోసం చేశాడని వారు ఆరోపించారు. ఆ టీంలో చేరేందుకు ప్రతి ఒక్కరూ రూ.15 వేల చొప్పున్న చెల్లించామన్నారు. అలా చేరిన వ్యక్తులు మరో ఇద్దరిని చేర్పించాలని, అలా చేస్తే.. చేరిన ఒక్కో వ్యక్తి నుంచి రూ.5 వేల చొప్పున్న డబ్బులు వస్తాయన్నారు. తీరా అదనపు ఆదాయం రాకపోగా.. కట్టిన డబ్బులను తిరిగి ఇవ్వకుండా టీం లీటర్ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. గుడ్ మార్నింగ్కు బదులు.. మనీ మార్నింగ్ చెప్పండంటూ.. మోసం చేశారని తెలిపారు. పోలీసులు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వారి వెంట శంకర్, ధనరాజ్లు ఉన్నారు. అరటి చెట్లను ధ్వసం చేసిన ఏనుగులు -
టీటీడీకి రూ.20 లక్షల విరాళం
తిరుమల: టీటీడీ మాజీ సీవీఎస్వో దామోదర్ టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. పోలీసులపై తెలుగు తమ్ముడి ఆగ్రహం చంద్రగిరి: సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు టీడీపీ నేతలు పోటీ పడ్డారు. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లను నిలువరించేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం చంద్రబాబు తన నివాసంలోకి వెళ్లిన తర్వాత, ఓ కార్యకర్త ఆయన్ని కలిసేందుకు యత్నించారు. పోలీసులు అతన్ని నిలువరించడంతో ఒక్కసారిగా పోలీసులపై రెచ్చిపోయాడు. మా ప్రభుత్వంలో నన్నే అడ్డుకుంటారా..? మా నా యకుడికి చెప్పి నీ సంగతి తేలుస్తా అంటూ డీఎస్పీ స్థాయి అధికారిపై రెచ్చిపోయాడు. చేసే దేమి లేక అక్కడ ఉన్న సిబ్బంది ఆ కార్యకర్తను సముదాయించి పంపించడం గమనార్హం. నేడు గోదాదేవి కల్యాణం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరదరాజస్వామి దేవస్థానంలో బుధవారం గోదాదేవి కల్యాణం జరగనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని పునీతులవ్వాలని కోరారు. గుర్తుతెలియని మహిళ మృతి చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని పీసీఆర్ కూడలిలో ఓ గుర్తుతెలి యని మహిళ మంగళవారం మృతి చెందింది. దాదాపు 50 ఏళ్ల వయస్సున్న మహిళ.. గత రెండు నెలలుగా ఇక్కడే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. స్ఫృహతప్పి ఉన్న మహి ళను స్థానికులు పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు నిర్ధారించారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచామని, మహిళ ఆచూకీ తెలిస్తే ఫోన్–9440796707, 08575234100 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని వన్టౌన్ పోలీసులు సూచించారు. -
16న విశ్వంలో సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ మోడల్ టెస్ట్
తిరుపతి సిటీ: స్థానిక వరదరాజనగర్లోని విశ్వం సైనిక్ ఇన్స్టిట్యూట్లో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్న్స్ ఎగ్జామ్ – 2026కు సంబంధించి ఈనెల 16న ఉచిత మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ విశ్వనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయిలో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఈనెల 18వ తేదీన జరగనున్న నేపథ్యంలో, సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షకు ముందస్తు సాధన కల్పించేందుకు మోడల్ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ నమూనా పరీక్ష ద్వారా విద్యార్థులు ప్రధాన పరీక్షకు సన్నద్ధం కావడంతో పాటు, సబ్జెక్టుల వారీగా తమ లోపాలను గుర్తించి, సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. మోడల్ పరీక్షకు ఎటువంటి ప్రవేశ రుసుము అవసరం లేదని స్పష్టం చేస్తూ, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ సైనిక్ స్కూల్ అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) జిరాక్స్ కాపీని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 86888 88802 / 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పండక్కి ఊరెళుతూ పరలోకాలకు.. నాగలాపురం: పండక్కి ఊరెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగలాపురం మండలం, కృష్ణాపురంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. మండలంలోని దక్షిణపుకోట వీధికి చెందిన టి.శేఖర్ కుమారుడు టి.హర్షవర్ధన్(13) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల నిమిత్తం తన మేనమామ, అతని కొడుకుతో కలిసి ముగ్గురు ద్విచక్రవాహనంలో తిరుపతికి బయలు దేరారు. కృష్ణాపురం స్పీడ్ బేకర్ వద్ద వెనుక కూర్చుని ఉన్న హర్షవర్థన్ ద్విచక్ర వాహనం నుంచి అదుపు తప్పి కింద పడిపోయాడు, ఆ సమయంలో ఊత్తుకోట్టై వైపు వెళుతున్న టిప్పర్ హర్షవర్థన్ తలపై ఎక్కడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ను సురుటుపల్లి సరిహద్దు చెక్పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులో తీసుకున్నారు. మృతుని తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. -
భోగి వెలుగులు.. సంక్రాంతి సందళ్లు
చంద్రగిరి: తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో మంగళవారం సాయంత్రం ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఆ సందర్భంగా భోగి మంటలను వేసి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం సిబ్బంది, సందర్శకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శిల్పారామం అసిస్టెంట్ ఆఫీసర్(ఏఓ) సుధాకర్ భోగి మంటలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పారామం అసిస్టెంట్ ఇంజనీర్ రాధాకృష్ణ, ఫీల్డ్ సూపర్వైజర్లు పప్పి, సూర్యతేజ, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ వెంకటేశ్వర రెడ్డి, సిబ్బంది పాల్గొని భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయబద్ధంగా, ఆహ్లాదకర వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు. -
ఏంటీ గోల?
చంద్రబాబు సర్కార్లో ఐవీఆర్ఎస్ సర్వేల జోరు చిత్తూరు మండలం బీఎన్ఆర్ పేటలో ఐవీఆర్ఎస్ సర్వేలో సిబ్బందికాణిపాకం: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు,వినతుల పరిష్కారంపై బాబు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. లోటు పాట్లను తెలుసుకునేందుకు ఐవీఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కాల్స్తో నేరుగా ప్రజలకే ఫోన్ చేసి అమలు తీరుపై అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా .. ఏ ఒక్కటీ పరిష్కారం కాకపోవడం జనానికి చిర్రెత్తిస్తోంది. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో దాదాపు 2.5 లక్షల కుటుంబాలున్నాయి. ఆయా కుంటుంబాలు ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు పొందుతున్నాయి. వివిధ సమస్యల నిమిత్తం సచివాలయం, మండల కార్యాలయానికి వెళ్తుంటారు. నిత్యం ఆస్పత్రులకు వెళ్లి వస్తుంటారు. సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా అధికారులను కలిసి అర్జీలు ఇచ్చుకుంటున్నారు. లేకుంటే ఆన్లైన్లో అర్జీలు పెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో వారు ఏమేర సంతృప్తికరంగా ఉన్నారో.. తెలుసుకోవడానికి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. అయితే వారిచ్చే జవాబుకు మళ్లీ.. బదులురావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అధికారుల బేజారు ప్రధానంగా సచివాలయ సిబ్బంది సర్వేలతో కుస్తీ పడుతున్నారు. కొందరు డెప్యూటేషన్లపై మండలం, జిల్లా కార్యాలయాలకు పరిమితమయ్యారు. మిగిలిన ఒకరిద్దరూ కూడా మధ్యలో మీటింగ్లంటూ వెళ్లిపోతుంటారు. ఇక ప్రజాప్రతినిధుల పర్యటనలతో అరకొర సిబ్బంది అవస్థ పడుతున్నారు. ఇలాంటప్పుడు సేవల కోసం వెళ్లే ప్రజలకు సచివాలయం ఖాళీగా కనిపిస్తోంది. దీంతో మండల కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఇలాంటప్పుడు ప్రజలు ఫీడ్ బ్యాక్ అధికారులు, సిబ్బందిని తెగ టెన్షన్ పెట్టిస్తోంది. ఇలాంటప్పుడు సర్వేలకు పరిమితం కావాలా..? ప్రజలకు సేవ చేయాలా..? తెలియక తికమక పడిపోతున్నారు. గతంలో వలంటీర్లు చేసే పనులంతా తమ వద్ద చేయిస్తే ఎలా అని పలువురు లోలోపాల కుమిలిపోతున్నారు. కొందరు బహిరంగంగా చెప్పుకుని... రగిలిపోతున్నారు. జిల్లా అధికారులకు సైతం ఈ కాల్స్ తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో.. ఈ రకంగా బదులిస్తున్నారని, అయితే ఆ కాల్స్ అధికారుల కొంపు ముంచుతున్నాయని.. పలువురు తలలుపట్టుకుంటున్నారు. చర్యలు శూన్యం క్షేత్ర స్థాయిలో ఆ సమస్యలు అలానే ఉండిపోతున్నాయి. మార్పులు కనిపించకపోయినా మళ్లీ ఆ ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. కొంత మంది అధికారులు ప్రజా సమస్యలను ఆ చెవిలో విని..ఈ చెవిలో వదిలేస్తున్నారు. తప్పుచేసే అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్ష్యాలతో సహా చూపించినా చర్యలు శూన్యమని మండిపడుతున్నారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు ఉండడం లేదని, డబ్బులు అడుగుతున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్కు బదులిచ్చినా మార్పు కవడం లేదు. ఈ సర్వేలో అసంతృప్తి వ్యక్త పరచే వారు అధికంగా ఉంటున్నారు. -
పంటల్లేవు, పథకాలు రావు.. ఇంకెక్కడ పండగ?
నగరి : ‘ఎరువులు, యూరియా అందక, సబ్సిడీ విత్తనాలు లేక, పంటలు చేతికి రాక, వచ్చినా గిట్టుబాటు ధరలేక, ఇచ్చిన హామీలు ఏవీ అమలుగాక రైతుకు భవిష్యత్తే లేకుండా పోయింది. పంటల్లేవు.. పథకాలు రావు.. ఇంకెక్కడ పండగ అనే స్థాయికి రైతులు చేరుకున్నారు.. సంక్రాంతి కళతప్పి కనిపిస్తోంది’ అని మాజీ మంత్రి ఆర్కేరోజా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నగరిలోని తన నివాస కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ శ్రేణుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అందరికీ పార్టీ క్యాలెండర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్టంలో రైతులకు దిక్కుతెలియని పరిస్థితి నెలకొందన్నారు. సాగు వ్యయం పెరిగి పంట ఆదాయం తగ్గిందన్నారు. సాగు నుంచి పంట కోత వరకూ అప్పులు చేసుకుని తిప్పలు పడుతున్నారన్నారు. రైతుకు ప్రధాన పండుగైన సంక్రాంతిని జరుపుకోవడానికి ఖర్చులకు లేక రైతే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. రాయలసీమ ప్రజల గొంతుకోయొద్దు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. జగనన్న 80 శాతం పూర్తి చేసిన పనులను అటకెక్కించేసిందన్నారు. కరువు ప్రాంతాలకు శాశ్వత నీటిపరిష్కారానికి చేపట్టిన పనులకు గండికొట్టిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశామని చెప్పేంత వరకు చంద్రబాబు కుట్ర బయటపడలేదన్నారు. నిశ్శబ్దంగా చంద్రబాబు రాయలసీమ ప్రజల గొంతుకోసేస్తున్నారన్నారు. మంచి చేయడమంటే ఇదేనా? ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి, వీవీపాట్స్ను చించికాల్చేసి అవకతవకలకు పాల్పడి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసే మంచి ఇదేనా అని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. పాలక ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రం ఎంత నష్టపోతోందో, ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతోందో ప్రజలకు విడమరచి చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రాయలసీమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. పార్టీని పటిష్ట పరచుకోవడం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాడాలన్నారు. పార్టీకి నష్టం వచ్చే పనులకు పాల్పడితే వారు కూర్చున్న కొమ్మను వారు నరుక్కున్నట్లే అన్నారు. ఈ సమావేశంలో పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి, నగరి, పుత్తూరు ఎంపీపీలు భార్గవి, మునివేలు, నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు, పార్టీ కమిటీ నేతలు, అనుబంధ కమిటీ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
అధిక చార్జీలపై కఠిన చర్యలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీటీసీ నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఐదు రోజులుగా చేపడుతున్న తనిఖీల్లో అధిక చార్జీలు వసూలు చేసిన 30 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. తద్వారా రూ.3 లక్షల మేర జరిమానా విధించినట్టు వెల్లడించారు. అలాగే పన్ను చెల్లించని, పర్మిట్ లేని 32 బస్సులను గుర్తించి రూ.2 లక్షల మేరకు జరిమానా వేసినట్టు పేర్కొన్నారు. ఈ తనిఖీలు వచ్చే సోమవారం వరకు కొనసాగుతాయన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కారం చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 216 సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల పరంగా 17, ఎల్టీ లైన్ల పరంగా 283, సర్వీసు లైన్ పరంగా 20 కలిపి మొత్తం 536 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. వాటిలో 54 సమస్యలను పరిష్కారించామన్నారు. విద్యుత్ సమస్యలు తెలియజేయండి పెనుమూరు(కార్వేటినగరం): జనబాట కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోకి వస్తున్న విద్యుత్ సిబ్బందికి సమస్యలు తెలియజేసి, పరిష్కరించుకోవాలని ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ సూచించారు. ఎస్పీడీసీఎల్ జనబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెనుమూరు మండలం, పులికల్లు గ్రామంలో పర్యటించారు. అనంతరం ఎస్ఈ మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్నో రోజులుగా పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, వాటిని తక్షణం పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట ఏడీఈ శేషాద్రిరెడ్డి, ఏఈ తులసీప్రసాద్, ఎల్ఐ పద్మనాభనాయుడు, ఎల్ఎం రవి ఉన్నారు. వైద్య సేవలు మెరుగుపడాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ జమ, ఖర్చు లెక్కలు పక్కాగా ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను పీహెచ్సీల్లో విధిగా చేపట్టాలన్నారు. గర్భిణులకు అభా నమోదు తప్పనిసరి అన్నారు. ఎన్సీడీ–4.0 ద్వారా స్క్రీనింగ్ చేయించాలన్నారు. సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, డీఐఓ హనుమంతరావు, అధికారులు అనిల్కుమార్, ప్రవీణ, అనూష, జార్జ్, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. -
లగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు
తిరుమల: తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో ముఖఆధారిత పాద రక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద మంగళవారం ఉదయం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాద రక్షలు కౌంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ తిరుమల కొండపై భక్తులు ఎదుర్కొంటున్న పాద రక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధునిక పాదరక్షల నిర్వహణ వ్యవస్థను టీటీడీ విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం అద్భుత ఫలితాలు ఇవ్వడంతో, తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ విధానంలో భక్తులు తమ పాద రక్షలను కౌంటర్ వద్ద అప్పగించగానే వారికి క్యూఆర్ కోడ్తో కూడిన స్లిప్ ఇస్తారని, ఆ స్లిప్లో పాద రక్షల సంఖ్య, సైజు, ర్యాక్ నంబర్, బాక్స్ నంబర్, నిల్వ చేసిన స్థానం వంటి పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. భక్తులు తిరిగి వచ్చి ఆ స్లిప్ను స్కాన్ చేయగానే పాద రక్షలు ఉన్న కచ్చితమైన స్థానం డిస్ప్లే అవుతుందని, తద్వారా అతి తక్కువ సమయంలోనే భక్తులకు పాద రక్షలు తిరిగి అందజేయడం జరుగుతోందని అదనపు ఈఓ తెలిపారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.సత్య నారాయణ, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. -
పండగ పూటా ఎక్కిళ్లే!
పలమనేరు: మండలంలోని పెంగరగుంట పంచాయతీ, జంగాళపల్లి గ్రామస్తులు మూడు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని బోర్లు మరమ్మతులకు గురికావడంతో వ్యవసాయ బోర్ల నుంచి మంచినీటిని తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులే అధికంగా ఉండడంతో అక్కడి కూటమి నేతలకు మింగుడు పడడం లేదు. నీటి సమస్యను పరిష్కరించకుండా అధికారుల అండతో వారి గొంతు ఎండేలా చేసి కసి తీర్చుకుంటున్నారు. దీన్ని గమనించిన అక్కడి వైఎస్సార్సీపీ నాయకులు జెడ్పీ చైర్మన్కు విన్నవించగా.. ఆయన వెంటనే కొత్తబోరు, మోటార్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశా రు. అయినా కూటమి నేతలకు భయపడి ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పనులు చేపట్టలేదు. దీంతో గ్రామస్తు లు పండగపూటా తాగునీరు లేక అవస్థలెదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీకి ఓటేశారనే.. ఈ గ్రామంలో దాదాపు 70 గడపలు, 300 దాకా జనాభా ఉన్నారు. గ్రామంలోని బోరును గతంలో చెరువులో వేయడంతో అది మరమ్మతులకు గురైంది. మూడు నెలల నుంచి తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. వీరి బాధను గమనించిన ఆ పంచాయతీ వైఎస్సార్సీపీ నాయకులు రాజారెడ్డి సమస్యను జెడ్పీ చైర్మన్ వాసు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి జెడ్పీ 15 ఫైనాన్స్ టైడ్ నిధుల ద్వారా కొత్తగా బోరు వేసేందుకు, దానికి మోటారు కోసం గతనెల 29న రూ.6.3 లక్షలు మంజూరు చేశారు. 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలనిన ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు. ఆయన మాటలు విని సంతోషించిన గ్రామస్తులు ఎంపీడీవో వద్దకు తిరుగుతున్నా ఆయన కూటమి నేతల బెదిరింపులతో పనులు చేపట్టలేదు. దీంతో గ్రామస్తులు మంగళవారం సైతం ఆయన్ను కలిసి సంక్రాంతి పండుగను పురష్కరించుకొని వెంటనే పనులు చేపట్టాలని కోరారు. అయినా ఆయన నీళ్లు నమలడంతో నిరాశగా వెనుదిరిగారు. మూడు నెలలుగా కరెంట్ వచ్చినప్పుడు గ్రామ సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్ద నుంచి మంచినీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. దీనిపై పలమనేరు ఎంపీడీవో భాస్కర్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ పిక్ చేయడం లేదు. కాగా పలమనేరులో అధికారుల నిర్లక్ష్యంపై తాను జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని జెడ్పీ చెర్మన్ తెలిపారు.జంగాళపల్లి వాసులకు తప్పని తాగునీటి కష్టాలు -
రైల్వే స్థలంలో రోడ్డు నిర్మాణం
– పట్టించుకోని అధికారులు కుప్పంరూరల్: తన ప్రైవేట్ లే అవుట్ కోసం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా రైల్వే స్థలంలోనే రోడ్డు నిర్మించేశాడు. కుప్పం మండలం, గోపనపల్లి సమీపంలో బెంగళూరుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యవసాయ పొలాలు కొనుగోలు చేసి సైట్లు వేసుకుని, లే అవుట్ చేసుకున్నాడు. సంబంధిత లే అవుట్కు దారి లేకపోవడంతో ఏకంగా రైల్వే పట్టాలకు అనుకుని ఉన్న రైల్వే స్థలంలో రోడ్డు నిర్మాణానికి పూనుకున్నాడు. పట్టాల వెంట సుమారు 50 మీటర్ల వరకు రోడ్డు కంకర వేసి చదును చేశాడు. ఈ రోడ్డును చూపించి వినియోగదారులకు సైట్లను విక్రయించాలని చూస్తున్నాడు. భవిష్యత్లో ఉన్న రైల్వే లైన్ పక్కనే మరో లైన్ వస్తుందని, రైల్వే అధికారులు పలుమార్లు సర్వేలు చేపట్టా రు. నూతన రైల్వే లైన్ వేస్తే లే అవుట్ దారికాస్త మూసుకుపోతుంది. నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే స్థానిక రైల్వే అధికారులు తమ కేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు అయినా స్పందించి రోడ్డు నిర్మాణంపై చ ర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైల్వే స్థలంలో నిర్మించిన రోడ్డు -
ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎంఈవోలు, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సిందేనని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు పలు అంశాలపై ఆయన మంగళవారం క్షేత్ర స్థాయి విద్యాశాఖ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 13న 286 మంది విద్యాశాఖ ఉద్యోగులు ఫెషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉందన్నారు. అయితే 189 మంది మాత్రమే నమోదు చేశారని, మిగిలిన వారు వేయలేదని చెప్పారు. వేయని వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఇదే విధంగా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో టిస్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. పూర్తి చేయని 121 మంది వెంటనే వివరాలు నమోదు చేయాలన్నారు. నూతనంగా విధుల్లో చేరిన 1,400 మంది టీచర్లు ఆప్షన్ ఇచ్చిన వెంటనే వివరాలు నమోదు చేస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా కిచెన్ గార్డెన్ పనులు చేపట్టని 271 పాఠశాలలు వెంటనే ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. లేని పక్షంలో చర్యలుంటాయని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ పరిధిలో 400 ఈ బైసైకిల్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 57 మంది ఈ బైసైకిల్స్ కొనుగోలుకు నగదు చెల్లించారన్నారు. సైకిల్ ధర రూ.24 వేలు ఉంటుందని, మొదటగా రూ.5 వేలు చెల్లించి, నెలవారీగా రూ.900 చెల్లించే అవకాశం కల్పించారన్నారు. పదోతరగతి మూల్యాంకన కేంద్రానికి స్థలం గుర్తించి నివేదికలు పంపాలని పరీక్షల విభాగం అధికారులను ఆదేశించారు. జిల్లాలో పీఎంశ్రీ, ఎంఆర్సీ గ్రాంట్లను వెంటనే ఖర్చు చేయాలన్నారు. -
తెలుగు సంప్రదాయాల సంక్రాంతి
చిత్తూరు అర్బన్: ‘తెలుగుదనాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ, కుటుంబ సమేమతంగా సంక్రాంతి ను జరుపుకోవాలి..’ అని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు ఆయన ఓ ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్కడా కూడా జల్లికట్టు, కోడి పందాలు, పే కాట, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని కోరారు. ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది వస్తే డయల్–112, పోలీసు వాట్సప్ –9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిల చెల్లింపుల్లో కూటమి ప్రభుత్వం తీరు ఆక్షేపణీయమని వైఎస్సా ర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డిశేఖర్రెడ్డి ఆరోపించా రు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరుల తో మాట్లాడారు. ఉద్యోగ,ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.35 వేల కోట్లు ఉండగా కేవలం రూ.1,100 కోట్లు విడుదల చేసి సంక్రాంతి కానుక అని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రకటించిన కొద్దిపాటి సొమ్ము కూడా పండుగ నాటికి చేతికి అందే అవకాశాలు లేవన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల్లో నిరాశ తప్ప సంక్రాంతి సంబరాలు లేవన్నారు. -
ఆక్రమణలు అచ్చెరువు
●చెరువు ప్రాణకోటికి జీవగర్ర..దాన్ని అభివృద్ధి చేసి నీటితో నింపితే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. అయితే చెరువుకు నేడు రక్షణ కరువు అవుతోంది. పైగా ఆ నీటి వన రు నేడు ఆక్రమణలు, రియల్టర్లకు ఆదాయాని కి అడ్డాగా మారింది. ఫలితంగా ఎకరాలకు ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు కనుమరుగవుతోంది. వరదయ్యపాళెం: మండలంలోని కంచరపాళెం పంచాయతీ పరిధిలోని రెడ్డిగుంట చెరువు ఆక్రమణకు ఓ రియల్టర్ సిద్ధమయ్యాడు. ఆ దిశగా చెరువు కింద భాగంలో కంచరపాళెం దళితులకు చెందిన 60 ఎకరాల భూములను చైన్నెకు చెందిన రియ ల్టర్ కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల క్రితం ఆ భూములకు ప్రహరీ గోడ నిర్మాణంలో భాగంగా ఏకంగా తమ భూములకు ఆనుకుని ఉన్న రెడ్డిగుంట చెరువు భూ మిని సైతం దర్జాగా ఆక్రమించుకున్నాడు. చెరువుకు అవతలివైపు, ఇవతలివైపు ఆక్రమణతో పాటు చెరువు నుంచి వెళుతున్న కాలువలను సైతం పూడ్చి వేసి తమ రియల్ ఏస్టేట్కు సంబంధించిన భూమిలో అడ్డగోలుగా కలిపేసుకున్నారు. కాలువలో రూపురేఖలు లేకుండా చదును చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ నిర్మించాడు. బఫర్ జోన్ పూర్తిగా ఆక్రమణ రెడ్డిగుంట చెరువుకు సంబంధించి బఫర్ జోన్ పరిధిలో ఉన్న చెరువు భూమిని పూర్తిగా తమిళనాడుకు చెందిన రియల్టర్ ఆక్రమించుకున్నాడు. ఏకంగా చెరువుకట్టకు ఆనుకుని దర్జాగా ప్రహరీ గోడ నిర్మించుకున్నా ప్రశ్నించే దిక్కు లేదు. అంతేకాక చెరువు తూము నుంచి వెళ్లే కాలువను సైతం తమ రియల్ ఏస్టేట్ భూమిలోకి మళ్లించుకుని కాలువకు అడ్డంగా గోడ నిర్మించాడు. అంతేకాక చెరువు కొనకట్ట వద్ద కట్టను తెగ్గొట్టి మరీ కింద నుంచి ప్రహరీ నిర్మాణానికి పునాదులు వేశాడు. చెరువు లోతట్టు ప్రాంతం సైతం చెరువు భూమిని ఆక్రమంచి దర్జాగా ప్రహరీ గోడ నిర్మించుకున్నారు. చెరువుకట్టకు గండి.. అధికారుల కంటపడిన ఆక్రమణ రెడ్డిగుంట చెరువు ఆక్రమణకు పాల్పడిన రియల్టర్ ఏకంగా నాలుగు రోజుల కిందట ఇరిగేషన్ చెరువుకట్టను తెగ్గొట్టి అందులో నీటిని బయటకు తరలించి, చెరువు మట్టితో తమ భూమిని రియల్ వ్యాపారానికి అనుగుణంగా చదును చేసుకునేందుకు చేపట్టిన పన్నాగం స్థానిక గ్రామస్తుల కంటపడడంతో అది కాస్త అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో చెరువుకట్ట తెగ్గొట్టిన సంఘటనపై గ్రామస్తులు సైతం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెగిన చెరువుకట్టను పరిశీలించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు రెడ్డిగుంట చెరువు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఆ సందర్భంలో రియల్టర్ చెరువు చుట్టూ చేపట్టిన ఆక్రమణల భాగోతం వారి కంటపడింది. అంతేకాక ఇప్పటికే చెరువుకట్టను తెగ్గొట్టేందుకు వినియోగించి ఇటాచీ యజమానిపై కేసు నమోదు చేసి, దాన్ని సీజ్ చేశారు. ఆక్రమణలను అడ్డుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. రెడ్డిగుంట చెరువు రియల్టర్ దురాక్రమణ చర్యలు తీసుకుంటాం రెడ్డిగుంట చెరువు చుట్టూ రియల్టర్లు నిర్మించిన ప్రహరీ గోడ కట్టకు సమీపంలో బఫర్ జోన్లో నిర్మాణం జరిగినట్లు అనుమానాలున్నాయి. తూము వద్ద వెళుతున్న కాలువకు అడ్డంగా ప్రహరీ గోడ నిర్మించడం చట్టరీత్యా వ్యతిరేకం. దీనిపై సంబంధిత భూయజమానికి నోటీసులు అందించి ఆక్రమణలను అడ్డుకుంటాం. కచ్చితంగా ఆక్రమణ లు జరిగిన చోట ప్రహరీ నిర్మాణం జరిగినప్పటికీ దాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే చెరువుకట్ట తెగ్గొట్టిన వారిపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశాం. – రత్నాకర్ రెడ్డి, డీఈ, సత్యవేడు ఇరిగేషన్ శాఖ సబ్ డివిజన్ -
తనకు తెలియకుండా భూమిని రాసుకునేశారు
తనకు తెలియకుండా భూమిని రాసుకునేశారని బంగారుపాళ్యం మండలం, కల్లూరుపల్లెకు చెందినమునస్వామి ఆవేదన వ్యక్తం చేశా రు. బాధితుడు మాట్లాడుతూ కల్లూరుపల్లెలో సర్వే నం.176లో కొంత భూమిని తనకు తెలియకుండానే రాసుకుని ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నారు. తాను హేమాద్రినాయుడు అనే అతనికి ఏడు గుంటల భూమిని మాత్రమే అమ్మినట్లు తెలిపారు. కాగా హేమాద్రినాయుడు, చిక్కురుపల్లి సుధా, చిక్కురుపల్లి జ్ఞానశేఖర్, కట్లూరుపల్లి చిన్నరాజా తనను మోసం చేసి మూడు ఎకరాల భూమిని రాసుకున్నారన్నారు. -
అల్లుడికి తీసిచ్చిన అప్పు తీర్చలేదని..
బంగారుపాళెం: అప్పు తీర్చలేద ఆగ్రహించిన మామ అల్లుడిపై దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మండలంలోని మహాసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మహాసముద్రం గ్రామానికి చెందిన అర్జునయ్య తన అల్లుడు బంగారుపాళెం దళితవాడకు చెందిన నరేష్కు వేరొకరి వద్ద పూచీకత్తుగా ఉండి రూ.1.5 లక్షలు అప్పు తీసి ఇచ్చాడు. తీసి ఇచ్చిన డబ్బులు సకాలంలో తీర్చలేదని అల్లుడిపై ఒత్తిడి చేశాడు. దీంతో మామ అల్లుడి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆగ్రహించిన మామ అర్జునయ్య అల్లుడు నరేష్పై కత్తితో దాడి చేసి గాయపరచాడు. నరేష్ ఫిర్యాదు మేరకు మామ అర్జునయ్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పోలీసు గ్రీవెన్స్కు 30 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: చిత్తూరులోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీలు సాయినాథ్, రాంబాబు ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. మొత్తం 30 ఫిర్యా దులు అందినట్టు వారు పేర్కొన్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి బంగారుపాళెం: మండలంలోని కల్లూరుపల్లెకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు.. కల్లూరుపల్లెకు చెందిన లక్ష్మి(26) గుడిపాల మండలం, అనుప్పల్లెకు చెందిన సురేష్తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా నాలుగేళ్ల క్రితం భర్తను వదిలిపెట్టి స్వగ్రామం కల్లూరుపల్లెలో ఉంటోంది. ఈ క్రమంలో గుండ్లకట్టమంచికి చెందిన గిరితో లక్ష్మి సహజీవనం చేస్తోంది. గత కొన్ని రోజులుగా లక్ష్మి ప్రవర్తనపై గిరికి అనుమానం కలిగి వేధింపులకు గురి చేస్తుండడంతో ఆమె మనస్తాపంతో ఈ నెల 7న మహాసముద్రం టోల్ప్లాజా వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరింది. ఆపై చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మి ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తల్లి లైలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.51 కోట్లు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని అధికారులు లెక్కించారు. ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో రూ.1,51,15,630 ఆదాయం వచ్చింది. బంగారం 25 గ్రాములు, వెండి 1.200 కిలోలుగా లెక్కకట్టారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.9,178, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ. 9,178 వచ్చింది. యూఎస్ఏవి 709 డాలర్లు, సింగపూర్వి 55 డాలర్లు, మలేషియావి 32 రింగిట్స్, ఆస్ట్రేలియావి 40 డాలర్స్, యూరో 5 యూరో, కెనడా 35డాలర్లు వచ్చాయి. డీఈవోలు సాగర్బాబు, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. -
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా జీవీ రమణ
చిత్తూరు కలెక్టరేట్ : యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన జీవీ రమణ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈ నెల 10, 11 తేదీల్లో గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన ఎన్నికను ప్రకటించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో వరుసగా మూడవ సారి యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఎన్నికై న జీవీ రమణ మాట్లాడుతూ టీచర్ల సమస్యలను పరిష్కరించడం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయనకు పలువురు యూ టీఎఫ్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ ఇంట్లో చోరీ గంగవరం: పలమనేరు ఏఎంసీ చైర్మన్ రాజన్న నివాసంలో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన సోమవారం మండలంలోని ఆలకుప్పం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. రాజన్న పని నిమిత్తం మధ్యాహ్నం ఇంటి నుంచి పలమనేరుకు బయలుదేరి వెళ్లగా ఆయన భార్య లక్ష్మీదేవమ్మ వ్యవసాయ పనులు చూసుకునేందుకు పొలం వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు ఇనుప రాడ్తో డోర్ను పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఆపై లాకర్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.2.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం దుండగులు ధ్వంసం చేసి, డీవీఆర్ను కూడా ఎత్తుకెళ్లినట్టు తెలిసింది. -
గ్రామీణ రోడ్లు... నరకానికి నకళ్లు
నగరి : మండల కేంద్రం నగరి నుంచి మేళపట్టు, ముడిపల్లె, రామాపురం గ్రామాలకు, మీరా సాహెబ్పాళెం నుంచి మేళపట్టుకు ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో నగరి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించి సమస్యను పరిష్కరించారు. నేడు ఆ అండర్ బ్రిడ్జిలో హెవీలోడ్ టిప్పర్లు తిరుగుతుండడంతో సిమెంటు రోడ్లు ఛిద్రమై లోపలున్న ఇనుప కమ్మీలు కూడా బయటకు కనిపిస్తోంది. రాత్రి పూట ఈ మార్గంలో బైక్పై వచ్చేవారు ప్రమాదాలకు లోనయ్యే ఆస్కారం ఉంది. అలాగే విజయపురం మండలానికి వెళ్లే ప్రదాన రోడ్లయిన పన్నూరు రోడ్డు, కనకమ్మసత్రం రోడ్డు అధ్వాన్నంగా ఉన్నాయి. అలాగే పుత్తూరు మండలం సిరుగురాజుపాళెం, తడుకు రింగురోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్లు ఇలా ఉంటే ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని పిలుపునివ్వడం హాశ్యాస్పదంగా ఉందని స్థానికులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రోడ్ల సొగసు చూడతరమా? పలమనేరు: పలమనేరునియోజకవర్గంలో దాదాపు 250 కి.మీ తారురోడ్లు ఉండగా వాటిల్లో 60 శాతం రోడ్డు వర్షాల కారణంగా అధ్వాన్నంగా మారాయి. గతంలో రూ.4.13 కోట్లతో 6,395 మీటర్ల మేర రోడ్లు మరమ్మతులు చేసినట్టు చెబుతున్నా అవికూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ● బైరెడ్డిపల్లి మండలంలోని కడపనత్తం రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. ● పలమనేరు మండలం,కొలమాసనపల్లి పంచాయతీ, ఎర్రగొండేల్లి–మాదిగబండ రహదారి వానపడితే నాలుగడుగుల లోతు వరకు నీరు చేరి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. ● గొల్లపల్లి జంక్షన్ నుంచి మాదిగబండ, చెన్నుపల్లి నుంచి కల్లాడు గంగమాంబ సర్కిల్ రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. ● వీకోట పట్టణం నుంచి కర్ణాకట రాష్ట్రంలోని కేజీఎఫ్కు వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ● పెద్దపంజాణి మండలంలోని చీకలదిన్నేపల్లి– మద్దలకుంట, రాయలపేట–మాధవరం, కరసనపల్లి–రాజుపల్లి రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. మట్టి రోడ్డును తలపిస్తున్న తారు రోడ్డు శాంతిపురం: పలమనేరు జాతీయ రహదారిలోని బడుగుమాకులపల్లి క్రాసు–విజలాపురం రోడ్డు నుంచి కొలమడుగు పంచాయతీలోని కదిరిముత్తనపల్లికి వెళ్లే తారు రోడ్డు ఎక్కడికక్కడ గుంతలు తేలాయి. ఇరవై ఏళ్ల క్రితం నల్లరాళ్లపల్లి మీదుగా నిర్మించిన ఈ రోడ్డుకు తర్వాత కాలంలో నిర్వహణ పనులు చేయక ధ్వంసమైంది. గత ఏడాది కదిరిముత్తనలపల్లిలో జరిగిన కురబదేవర కోసం తారు రోడ్డు గుంతలకు మట్టిని తోలి తాత్కాలికంగా మేనేజ్ చేశారు. పూజల్లో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో రోజుల వ్యవధిలోనే రోడ్డు మళ్లీ గుంతలు తేలింది. తర్వాత ఇప్పటి వరకూ ఈ రోడ్డుకు మరమ్మతులు చేయలేదు. రోడ్లు పట్టించుకోరా? గుడిపాల: మండలంలోని మందిక్రిష్ణాపురం నుంచి తమిళనాడుకు వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా ఉంది. రోడ్డంతా కంకరలేచి గుంతలమయంగా ఉంది. గుంతలు..కళ్లకు గంతలు కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ కేంద్రమైన కుప్పం పట్టణంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. మోకాలి లో తు గుంతలు పడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాతపేటలోని డివైడర్ల జంక్షన్ వద్ద పెద్ద గుంత పడింది. బైపాస్ రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైన గుంతలు పడ్డాయి. కడా పీడీ కోసం నిర్మించిన ప్రాజెక్టు డైరెక్టర్ బంగ్లా రోడ్డు గుంతలు, వర్షం నీటి తో అధ్వాన్నంగా తయారైంది. శాంతినగర్ నుంచి గుడుపల్లె రోడ్డు లింక్గా ఉన్న ఈ మార్గం దుస్థితికి చేరింది. కోర్టు రోడ్డు, గుడుపల్లె రోడ్డు, పట్టణంలో అక్కడక్కడ మూడు నెలల క్రితం చేపట్టిన మరమ్మతులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్యాచ్ వర్క్లకు వేసిన తారు లేచిపోయింది. అడుగుకో గొయ్యి.. ఈతతోపు రోడ్డుకు మోక్షమెప్పుడో? చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు మండలం, తాళంబేడు పంచాయతీ, ఈతతోపు రోడ్డు అధ్వాన్నంగా దర్శనమిస్తోంది. ఏడాది క్రితం ఈ రోడ్డుకు కంకర వేసి వదిలేశారు. అప్పట్నుంచి ఈ రోడ్డును పట్టించుకునే వారు కరువయ్యారు. రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాలంటే నరకం అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇక పండుగలకు వచ్చే జనమంతా ఆ రోడ్డు చూసి ఛీదరించుకుంటున్నారు. ఈ సంక్రాంతికై నా రోడ్డు బాగుపడుతుందనుకుంటే...మళ్లీ కంకరేనా...? అంటూ నిట్టూర్చుతున్నారు. కార్వేటినగరం:నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణించాల్సివస్తోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. కార్వేటినగరం మండలం, కుమ్మరగుంట ఒడ్డి ఇండ్లకు సమీపంలో రోడ్డు కంకర తేలిపోయింది. కొల్లాగుంట నుంచి శీకాయపట్టెడ గ్రామానికి వెళ్లె బీటీ రోడ్డు కంకర తేలింది. కార్వేటినగరం– పచ్చికాపల్లం మార్గంలోని విజయమాంబాపురం గ్రామానికి సమీపంలో ఉన్న బీ టీ రోడ్డు అడుగు లోతు గుంతతో దర్శనమిస్తోంది. పాసముద్రం మండలం, వీర్లగుడి దళితవాడకు వెళ్లే రోడ్డుకు 2018లో బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నిధులు మంజూరు చేసినప్పటికీ టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ స్వాహా చేసి రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోకుండా పోయాడు. వెదురుకుప్పం మండలం, మాంబేడు గ్రామానికి వెళ్లే తారు రోడ్డు దుస్థితికి చెరింది. బాలుపల్లి నుంచి కురివికుప్పం వెల్లే రోడ్డు మార్గం గుంతలమయంగా మారింది. -
అర్జీల ఆవేదన!
ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 106 అర్జీలు చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. వివిధ సమస్యలపై మొత్తం 106 అర్జీలు సమర్పించారు. ప్రజల అర్జీల పరిష్కారంలో క్షేత్ర స్థాయి అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ హెచ్చరించారు. జేసీ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, డీఆర్వో మోహన్కుమార్ పాల్గొన్నారు. విద్యుత్ లైన్ మార్పు చేయకుండా.. విద్యుత్ శాఖ అధికారులు 11 కేవీ విద్యుత్ లైన్ మార్పు చేయకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని చిత్తూరు నగరంలోని సంతపేటకు చెందిన జగన్, మురళి, నరేష్, కళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సోమవారం పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. తాము గృహాలు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుండగా 11 కేవీ లైన్ సమస్యగా మారిందన్నారు. విద్యుత్ లైన్ల మార్పిడికి మూడు నెలల క్రితం రూ.1.62 లక్షలు ప్రభుత్వం చలానాగా చెల్లించినట్లు చెప్పారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ లైన్ మార్పు చేయకుండా అలసత్వం వహిస్తున్నారన్నారు. -
పెరుమాల్ గుంతకు సర్వే చేయాలి
పెరుమాల్ గుంటకు సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేయా లని కార్వేటినగరం మండలం, కొల్లాగుంట రెవెన్యూ పరిధిలోని ఈడిగపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన దాశయ్య, దామోదరమ్, కోటేశ్వరయ్య తదితరులు మాట్లాడుతూ కొల్లాగుంట లెక్కదాఖలలో ఈడిగపల్లి గ్రామం వద్ద ఉన్న సర్వే నం.308/1లో పెరుమాల్గుంట పోరంబోకు స్థలం ఉందన్నారు. ఈ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుని ఆలయ అవసరాలకు ఇవ్వకుండా గ్రామ ప్రజలతో గొడవలు చేస్తున్నారన్నారు. అధికారులు సంబంధిత స్థలానికి హద్దులు చూపించి గుడి నిమిత్తం వినియోగించుకునేలా ఆదేశాలివ్వాలన్నారు. -
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారన్నారు. అక్కడ కేటగిరి వారీగా సమస్యలను యాప్లో నమోదు చేసి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు. జాయింట్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్ – ప్రస్తుత జేసీ విద్యాధరి వైజాగ్కు బదిలీ చిత్తూరు కలెక్టరేట్ : జాయింట్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్ను నియమించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనను చిత్తూరు జేసీగా నియ మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జేసీగా పనిచేస్తున్న విద్యాధరిని వైజాగ్ జేసీగా బదిలీ చేశారు. జేసీ విద్యాధరి జిల్లాలో ఏడాదికి పైగా విధులు నిర్వర్తించారు. నూతన జేసీ 2020వ బ్యాచ్ జాయింట్ కలెక్టర్గా నియమితులైన ఆదర్శ్ రాజేంద్రన్ 2020వ ఐఏఎస్ బ్యాచ్కు చెందిన వారు. ఆయన స్వస్థలం కేరళ రాష్ట్రం. 2020లో ఐఏఎస్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సబ్కలెక్టర్, నూజివీడు, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో, జాయింట్ కలెక్టర్, నెల్లూరు, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా జేసీగా పనిచేస్తూ చిత్తూరుకు బదిలీ పై విచ్చేయనున్నారు. నూతన జాయింట్ కలెక్టర్ సతీమణి అదితిసింగ్ సైతం ఐఏఎస్ అధికారిణిగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కి చేపడుతున్న దరఖాస్తుల స్వీకరణ సోమవారంతో ముగిసిందని జిల్లా సమగ్రశిక్ష శాఖ జీసీడీవో ఇంద్రాణి వెల్లడించారు. ఈ మేరకు ఆమె విలేకరులతో మాట్లాడారు. సమగ్రశిక్ష శాఖ ఏపీసీ ఆదేశాల మేరకు పోస్టుల భర్తీ ప్రక్రి య పకడ్బందీగా భర్తీచేస్తామన్నారు. నోటిఫికేషన్లో ఇచ్చిన నిబంధనల మేరకు ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గడువు తేదీ అనంతరం వచ్చే దరఖాస్తులను స్వీకరించేది లేదన్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో కేజీబీవీలోని టైప్ 3 పోస్టులకు 461, మోడల్ స్కూల్స్లోని టైప్ 4 పోస్టులకు 251 దరఖాస్తులు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. అందిన ప్రతి దరఖాస్తును ప్రత్యేక నిపుణుల చేత క్షుణ్ణంగా పరిశీలన చేయిస్తున్నట్లు జీసీడీవో తెలిపారు. సంక్రాంతికి జాగ్రత్త! చిత్తూరు కార్పొరేషన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఔత్సాహికులు విద్యుత్ తీగలకు దూరంగా గాలిపటాలు ఎగురవేయాలని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. పండుగ సమయంలో విద్యుత్ పరికరాలు, తీగల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గాలిపటాలు కరెంటు తీగల మధ్య చిక్కుకున్నప్పుడు వాటిని తీయకూడదని స్ప ష్టం చేశారు. ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లకు దూ రంగా ఎగురవేయాలని, లోహపు దూరాలతో పతంగులు ఎగురవేయరాదన్నారు. పిల్లలు ఇంటిపై కప్పుపై గాలిపటాలు ఎగురవేసేటప్పుడు విద్యుత్ వైర్లు తగలకుండా జాగ్రత్తగా ఉండాలన్నా. ప్రమాదాలు జరిగితే టోల్ఫ్రీ 1912 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. అదేవిధంగా ఆ నంబరుతో పాటు ఎల్.ఎమ్.సి 94408 14319 నంబర్కు కాల్ చేసి తెలియజేయాలన్నారు. ఏఈలు, క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వివరించారు. -
మార్కింగ్ విస్తీర్ణం తగ్గించాలి
మార్కింగ్ విస్తీర్ణం తగ్గించాలంటూ చిత్తూరు నగరంలోని న్యూట్రిన్ ఫ్యాక్టరీ వద్ద నివసించే లక్ష్మి తదితరులు కోరారు. వారు మాట్లాడుతూ తాము చిత్తూరు నగరంలోని న్యూట్రిన్ ఫ్యాక్టరీకి ఎదురుగా రోడ్డు పక్కన ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నట్లు తెలిపారు. కష్టపడి కూలి పనులు చేసి సొంతంగా ఇళ్లను నిర్మించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దర్గా కూడలి నుంచి ఇరువారం వరకు పనులు చేపడుతున్నారని, ఈ పనుల్లో తాము నివసిస్తున్న ఇళ్లకు మార్కింగ్ చేశారన్నారు. మార్కింగ్ చేసిన ప్రకారం రోడ్ల విస్తరణ చేపడితే తాము కష్టపడి కట్టుకున్న ఇళ్లులన్నీ దెబ్బతింటాయని చెప్పారు. తిరిగి కట్టుకునే స్థోమత తమకు లేదన్నారు. -
చీకట్లో చేనేతలు
పుత్తూరులో పవర్లూమ్ యంత్రంనేతపనుల్లో మహిళగత ప్రభుత్వంలో ఆదుకున్న నేతన్న నేస్తం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. అంతేకాకుండా విద్యుత్ చార్జీల నుంచి 96 పైసల యూజర్స్ చార్జీలను తగ్గించి వెసులుబాటు కల్పించింది. గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో నారా చంద్రబాబునాయుడు పుత్తూరులో పర్యటించారు. ఆ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ చేనేత, పవర్లూమ్స్ కార్మికులకు 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తానంటూ హామీ ఇచ్చారు. దీనిని గుడ్డిగా నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం నాటి ఎన్నికల హామీకి ఎగనామం పెట్టడంతో పాటు వివిధ సుంకాల పేరిట విద్యుత్ చార్జీలను పెంచి నేత కార్మికుల నడ్డి విరిచారు. -
మందుచూపు!
చిత్తూరు అర్బన్: మద్యం విక్రయాలకు సంబంధించి బాటిల్పై రూ.10 పెంచుకోవడానికి మంత్రి వర్గంలో తీర్మానం అలా చేశారంతే. ఆ తీర్మానం తరువాత ఆ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు వెళ్లాలి, ప్రభుత్వం వాటిలో లోటుపాట్లు గుర్తించి జీవో ఇవ్వాలి. ఇవేవీ తమకు పట్టదన్నట్లు జిల్లాలో మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. మంత్రి వర్గం ధరల పెంపునకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని, టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ రాగానే.. జిల్లాలో ఒక్కో క్వార్టర్ బాటిల్పై ఏకంగా రూ.10 చొప్పున పెంచేశారు. అక్రమ వసూళ్లు జిల్లాలో 113 మద్యం దుకాణాలు, ఏడు మద్యం బార్లు ఉంటే.. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం నుంచే 90 శాతం దుకాణాల్లో మద్యం ధరలకు రెక్కలొచ్చేశాయి. ఆ రోజు అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎకై ్సజ్ పాలసీలో పలు మార్పులు చేస్తూ క్యాబినెట్ నిర్ణయిం తీసుకుంది. ఇందులో ప్రతీ మద్యం బాటిల్పై రూ.10 పెంచడమనేది ప్రధాన నిర్ణయం. రూ.99 మద్యానికి ఇందులో మినహాయింపు ఇచ్చింది. మంత్రి వర్గంలో దీనిపై నిర్ణయం తీసుకున్న క్షణాల్లోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో ధరలు అమాంతంగా పెంచేశారు. ప్రతీ క్వార్టర్ బాటిల్పై రూ.10 అక్రమంగా వసూలు చేసేస్తున్నారు. బీర్ విక్రయాలపై ధరల పెంపు లేకపోయినా.. జిల్లాలో యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇక ప్రీమి యం బ్రాండ్ల క్వార్టర్ బాటిల్పై రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. ఐదు రోజులుగా ఈ దందా సాగిస్తున్నా అడిగే దిక్కులేదు. రోజుకు రూ.కోటికి పైగా సాగే మద్యం విక్రయాల నుంచి ఈ ఐదు రోజులకు అక్రమ వసూళ్ల ద్వారా రూ.కోటి వరకు ఆదాయం చేకూరింది. భారీగా ఆఫ్ టేక్ మరోవైపు ప్రభుత్వం నుంచి ధరల పెంపు జీవో రాకమునుపే మద్యం డిపోల నుంచి భారీగా స్టాకును (ఆఫ్టేక్)కు దుకాణాలకు తరలిస్తున్నారు. ధరలు పెరిగిన తరువాత లాభం కోసం ఎదురుచూడడంకంటే.. అమల్లోకి రాకమునుపే మద్యం బాటిళ్లను భారీ మొత్తంలో తీసుకుంటూ రోజుకు రూ.లక్షలు ఆర్జిస్తు న్నారు. గతేడాది జనవరి 1–11వ తేదీ వరకు జిల్లాలో 37,973 మద్యం బాక్సులు, 13,269 బీరు బాక్సులు డిపోల నుంచి తరలించిన వ్యాపారులు రూ.25.92 కోట్లు చెల్లించారు. తాజాగా ఈ 11 రోజులకు జిల్లాలో ఏకంగా 57,463 బాక్సుల మద్యం (19,490 బాక్సులు అదనం), 15,748 బీరు బాక్సులు (2,479 బాక్సులు అదనం)తీసేసుకున్నారు. అంటే దాదాపు 51 శాతం స్టాకును అదనంగా తీసుకున్నారు. కేవలం ధరల పెరుగుదల కారణంగానే ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇటు ధరల పెంపునకు ముందు.. పెంపు తరువాత మద్యం ప్రియుల జేబులకు చిల్లు పడ్డట్లయ్యింది. నేటి నుంచి రూ.10 పెంపు మద్యం బాటిళ్లపై రూ.10 పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై సోమవారం రాత్రి జీవో విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి మద్యం బాటిల్పై రూ.10 పెంచుతున్నట్లు పేర్కొంది. బీర్, వైన్బాటిళ్లు, రూ.99 మద్యంపై ఈ పెరిగిన ధరలు వర్తించవు. మద్యం విక్రయాల్లో చిలక్కొట్టుడు! -
పాపం భాను!
నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పరిస్థితి ముందు గొయ్యి, వెనక నుయ్యిలా తయారైంది. నేత కార్మికులకు ఉచిత విద్యుత్ జీఓ విడుదలతో పాటు మంత్రివర్గం సైతం ఆమోద ము ద్ర వేసింది. దీంతో అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ ధన్యవాదాలు సైతం చెప్పేశారు. జీఓ విడుదలై ఏడాది, ధన్యవాదాలు చెప్పి ఆరు నెలలు గడచిపోతున్నా జీఓ అమలు కావడం లేదు. దీనిపై అధినేతను అడగలేక.. అడుగుతు న్న వారికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే తెగ ఇబ్బంది పడిపోతున్నారు. అత్యధికంగా నేత కార్మికులు ఉన్న నగరి, పుత్తూరు పట్టణాల్లో అడుపెట్టాలంటేనే పాపం భానుకు వణికిపోతున్నట్టు టీడీపీ నాయకులే చెవులు కొరుక్కొంటున్నారు. -
విత్తనాలు నేటికీ పంపిణీ చేయలేదు
నగరి : నియోజకవర్గంలో 59 రైతు సేవా కేంద్రాలున్నాయి. విలీనం పేరుతో 28 రైతు సేవా కేంద్రాలను మరో కేంద్రాల్లోకి కలిపేశారు. ప్రస్తుతం కేవలం 31 కేంద్రాలే ఉన్నాయి. దీంతో రైతు సేవా కేంద్రాలు తొలగించిన గ్రామాల్లోని రైతులు సుదూరంగా ఉన్న పక్క గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత రబీలో సబ్సిడీపై అందించాల్సిన వేరుశనగ విత్తనాలను ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు. నగరి మండలం ఓజీ కుప్పంలో రైతు సేవా కేంద్రం నిర్మాణం నిరుపయోగంగా ఉంది. విజయపురం మండలం కేవీపురంలో నిర్మాణం చేపట్టిన రైతుసేవా కేంద్రం పిల్లర్లకే పరిమితమయ్యాయి. ముడిపల్లి రైతుసేవా కేంద్రంలో ఎరువులు, యూరియా లేకపోవడంతో వారు తమిళనాడు సరిహద్దులకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. -
ఆస్పత్రుల్లో అయోమయం!
వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో వైద్యసేవలు గాడితప్పుతున్నాయి. దీంతో పనిభారం పెరుగుతోంది. సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026పాలసముద్రం మండలంలో ఆర్బీకేను రేషన్ షాపుగా మార్చిన దృశ్యంరైతు సేవలకు ఉరి!చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో ఏడాది కిందట 502 రైతు సేవా కేంద్రాలుండగా ప్రస్తుతం 314 కేంద్రాలకు కుదించారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు 113, ఎంపీఓలు 23, ఉద్యానశాఖ సిబ్బంది 93 మంది, పశుసంవర్థక సిబ్బంది 284 మంది సిరికల్చర్ సిబ్బంది 90 మంది పనిచేస్తున్నారు. ఈ రైతు సేవా కేంద్రాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటై వ్యవసాయరంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చాయి. గత ఐదేళ్లు రైతులకు పలు సేవలు అందించాయి. అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాంటి సేవలను చంద్రబాబు సర్కారు నిర్వీర్యం చేస్తోంది. నేడు కోతలు చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా కేంద్రాలపై కక్ష కట్టింది. 502గా ఉన్న కేంద్రాలను క్లస్టర్ పేరుతో 314కు తగ్గించింది. ఇక రైతు సేవలను నీరుగారుస్తోంది. ప్రధానంగా యూరియా అందక రైతులు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు పొలం బడి దూరమైంది. పశు వైద్య శిబిరాలకు మంగళం పాడింది. మందుల కొరత వేధిస్తోంది. అప్పట్లో జనరల్ మందులు 50 రకాలు ఉండగా.. ఇప్పుడు ఆ మందులు శూన్యమవుతున్నాయి. రైతు భరోసా కేంద్రాలకు రైతు సేవా కేంద్రాలుగా రంగు చంద్రబాబు ప్రభుత్వం రైతు సేవలకు ఉరి వేస్తోంది. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తోంది. రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చి ఉన్న సేవల్లో కోతలు పెడుతోంది. డిజిటల్ కియోస్క్లు, టీవీలు మూలకు చేరాయి. మరోవైపు ఎరువులు, పురుగు మందులు అందించకుండా రైతులను కష్టాల్లోకి నెట్టింది. పశువైద్యాన్ని గాలికొదిలేసింది. సిబ్బందిని సర్వేలకు పరిమితం చేసింది. దీంతో రైతాంగం అవస్థలకు గురవుతోంది. -
కేంద్రాల కుదింపు.. సిబ్బంది రావడం గగనం
కాణిపాకం : పూతలపట్టు నియోజకవర్గంలో మొత్తంలో 96 రైతు భరోసా కేంద్రాలుండగా క్లస్టర్ పేరుతో 57 కేంద్రాలకు కుదించారు. యాదమరిలో 19 కేంద్రాలుండగా..పలు కేంద్రాలకు సిబ్బంది రావడం కష్టంగా మారింది. దీంతో రైతు సేవా కేంద్రాలు వెలవెలబోతున్నాయి. పూతలపట్టులో 16 కేంద్రాలుండగా ఆ సంఖ్యగా 8కి పడిపోయింది. మిగిలిన కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి. ఉన్న కేంద్రాల్లో ఎరువులు దొరకడం కష్టంగా మారింది. బంగారుపాళ్యంలో 26 కేంద్రాలుండగా 13 కేంద్రాలు చేశారు. ఈ కేంద్రాల్లో రైతులు కావాల్సిన సేవలు దొరకడం లేదు. వీరంతా చిత్తూరు నగరానికి వస్తున్నారు. మిగిలిన వాటిని నిరుపయోగం చేశారు. తవణంపల్లిలో 17 ఆర్బీకేలను 7కు కుదించి..రైతులను అవస్థలోకి నెట్టేశారు. సిబ్బంది సర్వేలకు పరిమితమవుతున్నారు. ఐరాలలో 18 ఉండగా.. 10 కేంద్రాలకు పరిమితం చేశారు. ఈ కేంద్రాల్లో ఎరువులు, పశువైద్య సేవలు కనుమరుగువుతున్నాయి. యూరియా దొరక్క చిత్తూరు నగరంలోని ప్రైవేటు దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. సర్వే పేరుతో కేంద్రాలు ఖాళీ చిత్తూరు నియోజకవర్గంలో 30 రైతు భరోసా కేంద్రాలుండగా..కూటమి ప్రభుత్వం 18 కేంద్రాలకు తగ్గించింది. చిత్తూరు అర్బన్ 4 కేంద్రాలు, రూరల్లో 9 ఉంటే 5 కేంద్రాల వరకు చేశారు. మండలంలో సేవలు అందని ద్రాక్షలా మారాయి. పశువైద్యం దైవాధీనంగా మారింది. యూరియా, పురుగు మందులకు తమిళనాడులోని పొన్నై, పరదారామికి వెళుతున్నారు. గుడిపాల మండలంలో 17 కేంద్రాలుంటే చివరకు 9 కేంద్రాలే మిగిలాయి. సిబ్బంది సర్వే పేరుతో వెళ్లిపోతున్నారు. క్లస్టర్లో కోతలు పడ్డ 8 కేంద్రాలకు తాళం పడగా భవనాల్లో కొన్నింటిని ఇతరత్రా వాటికి వాడేస్తున్నారు. -
రూపకర్తలు వీరే..
పీఎస్ఎల్వీ రాకెట్ తయారు చేయడానికి ఎంతో మంది అనాటి యువ ఇంజినీర్లు శ్రమించినప్పటికి ముగ్గురు శాస్త్రవేత్తల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తాయి. నంబి నారాయణన్, డాక్టర్ ఎస్.శ్రీనివాసన్, ఈకే మాధవన్ నాయర్ కృషి ఫలితమే పీఎస్ఎల్వీ అని చెప్పొచ్చు. ఈ రాకెట్లుకు ప్రాజెక్టు డైరెక్టర్గా ఈకే మాధవన్ నాయర్ పనిచేశారు. అందులో ఎస్.శ్రీనివాసన్ అనే శాస్త్రవేత్త 1994లో జూన్ నుంచి అక్టోబర్ వరకు షార్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. నంబి నారాయణన్ మాత్రం ద్రవ ఇంధనం తయారు చేసిన శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచిపోయారు. 1988లో యువ శాస్త్రవేత్తలుగా వీరు పీఎస్ఎల్వీ ద్రవ ఇంధన దశల మీద ఎన్నో ప్రయోగాత్మక పరీక్షలు చేసి విజయం సాధించారు. ద్రవ ఇంధన ఇంజిన్ తయారు చేసుకుంటే భవిష్యత్లో అత్యంత బరువైన ఉపగ్రహాలను పంపించే సామర్థ్యం వస్తుందని నంబి నారాయణన్ ఆధ్వర్యంలో పారిస్లో శిక్షణకు వెళ్లారు. ఆయన అభివృద్ధి చేసిన ద్రవ ఇంజిన్లనే ఈనాటికీ ప్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం శాస్త్రవేత్తలు వాడుతుండడం విశేషం.శాస్త్రవేత్తలు నంబి నారాయణన్, ఈకే మాధవన్ నాయర్, ఎస్. శ్రీనివాసన్ -
గజరాజుల బీభత్సం
గుడిపాల : ఏనుగుల గుంపు ఒక్కసారిగా పంట పొలాలపై పడింది. రైతులు సాగు చేసుకుంటున్న అరటి, మామిడి, కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి. దీంతో పాటు పెన్సింగ్, పైపులన్నింటినీ ధ్వంసం చేశాయి. దీంతో రైతన్నలు లబోదిబో మంటున్నారు. బట్టువాళ్లూరు, ముత్తువాళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు హరినాథనాయుడు, మునిక్రిష్ణమనాయుడు, చందులతో పాటు మరికొంత మందికి సంబంధించిన 50 కొబ్బరి చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో పాటు అక్కడక్కడా మామిడి, అరటి చెట్లను విరగొట్టాయి. తమిళనాడు ప్రాంతం నుంచి 13 ఏనుగులు వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఏనుగులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో అని ఆదివారం సాయంత్రం డ్రోన్లను ఎగురవేసి దూర ప్రాంతాలకు తరిమిగొడతామని చెబుతున్నారు. ఇలానే కొనసాగితే తాము వ్యవసాయం ఎలా చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీప్రాంతం వైపు ఎవరూ వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు తెలియజేశారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కరణ్సింగ్ రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని నష్టపరిహారం అందజేస్తామన్నారు. దీంతో పాటు వ్యవసాయ పొలాల వైపు రాకుండా ట్రాకర్స్ సాయంతో ఏనుగులను తమిళనాడుకు తరలించే పనిలో ఉన్నామన్నారు. -
ఆస్పత్రుల్లో అయోమయం!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్యశాలలు గాడితప్పుతున్నాయి. సిబ్బంది కొరత ఆస్పత్రులను పీడిస్తున్నాయి. కొరత కారణంగా పనిచేస్తున్న వారిపై పనిభారం పడుతోంది. అదనపు పనులకు వాడేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేదలకు వైద్య సేవలు మొక్కుబడిగా అందుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి 1, ఏరియా ఆస్పత్రులు 6, సీహెచ్సీలు 17వరకు ఉన్నాయి. వీటిలో 1500 వరకు పనిచేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ పోస్టులు 50 వరకు ఖాళీలుంటే.. ఏరియా, సీహెచ్సీల్లో పలు పోస్టులు 132 వరకు ఖాళీలున్నాయి. ఈ ఖాళీలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భర్తీకి నోచుకోవడం లేదు. ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఖాళీల సంఖ్య ఇలా... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏరియా, సీహెచ్సీ ఆస్పత్రుల్లో 132 పోస్టులు ఖాళీలున్నట్లు జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారులు గుర్తించారు. అందులో సివిల్ సర్జన్ 2, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ 10, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 18, డిప్యూటీ సివిల్ సర్జన్ 19, స్టాఫ్నర్స్ 3, ఫార్మసిస్ట్ 11, థియేటర్ అసిస్టెంట్ 7, డార్క్ రూమ్ అసిస్టెంట్ 7, ఆస్పత్రి అడ్మినిస్టేటర్ 6, డీఈఓ 13, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ 13, ల్యాబ్ అటెండెంట్ 2, పోస్టుమార్టం అసిస్టెంట్ 5, ఫ్లంబర్ 2, ఎలక్ట్రీషియన్ 2, నర్సింగ్ సూపరింటెండెంట్ 2, హెడ్నర్సు 1, ఆఫీస్ సబార్డినేటర్ 1, ఇతర పోస్టులు 8 వరకు ఖాళీలు చూపించారు. ఈ పోస్టులు అధికంగా కుప్పం, పలమనేరు, నగరి, పీలేరు, పుంగనూరు ఏరియా ఆస్పత్రుల్లో కనిపిస్తునాయి. వాయల్పాడు, సత్యవేడు, సదుం, బి.కొత్తకోట సీహెచ్సీల్లో కూడా పోస్టుల కొరత వేధిస్తోంది. ఇది పోను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్టుల భర్తీ అయోమయంలో పడింది. అదనపు భారం... వైద్యశాలలో సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి అదనపు డ్యూటీలు వేస్తూ వేధిస్తున్నారు. 12గంటల పాటు పనులు చేయిస్తున్నారు. స్టాఫ్నర్సుల ద్వారా ఇతరత్రా పనులు చేయిస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు చేయాల్సిన జనన, మరణ ధ్రువీకరణలను స్టాఫ్ నర్సుల ద్వారా చేయించుకుంటున్నారు. తద్వారా స్టాఫ్ నర్స్ల చేయాల్సిన విధులు గాలిలో దీపంలా మారాయి. జిల్లా ఆస్పత్రితో పాటు సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో పోస్టుల కొరతతో ఎఫ్ఎన్ఓలను అన్నింటికి వాడేస్తున్నారు. ఇంజెక్షన్లు వేయడం, సైలెన్ ఎక్కించడం, బ్లడ్ శ్యాంపిల్స్ సేకరించడం వంటి పనులు చేయించడం విడ్డూరమని పలువురు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వం పేదల వైద్యానికి ఎలాంటి ఢోకా లేకుండా సేవలను విస్తృతం చేసింది. పల్లె పల్లెకు వైద్యసేవలను తీసుకొచ్చి..పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. వేలాది పోస్టులను భర్తీ చేసి..వైద్య సేవల్లో లోటు లేకుండా చేశారు. పోస్టులు ఖాళీ పడితే వెను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో వైద్యసేవలు అప్పట్లో పుంజకున్నాయి. ఈ విషయాన్ని శాఖలోని పలువురు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇదీ జిల్లా ఆస్పత్రి దుస్థితి... జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల పోస్టుల ఖాళీలు వేధిస్తున్నాయి. ఇద్దరు వైద్యులతోనే పోస్టుమార్టంను నిర్వర్తిస్తున్నారు. ఇంకా ఆరుగురు డాక్టర్లు అవసరమవుతోంది. ఇటీవల కంటి వైద్యులు సుధా మృతి చెందారు. ఈ స్థానం కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉంది. అలాగే మానసిక వైద్య విభాగ వైద్యులు, దంత, చర్మ వైద్యులు, జనరల్ మెడిషన్ లేరని ఆస్పత్రి వర్గాలు వాపోతున్నారు. దీని కారణంగా వైద్యం అటుంచింతే..సదరన్ సర్టిఫికెట్ల జారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో రెండు నెలలో మరో ఇద్దరు వైద్యులు రిటైర్ కానున్నారు. దీంతో పాటు డీఈఓలు 3, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు 10, ఫార్మసిస్ట్ 17, ఓటీ అసిస్టెంట్లు 5 మంది, ల్యాబ్ సిబ్బంది 7 మంది భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ఆస్పత్రిలోని వైద్యం బృందం డిమాండ్ చేస్తోంది. ఖాళీల కొరతతో ఇబ్బందులు తప్పడంలేదు. -
అటవీశాఖ అధికారులకు నెమలి అప్పగింత
తవణంపల్లె : మండలంలోని గాజులపల్లె సమీపంలోని క్వారీ వద్ద దొరికిన నెమలిని స్థానికులు సురక్షితంగా అటవీశాఖ అధికారులకు అప్పగించారు. గాజులపల్లె సమీపంలోని క్వారీ వద్ద నెమలి రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టారు. క్వారీ వద్ద ఉన్న స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ డాక్టర్ నాయక్.. ఫారెస్టు బీట్ ఆఫీసర్లు జబీ, మనోజ్లను పిలిపించి నెమలిని సురక్షితంగా అప్పగించారు. ఇటీవల అటవీ ప్రాంతాల్లో నివసించాల్సిన వన్యప్రాణులు పంట పొలాల్లోకి వస్తున్నా అటవీశాఖ అధికారులు వాటిని సంరక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
మూత పడిన కేంద్రాలు
కుప్పం : కుప్పం నియోజకవర్గంలోని రైతు సేవా కేంద్రాలను తెరవడం లేదు. గతంలో రైతులకు కావాల్సి విత్తనాలు, యూరియా, ఎరువులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలు, ఎరువులు పంపిణీ నిలిపి వేశారు. ఇన్ఫుట్స్ సబ్సిడీ, బీమా, రైతులకు అందాల్సిన సంక్షేమ పథకాలపై పర్యవేక్షణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రైతు కేంద్రాలు ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేసి వెళ్తారు తప్ప నిత్యం రైతు భరోసా కేంద్రాలు తెరవడం లేదు. నియోజకవర్గంలోని 12 చోట్ల పంచాయతీ కార్యాలయాలను రైతు భరోసా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. -
సేవలకు గ్రహణం
కార్వేటినగరం : జీడీ నెల్లూరు నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాలు రేషన్ షాపులుగాను, మరికొన్ని నిర్మాణం పూర్తికాక అసంపూర్తిగా దర్శన మిస్తున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 88 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. మండలాల్లో గతంలో రైతులకు ఎప్పుడు ఎరువులు, విత్తనాలు, అవసరమైనవి అందుబాటులో ఉండేవి. అప్పట్లో వాటి గడువు ముగిసి పోతే ప్రభుత్వమే వెనక్కి పంపి మళ్లీ కొత్త స్టాకు తెప్పించి ఉంచేది. నేడు ఆ పరిస్థితి లేదు. ఎరువులు అందుబాటులో ఉండడం లేదు. విత్తనాలు కనుమరుగు అయ్యాయి. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాలసముద్రం మండల కేంద్రంలోని ఆర్బీకేలో ఏకంగా రేషన్ దుకాణం ఏర్పాటు చేశారు. కార్వేటినగరం మండలంలో డీఎం పురం ఆర్బీకే ప్రారంభానికి నోచుకోలేదు. వెదురుకుప్పం మండలంలో మాంబేడు, పచ్చికాపల్లి ఆర్బీకేలు అసంపూర్తిగా ఉన్నాయి. శ్రీరంగరాజపురం మండల కేంద్రంలో ఉన్న ఆర్బీకే అసంపూర్తిగా ఉంది. గంగాధర నెల్లూరు మండలంలో 23 ఆర్బీకేలను 13 క్లస్టర్గా మార్చి వాడుకుంటున్నారు. -
ఇస్రో ప్రస్థానం.. ‘పీఎస్ఎల్వీ’దే అగ్రస్థానం
సూళ్లూరుపేట : శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో తొలిసారిగా 1979 ఆగస్టు 10వ తేదీన 22 మీటర్లు పొడవు, 17 టన్నుల బరువుతో 40 కిలోల ఉపగ్రహంతో ఎస్ఎల్వీ–3 ఇ1 పేరుతో రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తర్వాత ఎస్ఎల్వీ సిరీస్లో నాలుగు ప్రయోగాలు, ఏఎస్ఎల్వీ సిరీస్లో నాలుగు ప్రయోగాలు ఘన ఇంధన దశలతోనే పూర్తి చేశారు. ఇందులో మిశ్రమ పలితాలు రావడంతో అందరి మదిలో పుట్టిందే పోలార్ సన్ సింక్రోనస్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ). ఈ రాకెట్ను ఘన, ద్రవ ఇంధనాలతో కలగలసిన రాకెట్గా రూపొందించాలని అప్పటి శాస్త్రవేత్తలు నంబి నారాయణన్, శ్రీనివాసన్ తదితరులు ఫ్రాన్స్లో శిక్షణ తీసుకున్నారు. అనంతరం ద్రవ ఇంధన దశలను ఫ్రాన్స్కు పరిచయం చేసింది భారత శాస్త్రవేత్తలే కావడం గమనార్హం. భూమికి 505 నుంచి 730 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లోకి బరువైన ఉపగ్రహాలు పంపేందుకు అధ్యయనం చేశారు. అప్పటి ఇస్రో చైర్మన్ యూఆర్రావు ఆధ్వర్యంలో పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలకు సరైన వేదిక అవసరమని గుర్తించారు షార్లో ఒక వైపు మొదటి ప్రయోగ వేదిక (ఎంఎస్టీ)ని నిర్మిస్తూనే మరో వైపు పీఎస్ఎల్వీ రాకెట్కు అవసరమైన ద్రవ ఇంధన మోటార్ పరీక్షలను 1988లో ప్రారంభించారు. అప్పటి నుంచి 1992 దాకా అనేక పరీక్షలు నిర్వహించి పరిణితి సాధించారు. 44 మీటర్లు పొడవు 320 టన్నుల బరువుతో 1,400 కిలోల ఐఆర్ఎస్–1ఈ అనే ఉపగ్రహాన్ని 1993 సెప్టెంబర్ 20న మొట్టమొదటిగా పీఎస్ఎల్వీ–డీ1 పేరుతో ప్రయోగించారు. ద్రవ ఇంధన దశలో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆ ప్రయోగం విఫలమైంది. తర్వాత 1994 అక్టోబర్ 15వ తేదీన పీఎస్ఎల్వీ–డీ2 ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ రాకెట్ల విజయంలో ద్రవ ఇంధన దశల్లో వినియోగించే వికాస్ ఇంజిన్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటి దాకా చేసిన 63 పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో 60 ప్రయోగాలు విజయవంతమై 99.99 శాతం సక్సెస్ రేటును సాధించాయి. 60 పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 518 ఉపగ్రహాలను ప్రయోగించగా ఇందులో 38 దేశాలకు చెందిన 433 విదేశీ ఉపగ్రహాలే ఉండడం విశేషం. 72 స్వదేశీ ఉపగ్రహాలు, దేశీయంగా పలు యూనివర్సిటీలకు చెందిన 15 ఉపగ్రహాలను ప్రయోగించారు. పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా కమ్యూనికేషన్ (సమాచారం) ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు (దూరపరిశీలనా ఉపగ్రహాలను), గ్రహాంతర ప్రయోగాలు, దిక్సూచి వ్యవస్థ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి పంపించి దేశ ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన ఘనత పీఎస్ఎల్వీకే దక్కింది. ఈ రాకెట్ రాకముందు ఇస్రో ఇతర దేశాల మీద ఆధారపడి ప్రయోగాలు చేసేది. ప్రస్తుతం ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి ఎదిగింది. ప్రపంచంలో భారత కీర్తి ప్రతిష్టలను పతాకస్థాయిలో నిలిపింది పీఎస్ఎల్వీనే. చంద్రయాన్–1, మార్స్ ఆర్బిటర్ మిషన్–1, ఆదిత్య ఎల్1, ఖగోళంలో పరిఽశోధనల నిమిత్తం ఆస్ట్రోశాట్ వంటి ముఖ్యమైన ప్రయోగాలు పీఎస్ఎల్వీతోనే సాధ్యమయ్యాయి. 2017లో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారానే ఒకేసారి 104 ఉపగ్రహాలను తీసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించింది. -
మాటేసిన మృత్యువు
నగరి : బతుకు తెరువు కోసం అస్సాం రాష్ట్రం దిబ్రూఘర్ జిల్లా టింగ్ఖోంగ్ దోవాపత్తర్ గ్రామానికి చెందిన రాజెన్ముర (42) నగరి మండలం తడుకుపేట సమీపంలోని చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బతుకు తెరువు కోసం రాజెన్ముర అసోం నుంచి వచ్చి నగరి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న రైల్వే పనుల్లో కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చునేందుకు ట్రాక్పై నడిచి వెళుతున్న అతను వెనుక వైపున వస్తున్న గూడ్స్ను గమనించలేదు. సుదూరంగా ట్రాక్లను సరిచూస్తున్న కీమెన్ గూడ్స్ వస్తున్న ట్రాక్లోనే రాజెన్ముర నడిచి వస్తుండడాన్ని గమనించి అరిచి అతడిని హెచ్చరించాడు. అకస్మాత్తుగా గూడ్స్ రావడాన్ని గమనించిన రాజెన్ పక్కకు తప్పుకునే ప్రయత్నంలో ఏటవాలుగా ఉన్న ప్రదేశంలో కాలుపెట్టి అక్కడి నుంచి జారి చెరువులో పడ్డాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. అక్కడికి పరుగు తీసుకుంటూ వచ్చిన కీమెన్ జారిపడ్డ రాజెన్ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు సిబ్బందితో చేరుకున్న సీఐ మల్లికార్జునరావ్, ఎస్ఐ నాయక్ ఈతగాళ్లను చెరువులో దింపి గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు గాలించిన ఈతగాళ్లు ముళ్లకంపలకు తగులుకొని ఉన్న రాజన్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
లారీ బోల్తా
గుడిపాల : డివైడర్ను ఢీ కొనడంతో లారీ బోల్తా పడిందని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. శనివారం రాత్రి 11:30 గంటలకు చిత్తూరు వైపు నుంచి చైన్నె వైపునకు టైల్స్ పౌడర్ మూటలను వేసుకొని సీఎంసీ ఆసుపత్రి వద్ద ఉన్న డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఆ సమయంలో వాహనాలు ఏవీ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఓవరాల్ చాంపియన్గా వెటర్నరీ కళాశాల చంద్రగిరి : విజయనగరం జిల్లా గరివిడిలోని వెటర్నరీ యూనివర్సిటీలో ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన స్పోర్ట్స్, కల్చరల్, లిటరరీ మీట్లో తిరుపతి వెటర్నరీ వర్సిటీ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్స్గా నిలిచారు. సుమారు 530 మంది పాల్గొన్న ఈ పోటీల్లో తిరుపతి ఎస్వీ వెటర్నరీ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. అథ్లెటిక్స్ చాంపియన్లుగా విజయ్, అంజలి నిలిచారు. బాలుర బాస్కెట్ బాల్ పోటీల్లో వర్సిటీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీసీ వెంకటరమణ, డైరెక్టర్ వైకుంఠరావు చేతులమీదుగా బహుమతులు అందుకున్నారు. 100, 200, 400 మీటర్ల పరుగు పోటీల్లో వేణుతేజ బంగారు పతకాలను సాధించారు. తమ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్లుగా నిలవడం ఆనందంగా ఉందని అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. పీడీ జయచంద్ర, ఓఎస్ఏ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ సుధీర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ స్రవంతిని ప్రశంసించారు. ముక్కంటిని దర్శించుకున్న ప్రముఖులు శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. ఇందులో మైసూరు యదతోర్ మఠం పీఠాధిపతి శంకరభారతిస్వామిజీ, సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి స్వామి, అమ్మవార్లను ఉన్నారు. దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు గుర్రప్పశెట్టి, గోపీనాథ్, ఏఈవోలు విద్యాసాగర్రెడ్డి, మోహన్, ఏపీఆర్వో రవి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. గుడిమల్లంలో ... ఏర్పేడు: మండలంలోని గుడిమల్లంలో వెలసిన ఆనందవల్లీ సమేత శ్రీ పరశురామేశ్వరాలయాన్ని ఆదివారం తెలుగు సినీ నటులు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఆలయ ఈవో రామచంద్రారెడ్డి మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం చేయించారు. వేదపండితుల ఆశీర్వచనం అందించారు. ఆలయ తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టత, ఆలయంపై పురావస్తుశాఖ నిపుణుల పరిశోధనలను గురించి ఆయన వివరించారు. గుడిమల్లం పరశురామేశ్వరుని ఆదివారం న్యూఢిల్లీ సీబీఐ ఐజీ వీరేష్ ప్రభు, విశాఖపట్నం డీఐజీ మురళీరంబ, తిరుపతి అడిషనల్ ఎస్పీ వెంకట్రావు దర్శించుకున్నారు. ఆలయాధికారులు వారికి ఆలయ మర్యాదలతో దర్శనం చేయించి ఘనంగా సత్కరించారు. -
ఆకట్టుకున్న కవి సమ్మేళనం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మన సంస్కృతి, సంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయని చిత్తూరు జిల్లా రచయితల సంఘ గౌరవాధ్యక్షుడు కట్టమంచి బాలకృష్ణారెడ్డి, అధ్యక్షుడు గిరిధరన్ అన్నారు. చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం ‘సంక్రాంతి సంబరాలు–కవిసమ్మేళనం’ నిర్వహించారు. ఈసందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే కోలాటలు, గొబ్బెమ్మ పాటలతో సందడి చేశారు. వారు మాట్లాడుతూ ఒకప్పుడు సంక్రాంతి పండగంటే గంగిరెద్దులు, హరిదాసులు, ఆటలపోటీలతో పల్లె, పట్నం ఉత్సాహంగా కనిపించేదన్నారు. సంప్రదాయ పూజలతో ప్రజల్లో భక్తిభావం ఉండేదన్నారు. బంధువులతో ఇళ్లంతా కళకళలాడేదన్నారు. ఇప్పుడు ఫోన్లలో మాత్రమే బంధాలు కనిపిస్తున్నాయన్నారు. మళ్లీ పాతరోజులను చూడాలంటే సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం పలువురు కవులను సన్మానించారు. కుప్పం రెడ్డమ్మ, సాహితీ ట్రస్టు నిర్వాహకులు రామలక్ష్మి, సభ్యులు కృష్ణమూర్తి, సుధాకర్ మోహన్, శైలజమూర్తి, నాగరాజు, మల్లేశ్వరరాజు, మస్తానమ్మ పాల్గొన్నారు. -
మూలకు చేరిన కియోస్క్లు
పలమనేరు : గత ప్రభుత్వంలో రైతుల చెంతనే ఉంటూ వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉన్న రైతుసేవా కేంద్రాల్లో నేడు సేవలు అంతంత మాత్రంగానే మారాయి. గతంలో రైతులకు ఎప్పుడు ఎరువులు కావాలన్నా దొరికేవి. నేటి కూటమి పాలనలో కేవలం ఓ బస్తా యూరియా కోసం పొరుగునే ఉన్న కర్ణాటక లేదా ఎప్పుడో అందించే యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. పలమనేరు నియోజకవర్గంలో 90 పంచాయతీల్లో రైతుసేవా కేంద్రాలున్నాయి. పలమనేరు రూరల్ మండలంలోని కోటూరు ఆర్స్కేలో గోదాంగా మారింది. ఇక సముద్రపల్లి కేంద్రం అలంకారప్రాయంగా మారింది. పెద్దపంజాణి, గంగవరం మండలాల్లోని ఆర్స్కేల్లో కియోస్క్లు మూలకు చేరాయి. బైరెడ్డిపల్లి మండలంలో కొన్ని చోట్ల రైతులు పంట ఉత్పత్తులను సెంటర్ల ముందు వేసుకొని వాడుకుంటున్నారు. మండల కేంద్రమైన వీకోట, బైరెడ్డిపల్లిలోనూ ఆర్ఎస్కేల్లో ఎలాంటి సేవలు లేవు. దీంతో ఆర్ఎస్కేల వద్ద బూతద్దం పెట్టి వెతికినా రైతులు కనిపించడం లేదు. -
కాజూరు చెరువు కనుమరుగు
సాక్షి, టాస్క్ఫోర్స్ : ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాజూరు చెరువు కనుమరుగు కానుంది. చెరువును సైతం కనుమరుగు చేసే అధికార పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలో ఉండడం వల్లే సాధ్యమవుతోంది. గత నెల రోజులకు పైగా కాజూరు చెరువులోని మట్టిని దోచేస్తున్నారు. యంత్రాలతో మట్టిని యథేచ్ఛగా తోడేస్తున్నారు. కాజూరు చెరువులో మట్టిని ఇష్టానుసారంగా తవ్వుతున్నప్పటికీ జిల్లా యంత్రాంగం స్పందించడం లేదు. చెరువులో రోజు వందలాది లోడ్లు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికులు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే వారి ఇళ్ల వద్దకు రౌడీలను పంపి దౌర్జన్యాలకు దిగుతున్నారు. అక్రమ మట్టి తవ్వకాలు కాజూరు లోని ఓ టీడీపీ నాయకుడు, చిత్తూరులోని ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో జరుగుతోందని తెలిసింది. వేల మంది రైతులకు ఉపయోగపడే కాజూరు చెరువును అభివృద్ధి చేయాల్సింది పోయి ఆ చెరువును ప్రస్తుత సర్కారులో కనుమరుగు చేస్తున్నారు. చెరువును కబ్జా చేస్తున్నప్పటికీ ఇరిగేషన్, నగరపాలక అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి మట్టి దోపిడీ చేస్తున్న అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాజూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు, కాజూరు చెరువు నుంచి ట్రాక్టర్లతో మట్టి తరలిస్తున్న దృశ్యాలు -
ఆగని మట్టి దోపిడీ
కుప్పం చెరువులో కొనసాగుతున్న మట్టి తవ్వకాలు కుప్పం : కుప్పం చెరువుల్లో అధికార పార్టీ నేతలు దర్జాగా చేపట్టిన మట్టి తవ్వకాలు ఆదివారం యథాతంగా కొనసాగాయి. పట్టణ నడిబోడ్డున నివాస గృహాల మధ్యలో ఉన్న చెరువులో జేసీబీ, ఇటాచీ యంత్రాలతో ఇష్టానుసారంగా చెరువల్లో మట్టి దోపిడీ చేస్తున్నారు. రెండు రోజులుగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మట్టి దోపిడీ చేస్తున్నారని కుప్పం పట్టణంలో ప్రజలు, సోషియల్ మీడిమా , ప్రతికలు కోడై కూస్తున్నా అధికార పార్టీ ఏమాత్రం లెక్క చేయకుండా చెరువును తవ్వేస్తున్నారు. వేల లోడ్లు తరలించిన నేతలు కుప్పం చెరువులో మట్టి తవ్వకాలతో రియల్ ఎస్టేట్ లే అవుట్ లోడింగ్ చేస్తున్నారు, కొందరు ఇటుకల తయారీకి కావాల్సిన మట్టి మందస్తుగా ట్రాక్టర్లుతో తోలి స్టాక్ పెట్టుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ లోడ్ సుమారు రూ.400 ప్రకారం ఒప్పందం కుదుర్చుకుని కుప్పం చెరువుల్లో మట్టి తవ్వి అమ్మేస్తున్నారు. రెండు రోజులుగా నాలుగు జేసీబీ యంత్రాలు, ఇటాచీ వాహనం, 100 ట్రాక్టర్లుతో వేల లోడ్లు తరలించి సొమ్ము చేసుకున్నారు. చెరువును శుభ్రం చేసేందుకు రూ.3 లక్షలు పట్టణం నడిబొడ్డున చుక్క నీరు లేక ఎండిపోయి పిచ్చి మొక్కలతో నిండిపోయిన చెరువును శుభ్రం చేసేందుకు రూ. 3 లక్షల నిధులు మంజూరు చేశారు. పిచ్చిమొక్కలు తొలగించి నీటి ప్రవాహానికి సౌకర్యంగా చదును చేయాలని మున్సిపల్ అధికారులు సూచించారు. దీన్నే అదునుగా చేసుకుని భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇటు ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు కాగా అటు మట్టిని అమ్ముకుని అధికార పార్టీ నేతలు దోచేశారని పట్టణంలో పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం రాకపోవడం గమనార్హం. -
108లో సమ్మె సైరన్ !
కాణిపాకం : అత్యవసర వైద్యం అవస్థల్లో కూరుకుపోతోంది. సేవలు అందించే 108 వ్యవస్థకు కష్టాలొచ్చి పడ్డాయి. ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష గట్టింది. ఆపద్భాందవులపై అక్కసు ప్రదర్శిస్తోంది. ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. గతంలో వేతన నిధులు మంజూరు చేయకుండా అలక్ష్యం ప్రదర్శించిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుతం వారి సమస్యలు పరిష్కరించకుండా మోసం చేస్తోంది. ఆరు నెలలుగా సమస్యలు పరిష్కారానికి చొరవ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో వారందరూ సమ్మె సైరన్ మోగిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా 108 వాహనాలు 33 ఉన్నాయి. వీటి లో 70 మంది ఈఎంటీ, 75 పైలెట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అత్యవసర వైద్య సేవలు అందించడంలో వీరు కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రతి నెలా వేల సంఖ్యలో క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే భేదం లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఈ వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం కనీస కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. కొన్ని నెలలుగా 108 ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. 108లో పనిచేసే ఈఎంటీ, పైలెట్లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం అందుతోంది. సూపర్ వైజర్లకు రూ.30 వేలు, మేనేజర్లకు రూ.50 వేలు చెల్లిస్తున్నారు. గతంలో మూడు మాసాల వేతనాలు మంజూరు చేయలేదు. వెరసి ఉద్యోగులకు ఆకలి కేకలు తప్పలేదు. దాదాపు 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయం, డీఎంహెచ్ఓ, డీఆర్వో, ప్రజాప్రతినిధులు, 108 కోఆర్డినేటర్ కార్యాలయాల్లో 108 ఉద్యోగులు అందజేశారు. తమ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో సోమవారం తర్వాత ఏ క్షణమైనా 108 వాహనాలను నిలుపుదల చేసి విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. సెలవులు ఏవీ.. 108 సిబ్బంది అత్యవసర విధుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు రోజుకు దాదాపు 12 గంటల పాటు పనిచేయాలి. అదనంగా చేసే పనికి ఎటువంటి ఆదనపు చెల్లింపులు ఇవ్వడం లేదు. ఒక్కో వాహనానికి కనీసం ఆరుగురు ఉద్యోగులు రెండు షిప్టుల్లో పని చేయాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత ఉన్నా అలాగే నెట్టుకొస్తున్నారు. ఏ ఉద్యోగీ వారాంతపు సెలవు తీసుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. పండుగల సెలవులను మర్చిపోయారు. డ్యూటీ వేసిన మరుక్షణం వెళ్లి పోవాల్సిందే. అంత యాతన అనుభవించి పనిచేస్తున్నా ప్రభుత్వం కనికరంలే కుండా వ్యవహరిస్తోంది. సమస్యలు పరిష్కారం కాక ఉద్యమబాట చంద్రబాబు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో 108 ఉద్యోగులు ఉద్యమబాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆరు నెలలుగా నిరీక్షిస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఆరు మాసాల క్రితం ఆందోళనకు దిగిన ఉద్యోగులను బుజ్జిగించి, సమస్యలకు పరిష్కారం చూపుతామని నమ్మబలికిన ప్రభుత్వం నేటికీ వాటిని అమలు చేసిన దాఖలాలు లేవు. దీంతో చేసేది లేక తిరిగి సమ్మెకు దిగేందుకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సోమవారం నుంచి సమ్మె లోకి వెళతామని 108 సంఘం వెల్లడించింది. -
బరితెగింపు
గోతులమయంగా నెత్తం కండ్రిగ చెరువు నగరి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకృతి వనరుల పరిరక్షణ అటకెక్కింది. దీంతో జాతీయ రహదారి, రైల్వే పనుల సాకుతో ఇప్పటికే గ్రావెల్, ఇసుకను ఇష్టానుసారం తరలించేస్తున్న అక్రమార్కులు చెరువు మట్టిని కూడా వదలడం లేదు. రైల్వే పనులకు మట్టి అవసరమంటూ నెత్తం కండ్రిగ చెరువులోని మట్టిని ఇష్టానుసారంగా తరలించేస్తున్నారు. ఇటాచీ, జేసీబీల సాయంతో 30 నుంచి 40 అడుగుల లోతు గుంతలు తీస్తూ మట్టిని టిప్పర్లలో తరలించేస్తున్నారు. దీంతో నెత్తం కండ్రిగ చెరువు మొత్తం గోతులమయంగా మారింది. మన ప్రాంతంలో వేసే రైల్వే పనులకే కదా అని పట్టించుకోని గ్రామస్తులు వందల సంఖ్యలో వాహనాలు వెళ్తుండడంతో సందేహం వచ్చి శనివారం చెరువును పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ పరిస్థితిని చూసి షాక్కు గురయ్యారు. చెరువులో పెద్ద గుంతలు తవ్వేసి ఉండటం చూసి ఆగ్రహావేశాలకు లోనయ్యారు. మట్టి తవ్వుతున్న వాహనాలను అడ్డుకున్నారు. 30 నుంచి 40 అడుగుల గోతులు తవ్వేశారని వర్షాలకు చెరువు నిండే సమయంలో గోతులు తెలియక మనుషులు , పశువులు దిగితే ఎంత ప్రమాదకరమో తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేసినవారిలో గ్రామస్తులు రమేష్ రెడ్డి, ధనపాల్రెడ్డి, దేవరాజులు, పురుషోత్తం, కుప్పుస్వామి, పీతాంబరం తదితరులు ఉన్నారు.వాహనాలను అడ్డుకుంటున్న గ్రామస్తులు చెరువులో తవ్వేసిన రాక్షస గోతులు -
మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న వేధింపులు కట్టేసి కొట్టడం.. గ్యాంగ్ రేప్.. హత్యలు అన్నీ ఇక్కడే సీఎం సొంత జిల్లాలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కొమ్ము కాస్తున్న మరికొందరు దారి తప్పుతున్న దర్యాప్తు.. బలవుతున్న అతివలు
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చూడాలంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సొంత జిల్లా చూస్తే తెలిసిపోతుంది. మహిళలు, బాలికలే లక్ష్యంగా మృగాలు రెచ్చిపోతున్నారు. కరుడుగట్టిన నేరస్తులు చేయలేని పనులను నీళ్లు తాగినంత సులువుగా చేసేసి అధికార పార్టీ పేరు చెప్పుకుంటున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న వరుస ఘటనలు సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. మహిళలకు కనీస భద్రతలేక రోడ్లపైకి రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇంటర్ చదువుతున్న బాలికపై గతేడాది సెప్టెంబరు 25న జరిగిన గ్యాంగ్ రేప్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అటవీశాఖకు చెందిన పార్కులోకి తన స్నేహితుడితో కలిసి వెళ్లిన బాలికను బెదిరించిన కిషోర్, మహేష్, హేమంత్ లైంగిక దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాలిక స్నేహితుడి కడుపులో పిడిగుద్దులు గుద్ది, అతడి నోరు అదిమిపెట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆపై అడవిలో వీళ్లిద్దరినీ వదలి నిందితులు పారిపోయారు. ఈ ముగ్గురూ టీడీపీ నాయకులే. తీరా ప్రజలే నిందితులను పట్టిస్తే.. ముగ్గురినీ అరెస్టు చూపించిన ఖాకీలు తమ నిర్లక్ష్యం కప్పిపుచ్చుకోవడానికి వాళ్లను రోడ్లపై నడిపించారు. సాక్షి టాస్క్ఫోర్స్, తిరుపతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళపై జరిగిన కౄరమైన దాడి సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేసింది. తన భర్త తీసుకున్న అప్పును చెల్లించలేదని కుప్పం పట్టణంలోని నారాయణపురంలో ఓ మహిళను కన్న బిడ్డ ఎదుటే ఓ చెట్టుకు కట్టేసి కొట్టారు. రూ.80 వేల అప్పు తీసుకుని, వడ్డీలకు వడ్డీ చెల్లించి.. ఆపై డబ్బులు కట్టలేక ఆ కుటుంబం కుప్పం వదిలి వెళ్లిపోయింది. బిడ్డ చదువు కోసం టీసీ తీసుకోవడానికి వచ్చిన ఆమెను ఓ చెట్టుకు కట్టేసి అందరూ చూస్తుండగానే మునికన్నప్ప కుటుంబం దాడి చేసింది. కూటమి పార్టీ కార్యకర్తలైన నిందితులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు తొలుత వెనుకడుగువేశారు. ‘సాక్షి’ దీన్ని వెలుగులోకి తీసుకురావడంతో సీఎం ఆదేశాలతో పోలీసులు స్పందించి నిందితులను అరెస్టు చేశారు. ఇక చిత్తూరు నగరంలో అఖిల్ అనే యువకు డు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అవు ట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తూ, డిప్యూటీ మేయర్ రాజేష్కుమార్రెడ్డి వద్ద సొంత పనులు చక్కబెట్టేవాడు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, వేల్లూరు రోడ్డు వైపు ఒంటరి ప్రేమ జంటలే లక్ష్యంగా చేసుకున్న అఖిల్.. మహిళలపై దాడి చేసి, తాను పోలీసునని చెప్పుకునేవాడు. ఖాకీ దు స్తులు ధరించి, ప్రేమ జంటలను బెదిరించి, డ్రోన్ కెమె రాలో వీడియోలు ఉన్నాయని బంగారు ఆభరణాలు దోచుకునేవాడు. ఇతడిపై చర్యలు తీసుకోవడానికి కూడా ఆలోచించిన ఖాకీలు.. మీడియా లో వార్తలు రావడంతో చర్యలకు ఉపక్రమించారు. ● చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యంలో ఓ వివాహితపై బంగారుపాళ్యంకు చెందిన కానిస్టేబుల్, ఓ హోంగార్డు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన కూడా గతేడాది వెలుగులోకి వచ్చింది. బాధితురాలు స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు చెబితే.. ఆపై పోలీసులు కేసు నమోదు చేశారు. పైరవీలతోనే.. పోస్టింగుల కోసం పైరవీలు చేస్తున్న కొందరు పోలీ సు అధికారులు సక్రమంగా విధులు చేయకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పార్టీ ఎమ్మెల్యేల వద్ద సెల్యూట్ చేసి అటెండెస్ వేసుకోవడం, వాళ్లు చెప్పిన పనులన్నీ చక్కబెట్టడం, లాటరీ, పేకాల క్లబ్బులు, అక్రమ గ్రానైట్ తరలింపులో కొందరు పోలీసు పాత్ర ఉన్నాయని.. ఫలితంగా శాంతిభద్రతలను గాలికి వదిలేశారనే ఆరోపణలు లేకపోలేదు. మరికొందరు పోలీసులు నిజాయితీగా విధులు చేయడానికి వస్తు న్నా, రాజకీయ నాయకుల మాట వినలేదని బదిలీ వేటు వేస్తుండటంతో డ్యూటీలు చేయలేక సతమతమవుతున్నారు. ఇందులో భాగంగా పలువురు ఇన్ స్పెక్టర్లు లా అండ్ ఆర్డర్ వద్దని లూప్లైన్ వెతుక్కుంటుంటే.. జిల్లా లోని ఓ సబ్డివిజన్ అధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. తాజాగా విభిన్న ప్రతిభావంతురాలు కనిపించడంలేదంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే మా పరిధి కాదంటూ తప్పించారు. వారం తరువాత ఆమె హత్యకు గురై నదిలో పడి ఉండడాన్ని మృతురాలి తమ్ముడు గుర్తించాడు. ఈ కేసులో కూడా ఖాకీల దర్యాప్తు సక్రమంగా సాగలేదని పోలీసులను బాధ్యులుగా చేస్తూ ఓ న్యాయవాది మానవ హక్కులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులను ఓ ఠాణా నుంచి మరో స్టేషన్కు పంపిస్తూ నిర్లక్ష్యం చేశారంటూ వికలాంగ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్.. హత్య కలకలం -
ప్రైవేట్ బడుల్లో వ్యాయామ విద్య తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : ఇకపై ప్రైవేట్ పాఠశాలల్లో వ్యాయామ విద్య తప్పనిసరి అని రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఆదేశించారు. ప్రతి తరగతికి వారానికి ఆరు పీరియడ్లు ప్రత్యేకంగా వ్యాయామానికి కేటాయించాలని, ప్రతి విద్యార్థికి రోజుకు ఒక గంట శారీరక శ్రమ ఉండేలా చూ డాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో కచ్చితంగా వ్యాయామ విద్య అమలు చేయాలని తెలిపారు. పాఠశాల అసెంబ్లీలో ప్రతిరోజూ పది నిమిషాలు ధ్యానం, వారానికి ఒక పీరియడ్ నిర్ధేశించిన సిలబస్ మేరకు ఆరో గ్య విద్యకు కేటాయించాలని సూచించారు. ఆరోగ్య విద్య బోధనా సమయంలో విద్యార్థికి నీతి కథలు, నైతిక విలువలు, మంచి ప్రవర్తన, వంటివి బోధించాలని ఆదేశించారు. వడ్డెర ఓబన్న అడుగుజాడల్లో నడుద్దాం జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు చిత్తూరు కార్పొరేషన్: వడ్డెర ఓబన్న అడుగుజాడల్లో నడుద్దామని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. శనివా రం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఈనెల 11వ తేదీన వడ్డెర ఓబన్న జయంతి అని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చరిత్ర పుటల్లో అలుపెరుగని పోరాట యోధుడు వడ్డెర ఓబన్న అని కొనియాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. ఓబన్న త్యాగాలను స్మరించుకుంటూ రాబోయే తరాలకు ఆయన చరిత్రను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జెడ్పీ చైర్మన్ ఆకాంక్షించారు. నాటుబాంబు పేలి ఆవుకు తీవ్ర గాయాలు గంగాధర నెల్లూరు : అడవి పందుల కోసం వేటగాళ్లు పెట్టిన నాటుబాంబును ఆవు కొరకడంతో తీవ్ర గాయాల పాలై రైతుకు నష్టం చేకూర్చిన సంఘటన గంగాధర నెల్లూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కొండేపల్లి పంచా యతీ పరిధిలోని పోలినాయుడుపల్లిలో రైతు నారాయణస్వామి నాయుడుకు చెందిన పాడి ఆవు శనివారం పొలంలో గడ్డి మేస్తుండగా వేటగాళ్లు అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబును కొరకడంతో ఆవు నోటి భాగం పేలిపోయింది. వేటగాళ్లు ప్రమాదకరమైన నల్లమందును జనావాసాలలో పెడితే మనుషులకు కూడా ప్ర మాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లమందు పెట్టే వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
వాట్సాప్లో టెట్ ఫలితాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో టెట్ రాసిన అభ్యర్థులు వాట్సాప్లో ఫలితాలు చూసుకోవచ్చని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గత ఏడాది డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వర కు పరీక్షలు జరిగాయని చెప్పారు. టెట్ రాసిన అభ్యర్థులు 9552300009 నంబర్లో ఫలితాలు తెలుసుకోవచ్చని డీఈవో వెల్లడించారు. విఘ్నేశ్వరుని సన్నిధిలో తనికెళ్ల భరణి కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని బుధవారం సినీనటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగ తం పలికి దర్శన సేవలు చూశారు. అనంతరం వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు, స్వామి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది వాసు, రవి తదితరులున్నారు. అయ్యప్పస్వామి సేవలో జెడ్పీ చైర్మన్ సదుం : చిత్తూరు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీని వాసులు మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయాన్ని శనివారం సందర్శించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఆయ న ఇరుముడి కట్టుకుని 18 మెట్ల నుంచి అయ్య ప్ప స్వామిని దర్శించుకుని, ఇరుముడి చెల్లించారు. ఆయనను తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఆలయంలో కలుసుకుని ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. -
దర్జాగా మట్టి దోపిడీ
కుప్పం : అధికారం చేతిలో ఉంటే.. నో రూల్స్.. శనివారం కుప్పం అధికార పార్టీ నేతలు పట్టపగలు పట్టణం నడి బొడ్డున చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టారు. కుప్పం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నాయకులు బరితెగించి మట్టి దందా చేపట్టారు. చెరువు సమీపంలోని గ్రామస్తులు అడ్డుపడినా డోంట్ కేర్ అంటూ మట్టి తరలించేశారు. పట్టణ నడిబొడ్డు జాతీయ రహదారి పక్కన ఉన్న కుప్పం చెరువులో అధికార పార్టీ నేతలు చెలరేగి మట్టి తవ్వకాలు చేపట్టారు. నిబంధనలకు వ్యతిరేకంగా పట్ట పగలు భారీ వాహనాలతో తవ్వకాలు చేపట్టారు. రెండు ఇటాచ్లు, 4 జేసీబీలు, 100 ట్రాక్టర్లు ఇష్టానుసారంగా మట్టి దోచేశారు. అధికార పార్టీ నేతల ఇటుకల తయారీ, రియల్ ఎస్టేట్ లే అవుట్ చదును కోసం భారీ ఎత్తున వాహనాలు పెట్టి దర్జాగా మట్టిని తరలించారు. కుప్పం చెరువు మొత్తం వాహనాలు నిండిపోయాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతంగా తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లుతో మట్టి తరలించారు. అధికారులు ఒకరిపై ఒకరు.. కుప్పం చెరువులో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే అధికారే లేరు. రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేస్తే..ఇరిగేషన్ శాఖ సంబంధించి ఒకరిపై ఒకరు చెప్పుకుని కాలం వెలిబుచ్చారు. ఈ చెరువు పక్కనే ఉన్న బాబునగర్ గ్రామస్తులు ఒకే రోజు భారీ సంఖ్యలో వాహనాలు పెట్టి మట్టి తవ్వకాలు చేపట్టడం సరికాదని అడ్డుపడ్డారు. మా గ్రామంలో ఓం శక్తి ఆలయం చదునుకు 10 లోడ్ల మట్టి కావాలంటే అధికారులు ఒప్పుకోలేదు. ఇప్పుడు వందల సంఖ్యలో వాహనాలు పెట్టి ఇష్టానుసారంగా మట్టి తరలించుకుపోతున్నా ప్రశ్నించిన పాపాన పోలేదు. పట్టపగలు చెరువులో అధిక సంఖ్యలో జేసీబీలు, ట్రాక్టర్లు, ఈటాచీలు పనిచేస్తున్నా...నిలిపి వేయాల ని 100 మంది గ్రామస్తులు రోడ్డెక్కి అభ్యంతరం వ్యక్తం చేసినా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కప్పేసిన దుమ్ము పట్టణంలోని చెరువులో ఒక్కసారి భారీ వాహనాలతో మట్టి తవ్వకాలు చేపట్టడంతో దుమ్ము పట్టణాన్ని కప్పే సింది. చెరువు కట్టనుంచి బాబునగర్, గుడుపల్లె రోడ్డు , కుప్పం పట్టణ వీధుల వెంట ట్రాక్టర్లుతో మట్టి తరలిస్తుండడంతో రోడ్డుపై మట్టి నిండిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కుప్పం చెరువులో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు ఇటాచీలతో ట్రాక్టర్లకు మట్టి నింపుతున్న దృశ్యం -
‘ఫీజు’ బకాయిలు విడుదల చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6,400 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమర్, వైఎస్సార్ యూత్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు మనోజ్రెడ్డి, వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ నియోజకవర్గ కార్యదర్శి సద్ధాం డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నత విద్య చదివే విద్యార్థులను చులకనగా చూస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. ఫీజులు చెల్లించుకోలేక చదువులు మానేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్ర బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీల ను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ యువగళం పాద యాత్రలో విద్యార్థులకు, యువతకు అనేక హామీ లు గుప్పించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీ నెరవేర్చలేదన్నారు. 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి వైద్య విద్యను దూరం చేసేందుకే పీపీపీ విధానాన్ని ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడం వెనుక ఉన్న కుట్ర ను మానుకోవాలన్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఘాటుగా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక రకాల విద్యారంగ సమస్యలు వేధిస్తున్నాయన్నారు. ఈ సమస్య లను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన సంఘాలపై కేసులు పెట్టి బెదిరించడం తగదన్నారు. వెంటనే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యూత్ సంఘం నాయకులు గౌతమ్, అజిత్, శబరీష్రెడ్డి, జయంత్, లోకేష్, రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్, నాయకులు చరణ్, వసంత్ పాల్గొన్నారు. -
బౌల్డిరింగ్ ఫెస్టివల్స్ రద్దు
కుప్పం: మండలంలోని కంగుంది గ్రామంలో ప్రభుత్వం నిర్వహించాల్సి ఉన్న బౌల్డిరింగ్ ఫెస్టివల్ రద్దయ్యింది. రాక్ క్లంబింగ్ క్రీడాకారులకు సరైనా వసతులు లేక పోవడంతో క్రీడాకారులు హాజరుకాలేదు. శుక్రవారం నుంచి మూడు రోజులు పాటు జరగాల్సిన సాంస్కృతి కార్యక్రమాలకు మంత్రులు, శాప్ చైర్మన్, ఎమ్మెల్యేలు వస్తారని భావించిన స్థానిక అధికారులు, నేతలకు నిరాశే ఎదురైంది. ప్లాన్ అదే.. కుప్పం ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బౌల్డిరింగ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమం చేపట్టారు. పూణేకు చెందిన తదేకం, పర్యటక శాఖ, కుప్పం కడా సంస్థలు సంయుక్తంగా ఈ ఫెస్టివల్ నిర్వహించాయి. ఈ ఫెస్టివల్కు కుప్పం మండలం కంగుంది కోటను కేంద్రంగా ఎంపిక చేశారు. ప్రధానంగా రాక్ క్లంబింగ్ (గుట్టలు ఎక్కడం) క్రీడలకు పోటీలు నిర్వాహించారు. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ఆహ్వానించి పెద్ద ఎత్తున్న ఆర్భాటంగా నిర్వహించాలని ప్లాన్ వేశారు. దీని కోసం తదేకం సంస్థ ప్లాన్ ప్రకారం కడా, పర్యటక శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాక్ క్లంబింగ్ క్రీడలతో పాటు స్థానికంగా ప్రాముఖ్యతను సంచరించుకున్న కంగుంది కళలు, వీధి నాటకాలు, వాటికి పర్యటకంగా చూపే ప్రయత్నం చేశారు. వసతుల ఏర్పాటులో విఫలం బౌల్డిరింగ్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో చేపట్టే రాక్ క్లంబింగ్ క్రీడాకారులకు సరైన వసతులు లేవు. ముంబై, బెంగళూరుకు చెందిన 40 మంది క్రీడాకారులు కంగుంది గ్రామానికి వచ్చి తిరిగి వెళ్లిపోయారు. నాలురోజులు పాటు జరిగే ఈ ఫెస్టివల్ రాత్రి వేళలో సరైన వసతులు కల్పించలేదు. దీంతో పలువురు క్రీడాకారులు వెనుదిరిగారు. కంగంది అటవీ ప్రాతం కావడంతో కనీస వసతులతో పాటు రవాణా సౌకర్యలు అంతంతమాత్రంగానే ఉండడం వల్ల బయట ప్రాంతాల నుంచి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. మంత్రుల పర్యటన రద్దు బౌల్డిరింగ్ ఫెస్టివల్ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయ శాఖమంత్రి ఆనం నారాయణరెడ్డి, రవాణ శాఖ మంత్రి రామ్ప్రసాద్రెడ్డి శుక్రవారం రావాల్సి ఉండగా అకస్మాత్తుగా వారి పర్యటనలను రద్దు చేశారు. శనివారం పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజేతలకు బహుమతులు అందజేయాల్సి ఉంది. కానీ వారెవ్వరూ కుప్పం పర్యటనకు రాకపోవడంతో స్థానిక ఫెస్టివల్ నిర్వాహకులు అసహనానికి గురయ్యారు. జనం లేక వెలవెలబోయిన ఫెస్టివల్ బౌల్డిరింగ్ ఫెస్టివల్స్లో నృత్యం చేస్తున్న విదేశీయులు -
పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!
పెళ్లి చేసుకోమన్నందుకే దివ్యాంగురాలు కవితను ప్రియుడు గణేష్ దారుణంగా హత్య చేసినట్టు తేలింది. శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026పలమనేరు: లైవ్స్టాక్ టెస్ట్లు చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్ మామిడి రైతులను ఆదుకోండి బాబూ! పాలసముద్రం: చంద్రబాబు ప్రభుత్వంలో మామిడి రైతులు సర్వనాశ నం అయ్యారని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మామిడి రైతు లను ఆదుకుంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి, ఆయ న తనయుడు వైఎస్.జగన్మోహన్రెడ్డేనని గుర్తుచేశారు. శుక్ర వారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడా రు. గత ప్రభుత్వంలో మా మిడి రైతులకు కిలో కు రూ.30 దాకా ఇచ్చా రన్నారు. ఇప్పుడు రూ.8 కూడా ఇవ్వడం లేద ని మండిపడ్డారు. మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలేక నష్టాలపాలవుతున్నారని వాపోయా రు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం పునరాలోచించి వచ్చే సీజన్లోనైనా మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సూక్ష్మ సాగునీటిలో ఆటోమేషన్కు రాయితీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): సూక్ష్మ సాగునీటి వ్యవస్థలో ఆటోమేషన్ అందజేతకు ప్రభు త్వం రాయితీ ఇస్తోందని ఏపీఎంఐపీ డీడీ రమణ తెలిపారు. చిత్తూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సూక్ష్మ సాగునీటి వ్యవస్థలో ప్రభుత్వం ఆటోమేషన్ను ప్రోత్సాహిస్తోందన్నారు. ఆటోమేషన్ టెక్నాలజీతో నీటివృధాను అరికట్టవచ్చన్నారు. పంట ఉత్పాదకతను పెంచవచ్చని చెప్పారు. ఎక్కడ నుంచి అయినా నీటి పారు దల వ్యవస్థను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఆటోమేషన్ కోసం హెక్టారుకు రూ.40 వేలు ఖర్చవుతుందన్నారు. ఇందుకు ప్రభు త్వం రూ.22 వేలు రాయితీగా అందిస్తోందని గుర్తుచేశారు. ఆసక్తిగల రైతులు తమను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. 12న ఐటీఐలో అప్రెంటీస్ మేళా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 12న అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రముఖ కంపెనీల్లో అప్రెంటీస్షిప్ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో శిక్షణ పూర్తి చేసి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావొచ్చన్నారు. ఇతర వివరాలకు 9676486678 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. విద్యుత్ సమస్యలు పరిష్కారం చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 251 సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల పరంగా 26, ఎల్టీ లైన్ల పరంగా 339, సర్వీసు లైన్ పరంగా 22 కలిపి మొత్తం 638 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ తెలిపారు. వాటిలో 63 సమస్యలను పరిష్కారించినట్టు ఆయన వెల్లడించారు. రైతుకు అగ్ని పరీక్ష!చిత్తూరు రూరల్ (కాణిపాకం): చంద్రబాబుకు మొదటి నుంచీ రైత న్నలంటే చులకనే. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చి నా వ్యవసాయాన్ని, రైతులను చిన్నచూపు చూస్తుంటారు. ఈ సారీ అదే జరుగు తోంది. అన్నదాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటికితోడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.కోట్లు వెచ్చించి రైతన్న సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అగ్రి టెస్ట్ ల్యాబ్లను నిర్వీర్యం చేస్తోంది. ఉపయోగంలో ఉన్నవాటినీ నిరుపయోగంగా మార్చే డం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో నగరి, పలమనేరు, పూతలపట్టు, పెనుమూరు, సోమల ప్రాంతాల్లో గత ప్రభుత్వం అగ్రి ల్యాబ్లు నిర్మించింది. ఒక్కో ల్యాబ్ నిర్మాణానికి, వసతులకు రూ.కోటికిపైగా ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాకు రూ.11కోట్ల వరకు మంజూరైంది. తద్వారా నగరి, పలమనేరు లో ల్యాబ్లు ప్రారంభానికి నోచుకుని పరీక్షలు చేస్తున్నాయి. మట్టి నమూనాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పరీక్షలతో పాటు పశుసంవర్థక శాఖ అభివృద్ధిలో భాగంగా అందుకు సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. రైతులకు నాడు ఎంతో మేలు చేసిన అగ్రి టెస్ట్ ల్యాబ్లు నేడు నిర్వీర్యమయ్యాయి. పాలకుల నిర్లక్ష్యం, కక్ష సాధింపులతో ఇవి ఎందుకూ పనికిరానివాటిగా మార్చేశారు. ఆయా ల్యాబ్లకు చెందిన కోట్ల విలువ చేసే భవనాలు, పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. అ‘లక్ష్యం’! ఎంతో ఉన్నత లక్ష్యం, ఆశయంతో గత వైఎస్సార్సీ పీ ప్రభుత్వం రైతన్న సంక్షేమం కోసం రూ.కోటి ఖర్చు పెట్టి అగ్రిటెస్ట్ ల్యాబ్లు నిర్మించింది. కల్తీ నివారణే లక్ష్యంగా అడుగులు వేసింది. విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించిన తర్వాత సాగుచేస్తే మేలైన దిగుబడులు సాధించే వీలుంటుందనే ఉద్దేశంతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్లను నిర్మించింది. సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలతో భవన నిర్మాణాలు, రూ.40 లక్షలతో వివిధ రకాల పరికరాలు, రసాయనాలు, కంప్యూటరైజ్డ్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. పలమనేరు, నగరిలోని ల్యాబ్లో వందల సంఖ్యలో పరీక్షల నమూనాలు వచ్చేవి. ఆయా నియోజకవర్గాల్లోని మండలాల రైతన్నలకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. అయితే చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఈ ల్యాబ్లు నిర్వీర్యమవుతున్నాయి. పరీ క్ష నమూనాలు రావడమే కష్టంగా మారింది. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు కరు వవుతున్నారు. సీజన్ల వారీగా సాగు విస్తీర్ణం ఈఏడాది ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 80 వేల హెక్టా ర్లు కాగా, సాగు విస్తీర్ణం 30వేల హెక్టార్ల వరకు ఉంటోంది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 24వేల హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 6వేల హెక్టార్లకుపైగా పంటలు సాగులో ఉన్నాయి. వరి సాధారణ విస్తీర్ణం 6,359 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకూ అత్యధికంగా 2 హెక్టార్లలో సాగుచేశారు. గతంలో సీజన్వారీగా పంట పండించే రైతులు అగ్రి టెస్ట్ ల్యాబ్లను ఉపయోగించి.. పరీక్షించుకు నేవారు. ఇలా ఏటా నగరి, పలమనేరు నుంచి 1000కిపైగా పరీక్షలు జరిగేవి. ఇప్పుడు 200 దాటడం కష్టంగా ఉంది. విత్తన వ్యాపారులకే పరిమితం నగరి: ల్యాబ్ సమీపంలో పడి ఉన్న ఖాళీ మద్యం సీసాలు నగరి: ల్యాబ్లో విత్తన పరీక్ష చేస్తున్న సిబ్బంది నగరి: అగ్రి టెస్ట్ ల్యాబ్కు వెళ్లే దారి పలమనేరు: నియోజకవర్గ అగ్రి టెస్టింగ్ ల్యాబ్గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు అభినందనలు చిత్తూరు కలెక్టరేట్ : జాతీయ అండర్ 11, 14 స్థాయిల్లో మార్షల్ ఆర్ట్స్లో రాణించిన విద్యార్థులను కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ అభినందించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఇదే స్ఫూర్తితో మరిన్ని పోటీల్లో రాణించాలన్నారు. కోచ్లు మన్సూర్, ఉమర్ మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్లో 26వ స్క్వే క్రీడా మార్షల్ ఆర్ట్స్ అంతర్జాతీయ పోటీలు నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో చిత్తూరు నగరంలోని జైహింద్ ఉర్దూ పాఠశా ల విద్యార్థులు ప్రతిభచాటారన్నారు. సాయి శ్రవంతి, మహమ్మద్ నూరాజ్, మహమ్మద్ ముస్తకీమ్ బంగారు పతకాలు, అభిలాష్, ఫరూక్ ఖాన్లు రజక పతకం, ఆదిల్, మహమ్మద్ సాద్, ఉమర్, అప్జల్, హఫీన్ తదితర విద్యర్థులు కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థులకు కలెక్టర్ సర్టిఫికెట్, మెడల్స్ అందజేసి అభినందించారు. చిత్తూరు కలెక్టరేట్ : పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో మోహన్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జనవరి 26న నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగస్తులకు అందించే ప్రశంసాపత్రాల వివరాలు వెంటనే కలెక్టరేట్కు పంపాలన్నారు. ఈ నెల 19న కలెక్టర్ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీ సాయినాథ్, ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు. మట్టినే నమ్ముకున్న రైతుకు వెన్నుదన్నుగా నిలవాలి. నకిలీలకు ఫుల్స్టాప్ పెట్టాలి. మేలు రకం విత్తనాలు, ఎరువులు, రసాయన మందులు అందించాలి. అధిక దిగుబడినిచ్చే వంగడాలను అందుబాటులోకి తేవాలి. భూసార పరీక్షలు నిర్వహించి పంట ఎంపికను తెలియజేయాలి..’ అన్న లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అగ్రిటెస్ట్ ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇవి రైతులకు ఎంతగానో ఉపయోగపడేలా చర్యలు చేపట్టింది. గత ఎన్నికల తర్వాత వీటిని నిర్వీర్యం చేయడానికి బాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులకు ఎక్కడ మేలు జరగకుండా.. గత ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు రాకుండా ఉండేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఫలితంగా ఏవి నకిలీవో.. ఏవి మేలైనవో తెలియక రైతులు తికమకపడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో అగ్రిటెస్ట్ ల్యాబ్ల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్రిపోర్ట్. తూతూమంత్రంగా నిర్వహణ నగరి: పట్టణంలో 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.68.5 లక్షలతో డాక్టర్ వైఎస్సార్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్ను నిర్మించారు. అప్పటి వరకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పరీక్షించడానికి తాడేపల్లిగూడెం, హైదరాబాద్కు పంపే రైతులకు ఆ సదుపాయం నగరిలోనే వచ్చింది. 2021 జూలై 8న మాజీ మంత్రి ఆర్కే రోజా ఈ ల్యాబ్ను ప్రారంభంచారు. నగరి, నిండ్ర, విజయపురం, ఎస్ఆర్ పురం, పాలసముద్రం, గంగాదరనెల్లూరు మండలాలకు చెందిన రైతులు ఈ టెస్టింగ్ ల్యాబ్కు విచ్చేసి విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించుకునేవారు. 2023లో 546 టెస్టింగ్లు ఈ ల్యాబ్లో జరిగాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భవనాలపై ఉన్న వైఎస్సార్ పేర్లను తీసేయించారు. ల్యాబ్కు వెళ్లేందుకు దారి వసతి కల్పించ లేదు. రాత్రిళ్లు టెస్టింగ్ ల్యాబ్కు వెళ్లేదారే మద్యం బాబులకు బార్గా మారిపోతోంది. ఉదయాన్నే ల్యాబ్కు విచ్చేసే అధికారులకు ఖాళీ మద్యం సీసాలే దర్శమిస్తున్నాయి. 2025లో ల్యాబ్లో 456 టెస్టింగ్లు మాత్రమే జరిగాయి. ఈ ల్యాబ్లో ఇద్దరు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒకరు మెటర్నిటీ సెలవులో ఉండడంతో ఒక్కరే నిర్వహణ బాధ్యతలను చేపడుతున్నారు. పలమనేరు: గత ప్రభుత్వం పలమనేరులోని ఏఎంసీ పరిధిలో రూ.70 లక్షల వ్యయంతో అగ్రిల్యాబ్ను నిర్మించింది. 2023లో ఈ ల్యాబ్ నిర్మాణం పూర్తయింది. అప్పటి రైతు దినోత్సవం సందర్భంగా అధికారులు ఈ భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడ వ్యవసాయశాఖకు సంబంధించిన ఇరువురు జూనియర్ అనలిస్ట్లు, వెటర్నరీ శాఖకు చెందిన ఇరువురు సిబ్బంది విధుల్లో ఉన్నారు. వీరు ప్రతినెలా వ్యాపారులు, రైతులు, ఫార్ములా మేరకు 50 దాకా టెస్ట్లు చేయాలి. రైతులు ఎప్పటికప్పుడు విత్తనాలు, ఎరువుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించుకోవచ్చు. నకిలీ విత్తనాలను గుర్తించవచ్చు. పశువులకు సోకే వ్యాధుల నిర్థారణ సైతం ఇక్కడ తెలుసుకోవచ్చు. గతంలో ఈ సేవలు కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లేవారు. గత ప్రభుత్వం ఈ టెస్టింగ్ సెంటర్ను స్థానికంగానే అందుబాటులోకి తెచ్చింది. కానీ ఈ సేవలను ట్రేడర్స్ మాత్రమే వాడుకుంటున్నారే గానీ రైతులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. నామమాత్రంగా అప్పుడప్పుడు కొన్ని శ్యాంపుల్స్ మాత్రం టెస్ట్ చేస్తున్నట్టు తెలిసింది. అగ్రిల్యాబ్పై సరైన అవగాహన లేకపోవడమే ఈ దుస్థితికి కారణమవుతోంది. అవగాహన కల్పిస్తే ఒట్టు! ఈ ప్రాంతంలోని వరి సాగుచేసే రైతులు వరి పండించాక పంట దిగుబడి బాగుంటే ఆ ధాన్యాన్ని అలాగే నిల్వ ఉంచి దాన్ని మరో పంటకు విత్తనాలుగా వాడడం ఆనవాయితీ. అగ్రిల్యాబ్లో సిబ్బంది గాని ఆర్ఎస్కేలోని సహాయకులుగానీ పలమనేరులో ఇలాంటి సేవలు అందుబాటులో ఉండాయని చెబితేగా. దీనిపై గ్రామాల్లో రైతులకు చెప్పి అవగాహన కల్పిస్తే బాగుంటుంది. – సోమిరామిరెడ్డి, మొరం పంచాయతీ, పలమనేరు మండలం -
పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!
చిత్తూరు అర్బన్: బ్యాంకు ఉద్యోగం రావడం, తనకన్నా వయసులో 12 ఏళ్లు పెద్దదైన మహిళను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని గణేష్.. కవితను హత్య చేసినట్లు తేలింది. ఆమె కనిపించకుండాపోయిన రోజునే కవితను హతమార్చి నదిలో పడేశాడు. చిత్తూరులో కలకలం రేపిన దివ్యాంగురాలు కవిత (38) హత్య కేసులో నిందితుడు, ఆమె ప్రియుడు కావేరిపాకం గణేష్ (26)ను శుక్రవారం పోలీసులు అరెస్టు చూపించారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య, ఎస్ఐ రమేష్తో కలిసి చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. చిత్తూ రు గిరింపేటకు చెందిన కవిత, ఎస్ఆర్.పురంలోని బసిరెడ్డిపల్లెకు చెందిన గణేష్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పలుమార్లు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా గణేష్ నిరాకరిస్తుండడంతో కవిత పోలీసుల వద్దకు వెళ్లడం.. దివ్యాంగుల జేఏసీ నేతల మధ్య పెళ్లి చేసుకుంటామని చెప్పి రాజీ చేసుకుని వెళ్లేవా రు. ఈ క్రమంలో ఆర్నెళ్ల క్రితం గణేష్కు ఎస్ బీఐలో ఉద్యోగం రావడంతో కవితను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ కవిత నుంచి ఒత్తిడి పెరిగడంతో ఈనెల 31న పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిన కవిత, తన వాహనాన్ని నాయుడు బిల్డింగ్స్ వద్ద పార్కింగ్చేసి.. ఓ ఆటోలో గంగాధరనెల్లూరు సబ్స్టేషన్ వద్దకు వెళ్లారు. ఆపై గణేష్ తన స్కూటర్లో వచ్చి, ఆమెను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. వివాహ విషయమై మళ్లీ ఇద్దరికీ వాద నలు ప్రారంభమవడంతో పెళ్లి చేసకుంటామ ని చెప్పి, స్కూటర్లో ఎక్కించుకుని ఆమె తలను స్కూటర్ ముందు భాగంలోని ఇనుప డోర్కు కొట్టి చంపేశాడు. బ్రిడ్జిపై నుంచి మృతదేహాన్ని నీవా నదిలో పడేసి వెళ్లిపోయాడు. నిర్లక్ష్యంగా చూడలేము ఈ ఘటనలో కవిత తనకు ప్రాణహాని ఉందని జేఏసీ నేతకు పంపిన వాయిస్ మెసేజ్ సకాలంలో చూసుకోకపోవడంతో ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుగా వన్టౌన్కు వెళ్లడం.. ఇది తమ పరిధి కాదనడం, ఆపై టూటౌన్కు వెళ్లినా ఇదే సమాధానం వచ్చింది. తీరా కవిత గిరింపేట నుంచి వెళ్లినట్టు గుర్తించి సీఐ కేసు నమోదు చేశారు. కవిత కనిపించకుండాపోయిన రోజునే హత్యకు గురవడంతో . స్టేషన్ పరిధిపై తిప్పి పంపడాన్ని పోలీసుల నిర్లక్ష్యంగా చూడలేమని డీఎస్పీ పేర్కొన్నారు. కవిత ఫోన్ సిగ్నల్ తమిళనాడులోని ఆరణి ప్రాంతంగా చూపిస్తోందని, ఇంకా రికవరీ చేయలేదన్నారు. దివ్యాంగురాలు కవిత హత్య కేసులో గణేష్ అరెస్ట్ నిందితుడు గణేష్ విద్యాపరంగా ప్రతిభావంతుడు. పదో తరగతిలో మంచి మార్కు లు సాధించిన ఇతను కడప ఐఐఐటీ, ఆపై జేఈఈ అడ్వాన్స్డ్ రాసి తిరుచనాపల్లె ఎన్ఐటీలో బీ.టెక్ పూర్తి చేశాడు. ఆపై సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్లో రెండు మార్కుల్లో వెనకబడ్డాడు. క్రికెట్పై పట్టు ఉన్న ఇతను రాష్ట్ర క్రీడాకారుడిగా, 2021లో డిజేబుల్ ఐపీఎల్ రాజస్థాన్ రాజ్వాడ్స్ టీమ్లోనూ ఆడాడు. 2023లో ఇండియా–నేపాల్ అంతర్జాతీయ డిజేబుల్ క్రికెట్లోనే ఆడాడు. ఈ కోటాలోనే బ్యాంకు ఉద్యోగం కూడా వచ్చింది. కవితను వదిలించుకోవాలనే విషయంలో అతితెలివి ప్రదర్శించాడు. ఆమెను హత్య చేసిన రోజు గణేష్ తన మొబైల్ను బ్యాంకులోనే ఉంచేశాడు. హత్యానంతరం మృతదేహాన్ని బురదలో వేస్తే దుర్గంధం రాదని అక్కడే పడేశాడు. తరువాత కవిత మొబైల్ను ఓ లారీలో పడేసి.. మరుసటి రోజు తాను కూడా ఆమెను వెతుకుతున్నట్లు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. తీరా కవిత మృతదేహం బయటపడడంతో గణేష్ పాచికలు పారలేదు. కవిత హత్యపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చిత్తూరు అర్బన్: చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలు కవిత హత్య కేసులో పోలీసు నిర్లక్ష్యమే కారణమంటూ న్యాయవాది అర్షద్ జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. చిత్తూరు ఎస్పీ, డీఎస్పీ, టూటౌన్ ఎస్హెచ్వోను బాధ్యులుగా చేస్తూ ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై ఇప్పటికే జాతీయ మానవహక్కుల సంఘానికి సైతం అర్హద్ ఫిర్యాదు చేశారు. -
7.83 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఉదయం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యాంశాలివీ.. ● వైకుంఠ ద్వార దర్శనాలపై దాదాపు 93 శాతం మంది భక్తులు సంతృప్తి. ● ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 7.83 లక్షలు. ● గత వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.83 లక్షల మంది దర్శించుకోగా ఈ ఏడాది లక్ష మంది భక్తులకు అదనంగా దర్శనాలు. ● పది రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.41.14 కోట్లు. ● భక్తులకు విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 44 లక్షలు కంటైనర్ ఢీకొని.. బంగారుపాళెం: మండలంలోని బలిజపల్లె ఫ్లైఓవర్పై శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. పాలేరు గ్రామానికి చెందిన శ్రీనివాసులుశెట్టి(55) పంబల కళాకారుడు. గాండ్లపల్లెలో ఓంశక్తి భక్తులు నిర్వహించే పూజా కార్యక్రమానికి పంబలు కొట్టేందుకు ద్విచక్ర వాహనంపై స్వగ్రామం పాలేరు నుంచి గాండ్లపల్లెకు బయల్దేరాడు. మార్గ మద్యంలో బలిజపల్లె ఫ్లైఓవర్పై ఎదురుగా వస్తున్న కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులుశెట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
సంక్రాంతికి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సంక్రాంతి పండుగ పేరుతో ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీటీసీ నిరంజన్రెడ్డి హెచ్చరించారు. సాక్షి దినపత్రికలో ఈ నెల 5వ తేదీన సంక్రాంతికి ప్రైవేటు బాదుడు పేరిట వార్త వెలువడింది. దీనిపై రవాణాశాఖ అధికారు లు స్పందించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రైవేటు ట్రావెల్స్, కాంట్రాక్టు క్యారేజ్, బస్సు యజ మానులు, ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ముందుగా ప్రకటించిన ప్రయాణ షెడ్యూల్ను ఎటువంటి కారణాలతోనైనా రద్దు చేయడం, వాయిదా వేయడం అనుచితమని.. అటువంటి చర్యలు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి దారితీస్తాయన్నారు. వాహనాల అతివేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ను పూర్తిగా నిషేధించాలన్నారు. ప్రతి బస్సులో అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలన్నారు. ప్రయాణికు లు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా సహాయం పొందేందుకు, ప్రభుత్వం ప్రకటించిన హెల్ప్ లైన్ నంబరు 9281607001ను బస్సులో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రయాణికుల నుంచి అధికంగా, అనధికారికంగా చార్జీలు వసూలు చేయడం పూర్తిగా నిషేధమన్నారు. ఆర్టీసీ చార్జీలతో పోల్చి నిర్ణయించిన చార్జీలను మాత్రమే వసూలు చేయాలని, సంక్రాతి లాంటి పీక్ టైంలో గరిష్టంగా 1.5 రెట్లు మాత్రమే సర్జ్ చార్జీ అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనికి మించి వసూలు చేసినట్లయితే సంబంధిత ఆపరేటర్లు, యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్టీఓ సునీల్, ఎంవీఐలు మురళి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు బందోబస్తుతో..
పోలీసు బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేసిన ఘటన రొంపిచెర్ల మండలంలో చోటు చేసుకుంది. నిరుపయోగంకార్వేటినగరం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం పెనుమూరు మండలంలో రూ.68 లక్షలు వెచ్చించి అగ్రిటెస్టింగ్ ల్యాబ్ నిర్మాణం చేపట్టింది. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీనికి గ్రహణం పట్టుకుంది. ల్యాబ్కు కావాల్సిన పరికరాలు అందించలేదు. భవనం నిరుయోగంగా మారింది. రైతులు విత్తన, భూసార పరీక్షలు చేసుకోవాలన్నా నగరి, చిత్తూరు, తిరుపతికి వెళ్లాల్సి వస్తోంది. గత ప్రభుత్వంపై ఉన్న కక్ష సాధింపును నేడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. -
కాల్చేస్తున్న కూల్ లిప్!
క్లాస్ రూమ్లోనే.. స్కూల్ బ్యాగుల్లో కూల్ లిప్ ప్యాకెట్లు చిత్తూరు కలెక్టరేట్ : పాఠశాల స్థాయి విద్యార్థుల బ్యాగుల్లో, జేబుల్లో కూల్ లిప్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. ఏమిటి ఈ కూల్ లిప్ అనుకుంటున్నారా.. పొగలేకుండా పసిపిల్లల భవిష్యత్ను కాల్చేసే మత్తు పదార్థం. చిత్తూరు నగరంలోని గాండ్లపల్లి, కట్టమంచి, గిరింపేట, సంతపేటలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు ఈ కూల్ లిప్ మత్తుకు బానిసలవుతున్నారు. చిత్తూరు జిల్లా కేంద్రం తమిళనాడుకు సరిహద్దుగా ఉండడంతో అక్కడి నుంచి అక్రమంగా వీటిని జిల్లాలోకి తరలిస్తున్నారు. ఈ ప్యాకెట్లకు అలవాటు పడ్డ విద్యార్థులు మత్తుకు బానిసవుతున్నారు. కూల్ లిప్ సేకరించి మత్తులోనే తరగతులకు వస్తున్నారని టీచర్లు ఆవేదన చెందుతున్నారు. నిషేధం అయినప్పటికి చిత్తూరు జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల్లో కూల్లిప్ అందుబాటులో ఉండడం విమర్శలకు తావిస్తోంది. మత్తుకు బానిసలు కావొద్దు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని డీవైఈవో ఇందిర సూచించారు. గాండ్లపల్లి నగరపాలక పాఠశాలను తనిఖీ చేసిన ఆమె విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. టీచర్లు నిత్యం విద్యార్థుల నడవడికలపై ప్రత్యేక దృష్టి వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు సెల్వరాజ్, మోహన్, ఎకై ్సజ్ ఎస్ఐ మోహన్కృష్ణ, పీహెచ్సీ డాక్టర్ దయాసాగర్, హెచ్ఎం గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు క్లాస్ రూమ్లోనే మత్తు వేషాలు వేస్తున్నారని టీచర్లు ఆరోపిస్తున్నారు. తరగతికి రాగానే నిద్రపోతున్నారని వెల్లడిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా ఉన్నారని టీచర్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. విద్యార్థుల బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా కూల్ లిప్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. వీటిని ఉన్నతాధికారులకు తెలియజేయగా పోలీసుల సహాయంతో కూల్ లిప్ల గురించి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న గాండ్లపల్లి నగరపాలక పాఠశాలలో కూల్ లిప్ లు దొరకడంతో విద్యాశాఖ, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఏఎస్పీ రాజశేఖర్రాజు, డీవైఈవో ఇందిరా, ఎంఈవోలు సెల్వరాజ్, మోహన్లు మురుగానపల్లి పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాల ఆవరణలో కూల్ లిప్ ప్యాకెట్లను గుర్తించారు. కూల్ లిప్లను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు. -
రసాయనాలను కట్టడి చేయరా?
నగరి : ఏరులై పారుతున్న రసాయనాలను కట్టడి చేయరా?.. కుశస్థలి నదిలో హానికర రసాయనాలను లక్షల లీటర్లలో విడుదల చేస్తున్న తమిళనాడు డైయింగ్ యూనిట్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోరా?.. ప్రజా సంక్షేమం అధికారులకు పట్టదా?.. దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది..? అంటూ సీపీఐ నాయకులు కుశస్థలి లోతట్టు వంతెనపై కూర్చుని ధర్నా, రాస్తారోకో చేశారు. సీపీఐ నాయకుడు కోదండయ్య మాట్లాడుతూ తమ రాష్ట్రంలో నిర్వహించే పరిశ్రమల కోసం తమిళనాడుకు చెందిన వారు నగరి మున్సిపాలిటీలో నడిపే డైయింగ్ యూనిట్లను అరికట్టడంలో అధికారుల పూర్తిగా విపలమయ్యారన్నారు. పళ్లిపట్టు నుంచి పూండి వరకు జలవనరుగా ఉన్న ఈ నదిని నగరి పట్టణంలోని డైయింగ్ యూనిట్ల వారు కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు చర్మం, కిడ్నీ, ఎముకలు, లివర్ సమస్యలతో బాధపడుతున్నారంటే అందుకు కలుషితనీరే కారణమన్నారు. ధర్నా చేసినపుడు డైయింగ్ యూనిట్లకు నోటీసులు ఇవ్వడం.. ఆపై సమస్యను పక్కన పెట్టేయడం ఆనవాయితీగా మారిందన్నారు. ఈనెల 5వ తారీఖున ప్రజలే ఆగ్రహంతో ఉప్పొంగి పెద్ద ఎత్తున పోరాటం చేసినట్టు గుర్తుచేశారు. అక్రమడైయింగ్ యూనిట్లను నిషేధించాలని ప్రజలు కోరుతుంటే.. వాటికి అనుమతులున్నాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జనజీవనానికి దూరంగా డైయింగ్ యూనిట్లను పంపాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై వాహనాలు ఆగిపోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ బాలాజీనాయక్, డీఈ రవీంద్ర నిరసనకారులతో మాట్లాడారు. డైయింగ్ యూనిట్ల యజమానులతో ఈ అంశంపై చర్చిస్తామన్నారు. దీంతో నిరసనకారులు శాంతించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి వేలన్, నాయకులు బాషా, విజయ్కుమార్, రాజేంద్ర, ముత్తు పాల్గొన్నారు. -
బంధువు చావుకు వెళ్లి వస్తూ..
నగరి : బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నగరి మండలం, తడుకు పేట వద్ద చోటుచేసుకుంది. సీఐ మల్లికార్జున రావు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం, రాణిపేట జిల్లా, పర్వత్తూరు గ్రామానికి చెందిన శ్రీనివాసన్ కుమారుడు భరత్కుమార్ (25) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. నారాయణవనంలో మృతిచెందిన తన బఽంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి పర్వత్తూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో తడుకుపేట వద్ద ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి ఢీ కొన్న వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మృతుడు ఏకై క కుమారుడు. వివాహమై.. రెండేళ్ల పాప ఉంది. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే ఇతను మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. యువకునికి తీవ్ర గాయాలు నగరి : మున్సిపల్ పరిఽ ది, నగరిపేట సమీపం, జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువరాజ్ (29) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తమిళనాడు పల్లిపట్టు తాలూకా, సొరకాయపేట గ్రామానికి చెందిన ఇతను పుత్తూరు వైపుగా వెళుతూ ముందుగా వెళుతున్న కారును ఓవర్టేక్ చేయబోయి సైడ్ మిర్రర్ తగిలి కిందపడ్డా డు. జాతీయ రహదారి పక్కనే నిర్మించే కాలువకు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. నలుగురికి జైలు చిత్తూరు అర్బన్: వేర్వేరు ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో నలుగురు నిందితులకు జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ షేక్ బాబ్జాన్ శుక్రవారం తీర్పునిచ్చారు. నిందితులు ఎస్.మహేష్, ఆర్ఎస్.వసీం, ఆదినారాయణ, షణ్ముగం అనే నలుగురికి జైలుశిక్ష విధించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉమాదేవి కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీ, ఈశ్వరుని ఆల యం వీధిలో గత ఏడాది నవంబర్లో పలు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. దీనిపై పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించారు. చిత్తూరుకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుల హాజరుపరచగా.. నేరం రుజువయ్యింది. మహేష్, వసీంకి మూడు నెలల జైలు శిక్ష, ఆదినారాయణ, షణ్ముగంకు ఆర్నెళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 18 మద్యం బాటిళ్ల స్వాధీనం కార్వేటినగరం: మండల పరిధిలోని డీఎం పురం గ్రామానికి చెందిన శ్రీధర్ ప్రొవిజన్ షాపులో అక్రమంగా విక్రయిస్తున్న 18 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తేజ స్విని తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడు తూ నిత్యావసర సరుకుల దుకాణం ముసు గులో బెల్టు షాపు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు చేసినట్టు తెలి పారు. ఆ దుకాణ యజమాని శ్రీధర్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో సిబ్బంది రాజశేఖర్, యుగంధర్, యువరాజ్ పాల్గొన్నారు. -
పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ
రొంపిచెర్ల: పోలీసు బందోబస్తుతో చిత్తూరు జిల్లాలోని పలు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయాఽధికారులు శుక్రవారం యూరియా పంపిణీ చేశారు. నాలుగు రోజుల క్రితం గానుగచింత రైతు సేవాకేంద్రంలో యూరియా కోసం రైతులు ఘర్షణ పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రొంపిచెర్ల–2, బొమ్మయ్యగారిపల్లె రైతు సేవా కేంద్రాల్లో యూరియాను పోలీసు బందోబస్తు నడుమ పంపిణీ చేశారు. ఒక రైతుకు ఒక బస్తా వంతున యూరియా ఇచ్చారు. రెండు రైతు సేవా కేంద్రాల్లో 800 బస్తాలకు శుక్రవారం 405 బస్తాల యూరియాను పంపిణీ చేసినట్లు ఏవో శ్రావణి తెలిపారు. మిగిలిన యూరియా బస్తాలను సోమవారం ఇస్తామని చెప్పారు. ఏఈవో ఖాదర్వల్లీ, వీహెచ్ఏలు ఉదయశ్రీ, తిరుమల, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఓబులేసు పాల్గొన్నారు. 90 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం బైరెడ్డిపల్లె : అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న 90 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని నింధితుడ్ని అరెస్ట్ చేసినట్లు సీఐ పరుశురాముడు పేర్కొన్నారు. బైరెడ్డిపల్లె పోలీస్స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గంగవరం మండలానికి చెందిన సురేష్ బొలేరో వాహనంలో బైరెడ్డిపల్లె మీదుగా దేవదొడ్డి నుంచి దాసార్లపల్లె రహదారిలో కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తుండగా ఎస్ఐ చందనప్రియ సిబ్బందితో కలసి దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు. జెడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీ గంగాధర నెల్లూరు: మండలంలో శుక్రవారం చిత్తూ రు జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మండలంలోని పాచిగుంట, నెల్లెపల్లె గ్రామ పంచాయతీల ప్రజలు చిత్తూ రులో పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ఇచ్చిన వినతల మేరకు అయన గ్రామాల లో పరిశీలించారు. అర్జీదారులతో మాట్లాడారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, సిబ్బంది కుమార్, ప్రశాంత్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు . సేంద్రియ వ్యవసాయంతో అధిక ఆదాయం గంగాధర నెల్లూరు: సేంద్రియ వ్యవసాయంతో రైతులు ఆరోగ్యకరమైన దిగుబడులతో పాటు అధి క ఆదాయం పొందవచ్చని జిల్లా వనరుల కేంద్రం అధికారిణి లక్ష్మీ ప్రసన్న అన్నారు. మండలంలోని నెల్లేపల్లె గ్రామ పంచాయతీలో శుక్రవారం సేంద్రి య వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, సేంద్రియ వ్యవసాయంతో రైతులు రసాయన ఎరువుల జోలికి వెళ్లకుండా పంటలు పండిస్తే ఆరోగ్యకర ఆహారోత్పత్తులు అందించిన వారవుతారన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరారు. కార్యక్రమంలో పెరుమాళ్లపల్లె ప్రాంతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సరళ రైతులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది వీహెచ్ఏ కవిత, ఢిల్లీ ప్రసాద్, రైతులు పాల్గొన్నారు. -
వాడికి మనసెలా వచ్చిందో?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ‘మా బిడ్డను ఎలా చంపాడో.. వాడికి ఎలా మనసొచ్చిందో.. వాడ్ని వెంటనే అరెస్టు చేయాలి..?’ అంటూ మృతురాలు కవిత తల్లి పోలీసుల ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. దివ్యాంగురాలు కవిత హత్యపై దివ్యాంగుల సంఘ నేతలు, సభ్యులు గురువారం రోడెక్కారు. చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. హత్య చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నినదాలతో హోరెత్తించారు. దీంతో అర్థగంట పాటు రాకపోకలు స్తంభించాయి. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేశారు. హత్య చేసిన వ్యక్తులను వదిలిపెట్టబోమని పోలీసులు వారికి సర్దిచెప్పారు. ఇంతలో బాధిత కుటుంబీకులు ఆగ్రహానికి గురయ్యారు. చంపేసిన తర్వాత న్యాయం చేస్తారా..? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు అత్యవసర కేసులు ఆస్పత్రికి రావడంతో దివ్యాంగులు ధర్నా నుంచి తప్పు కున్నారు. ఆపై అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. అర్ధగంట పాటు నినాదాలు చేశారు. తర్వా త వికలాంగుల హక్కుల చట్టం అమలు జిల్లా కమి టీ సభ్యులు చంద్రశేఖర్, మురళి మాట్లాడుతూ చిత్తూరు నగరం గిరింపేటకు చెందిన కవిత దారుణ హత్యకు గురైందన్నారు. ఈ నెల 31న అదృశ్యమైన కవిత బుధవారం జీడీనెల్లూరు వద్ద నీవానదిలో శవమై తేలిందన్నారు. ఈ హత్యకు కారకులైనా వారి ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఇక్కడి నుంచి కదిలేదిలేదన్నారు. కవిత అదృశ్యంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులకు రెండు రోజుల సమయం పట్టింది. వన్టౌన్ పోలీస్ స్టేషన్కు వెళితే.. టూటౌన్కు వెళ్లామని తిప్పించుకున్నారు. డీఎస్పీని కూడా కలిశామన్నారు. ఇంతలోనే ఆమె హత్యకు గురై.. శవమై కనిపించడం బాధకరమన్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టంపై పాలకులు దృష్టిసారించాలన్నారు. జీరో ఎఫ్ఐ కట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో లీలాపతినాయుడు, ఏకాంబరం, మురళిగౌడ్, సుబ్రమణ్యం, కాంచన, మాధవి, సుబ్బమ్మ, గజేంద్రన్, చిట్టిబాబు, గోపి, దొరబాబు, హరికృష్ణ, రామానాయుడు, రామ కృష్ణ, శివకుమారి, శివకుమార్ పాల్గొన్నారు. -
కరెంటు కుట్ర!
శాంతిపురం: గ్రామాల్లో తమ పంతం నెగ్గించుకోవడానికి, ఇతర పార్టీల వారిని ఇబ్బంది పెట్టడానికి అధికారులను వాడుకోవడం అధికార పార్టీ నాయకులకు అలవాటైపోయింది. వ్యవసాయ అవసరాల కోసం తవ్వుకున్న బోర్లకు కరెంటు కనెక్షన్ ఇవ్వడంలోనూ తమ నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మండలంలోని సి.బండపల్లి పంచాయతీ మహిళా సర్పంచ్ శకుంతల కుటుంబం రాజకీయ వేధింపులతో తీవ్ర క్షోభను అనుభవిస్తోంది. శకుంతల, ఆమె భర్త కుమారరాజ తమ వ్యవసాయ బోరులో నీరు నామమాత్రంగా రావడంతో పశుగ్రాసం సాగు చేసి, పశువులు పెంచుతూ నలుగురు పిల్లలను చదివించుకునేవారు వారు. సాగు నీరు ఉంటే వర్షాధారంగా ఉన్న 7.5 ఎకరాలలోనూ వ్యవసాయం చేయొచ్చనే ఆశతో తమ పొలంలో నాలుగు బోర్లు తవ్వించినా వాటిలో నీరు రాలేదు. కొద్దోగొప్పో నీరున్న బోరు కూడా ఇంకిపోవడంతో పాడి పశువులను కూడా అమ్ముకుని 2025 జనవరిలో మరో బోరు తవ్విస్తే నీరు పుష్కలంగా పడ్డాయి. ఆ ఆనందంలో కరెంటు కనెక్షన్ కోసం గత ఫిబ్రవరిలో కుప్పం రెస్కోకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఎస్టిమేషన్ ఇవ్వడంతో ఎలాగోలా తంటాలు పడి గత మార్చిలో ఆ మొత్తాన్ని రెస్కోకు చెల్లించారు. జూన్లో వారికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, తీగలు, ఇతర సామగ్రిని రెస్కో అధికారులు ఇచ్చారు. పార్టీ మారితేనే కరెంటు రాజకీయ క్రీడ స్తంభాలు నాటి లైన్లు లాగడం మొదలు పెట్టగానే స్థానిక కూటమి నాయకులు రంగంలోకి దిగారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా రెస్కో అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు ఆపించారు. శకుంతలమ్మ బోరుకు కరెంటు కోసం మరో రైతు పొలంలో లాగిన తీగిలను అడ్డంగా అలాగే వదిలేసి రెస్కో సిబ్బంది వెనుదిరిగారు. అక్కడ ఏర్పాటు చేసేందుకు తెచ్చిన ట్రాన్సుఫార్మర్ అప్పటి నుంచి ట్రాక్టర్ ట్రాలీలో అలాగే మిగిలిపోయింది. సమీపంలోని మరో ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంటు తీసుకుని మోటారు నడిపే ప్రయత్నం చేసినా రెస్కో సిబ్బందిని పురమాయించి ఒక్క రోజులోనే వైర్లను కత్తిరించేశారు. తమ కరెంటు కనెక్షన్ కోసం రెస్కో అధికారుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసినా ఫలితం లేకపోయిందని బాధితుడు కుమారరాజ వాపోయాడు. స్థానిక నాయకులను కలిసి ఆ తర్వాత రెస్కో అధికారులతో చెప్పించాలని సలహా ఇచ్చారని చెప్పాడు. తమ గ్రామానికి చెందిన మరో రైతు వెంకటేష్ భూముల వ్యవహారం కోర్టులో ఉంటే దాంతో ఎలాంటి సంబంధం లేని తమ భూములు కోర్టులో ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. అభ్యంతరాలతో పనులు ఆపాము శకుంతలమ్మకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ పనులను ఎప్పుడో చేపట్టాం. కానీ కొందరు స్థానికులు దీనిపై లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపారు. ఆపై క్షేత్ర స్థాయిలో అడ్డుకోవడంతో పనులు ఆపేశాము. కొత్తగా సర్వీసు తీసుకున్న భూమి రెవెన్యూ రికార్డుల్లో యజమాని పేరు మార్చారు. కోర్టు వివాదంలో ఉందని వారు చెప్పారు. కోర్టు నుంచి దీనిపై మాకు ఎలాంటి ఆదేశాలు గానీ, సమాచారం గానీ లేదు. గ్రామస్తుల మధ్య వివాదం లేకుంటే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. – మునిరత్నం, రెస్కో ఏఈ, శాంతిపురం -
కోర్టును పేల్చేస్తాం!
చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపు! సాయంత్రం 4 గంటలుసమయం 12.45 గంటలుసమయం 12.30 గంటలుగురువారం చిత్తూరు నగరంలోని జిల్లా కోర్టు నుంచి పెద్దగా సైరన్ శబ్దం. పలువురు న్యాయవాదులు ఆందోళనగా బయటకు వస్తున్నారు. కక్షిదారుల్లో కొందరు పరుగులు తీస్తున్నారు. ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. దానికి ముందు చిత్తూరులోని జిల్లా కోర్టు సూపరింటెండెంట్ అధికారిక మెయిల్కు బుధవారం రాత్రి 9.28 గంటలకు ఇన్బాక్స్లో వచ్చిన ఓ సందేశాన్ని ఓపెన్ చేసి చూశారు. ‘తమిళనాడులోని ఓ రాజకీయ పార్టీ మమ్మల్ని నీచంగా చూస్తోంది. ఎల్టీటీఈ నుంచి విడిపోయి కశ్మీర్ ఐఎస్ఐ సభ్యులతో కలిసి 8వ తేదీన మీ న్యాయస్థానాల సముదాయంపై మానవ బాంబులను పేల్చుతున్నాం. సీ–4, ఆర్డీఎక్స్ ఉపయోగించిన పేలుడు పదార్థాలతో మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో పేలుడు జరుగుతుంది. ఆ మానవ బాంబు పేలకపోతే, శ్రీలంకలో ఈస్టర్ రోజున జరిగిన దాడుల్లా పేల్చేస్తాం. న్యాయమూర్తులు వెంటనే గదులను ఖాళీ చేయాలని అభ్యర్థిస్తున్నాం..’ అంటూ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో జరిగిన విషయాన్ని జిల్లా జడ్జి అరుణ సారికకు చెప్పారు. ఆమె జిల్లాలోని అన్ని కోర్టులను అప్రమత్తం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సైతం జిల్లా పోలీసులను అప్రమత్తం చేయడంతో అగ్నిమాపక అధికారులు, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీ సాయినాథ్, సీఐలు మహేశ్వర, శ్రీధర్ నాయుడు తదితరులు పరిస్థితిన పర్యవేక్షించి.. కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. – చిత్తూరు అర్బన్తనిఖీల అనంతరం ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. తీరా ఇది ఉత్తుత్తి బెదిరింపు మెయిల్గా గుర్తించడంతో పోలీసులు, న్యాయశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా జడ్జి అరుణ సారిక విషయాన్ని ఎస్పీ తుషార్ డూడీకి చెప్పారు. హుటాహుటిన పోలీసులు, బాంబు–డాగ్ స్క్వాడ్ బృందాలు చిత్తూరు కోర్టును ముట్టడించాయి. కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులకు జిల్లా కోర్టు నుంచి పోలీసులు బయటకు పంపించేశారు. జిల్లా జడ్జి ప్ర యాణించే వాహనం, ఇతర కోర్టులో తనిఖీలు ప్రారంభించారు. -
అప్పుడే పోలీసులను ఆశ్రయించినా!
చిత్తూరు అర్బన్: ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో కవిత ముందే పోలీసులను ఆశ్రయించారు. కానీ బాధితురాలి ఫిర్యాదుపై మద్య స్తం చేయడంతో కేసును వెనక్కి తీసుకున్నారు. తీరా నమ్మించిన వ్యక్తే ప్రాణాలు తీసేశాడు. చిత్తూరుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు కవిత హత్య కేసులో పలు ఆసక్తికర ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈమెను హత్య చేసింది ప్రేమికుడు గణేష్ అని పోలీసులు నిర్ధారించారు. గతంలో స్టేషన్కు కవిత–గణేష్ ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే నిరుద్యోగిగా ఉన్న సమయంలో వీళ్ల ప్రేమకు ఎలాంటి ఇబ్బందీ రాకపోవడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తీరా గణేష్కు ఎస్బీఐలో ఉద్యో గం రావడం, ఆమె తనకన్నా 12 ఏళ్లు వయస్సులో పెద్దదికావడంతో కవితను పెళ్లి చేసుకోవడానికి నిందితుడు ఒప్పుకోలేదు. తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన కవిత గతంలో పోలీసులను ఆశ్రయిస్తే.. విభిన్న ప్రతిభావంతుల సంఘ నాయకులు రావడంతో కేసు పెట్టకుండా పోలీసులు రాజీ చేశారు. ఆపై కవితను ఆమె ప్రియుడు కొట్టిచంపాడు. అంత్యక్రియలు పూర్తి కవిత మృతదేహానికి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం గిరింపేటలోని శ్మశాన వాటిలో కవిత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి తలపై నాలుగు బలమైన గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పోలీసులపై ఫిర్యాదు ఈ కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ చిత్తూరుకు చెందిన న్యాయవాది అర్హద్ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. గతంలో రాజీ చేసుకున్నారు వయస్సు తేడా ఉండడం, ఉద్యోగం రావడంతో ఆమెను వదిలించుకోవడానికి గణేష్ హత్య చేశాడు. గతంలో కూడా తనను మోసం చేశాడంటూ కవిత పోలీసులను ఆశ్రయిస్తే.. వికలాంగ జేఏసీ నేతలు వచ్చి గణేష్–కవితతో మట్లాడగా వివాహం చేసుకోవడానికి గణేష్ ఒప్పుకున్నాడు. దీంతో కేసు వద్దంటూ రాజీ చేసుకున్నారు. ఈ కేసులో ఎక్కడా కూడా పోలీసుల నిర్లక్ష్యం లేదు. కవిత కనిపించకుండా పోయిన రోజే హత్యకు గురయ్యారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చూపిస్తాం. – సాయినాథ్, డీఎస్పీ, చిత్తూరు -
మట్టి..గుట్ట స్వాహా!
గుట్టలో మామిడి మొక్కలు పెట్టిన దృశ్యం చదును చేస్తున్న గుట్ట భూమిచిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం, బండపల్లి రెవెన్యూలోని 194.వెంకటాపురం గ్రామంలో గుట్ట భూమి ఆక్రమణకు గురవుతోంది. తన పొలం పక్కన ఉందని..టీడీపీకి చెందిన ఓ వ్యక్తి గుట్టపై కన్నేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చే సరికి.. జేసీబీలతో రంగంలోకి దిగాడు. పంట పొలాలకు మట్టి తోలుతున్నానని ఊరు జనాన్ని నమ్మించాడు. రోజుకు వందల ట్రాక్టర్లు.. మట్టి తరలిస్తున్నాయి. ఈ మట్టి ఎక్కడికి వెళుతోందని ఊరు జనం ఓ లుక్కేశారు. ఒక ట్రాక్టర్ మట్టిని రూ.1000 లెక్కన చిత్తూరు నగరానికి తరలిస్తూ..సొమ్ము చేసుకుంటున్నాడనే విషయాన్ని తెలుసుకున్నారు. ఒక రోజుకు సుమారు 100 లోడ్లకు రూ.లక్ష సంపాదిస్తున్నట్లు లెక్కగట్టారు. ట్రాక్టర్ బాడుగ, జేసీబీ ఖర్చు పోను చేతికి రూ. 50 వేలు మిగులుతుందనే విషయాన్ని గుర్తుపట్టారు. ఇలా 15 రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్దామనే లోపు..మట్టి కొట్టు..గుట్ట పట్టు కథ బయటపడింది. చదును చేస్తూ..ఆక్రమిస్తూ..! మట్టేకదా అని చూస్తే.. ఆరు ఎకరాల గుట్ట భూమి మాయమవుతోంది. టీడీపీకి చెందిన ఓ వ్యక్తి గుట్టలో గుట్టు చప్పుడు కాకుండా ఆరు ఎకరాల భూమిని చదును చేసేశారు. ఓ వైపు మట్టి అమ్ముకుంటూ.. మరో వైపు ఎకరాల కొద్దీ భూమిని ఆక్రమించుకుంటూ.. ఇంకో వైపు మామిడి మొక్కలు నాటుకుంటూ వస్తున్నారు. ఇలా ఆరు ఎకరాల వరకు ఆక్రమించేశారు. ఇదేమని ప్రశ్నించిన వారి వద్ద పట్టా ఉందని సాకులు చెబుతున్నాడు. ఒక వేళ పట్టా ఉంటే.. ఎకరా భూమికి మాత్రమే పట్టా ఉంటుందని గ్రామస్తులు చెన్నమ్మ (గ్రామదేవత) సాక్షిగా ఒట్టేసి చెబుతున్నారు. ఈ బాగోతం ఓ ద్వితీయ శ్రేణి అధికారికి తెలిసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అమ్మా..దీనికి వెనుక పవర్ ఉందమ్మా! మట్టి దోపిడీ నుంచి.. ఆరు ఎకరాల ఆక్రమణ వరకు రెవెన్యూలో ఓ ద్వితీయ శ్రేణి అధికారి పవర్ పనిచేస్తోందని ఊరంతా కోడైకూస్తోంది. ఆక్రమణ దారుల వెంట.. ఆ పవర్ కరెంట్ తీగలా అల్లుకుపోయిందని చర్చించుకుంటున్నారు. ముందుపడి ఫిర్యాదు చేస్తే.. ఆ పవర్.. షాక్ కొట్టేలా చేస్తోందని చెబుతున్నారు. ఆక్రమణను అమ్మ వరకు చేరనివ్వకుండా ఆ పవర్ అడ్డుపడుతోందని అంటున్నారు. ఇది వరకే ఓ సారి ఫిర్యాదు వస్తే.. పట్టా ఉందని..ౖపైపెకి తేలుసుకున్నారనే విషయాన్ని గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. ఆక్రమణపై కన్నేసి.. వెనుక పవర్కు కోత విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ కల్యాణిని వివరణ కోరగా.. చదును పనులను ఆపేశాం. పట్టా ఉందని చెబుతున్నారు. గతంలో ఓ సారి కూడా పట్టా తీసుకురమ్మని చెప్పాం. ఇంత వరకు రాలేదు. ఇప్పుడు తెస్తే..రికార్డులను చూస్తాం. పరిశీలించిన తర్వాత ఆక్రమణ..అవునా..కాదా..? అనే విషయం తెలుస్తుందని వివరణ ఇచ్చుకున్నారు. -
● కేసులు, రౌడీషీట్లు, పీడీ యాక్ట్లకు భయపడం ● ఏఐఎస్ఎఫ్, వైఎస్సార్ యూత్ ఫెడరేషన్ నేతలు
బాబు, లోకేశ్.. ఎన్నికల హామీలేమయ్యాయి? చిత్తూరు కలెక్టరేట్: ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడంలేదని ఏఐఎస్ఎఫ్, వైఎస్సార్ యూత్ ఫెడరేషన్ నాయకులు ప్రశ్నించారు. జిల్లా కేంద్రం చిత్తూరులో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన నేతలపై కేసులు బనాయించడం తగదన్నారు. ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం, రౌడీషీట్లు ఓపెన్ చేయడం, పీడీ యాక్ట్లు పెడుతామంటే పుట్టగతులుండవని హెచ్చరించారు. మంత్రి లోకేశ్.. తస్మాత్ జాగ్రత్త అంటూ మండిపడ్డారు. విశాఖపట్టణంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీషీట్, రైతుసంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్లను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రూ.6,400 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తగదని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు, లోకేశ్ సమావేశాలు, పాదయాత్రలు నిర్వహించి ఇచ్చిన హామీలను ఇప్పుడు ఎందుకు నెరవేర్చడం లేదని ఆయన నిలదీశారు. వైఎస్సార్ యూత్ ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు మనోజ్రెడ్డి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా డిమాండ్ చేస్తున్న సంఘ నాయకులపై కేసులు బనాయించడం తగదని చెప్పారు. వారిపై కేసులు తొలగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు శబరీష్రెడ్డి, వసంత్, చరణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
20 లోపు కొలతల ప్రక్రియ పూర్తి చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2026–2027 విద్యాసంవత్సరంలో పంపిణీ చేసే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర విద్యాసామగ్రి పంపిణీ కొలతల ప్రక్రియ ఈ నెల 20లోపు పూర్తి చేయలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వు లు జారీ చేశారు. ఇవి గురువారం డీఈవో కార్యాలయానికి అందాయి. జిల్లాలోని ప్రభు త్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అడుగుల పరిమాణం కొలతలను, దుస్తుల కొలతలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నా రు. సేకరించే కొలతలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇయర్–2 ఆన్లైన్ మాడ్యూల్స్నూ.. ఇయర్–2 ఆన్లైన్ మాడ్యూల్స్ను పూర్తి చేయా లని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు మాడ్యూల్స్ను పూర్తి చేయాల్సి ఉంటుందన్నా రు. జ్ణానప్రకాష్ ఇయర్–1 సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసిన ఎస్జీటీలు మాడ్యూల్–2ను పూర్తి చేయాలన్నారు. దీక్ష ప్లాట్ఫామ్లో 19 ఆన్లైన్ మాడ్యూల్స్ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28 లోపు రెండో మా డ్యూల్ ప్రక్రియ పూర్తిచేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. పాఠశాలల్లో ఎస్ఏఎల్టీ కార్యక్రమం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఏఎల్టీ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం అమలుపై ఎంపిక చేసి న పాఠశాలల్లో ఫోన్ ఇన్ సర్వే కార్యక్రమం చేపట్టనున్నారు. పాఠశాలల్లో ప్రపంచ బ్యాంక్ ఆధ్వ ర్యంలో నిర్వహించే ఎస్ఏఎల్టీ కార్యక్రమంపై సర్వే చేపట్టి వివరాలు సేకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ఈ సర్వే ప్రక్రియను నిర్వహించనున్నారు. టీడీపీ కవ్వింపు చర్యలు వైఎస్సార్ విగ్రహానికి చుట్టిన టీడీపీ జెండాలు కుప్పంరూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. కబ్జాలు, దాడులు, దందాలు చాలదన్నట్టు కవ్వింపు చర్యలకు పాల్పడడం రివాజుగా మారుతోంది. ఇలాంటి ఘటనే కుప్పం మండలంలో చోటు చేసుకుంది. కుప్పం మండలం, తంబిగానిపల్లి కొటాలు వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి గురువారం టీడీపీ మద్దతుదారులు టీడీపీ జెండాలు, తోరణాలు కట్టి కవ్వింపు చర్యలకు పూనుకునానరు. దీన్ని చూసిన వారు ఇదేమి వ్యవహారం అంటూ దుమ్మెత్తి పోస్తు న్నారు. మహానేత వై ఎస్సార్ విగ్రహానికి ఇలా జెండాలు, తోరణాలు కట్టడం సరికాదని చర్చించుకుంటున్నారు. ప్రశ్నిస్తే ఎక్కడ పోలీసు కేసులు ఎదుర్కోవాలోనని మిన్నకుండిపోతున్నారు. షణ్ముగరెడ్డికి షాక్! సీనియర్లు దూరం సాక్షి, టాస్క్ఫోర్స్: జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న షణ్ముగరెడ్డికి తొలి రోజే ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. గురువారం చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో.. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్లు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వన్నియకులక్షత్రియ సామాజిక వర్గానికి చెందిన తాజా మాజీ జిల్లా అధ్యక్షుడు సీఆర్.రాజన్తో కలిసి, ఆ సామాజికవర్గ ప్రధాన నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. టీడీపీ అధికారంలోకి రాకమునుపు సిఆర్.రాజన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. రెండో మారు కూడా ఈయన ఆ పదవిని ఆశించారు. కానీ రాజన్కు రాష్ట్ర వన్నియకులక్షత్రియ ఛైర్మన్ పదవి ఇచ్చి, పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఐవీఆర్ఎస్ సర్వేలో సైతం రాజన్ను కొనసాగించాల ని ఎక్కువ శాతం, షణ్ముగరెడ్డికి తక్కువ శాతం వచ్చిన ట్లు సమాచారం. అయినా జిల్లా సారథి పదవి షణ్ముగరెడ్డిని వరించడంపై పలువురు సీనియర్లు అంగీకరించలేదు. దీంతో ప్రమాణ స్వీకారానికి టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్లు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి మరీ షణ్ముగరెడ్డి ఆహ్వానించారు. కానీ చాలా మంది ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జీడీనెల్లూరు, పలమనేరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, పుంగనూరు నుంచి చల్లా బాబు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. -
భూమి ఇవ్వనందుకు కక్ష సాధింపు
కుప్పం: సోలార్ ప్లాంట్కు భూమి ఇవ్వలేదని కూట మి ప్రభుత్వం కక్షగట్టింది. అధికారులతో దౌర్జన్యం చేయించింది. దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించా రు. దీనిపై అధికారులు మరింత రెచ్చిపోయారు. దీనికి తోడు అధికార పార్టీ నేతలు రైతులను వేధి స్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు.. ఇదెక్కడో కా దండోయ్..రామకుప్పం మండలం, బళ్ల గ్రామంలో.. అసలేం జరిగిదంటే..? సోలార్ ప్లాంట్కు ప్రభుత్వం భూములు సేకరించింది. బళ్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని 13 మంది రైతులకు చెందిన భూములు రెవెన్యూ అధికార్లు గుర్తించా రు. వీటిలో చిన్న కాలప్ప, శంకరప్ప వ్యవతిరేకించా రు. తమకు జీవానాధరంగా ఉన్న భూములు ఇవ్వ మని భీష్మించారు. కానీ అధికార్లు బలవంతంగా భూములు లాక్కొని సోలార్ ప్లాంట్ పనులకు శ్రీ కారం చుట్టారు. మరో పది మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. సోలార్ ప్లాంట్ నిర్మాణానికి అటంకం ఏర్పాడింది.. దీన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నేతలు రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అన్నదాత సుఖీభవలో మృతి చెందినట్లు రికార్డు రామకుప్పం మండలం, బళ్ల గ్రామానికి చెందిన చిన్న కాలప్పకు సర్వే నెం.158/2 ఏలో 1.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని సోలార్ ప్లాంట్ ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేశారు. దీనికి ఆయన వ్యతిరేకించడంతో కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఐదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో ఈ సారి చిన్నకాలప్పకు నగదు భ్యాంక్లో జమ కాలేదు. దీన్ని అన్లైన్ అప్డేట్ విచారించంగా చిన్న కాలప్ప మృతి చెందినట్లు రికార్డులు చూపుతున్నాయి. సోలార్ ప్లాంట్కు భూమి ఇవ్వనందకు రేషన్ కార్డుల్లో పేర్లు తోలగించారు. మూడు నెలలుగా రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకు నిలిపి వేశారు. ఆధార్ లింక్ను తొలగించి పెన్షన్ కూడా ఆపేశారు. అంతేకాకుండా తప్పుడు కేసులు బనాయించి 47 రోజులు రిమాండ్కు పంపారు. ఇలా రైతులపై కూటమి నేతలు కక్ష గట్టి వేధిస్తున్నారు. -
కడుపు నొప్పి తాళలేక..!
– ఉరి వేసుకుని యువకుడి మృతి గంగాధర నెల్లూరు: మండలంలోని ముక్కలతూరు పంచాయతీలో ఓ యువ కుడు ఉరి వేసుకుని మృతి చెందాడు. స్థానిక పోలీసుల వివరాలు.. మండలంలోని ముక్కలతూరు గ్రామ పంచాయతీకి చెందిన నాగరాజు కుమారుడు మోనీష్ (25) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కడుపు నొప్పి తాళలేక తన ఇంటి వద్ద గురువారం ఉదయం ఉరి వేసుకుని మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బైక్ను ఢీకొన్న బస్సు వి.కోట: ముందువెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొనడంతో ద్విచక్ర వాహదారుడు అక్క డికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని వి.కోట–పేర్నంభ ట్ జాతీయ రహదారి, ఏడుచుట్లకోట గ్రామం వద్ద గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని చింతమాకులపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణప్ప(65) తన సొంత పనుల నిమిత్తం వి.కోట పట్టణానికి బైక్పై వచ్చి తమ స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నా డు. అదే సమయంలో కార్ణటక రాష్ట్రం, హోస్కాట నుంచి తమిళనాడు రాష్ట్రంలోని ఓంశక్తి ఆలయానికి వెళుతున్న బస్సు వి.కోట –పేర్నంభట్ జాతీ య రహదారిలోని ఏడుచుట్లకోట గ్రామం వద్ద ముందువెళుతున్న రామకృష్ణప్ప బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామకృష్ణప్ప అక్కడికక్కడే మృతి చెందా డు. బస్సు అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్తం నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలించినట్లు సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ నారాయణగిరి షెడ్ లో వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 88,752 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 19,443 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.69 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
రైలు కింద పడి వ్యక్తి మృతి
గుడిపాల: రైలు కింద పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతిచెందాడు. గుడిపాల మండలం, మరకాలకుప్పం దళితవాడకు చెందిన సాల్మన్ జయశీలన్(40)కి మతిస్థిమితం సరిగ్గా లేదు. ఇతను గురువారం కొయంబత్తూరు నుంచి తిరుపతికి వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ 22616 వస్తుండగా బొమ్మసముద్రం ఆర్ఎస్ఎస్ రామాపురం మధ్యలో హఠాత్తుగా రైల్వే ట్రాక్పై రావడంతో రైలుబండి అతన్ని ఢీకొట్టింది. దీంతో సుమారు 80 స్లీపర్ల దూరంలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. 37 బీరు బాటిళ్లు స్వాధీనం పెనుమూరు (కార్వేటినగరం) : దాబాలో అక్రమంగా దాచి ఉంచిన 37 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ వెంకటనరసింహ తెలిపారు. వివరాలు.. పెనుమూరు మండల కేంద్రంలోని కొత్తరోడ్డులో ఉన్న హర్షిత్ డాబాపై గురువారం రాత్రి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డాబాలో అక్రమంగా దాచి ఉంచిన 37 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆపై డాబా యజమాని పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
టమాట ధర ఢమాల్!
పలమనేరు: చిత్తూరు జిల్లాలో టమాట ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు వారాల క్రితం బాక్సు (15 కిలోలు) ధర రూ.900 దాటగా ఉన్నట్టుండి గురువారానికి పలమనేరు మార్కెట్లో గరిష్ట ధర బాక్సు రూ.380, కనిష్ట ధర రూ.100 సగటు ధర రూ.250కి దిగజారింది. దీంతో టమాట రైతులు లబోదిబోమంటున్నారు. ధర లేదు చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో సీజన్తో సంబంధం లేకుండా టమాటను రైతులు సాగుచేస్తుంటారు. పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో పలమనేరు, పుంగనూరు, వీకోట, సోమల, సదుంలో టమాట మార్కెట్లున్నాయి. ఇలా ఉండగా ప్రస్తుతం అన్నమయ్య, అనంతరం, పుట్టపర్తి, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం ప్రాంతాల నుంచి భారీగా సరుకు ఇక్కడి మార్కెట్లకు చేరుతోంది. స్థానికంగా పంట దిగుబడులు, నాణ్యత బాగున్నప్పటికీ ధరలు పడిపోవడంతో టమాట రైతులకు నష్టాలు తప్పడం లేదు. తగ్గిన ఎగుమతులు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి ఎక్కువగా టమాటాలను తమిళనాడు, చత్తీష్ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతులు చేసేవారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర, చత్తీష్ఘడ్ రాష్ట్రాల్లో స్థానికంగా పండిన టమాట అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ రాష్ట్రాలకు ఇక్కడి సరుకు వెళ్లడం లేదు. తమిళనాడు వ్యాపారులు మాత్రమే చిత్తూరు జిల్లాలోని మార్కెట్లకు వస్తున్నారు. ఇక్కడి నుంచి ఉత్తరాధి రాష్ట్రాలకు సరుకును విక్రయించే వ్యాపారులు రావడం లేదు. దీంతో ధరల తగ్గుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సీజన్లో టమాట సాధరణ సాగు 5 వేల హెక్టార్లు ప్రస్తుతం సాగైన పంట 1,500 హెక్టార్లు కోత దశలో ఉన్న తోటలు 650 హెక్టార్లు మండీలకొచ్చే సరుకు 80 లారీ లోడ్లు మార్కెట్లకు చేరుతున్న సరుకు (పొరుగు జిల్లాల నుంచి కలిపి)55 లోడ్లు పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో సాగు వివరాలు -
గంజాయి నిల్వ ఉంచిన ముగ్గురి అరెస్ట్
– 16 కిలోల గంజాయి స్వాధీనం బైరెడ్డిపల్లె: మండలంలో అక్రమంగా గంజాయి నిల్వ ఉంచుకుని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ డేగల ప్రభాకర్ పేర్కొన్నారు. బైరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం ఆయన విలేకర్లకు వివరాలు తెలియజేశారు. బైరెడ్డిపల్లె మండలం, చప్పిడిపల్లె గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి ఇంట్లో గంజాయి నిల్వ ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ చందనప్రియ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారన్నారు. బాలకృష్ణారెడ్డి ఇంట్లో ఉన్న 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలకృష్ణారెడ్డితో పాటు పలమనేరుకు చెందిన షేక్ సలీంబాషా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన గోనిపల్లె అల్లెయ్యను చప్పిడిపల్లె క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. గంజాయి తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్నారని, అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లె, వికోట, గంగవరం పరిసర ప్రాంతాలకు చేరవేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. డీఎస్పీ వెంట సీఐ పరుశురాముడు, ఎస్ఐ చందనప్రియ, పోలీస్ సిబ్బంది ఉన్నారు. గ్రావెల్ అనుమతుల కోసం బెదిరింపులు పాలసముద్రం: గ్రావెల్ తవ్వకాలకు అనుమతివ్వాలంటూ సర్పంచ్, ఎంపీడీఓను అధికార పార్టీ నేతలు బెదిరించిన ఘటన మండలంలోని వనదుర్గాపురం పంచాయతీలో గురువారం చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రానికి ఎర్రమట్టి గ్రావెల్ సరఫరా చేయాలని, 45 రోజులు తాత్కాలిక గనుల లీజు అనుమతి ఇవ్వాలని బెదిరించినట్టు తెలిసింది. ఇప్పటికే గ్రామంలోని మూడు కొండలు కనుమరుగయ్యాయని స్థానికులు చెబుతున్నారు. రెండుల నెలలుగా ఎర్రమట్టి గ్రావెల్ తమిళ రాష్ట్రానికి వెళ్లకుండా అధికారులు, ప్రజలు అడ్డు కట్టవేశారని, ఇప్పుడు మళ్లీ గనుల లీజు అని అధికారులను బయంపెట్టడం దారుణమని పేర్కొంటున్నారు. రెవెన్యూ కార్యాలయ గనుల శాఖ ఫైళ్లన్నింటినీ తనిఖీ చేయడానికి టాస్క్ఫోర్స్, విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
తూగుండ్రం సచివాలయం తనిఖీ
గంగాధర నెల్లూరు: మండలంలోని తూగుండ్రం సచివాలయాన్ని కలెక్టర్ సుమిత్కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో యునైటెడ్ ఫ్యామిలీ సర్వే, తాగునీటి ట్యాంకుల శుభ్రత, క్లోరినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తూగుండ్రం మేజర్ పంచాయతీ అని, తడి చెత్త –పొడి చెత్త సేకరణకు చిన్న బండి సరిపోవడం లేదని, చెత్త సేకరణకు ట్రాక్టర్ కావాలని పంచాయతీ కార్యదర్శి కలెక్టర్కు విన్నవించారు. కలెక్టర్ స్పందిస్తూ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తూగుండ్రంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామన్నారు. గంగాధరనెల్లూరు నుంచి తూగుండ్రం వరకు కొత్తగా వేసిన తారు రోడ్డును కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోహర్గౌడ్, స్థానిక సర్పంచ్ శ్రీ బాబు, ఎంపీటీసీ వాణిశ్రీ కేశవులు, తూగుండ్రం జెడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ సుధాకర్, వెల్ఫేర్ అసిస్టెంట్ జనార్దన్, ఆర్బీకే అగ్రికల్చర్ ఆఫీసర్ రెడ్డెప్ప, డిజిటల్ అసిస్టెంట్ గీత తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినిని చితక్కొట్టిన ఉపాధ్యాయురాలు
పుత్తూరు: అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదన్న కోపంతో సహనం కోల్పోయిన ఉపాధ్యాయురాలు తీవ్రంగా కొట్టడంతో ఓ విద్యార్థిని స్ఫృహతప్పి పడిపోయింది. ఈ ఘటన పుత్తూరు జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. సోషల్ టీచర్ రాజేశ్వరి మ్యాప్ పాయింట్పై మణిదీపిక అనే విద్యార్థినిని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో నియంత్రణ కోల్పోయిన టీచర్ మణిదీపికను గట్టిగా కొట్టింది. దీంతో విద్యార్థిని స్ఫృహతప్పి కిందపడిపోయింది. సహచర విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మణిదీపిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా విద్యార్థిని తల్లి భవాని ఆస్పత్రికి చేరుకుని చదువు చెప్పమంటే ఇంతలా కొడతారా అని పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రధానోపాధ్యాయురాలు భువనేశ్వరి హామీ ఇచ్చారు. ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు పాఠశాలలో జరిగిన ఉదతంపై వివరణ కోరుతూ సోషల్ టీచర్ రాజేశ్వరికి పుత్తూరు డీవైఈవో మహేశ్వరరావు బుధవారం షోకాజ్ నోటీసు జారీచేశారు. విద్యార్థి ఆస్పత్రిలో చేర్పించే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. -
కర్షకుల కడుపు కొట్టొద్దు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో మామిడి రైతులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై పెదవి విరుస్తున్నారు. కేజీకి రూ.9 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద గిట్టుబాటు ధర పోరును ఉధృతం చేస్తున్నారు. బుధవారం జీడీ నెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీని ముట్టడించారు. గతేడాది పండిన మామిడి పంటను రైతులు అష్టకష్టాల నడుమ విక్రయించుకున్నారు. 31 పల్ఫ్ ఫ్యాక్టరీలకు కాయలు తరలించగా.. సుమారు రూ.360 కోట్లు వరకు రైతులకు బకాయిలున్నాయి. ఆరు నెలలుగా పలు ఫ్యాక్టరీలు ఆ బిల్లులు చెల్లించకపోగా.. కొన్ని ఫ్యాక్టరీలు రూ.3, రూ.4 చెల్లించేందుకు ముందుకొస్తున్నాయి. దీనిపై రైతులు మండిపాటుకు గురవుతున్నారు. ప్రభుత్వ ప్రకటించిన మద్ధతు ధర ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేజీకి రూ.8 కాదు..రూ.9 ఇవ్వాలి చంద్రబాబు సర్కార్ కేజీకి రూ.8 ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకో లేదు. దీంతో రైతులు ఫ్యాక్టరీలను ముట్టడిస్తున్నారు. ధర్నాలు చేస్తూ..రోడెక్కుతున్నారు. పలు ఫ్యాక్టరీలకు తాళం వేస్తూ..వారి ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ప్రకటించిన.. కేజీకి రూ.8తో పాటు ఆరునెలల పాటు జాప్యానికి బదులుగా మరో రూ.1 అదనంగా ఇవ్వాలనే డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొంత మంది మామిడి రైతు నాయకులు ఫ్యాక్టరీలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలతో లాలూచీ? కొందరు మామిడి రైతు నాయకులు ఫ్యాక్టరీలతో లాలూచీ పడ్డారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేజీకి రూ.8 బదులుగా.. రూ.6 ఇవ్వండి అంటూ.. ముందుపడడంతో అధిక శాతం మంది రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. రూ.6 అనే మాటే వద్దని భీష్మిస్తున్నారు. ఇది కూడా పాలకుల సిండికేట్ దెబ్బే అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సంక్రాంతికి ఇవ్వకుంటే! ఫ్యాక్టరీలు సంక్రాంతికి కల్లా రైతులకు నగదు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఈనెల 14వ తేదీ మళ్లీ మామిడి రైతుల పోరు ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ఆపై నిరవధిక సమ్మె ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రైతులను పోలీసుల ద్వారా అడ్డుకుని నోరు మూయిస్తున్నారు. -
ఆరునూరైనా పోరాటమే!
మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు రోడ్డున పడేశాయి గంగాధరనెల్లూరు : జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలు సిండికేట్గా మారి మామిడి రైతులను రోడ్డున పడేశాయని మామిడి రైతు సంఘ నేతలు మండిపడ్డారు. గంగాధరనెల్లూరు మండల కేంద్రంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద బుధవారం నిరసన తెలియజేశారు. ప్రభుత్వం మామిడి రైతుల కష్టాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. నాడు రైతు సంఘాల నాయకులతో కలెక్టర్ ఆధ్వర్యంలో కిలోకు రూ.8 గిట్టుబాటు ధర ఇస్తామని హామీ ఇవ్వగా, ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాటతప్పాయన్నారు. నేడు రూ.6, రూ.4 ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయశాఖా మంత్రి అచ్చెన్నాయుడు కిలోకు రూ.8 ఇవ్వమని చెప్పినా ఏ ఒక్క ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా పట్టించుకోలేదన్నారు. జనవరి 14వ తేదీ ముఖ్యమంత్రిని కలిసి అక్కడే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. వడ్డీకి కూడా రాలేదు చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు చాలావరకు అప్పులు తెచ్చి మందులు పిచికారీ చేశారని, వేలాది రూపాయలు ట్రాక్టర్ బాడుగలు వెచ్చించి, రోజుల తరబడి రోడ్లపై పడిగాపులు కాసి ఫ్యాక్టరీ యాజమాన్యాలకు కాయలు తోలామని తెలిపారు. నేడు మద్దతు ధర ఇవ్వకుండా రైతు కడుపు కొట్టే పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. భారీ పోలీసు భద్రత మామిడి రైతుల నిరసన కార్యక్రమంలో భాగంగా జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రైతు సంఘాల నాయకులతో మాట్లాడి గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలతో చర్చలు జరిపి సంక్రాంతి లోపు డబ్బులు వచ్చేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. రూ.6కు ఒప్పందం.. ఆపై వాగ్వాదం గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలతో చర్చలు సందర్భంగా రైతు సంఘ నాయకులు మీడియా ముందు ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకున్నారు. రైతు సంఘాల నాయకులు హరిబాబు చౌదరి, కొత్తూరు బాబు మాట్లాడుతుండగా మధ్యలో చంద్రశేఖర్ నాయుడు కలుగజేసుకుని రూ.6కు ఎలా ఒప్పుకుంటారని నిలదీశారు. ఆపై ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ? మామిడి రైతులు ఇబ్బందులు పడుతుంటే బాబు ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ..? అని మామిడి రైతు సంఘ నాయకుడు ఆనంద నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ నాయకులు మామిడి రైతులతో చెలగాటమాడుతున్నారని, మామిడి రైతుల కన్నీరు ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా తుడవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా ఆస్పపత్రిలో పీపీపీ పద్ధతిలో రోగులకు సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో బుధవారం పీపీపీ పద్ధతిలో రోగులకు సూపర్ స్పెషాలిటీ సౌకర్యాల కల్పనపై వివిధ వార్డులను కలెక్టర్, ఎంపీ ప్రసాదరావు, అపోలో నిర్వాహకులతో కలిసి పరిశీలించారు. ఆస్పత్రిలో అపోలో నిర్వాహకులు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు, ఎమర్జెన్సీ విభాగం విస్తరణ, అలాగే పార్కింగ్ సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించారు. సుమారు 450 పడకలు పునర్నిర్మాణ ఆస్పత్రి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వివిధ వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందుతున్న సేవల నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ హోదాలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ పద్మాంజలి, సూపరింటెండెంట్ ఉషశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి పాల్గొన్నారు. -
11కేవీ విద్యుత్ లైన్ తగిలి క్లీనర్ మృతి
గుడిపాల: 11 కేవీ విద్యుత్లైన్ తగిలి ఓ టిప్పర్ షార్ట్ సర్క్యూట్కు గురైంది. ఈ ఘటనలో ఓ క్లీనర్ మృతిచెందాడు. గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ కథనం.. గుడిపాల మండలం, ముత్తువాళ్లూరు గ్రామ సమీపంలో రోడ్డు వద్ద వర్షం కారణంగా గుంతలు ఏర్పడ్డాయి. వాటిని పూడ్చేందుకు బుధవారం మధ్యాహ్నం ఏపీ–39–టీఏ–7475 నంబరు గల టిప్పర్ మట్టిని తీసుకొచ్చి అన్లోడింగ్ చేస్తోంది. ఇంతలో పైన 11కేవీ విద్యుత్లైన్ తగలడంతో డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకేశాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. టిప్పర్లోనే ఉన్న ఒడిశా రాష్ట్రానికి చెందిన క్లీనర్ పీతంబర్శెట్టి( 51) మృతిచెందాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు మంటలను అదుపుచేశారు. టిప్పర్ వెనుకభాగం పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు చిత్తూరు కలెక్టరేట్ : ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో దివ్యాంగ క్రీడాకారులకు ఉచితంగా క్రీడాసామగ్రి పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని, పట్టుదల, కృషి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని తెలిపారు. వైకల్యాన్ని అదిగమించి విజయాలు సాధించాలన్నారు. ఎలాంటి బాధ లేకుండా కృషి, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలన్నారు. అనంతరం దివ్యాంగ క్రీడాకారులకు క్రీడీ సామగ్రిని ఉచితంగా అందజేశారు. డీఎస్డీవో ఉదయ్భాస్కర్, దివ్యాంగ క్రీడాకారులు జ్యోతి పాల్గొన్నారు. 108 డ్రైవర్ గుండె పోటుతో మృతి కాణిపాకం: ఆపదలో అందరి ప్రాణాలను కాపాడే 108 డ్రైవర్ గుండె పోటుతో మృతి చెందిన ఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. ఐరాల మండలం, దేవగిరి గ్రామానికి చెందిన హేమశేఖర్ నాయుడు(42) కాణిపాకం 108 డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం కాణిపాకం నుంచి ఓ కేసును తీసుకొని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. తిరిగి కాణిపాకం వెళ్తున్న సమయంలో నగరంలోని దర్గా సర్కిల్ వద్ద ఓ షాపు వద్ద ఆగి ఏవో వస్తువు కొంటున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. అదే 108లోనే మరో డ్రైవర్ అతన్ని పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ లోపు 108 సిబ్బంది సీపీఆర్ కూడా చేస్తూ వెళ్లారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే హేమశేఖరనాయుడు మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. కాగా మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. కొత్తపల్లిమిట్టలో ఐసీఎంఆర్ బృందం పర్యటన శ్రీరంగరాజపురం : మండలంలోని 49 కొత్తపల్లిమిట్టలో నాలుగురికి స్కృబ్ టైఫస్ వ్యాధి సోకడంతో జాతీయ ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ బృందం పర్యటించింది. రీసెర్చ్ సభ్యులు సురేష్, విష్ణునాథన్, ఎల్.అరసన్ రోగులను పరామర్శించారు. వారికి ఉచితంగా మందులను అందించారు. అనంతరం 49 కొత్తపల్లిమిట్ట గ్రామస్తులకు స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. గ్రామంలోని 25 మందికి రక్త పరీక్షలు నిర్వహించి, ల్యాబ్కు పంపారు. ఇంటి పరిసరాల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. మండల వైద్యాధికారి డాక్టర్ బాలజీచరణ్, సుపర్వైజర్ ఝాన్సీరాణి పాల్గొన్నారు. యూరియాపై ఆందోళన వద్దు పెనుమూరు(కార్వేటినగరం): జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఐ.మురళి చెప్పారు. బుధవారం పెనుమూరు మండలం, గుంటిపల్లి రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయడం వల్ల మిగిలిన రైతులకు సకాలంలో అందించ లేకపోతున్నామన్నారు. అలాగే సమగ్ర పోషణ, యాజమాన్య పద్ధతులను వివరించారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా ద్రవ రూపంలో ఒక్కసారి పిచికారీ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఉమా, డీఆర్సీ లక్ష్మీప్రసన్న, ఏఓ సుహర్లత పాల్గొన్నారు. -
బేలుపల్లెలో పట్టపగలే చోరీ
బైరెడ్డిపల్లె : మండలంలోని బేలుపల్లెలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన నారాయణప్ప బుధవారం ఉదయం ఇంటికి తాళాలు వేసుకుని పొలం వద్దకు వెళ్లాడు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లగా బీరువా తాళాలు పగులగొట్టి సుమారు 50 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేలు వరకు నగదు చోరీ చేశారు. సమాచారం అందుకున్న సీఐ పరుశురాముడు, ఎస్ఐ చందనప్రియ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇదివరకే గ్రామంలో చాలాసార్లు చోరీలు జరిగాయని, దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు పోలీసులకు విన్నవించారు. -
ఇలాగైతే ‘టెండర్లు’ ఎందుకో?
చిత్తూరులో తమ కనుకూలురుకు ముందే పనులప్పగించి ఆపై టెండర్లు ఆహ్వానించడం విమర్శలకు తావిస్తోంది. 9,10న మంత్రులు కుప్పం రాక కుప్పం: కుప్పంలో ఈ నెల 9, 10 తేదీల్లో ముగ్గురు రాష్ట్ర మంత్రులు పర్యటించనున్నట్లు ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం తెలిపారు. కుప్పం మండలం, కంగుంది గ్రామంలో నిర్వహించనున్న బౌల్డరింగ్ ఫెస్టివల్ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖా మంత్రి రామ్ప్రసాద్రెడ్డి, దేవదయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణరెడ్డి ఈనెల 9వ తేదీ రానున్నట్లు తెలిపారు. అదేవిధంగా 10వ తేదీ శనివారం పర్యాటక శాఖామంత్రి కందుగ దుర్గేష్ కుప్పంలో పర్యటిస్తారన్నారు. కంగుందిలో నిర్వహిస్తున్న బౌల్డరింగ్ ఫెస్టివల్ కార్యక్రమంలో 10వ తేదీ జరగనున్న ఫైనల్ పోటీలను మంత్రులు పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తారన్నారు. కుప్పం ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. రహదారి నిబంధనలు తప్పనిసరి చిత్తూరు రూరల్: రహదారి నిబంధనలను విధిగా పాటించాలని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలో బుధవారం జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అంబేడ్కర్ విగ్రహ కూడలిలో కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ మాసోత్సవంలో ‘శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన’ అని సరికొత్త నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. అనంతరం ఎంపీ డూడి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు రద్దు చేస్తామన్నారు. రహదారి భద్రత మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి నిరంజన్రెడ్డి, ఆర్టీఓ సునీల్, ఎంవీఐలు నరసింహులు, మురళి, శివకుమార్, కుసుమ పాల్గొన్నారు. -
కలలు సాకారం చేసుకోవాలి
రొంపిచెర్ల : స్వయం సహాయక సభ్యులు తమ కలలు సాకారం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. బుధవారం రొంపిచెర్ల సీ్త్ర శక్తి కార్యాలయంలో ఆమె మండల సమాఖ్య లీడర్లు, వీఓ లీడర్లు, సంఘమిత్రలకు శిక్షణ తరగతులను నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ సంఘాల అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మౌలిక వసతులు, జీవనోపాధి, సామాజిక భద్రత, ఆస్తులు, భూముల కొనుగోళ్లు వంటి కలలను సాకారం చేసుకోవాలన్నారు. సభ్యులకు ఇచ్చిన రుణాలను తిరిగి అదేవిధంగా బ్యాంక్లకు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. పాఠశాలల తనిఖీ కుప్పం: పట్టణంలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికోన్నత పాఠశాలలను డీఈవో రాజేంద్రప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుప్పంలో పర్యటించిన ఆయన రెండు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఆరా తీశారు. ఫిబ్రవరిలో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు అత్యధిక శాతంతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈవో రాజారామ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కారుకు లాయర్ స్టిక్కర్లు.. చేసేది దొంగతనాలు!
చిత్తూరు అర్బన్: కారుకు న్యాయవాది లోగో ఉన్న స్టిక్కర్లు వేసుకుని వెళ్లడం.. చీకటైతే తాళాలు వేసిన ఇళ్లను పగులగొట్టి చోరీలకు పాల్పడడం అటవాటు చేసుకున్న అంతర్రాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన రాయపాటి వెంకయ్య (49), షేక్ నాగుల్ మీరా (27), యక్కంటి తులసిరామిరెడ్డి (26)ని అరెస్టు చేసిన పోలీసులు.. దాదాపు రూ.50 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు, కార్లు, స్కూటర్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఎస్పీ తుషార్ డూడీ, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. గతేడాది జూలై 15వ తేదీన పలమనేరు పట్టణంలోని అయ్యాకన్ను వీధిలో ఉంటున్న బాలాజీ అనే వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దీనిపై అదే నెల 18వ తేదీ బాధితుడి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం పలమనేరు శివారుల్లోని చిత్తూరు–బెంగళూరు జాతీయ రహదారిపై నాగమంగళం బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రాయపాటి వెంకయ్య (49), షేక్ నాగుల్ మీరా (27), యక్కంటి తులసిరామిరెడ్డి (26)ను అదుపులోకి తీసుకుని విచారించారు. పలమనేరులో చేసిన చోరీలో 210 గ్రాముల బంగారు, వజ్రాభరణాలు, పుంగనూరులో జరిగిన మరో చోరీలో 76 గ్రాముల బంగారు, ఓ చైన్స్నాచింగ్ కేసులో 13 గ్రాములు, క్రిష్ణగిరిలో జరిగిన చైన్ స్నాచింగ్లో 13 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు, బైకుల్లో వెళ్లి.. ఇళ్లలో చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కారు, రెండు ద్విచక్ర వాహనాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వీటి విలువ రూ.50 లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. వందల కొద్దీ కేసులు పట్టుబడిన నిందితులపై వందల కొద్దీ కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. పలమనేరు, పుంగనూరు, గంగవరం, బెంగళూరు, కర్ణాటకలోని ముల్బాగల్, బంగారుపేట, కోలార్, తమిళనాడులోని కృష్ణగిరి, గుంటూరు ప్రాంతాల్లో సైతం కేసులు నమోదయ్యాయన్నారు. ప్రధాన నిందితుడు వెంకయ్యపై వందకు పైగా కేసులుంటే, మీరాపై 75 కేసులు, తులసిరామిరెడ్డిపై పదికి పైగా కేసులు ఉన్నట్టు వెల్లడించారు. 35 కేసుల్లో నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారని తెలిపారు. లాకర్లలో బంగారం కాగా గంగవరంలో నిందితులు చేసిన చోరీలో దోచుకున్న బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇక కోలార్లోని ఓ వ్యాపారి ఇంట్లో కేజీ బంగారు ఆభరణాలు, ముల్బాగిల్లో రూ.15 లక్షల నగదు, నంగిలి, మధురై ప్రాంతాల్లో కూడా చోరీలకు పాల్పడినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదించిన సీఐ మోహన్రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ.. నగదు ప్రోత్సాహకాలు అందచేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రాజశేఖర్ రాజు, ట్రైనీ ఐపీఎస్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇలాగైతే ‘టెండర్లు’ ఎందుకో?
చిత్తూరు అర్బన్: ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, సదుపాయాల కల్పనలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిందే. ఇదే సమయంలో అభివృద్ధి పనులు చేయడానికి నిర్ణీత నిబంధనలతో ముందుకు వెళ్లాలే తప్ప.. నలుగురు తప్పుబట్టేలా కాదు. ఈ విషయాన్ని మరచిపోయిన చిత్తూరు మునిసిపల్ అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి పనులను చేయించడంలో టెండర్లు అనే విధానం ఉందని కూడా మరిచిపోతున్నారు. రోడ్లు, కాలువ పనులను ముందుగానే టీడీపీ నేతలకు ఇచ్చేయడం.. ఆపై టెండర్లు పిలవడం అధికారులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో అరకోటికి పైగా అభివృద్ధి పనులు చేయడానికి కార్పొరేషన్ అధికారులు టెండర్లు పిలిచారు. దరఖాస్తు చేయడానికి గురువారం సాయంత్రం 5 గంటల వరకు సమయం కూడా ఉంది. కానీ ఆ పనులను అధికారపార్టీ నేతలు ఎప్పుడో పూర్తి చేశారు. ఈ మాత్రం దానికి మరి టెండర్లు పిలవడం ఎందుకో?.అత్యవసరం మేరకు కొన్నిచోట్ల కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటించినపుడు ప్రజలకు వెంటనే మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో పనులు చేయించాల్సి వస్తోంది. అన్ని టెండర్లలో ఇలా చేయడం లేదు. ఇక నుంచి టెండర్లు పిలిచాకే పనులు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెబుతాం. – వెంకటరామిరెడ్డి, ఇన్చార్జ్ కమిషనర్, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ టెండర్లు పిలవొద్దు అభివృద్ధి పనులకు మేము అడ్డుకాదు. కానీ ఏదైనా ఓ పద్ధతిలో జరగాలి. టెండర్లు లేకుండా అసలు పనులు ఎలా చేస్తారు. ఆ మాత్రం దానికి టెండర్లు పిలవకుండా మీ పార్టీ కార్యకర్తలకు పనులు అప్పగించుకోండి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతులను ఏ ఒక్కరూ హర్షించరు. –ఎంసి.విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, చిత్తూరు సాక్ష్యాలు ఇవే.. కాదంటారా? చిత్తూరులోని గంగాసాగరం వద్ద రూ.7.05 లక్షలతో కాలువ నిర్మించడానికి అధికారులు ఆన్లైన్లో టెండర్లు పిలిచారు. కానీ క్షేత్ర స్థాయిలో వెళ్లి చూస్తే.. కాలువ ఎప్పుడో కట్టేశారు. అసలు కాలువ పొడవు ఎంత..? పనులు ఎవరు పర్యవేక్షించారు? ఇసుకలో సిమెంటు ఎంత కలిపారు..? లాంటి ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు. చిత్తూరు నగరంలోని నాయుడు బిల్డింగ్స్లో రూ.7.43 లక్షలకు రోడ్డు వేయాలని, ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్లు గురువారం సాయంత్రంలోపు టెండరు వేసుకోవాలని కార్పొరేషన్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. నాయుడు బిల్డింగ్స్ వద్ద వెళ్లి చూస్తే.. ఇప్పుడిప్పుడే వేసిన రోడ్డు కనిపిస్తోంది. ఎన్ని రోజుల్లో రోడ్డు వేశారు..? క్యూరింగ్ ఎప్పుడు చేశారు..? నాణ్యత పరిస్థితి ఏమిటి..? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంత్ నగర్ వద్ద కూడా ఇదే పరిస్థితి. రూ.8.35 లక్షల పనులను ఎప్పుడో పూర్తి చేసేస్తే.. ఇప్పుడు టెండరు పిలిచారు. అసలు ఇది ఎన్నాళ్ల ముందు నిర్మించిన కాలువ..? గతంలో బిల్లులు ఇచ్చిన కాలువకు.. ఇప్పుడు తప్పుడు బిల్లులు పెడుతున్నారా..? ఏదీ అర్థం కావడం లేదు. -
ఓ తల్లి ముందు‘చూపు’!
● కొడుకు నేత్రాలను దానం చేసిన మాతృమూర్తి చిత్తూరు రూరల్(కాణిపాకం): కన్న కొడుకు మృతితో కన్నీళ్లు కార్చిన ఓ తల్లి.. చివరకు ఆ కొడుకు కళ్లు దానం చేసి మరొక్కరికి చూపు ఇవ్వాలని నిర్ణయించుకుంది. మంగళవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మృతిచెందిన కొడుకు కళ్లు దానం చేసి ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. చిత్తూరు నగరం, రంగాచారి వీధికి చెందిన రాహుల్ (18) బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి వెంకటేష్ కరోనా కాలంలో మృతిచెందగా.. తల్లి అమ్ము దినసరి కూలీగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. డిసెంబర్ 31వ తేదీన రాహుల్ ద్విచక్ర వాహనంపై వెళుతూ మురకంబట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రాహుల్ తలకు తీవ్రగాయాలయ్యా యి. వెంటనే స్థానికులు ఆ యువకుడిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాయపడ్డ యువకుడిని మెరుగైన చికి త్స నిమిత్తం తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో బంధువులు ఈనెల 2వ తేదీ చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చేశారు. ఇక్కడ వెంటిలేటర్పై చికిత్స అందిస్తుండంగా.. మంగళవారం ఆ యువకుడు మృతిచెందాడు. మృతుడి తల్లి తన కుమారుడి అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకుంది. చివరకు కొడుకు కళ్లు అయినా దానం చేసి ఇంకొక్కరికి చూపు ఇవ్వాలని భావించింది. ఈ మేరకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో కుమారుడి కళ్లు దానం చేయించింది. -
రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం
నారాయణస్వామి పాలసముద్రం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణశాసనం రాశారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఘాటుగా విమర్శించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నివర్శనమన్నారు. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తల పెట్టిన లిఫ్ట్ఇరిగేషన్ స్కీంను ఆపేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి మేలు జరగదనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఆయన సీఎంగా ఉన్న కాలంలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కూడా తెచ్చి పూర్తి చేయలేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం ఈ ప్రాంతవాసుల దురదృష్ట కరమన్నారు. శ్రీశైలంలో 880 అడుగుల నీటి మట్టం ఉంటేనే రాయలసీమ నీటిని తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గుర్తు చేశారు. ఆ నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుపడినా ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడారన్నారు. 854 అడుగుల వద్ద 7వేల క్యూసెక్కులు, 841 అడుగుల వద్ద 2వేల క్యూసెక్కుల చొప్పున డ్రా చేసుకునేందుకు వీలుంటుందన్నారు. శ్రీశైలంలో ఏపీకి 101 టీఎంసీల నికర జలాలు కేటాయించారని, విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ 795 అడుగులకు వచ్చేసరికి వాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. దీంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోందని చెప్పారు. రాయలసీమ వాసుల ప్రయోజనాలు కాపాడేందుకు వైఎస్సార్ సీపీ ఎంతటి పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. -
అక్రమ కేసులకు భయ పడొద్దు
రొంపిచెర్ల : అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ కార్యకర్త లు ఎవ్వరూ భయపడొద్దని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రొంపిచెర్ల మండలం, చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీ, గురికివారిపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బాలాజీని ఆయన కలిసి పరామర్శించారు. 25 రోజుల క్రితం తన వ్యవసాయ పొలంలో ఉన్న శ్రీగంధం మొక్కలను చదును చేసుకు నే క్రమంలో తొలగించానని, టీడీపీ నాయకులు ఫిర్యా దు చేయడంతో అటవీశాఖ అధికారులు అక్రమంగా కేసు నమోదు చేశారని బాలాజీ మాజీ మంత్రికి వివరించారు. దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసులకు ఎవ్వరూ భయపడొద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారి పేర్లను వైఎస్సార్సీపీ కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలన్నారు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, తర్వాత అసలు, వడ్డీ తిరిగి ఇచ్చేదామన్నారు. పెద్దిరెడ్డిని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రతాప్రెడ్డి, ఆనందనాయుడు, పరమేశ్వర, రామనారాయణరెడ్డి, అనిల్రెడ్డి ఉన్నారు. -
పెన్షనర్ల ప్రయోజనాలపై విస్తృత అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : పెన్షనర్ల ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఆర్వో మోహన్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ వివిధ సంస్థల్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందే ఉద్యోగులకు అందే పెన్షన్ ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. యాజమాన్యాలకు, సంస్థలకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ పథకం, ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన పథకంలో ఉద్యోగులు నమోదు కావాలన్నారు. ఈ కార్యక్రమాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సామాజిక భద్రత అర్హత కలిగిన ఉద్యోగులు వారు చేరిన తేదీ నుంచి ఉద్యోగుల భవిష్యనిధి పథకం, ఉద్యోగుల పెన్షన్ పథకం, ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్లో సామాజిక భద్రత ప్రయోజనాలు పొందుతారన్నారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హైవేలో బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
రొంపిచెర్ల : చైన్నై– అనందపురం హైవేలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సులు బస్స్టాప్లో అగడం లేదని, దీని కారణంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మంగళవారం మధ్యాహ్నం బస్సులను అడ్డుకున్నారు. దీంతో అన్నమ్మయ్య జిల్లా, పీలేరు ఆర్టీసీ డీఎం రోషన్ వచ్చి బస్స్టాప్లోనే బస్సులు నిలుపుతామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దు మణిగింది. గత నాలుగు నెలల కాలంలో రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో రోడ్డు దాటుతూ 8 మంది మృతి చెందగా, మరో 10 మంది వరకు గాయపడ్డారు. దీనికి ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను బస్స్టాప్లో అపక పోవడమే కారణమని మండిపడ్డారు. సోమవారం రాత్రి కూడా గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలసి పోతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని బస్సులను అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి రొంపిచెర్ల పోలీసులు వచ్చి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆపై బస్సులు ఇక్కడే ఆపాల ని తెలిపారు. డీఎం అప్పటికప్పుడే బస్స్టాప్ వద్దనే బస్సులు నిలపాలని డ్రైవర్లను ఆదేశించడంతో సమస్య సద్దుమణిగింది. చైన్నె– అనంతపురం హైవేలో నిలిచిన బస్సులురొంపిచెర్ల క్రాస్ రోడ్డులో బస్సులను అడ్డుకున్న ప్రజలు -
గుజ్జు..బతుకు నుజ్జు!
కాణిపాకం: జిల్లాలో 56వేల హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టా ర్లు, నీలం 5,818 హెక్టార్లు, అల్పోన్సో 3,127 హెక్టా ర్లు, బేనీషా 3,895 హెక్టార్లు, మల్లిక 1,740 హెక్టా ర్లు, ఇతర రకాలు 1,526 హెక్టార్లల్లో సాగవుతున్నా యి. గతేడాది మే నుంచి మామిడి కోతలు మొదలయ్యాయి. టేబుల్ రకం మాత్రం మే 15 తర్వాత కోతలు కోసి విక్రయించుకున్నారు. తోతాపురి జూన్లో కోతలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో దిగుబడిని ఆసరాగా చేసుకుని ఫ్యాక్టరీలన్నీ సిండికేట్ అయ్యి.. రేట్లు తగ్గించేశాయి. ప్రభుత్వ గిట్టుబాటు ధర ఇదీ జిల్లాలోని పలు ఫ్యాక్టరీలు మామిడి రైతులను చిత్రహింసలకు గురిచేశాయి. కాయలు కొనుగోలు చేయలేమని చేతులెత్తేశాయి. మరికొన్ని ఫ్యాక్టరీలు కేజీ తోతాపురి రూ.4, రూ.5, రూ.6 అంటూ పాటపాడాయి. దీనిపై రైతులు తిరుబాటు ఎగురవేశారు. చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చి మామిడికి గిట్టుబాటు ధరను ప్రకటించింది. ఫ్యాక్టరీలు కేజీకి రూ.8 చొప్పున్న చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. ఉద్యమ బాట చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతు కష్టాలు, గిట్టుబాటు ధరను పట్టించుకోకపోవడంతో జిల్లా లోని రైతులంతా ఉద్యమ బాట పడుతున్నారు. ఇది వరకు పలుమార్లు కలెక్టరేట్ను ముట్టడించారు. గుడిపాల మండలంలోని కొత్తపల్లి వద్ద ఉన్న ఓ ఫ్యాక్టరీ రూ.3, రూ.4 చెల్లిస్తోందని రోడెక్కారు. అదే ఫ్యాక్టరీకి సోమవారం రైతులంతా కలిసి తాళం వేశారు. నవంబర్లో చిత్తూరు మండలం, చెర్లోపల్లి వద్ద ఉన్న ఫ్యాక్టరీకి బంగారుపాళ్యంకు చెందిన రైతులు చేరుకుని ధర్నా చేశారు. బుధవారం జీడీనెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీకి తాళం వేయడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. గిట్టుబాటు ధర ఇచ్చేంత వరకు తమ ఉద్యమం ఆగదని రైతు నాయకులు తేల్చి చెబుతున్నారు. గిట్టుబాటు ధరకు ఎసరు? రైతులు ఫ్యాక్టరీలకు కాయలు తోలి ఆరు నెలలు గడించింది. ఇంతవరకు చాలా ఫ్యాక్టరీలు రైతులకు చిల్లిగవ్వ చెల్లించ లేదు. కొన్ని ఫ్యాక్టరీలు కేజీకి రూ.3, రూ.4 చెల్లించడంతో రైతుల కడుపు మండిపోతోంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికెళ్లినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఫ్యాక్టరీలతో ప్రభుత్వం సిండికేట్ అయ్యిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కారణంగానే ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధరను పట్టించుకోకుండా సొంత ధరను నిర్ణయించాయి. ఈ చెల్లింపుపై చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సిండికేట్ వెనుక ఎవరెవరున్నారని, ఎందుకు రైతులను ఇలా చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మామిడి రైతులకు అందని బకాయిలు తమిళనాడు కాయలకు ప్రాధాన్యం మామిడిలో టేబుల్ రకాలను పక్కన పెడితే జిల్లాలో అధికంగా తోతాపురి సాగువుతోంది. దాదాపు 39,895 హెక్టార్లు ఉండగా.. గతేడాది 4.99లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చింది. అందుకు తగ్గట్టు కొనుగోలుకు ఫ్యాక్టరీలు ఆసక్తి చూపలేదు. తమిళనాడు కాయలకు ప్రాధాన్యతనిచ్చా యి. రైతులంతా పోరుబాట పట్టడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ నేపథ్యంలో 46 ఫ్యాక్టరీలుంటే 31 ఫ్యాక్టరీలు కాయలు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. దిగుబడిని సాకుగా చూపించి ధరలను తగ్గించేశాయి. దీంతో రైతులు రోడెక్కాల్సి వచ్చింది. -
బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
చైన్నె–అనంతపురం హైవేలోని రొంపిచెర్ల బస్టాప్ వద్ద బస్సులు ఆపడం లేదని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఉద్యమం ఆగదు మామిడి రైతులు ఇన్నాళ్లు గమ్మనున్నారు. గిట్టుబాటు ధర ఇస్తార ని ఊరుకున్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు అన్యాయంగా రూ.3, రూ.4 ఇవ్వడం దారుణం. కడుపు మండిపోతోంది. రైతులంటే అలుసుగా మారిపోయింది. ఇది పద్ధతి కాదు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే. అంత వరకు మా ఉద్యమం ఆగదు. బెదిరింపులకు భయపడేది లేదు. – హరిబాబుచౌదరి, రైతు సంఘ నాయకుడు, చిత్తూరు మండలం ఆరు నెలలుగా తిరుగుతున్నాం మామిడి పంట కంటికి రెప్పలా కాపాడినా ఏం ప్రయోజనం. ఏదో పది రూపాయలు వస్తాదని ఫ్యాక్టరీకి తొలితే...ఆరు నెలలుగా బిల్లులు ఇవ్వలేదు. ఇలాగైతే రైతులు ఎలా బతకాలి. కేజీకి రూ.8 గిట్టుబాటు ధర ఇస్తామన్నారు. ఇప్పుడు రూ.3, రూ.4 ఇస్తే ఎలా..?. ఇలాగైతే రైతులంతా ఏకమవుతాం. రైతుల కడుపు కొట్టాడు..ఫ్లీజ్. – రాజశేఖర్నాయుడు, తెల్లగుండ్ల వలస, చిత్తూరు మండలం మొద్దు నిద్ర వీడాలి సీఎం సొంత జిల్లాలో మామిడి పంట ప్రధానం. గిట్టుబాటు ధర ఇస్తామని.. ఇంత వరకు ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. కలెక్టర్కు కూడా ఈ విషయాన్ని పదేపదే ప్రకటించారు. ఇప్పుడు రూ.3, రూ.4 ఇస్తుంటే..వాళ్ల మాటలకు విలువలేదా..? ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి. ఫ్యాక్టరీలతో పాలకులు కుమ్మకయ్యారనే అనుమానాలున్నాయి. ఇప్పటికై నా పార్టీలకు అతీతంగా పోరాడాలి. – విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ
చౌడేపల్లె : మండల కేంద్రంలోని హైస్కూల్ వీధిలో చర్చి పక్కన ఉన్న పెయింట్ వ్యాపారి గంగాధరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును విచారణ చేశారు. పెయింట్ వ్యాపారిపై పెద్ద కొండామర్రికి చెందిన శ్రీదేవి, ఆమె అల్లుడు రాజేష్రెడ్డి, చిన్నకొండామర్రికి చెందిన చెంగళ్రాయప్పలు దాడి చేసి పెయింట్ డబ్బాలు తీసుకెళ్లడంతోపాటు షాప్నకు తాళాలు వేశారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకొని డీఎస్పీ విచారణ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ రాంభూపాల్, ఎస్ఐ నాగేశ్వరరావు ఉన్నారు. వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి రొంపిచెర్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చైన్నై– అనంతపురం హైవేలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ మధుసూధన్ కథనం.. రాత్రి 11 గంటల సమయంలో రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వాహనదారులు చూసి రొంపిచెర్ల పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. రొంపిచెర్ల పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితుడిని 108లో అన్నమయ్య జిల్లా, పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుంది. మృతుడి ఆచూకీ తెలియని వారు కల్లూరు సీఐ జయరాం నాయక్ 9490617885, రొంపిచెర్ల ఎస్ఐ 9440900709కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా
ఐరాల: హంద్రీ–నీవా కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి కాలు విరిగిన ఘటన మంగళవారం మండలంలోని యల్లంపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం.. యల్లంపల్లెకు చెందిన రైతు బాబునాయుడు తన సొంత ట్రాక్టర్లో గ్రామ శివారులో ఉన్న పొలం వద్దకు మట్టి రోడ్డుపై తీసుకెళ్తున్నాడు. ట్రాక్టర్ అదుపు తప్పి హంద్రీ–నీవా కాలువలోకి దూసుకెళ్లింది. పొలాలకు వెళ్తున్న రైతులు గమనించి బాబునాయుడిని కాలువ నుంచి బయటకు తీశారు. అప్పటికే కాలు విరిగింది. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు హంద్రీ–నీవా కాలువలోకి నీరు చేరి బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాలువపై కల్వర్టు లేకపోవడంతో ఈ మార్గం ద్వారా మిరియం గంగనపల్లె, ఎస్టీ కాలనీ, బెల్లంగోవిందరెడ్డిపల్లెకు ప్రయాణం సాగించాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలువపై కల్వర్డు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మద్యం దుకాణంలో చోరీ వి.కోట : స్థానిక కేజీఎఫ్ రోడ్డులోని ఆంధ్రా వైన్స్ షాపులో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం పైకప్పు షీట్లను కట్ చేసి లోపలికి చొరబడ్డారు. రూ.50వేల విలువైన మద్యం సీసాను అపహరించారు. దుకాణం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. -
ఘనంగా సంకటహర చతుర్థి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో మంగళవారం సంకటహర చ తుర్థి గణపత్రి వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ అధికారులు ఉత్స వ మూర్తులను తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సా యంత్రం 5 నుంచి 6గంటల వరకు చతుర్థి గణపతి వ్రతాన్ని జరిపించారు. స్వర్ణ రథంపై స్వామివారు వరసిద్ధి వినాయకస్వామి వారు రాత్రి ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై కటాక్షించారు. ప్రధాన ఆలయంలో సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు అర్చక, ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి స్వర్ణ రథంలో కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. వ్రతంలో భక్తులు (ఇన్సెట్) ఊరేగుతున్న స్వామివారు -
లక్ష్యాలు చేరుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్ : వ్యవసాయశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యానవన పంటలు పండించే రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంఐడీహెచ్, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన, ఆయిల్ ఫామ్ సాగులో రైతులకు రూ.32 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను గుర్తించి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్నారు. తక్కువ సాగు ఖర్చులతో అధిక ఆదాయం పొందేందుకు రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు రూ.12 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. వివిధ పథకాలకు సంబంధించిన బిల్లులను వారానికి మూడు విడతలుగా అనుమతులు పొందాలన్నారు. జిల్లాలో నగరి, విజయపురం, నిండ్ర, కార్వేటినగరం, జీడీనెల్లూరు, ఎస్ఆర్ పురం మండలాల్లో ఆయిల్పామ్ తోటలకు 300 హెక్టార్లలో బ్సిడీని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. వచ్చే సమావేశానపికి ట్రెజరీ అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. లక్ష్యాలు సాధించడంలో బంగారుపాళ్యం, శాంతిపురం, వి.కోట క్లస్టర్ల ఉద్యానవన శాఖ అధికారులు వెనుకబడి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యానవన శాఖ ఏడీ కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఉచిత శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్స్, విభిన్న ప్రతిభావంతులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ట్రాన్స్జెండర్స్, విభిన్న ప్రతిభావంతులకు ఆన్లైన్లో ఉచితంగా పోటీ పరీక్షలు, స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ స్కిల్స్, కమ్యూనికేషన్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షణ పొందేందుకు అర్హత, ఆసక్తి ఉన్న వారు కలెక్టరేట్లోని విభిన్న ప్రతిభావంతుల శాఖలో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 08572–296506 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. బాధ్యతల స్వీకరణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సైన్స్ అధికారి (డీఎస్వో) మోహన్సింగ్ మంగళవారం బాధ్యత లు స్వీకరించారు. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా సైన్స్ అధికారిగా పనిచేసిన ఆయనను జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్గా నియమించారు. దీంతో సైన్స్ అధికారి పోస్టు ఖాళీ ఏర్పడింది. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం, లింగాపురం జెడ్పీ హైస్కూల్లో సైన్స్ టీచర్గా విధులు నిర్వహిస్తున్న మో హన్సింగ్ను జిల్లా సైన్స్ అధికారిగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపడుతామన్నారు. పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ–సంజీవనిని సద్వినియోగం చేసుకోవాలి – చిత్తూరు డీఎంహెచ్ఓ సుధారాణి చౌడేపల్లె: స్థానిక ప్రభుత్వాస్పత్రిని చిత్తూరు జిల్లా డీఎంహెచ్ఓ సుధారాణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఈ–సంజీవనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఈ కార్యక్రమం ద్వారా రోగి ఆరోగ్య స్థితిగతులను ఆన్లైన్లో పొందుపరచడం యూనిక్ ఐడీ ద్వారా ఎప్పటికప్పుడు వైద్యసేవ లు, జాగ్రత్తలు తెలిపేందుకు దోహదపడుతుందన్నారు. అనంతరం లద్దిగంలో ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పా టు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, అయితే స్థలం ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా చూపాల్సి ఉందన్నారు. మరో సారి జిల్లా కలెక్టర్కు స్థలం విషయమై నివేదిస్తామన్నారు. ఆమె వెంట డాక్టర్ మోనా ఉన్నారు. సైన్స్లో ఉపాధ్యాయ శిక్షణ కోర్సు చిత్తూరు కలెక్టరేట్ : సైన్స్లో ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయ శిక్ష ణ అవసరాల విశ్లేషణ (టీఎన్ఏ) ఆధారంగా మాధ్యమిక పాఠశాల సైన్స్ టీచర్లకు శిక్షణ కోర్సు అమలు చేయనున్నారు. టీఎన్ఏ ప్రక్రి యలో ఎంపిక చేసుకున్న టీచర్లకు శిక్షణ ఇవ్వ నున్నారు. ఈ శిక్షణకు జిల్లాలో డీఆర్పీ, మండలాల వారీగా ఎంఆర్పీలను ఎంపిక చేసి జాబితాను విడుదల చేశారు. ఈ శిక్షణ నిర్వహణ విధి విధానాలు, ఆన్లైన్ కోర్సుల పూర్తి షెడ్యూల్ను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్లో అర్హత, ఆసక్తి ఉన్న క్రీడాకారులు వర్క్షాప్లో పాల్గొనేందుకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఉదయ్భాస్కర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏపీ టూరి జం శాఖ ఆధ్వర్యంలో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు విజయవాడలో వర్క్షాప్ ఉంటుందన్నారు. అవకై ్క అమరావతి సినిమా, సంస్కృతి, సాహిత్య ఉత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ వర్క్షాప్ విజయవాడలోని భవానీ ద్వీపంలో జరుగుతున్నట్టు వెల్లడించారు. జిల్లాలో ఆసక్తి ఉన్న మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు (కరా టే, థైక్వాండో, జూడో, కుంగ్ఫూ తదితర) ఈ నెల 5వ తేదీలోపు నామినేషన్లు పంపాలన్నా రు. ఇతర వివరాలకు 9989345777, 9491504449 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
జరిమానా
గుడుపల్లె: అక్రమంగా చింత చెట్లను నరికి తమిళనాడుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న చింత కొమ్ముల కట్టెలకు కుప్పం అటవీశాఖ అధికారి జయశంకర్ మంగళవారం జరిమానా వేశామన్నారు. మండలంలోని పెద్దగొల్లపల్లె గ్రామ సమీపంలో తమిళనాడుకు చెందిన వ్యాపారులు చింత చెట్లను నరకి తరలిచేందుకు సిద్ధంగా ఉంచారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారుల ఉత్తర్వూలు లేకపోవడంతో తమిళనాడు నుంచి వచ్చిన వ్యాపారులకు రూ.25 వేల వరకు జరిమానా విధించారు. పేకాటరాయుళ్ల అరెస్ట్ శాంతిపురం: పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను రాళ్లబూదుగూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ నరేష్ కథనం మేరకు.. పంచా యతీ కేంద్రమైన రేగడదిన్నేపల్లి సమీపంలో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసు సిబ్బందితో కలిసి దాడిచేశారు. పేకాట ఆడుతున్న కర్ణాటకు చెందిన ఒకరితో పాటు మొత్తం నలుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ 4,430 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసులు నమో దు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి వి.కోట : పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో సోమ వారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. అంబేడ్కర్నగర్ కు చెందిన వినోద్తో కర్ణాటక రాష్ట్రం తాయలూరు వద్ద గల గడ్డం చిన్నెపల్లెకు చెందిన మేఘన (27)కు వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఏం జరిగింతో తెలియ దు కానీ, మేఘన ఇంట్లో ఉరివేసుకుంది. తమ బిడ్డను ఆమె భర్త, కుటుంబీకులే హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించామని సీఐ సోమశేఖర్రెడ్డి తెలిపారు. చోరీ కేసులో నిందితుడికి జైలు చిత్తూరు అర్బన్: మోటారు సైకిళ్లను చోరీ చేసిన కేసులో నిందితుడు పూజారి ఈశ్వర్ (36)కు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూ టర్ కె.ఉమాదేవి కథనం మేరకు.. బంగారు పాళ్యం, తగ్గువారిపల్లె, మురుకుల వీధి ప్రాంతాల్లో నాలుగు చోట్ల గత ఏడాది మోటారు సైకిళ్లు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదుచేసి దర్యా ప్తు ప్రారంభించారు. బంగారుపాళ్యం మండలం కీరమందకు చెందిన కోటి అలియాస్ పూజారి ఈశ్వర్ను నిందితుడిగా గుర్తించి గత ఏడాది అక్టోబరు 13వ తేదీన అరెస్టు చేసి, నాలుగు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టుకు తరలించారు. నేరం రుజువు కావడంతో ఒక్కో కేసులో ఏడాది జైలు శిక్ష చొప్పున.. మొత్తం నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. -
కలెక్టర్ సారూ... న్యాయం జరగడం లేదు
పీజీఆర్ఎస్లో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులుచిత్తూరు కలెక్టరేట్ : శ్రీకలెక్టర్ సారూ....క్షేత్ర స్థాయి లో న్యాయం జరగడం లేదుశ్రీ అంటూ పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ మాట్లాడు తూ ప్రజల నుంచి పీజీఆర్ఎస్లో నమోదయ్యే అర్జీల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. డీఆర్వో మోహన్కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలి తమ గ్రామంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలని గంగాధరనెల్లూరు మండలం, చెర్లోపల్లి, బంగారెడ్డిపల్లి, తాటిమాకులపల్లి గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. ఆయా గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. మహిళలు మాట్లాడుతూ చెర్లోపల్లి గ్రామంలోని దండుమారియమ్మ ఆలయం పక్కన ఓ నివాసంలో మహిళ వ్యభిచారం చేయిస్తోందని, ఆలయం పక్కన నివాసంలో జరుగుతున్న ఈ అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన సర్పంచ్ పై దాడి చేయించారని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొలం దారిని ఆక్రమించారు పొలం దారిని ఆక్రమించారని పలమనేరు మండలం, జంగాలపల్లె గ్రామస్తులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ పొలానికి దారిగా ఉన్న భూమిని ఆక్రమించడంతో రాకపోకలకు అవస్థలు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకున్నారు. -
మా ఊరిలోనే పాఠశాల కొనసాగించాలి
మా ఊరిలోనే పాఠశాలను కొనసాగించాలంటూ విద్యార్థులు చేతిలో ప్లకార్డులు పట్టి నిరసన చేపట్టారు. కలెక్టరేట్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. జిల్లాలోని గుడిపాల మండలం, వెంగమాంబపురం లో ఉన్న ఎంపీపీ పాఠశాలను ఏఎల్పురానికి మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని గ్రామస్తులు నవీన్, నాగజ్యోతి, మేఘల, ఏసుపాదం తెలిపారు. వెంగమాంబపురంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 20 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. ఏఎల్పురానికి పాఠశాలను మార్చే నేపథ్యంలో గత వారం నుంచి మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు పెట్టడం లేదన్నారు. తమ గ్రామం నుంచి ఏఎల్పురం 3 కి.మీ దూరం ఉంటుందన్నారు. ఆ గ్రామానికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
డయల్ యువర్ ఎస్ఈకి 8 ఫిర్యాదులు
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లాలో నిర్వహించిన డయల్ యువర్ కార్యక్రమానికి 8 ఫిర్యాదులు వచ్చాయి. ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ ఇస్మాయిల్అహ్మద్ సమస్యలను తెలుసుకున్నారు. పులిచెర్ల నుంచి పరిశ్రమ సర్వీసు పేరు మార్చాలని ఫిర్యాదు వచ్చింది. పుంగనూరు నుంచి చోరికాబడ్డ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో మరొకటి ఏర్పాటు చేయాలని ఇద్దరు ఫిర్యాదు చేశారు. నగరంలోని మురకంబట్టులో త్రీకటింగ్ చేయాలని, కార్వేటినగరంలో వ్యవసాయ సర్వీసులకు డబ్బులు కట్టామని, వాటిని రిలీజ్చేయాలన్నారు. కొత్తఇండ్ల నుంచి డబ్బులు కట్టినా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేదన్నారు. నగరంలోని కన్నయ్యనాయుడు కాలనీలో లోఓల్టేజీ సమస్య నివారించాలన్నారు. పలమనేరు నుంచి వ్యవసాయ సర్వీసు విడుదల చేయాలన్నారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఈఈలను ఆదేశించారు. ఈఈ మునిచంద్ర, పీఓ రెడ్డెప్ప, డీఈ ఆనంద్, ఏఈ వివేకానందరెడ్డి పాల్గొన్నారు. -
రేవంత్రెడ్డిపై పన్నీరు.. రాయలసీమ వాసులకు కన్నీరు
తిరుపతి మంగళం : తన శిష్యుడు రేవంత్రెడ్డి ప్రయోజనాలను కాపాడడం కోసం రేవంత్రెడ్డిపై పన్నీరు.. రాయలసీమ వాసులకు కన్నీరు మిగిల్చేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం ఎంత దుర్మార్గంగా ఉందో.. రాయలసీమ వాసులంతా ఆలోచించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కోరారు. రాయలసీమ వాసులకు చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ శాసన సభలో సీఎం రేవంత్రెడ్డి చంద్రబాబు దయవల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని చెప్పారన్నారు. ఆ పలుకులతో చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు చేస్తున్న ద్రోహం ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమైయిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనకు అనుకూలమైన, తన శిష్యుడైన రేవంత్రెడ్డి ప్రయోజనాలను కాపాడడం కోసమ ని రాయలసీమ ప్రజల కళ్లల్లో కారం కొట్టారన్నారు. చంద్రబాబు రేవంత్రెడ్డితో చేస్తున్న చెలి మి రాయలసీమను తాకట్టు పెట్టేలా ఉందన్నా రు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ వాసు ల కడగండ్లు తీర్చాలన్న సదాశయంతో రూ.4 వేల కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించి, నిత్యం టీఎంసీ నీళ్లతో రాయలసీమవాసుల పొలాలను తడపాలన్న గొప్ప ఆలోచన చేస్తే ఈ రోజు చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా రేవంత్రెడ్డి ప్రయోజనాలను కాపాడడం కోసమని రాయలసీమను తాకట్టుపెట్టడం వంటి ఘోరం మరొకటి లేదన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చెలికత్తె పత్రిక ఈరోజు పతాక శీర్షికలో ఒక వ్యాసం రాసిందన్నా రు. టీడీపీ కార్యకర్తలకు కూడా ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏమీ తెలియకపోయినా ఆ చెలికత్తె పత్రిక తన భుజాలపైకి ఎత్తుకుని వ్యాసం రాసిందన్నారు. సీమ వాసి అయిన చంద్రబాబు రాయలసీమకు ఒక మంచిపని చేసిన పాపానపోలేదని మండిపడ్డారు. రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే 1984–85 సంవత్సరాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వీరోచిత పోరాటాలతోనే పలు ప్రాజెక్టులు వచ్చాయన్నారు. గాలేరు–నగిరి, హంద్రీ–నీవా వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయంటే వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని అన్నా రు. ఆ నాడు రాజశేఖరరెడ్డి లేకపోయి ఉంటే రాయలసీమ వాసులకు తీవ్రమైన నష్టం జరిగి ఉండేదన్నారు. ఆయన వారసుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమకు మరింతగా రాయలసీమ వాసుల కడకండ్లను తీర్చాలన్న గొప్ప ఆలోచనలతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే ఆ చెలికత్తె పత్రిక జగన్మోహన్రెడ్డి ఏమాత్రం ప్రయత్నం చేయలేదనంటూ వ్యాసాలు రాసిందని మండిపడ్డారు. ఇక రాయలసీమ వాసులెరూ కూడా మేధావులైనా, కార్మికులైనా, కర్షకులైనా ఉపేక్షించి మౌనంగా ఉండే ప్రసక్తేలేదన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమని రాయలసీమకు చేస్తున్న అన్యాయంపై రాయలసీమ వాసులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకాన్ని మనమంతా తిరిగి సాధించుకోవడం కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేపడదామని పిలుపునిచ్చారు. -
తాసా..ముంచేశా!
గుడిపాల: ‘తాసా జ్యూస్ ఫ్యాక్టరీ మామిడి రైతులతో ఆడుకుంటోంది. మామిడి కాయలు ఫ్యాక్టరీకి తోలి ఆరు నెలలైనా ఇంతవరకు పైసా కూడా విడుదల చేయకుండా వేధిస్తోంది. రైతులంటే ఫ్యాక్టరీ యాజమాన్యానికి లెక్కలేకుండా పోయింది..’ అంటూ రైతులు మండిపడ్డారు. దీని పై సోమవారం బాధిత రైతులు ఉద్యమబాట పట్టారు. గుడిపాల మండలంలోని 189 కొత్తపల్లె వద్ద ఉన్న తాసా జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాకు ఉపక్రమించారు. గతంలో మామిడి కాయలు తోలిన ఇరవై రోజులకే రైతులకు నగదు అందజేసే వారని, ప్రస్తుతం నగదు ఇవ్వకుండా కాలయాపన చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో మామిడికి గిట్టుబాటు ధర రూ.8 ఇస్తామని చెప్పారని.. ప్రస్తుతం రైతులను పిలిపించుకొని రూ.4 ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మీకెందుకు అంతకష్టం మేము కష్టపడి ఆరుగాలం శ్రమించి మామిడి పంటను కోసి ఫ్యాక్టరీకి తోలితే మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి మీకెందుకు అంతకష్టం. అన్ని ఫ్యాక్టరీలు మామిడికి డబ్బులు ఇస్తే ఎందుకు ఇంతవరకు కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం మామిడికి అన్ని ఫ్యాక్టరీలు రూ.8 ఇస్తున్నాయి. మీరు ఎందుకు రూ.4మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. రూ.8తో కలిపి అదనంగా ఒక రూపాయి వేసి రూ.9 ఇవ్వాల్సిందే. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం. – శ్రీనివాసులు, రైతు, చీలాపల్లె, గుడిపాల మళ్లీ అప్పుచేయాల్సిందే ఫ్యాక్టరీకి మామిడి పంటను తోలి ఆరు నెలలైంది. మళ్లీ సీజన్ వస్తోంది. దుక్కులు దున్ని, మందులు పిచికారీ చేయాలి. ఇంతవరకు మామిడి తోలిన డబ్బులు రాలేదు. అప్పుచేయాల్సిన పరిస్థితి నెలకుంటోంది. 15 టన్నులు మామిడిని తోలాను. ఫ్యాక్టరీ చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఇప్పుడేమో రూ.4 లెక్కన ఇస్తామని చెబుతున్నారు. వాళ్లు రూ.4 ఇస్తే కూలీలు, బాడుగలకే చాలదు. కచ్చితంగా రూ.8 ఇవ్వాల్సిందే. – చిట్టిబాబు, రైతు, దళవాపల్లె, గుడిపాల 20 టన్నులు తోలాను నేను తాసా జ్యూస్ ఫ్యాక్టరీకి 20 టన్నులు మామిడిని తోలాను. ఇప్పటికి ఆరు నెలలైంది. పక్కనే ఉన్న ఫుడ్ అండ్ ఇన్స్ జ్యూస్ ఫ్యాక్టరీలో రైతుకు కిలో మామిడికి రూ.8 అందజేశారు. ఇక్కడ ఇంతవరకు ఒక్క నయాపైసా కూడా ఇవ్వలేదు. అడిగితే రూ.4 చెక్కు రూపంలో అందజేస్తామని చెబుతున్నారు. అదికూడా ఇంతవరకు ఇవ్వలేదు. రూ.8 ఇస్తేనే మేము తీసుకుంటాము. రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు. – జగధీశ్వరనాయుడు, తుమ్మలవారిపల్లె, రైతు, గుడిపాల మామిడి రైతులను ముంచేసిన తాసా జ్యూస్ఫ్యాక్టరీ అదే మా కొంప ముంచింది గతంలో తాము ధర్నా చేసినప్పుడు అధికారులు వచ్చి తమకు న్యాయం చేస్తామని చెప్పడంతో వారిని నమ్మామని, ఇప్పుడు తీరా వారు చేతులెత్తేశారని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని జ్యూస్ ఫ్యాక్టరీలలో మామిడి కిలోకు రూ.8 ఇవ్వడం జరిగిందని, ఇక్కడ మాత్రం ఎందుకు ఇవ్వలేదని వారు తాసా జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఫ్యాక్టరీని మూసివేస్తేనే మీరు తమ మాట వింటారని రైతులందరూ మూకుమ్మడిగా ఫ్యాక్టరీకి తాళాలు వేశారు. తమకు డబ్బులిచ్చేంత వరకు ఫ్యాక్టరీని తెరిపించేది లేదని భీష్మించుకున్నారు. గుడిపాల తహసీల్దార్ శ్రీనివాసులు, డీఎస్పీ సాయినాఽథ్ ఒకవైపు ఫ్యాక్టరీ యాజమాన్యం, మరోవైపు రైతులతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. -
అండగా వన్ స్టాప్ సెంటర్
చిత్తూరు కలెక్టరేట్ : సమాజంలో హింసకు గురవుతున్న మహిళలకు సఖి వన్ స్టాప్ సెంటర్ అండగా ఉంటుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. సఖి వాహనాన్ని సోమవారం కలెక్టరేట్ నుంచి ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లా డుతూ చిత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో వన్ స్టాప్ సెంటరు ఏర్పాటు చేశామన్నారు. ఆపదలో ఉన్న మహిళలు ఈ కేంద్రాన్ని సంప్రదిస్తే.. ఉచిత కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పోలీసు సహాయం, వైద్య సహాయంతోపాటు ఆశ్రయాన్ని కల్పిస్తామన్నారు. అత్యవసర సమయాల్లో 181 హెల్ప్ లైన్ నంబరులో సంప్రదించాలన్నారు. ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాను చంద్రబాబే చిత్తు చేశారు! – జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ధ్వజం పలమనేరు: రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు తన సొంత జిల్లాకు చేసేందేమీ లేదని, ఆయన సొంత నియోజక వర్గం నుంచే నిత్యం వేలాది మంది పనుల కోసం కర్ణాటకలోని బెంగళూరుకు వలస వెళ్తున్నారని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. పలమనేరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కారణంగా చిత్తూరు ఎందుకూ పనికి రాకుండా పోయిందన్నారు. గతంలో జిల్లాకు కేంద్ర నిధులతోపాటు రాష్ట్ర నిధులు వచ్చేవన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాల్లోని పొరుగు జిల్లాలు అభివృద్ధిపరంగా దూసుకుపోతుండగా చిత్తూరు జిల్లా మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. ఇక్కడ పరిశ్రమలు గానీ, ఓ యూనివర్సిటీగానీ, రైతులకు హార్టికల్చర్పై ఎలాంటి చర్యలు లేవన్నారు. సత్యవేడులో సెజ్ లాగా చిత్తూరులో ఎక్కడుందన్నారు. ఇప్పుడు హంద్రీనీవా కాలువలో వస్తున్న నీరు నాటి ప్రభు త్వ చలువేనన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉద్యాన, పాడి పరిశ్రమ, పట్టు, పరిశ్రమలపై రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. -
మిట్టపల్లెలో బొలెరో బోల్తా
బంగారుపాళెం: మండలంలోని మిట్టపల్లె వద్ద సోమవారం చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడింది. పలమనేరు నుంచి చిత్తూరుకు టమాటా లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి రహ దారిపై బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. రహదారి పై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన బొలెరో వాహనాన్ని పక్కకు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మెరుగైన విద్యనందించాలి రొంపిచెర్ల : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యను ఉపాధ్యాయులు అందించాలని చిత్తూరు జిల్లా డీవైఈఓ ఇందిర సూచించారు. సోమవారం రొంపిచెర్ల కస్తూర్భా గురుకుల పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. డీవైఈఓ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు ఉండాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించి పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీసీడీఓ ఇంద్రాణి, ఎంఈఓ శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సుజాత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి, అమరశేఖర్ పాల్గొన్నారు. -
కీచక తండ్రి అరెస్ట్
పలమనేరు: కుమార్తైపె లైంగికదాడి చేసిన తండ్రిని పోలీసులు సోమవారం పలమనేరులో అరెస్ట్ చూపారు. నిందితుడిని పోలీసు స్టేషన్ నుంచి రోడ్డుపై నడిపించుకుంటూ రిమాండ్కు తరలిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. ఈనెల 2న పెద్దపంజాణి మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తైపె లైంగికదాడికి పాల్పడ్డాడన్నారు. దీనిపై బాలిక నానమ్మ ఫిర్యా దుతో పెద్దపంజాణి పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారని చెప్పారు. ఇందులో భాగంగా ముద్దాయిని పలమనేరు–రాయల పేట రోడ్డులోని గుత్తివారిపల్లి వద్ద సోమవారం అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆపై నిందితుడ్ని పలమనేరు పట్టణంలో రోడ్లపై నడిపించుకుంటూ రిమాండ్కు తరలించినట్టు వెల్లడించారు. ఇలాంటి కీచక కామాంధులను వదిలిపెట్టే ప్రస క్తే లేదన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన వారిలో సీఐ పరశురాముడు, సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. -
తగ్గిన పంచాయతీల సంఖ్య
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాల పునఃవిభజన కారణంతో చిత్తూరు జిల్లాలో పంచాయతీల సంఖ్య తగ్గింది. 696 పంచాయతీలు ఉన్న జిల్లాలో ఆ సంఖ్య 621కి తగ్గింది. దీంతో 75 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన మదనపల్లెకు వెళ్లిపోయాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సదుం మండలాలను మదనపల్లె జిల్లాలో కలపడంతో 32గా ఉన్న మండలాల సంఖ్య 28కి తగ్గింది. 2022 ఏప్రిల్లో ఉమ్మడి జిల్లా మూడుగా విడిపోగా చిత్తూరు జిల్లాకు 31 మండలాలు మిగిలాయి. చిత్తూరు మండలాన్ని అర్బన్, రూరల్ పునర్విభజన చేయడంతో మండలాల సంఖ్య 32కు చేరింది. తాజా విభజనతో మండలాల సంఖ్య 28కి చేరగా, పంచాయతీల సంఖ్య 621కు చేరింది. దీనికి తోడు కొత్త పంచాయతీల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 17 కొత్త పంచాయతీల ఏర్పాటుకు నిబంధనల మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. సర్పంచ్ల పదవీకాలం ముగిశాక జిల్లా విభజన చేసుంటే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. డ్రిప్ ఏర్పాటుకు రాయితీలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా డ్రిప్ ఏర్పాటుకు రాయితీలు అందిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 95,752 హెక్టార్ల విస్తీర్ణంలో డ్రిప్ అమలుకు అవకాశం ఉందన్నారు. కూరగాయలు, మామిడి, పూల సాగుకు డ్రిప్ ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ పీవీరమణ పాల్గొన్నారు. స్క్రబ్ టైఫస్పై ప్రత్యేక టీమ్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు అధికంగా నమోదు కావడంతో చైన్నె నుంచి ఐసీఎంఆర్ బృందం సోమవారం చిత్తూరుకు చేరుకుంది. హిమబిందురెడ్డి, శంకర్, ధనశ్రీ, అన్సారి, సురేష్, ఇలవర్సన్, విశ్వనాథ్ వ్యాధిపై పరిశోధన చేపట్టారు. తొలిరోజు యాదమరి మండలం కీనాటంపల్లి పర్యటించి రక్తనమూనాలు సేకరించారు. మంగళవారం బంగారుపాళ్యం మండలం చెరుకువారిపల్లి, గంగాధరనెల్లూరు మండలం ముక్కళ్లత్తూరు, బుధవారం గుడిపాల మండలం 189 కొత్తపల్లి, ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లిమిట్ట, గు రువారం ఐరాల మండలం ఎర్లంపల్లి గ్రా మా ల్లో పర్యటించనున్నారు. కాగా డీఎంఅండ్హెచ్ సుధారాణిని కలిసి టైపస్ వ్యాధిపై చర్చించారు. -
400 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
– ముగ్గురు నిందితుల అరెస్ట్ వడమాలపేట (పుత్తూరు): శ్రీకాళహస్తి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 400 బస్తాల రేషన్ బియ్యాన్ని సోమవారం వడమాలపేట మండలం, ఎస్వీపురం టోల్ప్లాజా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఎస్ఐ హరీష్ కథనం మేరకు.. సోమ వారం తెల్ల వారు జామున టోల్ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో శ్రీకాళహస్తి నుంచి తమిళనాడులోని ఊ తుకోటకు ఏపీ.21 టిజడ్.7850 నంబరు గల లారీలో రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు శ్రీకాళహస్తికి చెందిన మహాబూబ్ బాషా, నెల్లూరుకు చెందిన దసరథరామయ్య, ఊతుకోటకు చెందిన సంతోష్ను అరెస్ట్ చేశారు. లారీని తనిఖీ చేయాగా 50 కేజీలు కలిగిన 400 బస్తాల రేషన్ బియ్యా న్ని గుర్తించారు. ఈ బియ్యం విలువ రూ.9 లక్షలుగా లెక్కగట్టారు. తహసీల్దార్ జరీ నా పంచనామా నిర్వహించి, సీఎస్డీటీ హరికృష్ణ ద్వారా పుత్తూరు సివిల్ సప్లైస్ గోడౌన్కు తరలించారు. వడమాలపేట ఎస్ఐ హరీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెల్లుబికిన జనాగ్రహం
నగరి : విషపూరిత రసాయన నీటికి వ్యతిరేకంగా జనాగ్రహం పెల్లుబికింది. సోమవారం నగరి పర్యా వరణ పరిరక్షణ సేవా సమితి, లయన్స్ క్లబ్, వాక ర్స్ అసోసియేషన్, నేషనల్ హ్యూమన్రైట్స్ కౌన్సి ల్, ఏఐఏఎంఎఫ్ జస్టీస్ పోరమ్తో కలసి నగరి ప్రజలు ‘విషం నీళ్లు వద్దు.. మంచి నీళ్లు ఇవ్వండి’ అంటూ ఉద్యమించారు. టవర్క్లాక్ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సి పల్ కార్యాలయం ఎదుట భీష్మించుకు నిరసన తెలిపారు. తమిళనాడు డైయింగ్ యూనిట్లను వెంటనే తరలించాలని, విషపూరిత రసాయనాలు పూర్తి స్థాయిలో నిషేధించాలని, కాలువల్లో, చెరువుల్లో, నదిలో పారుతున్న రసాయనాలకు అడ్డుకట్ట వేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రసాయన రంగు నీటితో ఇబ్బందులు నగరి పర్యావరణ పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ విషపూరిత రసాయన రంగునీటి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూగర్భ జలాలు కలుషితమై తాగడానికే కాకుండా స్నానానికి, వంటకు కూడా పనికిరాని స్థితిలో మారాయన్నారు. 16 భారీ డైయింగ్ యూనిట్లు లక్షల లీటర్ల నీటిని భూమి నుంచి తీసి కలుషితం చేసి వదలిపెడుతున్నాయని ఆరోపించారు. ఈ డైయింగ్ యూనిట్లు మాత్రమే వినియోగించే నీరు నగరి, నిండ్ర, విజయపురం మండలాలు మొత్తం వినియోగించే నీటితో సమానమన్నారు. ఇంతటి విషపూరిత నీరు కాలువల్లో, చెరువుల్లో, నదుల్లో ప్రవహిస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. వారిని నగరి నుంచి సాగనంపండి సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మా ట్లాడుతూ తమిళనాడులో నిషేధించిన డైయింగ్ యూనిట్లు నగరిలో చాపకింద నీరులా ఆక్రమించి విషపూరిత రసాయనాలను విడుదల చేస్తున్నట్టు ఆరోపించారు. తమిళనాడులో వస్త్ర ఉత్పత్తి చేసుకునే వారు వ్యర్థనీరు వదలడానికి నగరిని వాడు కుంటున్నారన్నారు. వారిని నగరి నుంచి తరిమికొట్టాలన్నారు. పర్యావరణం ఇంత కలుషితమవుతున్నాతున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అసలు ఆ విభాగం జిల్లాలో ఉందా, లేదా అన్న సందేహం కలుగుతోందన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న నగరి ప్రజలు ధర్నాలో మాట్లాడుతున్న నగరి పర్యావరణ పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులు వ్యాధులతో సతమతం కౌన్సిలర్ దయానిధి మాట్లాడుతూ రసాయన నీటి సమస్యలో ఇప్పటికే నగరి ప్రజలు కిడ్నీ సమస్య, క్యాన్సర్, చర్మవ్యాధులు, నరాల బలహీనత సమస్యతో సతమతమవుతున్నారని వాపోయారు. మరో ఉద్దానంలాగో, తురకపాళెంలాగో నగరి మారకముందే అధికారులు స్పందించాలన్నారు. వైద్యులు రామచంద్రన్, హరీష్ మాట్లాడుతూ మానవ శరీరంలో 70 శాతం నీరే ఉంటుందని, ఆ నీరు కలుషితంగా వాడితే ఆరోగ్య సమస్యలు తప్పవన్నారు. జీర్ణ వ్యవస్థతో పాటు శరీర భాగాలన్నింటికీ సమస్య వస్తుందన్నారు. మహా ధర్నా అనంతరం నిరసనకారులు మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో సమితీ నేతలు వెంకటేశ్, మునికృష్ణ, సుబ్రమణ్యం, తిరుమలరెడ్డి, ఇంద్రయ్య, రిటైర్డ్ డీవైఈవో ప్రభాకర్రాజు, డాక్టర్ ఆంబ్రోస్ విల్సన్, జగన్నాథం, చిరంజీవిరెడ్డి, బాబు, ఎ.మోహన్, మహిళా సంఘాలు, లయన్స్క్లబ్, వాకర్స్ అసోసియేషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్కు 27 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 27 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఏఎస్పీ రాజశేఖరరాజు, డీటీసీ డీఎస్పీ రాంబాబు సైతం ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. -
చీకటి ఒప్పందం..
రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ పోరాటం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు మిలాఖత్ గత ప్రభుత్వంలో జోరుగా పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని రైతులు, ప్రజలకు నీటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పుంజుకుందన్నారు. ఎత్తిపోతల పథకం పూర్తి అయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందనే ముందుగా చూపుతో గొప్ప పథకాన్ని ఆయన పకడ్బందిగా చేపట్టారన్నారు. సాక్షాత్తు పోలీసుల వెంటబెట్టుకుని వైఎస్ జగన్ సర్కారు తమకు రావాల్సిన నీటిని రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ప్రజల నీటి కష్టాలను ఈ ప్రభుత్వం విస్మరించి, పక్కరాష్ట్ర సీఎంకు జీ హుజూర్ అంటూ సలాం కొడుతున్నారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నా.. చంద్రబాబు సర్కారు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అభినయ్ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో సుమారు రూ.7 వేల కోట్లను అప్పటి సీఎం వైఎస్ జగన్ ఎత్తిపోతల పథకానికి కేటాయించారని ఆయన తెలిపారు. శ్రీశైలం, తెలుగుగంగ, నగరి–గాలేరు ప్రాజెక్టులకు నీళ్లు అందించాలని సంకల్పించారన్నారు. రాయలసీమకు జీవనాడిగా భావించిన పథకాన్ని చంద్రబాబు అడ్డుకోవడం దేనికి సంకేతమని మండిపడ్డారు. చంద్రగిరి: చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం తన శిష్యుడితో కలసి రాయలసీమతోపాటు గుంటూరు, నెల్లూరు జిల్లాల ప్రజలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి భూమన అభినయ్ మండిపడ్డారు. రాయలసీమకు తలమానికమైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను అడ్డుకున్నానని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేయడంతో చంద్రబాబు సీమకు చేస్తున్న ద్రోహం బట్టబయలైందన్నారు. సోమవారం వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ రెడ్డి, రాయలసీమ ఉద్యమకారుడు, మాజీ శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రమణ్యం రెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తిరుచానూరులోని జిల్లా కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ సీపీ, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. వందలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజా సంఘాల నేతలు కలెక్టరేట్కు చేరుకున్నారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం తెలిపారు. సైంధవుడిలా సీమ ప్రజలకు బాబు ద్రోహం అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు సైంధవుడిలా వ్యవహరిస్తూ సీమ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని భూమన అభినయ్ మండిపడ్డా రు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితులైన గురు, శిష్యులిద్దరూ చేరి రాష్ట్రాన్ని నాశనం చేయాలనే సంకల్పించారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా 90 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ వాడుకోవాల్సి ఉందని, అయితే చంద్ర బాబు పాలనలో కనీసం 12 వేల క్యూసెక్కుల నీటిని కూడా వాడుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరూ సీఎంలు చీకటి ఒప్పందాలతో రైతులకు తీవ్ర అన్యా యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 800 అడుగుల నీళ్లు ఉండగానే తెలంగాణలోని వారు దిండి, పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాంతాలకు ఎత్తిపోతల నీటిని తరలించడం, కూటమి ప్రభుత్వం వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అవలంభిస్తున్న తీరుతో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మదనపల్లి, తంబళ్లపల్లి, చిత్తూరు ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం రైతులు ఉత్తరాంధ్ర బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు రాజధాని పేరుతో చంద్రబాబు పేదల భూములను లాక్కొంటూ, మరోవైపు ప్రాజెక్టులను తెలంగాణకు దోచిపెట్టి రాయలసమీతో పాటు రాష్ట్రాన్ని ఎడారిగా మార్చుతున్నారని మండిపడ్డారు. పార్టీ నేతలు, కార్యకర్తలపై దురుసుగా వ్యవహరిస్తున్న పోలీసులు ‘సీఎం చంద్రబాబు స్వార్థం.. శిష్యుడితో చీకటి ఒప్పందం.. తెలంగాణా అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు..అయినా స్పందించని బాబు సర్కారు.. ఫలితం సీమ ఎత్తిపోతల పథకానికి అడ్డంకి.. రాయలసీమతోపాటు కోస్తాలో రెండు జిల్లాలకు తప్పని నీటి కష్టాలు..రాష్ట్రానికి తీరని అన్యాయం’ జరిగిందని వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ మండిపడ్డారు. భూమన అభినయ్ అక్రమ అరెస్టు రాయలసీమకు అన్యాయం చేస్తే ప్రజాగ్రహం తప్పదు రాయలసీమకు నీళ్లు రాకుండా సీఎం చంద్రబాబు, ఆయన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అభినయ్ స్పష్టం చేశారు. నాలుగు సార్లు సీఎం అని చెప్పుకునే వ్యక్తి, తన శిష్యుడిని ఎదు రించలేక ప్రాజెక్టులను తెలంగాణకు నీటి పథకం కట్టబెట్టడమేనా? 40 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని నిలదీశారు. రాయలసీమను నీటితో సస్యశ్యామ లం చేయడం చేతకాని ఈ సీఎం, రాక్షసుడిలా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, తమకు రావాల్సిన నీటిని తీసుకురాకుండా, సీమ ప్రజలను మోసం చేస్తే ప్రజా సంఘాలతో కలసి వైఎస్సార్సీపీ పోరును మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. -
బడులపై ఇన్చార్జుల పెత్తనం
కార్వేటినగరం : రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో గందరగోళం ఏర్పడుతోంది. ఎప్పుడెలాంటి ఆదేశాలు జారీ చేస్తారో ఎవరికి అంతుచిక్కని పరిస్థితి నెలకొంటోంది. ఇప్పటికే రక రకా ల యాప్ల నమోదుతో హెచ్ఎంలు, ఉపాధ్యాయు లు తలలు పట్టుకుంటుండగా తాజాగా ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో వందరోజుల ప్రణాళికను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవుల్లోనూ తరగతులు నిర్వహించాలని పేర్కొనడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరో ౖవైపు జిల్లాలోని 62 మండలాలకు ఒకరు చొప్పున ఇన్చార్జిలను నియమించారు. విద్యాశాఖతో సంబంధం లేని ఇతర శాఖల ఉద్యోగులు, అధికారులను ఇన్చార్జులుగా నియమించడంపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరు వారంలో రెండు రోజులు ఆయా పాఠశాలలకు వెళ్లి తనిఖీలి చేయాల్సి ఉంటుంది. పదో తరగతి సంబంధించి అమలు చేస్తున్న వందరోజుల ప్రణాళిక గందరగోళానికి దారి తీస్తోంది. విద్యాశాఖలో సంబంధం లేని వ్యక్తుల నియామకం అగ్గి రాజేస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం ఇన్చార్జిల కనుసన్నల్లో జరగనుంది. ప్రత్యేక తరగతుల నిర్వహణ మొదలు స్లిప్ టెస్టులు, మార్కుల నమోదు. రిజిస్టర్ నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు ఇలా అన్నింటినీ పబ్లిక్ పరీక్షల ప్రారంభం వరకూ ఇన్చార్జిలే పర్యవేక్షించనున్నారు. ఇతర శాఖ అధికారుల పర్యవేక్షణ రెవెన్యూ, పంచాయతీరాజ్,డ్వామా, వైద్య, ఎంపీడీఓ ఆర్డబ్ల్యూ ఎస్.వ్యవసాయ, ఇరిగేషన్, హౌసింగ్, మున్సిపల్ కమిషనర్, వెటర్నరీ తదితర శాఖల్లో పని చేస్తున్న వీరంతా వారి మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి పదో తరగతిలో ప్రణాళిక అమలు అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. స్లిప్ టెస్టులు, ఉపాధ్యా యుల హాజరు, పదిలో షైనింగ్, రైజింగ్ స్టార్లుగా విభజించి పాఠాలు బోధిస్తున్నారనే అంశాన్ని రోజూ పర్యవేక్షించాలి. ఉపాధ్యాయులు హాజరు నమోదు సబ్జెక్టు టీచరు వస్తున్నారా, ఆదివారా లు, ఇతర సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నారనే అంశాన్ని మానిటర్ చేయాల్సి ఉంది. టీచర్ల మండిపాటు బడుల పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారులను నియమించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్త వానికి ప్రతి మండలానికి ఏంఈవో 1,2, ఉన్నారు. వీరితో పాటు డీవైఈవోలు, ప్రతి పాఠశాలకు హెచ్ఎం ఉన్నారు. ప్రణాళిక అమలు పర్యవేక్షణకు వీరున్నప్పుడు ఇతర శాఖల అధికారులను ఇన్చార్జిలుగా నియమించడమేమిట ని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీరిని అపాయింట్ మెంట్ చేయడం తమను అవమానించడమే నని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణ, రికార్డులు పది సిలబస్పై వీరికి ఏ మేర కు అవగాహన ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ నూరు రోజుల పాటు సదరు ఇన్చార్జిలు తమ శాఖలో జరిగే పనులు మాని దీన్ని పర్యవేక్షిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాలో ఇలా...?జిల్లాలో 380 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 36 వేల మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి నిర్వహించనున్నారు. ఈ తరుణంలో డిసెంబరు 6వ తేదీ నుంచి వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనాలోచిత నిర్ణయం వంద రోజుల ప్రోగ్రామ్ ఉపాధ్యాయులు విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తోంది. కార్యక్రమ పర్యవేక్షణకు ఎంఈవో , డీవైఈవోలను నియమించాలి. ఇన్చార్జిల కంటే విద్యాశాఖ అధికారులు అయితే మంచి ఫలితాలు ఉంటాయి. వంద రోజుల ప్రణాళిక ప్రశ్నపత్రాలను అప్లోడ్ చేయకపోవడం వల్ల కొంత మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం దారుణం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితంగా ఉంది. – సుదర్శన్రాజు, ఏపీటీఎఫ్ 1938 మాజీ మండల అధ్యక్షుడు, శ్రీరంగరాజపురం మండలం ఇతర శాఖల అధికారులతో తనిఖీలు సరికాదు పదో తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించడానికి విధ్యాశాఖ చేపట్టిన వందరోజుల కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా జరుగుతోందో పర్యవేక్షించడానికి విద్యాశాఖకు ఏ మాత్రం సంబంధం లేని ఇతర శాఖలకు చెందిన అధికారులను నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు. దీనివల్ల ఉపాధ్యాయుల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. – దేవయ్య, ఎస్టీయూ మాజీ జిల్లా నేత , పాలసముద్రం మండలం -
మారథాన్లో సీఐ రికార్డు
పలమనేరు : చైన్నె రన్నర్స్ సంఘం ఆధ్వర్యంలో చైన్నెలో ఫ్రెస్ వర్క్స్ ఆధ్వర్యంలో 21.97 కిలో మీటర్ల మారథా న్ పరుగు పందెం పోటీల్లో తిరుపతి పీటీసీ (పోలీస్ ట్రైనింగ్ సెంటర్)కు చెందిన సీఐ మధుసూధన్రెడ్డి గంటా 57 నిమిషాల్లో పూర్తిచేసి రికార్డ్ నెలకొల్పారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లికి చెందిన మధుసూధన్రెడ్డి కొన్నేళ్లుగా నడక, పరుగు పోటీల్లో పాల్గొంటూ పలు పతకాలను సాధించారు. ఈ నేపథ్యంలో చైన్నెలో ఆదివారం జరిగిన మారథాన్లో విజేతగా నిలిచి అక్కడి నిర్వాహకులచే ప్రశంసంతో పాటు మెడల్ను సాధించారు. టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ రాంగణేష్ మృతి చిత్తూరు కార్పొరేషన్ : మాజీ టౌన్ బ్యాంకు చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా బూత్ కమిటీ ఉపాధ్యక్షుడు రాంగణేష్ (45) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. నగరంలోని మురకంబట్టుకు చెందిన ఆయన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయ్యప్పమాల ధరించిన ఆయన శబరిమలకు వెళ్లారు. ఆదివారం సన్నిధానంకు కిలోమీటరు దూరం ఉండగా కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్న రాంగణేష్ అలాగే వాలిపోయాడన్నారు. చికిత్స అందిస్తుండగా మృతి చెందారన్నారు. కాగా ఆయనకు ఇద్దరు కుమారులు మెతీష్, నితీస్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని, కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నట్లు పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. -
సంక్రాంతికి ‘ప్రైవేటు’ బాదుడు!
పండుగ బాదుడుకు ప్రైవేట్ ఆపరేటర్లు సిద్ధమయ్యారు. అప్పుడే సంక్రాంతి బుకింగ్లు ఫుల్ అవుతున్నాయి. రైల్వే టిక్కెట్ల వెయింటిగ్ లిస్టు చాంతాడంత ఉండడం... హైదరాబాద్, బెంగుళూరు నుంచి వచ్చి వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సు టిక్కెట్లు ఇప్పటికే కొనుగోలు పూర్తి కావడంతో ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్ ధరలను రెండు, మూడు రెట్లు పెంచేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లేవారికి పండుగ రోజుల్లో ఇళ్ల వద్ద అయ్యే వ్యయం కన్నా ప్రయాణానికే అయ్యే ఖర్చు అధికం కానుంది. కాణిపాకం : జిల్లా నుంచి బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, విజయవాడ ప్రాంతాల్లో స్థిరపడ్డ వా రు చాలా మంది ఉన్నారు. అలాగే ఉద్యోగం, ఉపాధి, ఉన్నత చదువుల కోసం లక్షల మంది వెళ్లారు. వీరు రాకపోకలు అప్పడప్పుడు సర్వసాధారణంగా కనిపిస్తోంది. అయితే పండగకు ఊర్లోకి రావడం సమ్థింగ్ స్పెషల్గా భావిస్తున్నారు. అందులోనూ సంక్రాంతి పండగకు పల్లెకొస్తే ఉత్సాహంగా గడపవచ్చునని అనుకుంటుంటారు. ఈక్రమంలో కొంత మంది కార్లలో పల్లెకు వస్తుంటారు. అయితే మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన వారు రైలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తారు. శుక్రవారం నుంచే సొంతూళ్లకు.. ఈనెల 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈనెల 14వ తేదీ బుధవారం భోగి పండుగ వచ్చింది. అయితే తొమ్మిదో తేదీ రెండవ శనివారం కావడంతో చాలా మంది శుక్రవారం రాత్రి బయలుదేరనున్నారు. రెండవ శనివారం, తరువాత ఆదివారం సెలవు కావడంతో సోమ, మంగళవారాలు సెలవులు పెట్టుకుంటే తిరి గి 17వ తేదీ శనివారం, 18వ తేదీ ఆదివారం తిరిగి వలస ప్రాంతాలకు వెళ్లనున్నారు. 18వ తేదీ అమావాస్య కావడంతో చాలామంది 17వ తేదీన తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బెంగళూరు నుంచి రూ.5 వేలు బెంగళూరు నుంచి చిత్తూరుకు సాధారణ రోజుల్లో నాన్ఏసీలో సీటర్ రూ.280 నుంచి రూ.350 వరకు ఉంటుంది. అదే ఏసీ సీటర్ అయితే రూ.500 వరకు ఛార్జ్ చేస్తారు. ఏసీ స్లీపర్ అయితే రూ. 500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. పండగ బాదుడు నేపథ్యంలో ఒక్కసారిగా చిత్తూరు రావడానికి ప్రైవేటు బస్సు చార్జీలు ఆకాశనంటుతున్నాయి. అప్పుడే ఆన్లైన్లో టిక్కెట్లు బుకింగ్ ఫుల్ కావడంతో ప్రైవేటు బస్సు నిర్వాహకులు భారీగా దోపిడీకి స్కెచ్ వేశారు. శుక్రవారం రాత్రి నుంచి ధరలు అమలులోకి పెట్టేశారు. ఈ నేపథ్యంలో నాన్ఏసీ ధరలు రూ. 500 నుంచి రూ.1500 పలుకుతున్నాయి. ఏసీ ధరలు రూ. 1500 నుంచి రూ.5 వేలు కనిపిస్తున్నా యి. ఈ టిక్కెట్ ధరలు చూసి చాలా మంది పెద్ద పండుగకు పల్లెకు వద్దని వాయిదా వేసుకుంటున్నారు. పట్టని నియంత్రణ ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీపై చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఆపరేటర్లలో ఆ పార్టీకి చెందిన సానుభూతి పరులు, ప్రధాన నేతలు ఉండడంతో చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పండుగ సమయంలో దొడ్డిదారిన బస్సులు నడిపేందుకు సైతం ప్రైవేట్ ఆపరేటర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిమాండ్ లేని ప్రాంతాలకు బస్సు సర్వీసులు నిలుపుదల చేసి డిమాండ్ ఉన్న సర్వీసులో తిప్పనున్నారు. ఇక పండగ సమయంలో చూసీచూడనట్లు వదిలేసే అవకాశం ఉండడంతో ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా బస్సులు తిప్పనున్నారు. ఇష్టానుసారంగా పెంచేసి..ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ, నాన్ఏసీ బస్సులు అనే తేడా లేకుండా టిక్కెట్లు అయిపోవడంతో చాలామంది ప్రైవేట్ బస్సుల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు బస్సు టిక్కెట్ ధరలు అమాంతంగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సు టిక్కెట్ ధరలు 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టిక్కెట్ ధరలు రెండు..మూడు రెట్లు పెరిగాయి. అన్ సీజన్లో నాన్ ఏసీ సిటింగ్ రూ. 620 నుంచి రూ.800 వరకు ఉంది. ఇప్పుడు నాన్ ఏసీ స్లీపర్ టిక్కెట్ ధర రూ.800 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. ఇక ఏసీ బస్సు సిటింగ్ ధర రూ. 620 నుంచి రూ.1000 వరకు ఉంది. స్లీపర్ టిక్కెట్ ధర రూ.900 రూ.1500 పలుకుతోంది. తొమ్మిదవ తేదీన అయితే ఏకంగా రూ.2,000 నుంచి రూ.5 వేలు దాటడం గమనార్హం. తిరిగి ఎక్కువ మంది వెళ్లే 18వ తేదీన నాన్ ఏసీ, ఏసీ సిటింగ్ ధర రూ. 1600 నుంచి రూ. ఽ1800 ఫిక్స్ చేశారు. ఏసీ, నాన్ ఏసీ స్లీపర్ ధరలు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఉండడం గమనార్హం. టిక్కెట్లు ఫుల్ జిల్లాకు వచ్చేవారు సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి బయలుదేరి చిత్తూరుకు వస్తారు. ఆ రోజుల్లో రెగ్యులర్గా నడిచే రైళ్ల వెయిటింగ్ లిస్టు భారీగా ఉంది. ప్రధాన సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్ల టిక్కెట్లు వెయిటింగ్ లిస్టు పరిమితి దాటిపోవడంతో రిగ్రెట్లో పెట్టారు. పండుగ కోసం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక రైళ్ల పరిస్థితి అలానే ఉంది. 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఇంచుమించు ఇదే పరిస్థితి, ఇక ఆర్టీసీ బస్సులలో కూడా టిక్కెట్లు అందుబాటులో లేకుండా పోయాయి. హైదరాబాద్ నుంచి రోజూ సుమారు 8 నుంచి 10 రెగ్యులర్ బస్సులున్నాయి. వీటిలో తొమ్మిదో తేదీ ఉదయం నడిచే బస్సులకు తప్ప మిగిలిన బస్సుల టిక్కెట్లు పూర్తవుతున్నాయి. 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం, రాత్రి సర్వీసులు బస్సులు టిక్కెట్లు ఫుల్ అవుతున్నాయి. జిల్లాలో చిత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు డిపోల బస్సుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది. -
నకిలీ నోట్ల చలామనీ
కుప్పం : మూడు రాష్ట్రాల కూడలి ప్రాంతమైన కుప్పం కేంద్రంగా నకిలీ నోట్లు చలామనీ విచ్చలవిడిగా సాగుతోంది. ప్రధానంగా 500 రూపాయల నోటు చూస్తేనే వ్యాపారులు హడలిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా చిల్లర , పాల వ్యాపారులు దుకాణాల్లో 500 నకిలీ నోట్లు జోరుగా చలామని అవుతున్నాయి. కుప్పం ప్రాంతం మూడు రాష్టాల కూడలి కావడంతో అక్రమ వ్యాపారాలకు అనువుగా మారింది. కర్ణాటక రాష్ట్రం 10 కిల్లో మీటర్లు, తమిళనాడు 10 కిల్లో మీటర్లు దూరంలో ఉన్నాయి. కుప్పం కేంద్రంగా కర్ణాటక రాష్ట్రం కోలార్, కేజీఎఫ్ నుంచి తమిళనాడు చేరిన సేలం, కోయంబత్తూరు , దర్మపూరి పట్టణాల నుంచి నకిలీ నోట్లు జోరుగా సరఫరా జరుగుతున్నట్లు తెలిసింది. కుప్పం మీదుగా నకిలీ నోట్లు సరఫరా చేస్తూ కుప్పంలోనూ 500 నకిలీ నోట్లు చలామనీ చేస్తున్నారు. ఒకే దుకాణంలో నాలుగు నకిలీ నోట్లు పట్టణం ప్యాలెస్ ఎక్స్టెన్షన్లో ఉన్న ఓ పాల దుకాణంలో ఒకే రోజు నాలుగు నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వచ్చిన డబ్బును చలాన కట్టేందుకు బ్యాంకుకు వెళ్తే నాలుగు 500 రూపాయిల నోట్లు బ్యాంక్ అధికారులు రిజక్ట్ చేశారు. దీంతో పాల వ్యాపారి షాక్కు గురయ్యాడు. నిత్యం ఇలా ఒకటి రెండు 500 నకిలీ నోట్లు వస్తున్నాయని పాల వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పంలో అక్రమ రవాణాపై నిఘా కొరవడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు రిజక్ట్ చేసిన 500 నకిలీ కరెన్సీకుప్పంలో చలామనీ అవుతున్న నకిలీ నోట్లు -
జలం.. గరళం
నగరి పట్టణంలోని భూగర్భ జలాలు కలుిషి తం అయ్యాయి. నూలుకు రంగు వేసే ప్రక్రియలో విడిచిపెట్టే వ్యర్థ రసాయన నీరు పారే కాలువలకు సమీపంగా ఉన్న ప్రాంతాల్లో బోరు నుంచి వచ్చేది జలం కాదని అది ప్రజల పాలిట పాషాణం అని నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం నిర్వహించిన తాగునీటి పరీక్షలో తేలిపోయింది. ఈ నీటిని తాగితే మంచాన పడటం ఖాయమని ఆ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామం ప్రజలను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై నేడు మహాధర్నాకు సన్నద్ధమయ్యారు. కుశస్థలి నదిలోకి వస్తున్న రసాయ రంగునీరు ఎరుపెక్కి పారుతున్న కుశస్థలి నది నగరి : నగరి మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో నీటి నాణ్యతను పరిశీలించడానికి నాలుగు ప్రాంతాల్లో మున్సిపల్ ట్యాప్లలో వచ్చే నీటితో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో నివాసితులు వేసుకున్న బోర్లలో వచ్చే నీటిని సేకరించి పరీక్ష చేశారు. మున్సిపల్ కొళాయిల్లో వచ్చే నీరు మినహా బోర్లలో వచ్చే నీరు తాగడానికి, వంటకు, స్నానానికి కూడా వినియోగించరాదని తేలింది. మునీశ్వర ఆలయం వద్ద బోరు నీటి పరీక్షలో యురేనియం 0.10 ఎంజీ/లీ ఉంది, ఓంశక్తి ఆలయం వద్ద తీసిన నీటిలో యురేనియం 0.265 ఎంజీ/లీ ఉన్నట్లు, ఇందిరానగర్లో తీసిన నీటిలో యురేనియం 0.33 ఎంజీ/లీ, మాంగనీసు 0.466 ఎంజీ/లీ ఉన్నట్లు, ఆనం లలితా లే అవుట్లో యురేనియం 0.49 ఎంజీ/లీ, మాంగనీసు 2.316 ఎంజీ/లీ ఉన్నట్లు తేలింది. పర్యావరణ పరిరక్షణ సంస్థ సూచనల మేరకు సురక్షిత నీటిలో ఉండాల్సిన మాంగనీసు పరిమాణం 0.3 ఎంజీ/లీ, యురేనియం పరిమాణం 0.03 ఎంజీ/లీ మాత్రమే. అయితే రసాయన నీటి ప్రభావంతో నగరిలో పరిశోధించిన ప్రాంతాల్లో చూపిన మాంగనీస్ స్థాయి రెండింతల నుంచి ఏడింతల వరకు ఎక్కువగా ఉండగా, యురేనియం స్థాయి మూడింతల నుంచి పదహారింతల వరకు ఎక్కువగా ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి మున్సిపల్ కొళాయిల్లో వచ్చే నీటిపైనే నగరి ప్రజలు ఆధార పడాల్సి ఉంది. ఆగని దందా భూగర్భ జలాలు పాడైపోయినా, మున్సిపల్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రశ్నల వర్షం కురిపించినా, డైయింగ్ యూనిట్ల దందాకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నగరిలో డైయింగ్ యూనిట్లను అద్దెకు తీసుకున్న తమిళనాడుకు చెందిన ఈరోడు, సేలం వ్యాపారులు తమ పరిశ్రమలకు అవసరమైన నూలుకు రంగులు వేసుకొని వృథా రసాయనాలను దర్జాగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ప్రతి రోజు 20 వాహనాలు నూలును తమిళనాడుకు ట్రాన్స్పోర్టు చేస్తోంది. భారీ డైయింగ్ యూనిట్ల నుంచి వచ్చే రసాయన నీటితో కుశస్థలి ఎరుపెక్కి పారుతోంది. అందరికీ ఆంక్షలు విధించేస్తోంది. ఒక్క చుక్క రసాయనీరు కూడా బయటకు రాదన్న అధికారుల హామీలు పారే నీటిలోనే కొట్టుకుపోయింది. కాలువల్లో పారే మురుగు నీటిలో మునిగిపోయింది. విషపూరిత రసాయనాలు కాలువల్లో పారుతుంటే మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో..! చెరువుల్లో, నదిలో పారుతుంటే ఇరిగేషన్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడంలేదో, పర్యావరణం కాలుష్యభరితం అవుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్టు అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారో నగరి ప్రజలకు జవాబు తెలియని ప్రశ్నగా మిగిలిపోతోంది. నీటి పరిశోధన నివేదిక కాలువల్లో పారుతున్న రసాయన నీరు నేడు మహాధర్నా నగరి పర్యావరణ పరిరక్షణ సమితి రసాయ నీటికి వ్యతిరేకంగా పోరాడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. వ్యాపారం తమిళనాడులో వ్యర్థాలు నగరిలోనా అనే నినాదంతో నిరసన వ్యక్తం చేయనున్నారు. దీనిపై ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సుమారు 20 మిషన్ డైయింగ్ యూనిట్ల వారు 10 వేల మరమగ్గ పరిశ్రమలను సాకు చూపుతూ చాపకింద నీరులా వారికి కూడా చేటుచేస్తున్నారన్నా రు. మరమగ్గ పరిశ్రమనే నేడు వారు శాసించే స్థాయికి చేరుకోవడంతో నేత పరిశ్రమను నమ్ముకున్న వారు కూడా నేడు నీటి సమస్యతో సతమతం అవుతున్నారని, ఇది ప్రభుత్వానికి చెవికెక్కేలా చెప్పి తమిళనాడు డైయింగ్ యూనిట్లను తరిమికొట్టడం, స్థానిక డైయింగ్ యూనిట్ల వారిని నివాస ప్రాంతాలకు దూరంగా తరలించడమే ధర్నా ఉద్దేశమని చెబుతున్నారు. సమస్యలు తప్పవు పర్యావరణ పరిరక్షణ సంస్థ తన పరిశోధనలో పేర్కొన్న నీటిలో మాంగనీసు శాతం ఎక్కువగా ఉంటే నాడీ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ నీటిని వేడిచేస్తే మాంగనీసు మరింత దృఢంగా మారుతుంది. వంట, స్నానానికి కూడా ఈ నీటిని వాడకూడదు. కొళాయిలు, పైపులు, షింక్లపై ఉప్పులాంటి పదార్థం పేరుకుపోయి నలుపు, గోధుమ రంగు మరకలు ఏర్పరుస్తుంది. వస్తువులు త్వరగా పాడైపోతాయి. యురేనియం శాతం ఎక్కువగా ఉంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఎముకల సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు వచ్చేందుకు అధికంగా ఆస్కారం ఉంది. చిన్న పిల్లలకు ఈ నీటిని అస్సలు వినియోగించకూడదు. -
నేటి నుంచి గ్రామసభలు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని పలు పంచాయతీల్లో సోమవారం గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు అంశాల పై చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ వికసిత్ భారత్ వీబీ జీ రామ్ జీని తీసుకొచ్చింది. ఈ నూతన పథకం మార్పులపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద ఏక కాలంలో గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు. జాబ్కార్డు కలిగిన వారికి ఏడాదికి గరిష్టంగా ఇప్పటి వరకు వంద రోజుల పని కల్పిస్తుండగా ఇకపై 125 రోజులు కల్పించనున్నారు. పరిపాలనా వ్యయం ఇప్పటి వరకు 6శాతం ఇస్తుండగా దానిని 9 శాతానికి పెంచారు. పలు అంశాల పై చర్చ గ్రామసభలో పలు అంశాల పై చర్చించనున్నారు. వీబీ జీ రామ్ జీ పథకంలో మార్పులు, అమలు, స్వచ్ఛ గ్రామాల పేరుతో సంక్రాంతి లోపు అన్ని గ్రామాల్లో పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తారు. అలాగే స్వర్ణ పంచాయతీ యాప్ అమలు, పన్నుల చెల్లింపు స్వామిత్వ మూడో విడత సర్వేపై వివరించనున్నారు. – సుధాకర్రావు, డీపీఓ -
నేటి నుంచి ఆధార్ శిబిరాలు
చిత్తూరు కలెక్టరేట్ : పిల్లలు తమ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాల అప్డేట్కు ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ శిబిరాలను నిర్వహించనున్నారు. జిల్లాలో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సినవారు 18 వేల మందికి పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికోసం గ్రామ/వా ర్డు సచివాలయాల్లోని 125 కేంద్రాల్లో పిల్లలు తమ ఆధార్లో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కిక్కిరిసిన బోయకొండ చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆల యం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. కోరిన కోర్కె లు తీర్చే గంగమ్మా .. దీవెంచమ్మా అంటూ వేడుకున్నారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలి వచ్చా రు. ఆదివారం సెలవు కావడంతో అమ్మవారి దర్శనం కోసం విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు అఽధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయం రద్దీతో క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కి రిసి పోయాయి. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఉచిత ప్రసా దాలను పంపిణీ చేశారు. 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం కార్వేటినగరం : సారా తయారీ అమ్మకాలు జరిపితే కఠిన శిక్ష తప్పదని ఎస్ఐ తేజస్విని అన్నా రు. ఆదివారం మండల పరిఽధిలోని కనికాపురం సమీపంలో దాడులు నిర్వహించి సారా తయారీకి సిద్ధం చేసి ఉంచిన సుమారు 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. మండలంలో కొటార్వేడు, గోపిశెట్టిపల్లి, కనికాపురం,కృష్ణసముద్రం, వంటి పలు గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం కనికాపురం సమీపంలో కృష్ణాపురం జలాశయం సప్లై చానల్లో అక్రమంగా దాచి ఉంచిన ఊట, సారా తయారీకి వినియోగించే పరికరాలను ధ్వంసం చేశారు. కానిస్టేబుల్ రాజశేఖర్, రాజ ఉన్నారు. బ్రెయిలీ విగ్రహావిష్కరణ చిత్తూరు కలెక్టరేట్: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ విగ్రహాన్ని చిత్తూరు నగరంలో ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం విగ్రహాన్ని ఆవిష్కరించారు. నగరంలోని కట్టమంచి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బ్రెయిలీ విగ్రహం వద్ద జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ అధికారులు కార్యక్రమం ఏర్పా టు చేశారు. నిర్వహణకు నిధులు మంజూరు అవుతున్నప్పటికీ జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ అధికారులు కార్యక్రమాన్నితూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. అంధులకు, సంఘ నాయకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ శాఖ అధికారులు అవమానం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులను పక్క దారి పట్టించేందుకు ఇలాచేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ తప్పనిసరి తిరుపతి లీగల్ : తమిళనాడు తరహాలోనే ఏపీలో కూడా బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలల్లో రిజర్వేషన్లు కల్పించడం తప్పనిసరిగా సీఎం చంద్రబాబు కృషి చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య సూచించారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లా డుతూ రాష్ట్రంలో బీసీలకు చట్ట సవరణ ద్వారా రిజర్వేషన్లు కల్పించాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రిజర్వేష్లకోసం బీసీ సంఘాల తరఫున హైకోర్టులో రిట్ దాఖలు చేశామని, సోమవారం విచారణ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. చంద్రబాబు సర్కార్ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోందని, రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి, హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 లక్షల విరాళం తిరుమల : వడమాలపేట మండలంలోని అంకాలమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ టి.పీతాంబరం ఆచారి అనే భక్తుడు ట్రస్ట్ తరఫున ఎస్వీ విద్యాదాన ట్రస్ట్కు ఆదివారం రూ.10,01116 విరాళంగా అందించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి చెక్ అందజేశారు. -
నేడు డయల్ యువర్ ఎస్ఈ
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. లడ్డూ పోటు తనిఖీ కాణిపాకం : లడ్డూలో నాణ్యత ఉండాలని..లోటు కనిపిస్తే చర్యలు తప్పవని ఈవో పెంచల కిషోర్ హెచ్చరించారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన లడ్డూ పోటును ఆదివారం తనిఖీ చేశారు. లడ్డూ తయారీని క్షుణంగా పరిశీలించారు. ఈవో మాట్లాడుతూ లడ్డూ రుచిని మరింత పెంచేలా..తయారీలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు. కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, సిబ్బంది ఉన్నారు. నేడు ఇంటర్ తత్కాల్లో ఫీజు చెల్లింపునకు అవకాశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఈనెల 5వ తేదీ లోగా ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజును తత్కాల్ పద్ధతిలో చెల్లించవచ్చని జిల్లా ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తత్కాల్ విధానంలో ఫీజు చెల్లించేందుకు ఆఖరి అవకాశం కల్పించారన్నారు. తత్కాల్లో రూ.5 వేల అపరాధ రుసుంతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
చతికిల‘బడి’
మూసివేతకు... బాబు సర్కారు కుట్ర ! ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయకపోగా మూసివేతకు చంద్రబాబు సర్కారు చర్యలు చేపడుతోంది. 2019కి ముందు రేషనలైజేషన్ పేరుతో వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వెంటనే విలీనం పేరుతో పాఠశాలలను కనుమరుగుచేశారు. తాజాగా తక్కువ విద్యార్థుల సాకుతో మరిన్ని పాఠశాలలను మూసివేతకు రహస్యంగా వివరాలు సేకరిస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందా.. తగినంత మంది విద్యార్థులు లేరనే సాకుతో బడులను మూసివేసేందుకు కుట్ర పన్నుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి రెండు రోజుల కిందట అన్ని జిల్లా లు, మండలాల విద్యాశాఖాధికారులతో వెబెక్స్ నిర్వహించారు. విద్యార్థుల సంఖ్య ఐదులోపు ఉన్న ఫౌండేషన్న్ స్కూళ్లు, పదిలోపు ఉన్న బేసిక్ స్కూళ్లు, 30లోపు ఉన్న మోడల్ ప్రైమరీ స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య 50 లోపు ఉన్న హైస్కూళ్ల వివరాలు సేకరించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. పిల్లల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో కొన్ని పాఠశాలలను సమీప పాఠశాలల్లోకి విలీనం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్న విమర్శలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలోమీటర్ పరిధిలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోకి విద్యాశాఖ పంపేసింది. ఈ ప్రక్రియతో చాలా పాఠశాలలు మూతపడ్డాయి. వందల సంఖ్యలో పాఠశాలలు సింగిల్ టీచర్ (ఏకోపాధ్యాయ)కే పరిమితమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం 3, 4, 5 తరగతులను విలీనం చేసింది. ఈ విధానం వల్ల చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు సమాచారం. బడులకు తాళం కార్టూన్ చిత్రం పాఠశాలలో పాఠాలు చెబుతున్న టీచర్ కార్టూన్ చిత్రంనియోజకవర్గం పాఠశాలల విద్యార్థుల సంఖ్య సంఖ్య చిత్తూరు 183 11,413 గంగాధరనెల్లూరు 399 15,139 కుప్పం 433 31,955 నగరి 177 10,334 పలమనేరు 463 33,327 పూతలపట్టు 355 15,642 పుంగనూరు 404 22,856 మొత్తం 2414 1,40,666 ఇది జిల్లాలో పరిస్థితి జిల్లాలోని చిత్తూరు, కుప్పం, పలమనేరు, పూతలపట్టు, నగరి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లోని పలు పాఠశాలలను తక్కువ విద్యార్థుల సాకుతో మూసివేతకు రహస్యంగా కసరత్తు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కసరత్తు నిర్వహించి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు నివేదికలు పంపేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లా సమాచారం -
శాంతి భద్రతలపై దిశానిర్దేశం
సదుం : పోలీసు స్టేషన్ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం తనిఖీ చేశారు. ఆయనకు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, డీఎస్పీ మహీంద్ర స్వాగతం పలికి, గౌరవ వందనం చేశారు. స్టేషన్లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అన్నమయ్య జిల్లా పరిధీలోకి చౌడేపల్లె సర్కిల్ చేరడంతో పరిస్థితుల అవగాహన కోసం సాధారణ తనిఖీ చేపట్టారు. కార్యక్రమంలో పుంగనూరు రూరల్ సీఐ రాంభూపాల్, చౌడేపల్లె ఎస్ఐ నాగేశ్వర రావు, ఏఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. చల్లా ఇంటికి.. రొంపిచెర్ల : పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఇంటికి కర్నూల్ రెంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం ఉదయం వచ్చారు. మండలంలోని బొమ్మయ్యగారిపల్లె పంచాయతీలోని గర్నిమిట్టవారిపల్లెలోని చల్లా రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి కొంత సేపు ముచ్చటించి వెళ్లారు. అనంతరం నియోజక వర్గంలోని సోమల, చౌడేపల్లె, పుంగనూరు పోలీసుస్టేషన్లును డీఐజీ తనిఖీ చేశారు. జిల్లాలో పెద్ద రెవెన్యూ డివిజన్ పాయె! ఆలయాల భద్రత గాలికి తిరుపతి మంగళం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీకి సంబంధించిన అధికారులను వేధించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తు లపై బురద జల్లడం పరమావధిగా మారిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా మాట్లాడారు. టీటీడీ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. దీనికి అనేక ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయన్నారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, ఏడాది గడిచినా ఇప్పటివరకు ఆ నివేదిక వెలువడకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అదే విధంగా తిరుమల, తిరుపతిలో వరుసగా భద్రతా లోపాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ఆయా భద్రతా లోపాలపై లేఖలు రాశారని, దానికి ప్రతిగా కేంద్ర హోంమంత్రి అమిత్షా కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, మా లేఖకు వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదన్నారు. ఆలయాల భద్రతపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆలయాల పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేయడం వల్లనే అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి గోవిందరాజ స్వామి ఆలయంలోని నడిమి గోపురం ఎక్కి, పవిత్రమైన కలశాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం, నకిలీ మద్యం విక్రయాలు జరగడం వల్ల ప్రజలు తాగి ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. పలమనేరు : పలమనేరు కొత్త రెవెన్యూ డివిజన్గా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవతరించింది. 2022 ఏప్రిల్లో పలమనేరులో డివిజన్ కార్యాలయ సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోనే పలమనేరు వైశాల్యంలో పెద్ద డివిజన్గా మారింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని ఎటూ కాకుండా చేసేశారు. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని పుంగనూరు, చౌడేపల్లి మదనపల్లి డివిజన్లోకి, బంగారుపాళ్యాన్ని చిత్తూరులోకి, సోమల, సదుం మండలాలను పీలేరు డివిజన్లోకి విలీనం చేసేశారు. దీంతో పలమనేరు రెవెన్యూ డివిజన్ కేవలం ఐదు మండలాలకే పరిమితమైంది. ఫలితంగా విస్తీర్ణంలోనూ తగ్గి పెద్ద డివిజన్ పేరును పోగొట్టుకుంది. పలమనేరుపై ఇంత కక్ష జరుగుతున్నా దీనిపై పాలకులు నోరు మెదపకపోవడంపై జనంలో విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘బీమా’.. లేదిక ధీమా!
కార్వేటినగరం : ప్రమాదాలు.. సహజ మరణాల్లో కుటుంబ పెద్ద దిక్కును కోల్పో యిన పేదలకు అండగా ఉండే బీమా అమ లుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. కూట మి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర అవుతున్నా బీమా పథకం అమలుపై ఎటువంటిి ప్రకటనా చేయలేదు. రేషన్ కార్డు ఉన్న కుటుంబ పెద్ధ ఆకస్మిక, సహజ మరణం పొందినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కలిగించడం కోసం ప్రభుత్వం బీమా పథకం ప్రవేశపెట్టింది.2014–19 మధ్య అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం అమలు చేసింది. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పేరుతో ఈ పథకం అమలు చేసి బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. చంద్రన్న బీమా అమలెప్పుడు..? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న బీమా పథకం అమలు చేస్తామని ఆ పార్టీ నాయకులు హామీ ఇచ్చా రు. గతం కన్నా మిన్నగా ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తామని గొప్పలు చెప్పారు. సహజ మరణానికి రూ. 5 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడా దిన్నర పూర్తవుతున్నప్పటికీ ఇంత వరకూ చంద్రన్న బీమా పథకం గురించి పార్టీ నాయకులెవరూ మాట్లాడని పరిస్థితి నెలకొంది. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా యి. ఇలాంటి వారికి బీమా అమలు చేసి ఉంటే కాసింత ఉపశమనం కలిగేదని బాధి త కుటుంబాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం అలసత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న బీమా పథకం ఆమలులో ఆలసత్వం చేస్తోంది. జిల్లాలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు 5.40 లక్షలు ఉన్నాయి. ఏటా 8 వందల నుంచి 1200 వరకు సహజ మరణాలు నమోదు అవుతున్నాయి. అదే విధంగా వివి ధ ప్రమాదాల్లో సుమారు 3 వందల మంది వరకు ప్రాణాలు విడుస్తున్నట్లు సమాచారం. అలాగే వివిధ ప్రమాదాల వల్ల వందల మంది వైకల్యం బారిన పడి మంచానపడి మగ్గుతున్నారు. బీమా పథ కం లేకపోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బీమా విషయంపై ప్రభు త్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అమలు చేయాలి కూటమి ప్రభు త్వం ఎన్నికల హామీలో భాగమై న చంద్రన్న బీమా పథకం తక్షణమే అమలు చేయాలి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం ఎంతో ఉపయోగకరం. ప్రమాదాలు, సహజ మరణాల్లో కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టు మిట్టాడుతుంది. బీమా సొమ్ము ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది. కూట మి ప్రభుత్వం బీమా పథకం అమలు చేయాల్సిన అవసరం ఉంది. – పురుషోత్తంరాజు, రాజుల కండ్రిగ, కార్వేటినగరం -
రూ.12 లక్షలు వంకపాలు!
చిత్తూరు రూరల్(కాణిపాకం) : ఓ టీడీపీ నేత లక్షణంగా రోడ్డు వేశామని... జనాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. కుప్పకూలిన రోడ్డులో ఓ బైక్ ఇరుక్కుపోయి శనివారం అవస్థలు పడ్డాడు. ఆ వివరాలు ఇలా.. గతేడాది వర్షానికి చిత్తూరు మండలం బీఎన్ఆర్పేట వంకలో రాకపోకలకు అంతరాయం ఏర్ప డింది. ఈ వంకలో జీడీ నెల్లూరు మండల వాసులు పలు పనుల నిమిత్తం వస్తూ పోతుంటారు. వారి అంతరాయం ఆసరాగా చేసుకుని వంక మధ్యలో రోడ్డు వేయాలని ప్లాన్ వేశారు. ఇందుకు ప్రభుత్వం నుంచి రూ.12 లక్షల వరకు మంజూరు చేయించుకున్నారు. నీటి ప్రవాహం కుదుట పడిన వెంటనే పనులు ప్రారంభించారు. సిమెంట్ పైపులను అడ్డం పెట్టి మట్టి కప్పారు. ఆ పని తూతూమంత్రంగా చేయడంతో రెండు రోజులకే నాణ్యత తేలిపోయింది. వంక మధ్యలో రోడ్డు కుంగింది. నాలుగు రోజు కు పెద్ద పెద్ద చీలికలు పడి.. మట్టి కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ రోడ్డు ప్రమాదకరంగా ఉంది. కాలి నడక వెళ్లే వారు అతి జాగ్రత్తతో వంక దాటుతున్నారు. కుంగిన రోడ్డులో..జారి పడిపోయారు... జీడీనెల్లూరు మండలం కడపగుంట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి తనకు మారుడితో కలిసి శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో చిత్తూరు మండలంలోని బీఎన్ఆర్పేట గ్రామానికి బయలుదేరాడు. నెమ్మదిగా వంక రోడ్డు దాటుతు న్న సమయంలో ద్విచక్రవాహనంను కుంగిన రోడ్డు లాగేసింది. తండ్రి, కొడుకులు ఇద్దరు..ఈ గోతిలో పడ్డారు. వారికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనం మాత్రం బాగా ఇరుక్కుపోయింది. అటువైపుగా వెళుతున్న కొందరు ఈవిషయాన్ని గమనించి...ఇరుక్కపోయిన ద్విచక్రవాహ నాన్ని పైకి లాగడానికి ప్రయత్నించారు. పైపుల మధ్య ముందు చక్రం ఇరుక్కుపోవడంతో అరగంట పాటు శ్రమించారు.రోడ్డును మళ్లీ బాగుచేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందులోనైనా నాణ్యత ఉండేలా చూడాలని వారు కోరుతున్నారు. -
మతిస్థిమితంలేని మహిళ కుటుంబ సభ్యుల చెంతకు
చిత్తూరు అర్బన్ : మతిస్థిమితంలేని ఓ మహిళ తప్పిపోయి చిత్తూరుకు రాగా.. పోలీసులు ఆమెను శనివారం తన కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. కర్నూలు జిల్లా ఆచార్య నగర్కు చెందిన ఓ మహిళ తన మానసిక ఆరోగ్యం సరిగాలేకపోవడంతో ఇంటి నుంచి వచ్చేశారు. రెండు రోజులుగా చిత్తూరులో ఉండటంతో ఆమెను మహిళా పోలీస్టేషన్ అధికారులు గుర్తించి స్టేషన్కు తీసుకెళ్లారు. ఆమె వద్ద కాగితాల ఆధారంగా తమ కుటుంబ సభ్యులను పిలిపించి.. కర్నూలుకు పంపించారు. 5న గ్రామసభలు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పంచాయతీలలో సోమవారం గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీపీఓ సుధాకర్రావు తెలిపారు. ఈ సభలు సర్పంచుల ఆధ్వర్యంలో నిర్వహించనుండగా, కార్యదర్శులు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారన్నారు. స్వచ్ఛ సంక్రాంతిలో భాగంగా ఈనెల 10లోపు పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు వచ్చాయన్నారు. భక్తిశ్రద్ధలతో సత్యనారాయణవ్రతం కాణిపాకం : పౌర్ణమిని పురస్కరించుకుని కాణిపాకంలోని శ్రీవరసిద్ది వినాయకస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీవరదరాజస్వామి ఆలయంలో శనివారం సత్యనారాయణ వ్రతంను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామి వారికి అభిషేక పూజలు జరిపించారు. అనంతరం సత్యనారాయణవ్రతంను నిర్వహించారు. ఈ వ్రతానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి స్వామి వారిని గరు డు సేవలో ఊరేగించారు. మహిళా వర్సిటీలో 23 మందికి ఉద్యోగోన్నతి తిరుపతి రూరల్: మహిళా యూనివర్సిటీ లో కెరీర్ అడ్వానన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద 23 మంది బోధనా సిబ్బందికి ఉద్యోగోన్నతి కల్పిస్తూ వైస్ చాన్సలర్ ఆచార్య ఉమ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగోన్నతి ఉత్తర్వులను వైస్ చాన్స్లర్ ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. రజని అధ్యాపకులకు అందజేశారు. ఇటీవల నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగోన్నతికి ఆమో దం తెలపడంతో ఆ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. -
డిపార్ట్మెంట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
చిత్తూరు కలెక్టరేట్ : డిపార్ట్మెంట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ.. జిల్లాలోని 4 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని ఆర్వీఎస్ నగర్లో ఉన్న ఎస్వీ సెట్, పలమనేరులోని మధర్ థెరిస్సా ఇంజినీరింగ్, మురకంబట్టులోని సీతమ్స్ ఇంజినీరింగ్, కుప్పంలో ని కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్స్లో 1797 మంది, కన్వెన్షనల్ పరీక్షకు 318 మంది హాజరవుతారన్నారు. సమావేశంలో కలెక్టరేట్ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ బ్యూలా, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో నాన్ టీచింగ్ పోస్టులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. జిల్లాలోని 5 కేజీబీవీల్లో నాన్ టీచింగ్ పోస్టులు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న 34 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. సాధారణ అభ్యర్థులకు 18–45 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అభ్యర్థులకు ఐదు సంవత్సరా లు, దివ్యాంగులకు ఏడు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తులను కేజీబీవీ ప్రిన్సిపల్స్, ఎంఈఓల వద్ద పొందవచ్చని చెప్పారు. ఈ పోస్టులకు జిల్లాలో అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 11వ తేదీ లోపు నేరుగా డీఈఓ కార్యాలయంలో ఉన్న సమగ్ర శిక్ష శాఖలో అందజేయాలని ఆయన వెల్లడించారు. బోయకొండ గర్భాలయానికి ఇత్తడి తాపడం సమర్పణ చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ప్రధాన గర్భాలయంలో అమ్మ వారి విగ్రహానికి వెనుక అలంకరణ కోసం ఇత్తడి తాపడాన్ని శనివారం విరాళంగా అందజేసినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. మదనపల్లె టౌన్ ఎస్బీఐ కాలనీకు చెందిన పి.గంగాధరం సుమారు రూ.2.80 లక్షలు విలువ చేసే ఇత్తడి తాపడం షీట్ తయారు చేయించి ఆల యంలో అలంకరణ కోసం విరాళమిచ్చారు. వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ రుణాలపై వడ్డీమాపీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విక్రమ్కుమార్ రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరి ధిలో 2015–16 నుంచి 2018–19లో మంజూరు చేసిన ఎన్ఎస్ఎఫ్ దీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ రుణాలపై ప్రభుత్వం వడ్డీ మాఫీ అవకాశం కల్పించిందన్నారు. నాలు గు నెలల (ఏప్రిల్ 2026)లోపు అస లు రుణ మొత్తం చెల్లిస్తే, 2025 ఆగస్టు 31 వరకు ఉన్న మిగిలిన వడ్డీని మాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని అంబేడ్కర్ భవనంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 83,032 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,272 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శ నం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమ యం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కె ట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
పిల్లల పోషణ, ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పిల్లల పోషణ, ఎదుగుదలపై ఐసీడీఎస్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేసే ఆహారం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అన్ని ప్రాజెక్టులలో టీహెచ్ఆర్ పంపిణీ 100 శాతం పకడ్బందీగా జరగాలన్నారు. ఫ్రీ స్కూల్ పిల్లలు 100 శాతం హాజరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీషన్ గార్డెన్స్ నిర్వహించాలన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గర్భిణులలో హిమోగ్లోబిన్ తగ్గుదలలో కార్వేటినగరం, బైరెడ్డిపల్లి, పులిచెర్ల, కుప్పం, శాంతిపురం కేంద్రాల్లో ఎక్కు వగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల్లో బరువు తగ్గుదల అంశంలో పలమనేరు, వి.కోట, చిత్తూరు అర్బన్ తదితర ప్రాంతాలు వెనుకబడి ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, సీడీపీవోలు పాల్గొన్నారు. -
నీళ్ల సాంబారు ..
ముద్ద అన్నం అన్నంపై పోస్తున్న నీళ్ల సాంబారు ముద్దకట్టిన మధ్యాహ్న భోజనం మండలంలోని తిరుమళరాజుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనంలో శనివారం నీళ్ల సాంబారు.. ముద్ద కట్టిన అన్నం ఎలా తింటారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తమిళనాడు సరిహద్దులో తిరుమళరాజుపురం హైస్కూల్లో 245 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంట్లో కంటే పాఠశాలలో ప్రభుత్వం మంచి భోజనం పెడుతుందని ఆశించిన విద్యార్థులకు నీళ్ల సాంబారు.. ముద్ద కట్టిన అన్నం పెట్టడంతో తినలేక అన్నంను ఉపాధ్యాయులకు తెలియకుండా కింద పడేస్తున్నారు. – పాలసముద్రం -
గొడవలో ముగ్గురికి కత్తిపోట్లు
● దుకాణంలో జరిగిన వాగ్వివాదమే కారణమా? ● పరారీలో దాడిచేసిన వ్యక్తి పలమనేరు : వస్త్ర దుకాణంలో జరిగిన వాగ్వాదం కారణంగా ముగ్గురు స్నేహితు లు ఓ వ్యక్తిని వెంబడించగా ఎదురుతిరిగిన అపరిచిత యువకుడు ముగ్గురిని కత్తి తో పొడిచి పరారైన సంఘ టన పలమనేరు పట్టణంలో ని గంటావూరు వద్ద శనివా రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. ఓ యువకుడు స్థానిక వస్త్ర దుకాణంలో కొనుగోలు చేస్తూ అక్కడి యజమానితో గొడవకు దిగినట్లు సమాచారం. అనంతరం ఆ యువకుడు బైక్ను ర్యాస్గా నడుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహించిన ఆ యజమాని తన స్నేహితులను పిలిపించి ఆ యువకుడి బైక్ను వెంబడించుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది. గంటావూరు వద్ద వీరందరూ ఆ యువకుడిపై వాగ్వాదానికి దిగగా అక్కడ జరిగిన గొడవలో ఆ గుర్తు తెలియని యువకుడు తనవద్ద నున్న పదునైన కత్తితో ముగ్గురిపై దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడిలో పట్టణానికి చెందిన లక్ష్మీపతి కుమారుడు భవంత్(27) వీపుపై తీవ్ర గాయమైంది. మధుశేఖర్ కుమారుడు సన్ని(25)కి కడుపు, వీపుపై కత్తిపోట్లు పడ్టాయి. సునీల్(26)కు వీపుపై గాయమైంది. వీరిని స్థానికులు ఇక్కడి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన భవంత్, సన్నిలను మెరుగైన చికిత్స కోసం సీఎంసీకి తరలించారు. పలమనేరు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. తుమ్మిందలో నేత్రావధానం చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలం తుమ్మింద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో నేత్రావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఎటువంటి సంభాషణలు లేకుండా కనుసైగలు, కనుబొమ్మల సంజ్ఞలతో మాట్లాడుకున్నారు. పృచ్ఛకులు ఇచ్చిన పదాలను, వాక్యాలను, సంఖ్యలను ఎనిమిదో తరగతి చదువుతున్న జ్ఞానప్రియ కనుబొమ్మలతో ఇచ్చిన సంజ్ఞలను అర్థం చేసుకొని ఏడో తరగతి చదువుతున్న పి.చాముండి వాటిని చకచక చెప్పేసింది. అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుజాత మాట్లాడుతూ ఇలాంటి అరుదైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తమ పాఠశాలలో నిర్వహించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో గణిత అవధాని హెచ్.అరుణ శివప్రసాద్ పృచ్ఛకులు వసంత లక్ష్మి సంజీవి, లలిత, కాళప్ప, ఈశ్వరి, అమర్నాథ్, జ్ఞాన దీపం, జయమణి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కత్తిపోట్లకు గురైన భవంత్,సన్ని -
ఒక్క టోకెన్ సామీ !
యూరియా రైతులను కుంగదీస్తోంది. టోకెన్ల కోసం పరుగులు పెట్టిస్తోంది. గంటలోపే టోకెన్లు అందక కన్నీళ్లు పెట్టిస్తోంది. క్యూకట్టి...వెన్ను విరిచేస్తోంది. తిండి తిప్పలు లేక పడిగాపులు పడుతున్నారు. ఇదీ చాలదన్నట్లు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పస్తులతో యూరియా కోసం అలమటిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.చిత్తూరు నగరంలోని సహకార మార్కెటింగ్ సొసైటీ భవనం వద్ద గుమికూడిన రైతులు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలో శనివారం యూరియా పంపిణీ చేశారు. మళ్లీ మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో టోకె న్లు పంపిణీ చేశారు. ఇందుకు ముందుగానే చిత్తూ రు నగర పరిసర ప్రాంతాల్లోని రైతులు వందలాదిగా క్యూకట్టారు. ఉదయం 8గంటలకే కార్యాలయాన్ని చుట్టిముట్టేశారు. రైతులు అధిక సంఖ్యలో అక్కడికి రావడంతో గందరగోళంగా కనిపించింది. గంటల్లోనే టోకన్లు అమ్ముడుపోవడంతో చాలా మంది రైతులు నిరాశకు లోనయ్యారు. బతిమిలాడుతున్నా.. వందలాదిగా వచ్చిన రైతుల్లో కొంత మందికి మాత్రమే టోకెన్లు వచ్చాయి. మిగిలిన రైతులను సోమవారానికి రమ్మని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత వచ్చిన వారికి టోకెన్లు లేవని తిప్పి పంపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు మాత్రం అల్లాడిపోయారు. అధికారులను ఒక్క టోకెన్ సామి అని బతిమిలాడుకున్నారు. వారిని అధికారులు.. మీ ఊళ్లోనే ఇస్తారని సర్ధిచెప్పి పంపించేశారు. ఇక టోకెన్లు అందిన వారికి కూడా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. నిల్వలు ఇవీ జిల్లాలో ప్రస్తుతం 324 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. 108 ఆర్బీకేలో 84 మెట్రిక్ టన్నులు, 7 సహకార సొసైటీలో 40 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు దుకాణాల్లో 200 టన్నులు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే వీటిని రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. గంటల తరబడి పడిగాపులు చిత్తూరు నగరంలోని మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడకు ఉదయం 8గంటలకు వచ్చి క్యూలో నిలబడుతున్నారు. టోకెన్లు దొరకవని పొద్దు..పొద్దునే వచ్చేస్తున్నారు. కార్యాలయం వద్ద గంట నుంచి..రెండు గంటల సమయం తర్వాత టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. అక్కడ టోకెన్లు తీసుకుని గాంధీ రోడ్డులోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ భవనం వద్దకు నడిచి వెళ్లాలంటే అర గంట సమయం పడుతుంది. ఇంతలో రైతులు నీరసించిపోతున్నారు. యూరియా తీసుకోవాలంటే క్యూలో నిలబడి తల్లడిల్లిపోతున్నారు. బయోమెట్రిక్ వేసి..యూరియా బ్యాగు తీసుకుని బయటకు రావడానికి రెండు గంటల సమయం పడుతోంది. దీంతో రైతులు సొమ్మ సిల్లిపోతున్నారు. అధికారులు స్పందించి ఈ కష్టాల నుంచి విముక్తి కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. యూరియాకు..రెండు కి.మీ... యూరియాకు టోకెన్లు అందిన రైతులు కూడా మండిపాటుకు గురవుతున్నారు. ఆఫీసులో టోకెన్లు ఇస్తే..రెండు కి.మీ దూరం వెళ్లి యూరియా తెచ్చుకోవాలా అంటూ మండిపడుతున్నారు. రైతులను ఇలా ఇబ్బంది పెట్టించడం కరెక్టు కాదని ఆగ్రహానికి గురవుతున్నారు. యూరియా పంపిణీ చేసే చోటే..టోకెన్లు పంపిణే చేస్తే బాగుంటుందని, ఈ విషయంలో కలెక్టర్, పాలకులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరీక్షణ లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే యూరియా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని నివేదిస్తున్నారు. -
ఉత్తుత్తి ఆర్భాటమే!
కుప్పం : కుప్పంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని.. వందల కోట్లు కుప్పం అభివృద్ధికి సీఎం చంద్రబాబు మంజూరు చేస్తున్నారని గొప్పలు చెబుతూ...అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే కుప్పం పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులే. పట్టణంలో అర్ధంతరంగా ఆగిన రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికార పార్టీ నేతలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎంఆర్రెడ్డి సర్కిల్ నుంచి కుప్పం రైల్వే గేటు వరకు రెండవ రోడ్డు రీచ్ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా ఆరు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరయ్యాయని హంగామా చేశారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం నిర్ణయించలేదు, రోడ్డు విస్తరణ మార్కింగ్ చేయకుండానే ఆర్భాటం చేశారు. తీరా రోడ్డు విస్తరణకు ఆర్అండ్బీ ప్రభుత్వ కార్యాలయం అడ్డంగా ఉందని, హఠాత్తుగా కార్యాలయం పూర్తి కానీ సొంత భవనంలోకి మార్చేశారు. రైల్వే గేటు సమీపంలోని ఆర్ అండ్బీ కార్యాలయం ప్రహరీ వద్ద పూజలు చేపట్టి జేసీబీతో గోడను కూల్చి వేశారు. అంతే ఇప్పటి వరుకు రోడ్డు విస్తరణ పనులు ఊసే లేకుండా పోయాయి. ప్రారంభానికి నోచుకోలే.. రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉందని ఆర్అండ్బీ కార్యాలయాన్ని కృష్ణగిరి సర్కిల్లో నిర్మిస్తున్న సొంత భవనంలోకి మార్చేశారు. కానీ నెలలు గడుస్తున్నా రోడ్డు విస్తరణ పనులు మాత్రం ఫ్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఖాళీగా ఉన్న భవనంలో నూతనంగా కుప్పం ఉద్యానశాఖ కార్యాలయం ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు విస్తరణపై అధికారులు, నాయకులు చెప్పే మాటలకు పొంతన లేకుండా ఉంది. అభివృద్ధి పనులు అంతంతే.. అధికార పార్టీ నేతలది కుప్పం అభివృద్ధిపై ఉత్తుత్తిఽ ఆర్భాటాలు తప్ప ఒరిగింది ఏమీ లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. కోట్లతో కుప్పం అభివృద్ధి అంటే కేవలం దస్త్రం మీదే కనిపిస్తోంది తప్ప క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. కుప్పం మున్సిపాలిటీ సైతం అభివృద్ధికి ఆమడ దూరంగా నిలుస్తోంది. -
రాజనాలబండ.. నిజాయితీకి అండ
చౌడేపల్లె : సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ ప్రసన్నాంజనేయ స్వామి పేరు చెప్పగా చోరీ చేసిన సుమారు 150 గ్రాముల బరువు గల నగలు ఇంటి ముందు ప్రత్యక్షమైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. చౌడేపల్లె మండలం వెంగళపల్లె పంచాయతీ గాజులవారిపల్లెకు చెందిన గిరిబాబు ఇంటి బీరువాలో దాచిన బంగారు నగలను గతనెల 25వ తేదీ చోరీ అయ్యాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో ఏర్పాటు చేసిన పంచాయతీకి ఇంటికొకరు చొప్పున హాజరయ్యారు. చోరీ సంఘటన గురించి ఆరా తీశారు. నేరం అంగీకరించకపోవడంతో ఈనెల 3న శనివారం ప్రతి ఇంటిలోని ఒకరు రాజనాలబండకు చేరుకొని ప్రమాణం చేయాలని తీర్మానించారు. ఇంతలో శనివారం ఉదయం చోరీ అయిన బంగారు నగల మూట ఇంటి ఆవరణలో ప్రత్యక్షం కావడంతో కథ సుఖాంతమైంది. అనంతరం టెంపుల్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్,, అర్చకుడు కష్ణమూర్తి పూజలు చేసి బాధితులకు బంగారు నగలు అందజేశారు. -
టీచర్లకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు రద్దు చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర విద్యాశాఖ అధికారులు టీచర్లకు షోకాజ్ నోటీసులుకాదు స్వేచ్ఛ నివ్వాలని వైఎస్సార్ టీఏ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రెడ్డి శేఖర్రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యా శాఖ అధి కారులు 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టిన 100రోజుల ప్రణాళికలో మార్కు లు నమో దు చేయలేదనే కారణంతో టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు టీచర్లకు స్వేచ్ఛ ని ఇవ్వకుండా ఉత్తీర్ణత శాతం పెంపునకు ఇబ్బంది పెట్టడం తగదన్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు సరైన ఆహారం, విశ్రాంతి, వినోదం అవసరమని మానసిక వైద్యులు సూచిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యాశాఖలో ఇతర శాఖల అధికారుల పెత్తనం ఎక్కువైందని టీచర్లు రగిలిపోతూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. తగిన కారణాలు తెలుసుకోకుండా టీచర్లకు ఏకపక్షంగా షోకాజ్ నోటీసులు జారీ చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. టీచర్లకు నోటీసులు ఇచ్చి భయపెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షోకాజ్ నోటీసులు వెంటనే రద్దు చేయకపోతే 100 రోజుల ప్రణాళికను టీచర్లు బహిష్కరిస్తారని హెచ్చరించారు. ఆర్మ్డ్ రిజర్వు ఏఎస్పీగా దేవదాసు చిత్తూరు అర్బన్ : చిత్తూరు పోలీసుశాఖలోని ఆర్మ్డ్ రిజర్వు (ఏఆర్) ఏఎస్పీగా ఎం.దేవదాసు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఏపీ పోలీసు అకాడమీలో పనిచేస్తున్న దేవదాసును చిత్తూరుకు బదిలీ చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులో బాధ్యతలు తీసుకున్న ఆయన ఎస్పీ తుషార్ డూడీను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఈయన గతంలో చిత్తూరు ఆర్ఎస్ఐగా, ఏఆర్ డీఎస్పీగా పనిచేశారు. -
రాతపై పట్టు.. మార్కులు రాబట్టు
కార్వేటినగరం : పరీక్ష రాసే విద్యార్థుల చేతి రాత బాగుంటే మూల్యాంకనం చేసే వారికి సులువుగా అర్థమవుతుంది. ఫలితంగా మంచి మార్కులు వేస్తారు. చేతి రాత బాగా లేకపోతే మూల్యాంకనం చేసే వారికి సమాధానం అర్థం కాకుంటే ఒక మార్కు లేదా అర మార్కు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం మార్కులపై ప్రభావం చూపి ర్యాంకు తగ్గే అవకాశం లేకపోలేదు. విద్యార్థులు చేతి రాతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పరీక్షలకు రెండు నెలలకు పైగా సమయం ఉన్నందున విద్యార్థులు ప్రతి రోజూ అర గంట చేతిరాతపై సాధన చేయాలని. నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల్లో చేతి రాత ఎలా ఉండాలో నిపుణుల మాటల్లోనే... ● విద్యార్థుల ఆన్సర్ షీట్ (బుక్లెట్)లో సమాధానాలను స్పష్టంగా రాయాలి. ● నాలుగు వైపులా మార్జిన్లు (బార్డర్లు) చేసుకుంటే అందంగా ఉంటుంది. ● బుక్ లెట్ ఎడమవైపు రెండున్నర సెంటీమీటరు, కుడివైపు, పైనా, కింద, ఒకటిన్నర సెంటీ మీటరు బార్డర్ వేసుకోవాలి. ● ఒకలైన్ , మరో లైనుకు ఒకటిన్నర సెంటీ మీటరు గ్యాప్ ఇవ్వాలి. ● పదానికి, పదానికి అర సెంటీ మీటరు స్పేస్ ఇవ్వాలి. ● బుక్లెట్లో వాక్యాలు పైకి కిందకు లేకుండా వరుస క్రమంలో ఉండాలి. ● బొటన వేలు, మూడవ వేలికి చూపుడు వేలు సహాయంతో పెన్నును చక్కగా పట్టుకోవాలి, ఇలా చేయడం వల్ల రాసే సమయంలో స్పీడుగా రాయవచ్చు. ● ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లేకుంటే ఆ ప్రభావం చేతిరాత పై కూడా పడుతుంది. ● మనసు ప్రశాంతంగా ఉంటే చేతిరాత చక్కగా వస్తుంది. సమాధాన పత్రంలో అక్షరాలు బాగుంటే ప్రతి సెబ్జెక్టులో కనీసం నాలుగు నుంచి ఐదు మార్కులు పెరిగే అవకాశం ఉంది. ● అక్షరాలు బాగా లేకపోతే చాలా మార్కులు కోల్పోవాల్సి వస్తుంది. సాధనతో సాధ్యం చక్కటి చేతిరాత సాధనతోనే సాధ్యం అవుతుంది. పరీక్షలకు ఇంకా సమ యం ఉన్నందున విద్యార్థులు అక్షరాలను గుండ్రంగా రాసేందుకు సమ యం కేటాయించి సాధన చేయాలి. చాలా మంది తొలి ప్రశ్నకు గుండ్రటి అక్షరాలతో సమాధానం రాస్తారు. ఆ తరువాత సమయం అయిపోతుందనే ఆందోళనతో వేగంగా రాయడం ప్రారంభిస్తారు. గుండ్రటి అక్షరాలు కుదరవు. ఈ ప్రభావం మా ర్కులపై పడుతుంది. అన్ని ప్రశ్నలకు సమాధానా లు గుండ్రంగా రాయాలంటే సాధన తప్పనిసరి. – జగదీశన్, చేతిరాత నిపుణుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కార్వేటినగరం -
పరిశ్రమల స్థాపనకు పారదర్శకంగా అనుమతులు
చిత్తూరు కలెక్టరేట్ : పరిశ్రమల స్థాపన నిమిత్తం పారిశ్రామికవేత్తలకు అనుమతులను పారదర్శకంగా మంజూరు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమా ర్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎంఈజీపీ యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని, ప్రతి మండలానికి ఐదు యూనిట్ల లక్ష్యాన్ని డీఆర్డీఏకు కేటాయించాలన్నారు. భాగస్వామ్య ఒప్పంద యూనిట్లకు సంబంధించి సమస్యలను పరిష్కరించి లైసెన్సులు మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల క్లస్టర్లను సందర్శించి విద్యుత్ సేవల అంతరాయంపై పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. ఇండస్ట్రీయల్ ఏరియా ఎస్టేట్ లోకల్ అథారిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవా లని పేర్కొన్నారు. డీఐసీ జీఎం సూరిబాబు, ఏపీఐఐసీ జెడ్ఎం సుబ్బారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం తొట్టంబేడు: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన తొట్టంబేడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. రాయచోటికి చెందిన చందు(21) శుక్రవారం తొట్టంబేడు పోలీస్స్టేషన్ పరిధిలోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చందు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అదుపు తప్పి విద్యార్థి మృతి తవణంపల్లె : అరగొండ– చిత్తూరు ప్రధాన రహదారిలో వినాయక స్కూల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడపడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని ఢీకొనడంతో బీటెక్ చదువుతున్న విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడని తవణంపల్లె ఎస్ఐ డాక్టర్ నాయక్ తెలిపారు. సంఘటనకు సంబంధించి వివరాలిలా.. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం యల్లవపాల్లెకు చెందిన వంకరాజు సుధాకర్ కుమారుడు వంకరాజు సురేష్కుమార్(21) చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో సురేష్కుమార్ ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడపడం వల్ల అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
అందని రేషన్
పాలసముద్రం : మండలంలోని 10వ రేషన్ షాపు వద్ద రేషన్ బియ్యం సక్రమంగా వేయడం లేదని రేషన్ కార్డు లబ్ధిదారులు శుక్రవారం ధర్నా చేపట్టారు. రేషన్ కార్డుదారులు మాట్లాడుతూ.. శ్రీబొమ్మరాజుపురం ఆదిఆంధ్రవాడ, రాచపాల్యం, సన్నగుంట ఎస్టీ కాలనీ, గుండుబావి సన్నగుంట బీసీ కాలనీ గ్రామాలకు చెందిన 320 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ 10వ నంబర్ రేషన్ షాపును కేటాయించి ప్రభుత్వం నిత్యావసర సరుకులు సరఫరా చేస్తోంది. 320 రేషన్ కార్డులకు 5.500 టన్నులు రేషన్ బియ్యం పంపిణీ చేయాలి. ప్రస్తుతం ఆరు నెలలుగా 2.500 టన్నుల బియ్యం మాత్రమే షాపునకు పంపిణీ చేస్తున్నారు. మొదటి రెండు రోజులు వస్తున్న సుమారు 100 రేషన్ కార్డులకు 2.500 టన్నుల బియ్యం సరిపోతోంది. మిగిలిన 220 రేషన్ కార్డులకు బియ్యం లేవంటున్నారు. ప్రతి రోజు కూలీ పనులకు వెళ్లగా చాలీచాలని సంపాదనలో కుటుంబాలను పోషించుకుంటున్నామని, రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో మార్కెట్లో వేలకు వేలు పెట్టి బియ్యం కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా మా రేషన్ కార్డుల సరుకులు అందడం లేదని వాపోయారు. -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ..
పుంగనూరు : అతి వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటో బోల్తా పడి ఇద్దరు మృతి చెందగా, 10 మంది గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి పట్టణ సమీపంలోని కొత్తపల్లె మలుపు వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం, చెంబకూరు పంచాయతీ దిన్నిమీద హరిజనవాడకు చెందిన రా జమ్మ, కదిరప్ప , లక్ష్మీపతి, నారాయణమ్మ , గాయత్రి, రూపశ్రీ, లావణ్య, శరణ్య, రెడ్డెమ్మ , మనోజ్, ఆటో డ్రైవర్ రెడ్డెప్ప (38), నారాయణప్ప(52) కలసి ఆటోలో స్వగ్రామం నుంచి బయలుదేరి పెద్ద పంజాణి మండలం , వీరప్పల్లెలోని నల్లవీరగంగమ్మ గుడికి వెళ్లారు. అక్కడ అమ్మవారికి పూజలు చేసుకుని కుటుంబ సభ్యులతో కలసి సాయంత్రం స్వగ్రామానికి ఆటోలో తిరిగి బయలుదేరారు. మా ర్గ మధ్యలో కొత్తపల్లె వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ ఇమ్రాన్ అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో కారు ఆటో ను ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ రెడ్డెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. నారాయణప్ప కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మిగిలిన 10 మంది గాయాలుపాలయ్యారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి, బాధితులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నారాయణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేశారు. బిక్కుబిక్కుమంటున్న చిన్నారులతో అవ్వ... రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒకే కుటుంబానికి చెందిన లక్ష్మీపతి, గాయత్రి, లక్ష్మీపతి తల్లి రెడ్డెమ్మ, వారి చిన్నారులు లావణ్య, శరణ్య కలసి గుడికి వెళ్లి ప్రమాదంలో గాయపడ్డారు. చిన్నారుల తల్లిదండ్రులు ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. కానీ అదృష్టవశాత్తు అవ్వ రెడ్డెమ్మ కు , చిన్నారులు ఇద్దరికి స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనతో నిశ్చేష్టులైన చిన్నారులను అవ్వ రెడ్డెమ్మ ఒడిలో పెట్టుకుని భయకంపితురాలైంది. ఇద్దరు చిన్నారులకు తల్లిదండ్రులు ప్రమాదంలో గాయపడిన సంఘటన తెలియకపోయినా ఏం జరిగిందోనన్న భయంతో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ ఉండడం కనిపించింది. -
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ
సోమల(పుంగనూరు) : సోమల మండల కేంద్రంలో నివాసం ఉన్న చెన్నరాయుడు భార్య రెడ్డెమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును లాకెళ్లిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలు రెడ్డెమ్మ సాయిబాబా గుడి ముందు నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్పై వచ్చి మెడలోని బంగారు గొలుసు లాకెళ్లారు. ఈ సంఘటనతో బాధితురాలు కేకలు వేయడంతో దొంగలు ఇద్దరు డిగ్రీ కళాశాల వైపు వెళ్లినట్లు గమనించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24 గ్రాముల బరువు గల బంగారు గొలుసు విలువ సుమారు రూ.3 లక్షలు అని బాధితురాలు పేర్కొంది. ఈ మేరకు సోమల పోలీసులు కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నారు. 12న వాలీబాల్ పోటీలు చిత్తూరు కలెక్టరేట్ : స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఈనెల 12న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు మైభారత్ జిల్లా యువజన అధికారి ప్రదీప్ తెలిపారు. ఆరోజు స్థానిక మెసానికల్ గ్రౌండ్స్ నందు పోటీలు ఉంటాయన్నారు. యువజన, మహిళలు, స్వచ్ఛంద సంస్థలకు కిట్లను ఇవ్వనున్నామన్నారు. ఈనెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గంగమ్మకు రాహుకాల పూజలు చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు. రాహుకాల సమయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు సంప్రదాయ రీతిలో అర్చనలు , అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, రంగు రంగు పూలతో ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. సారా స్వాధీనం రొంపిచెర్ల : అక్రమంగా తరలిస్తున్న 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ మధుసూధన్ తెలిపారు. శుక్రవారం మోటుమల్లెల గ్రామ పంచాయతీ ఆదినవారిపలె బస్టాప్ వద్ద యువకుడు సంచిలో క్యాన్ పెట్టుకుని ఉండగా అనుమానం వచ్చి తనిఖీ చేయగా సారాగా తేలిందన్నారు. రూ. 1500 విలువ చేసే సారాను స్వాధీనం చేసుకుని నిందితుడు సోమశేఖర్ (33)ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పీలేరు కో ర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్కు ఆదేశించినట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలో ఎక్కడైన సారా తయారు చేసిన ,విక్రయించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లును రహస్యంగా ఉంచుతామన్నారు. -
పాసు పుస్తకాలు పంపిణీ చేస్తాం
గుడిపాల : గ్రామాల్లో గ్రామసభ లు నిర్వహించి జనవరి 9వతేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. శుక్రవారం గుడిపాల మండలంలో వసంతా పురం సచివాలయంలో రైతు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ రీసర్వేతో కొత్తగా పాసు పుస్తకాలు ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అన్ని మండలాలు కలిపి 59,701 మందికి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చాయని, వీటిని 298 గ్రామాలలో పంపిణీ చేస్తామన్నారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శిరీషా, సర్పంచ్ రజినీకాంత్, మాజీ జడ్పీటీసీ బాలాజీనాయుడు పాల్గొన్నారు. -
యూరియాకు పరుగో.. పరుగు !
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : యూరియా పంపిణీలో టోకెన్లు ఓ చోట ఇస్తూ..మరో చోట యూరి యా బ్యాగులను చూపిస్తున్నారు. ఇలా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అది కూడా ముందు వెళ్లే వారికి టోకెన్లు చేతికిస్తున్నారు. వెనకొచ్చేవారికి రేపు రండి అని తరిమేస్తున్నారు. సిఫార్సులుంటే కుర్చీ వేసి టోకెన్లు ఇస్తున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే.. జేడీ ఆఫీసు నుంచి సిఫార్సు అని బహిరంగంగా వెల్లడిస్తున్నారు. సిఫార్సుల వెల్లువ యూరియా పంపిణీలో సిఫార్సులు వెల్లువెత్తాయి. కొందరు టీడీపీ నేతలు యూరియా కోసం పట్టుబడుతున్నారు. తమ వాళ్లకే ఇవ్వాలని ముందుండి టోకెన్లు ఇప్పిస్తున్నారు. సామాన్య రైతులకు తలుపులేసి...అయినా వారికి తలుపులు తెరుస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ..వ్యవసాయశాఖ సిబ్బంది... ఎవరికి టోకెన్లు ఇవ్వడం లేదని, జేడీ ఆఫీసు నుంచి ఫోన్ చేసినా వాళ్లకు మాత్రం టోకెన్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. దీంతో అక్కడున్న రైతులంతా అవాక్కయ్యారు. దీనిపై మండల వ్యవసాయశాఖ అధికారి వేణుగోపాల్ను వివరణ కోరగా...యూరియా పంపిణీలో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఇప్పుడే ఆ సిబ్బందిని కూడా హెచ్చరించారన్నారు. అలాంటివి జరగకుండా అందరికీ యూరియా అందేలా చూస్తామని తెలిపారు. సుదూరంగా పంపిణీ ఏఓ కార్యాలయంలో టోకెన్లు తీసుకున్న వారికి.. చిత్తూరు నగరం గాంధీ రోడ్డులోని జిల్లా సహకార సొసైటీ గోడౌన్లో యూరియా పంపిణీ చేపట్టారు. ఏఓ కార్యాలయం నుంచి గోడౌన్కు రెండు కి.మీ దూరం ఉంది. మండల కార్యాలయంలో టోకెన్లు తీసుకుని రైతులు పరుగు..పరుగున సొసైటీ భవనానికి చేరుకున్నారు. అప్పటికే టోకెన్ల కోసం నీరసించిపోయిన రైతులు..మళ్లీ యూరియా బ్యాగు తీసుకునేందుకు గంటల కొద్ది నిరీక్షించాల్సి వచ్చింది. ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తే ఈ బాధలు తప్పేవని రైతులు ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. టోకెన్లకు పడిగాపులు చిత్తూరు మండలంలో శుక్రవారం యూరియా పంపిణీ చేపట్టారు. ఇందుకు నగరంలోని మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో టోకెన్ల పంపిణీ చేశారు. కొంత మందికి టోకెన్లు ఇచ్చి మరి కొంత మందికి ఇవ్వకుండా చేశారు. జిల్లా సహకార సొసైటీ వద్ద (యూరియా పంపిణీ చేస్తున్న ప్రాంతం) వద్ద రైతులు రద్దీగా ఉన్నారని టోకెన్ల పంపిణీ అర్థంతరంగా ఆపేశారు. దీంతో చాలా మంది రైతు లు మధ్యాహ్నం 2గంటల వరకు కార్యాలయం వద్ద పడిగాపులు పడ్డారు. వేచి ఉన్న వారిని రేపు రమ్మని చెప్పి పంపించేశారు. సిఫార్సులున్న వారిని లోపలికి రమ్మని చెప్పి గుట్టుగా టోకెన్లు ఇచ్చి పంపించారు. ఓ వృద్ధ మహిళా రైతు తలుపు వద్దే నిరీక్షించి తీవ్ర నిరాశతో వెనుదిరిగింది. ఆపై సిఫార్సు ఉండే వారికి మాత్రమే యూరియా ఇవ్వడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. ఇక టోకెన్లు ఇక్కడ ఇస్తూ..రెండు కిలో మీటర్ల దూరంలో యూరియా ఇవ్వడం విడ్డూరంగా ఉందని వారు అసహనం వ్యక్తం చేశారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
మండిపడ్డ కలెక్టర్ గుడిపాల : విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సుమిత్కుమార్ అన్నారు. శుక్రవారం గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఇద్దరు డాక్టర్లు ఉండాల్సిన చోట ఒక్కరూ లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక డాక్టర్ సెలవుపై ఉన్నార ని సిబ్బంది తెలిపారు. మరో డాక్టర్ ఎక్కడికి వెళ్లారని కలెక్టర్ ప్రశ్నించారు. స్టాప్ నర్సులే రోగులను ఎలా చూస్తారన్నారు. ఇలానే కొనసాగితే ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదన్నారు. వచ్చే రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని కలెక్టర్ హెచ్చరించారు. పీహెచ్సీలోని అన్ని విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్ను పరిశీలించి సిబ్బందిపై మండిపడ్డారు. 15 రోజుల తరువాత మరోసారి ఆసుపత్రి విజిట్ చేస్తానని ఇంతలో తీరు మార్చుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఇలానే కొనసాగితే జనవరి నెలకు సంబంధించి జీతాలను నిలిపివేస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ సూర్యనారాయణ, వైద్య సిబ్బంది చంద్రశేఖర్, విజయ్, వెంకటేష్ పాల్గొన్నారు. -
పార్కింగ్ ఫీజుకు బ్రేక్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలోని వాహనాల పార్కింగ్ ఫీజుకు బ్రేకు పడింది. సాక్షి దినపత్రికలో నవంబర్ 25వ తేదీన ధర్మా స్పత్రిలో ఏమిటీ దౌ ర్బాగ్యం అనే పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పందించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన పత్రికలో వచ్చిన కథనాన్ని గుర్తు చేశారు. జనవరి 1 నుంచి పార్కింగ్ ఫీజు ను ఎత్తివేస్తామని ప్రకటించారు. ఈ మేరకు పార్కింగ్ గేటు వసూళ్లకు బ్రేకులు వేశారు. వైద్య శాఖలో ఆ అధికారి బదిలీ ? సాక్షి టాస్క్ఫోర్స్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఓ అధికారిని బదిలీ చేసేందుకు రంగం సిద్ధ మైందనే విమర్శలు వస్తున్నాయి. శాఖలో ఓ అధి కారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బదిలీలు, పోస్టుల భర్తీ, కార్యాలయ నిర్వహణ, పలు కార్యక్రమాల నిర్వహణలో పెద్ద ఎత్తున ఆరోపణలు మూట కట్టుకున్నారు. అనతి కాలంలోనే శాఖలోని 90 శాతం మంది ఆ అధికారికి గిట్టని వాళ్లయ్యారు. కొంత మంది తమ తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఆ అధికారికి వద్ద ఊసరవెల్లులా ఉంటున్నారు. అయితే కార్యాలయంలో చీమ చిటుక్కుమన్నా..టక్కుమని రాష్ట్ర శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగానికి ఉప్పందిస్తున్నారు. దీనికితోడు రాత పూర్వకంగా పలు ఫిర్యాదులు వెళ్లాయి. దీని పై రాష్ట్ర శాఖ, జిల్లా యంత్రాంగం సైతం ఎప్పటి కప్పుడు గోప్యంగా విచారిస్తోంది. ఇటీవల జిల్లా కు వచ్చిన ఓ రాష్ట్ర శాఖ అధికారి సైతం ఆ అధికా రి తీరును పసిగట్టినట్లు తెలుస్తోంది. వస్తున్న ఫిర్యాదులను పలువురితో పంచుకున్నారనే విష యం బయటకొచ్చింది. త్వరలో బదిలీ ఉంటుందని రాష్ట్ర అధికారి చెప్పడంలో కార్యాలయంలో 95శాతం మంది కూల్ అయ్యారు. ఇక కార్యాలయంలో ఎప్పడు లేనంతగా ఫైళ్లు చకచకా కదలడంతో...మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. జిల్లా విభజనలో అధికారికి బదిలీ తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ అధికారి మాత్రం నన్ను బదిలీ చేసే పరిస్థితి లేదని ధీమాతో ఉన్నారు. ఉచిత శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : ఐటీఐ పూర్తి చేసి పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఐటీఐ రెండేళ్ల కోర్సులో 60 శాతం మార్కులు ఉత్తీర్ణత సాధించిన వారు ఈనెల 5 లోగా ఆధార్ , రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, పదో తరగతి జిరాక్స్ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవా లన్నారు. ఈనెల 5 నుంచి ఫిబ్రవరి 4వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నమన్నారు. శిక్షణ కాలంలో ఎటువంటి భత్యం చెల్లించరని సృష్టం చేశారు. -
తోటలో డబ్బుల మూట
– స్వాధీనం చేసుకున్న పోలీసులు? పలమనేరు : పట్టణ సమీపంలోని నాగమంగళం వద్ద ఓ రైతు టమాట తోటలో కూలీలు పొలం పనులు చేస్తుండగా కర్ణాటక పోలీసులు రావడం ఓ వ్యక్తిని తీసుకురావడం ఆయన చెప్పినచోట తోటలో దాచిన మూట నగదును వారు స్వాధీనం చేసుకోవడం నిమిషాల్లో జరిగిపోయింది. దీన్ని చూసిన కూలీలకు ఏమీ అర్థం కాలేదు. ఈ సంఘటన వారం క్రితం జరగ్గా ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. బేరుపల్లికి చెందిన గోవిందురెడ్డి పట్టణ సమీపంలోని ఓ వ్యక్తికి చెందిన భూమిని కౌలుకు తీసుకొని అందులో టమాట, కాకర పంటలను సాగు చేశాడు. ఆ తోటలో గుర్తు తెలియని వ్యక్తి కరెన్సీ కట్టలున్న ఓ సంచిని దాచి వెళ్లిపోయాడు. ఈ విషయం రైతుకు తెలియదు. రోజువారి కూలీలు పొలం పనులు చేస్తుండగా కర్ణాటక పోలీసులు హుటాహుటిన రావడం వాహనంలోంచి ఓ వ్యక్తిని దింపి డబ్బు ఎక్కడ దాచావో చూపించాలని చెప్పడంతో అతను దాచిన స్పాట్ను చూపెట్టాడు. అక్కడ సురక్షితంగా ఉన్న డబ్బు సంచిని పోలీసులు స్వాధీనం చేసుకొని వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న కూలీలు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇంతకీ టమాట తోటలో డబ్బు సంచిని దాచిందెవరు? ఆసొమ్ము ఎవరిది? తోటలోకి ఆ వ్యక్తిని తీసుకొచ్చి సంచిని తీసుకెళ్లింది కర్ణాటక పోలీసులేనా? కాదా అనే విషయాలు ఇక్కడి పోలీసులకు సైతం తెలియకపోవడం కొసమెరుపు. తోటలోని కూలీల ద్వారా వెలుగుచూసిన ఈ విషయం ఇప్పుడు స్థానికంగా హాట్టాపిక్గా మారింది. పలమనేరు సమీపంలో కరెన్సీ కట్టలు దాచిన టమాట తోట ఇదే... -
ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయండి
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పను లు వేగవంతం చేయాలని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం ఎస్ఈ కార్యాలయంలో నిర్మా ణ, ఎంఆర్టీ, డీపీఈ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పల్లెలకు త్రీఫేజ్ సరఫరా ఇవ్వడానికి ఈ పథకం కేంద్ర ప్రభు త్వం ప్రవేశ పెట్టిందన్నారు. దీంతో గ్రామాలకు మెరుగైన సరఫరా ఇవ్వడమే లక్ష్యమన్నారు. జిల్లా లో మార్చి నాటికి 421 ఫీడర్ల పరంగా పనులు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 174 మాత్రమే చేశారన్నారు. మిగిలినవి యుద్ధప్రాతిపాదికన చేయాలని ఆదేశించారు. స్మార్ట్మీటర్ల ఏర్పాటు వాణిజ్య సర్వీసులకు బిగించడం పూర్తి చేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పా టు చేస్తున్నామన్నారు. తదుపరి ప్రభుత్వ ఉద్యోగు ల నివాసాలకు చివరిగా మిగిలిన సర్వీసులకు స్మార్ట్ మీటర్లను పెట్టాలన్నారు. నగరి, కార్వేటినగర వినియోగదారులు చిత్తూరుకు రావడం ఎందుకన్నారు. కార్యక్రమంలో ఈఈలు హరి, భాస్కర్నాయుడు, రవి, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
నాడి పట్టని వైద్యులు
ప్రాథమిక ఆరోగ్యానికి సుస్తీ చేసింది. వైద్యులు నాడి పట్టకలేకపోతున్నారు. ఓపీకి..ఓపిక లేదంటున్నారు. విజిట్ పేరుతో విధులకు డుమ్మాకొడుతున్నారు. స్టాఫ్నర్సులే డాక్టర్ల అవతారమెత్తుతున్నారు. ఓపీ సంఖ్య దారుణంగా పడిపోతోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూగబోతున్నా యి. ఆరోగ్య సేవలపై కలెక్టర్ సీరియస్ అవుతున్నారు. గుడిపాలలో చికిత్స అందిస్తున్న స్టాఫ్నర్సులు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో 50 పీహెచ్సీలు, 15యూపీహెచ్సీలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి రోజువారీగా 50 నుంచి 120 ఓపీలొస్తున్నా యి. ఇక్కడికి వస్తున్న వారిలో ఎక్కువ మంది పేద లే. అందులో అధికంగా వృద్ధులుంటున్నారు. వీరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం అందని ద్రాక్షలా మారింది. చంద్రబాబు సర్కారు వచ్చాక ఆరోగ్య సేవలు ఆమడ దూరమయ్యాయని పేద లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాడితప్పిన సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా గాడితప్పాయి. పర్యవేక్షణ లోపం కారణంగా డాక్టర్లు కనుమరుగవుతున్నారు. చెప్పాపెట్టకుండా డుమ్మాకొట్టేస్తున్నారు. ఉదయం 9 గంటలకు విధులకు హాజరై..ఫేషియల్ అటెండన్స్ పెట్టాలి. కానీ చాలా మంది సమయానికి అటెండన్స్ వేయడం లేదు. సాయంత్రం హాజరు ఊసే కనిపించడం లేదు. డాక్టర్లు విజిట్ పేరుతో తప్పించుకుని తిరుగుతున్నారు. సొంత వైద్యానికి పదును పెడుతున్నారు. విజిట్..వ్యసనంలా..! విజిట్ అనే పదాన్ని పలువురు వైద్యులు వ్యసనంలా మార్చేశారు. మూమెంట్, విజిట్ రిజిస్ట్రర్లను చూపించి...పలువురు వైద్యులు వైద్య సేవలను గాలిలో దీపంలా చేశారు. డాక్టర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విధిగా ఓపీ చూడాలి. కానీ ఆ రకంగా వైద్యులు ఓపీ చూడడంలేదు. ఆ సీట్లో కూర్చొనే ఓపిక లేకుండా పోతోంది. విజిట్ పేరుతో విధులకు స్వస్తి పలుకుతున్నారు. ఏదో ఒక చోట పరిశీలనకు వెళ్లినట్టు నోట్ క్యామ్ ద్వారా ఫొటోలు పెట్టి...సొంత పనులకు పరుగులు పెడుతున్నారు. లేకుంటే డీఎంహెచ్ఓ ఆఫీసులో మీటింగ్ అంటూ విధులను వదిలించుకుంటున్నారు. ఇద్దరు డాక్టర్లుంటే ఓ వైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పట్టించుకోకుండా ..మరో వైపు 104 సేవలను కూడా నీరుగారుస్తున్నారు. స్టాఫ్నర్సులే అన్నీ తామై.. డాక్టర్లు లేని పీహెచ్సీలో స్టాఫ్ నర్సులే డాక్టర్లవుతున్నారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వైద్యులకు వారు వైద్యం చూసి పంపుతున్నారు. జబ్బు అడిగి..మందులు, మాత్రలు ఇవ్వడమే పనిగా పెట్టుకుంటున్నారు. స్టాఫ్ నర్సులే పీహెచ్సీలో అన్ని తామై వ్యవహరిస్తున్నారు. ఒక వేళ డాక్టర్లు ఉన్నా కొన్ని చోట్ల స్టాఫ్ నర్సుల ద్వారా చికిత్స చేయిస్తున్నారు. దీంతో వైద్య సేవలు పూర్తిగా గాడితప్పుతున్నాయి.


