breaking news
Cinema News
-
35 ఏళ్ల తర్వాత తల్లైయిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!
సినీ తారల పెళ్లిళ్లు కాస్త లేట్గానే అవుతుంటాయి. వయసులో ఉన్నప్పుడు కెరీర్పైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. పెళ్లి చేసుకుంటే ఆఫర్లు రావనే భయంతో చాలా మంది హీరోయిన్లు వివాహాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లయిన తర్వాత కూడా సినిమా చాన్స్లు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు హీరోయిన్కి పెళ్లి అయిందంటే.. ఇండస్ట్రీకి దూరం అయినట్లే. మళ్లీ తెరపై కనిపించేవాళ్లు కాదు. అందుకే పెళ్లి కాస్త లేట్గా చేసుకునేవాళ్లు. దీంతో పిల్లలను కూడా లేటు వయసులోనే కనేవాళ్లు. 42 ఏళ్ల వయసులో కత్రినా కైఫ్ ఇప్పుడు గర్భవతి అయింది. కత్రినా మాత్రమే కాదు.. చాలా మంది తారలు 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అమ్మగా ప్రమోషన్ పొందారు. అలా తల్లైయిన తారలపై ఓ లుక్కేద్దాం.కరీనా కపూర్కరీనా కపూర్ 2012లో నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. 36 ఏళ్ల వయసులో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో రెండో బిడ్డకు జన్మనిచ్చింది.బిపాషా బసుబిపాషా బసు 2016లో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత 2022లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అప్పటికీ బిపాషా వయసు 43 ఏళ్లు.ఐశ్వర్యరాయ్38 ఏళ్ల వయసులో ఐశ్వరరాయ్ బచ్చన్ తల్లయింది. 2011లో ఆమె ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పేరు ఆరాధ్య. ఐశ్వర్య-అభిషేక్ల వివాహం 2007లో జరిగింది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఐశ్వర్య అమ్మగా ప్రమోషన్ పొందింది.రాణి ముఖర్జీ2015లో రాణి ముఖర్జీ ఓ బిడ్డకు జన్మన్చింది. అప్పటికే ఆమె వయసు 37 ఏళ్లు. లేటు వయసులో తల్లయ్యారు. 47 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికిగాను ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. -
‘కె-ర్యాంప్’ అంటే బూతు కానేకాదు.. అర్థం చెప్పిన డైరెక్టర్
కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘కె-ర్యాంప్’( K Ramp). ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే బూతు సినిమా అని ట్రోల్ చేశారు. ఇక ట్రైలర్లో కూడా ఒకటి రెండు బూతు పదాలు ఉండడంతో..కె-ర్యాంప్ అంటే కూడా బూతు పదమే అని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టైటిల్పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. కె-ర్యాంప్ అంటే అసభ్యపదం కాదని.. దాని అర్థం కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని అన్నారు. ఆయనను దృష్టిలో పెట్టుకొనే ఈ స్క్రిప్ట్ రాశానని చెప్పారు. తాజాగా చిత్రయూనిట్ నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకుడు జైన్స్ నాని మాట్లాడుతూ.. ‘టైటిల్ చూసి అది బూతు పదం అని అంతా అనుకుంటున్నారు. కానీ మా ఉద్దేశం అది కాదు. కె-ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్. ఈ సినిమాలో హీరో పేరు కుమార్.. అందుకే టైటిల్ అలా పెట్టాం’ అన్నారు.కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) మాట్లాడుతూ.. థియేటర్లో కూర్చుని నవ్వుకునే వైబ్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కన పెడితే నాకు నాని రూపంలో మంచి బ్రదర్ దొరికాడు. లైఫ్లో నానిని ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాను. సెట్కు వెళ్లగానే ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకొని 20 నిమిషాలు నవ్వుకునే వాళ్లం. ఇది రిలీజ్ అయ్యాక ఆడియన్స్ కూడా అలానే నవ్వుతారు’ అన్నారు.ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేశ్ మాట్లాడుతూ.. ‘‘ దర్శకుడు జైన్స్ నాని ఈ కథ చెప్పగానే, రెండే రెండు మాటలు చెప్పా. ‘నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్’ అని చెప్పా. యూత్తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడొచ్చు. ముఖ్యంగా మేనమామ, మేనల్లుడు కలిసి చూడ్సాల్సిన చిత్రమిది’ అన్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: ధర్మ మహేశ్
ధర్మ మహేశ్ (Dharma Mahesh).. హీరోగా చేసింది రెండే రెండు సినిమాలు (సిందూరం, డ్రింకర్ సాయి).. కానీ సినిమా వార్తలకంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. అదనపు కట్నం అడుగుతున్నాడని, వేరే మహిళలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ మహేశ్పై సంచలన ఆరోపణలు చేసింది భార్య, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి. ఈ మేరకు బిగ్బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరి (Rithu Chowdary) అతడి ఫ్లాట్కొచ్చిన వీడియోలు బయటపెట్టింది. మీడియా ముందుకు ధర్మ మహేశ్రీతూ కోసం అతడు గొడవపడ్డ చాటింగ్ స్క్రీన్షాట్స్ కూడా రిలీజ్ చేసింది. మహేశ్తో పాటు అతడి కుటుంబాన్ని సైతం నిందించింది. ఈ వివాదంపై చాలారోజులుగా సైలెంట్గా ఉన్న మహేశ్ ఎట్టకేలకు నోరు విప్పాడు. రీతూ తనకు ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ గౌతమి (Gautami Chowdary) వరుస ఆరోపణలు చేస్తూనే ఉంది. దీంతో ఓపిక నశించిన మహేశ్.. తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. తాను కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే గౌతమి కూడా ఎన్నో తప్పులు చేసిందన్నాడు. తన ఫోన్ నెంబర్ తెలీదుఅతడు ఇంకా మాట్లాడుతూ.. గౌతమి ఫోన్లోని సెకండ్ నెంబర్ ఏంటో కూడా నాకు తెలీదు. అడిగితే.. నీ ప్రైవసీ నీది, నా ప్రైవసీ నాది అంటుంది. మొగుడ్ని.. నాకే నెంబర్ చెప్పదు. రాత్రి వేరే ఎవడి కారులోనో బర్త్డే పార్టీకి వెళ్లొస్తుంది. బాగా తాగి నా ఫోటోను కూడా కాల్చేసింది. ఇవన్నీ నేనెలా తట్టుకోవాలి. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందు గుంటూరులో ఒకే గదిలో కలిసున్నాం. ఆ సమయంలో అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు నాకింకా 19 ఏళ్లే!పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీఅయినా సరే నేను నిలబడతాను, ప్రెగ్నెన్సీ ఉంచుకోమన్నాను. కానీ తను ఒప్పుకోలేదు. పరువు పోతుందని అబార్షన్ చేయించుకుంది. వేలెత్తి నన్ను చూపించేముందు నిన్ను నువ్వు చూసుకో అంటున్నా.. నీకూ, నాకు పెద్ద తేడా ఏం లేదు. మే నెలవరకు కలిసుందామనే ప్రయత్నించాను. నేను గౌతమితో తప్ప ఎవరితోనూ ఎమోషనల్గా కనెక్ట్ అవలేదు. నా కొడుకును చూపించమంటే లెక్కచేయడం లేదు. మే తర్వాత నుంచి నా కొడుకును ఇంతవరకు చూపించలేదు. నేను డబ్బు గురించి అడిగానంటే చెప్పుతో కొట్టండి. నాకు డ్రగ్స్ అలవాటు లేదు. కావాలంటే రక్తపరీక్షలు చేయండి.ఈ ఇంటర్వ్యూలో నేను అబద్ధం చెప్తే కుక్కచావు చస్తాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ధర్మ మహేశ్.చదవండి: నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త -
ఓజీలో పవన్ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ (They Call Him OG Movie). ఇందులో పవన్.. గ్యాంగ్స్టర్గానే కాకుండా తండ్రి పాత్రలోనూ యాక్ట్ చేశారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. సినిమాలో పవన్- ప్రియాంకల కూతురిగా సాయేషా అనే పాప యాక్ట్ చేసింది. వెండితెరపై ఆమె నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం!ఇదే ఫస్ట్ మూవీ!ముంబైకి చెందిన సాయేషా ఇప్పటివరకు అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించింది. సంతూర్, లెన్స్కార్ట్, ఫస్ట్క్రై వంటి బ్రాండ్స్తో పాటు రియల్ ఎస్టేట్ యాడ్స్లోనూ యాక్ట్ చేసింది. మృణాల్ ఠాకూర్తోనూ ఓ రియల్ ఎస్టేట్ యాడ్లో నటించింది. ఇప్పుడీ చిన్నారి సినిమాల వైపు అడుగులు వేస్తోంది. లాగౌట్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. కానీ ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఓజీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది. అందరికీ థాంక్స్ఈ పాపను చూసిన వారంతా తనకు మంచి భవిష్యత్తు ఉందని మెచ్చుకుంటున్నారు. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్తో దిగిన ఫోటోలను సాయేషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్ ప్రియాంకతో ఆటలు ఆడుకోవడం మిస్ అవుతానంది. తనకు చాక్లెట్లు ఇచ్చిన అర్జున్దాస్కు కృతజ్ఞతలు చెప్పింది. ప్రకాశ్ రాజ్తో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజిత్కు, అలాగే పవన్ సహా ఓజీ టీమ్కు థాంక్స్ చెప్పింది. View this post on Instagram A post shared by Sayesha Shah (@sayesha0307) చదవండి: ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు -
చార్మినార్లో అనన్యా పాండే సందడి.. వీడియో వైరల్
స్టార్ట్ కెమెరా... టేక్ అన్నారు డైరెక్టర్ వివేక్ సోని. అంతే... హీరో లక్ష్య బైక్ స్టార్ట్ చేశారు... వెనకాల హీరోయిన్ అనన్యా పాండే కూర్చుకున్నారు. రయ్మంటూ బైక్ ముందుకు సాగింది. సీన్ పూర్తయింది. షాట్ ఓకే అన్నారు వివేక్. ఈ షూటింగ్ జరిగింది ఎక్కడంటే హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర. ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో లక్ష్య, అనన్య కలర్ఫుల్గా కనిపించారు. అక్కడి జనాలు వీరిని గుర్తు పట్టి, చుట్టుముట్టారు. సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. లక్ష్య, అనన్యా పాండే జంటగా నటిస్తున్న కాలేజ్ రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’ కోసమే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఈ ఇద్దరూ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం షూటింగ్ని వారం రోజుల పాటు హైదరాబాద్లో ప్లాన్ చేశారు. చార్మినార్ తర్వాత మరో పాపులర్ ప్లేస్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by mainly_hyderbadi ❤️📌 (@mainly_hyderabadi) -
ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు
తల్లయ్యాక తనకంటూ కొన్ని హద్దులు గీసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone). రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేనని కరాఖండిగా చెప్తోంది! భారీ బడ్జెట్ సినిమాలకు ఇలాంటి కండీషన్లు పెడితే కష్టమని కల్కి 2 నుంచి ఆమెను తప్పించేశారు. దానికంటే ముందు స్పిరిట్ నుంచి కూడా దీపికా సైడ్ అయిపోయింది. దీంతో అసలు 8 గంటల షిఫ్ట్ తప్పా? ఒప్పా? అని ఎవరికి వారు చర్చల్లో మునిగిపోయారు.8 గంటలే దీపిక పనిఅయితే ఈ విషయంపై దీపికాపై ఫన్నీ సెటైర్లు వేసింది బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan). తన చెఫ్ దిలీప్తో కలిసి ముంబైలో నటుడు రోహిత్ సరఫ్ ఇంటికి వెళ్లింది ఫరా. ఈ మేరకు ఓ యూట్యూబ్ వ్లాగ్ చేసింది. అందులో మొదటిసారి రోహిత్ సరఫ్ తల్లిని చూపించింది. నా సినిమా కోసం దీపికను ఒప్పించడానికి కూడా ఇంత సమయం పట్టలేదేమో! అంటూ రోహిత్ తల్లిని హత్తుకుంది. ఇంతలో ఫరా చెఫ్ దిలీప్.. దీపిక పదుకొణె మేడమ్ మన షోకి ఎప్పుడొస్తారు? అని అడిగాడు. అందుకామె.. దీపిక ఇప్పుడు రోజులో 8 గంటలు మాత్రమే పని చేస్తుంది. మన షోకి వచ్చేంత తీరిక తనకెక్కడిది? అంది. సినిమాఫరాఖాన్ దర్శకత్వంలోనే దీపిక బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. వీరి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఓం శాంతి ఓం. ఇందులో షారూఖ్ హీరోగా నటించాడు. ఫరా, దీపికా, షారూఖ్.. ముగ్గురూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్ (2014) అనే మరో సినిమా చేశారు. ఆమధ్య 'కల్కి' మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె.. చివరగా ఫైటర్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం షారూఖ్ ఖాన్తో కలిసి 'కింగ్' మూవీ చేస్తోంది. అలాగే అట్లీ-అల్లు అర్జున్ సినిమాలోనూ భాగమైంది. ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ అనే హాలీవుడ్ సినిమా సీక్వెల్లోనూ భాగమైనట్లు ప్రచారం జరుగుతోంది.చదవండి: నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త -
నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త
బతికున్నప్పుడు ఆమె చేయి వదల్లేదు, చనిపోయాక తన జ్ఞాపకాలను, గుర్తులను వదలడం లేదు. ఆమె జీవించినప్పుడే కాదు మరణం తర్వాత కూడా తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. 'కాంటా లగా' సాంగ్ ఫేమ్, బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా (Shefali Jariwala) మరణించి మూడు నెలలు కావస్తున్నా ఆమెను క్షణమైనా మర్చిపోలేకున్నాడు భర్త, నటుడు పరాగ్ త్యాగి (Parag Tyagi). అందుకే అణువణువునా ఉన్న ప్రేమను పచ్చబొట్టు రూపంలో హృదయంపై ఆమె ముఖచిత్రాన్ని పదిలంగా పరుచుకున్నాడు. భార్య దిండుపైనే నిద్రతాజాగా 'షెఫాలీ పరాగ్ త్యాగి' అంటూ ఓ పాడ్కాస్ట్ చానల్ను ప్రారంభించాడు. ఇందులో మొదట తన సెల్ఫ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. పరాగ్ మాట్లాడుతూ.. షెఫాలీ బ్రష్తోనే నా పళ్లు తోముకుంటున్నాను. తన దిండుపైనే నిద్రిస్తున్నాను. తన టీషర్ట్స్, షార్ట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. వాటినెప్పుడూ నాపక్కనే పెట్టుకుంటున్నాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తను ఆర్డర్ చేసిన వస్తువులు ఇప్పటికీ డెలివరీ అవుతూనే ఉన్నాయి. ఆమె విడిచిన బట్టల్ని ఇంతవరకు ఉతకలేదు. అవి మరీ చిన్నగా ఉండటం వల్ల ధరించలేకపోతున్నాను. కానీ, వాటిని కప్పుకునే ప్రతిరోజు నిద్రిస్తున్నాను.సీపీఆర్ చేశా..షెఫాలీ చివరిరోజు మా సింబా(పెంపుడు శునకం)ను వాకింగ్కు తీసుకెళ్లమని నాకు చెప్పింది. బయటకు వెళ్లి వచ్చేలోపు అపస్మారక స్థితిలో పడి ఉంది. సీపీఆర్ కూడా చేశాను. రెండుసార్లు శ్వాస తీసుకుంది. ఆ వెంటనే కన్నుమూసింది అని చెప్పుకొచ్చాడు. యాంటీఏజింగ్ డ్రగ్స్ వల్లే షెఫాలీ మరణించిందన్న వార్తలను పరాగ్ కొట్టిపారేశాడు. తనెప్పుడూ డ్రగ్స్ వాడలేదని క్లారిటీ ఇచ్చాడు. కేవలం మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ తీసుకునేదని తెలిపాడు.చదవండి: మిడ్నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు! నేరుగా సీక్రెట్రూమ్కు -
అలాంటి సినిమా చేయాలనుంది.. కోరిక బయటపెట్టిన అదితి శంకర్
సినిమా రంగుల ప్రపంచం.. ఆశల పల్లకి. ఇందులో గొప్పగా రాణించాలన్న ఆశ నటీనటులకు ఉంటుంది. అందుకోసం ఉన్నత ఉద్యోగాలను, వృత్తిని పక్కనపెట్టినవారున్నారు. హీరోయిన్ అదితి శంకర్ (Aditi Shankar) కూడా అదే కోవకి చెందుతుంది. స్టార్ దర్శకుడు శంకర్ కూతురే అదితి. ఈమె వైద్య విద్యలో పట్టభద్రురాలు. అయినప్పటికీ సినిమాపై ఆసక్తితో కథానాయికగా రంగప్రవేశం చేసింది. విరుమాన్ చిత్రంతో సినిమా కెరీర్ మొదలుపెట్టింది. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ తరువాత మావీరన్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్లో బోర్లాపడ్డ బ్యూటీఈమె నటించిన మూడో చిత్రం నేశిప్పాయా పూర్తిగా నిరాశపరచింది. నాలుగో చిత్రం భైరవంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే భైరవం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అలా 2022లో హీరోయిన్గా పరిచయమైన అదితి శంకర్ ఈ నాలుగేళ్లలో చేసిన నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఐదో చిత్రం ఒన్స్ మోర్ నిర్మాణంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది.మోడ్రన్ లుక్లో..అదితి శంకర్ లంగా ఓణీ ధరిస్తే పక్కింటి అమ్మాయిలా, మోడ్రన్ దుస్తులు ధరిస్తే ఈ తరం అమ్మాయిలా కనిపిస్తుంది. ఈ అమ్మడు ఇప్పటి వరకూ పూర్తిగా మోడ్రన్ యువతి పాత్రల్లో నటించలేదనే చెప్పాలి. అయితే అలాంటి పాత్రలో నటించాలన్న ఆశ ఉందనే అభిప్రాయాన్ని తాజాగా అదితి వ్యక్తం చేసింది. ఒక సమావేశంలో అదితి శంకర్ మాట్లాడుతూ.. తండ్రిని చూసి చిన్నతనంలోనే నటినవ్వాలన్న కోరిక బలంగా కలిగిందని తెలిపింది.అలాంటి సినిమా చేయాలనుందితన ఆశను త్రండి శంకర్కు చెప్పగా ముందు చదువు పూర్తి చేయమని చెప్పారంది. దీంతో తనకు ఇష్టమైన వైద్య విద్యను ఎంపిక చేసుకుని దాన్ని కంప్లీట్ చేశానంది. ఆ తరువాత తనకు నచ్చిన సినిమా రంగంలోకి అడుగు పెట్టానని, నటిగా సక్సెస్ కాకపోతే తిరిగి వైద్య వృత్తిని చేపడతానని నాన్నకు చెప్పానని పేర్కొంది. ఇప్పుడు నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపింది. తనకు ఒక చారిత్రక కథా చిత్రంలో నటించాలన్నది ఆశ అని, అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial)చదవండి: నా కుమార్తెకు అనుమతి లేదు.. అందుకే ఆ నెక్లెస్ ధరించా: రాణీ -
హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ కి మరోసారి షాక్!
తెలంగాణలో హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రాకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టికెట్ల పెంపుకు అంగీకరించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 24న ఓజీ మూవీ టికెట్ ధరల పెంపు మొమోని హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేసిని సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి.‘ఓజీ’ యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రివ్యూ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.కాగా, తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ల పెంపుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న రాత్రి వేసిన ప్రీమియర్ టికెట్ ధరను రూ. 800గా నిర్ణయించారు. అక్టోబరు 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వాటిని తగ్గించాల్సి ఉంటుంది. -
వెండితెరపై గోట్స్ ఫైట్..‘మడ్డీ’ డైరెక్టర్ మరో ప్రయోగం!
భారతీయ సినిమాలో తొలిసారిగా మట్టి రేసింగ్ నేపథ్యంలో రూపోందిన మడ్డీ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అదే విజయోత్సాహంతో మరింత ఆసక్తికరమైన కథాంశంతో, ప్రేక్షకులకు థ్రిల్ ను పంచడానికి డా. ప్రగభల్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జాకీ. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయింది.వినుత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోట్స్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ముఖ్యంగా మదురైలో సాంప్రదాయంగా కొనసాగుతున్న ఈ గోట్ ఫైట్ చుట్టు అల్లుకున్న కథ అని తెలుస్తుంది. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థం అవుతుంది. రియల్ లోకేషన్స్ లో చిత్రీకరించడమే కాకుండా 2022 నుంచి అక్కడి సాంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి అదే ప్రాంతంలో ఉన్నట్లు డైరెక్టర్ తెలిపారు.సహజసిద్దంగా చిత్రీకరించేందుకు అక్కడి ప్రజలతో మమేకమై, ప్రతీది తెలుసుకొని జాగ్రత్తగా షూట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాదు సినిమా కావాల్సిన ప్రతీ అంశాన్ని జోడించి ఎంతో గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ను సెట్ చేసినట్లు పేర్కొన్నారు. అందుకోసం నటీనటులు గోట్స్ సంరక్షకులతో కొద్దిరోజులు సవాసం చేసి, వారితో, గోట్స్ తో అనుబంధం పెంచుకున్నట్లు మేకర్స్ తెలిపారు. నటీనటులు అద్భుతమైన ప్రదర్శనతో ఆద్యాంతం కట్టిపడేస్తారని, ఫైట్ సన్నివేశాలకోసం శారీరంగా, మానసికంగా రెడీ అయ్యారని అందుకే ప్రతీ సన్నివేశం అద్భుతంగా వచ్చిందని మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా గోట్ సంరక్షకుల భావోద్వేగాలు కట్టిపడేస్తాయని, అలాగే మదురైలో ఉన్న ఈ సంస్కృతి ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధంచి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు. -
8 ఏళ్లు పేదరికంలోనే ఉన్నాం.. నిజంగా ఇడ్లీ తినేందుకు డబ్బుల్లేవ్!
కుబేరతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ (Dhanush) ఇడ్లీ కొట్టు మూవీ (Idly Kadai Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ధనుష్ స్వీయదర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇటీవల సినిమా ఆడియా లాంచ్ ఈవెంట్లో ధనుష్ తన బాల్యం గురించి చెప్తూ ఎమోషనలయ్యాడు. చిన్నప్పుడు రోజూ ఇడ్లీ తినాలనుండేదని, కానీ తన దగ్గర అంత డబ్బుండేది కాదన్నాడు. ట్రోలింగ్పై స్పందించిన ధనుష్ఏదైనా చిన్నపనికి వెళ్లి, ఆ డబ్బుతో ఇడ్లీ కొనుక్కుని తినేవాడినని గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ కామెంట్స్పై నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ధనుష్ తండ్రి కూడా ఒక దర్శకుడేనని, అలాంటి వ్యక్తి పేదరికంలో ఎందుకుంటాడని, అంతా కట్టుకథ అని విమర్శించారు. ఈ వివాదంపై మధురైలో జరిగిన ఇడ్లీ కొట్టు ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్ స్పందించాడు. నా స్పీచ్ మీరు పూర్తిగా విన్నారా? 1983లో నేను పుట్టాను. 1991లో మా నాన్న దర్శకుడయ్యాడు. ఆ ఎనిమిదేళ్లపాటు మేము కష్టపడుతూనే ఉన్నాం. 1995 తర్వాతే మా కుటుంబ పరిస్థితి మెరుగుపడింది. మేము నలుగురం సంతానం కాబట్టి బయట తినడానికి డబ్బు అడిగినప్పుడు ఇచ్చేవాళ్లు కాదు! అందుకే ఏదైనా పని చేసి కొనుక్కునేవాడిని.అన్న దొంగచిన్నప్పుడు నేను అల్లరి ఎక్కువ చేసేవాడిని. మా అన్న సెల్వరాఘవన్ నన్ను మించిపోయేవాడు. నేను 20 పైసలు, చారానా.. ఇలా కాయిన్లు దాచుకునేవాడిని. అవి నాలుగైదు రూపాయలవగానే మా అన్న వాటిని దొంగిలించేవాడు. క్రికెట్ ఆడేటప్పుడు కూడా మూడున్నరగంటలవరకు ఔట్ అవకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉండేవాడు. నేను బౌలింగ్ చేసేవాడిని. నా వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాడిని. కానీ ఎప్పుడైతే అతడు ఔటయి నేను బ్యాట్ పట్టుకుంటానో.. వెంటనే బౌలింగ్ చేయకుండా అక్కడినుంచి పారిపోయేవాడు. అలా నన్ను చీటింగ్ చేసేవాడు అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.బయోపిక్ కాదుఅలాగే ఇదో ప్రముఖ చెఫ్ బయోపిక్ అంటూ వస్తున్న రూమర్లను కొట్టిపారేశాడు. ఇది ఎవరి బయోపిక్ కాదని, తన బాల్యంలో ఎదురైన సంఘటనలు, అనుభవాలు, తన ఊహలను కలగలిపి ఈ సినిమా తీసినట్లు పేర్కొన్నాడు. ఇడ్లీ కొట్టు సినిమా విషయానికి వస్తే ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అరుణ్ విజయ్, రాజ్కిరణ్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.చదవండి: చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్ -
అధికార మదం తలకెక్కింది.. బాలయ్యపై మెగా అభిమానులు ఆగ్రహం
బాలకృష్ణపై చిరంజీవి అభిమాన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ‘బాలకృష్ణ గతంలో కూడా అనేకసార్లు అమమానకరంగా మాట్లాడడం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి వాటిపై ఎప్పుడు స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన సంయమనం పాటించాం. బాలకృష్ణ కుటుంబం అధికారంలోకి రావడానికి మెగా ఫ్యామిలీ అహర్నిశలూ కృషి చేసిది. ఆ విజ్ఞత మరిచి, అధికార మదంలో బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. చట్టసభల్లో సైతం చిరంజీవి ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడేందుకు తెగించారు. ఈ వ్యాఖ్యలు మా దైవం చిరంజీవి గారిని సైతం బాధించాయని ఆయన ప్రతిస్పందన ద్వారా అర్ధమవుతోంది.మెగా కుటుంబం అండగా నిలవకపోయుంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని విన్నవిస్తున్నాం.చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. లేని యెడల బాలకృష్ణ ప్రజాక్షేత్రం తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం’ అని అఖిల భారత చిరంజీవి యువత పేర్కొంది.కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవిని ఏకవచనంతో సంబోధిస్తూ ‘ఎవడు’ అంటూ మాట్లాడాడరు. శాసనసభలో గురువారం శాంతిభద్రతల అంశంపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడిన విషయాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవిని అవమానించారని, ఆయన్ను కలవడానికి వెళితే కలవకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారని శ్రీనివాస్ చెప్పారు. దీనిపై జోక్యం చేసుకున్న బాలకృష్ణ.. కామినేని శ్రీనివాస్ చెప్పినదంతా అబద్ధమని కొట్టిపడేశారు. చిరంజీవి గట్టిగా అడిగితే సీఎం వచ్చాడనేది అబద్ధమని, అక్కడ గట్టిగా ఎవడూ అడగలేదని బాలకృష్ణ అన్నారు. గట్టిగా అడిగితేనే ఆయన కలవడానికి వచ్చాడని, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారనేది అసత్యమని, ఆయన గట్టిగా చెబితే దిగొచ్చాడంట.. అని వ్యంగ్యంగా అన్నారు. ‘గట్టిగా అడిగారా.. ఎవడు అడిగాడు గట్టిగా, అడిగితే వచ్చాడా వీడు కలవడానికి. నాన్సెన్స్’ అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. -
చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్
అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ! ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది బిగ్బాస్ బ్యూటీ, నటి వితికా షెరు (Vithika Sheru). చెల్లి కృతికను చంటిపాపలా చూసుకుంటుంది. తన పెళ్లి కూడా వితిక చేతుల మీదుగానే జరిగింది. 2022లో కృతిక- కృష్ణల వివాహం ఎంతో ఆడంబరంగా, కన్నులపండగ్గా జరిగింది. రెండు రోజుల క్రితం కృతిక.. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.చెల్లెలికి సర్ప్రైజ్వితికాకు అసలే సర్ప్రైజ్లంటే చాలా ఇష్టం. తన భర్తను, ఫ్రెండ్స్ను ఎప్పుడూ ఏదో ఒకరంగా సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఈసారి చెల్లెలికి ఊహించని కానుకనిచ్చింది. అదే ఆమె సీమంతం. ఒక గదిని అందంగా డెకరేట్ చేసి చెల్లెలి సీమంతం జరిపింది. ఫ్రెండ్స్, కజిన్స్ సమక్షంలో సర్ప్రైజ్ సీమంతం జరుపుకోవడంతో కృతిక మనసు సంతోషంతో నిండిపోయింది. పెద్దమ్మ గిఫ్ట్వీళ్లంతా కలిసి చిన్నపాటి బేబీ డ్రెస్పై బొమ్మలు పెయింట్ వేశారు. వితిక అయితే అక్షరాభ్యాసానికి రెడీగా టీషర్ట్పై తెలుగు అక్షరాలను గీసింది. అందులో పెద్దమ్మ అనే అక్షరాలను పొందుపరిచి వాటిని అండర్లైన్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను వితికా అభిమానులతో పంచుకుంది. అది చూసిన అభిమానులు.. మీ ఓపికను మెచ్చుకుని తీరాల్సిందే! అవతలివారి సంతోషంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటారు, గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru)చదవండి: ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి తల్లి కన్నుమూత -
ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి తల్లి కన్నుమూత
ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి (Y. V. S. Chowdary) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి యలమంచలి రత్నకుమారి (88) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లితో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఏ లోటూ రాకుండా పెంచిందిమా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’గారు ఒక స్త్రీశక్తి. లారీడ్రైవర్ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యం అందించేది. అంతేకాదు, సినిమాలు చూపించడం దగ్గరి నుంచి దేవాలయ దర్శనాలు, సీజనల్ పిండివంటలు, నిల్వ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. ఎటువంటి లోటు రాకుండా.. తన నోటి మీది లెక్కలతోనే బడ్జెట్ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మగారు.మాలో స్ఫూర్తి నింపిందివీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు.. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన విధానాలతో మాలో కూడా స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మగారు. సినిమాఅటువంటి మా అమ్మగారు (88 యేళ్ళు) 25వ సెప్టెంబరు 2025, రాత్రి 8.31 గంటలకు.. ఈ భువి నుంచి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. వైవీఎస్ చౌదరి విషయానికి వస్తే.. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడిగా మారారు. సీతారామరాజు, యువరాజు సినిమాలు చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, రేయ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. View this post on Instagram A post shared by Yvs Chowdarry (@i_am_yvs) -
ఓం నమః శివాయ.. జటాధర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
సుధీర్బాబు హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’ (Jatadhara Movie). ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులు. సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్గురువారం ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధర’ను విడుదల చేశారు. ఈ ట్రాక్లో ‘ఓం నమః శివాయ’ అంటూ వినిపిస్తుంది. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి పాడారు. ‘‘మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి–విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ‘జటాధర’ చిత్రం చూపించబోతోంది. పౌరాణిక ఇతివృత్తాలు, సూపర్ విజువల్స్తో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీ మ్యూజిక్ కో. చదవండి: జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 తెలుగు ట్రైలర్ -
ఫ్రైడే ధమాకా: ఒక్కరోజే ఓటీటీలో 22 సినిమాలు
ఈ ఫ్రైడే ఓటీటీలో కిక్కిచ్చే సినిమాలు రిలీజవుతున్నాయి. యాక్షన్, హారర్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్.. ఇలా అన్నిరకాల చిత్రాలు ఓటీటీప్రియులను అలరించేందుకు రెడీ అయ్యాయి. వాటిలో ఘాటి, హృదయం పూర్వం, సుమతి వళవు చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి రేపు (సెప్టెంబర్ 26) ఒక్కరోజే ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..జియోహాట్స్టార్👉 హృదయపూర్వం (మలయాళ మూవీ)అమెజాన్ ప్రైమ్👉 ఘాటి (తెలుగు మూవీ)👉 మాదేవా (కన్నడ మూవీ)నెట్ఫ్లిక్స్👉 ధడక్ 2 (హిందీ మూవీ)👉 సనాఫ్ సర్దార్ (హిందీ మూవీ)👉 ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (మలయాళ మూవీ)👉 ది గెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) 👉 అలైస్ (ఇంగ్లీష్ సిరీస్)👉 హౌస్ ఆఫ్ గిన్నీస్ (ఇంగ్లీష్ సిరీస్)👉 మాంటిస్ (దక్షిణ కొరియన్ సినిమా)👉 ఫ్రెంచ్ లవర్ (ఇంగ్లీష్ మూవీ)👉 రుత్ అండ్ బోజ్ (ఇంగ్లీష్ మూవీ)👉 క్రైమ్సీన్ జీరో (కొరియన్ వెబ్సిరీస్ - కొత్త ఎపిసోడ్)జీ5👉 జనావర్: ద బీస్ట్ వితిన్ (హిందీ సిరీస్)👉 సుమతి వళవు (మలయాళ సినిమా)సన్ నెక్స్ట్👉 మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు మూవీ)👉 దూరతీర యానా (కన్నడ మూవీ)ఆపిల్ ప్లస్ టీవీ👉 ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ)👉 ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్)లయన్స్ గేట్ ప్లే👉 డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా)మనోరమ మ్యాక్స్👉 సర్కీత్ (మలయాళ మూవీ)హుళు👉 ద మ్యాన్ ఇన్ మై బేస్మెంట్ (ఇంగ్లీష్ మూవీ)చదవండి: OG మూవీలో హీరోయిన్కు అన్యాయం -
‘ఓజీ’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను మాత్రం ఈ సినిమా అందుకోలేపోయింది. సాంకేతికంగా సినిమా బాగున్నా.. కథ-కథనం అంతగా ఆకట్టుకోలేకపోయిందని పలు రివ్యూస్ చెబుతున్నాయి. (‘ఓజీ’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఎలివేషన్పైనే ఎక్కువ దృష్టిపెట్టి.. కథనాన్ని గాలికొదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి రిలీజ్ ముందు ఉన్నంత అయితే హైప్ ఇప్పుడు లేదు. మరి ఈ ప్రభావం కలెక్షన్స్పై ఉంటుందో లేదో వీకెండ్లో తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాకు టికెట్ రేట్లు అధికంగా పెంచడంతో సాధారణ సినీ ప్రేక్షకులు థియేటర్స్కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నాలుగు రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అని చాలా మంది అనుకుంటున్నారు. నెట్టింట కూడా ఓజీ ఓటీటీ రిలీజ్పై ఆరా తీస్తున్నారు. ఏ ఓటీటీలో వస్తుంది.. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది.. తదితర విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఆ ఓటీటీలోనే.. ఓజీ డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 80 కోట్లకు వరకు చెల్లించినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట. ఈ ఒప్పందంతోనే నెట్ఫ్లిక్స్ అంత డబ్బు పెట్టి ఓటీటీ రైట్స్ తీసుకుందట. ఈ లెక్కన అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. -
OG మూవీలో హీరోయిన్కు అన్యాయం
టాలీవుడ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty)కి అన్యాయం జరిగింది. కథానాయికగా తన సినిమాలేవో తను చేసుకుంటున్న ఈ బ్యూటీకి ఐటం సాంగ్ ఆఫర్ వచ్చింది. అదీ ఓజీ మూవీ (They Call Him OG Movie)లో! హీరోయిన్గా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకపోయినా సరే.. పవన్ కల్యాణ్ కోసం తొలిసారి స్పెషల్ సాంగ్కి ఓకే చెప్పింది. అలా థాయ్లాండ్లో ఈ పాటను చిత్రీకరించారు. సర్ప్రైజ్ ఉంటుందన్న బ్యూటీఈ సాంగ్లో పవన్తో కలిసి స్టెప్పులేసిందీ బ్యూటీ! ఈ విషయాన్ని తనే పరోక్షంగా బయటపెట్టింది. ఇటీవల ఓ ఈవెంట్కు వెళ్లినప్పుడు తన నెక్స్ట్ సినిమాల గురించి ప్రస్తావన వచ్చింది. నా సినిమాల గురించి తర్వాత ప్రకటిస్తాను. ఇప్పుడైతే నవంబర్లో ఓజీ మూవీ వస్తుంది కదా.. అందులో ఒక సర్ప్రైజ్ ఉంది. అది చూసి మీరందరూ సంతోషిస్తారనుకుంటున్నాను అంది. కట్ చేస్తే ఓజీ మూవీలో ఆ స్పెషల్ సాంగ్నే తీసేశారు. అది చూసి నేహా అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఎడిటింగ్లో తీసేశారా?ఎడిటింగ్లో నేహా శెట్టినే లేపేయడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి యూట్యూబ్లో అయినా ఆ స్పెషల్ సాంగ్ ఉంటుందేమో చూడాలి! ఓజీ విషయానికి వస్తే.. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్). పవన్ కల్యాణ్ హీరోగా నటించగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఇమ్రాన్ హష్మీ విలన్గా యాక్ట్ చేశాడు. ఓజీ రిలీజ్శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ నేడు (సెప్టెంబర్ 25న) ప్రేక్షకుల ముందుకు రాగా మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. నేహా శెట్టి విషయానికి వస్తే.. డీజే టిల్లు మూవీలో రాధికగా విపరీతమైన క్రేజ్ అందుకుంది. టిల్లు స్క్వేర్లోనూ అతిథి పాత్రలో తళుక్కుమని మెరిసింది. రూల్స్ రంజన్, బెదురులంక 2012, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేసింది. ఈ ఏడాది ఏ సినిమాలోనూ కనిపించలేదు.చదవండి: They Call Him OG Review: ‘ఓజీ’ మూవీ రివ్యూ -
రష్మికకు కొత్త సవాల్.. పోరాడాల్సిందే!
జర్మనీలో జన్మించిన వియత్నామీస్ మూలాలున్న యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ న్గుయెన్(Andy Long Nguyen), ఆయన కుంగ్ ఫూ వారియర్ (2017) యాక్సిడెంట్ మ్యాన్: హిట్మ్యాన్ హాలిడే (2022) వంటి హాలీవుడ్ చిత్రాల నుంచి శివాయ్ (2016), సనక్ (2021) వంటి బాలీవుడ్ చిత్రాల దాకా పనిచేశాడు. ఇటీవల తెలుగు పౌరాణిక సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 ఎడి కి పని చేయడం ద్వారా స్టంట్స్ కొరియోగ్రఫీలో అంతర్జాతీయ కెరీర్ను అందుకున్న టాప్ యాక్షన్ డైరెక్టర్గా నిలిచారు.ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు.‘‘జర్మనీ లో డబ్ చేయబడిన భారతీయ చిత్రాలను చూస్తున్న టీనేజర్గా, అమితాబ్ బచ్చన్ను డైరెక్ట్ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన వయస్సు గురించి తొలుత నాకు ఆందోళన ఉండేది అయితే షూటింగ్ సమయంలో ఆయన తన వయస్సులో సగం మంది కంటే చురుకుగా కదిలారు’’ అంటూ ఆయన చెప్పాడు. ‘‘ దేవుళ్ళు, అమరులు, దిగ్గజాలు, రోబోలు అంతరిక్ష నౌకలతో నా మొదటి పౌరాణిక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం అది. సవాలుగాగానూ, అద్భుతంగా కూడా ఉంది, ’’అని ఆయన గుర్తుచేసుకున్నాడు. నాగ్ అశ్విన్ తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ ‘స్టోరీబోర్డులు లేదా రిఫరెన్స్లపై ఆధారపడకుండా నాగ్ తన టీమ్ని నడిపించే విధానం సూపర్. తక్కువ సూచనలతోనే అందరి దృష్టి తన వైపు మళ్ళించగలిగాడు. అది చాలా ఆకట్టుకుంది.’’ అని చెప్పాడు ఆండీ.తెలుగు సినిమాలో లాంగ్ తదుపరి అతి పెద్ద ప్రాజెక్ట్ మైసా( Mysaa), ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna) నటిస్తోంది. అది కూడా తొలిసారిగా ఆమె ఒక యాక్షన్ క్వీన్గా మారనుంది. ఈ విషయంపై ఆండీ మాట్లాడుతూ ‘‘రష్మికతో అంతకు ముందుగానే పనిచేయాల్సి ఉండింది. ఆమెతో పనిచేయడం పట్ల నేను సంతోషంగా అంతకు మించి ఆసక్తిగా ఉన్నాను. రష్మిక చాలా చురుకైన యువతి.. అయితే నేను డైరెక్ట్ చేయబోయే పాత్ర కోసం తనను తాను మరింత సాన బెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కఠినమైన శారీరక స్టంట్ శిక్షణ పొందవలసి ఉంటుంది, ఇది ఆమెకు పూర్తిగా కొత్త అనుభవం సరికొత్త సవాల్ కూడా ’’అని అంటున్నాడాయన.ఆండీకి, ఫైట్ కొరియోగ్రఫీ అంటే శారీరక కదలికలు గురించి మాత్రమే కాదు – ఇది కథ చెప్పడం కూడా. ‘కథకు ఉపయోగపడే విధంగా పాత్రను మరొక స్థాయికి తీసుకెళ్లే విధంగా యాక్షన్ను రూపొందించడాన్ని ఇష్టపడతాను. ఏ నైపుణ్యాలు అర్ధవంతంగా ఉంటాయో, వారు ఎందుకు పోరాటంలోకి ప్రవేశిస్తారో వారి లక్ష్యం ఏమిటో తెలుసుకోవడం కోసం స్క్రిప్ట్ , పాత్రలను అధ్యయనం చేయడం చాలా ముఖ్యం’’ అని వివరించాడు. అతను యాక్షన్ ను కథనం నుంచి∙విడదీయలేని భాగంగా వర్ణించాడు. ‘యాక్షన్ అనేది సంభాషణ కు మరొక రూపం అది ప్రతి ఇతర సన్నివేశంతో సంపూర్ణంగా మిళితం కావాలి. పోరాటం వెనుక ఉన్న భావోద్వేగం కొరియోగ్రఫీ లాగే ముఖ్యమైనది అంటున్న ఆయన ‘హైదరాబాద్ భారతదేశంలో తన మొదటి గమ్యస్థానంగా తనపై శాశ్వత ముద్ర వేసిందనీ, ఇక్కడి వంటకాలు మరపురానివని చెప్పాడు, గోల్కొండ కోట యాక్షన్–సాహసం కోసం వేచి ఉన్న రెడీమేడ్ మూవీ సెట్ లాగా తనకు అనిపిస్తుంది.‘ అంటూ వర్ణించాడు. -
‘భూతం ప్రేతం’ పెద్ద హిట్ కావాలి: అనిల్ రావిపూడి
‘జబర్దస్త్’ ఫేమ్ యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, ఇమ్మాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భూతం ప్రేతం’. రాజేష్ ధృవ దర్శకత్వంలో బి. వెంకటేశ్వర రావు నిర్మించారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘భూతం ప్రేతం’ టైటిల్, ఫస్ట్ లుక్ చాలా బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూ΄÷ందిన చిత్రం ‘భూతం ప్రేతం’. ఐదుగురు కుర్రాళ్లు అనుకోకుండా భూతానికి చిక్కుకుంటారు. ఆ తర్వాత ఆ భూతం నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది కథ. మా చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది... భయపెడుతుంది. ఈ ఏడాదిలోనే మా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: గిరీష్ హోతుర్, కెమెరా: యోగేష్ గౌడ. -
మార్ఫింగ్ వీడియోలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున
సాక్షి, డిల్లీ: తన పేరుతో మార్ఫింగ్ వీడియోలు చేయడం ఆపాలంటూ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ సాయంతో యూట్యూబ్ షార్ట్స్, వీడియోలు క్రియేట్ చేయడం, వాటికి నాగార్జున హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం ఆపేయాలని పిటిషన్ వేశారు. తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, పేరు ఉపయోగించి వెబ్ సైట్స్ బిజినెస్ చేయడాన్ని ఆపాలని పిటిషన్లో కోరారు. ఐశ్వర్య రాయ్ ఫోటోలు ఉపయోగించి సొమ్ము చేసుకున్న తరహాలోనే తన ఫోటోలు, పేరు వాడుకుంటున్నారని పేర్కొన్నారు.పేరు దుర్వినియోగంఏఐ సాయంతో పోర్నోగ్రఫీ కంటెంట్, లింక్స్ క్రియేట్ చేశారని నాగార్జున తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. టీ షర్టులపై ఆయన ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నట్లు వెల్లడించారు. హీరో పేరును, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని, నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడాలని పిటిషన్లో కోరారు. నాగార్జున ఏఐ వీడియోలు అప్లోడ్ చేసిన 14 వెబ్ సైట్స్ ఆ లింక్స్ను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై జస్టిస్ తేజస్ కరియా ధర్మాసం గురువారం విచారించింది. నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కాపాడుతామని తెలిపింది.గతంలో..గతంలో బాలీవుడ్ హీరోహీరోయిన్లు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్ తదితరులు తమ వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినీనటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే నాగార్జున సైతం కోర్టును ఆశ్రయించారు.చదవండి: పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు: సల్మాన్ ఖాన్ -
తమిళ దర్శకుడు నారాయణమూర్తి కన్నుమూత
సినీ దర్శకుడు నారాయణమూర్తి (59) (R D Narayanamurthy) మంగళవారం రాత్రి చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. నారాయణమూర్తి 'మనదై తిరిడి విట్టాయ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత 'ఒరు పొన్ను ఆరు పయ్యా' చిత్రం చేశారు. పలు టీవీ సీరియల్స్కు సైతం దర్శకత్వం వహించిన నారాయణమూర్తి ఇటీవల అనారోగ్యంతో చైన్నెలోని ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం అంత్యక్రియలుఅక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. స్థానిక పంబల్లో నివసించిన నారాయణమూర్తికి భార్య హంసవేణి, లోకేశ్వరన్ అనే కుమారుడు ఉన్నారు. లోకేశ్వరన్ లండన్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన శుక్రవారం చైన్నెకి రానున్నారు. అదేరోజు పంబల్లో దర్శకుడు నారాయణమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దర్శకుడి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: నేనూ సెలవు తీసుకుంటా! -
ఆ రోజే థియేటర్స్లోకి ‘ఎర్రచీర’
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన తాజా చిత్రం ‘ఎర్రచీర - ది బిగినింగ్’. ఈ మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బిజినెస్ షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని సినిమా తీసుకునేందుకు ముందుకు వచ్చారు.సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని దీపావళి కానుకగా వారం ముందే.. అంటే అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ చిత్ర బృందాన్ని అభినందించారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలిచాయన్నారు.ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉందని చూసినవారు వెల్లడించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో మదర్ సెంటిమెంట్ తో తీసిన ఈ లేడీ ఓరియేంటెడ్ సినిమా అందరూ కలిసి చూసే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్ కి వచ్చి చూడాలని కోరారు. ప్రమోషన్స్ జోరు పెంచుతున్నామని, అక్టోబర్ 3న రిలీజ్ ట్రైలర్ విడుదల చేసి, అక్టోబర్ 5 న విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపారు. -
ఓటీటీలోకి అనుష్క ‘ఘాటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
అనుష్క శెట్టి(Anushka shetty) నటించిన తాజా చిత్రం ‘ఘాటి’(Ghaati Movie). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలై మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. కథా నేపథ్యం బాగున్నా.. దాన్ని అంతే ఆకర్షనీయంగా తెరపై చూపించడంలో క్రిష్ సఫలం కాలేదు. ఫలితంగా రెండో రోజు నుంచే సినిమా కలెక్షన్స్ తగ్గిపోయాయి. దీంతో విడుదలైన 20 రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ని అమెజాన్ ప్రైమ్(Amazon prime Video) రిలీజ్ చేసింది.స్ట్రీమింగ్ ఎప్పుడంటే..‘ఘాటి’ఓటీటీ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే రిలీజైన 8 వారాలకు ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.ఘాటి కథేంటంటే..ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే ఖరీదైన గంజాయి పంట శీలావతి. ఆ పంటను కోసి, బయటకు తీసుకొచ్చే సత్తా ఘాటీలకు మాత్రమే ఉంటుంది. అలా బయటకు తీసుకొచ్చిన గంజాయిని డ్రగ్స్ మాఫీయా లీడర్ కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), అతని తమ్ముడు కుందుల నాయుడు(చైతన్యరావు) ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అలా ఘాటీలుగా పని చేసిన దేశిరాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క).. ఓ కారణంగా ఆ పని వదిలేస్తారు... వేరే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.కట్ చేస్తే.. కుందుల నాయుడికి తెలియకుండా ఓ గ్యాంగ్ శీలావతి గంజాయిని లిక్విడ్గా మార్చి బయటి ప్రాంతాలకు సరఫరా చేస్తుంటుంది. ఈ ముఠాకి లీడర్గా దేశిరాజు ఉన్నట్లు కుందుల నాయుడికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఘాటీ పని వదిలిన దేశి రాజు, శీలావతి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? శీలావతి క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? దేశిరాజు లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు శీలావతి ఏం చేసింది? అనేదే మిగతా కథ. -
ఇంటిమేట్ సీన్.. హీరోను ఏడిపించిన హీరోయిన్
'బాబీ' సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది డింపుల్ కపాడియా (Dimple Kapadia). హిందీలో అనేక హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది. అయితే అనిల్ కపూర్ (Anil Kapoor)తో చేసిన ఓ సినిమాలో మాత్రం డింపుల్ బాగా ఇబ్బందిపడింది. ఆ సీన్ కహానీ ఏంటో చూసేద్దాం.. 1986లో జన్బాజ్ మూవీలో అనిల్ కపూర్, డింపుల్ కపాడియా జంటగా నటించారు. ఫిరోజ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇందులోని పాటలు ఇప్పటికీ పాడుకుంటూ, వింటూ ఉంటారు.అనిల్ కపూర్, డింపుల్ కపాడియారొమాంటిక్ సీన్అయితే ఈ మూవీలోని ఓ షాట్ కోసం.. ఫిరోజ్ ఖాన్ ఫామ్హౌస్ను ఎంచుకున్నారు. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య కాస్త క్లోజప్ (ఇంటిమేట్) సీన్స్ పెట్టారు. ఆ విషయం హీరోహీరోయిన్లిద్దరికీ చెప్పారు. సమయానికి ఇద్దరూ సెట్లోకి వచ్చారు. కానీ అనిల్ చొక్కా విప్పగానే డింపుల్ అడుగు ముందుకు వేయలేదట! కారణం.. అతడి ఛాతీనిండా గుబురుగా వెంట్రుకలు ఉండటం! దీంతో దర్శకుడు ఆమెను బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. చిట్టచివరకు ఆమె ఆ సీన్ చేసేందుకు అంగీకరించింది. అనిల్ ఛాతీపై వెంట్రుకలు చూసి డింపుల్ అతడిని చాలారోజులపాటు ఏడిపించిందట! ఇకపోతే జన్బాజ్ మూవీలోని ఓ సాంగ్లో హీరోయిన్ శ్రీదేవి తళుక్కుమని మెరిసింది.చదవండి: అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్లో ఉన్నా: ధర్మ మహేశ్ -
వితికా ఇంట వెల్లివిరిసిన ఆనందం.. త్వరలో బుజ్జి పాపాయి
టాలీవుడ్ జంట వరుణ్ సందేశ్- వితికా షెరు (Vithika Sheru) ఇటీవలే కొత్తింట్లోకి గృహప్రవేశం చేశారు. ఇంతలోనే వితికా మరో గుడ్న్యూస్ చెప్పింది. తన చెల్లెలు కృతిక గర్భం దాల్చిందంటూ సదరు ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అందులో కృతిక బేబీ బంప్తో ఫోటోలకు పోజిచ్చింది. చెల్లి పెళ్లికృతిక - కృష్ణల వివాహం 2022లో జరిగింది. చెల్లి పెళ్లిని తన చేతుల మీదుగా జరిపించింది వితికా. పెళ్లయిన మూడేళ్లకు కృతిక తల్లి కాబోతుండటంతో వీరి ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. చెల్లి తల్లి కాబోతోంది, మరి అక్క ఎప్పుడు గుడ్న్యూస్ చెప్తుందో? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.వరుణ్- వితిక జర్నీ'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో వితిక- వరుణ్ జంటగా నటించారు. వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. 2018లో వితిక తొలిసారి గర్భం దాల్చింది. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. కొద్దిరోజులకే గర్భస్రావం అయింది. ఈ సంఘటన తర్వాత వరుణ్తో బిగ్బాస్కు వెళ్లొచ్చింది. దేవుడు కరుణించి పిల్లల్ని ఇస్తే అంతకంటే అదృష్టం ఇంకేముందని ఓసారి ఇంటర్వ్యూలో చెప్పింది. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) చదవండి: కాంతార చూడాలంటే మందు, ముక్క జోలికి వెళ్లకూడదంటూ పోస్ట్! -
అక్కడ అన్ని బూతు సినిమాలే.. మా పేరెంట్స్ నటించవద్దని చెప్పారు: సినీ నటి
ఇంటర్నెట్ పుణ్యమా అని అడల్ట్ సినిమాలు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చేశాయి. కానీ ఒకప్పుడు అంటే షుమారుగా 3 దశాబ్ధాల క్రితం ఈ పరిస్థితి లేదు. పెద్దలకు మాత్రమే అంటూ ఊరించే ఎ సర్టిఫికెట్ సినిమాల కోసం సదరు అడల్ట్ మూవీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. అలాంటి వారందరికీ ఆంగ్ల చిత్రాల తర్వాత మన దేశీయ భాషలో ఒకే ఒక చిత్ర పరిశ్రమ నుంచి సాంత్వన లభించేది. అది...ప్రస్తుతం దేశంలోనే అత్యంత వైవిధ్య భరిత చిత్రాలకు కేరాఫ్గా ఉన్న మళయాల చిత్ర పరిశ్రమ. అదే ఒకప్పుడు బూతు చిత్రాలకు చిరునామాగా ఉండేది. అప్పట్లో షకీలా తదితర అడల్ట్ మూవీ స్టార్స్ మళయాళ సినిమాలపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించేవారు. దాంతో దేశవ్యాప్తంగా బి గ్రేడ్ సినిమాలంటే మళయాళమే అనే గుర్తింపు వచ్చేసింది. బహుశా ఇప్పటి తరానికి పెద్దగా తెలియని ఆనాటి విషయాలను గుర్తుకు వచ్చేలా చేసింది తమిళ సినీనటి ఛార్మిల(Charmila)మలయాళ సినిమాలో ఒకప్పుడు ప్రముఖ తారగా వెలుగొందింది నటి చార్మిల, ఆ పరిశ్రమలో చేరడానికి ముందు తనకు ఆ పరిశ్రమ పట్ల ఉన్న అభిప్రాయం గురించి వెల్లడించింది, గతంలో అంటే 1980– 1990 మధ్య కాలంలో మళయాళ చిత్రపరిశ్రమ ఖ్యాతి బి–గ్రేడ్ చిత్రాలవెల్లువలో కొట్టుకుపోయిందని చెప్పిందామె. ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో మలయాళ సినిమా ఆఫర్లను అంగీకరించకుండా తన తల్లిదండ్రులు అడ్డుకున్నారని గుర్తుచేసుకుంది. ‘‘అప్పట్లో, మలయాళ సినిమా అంటే కేవలం బి–గ్రేడ్ చిత్రాలను మాత్రమే నిర్మిస్తుందని చాలా మంది భావించేవారు, అందుకే నా తల్లిదండ్రులు ఆ పరిశ్రమకు నన్ను పంపడానికి ఇష్టపడలేదు, అందుకే మొదటి ఆఫర్ వచ్చినప్పుడు భయపడ్డా. పేరొందిన దర్శకులు సంప్రదించినప్పుడు కూడా నటించడానికి నిరాకరించాను’’ అంటూ వెల్లడించారామె.కేరళ లోపల కాకుండా ఆ రాష్ట్రం బయట థియేటర్లలో నడిచిన మళయాళ సినిమాల వల్లనే మళయాళ చిత్ర పరిశ్రమకు ఈ రకమైన కళంకం అంటిందని ఆమె అభిప్రాయపడింది. పక్కరాష్ట్రాల్లోని జనం మలయాళ చిత్రాల గురించి మాట్లాడినప్పుడు, వారికి గుర్తుకు వచ్చేది ఎ–సర్టిఫికేట్ సినిమాలు, వాటి పోస్టర్లు మాత్రమే. ‘వారికి మళయాళ వినోదం అంటే డ్రగ్స్ లేడీస్,‘ అంటూ చెప్పిందామె. సీనియర్ నిర్మాత కె బాలాజీ తన కుటుంబాన్ని ఒప్పించిన తర్వాతే బాలాజీ అల్లుడు నేటి సూపర్ స్టార్ మోహన్ లాల్తో తాను నటించానంది. మలయాళ సినిమా అంతా బి–గ్రేడ్ టైప్ కాదని, మోహన్ లాల్ మమ్ముట్టి వంటి ప్రధాన నటులు మంచి చిత్రాలలో మాత్రమే పనిచేస్తారని ఆయన అర్ధం అయేలా చెప్పడంతో చార్మిల తన తొలి మలయాళ ప్రాజెక్ట్లో మోహన్ లాల్ సరసన నటించింది, తరువాత క్లాసిక్ల ద్వారా ఆ భాషలో కెరీర్కు బాటలు వేసుకుంది.ఆ కాలపు మళయాళ చిత్ర పరిశ్రమ గురించి గుర్తు చేసుకుంటూ ‘‘ బి–గ్రేడ్ సినిమాలో పనిచేసిన నటులు ‘పూర్తిగా భిన్నమైన వర్గానికి‘ చెందినవారని వారు బస చేసిన హోటళ్ళు మా హోటళ్ళలా ఉండేవి కావు‘ అని ఆమె చెప్పింది, తరువాత వారిలో చాలామంది సినిమాలను విడిచిపెట్టారని, కొందరు వివాహం తర్వాత విదేశాలకు వెళ్లారని లేదా ఇతర భాషలలో గ్లామర్ పాత్రలకు మారారని ఆమె చెప్పింది.ఆ సమయంలో మలయాళ సినిమా చుట్టూ వివాదాలు ఎలా ఉన్నా చార్మిల సినిమాలు స్వర్ణ యుగంలో భాగంగా పరిగణన పొందాయి. ఆమె తమిళనాడులో జన్మించినప్పటికీ, ’ధనం’లో గ్రామీణ అమ్మాయి థంకమ్ పాత్రలో తన నటనతో మలయాళ ప్రేక్షకుల హదయాలను గెలుచుకుంది. తరువాత ఆమె ’అంకుల్ బన్ ’, ’కేళి’, ’ప్రియపెట్ట కుక్కు’ మోహన్ లాల్, జయరామ్, వినీత్ వంటి తారలతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాల్లో పనిచేస్తోంది. అయినప్పటికీ ఆమె అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలు మాత్రం ఆమె మలయాళ విహారయాత్రలుగా మిగిలిపోయాయి. నటుడు బాబు ఆంటోనీ ఆ తరువాత విడాకులు తీసుకున్న నటుడు హోస్ట్ కిషోర్ సత్యతో ఆమె గత సంబంధాలు సహా ఆమె వ్యక్తిగత జీవితం ఆమె స్క్రీన్ కెరీర్ లాగే అందరి దృష్టినీ ఆకర్షించింది. -
సూర్య పనిమనుషుల చేతివాటం.. రూ.42 లక్షలు స్వాహా!
తమిళ హీరో సూర్య (Suriya)కి భద్రతా అధికారిగా పని చేస్తున్న జార్జ్ ప్రభు ఆర్థికంగా మోసపోయారు. సూర్య ఇంట్లో పనిచేసేవారి చేతుల్లో రూ.42 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్య ఇంట్లో సులోచన, ఆమె కుమారుడు పని చేస్తున్నారు. వీరు సెక్యూరిటీ ఆఫీసర్ జార్జ్కు అధిక వడ్డీ ఆశ చూపారు. దీంతో ఆయన మొదటగా రూ.1 లక్ష ఇచ్చారు. దానికి బదులుగా 30 గ్రాముల బంగారాన్ని వీళ్లు తిరిగిచ్చారు. జార్జ్కు నమ్మకం కుదరడంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం రూ.42 లక్షలను నిందితులకు బదిలీ చేశారు. రూ.2 కోట్ల మేర మోసంఅప్పటినుంచి వాళ్లు డబ్బులివ్వకుండా సైలెంట్ అయ్యారు. దీంతో భద్రతా అధికారి తన డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా సులోచన కుటుంబం అక్కడినుంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఇదే కుటుంబం చెన్నైలో పలువురిని నమ్మించి రూ.2 కోట్ల దాకా మోసాలకు పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ నలుగురూ సూర్య ఇంట్లో పనిచేసేవారే కావడం గమనార్హం! చదవండి: సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై.. -
‘విద్రోహి’ విజయం సాధించాలి : అల్లరి నరేశ్
రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వి ఎస్ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్ని వివి వినాయక్ , రెండో పాటను ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఆవిష్కరించారు. త్వరలోనే విద్రోహి చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.ట్రైలర్ విడుదల అనంతరం అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘విద్రోహి’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాలో పని చేసిన వారు నాకు చాలా క్లోజ్ పర్సన్స్. వారికి ఈ సినిమా మంచి సక్సెస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’అన్నారు.ఈ చిత్ర నిర్మాత వెంకట సుబ్రమణ్యం మాట్లాడుతూ - మా ‘విద్రోహి’ మూవీ ట్రైలర్ ను విడుదల చేసిన కామెడీ కింగ్ అల్లరి నరేష్గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు హీరో శ్రీకాంత్ గారు, దర్శకుడు వివి వినాయక్గారు , సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ తరపున ఇలాంటి సపోర్ట్ మాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు. -
Bigg Boss 9: ‘సారీ అమ్మా.. ’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన కమెడియన్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 9వ సీజన్ చూస్తుండగానే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఇంట్లో నుంచి ఇద్దరు బయటకు వెళ్లారు. మూడోవారం నామినేషన్స్లో హరీశ్, ప్రియ, కల్యాణ్, రాము, రీతూ,ఫ్లోరా ఉన్నారు. వీరిలో నుంచి ఒకరు బయటకు వెళ్తారు. ఆ ఒక్కరు ఎవరనేది ఈ వీకెండ్లో తెలిసిపోతుంది. ఇప్పటికి వరకు కండబలం, బుద్ది బలంపై ఫోకస్ చేసిన బిగ్ బాస్.. ఇప్పుడు భావోద్వేగ బలంపై దృష్టిపెట్టాడు. కంటెస్టెంట్స్ ఎమోషన్తో గేమ్ ప్లాన్ చేసినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. హౌస్లో ఉన్నవాళ్లకు బిగ్ బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఎవరైతే తొలుత బజర్ ప్రెస్ చేస్తారో..వారికి ఫ్యామిలీ వాళ్లు అందించిన సందేశాలను పంపిస్తామని చెప్పాడు. అయితే అది పొందాలంటే కొంత మూల్యం చెల్లించాల్సిందే అంటూ అక్కడ వందశాతం నిండి ఉన్న బ్యాటరీని చూపించాడు.బటన్ ప్రెస్ చేసి అవకాశం దక్కించుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ముందు మూడు ఆప్షన్లు పెట్టాడు బిగ్బాస్. నాన్న నుంచి వచ్చిన లేఖను పొందలాంటే హౌస్ బ్యాటరీ నుంచి 45 శాతం తగ్గింపోతుందని, అమ్మ నుంచి వచ్చిన ఆడియో మెసేజ్ని పొందాలంటే 30 శాతం బ్యాటరీ తగ్గిపోతుందని, ఫ్యామిలీ ఫోటోని పొందాలంటే 25శాతం తగ్గుతుందని చెప్పి.. ఇందులో ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం అని అన్నాడు. ఇది విని ఇమ్మాన్యుయేల్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ‘నేను ఏడిస్తే..మా అమ్మ తట్టుకోలేదు’ బిగ్బాస్ అంటూ కన్నీళ్లు తూడ్చుకున్నాడు. తోటి కంటెస్టెంట్స్ కోసం ఇమ్మాన్యుయేల్ చివరి ఆప్షన్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది. -
107 మిలియన్ వ్యూస్.. ‘కాంతార: చాప్టర్ 1’ ఖాతాలో సరికొత్త రికార్డు!
2022లో రికార్డు సృష్టించిన ‘కాంతర’ చిత్రానికి ప్రీక్వెల్గా రాబోతున్న చిత్రం కాంతార: చాప్టర్ 1(Kantara Chapter 1 ). తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో ప్రభాస్, హిందీలో హృతిక్, మలయాళంతో పృ థ్విరాజ్, తమిళ్లో శివకార్తికేయన్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులుని కాంతారా ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. ఇక ఈ ట్రైలర్ అనేక రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఈ ట్రైలర్ అన్ని భాషలు కలిపి 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో పాటు 3.4 మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ మూవీలొ రిషబ్ శెట్టి సరసన యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడిగా రిషబ్ శెట్టి ఒక దృశ్య కావ్యంలా తీర్చిదిద్దుతున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అక్టోబర్ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.𝟏𝟎𝟕𝐌+ 𝐕𝐢𝐞𝐰𝐬 & 𝟑.𝟒𝐌+ 𝐋𝐢𝐤𝐞𝐬 𝐢𝐧 𝟐𝟒 𝐡𝐨𝐮𝐫𝐬…🔥The Trailer of #KantaraChapter1 takes the internet by storm, igniting massive excitement everywhere.Watch #KantaraChapter1Trailer now – https://t.co/YVnJsmn7VxIn cinemas #KantaraChapter1onOct2 ✨#Kantara… pic.twitter.com/WyjLETiGsX— Hombale Films (@hombalefilms) September 23, 2025 -
ఆ మాట నేనెప్పుడు అనలేదు: హీరోయిన్
సినిమా తారలపై రకరకాల రూమర్స్ వస్తుంటాయి. వాళ్ల సినిమాలతో పాటు పర్సనల్ విషయాలపై కూడా నెట్టింట గాసిప్స్ చక్కర్లు కొడుతుంటాయి. అయితే చాలా మంది నటీనటులు వాటిని పెద్దగా పట్టించుకోరు. అవసరం అయితే తప్ప స్పందించరు. అయితే ఆ అబద్దం నిజమని నమ్మినట్లుగా తెలిస్తే మాత్రం వెంటనే ఖండిస్తారు. తాజాగా నటి కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan ) అదే పని చేశారు. తనపై మీడియాలో వచ్చిన ఓ పుకారుని తీవ్రంగా ఖండించారు.తనను, తన సోదరుడిని తల్లిదండ్రులు వియత్నాంలోని అనాథశ్రమంలో వారం రోజుల పాటు వదిలి వెళ్లారని.. జీవితం అంటే ఏంటో తెలియాలనే ఉద్దేశ్వంతో అలా చేశారని కల్యాణి చెప్పినట్లుగా ఓ సినీ వెబ్సైట్ వార్తలను రాసుకొచ్చింది. ఈ విషయం కళ్యాణి దృష్టికి వెళ్లడంతో..ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి మాటలను నేనెప్పుడు అనలేదని..దయచేసి ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురే ఈ కల్యాణి.‘హలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘చిత్రలహరి’తో మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల ఆమె నటించిన ‘కొత్త లోక’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆగస్ట్ 28న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 270పైగా వసూళ్లను సాధించింది.. మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రగా నిలిచింది. -
అది ఫేక్.. నిజం తెలుసుకొని రాయండి: మీడియాకు హీరో అక్షయ్ విజ్ఞప్తి!
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగం నడుస్తోంది. ప్రతి రంగంలోనూ ఏఐని వాడేస్తున్నారు. అయితే కొంతమంది ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ఫేక్ వీడియో, ఫోటోలను సృష్టించి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినీ తారల విషయంలో ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ.. అవే నిజం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్కు సంబంధించి ఓ ఫేక్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆయన వాల్మీకి మహార్షి పాత్రలో నటిస్తూన్నారంటూ.. ఐఏ సహాయంతో ఓ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ట్రైలర్గా రిలీజ్ చేశారు. దీంతో చాలా మంది ఇది నిజమనే నమ్మారు. ఈ వీడియో వైరల్ కావడంతో... చివరకు అక్షయ్ కుమారే స్పదించాల్సి వచ్చింది. ఆ ట్రైలర్ ఫేక్ అని.. ఎవరూ నమ్మొద్దు అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.‘నేను మహర్షి వాల్మీకి పాత్రలో ఓ సినిమా చేస్తున్నానంటూ ఏఐతో చేసిన ఫేక్ వీడియో ఒకటి వైరల్ చేశారు. అలాంటి వాటిని నమ్మకండి. దారుణమైన విషయం ఏంటంటే.. కొన్ని వార్తా ఛానల్స్ కూడా ఆ వీడియోలు నిజం అనుకొని ఆ ప్రాజెక్ట్ గురించి వార్తలు రాసేశారు. కనీసం రాసేముందు అవి నిజమా, మార్ఫింగ్ చేసినవా అని చూసుకోలేదు. ప్రస్తుతం ఏఐ వీడియోలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. నిజమైన వాటికంటే అవే ఎక్కువ వేగంగా వైరల్ అవుతున్నాయి. దీన్ని అందరూ గమనించాలని అభ్యర్థిస్తున్నాను. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాన్ని పరిశీలించాలని కోరుతున్నా. వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు అందించాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నా’అని అక్షయ్ ఎక్స్లో రాసుకొచ్చారు. -
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. అప్పుడు భర్తకే తెలియదా?
సినిమా తారల కెరీర్ విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలపై కూడా జనాలకు ఆసక్తి ఎక్కువ. వాళ్లు తినే తిండి మొదలు.. ధరించే దుస్తుల వరకు ప్రతీది సాధారణ ప్రజలకు వార్తే అవుతుంది. ఇక వాళ్ల పర్సనల్ లైఫ్పై కూడా ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది. ప్రేమ, పెళ్లి.. ప్రెగ్నెన్సీ.. ఇలాంటి శుభవార్తలను విని ఆనందించే అభిమానులు చాలా మందే ఉన్నారు. అందుకే కొంతమంది స్టార్స్ సోషల్ మీడియా వేదికగా పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. మరికొంతమంది అయితే.. వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడించేందుకు అంతగా ఆసక్తి చూపించరు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్(Vicky Kaushal ) కూడా ఒకరు. ఆయన పర్సనల్ లైఫ్ని గోప్యంగా ఉంచేందుకు ఇష్టపడతాడు. ముఖ్యమైన విషయాలను మాత్రమే అభిమానులతో షేర్ చేసుకుంటాడు. తాజాగా ఆయన ఓ గుడ్ న్యూస్ని తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు. త్వరలోనే ఆయన తండ్రి కాబోతున్నాడు. ఆయన సతీమణి, స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్(Katrina Kaif ) గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తాజాగా ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేస్తూ..‘మా జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభమైంది’ అని రాసుకొచ్చారు. అప్పుడు అలా.. కత్రినా కైఫ్ గర్భం దాల్చిందని గత కొన్నాళ్ల క్రితమే వార్తలు వచ్చాయి. ఆమె ప్రెగ్నెంట్ అని.. అందుకే బయటకు ఎక్కువ రావడం లేదని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఇదే విషయాన్ని ఓ సినిమా ఈవెంట్ని విక్కీ కౌశల్ని అడిగితే.. అలాంటిదేమి లేదని, శుభవార్త ఉంటే తామే చెబుతామని అన్నారు. దీంతో కత్రినా ప్రెగ్నెంట్ రూమర్ మాత్రమే అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఆమె బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కత్రినా తన నివాసంలో బేబీ బంప్తో ఫోటో షూట్ చేసిన నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది. కత్రినా ప్రెగ్నెంట్ విషయం భర్తకే తెలియదా..విక్కీ ఎందుకు అలా చెప్పాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఈ విషయాన్ని ఈ జంట అధికారికంగా వెల్లడించింది. దీంతో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.నాలుగేళ్ల తర్వాతకొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. 2021 డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వయసులో కత్రినా కంటే విక్కీ చిన్నవాడు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారు. సినిమాల విషయానికొస్తే.. ‘ఛావా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్కీ.. ప్రస్తుతం లవ్ అండ్ వార్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. కత్రినా విషయానికొస్తే.. ‘మల్లీశ్వరి’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలకృష్ణతో కలిసి నటించిన అల్లరి ప్రియుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత కత్రినా.. తన మకాంని బాలీవుడ్కి మార్చింది.అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చివరగా 2024లో విజయ్ సేతుపతితో కలిసి ‘మేరి క్రిస్మస్’ చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
ప్రశాంత్ వర్మ సర్ప్రైజ్.. సూపర్ హీరో మూవీ పోస్టర్ రిలీజ్
హనుమాన్ సినిమాతో వెండితెరపై అద్భుతాన్ని సృష్టించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). ఈ ఒక్క మూవీతో అతడి పేరు మార్మోగిపోయింది. అంతేకాదు, తనదగ్గర 20 కథలు రెడీగా ఉన్నాయన్నాడు. వాటిని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తానన్నాడు. ఈ సినిమాలో సూపర్ హీరోలను చూస్తారన్నాడు.పవర్ఫుల్ పోస్టర్తాజాగా పీవీసీయూ (Prasanth Varma Cinematic Universe) నుంచి అధీర సినిమా పోస్టర్ వదిలారు. ఈ మూవీలో నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. నటుడిగా ఇదే అతడి తొలి చిత్రం కావడం విశేషం. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. పోస్టర్లో అగ్నిపర్వతం బద్ధలైనట్లుగా చూపించారు. కల్యాణ్ సూపర్ హీరో గెటప్లో ఉన్నాడు.థియేటర్లలో అధీర గ్లింప్స్?ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు.. ఆశాకిరణం వెలుగులా పుట్టుకొస్తుందంటూ ప్రశాంత్ వర్మ అధీర పోస్టర్ షేర్ చేశాడు. అయితే ఈ మూవీకి దర్శకుడు ఈయన కాదు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సూపర్ విజన్తో ఈ మూవీ రాబోతోంది. దీనికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మించిన ఓజీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. పనిలో పనిగా అధీర గ్లింప్స్ను ఓజీలో చూపించాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. When darkness blooms the world, a LIGHTNING of hope emerges ❤️🔥Presenting @IamKalyanDasari and @iam_SJSuryah in #ADHIRA ⚡️A New SUPERHERO from #PrasanthVarmaCinematicUniverse 💥💥💥A @RKDStudios Production Presented By RK Duggal Directed By @sharandirects Produced By… pic.twitter.com/FSnovvMY5P— Prasanth Varma (@PrasanthVarma) September 22, 2025 చదవండి: హౌస్లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై మనీష్ బిగ్బాంబ్ -
ఉన్ని ముకుందన్ బర్త్డే.. 'మా వందే' నుంచి పోస్టర్ రిలీజ్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతమవుతోంది. 'మా వందే' (Maa Vande Movie) పేరిట ఆయన బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ మూవీలో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan).. మోదీగా నటించనున్నారు. క్రాంతి కుమార్ సీహెచ్ దర్శకత్వం వహిస్తుండగా వీర్ రెడ్డి.ఎం నిర్మిస్తున్నారు. ఇటీవల (సెప్టెంబర్ 17న) మోదీ బర్త్డే సందర్భంగా మా వందే ప్రాజెక్ట్ ప్రకటించారు. నేడు (సెప్టెంబర్ 22) ఉన్ని ముకుందన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.మోదీ బయోపిక్..ఇందులో మోదీ జనం ఎదుట స్టేజీపై నడుస్తున్నట్లుగా ఉంది. అతడి ఆశయాన్ని, సంకల్పాన్ని తల్లి ఆశీర్వదిస్తున్నట్లుగా పోస్టర్లో చూపించారు. ఈ మూవీలో మోదీ బాల్యం నుంచి నేటి వరకు జరిగిన ఎన్నో అంశాలను చూపించనున్నారు. వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ ప్రపంచనాయకుడిగా ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ప్రేరణ ఎంతో ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని.. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పదనే సందేశం ఇవ్వనున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.From Maa’s blessing to the nation’s anthem… ✨Team #MaaVande wishes @Iamunnimukundan a very Happy Birthday! ❤️🤗#HBDUnniMukundan@silvercast_prod @sannajaji @veerreddy_m @DOPSenthilKumar @RaviBasrur @Sreekar_Prasad @sabucyril @SolomonStunts @GangadharNS1 @MaaVandeMovie pic.twitter.com/rb6JsF30yp— Maa Vande (@MaaVandeMovie) September 22, 2025చదవండి: హౌస్లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై మనీష్ బిగ్బాంబ్ -
రాధిక శరత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రాధిక తల్లి, సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధ సతీమణి గీత (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం (సెప్టెంబర్ 21న) రాత్రి మరణించారు. గీత మృతితో రాధిక కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అంత్యక్రియలునేడు సాయంత్రం చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో గీత అంత్యక్రియలు జరపనున్నట్లు కుటంబసభ్యులు వెల్లడించారు. ప్రముఖ నటుడు మద్రాస్ రాజగోపాల్ రాధాకృష్ణన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతడి ముగ్గురు భార్యలు సరస్వతి, ధనలక్ష్మి, గీత ద్వారా మొత్తం 12 మంది సంతానం జన్మించారు. వారిలో హీరోయిన్లు రాధిక శరత్ కుమార్, నిరోషా ఉన్నారు.చదవండి: 25 ఏళ్ల తర్వాత విజయ్, జ్యోతికల హిట్ సినిమా రీరిలీజ్ -
చీర కడితే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు
హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసి బాగా పాపులర్ అయిన నటి స్నిగ్ధ. ‘అలా మొదలైంది’ చిత్రంతో కెరీర్ని ప్రారంభించి.. మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్ కాదల్, చందమామ కథలు, టైగర్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ తదితర చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. సినిమాల్లోనే కాకుండా బటయ కూడా అబ్బాయి గెటప్లోనే ఉంటారు టాలెటెండ్ నటి. అబ్బాయిల మాదిరే ప్యాంట్, షర్ట్ ధరించి..హెయిర్ స్టైల్ కూడా అలానే మెంటేన్ చేస్తుంటారు. ఆమె లుక్, మాటతీరే.. సినిమా చాన్స్లు తెచ్చిపెట్టాయి. ఈ మధ్య ఆమెకు అవకాశాలు తగ్గాయి కానీ.. మొన్నటివరకు మంచి డిమాండ్ ఉండేది. నటనకు విరామం వచ్చినా.. ప్రజలకు మాత్రం దూరం కాలేదని చెబుతోంది ఈ నటి. సినిమాల్లో నటించకపోయినా..స్టేజ్ షోల ద్వారా అభిమానులతో టచ్లో ఉంటున్నానని చెబుతోంది.ఇక తన లుక్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇలా (ప్యాంట్, షర్ట్ ధరించి మగరాయుడిలా) ఉండడం వల్లే.. మంచి క్యారెక్టర్లు వచ్చాయి. ఒకవేల ఇప్పుడు నేను చీర కట్టుకుంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. నేను 5 నిమిషాల్లో చీరకట్టుకోగలను కానీ..కంఫర్టబుల్గా ఉండలేను. ఫ్యాన్స్ కోసమే చీర కట్టడంలేదు’అని నవ్వుతూ చెప్పారు. ఇక పెళ్లి గురించి అడగ్గా.. ‘కచ్చితంగా చేసుకుంటాను.కానీ ఇప్పుడు కాదు. కరెక్ట్ పర్సన్ దొరకాలి. నాకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటా’ అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది.ఇక తన ఆదాయ మార్గాలను వివరిస్తూ.. ‘నాకు యాక్టింగ్తో పాటు మ్యజిక్ కూడా వచ్చు. సంగీత దర్శకురాలిగా పని చేశాను .ఎగ్జిక్యూటివ ప్రొడ్యూసర్గానే వర్క్ చేశా. ఇలా వచ్చిన డబ్బుతో జీవితాన్ని హాయిగా గడుపుత్నున్నా. సినిమా చాన్స్ల కోసం నేను ఎవరిని అడగను. వచ్చిన అవకాశాలనే తీసుకుంటాను. నా నోటిదూల కారణంగానే సినిమా చాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు షోలు చేస్తూ జీవితాన్ని గడుపుతున్నా’ అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘నా వరకు అయితే ఇంతవరకు ఎవరూ కమిట్మెంట్ అడగలేదు. ఒక సిస్టర్లా, బ్రదర్లా నన్ను చూసుకున్నారు’ అని స్నిగ్ద చెప్పుకొచ్చింది. -
మలయాళ స్టార్ జంట కూతురు.. చిన్నప్పుడు అనాథాశ్రమంలో..
మలయాళ స్టార్ నటుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) రికార్డులు తిరగరాస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త లోక: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీ మోహన్లాల్ 'ఎల్2: ఎంపురాన్' కలెక్షన్లను దాటేసి ఏకంగా రూ.266 కోట్లు రాబట్టింది. దీంతో మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొట్టమొదటి చిత్రంగా రికార్డులోకెక్కింది. మంచి సలహాసూపర్ హీరోగా నటించిన కల్యాణికి సౌత్ నుంచి నార్త్ వరకు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె తండ్రి విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోవద్దని జాగ్రత్తలు చెప్పాడు. అలాగే పరాజయాన్ని మనసుకు తీసుకోవద్దని మంచి మాట చెప్పాడు. కల్యాణి కూడా ఎప్పుడూ స్టార్ హీరో కూతుర్ని అని ఎప్పుడూ బిల్డప్ కొట్టలేదు. పైగా తండ్రి మాటను తు.చ తప్పకుండా పాటిస్తుంది.అనాథాశ్రమంలో..అందుకే చిన్నప్పుడు తల్లిదండ్రుల కోరిక మేరకు కొద్దిరోజులపాటు అనాథాశ్రమంలో ఉంది. కల్యాణియే కాదు, ఆమె సోదరుడు సిద్దార్థ్ కూడా అనాథాశ్రమంలో ఉన్నారు. మలయాళ స్టార్ జంట ప్రియదర్శన్- లిస్సీ జంటే తమ పిల్లల్ని వియత్నాంలోని ఓ ఆశ్రమంలో చేర్పించారు. అయితే ఇందుకో బలమైన కారణం ఉంది. పేరు, సంపాదన, లగ్జరీని పక్కనపెట్టి జీవితం విలువ నేర్పడానికే వాళ్లు ఈ పని చేశారు. కల్యాణి, సిద్దార్థ్ కూడా అనాథలతో కలిసి తినేవారు, ఆడుకునేవారు, వాళ్లతోనే కలిసి నిద్రించేవారు. అలా చిన్నప్పటినుంచే వారికి మానవత్వం, మంచితనం వంటి విలువలను నేర్పించారు.చదవండి: నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. జీవితంలో మర్చిపోలేని విషాదం -
మరోసారి రిస్క్ చేస్తున్న రాజశేఖర్.. వర్కౌట్ అయ్యేనా?
హీరో రాజశేఖర్(Rajasekhar) వెండితెరపై కనిపించి చాలా రోజులైంది. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘శేఖర్’. 2022లో ఈ మూవీ రిలీజైంది. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’(2023)లో క్యామియో రోల్ ప్లే చేసి ఆకట్టుకున్నాడు. చాలా కాలం తర్వాత రాజశేఖర్ మళ్లీ ఓ సినిమా చేయబోతున్నాడట. అది కూడా రీమేక్. తమిళ్లో పెద్ద హిట్ అయిన ‘లబ్బర్ పందు’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారట రాజశేఖర్.హరీష్ కళ్యాణ్- దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'లబ్బర్ పందు' సినిమాను తమిళరాసన్ పంచముత్తు దర్శకత్వం వహించారు. గల్లీ క్రికెట్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారట.ఒరిజినల్లో దినేష్ చేసిన పాత్రను తెలుగులో రాజశేఖర్ చేస్తున్నారట. విశ్వదేవ్ రాచకొండ మాతృకలో అర్జున్ కళ్యాణ్ చేసిన పాత్రను చేస్తున్నాడట. రాజశేఖర్ తనయురాలే ఇందులో హీరోయిన్గా కనిపించనుందట.రీమేక్తో రిస్క్.. ఓటీటీ వాడకం పెరిగిన తర్వాత రీమేక్ చిత్రాలేవి వర్కౌట్ కావడం లేదు. ఒక భాషలో హిట్టయిన సినిమాను..ఓటీటీలో అన్ని ప్రాంతాల వారు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజశేఖర్ రిస్క్ చేసి రీమేక్ చేస్తున్నాడు. ఒకప్పుడు ఆయన రీమేక్ చేసిన చిత్రాలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. కానీ ఇప్పుడు పరిస్థితుల మారాయి. ఆయన రీమేక్ చేసిన గడ్డం గ్యాంగ్, శేఖర్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా కూడా రాజశేఖర్ మళ్లీ రీమేక్నే నమ్ముకున్నాడు. మరి ఆయన రిస్క్ ఫలిస్తుందో లేదో చూడాలి. -
నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. జీవితంలో మర్చిపోలేని విషాదం!
శుభాకాంక్షలు, గోకులంలో సీత, పెళ్లి పందిరి, స్నేహితులు, ప్రేయసి రావే.. ఇలా పలు సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది రాశి (Raasi). ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. హీరోయిన్గానే కాకుండా నిజం మూవీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ యాక్ట్ చేసి మెప్పించింది. చాలాఏళ్ల తర్వాత మళ్లీ ఆమె సినిమాలతో బిజీ అవుతోంది.చిరంజీవితో సినిమాతాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాశి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. నేను చెన్నైలోని తెలుగు కుటుంబంలో పుట్టి పెరిగాను. నాకు మేకప్ వేసుకోవడం నచ్చదు, సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒక్కసారి యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చాక నేను చేసే పనిని ఎప్పుడూ తక్కువ చూడలేదు. నా పనిని నేనెంతో గౌరవిస్తాను. ఇండస్ట్రీకి వచ్చేవారికి కూడా పనిని గౌరవించడం నేర్చుకోమని చెప్తాను. పెళ్లికూతురినయ్యాక..ఇకపోతే నేను చిరంజీవితో ఓ సినిమా చేయాల్సింది. ఆర్తి అగర్వాల్కు, నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ దర్శకుడితో చిరంజీవి విభేదాల కారణంగా సినిమా ఆగిపోయింది. రంగస్థలం సినిమాలో సుకుమార్.. రంగమ్మత్త పాత్ర ఆఫర్ చేశారు. ఆ పాత్రలో నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తారో, లేదోనన్న భయంతో రిజెక్ట్ చేశాను. నాకు 2004లో పెళ్లయింది. ఆ సమయంలోనే సౌందర్య చనిపోయింది. నన్ను పెళ్లికూతురిని చేశాక బెంగళూరులో సౌందర్య సంతాపసభకు వెళ్లొచ్చాను.మొదటిరోజే అలాంటి సీన్పెళ్లయిన పదేళ్లకు పాప పుట్టింది. అదే నా జీవితంలో మ్యాజికల్ మూమెంట్. డైరెక్టర్ తేజ 'నిజం' సినిమాలో నా క్యారెక్టర్ను పాజిటివ్గా చెప్పాడు. తీరా సెట్కు వెళ్లాక మొదటి రోజే నాతో చేయకూడని సీన్ చేయించారు. అసలు ఈ సీన్ ఉంటుందనే చెప్పలేదు. చాలా హర్టయ్యాను, ఈ సినిమా చేయనన్నాను. నాకున్న ఇమేజ్కు ఈ సినిమా చేశానంటే కెరీర్ ఇంతటితో ఆగిపోతుంది, నా వల్ల కాదన్నాను. వాళ్లు చేయాల్సిందేనన్నారు. అయిష్టంగానే మూవీ పూర్తి చేశాను. క్షమించలేనుడబ్బింగ్ సమయంలో తేజ ఫోన్ చేసి సారీ చెప్పారు. ఈ మూవీ విషయంలో మాత్రం ఆయన్ను నేను క్షమించలేను. ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ను మర్చిపోవాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు తేజ పేరే చెప్తాను. ఆ సినిమా వల్ల నిజంగానే కెరీర్ దెబ్బతింది. నా పుట్టినరోజే నాన్న చనిపోయాడు. అది మర్చిపోలేని విషాదం. నా కెరీర్ మొదట్లో నాన్న నాకు అసిస్టెంట్లా, టచప్ బాయ్లా పనిచేసేవారు అంటూ రాశి ఎమోషనలైంది.చదవండి: ప్రముఖ నటుడి మరణం.. రోడ్డుపై డ్యాన్స్ చేసిన భార్య -
ఒక్క సినిమాతో ఫేమస్.. కనిపించకుండా పోయిన ‘అందాల తార’!
ఒకే ఒక్క చాన్స్తో చిత్రపరిశ్రమలో స్టార్స్గా ఎదిగినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. పదుల సంఖ్యలో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాతో కొట్టిసి..ఇండస్ట్రీలో సిర్థపడిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఇక్కడ పోటీ చాలా ఎక్కువ. కొంతమంది మాత్రం తొలి సినిమాతోనే ఫేమస్ అవుతుంటారు. అలాంటి వారిలో శ్రీలక్ష్మీ సతీష్ ఒకరు. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టకపోవచ్చు. ఆరాధ్య దేవి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఆ మధ్య ఈ పేరు టాలీవుడ్లో మారుమోగిపోయింది. సినిమా రిలీజ్ కాకముందే ఆరాధ్య దేవి టాప్ సెలెబ్రిటీ అయిపోయింది. దానికి కారణంగా ఆర్జీవీ. ఆయన తీర్చిదిద్దిన ‘అందాల తార’నే ఈ ఆరాధ్య.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఆరాధ్య దేవి.. చీరకట్టులో ఫోటో షూట్ చేసి ఇన్స్టాలో షేర్ చేయగా..అవి ఆర్జీవీ కంట పడ్డాయి. దీంతో తన ‘శారీ’ సినిమాలో ఆరాధ్యను హీరోయిన్గా తీసుకున్నాడు. సినిమా ఫలితం పక్కన పెడితే.. ఆరాధ్య మాత్రం ఇండస్ట్రీలో బాగా వైరల్ అయిపోయింది. ఆమె అందం, అభినయం చూసి.. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిపోవడం పక్కా అనుకున్నారు. కానీ ‘శారీ’ తర్వాత ఇండస్ట్రీ ఆమెకు ‘సారీ’ చెప్పినట్లు ఉంది. ఈ చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో ఎలాంటి అవకాశాలు రాలేదు. ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అని, అవసరం అయితే గ్లామర్ షో కూడా చేస్తానని చెప్పినా.. ఆరాధ్య దేవికి అవకాశాలు రావట్లేదు. -
ప్రముఖ నటుడి మరణం.. రోడ్డుపై డ్యాన్స్ చేసిన భార్య
ప్రముఖ కమెడియన్, నటుడు రోబో శంకర్ (46) మృతిపై తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినిమా సెట్లో స్పృహ తప్పి పడిపోయిన ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా గురువారం (సెప్టెంబర్ 18న)చికిత్స పొందుతూ మరణించాడు. రోబో శంకర్ (Robo Shankar) మృతి పట్ల కమల్ హాసన్, ధనుష్, శివకార్తికేయన్, ఐశ్వర్య రాజేశ్ సహా పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు.అంత్యక్రియల్లో చివరిసారిగా..రోబో శంకర్ మృతితో అతడి భార్య ప్రియాంక కన్నీరుమున్నీరుగా విలపించింది. శుక్రవారం నటుడి అంత్యక్రియలు జరగ్గా.. చివరిసారి భర్తకు డ్యాన్స్తో వీడ్కోలు పలికింది. మనసులో విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతం లాంటి బాధను డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రియ ఈ బాధ నుంచి ఎలా బయటపడుతుందో? ఏంటో? అని కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ రోబో శంకర్?కాగా శంకర్.. రోబో డ్యాన్స్తో ఫేమస్ అయ్యారు. అలా ఆయన పేరు రోబో శంకర్గా స్థిరపడిపోయింది. మారి, ఇరుంబు తిరై, విశ్వాసం, చక్ర, కోబ్రా, కలకలప్పు 2, పులి, యముడు 3, మిస్టర్ లోకల్ తదితర చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్నారు. దాదాపు 80కి పైగా సినిమాలు చేశారు. ఈయన భార్య ప్రియాంక కూడా కన్ని మేడమ్ సినిమాలో నటించింది. వీరి కుమార్తె ఇంద్రజ.. విజయ్ 'బిగిల్' (తెలుగులో విజిల్) మూవీలో గుండమ్మగా నటించింది. చదవండి: మా అధ్యక్షుడి అక్కకే ఇలాంటి గతి.. అయినా స్పందించవా?: హేమ -
మా అధ్యక్షుడి అక్కకే ఇలాంటి గతి.. అయినా స్పందించవా?: హేమ
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) డ్రెస్సింగ్పై ఓ సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నించిన తీరు వివాదాస్పదమైంది. తాను వేసుకునే బట్టలు, వయసు గురించి ప్రశ్నిస్తూ బాడీ షేమింగ్ చేశాడని, అవమానించాడంటూ మంచు లక్ష్మి ఫిలిం ఛాంబర్ను ఆశ్రయించింది. తన ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రశ్నించిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.చదువురాని వాళ్లంటే ఏదో అనుకోవచ్చుఈ విషయంలో సీనియర్ నటి హేమ (Actress Hema).. మంచు లక్ష్మికి సపోర్ట్ చేసింది. మీడియా వల్ల బాధపడ్డవారిలో నేనూ ఒకర్ని. పెద్దగా చదువుకోని నాలాంటివాళ్లు ఏదైనా తెలియక మాట్లాడి ఉండొచ్చేమో! కానీ బాగా చదువుకున్న కొందరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఇలా ఏదిపడితే అది మాట్లాడినప్పుడు మీ అసోసియేషన్లో ఉన్న వేరే ఎవరూ మాట్లాడరా?మా అధ్యక్షుడి అక్కకే ఇలాంటి గతినోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? మంచు లక్ష్మిని ఓ యాంకర్ బాడీ షేమింగ్ చేశాడు. మా అసోసియేషన్ ఏం చేస్తోంది? మా ప్రెసిడెంట్ అక్కకే ఇలాంటి గతి అంటే.. మిగతావాళ్ల పరిస్థితి ఏంటి? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకింతవరకు స్పందించలేదు? విష్ణుబాబు, ఏం చేస్తున్నావ్. ఈరోజు నీ అక్కకు, రేపు ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి వస్తుంది. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్ అన్నది మాలాంటి ఆర్టిస్టులను కాపాడుకోవడానికే కదా! సారీ చెప్పించారుగతంలో వేణుస్వామి.. సమంత, నాగచైతన్య గురించి ఏదో అంటే జర్నలిస్టులు కంప్లైంట్ చేసి ఆయన క్షమాపణలు చెప్పేదాకా ఊరుకోలేదు. తర్వాత సుమతో కూడా సారీ చెప్పించారు. మరిప్పుడు ఆ వ్యక్తి పిచ్చి ప్రశ్నలతో నటిని అవమానించినప్పుడు మా అసోసియేషన్ పట్టించుకోదా? దయచేసి స్పందించు విష్ణు బాబు' అని హేమ ఆవేదన వ్యక్తం చేసింది.చదవండి: హీరోయిన్లు అంటే చాలు, రెడీగా ఉంటారు: వేదిక -
మోహన్లాల్కు వైఎస్ జగన్ అభినందనలు
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించటం పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి శాశ్వతమైనది అని, నటుడిగా మోహన్లాల్ బహుముఖ ప్రజ్ఞ అసమానమైనదని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మోహన్లాల్కు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.(చదవండి: కంప్లీట్ యాక్టర్ ఫాల్కే గ్రహీత – మోహన్లాల్)కాగా, సినీ రంగంలో దేశంలోనే అత్యున్నతమైన అవార్డు అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2023 సంవత్సరానికి గాను మోహన్లాల్కు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాశాఖ శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ నెల 23న 71వ జాతీయ సినీ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మోహన్లాల్కు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రతిష్టాత్మక అవార్డు లభించడం పట్ల మోహన్లాల్ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. Congratulations to Shri @Mohanlal on being awarded the Dadasaheb Phalke Award. His contribution to Indian cinema is everlasting, and his versatility as an actor is unparalleled. Wishing him continued glory and good health.#DadasahebPhalkeAward pic.twitter.com/Yqwhsa1S9z— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2025 -
గ్లామరస్గా ఉంటే క్యారెక్టర్నే తప్పుపడతారా?: హీరోయిన్ ఫైర్
కొందరు నటీమణులను చూస్తే వీరికి వయసు పెరగదా? అనిపిస్తుంది. అలాంటి వారిలో వేదిక (Actress Vedhika) ఒకరు. ఈ మహారాష్ట్ర బ్యూటీ వయసు ఇప్పుడు 37 ఏళ్లు. అయినప్పటికీ ఇప్పటికీ పదహారేళ్ల పడుచుపిల్లలాగే కనిపిస్తుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో హీరోయిన్గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం కష్టపడుతూనే ఉంది. హీరోయిన్స్ అంటే చాలు..తమిళంలో ముని, సక్కరకట్టి, కాళై, పరదేశీ, కావియ తలైవన్, కాంచన–3 వంటి చిత్రాల్లో నటించిన వేదిక ఇప్పటికీ తన సొగసులతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా కొన్ని విమర్శలు ఈ బ్యూటీకి కోపం తెప్పించాయి. గ్లామరస్గా కనిపిస్తే చాలు వేలెత్తి చూపడానికి రెడీ ఉంటారని ఆగ్రహించింది. సాధారణంగానే హీరోయిన్లు అంటే విమర్శలు గుప్పించడానికి ఒక వర్గం రెడీగా ఉంటుందని, అందులోనూ కాస్త గ్లామరస్ దుస్తులు ధరిస్తే ఏకంగా వారి క్యారెక్టర్నే తప్పుపడుతున్నారని మండిపడింది.నేను లెక్క చేయనుదుస్తుల గురించి విమర్శించే దుస్థితి మారాలంది. తానూ బికినీ ధరించి కూడా నటిస్తానని, ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోనని చెప్పింది. తానేమిటో తనకు బాగా తెలుసని, తప్పుడు బుద్ధి కలవారు మారితే మంచిదని వేదిక పేర్కొంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో ఒక్కో చిత్రం చేస్తోంది.చదవండి: ఒక్క మూవీతో ప్రేమలో పడ్డారా?.. సూపర్ హిట్ జంటపై డేటింగ్ రూమర్స్ -
OTT: ఎలియో మూవీ రివ్యూ
హేయ్ కిడ్స్...మీకెవరికైనా ఏలియన్స్ ని చూడాలనుందా లేదా వాళ్ళ దగ్గరకి వెళ్ళాలనుందా. అమ్మో అస్సలు లేదు అనుకుంటున్నారా..కాని ఎలియోకి మాత్రం తనను ఎవరైనా ఏలియన్స్ తీసుకువెళితే బావుండు అని అనుకుంటున్నాడు, అది కూడా ఎంతలా అంటే రోజూ బీచ్ కి వెళ్ళి అలా ఒంటరిగా ఉండిపోయి పడుకుండి పోతాడు. ఎప్పుడైనా ఓ ఏలియన్ తనను చూసి ఎత్తుకెళ్ళకుండా ఉంటదా అన్న చిన్న ఆశ ఎలియోకి. తన పేరెంట్స్ ని పోగొట్టుకోని ఎయిర్ ఫోర్స్ మేజర్ అయిన తన పిన్ని దగ్గర ఉంటున్న ఎలియోకి చిన్నప్పటి నుండి ఈ ఏలియన్స్ అంటే పిచ్చి, అందుకే తనను ఎత్తుకుపొమ్మని కనిపించిన సిగ్నల్స్ కి మెసేజ్ పెడుతుంటాడు ఎలియో. ఆ రోజు రానే వస్తుంది. ఎలియోని ఓ ఏలియన్ గ్రూప్ ఎత్తుకువెళుతుంది. ఏలియన్స్ గ్రూప్ లో గ్లోర్డన్ ఎలియోకి మంచి ఫ్రెండ్ అవుతుంది. ఇక అక్కడ నుండి వీళ్ళు చేసే అల్లరి, ఫాంటసీ అడ్వెంచర్స్ మాత్రం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న యానిమేటెడ్ ఫాంటసీ మూవీ ఎలియోని చూడాల్సిందే. కిడ్స్ ఎలియో ఈజ్ ఎ సూపర్ మూవీ. ఇంకెందుకాలస్యం గ్రాబ్ యువర్ రిమోట్ టు జాయిన్ ఎలియో ఎలాంగ్ విత్ ఏలియన్స్.- హరికృష్ణ ఇంటూరు -
శివుడి పెయింటింగ్ అద్భుతంగా వేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సుధీర్బాబు (Sudheer Babu) నటుడు మాత్రమే కాదు, తనలో మరో కళ కూడా ఉంది. అదే పెయింటింగ్ కళ! తాజాగా అతడు తన చేతులతో ఓ అద్భుతాన్ని సృష్టించాడు. నీలకంఠుడి పెయింటింగ్ వేశాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో సుధీర్బాబు మాట్లాడుతూ.. నేను ఎవరి పెయింటింగ్ వేస్తున్నాననుకుంటున్నారు? ఎవరైనా అందమైన అమ్మాయిల బొమ్మలు గీస్తుంటారు. అందగాడి బొమ్మ గీస్తున్నా..కానీ నేను ఒక అందగాడి బొమ్మను గీస్తున్నా.. ఆయన ఎలాంటి అందగాడంటే అందాన్ని చందమామతో పోలుస్తాం కదా.. ఆ చందమామ ఆయన తలలో ఏదో ఒక మూలన పడి ఉంటుంది. అసలాయన అందం ముందు చందమామను ఎవరూ పట్టించుకోరు. మనమంతా అందంగా కనిపించడానికి మంచిగా హెయిర్స్టైల్ చేసుకుంటే ఆయనేమో జుట్టునసలు పట్టించుకోనే పట్టించుకోడు. అందుకే ఆయన జుట్టు ఎప్పుడూ ఏదో దారాలు చిక్కుక్కున్నట్లు చిక్కుముడుల్లా ఉంటుంది. ఆ బొమ్మే జటాధరఅందుకే ఆయన్ని జటాధర అని పిలుస్తారు. ఆయన గురించి ఇంకా చాలా చెప్పాలి. అందుకోసం నేనో బొమ్మ (సినిమా) తీశాను.. ఆ బొమ్మే జటాధర. అందరూ థియేటర్లలో జటాధర చూడండి అని చెప్పుకొచ్చాడు. జటాధర విషయానికి వస్తే.. సుధీర్బాబు, సోనాక్షి సిన్హ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని దర్శక ద్వయం వెంకట్ కల్యాణ్– అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించారు. శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) చదవండి: గాజులేసుకుని కూర్చో.. సుమన్పై సంజనా చీప్ కామెంట్స్ -
2700 కోట్ల ఆస్తి.. బ్యాంకు జాబ్ వదిలి సినిమాల్లోకి.. ఎవరా స్టార్ హీరోయిన్?
సినిమా రంగంలో సక్సెస్ అనేది చాలా తక్కువ. అయినా చాలా మంది ఈ రంగుల ప్రపంచంలోకి రావాలని ఆశపడతారు. ఇతర రంగాలలో బలంగా స్థిరపడినా సరే.. దాన్ని వదులుకొని మరీ ఇండస్ట్రీలోకి వస్తారు. వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయి ‘స్టార్స్’ అవుతారు. అలాంటి వారిలో నటి సోహా అలీఖాన్ ఒకరు.ఇంటర్నేషనల్ బ్యాంకులో జాబ్ఆమె లెజెండరీ నటి షర్మిలా ఠాగూర్, క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి కుమార్తె, స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ సొదరి అయినప్పటికీ.. చిత్ర పరిశ్రమలోకి రావాలని ఆమె అస్సలు అనుకోలేదు. పెరెంట్స్ కూడా ఆమెను ఇండస్ట్రీకి దూరంగానే పెంచారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్న సోహా.. ఈ తర్వాత ముంబైకి వచ్చి ఓ ఇంటర్నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేసింది. అప్పుడు ఆమె జీతం నెలకు రూ. 18 వేలు మాత్రమే ఉండేది. ముంబైలో ఆమె నివసించే ఇంటి రెంట్కే రూ. 17000 పోయేవి అట. అయినా కూడా ఇండిపెండెంట్గా బతకాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగం చేసేదట. తన తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి అప్పట్లోనే 2700 కోట్ల ఆస్తి ఉండేదట. డబ్బుకు కొదవ లేకున్నా.. పెరెంట్స్ని అడగడం ఇష్టంలేక జాబ్ చేసి తన అవసరాలు తానే తీర్చుకునేదానిని అని ఓ ఇంటర్వ్యూలో సోహా అలీఖాన్ చెప్పింది. అలా సినిమాల్లోకి.. బ్యాంకింగ్ జాబ్ చేస్తున్న సమయంలోనే సోహా మనసు సినిమా రంగంపై పడింది. సినిమా చాన్స్ల కోసం చేస్తున్న సమయంలో ఓ మోడలింగ్ కాంట్రాక్టు దక్కింది. ఆ తర్వాత ఆమె జీవితం మారిపోయింది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమా చాన్స్ వచ్చింది. షాహిద్ కపూర్కు జోడీగా ‘దిల్ మాంగే మోర్(2004)’లో ఆఫర్ వచ్చింది. ఈ సినిమాకు ఆమె అందుకున్న రెమ్యునరేషన్ రూ. 10 లక్షలు . నిజానికి సోహా ఈ సినిమా కంటే ముందే షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘పహేలి’లో నటించాల్సింది. ఆ ఆఫర్ వచ్చిందనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు రాణి ముఖర్జీ చేతికి వెళ్లింది. దీంతో సోహా నిరుద్యోగిగా మారిపోయింది. అదే టైమ్లో షాహిద్ కపూర్తో ‘దిల్ మాంగే మోర్’ అవకాశం దక్కింది. ఆ సినిమా తర్వాత సోహకు బాలీవుడ్లో వరుస ఆఫర్లు వచ్చాయి. కొన్నాళ్లకే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆమె కెరీర్లో రంగ్ దే బసంతి, అహిస్టా అహిస్టా, ఖోయా ఖోయా చంద్, ముంబై మేరీ జాన్, 99, సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్స్టర్ రిటర్న్స్ లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. అయితే హీరోయిన్గా ఆమెకు అపజయాలే ఎక్కువ వచ్చాయి. యాక్టింగ్తో పాటు రైటర్గానే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె రాసిన బుక్, ‘ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్ మోడరేట్లీ ఫేమస్’ క్రాస్వర్డ్ బుక్ అవార్డును గెలుచుకుంది. సోహా అలీ ఖాన్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2015లో నటుడు కునాల్ ఖేముని వివాహం చేసుకుంది. వారికి ఇనాయ అనే కుమార్తె ఉంది. -
మలయాళ బ్లాక్బస్టర్ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam Movie). సంగీత్ ప్రతాప్, ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అయిన సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించాడు. ఆశీర్వాద్ సినిమా బ్యానర్పై ఆంటొని పెరుంబవూర్ నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టింది. వచ్చేవారమే రిలీజ్కేవలం రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ కేరళలోని పలు థియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉంది. సినిమా రిలీజై మూడువారాలు దాటిపోవడంతో ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. జియో హాట్స్టార్లో సెప్టెంబర్ 26న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.వరుస హిట్లుమోహన్లాల్ ఈ ఏడాది ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజవగా ఆ మూడు కూడా బ్లాక్బస్టర్ హిట్లు కొట్టాయి. ఎల్2: ఎంపురాన్ మూవీ ఏకంగా రూ.260 కోట్లు రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలోనే రూ.250 కోట్లు దాటిన మొట్టమొదటి సినిమాగా రికార్డుకెక్కింది. తర్వాత తుడరుమ్ రిలీజ్ అవగా ఈ మూవీ కూడా రూ.230 కోట్లు వసూలు చేసింది. తర్వాత వచ్చిన హృదయపూర్వం రూ.70 కోట్లు కలెక్ట్ చేసింది. మరి మోహన్లాల్ మున్ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి! എന്ന് ഹൃദയപൂർവം ജിയോഹോട്ട്സ്റ്റാർ#Hridayapoorvam will be streaming from September 26 on JioHotstar. @mohanlal @antonypbvr @aashirvadcine @MalavikaM_#Hridayapoorvam #HridayapoorvamOnJioHotstar #Mohanlal #HridayapoorvamMohanlal #Family #Drama #Comedy #Malayalam #JioHotstar pic.twitter.com/r8Q1hL4JEv— JioHotstar Malayalam (@JioHotstarMal) September 19, 2025చదవండి: గాజులేసుకుని కూర్చో.. సుమన్పై సంజనా చీప్ కామెంట్స్ -
హాలీవుడ్లోకి టాలీవుడ్ దర్శకుడు.. టైటిల్ ఇదే!
తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలో సుధీర్ఘ అనుభవం ఉన్న దర్శక, నిర్మాత సత్యారెడ్డి తాజాగా ఓ భారీ బడ్జెట్ చిత్రంతో హాలీవుడ్ లోకి ప్రవేశించేందుకు సంసిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా పాన్ వరల్డ్ సినిమాస్ అనే పేరుతో ఓ బ్యానర్ ను కూడా రిజస్టర్ చేశారు. హాలీవుడ్ స్థాయి లో నిర్మించే ఈ సినిమా కి అన్ని భాషల్లో ‘కింగ్ బుద్ధ ’ అనే టైటిల్ కన్ఫామ్ చేసినట్లు తెలిసింది.దాదాపు పాతికేళ్ల క్రితం ‘సర్దార్ చిన్నపరెడ్డి’ చిత్రంతో సినీ జీవితాన్ని ఆరంభించిన ఆయన ‘ప్రేమికుల రోజు’, హీరో కునాల్ తో ‘కుర్రకారు’, ‘రంగుల కళ’, ‘శంకర్ దాదా జిందాబాద్’ ఫేమ్ కరిష్మా కోటక్ తో పాటు ;పలువురు ప్రముఖ హీరో, హీరోయిన్ల తో 55 చిత్రాలకు దర్శక, నిర్మాత, హీరో గా వ్యవహారించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.ఓ వైపు దర్శక, నిర్మాతగా, నటుడిగా తన అభిరుచిని చాటుకుంటూనే నిర్మాతల మండలిలో కూడా కీలకంగా వ్యవహరిస్తుంటారు. 2016 లో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ గా కూడా ఎన్నుకోబడ్డారు.ఇదిలాఉండగా....ఆ మధ్య .వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ తో ‘ఉక్కు సత్యాగ్రహం’ అనే చిత్రం నిర్మించి ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించారు.. ఈ చిత్ర నిర్మాణంలో అనేకమంది రష్యా,అమెరికా కి చెందిన హాలీవుడ్ యాక్టర్లతో పనిచేస్తున్నప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయిలో చేయాలనీ అప్పుడే నిర్ణయించుకున్నట్టు తెలిసింది.‘ఉక్కు సత్యాగ్రహం’చిత్రకథలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి టెక్నీకల్ సహాయం చేసిన రష్యన్లను కలిసే ముందు అప్పట్లో గద్దర్ ఆదేశాల మేరకు, ఆయన ఇచ్చిన ప్రేరణతో బుద్ధిజం పైన హాలీవుడ్లో ఓసినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సంధర్భంగా సత్యారెడ్డి స్పందిస్తూ, ఈ తాజా చిత్రం షూటింగ్ లోకేషన్ల కోసం ఇప్పటికే అమెరికా, చైనా, టిబెట్, నేపాల్, థాయ్ లాండ్, ,సింగపూర్, మలేషియా తదితర దేశాలు పర్యటించామని చెప్పారు. ప్రస్తుతం చిత్ర నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని, త్వరలో అమెరికా లో ప్రముఖుల సమక్షంలో చిత్ర పోస్టర్ లాంచ్ తో పాటు అన్ని వివరాలు ప్రకటిస్తానని తెలిపారు. -
వాషి యో వాషి.. పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓజీ (They Call Him OG Movie). ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా యాక్ట్ చేశాడు. రన్ రాజా రన్, సాహో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ దర్శకత్వం వహించాడు. డీవీవీ దానయ్య నిర్మించగా తమన్ సంగీతం అందించాడు.సాంగ్ రిలీజ్సెప్టెంబర్ 21న ఓజీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే దానికంటే ముందు ఓ సర్ప్రైజ్ వదిలారు. పవన్ పాడిన 'వాషియో వాషి' పాటను రిలీజ్ చేశారు. ఇది జపనీస్ భాషలో సాగుతుంది. అయితే ఇదంతా పవన్ ఏదో డైలాగులు చెప్తున్నట్లు ఉందే తప్ప అసలు పాటలానే లేదు.డబ్బులు దండుకునే పనిఇక ఓజీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను భారీగా పెంచారు. ప్రజల కోసం, ప్రజల కొరకు అంటూ డైలాగులు చెప్పే పవన్.. తన సినిమావంతు వచ్చేసరికి మాత్రం ప్రజల జేబులో డబ్బులు దండుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయకపోవడం గమనార్హం. కాగా ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
60% షూటింగ్ పూర్తి.. ఆ హీరోను తీసేశా: దర్శకుడు
దర్శకుడు బాలాజీ తాజాగా రూపొందిస్తున్న చిత్రం 'ది డార్క్ హెవెన్'. క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఇందులో నటుడు నకుల్ హీరోగా నటించడానికి ఎంపికయ్యారు. అయితే కొంత షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈ చిత్రం నుంచి నకుల్ వైదొలిగారు. దీంతో రాజారాణి–2 చిత్రం ఫేమ్ సిద్ధు కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శక, నిర్మాత బాలాజీ మాట్లాడుతూ.. కథకు కరెక్ట్గా సూటవుతుందనే ఇంగ్లీష్ టైటిల్ను నిర్ణయించాం.60% షూటింగ్ అయ్యాక..ఒక గ్రామంలో జరిగే వరుస హత్యల గురించి దర్యాప్తు చేయడానికి పోలీస్ అధికారి రంగంలోకి దిగుతారు. ఆయన ఈ హత్యల మిస్టరీని ఎలా చేధించాడు? అన్నదే చిత్రకథ. ఈ చిత్రంలో ముందుగా హీరోగా నకుల్ను ఎంపిక చేశాం, ఆయనతో 60 శాతం షూటింగ్ పూర్తి చేశాం. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన్ని సినిమా నుంచి తప్పించి సిద్ధును కథానాయకుడిగా ఎంపిక చేశాం. నా స్పీడ్ను నకుల్ అందుకోలేకపోయారు.షూటింగ్లో కథానాయకుడు కట్ చెప్పడం సరికాదు. నకుల్ మాత్రం సీన్లు చేస్తుండగా కట్ చెప్పేవారు. నాకు సంబంధించినంత వరకు హీరో ఎవరన్నది ముఖ్యం కాదు, ఆ పాత్రకు ఎవరు కరెక్ట్ అన్నదే ముఖ్యమని భావించాను. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ దర్శిక కథానాయికగా, రితిక, అరుల్జ్యోతి, ప్రదీప్, జయకుమార్ జానకిరామన్,అజిత్ జోషి, చాప్లిన్ బాలు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు అని చెప్పారు. పీకే చాయాగ్రహణం, శక్తి బాలాజీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.చదవండి: పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్గా రాము రాథోడ్ -
నాకు గర్ల్ఫ్రెండ్స్ ఉండగా మా అమ్మకు బాయ్ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి?
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)లో సెలబ్రిటీలు అడుగుపెట్టినప్పుడు వారి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ లాగుతుంటారు. కొన్నిసార్లు వాళ్లే గతాన్ని గుర్తు చేసుకుని పక్కవారితో చెప్పుకుని బాధపడుతూ ఉంటారు. బాలీవుడ్ నటి, సింగర్ కునిక సదానంద్ అదే పని చేసింది. ఈమె ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొంది. నాకింకా పెళ్లి కాలేఈమె కెరీర్ తొలినాళ్లలో సింగర్ కుమార్ సానును ప్రేమించింది. ఈ విషయాన్ని ఆమె బిగ్బాస్ హౌస్లో వెల్లడించింది. నేను సింగర్ (కుమార్ సాను)ని ప్రేమించాను. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. అతడు భార్యతో విడిపోయి ఉంటున్నాడు. దీంతో మేమిద్దరం కలిసుండేవాళ్లం. తనను ఎంతగానో నమ్మాను. కానీ ఓరోజు తనకు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిసింది. తప్పేంటి?ఆ విషయం అతడే ఒప్పుకోవడంతో తనకు బ్రేకప్ చెప్పాను అంది. తల్లికి యుక్తవయసులో ఉన్న రిలేషన్షిప్ గురించి కునిక కుమారుడు అయాన్ లాల్ స్పందిస్తూ.. నాకు గర్ల్ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అమ్మకు బాయ్ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? అప్పుడు తన వయసు 27 ఏళ్లే కదా! అప్పుడు నేనింకా పుట్టనేలేదు. కానీ, అమ్మ ప్రేమ విషయం నాకు తర్వాత తెలిసింది. 27 ఏళ్ల వయసులో లవ్అమ్మ అతడిని (కుమార్ సాను) సింగర్గా ఇష్టపడేది. ఇంట్లో అతడి పాటలు పాడుతూ ఉండేది. ఇప్పటికీ పాడుతుంది కూడా! అతడి ప్రతిభను ఇష్టపడుతుంది, కానీ ఆ వ్యక్తిని కాదు. వాళ్ల ప్రేమాయణం 27 ఏళ్లు సాగిందని అందరూ అనుకుంటారు, అది నిజం కాదు! అమ్మ 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమలో పడిందంతే! కొన్నేళ్లకే విడిపోయారు అని చెప్పుకొచ్చాడు.రెండు పెళ్లిళ్లు- విడాకులుకునికకు రెండు పెళ్లిళ్లయ్యాయి. ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ కొడుకు పుట్టాడు. తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి ఓ కుమారుడు సంతానం. కానీ ఈ జంట కూడా ఎంతోకాలం కలిసుండలేదు, భేదాభిప్రాయాల వల్ల విడాకులు తీసుకున్నారు.చదవండి: పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించిన రీతూ.. ఓనర్గా రాము రాథోడ్ -
నైట్ పార్టీలో రేఖ డ్యాన్స్ వైరల్.. మాధురీ, ఊర్మిళ సైతం వెలవెల!
ఎవర్ గ్రీన్ గ్లామర్ స్టార్గా వెలుగొందుతున్న బాలీవుడ్ నటి రేఖ..మరోసారి తన డ్యాన్స్ స్కిల్స్తో అభిమానుల మనసు దోచుకుంది. ఏడు పదుల వయస్సులో ఇప్పటికీ వన్నె తరగని వర్ఛస్సుతో ఆమె చేసిన డ్యాన్స్ వైరల్గా మారింది. అయితే ఈ డ్యాన్స్ ఆమె తాజా సినిమాలోది కాదు.. ఒక నైట్ పార్టీలో కావడం విశేషం.ఈ అపురూప నృత్య సన్నివేశం చోటు చేసుకుంది బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ పుట్టిన రోజు నాడు కావడం విశేషం. తన కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలోని సన్నిహితులతో షబానా 75వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అనేక మంది బాలీవుడ్ స్టార్లు హాజరైన ఈ పుట్టినరోజు వేడుకల్లో రేఖ, హృతిక్ రోషన్, స్నేహితురాలు సబా ఆజాద్, సోను నిగమ్, మాధురి దీక్షిత్, కరణ్ జోహార్ తదితరులు ప్రముఖంగా కనిపించారు. బాలీవుడ్లో ఇలాంటి పార్టీలు జరగడం సహజమే అయినా ఈ పార్టీలోని వీడియోలు వైరల్ కావడానికి మరో సీనియర్ నటి రేఖ డ్యాన్స్ దోహదం చేసింది. ’పరిణీత’లోని ’కైసీ పహేలి జిందగని’ పాట కోసం రేఖ చేసిన నృత్యం నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.రేఖ తన ట్రేడ్మార్క్ గ్రేస్ ఎనర్జీతో ఈ నృత్యానికి కేంద్ర బిందువుగా మారిన వెంటనే, ఆ పార్టీకి హాజరైన వారంతా అక్కడే గుమికూడడం గమనార్హం. అంతేకాదు రేఖ అడుగులు కదుపుతుంటే అందరూ చప్పట్లు కొట్టి, ఉత్సాహపరుస్తూ హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఈ నృత్యం ద్వారా ఆమె బాలీవుడ్ ఫరెవర్ దివాగా తాను ఎందుకు ఎప్పటికీ కొనసాగుతుందో మరోసారి అందరికీ గుర్తు చేశారు. ’డ్యాన్సింగ్ క్వీన్’ గా పిలువబడే మాధురీ దీక్షిత్, రంగీలా లో డ్యాన్స్లతో షాకిచ్చిన ఊర్మిలా మాతోండ్కర్, డర్టీ పిక్చర్తో స్మితను గుర్తు చేసిన విద్యాబాలన్ వంటి రేఖ తదుపరి తరం హీరోయిన్స్ సైతం రేఖతో చేతులు కలిపి నృత్యం చేయడానికి ఒకరితో ఒకరు పోటీపడడం కనిపించింది. తమదైన శైలిలో వారు కూడా డ్యాన్స్ చేసినప్పటికీ అందరి చూపూ రేఖ మీదే ఉండిపోవడం గమనార్హం. ఈ సందర్భంగా తీసిన ఈ పార్టీలోని వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్గా మారి అభిమానులకు ఆనందోత్సాహాలను పంచాయి. వైరల్ క్లిప్లలో, రేఖ, ఊర్మిళ, మాధురి, విద్య, షబానా అజ్మీ కలిసి నృత్యం చేసే అరుదైన సందర్భం అందరినీ ఆకట్టుకుంది. రేఖ మొదట మాధురి, ఊర్మిళ, విద్య...ఇలా ఒకరి తర్వాత ఒకరితో కలిసి డ్యాన్స్ చేయడం కనిపించింది. తరువాత, ఆమె తన తరం నటి షబానాను తనతో డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించింది. ఈ పార్టీలో బర్త్ డే గాళ్ షబానా అజ్మీ సైతం తన భర్త జావేద్ అఖ్తర్తో కలిసి ’ప్రెట్టీ లిటిల్ బేబీ’కి చేసిన నృత్యం ఆహ్లాదకరంగా ఆకట్టుకుంది. అలాగే షబానా అజ్మీ తన భర్త జావేద్ అఖ్తర్తో కలిసి కోనీ ఫ్రాన్సిస్ ప్రసిద్ధ పాట ’ప్రెట్టీ లిటిల్ బేబీ’కి నృత్యం చేశారు. ఈ పాటలు, నృత్యాల తాలూకు వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి View this post on Instagram A post shared by Rekha (@legendaryrekhaofficial) -
అల్లు అరవింద్ ఏమీ చేయరు, చివర్లో వచ్చి పేరు కొట్టేస్తారు!
యూట్యూబర్ మౌళి కథానాయకుడిగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts Movie). సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ మూవీని బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 5న రిలీజ్ చేశారు. కేవలం రెండున్నర కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దాదాపు రూ.40 కోట్లు వసూలు చేసింది. దీంతో చిత్రయూనిట్ సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ పేరిట సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, బండ్ల గణేశ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.కోట్లల్లో ఒకరుఈ కార్యక్రమంలో బండ్ల గణేశ్ (Bandla Ganesh) మాట్లాడుతూ.. సినిమా అంటేనే కష్టాలు, కన్నీళ్లు, బాధలు. అన్నీ ప్రిపేర్ అయి రావాలి. కానీ, వందల కోట్లలో ఒకాయన మాత్రం దీనికి అతీతులుగా ఉన్నారు. ఆయన (అల్లు అరవింద్ను ఉద్దేశిస్తూ) స్టార్ కమెడియన్కు కొడుకుగా పుడతాడు, మెగాస్టార్కు బామ్మర్దిగా, ఐకాన్ స్టార్కు తండ్రిగా ఉంటాడు. ఎప్పుడూ కాలు మీద కాలేసుకుంటాడు. ఆయనెవరికీ అందుబాటులో ఉండడు. ఆయన కావాలనుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాడు. సిగ్గుతో తలదించుకోవాలిఅదీ జీవితం అంటే! అలాంటి మహర్జాతకుడిని నేను జీవితంలో చూడలేదు, ఇక చూడబోను కూడా! అలా జీవితాన్ని అద్భుతంగా ప్లాన్ చేసుకున్న అరవింద్గారు ఇక్కడికి రావడం సంతోషం. చిన్న సినిమా చచ్చిపోయింది అనుకుంటున్న తరుణంలో బడ్జెట్తో కాదు, కథతో మూవీ తీస్తే హిట్టవుతుందని నిరూపించింది లిటిల్ హార్ట్స్. రెండున్నర కోట్లతో రూ.50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే మెచ్చుకుని తీరాల్సిందే! మిమ్మల్ని చూసి నేను సహా పెద్దపెద్ద దర్శకనిర్మాతలు సిగ్గుతో తలదించుకునేలా చేశారు. ఈ మూవీని జనానికి చేరువ చేసిన బన్నీ వాసు, వంశీని అభినందించాలి. ఆయన పేరు కొట్టేస్తారుమీరెంత కష్టపడ్డా చివరికి అల్లు అరవింద్ (Allu Aravind)గారి సినిమా అంటున్నారు. అది ఆయన అదృష్టం, మీ దురదృష్టం. నేనేం చెప్పలేను. ఆయనేమీ చేయరు. చివరి నిమిషంలో వస్తారు, పేరు కొట్టేస్తారు. ఆయన జాతకం అలాంటిది, దానికి మనమేమీ చేయలేం అన్నాడు. ఈ కామెంట్స్తో అక్కడున్నవాళ్లు షాకయ్యారు. దీంతో బన్నీ వాసు స్పందిస్తూ.. అల్లు అరవింద్గారు పుట్టాకే అల్లు రామలింగయ్యగారు స్టార్ కమెడియన్ అయ్యారు. ఆ విషయం బండ్లన్నకు తెలియదేమో! మా అందరికీ అరవింద్గారే ఆదర్శం అని పేర్కొన్నాడు.ఆయన మాకెంతో ఇష్టంఇక బండ్ల కామెంట్స్పై నెట్టింట ట్రోలింగ్ జరుగుతుండటంతో సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేశ్ ఓ పోస్ట్ పెట్టాడు. అల్లు అరవింద్గారు మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత. ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్బస్టర్స్. ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీదున్న ప్రేమ వల్ల తెలుగు సినిమా గర్వంగా నిలబడింది. అల్లు అరవింద్గారంటే మాకెంతో ఇష్టం అని ట్వీట్ చేశాడు.అల్లు అరవింద్ గారు మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత 🙏ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్బస్టర్స్.ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీద ఉన్న ప్రేమ వలన తెలుగు సినిమా గర్వంగా నిలిచింది.అల్లు అరవింద్ గారు అంటే మాకు ఎంతో ఇష్టం ❤️ 🙏— BANDLA GANESH. (@ganeshbandla) September 19, 2025చదవండి: లిటిల్ హార్ట్స్.. మరీ అంత బాగోలేదు: యాటిట్యూడ్ స్టార్ -
లిటిల్ హార్ట్స్.. మరీ అంత బాగోలేదు: యాటిట్యూడ్ స్టార్
ప్రముఖ నటుడు ప్రభాకర్ తనయుడు, హీరో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Chandrahas) కొత్త మూవీ చేస్తున్నాడు. అదే కాయిన్. తన బర్త్డే (సెప్టెంబర్ 17) సందర్భంగా కాయిన్ టైటిల్ పోస్టర్తో పాటు, గ్లింప్స్ వీడియో సైతం రిలీజ్ చేశారు. జైరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రీకాంత్ రాజా రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్లో చంద్రహాస్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఏది బాగుందన్న ప్రశ్నకు చంద్రహాస్ ఇలా స్పందించాడు.ఎంజాయ్ చేశా.. కానీ!లిటిల్ హార్ట్స్ కామెడీ ఎంటర్టైనర్. కామెడీ సినిమాలు అప్పటికప్పుడు చూసి నవ్వుకుని వదిలేస్తాను. ఆ మూవీ చాలా బాగుందనైతే నేను చెప్పలేను. కాకపోతే ఎంజాయ్ చేశానంతే! అని చెప్పుకొచ్చాడు. రామ్నగర్ బన్నీ సినిమా నష్టాల గురించి స్పందిస్తూ.. మేము పెట్టినదాంట్లో సగానికంటే ఎక్కువ తిరిగొచ్చింది. కానీ ఆస్తులమ్ముకున్నాం, నష్టాల్లో కూరుకుపోయాం అన్న వార్తల్లో నిజం లేదు అని చంద్రహాస్ క్లారిటీ ఇచ్చాడు.చదవండి: ప్రముఖ నటుడు రోబో శంకర్ కన్నుమూత -
ఒక్క ఏడాదిలోనే రూ.140 కోట్ల నష్టం: మిరాయ్ నిర్మాత
తేజ సజ్జ హీరోగా, మంచు మనోజ్ విలన్గా నటించిన మిరాయ్ మూవీ బాక్సాఫీస్పై కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్లు దాటేసిన ఈ మూవీ మున్ముందు మరిన్ని రికార్డులు తిరగరాయనుంది. ఈ సినిమాతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది. గతేడాది కోట్లాది రూపాయలు నష్టపోయిన ఆయన మిరాయ్పై పెట్టుకున్న ఆశలు నిజమవుతున్నాయి. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓటీటీ వల్ల మా సినిమాల బిజినెస్ దెబ్బతింది.ఒక్క ఏడాదే రూ.140 కోట్ల నష్టంఒక్క ఏడాదిలోనే మేము ఐదారు సినిమాలు చేశాం. అవి వడక్కుపట్టి రామస్వామి, ఈగల్, మనమే, విశ్వం, స్వాగ్, మిస్టర్ బచ్చన్.. ఇవి కొన్ని థియేటర్లో బాగా ఆడినా నాన్ థియేట్రికల్ బిజినెస్ సరిగా చేయలేకపోయాయి. ఈ సినిమాలను ఓటీటీలకు సరైన సమయంలో అమ్మకపోవడం వల్ల భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. కేవలం ఓటీటీల వల్లే 2024లోనే రూ. 120 -140 కోట్లు నష్టపోయాను. ఇంకా రికవరీ అవలేదు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ మరోసారి వైరల్గా మారాయి.చదవండి: సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ స్టార్ హీరో దర్శకుడిని కొట్టాడు -
ఆ హీరోను ఇష్టపడ్డా.. చెల్లి అని పిలిచాడు: హీరోయిన్
హీరోయిన్ మహేశ్వరి (Actress Maheswari) గుర్తుందా? ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించింది. ఇటీవల ఆమె జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి హాజరైంది. ఈ సందర్భంగా ఓ హీరోపై తనకున్న క్రష్ను బయటపెట్టింది. మహేశ్వరి మాట్లాడుతూ.. 'హీరో అజిత్ కుమార్ అంటే నాకు క్రష్. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. తనతో రెండు సినిమాలు చేశాను. షూటింగ్ చివరి రోజు..ఓ మూవీ షూటింగ్ సాగదీయడం వల్ల ఏడాదిన్నర పాటు తనతో కలిసి పని చేశాను. అంతా అయ్యాక షూటింగ్ చివరి రోజు ఊహించనిది జరిగింది. అసలే ఆయన్ను మళ్లీ కలవలేనని బాధపడుతూ కూర్చున్నాను. ఇంతలో అజిత్ నా దగ్గరకు వచ్చి మహి, నువ్వు నా చెల్లెలిలాంటిదానివి. నీ జీవితంలో ఎప్పుడు, ఏం అవసరమొచ్చినా దయచేసి నన్ను అడుగు.. నేను నీకోసం ఉన్నాను అని చెప్పాడు. అలా నా క్రష్ నన్ను చెల్లి అని పిలిచాడు' అని గుర్తు చేసుకుంది.సినిమామహేశ్వరి.. 1994లో కరుత్తమ్మ సినిమాతో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి కాపురం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. గులాబి సినిమాతో సెన్సేషన్ అయింది. దెయ్యం, పెళ్లి, ప్రియరాగాలు, మా బాలాజీ, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ.. ఇలా అనేక సినిమాలు చేసింది. అజిత్తో ఉల్లాసం, నేశం సినిమాల్లో నటించింది. రెండున్నర దశాబ్దాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కొంతకాలం పాటు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన ఆమె ఈ మధ్య కాలంలో పలు షోలు, ఇంటర్వ్యూల్లో కనిపిస్తోంది.చదవండి: ముఖంపై అవాంచిత రోమాలు.. అదే కారణమన్న తెలుగు నటి -
పైరసీ భూతం.. జియోస్టార్ కొత్త ప్రయత్నం!
పైరసీ.. చిత్ర పరిశ్రమను ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న చీడపురుగు. వేల మంది కష్టాన్ని మింగేస్తూ.. కోట్ల రూపాయాల వ్యాపారానికి నష్టాన్ని కలిగిస్తుంది. సినిమా విడుదలైన ఒకటి, రెండు రోజుల్లోనే సోషల్ మీడియాలో పైరసీ కాపీలు ప్రత్యక్షమవుతున్నాయి. కరోనా తర్వాత ఓటీటీ వాడకం పెరగడంతో కొన్నాళ్ల పాటు నివురు గప్పిన నిప్పులా ఉన్న పైరసీ భూతం ఇప్పుడు మళ్లీ జడలు విప్పింది. వందల కోట్లతో నిర్మించిన చిత్రాలు.. రిలీజైన రోజే పైరసీ వెబ్సైట్లలో ప్రత్యేక్షం అవుతున్నాయి. దీని వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. టాలీవుడ్లో ఇటీవల రిలీజైన మిరాయ్ చిత్రాన్ని సైతం ఈ పైరసీ బూతం వదల్లేదు. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థ జియోస్టార్ పైరసీ అడ్డుకట్టకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. స్ట్రీమింగ్ రైట్స్తో పాటు అన్ని హక్కులను కొనుగోలు చేసిన ఓ బాలీవుడ్ మూవీని పైరసీ నుంచి కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ధర్మాసనం.. 72 గంటల్లోగా పైరసీ వెబ్సైట్లను బ్లాక్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.రిలీజ్కు ముందే..బాలీవుడ్లో కామెడీ ఆధారంగా రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా జాలీ ఎల్ఎల్బీ, జాలీ ఎల్ఎల్బీ 2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ తర్వా త ఈ సిరీస్లో మూడో చిత్రంగా వస్తున్న చిత్రం జాలీ ఎల్ఎల్బీ 3. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సీనియర్ నటుడు అర్హద్ వార్సీ, సౌరబ్ శుక్లా, అమృత రావు, హ్యుమా ఖురేషి, బోమన్ ఇరానీ, సీమా బిశ్వాస్, గజరాజ్ రావు, రామ్ కపూర్, అన్ను కపూర్ కీలక పాత్రలు పోషించారు. అలోక్ జైన్, అజిత్ అంధారి నిర్మించిన ఈ కామెడీ లీగల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన జియోస్టార్..ఈ సినిమాని అక్రమంగా స్ట్రీమింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. పైరసీ చేస్తున్న సుమారు 20 వెబ్సైట్లకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ..వాటిని బ్లాక్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.72 గంటల్లోగా బ్లాక్ చేయాలివిచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆ 20 వెబ్సైట్లకు సంబంధించినడొమైన్ రిజిస్ట్రేషన్లను 72 గంటల్లోపు నిలిపివేయాలని డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లు (DNRలు), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికమ్యూనికేషన్స్ విభాగంతో పాటు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. అంతేకాదు సినిమా విడుదలకు ముందు లేదా విడుదల సమయంలో కనుగొనబడిన అదనపు పైరసీ వెబ్సైట్ల వివరాలను తెలియజేయడానికి జియోస్టార్కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, వాటిని కోర్టు ఆదేశాలు లేకుండానే బ్లాక్ చేయొచ్చని తీర్పులో వెల్లడించింది. తప్పుగా బ్లాక్ చేస్తే..కోర్టును సంప్రదించి, సవరించుకోవచ్చుననని ఆదేశాలు జారీ చేసింది. పైరసీ వెబ్సైట్లలనో సినిమాను ప్రసారం చేయడం వల్ల నిర్మాతల ఆదాయం గణనీయంగా తగ్గుతుందని, కోలుకోలేని నష్టాన్ని నివారించడానికి త్వరిత జోక్యం అవసరమని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. తదుపరి విచారణనను వచ్చే ఏడాది జనవరి 20కి వాయిదా వేసింది. -
ముఖంపై అవాంచిత రోమాలు.. అదే కారణమన్న తెలుగు నటి
మగరాయుడి గెటప్తోనే పాపులర్ అయింది తెలుగింటి అమ్మాయి స్నిగ్ధ (Actress Snigdha Nayani). 'అలా మొదలైంది' సినిమాతో తన కెరీర్ మొదలైంది. మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్ కాదల్, చందమామ కథలు, టైగర్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ ఇలా అనేక సినిమాలు చేసింది. ప్రస్తుతం స్నిగ్ధ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.. కానీ సింగర్గా పలు షోలు చేస్తోంది. ఈ నటి రీల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా మగరాయుడిలాగే ఉంటుంది. ఆ కారణం వల్లే ముఖంపై..పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండిపోతానని చెప్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధకు ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. ముఖంపై గడ్డాలు, మీసాలు రావడానికి గల కారణమేంటని యాంకర్ అడిగాడు. అందుకు స్నిగ్ధ స్పందిస్తూ.. షూటింగ్స్కు వెళ్తున్న సమయంలోనే పీసీఓడీ వచ్చింది. దీని వల్ల అవాంచిత రోమాలు వస్తుంటాయి. అలాగే చాలామంది అమ్మాయిలకు ఫేషియల్ హెయిర్ ఉంటుంది. గుండు గీయించుకున్నా..నెలకోసారి థ్రెడింగ్ చేసుకుంటారు. ఇది చాలా మామూలు విషయం. అయితే నేను షూటింగ్స్కు వెళ్లినప్పుడు నా ముఖంపై హెయిర్ కనిపిస్తుందనగానే వెంటనే మేకప్మ్యాన్ లేజర్తో గీకేసేవారు. దానివల్ల అదింకా ఎక్కువైంది. మరో విషయమేంటంటే.. ఎంబీఏ అయిపోగానే నేను గుండు చేయించుకున్నాను. అప్పుడతడు నా తలపై నుంచి ముఖం మీది దవడ వరకు బ్లేడుతో గీకాడు. అప్పటినుంచే అవాంచిత రోమాలు రావడం చిన్నగా మొదలైంది. మా అమ్మక్కూడా ఫేషియల్ హెయిర్ ఉంది అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది.చదవండి: సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ దర్శకుడిని చితకబాదిన స్టార్ హీరో -
సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ స్టార్ హీరో దర్శకుడిని చితకబాదాడు!
బాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ హిందీ చలనచిత్ర పరిశ్రమకు గుడ్బై చెప్పేసి సౌత్కు షిఫ్ట్ అయిపోయాడు. అనురాగ్ సోదరుడు అభినవ్ కశ్యప్ (Abhinav Kashyap) కూడా దర్శకుడిగా హిందీలో రెండే రెండు సినిమాలు చేసి సైలెంట్ అయిపోయాడు. అవి దబాంగ్, బేషరం. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ మూవీ బ్లాక్బస్టర్ విజయం సాధించింది. దీనికి దబాంగ్ 2, 3 అంటూ రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి.ధర్మేంద్రను తీసుకోవాలంటే భయంవాటిలో సల్మాన్ (Salman Khan) హీరోయే కానీ దర్శకుడు మాత్రం మారిపోయాడు. అందుకు గల కారణాన్ని దర్శకుడు అభినవ్ తాజాగా బయటపెట్టాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. దబాంగ్ సినిమా ప్రారంభంలో అంతా బానే ఉంది. అందరం అనుకున్నట్లుగా అనుపమ్ ఖేర్, ఓం పురిని తీసుకున్నాం. కానీ, ధర్మేంద్రను సెలక్ట్ చేసుకోవాలంటే భయమేసింది. అందుకే ఆయనకు బదులుగా వినోద్ ఖన్నాను తీసుకున్నాను.దర్శకుడిని చితకబాదిన హీరోనిజానికి దబాంగ్ మూవీ చేయమని ధర్మేంద్రను కలిశాను. అందుకాయన.. బేటా, ముఖ్యమైన పాత్ర ఉంటేనే ఇవ్వు, లేదంటే వద్దు అని చెప్పాడు. దాంతో నాకు భయమేసింది. ఆయన ఎలాంటి పాత్ర ఆశిస్తున్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే ధర్మేంద్రతో అసభ్య సన్నివేశం చిత్రీకరించినందుకుగానూ దర్శకుడు కాంతిషాపై హీరో సన్నీడియోల్ (Sunny Deol) చేయి చేసుకున్నాడని రూమర్లున్నాయి. ఏదైనా తేడా వస్తే గొడవ ఖాయం అని అర్థమై ధర్మేంద్రను పక్కనపెట్టాను. ఇక నేను ఏ నటుడితో మంతనాలు జరిపినా సల్మాన్ సోదరుడు సోహైల్ నా వెంటే వచ్చేవాడు.తండ్రి ధర్మేంద్రతో బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్సల్మాన్ ఓ గూండాతనే అందరి పారితోషికం గురించి చర్చలు జరిపాడు. వాళ్ల సూచనల ప్రకారమే యాక్టర్స్ను సెలక్ట్ చేసుకున్నా.. కానీ వారికి వ్యతిరేకంగా సోనూసూద్ను సినిమాలో తీసుకున్నా.. సోనూ ఫిజిక్ చూసి సల్మాన్ ఈర్ష్య పడేవాడు. అయినా సరే, వాళ్ల మాటను కాదని సోనూసూద్ను ఎంపిక చేసుకున్నాను. దబాంగ్ సినిమా ముందువరకు సల్మాన్ ఏంటో నాకు తెలీదు. కానీ, తర్వాత అర్థమైంది అతడో పెద్ద గూండా అని! అతడికి యాక్టింగ్ అంటే ఆసక్తి లేదు. సెలబ్రిటీ హోదాను మాత్రం ఇష్టపడేవాడు. అతడో నీచుడు, చెడ్డ వ్యక్తి అని అభినవ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.డైరెక్టర్పై సన్నీడియోల్ ఆవేశం.. అసలు కథ2017లో మిడ్డేలో వచ్చిన వార్తా కథనం ప్రకారం.. ధర్మేంద్ర స్టార్డమ్ కోల్పోయిన సమయంలో బీ గ్రేడ్, సీ గ్రేడ్ (తక్కువ బడ్జెట్, తక్కువ క్వాలిటీతో) సినిమాలు చేశారు. అందులో కొన్ని దర్శకనిర్మాత కాంతి షా తెరకెక్కించారు. అందులో ఓ సినిమాలో ధర్మేంద్రకు గుండెపోటు వచ్చినట్లుగా నటించమన్నాడు. కానీ దాన్ని ఎడిటింగ్లో పూర్తిగా మార్చేశాడు. బెడ్రూమ్ సన్నివేశాల్లో నటించినట్లుగా అశ్లీలంగా రీఎడిట్ చేశాడు. అశ్లీల సీన్లో ధర్మేంద్ర!మొదటగా ఈ సినిమాను పంజాబ్లో రిలీజ్ చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ధర్మేంద్ర ముసలితనంలో ఇలా ఓ అమ్మాయితో బెడ్పై కనిపించడం చూసి అభిమానులు షాకయ్యారు. దీంతో ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ ఆ దర్శకుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఓ కథ గురించి చర్చించుకుందాం రమ్మని దర్శకుడు కాంతిని ఆఫీస్కు పిలిపించాడు. ఆ తర్వాత అతడిని దారుణంగా కొట్టాడు.చదవండి: ఓటీటీలో సూపర్ హిట్ హారర్ సినిమా.. ఎక్కడంటే? -
రెమ్యునరేషన్ కాదు.. ఆ ఒక్క కండీషనే దీపిక కొంప ముంచింది?
ఎంత పెద్ద స్టార్ అయినా హిట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేరు. అందుకే సూపర్ స్టార్స్ సైతం ఫ్లాప్ వస్తే కాస్త భయపడతారు. తర్వాత సినిమా విషయంలో ఆచి తూచి ఆడుగేస్తారు. అల్రేడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ని ఎంచుకుంటారు. లేదా హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తీస్తానంటే కళ్లుమూసుకొని పచ్చ జెండా ఊపుతారు. కానీ దీపికా పదుకొణె మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. అనవసరమైన కండీషన్లతో భారీ ప్రాజెక్టులను వదులుకుంటుంది. మొన్నటికి మొన్న ప్రభాస్- సందీప్రెడ్డి క్రేజీ కాంబో ‘స్పిరిట్’ని మిస్ చేసుకుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ నుంచి తప్పుకుంది. కాదు కాదు.. నిర్మాతలే ఆమెను తప్పించారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. 'కల్కి 2898AD సినిమాకు రాబోయే సీక్వెల్లో దీపికా పదుకొణె నటించడం లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తమ భాగస్వామ్యం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పార్ట్1 సినిమా చేయడానికి చాలా దూరం ప్రయాణించినప్పటికీ, మా మధ్య భాగస్వామ్యం కుదరలేదు. కల్కి వంటి చిత్రానికి నిబద్ధత చాలా అవసరం. ఆమె భవిష్యత్లో మరెన్నో సినిమాలు చేయాలని మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము' అని వైజయంతీ సంస్థ ఎక్స్లో పేర్కొంది. అసలు కారణం ఇదేనా?దీపిక పెట్టిన కండీషన్లే తొలగింపుకు దారి తీశాయని అటు బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ టాక్ నడుస్తోంది. రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేనని దీపికా పదుకొణె కరాఖండిగా చెబుతోందట. అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలోనూ తగ్గడం లేదట. ఇబ్బందికరమైన సీన్లను చేయలేనని చెబుతోందట. కల్కి సీక్వెల్ విషయంలోనూ దీపిక ఇలాంటి కండీషన్లే పెట్టిందట. ఆ ఒక్కటే నచ్చలేదు!అయితే పారితోషికం విషయంలో వైజయంతీ సంస్థ వెనకడుగు అయితే వేయదు. కల్కి 2898 భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అలాంది సినిమాకు సీక్వెల్ అంటే.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం నిర్మాణ సంస్థ పెద్దగా ఆలోచించదు. అడిగినంత ఇచ్చేందుకు రెడీగానే ఉందట. కానీ దీపిక పెట్టిన పని గంటల కండీషనే నచ్చలేదట. భారీ ప్రాజెక్ట్ విషయంలో పని గంటల కండీషన్ పని చేయదు. అందుకే నిర్మాతలు ‘పూర్తి నిబద్ధత’ అవసరం అని ప్రకటించారు. పెద్ద సినిమాల షూటింగ్ చెప్పిన సమయానికి పూర్తికాదు. నెలల తరబడి షూటింగ్ చేయాల్సి వస్తుంది. దీపిక పదుకొణె లాంటి స్టార్స్కి ఈ విషయం తెలుసు. అయినా కూడా తలకు మించిన కండీషన్లు పెట్టి.. సినిమాలను దూరం చేసుకుంటున్నారు. ఇలాంటి కండీషన్లు నచ్చకనే సందీప్రెడ్డి వంగా ‘స్పిరిట్’ నుంచి తప్పించాడు. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కూడా చేజారిపోయింది. దీపికా వైఖరి మారకపోతే.. మున్ముందు సినిమా చాన్స్లు రావడమే కష్టమవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD. After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership. And a film like…— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025 -
ఓటీటీలో సూపర్ హిట్ హారర్ సినిమా.. ఎక్కడంటే?
ఓటీటీలో మలయాళ సినిమాలకున్న క్రేజే వేరు. అయితే ఈసారి లవ్స్టోరీకి బదులుగా ఓ కామెడీ హారర్ మూవీ ఓటీటీ (OTT)లోకి రానుంది. ఆ సినిమాయే సుమతి వలవు (Sumathi Valavu Movie). ఇందులో అర్జున్ అశోకన్, సైజు కురుప్, గోకుల్ సురేశ్, మాళవిక మనోజ్, బాలు వర్గీస్ ప్రధాన పాత్రలు పోషించారు. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రం దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది.ఓటీటీలో హారర్ మూవీతాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 26 నుంచి జీ5లో ప్రసారం కానుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సుమతి వలవు అందుబాటులోకి రానుంది. ఈ మూవీలో హారర్, కామెడీతో పాటు మిస్టరీ, ఎమోషన్స్, థ్రిల్ కూడా ఉందని చిత్రయూనిట్ చెప్తోంది. ఐఎమ్డీబీలో ఈ సినిమా 7.7 రేటింగ్ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ కూడా ప్రకటించారు. വരുന്നു, "സുമതി വളവ്". സെപ്റ്റംബർ 26 മുതൽ നമ്മുടെ ZEE5 മലയാളത്തിൽ#SumathiValavu Premieres 26th September on ZEE5#ArjunAshokan #SidharthBharathan #GokulSuresh #BaluVarghese #SaijuKurup #BobyKurian #MalavikaManoj #JoohiJu #SijaRoseGeorge #Shivada pic.twitter.com/NGNr99ihOA— ZEE5 Malayalam (@zee5malayalam) September 18, 2025చదవండి: అమ్మ పేరుతో పేదలకు రుచికరమైన భోజనం: రాఘవ లారెన్స్ -
'OG' మూవీలో పవర్ఫుల్ రోల్లో ప్రకాశ్ రాజ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన యాక్షన్ మూవీ ఓజీ (OG Movie). ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషించారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ఓజీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ట్రైలర్ను పక్కనపెట్టి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ వదిలింది చిత్రయూనిట్. ఓజీలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఉన్నట్లు ప్రకటించింది. సత్య దాదాగా ప్రకాశ్ రాజ్ఈమేరకు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందులో ప్రకాశ్ రాజ్.. శాలువా కప్పుకుని, కళ్లజోడు పెట్టుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర పేరును సత్యదాదాగా ప్రకటించారు. మరి ఆయన క్యారెక్టర్ ఏంటనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే! ఇక ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. Here’s the versatile force Prakash Raj in #OG 🔥#TheyCallHimOG @prakashraaj pic.twitter.com/NiKjAtc1Qv— DVV Entertainment (@DVVMovies) September 18, 2025 చదవండి: దీపికా పదుకొణెకు షాకిచ్చిన 'కల్కి' టీమ్ -
బాయ్ ఫ్రెండైనా ఉండాలి..బ్యాగ్రౌండ్ ఐనా ఉండాలి
చలనచిత్ర రంగంలో తారలుగా రాణించాలని చాలా మందికి ఉంటుంది. అయితే అది అందరి వల్లా సాధ్యపడేది కాదు టాలెంట్ మాత్రమే ఉంటే చాలదు ఇంకా చాలా చాలా ఉండాలి. అలాంటి వాటిలో ఇటీవల బాగా చర్చనీయాంశం అవుతున్న విషయం సినీ పరిశ్రమలో అప్పటికే స్థిరపడిన కుటుంబాలు, వారికి సంబంధీకులకే తప్ప బయటివారికి అండా దండా లభించవనేది. అందువల్లే బయటివారికి సినిమా రంగంలో అంత త్వరగా అవకాశాలు రావని, ఏదోలా వచ్చినా సక్సెస్ అయినా కూడా స్థిరపడడం కష్టమేనని బయటి నుంచి ఆ రంగంలోకి వచ్చిన వారి ఆరోపణ. అలా ఆరోపిస్తున్నవారిలో తాజాగా సీనియర్ నటి అమీషా పటేల్ కూడా చేరింది. కహోనా ప్యార్ హై సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు తెరంగేట్రం చేసిన ఈ నటి ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ సరసన బద్రి, నాని, నరసింహుడు, పరమవీర చక్ర..సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఆ తర్వాత అకస్మాత్తుగా సినిమాలకు దూరమైన అమీషా ఐదు సంవత్సరాల విరామం తర్వాత 2023లో సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మతో కలిసి గదర్ 2 చిత్రంతో తిరిగి తెరపైకి వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రూ.686 కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత ఆమె చివరిగా 2024లో విడుదలైన తౌబా తేరా జల్వా చిత్రంలో కనిపించింది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలు వచ్చాయి, కానీ అమీషా నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత మళ్లీ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అమీషా ఇంతవరకూ ప్రకటించలేదు.ఎన్ని హిట్ సినిమాల్లో చేసినా అమీషాకు రావాల్సినంత స్టార్ డమ్ రాలేదు. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను టాప్ హీరోయిన్ కాకపోవడానికి కారణమైన సినిమా పరిశ్రమ పరిస్థితులపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్త పరచింది.తన మనస్తత్వం కారణంగా సినీ పరిశ్రమ లోపలి వ్యక్తులు తనను ఇష్టపడరని అమీషా చెప్పింది, సినీరంగంలో రాణించాలంటే ఏదో ఒక శిబిరానికి చెందిన వారై ఉండాలంది. ‘ నేను శిబిరాలకు చెందినదానిని కాదు, వారితో పంచుకోవడానికి నాకు దురలవాట్లు లేవు. మందు తాగను, సిగిరెట్ త్రాగను లేదా పని కావాలని మస్కా–లగావో (కాకాపట్టడం లాంటివి) చేయను నా అర్హత ప్రకారం నాకు ఏది దొరికితే అది నాకు లభిస్తుంది. ఆ కారణంగా వారు నన్ను ఇష్టపడరు. అయినా సరే నేను లొంగిపోను.‘ అంటూ తేల్చి చెప్పేసింది. తనకు తొలి చిత్రం అవకాశం కూడా అతి కష్టమ్మీద వచ్చిందని అంది. ‘కహో నా... ప్యార్ హై’ సినిమా కోసం తాను మొదటి ఎంపిక కాదని, తొలుత కరీనా కపూర్ ను ఎంచుకున్నారని తెలిపింది. అయితే నిర్మాత రాకేష్ రోషన్ కు కరీనా కపూర్తో విభేదాలు వచ్చాక ఆమె ప్రవర్తన పట్ల అసంతృప్తి వచ్చిన కారణంగా ఆమెను ఆ సినిమా నుంచి తొలగించిన తర్వాత మాత్రమే తనకు ఆ అవకాశం వచ్చిందని ఆమె గుర్తుచేసుకుంది. పరిశ్రమ లో సన్నిహితుడో, భాగస్వామి లేనప్పుడు ఒంటరిగా అందులో ఇమడడం చాలా కష్టం అంటోందామె. ‘సినిమా పరిశ్రమకు చెందిన ఓ బాయ్ఫ్రెండ్ లేదా ఒక భర్త లేనప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మీరు పవర్ ఫుల్ కపుల్గా లో ’సగం’ కానప్పుడు రాణింపు చాలా కష్టం. ఎందుకంటే మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉండరు. మిమ్మల్ని సమర్థించడానికి ఎటువంటి కారణం లేదు కదా ఆఫ్ట్రాల్.. మీరు బయటి వ్యక్తి.’’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది. -
ఆ కారణంతో హీరోయిన్ని మార్చాం.. బడ్జెట్ పెరిగింది: బ్యూటీ నిర్మాత
సినిమా ఇండస్ట్రీలో ఒకటి లేదా రెండు శాతమే సక్సెస్ ఉంటుంది. ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా అని అంటే కుదరదు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా నిర్మిస్తూనే ఉండాలనే ఉద్దేశం, లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. మంచి కథలు, అన్ని రకాల జానర్లలో డిఫరెంట్ సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాను.అందుకే ‘బార్బరిక్’, ‘బ్యూటీ’ చిత్రాలను నిర్మించాను’ అన్నారు నిర్మాత విజయ్ పాల్ రెరడ్డి అడిదల.ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై ఆయన నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత విజయ్ పాల్రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘బ్యూటీ’ కథలో అందమైన ప్రేమ కథతో పాటుగా మనసుని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన చిత్రంగా మా ‘బ్యూటీ’ నిలుస్తుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరూ కలిసి చూడదగ్గ చిత్రం. నాకు పర్సనల్గా ఎమోషనల్ సీన్స్ అంటే ఇష్టం. ఈ కథలోని ఎమోషన్స్ నచ్చే నిర్మించేందుకు ముందుకు వచ్చాను.→ ఈ కథను విన్న వెంటనే ఈ మూవీని చేద్దామని మారుతికి చెప్పాను. జీ స్టూడియో సహకారం వల్లే మా సినిమాను ప్రతీ ఒక్కరికీ రీచ్ చేయగలిగాం. రిలీజ్ విషయంలో వారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. మా మూవీని దాదాపు 150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మౌత్ టాక్తో తరువాత మళ్లీ థియేటర్లను పెంచుతాం.→ ‘బ్యూటీ’ని ప్రారంభంలో వేరే హీరోయిన్తో షూటింగ్ చేశాం. ఓ వారం రోజులు అలా షూటింగ్ చేశాం. ముందుగా రైటర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. హీరోయిన్ పక్కింటి అమ్మాయిలా ఉండాలి అనుకున్నాం. ఆ హిరోయిన్ పాత్రకు అంతగా సెట్ అవ్వడం లేదు అని అంతా అనుకున్నాం. ఆ తరువాత నీలఖి ఈ సినిమాలోకి వచ్చారు. అలా సినిమా ఆరంభంలో చేసిన షూటింగ్ అంతా వృథా అయింది. దాని వల్ల బడ్జెట్ కాస్త పెరిగింది.→ ఇప్పటి వరకు ‘బ్యూటీ’ జర్నీ ఎంతో బాగా సాగింది. టైటిల్ ఎంతో క్యాచీగా ఉండటంతో.. జనాల్లోకి ఎక్కువగా వెళ్లింది. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు చూసిన వారంతా కూడా మూవీని మెచ్చుకున్నారు. రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. -
ఐశ్వర్య అంటే ఆ హీరోకి పిచ్చి.. ఆమె ఇంటిముందు సీన్ క్రియేట్ చేసేవాడు
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అందానికి మంత్రముగ్ధులు కానివారు ఉండరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆమెను ఆరాధించారు. కొందరు ఆమెతో ప్రేమలో పడ్డారు, ఒకరిద్దరు ఆమె ప్రేమను తిరిగి పొందారు. వారిలో ఒకరే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan). ఒకప్పుడు సల్మాన్ - ఐశ్వర్య ప్రేమించుకున్నారు. కానీ కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు. 2002లో వీరి బ్రేకప్ స్టోరీ బీటౌన్లో సంచనలంగా మారింది. సల్మాన్తో బ్రేకప్తాజాగా దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్.. ఐష్- సల్మాన్ల బ్రేకప్ గురించి మాట్లాడారు. ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సల్మాన్తో బ్రేకప్ అయ్యాక బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను దూరం పెట్టింది. అప్పుడు తను చాలా బాధపడింది. వీటి గురించి పట్టించుకోవద్దని ఆమెకు ధైర్యం చెప్పేవాడిని. సల్మాన్ కోసం ఇండస్ట్రీ తనను వెలేయడం తట్టుకోలేకపోయింది. అయితే బ్రేకప్ తర్వాతే తను కాస్త ప్రశాంత జీవితం గడిపింది. ఎందుకంటే తను అతి ప్రేమ, కోపంతో పిచ్చిపట్టినట్లు ప్రవర్తించేవాడు. తల గోడకేసి బాదుకునేవాడునేనూ అదే అపార్ట్మెంట్లో ఉండేవాడిని కాబట్టి తను వచ్చివెళ్లేది కనిపిస్తూ ఉండేది. అతడి ప్రవర్తన చూశాక.. ఇలాంటి వ్యక్తితో ఎలా ఉంటున్నావ్? అని అడిగాను. అతడు ఐశ్వర్య కోసం ఆమె ఇంటికి వచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేసేవాడు. తల గోడకేసి బాదుకునేవాడు. అధికారికంగా ప్రకటించే సమయానికంటే ముందే వీళ్లిద్దరూ విడిపోయారు అని చెప్పుకొచ్చారు. కాగా 2007వ సంవత్సరంలో ఐశ్వర్య.. బిగ్బీ కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు ఆరాధ్య సంతానం.చదవండి: ఒక్క డైలాగ్తో ఫేమస్.. నా గొంతు మార్చేశారు, ఇది చాలా తప్పు! -
ఒక్క డైలాగ్తో ఫేమస్.. నా గొంతు మార్చేశారు, ఇది చాలా తప్పు!
కోలీవుడ్ స్టార్ విజయ్ 'బీస్ట్' సినిమాతోనే తెలుగులో ఫుల్ బిజీ అయిపోయానంటున్నాడు తమిళ నటుడు వీటీవీ గణేశ్ (VTV Ganesh). టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నానని చెప్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ చిత్రం కిస్ ప్రెస్మీట్కు హాజరయ్యాడు. కెవిన్, ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ సతీశ్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 19న విడుదల కానుంది.ఒక్క డైలాగ్తో పాపులర్ఈ మూవీ ప్రెస్మీట్లో గణేశ్ మాట్లాడుతూ.. బీస్ట్ సినిమాలో ఎవర్రా, నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్ అనే ఒక్క డైలాగ్తో నేను తెలుగు ఇండస్ట్రీలో ఫేమసయ్యాను. ఈ సినిమాలో ఛాన్సిచ్చిన విజయ్ సర్కు థాంక్స్ చెప్పుకుంటున్నా.. నా గొంతే నా బలం. ఇప్పుడు తెలుగులో చిరంజీవి, నాగచైతన్య.. వంటి స్టార్ హీరోలతో దాదాపు 8 సినిమాలు చేస్తున్నాను. ఇకపోతే కిస్ మూవీ తెలుగు ట్రైలర్లో నా గొంతు మార్చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఈజీగా తప్పించుకుంటారునాకు తెలుగొచ్చు. రేపే డబ్బింగ్ చెప్పమన్నా చెప్తాను. నా వాయిస్ ఎందుకు ఉపయోగించుకోలేదని దర్శకుడిని అడిగినప్పుడు ఏమో, నాకు తెలీదు, చూద్దాం అని తప్పించుకున్నాడు. అదే లేడీ డైరెక్టర్ అయ్యుంటే సరే, నేను చెక్ చేస్తాను అని సరి చేసుకోవడానికి ప్రయత్నించేది. మేల్ డైరెక్టర్లు ఈజీగా తెలీదని తప్పించుకుంటారు అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. గణేశ్.. తెలుగులో భగవంత్ కేసరి, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, సింగిల్ సినిమాల్లో నటించాడు. తమిళ 'జైలర్', 'వారసుడు', 'డాడా'(పాపా), 'ప్రిన్స్' మూవీస్తోనూ అలరించాడు.చదవండి: ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్' -
అప్పుడు మైక్ టైసన్..ఇప్పుడు ఆర్నాల్డ్.. ‘తగ్గేలే’ అంటున్న విజయ్!
విజయ్ దేవరకొండ ఖాతాలో ఈ మధ్య సరైన హిట్ అయితే లేదు కానీ..అవకాశాలకు మాత్రం కొదవ లేదు. పెద్ద పెద్ద బ్యానర్లు ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నాయి. అంతేకాదు..బడ్జెట్ విషయంలోనూ తగ్గడం లేదు. వందల కోట్ల పెట్టి సినిమా చేస్తున్నారు. ఆయన కోసం హాలీవుడ్ నటులను సైతం రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ‘లైగర్’లో మైక్ టైసన్తో తలపడిన విజయ్..ఇప్పుడు ‘మమ్మీ’ విలన్తో పోరాడబోతున్నాడు.రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో ఈ చిత్రానికి నిర్మిస్తుంది. ఇందులో విలన్గా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ( Arnold Vosloo) నటిస్తున్నాడు.‘ది మమ్మీ’, ‘ది మమ్మీ రిటర్న్స్’ లాంటి హాలీవుడ్ సినిమాలతో విలన్గా నటించిన ఆర్మాల్డ్.. విజయ్ చిత్రంతో తొలిసారిగా ఇండియన్ సినిమాల్లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర అందర్ని ఆశ్చర్యపరిచేలా ఉండబోతుందట. విజయ్ సైతం కొత్త గెటప్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే తన లుక్ని మార్చేశాడు. -
ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్'
హను-మాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న తేజ సజ్జ 'మిరాయ్' మూవీ (Mirai Movie)తో మరో బ్లాక్బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. తేజ ప్రధాన పాత్రలో నటించిన మిరామ్ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించాడు. రితికా నాయక్ హీరోయిన్గా యాక్ట్ చేయగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్నిర్మించిన ఈ మూవీకి హరి గౌర సంగీతం అందించాడు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మిరాయ్ రూ.100 కోట్లు కొల్లగొట్టిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. టికెట్ రేట్లు పెంచకుండానే మిరాయ్ ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టడం విశేషం! గొప్ప మనసుతో సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కు మనోజ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇది మంచి సినిమా సాధించిన విజయం అని అభివర్ణించాడు. 100 Crores⚔️🔥Big love and gratitude to Audience especially families for celebrating #Mirai with all your heart🙏🏼❤️🤗This is the Victory of Good Cinema🔥#BlackSword 🚀 pic.twitter.com/hKClY8PcrN— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 17, 2025 చదవండి: దయచేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్.. మహేశ్బాబు రిక్వెస్ట్ -
ఇళయరాజా ఫిర్యాదు.. నెట్ఫ్లిక్స్ నుంచి అజిత్ మూవీ తొలగింపు
సంగీత దర్శకుడు ఇళయరాజా ఫిర్యాదు కారణంగా నెట్ఫ్లిక్స్ నుంచి అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ తొలగించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుమతి లేకుండా తన పాటలను ఉపయోగించారంటూ ఇళయరాజా కోర్టులో పిటిషన్ వేశారు. కాపీరైట్ చట్టానికి ఇది విరుద్దమని, ఆ పాటలను తొలగించడమే కాకుండా.. ఉపయోగించినందుకుగానూ తనకు పరిహారం ఇవ్వాలని ఇళయరాజా కోరారు. దీనిపై విచారణ జరిపిన మద్రాసు కోర్టు.. ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని తొలగించింది. పాటలను తొలగించి..మళ్లీ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తారా లేదా మొత్తానికి స్ట్రీమింగ్ చేయకుండా వదిలేస్తారో చూడాలి.కాగా,ఈ వివాదం గురించి చిత్ర నిర్మాత రవి గతంలో మాట్లాడుతూ.. ఇళయరాజా పాటలకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనలకు అనుగుణంగానే పాటలను ఉపయోగించామని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మే 8 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు,హిందీ,తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు కోర్డు ఆదేశాలతో సడెన్గా నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించారు. -
దయచేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్.. మహేశ్బాబు రిక్వెస్ట్
యూట్యూబర్, మీమర్ మౌళి హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts Movie). శివానీ నాగారం హీరోయిన్గా నటించింది. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా సినిజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించాడు. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.30 కోట్లకుపైగా వసూలు చేసింది.సెలబ్రిటీల ప్రశంసలు సినిమా బాగుందంటూ గోపీచంద్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి సినీతారలు అభినందించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సాయి, మ్యూజిక్ డైరెక్టర్ సినిజిత్ మహేశ్కు పెద్ద ఫ్యాన్స్. ముఖ్యంగా సినిజిత్.. నా దేవుడు మా సినిమా గురించి ఒక్క ట్వీట్ వేస్తే చాలు.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్లిపోతా.. అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు ఆయన కోరిక ఫలించింది. మహేశ్బాబు లిటిల్ హార్ట్స్ సినిమాపై రివ్యూ ఇచ్చాడు. దయచేసి ఎక్కడికీ వెళ్లకు'లిటిల్ హార్ట్స్ కొత్తగా, వినోదాత్మకంగా ఉంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. సినిజిత్.. నువ్వు దయచేసి ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్, త్వరలోనే నువ్వు చాలా బిజీ అయిపోతావ్.. ఇలాగే అదరగొడుతూ ఉండు. చిత్రయూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు' అని మహేశ్బాబు ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్ట్ పెట్టాడు. అభిమాన హీరో ట్వీట్ చూడగానే సినిజిత్ సంతోషంతో ఎగిరి గంతేశాడు. నేను ఎక్కడికీ వెళ్లను అన్నా అని రిప్లై ఇచ్చాడు. NENU INKA YEKKADIKI VELLANU ANNA @urstrulyMahesh 😭😭😭😭😭😭❤️❤️❤️💥💥💥💥💥 https://t.co/KcVcyVHwMK pic.twitter.com/eTH3pOQl0d— SinjithYerramilli (@SinjithYerramil) September 16, 2025 చదవండి: మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు -
జాతీయ అవార్డుగ్రహీత నుంచి ‘ప్రభుత్వ సారాయి దుకాణం’
‘‘ప్రభుత్వ సారాయి దుకాణం’ సినిమాలోని ప్రతి పాత్ర పురాణాల నుంచి ఏదో ఒక పాత్రను, వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తుంది. మనుషుల వ్యక్తిత్వాలు, ఇతర ఆలోచనలన్నింటినీ మా చిత్రంలోని పాత్రలు ప్రతిబింబిస్తాయి. అందుకే జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అనే ట్యాగ్లైన్ పెట్టాం. నాకు చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అని డైరెక్టర్ నరసింహా నంది చెప్పారు. సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేశ్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితీ మైకేల్, మోహనా సిద్ధి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. జాతీయ అవార్డుగ్రహీత నరసింహా నంది రచన, దర్శకత్వంలో ఎస్వీఎస్ ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్పై దైవ నరేశ్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరసింహా నంది మాట్లాడుతూ– ‘‘గ్రామీణ రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో మా చిత్రంలో సరికొత్తగా చూపించాం’’ అని తెలిపారు. ‘‘తొలి ప్రాజెక్ట్గా ఇటువంటి మంచి సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. మా బ్యానర్లో మరో మూడు సినిమాలు రానున్నాయి’’ అన్నారు దైవ నరేశ్ గౌడ. ‘‘ఒక గ్రామంలో జరిగే వాస్తవ ఘటనలకు మహిళా శక్తిని జోడించి, తీసిన సినిమా ఇది’’ అని పరిగి స్రవంతి మల్లిక్ పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ సారాయి దుకాణం’ లాంటి మంచి సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు సిద్ధార్థ్, నటీనటులు శ్రీలు, మోహనా సిద్ధి, విక్రమ్ జిత్ పేర్కొన్నారు. -
మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు
'కోర్ట్' సినిమాతో కోట్లు కొల్లగొట్టిన రోషన్ (Harsh Roshan)-శ్రీదేవి (Sridevi) జంట మరోసారి జత కట్టింది. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త మూవీ బ్యాండ్మేళం (Band Melam Movie). సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రోషన్.. రాజమ్మా.. గీడున్నవా.. నీకోసం ఇల్లంత దేవులాడిన, నీ కొరకో కొత్త ట్యూన్ పెట్టిన.. ఇంటవా.. ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాక ఇనబడ్తది, సూడు అంటూ తను కట్టిన ట్యూన్ వినిపించాడు. మాస్ డైలాగ్స్అటు శ్రీదేవి కూడా.. రాజమ్మ ఎవతిరా? గునపం వేసి గుద్దుతా ** అని బూతు డైలాగ్స్ చెప్పింది. అలా తెలంగాణ యాసలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. టైటిల్ గ్లింప్స్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా రోషన్కు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ అతడి ప్రతిభను గుర్తించి ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. సినిమాఅరవింద సమేత, వెంకీ మామ, సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, స్వాగ్, సరిపోదా శనివారం, మిషన్ ఇంపాజిబుల్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. కోర్ట్ సినిమాతో హీరోగా మారాడు. శ్రీదేవి విషయానికి వస్తే ఈమె కాకినాడ అమ్మాచి. సోషల్ మీడియాలో ఆమె రీల్స్ చూసి తనను కోర్ట్ మూవీకి సెలక్ట్ చేశారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తోంది. ఇప్పుడు తెలుగులో మరోసారి రోషన్తో జత కడుతోంది. ఈసారి తెలంగాణ అమ్మాయిగా అలరించనుంది. చదవండి: 4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్లో ఏడుగురు -
పిల్లల మీద ఒట్టు.. డబ్బులు ఎగ్గొట్టారు.. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు!
సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ప్రాధాన్యం లేదని, ఇక్కడివారికి పెద్దగా అవకాశాలివ్వరనేది ఎప్పటినుంచో ఉన్న వాదన! అయితే అదే నిజమంటోంది ప్రముఖ నటుడు మోహన్బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ప్రసన్న (Manchu Lakshmi Prasanna). ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను నటిస్తానంటే తెలుగులో బోలెడుమంది దర్శకనిర్మాతలు నాకు ఛాన్సిచ్చేందుకు రెడీగా ఉన్నారని అందరూ అనుకుంటారు. తెలుగువారిని తీసుకోరెందుకో?కానీ, అది నిజం కాదు. చాలామంది కన్నడ, తమిళ, మలయాళ భాషల నుంచి నటీమణుల్ని సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ సినిమాలు చూసినప్పుడు ఆ క్యారెక్టర్లో నేనైతే బాగుండేదాన్నేమో అనిపించేది. వెంటనే దర్శకనిర్మాతలకు ఫోన్ చేసి నన్నెందుకు పెట్టుకోలేదు? అని తిట్టేదాన్ని. తెలుగువాళ్లతో పని చేయించుకోవడం తెలుగువాళ్లకే ఇష్టం లేదు. ఇక్కడివారిని సెలక్ట్ చేసుకోవడానికి తెగ బాధపడుతుంటారు. అదెందుకో నాకూ అర్థం కావడం లేదు. నేను సమయానికి సెట్కి వచ్చి బుద్ధిగా పని చేస్తాను. ఎవరినీ, ఏమీ ఇబ్బంది పెట్టను.చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిపైగా ఇప్పటివరకు ప్రతి నిర్మాత నాకు డబ్బులెగ్గొట్టాడే తప్ప నేనెవరికీ డబ్బులెగ్గొట్టలేదు. నా చివరి సినిమా డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వనేలేదు. అడిగితే సినిమా కష్టాలు చెప్తారు. సరేలే, పాపం.. సినిమా ముందుకెళ్లాలి కదా అని షూటింగ్ పూర్తి చేస్తాం. తీరా చూస్తే పిల్లలపై ఒట్లు వేస్తారు, కానీ, డబ్బు మాత్రం ఇవ్వరు. ఇవన్నీ చూసి నిరాశచెందాను. మరో విషయం నాకు ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఈ విషయం చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఎప్పుడూ దీని గురించి అంతగా ఆలోచించలేదు. నేను సంపాదించిందంతా టీచ్ ఫర్ చేంజ్ వంటి సామాజిక సేవకే ఉపయోగించాను.చెప్పుడుమాటలు విని బతికాకానీ, నాకంటూ కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఆలోచించలేదు. ఇప్పుడిప్పుడే డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టాను. మనల్ని మనమే చూసుకోవాలి.. ఎవరూ వచ్చి ఏదీ చేయరు. నా జీవితమంతా చెప్పుడుమాటలు విని బతికేశాను. ఇందులో ఎవర్నీ తప్పుపెట్టడం లేదు. సినిమాల్లేనప్పుడు నేనూ ఇంకో దారి చూసుకోవాలి. అందుకే చీరల బిజినెస్ ప్రారంభించాను. దక్షిణాది స్పెషల్ చీరలను నార్త్కు పరిచయం చేస్తున్నాను అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.చదవండి: రూ.2వేల కంటే ఎక్కువ ఖర్చుపెట్టను: మృణాల్ ఠాకూర్ -
రూ.2వేల కంటే ఎక్కువ ఖర్చుపెట్టను: మృణాల్ ఠాకూర్
సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ భామ టీవీ సీరియల్స్లో నటించి ఆ తర్వాత సినీ రంగప్రవేశం చేసింది. మొదట్లో మరాఠీ చిత్రాల్లో నటించి ఆపై హిందీ చిత్రాల్లో నటిస్తుండగా టాలీవుడ్ కన్ను ఈ అమ్మడిపై పడింది. అలా సీతారామం అనే తెలుగు చిత్రంలో దుల్కర్ సల్మాన్కు జంటగా నటించి పాపులర్ అయింది. హాయ్ నాన్నతో మరింత స్టార్డమ్ అందుకుంది. కానీ తర్వాత ఆమె నటించిన సినిమాలు కొన్ని పెద్దగా ఆదరణ పొందలేవు. దీంతో హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న ఈ అమ్మడికి తాజాగా మరో లక్కీచాన్స్ వరించినట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీలో..అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో మృణాల్ఠాకూర్ ఒక కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఇంతకుముందు శివకార్తికేయన్కు జంటగా మదరాశి చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని ఆమె చేజార్చుకుంది. ఆ తర్వాత కోలీవుడ్లో ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా ఈ అమ్మడికి రాలేదు. ఇకపోతే హీరోయిన్గా తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ చేతినిండా సంపాదిస్తూ కోట్లు కూడబెడుతున్న ఈ బ్యూటీ ఖర్చు చేయడంలో మాత్రం మహా పొదుపరి!అంతకంటే ఎక్కువ పెట్టనుదీనిపై మృణాల్ ఇటీవల చెప్పిన విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. తనకు ఖరీదైన దుస్తులు కొనడం ఇష్టం ఉండదని, ఎంతో డబ్బులు పోసిన కొన్నప్పటికీ అవి బీరువా అరల్లో మూలుగుతుంటాయంది. తాను కొనుగోలు చేసిన దుస్తుల ఖరీదు అత్యధికంగా రూ.2వేలు దాటి ఉండవన్నారు. అయితే సినీ కార్యక్రమాలకు ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మాత్రం లక్షల ఖరీదైన దుస్తులు ధరిస్తానని, అయితే అవన్ని సొంతం కాదని, అద్దెకు తెచ్చుకునేవేనని మృణాల్ తెలిపింది.చదవండి: కథ నచ్చి ఓజీ ఒప్పుకున్నాను: ప్రియాంక మోహన్ -
‘బ్యూటీ’ చూసి అమ్మాయిలకు నాన్న గుర్తొచ్చి కన్నీళ్లు వస్తాయి : వీకే నరేశ్
అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమాలో కీలక పత్రాలు పోషించిన సీనియర్ నటుడు వీకే నరేశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఈ సినిమా సోల్, ఈ సినిమా థీమ్ మాత్రమే ఈ సినిమాకు బ్యూటీ. సుబ్బు రాసిన కథని దర్శకుడు వర్ధన్ అందంగా మలిచాడు. సింఫనీ ఆఫ్ క్రాఫ్ట్ ఈ సినిమా. అన్ని కుదిరాయి దీనికి. ఇటీవల ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కలిసి ఉన్న సినిమాలు తగ్గాయి. ఇందులో ఆ రెండూ ఉన్నాయి. ఇప్పుడు ప్రేక్షకులకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటే నచ్చట్లేదు. ఆర్గానిక్ గా ఉండాలి. అలా ఉంటేనే నచ్చుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ఆర్గానిక్ గా లేదు అని మీకు అనిపిస్తే లక్ష రూపాయలు ఇస్తాను అని ఛాలెంజ్ చేశాను నేను.⇢ ఇవాళ మంచి సినిమా, చెడ్డ సినిమా అని కాదు వాళ్ళు పెట్టే డబ్బులకు సంతృప్తి చెందుతున్నారా లేదా చూస్తున్నారు ఆడియన్స్. ఫ్యామిలీ మొత్తం కూర్చొని సినిమా చూడొచ్చు. ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న సమస్య ఉండొచ్చు. కానీ దీంట్లో ఏమి లేకుండా అంతగా వర్కౌట్ చేసారు. ఈ సినిమాలో ప్రస్తుత జనరేషన్ తమను తాము చూసుకుంటారు. ఈ రోజుల్లో మ్యారేజ్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అది ఒక కమిట్మెంట్. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్, కలిసి ఎంజాయ్ చేసి విడిపోవడం అంతే. ఇప్పటి పిల్లలకు మనం ఏమి చెప్పలేము. ఫ్రెండ్ గా ఉండటమే చేయాలి. ఒక రియలిస్టిక్ కంటెంట్ ని అందంగా చూపించారు.⇢ నాకు కూతురు లేదు అనే లోటు ఎప్పుడూ ఉండేది. ఆ లోటు కాదు కానీ కూతురు ఉంటే ఇంత పెయిన్ పడేవాడినా అని ఈ సినిమాలో అనుభవించాను. ఇవాళ్టి పిల్లలు ఏదో చేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. సినిమాలో ఆ అమ్మాయిని చూసి నేను ఆ పెయిన్ అనుభవించాను. ⇢ ఈ కథ విన్నప్పుడు నేను మెస్మరైజ్ అయ్యాను. నేను కథ విన్నాక మారుతీని ఈ సినిమా నేను చేయగలనా లేదా అని అడిగితే మీరు వంద శాతం పండిస్తారు అన్నారు. చిన్న అపార్ట్మెంట్ లో చాలా కష్టపడి షూట్ చేసాము. ఓల్డ్ సిరీస్ లో మట్టిలో తిరిగే సీన్స్ చేశాను. ఈ సినిమాలో కథ ఆడియన్స్ పాయింట్ నుంచి తీసుకెళ్లారు. అది కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఏమన్నా తప్పులు ఉంటే నేను మీ ముందుకు వచ్చి నిలబడతాను.⇢ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు. చిన్న చిన్న లొకేషన్స్ లో కూడా అమేజింగ్ విజువల్స్ ఇచ్చాడు కెమెరామెన్. ఆర్ట్ డైరెక్టర్ ని కూడా మెచ్చుకోవాలి. ఈ కథని జర్నలిస్ట్ రాసాడు అంటే ఎంత రియాలిటీ ఉంటుందో చూడండి.⇢ చాలా సినిమాల్లో అమ్మ - కొడుకుల రిలేషన్ చూపించారు కానీ తండ్రి కూతుళ్ళ రిలేషన్ చాలా తక్కువ సినిమాల్లో చూపించారు. ఈ సినిమా చూసి అమ్మాయిలకు వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి కంట్లో నీళ్లు రాకపోతే నన్ను అడగండి. ఇంట్లో అన్ని అమ్మ అయితే ఇంటికి కాంపౌండ్ వాల్ లాంటివాడు నాన్న. ఆ ఎమోషనే బ్యూటీ -
ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా
విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ‘కన్యా కుమారి’ ఓటీటీలోకి రాబోతుంది. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించిన వినాయక చవితి కానుకగా గత నెల 27న థియేటర్స్ లోకి వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. రేపటి నుంచి(సెప్టెంబర్ 17)ఈ చిత్రం అమోజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి ‘పుష్పక విమానం’ ఫేం సృజన్ దర్శకత్వం వహించారు. నటి మధు శాలిని ప్రెజెంటర్గా వ్యవహరించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. తిరుపతి(శ్రీచరణ్), కన్యాకుమారి(గీత్ సైని) ఒకే స్కూల్. తిరుపతికి కన్యాకుమారి అంటే ఇష్టం. తిరుపతికి రైతు అవ్వాలి, వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. కన్యాకుమారి మాత్రం పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటుంది. తిరుపతి చిన్నప్పుడే చదువు మానేసి రైతు అవుతాడు. దీంతో వీరిద్దరి మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. ఇక కన్యాకుమారికి ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చేసి బట్టల షాప్ లో పని చేస్తూ ఉంటుంది. కన్యాకుమారి పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. అబ్బాయి జాబ్ చేయాలి, నన్ను సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేయాలి, సిటీలో ఉండాలి అని కండిషన్స్ పెడుతుంది.తిరుపతికి ఏమో రైతు అని పెళ్లి అవ్వదు. అనుకోకుండా తిరుపతి ఫ్రెండ్ వల్ల కన్యాకుమారి – తిరుపతి కలుసుకుంటారు. తిరుపతి మళ్ళీ పాత ప్రేమని బయటకి తీసి కన్యాకుమారి వెంట తిరుగుతాడు. కన్యాకుమారి మాత్రం తిరుపతి రైతు అని పట్టించుకోదు. ఎలాగోలా తిరుపతి ఆమె వెనకాలే తిరిగి ప్రేమలో పడేస్తాడు. కానీ ఆ ప్రేమ బయటపడేలోపే తను సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తారన్నారని కన్యాకుమారి ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్తుంది. కనీసం నీకు ఉద్యోగం కూడా లేదు అని తిరుపతిని ప్రశ్నిస్తుంది. దీంతో తిరుపతి కన్యాకుమారి కోసం వ్యవసాయం మానేసి ఇష్టం లేకపోయినా జాబ్ లో జాయిన్ అవుతాడు. మరి కన్యాకుమారి పెళ్లి ఏమైంది? తిరుపతి - కన్యాకుమారిల ప్రేమ ఫలించిందా? తిరుపతి వ్యవసాయంలో సెటిల్ అయ్యాడా? కన్యాకుమారి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
కేబుల్ వైర్ చాలు ముఖం పచ్చడే... ఖుష్బూ స్ట్రాంగ్ రిప్లై
బరేలీలోని తన కుటుంబ నివాసం వెలుపల జరిగిన దిగ్భ్రాంతికరమైన కాల్పుల సంఘటన తర్వాత కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్ కుమార్తె, బాలీవుడ్ నటి దిశా పటానీ(Disha Patani) సోదరి ఖుష్బూ పటానీ వీటికి తనదైన శైలిలో బలంగా బదులిచ్చారు. తన ఇన్ స్ట్రాగామ్ హ్యాండిల్లో షేర్ చేసిన వీడియోలో ఆమె తనను తాను రక్షించుకోవడానికి కేవలం ఒక డేటా కేబుల్ వంటి సాధారణ రోజువారీ వస్తువు కూడా సరిపోతుందంటూ తనను చంపుతామని బెదిరిస్తూన్న వర్గాలకు ఆమె పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు ప్రమాద క్షణాల్లో తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లోని సాధారణ వస్తువులనే ఎలా సృజనాత్మకంగా ఉపయోగించవచ్చో ఖుష్బూ ఈ వీడియోలో వివరంగా ప్రదర్శించింది. బెదిరింపు పరిస్థితులలో ప్రతిస్పందించడానికి ఎల్లప్పుడూ ఆయుధాలు లేదా యుద్ధ కళల్లో శిక్షణ వంటివి అవసరం లేదని ఈ వీడియోలో ఆమె హైలైట్ చేస్తుంది. బదులుగా, కొంత సమయస్ఫూర్తి, తెగింపు, చురుకుగా ప్రతిస్పందించడం వంటివి సరిపోతాయంటూ ఆమె సాటి మహిళలకు సందేశాన్ని అందించింది. ఒక డేటా కేబుల్ వైర్ను దానిలో పొదిగిన కొన్ని ఇనుప వస్తువులను ఆమె ఒక బలమైన ఆయుధంగా మార్చింది. ఆ వైర్ చూడడానికి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ ఆత్మరక్షణ సమయంలో ఎదుటి వ్యక్తి ముఖం పగలగొట్టడానికి సరిగ్గా సరిపోతుందని ఆమె స్పష్టం చేసింది. కాల్పుల అనంతరం ధైర్యంగా స్పందిస్తూ, ఖుష్బూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలామంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, తెగువను ప్రశంసించారు. ఆమె ఫాలోయర్స్ ఆమెను ఒక ఆధునిక యోథురాలుగా కొనియాడారు. ‘‘మేము ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాం మేడమ్’’ అంటూ మరికొందరు ప్రోత్సహించారు. ‘‘మేడమ్, మీరు అద్భుతంగా స్పందించారు. ఈ పరిస్థితుల్లో ఇలా బలంగా ఉండటానికి ధైర్యంతో పాటు సంకల్ప శక్తి అవసరం’’ అంటూ కొందరు ఆమెను పొగిడారు. ‘‘నిజంగా మేడమ్, మీరు మాకు చాలా స్ఫూర్తినిస్తున్నారు’’అంటూ మరికొందరు యువతులు ఆమెను కొనియాడారు. కొందరు ఆమె క్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సహజంగానే కొందరు మాత్రం ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ ట్రోల్ చేశారు.మొత్తం మీద ఈ ఉదంతం ఇప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియని ఒక ప్రముఖ నటి సోదరిగా మాత్రమే గుర్తింపు పొందిన ఒక సాధారణ యువతిని సెలబ్రిటీగామార్చేసింది.బాలీవుడ్ని కుదిపేసిన ఈ కలకలానికి మూలం శుక్రవారం ఉదయం, బరేలీలోని సివిల్ లైన్లోని విల్లా నంబర్ 40 వెలుపల మోటారుబైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులుతో మొదలైంది, అక్కడ పఠానీ కుటుంబం నివసిస్తుంది. ఈ కాల్పులకు కారణం తామేనని ఓ అతివాద వర్గం ప్రకటించుకోవడంతో పాటు ఇకపై తమ మనోభావాలు దెబ్బతీస్తే పఠానీ కుటుంబంతో పాటు ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరికలు జారీ చేసింది. View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) -
ఆరోజు సౌందర్యతో పాటు నేనూ చనిపోయేదాన్నే..: మీనా
అందం, అమాయకత్వం కలబోసినట్లు ఉంటుంది హీరోయిన్ మీనా (Actress Meena). బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తర్వాత హీరోయిన్గా దక్షిణాది భాషల్లో అనేక సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తాజాగా 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి హాజరైంది. ఈ సందర్భంగా హీరోయిన్ సౌందర్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.క్యాంపెయిన్కు నన్నూ పిలిచారుసౌందర్య, నేను చాలా క్లోజ్. తను చాలా మంచి అమ్మాయి. ప్రచారానికి వెళ్లి చనిపోవడం బాధాకరం. నిజానికి ఆ క్యాంపెయిన్కు నన్ను కూడా రమ్మని పిలిచారు. అప్పుడు నేను షూటింగ్స్తో బిజీగా ఉన్నాను. పైగా ప్రచారాలపై నాకంత ఆసక్తి కూడా లేదు. అందుకే నాకు కుదరదని చెప్పి వెళ్లలేదు. లేకపోయుంటే తనతోపాటు నేనూ వెళ్లాల్సింది. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో తనను కోల్పోయినందుకు చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది.భర్తను కోల్పోయిన బాధలో..మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్ 28న కన్నుమూశారు. ఆ సమయంలో తనపై వచ్చిన రూమర్స్ చూసి మరింత బాధేసిందని పేర్కొంది. నా భర్తను కోల్పోయినప్పుడు ఎంతో బాధపడ్డా.. రెండేళ్లపాటు ఆ బాధ నుంచి బయటపడలేకపోయా.. నా ఫ్రెండ్స్ ఆ విషాదం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు. అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకు నేను చాలా లక్కీ. మళ్లీ పెళ్లంటూ రూమర్స్అయితే నా భర్త చనిపోయిన వారానికే నేను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నానని వార్తలు రాశారు. వీళ్లకసలు మనసుండదా? ఫ్యామిలీ ఉండదా? అనిపించింది. తర్వాత కూడా ఈ రూమర్స్ కొనసాగించారు. ఎవరికి విడాకులైనా వారితో నా పెళ్లి జరగబోతోందని రాశారు. బాధలో ఉన్న నన్ను మరింత బాధపెట్టారు అని తెలిపింది. కాగా జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో జీ5లో స్ట్రీమ్ అవుతోంది.చదవండి: అందరిముందు అలా అనేసరికి షాకయ్యా!: హీరోయిన్ -
ఏఐ సాయంతో నటుడి ఫోటోలు మార్ఫింగ్.. యువతిపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: ఏఐ టెక్నాలజీతో ఓ బాలీవుడ్ నటుడి ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేస్తూ ఆయన స్నేహితులకు, దర్శక, నిర్మాతలకు, కుటుంబ సభ్యులకు పోస్ట్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న యువతిపై బంజారాహిల్స్లో పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నివాసి, ఫ్రీలాన్స్ నటుడు ఆనంద సురేష్ కుమార్ రెన్వా (36)ను జియా ఉనిస్సా నస్రీన్ అనే మహిళ మూడు సంవత్సరాలుగా నిరంతరం వేధిస్తోంది. ఏఐతో మార్ఫింగ్అతని ఇన్స్ట్రాగామ్, వాట్సప్, ఫోన్ అకౌంట్స్ హ్యాక్ చేసి, అతని పేరుతో ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన సెమీ న్యూడ్, న్యూడ్ ఫోటోలు, వీడియోలు సృష్టించింది. ఆ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను పరిశ్రమలోని దర్శకులకు, రెండు ప్రొడక్షన్ హౌస్లకు పంపించి అరాచకానికి పాల్పడిందని, ఈ కారణంగా తన వృత్తిపై తీవ్ర ప్రభావం చూపిందంటూ బాధిత నటుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సోదరికి సైతం అశ్లీల సందేశాలుదాదాపు 15 నుంచి 20 నకిలీ ఖాతాల ద్వారా అతన్ని అవమానపరిచేలా పలు సందేశాలను, వీడియోలను పంపింది. అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడిందని, హృద్రోగ లక్షణాలు కూడా వచ్చాయని బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా అతని సోదరికి కూడా అశ్లీల సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చదవండి: ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్ -
అందరిముందు అలా అనేసరికి షాకయ్యా!: హీరోయిన్
సన్నగా ఉంటే అస్థి పంజరంలా ఉన్నావని, బొద్దుగా ఉంటే బాగా లావైపోయావని ఏదో ఒకరకంగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. తనను కూడా ఇలాంటి కామెంట్లతో బాడీ షేమింగ్ చేశారంటోంది మలయాళ హీరోయిన్ అపర్ణ బాలమురళి (Aparna Balamurali). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొందరు అదే పనిగా ఏదేదో వాగుతారు. ఏం చేస్తున్నావ్? ఇలా అయిపోతున్నావ్? అని కామెంట్లు చేస్తుంటారు. లెక్క చేయట్లేమొదట్లో ఫీలయ్యేదాన్ని. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లేది. కానీ ఇప్పుడవేవీ పట్టించుకోవడం లేదు. ఇలా ధృడంగా మారడానికి నాకు చాలా సమయం పట్టింది. ఒకసారేమైందంటే.. చాలాదూరం ప్రయాణించి విమానాశ్రయంలో దిగాను. ఇంతలో సడన్గా నాకు పరిచయమే లేని వ్యక్తి ఎదురొచ్చి.. ఏంటి? ఇంత లావైపోయావ్? అన్నాడు. షాకయ్యాఅందరి ముందు సడన్గా అలా అనేసరికి షాకయ్యాను. తర్వాత ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయాను. ఇలాంటివి జరిగినప్పుడు మనసుకు కష్టంగా అనిపించేది. కానీ, ఒకానొక సమయంలో ఈ బాధను అధిగమించాను. ఇప్పుడలాంటి కామెంట్లను పట్టించుకోవడమే మానేశాను అని చెప్పుకొచ్చింది. సినిమాఅపర్ణ బాలమురళి 2015లో ఒరు సెకండ్ క్లాస్ యాత్ర అనే మలయాళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సూరరై పొట్రు (ఆకాశమే నీ హద్దురా) సినిమాతో విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. మలయాళంలో సండే హాలీడే, 2018, ధూమం, రుధిరం వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 8 తొట్టకాల్, వీట్ల విశేషం, రాయన్ సినిమాలు చేసింది. ప్రస్తుతం మలయాళంలో మూడు సినిమాలు చేస్తోంది.చదవండి: 'మిరాయ్' రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. నన్ను నేనే కొట్టుకున్నానంటూ.. -
ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన మూవీ ఇడ్లీ కడై (Idli Kadai Movie). ఇది తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రానుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 14న) ఇడ్లీ కొట్టు ఆడియో లాంచ్ నిర్వహించారు. రోజూ తినాలనిపించేదిఈ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు ప్రతిరోజు నాకు ఇడ్లీ తినాలనిపించేది. కానీ నాదగ్గర అంత డబ్బుండేది కాదు. అప్పుడేం చేశానంటే తోటలో పూలు తెంపడానికి పనికెళ్లేవాడిని. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి త్వరగా తోటకు వెళ్లి రెండు గంటలు పనిచేసేవాడిని. అప్పుడు నాకు రూ.2 ఇచ్చేవారు. అది తీసుకున్నాక ముందు చేతి పంపు దగ్గరకు వెళ్లి రోడ్డుపైనే స్నానం చేసేవాళ్లం. తర్వాత ఇడ్లీ కొట్టుకు వెళ్తే.. ఆ డబ్బుతో నాలుగైదు ఇడ్లీలు వచ్చేవి. హ్యాపీగా ఉందిమనం కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కుని తింటే వచ్చే టేస్ట్ దేంట్లోనూ రాదు. మిమ్మల్నందరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నేను చాలామంది అభిమానులను కలిశాను. వారిలో ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు ఉన్నారు. నా ఫ్యాన్స్ ఇంత మంచి స్థాయిలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టుకునేదానిపైనే ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
'మిరాయ్' రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. నన్ను నేనే కొట్టుకున్నానంటూ..
తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా (Mirai Movie) భారీ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. ఎడారిలో ఒయాసిస్సులా.. ఫ్లాపులతో సతమతమవుతున్న మంచు మనోజ్కు సక్సెస్ దొరికినట్లైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ గ్రాండ్గా ఉండటం సినిమాకు మరింత ప్లస్సయింది.చివరిసారి ఎప్పుడు చూశానో..ఈ సినిమా చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎక్స్ (ట్విటర్) వేదికగా రివ్యూ ఇచ్చారు. మిరాయ్ చూశాక.. ఇంత మంచి వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమా చివరిసారి ఎప్పుడు చూశానో గుర్తు రావడం లేదు. రూ.400 కోట్లకుపైగా ఖర్చు పెట్టి తీసిన సినిమాల్లోనూ ఇంత గ్రాండ్ విజువల్స్ చూడనేలేదు. ముందుగా మనోజ్ను ఈ సినిమాలో విలన్గా తీసుకుని తప్పు చేశారనుకున్నాను. కానీ సినిమా చూశాక అతడి పర్ఫామెన్స్ చూసి నన్ను నేనే కొట్టుకున్నా.. నా అంచనా తప్పుఇంత పెద్ద యాక్షన్ అడ్వెంచర్ మూవీలో తేజ మరీ చిన్నపిల్లాడిలా కనిపిస్తాడేమో అనుకున్నా.. ఇక్కడ కూడా నా అంచనా తప్పయింది. విజువల్స్, బీజీఎమ్, స్క్రీన్ప్లే.. అన్నీ అదిరిపోయాయి. ఇంటర్వెల్ సహా మరికొన్ని చోట్ల సినిమా నెక్స్ట్ లెవల్కు వెళ్లింది. కత్తులు, అతీంద్రియ శక్తుల బెదిరింపుల మధ్యలో ప్రేమ, మోసం వంటి అంశాలతో ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించారు. లాభాలొక్కటే కాదు..కార్తీక్.. మిరాయ్ మీరు కన్న అద్భుతమైన కల. పురాణాలను, హీరోయిజాన్ని కలగలిపి చూపించారు. అన్ని విభాగాలపై మీకున్న పట్టు వల్లే ఇది సాధ్యమైంది. విశ్వప్రసాద్.. మీరు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోయినా మీకున్న ప్యాషన్ వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. ఇండస్ట్రీ పెద్దలు వార్నింగ్ ఇచ్చినా లెక్కచేయలేదు, మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. తద్వారా విజయం సాధించారు. లాభాలు తీసుకురావడమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించడం కూడా చిత్రయూనిట్ బాధ్యత అని నిరూపించారు.మనోజ్ రిప్లైచివరగా నేను చెప్పేదేంటంటే.. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని రాసుకొచ్చారు. దీనికి మంచు మనోజ్ (Manchu Manoj).. అన్నా, మీ స్పంద చూస్తుంటే నాకు గూస్బంప్స్ వస్తున్నాయి. చిన్నప్పటినుంచి మీ సినిమాలు చూస్తూ, మీతో కలిసి పనిచేస్తూ పెరిగాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇప్పుడు మీ నోటి నుంచి నా నటనకు ప్రశంసలు దక్కుతుంటే సంతోషంగా ఉంది అని రిప్లై ఇచ్చాడు. Annaaaa …..reading this from you gave me goosebumps 🙏🏻 I grew up watching your cinema, working with you, learning from it and today to hear you speak of my performance like this… it’s beyond special ❤️ thank you anna 🙏🏼🙌🏽#Mirai #BlackSword https://t.co/y9hfmJUGkR— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 14, 2025 చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్.. స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ!
కోలీవుడ్లోకి కొత్త హీరోయిన్ వచ్చేసింది. తృప్తి రవీంద్ర (Trupti Ravindra) ప్రధాన పాత్రలో నటించిన శక్తి తిరుమగన్ (భద్రకాళి) చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది.. మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ బ్యూటీ ఇంజినీరింగ్ పట్టభద్రురాలు, అలాగే స్టేజీ ఆర్టిస్ట్ కూడా! ఐదేళ్లపాటు నాటకాల్లో నటించిన తృప్తి రవీంద్ర పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. డాన్స్, యోగ వంటి వాటిలోనూ ప్రావీణ్యం ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో తృప్తి తమిళ భాషను నేర్చుకోవడం విశేషం. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించి, నిర్మించిన ఈ చిత్రానికి అరుణ్ ప్రభు కథ, దర్శకత్వం అందించారు.సంతోషంగా ఉందితాజాగా తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. థియేటర్ నాటకాల ద్వారా నటనలో శిక్షణ పొందినట్లు చెప్పింది. దర్శకుడు అరుణ్ ప్రభు, విజయ్ ఆంటోనితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. శక్తి తిరుమగన్ మూవీ ద్వారా కథానాయక పరిచయం అవుతుండటం గొప్ప విషయంగా భావిస్తున్నానంది. ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నట్లు తెలిపింది. ఇలాంటి అర్థవంతమైన కథాపాత్రల్లో, ఇతర భాషల్లోనూ నటించడానికి రెడీ అని సిగ్నల్ ఇచ్చేసింది. అదేవిధంగా ప్రేక్షకులపై మంచి ప్రభావాన్ని చూపించే సినిమాలను అందించే ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. View this post on Instagram A post shared by Trupti Ravindra (@trupti_ravindra_) -
100 రోజులు ఆడిన శ్రీలీల మూవీ.. ఇప్పుడు తమిళంలో..
వైరల్ వయ్యారి శ్రీలీల (Sreeleela) త్వరలో శివకార్తికేయన్కు జంటగా పరాశక్తి చిత్రంతో తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దీనికంటే ముందు 'కిస్ మీ ఇడియట్' అనే చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఇది ఆమె కన్నడంలో నటించిన రెండవ చిత్రం కిస్కు రీమేక్ కావడం గమనార్హం. కన్నడలో కిస్ మూవీ 2019లో విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. విరాట్ కథానాయకుడిగా నటించిన ఇందులో రోబో శంకర్, నాంజిల్ విజయమన్, అస్వతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయశంకర్ రామలింగం ఛాయాగ్రహణం, ప్రకాష్ నిక్కి సంగీతాన్ని అందించారు. కథేంటంటే?మాతృకకు పనిచేసిన డైరెక్టర్ అర్జున్ తమిళ వర్షన్కూ పని చేస్తున్నారు. కిస్ మీ ఇడియట్ చిత్రం సెప్టెంబర్ 26వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు మీడియాకు వెల్లడించాడు. 'కాలేజీలో చదువుకునే శ్రీలీల తన తోటి విద్యార్థులతో కలిసి ఆట పట్టించినందుకు గాను ప్రిన్సిపల్ ఆమెను తరగతి గది నుంచి ఒక రోజు బహిష్కరిస్తాడె. దీంతో కోపంతో బయటికి వచ్చిన శ్రీలీల కళాశాల వెలుపల ప్రిన్సిపల్ ఫొటో ఉన్న బ్యానర్పై రాయి విసురుతుంది. ఆ రాయి అటుగా వస్తున్న విరాట్ కారుపై పడటంతో అద్దం పగులుతుంది. తప్పని స్థితిలో..దీంతో శ్రీలీలను విరాట్ నష్టపరిహారంగా రూ.4 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తాడు. అంత డబ్బు తన వద్ద లేదని శ్రీలీల ప్రాధేయ పడితే ఒక ముద్దు ఇవ్వు లేదా తన వద్ద రెండు నెలలు సహాయకురాలిగా పనిచేయమని చెబుతాడు. దీంతో శ్రీలీల అతని వద్ద రెండు నెలలు సహాయకురాలుగా పనిచేయడానికి అంగీకరిస్తుంది. అలా శ్రీలీల విరాట్పై ప్రేమ పెంచుకున్న తరుణంలో గడువు పూర్తి కావడంతో ఆమెను పని నుంచి తొలగిస్తాడు. ఆ తర్వాత ఆమె లేకుండా తాను ఉండలేనన్న భావన విరాట్కు కలుగుతుంది అలాంటి వారి ప్రేమ ఫలించిందా ? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కిస్ మీ ఇడియట్ రూపొందింది అని దర్శకుడు చెప్పారు. -
డబుల్ మీనింగ్ డైలాగ్స్ నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు: మారుతి
హారర్ జానర్లో ప్రభాస్ నటిస్తున్న తొలి చిత్రం ది రాజా సాబ్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తుండగా టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ది రాజాసాబ్ను డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీ వాయిదా పడేట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామా? అన్న ఆలోచనలో ఉన్నారు. పిచ్చిమాటలు, బూతులుతాజాగా రాజాసాబ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) బ్యూటీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య ఓ డైరెక్టర్ తన సినిమాకు జనాలు రాలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. పది మంది కళాకారులను తయారు చేసే దర్శకుడు అలాంటి పిచ్చిపనులు చేయొద్దు. ఎందుకంటే.. ఆడియన్స్ను రప్పించడానికి పిచ్చిమాటలు, బూతులు మాట్లాడుతున్నారు. నాకంటే గొప్పగా ఎవరూ రాయలేడుచొక్కా తీసేస్తామంటున్నారు, సినిమాలు మానేస్తామంటున్నారు. ఒక సినిమా ఆడకపోతే ఇంత దిగజారిపోతారా? ఏంటిది? ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడితే సినిమాకు హైప్ వస్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు రాశాను. ఒక్కసారి నేను కూర్చుని రాయడం మొదలుపెడితే నాకంటే గొప్పగా ఎవడూ రాయలేడు. కానీ బస్టాప్ సినిమాతోనే డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాయడం ఆపేశాను. రూ.400 కోట్లతో రాజాసాబ్బూతు డైలాగులు ఎందుకని రాయడం లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? బ్యూటీ లాంటి సినిమాకు వంద డైలాగులు ఇస్తాను. కుటుంబంతో కలిసి ప్రేక్షకులు థియేటర్కు రావాలి. వారికి క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో, బస్టాప్ సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు రాసిన బూతు డైరెక్టర్ని.. రూ.400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నా.. నా ఎదుగుదల, గ్రాఫ్, కెరీర్ చూడండి. చిల్లర పనులు చేయొద్దుఅందరూ ఊరికనే డైరెక్టర్లు అయిపోరు. పాన్ ఇండియా స్టార్స్.. ఊరికనే ఫ్లాప్ డైరెక్టర్ని పిలిచి సినిమా అవకాశాలివ్వరు. ఊరికనే సినిమాలిచ్చారంటే ప్రభాస్ మనసులో నేనున్నా! మేమిద్దరం ఎంత ప్రేమతో ఉంటామో మాకు తెలుసు. సినిమా ఆడించేందుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనమెప్పుడూ మంచి సినిమా చూస్తారు. అంతేకానీ చిల్లరపనులు చేయకండి అని మారుతి చెప్పుకొచ్చాడు.చదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్బాస్కు.. ఎవరీ మాస్క్ మ్యాన్ -
డిప్రెషన్.. చనిపోవాలని చాలాసార్లు ట్రై చేశా..: హీరోయిన్
ఒకానొక సమయంలో జీవితంపై విరక్తి వచ్చి తనువు చాలించాలనుకున్నాను అంటోంది హీరోయిన్ మోహిని (Actress Mohini). తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయిన ఆమె అక్కడే సెటిలైపోయింది. మోహిని- భరత్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. తాజాగా తన వైవాహిక జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది మోహిని. డిప్రెషన్లో..నా పెళ్లయ్యాక భర్త, పిల్లలతో సంతోషంగా ఉన్నాను. కానీ, ఒకానొక సమయంలో నాలో తెలియని బాధ మొదలైంది. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. పోనీ, నా జీవితంలో ఏమైనా కష్టాలున్నాయా? అంటే ఏమీ లేవు. అంతా ఎప్పటిలాగే ఉంది. కానీ, నేను మాత్రం డిప్రెషన్ నుంచి బయటకు రాలేకపోయాను. ఆత్మహత్యకు ప్రయత్నించాను. అలా ఒక్కసారి కాదు, పలుమార్లు చనిపోయేందుకు ట్రై చేశాను. ఆ సమయంలోనే ఓ జ్యోతిష్యుడిని కలవగా నాపై చేతబడి జరిగిందని చెప్పాడు. దాన్నుంచి బయటపడ్డా..మొదట నవ్వుకున్నాను. కానీ ఆలోచిస్తే అదే నిజమనిపించింది. నా అంతట నేనుగా చనిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తాను? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. తర్వాత ఆ భగవంతుడిని నమ్ముకుని దాన్నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చింది. కాగా మోహిని తెలుగులో ఆదిత్య 369 సినిమాతో పాపులర్ అయింది.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్బాస్కు.. ఎవరీ మాస్క్ మ్యాన్ -
బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ సునామీ.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?
మిరాయ్..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. తక్కువ బడ్జెట్లో గొప్ప సినిమా తీశారంటూ విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తొలి రోజు(సెప్టెంబర్ 12) 27.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లను సాధించింది. మొత్తం రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 55.60 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.(చదవండి: మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!)ఓవర్సీస్లోనూ ఈ చిత్రం దూసుకెళ్తుంది. నార్త్ అమెరికాలో రెండు రోజుల్లోనే 1 మిలియన్ల డాలర్లను రాబట్టింది. యూఎస్, కెనడాలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఈ మూవీకి వచ్చిన హిట్ టాక్ని బట్టి చూస్తే..వీకెండ్లోగా ఈజీగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.(చదవండి: రెండోసారి ప్రసవం.. మానసికంగా దెబ్బతిన్నా: ఇలియానా)మిరాయ్ విషయానికొస్తే.. హనుమాన్ తర్వాత తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రమిది. మంచు మనోజ్ కీలక పాత్ర పోషించాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించారు. -
ఫోటోతో పాటు కింద నా రేటు కూడా వేసి వైరల్ చేశారు: బిగ్బాస్ నైనిక
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమని, సినిమా ఆఫర్స్ కోసం కమిట్మెంట్స్ అడుగుతారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. అయితే గతంలో దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు నటీమణులు భయపడేవారు. కానీ ఈ మధ్య తమకు ఇబ్బంది కలిగిస్తే.. మీడియా ముఖంగా వారి పేర్లను బటయపెడతున్నారు. క్యాస్టింగ్ కౌచ్పై చర్చిస్తూ.. నూతన నటీనటులకు అవగాహన కలిగిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను, వేధింపుల గురించి బాహాటంగానే వెల్లడించారు. తాజాగా డ్యాన్సర్, బిగ్బాస్ ఫేం నైనిక కూడా క్యాస్టింగ్ కౌచ్పై స్పందించారు. చాలామందిలాగానే తాను కూడా క్యాస్టింగ్ కౌచ్కి గురయ్యానని చెప్పింది. కమిట్మెంట్ ఇస్తే.. సినిమా చాన్స్ ఇస్తామని చాలా మంది అడిగారని, తాను నో చెప్పడంతో వాళ్లంతా మళ్లీ కాల్ చేయలేదని చెప్పింది. తాజాగా ఆమె ఓ టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.‘సినీ ఇండస్ట్రీ ఇప్పుడు వల్గర్గా తయారైంది. అందరూ గలీజ్ అయిపోయారు. ఓపెన్గానే కమిట్మెంట్ అడిగేస్తున్నారు. ఆ మధ్య నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్రాండ్ ప్రమోషన్స్ కోసం అని చెప్పి..‘పర్సనల్ రిక్వెర్మెంట్’ అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఆయన బ్రాండ్ని ప్రమోట్ చేయాలేమో అనుకున్నా. ఓకే చెప్పా. ఆయన మరోసారి ‘పర్సనల్ రిక్వెర్మెంట్’ అని చెప్పడంతో నాకు అర్థమైంది. నాకు తెలిసిన వ్యక్తి కావడంతో.. ‘మీ ఫోటోతో పాటు మీ రేటు కూడా బయటకు వెళ్తుంది. బాగా వైరల్ అయింది’ అని చెప్పాడు. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అమ్మాయిల వల్లే ఈ ఫార్మెట్ క్రియేట్ అయింది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. కొంతమంది అలా చేస్తున్నారు కూడా. నేను ఆర్టిస్ట్ అయినా కూడా.. ఒకవేళ నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీలోకి రానివ్వను. ఈ ఫీల్డ్ మంచిది కాదని చెబుతా’అని నైనిక చెప్పుకొచ్చింది.ఇక తన తండ్రి గురించి కూడా నైనిక చెప్పుకొచ్చింది. ఆయన తమతో ఉండరని, తానే ఇంటి నుంచి పంపేశానని చెప్పింది. ‘డాడీ మాతో ఉండరు. డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. ఆయన మంచోడు కాదు. అమ్మని టార్చర్ చేశాడు. అందుకే నేను డాడీని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పా. ‘నువ్వు ఉంటే నేను ఇంట్లో ఉండను’ అని డాడీతో చెప్పా. ఇప్పుడు ఆయన మాతో ఉండడం లేదు. డాడీని మిస్ అయిన ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగలేదు. అమ్మ నన్ను చాలా బాగా పెంచింది. కష్టపడి ఆడిషన్స్కి తీసుకెళ్లేది. అమ్మలా నేను కూడా నా పిల్లలను పెంచలేను. ఆమెకు ఒక మంచి ఇళ్లు కొనివ్వడమే నా లక్ష్యం’ అని నైనిక చెప్పుకొచ్చింది. ఢీ షో ద్వారా డ్యాన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నైనిక.. బిగ్బాస్ 8 లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం కొరియోగ్రఫీ చేస్తూనే..ఆర్టిస్ట్గానూ ప్రయత్నాలు చేస్తుంది. -
మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!
మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించగా, రితికా నాయక్ హీరోయిన్గా చేసింది. శ్రియ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు.రికార్డులు తిరగరాయడం ఖాయంమిరాయ్కు తొలి రోజే రూ.27 కోట్లు రావడంతో చిత్రయూనిట్ 'బ్రహ్మాండ్ బ్లాక్బస్టర్ సక్సెస్' పేరిట విజయోత్సవాలు జరుపుకుంది. సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే మిరాయ్ రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ తన గొంతు అరువిచ్చాడు. సినిమా ప్రారంభంలో ప్రభాస్ గొంతు వినిపించగానే ప్రేక్షకులు ఎగిరిగంతేస్తున్నారు. మిరాయ్ మూవీకి అంత బూస్ట్ ఇచ్చిన ప్రభాస్ దీనికోసం ఎంత డబ్బు తీసుకున్నాడని కొందరు చర్చలు మొదలుపెట్టారు. ఓటీటీ పార్ట్నర్అసలే ప్రభాస్ది వెన్నలాంటి మనసు. తన వల్ల సినిమాకు ప్లస్ అవుతుందంటే సరేనని గొంతు అరువిచ్చి సాయం చేశాడే తప్ప ఒక్క పైసా కూడా తీసుకోలేదట! దీంతో రెబల్ స్టార్ను అభిమానులు మరోసారి ఆకాశానికెత్తేస్తున్నారు. ఇకపోతే మిరాయ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. నెల రోజుల తర్వాతే మిరాయ్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలున్నాయి. అంటే అక్టోబర్ నెలలో మిరాయ్ ఓటీటీలో ప్రత్యక్షం కానుందని తెలుస్తోంది.చదవండి: ప్యారడైజ్లో విలన్గా మోహన్బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి -
రామ్ చరణ్, జూ.ఎన్టీయార్.. చేతి వాచీలు అంత ఖరీదా?
సగటు మనిషికి చేతి గడియారం అంటే సమయాన్ని తెలుసుకునే ఒక అవసరమైన వస్తువు మాత్రమే కావచ్చు. కానీ సెలబ్రిటీలకు, ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్, పెట్టుబడి, స్టేటస్ సింబల్... అంతేకాదు అన్నింటికీ మించి ఒక కళా ఖండం కూడా. బాలీవుడ్ తారల నుంచి క్రికెటర్లు వ్యాపార దిగ్గజాల వరకు, భారతదేశంలోని అత్యంత ప్రముఖు వ్యక్తులలో కొందరు లగ్జరీ కార్లు లేదా బహుళ అంతస్తుల భవనాల కంటే ఎక్కువ ఖరీదు పెట్టి కేవలం చేతి గడియారాలను కలిగి ఉన్నారంటే.. అర్ధమవుతుంది విలాసం అనేది ఏ స్థాయిలో పెరిగిందో...ఒక్కసారి ఖరీదైన చేతివాచీలు కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితా చూద్దామా...అత్యంత ఖరీదైన వాచీ ఎవరిదంటే...నెం1 సినిమా తారల్ని సైతం ఇంటి ముంగిట డ్యాన్స్ చేయించేంత డబ్బు, పలుకుబడి ఉన్న భారతదేశపు కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వాచీ అత్యంత ఖరీదైనదిగా తెలుస్తోంది. ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత సంక్లిష్టమైన గడియారాలలో ఒకటైన పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ స్కై మూన్ టూర్బిల్లాన్ ను అనంత్ అంబానీ కలిగి ఉన్నాడు. ఆ చేతి వాచీ విలువఏకంగా రూ. 70.48 కోట్లు , ఇది డబుల్ డయల్స్ తో ఖగోళ విధులను సైతం అందిస్తుంది, ఇది చేతివాచీల తయారీ శాస్త్రమైన హోరాలజీలో ఒక గొప్ప కళాఖండంగా ఖ్యాతి పొందింది.కండల వీరుడూ...కాస్ట్లీ వాచ్బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం రూ. 64.43 కోట్లు విలువైన పటేక్ ఫిలిప్ అక్వానాట్ హౌట్ జోయిలెరీ రెయిన్ బో జెమ్స్టోన్స్, డైమండ్స్ వాచ్ను ధరిస్తాడు. విలువైన రాళ్లతో కూడిన అద్భుతమైన ఇంద్రధనస్సుతో, ఈ చేతివాచీ అతని ఆడంబరమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.పాండ్యా... వాచ్ ఇట్...ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పిచ్ మీద బ్యాట్తో తన ఆటతీరుకు మాత్రమే కాదు బయట తన విలాసవంతమైన జీవనశైలికి కూడా అంతే ప్రసిద్ధి చెందాడు. అతని పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ బ్లూ డైమండ్ బాగెట్స్ చేతి వాచీ దర ఏకంగా రూ. 43.83 కోట్లు వజ్రాల ధగధగలతో ఇది మైదానంలో అతని బ్యాటింగ్ మెరుపుల్ని తలపిస్తుంది.రిచ్ దా...బాద్షా...భారతదేశపు ర్యాప్ స్టార్ బాద్షా ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ఫైవ్3–01 టూర్బిల్లాన్ పాబ్లో మాక్ డోనఫ్’’ లిమిటెడ్ ఎడిషన్ ను కలిగి ఉన్నాడు. ఇది అడ్వాన్స్డ్ డిజైన్స్ తో ఈ రూ. 24.85 కోట్లు ఖరీదు చేస్తుంది. ఈ వాచ్ అతని సంగీతం లాగే మహా బోల్డ్గా ఉంటుంది.యంగ్ టైగర్...వాచ్ కా షేర్...టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 40–01 మెక్లారెన్ స్పీడ్టైల్ ఆటోమేటిక్ టూర్బిల్లాన్ ’’ను కలిగి ఉన్నాడు. దీని ధర రూ. 8.93 కోట్లు. రేసింగ్–ప్రేరేపిత డిజైన్ కలిగిన ఈ వాచీ ఆయన పవర్ ప్యాక్డ్, శక్తివంతమైన పెర్మార్మెన్స్కు సరిగ్గా నప్పుతుంది.→ పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ పెర్పెచువల్ క్యాలెండర్ క్రోనోగ్రాఫ్ క్లాసిక్ వాచీని బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ధరిస్తాడు. ఆయన దీని కోసం రూ. 6.48 కోట్లు ఖర్చు చేశాడు→ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ రంగురంగుల రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ కాస్మోగ్రాఫ్ డేటోనా రెయిన్ బో వాచీని వినియోగిస్తాడు. దీని ధర రూ. 4.36 కోట్లు ఇది రోలెక్స్ అత్యంత అద్భుతమైన పీస్లలో ఒకటి.→ మరో ప్రముఖ భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మ: రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్65–01 వాచీని వాడతాడు. దీని ధర రూ. 4.36 కోట్లు.→ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఎవెరోస్ వాచ్ ఖరీదు రూ. 4.25 కోట్లు.→ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్: జాకబ్ – కో. ఆస్ట్రోనోమియా సోలార్ కాన్సెటలేషన్స్ వాచీని వినియోగిస్తున్నాడు. దీని ధర రూ. 3.05 కోట్లు.→ గాయకుడు, నటుడు యో యో హనీ సింగ్ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 011 ఫెలిపే మాస్సా వాచీతో కనిపిస్తాడు. ఈ వాచీ ఖరీదు రూ. 2.18 కోట్లు.→ అంబానీల కుటుంబానికి చెందిన ఆకాష్ అంబానీ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్67–02 బ్రాండ్ని ధరిస్తాడు. ఈ వాచీ విలువ రూ. 2.51 కోట్లు. -
ప్యారడైజ్లో విలన్గా మోహన్బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
ఎప్పుడూ ఏదో ఒకరకమైన గొడవలతో మంచు ఫ్యామిలీ నిత్యం వార్తల్లో ఉండేది. కానీ, ఈ మధ్య సినిమాల అప్డేట్స్తో మాత్రమే వార్తల్లో నిలుస్తోంది. మొన్నామధ్య విష్ణు 'కన్నప్ప', నిన్న మనోజ్ 'మిరాయ్', నేడు లక్ష్మి, మోహన్బాబుల 'దక్ష' సినిమాల అప్డేట్స్ నడుస్తున్నాయి. చూస్తుంటే మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి. కన్నప్పలో విష్ణు నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. రిలీజ్కు రెడీ అయిన దక్షపుష్కరకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్కు మిరాయ్తో భారీ విజయం దక్కింది. మంచు లక్ష్మి కూడా తన తమ్ముళ్లలాగే మంచి హిట్ కొట్టాలన్న కసితో దక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఓ సీక్రెట్ను బయటపెట్టేసింది. అలా అనుకుంటే జీవితం నరకం'మనోజ్ కమ్బ్యాక్ నాకు ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తుంటాయి. అవి ముగిసిపోతే బాగుండు అని అందరూ అనుకుంటారు. కానీ, జీవితం ఇంతే అనుకుంటే నరకం.. జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. మనోజ్.. ఎంతో మనోవేదనను దాటుకుని ఇంతదూరం వచ్చాడు. అయితే మనోజ్కు, నాకు వయసవుతుంది.. కానీ, మా నాన్నకు వయసవ్వడం లేదు. ఆయన ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. లీక్ చేసిన మంచు లక్ష్మి(అంతలోనే నాలుక్కరుచుకున) అఫీషియల్గా వచ్చిందా? లేదా నేనే లీక్ చేశానా? సరే పోనీ.. నాని ఏమీ అనుకోడు. ఆ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఫోటోలు తీసుకునేటప్పుడు.. తన లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. శారీరక వ్యాయామాలు చేస్తున్నాడు. ఈ వయసులో చాలామంది యాక్టర్స్ ఏదో రెండు గంటలు పని చేసి, నేను ఇంతకంటే ఎక్కువ చేయను అని బిల్డప్ ఇస్తుంటారు.చాలాకాలం తర్వాత విలన్గాకానీ, నాన్నగారు అలా చేయరు. ఆయన సెట్స్కు వస్తే ఒక చిన్నబిడ్డలా ప్రవర్తిస్తారు. పెద్ద డైరెక్టర్ అయినా, కొత్త డైరెక్టర్ అయినా అందరితో ఒకేలా ఉంటారు. ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్' అని లక్ష్మీ మంచు చెప్పుకొచ్చింది. కాగా దసరా తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! దీనికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చాలాకాలం తర్వాత ఈ సినిమా కోసం మోహన్బాబు విలన్గా నటించనున్నారని ప్రచారం జరిగింది. మంచు లక్ష్మి కామెంట్స్తో ఇప్పుడది నిజమని రుజువైంది.చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
Lilo And Stitch: ఏలియన్తో స్నేహం.. ఓటీటీలోకి గిలిగింతలు పెట్టించే మూవీ!
హేయ్ కిడ్స్...జియో స్టార్ లో ఓ సూపర్ మూవీ వచ్చిందోచ్. అదే లిలో & స్టిచ్. ఇదో సైంటిఫిక్ కామెడీ మూవీ. ఎర్త్ కి దూరంగా ఓ ప్లానెట్ లో ఏలియన్స్ ఓ ఎక్సపరిమెంట్ చేస్తుంటారు. దాంట్లో 626 అనే సూపర్ పవర్స్ ఉన్న ఏలియన్ ను క్రియేట్ చేస్తారు. అయితే యాక్సిడెంటల్ గా ఆ 626 ఏలియన్ ఎర్త్ మీద పడుతుంది. అది కూడా సరిగ్గా లిలో అనే పాప ఇంటి దగ్గర పడుతుంది. ఏలియన్ ప్లానెట్ హెడ్ ఈ 626 ని ఎర్త్ నుండి తీసుకురావడానికి మరో రెండు ఏలియన్స్ ని భూమి మీదకు పంపిస్తారు. అయితే ఈ లోపు పేరెంట్స్ ,ఫ్రెండ్సూ లేని లిలో కి 626 దొరికి మంచి ఫ్రెండ్ అవుతుంది.లిలో దానికి స్టిచ్ అని పేరు పెడుతుంది. లిలో & స్టిచ్ చేసే అల్లరి ఈ సినిమాలో సూపర్ హైలైట్. మరీ ముఖ్యంగా స్టిచ్ చేసే అల్లరి మిమ్మల్ని గిలిగింతలు పెట్టిస్తుంది. స్టిచ్ ని ఎత్తుకెళ్ళడానికి వచ్చిన ఇద్దరు ఏలియన్లు మనుషుల్లా మారి చేసే అల్లరి ఇంకా సూపర్ గా ఉంటుంది. ఇంకో సూపర్ విషయం ఏంటో తెలుసా, ఈ సినిమాని రూ. 10 కోట్లు పెట్టి తీస్తే వచ్చిన వందల కోట్ల లాభాలు వచ్చాయి. సో కిడ్స్..హావ్ ఎ నైస్ జర్నీ విత్ లిలో & స్టిచ్ ఆన్ జియో స్టార్.- హరికృష్ణ ఇంటూరు -
‘దక్ష’ కోసం మా అక్క లక్ష్మి చాలా కష్టపడింది: మంచు మనోజ్
‘‘ప్రస్తుతం థియేటర్స్ అన్నీ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా హిట్ అయింది. బెల్లంకొండ సాయి ‘కిష్కింధపురి’ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మా ‘మిరాయ్’ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. నెక్ట్స్ ‘దక్ష’ చిత్రం రాబోతోంది. ఆ తర్వాత ‘ఓజీ’ మూవీ వస్తోంది. ఈ నెల మూవీ లవర్స్కు ఫీస్ట్లా ఉంటుంది. అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది’’ అని హీరో మంచు మనోజ్ తెలిపారు. మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో, మంచు మోహన్బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘దక్ష–ది డెడ్లీ కాన్సిపిరసీ’. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ప్రెస్మీట్కి ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్ మాట్లాడుతూ– ‘‘దక్ష’ కోసం మా అక్క లక్ష్మి చాలా కష్టపడింది. మా నాన్న, అక్క కలిసి నటించిన ‘దక్ష’ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ–‘‘నాన్నగారి తర్వాత నన్ను అంత బాగా చూసుకునేది మనోజ్. మనోజ్ హీరోగానే కాదు... విలన్గానూ మెప్పించగలడు, కామెడీ చేయగలడు. వర్సెటైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. మా ‘దక్ష‘ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ వాళ్లు పంపిణీ చేస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘దక్ష’ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. విష్ణు అన్న ‘కన్నప్ప’, మనోజ్ అన్న ‘మిరాయ్’ సక్సెస్ అయినట్లే లక్ష్మి అక్క ‘దక్ష’ కూడా విజయం సాధించాలి’’ అన్నారు వంశీకృష్ణ మల్లా. -
పెళ్లి, తల్లి అయితే ఏంటి.. దూసుకెళ్తున్న హీరోయిన్లు!
హీరోయిన్ల కెరీర్ అంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అనే నానుడి ఇండస్ట్రీలో ఉంది. పెళ్లికి ముందు ఫుల్ క్రేజ్తో దూసుకెళ్లే నాయికల కెరీర్ మిసెస్ అయ్యాక జోరు తగ్గుతుందని, అవకాశాలు అరకొరగా వస్తాయని అంటుంటారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ‘మిసెస్ అయితే ఏంటి?’ అని ఇండస్ట్రీ అనుకుంటోంది... పెళ్లయ్యాకా కెరీర్లో దూసుకెళ్లాలని హీరోయిన్లు అనుకుంటున్నారు. అయితే పెళ్లి తర్వాత చాన్స్లు వచ్చినా అక్క, చెల్లి, వదిన... వంటి పాత్రలకే వారిని పరిమితం చేస్తుంటారనే వారూ ఇండస్ట్రీలో లేకపోలేదు. కానీ ఈ పరిస్థితి కూడా మారింది. ప్రస్తుతం మాత్రం పెళ్లి అయినా కెరీర్లో ఏ మాత్రం జోరు తగ్గకుండా దూసుకెళుతున్నారు పలువురు హీరోయిన్లు. మిసెస్ అయినా క్రేజ్, చాన్స్ల విషయంలో తగ్గేదే లే అంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా ఆయా భాషల హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగు పెట్టినా, తల్లిగా ప్రమోషన్ పొందినా అవకాశాల్లో మాత్రం జోరు చూపిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్లో విజయవంతంగా దూసుకుపోతున్న హీరోయిన్లు ఎవరో ఓ లుక్ వేద్దాం. ఇష్టంతో... తెలుగు చిత్ర పరిశ్రమకు ‘ఇష్టం’తో (2001) వచ్చారు శ్రియ శరణ్. ఆ తర్వాత ‘సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, ఎలా చెప్పను, నేనున్నాను, ఛత్రపతి, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు శ్రియ. అదే విధంగా మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారామె. కెరీర్ జోరుగా ఉన్న సమయంలోనే 2018 మార్చి 19న ఆండ్రీ కోస్చీవ్తో పెళ్లి పీటలెక్కారు శ్రియ. అయితే వివాహం తర్వాత కూడా ఆమె వరుస చాన్స్లు అందిపుచ్చుకున్నారు. 2021 జనవరి 10న ఓ ΄ాపకు జన్మనిచ్చారు శ్రియ. ఆ సమయంలో కొంచెం విరామం తీసుకున్న ఆమె 2022 నుంచి వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆమె నటించిన సూర్య ‘రెట్రో’ (ప్రత్యేక పాట) సినిమా మే 1న విడుదలైంది. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’ చిత్రం శుక్రవారం ΄ాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తేజ సజ్జా తల్లిగా అంబిక ΄ాత్రలో నటించారు శ్రియ. ఆమె ΄ాత్రకి మంచి ఆదరణ వస్తోంది. ఇంకా శ్రియ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. తన తొలి సినిమా (ఇష్టం) లానే కెరీర్ అంటే ఉన్న ఇష్టంతో సినిమాల్లో కంటిన్యూ కావాలనుకుంటున్నారు శ్రియ. జోరుగా చందమామ రెండు దశాబ్దాలుగా అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కాజల్ అగర్వాల్. ‘క్యూ! హో గయా నా’ (2004) అనే బాలీవుడ్ మూవీలో అతిథి ΄ాత్రలో కనిపించిన ఈ బ్యూటీ తేజ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీ కళ్యాణం’ (2007) సినిమా ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. అయితే కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’ (2007) చిత్రంతో ఓవర్ నైట్ ΄ాపులర్ అయ్యారు కాజల్. ఆ సినిమా తర్వాత ఆమెని టాలీవుడ్ చందమామ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు అభిమానులు. ఆ తర్వాత తెలుగులో ‘మగధీర, ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మేన్, సారొచ్చారు, నాయక్, బాద్షా, టెంపర్, ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారామె. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఈ బ్యూటీ 2020 అక్టోబరు 30న గౌతమ్ కిచ్లుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేశారు ఈ బ్యూటీ. 2022 ఏప్రిల్ 19న ఓ బాబుకి జన్మనిచ్చారు కాజల్. ఆ సమయంలో కొంచెం విరామం తీసుకున్న ఈ చందమామ సెకండ్ ఇన్నింగ్స్లోనూ మళ్లీ అదే జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘ది ఇండియా స్టోరీ, రామాయణ: పార్ట్ 1, రామాయణ: పార్ట్ 2’ వంటి హిందీ మూవీస్తో పాటు ‘ఇండియన్ 3’ అనే తమిళ సినిమా చేస్తున్నారు. అదే జోరు చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా కెరీర్ని సొంతం చేసుకున్నారు నయనతార. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్, క్రేజ్ని సంపాదించుకున్నారామె. ‘మనస్సినక్కరే’ (2003) అనే మలయాళ సినిమాతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్గా కంటిన్యూ అవుతున్నారు. ఓ వైపు హీరోలకి జోడీగా వాణిజ్య సినిమాల్లో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ తానేంటో నిరూపించుకుంటున్నారు. హీరోయిన్గా జెట్ స్పీడ్లో దూసుకెళుతున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో పెళ్లి పీటలెక్కారు నయన్. 2022 జూన్ 9న వీరి వివాహం జరిగింది. వారికి ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన మిగతా హీరోయిన్లు కెరీర్లో స్లో అయినప్పటికీ నయన్∙మాత్రం ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతున్నారామె. నయనతార ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ‘మన శంకరవరప్రసాద్గారు’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అరడజనుకు పైగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. బిజీ బిజీగా... ‘గిల్లి’ (2009) సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టారు రకుల్ప్రీత్ సింగ్. ‘కెరటం’ (2011) చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారామె. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ (2013) సినిమాతో తెలుగులో తొలి హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు రకుల్. ఆ తర్వాత ‘లౌక్యం, నాన్నకు ప్రేమతో, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి పలు హిట్ మూవీస్ చేశారు. తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన ఈ బ్యూటీ హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించి, ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త, నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 2024 ఫిబ్రవరి 21న ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత కూడా వరుస చాన్స్లతో కెరీర్ని కంటిన్యూ చేస్తున్నారామె. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మేరే హస్బెండ్ కి బీవీ’ చిత్రంతో సందడి చేశారు రకుల్. ప్రస్తుతం హిందీలో ‘దే దే ΄్యార్ దే 2, పతీ పత్నీ ఔర్ ఓ 2’ వంటి మూవీస్తో బిజీ బిజీగా ఉన్నారు రకుల్ ప్రీత్ సింగ్. అలాగే కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ‘ఇండియన్ 3’లో రకుల్ నటించారు. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. షార్ట్ బ్రేక్ తర్వాత... ‘అందాల రాక్షసి’ (2010) సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయమయ్యారు లావణ్యా త్రి΄ాఠి. ఆ తర్వాత ‘మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా’ వంటి పలు హిట్ మూవీస్లో యాక్ట్ చేశారామె. తెలుగులోనే కాదు... పలు తమిళ చిత్రాల్లోనూ నటించారు లావణ్య. 2023 నవంబరు 1న హీరో వరుణ్ తేజ్ని ప్రేమ వివాహం చేసుకున్నారు లావణ్య. వివాహం తర్వాత కూడా ఆమె సినిమాలు చేశారు. లావణ్య నటించిన తమిళ చిత్రం ‘టన్నెల్’, తెలుగు సినిమా ‘సతీ లీలావతి’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అథర్వా మురళి, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘టన్నెల్’. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్పై ఎ.రాజు నాయక్ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా లావణ్యా త్రి΄ాఠి, దేవ్ మోహ¯Œ జంటగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(‘శివ మనసులో శృతి’) సినిమాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగమోహన్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే ఈ నెల 10న లావణ్యా త్రి΄ాఠి ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుని, మళ్లీ సినిమాలతో బిజీ అవుతారని ఊహించవచ్చు. పెళ్లయిన వెంటనే ప్రమోషన్తో... ‘పైలెట్స్’ (2000) సినిమాతో బాలనటిగా మలయాళంలో అడుగుపెట్టారు కీర్తీ సురేశ్. 2013లో విడుదలైన ‘గీతాంజలి’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మలయాళ, తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2016లో విడుదలైన ‘నేను శైలజ’ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయం అయ్యారామె. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి, రంగ్ దే, సర్కారువారి పాట, దసరా, భోళా శంకర్, ఉప్పు కప్పురంబు’ వంటి పలు సినిమాల్లో నటించారు. దివంగత నటి సావిత్రి బయోపిక్గా రూపొందిన ‘మహానటి’ చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు కీర్తి. వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్న ఆమె... తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ని 2024 డిసెంబరు 12న వివాహం చేసుకున్నారు. గోవాలో హిందు, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. వివాహం అనంతరం హనీమూన్కి కూడా వెళ్లకుండా తాను కథానాయికగా నటించిన తొలి హిందీ చిత్రం ‘మేరీ జాన్’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో మెడలో పసుపుతాడుతో పాల్గొని, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. పెళ్లి తర్వాత కూడా కీర్తీ సురేశ్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఆమె నటించిన ‘ఉప్పు కప్పురంబు’ చిత్రం ఈ ఏడాది జూలై 4న రిలీజ్ అయింది. ప్రస్తుతం ‘రివాల్వర్ రీటా, కన్నివెడి’ వంటి తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు కీర్తి. టాప్ ప్లేస్లో... బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు దీపికా పదుకోన్. ‘ఐశ్వర్య’ (2006) అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కెరీర్కి చేరువ అవుతున్నారు. కన్నడ, హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లిష్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారామె. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్తో ఏడడుగులు వేశారు. 2018 నవంబరు 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా దీపిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ ్ర΄ాజెక్టులను సొంతం చేసుకుని, ఔరా అని ఆశ్చర్యపరిచారామె. ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకోన్ పేరు టాప్ ప్లేస్లో ఉండటం విశేషం. పైగా పెళ్లయినప్పటికీ హిందీలో అత్యధిక ΄ారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కంటిన్యూ అవుతున్నారీ బ్యూటీ. రణ్వీర్–దీపిక దంపతులకు దువా పదుకోన్ సింగ్ అనే ΄ాప ఉంది. 2024లో అమ్మగా ప్రమోషన్ పొందారు దీపిక. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగూ బిజీ అవుతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కింగ్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా ఉంది. భలే జోరు... అందం, అభినయంతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు ఆలియా భట్. ‘సంఘర్‡్ష’ (1999) సినిమాతో బాలనటిగా వెండితెరపై మెరిసిన ఆమె ఇప్పటికీ కెరీర్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. హీరోయిన్గా బిజీ బిజీగా ఉన్న సమయంలోనే హీరో రణబీర్ కపూర్ని పెళ్లి చేసుకున్నారు. 2022 ఏప్రిల్ 14న వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే కెరీర్ కంటిన్యూ చేశారు ఆలియా. వరుస అవకాశాలు అందిపుచ్చుకుని తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటూ నిరూపించారామె. రణబీర్ కపూర్–ఆలియా భట్లకు రాహా అనే పాప ఉంది. 2022 నవంబరు 6న వీరు తల్లితండ్రులుగా ప్రమోషన్ పొందారు. పాప పుట్టిన తర్వాత సినిమాలకు కొంచెం విరామం ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్లీ బిజీ బిజీ అయ్యారు. వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఆల్ఫా, లవ్ అండ్ వార్’ సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే... 2022లో రిలీజైన తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్కి జోడీగా సీత పాత్రలో ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇక బ్రేక్ లేకుండా... హీరోయిన్ కియారా అద్వానీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం బాలీవుడ్లోనే కాదు... టాలీవుడ్లోనూ ఈ బ్యూటీకి యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘ఫగ్లీ’ (2014) అనే సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కియారా దశాబ్దానికి పైగా దూసుకెళుతున్నారు. మహేశ్బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ (2018) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ బ్యూటీ ‘వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో వరుస అవశాలతో దూసుకెళుతున్న సమయంలోనే హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్నారామె. 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్ లో వీరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు కియారా. ఆమె నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది జనవరి 10న, ‘వార్ 2’ మూవీ ఆగస్టులో విడుదలైంది. ఈ ఏడాది జూలై 15న ఒక పాపకు జన్మనిచ్చారామె. ప్రస్తుతం ఆమె చేతిలో ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే కన్నడ– ఇంగ్లిష్ చిత్రం ఉంది. పెళ్లి, తల్లయిన కారణంగా కొంత గ్యాప్ తీసుకున్నారు కియారా. అయితే ఇక బ్రేక్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారు. వీళ్లే కాదు... ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్, కాజోల్, రాణీ ముఖర్జీ, జ్యోతిక, కత్రినా కైఫ్, విద్యాబాలన్, యామి గౌతమ్, మౌని రాయ్.. ఇలా పలువురు హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా అవకాశాలు అందుకుంటూ తమ జోరు చూపిస్తున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
ప్రభాస్గారి వాయిస్ మిరాయ్కి మంచి వెయిట్ : తేజ సజ్జా
‘‘మిరాయ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది. ఈ చిత్రాన్ని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. వాళ్ళ ఆదరణ వల్లే నేను సినిమాలు చేయగలుగుతున్నాను. ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నాను’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శ్రియ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా ‘బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్’ పేరిట శనివారం చిత్రయూనిట్ నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో తేజ సజ్జా మాట్లాడుతూ–‘‘దర్శకుడు కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్గార్లు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. మా మీద విశ్వప్రసాద్గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. మంచు మనోజ్గారి రాకతో మా సినిమా నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. ‘మిరాయ్’ కథ ప్రభాస్గారి వాయిస్ ఓవర్తో ప్రారంభమవ్వడం వల్లే మా సినిమాకు వెయిట్ వచ్చింది. మా సినిమాను సపోర్ట్ చేసిన ప్రభాస్, రానాగార్లకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత సక్సెస్తో నా ఫోన్ మోగుతూనే ఉంది. నాకు ఇదంతా కలలా ఉంది. ఈ కథలో నన్ను భాగం చేసిన కార్తీక్కు రుణపడి ఉంటాను. విశ్వప్రసాద్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. తమ్ముడు తేజ మంచి స్థాయికి వెళ్తాడు. మా అన్నతమ్ముళ్లు ఇద్దరి కోసం ప్రభాస్గారు నిలబడ్డారు (మంచు విష్ణు ‘కన్నప్ప’లో ప్రభాస్ కీలక పాత్రలో నటించారు). ఆయనకు థ్యాంక్స్’’ అని తెలిపారు మనోజ్ మంచు. ‘‘మిరాయ్’ నాలుగేళ్ల జర్నీ. తేజ అప్పట్నుంచి ట్రావెల్ అవుతున్నాడు. నన్ను నమ్మిన విశ్వప్రసాద్ గారికి, ఈ సినిమాలో భాగమైన అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు దర్శకుడు కార్తీక్. ‘‘2024 మాకు అంతగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో ‘మిరాయ్’ సక్సెస్ మాకు మరెన్నో సినిమాలు చేసే గొప్ప ఎనర్జీ ఇచ్చింది. గౌర హరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా తర్వాతి నాలుగు సినిమాలకు కూడా ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. మా అమ్మాయి కృతి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా తన జర్నీ మొదలుపెట్టి, ఈ సినిమాతో నిర్మాతగా మారారు. తను మా లక్కీ చార్మ్ అని భావిస్తున్నాం’’ అని తెలిపారు. -
హృదయాలను హత్తుకునేలా ‘బ్యూటీ’ ట్రైలర్
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యూటీ’. ఫాదర్ డాటర్ రిలేషన్, ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రానికి ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. కథ, స్క్రీన్ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ని విడుదల చేశారు మేకర్స్. యువ సామ్రాట్ నాగ చైతన్య విడుదల చేసిన ఈ ట్రైలర్.. హృదయాలను హత్తుకునేలా ఉంది.ఎప్పుడైనా నేను నిన్ను కొప్పడితే నన్ను అలా వదిలి పెట్టి వెళ్ళకు'.., 'నిన్ను వదిలేసి వెళ్ళడం అంటే.. నా ఊపిరి వదిలేయడమే కన్నా' అంటూ హీరో హీరోయిన్లు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఓపెన్ చేశారు. స్కూటీ కొనిస్తాను అని తండ్రి మాట ఇవ్వడం, మిడిల్ క్లాస్ ఫాదర్ ఎమోషన్స్, 'క్యాబ్ డ్రైవర్ అయితే క్యాబ్ డ్రైవర్ లా ఉండాలి గానీ కలెక్టర్ లా ప్రామిస్ చేయొద్దు' అనే డైలాగ్ ప్రతీ ఒక్కరిని కదిలించేలా ఉంది.ఈ ట్రైలర్ లోని డైలాగ్స్, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, ఫాదర్ డాటర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ కష్టాలు ఇలా అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ఇక మ్యూజిక్, ఆర్ ఆర్, విజువల్స్ అయితే టాప్ నాచ్ గా ఉన్నాయి. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు నటించారు. -
అవన్నీ చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది : సాయి దుర్గ తేజ్
‘సోషల్ మీడియాలో పిల్లల మీద అబ్యూజ్ చేస్తున్నారు. అలాంటి కామెంట్లు చేస్తే కూడా లైక్స్ చేస్తున్నారు.నవ్వుతున్నారు. అవన్నీ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మనం ఇలాంటి సమాజాన్ని కోరుకున్నామా?’ అని సాయి దుర్గతేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన హైదరాబాద్లో జరిగిన ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ..సోషల్ మీడియాలో చిన్న పిల్లల మీద పిచ్చి కామెంట్లు చేస్తున్నా..అవి చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒక్కరు కూడా అది తప్పని చెప్పడం లేదు. డార్క్ కామెడీ టాపిక్పై ఎవరైనా మాట్లాడాతారా? మీడియా స్పందిస్తుందా? అని నేను ఎదురు చూశాను. కానీ ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. ఇక ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. అందుకే నేను ఆ సమయంలో అలా రియాక్ట్ అయ్యాను. డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది.. కానీ ఎదుటి వాళ్లని బాధ పెట్టే వరకు ఉండకూడదు.ఇప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. ఇప్పుడంటే చాట్ జీటీపీ, ఏఐ అంటున్నారు.. కానీ నాకు మాత్రం మా అమ్మే ప్రపంచం. అమ్మ, మామయ్యలు, స్నేహితులు ఇలా అందరితో నేను సమయాన్ని ఎక్కువగా గడిపేవాడ్ని. పిల్లలతో పేరెంట్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి. నేను నా సెకండ్ క్లాస్లోని లవ్ స్టోరీని మా అమ్మతో చెప్పాను. అలా చెప్పే స్వతంత్రాన్ని నాకు ఆమె ఇచ్చారు. పేరెంట్స్తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లలకు ప్రతీ విషయాన్ని ప్రేమతో చెప్పే ప్రయత్నం చేయాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయాల్ని స్కూల్లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్ చెప్పే ప్రయత్నం చేయాలి.ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాలో బిజీగా మారిపోయారు. కనీసం వారంలో ఓ పూట అయినా మన ఫ్యామిలీతో కలిసి గడపాలి.. కలిసి మాట్లాడుకోవాలి. అందరికీ బాధ్యతల్ని నేర్పించాలి. సోషల్ మీడియాలో పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. సోషల్ మీడియా ఐడీలు తల్లిదండ్రుల నంబర్లకు కనెక్ట్ చేయడమో లేదా ఆధార్ కార్డ్కి లింక్ చేయడమో ఏదో ఒకటి చేయాలి’ అని సాయి దుర్గతేజ్ డిమాండ్ చేశారు. -
‘మంచు’ బ్రదర్స్కి అండగా ప్రభాస్.. మనోజ్ ఎమోషనల్!
ప్రభాస్ మంచితనం గురించి అందరికి తెలిసిందే. సాయం కోరి వస్తే.. తనకు సాధ్యమైనంతవరకు చేస్తాడని ఆయనను దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు. తన వల్ల ఒక సినిమాకు హెల్ప్ అవుతుందని చెబితే.. ‘స్టార్’ హోదాని సైతం పక్కకు పెట్టి వస్తాడని ‘కన్నప్ప’తో నిరూపించాడు.(చదవండి: నా కుటుంబాన్ని నిలబెట్టారు, నాలో భయాన్ని చంపేశారు: మనోజ్ భావోద్వేగం)ప్రభాస్కి ఉన్న క్రేజ్కి ‘కన్నప్ప’లోని రుద్ర పాత్ర చాలా చిన్నదనే చెప్పాలి. కానీ మోహన్ బాబు, మంచు విష్ణుల కోసం ప్రభాస్ ఆ పాత్ర ఒప్పుకున్నాడు. ప్రభాస్ కనిపించినంత సేపు థియేటర్స్ ఊగిపోయాయి. ఆయన ఉండడం వల్లే కన్నప్ప తొలి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టగలిగింది. అయితే ఈ చిత్రానికి ప్రభాస్ కూడా ఒక్క రూపాయి పారితోషికంగా తీసుకోకపోవడం గమనార్హం. ప్రభాస్ స్థానంలో మరో ఏ హీరో ఉన్నా.. ఇలా ఒప్పుకునేవారు కాదేమో. ఈ విషయాన్ని మంచు విష్ణు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు(చదవండి: రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన మిరాయ్.. తేజ కెరీర్లోనే అత్యధికం..)అలా కన్నప్పతో మంచు విష్ణుకి తోడుగా నిలిచిన ప్రభాస్.. ఇప్పుడు ‘మిరాయ్’తో తమ్ముడు మనోజ్కి అండగా నిలిచాడు. తేజ సజ్జ, మనోజ్ నటించిన ఈ చిత్రానికి ప్రభాస్ గాత్రదానం చేశాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన చిత్ర యూనిట్..రిలీజ్కి కొన్ని గంటల ముందు అఫిషియల్గా ప్రకటించింది. ప్రభాస్ వాయిస్ ఓవర్కి థియేటర్స్ దద్దరిల్లిపోతుండగా, సోషల్ మీడియా ఊగిపోతుంది. ఇలా అటు కన్నప్ప, ఇటు మిరాయ్ చిత్రాలకు తనవంతు సాయం అందించి, మంచు బ్రదర్స్కి రెబల్ స్టార్ అండగా నిలిచాడు. ఇదే విషయాన్ని మిరాయ్ సక్సెస్ మీట్లో మంచు మనోజ్ గుర్తు చేస్తూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ‘మా అన్నదమ్ములకు సపోర్ట్గా నిలబడినందుకు థ్యాంక్యూ సో మచ్ డార్లింగ్’ అంటూ ప్రభాస్కి కృతజ్ఞతలు తెలిపాడు. -
Heer Express: బాలీవుడ్లోకి వచ్చిన మరో ప్రేమ కథ
‘సైయారా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్లో మరో లవ్ స్టోరీ రిలీజైంది. అదే ‘హీరో ఎక్స్ప్రెస్’. ’ఓ మై గాడ్’, ‘102 నాట్ అవుట్’ ఫేం ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివిత జునేజా, ప్రిత్ కమాని హీరోహీరోయిన్లుగా నటించారు. అశుతోష్ రానా, గుల్షన్ గ్రోవర్, సంజయ్ మిశ్రా, మేఘనా మాలిక్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నిన్న(సెప్టెంబర్ 12) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే హిట్ టాక్ వచ్చింది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. వంట చేయడంలో ఆసక్తిగల హీర్ వాలియా(దివిత జునేజా) అనే పంజాబీ అమ్మాయి, తన వంట నైపుణ్యాలతో ప్రపంచాన్ని జయించాలని కలలు కంటుంది. సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించాలనే లక్ష్యంతో చెఫ్గా పనిచేయడానికి లండన్కు వెళ్తుంది. అక్కడ ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి, హీర్ చివరకు తన లక్ష్యాన్ని చేరుకుందా లేదా? అనేదే మిగతా కథ. ఫ్యామిలీ ఎమోషన్, వినోదం, క్యూట్ లవ్స్టోరీతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉందని బాలీవుడ్ రివ్యూస్ చెబుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఉమేష్ శుక్లా, ఆశిష్ వాఘ్, మోహిత్ ఛబ్రా, మరియు సంజయ్ గ్రోవర్ సంయుక్తంగా నిర్మించారు. సంపదా వాఘ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. -
సక్సెస్ చూసి 12 ఏళ్లు.. నా ఫ్యామిలీని నిలబెట్టారు: మనోజ్ ఎమోషనల్
విజువల్ వండర్గా తెరకెక్కిన మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. థియేటర్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. సెప్టెంబర్ 12న రిలీజైన ఈ మూవీ తొలి రోజు రూ.27.20 కోట్లు రాబట్టిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించాడు. శనివారం (సెప్టెంబర్ 13) ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. రుణపడి ఉంటా..ఇలాంటి సక్సెస్ మీట్లో పాల్గొని చాలాకాలమైందంటూ మనోజ్ (Manchu Manoj) భావోద్వేగానికి లోనయ్యాడు. సక్సెస్ వేదికపై నిలబడ్డందుకు సంతోషంగా ఉంది. దాదాపు 10-12 ఏళ్ల తర్వాత నా ఫోన్ మోగుతోంది. అందరూ సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు. కానీ, నాకు చాలాకాలమైంది. నిన్నటినుంచి అందరూ ఫోన్లు చేసి విషెస్ చెప్తుంటే అంతా కలలాగే ఉంది. దర్శకుడు కార్తీక్ ఏం ఆలోచించుకుని కథ రాసుకున్నారో కానీ నాకోసం ఓ పాత్ర రాసుకుని అడిగారు. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కమ్బ్యాక్ ఎప్పుడని అడిగేవారుఈ సినిమా నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అని కార్తీక్ నాకు చెబుతూ ఉండేవాడు. ఆ మాట చాలనుకున్నాను. ఎప్పుడూ ఏదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతూ ఉండేవాడిని. అప్పుడు సోషల్ మీడియాలో.. అన్నా, కమ్బ్యాక్ ఎప్పుడు? సినిమా చేయు, నీకు హిట్టు పడాలి, కమ్బ్యాక్ ఇవ్వు అని అడుగుతూ ఉండేవారు. వస్తున్నాను తమ్ముడు, త్వరలోనే చేస్తాను అనేవాడిని. బయటకు ధైర్యంగా మాట్లాడినా లోపల మాత్రం ఏదో తెలియని భయం ఉండేది. చాలా సినిమాలు దగ్గరివరకు వచ్చి వెళ్లిపోయాయి. ఒకటనుకుంటే ఇంకోటి జరిగేది. నా కుటుంబాన్ని నిలబెట్టారుఇలాంటి సమయంలో డైరెక్టర్ కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్ నన్ను నమ్మారు. కార్తీక్లాంటి దర్శకుడు, టెక్నీషియన్ను నా జీవితంలో చూడలేదు. మిమ్మల్ని దగ్గరినుంచి చూసినందుకు సంతోషంగా ఉంది. మీరు నన్నొక్కడినే కాదు, నా కుటుంబాన్ని సైతం నిలబెట్టారు. ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు కానీ నాలో ఓ భయం ఉండేది. నేను పెరిగినట్లుగా నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా? వాళ్లను బాగా చూసుకోగలుగుతానా? అని రోజూ భయపడేవాడిని. ఆ భయాన్ని మీరు చంపేశారు. నేను గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరి పాదాలకు నా వందనం అని మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు? -
సింహాలతో ఆటలాడిన బ్యూటీ.. ఇంత ధైర్యం ఎలా?
'ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు' అన్నది సినిమా డైలాగ్. ఎహె.. ఫ్లూటు ఊదడం కాదు, డైరెక్ట్గా వెళ్లి వాటితో ఆడుకుంటానంటోంది నటి వైగా రోజ్. థాయిల్యాండ్లో బ్యాంకాక్ ట్రిప్కు వెళ్లిన ఈ బ్యూటీ ఓ రెండు సింహాల దగ్గరకు వెళ్లి వాటిని నిమురుతూ సరదాగా ఆడుకుంది. సివంగిపై చేయి వేసి తను కూడా ఆడసింహంలా కెమెరాకు ఫోజిచ్చింది. సింహాలతో ఆటఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జైలర్కా హుకుం పాటను యాడ్ చేసింది. ఇది చూసిన అభిమానులు వీడియోలో మాకు మూడు సింహాలు కనిపిస్తున్నాయి, ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? సివంగిలా ఉన్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైగా రోస్.. అలెగ్జాండర్ ద గ్రేట్ మూవీతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆర్డినరీ, ఎన్ను నింటె మొయిదీన్ వంటి పలు చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by VAIKHA ROSE (@vaikharose) View this post on Instagram A post shared by VAIKHA ROSE (@vaikharose) View this post on Instagram A post shared by VAIKHA ROSE (@vaikharose) చదవండి: డేంజర్ జోన్లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు? -
‘మిరాయ్’పై మంచు విష్ణు ట్వీట్.. రిప్లై ఇచ్చిన మనోజ్!
ఎంతో అన్యోన్యంగా ఉండే మంచు ఫ్యామిలీలో కొన్నాళ్ల క్రితం పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. మనోజ్పై తండ్రి మోహన్ బాబు కేసు పెడితే.. తండ్రి,అన్నయ్యలపై మనోజ్ కేసులు పెట్టాడు. మీడియా ముఖంగా దాడికి దిగారు. బౌన్సర్లను పెట్టుకొని హడావుడి చేశారు. కట్ చేస్తే..ఇప్పుడు అన్నదమ్ములిద్దరు కలిసిపోయినట్లు ఉన్నారు. ఒకరి సినిమాపై మరొకరు పొగడ్తలు కురిపించుకుంటున్నారు. ఆ మధ్య రిలీజైన కన్నప్ప సినిమాపై మనోజ్ ప్రశంసలు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. సినిమా బాగుందని.. విష్ణు యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక ఇప్పుడేమో తమ్ముడు నటించిన మిరాయ్ సినిమాపై విష్ణు ట్వీట్ చేశారు.(‘మిరాయ్’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)సినిమా రిలీజ్ సందర్భంగా నిన్న(సెప్టెంబర్ 12) ‘మిరాయ్’ బృందానికి విష్ణు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ దేవుని దయ మీపై ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విట్ చేశాడు. అన్నయ్య ట్వీట్కి తమ్ముడు మనోజ్ రిప్లై ఇచ్చాడు. మిరాయ్ యూనిట్ తరపున ‘థాంక్యూ సో మచ్ అన్న’ అంటూ మనోజ్ ట్విట్ చేశాడు. వీరిద్దరి ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడంతో వీరిద్దరి మధ్య ఉన్న విభేధాలు తొలగిపోయాయని.. త్వరలోనే మంచు ఫ్యామిలీ ఒకటవ్వాలని కోరుకుంటున్నామంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించిన వెంకటేశ్, మహేశ్బాబు కలిసిపోయే ఎమోషనల్ సీన్కు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..‘అన్నదమ్ములు కలిసిపోయారు’ అని రీట్వీట్స్ చేస్తున్నారు.(చదవండి: బాక్సాఫీస్ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు మిరాయ్ కలెక్షన్స్ ఎంతంటే?)ఇక మిరాయ్ విషయానికొస్తే.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటించగా, మనోజ్ విలన్ మహావీర్ లామా పాత్రను పోషించాడు. రిలీజ్ తర్వాత మనోజ్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మనోజ్ విలనిజం అద్భుతంగా ఉందంటూ సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. హిట్ టాక్ రావడంతో తొలి రోజే రూ. 12 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. -
ఆ తెలుగు మూవీలో హీరోయిన్గా చేస్తానన్నా.. కాజల్కు ఇచ్చారు!
శివ మనసులో శృతి (2012) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమిళ మద్దుగుమ్మ రెజీనా కసాండ్రా (Regina Cassandra). తొలి సినిమాతోనే బాగా క్లిక్ అవడంతో టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. కొత్త జంట, రారా.. కృష్ణయ్య, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అ, ఎవరు.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఆచార్య మూవీలో సానా కష్టం అనే స్పెషల్ సాంగ్లోనూ తళుక్కుమని మెరిసింది. హీరోయిన్ ఛాన్స్ అడిగాఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించిన రెజీనా ప్రస్తుతం మాత్రం తమిళ, హిందీ భాషల్లో బిజీ అయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రెజీనా మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ అ సినిమా స్క్రిప్ట్ చెప్పారు. నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇస్తే చేస్తానన్నాను, లేదంటే అందులోనే బలమైన పాత్ర అడిగాను. అందుకాయన హీరోయిన్ పాత్ర కోసం అప్పటికే కాజల్ను సంప్రదించినట్లు చెప్పాడు. సరే, పర్లేదని మరో (మీరా) పాత్ర ఇవ్వమన్నాను. అది కూడా లేదంటే మాత్రం నేను సినిమా చేయనని తెగేసి చెప్పాను.జాట్లో ఆ పాత్ర కోసం అడిగారుజాట్ సినిమాలో గోపీచంద్ మలినేని నాకు పోలీసాఫీసర్ పాత్ర ఆఫర్ చేశాడు. కథ మొత్తం విన్నాక నాకు భారతి రోల్ ఇస్తేనే చేస్తానన్నాను. ఎందుకంటే అంతకుముందెన్నడూ అలాంటి పాత్ర చేయలేదు. అలా జాట్ సినిమాలో భారతిగా కనిపించాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెజీనా.. తమిళంలో మూకుత్తి అమ్మన్ 2 మూవీ చేస్తోంది. హిందీలో ద వైఫ్స్, సెక్షన్ 108 సినిమాల్లో నటిస్తోంది.చదవండి: హనుమాన్ రికార్డు బద్ధలు కొట్టిన మిరాయ్! ఫస్ట్డే కలెక్షన్స్ -
బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?
-
తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్లు.. గొప్ప చిత్రాన్ని కాపాడతారు: బెల్లంకొండ
‘‘కిష్కింధపురి’ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. గురువారం మూడు ప్రీమియర్ షోలు వేద్దామనుకుని, మొదలైన మా సినిమాకు 66 షోలు పడ్డాయి. ఆర్గానిక్గా మా సినిమా ఆడియన్స్కు చేరువైంది. మా ‘కిష్కింధపురి’కి వారి ప్రేమ దక్కింది. ఈ ప్రేమ కొనసాగుతుంది. తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్ళు. గొప్ప చిత్రాన్ని కాపాడతారు’’ అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదలైంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే కృషితో చేసిన సినిమా ‘కిష్కింధపురి’. సాహుగారు ఎంతగానో సపోర్ట్ చేసి, ఈ సినిమాను నిర్మించారు. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘మేము అనుకున్నదానికంటే డబుల్ ఇంపాక్ట్ రెస్పాన్స్ వస్తోంది. మా బ్యానర్లో మంచి సినిమా పడింది’’ అని తెలిపారు సాహు. ‘‘ఫస్ట్ టైమ్ హిట్ కొట్టినప్పుడు ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ మూమెంట్స్ని నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను’’ అని పేర్కొన్నారు కౌశిక్. ‘‘ప్రేక్షకుల స్పందన మా సినిమాకు గొప్ప బలాన్నిచ్చింది’’ అని చెప్పారు చేతన్ భరద్వాజ్. -
బాక్సాఫీస్ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు ఎన్నికోట్లంటే?
ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వీఎఫ్ఎక్స్ కోసం వందల కోట్లు గుమ్మరించేస్తున్నారు. దాంతో బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. దానికి తగ్గట్లుగా కలెక్షన్స్ రాబట్టడం గగనమవుతోంది. కానీ మిరాయ్ (Mirai Movie) మాత్రం తక్కువ బడ్జెట్తోనే అద్భుతాలు సృష్టించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. హీరోయిన్గా రితికా నాయక్, విలన్గా మంచు మనోజ్, హీరో తల్లిగా శ్రియ నటించారు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.ఫస్ట్డే కలెక్షన్స్సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇది హనుమాన్ కంటే కూడా ఎక్కువని తెలుస్తోంది! తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ మొదటిరోజు రూ.25 కోట్ల లోపే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ రికార్డును మిరాయ్ బద్ధలు కొట్టింది. మిరాయ్ మూవీ నార్త్ అమెరికాలో 7 లక్షల డాలర్లు (రూ.6 కోట్లపైనే) వసూలు చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన చిత్రంగా మిరాయ్ నిలిచింది. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. BRAHMAND DAY 1 💥💥💥27.20 Crores WORLDWIDE GROSS for #MIRAI ᴡɪᴛʜ ɴᴏʀᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 🔥🔥🔥Keep showering your love on #BrahmandBlockbusterMIRAI and experience it ONLY on the Big Screens ❤️🔥❤️🔥❤️🔥— https://t.co/BveSLQhrSISuperhero @tejasajja123Rocking Star… pic.twitter.com/lvYrluMkZS— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 #SuperYodha is setting the box office on fire 🔥🔥🔥#Mirai North America Gross $700K+ & counting 🇺🇸❤️🔥❤️🔥❤️🔥Experience '𝗕𝗥𝗔𝗛𝗠𝗔𝗡𝗗 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥' in cinemas now 💥North America by @ShlokaEnts @peoplecinemas Superhero @tejasajja123Rocking Star @HeroManoj1… pic.twitter.com/zDHsgJiJjQ— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 Blockbuster Vibes & Grateful Smiles 🤩🤩🤩Team #MIRAI shares overwhelming joy for the BRAHMAND BLOCKBUSTER ❤️🔥❤️🔥❤️🔥Experience India's Most Ambitious Action Adventure Only On the Big Screens 💥💥💥— https://t.co/BveSLQhrSISuperhero @tejasajja123Rocking Star @HeroManoj1… pic.twitter.com/OxOzGeWKbr— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 చదవండి: ఇమ్మాన్యుయేల్పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ -
సిరిసిల్లవాసి.. బాలీవుడ్లో తిరుగులేని హీరోగా స్టార్డమ్
తెలుగు నేల మీద పుట్టి, ముంబై మహానగరానికి వెళ్లి, అక్కడ హీరోగా విశేషమైన పేరు తెచ్చుకున్న ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే పైడి జైరాజ్ (Paidi Jairaj). పైడి జైరాజ్ పూర్తి పేరు పైడిపాటి జైరాజ్. ఆయన తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లలో 28 సెప్టెంబర్ 1909న జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నలు. పైడిపాటి సుందరరాజా, పైడిపాటి దీనదయాళ్. జైరాజ్ చిన్నవాడు కావడంతో అందరూ అతణ్ని అపురూపంగా చూసుకునేవారు. హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాలలో జైరాజ్ డిగ్రీ చదువుకున్నారు. మూకీ సినిమాలుఆ సమయంలో నాటక రంగం, చలనచిత్రాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఎలాగైనా సినిమాల్లో చేరాలన్న ఉద్దేశంతో 1929లో బొంబాయికి వెళ్లిపోయారు. ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహాసాగర్ మోతి’, ‘ఫ్లైట్ ఇంటూ డెత్’ తదితర సైలెంట్ సినిమాల్లో నటించారు.బాలీవుడ్లో రాణించిన తెలుగు వ్యక్తిమంచి నటుడిగా పేరు తెచ్చుకొని హమారీ బాత్ (1943), సింగార్ (1949), అమర్ కహానీ(1949), రాజ్పుత్ (1951), రేషమ్(1952) తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ వంటి కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 1952లో ‘సాగర్’ అనే సినిమాను తనే నిర్మించి దర్శకత్వం వహించారు. తెలుగు వ్యక్తిగా హిందీ సినిమాల్లో హీరోగా ఎదిగిన అరుదైన ఘనతను సాధించారు. జీవితంపై డాక్యుమెంటరీనటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఢిల్లీకి చెందిన పంజాబీ మహిళ సావిత్రిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భారతీయ సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గానూ 1980లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందించారు. జైరాజ్ 2000వ సంవత్సరం 11 ఆగస్టున ముంబైలో మరణించారు. ఆయన జీవితంపై 2018లో తెలంగాణ ప్రభుత్వం ‘లైఫ్ జర్నీ ఆఫ్ జైరాజ్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది.చదవండి: 'మిరాయ్' విజయం.. మనోజ్ తల్లి ఎమోషనల్.. వీడియో వైరల్ -
కథ విని షాకయ్యా: రాజేంద్రప్రసాద్
‘‘దర్శకుడు చిరంజీవి ‘నేనెవరు?’ చిత్ర కథ చెప్పినప్పుడు షాకయ్యా. ఇంత గొప్ప కథను కరెక్ట్గా తెరకెక్కించగలడా? అని సందేహపడ్డాను. కానీ, షూటింగ్కి వెళ్లాక అతను ఎంత జీనియస్ అన్నది అర్థం అయింది. నిర్మాతలు కూడా ఎంతో తపన, నిబద్ధత కలిగిన వ్యక్తులు. ఈ సినిమాతో వారికి మంచి విజయం సొంతం కావాలి. నేను నటించిన మంచి సినిమాల్లో ‘నేనెవరు?’ ఒకటిగా నిలిచిపోతుంది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తెలిపారు. చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నేనెవరు?’. సరికొండ మల్లికార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు–సకినాన భూలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ద్వారా వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు.హైదరాబాద్లో నిర్వహించిన ‘నేనెవరు?’ ఆడియో, టీజర్ లాంచ్ ఈవెంట్కి హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, దర్శకుడు వి.సముద్ర అతిథులుగా హాజరై, యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాజేంద్రప్రసాద్ వంటి గొప్ప ఆర్టిస్టుతో ‘నేనెవరు?’ చిత్రం రూపొందించే చాన్స్ లభించడం మా అదృష్టం. దసరాకి మా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.చదవండి: దిశా పటానీకి వార్నింగ్.. ఇంటి ముందు కాల్పులు -
నాభర్తకు డిగ్రీలేదు, నేనే పోషిస్తున్నా.. నా తల్లి బంగారం కూడా తాకట్టు పెట్టా!
కన్నడ దర్శకనటుడు ఎస్ నారాయణ్ (S Narayan)పై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. నారాయణ్ కుటుంబం వరకట్నం కోసం వేధిస్తోందంటూ ఆయన కోడలు పవిత్ర బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. తనకేదైనా జరిగితే భర్త, అత్తమామలదే పూర్తి బాధ్యత అని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు రమ్మని నారాయణ్, అతడి భార్య భాగ్యవతి, కుమారుడు పవన్కు నోటీసులు పంపారు.ఫిర్యాదులో ఏముందంటే?'నా భర్త పవన్ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అతడికి ఎటువంటి ఉద్యోగం లేదు. దీంతో నేనే కుటుంబాన్ని చూసుకుంటున్నాను. ఓసారి అతడు కారు కొనాలంటూ నా దగ్గర రూ.1 లక్ష, నా తల్లి దగ్గరి నుంచి రూ.75 వేలు తీసుకున్నాడు. నా భర్త కుటుంబం కళా సామ్రాట్ ఫిలిం అకాడమీ స్థాపించినప్పుడు నేను నా తల్లి బంగారం కూడా తాకట్టు పెట్టి వారికి ఆర్థిక సాయం చేశాను. కానీ, ఆ అకాడమీ ఎంతోకాలం నడపలేదు, కొంతకాలానికి మూసివేశారు. నేను సంపాదించి పోషించా..తర్వాత మళ్లీ నన్ను డబ్బు అడగడం ప్రారంభించారు. రూ.10 లక్షలు లోన్ తీసుకునిచ్చాను. కొన్నినెలలు సరిగానే చెల్లించి తర్వాత ఆపేశారు. నా పెళ్లి సమయంలో నాన్న పవన్కు రూ.1 లక్ష విలువైన బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. మా పెళ్లి విషయంలో నారాయణ్ దంపతులు గొడవపడ్డారు. పెళ్లయిన కొన్ని నెలలకే ఇంట్లోంచి బయటకు వచ్చి ఓ అద్దెగదిలో ఉన్నాం. ఓ సంవత్సరం తర్వాత తిరిగి మళ్లీ అత్తింట్లో అడుగుపెట్టాం' అని పవిత్ర పేర్కొంది.సినిమాచైత్రద ప్రేమాంజలి (1992) కన్నడ సినిమాతో నారాయణ్ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. అనురాగద అలెగలు, మేఘ మాలె, తవరిన తొట్టిలు, బేవు బెల్ల, సూర్యవంశం, సింహాద్రియా సింహ, దక్ష, చంద్ర చకోరి, మనసు మల్లిగె.. ఇలా ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశాడు. తమిళంలో జై సినిమా తీశాడు. చైత్రద ప్రేమాంజలి, కురిగలు సార్ కురిగలు, హనీమూన్ ఎక్స్ప్రెస్, తిప్పరల్లి తర్లెగలు, ఓల్డ్ మాంక్ వంటి పలు చిత్రాల్లో నటించాడు.చదవండి: మద్యానికి, సిగరెట్కు గుడ్బై.. శాకాహారిగా మారిపోయిన రణ్బీర్! -
మద్యానికి, సిగరెట్కు గుడ్బై.. శాకాహారిగా మారిపోయిన రణ్బీర్!
ఉన్నది ఒక్కటే జిందగీ.. నాకు నచ్చినట్లు బతికేస్తా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు. ఆరోగ్యాన్ని లెక్క చేయకపోతే వెంటనే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వయసుపైబడే కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. సెలబ్రిటీలైతే నోరు చంపుకుని, వ్యసనాలు వదిలించుకుని ఫిట్నెస్పై మరింత ఫోకస్ పెంచాల్సి ఉంటుంది. అందులోనూ ఆధ్యాత్మిక సినిమాలు చేస్తున్నప్పుడు కొందరు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా నిష్టగా ఉంటారు. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా అదే చేశాడు.శాఖాహారిగా మారిపోయాప్రస్తుతం ఇతడు దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ (Ramayana Movie) ప్రారంభానికి ముందు రణ్బీర్ తన లైఫ్స్టైల్లో చాలా మార్పులుచేర్పులు చేసుకున్నాడు. సిగరెట్ తాగడం మానేశాడు, మద్యపానానికి గుడ్బై చెప్పాడు. పూర్తిగా శాకాహారిగా మారినట్లు తెలిపాడు. యోగా, ధ్యానం కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు. రామాయణ మూవీ ప్రారంభానికల్లా చెడు అలవాట్లు శాశ్వతంగా మానేస్తానని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. రణ్బీర్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.సినిమారామాయణ సినిమాను నితీశ్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్తో రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీలో లక్ష్మణుడిగా రవిదూబే, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. రామాయణ పార్ట్ 1.. 2026 దీపావళికి, రామాయణ పార్ట్ 2.. 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి. రామాయణ్తో పాటు రణ్బీర్ మరో సినిమా చేస్తున్నాడు. భార్య, హీరోయిన్ ఆలియా భట్తో కలిసి లవ్ అండ్ వార్ మూవీ చేస్తున్నాడు. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 మార్చి 20న విడుదల కానుంది. 🚨 Ranbir Kapoor has given up smoking, drinking, and has even turned vegetarian — all in preparation for his role as Lord Ram in #Ramayana. A true embodiment of discipline and devotion. ✨🔥 pic.twitter.com/W5F3akrREK— Ramayana: The Epic (@RamayanaMovieHQ) September 7, 2025 చదవండి: నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి -
నా కడుపులో తన్నాడు, ముఖంపై పిడిగుద్దులు..: బుల్లితెర నటి
ప్రేమించిన ప్రియుడు తనను అష్టకష్టాలు పెట్టాడని వాపోయింది మలయాళ బుల్లితెర నటి జసీలా ప్రవీణ్ (Jaseela Parveen). మాటలతోనే కాకుండా చేతలతో నరకం చూపించాడని పేర్కొంది. ఈ మేరకు సాక్ష్యాలను సోతం సోషల్ మీడియాలో బయటపెట్టింది. అందులో ఓ ఫోటోలో జసీలా తలపై గాయాలున్నాయి, పెదవి చిట్లిపోయి ఉంది. డిసెంబర్ 31న కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ దాడి జరిగిందని నటి తెలిపింది.చర్మం ఊడివచ్చేలా..జసీలా మాట్లాడుతూ.. 'నా కడుపులో రెండుసార్లు తన్నాడు. తన చేతి కడియంతో నా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దానివల్ల నా చర్మం ఊడివచ్చింది. అతడు నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. నేను కాలు జారి కిందపడిపోవడం వల్లే ఈ గాయాలయ్యాయని చెప్తేనే ఆస్పత్రికి తీసుకెళ్తానన్నాడు. హాస్పిటల్ వెళ్లాక అదే అబద్ధం చెప్పాడు. డాక్టర్ నా ముఖంపై చీలిన చర్మాన్ని చూసి ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు. కొన్ని రోజుల తర్వాత ధైర్యం కూడదీసుకుని జరిగిందంతా పోలీసులకు చెప్పాను. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.అందవిహీనంగా మారిపోయాశారీరక హింస, మానసిక వేదన అనుభవించాక నన్ను నేనే కోల్పోయినట్లుగా అనిపించింది. అందవిహీనంగా మారిపోయాను. అద్దంలో చూసుకోవడం కూడా మానేశాను. సరిగా తినలేకపోయాను, కంటినిండా నిద్రపోలేకపోయాను. దాదాపు పది కిలోలు తగ్గాను. అతడు మాత్రం హాయిగా నార్మల్ లైప్ గడుపుతున్నాడు. అసలేదీ జరగనట్లే ఉన్నాడు. కొంచెం కూడా బాధపడలేదు, నా గురించి ఆలోచించనేలేదు. కనీసం జరిగినదానికి క్షమాపణలు కూడా చెప్పలేదు.సారీ చెప్తే వదిలేస్తానన్నా కూడా..అతడికి చిట్టచివరగా ఓ ఛాన్స్ ఇచ్చి చూశాను. నాకు సారీ చెప్తే ఇంతటితో దీన్ని వదిలేస్తానన్నాను. కానీ అతడు క్షమాపణలు చెప్పడానికి బదులుగా కోర్టుకెళ్లి బెయిల్ తీసుకోవడానికే సుముఖత చూపించాడు. తనే ఏదీ జరగనట్లు ఉంటే నేను మాత్రం ఎందుకు కుమిలిపోతూ ఉండాలి. బాధపడుతూ కూర్చుంటే ఏదీ మారదు.. అందుకే ఇప్పుడిప్పుడే గతాన్ని మర్చిపోయి మళ్లీ మామూలు మనిషినయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. అతడితో తెగదెంపులు చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. జసీలా పర్వీన్.. మలయాళ సీరియల్స్లో నెగెటివ్ పాత్రలు పోషించింది.చదవండి: రైలు నుంచి దూకేసిన బాలీవుడ్ హీరోయిన్ -
రైల్లో నుంచి దూకేసిన బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా శర్మ (Actress Karishma Sharma) కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ముంబైలో బుధవారం నాడు లోకల్ ట్రైన్ ఎక్కిన ఆమె సడన్గా కిందకు దూకేయడంతో వెన్నెముకకు, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇచ్చింది.కదులుతున్న రైలు నుంచి దూకేశా'షూటింగ్ కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులో చర్చ్గేట్కు వెళ్దామనుకున్నాను. స్టేషన్కు వెళ్లి ట్రైన్ ఎక్కాను. కాస్త వేగం పుంజుకున్నాక నా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కలేదన్న విషయం గమనించాను. అప్పుడు నేను చీర కట్టుకుని ఉన్నాను. అయినా ధైర్యం చేసి దూకేయగా తలకు, వెన్నెముకకు దెబ్బ తగిలింది. MRI స్కాన్ చేశారు. కొద్దిరోజులు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. సినిమాఈ ప్రమాదం జరిగినప్పటినుంచి నొప్పితో విలవిల్లాడుతున్నాను. మీ ప్రేమాభిమానాలే నన్ను కోలుకునేలా చేస్తాయి. దయచేసి నా కోసం ప్రార్థించండి' అని కోరింది. కాగా కరిష్మా శర్మ.. ప్యార్ కా పంచనామా 2, ఉజ్దా చమాన్, హోటల్ మిలన్, ఏక్ విలన్ రిటర్న్స్ మూవీస్లో నటించింది. రాగిణి ఎమ్ఎమ్ఎస్: రిటర్న్స్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది. బుల్లితెరపై పవిత్ర రిష్తా, కామెడీ సర్కస్, సిల్సిలా ప్యార్ కా వంటి సీరియల్స్లోనూ యాక్ట్ చేసింది.చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
ఆ హీరోతో కలిసి పనిచేసినందుకు హ్యాపీ: లావణ్య త్రిపాఠి
హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) రెండు రోజుల క్రితమే తల్లిగా ప్రమోషన్ పొందారు. ఉత్రరప్రదేశ్లోని అయోధ్యకు చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే ఈమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం టన్నెల్ నేడు (సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వారం వాయిదా పడింది. ఈ నెల 19న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. టన్నెల్ చిత్రం చూసినవారందరూ నా నటనను ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉందన్నారు. సంతోషంగా ఉందిచిత్ర ప్రథమార్థం రొమాంటిక్ సంఘటనలతోనూ, రెండవ భాగం ఎమోషనన్స్ అంశాలతో ఉంటుందని చెప్పారు. సినిమాలో తన పాత్ర సాధారణంగా కాకుండా కథకు కీలకంగా ఉంటుందన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు రవీంద్ర మాధవకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో అంకిత భావంతో పని చేసే హీరో అధర్వతో కలిసి నటించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కెరీర్లావణ్య త్రిపాఠి 2012లో అందాల రాక్షసి చిత్రంతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత బ్రహ్మ చిత్రంతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే తెలుగులోనే వరుస చిత్రాలు చేస్తూ టాలీవుడ్లో బిజీ అయ్యారు. కాగా 2017లో మాయాన్ అనే తమిళ మూవీలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు టన్నెల్ అనే తమిళ చిత్రంలో నటించారు. తమిళ హీరో అధర్వ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అన్నై ఫిలిమ్ ప్రొడక్షనన్స్ పతాకంపై ఎం.జాన్ పీటర్ నిర్మించారు. రవీంద్ర మాదవ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Annai Film Production (@annaifilmproductionofficial)చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
మిరాయ్ ట్విటర్ రివ్యూ
హను-మాన్ తర్వాత తేజ సజ్జ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సిసిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మిరాయ్’ ఎలా ఉంది? తేజ సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదతర అంశాలను ఎక్స్లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్లో మిరాయ్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉందంటూ చాలా మంది ట్వీట్స్ పెడుతున్నారు. అలాగే ఇందులో ప్రభాస్ కనిపించడం పెద్ద సర్ప్రైజింగ్ అంశం. ఎక్స్లో ప్రభాస్ పాత్రలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ గెస్ట్ రోల్ సినిమాకు ప్లస్ అయిందని చెబుతున్నారు.#Mirai A Worthy Action Adventure Infused with Devotional Elements! Mirai delivers an engaging first half, with a few dips in the middle, but a good pre-interval to interval block. The second half slows down in places, but a few strong sequences and a superb climax hold it…— Venky Reviews (@venkyreviews) September 11, 2025‘చిన్న చిన్న మలుపులతో ఫస్టాఫ్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. సెకండాఫ్ కొన్ని చోట్ల కథ సాగదీసినట్లుగా అనిపించినా..కొన్ని బలమైన సన్నివేశాలు, క్లైమాక్స్ అద్భుతంగా ఉండడంతో ఎక్కడా బోర్ కొట్టినట్లు అనిపించదు. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. #MiraiReview Positives@shriya1109#Jayaram@tejasajja123@HeroManoj1 (Mohan babu)#RitikaAnd everyone gave their best -VFX 👌👏-Second half BGM-Mirai daggariki vellaka vache sequence -Second half till climaxNegatives:Time ayipothundhani fast fast ga end chesinattundhi— ZoomOnZindagi (@ZoomOnZindagi) September 12, 2025 ‘తేజ సజ్జ, శ్రియ, మనోజ్, జయరామ్, రితికా..ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీఎఫెక్స్ అదిరిపోయింది. సెకండాఫ్ బీజీఎం బాగుంది. మిరాయ్ దగ్గరకు వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశం సినిమాకే హైలెట్. క్లైమాక్స్ బాగుంది. సినిమాలో నెగెటివ్ పాయింట్ ఏంటంటే.. టైమ్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా ఎండ్ చేసినట్లు ఉంటుంది’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.Just a voice over turned the entire film reception into rebel vibe 🔥🔥🔥Just his name is enough 💥💥💥 #Prabhas #Mirai pic.twitter.com/rhvvntcNGO— Prabhas RULES (@PrabhasRules) September 11, 2025#Mirai 1st half is a banger 💥💥 with usual teja and Srinu comedy , interval is very good .. 2nd is bit lengthy with same template as #HanuMan Overall it's a good movie 🎉🎉 Congrats team 3.5/5— N@|○ N£nu (@Karthik_nyl) September 12, 2025#Mirai – A Divine Action Adventure! 🔥✨High moments, solid interval, superb climax.Tech brilliance + Gowra Hari BGM elevate big time.@tejasajja123 shines bright.@HeroManoj1 👌💥Unique, engaging & worth a big-screen watch!Rating: ⭐⭐⭐⭐/5— 𝐕𝐢𝐡𝐚𝐚𝐧 (@TheRealPKFan) September 12, 2025#Mirai 1st half is a banger 💥💥 with usual teja and Srinu comedy , interval is very good .. 2nd is bit lengthy with same template as #HanuMan Overall it's a good movie 🎉🎉 Congrats team 3.5/5— N@|○ N£nu (@Karthik_nyl) September 12, 2025#Mirai 12 सितम्बर को रिलीज़ हो रही है ये फ़िल्म सनातन धर्म के आदर्श और राम जी की ताक़त से प्रेरित है 🚩दक्षिण भारत हमें सुपरहीरो देता है, बॉलीवुड बस स्टारकिड्स 😏आधुनिक युग में एक बेहतरीन फिल्मइस बार सिनेमा हॉल भरकर दिखाओ कि असली कंटेंट ही जीतेगा 💪#Mirai— ठाकुर राजन तोमर (@rajanbhajpa) September 12, 2025#Mirai - 🆗Teja Sajja delivers a gud Perf. Graceful Shreya. Superb Visuals & BGM. Promising start, middle portions r draggy. Post Interval Transformation fight gud. Lord Rama saved d climax. Though not extra ordinary, it Deserves a One Time Watch for its Cinematic Experience!— Christopher Kanagaraj (@Chrissuccess) September 12, 2025#Mirai Baane undi, Parledu!A decent fantasy action adventure film which has similar tones of #Karthikeya2 & #HanumanFew sequences are fantastic but few are subpar.Loved #ShriyaSaran role👍🏻#TejaSajja is brilliant and he killed it👌#ManchuManoj role is underwhelming🥲 pic.twitter.com/r7gHrlhsph— Sanjeev (@edokatile) September 12, 2025 -
అమ్మవారికి రూ.4 కోట్ల విలువైన కిరీటం సమర్పించిన ఇళయరాజా
కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా రూ. 4 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని బహుకరించారు. తాజాగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఆయన.. స్వయంగా ఈ కిరీటంతో పాటు వీరభద్ర స్వామికి వెండి ఆయుధాన్ని అందజేశారు. గుడి అర్చకులు దగ్గర ఉండి ఇళయరాజాతో పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలతోపాటు అమ్మవారి ఫొటో అందజేశారు. ఇళయరాజా వెంట ఆయన తనయుడు కార్తిక్, మనవడు యతీశ్ తదితరులు ఉన్నారు. ఇళయరాజాకు దైవభక్తి ఎక్కువే. తరచు ఆయన మూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. 2006లో కూడా ఆయన అమ్మవారికి ఓ కిరీటం బహుమతిగా ఇచ్చారు.కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం. -
లావణ్య త్రిపాఠికి ‘టన్నెల్’ విషెస్.. రిలీజ్ వాయిదా!
మెగా జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి బుధవారం (సెప్టెంబర్ 10) పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అంతా కూడా సంతోషంలో మునిగి తేలుతున్నారు. అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ‘టన్నెల్’ చిత్రబృందం కూడా లావణ్యకు విషెస్ తెలియజేసింది. ఈ చిత్రంలో అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు.రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల విడుదల కావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఓ వారం వాయిదా వేశారు. అలా ఈ మూవీని సెప్టెంబర్ 19న గ్రాండ్గా థియేటర్లోకి తీసుకు వచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.‘టన్నెల్’ ఓ యాక్షన్-థ్రిల్లర్ మూవీ అని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అడ్రినల్ రష్ ఇచ్చేలా, ఉత్కంఠ రేకెత్తించేలా సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లు అందరినీ సర్ ప్రైజ్ చేసేలా ఉన్నాయి. క్రైమ్లు చేస్తున్న సైకోని పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు? అనే పాయింట్తో ‘టన్నెల్’ రాబోతోంది. -
తెలుగు సీరియల్.. నా కూతురికి నరకం చూపించారు: చైల్డ్ ఆర్టిస్ట్ తల్లి
ఓ తెలుగు సీరియల్ వల్ల తన కూతురు నరకం చూసిందంటోంది చైల్డ్ ఆర్టిస్ట్ నిషిత (Nishita) తల్లి ప్రియ. అందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం బయటపెట్టింది. సెట్లో చిన్నారికి కరెంట్ షాక్ కొట్టిందని, ఆరోగ్యం బాగోలేకపోయినా షూటింగ్ చేయించారని వాపోయింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో రిలీజ్ చేసింది.చిన్నారికి కరెంట్ షాక్'అందులో నిషితను గార్డెన్ ఏరియాలో లైట్స్ ఉన్న దగ్గర పడుకోబెట్టారు. అక్కడున్న లైట్స్ ద్వారా కరెంట్ షాక్ రావడంతో ఆ పాప నిస్సహాయ స్థితిలో కేకలేసింది. మరో సీన్లో తను భయపడుతున్నా సరే బలవంతంగా స్విమ్మింగ్ పూల్లోకి లాగారు. అక్కడ తనకోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కొన్నిసార్లు ఆరోగ్యం బాగోలేక బెడ్పై ఉన్నా సరే.. తనకు విశ్రాంతి ఇవ్వకుండా షూటింగ్కు రమ్మని ఒత్తిడి తెచ్చారు. అనారోగ్యంతోనే తను సెట్కు వచ్చి షూట్ చేయాల్సి వచ్చింది. రెమ్యునరేషన్ ఆపేశారుచిన్నపాప అని ఆలోచించకుండా రాత్రిపూట షూటింగ్స్కు రమ్మనేవారు. సీరియల్ నిర్మాతలు చైల్డ్ ఆర్టిస్టుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా? అలాగే వీరు ఏప్రిల్ నుంచి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఆపేశారు. పని చేయించుకున్నారు, కానీ డబ్బులివ్వలేదు. దాదాపు 150 ఎపిసోడ్ల తర్వాత సడన్గా నా కూతురిని తొలగించి మరొకరిని తీసుకున్నారు. తనకు ఒంట్లో బాగోలేకపోయినా, ఎంత ఇబ్బందిపడ్డా సరే అవన్నీ ఓర్చుకుని పని చేసింది. చివరకు ఇదా మీరు తనకిచ్చే బహుమతి?టీఆర్పీ కోసం వాడుకున్నారుమీరు నా కూతురిని రీప్లేస్ చేయగలరేమో కానీ తన టాలెంట్ను కాదు. టీఆర్పీ కోసం నెలల తరబడి తనను వాడుకున్నారు. ఇప్పుడేమో ఎక్స్పెన్సివ్ కిడ్ అని పక్కన పెట్టేశారు. ఈ సీరియల్ కోసమే ఎన్నో ప్రాజెక్టులను కాదనుకున్నాం. ఇప్పుడు ఒక్క మాటైనా చెప్పకుండా తీసేశారు' అని నిషిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా నిషిత.. కన్నడంలో లక్ష్మీ నివాస సీరియల్లో నటించింది. ఇందులో పోషించిన ఖుషి పాత్రతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Priya v (@priyaseervi321) View this post on Instagram A post shared by Priya v (@priyaseervi321) చదవండి: హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్! -
ఫ్లాష్ బ్యాక్...అన్నయ్యతో ఆన్ స్క్రీన్ రొమాన్స్!
నటనే అయినప్పటికీ కూడా నిజ జీవితంలో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు... తెరపై జంటగా కనిపించడాన్ని భారతీయ ప్రేక్షకులు ఏ మాత్రం ఒప్పుకోరు. అందుకే నటనను ఎంత ప్రొఫెషనల్గా తీసుకున్నప్పటికీ అలాంటి సాహసం మన దేశంలోని ఏ నటిగానీ ఏ నటుడుగానీ చేయరు. కానీ చాలా కాలం క్రితమే అలాంటి ధైర్యం చేసింది ఓ అందాల బాలీవుడ్ నటి. తన స్వంత అన్నయ్యతో రొమాంటిక్ జోడిగా నటించి, నర్తించి ఆ తర్వాత జనాగ్రహానికి గురైంది. ఆమె పేరు మిను ముంతాజ్.భారతీయ సినిమాలో ప్రతిభావంతులైన నృత్యకారిణి, క్యారెక్టర్ నటిగా ప్రసిద్ధి చెందిన మిను ముంతాజ్, ముంబైలో జన్మించిన ఆమె తండ్రి ముంతాజ్ అలీ కూడా ప్రముఖ నటుడు నృత్యకారుడు కూడా. ఆమె అతని నుంచి నృత్య కళను నేర్చుకోవడం దగ్గర నుంచి అతని అడుగుజాడల్లోనే నడిచింది, కాలక్రమంలో ఆమె తండ్రి మద్యానికి బానిసగా మారాడు. దాంతో టీనేజ్లోనే మిను కుటుంబ ఆర్థిక భారాన్ని మోయవలసి వచ్చింది.నటనపై ఇష్టం అనే కన్నా సంపాదన కోసమే మిను 1955లో 13 సంవత్సరాల వయసులో నానాభాయ్ భట్ చిత్రం హకీమ్ ద్వారా తెరంగేట్రం చేసింది. ఆమె తల్లికి ఇష్టం లేకున్నా, సినిమా కెరీర్ను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, మిను ముంతాజ్ తన కుటుంబాన్ని పోషించడానికి తప్పనిసరై నటనను కొనసాగించింది. 14 సంవత్సరాల వయస్సులోనే పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రజాదరణ పొందింది. హిందీ చిత్ర పరిశ్రమలో 1950లు 60లలో, ఆమె ప్రముఖ సెలబ్రిటీగా మారింది. అప్పటి చాలా మంది తారల్లాగే మిను ముంతాజ్ది కూడా ఒక పెద్ద కుటుంబం ఆమెకు నలుగురు సోదరులు నలుగురు సోదరీమణులు ఉండేవారు. ఆమె అన్నయ్య మెహమూద్ సైతం అప్పటికే బాలీవుడ్లో స్థిరపడిన హాస్య నటుడు. అతను నటించిన హౌరా బ్రిడ్జి సినిమా 1958 లో విడుదలైంది. అయితే ఈ సినిమాలో ‘‘కోరా రంగ్ సునారియా కలి’’ అనే రొమాంటిక్ పాటలో మెహమూద్ సరసన మిను ముంతాజ్ ప్రియురాలిగా హొయలొలికిస్తూ నటించారు. సినిమా విడుదలైన తర్వాత, ఆ రొమాంటిక్ పాత్రలో నటించిన నటులు నిజ జీవితంలో తోబుట్టువులని తెలుసుకుని ప్రేక్షకులు షాక్కి గురయ్యారు. ఈ తారల నైతికత కుటుంబ సంబంధాల సున్నితత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలు వీధుల్లో కి వెళ్లి మరీ నిరసన తెలిపారు. దీనికి స్పందించిన నటులు క్షమాపణ చెప్పడమే కాక మిను ముంతాజ్ తాను కుటుంబ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా మాత్రమే ఆ పనిచేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో కొంత కాలానికి ఆ వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత ఆ వివాదం ప్రభావమో మరొకటో గానీ మిను ముంతాజ్ స్వల్ప కాలంలోనే అవకాశాలు లేక పరిశ్రమకు దూరమై, ఒక దర్శకుడిని వివాహం చేసుకుని ు కెనడాలో స్థిరపడింది, అక్కడ నివసిస్తూ 2003లో, మిను ముంతాజ్ ఆరోగ్యం క్షీణించడం జ్ఞాపకశక్తి కోల్పోవడం ప్రారంభమైంది వైద్య పరీక్షల్లో ఆమెకు 15 సంవత్సరాలుగా గుర్తించబడని మెదడు కణితి ఉందని తేలింది. అనారోగ్యంతో చాలా కాలం పోరాడిన మిను ముంతాజ్ 2021లో మరణించారు, -
ఆడియన్స్ పిచ్చోళ్లా.. ఇంత సపోర్ట్ చేస్తారా?: యంగ్ హీరో
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు సైతం సరిగ్గా ఆడడం లేదు. ఇలాంటి సమయంలో తక్కువ బడ్జెట్ వచ్చిన చిన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’ భారీ విజయం సాధించింది. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రం రిలీజైన తొలిరోజే(సెప్టెంబర్ 5) హిట్ టాక్ తెచ్చుకొని.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా హీరో మౌళి మాట్లాడుతూ ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని అన్నారు. ‘ఆడియన్స్.. పిచ్చోళ్లా మీరు. ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా. మేము అస్సలు ఊహించలేదు. మంచి సినిమా చేశామని తెలుసు. తొలి వారం కొంతమంది చూస్తారు. మౌత్ టాక్తో రెండో వారం నడుస్తుందేమో అనుకున్నాం. అలా అనుకొనే గట్టిగా ప్రమోషన్స్ చేశాం. అయినా కూడా ప్రేక్షకులు థియేటర్స్కి వస్తారా రారా అనుకున్నాం. కానీ ప్రీమియర్స్, ఫస్ట్ రోజు..థియేటర్స్ అన్ని నిండిపోయాయి. ఫస్ట్డే రూ.2.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇది మా సినిమా బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. పిచ్చోళ్లం అయిపోయాం. మమ్మల్ని నమ్మి సినిమాకు వచ్చిన ఆడియన్స్కి థ్యాంక్స్. ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు. ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తునారనో నాకే అర్థం కాలేదు. ఎవరైనా సినిమా బాగోలేదని కామెంట్ పెడితే.. వాళ్లను తిడుతూ రిప్లై ఇస్తున్నారు. రవితేజ, నాని మొదలు ఇండస్ట్రీ పెద్దలంతా మా సినిమాను మొచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇలానే కష్టపడి మంచి సినిమాలు తీస్తానని అందరికి మాట ఇస్తున్నా’ అన్నారు.సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించారు. 2009-2020 మధ్యకాలంలో జరిగే టీనేజ్ లవ్స్టోరీ ఇది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. యువత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. -
ఐస్క్రీమ్ తిన్నందుకే నా భార్య చనిపోయింది: ప్రముఖ విలన్
మలయాళ నటుడు దేవన్ (Devan Sreenivasan ) భార్యను కోల్పోయి ఆరేళ్లపైనే అవుతోంది. దేవా సతీమణి సుమ 2019లో అలర్జీతో మరణించింది. తాజాగా భార్యను గుర్తు చేసుకున్న నటుడు ఆమె మరణానికి గల కారణాన్ని వెల్లడించాడు. దేవన్ మాట్లాడుతూ.. తను బాగానే ఉండేది. ఏమైందో ఏమో కానీ ఐస్క్రీమ్ తింటే మాత్రం పడేది కాదు. అదెలా తెలిసిందంటే.. చెన్నైలో ఉన్నప్పుడు ఓసారి ఐస్క్రీమ్ తిన్నాం. కాసేపటికే తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. డాక్టర్ వార్నింగ్వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తను ఎప్పటికీ ఐస్క్రీమ్ తినకూడదని డాక్టర్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మేము కూడా దాన్ని ఫాలో అయ్యాం. ఒకరోజు నా కూతురు లక్ష్మి దాని బిడ్డను తీసుకుని మా ఇంటికి వచ్చింది. అప్పుడు నేను ఇంట్లో లేను. షూటింగ్ కోసం వేరే లొకేషన్లో ఉన్నాను. పిల్లల కోసమని ఐస్క్రీమ్ కొన్న ఆమె కాస్త మిగిలితే దాన్నలాగే వదిలేసి తిరిగెళ్లిపోయింది. ఇంట్లో ఉన్న సుమ.. డాక్టర్ వార్నింగ్ మర్చిపోయి కాస్తం ఐస్ క్రీమ్ తింది. అంతే.. మళ్లీ తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది.వెళ్లేసరికే..నేలపై పడి గిలగిల కొట్టుకుంటోందని పనివాళ్లు ఫోన్ చేసి చెప్పారు. నేను ఇంటికెళ్లేసరికి తన పరిస్థితి మరింత దిగజారింది. హాస్పిటల్కు తీసుకెళ్లాం, కానీ తనను కాపాడుకోలేకపోయాం. ఐస్క్రీమ్ అలర్జీ వల్ల ఊపిరితిత్తుల్లో రంధ్రాలు ఏర్పడ్డాయి. అలా నా భార్య కన్నుమూసింది అని చెప్పుకొచ్చాడు. దక్షిణాదిన వందలాది చిత్రాల్లో నటించిన దేవన్ తెలుగులో ఆశయం, పెళ్లి చేసుకుందాం, మా అన్నయ్య, దేశముదురు, ఏమాయ చేసావె, హార్ట్ ఎటాక్, సాహొ వంటి పలు చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా విలన్ పాత్రలతోనే మెప్పించాడు.చదవండి: 'లోక' @ రూ.200 కోట్లు.. గర్వాన్ని తలకెక్కించుకోవద్దన్న తండ్రి -
సీనియర్ సిటిజన్కు సినీ నిర్మాత టోకరా.. కేసు నమోదు
బంజారాహిల్స్: పదేళ్ల పాటు లీజుకు తీసుకుని భవనాన్ని 99 ఏళ్ల లీజు అంటూ ఫోర్జరీ పత్రాలను సృష్టించి మోసం చేయడంతో పాటు వృద్ధురాలిని బెదిరింపులకు గురిచేస్తున్న వ్యవహారంలో సినీ నిర్మాత, రౌడీషీటర్ షేక్ బషీద్తో పాటు అతని భార్యపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లో నివాసం ఉంటున్న లక్ష్మీశ్వరి (85) కుమారుడు తిరుమల వెంకటేష్ అమెరికాలో ఉంటారు. అతడికి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లో భవనం ఉంది. దానికి జీపీఏ హోల్డర్గా ఉన్న తల్లి లక్ష్మీశ్వరి వద్ద నుంచి 2013లో సినీ నిర్మాత షేక్ బషీద్, అతని భార్య షేక్ కరీమున్నీసా లీజుకు తీసుకున్నారు.పదేళ్ల పాటు లీజుకు ఇచ్చినట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2023లో లీజు గడువు ముగియడంతో ఖాళీ చేయాలంటూ యజమానులు చెప్పగా, తమకు 99 ఏళ్ల పాటు లీజు ఉందంటూ పత్రాలు చూపించారు. 2012 నుంచి 2112 దాకా ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తే లేదంటూ షేక్బషీద్ చెప్పడంతో లక్ష్మీశ్వరి షాక్కు గురయ్యారు. అప్పటి నుంచి అద్దె చెల్లించకపోవడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వాలు తప్ప ప్రైవేటు వ్యక్తులు ఎవరూ 99 ఏళ్లకు ఇంటిని లీజు ఇవ్వరని, తప్పుడు పత్రాలతో తన ఇంటిని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు షేక్బషీద్తో పాటు అతని భార్య కరీమున్నీసాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేషనల్ అవార్డ్ విన్నర్ కొత్త సినిమా.. రేపే రిలీజ్
తొలి సినిమా 'తిథి' (కన్నడ మూవీ)తోనే జాతీయ అవార్డు అందుకున్న రామ్ రెడ్డి మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ జుగ్నుమా (Jugnuma - The Fable film). ఈ మూవీ ద ఫేబుల్ పేరిట అంతర్జాతీయ స్థాయిలో విడుదలైంది. ఇప్పుడు దేశీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అలరించనుంది. జుగ్నుమా కథ ఇప్పటిది కాదు! తొమ్మిదేళ్ల క్రితం హిమాలయాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళాలకు తనవంతు సాయం చేశాడు రామ్ రెడ్డి. ఆ సమయంలో ఈ కథ పురుడు పోసుకుంది. భారత్- నేపాల్ సరిహద్దులోని హిమాలయ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ చేశారు. ఇందులో అడవిలో చెట్లను పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. మనోజ్ బాజ్పాయ్, ప్రియాంక బోస్ ప్రధాన పాత్రలు పోషించారు. బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలో జుగ్నుమా ప్రదర్శితమైంది. లీడ్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకుంది. సినిమా ప్రదర్శితమైన ప్రతి చోటా దర్శకుడి ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. దర్శకనటుడు అనురాగ్ కశ్యప్, నిర్మాత గునీత్ మోంగా సైతం సినిమా చూసి అభినందించారు. -
'లోక' @ రూ.200 కోట్లు.. గర్వాన్ని తలకెక్కించుకోవద్దన్న తండ్రి
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కలెక్షన్స్ పెద్దగా రావంటుంటారు! కానీ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన 'కొత్త లోక మూవీ' ఆ వాదనను కొట్టిపారేసింది. సెంచరీలు కొడుతోంది. బాక్సాఫీస్ వద్ద రిలీజైన 13 రోజుల్లోనే రూ.202 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇంతటి ఘన విజయం సాధించినందుకు అందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇదే నా సలహా: తండ్రి మెసేజ్ఇలాంటి సమయంలో కల్యాణికి తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అదేంటనేది ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేసింది. 'ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో.. విజయ గర్వాన్ని తలకెక్కించుకోకు, ఫ్లాప్ వచ్చినప్పుడు ఆ బాధను మనసులో మోయకు.. నేను నీకు ఇచ్చే మంచి సలహా ఇదే! లవ్యూ..' అని కూతురికి మెసేజ్ పెట్టాడు. అందుకు కల్యాణి.. తప్పకుండా మీరు చెప్పింది పాటిస్తాను నాన్నా, లవ్యూ అని రిప్లై ఇచ్చింది.సినిమాతన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు సైతం అభినందనలు తెలిపింది. 'మీ వల్లే సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నాకు మాటలు రావడం లేదు. మన ఇండస్ట్రీలో కంటెంటే కింగ్. కథలో దమ్ముంటే మీరు దాన్ని అందలం ఎక్కిస్తారని మరోసారి రుజువు చేశారు' అని రాసుకొచ్చింది. సూపర్ హీరో కాన్సెప్ట్తో వచ్చిన మూవీ 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర'. కల్యాణి ప్రియదర్శన్, నస్లీన్ ప్రధాన పాత్రలు పోషించారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఈ మూవీ ఆగస్టు 28న మలయాళంలో రిలీజైంది. ఒకరోజు ఆలస్యంగా ఆగస్టు 29న సాయంత్రం తెలుగులో విడుదలైంది. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) చదవండి: అంత వైరల్ చేశారేంటి? నేనేదో సరదాగా అన్నా!: హీరో -
కన్నడ స్టార్ రాజ్కుమార్ కిడ్నాప్పై సినిమా
కన్నడ కంఠీరవ రాజ్కుమార్ (Dr. Rajkumar) జీవితంలోని కీలక అంశమైన కిడ్నాప్ నేపథ్యంలో ఓ సినిమా రానుంది. రాజ్కుమార్ని వీరప్పన్ (Veerappan) కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే! అశోక్, ముని, నాగేశ్ ప్రధాన పాత్రధారులుగా కట్టా శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వంలో వి.లీలా మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అక్టోబరులో షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రీకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘రాజ్కుమార్గారిని వీరప్పన్ కిడ్నాప్ చేయడం అందర్నీ షాక్కి గురి చేసింది. అప్పటి కిడ్నాప్ కోణంలో పలు అంశాలను ఈ చిత్రంలో చర్చించబోతున్నాం. ఈ చిత్రానికి ప్రతిభగల టెక్నీషియన్లు పని చేయనున్నారు. పూర్తి వివరాలు దసరా తర్వాత వెల్లడిస్తాం’’ అని చెప్పారు. అసలేం జరిగింది?కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ తండ్రి రాజ్కుమార్ను 2000వ సంవత్సరం జూలై 30న వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. రాజ్కుమార్తో పాటు ఆయన అల్లుడు గోవింద్రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. ఆ సమయంలో తమిళనాడులో కరుణానిధి అధికారంలో ఉన్నారు. వీరప్పన్.. రాజ్కుమార్ను టార్గెట్ చేశాడని 1999లోనే సిట్ (వీరప్పన్ను పట్టుకోవడం కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం) ప్రభుత్వాన్ని హెచ్చరిచింది.అయినా నటుడికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం వీరప్పన్తో పలుమార్లు చర్చలు జరిపింది. అలా 108 రోజులపాటు రాజ్కుమార్ను బంధించిన వీరప్పన్ 2000 సంవత్సరం నవంబర్ 15న ఆయన్ను వదిలేశాడు. చర్చలు జరిపినా వినని వీరప్పన్.. సడన్గా రాజ్కుమార్ను విడుదల చేయడం మిస్టరీగానే మిగిలిపోయింది. 2004లో సిట్ బృందం చేతిలో వీరప్పన్ మృతి చెందగా, 2006 ఏప్రిల్ 12న రాజ్కుమార్ తుదిశ్వాస వదిలారు.చదవండి: బిగ్బాస్: 5 నెలల పాప.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా? -
అంత వైరల్ చేశారేంటి? నేనేదో సరదాగా అన్నా!: హీరో
హారర్, మిస్టరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు. నాకు ఇష్టమైన జానర్👻 టీనేజ్లో ఉన్నప్పట్నుంచి నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. మా శ్రీ సాయి గణేశ్ ప్రొడక్షన్లో నిర్మించిన ‘కాంచన’ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. డైరెక్టర్ కౌశిక్ ‘కిష్కింధపురి’ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. నాకు బాగా ఇష్టమైన జానర్ ఇది. హారర్ కారణంగా మా సినిమాకి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలమైందని సెన్సార్ సభ్యులు అభినందించడం ఆనందాన్నిచ్చింది.👻 ఈ సినిమా కోసం సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ని సెట్గా వేశాం. అలాగే ఓ పాడుబడ్డ గృహంలో షూట్ చేశాం. మంగళవారం ఈ సినిమాని మా స్నేహితులతో కలిసి థియేటర్స్లో చూశాం... సినిమా అదిరిపోయింది. సౌండ్ డిజైనర్ రాధాకృష్ణగారు సౌండ్ని అద్భుతంగా డిజైన్ చేశారు. కౌశిక్ మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ పరిమితులుంటాయి. కానీ, సాహు గారపాటిగారు ఆడియన్స్కి ద బెస్ట్ ఇవ్వాలని రాజీ పడకుండా నిర్మించారు. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం అందించారు. 👻 ‘మా సినిమాకి వచ్చిన ప్రేక్షకుల్లో మొదటి పది నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ పట్టుకుంటే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను’ అని సరదాగా అన్నాను... దాన్ని వైరల్ చేశారు. మా చిత్ర కథ అంత ఆసక్తిగా ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు... ఇండస్ట్రీలోనే ఉంటాను... భవిష్యత్లో దర్శకత్వం కూడా చేస్తాను. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కథ ఉంటే నేను, నా తమ్ముడు సాయి గణేశ్ కలిసి సినిమా చేస్తాం.చదవండి: బిగ్బాస్: 5 నెలల బాబు.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా? -
‘కానిస్టేబుల్’కి 30 లక్షలు!
"హ్యాపీడేస్, కొత్త బంగారులోకం" వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో కెరీర్ ను మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ఇప్పటివరకు అనేక చిత్రాలు చేసినప్పటికీ లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాను నటిస్తున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్’ తో మాస్ కమర్షియల్ హీరోగా కొత్త ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ..‘ఈ సినిమాట్రైలర్ ను ఆగస్టు 31 వ తారీఖున రిలీజ్ చేశాం. ,నాటి నుంచి ఇప్పటివరకు జనాల్లో విశేష స్పందన వస్తోంది. 30 లక్షల మందికి పైగా ఈ ట్రైలర్ ని ఆదరించారు. మా అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది. త్వరలో భారీగా ప్రపంచవ్యాప్తంగా చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం’ అని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ‘టైలర్ కి అద్భుత స్పందన రావడం ఆనందదాయకం. సినిమా సస్పెన్స్ తో పాటు ప్రతి సీన్ థ్రిల్లింగ్ గా ప్రతి ఒక్కరికి నచ్చే విదంగా ఉంటుంది, అలాగే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది’అని అన్నారు. -
‘మిరాయ్’ షూటింగ్లో తేజకు గాయాలు, అనారోగ్యం.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘నా తొలి చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడు ‘మిరాయ్’ అవకాశం వచ్చింది. అద్భుతంమైన కథ. నా క్యారెక్టర్ చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాను. ఈ చిత్రంలోని యాక్షన్ అడ్వంచర్ ఆడియన్స్ గొప్ప అనుభూతిని ఇస్తుంది’ అని అన్నారు హీరోయిన్ రితీకా నాయక్. హనుమాన్ తర్వాత తేజ సజ్జ నటించిన తాజా మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా నటించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్గా రితీకా నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశాం. ముఖ్యంగా తేజ చాలా కష్టపడ్డాడు. షూటింగ్ సమయంలో ఆయనకు చాలా గాయాలు అయ్యాయి. కొన్నిసార్లు అనారోగ్యం కూడా చేసింది. అయినప్పటికీ ఆయన కరెక్ట్ టైం కి సెట్ లో ఉండేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.మనోజ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆఫ్ స్క్రీన్ ఆయన చాలా ఫన్ ఫుల్ గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్. ఈ సినిమాలో దాదాపు 80% లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ప్రతి రియల్ టైమ్ లొకేషన్స్ లోకి వెళ్లడం వెరీ చాలెంజింగ్. అయితే మా టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో జర్నీ చాలా అద్భుతంగా జరిగింది.కార్తీక్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. కథలో ప్రాధాన్యత ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. -
176 సినిమాలు చేశా కానీ, తిరుపతికి వెళ్తే ఓ పెద్దావిడ అలా అనేసింది: తమన్
తెలుగు ఇండియన్ ఐడల్ షో నాలో కొత్త మార్పుని తీసుకొచ్చింది. నేను సంగీతం అందించిన సినిమాలు నన్ను ప్రేక్షకుల ఇంటిదాక తీసుకెళ్తే.. ఈ షో ఇంటిలోపలికి తీసుకెళ్లేలా చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ కు పనిచేయడం ఒక బాధ్యతగా, గౌరవంగా భావిస్తున్నాం’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సంగీత కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్, గీతా మాధురి జడ్జెస్ గా, శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ లో టాప్ 12 కంటెస్టెంట్స్ గాన ప్రతిభను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ - ఈ షో తర్వాత మేము మ్యూజిక్ కన్సర్ట్స్ కు వెళ్తే ఇండియన్ ఐడల్ లో బాగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మా కన్సర్ట్స్ కు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తిరుపతి దర్శనానికి వెళితే.. ఓ పెద్దావిడ క్యూలో నుంచి అందరిని పక్కకి నెట్టి నా దగ్గరకు వచ్చి ‘ఇండియన్ ఐడల్లో బాగా చేస్తున్నావు’ అని చెప్పి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు నేను 176 సినిమాలకు సంగీతం అందించా.. వాటి గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా.. షో గురించి చెప్పి వెళ్లింది(నవ్వుతూ..). అలాంటి గుర్తింపు మాకు తెలుగు ఇండియన్ ఐడల్ తీసుకొచ్చింది. ఈ షోలో డల్లాస్ నుంచి కూడా కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఈ షోను ఆర్గనైజ్ చేయబోతున్నాం. అందుకే గల్లీ టు గ్లోబల్ అనే క్యాప్షన్ పెట్టాం. కంటెస్టెంట్స్ పాడటం ఒక్కటే కాదు వారి కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, ఇక్కడ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేవి అన్నీ క్యాప్చర్ చేస్తున్నాం. ఈ షోకు వస్తే మాకు హాలీడేకు వచ్చిన ఫీల్ కలుగుతుంటుంది. తెలుగు ఇండియన్ ఐడల్ ను ఒక ఆస్తిలా భావిస్తున్నాం. అన్నారు.నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అద్భుతంగా వచ్చింది. అంత బాగా మీరు చేస్తానంటేనే సీజన్ 4కు ఇన్వెస్ట్ మెంట్ పెడదాం అని అన్నాను. ఇండియన్ ఐడల్ వారికి ప్రతి సీజన్ కు డబ్బు ఇచ్చి రైట్స్ తీసుకోవాల్సిఉంటుంది. గత సీజన్ కంటే ఈ సీజన్ 4 బాగా చేస్తున్నారు. ఇందుకు తమన్ కు థ్యాంక్స్ చెప్పాలి. ఈ షోకు తమన్ లైఫ్ తీసుకొచ్చాడు. స్కూల్ లో చదువుతున్న పిల్లలు కూడా వచ్చి బాగా పాడుతున్నారు. ఇతర రాష్ట్రాల పిల్లలు తెలుగు నేర్చుకుని పాడుతున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ క్రేజ్ ఎంతలా ఉందంటే అమెరికాలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ అక్కడి నుంచి కంటెస్ట్ చేసేందుకు వచ్చారు. మనం గల్లీ టు ఢిల్లీ అంటాం, కానీ ఇది గల్లీ టు గ్లోబల్ అయ్యింది. ఆహా నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ షో చేస్తున్నందుకు గర్వంగా ఉంది’అన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్ సమీరా భరద్వాజ్, గీతా మాధురి పాల్గొని మాట్లాడారు. -
ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడు చూడలేదు : హీరో బెల్లంకొండ
నేను ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఆ క్రమంలో చాలా వరకూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే నాకు పర్సనల్ గా హారర్ సినిమాలంటే ఇష్టం. మా ప్రొడక్షన్ లో చేసిన కాంచన లాంటి సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను.చాలా రోజుల తర్వాత నాకు నచ్చే జానర్లో కిష్కింధపురి అనే ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఈ చిత్రం డియన్స్ కి ఒక డిఫరెంట్ థ్రిల్, సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది’అన్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సాయి శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...→ దర్శకుడు కౌశిక్ కు మంచి కథ రెడీ చేసుకున్నాడు. అయితే ఇలాంటి జోనర్స్ సినిమాలకి బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. కానీ సాహు ఆడియన్స్ కి ద బెస్ట్ ఇవ్వాలని టెక్నికల్ గా గ్రాఫిక్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిదీ ఇచ్చారు.ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్ గా ఉంది. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా చేసిన సినిమా ఇది.→ నిన్న ఫస్ట్ టైం థియేటర్స్ లో ఈ సినిమా చూసాం. అదిరిపోయింది. ముఖ్యంగా సౌండ్. సలార్ యానిమల్ కాంతారా సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకృష్ణ సౌండ్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమాకి అద్భుతమైన సౌండ్ డిజైన్ చేసే స్పేస్ ఉంది. హారర్ మిస్టరీ ఉన్న ఒక కొత్త జానర్ ఇది. టెక్నికల్ అద్భుతంగా ప్రజెంట్ చేశాం.→ ఈ సినిమా కథలోనే యాక్షన్ ఉంది. మొత్తం ఆర్గానిక్ గా చేసిన సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్ సౌండ్ పరంగా ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు. హారర్ సినిమాలో ఇంత కథ ఉన్న సినిమా నేను ఎప్పుడు చూడలేదు. హారర్ మిస్టరీ రెండు బ్లెండ్ అయిన సినిమా ఇది. ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.→ ఈ సినిమా కోసం సువర్ణమాయ రేడియో స్టేషన్ ని సెట్ గా వేశాం. అలాగే రియల్ వాంటెడ్ హౌస్ లో షూట్ చేశాం. అది రియల్ గా పాతబడిపోయిన బిల్డింగ్. తర్వాత వాళ్లకి కొత్త బిల్డింగ్ వేసి ఇవ్వడం జరిగింది.→ ఈ సినిమాని టీనేజ్ ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. హారర్ కారణంగా సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలం అయిందని సెన్సార్ సభ్యులు చెప్పడం ఆనందాన్నిచ్చింది.→ ఈ మధ్య ఏదైనా ఒక కొత్తగా చేయాలి, యాక్టర్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే కసి పెరిగింది. ఒక కొత్త క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు సెట్లో లొకేషన్ లో ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను.→ కొత్త సినిమాల విషయానికొస్తే.. టైసన్ నాయుడు షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. హైందవ షూటింగ్ చివరి దశకు వచ్చింది. సమ్మె కారణంగా బ్రేక్ పడింది కానీ ఈపాటికి షూటింగ్ అయిపోయేది. ఈ రెండు కూడా డిఫరెంట్ సినిమాలు. అలాగే పొలిమేర డైరెక్టర్ అనిల్ తో ఒక సినిమా ఉండబోతుంది. అది న్యూ ఏజ్ థ్రిల్లర్. -
ప్రభాస్ సినిమా చూసి భారతీయ సినిమాలను నిషేధించాడు!
భారత్కు చిరకాల మిత్ర దేశం, పొరుగు దేశమైన నేపాల్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. అవినీతితో పాటు సోషల్ మీడియాపై నిషేధాలతో మొదలైన ప్రజాగ్రహానికి ప్రధాని సహా ప్రభుత్వం మొత్తం దాసోహమైపోయింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రధాని , దేశాధ్యక్షుడు సహా రాజీనామా చేసేశారు. ఈ నేపధ్యంలో ఆ దేశ ప్రధానిగా బాలేంద్ర షా పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖాట్మాండు మేయర్గా ఉన్న బాలేంద్ర కు యువతలో ఉన్న ఆదరణ, ఆయనను ప్రధానిగా కోరుకుంటున్న వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో తదుపరి ప్రధాని ఆయనే అనే ఆలోచన బలపడుతోంది.ఈ నేపధ్యంలో కాబోయే ప్రధానిగా పేర్కొంటున్న బాలేంద్ర షా కు భారత్ తో ఉన్న వైరుధ్యాలు ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఆయన రెండేళ్ల క్రితం భారత సినిమాలపై చూపించిన అవసరానికి మించిన ఆగ్రహం ప్రస్తావనార్హంగా మారింది. రెండేళ్ల క్రితం ఖాట్మండు మేయర్ హోదాలో ఆయన ఖాట్మాండు నగరంలో భారతీయ సినిమాల ప్రదర్శనలను నిలిపేయాలని ఆదేశించారు. దాంతో ఖాట్మాండు మెట్రోపాలిస్తో పాటు, పోఖారా మెట్రోపాలిటన్ నగరం కూడా భారతీయ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించింది. ఈ విషయంలో పోఖారా మేయర్ ధనరాజ్ ఆచార్య కూడా బాలేంద్ర షా మార్గాన్నే అనుసరిస్తూ బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేయాలని మధ్య నేపాల్లోని మెట్రోపాలిటన్ నగరంలోని సినిమా హాళ్లను ఆదేశించారు. రెండు మెట్రోపాలిటన్ నగరాల మేయర్ల ఆదేశాల తర్వాత, అక్కడ సినిమా హాళ్లు హిందీ లేదా బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను రద్దు చేసి, వాటి స్థానంలో హాలీవుడ్ నేపాలీ సినిమాలను అప్పటికప్పుడు ప్రవేశపెట్టాయి. ఇంతకీ ఇలా బాలీవుడ్ చిత్రాలపై నేపాల్ మేయర్ల ఆగ్రహానికి కారణమైంది టాలీవుడ్ రెబల్ స్టార్ నటించిన ఆదిపురుష్ సినిమా కావడం విశేషం. దీనికి కారణాలను బాలేంద్ర షా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘భారతీయ చిత్రం ఆదిపురుష్ చూశాను. ఆ సినిమాలో రాముని సతీమణి జానకి జన్మ స్థలంపై తప్పు సమాచారం ఉంది . అందులో ఆమెను భారతదేశపు కుమార్తె అని చెప్పే సంభాషణ ఉంది (నేపాలీయులు సీతమ్మ తమ నేలపైనే జన్మించినట్టు విశ్వసిస్తారు), ఇది సరికాదని, అభ్యంతరకరమైనదని మేం వారి దృష్టికి తీసుకెళ్లాం. తప్పును సరిదిద్దడానికి 3 రోజుల సమయంతో అల్టిమేటం ఇచ్చాము. అయినా వారు పట్టించుకోలేదు. నేపాల్ స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఆత్మగౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచడం ద్వారా జాతీయ ప్రయోజనాలను కాపాడటం ప్రతి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వేతర రంగం నేపాలీ పౌరుడి ప్రథమ కర్తవ్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు‘ అని ఖాట్మండు మేయర్ అప్పట్లో తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు.అయితే ఆ తర్వాత నేపాలీ రాజధానిలో ప్రదర్శనపై నిషేధం నేపధ్యంలో, ’ఆదిపురుష్’ నిర్మాణ సంస్థ ’టి–సిరీస్’ నేపాలీ మేయర్కు లేఖ రాసింది. అనంతరం సినిమాల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశాలిస్తూ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్ధుమణిగింది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి
టాలీవుడ్ స్టార్ దంపతులు వరుణ్ తేజ్ (Varun Tej)- లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. లావణ్య బుధవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మరోవైపు చిరంజీవి కూడా 'మన శంకరవరప్రసాద్గారు' మూవీ సెట్స్ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి వరుణ్- లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అటు అభిమానులు, సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా వరుణ్ జంటకు విషెస్ చెప్తున్నారు.లవ్ మ్యారేజ్వరుణ్-లావణ్యలది ప్రేమ వివాహం. 2017లో మిస్టర్ సినిమాలో తొలిసారి జంటగా నటించారు. తర్వాత అంతరిక్షంలోనూ యాక్ట్ చేశారు. ఈ సినిమాల సమయంలోనే వీరి మధ్య స్నేహం బలపడింది. అది ప్రేమగా మారడంతో కొంతకాలం డేటింగ్లో ఉన్నారు. తర్వాత పెద్దలనొప్పించి 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ చివరగా గతేడాది మట్కా సినిమాలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం #VT15 అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. Our little man 🩵🩵🩵10.09.2025 pic.twitter.com/dFTCFFPl9o— Varun Tej Konidela (@IAmVarunTej) September 10, 2025 View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
ఏడుస్తున్నా వినకుండా ఆ సీన్స్ చేయించారు.. నాపై చేతబడి చేశారు!
చిరంజీవి, మోహన్బాబు, బాలకృష్ణ.. ఇలా స్టార్ హీరోలందరితోనూ నటించింది హీరోయిన్ మోహిని. ఆదిత్య 369 సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాదిన అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు 100కి పైగా సినిమాలు చేసింది. తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టాక సినీ ఇండస్ట్రీకి దూరమైంది.వద్దని ఏడ్చా..చాలాకాలం తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా సినీజ్ఞాపకాలను పంచుకుంది. మోహిని (Tamil Actress Mohini) మాట్లాడుతూ.. ఓ సినిమాలో దర్శకుడు రొమాంటిక్ సాంగ్ను స్విమ్మింగ్ పూల్లో ప్లాన్ చేశాడు. నాకసలే ఈత రాదు, అందులోనూ స్విమ్ సూట్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది. అదే మాట చెప్పి ఏడ్చాను. నావల్ల కాదన్నాను.ఇష్టం లేకుండా నటించాఅప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్లు లేరు, మగవాళ్లే ఉన్నారు. వాళ్ల ముందు సగం బట్టలే వేసుకుని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే ఆ పాటలో నాతో బలవంతంగా సగం దుస్తులు వేయించి స్విమ్మింగ్ పూల్లో షూట్ పూర్తి చేశారు. తర్వాత ఊటీలో మళ్లీ అలాంటి సీన్ చేయాలన్నారు. అప్పుడు నేనసలు ఒప్పుకోలేదు. ఆల్రెడీ సీన్ అయిపోయాక మళ్లీ ఇదేంటి? నేను చేయనని తెగేసి చెప్పాను. నాకు ఇష్టం లేకపోయినా మరీ గ్లామరస్గా కనిపించేలా చేశారు.చేజారిన సినిమాలు'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మూవీలో సిమ్రాన్కు బదులుగా నేనే నటించాల్సింది. ముందు నన్నే అడిగారు. కానీ నేను సినిమాలు మానేశానని ఎవరో డైరెక్టర్కు చెప్పారట! దీంతో నా స్థానంలో సిమ్రాన్ను తీసుకున్నారు. ఈ విషయం దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వయంగా నాతో చెప్పాడు. రజనీకాంత్ 'ముత్తు' సినిమాలో హీరోయిన్గా నన్ను తీసుకోవాలా? మీనాను సెలక్ట్ చేసుకోవాలా? అని దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. నన్నోసారి వచ్చి కలవమన్నారు. పనికోసం వెతుక్కుంటూ వెళ్లడం నాకిష్టం లేదు. నాపై చేతబడిమనకని రాసిపెట్టుంటే అది మనకే వస్తుందని ఊరుకున్నాను. వాళ్లు ఫైనల్గా మీనాను సెలక్ట్ చేశారు. ఇది పోతే నాకు ఎక్కడో మంచి అవకాశం ఉండే ఉంటుందనుకున్నాను. డేట్స్ కుదరకపోవడంతో చిన్న తంబి చేజారింది అని చెప్పుకొచ్చింది. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. నా భర్త కజిన్ నాపై చేతబడి చేయించింది. అప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాడు అని పేర్కొంది. మోహిని చివరగా కలెక్టర్ (2011) అనే మలయాళ మూవీలో మెరిసింది.చదవండి: IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్లో రక్తం.. ప్రాణం లేని బిడ్డకు జన్మనిచ్చిన నటి -
చిన్నారికి అరుదైన వ్యాధి.. హీరోయిన్ ఆపన్నహస్తం
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez). బాబు ఇంటికి వెళ్లి తనతో కబుర్లు చెప్పి, ఆడించి నవ్వించే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులోని బాబు తల బెలూన్లా ఉబ్బిపోయి ఉంది. తలపై నరాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని హైడ్రోసెఫాలస్ (Hydrocephalus) అని పిలుస్తారు. అరుదైన వ్యాధిఈ వ్యాధి వచ్చిన శిశువుల తల అసాధారణంగా పెద్దగా ఉంటుంది. ఈ వ్యాధితో ఓ బాలుడు బాధపడుతున్నాడని తెలిసి జాక్వెలిన్ చలించిపోయింది. వెంటనే అతడి కుటుంబాన్ని కలిసి సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హుస్సేన్ మన్సూరి వెల్లడిస్తూ జాక్వెలిన్కు అభినందనలు తెలిపాడు. పిల్లవాడు మళ్లీ మామూలు స్థితికి వస్తాడని ఆశిద్దామని పోస్ట్ పెట్టాడు. మంచి మనసుకాగా జాక్వెలిన్ పలు స్వచ్ఛంద సంస్థలకు సాయం చేస్తూ ఉంటుంది. మూగ జీవాల సంరక్షణ, పిల్లల చదువులు.. ఇలా అన్నింటికోసం పాటుపడుతూ ఉంటుంది. అలాగే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని జనాల్లో అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జాక్వెలిన్.. వెల్కమ్ టు ద జంగిల్ సినిమా చేస్తోంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hussain Mansuri (@iamhussainmansuri) చదవండి: నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్మ్యాన్ -
IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్లో రక్తం.. ప్రాణం లేని పాప!
తల్లవాలంటే ముందు పెళ్లవాలా? అక్కర్లేదు, ఏ తోడూ లేకుండానే అమ్మనవుతాను అని నిర్ణయించుకుంది కన్నడ నటి భావన రామన్న. అందుకే 40 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ఐవీఎఫ్ ఎంచుకుంది. కడుపులో కవలలను మోసింది. సీమంతం కూడా బాగా జరిగింది. కానీ డెలివరీ రోజు ఒక శిశువు మాత్రమే ప్రాణంతో దక్కింది. ఓ శిశువును కోల్పోయింది.టైం బాంబ్పై కూర్చున్నావ్ఈ విషాదం గురించి భావన (Bhavana Ramanna) మాట్లాడుతూ.. సీమంతం తర్వాత నేను ఎక్కువసేపు కూర్చోలేకపోయాను. కొన్నిసార్లు స్పాటింగ్ (రక్తస్రావం) కనిపించేది. నేను వెళ్లే హాస్పిటల్ చాలా దూరంలో ఉండటంతో దగ్గర్లోనే మంచి డాక్టర్ను చూసుకుంటే అయిపోతుందన్నారు. మా బంధువులు ఎక్కువగా డెలివరీ అయిన డాక్టర్ దగ్గరకు వెళ్లి కలిశాను. ఆమె నన్ను చూడగానే.. భావన, నువ్వో టైం బాంబ్ మీద కూర్చున్నావ్.. తెలుసా? అంది. పాప చనిపోయిందివెంటనే నాకు అన్ని పరీక్షలు చేసింది. సాధారణంగా బొడ్డుతాడు ద్వారా శిశువుకు రక్తం అందుతుంది. కానీ టెస్ట్లో అది రివర్స్లో జరుగుతుందని తేలింది. అలాగే ఓ శిశువు గుండె కొట్టుకునే వేగం సగానికి సగం తగ్గిపోయిందని తెలిసింది. పైగా సరైన బరువు కూడా లేదని డాక్టర్ చెప్పింది. అప్పటికప్పుడు నాకు ఆపరేషన్ చేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఒక బిడ్డ చనిపోయిందని చెప్పగానే నాకు మాటలు రాలేదు. అమ్మమ్మ పేరే పెట్టా..పుట్టిన బిడ్డ కోసం సంతోషపడాలా? చనిపోయిన పాప కోసం ఏడవాలా? ఏదీ అర్థం కాని స్థితిలో ఉండిపోయాను. నా కూతురికి రుక్మిణి అని మా అమ్మమ్మ పేరు పెట్టాను. తను ఆగస్టు 20న జన్మించింది అని చెప్పుకొచ్చింది. కన్నడలో అనేక సినిమాలు చేసిన భావన రామన్న తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా మలయాళంలో ఒట్ట మూవీ చేసింది. తెలుగులో అమ్మాయి నవ్వితే (2001) అనే ఏకైక మూవీలో కనిపించింది.చదవండి: రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు! -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న బిగ్బాస్ రన్నరప్
బిగ్బాస్ రియాల్టీ గేమ్ షో (Bigg Boss Reality Show) నుంచి బయటికి వచ్చిన పలువురు సినిమాల్లో హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ విక్రమన్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రాన్ని గోల్డెన్ గెట్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రీతి కరికాలన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఇటీవల చైన్నెలో నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ.. బిగ్బాస్ ఫేమ్ విక్రమన్ను హీరోగా ఎంపిక చేయడానికి కారణం అతని పర్సనాలిటీ అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉండడమేనన్నారు. ఈ చిత్రంలోని కథానాయకుడి పాత్రకు తను పర్ఫెక్ట్గా ఉంటారన్నారు. చిత్ర కథ వాస్తవానికి దగ్గరగా, చాలా ఫ్రెష్గా కలర్ ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. సంగీతం, విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయన్నారు. టోటల్గా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు శ్రీధర్ ఛాయాగ్రహణం, అజేష్ అశోకన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా విక్రమన్.. తమిళ బిగ్బాస్ ఆరో సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. -
ఒక ప్రాణం పోయాక నువ్వు పుట్టావ్.. హీరోయిన్ తల్లి
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాళ్లు మనల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్లరు. ఒకవేళ తనువు చాలించి వెళ్లిపోయినా మళ్లీ ఏదో ఒక రూపంలో మనముందుకు వస్తారని చాలామంది బలంగా నమ్ముతారు. హీరోయిన్ అనస్వర రాజన్ (Anaswara Rajan) ఇంట అదే నిజమైంది. సూపర్ శరణ్య, నెరు, రేఖా చిత్రం వంటి పలు హిట్ సినిమాల్లో నటించింది అనస్వర.నా పాపాయికి హ్యాపీ బర్త్డేనేడు (సెప్టెంబర్ 8) ఆమె బర్త్డే. ఈ సందర్భంగా హీరోయిన్ తల్లి ఉషా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఆరోజు నేనెంతో ప్రేమించిన వ్యక్తిని కోల్పోయాను.. అదే రోజు నువ్వు జన్మించావు. 23 ఏళ్ల ఈ పాపాయి ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. అమ్మ నీకోసం వేవేల బర్త్డే విషెస్ తెలియజేస్తోంది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు అనస్వర ఫోటోను జత చేసింది. దీంతో అభిమానులు హీరోయిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాకాగా ఉషా- రాజన్ దంపతులకు 2002 సెప్టెంబర్ 8న అనస్వర జన్మించింది. ఈమె పుట్టడానికి ముందు ఉషా తల్లి మరణించింది. తల్లిని కోల్పోయి పుట్టెడు శోకంలో మునిగిన ఉషాకు కూతురే ప్రపంచంగా మారింది. అనస్వరలోనే తల్లిని చూసుకుని సంతోషపడిపోయింది. అనస్వర రాజన్ సినిమాల విషయానికి వస్తే.. 7/G రెయిన్బో కాలనీ 2 సినిమా చేస్తోంది. ఇది తెలుగులో7/G బృందావన కాలనీ 2గా విడుదల కానుంది. దీనితో పాటు మరో రెండు మూవీస్ చేస్తోంది. View this post on Instagram A post shared by Usha Rajan (@usharajan_) చదవండి: 15 మంది పనోళ్లు.. కూతుళ్లు లేరు, కొడుకూ లేడు, అందుకే.. -
ఎన్నో అవమానాలు.. ఈ స్థాయికి వస్తాననుకోలేదు: నిర్మాత ఎమోషనల్
అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన వ్యక్తిగా డి.రామానాయుడు చరిత్రకెక్కితే... ఒకేరోజు 15 చిత్రాలు ప్రారంభించిన నిర్మాతగా ప్రపంచ రికార్డు సాధించారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ (Tummalapalli Rama Satyanarayana). అంతేకాదు ఈ 15 సినిమాలు ఏడాది వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే స్థిర సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ శతాధిక చిత్ర నిర్మాత తన పుట్టిన రోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.15 సినిమాలుతన వల్ల తెలుగు సినిమాకి ఓ గొప్ప గౌరవం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అయితే ఈ ఘనత తన ఒక్కడిదే కాదని, తన వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ చెందుతుందని తెలిపారు. 15 సినిమాల్లో "యండమూరి కధలు, కె.పి.హెచ్.బి. కాలనీలో, మా నాన్న హీరో, మహానాగ" చిత్రాల రెగ్యులర్ షూటింగ్ మొదలైందని, మిగతా చిత్రాలు ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయని వివరించారు. ఇదే ఏడాదిలో ఒక ప్రముఖ దర్శకుడితో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఈ బర్త్డే ఎంతో స్పెషల్ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు!! తొలినాళ్లలో పలు చేదు అనుభవాలు ఎదుర్కొన్న తనకు... ఇండస్ట్రీ ఇంత మంచి స్థానాన్ని, స్థాయిని ఇస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఇందుకు తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని వెల్లడిస్తూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాతగా 200 చిత్రాలు పూర్తి చేయాలన్నదే తన జీవితాశయమని తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రకటించారు. -
15 మంది పనోళ్లు.. కూతుళ్లు లేరు, కొడుకూ లేడు, అందుకే..
కోలీవుడ్ స్టార్ దంపతులు శరత్కుమార్- రాధిక (Radhika Sarathkumar) తమ లగ్జరీ బంగ్లా నుంచి బయటకు వచ్చేశారు. చెన్నైలోని ఈసీఆర్లో ఉన్న విలాసవంతమైన భవనంలో కొన్నేళ్లుగా నివసిస్తున్న వీరు మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అందుకు గల కారణాన్ని శరత్కుమార్ వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. మేము ఉన్న ఇల్లు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మా ఇంటికి ఏడు ద్వారాలున్నాయి. అందుకే ఇల్లు మారాంప్రతిరోజు రాత్రి ఆ తలుపులకు గడియపెట్టడం కూడా ఇబ్బందవుతోంది. కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడు. కూతుళ్లకు పెళ్లిళ్లయిపోయి ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు. మా ఇంట్లో 15 మంది పనివాళ్లున్నా సరే.. రాధిక ఒక్కరే ఆ పెద్ద ఇంటిని చూసుకోవడం కష్టమవుతోంది. అందుకే ఇల్లు మారాం. ప్రస్తుతం ఆ ఇంటిని ఓ ఐటీ కంపెనీకి అద్దెకిచ్చాం అని చెప్పుకొచ్చాడు. శరత్కుమార్ చివరగా 3BHK సినిమాలో కనిపించాడు. గణేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచికు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సైతం 3BHK మూవీపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. పర్సనల్ లైఫ్రాధిక.. 1985లో నటుడు ప్రతాప్ పోతన్ను పెళ్లాడింది. ఏడాదికే అతడికి విడాకులిచ్చేసి బ్రిటీష్ వ్యక్తి రిచర్డ్ హార్డీని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు రయానే జన్మించింది. రెండేళ్లకే ఈ దంపతులు కూడా విడిపోయారు. 2001లో నటుడు శరత్కుమార్ను మూడో పెళ్లి చేసుకుంది. శరత్కుమార్కు ఇది రెండో పెళ్లి! ఈయన మొదటగా 1984లో చాయాదేవిని పెళ్లి చేసుకోగా వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. 2000వ సంవత్సరంలో చాయాతో విడాకులు తీసుకున్న శరత్కుమార్ మరుసటి ఏడాది రాధికను పెళ్లాడాడు. రాధిక- శరత్ జంటకు రాహుల్ జన్మించాడు.చదవండి: మిరాయ్.. టికెట్ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా -
సినిమాలు ప్రేక్షకులకోసం.. అవార్డులిచ్చేవారికోసం కాదు: హీరో
కేంద్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించింది. జవాన్, 12th ఫెయిల్, సామ్ బహదూర్, పార్కింగ్, బేబి, బలగం, హనుమాన్.. ఇలా పలు సినిమాలకు వివిధ కేటగిరీల్లో పురస్కారాలు వరించాయి. అయితే రూ.150 కోట్లకిపైగా కొల్లగొట్టిన 'ఆడుజీవితం సినిమా' (Aadujeevitham: The Goat Life Movie)కు మాత్రం ఎటువంటి అవార్డు రాలేదు. ఆడుజీవితం నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమా తెరకెక్కించాడు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించాడు. ప్రేక్షకుల కోసమే మా సినిమాహృదయాలను కదిలించిన ఈ సినిమాకు జాతీయ అవార్డు రాకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారిగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. సినిమా అనేది ప్రేక్షకుల కోసం తీస్తాం. అంతేకానీ జ్యూరీ కోసమో, మార్కులిచ్చే పదిమంది కోసమో కాదు. కేవలం అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో ప్రదర్శితమయ్యేందుకే సినిమాలు తీయము. అవార్డులకు.. వాటి విలువ వాటికి ఉండొచ్చు. కానీ అంతిమంగా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం ముఖ్యం.అదే పెద్ద అవార్డుటికెట్ కొని థియేటర్కు వచ్చిన ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించగలగాలి. వాళ్లంతా ఆడుజీవితాన్ని ఆస్వాదించారు, ఆదరించారు. అదే మాకు గొప్ప అవార్డు. అందుకు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఆడు జీవితం 6 'కేరళ స్టేట్ ఫిలిం అవార్డులు' సాధించింది. జాతీయ అవార్డు కోసం 14 కేటగిరీల్లో పోటీపడినప్పటికీ ఒక్క పురస్కారం కూడా గెలుచుకోలేకపోయింది.చదవండి: నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్లో హీరోయిన్ -
మిరాయ్.. టికెట్ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా
'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించాడు హీరో తేజ సజ్జా (Teja Sajja). ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్ (Mirai Movie). మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. వారికోసమే ఈ నిర్ణయంతెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ, మరాఠి, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో సోమవారం నాడు మిరాయ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై టికెట్ రేట్ల పెంపు గురించి హీరో క్లారిటీ ఇచ్చాడు. తేజ సజ్జా మాట్లాడుతూ.. టికెట్ రేట్ల పెంపు లేదు. తక్కువ ధరకే ఈ సినిమాను చూడబోతున్నారు. మా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ను ఇబ్బంది పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం. కుటుంబమంతా వచ్చి చూడాలనే టికెట్ రేట్లు పెంచడం లేదు అని తేజ సజ్జ పేర్కొన్నాడు.టికెట్ రేట్లు యథాతథంఅయితే ఓ రెండు సర్ప్రైజ్లు దాచుంచామని, అది ఎవరికీ తెలియదని, తెలుసుకోవాలంటే థియేటర్కు రమ్మని పిలుపునిచ్చాడు. ఈరోజుల్లో మధ్య తరహా, భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచేస్తున్నాయి. అలాంటి తరుణంలో టికెట్ రేట్లు పెంచకుండా సినిమా తీసుకొస్తుండటంతో పలువురూ మిరాయ్ టీమ్ను అభినందిస్తున్నారు.కథేంటంటే?మహాజ్ఞాన సంపన్నుడు అశోక చక్రవర్తి తాను పొందిన జ్ఞానాన్ని గ్రంథంలో పొందుపరిచారు. అది ఒకే చోట ఉంటే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని భావించి దాన్ని 9 గ్రంథాలుగా విభజించి 9 మంది యోధులకు ఇస్తారు. ఆ గ్రంథాలను పరిరక్షించే బాధ్యతను అప్పజెప్పుతారు. అయితే, 2025లో ఒక ఈవిల్ ఫోర్స్ వాటిని ఒక్కొక్కటిగా తస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. మరి వాటిని హీరో కాపాడాడా? లేదా? అన్నదే సినిమా కథ! ఈ మూవీని చైనా, జపాన్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్లో హీరోయిన్
బిగ్బాస్ షోలో అందరికీ నచ్చేది నామినేషన్స్. ఈ సీజన్లో మొదటి నామినేషన్స్ నేడు జరగనున్నాయి. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో అందరి టార్గెట్ హీరోయిన్ సంజన అనే కనిపిస్తోంది. బిగ్బాస్.. కామనర్లను ఓనర్లుగా ప్రధాన హౌస్లోకి పంపించి, సెలబ్రిటీలను టెనంట్లు(అద్దెకుండేవారు)గా గార్డెన్ ఏరియాలో ఉన్న బెడ్రూమ్కు పంపాడు. ఈరోజు నామినేషన్స్ ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ అన్నట్లుగా జరగనుంది. టెనంట్స్లో నుంచి ఒకరిని ఓనర్స్ నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు బిగ్బాస్.అబద్ధాలుదాంతో అందరూ కలిసి సంజన గల్రానీని సెలక్ట్ చేశారు. నీ వల్లే గొడవలు జరుగుతున్నాయి. అబద్ధాలాడుతున్నావ్, వెనకాల మాట్లాడుతున్నావ్ అంటూ కారణాలు చెప్పారు. ప్రియ బ్యాక్ బిచింగ్ అనగానే సంజనాకు మండిపోయింది. అలాంటి పదాలు వాడొద్దని హెచ్చరించింది. తర్వాత సంజనా- ఆశా గొడవపడ్డారు. నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి పదేపదే మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? అని సంజనాను నిలదీసింది. (Bigg Boss 9 Telugu First Week Nominations)ఎలిమినేషన్ గండంఆమె నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బిగ్బాస్ హౌస్లో ఎవరైతే కిచెన్లో అడుగుపెడతారో వారు ఎప్పుడూ ఎలిమినేషన్కు దగ్గరగా ఉంటారు. అందులోనూ మొదటివారం కిచెన్లో దూరినవారు మరోవారం కనిపించకుండా పోతారు, అదే ఎలిమినేట్ అవుతారు. మరి సంజనా ఈ గండం గట్టెక్కుతుందో, లేదో చూడాలి! -
సోషల్ మీడియాలో నటి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు.. పోలీసులకు ఫిర్యాదు!
సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ కావడంతో ఆమె పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తాము కలసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు బయట పెడతానని గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించాడని ఆమె ఫిర్యాదులో తెలిపారు. ప్రస్తుతం కొన్ని ట్విటర్ పేజీలతో పాటు రాధకృష్ణ కూడా అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని నటి ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు షేర్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గతంలో రాధకృష్ణతో రంగ సుధ రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దర మధ్య విబేధాలు రావడంతో గతకొంత కాలంగా రంగ సుధ.. రాధకృష్ణకు దూరంగా ఉంటుంది. ఈ కోపంతోనే ఆయన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. మోడల్ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రంగ సుధ.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. మలయాళంలో హీరోయిన్ గా మారింది. తేరి మేరీ అనే మలయాళ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈమెకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. -
46 ఏళ్ల తర్వాత క్రేజీ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ బద్దలే!
రజనీకాంత్, కమల్ హాసన్.. భారతీయ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలుగా ఉన్న వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయాలని చాలా మంది సినీ ప్రియులు కోరుకుంటున్నారు. వీళ్ల కాంబోలో సినిమా రాబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు కూడా వస్తున్నాయి. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. పైగా ఈ సినిమాపై అటు రజనీ కానీ, ఇటు కమల్ కానీ స్పందించకపోవడంతో.. ఇదంతా పుకారే అనుకున్నారు. కానీ త్వరలోనే సినీ ప్రియుల కల నిజం కాబోతుంది. కమల్, రజనీలను ఒకే స్క్రీన్పై చూడబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించాడు.ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో పాల్గొన్న కమల్.. రజనీతో సినిమాపై స్పందించాడు. ‘ప్రేక్షకుల సంతోషమే మాకు ముఖ్యం. మేమిద్దరం కలిసి నటించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. కానీ ఇన్నాళ్లు అది కుదరలేదు. త్వరలోనే మేమిద్దరం మీ ముందుకు రాబోతున్నాం. ఆ సినిమా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది’ అని కమల్ అన్నారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1979 లో వచ్చిన అల్లాయుద్దీన్ అద్భుత దీపం తర్వాత వీరిద్దరు కలిసి నటించలేదు. దాదాపు 46 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబుతున్నారు. సినిమాకు కాస్త హిట్ టాక్ వచ్చినా బక్సాఫీస్ బద్దలవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మాత్రం కమల్ వెళ్లడించలేదు. గతంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వీరిద్దరి సినిమా ఉంటుందని రూమర్స్ వచ్చాయి. -
బిగ్బాస్ 9: అతనికి మద్దతుగా నాగబాబు పోస్ట్.. నెటిజన్స్ సెటైర్స్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ తొమ్మిదో సీజన్(Bigg Boss 9 Telugu) ఆదివారం గ్రాండ్గా ప్రారంభం అయింది. ఈ సారి కూడా హోస్ట్గా కింగ్ నాగార్జుననే వ్యవహరించాడు. మొత్తం 15 మంది హౌస్లోకి వెళ్లారు. సోషల్ మీడియాలో నిన్న మొన్నటిదాక చక్కర్లు కొట్టిన లిస్టులో ఉన్న వాళ్లే..ఇప్పుడు హౌస్లోకి అడుగుపెట్టారు. ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, భరణి, శ్రేష్ట వర్మ, సంజనా గల్రానీ, ఆశాశైనీలు సెలబ్రెటీ కంటెస్టెంట్స్గా వెళ్లగా.. కామనర్స్గా మాస్క్ మెన్ హరీశ్, శ్రీజ, మర్యాద మనీష్, జవాన్ పవన్ కల్యాణ్, ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే వీరంతా సోషల్ మీడియాలో ప్రచారానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలో వరుస పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అయితే ఇలా బిగ్బాస్ షో ప్రారంభం అయిందో లేదో అప్పుడే మెగా బ్రదర్ నాగబాబు ఏడో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన నటుడు భరణికి మద్దతు తెలుపుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు.(చదవండి: బిగ్బాస్ 9 కంటెస్టెంట్స్ వీళ్లే.. హైలెట్స్ ఇవే)‘నాకు అత్యంత సన్నిహితుడైన భరణి శంకర్ బిగ్బాస్ 9 సీజన్లోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఆయనకు నా శుభాకాంక్షలు. ఈ ప్రయాణం అతడికి విజయాన్ని, మంచి గుర్తింపుని తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అంటా నాగబాబు ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. నాగబాబు పోస్టుపై కొంతమంది నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ‘నీ నోటితో అన్నావ్గా..ఇక త్వరగానే బయటకు వచ్చేస్తాడులే’, ‘నాలుగు వారాల్లో వచ్చేస్తాడు’, ‘భరణిని గెలిపించాలని జనసైనిక్స్కి నాగబాబు టాస్క్ ఇచ్చాడు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొంతమంది భరణికి మద్దతుగా పోస్టులు పెట్టారు.ఇక భరణి విషయానికొస్తే.. అప్పట్లో చిలసౌ స్రవంతి సీరియల్తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రతినాయక పాత్రలు కూడా చేశారు. బాహుబలి, ఆవిరి, ధీర, క్రేజీ అంకుల్స్ తదితర చిత్రాల్లో నటించాడు. గతకొంతకాలంగా అటు వెండితెరపై కానీ, ఇటు బుల్లితెరపై కానీ భరణికి సరైన అవకాశాలు రావడం లేదు. బిగ్బాస్ 9 గుర్తింపు వస్తే.. అవకాశాలు వస్తాయనే ఆశతో హౌస్లోకి వెళ్లాడు. మరి భరణి ఎన్నిరోజులు హౌస్లో ఉంటాడో చూడాలి. -
హీరో విజయ్పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు!
నటి త్రిష.. తొలుత తమిళంలో జోడి అనే చిత్రంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలో నటించారు. ఆ తర్వాత సూర్యకు జంటగా మౌనం పేసియదే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్రమ్ సరసన నటించిన సామి చిత్రం త్రిషను స్టార్ హీరోయిన్ చేసింది. అంతే ఆ తరువాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవలసిన ఈ బ్యూటీకి కలగలేదు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషలలో నటిస్తూ అగ్ర కథానాయకిగా మారారు. ఈ 42 ఏళ్ల చెన్నై సుందరి ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడం గమనార్హం. అదేవిధంగా కథానాయకిగా 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే త్రిష కెరీర్లోను చాలా ఎత్తు పల్లాలు చోటుచేసుకున్నాయి. అలా పడి లేస్తూ తన కెరీర్ను పదిల పరుచుకుంటూ వస్తున్న త్రిష ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె సూర్యకు జంటగా నటిస్తున్న కరుప్పు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని దీపావళి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న విశ్వంభర చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్లో బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ఈమె చేతిలో కొత్త చిత్రాలు ఏమీ లేవు. ఇదిలా ఉంటే త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు విజయ్ త్రిషకు మంచి మిత్రుడు. అయితే స్నేహబంధం కొందరు వేరే విధంగా కూడా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి 2026లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో 25 ఏళ్ల సినీ కెరియర్ గాను నటి త్రిషకు స్పెషల్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తాను నటించిన ఒక్కో హీరో గురించి త్రిష మాట్లాడారు. నటుడు విజయ్ గురించి ఆమె మాట్లాడుతూ ఆయన నూతన పయనానికి గుడ్ లక్ అని పేర్కొన్నారు అదేవిధంగా విజయ్ కి ఎలాంటి కల ఉన్నా అది నెరవేరాలని, అందుకు ఆయన అర్హుడని, ఆయనకు తన శుభాకాంక్షలు అని అన్నారు. త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
Bigg Boss 9 : ఊహకందని మార్పులు.. ప్రోమోతోనే ట్విస్ట్.. వీళ్లు కన్ఫార్మ్!
ఊహకందని మార్పులు..ఊహించని మలుపులు. డబుల్ హౌస్తో డబుల్ జోష్తో మీ ముందుకు వచ్చేసింది బిగ్బాస్ నైన్ అంటూ బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ కొత్త ప్రోమో రిలీజైంది. నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షో.. తొమ్మిదో సీజన్ నేడు(సెప్టెంబర్ 7) గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకి సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీ కంటెస్టెంట్ వాయిస్ మాత్రమే వినిపించారు. వారు ఎవరనేది గుర్తుపట్టకుండా ప్రోమోని కట్ చేశారు. అయితే తొలి రోజే ఓ కంటెస్టెంట్కి షాకిచ్చినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది.ఓ కంటెస్టెంట్ హౌస్లోకి గిఫ్ట్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బిగ్బాస్ తిరస్కరిస్తాడు. దీంతో, ‘నువ్వు ఇంటికెళ్లిపోవచ్చు’ అని నాగార్జున చెబుతారు. గత సీజన్లకు ఇది పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి రెండు హౌస్ల ఉండబోతున్నాయి. టాస్క్లు కూడా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ ఈసారి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ సారి 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లబోతున్నారట. వారిలో 9 మంది డైరెక్ట్గా హౌస్లోకి వెళ్లగా, మిగతా 5 మంది అగ్ని పరీక్షలో గెలిచిన వాళ్లు వెళ్తారు. సెలెబ్రిటీ లిస్ట్లో ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్, ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన సంజన గల్రానీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, తనూజ, ఆశా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. కామనర్స్గా కామనర్స్గా శ్రీజ, పవన్ కల్యాణ్, మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి వెళ్లే అవకాశం ఉంది. -
SIIMA 2025: ఉత్తమ నటి సాయి పల్లవి.. కోలీవుడ్, మాలీవుడ్ విజేతలు వీళ్లే!
దుబాయ్ వేదికగా ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా) వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తమిళ, మలయాళ చిత్రాలకు అవార్డులు అందజేశారు నిర్వాహకులు. కోలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రంగా అమరన్, మలయాళం నుంచి ఉత్తమ చిత్రంగా ‘మంజుమ్మల్ బాయ్స్’ ఎన్నికయ్యాయి. ఇక తమిళ్లో ఉత్తమ నటి అవార్డ్ను అమరన్కు గాను సాయి పల్లవికి లభించింది. ఉత్తమ నటుడిగా ‘పృథ్వీరాజ్ సుకుమారన్’ (ది గోట్ లైఫ్) నిలిచాడు. తమిళంలో అమరన్, మహారాజా, లబ్బర్ పండు చిత్రాలకు, మలయాళంలో ది గోట్ లైఫ్ చిత్రానికి అత్యధిక అవార్డులు వచ్చాయి. ‘సైమా’ విజేతలు (కోలీవుడ్)ఉత్తమ చిత్రం : అమరన్ఉత్తమ దర్శకుడు: రాజ్ కుమార్ పెరియసామి(అమరన్)ఉత్తమ నటి : సాయి పల్లవి(అమరన్)ఉత్తమ విలన్ : అనురాగ్ కశ్యప్(మహారాజా)ఉత్తమ సంగీత దర్శకుడు : జీవీ ప్రకాశ్ (అమరన్)ఉత్తమ కమెడియన్ : బల శరవణన్(లబ్బర్ పందు)ఉత్తమ నటుడు(క్రిటిక్స్) : కార్తి (మెయ్యజగన్)ఉత్తమ నటి(క్రిటిక్స్): దుషారా విజయన్ (రాయన్)ఉత్తమ దర్శకుడు(క్రిటిక్స్): నిథిలన్ సామినాథన్(మహారాజ)ఉత్తమ నూతన దర్శకుడు: తమిళరాసన్(లబ్బర్ పందు)‘సైమా’ విజేతలు (మాలీవుడ్)ఉత్తమ చిత్రం : మంజుమ్మల్ బాయ్స్’ఉత్తమ దర్శకుడు: బ్లెస్సీ (ది గోట్ లైఫ్)ఉత్తమ నటి : ఊర్వశి(ఉళ్లోళుక్కు)ఉత్తమ విలన్ : జగదీష్(మార్కో)ఉత్తమ సంగీత దర్శకుడు : దిబు నినన్ థామస్(ఏఆర్ఎం)ఉత్తమ కమెడియన్ : శ్యామ్ మోహన్(ప్రేమలు)ఉత్తమ నటుడు(క్రిటిక్స్) : ఉన్ని ముకుందన్(మార్కో)ఉత్తమ నూతన దర్శకుడు: జోబూ జార్జ్(పని)ఉత్తమ నూతన నటుడు(క్రిటిక్స్) : కేఆర్ గోకుల్(ది గోట్ లైఫ్)