breaking news
Cinema News
-
మెట్లు ఎక్కలేని స్థితిలో స్టార్ హీరో కూతురు.. ఇప్పుడేకంగా హీరోయిన్గా!
తండ్రి బాటలో అడుగులు వేసేందుకు సిద్ధమైంది విస్మయ (Vismaya Mohanlal). మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో కాలు మోపనుంది. తుడక్కం అనే మలయాళ చిత్రంతో వెండితెరపై రంగప్రవేశం చేయనుంది. అయితే విస్మయ ఇప్పటికే రచన, మార్షల్ ఆర్ట్స్లో ఆరి తేరింది. 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్' అనే పుస్తకంతో రచయిత్రగా ప్రయాణం ప్రారంభించింది. థాయ్లాండ్లో మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంది. ఇప్పుడు హీరోయిన్గా అలరించనుంది.థాయ్ల్యాండ్లో ఫిట్నెస్ ట్రైనింగ్విస్మయ మొదట్లో కాస్త బొద్దుగా ఉండేది. థాయ్ల్యాండ్లో ఫిట్నెస్ క్యాంప్నకు వెళ్లి తన శరీరంపై ఫోకస్ చేసింది. అటు మార్షల్ ఆర్ట్స్, ఇటు ప్రత్యేక వ్యాయామాలతో 22 కిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని 2020 డిసెంబర్లో తనే ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. నాలుగు మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చేది. ఫిట్గా ఉండాలనిపించేది కానీ అందుకోసం ఏదీ చేయకపోయేదాన్ని. కానీ, ఇక్కడికి వచ్చాక అంతా మారిపోయింది.నా వల్ల కాదనుకున్నప్పుడల్లా..కొండలు ఎక్కేస్తున్నాను. ఎక్కువసేపు స్విమ్మింగ్ చేస్తున్నాను. ఇదంతా నా కోచ్ వల్లే సాధ్యమైంది. నాకోసం 100 శాతం కష్టపడ్డాడు. ఎప్పుడూ నా వెంటే ఉన్నాడు. గాయాలవుతున్నా సరే.. నా ఫిట్నెస్ జర్నీ ఆపకూడదని నాకు ధైర్యాన్ని నూరిపోశాడు. నా వల్ల కాదనుకున్న ప్రతిసారి.. కచ్చితంగా అవుతుందని వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఇక్కడకు వచ్చాక కేవలం బరువు తగ్గడమే కాదు, కొత్త విషయాలు నేర్చుకున్నాను, కొత్తవారిని కలిశాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. నా జీవితమే మారిపోయిందినేను చేయలేను అనే ఆలోచన నుంచి ఏదైనా చేయగలిగేలా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక నా జీవితమే మారిపోయింది అని రాసుకొచ్చింది. అప్పటినుంచి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వస్తోంది. తుడక్కం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి జూడ్ ఆంథొనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. జూడ్ ఆంథొని గతంలో సారాస్, 2018 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంథొనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Vismaya Mohanlal (@mayamohanlal) చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
ఒకే ఒక పెద్ద సినిమా.. టాలీవుడ్కి ఏమైంది?
టాలీవుడ్లో మొన్నటి వరకు పోటీ లేకుండా సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఒకేవారం పెద్ద సినిమాతో పాటు మూడు, నాలుగు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అయ్యేవి. కానీ సమ్మర్ నుంచి టాలీవుడ్లో పెద్దగా పోటీ లేకుండా సినిమాలు వస్తున్నాయి. ఇక గత నెలలో థగ్లైఫ్, కుబేర, కన్నప్ప లాంటి పెద్ద సినిమాలు వచ్చినా.. వాటి మధ్యలో కూడా వారం, వారం గ్యాప్ ఉంది. వీటితో పాటు రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. కానీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక జులైలో టాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెల మొత్తంలో ఒకే ఒక పెద్ద సినిమా రిలీజ్ కానుంది. మిగిలిన సినిమాలన్ని పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగబోతున్నాయి.జులై మొదటి వారంలో తమ్ముడు చిత్రంలో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ హీరోయిన్లుగా నటించగా, లయ కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మేరకు అయినా సినిమా ఆడుతుందో లేదో జులై 4న తెలుస్తుంది. ఇక అదే రోజు సిద్ధార్థ్ నటించిన 3 బి.హెచ్.కె కూడా విడుదల కానుంది. తమ్ముడుతో పోలిస్తే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్కి వెళ్లి చూసే పరిస్థితి అయితే ఈ సినిమాకు లేదు.ఇక రెండో వారంలో అనుష్క షూటీ రిలీజ్ కావాల్సింది. కానీ అది వాయిదా పడింది. దీంతో ఈ వారంలో ఎలాంటి పోటీ లేకుండా సింగిల్గా బరిలోకి దిగుతున్నాడు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ జులై 11న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. మరి సింగిల్గా వస్తున్న సుహాస్.. సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.ఇక మూడో వారంలో మేఘాలు చెప్పిన ప్రేమ కథ(జులై 17) అనే చిన్న సినిమాతో పాటు జూనియర్(జులై 18 అనే కన్నడ-తెలుగు సినిమా కూడా ఇక్కడ విడుదల కాబోతుంది. గాలి జనార్థన్రెడ్డి కొడుకు కిరీటీ హీరోగా నటిస్తున్న జూనియర్పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం, హీరోయిన్గా శ్రీలీల నటించడం, మరో కీలక పాత్రలో జెనీలియా కనిపించడంతో జూనియర్పై టాలీవుడ్లో మంచి హైప్ క్రియేట్ అయింది.ఇక చివరి వారంలో (జూలై 24) హరిహరి వీరమల్లు రాబోతుంది. ఈ నెలలో వస్తున్న ఏకైక పెద్ద సినిమా ఇదే. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఎంఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాలో నిధి అగర్వాల హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసిది. -
సూర్య, దీపికా పదుకొణెలతో 8 వసంతాలు..: డైరెక్టర్
8 వసంతాలు (8 Vasantalu Movie).. ఇది ప్రేమ కథ కాదు, ప్రేమ కావ్యమని చెప్పొచ్చు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి దుగ్గిరాల, హనురెడ్డి, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించారు. కవిత్వం, భావుకత పుష్కలంగా ఉన్న ఈ సినిమా చాలామందికి నచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు మొదట స్టార్ హీరోహీరోయిన్లను అనుకున్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సూర్య, దీపికతో..ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ.. 8 వసంతాలు మూవీ పెద్దవాళ్లతో చేద్దామనుకున్నాను. సూర్య, దీపికా పదుకొణెను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అందుకే డైలాగులు అంత బలంగా ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ దగ్గరకు కథ తీసుకెళ్లినప్పుడు కొత్తవాళ్లతో అయితే ఇంకా బాగుండొచ్చు అన్నారు. పెద్దవాళ్లతో అంటే ఇబ్బందులు ఎదురవొచ్చేమో, కథ ఎక్కడైనా పాడవుతుందేమో.. ఒక్కసారి ఆలోచించు అన్నారు. అప్పుడు నేను ఆలోచించి కొత్తవాళ్లతో ముందుకు వెళ్లాను అని చెప్పుకొచ్చారు.చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి
సినిమా అవకాశాల కోసం వెళ్తే చేదు అనుభవాలు ఎదుర్కొన్న నటీనటులు ఎందరో! అయితే సినిమాలే కాదని ఓటీటీలో ఛాన్సులు కావాలంటే కూడా పిచ్చి కండీషన్లు పెడుతున్నారని చెప్తున్నారు నటి హెల్లీ షా (Helly Shah). తనకు ఓ వెబ్ సిరీస్లో ఆఫర్ వచ్చిందట.. కానీ వాళ్లు చెప్పిన కండీషన్కు ఓకే అంటేనే ఎంపిక చేస్తామని మెలిక పెట్టారట! ఈ విషయం గురించి హెల్లీ షా మాట్లాడుతూ.. గతంలో నాకు పెద్ద వెబ్ సిరీస్లో భాగమయ్యే ఛాన్స్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదిస్తూ ఓ మెసేజ్ వచ్చింది. కండీషన్కు ఒప్పుకుంటే..అది చూడగానే.. నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందుకు అవతలివైపు నుంచి అవును, అందుకోసమే మీకు మెసేజ్ చేశాం అని రిప్లై వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ అంతలోనే.. ఓ కండీషన్.. మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి చెప్పినట్లు చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ మీ సొంతం అన్నారు. నా వల్ల కాదు, మీరు వేరే ఎవర్నైనా చూసుకోండి అని రిప్లై ఇచ్చాను.ఆన్లైన్లో అయినా ఓకేఅప్పటికీ అవతలి వ్యక్తి ఊరుకోలేదు. పర్లేదు, మీరు రాకపోయినా సరే, ఫోన్లోనే నేను చెప్పింది చేయండి. ఆన్లైన్లో అయినా నాకేం పర్లేదని బదులిచ్చాడు. అతడు అన్న మాటల్ని నా నోటితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆన్లైన్లో కాంప్రమైజ్ అడిగాడు. ఈ సోదంతా నాకెందుకు అని అతడి నెంబర్ బ్లాక్లిస్ట్లో పెట్టాను. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్గులేని జనాలు మారరు. కొంచెమైనా పద్ధతిగా ప్రవర్తించరు. ఇలాంటి మనుషులతో నాకెందుకు అని ఆ వెబ్ సిరీస్ను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చారు.సీరియల్స్- సినిమాహెల్లీ షా ప్రస్తుతం గుజరాతీ మూవీ దేడ చేస్తున్నారు. ఇందులో హెల్లీ గర్భవతిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 4న విడుదలవుతోంది. ఇకపోతే హెల్లీ షా.. అలక్ష్మి: హమారీ సూపర్ బహు, ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి, దేవాన్షి, స్వరాగిని- జోడైన్ రిష్తో కే సుర్, ఇష్క్ మే మర్జవాన్ 2: నయా సఫర్ వంటి పలు సీరియల్స్ చేశారు. గుల్లక్, పిరమిడ్ వంటి వెబ్ సిరీస్లలోనూ మెరిశారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
'మ్యాడ్' హీరోతో నిహారిక కొత్త సినిమా షురూ
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా కొత్త సినిమా ఆరంభమైంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ వంటి హిట్ చిత్రం తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ద్వితీయ సినిమా ఇది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్స్ వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ‘‘ఫ్యాంటసీ, కామెడీ జోనర్ తెరకెక్కనున్న చిత్రమిది. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో జరగనుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ ఇతర పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి సంగీతం: అనుదీప్ దేవ్, కెమేరా: రాజు ఎడురోలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
ప్రభాస్కు కథ చెప్పిన 'అమరన్' డైరెక్టర్!
హీరో ప్రభాస్ (Prabhas), ‘అమరన్’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ను కలిసి రాజ్కుమార్ ఓ కథ వినిపించారని, అది నచ్చి ప్రభాస్ సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారని భోగట్టా. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటు రాజ్కుమార్ కూడా ధనుష్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఇద్దరూ తమ కమిట్మెంట్స్ పూర్తి చేశాకే ఈ హీరో–దర్శకుడి కాంబినేషన్ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో ది రాజా సాబ్, ఫౌజీ, సలార్ 2, స్పిరిట్ చిత్రాలున్నాయి. ఇందులో ది రాజాసాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది.చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు -
జవాన్ కుటుంబానికి సాయం.. మర్యాదగా మాట్లాడండి: గౌతమ్ వార్నింగ్
బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా, రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించిన చిత్రం సోలో బాయ్. అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రాఫర్గా, జుడా సంధ్య మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.డైరెక్టర్ అవుదామని వచ్చి..ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ... "నిర్మాత సతీష్ ఒక దర్శకునిగా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. ఎంతో కష్టపడి చాలా సాధారణ స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఈ చిత్రంలో నటించిన గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను" అన్నారు. రఘు కుంచె మాట్లాడుతూ... "నిర్మాత సతీష్ నాకు ఎంతోకాలంగా పరిచయం. ఆయన ఓటీటీ ద్వారా విడుదల చేసిన బట్టల రామస్వామి బయోపిక్ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆర్పీ పట్నాయక్ గారితో కలిసి చేసిన కాఫీ విత్ ఎ కిల్లర్ ఎంతో పాపులర్ అయింది. ఇప్పుడు సోలో బాయ్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా" అన్నారు.బిగ్బాస్ నుంచి హీరోగా..హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ... "నేను బిగ్బాస్కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది. నాకు ఎటువంటి ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి సతీష్ గారు ఈ సినిమా మొదలుపెట్టారు. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిత్ర పరిశ్రమలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం అనేది చాలా పెద్ద విషయం. నేను దాన్ని ఒక సక్సెస్ లా చూస్తున్నాను.మర్యాద ఇచ్చి మాట్లాడండిఅలాగే దివంగత జవాన్ మురళి నాయక్ గారి కుటుంబానికి మేము అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఆ కుటుంబానికి ఇప్పటికే ఎంతోమంది సహాయం చేశారు, ఇంకా మీరు ఎందుకు ఇస్తున్నారు? అని అన్నారు. మురళి నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు. ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడండి. జై హింద్" అంటూ ముగించారు. సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గౌతమ్.. మురళీ నాయక్ పేరెంట్స్కు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు.చదవండి: మీ చేతిలో కీలుబొమ్మలం కాదు.. స్నేహితురాలిని పెళ్లాడిన నటి!? -
ఒంటరిగా ఉండలేను.. ఐశ్వర్య సలహానే పాటిస్తున్నా : అభిషేక్
తనపై వచ్చే నెగెటివిటీని ఎదుర్కోవడానికి భార్య ఐశ్వర్య ఇచ్చే సలహాను పాటిస్తున్నానని చెప్పారు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan). ఆమె ఇచ్చిన సలహాతో ఇప్పుడు పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టిపెడుతున్నానని అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటుడిగా తనపై వచ్చే ఫేక్ న్యూస్, ట్రోలింగ్ని ఎలా ఎదుర్కొంటున్నాడో వివరించాడు. ‘నా చుట్టు ఉన్నవారిని సంతోషంగా ఉంచాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అలా చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్నిసార్లు కాలమే మనకు కఠినంగా ఉండమని చెబుతుంది. ఒక నటుడిగా అలా ఉండడం నాకు కుదరదు. అలా ఉంటే ఆ ప్రభావం నా కెరీర్పై పడుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా సరే నలుగురిని సంతోషంగా ఉండేలా చేయాలనే మనస్తత్వం నాది. నెగెటివ్ విషయాలు చెప్పే వారి గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని, ట్రోలింగ్పై కూడా దృష్టిపెట్టేవాడిని. కానీ నా భార్య ఇచ్చిన ఒక సలహాతో వాటిని దూరం పెట్టేశాను.‘తప్పుడు వార్తలు మనపై ఎలాంటి ప్రభావం చూపవు. పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టిపెట్టండి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది’ అని ఐశ్వర్య నాకు సలహా ఇచ్చింది. ఇప్పుడు అదే నేను ఫాలో అవుతున్నాను. ట్రోలింగ్ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తున్నాను. ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండడం నా వల్ల కాదు. కుటుంబాన్ని చూడకుండా ఉండలేను. నా పక్కన మాట్లాడడానికి ఒక మనిషి కచ్చితంగా ఉండాలి. ఇంట్లో అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటాం. వర్క్ బిజీగా గడుపుతున్నప్పటికీ అప్పుడప్పుడు మనకోసం కూడా సమయం కేటాయించుకోవాలి’ అని అభిషేక్ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన కాళిధర్ లాపత మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. జీ 5’ వేదికగా జులై 4 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. -
మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు అసహనం
రామ్చరణ్ ప్రధాన పాత్రలో నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా (Game Changer Movie) వచ్చి ఆరు నెలలు దాటిపోయింది. అయినా ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో, ఫిల్మీదునియాలో మార్మోగిపోతోంది. కారణం.. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ మొట్టమొదటిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం.. అందులో శిరీష్ ఏమన్నారంటే..? 'గేమ్ ఛేంజర్తో మా పని అయిపోయిందనుకున్నాం.. అంత నష్టం వచ్చినా హీరో, దర్శకుడు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. అలా అని వారిని తప్పుపట్టడం లేదు. రామ్చరణ్తో ఎలాంటి విభేదాలు లేవు. గేమ్ ఛేంజర్ నష్టాన్ని దాదాపు 70% సంక్రాంతికి వస్తున్నాం కవర్ చేసేసింది' అని పేర్కొన్నారు.చంపుకుతింటున్నారుఈ కామెంట్స్ మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించడంతో శిరీష్ను ఏకిపారేశారు. దీంతో శిరీష్.. మెగా ఫ్యాన్స్కు క్షమాపణలు చెప్తూ లేఖ విడుదల చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దిల్ రాజు (Dil Raju) అసహనం వ్యక్తం చేశారు. తమ్ముడు మూవీ ప్రమోషన్స్లో ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడో జనవరిలో రిలీజైన గేమ్ ఛేంజర్ గురించి పదేపదే అడిగి చంపుకు తింటున్నారు. సినిమా రిలీజై ఆరు నెలలు అయిపోయింది. ప్రతిదాంట్లో గేమ్ ఛేంజర్ టాపిక్ తప్ప మరొకటి లేనే లేదు. తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే..ఎందుకసలు? బాగా ఆడిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి అడగొచ్చు కదా! ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాపులు వచ్చాయి. అలాంటప్పుడు గేమ్ ఛేంజర్ను మాత్రమే పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? ఇండస్ట్రీలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయినవి ఉన్నాయి. ఏ సినిమాను ఇంతగా పట్టించుకోలేదు. నా సోదరుడు శిరీష్ తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే ఆయన్ని కూడా వివాదంలోకి లాగి ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా అవసరం లేదు కదా!22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా..మేము తమ్ముడు సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తున్నాం. దాన్ని వదిలేసి ఆరు నెలల కిందట రిలీజైన సినిమా గురించే మాట్లాడుతున్నారు. రామ్చరణ్కు, మాకు మధ్య సత్సంబంధాలున్నాయి. చరణ్కు ఈ ఏడాది హిట్ ఇవ్వలేకపోయాం. మంచి స్క్రిప్టు సెలక్ట్ చేసుకుని చరణ్తో సూపర్ హిట్ మూవీ చేస్తామని ఇదివరకే ప్రకటించాను. 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ అందరు స్టార్ హీరోలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరితోనూ సినిమాలు తీసిన సంస్థ ఇది. చీల్చి చెండాడుతున్నారుఎక్కడా ఏ వివాదం లేకుండా పని చేసుకుంటూ వచ్చాను. కానీ ఆరు నెలల కిందట ఫ్లాప్ అయిన ఒక్క సినిమాను పట్టుకుని మమ్మల్ని చీల్చి చెండాడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే టాపిక్. జరిగిన సంభాషణంతా వదిలేసి కావాల్సిన చిన్న క్లిప్ తీసుకుని సంచలన హెడ్డింగ్స్ పెట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇంత నెగిటివిటీ ఎందుకు? అయిపోయిన సినిమాను వదిలేయండి. జనవరి తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో ఫ్లాపులున్నాయి. వాటిలో ఒక్క సినిమా గురించైనా మాట్లాడుతున్నారా? అని అసహనం వ్యక్తం చేశాడు.చదవండి: బడ్జెట్ కాదు .. సబ్జెక్ట్ ముఖ్యం గురూ -
టిక్ టాక్ చేద్దామా.. లిప్లాక్ చేద్దామా..!
కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. మాస్ బంక్ మూవీస్ పతాకంపై లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ కామెడీ హారర్ మూవీ జులై 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'టిక్ టాక్ చేద్దామా..'అనే పాటను టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ కంపోజ్ చేసిన ఈ పాట యూత్ని ఆకట్టుకునేలా ఉంది. రీసెంట్ గా ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన "లోపలికి రా చెప్తా" ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. హారర్ కామెడీ జానర్ లో ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉందని చిత్ర బృందం పేర్కొంది. -
పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమా చూలేదు : కాంతర హీరోయిన్
‘పుష్ప’ చిత్రంలో రష్మిక చేసిన పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఆఫర్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. కానీ కాంతర సక్సెస్ తర్వాత నాకు అన్ని అలాంటి క్యారెక్టర్సే ఆఫర్ చేశారు. అందుకే చాలా మూవీస్ వదులుకున్నాను. ఎక్కువ చిత్రాలు చేయకపోవడానికి కారణం ఇదే. డిఫరెంట్ రోల్స్ వస్తే కచ్చితంగా చేస్తా. కమర్షియల్ సినిమా చేయడం కూడా ఇష్టమే. ‘తమ్ముడు’ కూడా కమర్షియల్ చిత్రమే’ అని అన్నారు కన్నడ బ్యూటీ సప్తమి గౌడ. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘తమ్ముడు’. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సప్తమి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ కాంతార సినిమా తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు గారి దగ్గర నుంచి "తమ్ముడు" మూవీ కోసం కాల్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను. లుక్ టెస్ట్ లో ఓకే అయ్యాక, డైలాగ్ వెర్షన్ చెప్పారు. అప్పటికే రత్న క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఉంది. హార్స్ రైడింగ్ నేర్చుకోమని చెప్పారు. అరకులో షూటింగ్ చేశాం. నితిన్ గారి భుజానికి గాయం వల్ల షూటింగ్ కొంత ఆలస్యమైంది. "తమ్ముడు" మూవీకి వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది.→ అంబరగొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి క్యారెక్టర్ నాది. తను పవన్ కల్యాణ్ అభిమాని. నా క్యారెక్టర్ కు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాంతారతో చూస్తే లుక్ వైజ్ నా క్యారెక్టర్ ఒకేలా ఉంది అనిపించవచ్చు కానీ క్యారెక్టర్ గా చూస్తే పూర్తిగా భిన్నమైనది.→ "తమ్ముడు" కాస్త సీరియస్ సబ్జెక్ట్..ఇందులో నా క్యారెక్టర్ ద్వారా ఫన్ క్రియేట్ అవుతుంది. లయ, నితిన్ గారు కొన్ని పరిస్థితుల్లో అంబరగొడుగు అనే ఊరికి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్, లయ గారు ఉన్న సిచ్యువేషన్ తెలియకుండా వారితో నా తరహాలో జోవియల్ గా ఉంటాను. అది ఆడియెన్స్ కు హ్యూమర్ ఇస్తుంది.→ కొండలు, గుట్టల్లాంటి ప్రాంతంలో హార్స్ రైడింగ్ చేయాల్సివచ్చింది. రోజూ మూడు, నాలుగు గంటలు హార్స్ రైడింగ్ చేయడంతో ఇబ్బందిపడ్డాను. కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయనే సంతృప్తి ఉంది.→ పవన్ కల్యాణ్ తమ్ముడు సినిమా గురించి నాకు ఐడియా ఉంది. వేణు గారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు నేను ఆ సినిమాను చూడలేదు. మా మూవీ రిలీజ్ లోపు పవన్ గారి తమ్ముడు మూవీ చూస్తాను.→ "తమ్ముడు" సినిమా నటిగా నాకు తప్పకుండా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఈ చిత్రంలో నాది లెంగ్తీ రోల్ కాదు, కానీ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. రత్న క్యారెక్టర్ రాసేప్పుడు మిగతా వాటి కంటే ఎంజాయ్ చేశానని డైరెక్టర్ వేణు గారు చెప్పేవారు. ఈ సినిమాకు ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే.→ ఈ మూవీలో నితిన్ తో నాకు లవ్ ట్రాక్ ఉంటుంది. మా టీనేజ్ ప్రేమ తర్వాత మరింత పరిణితి చెందుతుంది. మూవీలో రత్న, నితిన్ క్యారెక్టర్ కలవాలని ప్రేక్షకులు కోరుకుంటారు. దిల్ రాజు గారి ఎస్వీసీ సంస్థలో నా ఫస్ట్ తెలుగు మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక సినిమా బాగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయాలంటే మంచి సంస్థలకే సాధ్యమవుతుంది. డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు "తమ్ముడు" మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి క్యారెక్టర్ ను పక్కాగా డిజైన్ చేసుకున్నారు. ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ నుంచి కూడా తనకు కావాల్సిన ఔట్ పుట్ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు.→ ప్రస్తుతం తెలుగులో మరో రెండు చిత్రాలతో పాటు తమిళంలో, కన్నడలో మూవీస్ చేస్తున్నా. వాటి డీటెయిల్స్ త్వరలో వెల్లడిస్తా. భాషాలకు అతీతంగా అన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా. -
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. అల్లు అర్జున్ స్థాయికి రాలేకపోయావ్: దిల్ రాజు
నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. జూలై 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంది చిత్రయూనిట్. ఈ క్రమంలో దిల్ X తమ్ముడు పేరుతో ఓ స్పెషల్ చిట్చాట్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడారు.సత్సంబంధాలు లేకపోయినా..నితిన్ మాట్లాడుతూ.. దిల్రాజు (Dil Raju)ను నేను అంకుల్ అని పిలిచేవాడిని. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న, రాజు కలిసి తొలిప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ సినిమా హిట్టయినప్పుడు అందరం కలిసి తిరుపతి వెళ్లాం. అలా రాజుతో పరిచయం ఏర్పడింది. 2005లో రామ్ సినిమా చేశాను. అప్పుడు రిలీజ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మన మధ్య సత్సంబంధాలు లేకపోయినా మీరు వచ్చి కొంత అమౌంట్ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. చాలామంది హీరోలకు, నిర్మాతలకు సాయం చేశారు. అలాంటిది మీరు సినిమాలను తొక్కేస్తారన్న విమర్శలు విన్నప్పుడు బాధేసింది అని చెప్పుకొచ్చాడు.జయం సినిమాకు ముందే..దిల్ రాజు తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. జయం సినిమా పోస్టర్స్ చూసి ఈ కుర్రాడు భలే ఉన్నాడనుకున్నాను. అప్పుడు నువ్వు ఎవరో కాదు, సుధాకర్ రెడ్డి కుమారుడు అనగానే.. మరింకే, నితిన్తో సినిమా చేద్దామని వినాయక్తో అన్నాను. అలా జయం రిలీజ్కు ముందే దిల్ మూవీ ఫిక్స్ చేశాం. కాకపోతే దిల్ టైటిల్ బూరుగుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఉంది. ఆయన దగ్గరకు వెళ్లి ఈ టైటిల్ మా సినిమాకు బాగుంటుందని అడగ్గానే ఇచ్చారు. ఆయన టైటిల్ ఇవ్వడం వల్లే 'దిల్' రాజు అనేది ఒక బ్రాండ్ అయిపోయింది.గేమ్ ఛేంజర్ నష్టాలునేను 2003లో నిర్మాతనయ్యాను. నువ్వు 2002లో హీరో అయ్యావు. నాకంటే ఒక ఏడాది సీనియర్వి. నేను జూనియర్ను. అయినా నేను ఒక్కొక్కటిగా సాధించుకుంటూ టాప్ పొజిషన్లోకి వచ్చాను. ఆర్య సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ను, దిల్ సినిమా చేస్తున్నప్పుడు నితిన్ (Nithiin)ను ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించాను. కానీ, నువ్వు ఆ స్థాయికి రాలేకపోయావు. అదే నువ్వు కోల్పోయావు. తమ్ముడుతో సక్సెస్ వస్తుంది కానీ పూర్వ వైభవం రావడానికి అది సరిపోదు అన్నాడు.రెండు ప్రాపర్టీలు అమ్ముకుంటా..గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గురించి ఓపెన్ అవుతూ.. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజవగానే నాకు నష్టం రాబోతుందని అర్థమైంది. కాకపోతే 14న రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం కచ్చితంగా హిట్ కొడుతుందని నమ్మకంగా ఉన్నాను. ఒకవేళ ఆ సినిమా లేకపోయినా.. రెండు ప్రాపర్టీలు అమ్ముకుని ఆ నష్టాల నుంచి బయటపడేవాడిని. అది పెద్ద విషయం కాదు అని చెప్పుకొచ్చాడు. ఇక వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నితిన్కు.. తమ్ముడు సినిమా విజయాన్ని సాధించి పెట్టాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
'మీ పిల్లలకు తల్లి లేకుండా చేస్తున్నావ్'.. చాలా బాధేసింది: డైరెక్టర్
సింగిల్ పేరెంటింగ్ అన్నది చాలా కష్టం. తల్లి/తండ్రి లేని లోటు తెలియకుండా పిల్లల్ని పెంచాలి. అమ్మానాన్న అన్నీ ఒక్కరై పిల్లల్ని చూసుకోవాలి. ఇద్దరి ప్రేమను ఒక్కరే పంచాలి. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) కూడా అదే పని చేస్తున్నాడు. 2017లో సరోగసి ద్వారా కవలలకు తండ్రయ్యాడు. అప్పటినుంచి అన్నీ తానై పిల్లల్ని చూసుకుంటున్నాడు. కానీ కొందరు దీన్ని కూడా తప్పుపట్టారు. ఆ చిన్నారులకు తల్లి లేకుండా చేశావని నిర్మాతను విమర్శించారు. ఆ మాటలు తననెంతగానో బాధపెట్టాయంటున్నాడు కరణ్ జోహార్.నాపై నాకే అనుమానంతాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ.. నీ పిల్లలకు తల్లి లేకుండా చేస్తున్నావన్న విషయం నీకర్థమవుతోందా? అన్న కామెంట్లు చూసి భరించలేకపోయాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా? అని నామీద నాకే అనుమానమేసింది. అప్పుడు వెంటనే పిల్లల గదిలోకి వెళ్లాను. అప్పుడు వారి వయసు ఐదేళ్లుంటాయంతే! మీరు సంతోషంగానే ఉన్నారా? అని అడిగాను. నువ్వు మా నాన్నవి కాబట్టి హ్యాపీగా ఉన్నామన్నారు. నేను ఆ సమాధానం కోసమే ఎదురుచూశాను. సింగిల్ పేరెంట్గా..వారి రెస్పాన్స్ విన్నాక నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఎవరేమనుకున్నా నాకనవసరం అనిపించింది. సింగిల్ పేరెంట్గా ఉన్నందుకు గర్వంగా ఫీలయ్యాను. మా అమ్మానాన్నకు నేను ఒక్కడినే సంతానం. ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్గా ఉన్నాను. నాకు అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, లైఫ్ పార్ట్నర్ అంటూ ఎవరూ లేరు. ఉన్నదల్లా నా కుటుంబం, స్నేహితులు.. వీళ్లెప్పుడూ నా వెన్నంటే ఉంటారు. అందుకు గర్విస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు -
తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Vishnu Manchu)కు హిట్టు పడి చాలా ఏళ్లే అయింది. ఆయన చివరగా జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈసారి రొటీన్ సినిమాలు కాదని తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పట్టాలెక్కించాడు. దీనికోసం ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే కన్నప్ప షూటింగ్ మొదలుపెట్టాడు. మోహన్బాబు, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి బడా తారలు కీలక పాత్రలు పోషించారు. కన్నప్పపై ట్రోలింగ్మహాభారత్, రామాయణ్ సీరియల్స్ తెరకెక్కించిన హిందీ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. దీంతో సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు.. కన్నప్పపై జరిగిన ట్రోలింగ్ గురించి మాట్లాడాడు. కన్నప్ప సినిమా టీజర్ రిలీజైనప్పుడు ఉత్తి పుణ్యానికే నెగెటివిటీ ప్రచారం చేశారు. యూట్యూబ్లో నాన్నగారి గురించి, నా గురించి ఏమీ లేకపోయినా నెగెటివ్ థంబ్నైల్స్ పెడితే వారికి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఆదాయం వస్తోంది. వీఎఫ్ఎక్స్ గుర్తించలేకపోయారుఅది ఎంత పెద్ద తప్పని వారు రియలైజ్ అవట్లేదు. లొకేషన్స్ బాలేవు, గ్రాఫిక్స్ బాగోలేవు అని నానామాటలు అన్నారు. చాలామందికి తెలియని విషయమేంటంటే నేను రిలీజ్ చేసిన మొదటి టీజర్లో చాలా తక్కువ వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. రెండో టీజర్లో మాత్రం 70% వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. అదెవరూ గుర్తించలేకపోయారు. మోహన్లాల్గారి ఎపిసోడ్లో ఆ బాణాలు తప్ప అన్నీ ఒరిజినలే! రియల్ లొకేషన్లో షూట్ చేశాం అన్నాడు. నాతో ఎవరూ చేయరుతెలుగులో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా, హిందీలో ముకేశ్ కుమార్నే ఎందుకు నమ్మారు? ఆయనకే ఎందుకు డైరెక్షన్ బాధ్యతలు ఇచ్చారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు విష్ణు స్పందిస్తూ.. నాతో తెలుగులో ఏ డైరెక్టర్ పని చేయరని నాకు తెలుసు. కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరూ నాతో చేయరని అందరికీ తెలుసు. పైగా దీనికంటే ముందు నేను చేసిన రెండు,మూడు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందువల్ల ఇక్కడ ఎవరూ చేయరు. మహాభారతాన్ని (సీరియల్) అంత గొప్పగా తీసిన ముకేశ్ కన్నప్పను అంతే అద్భుతంగా తెరపై చూపించగలరని నమ్మాను అని చెప్పాడు. ముకేశ్ కుమార్ సింగ్కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం!చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
ఏం చేయాలో అర్థం కాలేదు.. నడిరోడ్డుపై ఏడ్చేశాను : ‘దసరా’ విలన్
కోలీవుడ్ నటుడు, ‘దసరా’ ఫేం షైన్ టామ్ చాకో(Shine Tom Chacko ) ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నెల 6న తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో అతని తండ్రి సీపీ చాకో మృతి చెందగా, తల్లి, సోదరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా ఈ విషాద ఘటనపై చాకో స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగిందని, తండ్రి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని ఎమోషనల్ అయ్యారు.(చదవండి: రోజంతా కూర్చోబెట్టి.. అమ్మాయితో గుడి గంట కొట్టించారు : దిల్ రాజు)‘ప్రమాదం జరిగిన సమయంలో నేను వెనుక సీటులో కూర్చొని నిద్రపోతున్నాను. మధ్యలో రెండు, మూడు సార్లు మెళకువ వచ్చింది. నాన్నని బిస్కెట్లు అడిగి తిని మళ్లీ నిద్రపోయాను. కాసేపటి తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడి చిద్రలేచా. చూస్తే మా కారుకు ప్రమాదం జరిగింది. ఎలా జరిగిందో తెలియదు. మేమంతా రోడ్డు మీద ఉన్నాం.అమ్మ షాక్కి గురైంది. ‘మనం ఎందుకు రోడ్డు మీద ఉన్నాం?’ , ఎక్కడికి వెళ్తున్నాం’ అని ప్రశ్నించింది. మా నాన్నను ఎన్నిసార్లు పిలిచిన పలకలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ‘దయచేసి ఎవరైనా సహాయం చేయండి. మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అంటూ నడిరోడ్డుపైనే ఏడ్చేశాను. నా జీవితంలో తొలిసారి ఇలాంటి ఘటన ఎదుర్కొన్నాను’ అని చాకో చెప్పారు. ఈ ప్రమాదం తనకు 30 కుట్లు పడ్డాయని, తల్లి, సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయన్నారు. -
నేను చేసిన ఐదు సినిమాలు ముందు నాగచైతన్యకే చెప్పా: వెంకీ అట్లూరి
సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri). ప్రస్తుతం హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. దర్శకుడిగా ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన వెంకీ అట్లూరి.. వాటన్నింటినీ ముందుగా అక్కినేని నాగచైతన్యకు వినిపించాడట! తాజాగా ఓ పాడ్కాస్ట్లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అక్కినేని ఫ్యామిలీ అంటే నాకిష్టం. మీరు నమ్ముతారో, లేదో కానీ.. ఇప్పటివరకు రాసుకున్న ప్రతి కథ మొదటగా నాగచైతన్యకే చెప్పాను.వర్కవుట్ కాలేఈరోజు వరకు నేను తీసిన ఐదు సినిమాలు ప్రతీది చైతన్య (Naga Chaitanya)కే చెప్పాను. కానీ, డేట్స్ కుదరక.. లేదా ఏదో ఒక కారణం వల్ల మా కాంబినేషన్లో సినిమా వర్కవుట్ కావడం లేదు. నెక్స్ట్ టైం అయినా కలిసి మూవీ చేద్దామని జోక్ చేసుకుంటూ ఉంటాం. అఖిల్కు మంచి హిట్టు ఇవ్వలేకపోయానన్న బాధ ఉంది. తనతో భవిష్యత్తులో కచ్చితంగా ఓ మంచి మూవీ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. సినిమావెంకీ అట్లూరి.. అఖిల్తో మిస్టర్ మజ్ను మూవీ చేశాడు. ప్రస్తుతం సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందిస్తున్నారు.చదవండి: నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం -
తెలుగులో ఎప్పుడో నటించిన దీపికా.. ఆమె ఆస్తి ఎంతో తెలుసా?
బ్యాడ్మింటన్ కోర్టు వదిలేసి, మోడలింగ్ ప్రపంచంలో నాజూకు అడుగులతో మొదలుపెట్టింది. నేడు వెండితెర మీద తనదైన సామ్రాజ్యం నిర్మించుకుంది నటి దీపికా పదుకొణే. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని త్వరలో రాబోతుండటంతో, ఎక్కడ చూసినా ఆమె పేరే ఒక హాట్ టాపిక్! అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందే సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేయడం సినీ పరిశ్రమలో పెద్ద వార్తగా మారింది. ఆమె గురించి కొన్ని విషయాలు మీకోసం..బ్యాడ్మింటన్ ఆట నుంచి..దీపికా పదుకొణె (Deepika Padukone) కొంకణి అమ్మాయి. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. తండ్రి ప్రభావంతో బ్యాడ్మింటన్ ఆడిన దీపికా, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. కాని తనకు సినిమా, మోడలింగ్పై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో నటన వైపు మొగ్గుచూపింది. ఆమె సినీ ప్రయాణం తెలుగు సినిమా ‘మన్మథుడు’ ఆధారంగా రూపొందిన కన్నడ రీమేక్ ‘ఐశ్వర్య’ చిత్రంతో మొదలైంది. తెలుగులో ఎప్పుడో యాక్ట్ చేసిందితెలుగు దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, దీపికాకు తెలుగులో మొదటి అవకాశం ఇచ్చారు. ఓ యువ ప్రేమకథలో ప్రత్యేక పాటలో నాట్యం చేసింది. ఆ సినిమా పూర్తయింది. కానీ, ఇప్పటికీ విడుదల కాలేదు. లేకపోతే ఆమె టాలీవుడ్లో ఎప్పుడో అడుగుపెట్టేది. ‘కల్కి’ సినిమాలో సుమతి పాత్రతో ఆకట్టుకున్న దీపికా, ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.గ్లామర్లో తగ్గేదేలే‘రామ్ లీలా’ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్వీర్ సింగ్తో పరిచయం ప్రేమగా మారింది. అంతకు ముందు రణ్బీర్ కపూర్తో ప్రేమలో ఉన్న ఆమె, ఆ బ్రేకప్ తర్వాత కొత్త జీవితం మొదలుపెట్టింది. పెళ్లి అయినా, తల్లి అయినా, దీపికా తన గ్లామర్ను తగ్గించుకోలేదు. తన పని పట్ల నిబద్ధతతో ప్రవర్తించేది. హిందీ సినీ ప్రపంచంలో ఆమె తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’, షారుఖ్ ఖాన్తో కలసి నటించింది. ఆ చిత్రం ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘చెన్నై ఎక్స్ప్రెస్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘పఠాన్’, ‘జవాన్’లాంటి హిట్ సినిమాల్లో నటించింది.రూ.500 కోట్లకు పైగా ఆస్తులుహాలీవుడ్లోనూ నటించే అవకాశం పొందిన దీపికా, ప్రపంచ సినీరంగంలో కూడా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం దీపికా ఆస్తుల విలువ దాదాపు రూ.500 కోట్లకు పైగా ఉంది. ముంబైలో ఆమెకు అంధేరి, బాంద్రా, ప్రభాదేవి ప్రాంతాల్లో మూడు ఇళ్లు ఉన్నాయి. 2022లో ఆమె సొంతంగా సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ను ప్రారంభించింది. ఇళ్లపై పెట్టుబడులు పెట్టడాన్ని ఆమె ఇష్టంగా భావిస్తుంది.రహస్యాన్ని అతడికే చెప్తాఓ ఇంటర్వ్యూలో తల్లి అయ్యాక, తన పాత్రల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నానని, బిడ్డకు సమయాన్ని ఇచ్చేలా ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఓ కార్యక్రమంలో ‘ఒక రహస్యాన్ని చెవిలో చెప్పాలంటే ఏ హీరోకి చెబుతారు?’ అన్న ప్రశ్నకు వెంటనే షారుఖ్ ఖాన్ అని బదులిచ్చింది. 2007లో రణ్బీర్ కపూర్తో పరిచయం, ప్రేమగా మారింది. ఒకే మేకప్ ఆర్టిస్ట్ కారణంగా ఫోన్ నంబర్లు మార్చుకుని ప్రేమలో పడ్డారు. తన మెడ వెనక అతడి పేరు టాటూ వేయించుకుంది. కాని, ఏడాదిలోనే బ్రేకప్ జరిగింది.డిప్రెషన్రణ్బీర్ కపూర్ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం వల్ల విడిపోయినట్లు ఓ సందర్భంలో దీపిక చెప్పింది. దీని వలన డిప్రెషన్కు లోనైనా, కెరీర్పై ప్రభావం రాకుండా చూసుకుంది. ‘ఏ జవానీ హై దివానీ’ సినిమా అదే సమయంలో పూర్తి చేసింది. ఇప్పుడు ఇద్దరూ ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దీపికా – రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది. మరోవైపు రణ్బీర్ కపూర్ – ఆలియా భట్ను వివాహం చేసుకుని పాపకు తండ్రయ్యాడు. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రొఫెషనల్గానే పలకరించుకుంటారు.చదవండి: స్క్విడ్ గేమ్ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్, అందరికీ రుచిస్తుందా? -
ఆ సీన్ తర్వాత గతం మర్చిపోయిన అమ్రిష్ పురి..
హీరోయిన్ కాజోల్కు మతిమరుపు ఉండేది. కుచ్కుచ్ హోతా హై సినిమా సెట్లో పదేపదే అన్నింటినీ మర్చిపోయేది. ఓసారి తనే ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే లెజెండరీ నటుడు అమ్రిష్ పురి (Amrish Puri) ఒకానొక సందర్భంలో తనెవరన్నది కూడా మర్చిపోయాడని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో కాజోల్ మాట్లాడుతూ.. అజయ్ దేవ్గణ్, అమ్రిష్ పురి ఓ సినిమాలో కలిసి నటించారు. అంతా మర్చిపోయిన అమ్రీష్పురిఅందులో అమ్రీష్.. జలపాతం కింద నిల్చునే సీన్ ఉంది. అందుకోసం ఆయన వాటర్ఫాల్ కింద నిలబడ్డారు. పైనుంచి ఎంతో వేగంగా వస్తున్న నీళ్లు ఆయన తలను కొట్టుకుంటూ కిందపడేవి. తలకు రక్షణగా ఏదీ పెట్టలేదు. సన్నివేశం అయిపోగానే ఆయన వాటర్ఫాల్ నుంచి వచ్చేశారు. కానీ అన్నీ మర్చిపోయాడు. అసలేదీ గుర్తులేదు. నేనెవర్ని? నేనిక్కడేం చేస్తున్నాను? అని ప్రశ్నించాడు. సెట్లో ఉన్నవాళ్లందరికీ భయంతో చెమటలు పట్టాయి. తనకు జ్ఞాపకశక్తి రావడానికి మూడు గంటలు పట్టింది. కరడుగట్టిన విలన్గా..ఇప్పుడు తల్చుకుంటే సరదాగా అనిపిస్తుందేమోకానీ ఆ సమయంలో మాత్రం అందరూ చాలా భయపడ్డారు అని చెప్పుకొచ్చింది. అమ్రీష్ పురి, అజయ్ దేవ్గణ్.. టార్జాన్: ద వండర్ కార్, ఫూల్ ఔర్ కాంటే, హల్చల్, గెయిర్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. హిందీలో వందలాది సినిమాలు చేసిన అమ్రిష్ పురి.. ఆదిత్య 369, బాబా, జగదేక వీరుడు అతిలోక సుందరి, మేజర్ చంద్రకాంత్, నిప్పురవ్వ వంటి పలు చిత్రాల్లో నటించారు. కరడుగట్టిన విలన్గా ప్రేక్షకులను తన ఆహార్యంతోనే భయపెట్టేవారు. 2005లో బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూశారు.చదవండి: కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్ -
తెలుగులో అద్భుతంగా మాట్లాడిన హీరోయిన్.. నోరెళ్లబెట్టిన హీరో సిద్దార్థ్
ఎన్నేళ్లు తెలుగు ఇండస్ట్రీలో పని చేసినా కొందరు హీరోయిన్లకు తెలుగు అస్సలు రాదు. కానీ పైన కనిపిస్తున్న కథానాయిక మాత్రం స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనెవరో మీరీపాటికే గుర్తుపట్టేసి ఉంటారు. గుడ్నైట్ హీరోయిన్ మీథా రఘునాథన్ (Meetha Raghunath). 3 BHK సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీథా అనర్గళంగా తెలుగు మాట్లాడింది. తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఏమైనా తప్పులు దొర్లితే క్షమించండి అంటూ స్పీచ్ మొదలుపెట్టింది.రెండోసారి..మీరు నన్ను గుడ్నైట్ సినిమాలో చూసి ఉంటారు. ఆ సినిమాలో నా క్యారెక్టర్ పట్ల మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను చిన్నప్పుడు స్కూల్ ట్రిప్ కోసం తొలిసారి హైదరాబాద్కు వచ్చాను. ఇప్పుడు 3 BHK మూవీ కోసం రెండోసారి ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 3 BHK.. కలలను సాకారం చేసుకునే కథ. ఇది మా కథ మాత్రమే కాదు, మీ కథ.. మనందరి కథ. ఈ సినిమాను ప్రేమతో, హృదయపూర్వకంగా చేశాం. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో థియేటర్కు వచ్చి సినిమా ఎంజాయ్ చేయండి. మీ అందరికీ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను.తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా..ఈ మూవీ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. దయచేసి సినిమా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రసంగం విని సిద్దార్థ్ నోరెళ్లబెట్టాడు. చాలా బాగా మాట్లాడావని మెచ్చుకున్నాడు. నెక్స్ట్ తెలుగు మూవీ చేసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా మాట్లాడతానని మీథా మాటిచ్చింది. ఇకపోతే మీథా రఘునాథ్ తెలుగులో డైరెక్ట్గా ఇంతవరకు సినిమా చేయలేదు. గుడ్నైట్ అనే తమిళ సినిమా తెలుగు వర్షన్తోనే ఇక్కడివారికి సుపరిచితురాలైంది. ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్న ఈ బ్యూటీ త్వరలోనే ఇక్కడ స్ట్రయిట్ ఫిలిం చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.తెలంగాణ అల్లుడిని కదా..3 BHK మూవీలో శరత్కుమార్, సిద్దార్థ్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సిద్దార్థ్ మాట్లాడుతూ.. 25 ఏళ్లయింది.. నేను ఇంతవరకు భూమి, ఇల్లు ఏవీ కొనలేదు. 3 బీహెచ్కే సినిమా చేస్తున్నప్పుడు తొలిసారి ఇల్లు కొనుక్కున్నాను. పెళ్లయ్యాక బాధ్యతలు పెరిగాయి కదా.. అసలే తెలంగాణ అల్లుడిని కదా! అందుకే నా భార్యతో కలిసి కొత్త ఇల్లు కొనుక్కున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: 'కాంటా లగా' సాంగ్తో సెన్సేషన్.. నటి కన్నుమూత -
రెండో బిడ్డ జననం.. ఫోటో షేర్ చేసిన ఇలియానా
దేవదాసు, పోకిరి, జులాయి వంటి చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్గా రాణించింది ఇలియానా డీక్రూజ్ (Ileana D'Cruz). ఒకప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం యాక్టింగ్ పక్కన పెట్టి కుటుంబానికే పెద్ద పీట వేస్తోంది. ఇటీవలే ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ బుడ్డోడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అతడికి ఏం పేరు పెట్టిందో కూడా వెల్లడించింది. శుభాకాంక్షల వెల్లువజూన్ 19న జన్మించిన కెయాను రఫె డోలన్ను మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు మా హృదయాలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి అని క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్కు హీరోయిన్ ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపింది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు.. ఇలియానాకు అభినందనలు తెలియజేస్తున్నారు.పెళ్లి- పిల్లలుఇలియానా.. 2023లో విదేశీయుడు మైఖేల్ను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో పండంటి కొడుక్కి జన్మనిచ్చింది. అతడికి కోవా ఫోనిక్స్ డోలన్ అని నామకరణం చేసింది. ఇప్పుడు మరోసారి కొడుకే జన్మించాడు. ఇకపోతే ఇలియానా చివరగా 'దో ఔర్ దో ప్యార్' సినిమాలో కనిపించింది. 'రైడ్ 2'లో నటించే ఆఫర్ వచ్చినప్పటికీ చిన్న పిల్లాడు ఉన్నందున ఆ సినిమాను వదిలేసుకుంది. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) చదవండి: 'కాంటా లగా' సాంగ్తో సెన్సేషన్.. నటి కన్నుమూత -
'కాంటా లగా' సాంగ్తో సెన్సేషన్.. నటి కన్నుమూత
బాలీవుడ్ నటి, కాంటా లగా సాంగ్ ఫేమ్ షెఫాలీ జరివాలా (42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భర్త పరాగ్ త్యాగి వెంటనే ఆమెను అంధేరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే నటి మృతి చెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టమ్ కోసం ఆమె మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించారు. తొలుత ఆమె గుండెపోటుతో మరణించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. నటి మృతికి ఇంకా కారణాలు తెలియలేదన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆమె నివాసంలో పలు ఆధారాలను సేకరిస్తున్నారని తెలిపారు. షెఫాలి (Shefali Jariwala) మృతి పట్ల సెలబ్రిటీలు, అభిమానులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.నటి ప్రయాణం సాగిందిలా..షెఫాలీ జరివాలా 2002లో వచ్చిన కాంటా లగా సాంగ్తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి అభిమానులు ఆమెను కాంటా లగా గర్ల్ అనే పిలుచుకుంటున్నారు. ఈ గుర్తింపుతోనే ముజ్సే షాదీ కరోగి చిత్రంలో షెఫాలీకి నటించే ఛాన్స్ వచ్చింది. అలాగే కన్నడలో హుడుగరు మూవీలో యాక్ట్ చేశారు. బేబీ కమ్నా అనే వెబ్ సిరీస్లోనూ కనిపించారు. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లోనూ పాల్గొన్నారు. షెఫాలి.. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్ను పెళ్లాడారు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2009లో విడిపోయారు. అనంతరం 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఆస్కార్ కమిటీలో ఇండియన్ స్టార్స్ -
'అద్దె ఇంట్లో ఉంటున్నా'.. ప్రియురాలు కావాలంటే తప్పదుగా!
3 BHK.. అద్దె ఇంట్లో ఉంటున్న ఎన్నో మధ్యతరగతి కుటుంబాల కల. ఈ కలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమే 3BHK. హీరో సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ ఈవెంట్కు తమిళ స్టార్ హీరో రవి మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.అద్దె ఇంట్లో ఉంటున్నా..రవి మోహన్ (Ravi Mohan) మాట్లాడుతూ.. ఇంతకుముందెన్నడూ అద్దె ఇంట్లో ఉండలేదు. నేను పుట్టినప్పటి నుంచి నాకు చెందిన ఇళ్లల్లోనే ఉన్నాను. కానీ, ఇప్పుడు మాత్రం అద్దె ఇంట్లో బతుకుతున్నాను. ఈ సినిమా నా జీవితానికి దగ్గరగా ఉంది. మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటున్నాను. ఈ మూవీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అని చెప్పుకొచ్చాడు. కానీ ఇది జనాలకు అస్సలు మింగుడుపడలేదు. ప్రియురాలితో ఉండాలంటే..'అద్దె ఇంట్లో ఉండటమంటే లక్షలు రెంటు కట్టడం కాదు.. సొంతిల్లు లేక అగచాట్లు పడటం!', 'అయినా ఎందుకీ చెత్తంతా వాగుతున్నావు.. నువ్వు హీరోవి, కోట్లల్లో సంపాదిస్తున్నావు.. అద్దె ఇంట్లో కష్టాలు పడే కూలీలా మాట్లాడకు..', 'నీకు పెళ్లయి భార్య ఉంది, కానీ ఆమెను పక్కనపెట్టి ప్రియురాలు కావాలనుకున్నావ్, అలాంటప్పుడు అద్దె ఇంట్లోనే కదా ఉండాల్సింది! సింపతీ కార్డు వాడకు', 'అద్దింట్లో ఉంటున్నావ్.. కానీ సినిమాలు నిర్మిస్తున్నావ్' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.సినిమాకాగా రవి మోహన్- ఆర్తి దంపతులు 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సింగర్ కెనీషాతో ప్రేమాయణమే దంపతుల మధ్య చిచ్చు పెట్టిందన్న రూమర్లున్నాయి. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులోనే ఉండగా భార్యాభర్తలు విడివిడిగా జీవిస్తున్నారు. 3 BHK సినిమా విషయానికి వస్తే.. ఆర్ శరత్కుమార్, దేవయాని, యోగిబాబు, మీఠా రఘునాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.చదవండి: Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా అనుకోలే: మనోజ్ -
కన్నప్పను కాపాడిన రుద్ర!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్పుకుంటున్న కన్నప్ప నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లోనే ఉంది. రుద్ర పాత్రలో ప్రభాస్(Prabhas) నటిస్తున్నాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అందరు అనుకున్నట్లుగా ఈ సినిమాను ప్రభాసే నిలబెట్టేవాడు.( చదవండి: కన్నప్ప మూవీ రివ్యూ) ఈ సినిమాలో ఆయన కనిపించేది 20 నిమిషాలే అయినా.. ఆ సన్నివేశాలే సినిమాలకు కీలకం. సెకండాఫ్లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. రుద్ర పాత్ర తెరపై కనిపించగానే థియేటర్స్లో విజిల్స్ పడతాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే ఆయన ఎంట్రీ గ్రాండ్గా ఉంటుంది. ఇక ఆయన చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి. తిన్నడుతో పాటు నెమలితో రుద్ర చేసే కామెడీ సంభాషణనలు ఆకట్టుకుంటాయి. రుద్ర పాత్రకు ప్రభాస్ని తప్ప వేరే హీరోని ఊహించుకోలేమని సినిమా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. . ఇక మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో మహాదేవ శాస్త్రిగా అద్భుత నటన కనబరిచాడు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ చక్కగా చేసింది. మంచు విష్ణు కూడా తన కెరీర్లో బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో విష్ణు నటన అందరినీ ఆకట్టుకుంటుంది. -
మాది కూడా 3 BHK.. అమ్మానాన్న కష్టపడి..: సిద్ధార్థ్ భావోద్వేగం
సిద్దార్థ్ (Siddharth) హీరోగా నటించిన 40వ సినిమా 3 BHK. హైదరాబాద్లో గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో భావోద్వేగానికి లోనయ్యాడు. సిద్దార్థ్ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు కూడా 3 BHKలోనే ఉండేవారు. నటుడిగా నాకిది 40వ సినిమా. 3BHK మూవీ చేస్తున్నానని చెప్పగానే నాన్న (సూర్యనారాయణన్) ముఖంలో సంతోషం కనిపించింది. ఒకరకమైన తృప్తి, ఒకింత గర్వం కనబడింది.నాకోసం సంపాదనంతా..ఈ సినిమాలో అందరూ నన్ను ఏడిపిస్తారు. ఇదొక ఎమోషనల్ ఫిలిం. ఈ మూవీ చేసినందుకు సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో నమ్మారు. నా జీవితం బాగుండాలని వారు సంపాదించినదంతా ఖర్చుపెట్టారు. నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్కు థాంక్యూ అంటూ కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకున్నాడు.సినిమాసొంతిల్లు అనేది ఎన్నో మధ్యతరగతి కుటుంబాల కల. మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ కల నెరవేర్చుకుందా? లేదా? దానికోసం ఏ చేశారన్నదే 3 BHK కథ. శరత్కుమార్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. చదవండి: బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్? -
నిహారిక కొణిదెల కొత్త మూవీ.. హీరోయిన్ దొరికేసింది
‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల్లో నటించిన సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) సోలో హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మానసా శర్మ దర్శకత్వం వహించనున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత నిహారిక కొణిదెల నిర్మించనున్న చిత్రం ఇది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ‘ఆయ్, క’ చిత్రాల ఫేమ్ నయన్ సారిక (Nayan Sarika)ను ఎంపిక చేసినట్లుగా మేకర్స్ గురువారం ప్రకటించారు. ‘‘జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (ఇందులో సంగీత్ శోభన్ లీడ్ యాక్టర్) వెబ్ సిరీస్కి రచయితగా, ‘బెంచ్లైఫ్’ సిరీస్కి దర్శకురాలిగా చేసిన మానసా శర్మ దర్శకత్వం వహించనున్న తొలి చిత్రం ఇది’’ అని యూనిట్ పేర్కొంది. The beautiful @UrsNayan joins the joyride that is #ProductionNo2!Excited for all the fun ahead with this amazing team ❤️😎#PEP2@IamNiharikak #SangeethShobhan #ManasaSharma @anudeepdev #MaheshUppala @manyam73 @beyondmediapres @Ticket_Factory pic.twitter.com/G7LwesEqHG— Pink Elephant Pictures (@PinkElephant_P) June 26, 2025 చదవండి: స్టార్ సింగర్ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే? -
అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్ హోటల్స్లో వసతి అక్కర్లేదు: లయ
‘‘మా కథకి ‘తమ్ముడు’ సరైన టైటిల్. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారు. ఈ సినిమాలో నితిన్కి అక్క పాత్ర చేశాను. నటన పరంగా చూస్తే నితిన్ మెచ్యూర్డ్గా కనిపిస్తారు. చాలా కష్టమైన సన్నివేశాలను కూడా సులభంగా చేశారు’’ అని నటి లయ (Actress Laya) తెలిపారు. నితిన్ హీరోగా రూపొందిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించిన లయ పంచుకున్న విశేషాలు.2023లో ఇండియాకు..వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడిన నేను 2023 ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చాను. అప్పుడు కొన్ని యూట్యూబ్ చానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలు చూసిన ‘తమ్ముడు’ మూవీ టీమ్ నుంచి జూన్లో నాకు ఫోన్ వచ్చింది. నటిస్తారా? అని అడిగితే ఓకే అన్నాను. ‘తమ్ముడు’ కథ ఓ లైన్గా చెప్పారు. ఝాన్సీ కిరణ్మయి పాత్ర కోసం బరువు పెరగాలని చెప్పడంతో స్వీట్స్ బాగా తిని, 7 కిలోలు బరువు పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక పూర్తి కథ విన్నాను. నా రీ ఎంట్రీకి ‘తమ్ముడు’ సరైన సినిమా అని బలంగా అనిపించి, నటించాను.ఉద్యోగం మానేశా‘తమ్ముడు’ సినిమా కోసం హైదరాబాద్ రావాలనుకున్నప్పుడే అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ మానేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు... అందుకే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశం వదులుకోకూడదని వచ్చేశా. ఈ సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ భిన్నంగా ఉంటుంది. ఝాన్సీ కిరణ్మయి స్ట్రిక్ట్ ఆఫీసర్. కుటుంబాన్ని చూసుకుంటూనే, ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటుంది. నా క్యారెక్టర్లో స్ట్రిక్ట్నెస్తో పాటు ఎమోషన్, అఫెక్షన్ కూడా ఉంటాయి. అమెరికాలోనే కాదు హైదరాబాద్లోనూ..కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటించాలని అనుకుంటున్నాను. నేను అమెరికా నటిని కాదు... పక్కా హైదరాబాద్ నటినే. నాకు అమెరికాలో ఇల్లు ఉంది. హైదరాబాద్లోనూ ఉంది. నాకోసం ఫ్లైట్స్లో బిజినెస్ క్లాస్ టికెట్స్, స్టార్ హోటల్స్లో వసతి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్లోని నా ఇంట్లో ఉంటాను. ప్రస్తుతం శివాజీగారితో చేస్తున్న ఓ సినిమా తుది దశకు వచ్చింది. కొన్ని కథలు వింటున్నాను.చదవండి: Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ -
మురుగ పుస్తకంతో జూనియర్ ఎన్టీఆర్
వెండితెరపై కార్తికేయుడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మైథాలజీ సినిమాలోనే కార్తికేయుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ‘వార్ 2’ సినిమా వర్క్స్లో భాగంగా ముంబై ఎయిర్పోర్ట్కు వెళ్లిన ఎన్టీఆర్ చేతిలో ‘మురుగ’ (కార్తికేయుడు) పుస్తకం కనిపించింది.అందుకోసమే ఈ ప్రిపరేషన్దీంతో త్రివిక్రమ్తో చేయబోయే మైథాలజీ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, ఇందులో భాగంగానే మురుగ పుస్తకం చదువుతున్నారని ఆయన ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఈ సినిమాను కల్యాణ్రామ్, సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. కొరటాల శివతో ‘దేవర 2’ కమిట్ అయ్యారు. తమిళ దర్శకుడు నెల్సన్తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారని టాక్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతోంది. ఈ కాంబినేషన్ గురించి కూడా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్? -
స్టార్ సింగర్ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే?
స్టార్ సింగర్ కేఎస్ చిత్ర (KS Chitra)ను ఇష్టపడని వాళ్లుండరు. అద్భుత గాత్రంతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తోంది. ఇటీవల చిత్రకు ప్రమాదం జరిగిందంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. చేతికి కట్టుతో కనిపించడంతో ఇది నిజమేనని తేలిపోయింది. తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి వివరాలు బయటపెట్టింది చిత్ర. మలయాళంలో వచ్చే స్టార్ సింగర్ (10వ సీజన్) షోలో చిత్ర మాట్లాడుతూ.. చెన్నై ఎయిర్పోర్టులో ఈ ప్రమాదం జరిగింది.కింద పడిపోయా..హైదరాబాద్ వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకుని నా భర్త కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో అక్కడున్న అభిమానులు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా వెనకాలే సెక్యూరిటీ వస్తువులు పెట్టే ట్రే ఉంది. నాతో ఫోటో తీసుకునే ఉత్సాహంలో నన్ను కాస్త వెనక్కు నెట్టారు. ఫోటోలు దిగడం అయిపోయాక నేను వెనక్కు తిరిగి ఓ అడుగు వేశాను. అంతే.. నా కాలు ట్రేకు తగలడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాను.విశ్రాంతిఅప్పుడు నా భుజం ఎముక ఒకటిన్నర అంగుళం కిందకు జరిగింది. డాక్టర్లు దాన్ని సరిచేశారు. కానీ, మూడువారాలు విశ్రాంతి తీసుకోవాలన్నారు. మూడు నెలలపాటు జాగ్రత్తగా ఉండమని సూచించారు అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు.. చిత్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చిత్ర.. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో పాటలు పాడుతూ రాణిస్తోంది. ఇప్పటివరకు 25 వేలకుపైగా పాటలు పాడినట్లు తెలుస్తోంది. ఈమెను మెలోడీ క్వీన్ అని పిలుస్తారు. View this post on Instagram A post shared by Asianet (@asianet) చదవండి: Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ -
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa ) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాన్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కన్నప్ప కథేంటి? ఎలా ఉంది? ప్రభాస్ ఈ సినిమాకు ఎంత వరకు ప్లస్ అయ్యాడు? తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.కన్నప్ప చిత్రానికి ఎక్స్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా చాలా బాగుందని కొంతమంది, యావరేజ్గా ఉందని మరికొంతమంది ట్వీట్ చేశారు. మంచు విష్ణు నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన కెరీర్లోనే ఇది బెస్ట్ ఫెర్పార్మెన్స్ అని కామెంట్ చేస్తున్నారు. #KannappaReview ✅🔥Vishnu Manchu delivers his career-best performance 👑Prabhas cameo = Goosebumps overload 💥Mohanlal’s character is a big surprise 👀BGM & elevations are top-class 💯Climax is pure emotion – will leave you in tears 😢BLOCKBUSTER LOADING 📿✨ 3.5/5 pic.twitter.com/NhfoLlh9an— POWER Talkies (@PowerTalkies1) June 26, 2025 మంచు విష్ణు కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రభాస్ క్యామియో రోల్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. మోహన్ లాల్ క్యారెక్టర్ బిగ్ సర్ప్రైజ్, నేపథ్య సంగీతం, ఎలివేషన్స్ టాప్ క్లాస్గా ఉన్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్గా ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ థియేటర్ బయటకు వస్తారంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చాడు. Prabhas kosam cinema ki vellipovachuPrabhas scenes chala baagunnayi His cameo is worth the ticket price🙏🏽🙏🏽🙏🏽#Kannappa #Prabhas #KannappaMovie #KannappaOnJune27th— IndianCinemaLover (@Vishwa0911) June 27, 2025 ప్రభాస్ కోసమే ఈ సినిమాకు వెళ్లిపోవచ్చు. ప్రభాస్ సీన్స్ చాలా బాగున్నాయి. మనం కొన్న టికెట్కు ప్రభాస్ అతిథి పాత్ర న్యాయం చేస్తుంది అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.#Kannappa is an Mythology drama that bores from start to finish due to its outdated and bland screenplay. The storyline idea may have been emotional on paper. However, it feels lifeless and somewhat silly when translated on screen. Rating: 2/5 #Kannappa#Prabhas #Prabhas— AbhishekSharma Sena (@KapuIndrasen) June 27, 2025 కన్నప్ప బోర్గా సాగే ఓ మైథాలజీ డ్రామా. స్క్రీన్ప్లే చప్పగా ఉండడంతో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బోరింగ్గా సాగుతుంది. ఈ స్టోరీ లైప్ పేపర్పై రాసుకున్నప్పుడు ఎమోషనల్గా అనిపించొచ్చు కానీ తెరపై చూస్తే మాత్రం నిర్జీవంగా, కొన్ని సీన్లు సిల్లీగా అనిపించాయి అంటూ ఓ నెటిజన్ కేవలం 2 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు.#Kannappa #KannappaMovieIf same cameo of Rudra was offered to any contemporary stars they would have said no because of risk and insecurity#Prabhas gambles pay off in hugeThen Baahubali now the list ever goes onHe is the choosen one of all the stars and he's the super star pic.twitter.com/YCHHckCoB1— IndianCinemaLover (@Vishwa0911) June 27, 2025 ప్రభాస్ పోషించిన రుద్ర పాత్రను ఈ రోజుల్లో ఏదైనా యంగ్ హీరోకు ఆఫర్ చేస్తే రిస్క్ ఎందుకని సున్నితంగా తప్పుకునే వారు. కానీ ప్రభాస్ మాత్రం ఆ రిస్క్ చేశాడు. ఆయన పాత్ర ఈ సినిమాకు ప్రాణం పోసింది. బాహుబలి తర్వాత ఆయన మరో మంచి పాత్రని ఎంచుకున్నాడు. అందుకే ప్రభాస్ సూపర్స్టార్ అయ్యాడంటూ ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.#KannappaReview Rating: ⭐️⭐️½ #VishnuManchu gives a heartfelt performance, #AkshayKumar brings divine intensity as Lord Shiva,But the film suffers from a slow pace, flat BGM & a dull and disengaged cameo by #Prabhas that adds no real value.Review 👇https://t.co/YOC4dI82lU— CineMarvel🇮🇳 (@cinemarvelindia) June 27, 2025Mahashivratri Episode starring Prabhas worked very big time🛐🔥🔥🔥🔥🔥Adhi Biggest plus point ani mention chestunaru andharu🥵🔥🔥 And vishnu last 20 mins ichi padesadu anta🔥🔥#KannappaReview pic.twitter.com/b45nW48OH1— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) June 27, 2025 -
ఇలాంటి సినిమాలు విజయం సాధించాలి: మురళీ మోహన్
‘‘డొక్కా సీతమ్మగారిలాంటి గొప్పవారిపై సినిమా తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయిన సమయంలో రాంబాబు, రవి నారాయణగారు ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ చిత్రం నిర్మిస్తుండటం అభినందనీయం. ఇలాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి’’ అని మురళీమోహన్ తెలిపారు. టీవీ రవి నారాయణ్ దర్శకత్వంలో మురళీమోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. జూన్ 24న మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ను, గ్లింప్స్ని విడుదల చేశారు. టీవీ రవి నారాయణ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఆరంభం నుంచి మురళీమోహన్గారు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆయన వల్లే ఈ చిత్రం ఇక్కడివరకూ వచ్చింది’’ అన్నారు. అతిథిగా హాజరైన డైరెక్టర్ రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘డొక్కా సీతమ్మగారి’ కథతో సినిమా తీస్తుండటం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కార్తీక్, నిర్మాతలు సాయివెంకట్, రామ సత్యనారాయణ, బెక్కెం వేణుగో΄ాల్, డైరెక్టర్ శివ నాగు, దాసన్న తదితరులు మాట్లాడారు. -
వెండితెరపైకి దశావతారాలు.. ఏ సినిమా ఎప్పుడంటే?
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తాజాగా క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి పన్నెండేళ్ల ప్రణాళికతో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ యూనివర్స్లో భాగంగా రానున్న తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయి, చైతన్య దేశాయి నిర్మించారు. ఈ చిత్రం 3డీ ఫార్మాట్లో ఐదు భాషల్లో జూలై 25న రిలీజ్ కానుంది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రోర్ ఆఫ్ నరసింహ...’ పాటను రిలీజ్ చేశారు. సామ్ సీఎస్, రాకేందు మౌళి సాహిత్యం అందించి, పాడారు. ఈ సందర్భంగా అశ్విన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఇది కేవలం సినిమా కాదు... ఆధ్యాత్మిక అనుభూతి’’ అన్నారు. ‘‘ఇప్పుడు మన కథలు వెండితెరపై అలరించబోతున్నాయి. ఇదో అద్భుతమైన సినిమా ప్రయాణం’’ అని శిల్పా ధవాన్ తెలిపారు. ఇదిలా ఉంటే... ఎంసీయూ దశావతారాలను తెరపైకి తీసుకొస్తుంది. 2025లో నరసింహ, 2027లో పరశురామ, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలిపారు. చదవండి: విమానంలో మూర్ఛ వచ్చింది.. ఎక్కువ డోస్ ఇవ్వడంతో..: -
కాస్టింగ్ కౌచ్.. ఓ గొప్ప ఫిలింమేకర్ కాంప్రమైజ్ అడిగాడు: నటుడు
అడ్జస్ట్ అయితేనే అవకాశాలు ఇస్తామంటున్నారు అని ఎంతోమంది నటీమణులు మీడియా ముందు గోడు వెల్లబోసుకున్నారు. అయితే తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటున్నాడు బాలీవుడ్ నటుడు సుధాన్షు పాండే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధాన్షు పాండే మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. నేను కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఓ ప్రముఖ దర్శకనిర్మాత తను అడిగింది చేస్తే మంచి ఆఫర్ ఇస్తానన్నాడు.కాంప్రమైజ్ అయితేనే..ఇప్పుడాయన బతికి లేడు. గొప్ప ఫిలింమేకర్స్లో ఆయన ఒకరు. ఆయన అడిగినదానికి కాంప్రమైజ్ అయితేనే రోల్ ఇస్తానన్నాడు. ఆయనపై నాకెలాంటి కోపం, పగ లేదు. ఎందుకంటే వాళ్లు అడిగినదానికి ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఆయన అడిగింది నా వల్ల కాదని సున్నితంగా తిరస్కరించాను. మర్యాదగా అడిగాడు కాబట్టి అంతే గౌరవంగా బదులిచ్చాను. బలవంతం చేస్తే నచ్చదుఅలా కాకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించుంటే లాగిపెట్టి కొట్టేవాడిని. ఎవరైనా నన్ను బలవంతం చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. నాకు నచ్చినపనే చేస్తాను. నచ్చినవాటివైపే నిలబడతాను. ఇష్టం లేకుండా ఏ పనీ చేయను అని చెప్పుకొచ్చాడు. సుధాన్షు పాండే.. ఖిలాడీ 420, ద మిత్, యాకీన్, మర్డర్ 2, రాజధాని ఎక్స్ప్రెస్ వంటి పలు చిత్రాలు చేశాడు. రోబో 2.0, మన్మథుడు 2 వంటి చిత్రాలతో తెలుగువారికీ సుపరిచితుడే.. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్లో కనిపిస్తున్నాడు.చదవండి: లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో! -
లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో! సినిమాల్లో..
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా రాణించింది లయ (Actress Laya Gorty). శివరామరాజు, నీ ప్రేమకై, ప్రేమించు, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా.. ఇలా బోలెడు సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. కొన్నేండ్ల క్రితమే సినిమాలకు గుడ్బై చెప్పి అమెరికాలో సెటిలైన లయ తమ్ముడు చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది.తమ్ముడుతో రీఎంట్రీనితిన్ ప్రధాన పాత్రలో నటించిన తమ్ముడు సినిమాలో లయ అక్కగా నటించింది. వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ, స్వసికా విజయన్, బేబీ శ్రీరామ్ కీలక పాత్రలు పోషించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 4న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు లయ సినిమాలకు దూరంగా ఉందే కుటుంబం కోసం! అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంది. సరైన సమయం వచ్చేదాకా ఆగి ఇన్నాళ్లకు రీఎంట్రీకి రెడీ అయింది. తాజాగా లయ ఇంట గ్రాండ్ ఫంక్షన్ జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్గా శ్లోక..ఆమె కూతురు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలను లయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్డే మై శ్లోక ప్రిన్సెస్.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా లిటిల్ సన్షైన్కు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అని క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన అభిమానులు లయ కూతురికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. శ్లోక.. అమర్ అక్బర్ ఆంటోని మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. అఖండ 2లోనూ శ్లోక భాగమైనట్లు ఆమధ్య ఓ రూమర్ తెగ వైరలయింది. View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ -
విమానంలో మూర్ఛ వచ్చింది.. ఎక్కువ డోస్ ఇవ్వడంతో..: హీరోయిన్
బాలీవుడ్ హీరో విజయ్ వర్మ.. తమన్నాకు బ్రేకప్ చెప్పాక మరో హీరోయిన్తో ప్రేమలో పడ్డాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షైఖ్ (Fatima Sana Shaikh)తో పలుమార్లు కనిపించడంతో వీళ్లు లవ్ బర్డ్స్ అయుండొచ్చని పలువురూ అభిప్రాయపడ్డారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదంటోంది ఫాతిమా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ సమాన గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరు చెప్పేది మరొకరు వినాలి. సింగిల్ లైఫ్కొన్నిసార్లు ఒకరి కోసం మరొకరు కాంప్రమైజ్ అవ్వాలి. మిమ్మల్ని మీరు కోల్పోకుండా మీ అనుబంధాన్ని ముందుకు నడిపించాలి. అప్పుడే ఆ బంధం విజయవంతంగా కొనసాగుతుంది. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఎవరూ లేరు. మంచివాళ్లు కేవలం సినిమాల్లోనే ఉంటారు అంటూ తన రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని వెల్లడించింది. అలాగే తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ.. నాకు మూర్ఛ రోగం (Epilepsy) ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు విమానంలో ఉండగా మూర్ఛ వచ్చింది. దాంతో నన్ను ఎయిర్పోర్ట్ హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ఫిట్స్ వచ్చి పడిపోయాఅయినా మూర్ఛ తగ్గకపోవడంతో ఎక్కువ డోసు ఇచ్చారు. దానివల్ల నా శరీరం ఎఫెక్ట్ అయింది. బెడ్రెస్ట్ తీసుకోక తప్పలేదు. అప్పుడు నా చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటి షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. షూటింగ్కు రమ్మని పిలిచినప్పుడు బాధ తట్టుకోలేక ఏడ్చేశాను. నాకున్న మూర్ఛ వ్యాధి గురించి అందరికీ చెప్పాలని డిసైడయ్యాను. అప్పుడే నాకు ఫిట్స్ ఉన్నట్లు వెల్లడించాను అని చెప్పుకొచ్చింది. ఫాతిమా.. మాధవన్ సరసన ఆప్ జైసా కోయ్ మూవీలో నటించింది. ఈ చిత్రం జూలై 11న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఫాతిమా నటించిన మరో చిత్రం 'మెట్రో ఇన్ డినో' జూలై 4న థియేటర్లలో రిలీజవుతోంది.చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ -
కన్నప్పలో సైడ్కి నిలబడే పాత్ర.. మోహన్బాబు అడిగితే..
‘‘కన్నప్ప’ చిత్రంలో మహదేవశాస్త్రి (మోహన్బాబు పాత్ర) కొడుకుగా యాక్ట్ చేయమని మోహన్బాబుగారు అన్నప్పుడు ఆలోచించాను. మరీ సైడ్కి అలా నిలబడే పాత్ర ఎలా చేయాలని విష్ణుని అడిగితే, ‘నీ ఇష్టం’ అన్నారు. మా ఆవిడ మధుమిత కూడా అలానే అన్నారు. ఫైనల్గా ఒప్పుకున్నాను. అయితే ఈ చిత్రంలో ఆ పాత్ర చేసి ఉండకపోతే నేను చాలా మిస్ అయ్యేవాణ్ని. ఇప్పుడు నాకు ఆ పాత్ర గొప్పదనం అర్థమైంది’’ అని శివ బాలాజీ అన్నారు. విష్ణు మంచు హీరోగా ముఖేష్కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కన్నప్ప’. మంచు మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించిన శివ బాలాజీ మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’లో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యత కాస్త తక్కువగా ఉంటుంది. కానీ, ఓ గొప్ప చిత్రం, పాన్ ఇండియన్ సినిమాలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి. ఇక నేను చేసిన ‘రెక్కీ’ సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘రెక్కీ 2’ త్వరలోనే రానుంది. ప్రస్తుతం ‘సిందూరం’ అనే చిత్రం చేశాను. అలాగే మోహన్బాబుగారి ప్రొడక్షన్లో నేను హీరోగా ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు.చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ -
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ ప్రవస్తి
సింగింగ్ రియాలిటీ షో పాడుతా తీయగాలో తనను బాడీ షేమింగ్ చేశారని, పక్షపాతం చూపిస్తున్నారంటూ అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించింది సింగర్ ప్రవస్తి. తన ఎలిమినేషన్ ఎపిసోడ్కి సునీత తప్ప ఎవరూ లేరంది. కానీ, రీసెంట్గా ఆ ఎలిమినేషన్కు సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ అవగా.. అందులో ముగ్గురు జడ్జిలు (సునీత, చంద్రబోస్, కీరవాణి) చప్పట్లు కొడుతూ కనిపించారు.ఇంత అనైతికంగా..దీని గురించి ప్రవస్తి ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వివాదం గురించి ఇక మాట్లాడకూడదనుకున్నాను. కానీ నిన్నటి ఎలిమినేషన్ ఎపిసోడ్ చూశాక స్పందించాల్సి వస్తోంది. ఆ ఎపిసోడ్ చూసి చాలా షాకయ్యాను. రియాలిటీ షో చరిత్రలోనే ఇంత అనైతికంగా ఎడిటింగ్లు చేసి ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారనుకోలేదు. ఎడిట్ చేస్తారని తెలుసు. ఎలాగంటే అక్కడక్కడా ముక్కలు అతికిస్తారనుకున్నా.. కానీ, ఇంత అన్ప్రొఫెషనల్గా చేస్తారని మాత్రం ఊహించలేదు.మోసం చేయొచ్చనిమీరే చాలామంది రియలైజ్ అయి నాకు మెసేజ్లు చేస్తున్నారు. మిగిలిన ఎలిమినేషన్స్తో పోల్చుకుంటే ఇది అన్యాయంగా ఉందని కామెంట్లు చేశారు. మీరు చెప్పేది నిజమే.. చాలా ఎడిట్ చేశారు. జనాలను ఈజీగా మోసం చేయొచ్చని వారి ఉద్దేశం. అదే నాకు ఎంతో బాధనిపించింది. నా ఎలిమినేషన్ అప్పుడు సునీత మేడమ్ తప్ప మిగతా జడ్జిలు లేరని చెప్పాను. చంద్రబోస్ సర్ లేనే లేరు. కీరవాణి సార్.. నాకు సంబంధం లేదని లేచి వెళ్లిపోయారు. అది ఎడిటింగ్లో లేపేశారు.ఎక్కడినుంచి తీసుకొచ్చి అతికించారో..కానీ ఆయన చప్పట్లు కొడుతున్న సీన్ పెట్టారు. అది ఎక్కడినుంచి తీసుకొచ్చి అతికించారో నాకు తెలీదు. ఎలిమినేషన్లో చప్పట్లు కొట్టే సీన్ ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియాలి. చివరి రౌండ్లో ఇద్దరం మిగిలాం. నన్ను ఎలిమినేట్ చేసినప్పుడు నాకెన్ని మార్కులు వచ్చాయి? ఎందుకు ఎలిమినేట్ చేశారు? అనేది చూపించలేదు. నేనైతే ఆ ఎలిమినేషన్ ప్రక్రియ మొత్తం నవ్వుతూనే ఉన్నాను. ఎలిమినేట్ అవడమే బెటర్ఎందుకంటే, ఇంత అన్ప్రొఫెషనల్ రియాలిటీ షోలో ఉండటం అనవసరం అనిపించింది. ఈ సీజన్ ఇంత ఘోరంగా జరుగుతుంటే ఎలిమినేట్ అవడమే బెటర్ అనుకున్నాను. అలాగే చూసే జనాలకు కూడా నిజాలు తెలియాలనుకున్నాను. వాళ్లు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పాలని ఆరోజే నిర్ణయించుకున్నాను. అక్కడ సేవ్ అయిన కంటెస్టెంట్ల కంటే కూడా నా ముఖంలోనే చిరునవ్వు ఉంది. నేను మిస్టేక్స్ చేయలేదు. ద్వేషం లేదుసేవ్ అయినవాళ్లను చూస్తే తప్పులు చేసినా కూడా సేవ్ అయ్యాం అని గిల్ట్ వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వారిపై నాకెలాంటి ద్వేషం లేదు. నాకు అన్యాయం జరిగిందని ఇదంతా మాట్లాడుతున్నాను. ప్రేక్షకులను ఫూల్ చేస్తున్నారని తెలియాలనే ఇదంతా చేశాను. విన్నర్ అయినా కూడా వారికి ఆ సంతృప్తి మిగులుతుందనుకోవడం లేదు. వాళ్లకు నచ్చినవారే గెలుస్తారు అని చెప్పుకొచ్చింది. చదవండి: క్రికెట్ వీడియోపై నెటిజన్ వ్యంగ్య కామెంట్.. ఇచ్చిపడేసిన తమన్! -
భార్యకు విడాకులు.. దుబాయ్కు వెళ్లిందంటే అమ్మాయి చెడిపోయినట్లేనా?
సినీ నటుడు రఫీ- మహిన మున్నా విడిపోయారు. పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు మహిన ప్రకటించింది. దయచేసి అందుకు గల కారణాలు అడగవద్దని కోరింది. అలాగే తనపై వస్తున్న ఆరోపణలపైనా స్పందించింది. మహిన మాట్లాడుతూ.. నేను, రఫీ కలిసున్నామా? లేదా? అన్నది చాలామంది ప్రశ్న. లేదు, మేమిద్దరం విడిపోయాం. ఎందుకు? ఏమిటి? అనేది ఎవరూ అడగకండి. మా గురించి పేరెంట్స్ను, బంధువులను అడిగి వారిని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను.దుబాయ్కు వెళ్తే అంతేనా?నా జీవితంలో ఏం జరిగిందో నేను చెప్పాలనుకోవడం లేదు. మీరు అడగడం కూడా కరెక్ట్ కాదు. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దు. దుబాయ్కు వెళ్లాకే మహినా మారిపోయింది, రఫీని వదిలించుకుంది అని చెత్త కామెంట్లు చేస్తున్నారు. అవి నేను జీర్ణించుకోలేకపోతున్నాను. దుబాయ్కు వెళ్తున్న అమ్మాయిలందరూ చెడ్డవారేనా? నేను నా కెరీర్ కోసం ఇక్కడికి వచ్చాను. నా కాళ్లపై నేను నిలబడాలనుకున్నాను. నా పేరెంట్స్ బాగోగులు నేనే చూసుకోవాలనుకున్నాను. దుబాయ్కు రాగానే అమ్మాయిలు మారిపోతారు, చెడిపోతారనే మాటల్లో ఏమాత్రం నిజం లేదు.నేనేంటో మీకేం తెలుసు?నేనే కాదు, 95% మంది ఇక్కడికి పనికోసమే వస్తారు. ఏదో ఒకటి సాధించాలన్న లక్ష్యంగా పని చేస్తారు. నేను కూడా అలా స్వశక్తితో ఎదగాలని వచ్చాను. నా గురించి పనికిరాని కామెంట్లు చేసేవారికి నేనేంటో తెలీదు. నా గురించి తెలిస్తే అలా ఏది పడితే అది వాగరు. రఫీని మోసం చేశానని అనేవాళ్లూ ఉన్నారు. అమ్మాయిలే మోసం చేస్తారా? అబ్బాయిలు కూడా మోసం చేస్తారు. 100% మంచివాళ్లంటూ ఎవరూ ఉండరు.విడిపోవడమే మంచిదని..మేము కలిసుండటానికి ఎంతగానో ప్రయత్నించాం. అదిక జరగదని అర్థమయ్యాకే విడిపోయాం. దీని గురించి పదేపదే అడిగి అతడి పేరెంట్స్ను కూడా ఇబ్బంది పెట్టకండి. కలిసికట్టుగా ఉంటేనే జీవితం ముందుకు సాగుతుందని నాకూ తెలుసు. కానీ సఖ్యత చెడిపోయినప్పుడు ఆ బంధాన్ని అలాగే కొనసాగించేబదులు విడిపోవడమే మంచిది. మేము చేసిందదే! మా కారణాలు మాకున్నాయి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మేము కలిసున్నప్పుడు సంతోషాన్నే మీకు చూపించాం. కొందరు వారి కష్టాలు, బాధలు, పోట్లాటలు అన్నీ కూడా వీడియోలు చేసి చెప్తుంటారు. అలా చేయడం నాకిష్టం ఉండదు.ఫేమ్ చూసి పెళ్లి?రఫీకి ఉన్న పాపులారిటీ వల్లే నేనిక్కడిదాకా వచ్చానంటున్నారు. ఆయన ఫేమ్ చూసి నేను పెళ్లి చేసుకోలేదు. ఫేమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా కెరీర్ కోసం విడిపోయాం అని చెప్పుకొచ్చింది. రఫీ, మహినా.. 2022లో పెళ్లి చేసుకున్నారు. రఫీ.. చక్కపాలెం సీరియల్తో పాపులర్ అయ్యాడు. కనిమంగళం కోవిలగం అనే వెబ్ సిరీస్ చేశాడు. ప్రస్తుతం సుమతి వలవు మూవీ చేస్తున్నాడు.చదవండి: ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎప్పుడూ ఉండేదే.. త్వరలోనే నిజాలు బయటకొస్తాయ్ -
ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎప్పుడూ ఉండేదే.. త్వరలోనే నిజాలు బయటపడతాయ్
చెన్నై: కోలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన శ్రీరామ్.. తనకు మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నట్లు అంగీకరించాడు. మరో తమిళ నటుడు కృష్ణ కూడా ఈ డ్రగ్స్ వాడినట్లు సమాచారం అందించడంతో పోలీసులు ఆ నటుడిని వెతికే పనిలో పడ్డారు. ఈ వ్యవహారంపై తమిళ హీరో విజయ్ ఆంటోని (Vijay Antony) స్పందించాడు.విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడటం కొత్తేమీ కాదు. ఇక్కడ చాలాఏళ్లుగా ఈ సమస్య ఉంది. డ్రగ్స్ కేసులో శ్రీకాంత్ (టాలీవుడ్లో శ్రీరామ్) జైల్లో ఉన్నాడు. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అన్నాడు. మార్గన్ మూవీ జూన్ 27న విడుదల కానుంది.చదవండి: దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్ -
ఆయన కోపం, తిట్లు భరించలేకపోయా.. మధ్యలోనే వెళ్లిపోయా!
దర్శకుడు సాజిద్ ఖాన్ (Sajid Khan) సెట్లో తనను ఇబ్బంది పెట్టాడంటోంది బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా (Esha Gupta). సాజిద్ డైరెక్ట్ చేసిన హమ్షకల్ (2014) మూవీలో ఈషా హీరోయిన్గా నటించింది. ఆనాటి చేదు అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. నన్నెవరైనా చులకనగా చూస్తే అస్సలు ఊరుకోను. అలాంటిది సాజిద్ నన్ను సెట్లోనే తిట్టేవాడు. నేనెందుకు ఊరుకుంటాను? తిరిగి ఇచ్చిపడేసేదాన్ని. కొంతమందికి ఆలోచన తక్కువ.. ఫ్రస్టేషన్ ఎక్కువుంటుంది. సారీ చెప్పడంతో వెళ్లా..ఈయన పదేపదే కోప్పడుతుండేవాడు. ఎంతవరకని భరిస్తాం? అప్పటికే సినిమాను కష్టపడి ప్రమోట్ చేశాం. అయినా కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు. అందరిపైనా అరుస్తూ తన పరువు తనే తీసుకునేవాడు. ఓరోజు ఆయన వైఖరిపై కోపమొచ్చి నేరుగా కారెక్కి ఇంటికి వెళ్లిపోయాను. ఆ సినిమానే వదిలేయాలనుకున్నాను. కానీ నిర్మాత వాసు భగ్నానీ పిలిచి సారీ చెప్పడంతో వెళ్లాను. దర్శకుడు సాజిద్ కూడా క్షమాపణలు చెప్పాడు.. కానీ నా మనసులో మాత్రం ఆయన్ను క్షమించలేకపోయాను అని చెప్పుకొచ్చింది. సినీ జర్నీహమ్షకల్ మూవీలో సైఫ్ అలీ ఖాన్, రితేశ్ దేశ్ముఖ్, రామ్ కపూర్ హీరోలుగా నటించారు. తమన్నా భాటియా, బిపాషా బసు, ఈషా గుప్తా కథానాయికలుగా యాక్ట్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈషా గుప్తా సినీజర్నీ విషయానికి వస్తే.. 'జన్నత్ 2' (2012) చిత్రంతో కెరీర్ ప్రారంభించింది. తెలుగులో వీడెవడు మూవీ చేసింది. వినయ విధేయ రామలో 'ఏక్ బార్ ఏక్ బార్..' అనే ఐటం సాంగ్లో యాక్ట్ చేసింది. చివరగా 'వన్ డే: జస్టిస్ డెలివర్డ్' మూవీలో డీసీపీ లక్ష్మీగా నటించింది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్లో కనిపిస్తోంది.చదవండి: హార్దిక్తో డేటింగ్.. ముందే అది ఫిక్స్ అయ్యాం: బాలీవుడ్ నటి -
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఏమైంది?
-
దుబాయ్లో ‘గామా అవార్డ్స్’.. హాజరయ్యే హీరోహీరోయిన్లు వీళ్లే!
గల్భ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (గామా) ఐదవ ఎడిషన్కు రంగం సిద్ధమైంది. ఆగస్ట్ 30న దుబాయ్లోని షార్జా ఎక్స్పో సెంటర్లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం గ్రాండ్గా జరగనుంది. ఇందుకు సంబంధించిన థీమ్ సాంగ్ను దుబాయ్లో లాంచ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను రఘు కుంచె కంపోజ్ చేసి పాడారు. సందర్భంగా ‘గామా అవార్డ్స్’ చైర్మన్ త్రిమూర్తులు గారు మాట్లాడుతూ ‘ దుబాయ్ లో జరిగే ఏకైక అతి పెద్ద వేడుక గామా అవార్డ్స్. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్నాం. ఆగస్ట్ 30న జరగబోయే 5వ ఎడిషన్ను కూడా మన తెలుగు వారు అందరూ , ఈ కార్యక్రమానికి సహకరించి, అధిక సంఖ్యలో హాజరు అయ్యి విజయవంతం చేయాలి’అని కోరారు.దుబాయ్లో జరిగే ఈ ఈవెంట్కి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్ తో పాటు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొనబోతున్నారు. అలాగే హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించనున్నారు.ప్రత్యేక అతిధులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్విని దత్, డివివి దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిషోర్ తదితర ప్రముఖులు హాజరవనున్నారు.వీరితో పాటు పలువురు టాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు సర్ ప్రైజ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారు. అతిరథ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరగనున్న ఈ అవార్డ్స్ వేడుక కోసం చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
మీ కోడలు ఐశ్వర్యను ఎందుకు మెచ్చుకోరు?.. అమితాబ్ సమాధానం ఇదే?
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సీనియర్ హీరోలలో అమితాబ్ బచ్చన్ ఒకరు. సినిమా అప్డేట్లతో పాటు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు. అంతేకాదు సమయం దొరికినప్పుడల్లా లైవ్లోకి వచ్చి ఫ్యాన్స్తో చిట్చాట్ చేస్తుంటాడు. వారు అడిగే ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెబుతుంటాడు. తాజాగా ఓ అభిమాని.. అమితాబ్ని విమర్శిస్తూ అడిగిన ఓ ప్రశ్నకు తనదైన శైలీలో సమాధానం చెప్పాడు బిగ్బీ.కొడుకుపై మాత్రమే ప్రశంసలు..! అమితాబ్పై ఓ విమర్శ ఉంది. ఆయన ఎప్పుడూ కొడుకు అభిషేక్ బచ్చన్ని పొగుడుతూనే ఉంటాడని.. అదే కోడలు ఐశ్వర్య, భార్య జయా బచ్చన్లను ప్రశంసిస్తూ ఒక్క ట్వీట్ కూడా చేయడు. కొడుకుని ప్రశంసినట్లుగానే భార్య, కోడలుని ఎందుకు ప్రశంసించరని కొందరు ఆయనను ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఓ అభిమాని ఇదే ప్రశ్నను డైరెక్ట్గా అమితాబ్నే అడిగాడు. ఐశ్వర్య, జయా బచ్చన్లను ఎందుకు ప్రశంసించరని ప్రశ్నించాడు. దానికి బిగ్బీ ఇలా సమాధానం ఇచ్చాడు.పబ్లిక్గా ప్రశంసించను కానీ.. నిజమే.. నేను అభిషేక్ని ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటాను. అలాగే నా భార్య జయాబచ్చన్, కోడలు ఐశ్వర్యతో పాటు కూతురుని కూడా పొగుడుతుంటాను. కాకపోతే వారిని మనసులోనే మెచ్చుకుంటుంటాను. అది నాకు మహిళలపై ఉన్న గౌరవం’అని రిప్లై ఇచ్చాడు. మరో యూజర్..‘అమితాబ్ రిప్లై ఇచ్చే వారంతా పెయిడ్ ఫ్యాన్స్’ అని కామెంట్ చేయగా.. దానికి బిగ్బీ ఇలా రిప్లై ఇచ్చాడు. ‘పెయిడ్ ఫ్యాన్స్ అని నిరూపించగలవా? నీది చాలా చిన్న మైండ్. అందుకే అలా భావిస్తున్నావు. నువ్వు కూడా డబ్బులు పెట్టి అభిమానులను సంపాదించుకోవచ్చు కదా? అని బిగ్బీ కౌంటర్ ఇచ్చాడు. -
మీరు చేసిన సాయం జీవితాంతం గుర్తుంచుకుంటా: రష్మిక
తమిళ స్టార్ హీరో ధనుష్పై నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna ) ప్రశంసల వర్షం కురిపించింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన చేసే పనులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడింది. అందరితో చాలా మర్యాదగా మాట్లాడతాడని చెప్పు, అలాంటి గొప్ప నటుడితో పని చేయడం ఆనందంగా ఉందని సోషల్ మీడియా వేదికగా ధనుష్ని పొగడ్తలతో ముంచేస్తూ.. ఆయనతో దిగిన సెల్ఫీ ఫోటోని షేర్ చేసింది.‘మీతో అంతపెద్ద సినిమా(కుబేర) చేసినప్పటికీ.. మనమిద్దరం కలిసి ఒక్క సెల్ఫీ మాత్రమే తీసుకున్నాం. మీరు చాలా అద్భుతమైన వ్యక్తి. ప్రతి రోజు కష్టపడి పని చేస్తున్నందుకు ధన్యవాదాలు. మనం మాట్లాడుకున్న ప్రతి సారి వేరు వేరు నగరాల్లో ఉండేవాల్లం. విశ్రాంతి ఎంత అవసరమో చర్చించుకునే వాళ్లం కానీ..మనం మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. కుబేరలో మాత్రమే కాదు..ప్రతి సినిమాలోనే మీ నటన అద్భుతంగా ఉంటుంది. నాతోనే కాదు చుట్టూ ఉన్నవాళ్లతో చాలా మర్యాదగా మాట్లాడతారు. సెట్లో నాకోసం తెచ్చిన లడ్డూలను ఎప్పటికీ గుర్తించుకుంటాను. అలాగే నాకు తమిళ డైలాగుల విషయంలో మీరు చేసి సాయం.. నేను ఏదైనా డైలాగు చెబితే మీరు ప్రశంసించిన తీరు.. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అయినా.. జీవితాంతం గుర్తుంటాయి ధనుష్ సార్’ అని రష్మిక ఇన్స్టాలో రాసుకొచ్చింది.కుబేర( Kuberaa ) విషయానికొస్తే.. ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్ర పోషించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైన హిట్ టాక్ని సంపాదించుకుంది. ధనుష్ నటనపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్
చెన్నై: డ్రగ్స్ కేసులో సినీ హీరో శ్రీరామ్ (Sriram) అలియాస్ శ్రీకాంత్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. AIADMK మాజీ నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతో నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నుంగంబాక్కం స్టేషన్కు తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు. నటుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది.అసలేం జరిగింది?చెన్నైలోని ఓ బార్లో ఏఐఏడీఎమ్కే మాజీ నేత ప్రసాద్ తాగి గొడవకు దిగాడు. పోలీసులు అతడిచి అరెస్టు చేసి విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. హీరో శ్రీరామ్ కోసం ప్రదీప్ అనే వ్యక్తి తన దగ్గర కొకైన్ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్కు 40 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో శ్రీరామ్ను అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా డ్రగ్స్ వాడినట్లు తేలిందని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై హీరో శ్రీరామ్ స్పందించాల్సి ఉంది.శ్రీరామ్ సినీజర్నీ..శ్రీరామ్.. రోజా కూటం అనే తమిళ చిత్రంతో హీరోగా ప్రయాణం ప్రారంభించాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దడ, నిప్పు, లై, 10th క్లాస్ డైరీస్,స్నేహితులు(డబ్బింగ్ మూవీ), పిండం, రావణాసుర.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చదవండి: ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది -
ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆమిర్ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007)కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కింది. జూన్ 20న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.తాజాగా ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu) రివ్యూ ఇచ్చాడు. సితారే జమీన్ పర్.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని రాసుకొచ్చాడు.సితారే జమీన్ పర్ మూవీలో ఆమిర్ ఖాన్, జెనీలియా జంటగా నటించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆమిర్ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. #SitaareZameenPar …Shines so bright and how…..It’ll make you laugh, cry and clap!! Like all Aamir Khan’s classics, you’ll walk out with a big smile on your face… Love and Respect..♥️♥️♥️#AamirKhan @geneliad @r_s_prasanna @AKPPL_Official @ShankarEhsanLoy #AmitabhBhattacharya…— Mahesh Babu (@urstrulyMahesh) June 22, 2025 చదవండి: మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
అతడు, సైనికుడు సినిమాల్లో సూపర్స్టార్ మహేశ్బాబు(Mahesh Babu)తో జోడీ కట్టింది హీరోయిన్ త్రిష (Trisha Krishnan). నిజానికి ఈ బ్యూటీకి మహేశ్ సినీ ఇండస్ట్రీలోకి రాకముందే తెలుసు. వీరిద్దరూ చెన్నైలోనే కాలేజీ విద్య పూర్తి చేశారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మహేశ్, త్రిష మధ్య పరిచయం ఏర్పడింది. కానీ యాక్టర్స్ అవుతామని అస్సలు అనుకోలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదే ఇంటర్వ్యూలో మహేశ్ గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.షూటింగ్ అయిపోగానే..త్రిష మాట్లాడుతూ.. మహేశ్ అద్భుతమైన నటుడు. నాకు ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరు. పెద్ద స్టార్ అయినప్పటికీ తోటి నటులను ఎంతో గౌరవిస్తారు. చాలామందికి అది చేతకాదు. తను చాలా ప్రొఫెషనల్. చాలా హార్డ్వర్క్ చేస్తారు. నాకేమో.. షూటింగ్ అయిపోగానే అలసటతో త్వరగా ఇంటికి వెళ్లిపోదామనిపిస్తుంది. కానీ వేకువజామునే సెట్కు వచ్చిన మహేశ్ మాత్రం రాత్రి 10.30 గంటలవరకు అక్కడే ఉంటాడు. అలా ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యాను.ఎప్పుడూ మానిటర్ దగ్గరే..తను వానిటీ వ్యాన్కు వెళ్లగా నేనెప్పుడూ చూడలేదు. తన సీన్ షూట్ లేనప్పుడు కూడా.. మానిటర్ దగ్గరే కూర్చునేవారు అని చెప్పుకొచ్చింది. త్రిష చివరగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించింది. మహేశ్బాబు SSMB29 సినిమా చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్ -
త్రిప్తి డిమ్రి ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమెలాగే హెయిర్కట్..
‘ఆ ఛాన్స్ నాకు ఎక్కడ దక్కుతుంది?’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన త్రిప్తికి.. కొన్ని రోజుల్లోనే ఆ అవకాశం పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ చుట్టూ తిరిగి చివరకు ఆమెనే వరించింది. దీపికా పదుకొణే ప్లేస్ని భర్తీ చేసిన త్రిప్తి తాజా జర్నీ ఆసక్తికరమే కాదు, ఆశ్చర్యకరమైనది కూడా!టాలీవుడ్లోనూ గుర్తింపుబాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి (Tripti Dimri).. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాలో నటించి టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడదే దర్శకుడు ప్రభాస్తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకొని ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. త్రిప్తి.. దీపికా పదుకొణెకు పెద్ద అభిమాని. చిన్నతనంలో ‘చాందినీ చౌక్ టు చైనా’ సినిమాలో దీపికా లుక్ చూసి, అదే స్టయిల్లో హెయిర్ కట్ చేసుకుందట!మందు జోలికి వెళ్లనుమొన్నటి వరకు టీ ఎక్కువగా తాగే త్రిప్తి, ఇప్పుడు కాఫీ మీద మక్కువ పెంచుకుందట. టీ, కాఫీ తప్ప... ఇప్పటివరకు ఎప్పుడూ ఆల్కహాల్ టేస్ట్ చేయలేదని, భవిష్యత్తులో చేయాలనే ఆలోచన కూడా లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇండియన్ సినిమాల్లో న్యూడ్గా నటించేందుకు ధైర్యం చేసిన అరుదైన నటీమణుల్లో త్రిప్తి ఒకరు. ‘యానిమల్’లో బోల్డ్ సీన్లు చేసిన తర్వాత స్టార్ అయింది. అయితే ఆ సీన్లు చూసి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారని ఒప్పుకుంది. అయినా కెరీర్ కోసం ఇలాంటి సాహసాలు అవసరమే అంటోంది.యానిమల్ మూవీతో దశ తిరిగిందిత్రిప్తి 2017లో ‘పోస్టర్ బాయ్స్’ సినిమాతో రంగ ప్రవేశం చేసింది. ‘లైలా మజ్ను’, ‘బుల్ బుల్’ వంటి చిత్రాల్లో నటించినా పెద్దగా పాపులారిటీ రాలేదు. చిన్నప్పటి నుంచే టాప్ హీరోయిన్ కావాలని కలలు కన్న త్రిప్తి, అవి నెరవేరక మొదట్లో చాలా డిజప్పాయింట్ అయిందట! సరిగ్గా అలాంటి సమయంలో ‘యానిమల్’ ఛాన్స్ రావడంతో వదులుకోలేకపోయింది. ఆ సినిమా ఆమె కెరీర్ను ఊహించని ఎత్తులకు చేర్చింది. రష్మిక మందన్నా కన్నా త్రిప్తికి ‘ఛోటా భాభీ’గా ఎక్కువ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ సినిమాలుఆ తర్వాత కూడా బోల్డ్ కథలే త్రిప్తిని వెతుక్కుంటూ వచ్చాయి. ‘బ్యాడ్ న్యూస్’ చిత్రంలో ఇద్దరు బాయ్ఫ్రెండ్స్లో ఎవరి వల్ల గర్భం దాల్చిందో తెలియని యువతి పాత్రలో నటించింది. అలాగే, ‘విక్కీ విద్యా కా వోహ్ వాలా వీడియో’ అనే సినిమా హాలీవుడ్ సెక్స్ టేప్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది. కొత్తగా పెళ్లైన జంట తమ మొదటి రాత్రిని షూట్ చేయడం, ఆ వీడియో లీక్ కావడం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావుతో కలిసి నటించింది.విమర్శలుత్రిప్తి నటనపై, డ్యాన్స్పై కొన్ని విమర్శలు వచ్చినా.. గ్లామర్, టాలెంట్, సక్సెస్ వల్ల అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ‘యానిమల్’లో న్యూడ్ సీన్ తీసే సమయంలో డైరెక్టర్, హీరో ఎంతో మద్దతు ఇచ్చారని తెలిపింది. ఆ సీన్ను చాలా అందంగా చూపించారని, ఏ కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినా షూటింగ్ ఆపేస్తామని మాట ఇచ్చిన తర్వాతే షూట్ చేశారని చెప్పింది త్రిప్తి.స్పిరిట్లో నేనా?ఒకసారి ఓ జర్నలిస్టు త్రిప్తిని ‘స్పిరిట్ సినిమాలో మీకు ఛాన్స్ వస్తుందా?’ అని అడిగినప్పుడు ‘ఒక్క శాతం కూడా అవకాశం లేదు. అంత పెద్ద ప్రాజెక్ట్లోకి ఎలా వస్తాను?’ అని ఆశ్చర్యంగా అంది. పైగా సందీప్ రెడ్డి వంగా తనకే మళ్లీ ఛాన్స్ ఇస్తాడా? అంటూ ఎదురు ప్రశ్నించింది. కానీ, విధి, సినిమా రంగం రెండూ మాయామయం! చివరకు దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తి వచ్చి చేరింది.చదవండి: షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్? -
షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్?
బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ బరుచ (Nushrratt Bharuccha) విమర్శలపాలైంది. యోగా ఈవెంట్కు వెళ్లి ఆమె చేసిన పనికి అందరూ ఆమెను తిట్టిపోస్తున్నారు. అసలేం జరిగిందంటే.. శనివారం నాడు ముంబైలో జరిగిన యోగా ఉత్సవాల్లో నుష్రత్ పాల్గొంది. తెలుపు దుస్తుల్లో అక్కడికి హాజరైన ఆమెకు సొంతంగా షూలు విడిచేందుకు కూడా కష్టమైంది. అక్కడున్న మహిళా వాలంటీర్ల సాయం తీసుకుంది. అమ్మాయి కింద కూర్చుని హీరోయిన్ కాలు పట్టుకుని ఆమె షూ లేస్ తీసింది.. ఇంతలో నుష్రత్.. మరో కాలి షూ కూడా తీసేయమని వేలు పెట్టి చూపించింది. దీంతో ఆమె మరో కాలి షూ కూడా తీసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.అది కూడా చేతకాదా?'నీ చేతులతో నువ్వు షూ లేస్ తీసేసి పక్కన విడిచిపెట్టలేవా?', 'నీ కాలికున్న షూలు తీసుకోలేవు కానీ యోగా చేస్తున్నావా?', 'నువ్వింకా చిన్న పిల్ల అనుకుంటున్నావా? డబ్బు, పాపులారిటీ చూశాక గర్వం తలకెక్కినట్లుంది' అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నుష్రత్.. చివరగా చోరీ 2 సినిమాలో కనిపించింది. విశాల్ ఫ్యురియా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమె తెలుగులో శివాజీ తాజ్మహల్ (2010) మూవీలో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by TCX.official (@tellychakkar) చదవండి: న్యూజిలాండ్లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్బాబు -
ఆ 20 శాతం కోసమే తెలుగమ్మాయిలు కొట్టుకోవాలి : అనన్య నాగళ్ల
టాలీవుడ్లో తెలుగమ్మాయిలకు అవకాశాలు చాలా తక్కువ అనే కంప్లైంట్ ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇప్పటికీ కొనసాగుతుందని చెబుతోంది యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల(Ananya Nagalla). టాలీవుడ్లో తెలుగమ్మాయిలకు 20 శాతం మాత్రమే అవకాశాలు వస్తాయని..దాని కోసమే పదేళ్లు కొట్టుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో వివరించింది. ‘తెలుగు అమ్మాయిలను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. ఇండియాలో ఏ లాంగ్వేజ్ అమ్మాయికి అయినా ఇంత కష్టం ఉండదేమో. తెలుగులో మన వాళ్లకు 20 శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. వందలో 80 సినిమాలకు పరభాష హీరోయిన్లనే తీసుకుంటారు. అదే మలయాళం, తమిళ్ తో పాటు ఇతర భాషల్లో చూస్తే..అక్కడ లోకల్ అమ్మాయిలకే 80 శాతం అవకాశం ఇస్తారు. ఇలా ఎక్కడ చూసిన తెలుగు అమ్మాయిలకు 20 శాతం మాత్రమే చాన్స్ ఉంటుంది. ఇందులోనే తమ టాలెంట్ని నిరూపించుకోవాలి. చిన్నప్పటి నంచి సినిమాలు చూసి ఇష్టం పెంచుకొని, పెరెంట్స్ ఒప్పించి ఇండస్ట్రీలోకి వస్తే.. ఈ 20 శాతం కోసమే పదేళ్లు కొట్టుకోవాలి. మిగతావాళ్లకి లోకల్తో పాటు మన దగ్గర కూడా 80 శాతం అవకాశాలు ఉంటాయి. అందుకే నాకు తెలుగు అమ్మాయిలను చూస్తే గర్వంగా ఉంటుంది. వాళ్లు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు’ అని అనన్య చెప్పుకొచ్చింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో పొట్టేల్ సినిమాకు గాను తనకు వచ్చిన స్పెషల్ జ్యూరీ గద్దర్ అవార్డు గురించి మాట్లాడుతూ.. ఇలాంటి అవార్డు తనకు వస్తుందని అసలు ఊహించలేదని చెప్పింది. ‘అవార్డులు ప్రకటించిన రోజు నా మూడ్ బాగోలేదు. ఇంట్లో పడుకొని ఉన్నాను. లేవగానే.. పాజిటివ్ విషయం గురించి థింక్ చేస్తూ.. ఏదైనా అవార్డు వస్తే బాగుండు అనుకున్నాను. అయితే ఆ రోజు గద్దర్ అవార్డులు ప్రకటిస్తారనే విషయం కూడా నాకు తెలియదు. బెడ్ రూం నుంచి హాల్లోకి రాగానే.. టీవీలో గద్దర్ అవార్డుల ప్రకటన న్యూస్ చూస్తూ.. ‘ఇంత మంచి సినిమాలు చేస్తున్నా..నాక్కుడా వస్తే బాగుండు’ కదా అని అన్నయ్యతో చెబుతున్నా..అంతలోనే నాకు పొట్టేల్ మూవీ నిర్మాత ఫోన్ చేసి‘మన సినిమాకు అవార్డు వచ్చింది’ అని చెప్పగానే షాక్ అయ్యాను. ఆరేళ్ల కెరీర్లో మీడియాతో పాటు ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేశారు. అందుకే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను’ అని అనన్య చెప్పుకొచ్చింది -
చిన్న వయసులో విగతజీవిగా మారిన నటుడు
మరాఠీ నటుడు తుషార్ ఘడిగోయెంకర్ (34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబై గోరెగావ్లోని అద్దెకుంటున్న ఫ్లాట్లో శుక్రవారం విగతజీవిగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల నివేదిక ప్రకారం.. శుక్రవారం రోజు.. రామ్ మందిర్ రోడ్లో ఓ ఫ్లాట్లోని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు కంట్రోల్ రూమ్కు ఫోన్కాల్ వచ్చింది. అపస్మారక స్థితిలో?వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా తుషార్ నేలపై స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అతడిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రంగుల ప్రపంచంలో రాణించాలనుకుని ఇండస్ట్రీకి వచ్చిన తుషార్కు పెద్దగా అవకాశాలు దొరక్కపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఏడాది కాలంగా మద్యానికి బానిసయ్యాడని పోలీసులు చెప్తున్నారు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నటుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా తుషార్.. మరాఠీ సినిమాల్లోనే కాకుండా థియేటర్ ఆర్టిస్టుగానూ రాణించారు. ఘంట నాద్ ప్రొడక్షన్ పేరిట సొంతంగా ఓ మ్యూజిక్ వీడియో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఎంతో ప్రతిభ ఉన్న ఆయన.. ఇలా చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.చదవండి: ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు -
ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు సినిమా
కొన్ని చిత్రాలు థియేటర్స్లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతున్నాయి. అలాంటి చిత్రాల్లో ‘చౌర్యపాఠం’ ఒకటి. ఇటీవల ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ చిత్రం 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్తో టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఆడియన్స్ను కట్టిపడేసింది. ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడానికి కారణం ఏంటంటే... కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ, నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా, ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించారు.నిధుల కోసం ధనపల్లి అనే గ్రామంలోని బ్యాంకును దోచుకోవడానికి ఒక చిన్న ముఠాతో కలిసి పథకం వేసే దర్శకుడిగా అతడి నటన ఆకట్టుకుంటుంది. నక్కిన నరేటివ్స్ బ్యానర్పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. -
ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు
‘‘కన్నప్ప’ సినిమా ఆ భగవంతుని ఆశీస్సులు. మన చేతుల్లో ఏదీ ఉండదు అనడానికి ఉదాహరణే ఈ చిత్రం. రెండు సినిమాలు హిట్ అవగానే మనం గొప్పవాళ్లమని అనుకుంటాం. కానీ, మనం కేవలం వస్తువులమే. ఆ భగవంతుడు, తల్లిదండ్రుల ఆశీస్సులే ముందుకు నడిపిస్తాయి’’ అని మంచు మోహన్ బాబు అన్నారు. విష్ణు మంచు హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్.. మంచు మోహన్బాబు, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, శరత్కుమార్, మధుబాల తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్ బాబు మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’లో అందరూ హీరోలే. ఈ చిత్రంలో నటించిన నటీనటుల సహాయ, సహకారాలు మరువలేనివి. కన్నప్పగా తిన్నడు ఎలా మారాడు? పరమేశ్వరుడికి కళ్లు ఎలా ఇచ్చాడు? అన్నది ఈ చిత్రకథ. శ్రీ కాళహస్తీశ్వరుడి కరుణ, కటాక్షాలతో ‘కన్నప్ప’ సక్సెస్ అవ్వాలి. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. మంచు విష్ణు(Manchu Vishnu) మాట్లాడుతూ– ‘‘ఇది నా సినిమా కాదు... కన్నప్ప సినిమా. ఎడిటింగ్లో సినిమా చూసిననప్పుడు.. ‘వావ్.. ఇంత పెద్ద సినిమానా? మేము చేయగలిగామా? నేను నటించానా?’ అనిపించింది. ఈ సినిమాలో చాలామంది హీరోలున్నారు. నటించినవారు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్... అందరూ హీరోలే. నేను పని చేసిన బెస్ట్ దర్శకుల్లో ముఖేష్ కుమార్గారు ఒకరు. శివుడి అనుగ్రహం వల్లే ఇంత పెద్ద సినిమా తీయగలిగానని శివ రాజ్కుమార్గారితో అన్నాను. ‘కన్నప్ప’ సినిమా చేయాల్సిన అవసరం ప్రభాస్కి లేదు. కానీ, నాన్నగారిపైన ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఒప్పుకున్నారు. కొంచెం డబ్బు, పేరు రాగానే మనుషులు మారిపోతుంటారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని పెద్ద నటుల్లో ప్రభాస్(Prabhas) ఒకరు... కానీ, మేమిద్దరం కలిసిన మొదటి రోజు నుంచీ ఈరోజు వరకు కూడా అలాగే ఉన్నాం. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు అయితే... తన జీవితంలో నేను కర్ణుడిని. ఈ సినిమాకి ఏది సాధ్యమైంది అన్నా అది నా దేవుడైన నాన్నగారి వల్లే. ‘కన్నప్ప’ని ప్రేక్షకులు మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’ సినిమాని ఆదరించండి... అభిమానించండి... అల్లరి మాత్రం చేయకండి. ఎందుకంటే శివుడు ప్రతి ఇంటా, ప్రతి గుండెలోకి, ప్రతివాళ్ల మనసులోకి చేరాలి’’ అన్నారు.ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ– ‘‘మోహన్ బాబుగారు నన్ను నమ్మడం వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. తెలుగు భాష కూడా తెలియని నన్ను నమ్మి, టాలీవుడ్కి తీసుకురావడం, గొప్ప ప్రాజెక్ట్ ఇవ్వడమంటే ఆయన ధైర్యం, నమ్మకమే. నేను పని చేసిన నటుల్లో విష్ణు మంచు మోస్ట్ ప్రిపేర్డ్ యాక్టర్. ప్రభాస్గారు మీకు రెబల్స్టార్. కానీ, నాకు తెలిసి ఆయన హంబుల్ స్టార్. సింపుల్గా ఉంటారు’’ అన్నారు. -
ఆసక్తిరంగా "స:కుటుంబానాం" టీజర్
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే వెళ్తుంది అని చెప్పచ్చు. ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీనీ హేట్ చేస్తూ కనిపించిన ఈ టీజర్ తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక రచయిత ఉదయ్ శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్, రామ్ కిరణ్, మేఘా ఆకాష్, బ్రహ్మానందం, సత్య, గిరి, భద్రం ముఖ్య తారాగణంగా.. ప్రేక్షకులని అలరించబోతున్నారు.ఈ చిత్ర టీజర్ విషయానికి వస్తే ఒక పక్క నుండి అర్జున్ రెడ్డి లాంటి వైబ్స్ కనిపిస్తూనే మరోపక్క కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని అర్థమవుతుంది. టీజర్ లోని ప్రతి డైలాగ్, విజువల్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే సత్య, బ్రహ్మానందం గారి హాస్యం చిత్రంలో బాగా పండుతుందని అనిపిస్తుంది. మేఘా ఆకాష్ మంచి క్యారెక్టర్ ప్లే చేసినట్లు అర్థమవుతుంది. రామ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో ఒక మార్క్ సృష్టిస్తారు నడిపించేలా తన ప్రెసెన్స్ & పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కుటుంబం విషయాలలో హీరో ఉద్దేశం అందరిలా సహజంగా ప్రేమగా కాకుండా కాస్త కొత్తగా ఉంటుందని ఈ చిత్ర టీజర్ అనిపిస్తుంది. టీజర్ లోని సంగీతం చాలా బాగుంది. -
చీప్గా చూశారు, దెబ్బకు తిరిగి వెళ్లిపోతాననుకున్నారు: నటి
సినీ నటిగా, యాంకర్గా మందిరా బేడీ (Mandira Bedi) అందరికీ సుపరిచితురాలు. క్రికెట్ ఈవెంట్స్కు కూడా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే ఆ సమయంలో ఎవరూ తనను లెక్క చేయలేదని, చులకనగా చూశారంటోంది నటి. జూమ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మందిరా బేడీ మాట్లాడుతూ.. ఏదైనా డిఫరెంట్గా చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ మనల్నే పరిశీలిస్తుంటారు. ఏదో ఒకటి అనేందుకు సిద్ధంగా ఉంటారు. అది వారి అభిప్రాయం అనుకోండి.మొదటివారమే డిజాస్టర్కొందరు మనల్ని ఇష్టపడతారు. మరికొందరేమో ద్వేషిస్తారు. అయితే నాకు టీమ్ నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఉండేది. అలా మొదటిసారి ఒక టోర్నమెంట్లో హోస్టింగ్ చేశాను. కానీ మొదటివారమే డిజాస్టర్ అయింది. మా టీమ్ నన్ను పిలిచి నీమీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాము. నువ్వేం భయపడకు. వెయ్యిమంది అమ్మాయిల్ని ఆడిషన్ చేశాకే నిన్ను తీసుకున్నాం. నీలో ఆ సత్తా ఉంది అని ప్రోత్సహించారు.మైండ్సెట్ మార్చా..ఆ మాటలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఇంత మంచి అవకాశం ఎవరికి దక్కుతుంది? భయపడి వెనకడుగు వేయడం దేనికి? అని ఆలోచించాను. ఉత్సాహంగా ముందుకు సాగాను. నెమ్మదిగా ప్యానెల్లో, ప్రేక్షకుల్లో నాపై ఉన్న అభిప్రాయాలు మారాయి. చాలామంది మైండ్సెట్ను నేను మార్చగలిగాను. నిజానికి ప్యానెల్లో ఉన్న వారికి నేనుండటమే ఇష్టం లేదు. నాకు కాస్తైనా మర్యాద ఇచ్చేవారు కాదు. చీప్గా చూసేవారు, పక్కన పడేసేవారు. డమ్మీ అని తిట్టారుమొదట్లో బాధపడ్డాను. కానీ నేనెందుకు తలదించుకోవాలనుకున్నాను. వాళ్లు వినిపించుకోకపోయినా ఒకటికి రెండుసార్లు ప్రశ్నలు అడిగేదాన్ని. కెమెరాలున్నాయి కాబట్టి వాళ్లు చచ్చినట్లు సమాధానం చెప్పేవాళ్లు. ఈమె తిరిగి వెళ్లిపోయేలా లేదని వాళ్లకర్థమైంది. చివరకు నన్ను ప్యానెల్లో మెంబర్గా స్వీకరించారు. సోషల్ మీడియాలో కూడా నేనో తెలివితక్కువదాన్ని, డమ్మీ అని తిట్టేవారు. నేనేదీ లెక్కచేయలేదు.యాంకర్గా, నటిగా..ఇక సౌతాఫ్రికా టోర్నమెంట్ నుంచి తిరిగి రాగానే నా ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు. జనాలు నా గురించి తెలుసుకోవాలని ఆరాటపడ్డారు. అలా రోజుకు నాలుగైదు ఇంటర్వ్యూలు ఇచ్చాను అని చెప్పుకొచ్చింది. పలు హిందీ సీరియల్స్లో యాక్ట్ చేసిన మందిరా.. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ (2003, 2007), ఛాంపియన్స్ ట్రోఫీ (2004, 2006)లకు హోస్టింగ్ చేసింది. మన్మథుడు, సాహో వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. చివరగా ఐడెంటిటీ అనే మలయాళ చిత్రంలో నటించింది.చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్ -
నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్
నా జోలికొస్తే ఊరుకుంటానేమో కానీ నా కూతురి జోలికొస్తే మాత్రం అంతు చూస్తానంటోంది హీరోయిన్ కాజోల్ (Kajol). ప్రస్తుతం ఆమె మా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజోల్.. తన కూతురిని ట్రోల్ చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా.. నా కూతుర్ని విమర్శించేవాళ్లెవరూ నా కారు ముందుకు రావొద్దు. నా కారు ముందుకొచ్చారంటే..ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో మిమ్మల్ని ఢీ కొట్టి మీ శరీరాలపై నుంచే నా కారును పోనిస్తాను. సోషల్ మీడియాలో వెయ్యి మెసేజ్లు వస్తే అందులో 999 తను అందంగా ఉంది, మీరు అమేజింగ్.. ఇటువంటి కామెంట్లే ఉంటాయి. కానీ ఏదో ఒక్కటి మాత్రం బ్యాడ్ కామెంట్ ఉంటుంది. అలా చెత్త వాగుడు వాగేవారు ఎందుకున్నారో అర్థం కాదు. అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను. చెడు గురించి కాదు అని చెప్పుకొచ్చింది.హారర్ సినిమాహారర్ సినిమాలను మ్యూట్లో పెట్టుకునే చూసే కాజోల్.. తొలిసారి ఈ జానర్లో నటిస్తోంది. విశాల్ ఫ్యురియా దర్శకత్వం వహిస్తున్న మా చిత్రంలో రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్గుప్తా, కెరిన్ శర్మ, నితిన్, సూర్జ్యశిఖ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాజోల్ చివరగా క్రూ సినిమాలో నటించింది. కాజోల్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్.. 1999లో పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరికి కూతురు నైసా జన్మించింది. 2010లో కుమారుడు యుగ్ పుట్టాడు.చదవండి: ఎయిరిండియాకు నటుడి సపోర్ట్.. ఫ్రీ టికెట్ ఇచ్చారా? -
హీరోయిన్ అంటే గ్లామర్ అనుకుంటివా..ఫైర్.. ‘తగ్గేదే లే’
ఒకరు తుపాకీ పట్టుకున్నారు.... మరొకరు ఖడ్గం అందుకున్నారు... ఇంకొకరు చేతికి దొరికిన ఆయుధం తీసుకున్నారు... చూడ్డానికి సున్నితంగా కనిపించే ఈ భామలందరూ ఇలా ‘వెపన్స్’ పట్టుకున్నది విలన్లను రఫ్ఫాడించడానికే. ప్రస్తుతం బాలీవుడ్ పాపులర్ హీరోయిన్లు కొందరు ‘యిన్ యాక్షన్’ అంటూ యాక్షన్ రోల్స్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్పై మెరుపు తీగల్లా కనిపించే ఈ తారలు మెరుపు వేగంతో ఫైట్స్ చేయడానికి ‘సై’ అన్నారు. ఆ పోరాటాల్లోకి వెళదాం. శివానీ రిటర్న్స్ శివానీ శివాజీ రాయ్ని తొలిసారి ప్రేక్షకులు ‘మర్దానీ’ (2014) చిత్రంలో చూశారు. ఈ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను రాణీ ముఖర్జీ అద్భుతంగా చేశారు. ఆ సినిమాకి సీక్వెల్గా వచ్చిన ‘మర్దానీ 2’ (2019)లోనూ పోలీస్గా విజృంభించారు రాణి. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. మరోసారి శివానీ శివాజీ రాయ్గా ‘మర్దానీ 3’లో కనిపించనున్నారు రాణీ ముఖర్జీ. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో తొలి భాగం ‘మర్దానీ’ని, రెండో భాగాన్ని గోపీ పుదిరన్ దర్శకత్వంలో నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ మూడో భాగం ‘మర్దానీ 3’ని అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తొలి, మలి భాగాల్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా చేసిన రాణీ ముఖర్జీ ‘మర్దానీ 3’లోనూ ఆ పాత్ర చేస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్లో రాణి చేసిన యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పదేళ్ల క్రితం ఫస్ట్ పార్ట్లో ఎంత ఎనర్జిటిక్గా కనిపించిందో ఇప్పుడూ అలానే కనిపిస్తోందనే కితాబులు ఆమెకు దక్కాయి. ఇక సినిమాలో ఏ రేంజ్లో విజృంభించారో చూడాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఆగాల్సిందే. ‘‘చెడుపై పోరాటం చేసే శివానీ శివాజీ రాయ్ని తెరపైకి తీసుకురావడానికి హోలీ కన్నా మంచి సమయం ఏం ఉంటుంది. 2026 మార్చి 4న హోలీ. ఓ వారం ముందే ఫిబ్రవరి 27న మా శివానీ థియేటర్స్కి వస్తుంది’’ అని యశ్ రాజ్ సంస్థ ఓ సందర్భంలో పేర్కొంది. వారియర్ క్వీన్ సిల్వర్ స్క్రీన్పై మెరుపు తీగలా కనిపించే దీపికా పదుకోన్ మెరుపు వేగంగా ఫైట్ చేయడం కూడా చూశాం. అందుకు ఉదాహరణగా ఈ మధ్య వచ్చిన చిత్రాలు ‘పఠాన్, ఫైటర్, సింగమ్ ఎగైన్’లను చెప్పుకోవచ్చు. ఇప్పుడు సౌత్ సినిమాలో తన యాక్షన్ని చూపించడానికి రెడీ అయ్యారు దీపికా పదుకోన్. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ΄పాన్ ఇండియన్ మూవీ ‘ఎఎ22 ఎ6’ (వర్కింగ్ టైటిల్)లో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె వారియర్ క్వీన్గా కనిపించనున్నారు. ఈ పోరాట యోధురాలికి సంబంధించిన లుక్ని ఇటీవల విడుదల చేయగా, దీపిక ఆ లుక్లో పవర్ఫుల్గా కనిపించారు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’లో దీపికా పదుకోన్ కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు ‘ఎఎ22 ఎ6’లో పూర్తి స్థాయి కథానాయికగా వారియర్ క్వీన్గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని సమాచారం. షాపింగ్ మాల్లో ఫైట్ ఎన్టీఆర్–హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందిన ‘వార్ 2’పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ మాస్ హీరోలిద్దరూ సిల్వర్ స్క్రీన్పై ΄పోటా పోటీగా చేసిన వార్ని చూడ్డానికి ఇద్దరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా... ఈ చిత్రంలో మరో లీడ్ రోల్లో నటించిన కియారా అద్వానీ కూడా ఫైట్ చేశారట. నిజానికి ‘వార్ 2’ టీజర్లో కియారా ఎల్లో కలర్ బికినీలో గ్లామరస్గా కనిపించి, హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఇంత హాట్గా కనిపిస్తూనే మరోవైపు ఇదే సినిమాలో ఓ షాపింగ్ మాల్లో డైనమిక్ ఫైట్లోనూ కుర్ర కారు గుండె లబ్ డబ్ పెంచనున్నారు. ఈ ఒక్క ఫైట్ మాత్రమే కాదు... మరికొన్ని ఫైట్ సీన్స్ కూడా చేశారట. ‘ఎట్రాక్షన్ మాత్రమే కాదు యాక్షన్’ కూడా అన్నమాట. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. లేడీ డాన్ కృతీ సనన్ వెండితెరపై తొలిసారి ఓ రేంజ్లో ఫైట్స్లో విజృంభించిన చిత్రం ‘గణపత్’ (2023). ఈ చిత్రంలో చేసిన జస్సీ సింగ్ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్లో ఓ కళ అయిన ‘నన్చాకు’ని నేర్చుకున్నారు. ఇప్పుడు రెండేళ్లకు మరోసారి ఫైట్స్లో స్పెషల్గా ట్రైనప్ అవుతారట. కృతీ సనన్కి వచ్చిన ఆఫర్లాంటిది మరి. ఈ బ్యూటీ లేడీ డాన్గా కనిపించనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్యారెక్టర్ కోసమే శిక్షణ తీసుకోనున్నారట. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో వచ్చిన ‘డాన్, డాన్ 2’ చిత్రాలకు ఉన్న క్రేజ్ తెలిసిందే. అయితే ఈ సిరీస్లో భాగంగా రూపొందనున్న ‘డాన్ 3’లో ఈసారి రణ్వీర్ సింగ్ డాన్గా కనిపించనున్నారు. లేడీ డాన్గా కియారా అద్వానీని ఖరారు చేశారు. కానీ ఆ తర్వాత కియారా ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ కావడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పట్నుంచి ఈ పాత్రకు పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. ఆ పేర్లలో కృతీ సనన్ పేరు కూడా ఉంది. ఫైనల్లీ కృతీ సనన్నే ఫిక్స్ చేశారట చిత్ర దర్శక–నిర్మాత ఫర్హాన్ అక్తర్. ఈ ఏడాదే ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. మహిళా గూఢచారుల కథ ఇద్దరు మహిళా గూఢచారులు బరిలోకి దిగారు. ఈ ఇద్దరూ ప్రమాదకరమైన మిషన్లు ఎదుర్కొంటారు. తగ్గేదే లే అంటూ సాహసాలు చేస్తారు. ఈ ఇద్దరూ చేసిన సాహసాలేంటి? అనేది ‘ఆల్ఫా’ చిత్రంలో చూడాల్సిందే. ఆలియా భట్, శార్వరీ ఏజెంట్స్గా నటిస్తున్న చిత్రం ఇది. శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నారు. వైఆర్ఆఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) యూనివర్స్లో భాగంగా రూపొందుతున్న చిత్రం ‘ఆల్ఫా’. ఈ యూనివర్స్లో భాగంగా వచ్చిన గూఢచారుల చిత్రాల్లో హీరోలు లీడ్ రోల్స్ చేశారు. అయితే ఈ స్పై యూనివర్స్లో మహిళా గూఢచారులే ప్రధాన పాత్రలుగా వైఆర్ఆఫ్ నిర్మిస్తున్న తొలి చిత్రం కావడంతో ‘ఆల్ఫా’పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఆలియా, శార్వరీ రిస్కీ స్టంట్స్ చేశారట. ఈ సినిమా షూటింగ్ ఆరంభించే ముందు ఇద్దరు నాయికలకు ఫైట్స్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాబీ, ఆలియా పాల్గొనగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ల నేతృత్వంలో భారీ పోరాట సన్నివేశం చిత్రీకరించారని, ఇంకా బోలెడన్ని రిస్కీ ఫైట్స్ ఉన్నాయని బాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో ఆలియా భట్ గురువు ΄ాత్రలో స్టార్ హీరో హృతిక్ రోషన్ కనిపించనున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో డిసెంబరు 25న విడుదల కానుంది. పగ తీర్చుకోవడానికి... సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ చిత్రంలో బోల్డ్ క్యారెక్టర్లో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నటించారు త్రిప్తీ దిమ్రి. తనలో మంచి గ్లామరస్ నటి ఉందనే విషయాన్ని నిరూపించుకున్నారామె. మళ్లీ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారీ బ్యూటీ. అయితే ఈ చిత్రంలో త్రిప్తి పాత్ర ఏంటనే వివరాలు బయటకు రాలేదు. కాగా తనలో మంచి యాక్షన్ హీరోయిన్ ఉన్న విషయాన్ని నిరూపించుకోవడానికి రెడీ అయిపోయారు ఈ హీరోయిన్. ఓ హిందీ చిత్రంలో త్రిప్తి యాక్షన్ రోల్ చేస్తున్నారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ‘కమీనే, హైదర్, రంగూన్’ వంటి విశ్లేషకుల ప్రశంసలూ దక్కించుకున్న చిత్రాల తర్వాత మళ్లీ షాహిద్ కపూర్–విశాల్ భరద్వాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ ఫుల్ ΄్యాక్డ్ యాక్షన్ మూవీలో త్రిప్తీ దిమ్రి పగ తీర్చుకునే ΄ాత్రలో కనిపిస్తారట. ఎవరిపై పగ? ఏంటా కథ అనేది తెలియాల్సి ఉంది. రివెంజ్ తీర్చుకునే క్రమంలో ΄ోరాటాలు చేస్తారట. ఈ ΄ాత్ర కోసం త్రిప్తి ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యారని సమాచారం. ఇక ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారట షాహిద్ కపూర్. ఈ ΄ాత్ర రిస్కీ ఫైట్స్ చేస్తుందని టాక్. ఈ నేపథ్యంలో ఫైట్స్ కోసం షాహిద్, త్రిప్తి ఒకేసారి శిక్షణ తీసుకున్నారని బాలీవుడ్ ఖబర్. ఈ ఏడాది డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. యాక్షన్తో ఇంట్రడక్షన్ సిల్వర్ స్క్రీన్పై ఫస్ట్ టైమ్ కనిపించడం కనిపించడమే ఓ యాక్షన్ రోల్లో కనిపించనున్నారు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్. తండ్రి కాంబినేషన్లో ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుక్ ఖాన్ డాన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రధానాంశం గురు–శిష్యుల నేపథ్యంలో ఉంటుందని సమాచారం. తండ్రీ కూతురు షారుక్–సుహానా వెండితెరపై గురు–శిష్యులుగా కనిపిస్తారట. గురువు క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్తో ఉంటుందని భోగట్టా. అంటే... షారుక్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని స్పష్టం అవుతోంది. నైపుణ్యం గల హంతుకుడిగా ఈ గురువు తన శిష్యురాలికి ΄ోరాటాల్లో శిక్షణ ఇస్తాడట. ఇద్దరూ కలిసి అత్యంత ప్రమాదకరమైన మిషన్ని ఛేదిస్తారట. ఈ యాక్షన్ రోల్ కోసం సుహానా ఫైట్స్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. వచ్చే ఏడాది అక్టోబరు 2న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరి... యాక్షన్ రోల్తో ఇంట్రడ్యూస్ కానున్న సుహానా ఖాన్ ఎన్ని మార్కులు తెచ్చుకుంటారో చూడాలి.ఇంకా సోనాక్షీ సిన్హా, తాప్సీ తదితర తారల డైరీలో యాక్షన్ మూవీస్ ఉన్నాయి. హీరోయిన్లంటే గ్లామర్ మాత్రమే కాదు... చాన్స్ వస్తే తమలోని ఫైర్ని బయటికి తీస్తామని యాక్షన్ మూవీస్ ద్వారా నిరూపించుకుంటుంటారు. అయితే ఒకేసారి ఈ తారలందరూ యాక్షన్ రోల్స్ చేయడం మంచి పరిణామం. కథానాయికల ప్రాధాన్యత పెరుగుతోందనడానికి ఇదో నిదర్శనం. -
జెన్ Z అంటే ఇదేనా? ఆశిష్ను అగౌరవపరుస్తావా? నటుడి ఆగ్రహం
గుడుంబా శంకర్, పోకిరి, అన్నవరం వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi). తెలుగుతో పాటు తమిళ, మలయాళ, బెంగాలీ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక చిత్రాలు చేశాడు. ప్రస్తుతం ద ట్రేటర్స్ అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో నటి అపూర్వ ముఖిజ .. ఆశిష్కు కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడింది. ఆశిష్.. అని ఏకవచనంతో సంభోదించింది. నీ తీరు బాగోలేదుఅంత సీనియర్ను పేరు పెట్టి పిలవడమేంటని నటుడు సుధాన్షు పాండే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ద రెబల్ కిడ్ అపూర్వ (Apoorva Mukhija)కు ఉన్న వివాదాలు సరిపోవడం లేదా? తను చెడ్డదని చెప్పడం లేదు. ఆమె మంచి అమ్మాయే! తనకు మంచి మనసుంది. కానీ నీ మాటతీరు మాత్రం అస్సలు బాగోలేదు. అదే నీకు చెడుగా మారుతుంది. నీకంటే సీనియర్ల గురించి ఎలా మాట్లాడాలనేది తెలియకపోతే మొత్తం వ్యవహారమే తలకిందులవుతుంది జాగ్రత్త!చెత్త మాటలుఆశిష్ విద్యార్థి.. నీకే కాదు నాక్కూడా సీనియర్. నా వెనక నిల్చున్నప్పుడు ఆశిష్ వెళ్లిపోతే బాగుంటుంది అని మాట్లాడావు. ఆయన నీ చిన్ననాటి స్నేహితుడా? నీ తల్లిదండ్రుల కంటే పెద్దవాళ్లైన సీనియర్ల గురించి ఇలాగేనా మాట్లాడేది? దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? జెన్ Zకు ఇదంతా కూల్గా అనిపిస్తోంది. కానీ ఇదస్సలు లైట్ తీసుకునే విషయం కాదు. ఇవన్నీ చెత్త మాటలు అంటాను. ఈ ధోరణి మన సమాజానికి ఒక శాపం అని చెప్పుకొచ్చాడు. అపూర్వ.. నడానియన్ సినిమాలో నటించింది. అలాగే కొన్ని సిరీస్లు కూడా చేసింది. సుధాన్షు.. తమిళ, పంజాబీ, హిందీ భాషల్లో అనేక చిత్రాలు చేశాడు. తెలుగులో మన్మథుడు 2లోనూ యాక్ట్ చేశాడు. హీరోయిన్ మాజీ ప్రియుడిగా నటించాడు.చదవండి: అమ్మా.. అంటూ తిరుపతిలో భిక్షమెత్తా: హీరో ధనుష్ -
Naga Bandham: ఒకే ఒక పాట కోసం రూ. 10 కోట్లు.. హైదరాబాద్లో భారీ సెట్!
‘పెదకాపు’ చిత్రం ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అన్నది ట్యాగ్లైన్. నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేశ్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్‡్ష నామా సమర్పణలో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్పై కిశోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్లో పాట చిత్రీకరణ జరుగుతోంది. ‘‘ఈ పాటలో విరాట్ కర్ణతో పాటు 5000 మంది నృత్య కళాకారులు పాల్గొంటున్నారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య పర్యవేక్షణలో ఈ ΄ాటను చిత్రీకరిస్తున్నాం. ఈ ఒక్క ఎపిసోడ్కే రూ. 10 కోట్లు బడ్జెట్ కేటాయించాం. ఈ అద్భుతమైన సీక్వెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, సంగీతం: అభే. -
ధనుష్తో కుబేర చూసిన శేఖర్.. రెస్పాన్స్ అదిరిపోలా!
ఏదో వచ్చామా? నాలుగు సినిమాలు చేశామా? అని కాదు.. చేసిన సినిమా గురించి నలుగురు మాట్లాడుకున్నారా? జనాలు గుండెలో పెట్టుకున్నారా? అనేట్లు ఉండాలి. శేఖర్ కమ్ముల (Sekhar Kammula)కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే.. భారీ ఫైట్లు.. విజువల్ ఎఫెక్ట్స్.. భారీ బడ్జెట్ చిత్రాల జోలికి పోడు. సింపుల్గా రాసుకున్న కథలతోనే ఊహించని విజయాలు అందుకుని థియేటర్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాడు.నాలుగేళ్ల గ్యాప్తో మూవీఇప్పుడదే జరుగుతోంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తీసి ఈ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. అయినా వెంటనే సినిమా చేయలేదు. నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని కుబేర (Kuberaa Movie)తో వచ్చాడు. ధనుష్ను యాచకుడిగా, నాగార్జునను సీబీఐ ఆఫీసర్గా చూపించాడు. డబ్బు, స్వార్థం చుట్టూ కథ అల్లుకున్నాడు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది.వీడియో వైరల్జనాల స్పందన ఎలా ఉందో చూద్దామని శేఖర్, ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్కు వెళ్లారు. ప్రజల అరుపులు, కేకలు విని ఆనందంతో వారికి కడుపు నిండిపోయింది. ధనుష్ అయితే.. డంపింగ్ యార్డ్లో కంపు కొడుతున్నా గంటల తరబడి షూటింగ్ చేసిన కష్టాన్ని మర్చిపోయి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Dhanush get emotional after seeing #Kuberaa Response 🥹🙏🙏@dhanushkraja WHAT A PERFORMANCE THROUGHOUT ENTIRE MOVIE 👏👏pic.twitter.com/rYl2BQSBUV— Dhanush Trends ™ (@Dhanush_Trends) June 20, 2025Whistles, applause and what not 🔥🔥It’s a BLOCKBUSTER WAVE that’s set @dhanushkraja & @sekharkammula’s hearts ablaze ❤️🔥This is the kind of cinema that demands to be experienced on the big screens 💥💥Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa… pic.twitter.com/yJTmUKtuhQ— Kuberaa Movie (@KuberaaTheMovie) June 20, 2025 చదవండి: 'కుబేర నాకెంతో స్పెషల్.. నా గురువు మరిన్ని గొప్ప కథలు చెప్పాలి' -
'కుబేర నాకెంతో స్పెషల్.. నా గురువు మరిన్ని గొప్ప కథలు చెప్పాలి'
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తాజాగా చిత్రం కుబేర. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) ఆల్ ద బెస్ట్ చెప్పింది. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో ఓ ట్వీట్ వేసింది. చాలా కారణాల వల్ల కుబేర నాకు స్పెషల్ చిత్రంగా నిలవబోతుంది. ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకోవడం, అద్భుతంగా నటించడం ధనుష్ సర్ వల్లే సాధ్యమవుతుంది.ఎప్పటికీ గుర్తుండిపోతుందిశేఖర్ (Sekhar Kammula) గారి డైరెక్షన్లో నాగార్జున సర్ కిల్లర్ లాంటి పాత్రలో కనిపించడం మాకు కన్నుల పండగ్గా ఉంటుంది. ప్రియమైన రష్మిక.. శేఖర్ గారు తన సినిమాల్లో హీరోయిన్లకు శక్తివంతమైన పాత్రలు ఇస్తారు. కుబేరలో నీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే నీ విజయాల పరంపరలో ఈ మూవీ కూడా చేరిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ గారు.. మీరు మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయం! రక్తం ధారపోశారుచైతన్య, సూరి, అజయ్, స్వరూప్.. మీరంతా రక్తం ధారపోసి కష్టపడ్డారు. అందుకు ప్రతిఫలం, గుర్తింపు తప్పకుండా వస్తుంది. నిర్మాత సునీల్ గొప్ప కథల్ని ఎంచుకుని అందిస్తున్నందుకు దివంగత నారాయణ్దాస్ గారు పై నుంచి ఎంతో గర్విస్తుంటారు. శేఖర్గారిలాంటి స్వచ్ఛమైన హృదయం కలవారే ఇలాంటి సినిమాలు తీయగలరు. మీరు ఒక తరాన్నంతటినీ ప్రభావితం చేస్తున్నారు. అందులో నేనూ ఉన్నాను. నా గురువుగారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కుబేరఇలాంటి మంచి కథల్ని మరెన్నో అందించాలని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సాయిపల్లవి ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలు చేసింది. కుబేర సినిమా విషయానికి వస్తే.. నాగార్జున సీబీఐ ఆఫీసర్గా, ధనుష్ బిచ్చగాడిగా నటించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. నికేత్ బొమ్మరెడ్డి కెమెరామేన్గా పని చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న రిలీజైంది. #Kuberaa is going to be special for many reasons! @dhanushkraja sir’s masterclass in acting & art of picking challenging characters that only he can pull off so effortlessly. @iamnagarjuna sir, It’s going to be a treat to watch you in a killer character under Sekhar garu’s…— Sai Pallavi (@Sai_Pallavi92) June 20, 2025 చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ -
'RCB గెలిచాక ఏ ఒక్కటీ మంచి జరగడం లేదు' సింగర్ అంతమాట అన్నాడా?
పద్దెనిమిదేళ్ల నిరీక్షణ.. కోట్లాది అభిమానుల కల.. ఐపీఎల్ ట్రోఫీ. ఎట్టకేలకు కింగ్ కోహ్లి (RCB Won IPL 2025) సేన ఆ కప్పు గెలుచుకోవడంతో కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అయితే ఆర్సీబీ గెలుపు తర్వాత దేశంలో ఏదీ మంచి జరగడం లేదంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అంటే ఆర్సీబీ విజయం తర్వాత అన్నీ అనర్థాలే జరుగుతున్నాయని దాని అర్థం. సోనూ నిగమ్ అన్న పేరుతో ఉన్న ట్వీట్ కావడంతో ఇది కచ్చితంగా సింగర్ సోనూ పనే అని చాలామంది ఫిక్సయ్యారు. అసలే కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇంకా అక్కడి ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఇంతలో మరోసారి కన్నడ టీమ్ గెలుపుపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటి? అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.అసలు నిజమిదే!ఆర్సీబీ ఐపీఎల్ గెలిచాక ప్రపంచంలో ఏదీ మంచి జరగడం లేదు అని సోనూ నిగమ్ (Sonu Nigam) ట్వీట్ చేసిన మాట వాస్తవం! కానీ ఈయన సింగర్ సోనూ నిగమ్ కాదు, బిహార్కు చెందిన లాయర్ సోనూ నిగమ్. ఇద్దరి పేర్లు ఒకటే కావడం.. అందులోనూ ఆయన ప్రొఫైల్కు బ్లూ టిక్ ఉండటంతో ఆ ట్వీట్ చేసి సింగర్ అని పలువురు పొరబడుతున్నారు. కానీ సింగర్ సోషల్ మీడియాలో ఆర్సీబీ గెలుపు గురించి ఎటువంటి విద్వేషపూరిత కామెంట్లు చేయలేదు.సోనూ నిగమ్ కన్నడ వివాదమేంటి?బెంగళూరులో సోనూ నిగమ్ ఇటీవల ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ప్రేక్షకులు సోనూ నిగమ్ను కన్నడ పాటలు పాడాలని కోరారు. "కన్నడ, కన్నడ" అని పదేపదే అరవడంతో ఆయన చిరాకు పడ్డారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే కారణం.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగానే ఆ దాడి జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని అసహనం వ్యక్తం చేశారు.సారీ కర్ణాటకసోనూ నిగమ్ కన్నడ భాష, సంస్కృతిని అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు కూడా నమోదైంది. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. దీంతో సోనూ మెట్టు దిగి వచ్చారు. కన్నడ ప్రజలు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మీ కోసం మీ భాషలో పాటలు పాడతాను. కానీ, ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడమని బెదిరించడంతో నా మనసు నొచ్చుకుంది. సారీ కర్ణాటక, నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ అని క్షమాపణలు చెప్పారు.ఇటీవల జరిగిన ప్రమాదాలు⇒ జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.⇒ జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం పైకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. అలాగే మెడికల్ కాలేజీ ఉన్న 34 మంది ప్రాణాలు విడిచారు.⇒ జూన్ 15న కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. Jabse RCB IPL jeeti hai tabse duniya mein kuch bhi achcha nahi ho raha hai!— Sonu Nigam (@SonuNigamSingh) June 16, 2025 చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు -
యంగ్ హీరో తేజ సజ్జా అరుదైన ఘనత
యంగ్ హీరో తేజ సజ్జా తన సినీ ప్రస్థానంలో అరుదైన ఘనతను సాధించారు. బాల నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తేజ.. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి బ్లాక్బస్టర్ చిత్రాల్లో తన నటనతో గుర్తింపు పొందారు. 2005లో వచ్చిన బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకుని తన టాలెంట్ను నిరూపించుకున్నారు.ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో విశేష గుర్తింపు పొందుతున్నారు. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానాన్ని సంపాదించిన తేజ సజ్జా, మరో ప్రతిష్టాత్మక అవార్డు తన ఖాతాలో వేసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 2024 మధ్య విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రదానం చేసింది. అందులో భాగంగా, 2023కి గాను ఉత్తమ ద్వితీయ చిత్రం (బెస్ట్ సెకండ్ ఫిల్మ్) విభాగంలో తేజసజ్జా హనుమాన్ చిత్రం అవార్డును గెలుచుకుంది.బాల నటుడిగా నంది అవార్డు, హీరోగా గద్దర్ పురస్కారం అందుకొని అరుదైన రికార్డు సాధించిన నటుడిగా నిలిచారు. ప్రస్తుతం తేజ మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుత స్పందన లభిస్తోంది. హనుమాన్ తరువాత తేజ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
అందరిచూపు సౌత్వైపే.. ఇక్కడే పాగా వేస్తానంటున్న బ్యూటీ
ఒకప్పుడు సౌత్ సినిమాలంటే చిన్నచూపు ఉండేది కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలు దేశాన్నే ఏలుతున్నాయి. ఖండాలు దాటి ప్రపంచ సినిమాను తమవైపు తిప్పుకునేలా చేస్తున్నాయి. అందుకే సౌత్ సినిమాలు చేయడానికి హీరోయిన్లు కూడా నూతన ఉత్సాహం చూపిస్తున్నారు. హిందీ బిగ్బాస్ 18 ఫేమ్, హీరోయిన్ యామిని మల్హోత్రా (Yamini Malhotra) కూడా దక్షిణాదిన రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.అన్నీ ప్రత్యేకమేదంత వైద్యురాలు అయిన యామిని తెలుగులో చుట్టాలబ్బాయి సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. తాజాగా బాలీవుడ్ బబుల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని మాట్లాడుతూ.. నేడు సౌత్లో చెప్తున్న కథలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అక్కడి కథలు, స్క్రీన్ప్లే, విజన్ కూడా అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బలమైన పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సౌత్లోకి మరోసారి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అని నాకనిపిస్తోంది.ఎగ్జయిట్ అయ్యా.. కానీ!తెలుగులో, పంజాబీలో చేసిన సినిమాలు రెండూ ఒకేరోజు విడుదలైనప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. అయితే అప్పుడు పంజాబీ సినిమాపైనే ఎక్కువ మొగ్గు చూపాను. ఎందుకంటే ఆ భాష నాకు కంఫర్టబుల్గా అనిపించేది. తెలిసినవాళ్లు కూడా ఉండటంతో ఇక్కడ ఎదగడం ఈజీ అనుకున్నాను. భాష అడ్డంకి అనుకున్నాను. కానీ అది నిజం కాదని అనుభవంతో తెలుసుకున్నాను అని యామిని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ 'చిల్ మార్ నా బ్రో' మూవీతో ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టింది.చదవండి: సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా -
సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా
జెనీలియా.. హహ.. హాసినిగా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే! బొమ్మరిల్లు ఒక్కటే కాదు సై, నా అల్లుడు, హ్యాపీ, ఢీ, రెడీ, ఆరెంజ్.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. ఇందులో కొన్ని సినిమాలు పలు భాషల్లో రీమేక్ అయ్యాయి కూడా! అందులో రామ్పోతినేనితో చేసిన రెడీ మూవీ ఒకటి. ఇది హిందీలో సల్మాన్ ఖాన్తో రీమేక్ చేశారు. కానీ హీరోయిన్గా జెనీలియా (Genelia D'Souza)కు బదులుగా అసిన్ను తీసుకున్నారు. జెనీలియాను సల్మాన్ వద్దనడంపై అప్పట్లో చర్చ జరిగింది.ఇంకో అవకాశం ఎదురుచూస్తుందేమో..సితారే జమీన్ పర్ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న జెనీలియాకు ఇదే ప్రశ్న ఎదురైంది. రెడీ హిందీ రీమేక్లో మిమ్మల్ని తీసుకోనందుకు బాధపడ్డారా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. అందుకు హీరోయిన్.. అలాంటిదేం లేదు. కానీ నన్ను సంప్రదించుంటే సంతోషంగా ఒప్పుకునేదాన్ని. ఎందుకంటే అది నా సినిమా. అయినా ఆ అవకాశం పోయిందంటే సల్మాన్తో నటించేందుకు మరో మూవీ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో.. అని చెప్పుకొచ్చింది.రుణపడి ఉన్నాతర్వాత యాంకర్.. దక్షిణాదిన మంచి పాత్రలు దక్కలేదు కదా? అని ప్రశ్నించగా వెంటనే జెనీలియా కాదంటూ మధ్యలోనే అడ్డుకుంది. ఆమె మాట్లాడుతూ.. సౌత్లో నాకెప్పుడూ మంచి పాత్రలే దక్కాయి. నా సినిమాలు చూస్తే సౌత్లో నాకు ఎంత అద్భుతమైన పాత్రలు దక్కాయో తెలుస్తుంది. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. నాకు మంచి సినిమాలు ఇచ్చారు.. అందుకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఈరోజు హైదరాబాద్కు వెళ్లినా సరే హాసిని(బొమ్మరిల్లులో జెనీలియా పాత్ర పేరు) అంటే చాలు నా పేరు చెప్తారు. ఎంజాయ్ చేశాతమిళంలో హరిణి (సంతోష్ సుబ్రహ్మణ్యం), మలయాళంలో ఆయేషా (ఉరుమి).. ఈ పేర్లతోనే నన్ను ఇప్పటికీ పిలుస్తుంటారు. అలాంటి పాత్రలు దక్కడం నా అదృష్టం. శంకర్, రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్లతోనే కాకుండా కొత్త దర్శకులతోనూ పని చేశాను. ఈ మొత్తం ప్రక్రియను నేను ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌత్ ఇండస్ట్రీపై విషం కక్కాలనుకున్న యాంకర్కు జెనీలియా గట్టిగానే బుద్ధి చెప్పిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Anchor: South films never used to give solid roles.Genelia : No, I always got - if you see my South films, I've had the best roles ever. It was my learning ground. I am eternally indebted to the work that I got there.#GeneliaDeshmukh pic.twitter.com/OBOhFQAAqZ— Whynot Cinemas (@whynotcinemass_) June 18, 2025చదవండి: బిగ్బాస్లో ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పిన గౌతమ్.. లైవ్లోనే -
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
సంగీత ప్రపంచంలో గాయణీమణులకు ప్రత్యేక స్థానం ఉంది. తమ అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది ప్రేమను పొందుతున్న లేడీ సింగర్స్ చాలా మందే ఉన్నారు. వారు ఆలపించే సినిమా పాటలకు యూట్యూబ్లో కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమలో ‘గాన కోకిల’లకు మంచి డిమాండ్ ఉంది. మేల్ సింగర్స్ కంటే వాళ్లే ఎక్కువ సంపాదించే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు లైవ్ కాన్సర్ట్లు, ఈవెంట్ల ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న లేడీ సింగర్స్పై ఓ లుక్కేద్దాం.1. శ్రేయా ఘోషాల్: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయనీ శ్రేయా ఘోషాల్. ఈమె ఒక్కో పాటకు సుమారు రూ. 25-27 లక్షలు, లైవ్ కాన్సర్ట్లకు రూ. 40-45 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. 'బర్సో రే', 'దేవసేనా' వంటి పాటలతో ఆమె అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. సూసేకీ..(పుష్ప 2), హైలోస్సో..(తండేల్), నానా హైరానా..(గేమ్ ఛేంజర్) లాంటి అద్భుతమైన పాటలను ఆలపించి.. తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది.2. సునిధి చౌహాన్సునిధి ఒక్కో పాటకు రూ. 20-25 లక్షలు, కాన్సర్ట్లకు రూ. 25-30 లక్షలు ఛార్జ్ చేస్తారట. నాలుగేళ్ల వయసులోనే ఆమె సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 'ఢూమ్ మచాలే', 'బీడీ జలైలే' వంటి పాటలతో బాలీవుడ్లో సంచలనం సృష్టించారు.ఇప్పటి వరకు ఆమె 10 భాషల్లో 2500 వరకు పాటలను పాడారు. ఓయ్ సినిమాలో ఆమె ఆలపించిన ‘సరదాగా చందమామనే..’ పాట సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పటికీ ఆ పాట చాలా మంది వింటుంటారు.3. కనికా కపూర్ బేబీ డాల్, చిట్టియక్కలాయాన్, టుకుర్ టుకుర్, జెండా ఫూల్ పాటలతో పాటు పుష్ప సినిమాలోని ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్తో జనాలను ఉర్రూతలూగించిన ఈ అందాల గాయని ఒక్కో పాటకు 18-22 లక్షలు తీసుకుంటుందట. ఆమె ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల వరకు ఉంటుదని సమాచారం.4. నేహా కక్కర్యూత్లో భారీ ఫాలోయింగ్ ఉన్న సింగర్ నేహా కక్కర్. ఆమె ఒక్కో పాటకు రూ. 10-15 లక్షలు, ఈవెంట్లకు రూ. 25-30 లక్షలు తీసుకుంటారు. 'మైల్ హో తుమ్', 'గర్మీ' వంటి హిట్ డ్యాన్స్ నంబర్స్తో ఆమె ట్రెండ్సెట్టర్గా మారారు.5. అల్కా యాగ్నిక్: 90లో బాలీవుడ్ హిట్ల రాణి అల్కా ఒక్కో పాటకు రూ. 12 లక్షలు, కాన్సర్ట్లకు రూ. 15-20 లక్షలు తీసుకుంటారు. 'ఏక్ దో తీన్', 'చోలీ కే పీఛే' వంటి పాటలతో ఆమె లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు6. నీతి మోహన్బాలీవుడ్ ప్రముఖ సింగర్స్లో నీతి మోహన్ ఒకరు. ఆమె ఒక్కో పాటకు 8-10 లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటుంది.7. తులసి కుమార్మెలోడీ సాంగ్స్తో గుర్తింపు పొందిన తులసి ఒక్కో పాటకు రూ. 5-10 లక్షలు, లైవ్ షోలకు రూ. 8-10 లక్షలు తీసుకుంటారు. 'తుమ్ జో ఆయే', 'లవ్ హో గయా' వంటి పాటలతో ఆమె అభిమానులను సంపాదించారు.8. ఆషా భోస్లేదిగ్గజ గాయనీమణి ఆషా ఒక్కో పాటకు రూ.5-8 లక్షలు, ఈవెంట్లకు రూ. 10-15 లక్షలు ఛార్జ్ చేస్తారు. 'దమ్ మారో దమ్', 'పియా తు అబ్ తో ఆజా' వంటి ఐకానిక్ పాటలతో ఆమె మంచి గుర్తింపు పొందింది.9. శిల్పారావుతనగాత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుటున్న తెలుగమ్మాయి శిల్పారావు ఒక్కో పాటకు 5-10 లక్షల వరకు తీసుకుంటుంది. దేవర సినిమాలో ‘చుట్టమల్లే..’, జైలర్ లో కావాలయ్యా అనే పాట పాడింది ఈ సింగరే.10. మోనాలీ ఠాకూర్బహుముఖ ప్రతిభ కలిగిన మోనాలీ ఒక్కో పాటకు రూ.5-10 లక్షలు, లైవ్ షోలకు రూ. 15 లక్షల వరకు తీసుకుంటారు. 'జరా జరా టచ్ మీ', 'సావర్లూన్' వంటి పాటలతో ఆమె గుర్తింపు పొందారు. -
రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు
కొన్ని ప్రదేశాలు నెగెటివ్ వైబ్స్ ఇస్తుంటాయి. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లినప్పుడు తనకూ అలాంటి నెగెటివ్ వైబ్స్ వచ్చాయంది బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol). షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు అంతా సరిగా ఉన్నట్లు అనిపించలేదని, వెంటనే తిరిగి వెళ్లిపోవాలనిపించిందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటుగా రామోజీ ఫిలిం సిటీని వర్ణించింది.హోటల్లో దెయ్యాలు?ఇలాంటి చేదు అనుభవం కాజోల్కు మాత్రమే కాదు, తాప్సీ (Taapsee Pannu), రాశీఖన్నా, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా ఎదురైందట! గతంలో తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దెయ్యాలున్నాయని నేను బలంగా నమ్ముతాను. అవంటే నాకు చాలా భయం. రామోజీ ఫిలిం సిటీలోని ఓ హోటల్ గదిలో బస చేసినప్పుడు నాతో పాటు ఎవరో ఉన్నట్లే అనిపించింది. ఆ హోటల్లో దెయ్యాలున్నాయని అందరూ అంటుంటే విన్నాను. కానీ, తొలిసారి అది ఎక్స్పీరియన్స్ చేశాను. నేను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్ధాలు వినిపించాయి. దెయ్యంతో పోరాడలేనుభయంతో వణికిపోయినప్పటికీ అదంతా నా భ్రమే అని నాకు నేను సర్ది చెప్పుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాను. దెయ్యంతో పోరాడేంత సినిమా నాకు లేదు అని చెప్పుకొచ్చింది. రాశీఖన్నా (Raashii Khanna) కూడా.. అదే హోటల్లో బస చేసినప్పుడు తన బెడ్ దానంతటదే ఊగిపోయిందని, తను కప్పుకున్న దుప్పటి కూడా ఎవరో లాగేశారంది. ఆ గదిలో కచ్చితంగా దెయ్యం ఉందని అభిప్రాయపడింది. ఎందుకంటే, తనకంటే ముందు పలువురు యాక్టర్స్కు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పినట్లు ఓ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది.కీరవాణిదీ అదే అభిప్రాయంఅలాగే ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani)కి కూడా చంద్రముఖి 2 సినిమా సమయంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. కీరవాణి మాట్లాడుతూ.. అత్యంత భయంకరమైన ప్రదేశం ఏది? అని ఇంటర్నెట్లో కొడితే రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) పేరే వస్తుంది. అక్కడున్న సింఫనీ స్టూడియోలో లేడీ సింగర్స్ పాట పాడుతున్నారు. అప్పుడు వారి చెవిలో ఏవో శబ్ధాలు వినిపించాయి అని చెప్పాడు. సెలబ్రిటీలందరూ ఇంత ఓపెన్గా చెప్తున్నారంటే రామోజీ ఫిలిం సిటీలో నిజంగానే ఏదో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ -
ఇండియా మొత్తం వెతికితే అనంతిక దొరికింది: నిర్మాత రవిశంకర్
‘‘క్లాసికల్ డ్యాన్స్, మార్సల్ ఆర్ట్స్ రెండూ వచ్చిన అమ్మాయి కావాలని ఇండియా మొత్తం వెతికితే ఒక్క అమ్మాయి దొరికింది... తనే అనంతిక. ‘8 వసంతాలు’ సినిమా కోసం తను చాలా కష్టపడింది’’ అని నిర్మాత వై. రవిశంకర్ తెలిపారు. అనంతికా సనీల్కుమార్ లీడ్ రోల్లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘8 వసంతాలు’. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల అవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఒక అమ్మాయి ఎనిమిదేళ్ల ప్రయాణమే ‘8 వసంతాలు’. ఈ సినిమాకి అనంతిక, ఫణి బిగ్గెస్ట్ పిల్లర్స్. విజువల్గా అదిరిపోయింది. మా సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం’’ అన్నారు. నవీన్ యెర్నేని మాట్లాడుతూ– ‘‘చాలా వైవిధ్యమైన చిత్రమిది. ఈ సినిమా కోసం పని చేసిన కొత్తవాళ్లందరి కోసమైనా ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అని తెలిపారు. ‘‘నవీన్గారు, రవిగారు చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని కాదు... మంచి సినిమానా? కాదా? అనేది చూస్తారు. మా ‘8 వసంతాలు’ మంచి చిత్రం’’ అన్నారు ఫణీంద్ర నర్సెట్టి. ‘‘శుద్ధి అయోధ్య లాంటి బలమైన పాత్ర చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అనంతిక చె΄్పారు. -
పారితోషికం తీసుకొని చాలా నష్టపోయా : శేఖర్ కమ్ముల
‘‘నా కెరీర్లోని మ్యూజికల్, లవ్స్టోరీ చిత్రాలు బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. దీంతో నా పై ఓ మార్క్ పడింది. కానీ కథకు ఏం కావాలో అదే చేశాను. ‘లీడర్’ చాలా నిజాయితీగా చెప్పిన కథ. ఈ కథలో లవ్స్టోరీ, మంచి పాటలు పెట్టాలనుకోలేదు. ‘హ్యాపీడేస్’ కాలేజ్ స్టోరీ కాబట్టి కాలేజీ స్టోరీలానే ట్రీట్ చేశాను. ‘కుబేర’ సినిమా కూడా అంతే. ఈ కథకు కావాల్సిందే చేశాను. చెప్పాలంటే... నేను కథను డైరెక్ట్ చేయడం కాదు... కథే నన్ను డైరెక్ట్ చేస్తుంటుంది’’ అని అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. (చదవండి: నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ కమ్ముల)ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా, జిమ్ సర్భ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రేపు విడుదల కానున్న సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో శేఖర్ కమ్ముల చెప్పిన విశేషాలు. ⇢ ‘కుబేర’ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను చిత్రీకరించాం. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం... ఇలా రెండు విభిన్నమైన ప్రపంచాలను ప్రేక్షకులు చూస్తారు. తనకి ఏమీ వద్దని, ఏ ఆశ లేని ఒక బెగ్గర్, ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక బిలియనీర్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే... బెగ్గర్ వర్సెస్ బిలియనీర్. ఈ తరహా కథలను చెప్పినప్పుడు పేదవారే గెలుస్తుంటారు. కానీ అది ఎలా ప్రజెంట్ చేశాం అన్నది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎమోషనల్ థ్రిల్లర్గా ఉంటుందీ సినిమా. ⇢ ‘మనం, ఊపిరి’ వంటి సినిమాల్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నాగార్జునగారు నటించారు. ‘కుబేర’లో కూడా ఆయన కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమాలోని పాత్రలో ఆయన ఇమిడిపోయిన తీరు అద్భుతం. ఇక ఈ చిత్రంలోని దేవా పాత్రలో ధనుష్ సూపర్గా నటించారు. ధనుష్ బెగ్గర్గా కనిపిస్తారు. దేవా పాత్రలో ధనుష్గారిని తప్ప ఆడియన్స్ మరొకరిని ఊహించలేరు. రష్మికా మందన్నా తన యాక్టింగ్తో ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్కు తెలుగు రాకపోయినా తెలుగు డైలాగ్స్ను బట్టీ పట్టి మరీ చక్కగా చెప్పారు. నా గత చిత్రాలతో పోలిస్తే నా మార్క్ ‘కుబేర’ సినిమాలో పదింతలు ఎక్కువగా ఉంటుంది. ⇢ నా పాతికేళ్ల జర్నీని చూసుకున్నప్పుడు ఎమోషనల్గా అనిపిస్తుంది. నా స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుని సినిమాలు తీసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. కానీ ఎక్కడా ఎదురు దెబ్బలు తగలలేదు. అది నా అదృష్టం. సినిమాల లాభాల విషయంలో కూడా నాకింత పర్సంటేజ్ కావాలని ఎప్పుడూ అడగను.. పారితోషికం తీసుకుంటానంతే. దీని వల్ల చాలా నష్టపోయాను. అయినా బాధలేదు. ప్రేక్షకుల ప్రేమే నాకు ముఖ్యం. నా కథలన్నీ నా జీవితంలో నేను చూసిన, నాకు తారసపడిన వ్యక్తుల జీవితాల్లోనివారివే. ఇక ‘లీడర్’కు సీక్వెల్ ఆలోచన ఉంది. కానీ ఇప్పటి రాజకీయ వ్యవస్థలో, ప్రజల్లో మార్పులొచ్చాయి. ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ను పట్టుకోవాలి. ఇక నానీతో చేసే సినిమాకు వర్క్ జరగాల్సి ఉంది. -
తింటుంటే అన్నంలో రక్తం.. రూ.10 ఇస్తే కడుపు నింపుకుందామని.. హరి కష్టాలు
పటాస్ షోతో ఫేమస్ అయ్యాడు ఎక్స్ప్రెస్ హరి (Express Hari). పలు టీవీషోలలో పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్నాడు. కమెడియన్గా రాణిస్తున్న అతడు ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. పిడికెడంత అన్నం కోసం రక్తాలే చిందించాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ షోలో వెల్లడించాడు. తేజస్వి మదివాడ(Tejaswi Madivada) హోస్ట్గా వ్యవహరిస్తున్న కాకమ్మ కథలు రెండో సీజన్కు ఎక్స్ప్రెస్ హరి గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా తన కష్టాలు ఏకరువు పెట్టాడు.అన్నంలో రక్తపు బొట్లునాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కష్టాలు చేశాను. మా పాఠశాలలో 250 మంది ఉండేవారు. చేతికి దెబ్బ తగిలి అన్నం తింటుంటే ఆ రక్తం భోజనంలో పడేది. మిగిలిపోయిన ఇడ్లీ కోసం పిలిస్తే ఎలా పరిగెత్తేవాళ్లమో తెలుసా? కిందపడి మోకాళ్లు గీసుకుపోయేవి. ఆ లైన్లో ముందు నిలబడితే ఒక ఇడ్లీ వస్తుంది కదా అన్న ఆరాటం!క్యాంటీన్లో చపాతీ కొనుక్కోవడానికి..మధ్యాహ్న సమయంలో అందరూ క్యాంటీన్కు వెళ్లి తినేవారు. అప్పుడు నాకు ఎవరైనా పది రూపాయలు ఇస్తే ఒక చపాతీ కొనుక్కుని తినాలనుకునేవాడిని అని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విని తేజు ఎమోషనలైంది. వెంటనే లేచి హరికి హగ్ ఇచ్చి ఓదార్చింది. నటి తేజస్వి యాంకరింగ్ చేస్తున్న కాకమ్మ కథలు టాక్ షో ఆహాలో ప్రసారమవుతోంది.చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది! -
OTT: రాజీవ్ గాంధీ హత్య కేసు ఆధారంగా 'ద హంట్'
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అదే ద హంట్ (The Hunt: The Rajiv Gandhi Assassination Case). ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. జూలై 4 నుంచి సోనీలివ్లో ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ టీజర్ కూడా రిలీజ్ చేసింది. అందులో.. 'రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా? ఆయనింకా బతికే ఉన్నారా?' అని శ్రీలంకలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి ఫోన్ రావడంతో టీజర్ మొదలవుతుంది. బాంబు పేల్చి రాజీవ్గాంధీని చంపిందెవరు? వారి ఉద్దేశ్యం ఏంటి? అన్న కోణాల్లో విచారణ మొదలుపెడతారు. ప్రతి సెకను కూడా ముఖ్యమేనంటూ నిందితులను పట్టుకునే పనిలో ఉంటారు. తర్వాత ఏం జరిగిందన్నది తెలియాలంటే ఓటీటీలో సిరీస్ చూడాల్సిందే! ద హంట్కు నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. కాగా 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు. The assassination that shook the nation. The manhunt that stunned the world.The Hunt - The Rajiv Gandhi Assassination Case, streaming from 4th July on Sony LIV.#TheHuntOnSonyLIV pic.twitter.com/ExOXEZxYFK— Sony LIV (@SonyLIV) June 18, 2025 -
కంటతడి పెట్టించే ‘పాపా’
కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డాడా’. గణేశ్ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని ‘పాపా’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రం కథ విషయానికొస్తే.. పెళ్ళికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న విచిత్ర మలుపుల సమహారమే ఈ చిత్రం. మణి (కవిన్), సింధు (అపర్ణ దాస్) ఇద్దరు ప్రేమించుకుంటారు. కాలేజీ టైంలోనే సింధు గర్భం దాల్చుతుంది. ఈ విషయం ఇద్దరి కుటుంబాలలో తెలిసి.. ఇద్దరిని బయటకు వెళ్లగొడతారు. బయటకు వచ్చి ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఒకవైపు చదువుతూనే వైవాహిక జీవితాన్ని ఎలా కొనసాగించారు? ఈ క్రమంలో వారిద్దరికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరి వరకు ఈ జంట కలిసే ఉందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వయసులో ఉండే ఆకర్షణలు, ఆవేశాలు, అపార్ధాలు, తరాల మధ్య అంతరాలు, వ్యక్తుల మధ్య ఉండే ఇగోలు, ఫ్రెండ్ షిప్, హెల్పింగ్ నేచర్, ముఖ్యంగా బంధాలు, భావోద్వేగాల కలబోతగా "పాపా" చిత్రాన్ని దర్శకుడు గణేష్ బాబు ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు. కథగా చెప్పుకోవడానికి సింపుల్ గా ఉన్నా... కథనాన్ని రక్తి కటించిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.భాగ్యరాజా, విటివి గణేష్ తప్ప మిగతా పాత్రలు పోషించినవారు మనకు తెలియనివారే అయినప్పటికీ... ప్రేక్షకులు ఆయా పాత్రలతో ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో కంట తడి పెట్టని వారంటూ ఎవరూ ఉండరు. హృదయాల్ని మెలిపెట్టేసే పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. . హీరోయిన్ అపర్ణాదాస్... కెరీర్ బిగినింగ్ నాటి నయనతారను కాస్త పోలి ఉండడం వల్ల... అట్లీ దర్శకత్వంలో ఆర్య - నయనతార నటించగా ఘన విజయం సాధించిన "రాజా - రాణి" చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఆ పోలిక జోనర్ కు మాత్రమే పరిమితం.హీరోగా నటించిన కవిన్, హీరోయిన్ పాత్ర పోషించిన అపర్ణాదాస్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తారు. వీళ్ళ అబ్బాయిగా చేసిన మాస్టర్ ఇయాన్ తోనూ మనం ప్రేమలో పడిపోతాం. ముఖ్యంగా క్లైమాక్స్ లో కంట తడి పెట్టని వారంటూ ఎవరూ ఉండరు. హృదయాల్ని మెలిపెట్టేసే పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. హీరోయిన్ అపర్ణాదాస్... కెరీర్ బిగినింగ్ నాటి నయనతారను కాస్త పోలి ఉండడం వల్ల... అట్లీ దర్శకత్వంలో ఆర్య - నయనతార నటించగా ఘన విజయం సాధించిన "రాజా - రాణి" చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఆ పోలిక జోనర్ కు మాత్రమే పరిమితం. ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే మరింత బాగుండేదనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ ను ఇంకొంచెం క్యాష్ చేసుకునెలా రెండుమూడు సీన్స్ కన్సీవ్ చేసుకుని ఉంటే ఎమోషన్ మరింత పండేదనిపిస్తుంది "సింగిల్ పేరెంటింగ్"లో ఉండే పెయిన్, తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ కు ఇంకొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఉంటే కూడా ఇంకా బాగుండేదనిపిస్తుంది. అయితే... మనసు తడిని వెలికి తీసే క్లైమాక్స్... ఇటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ కు తావు లేకుండా చేస్తుంది. -
కోటి రూపాయల కారులో మోనాలిసా.. ఇప్పుడదే నా ఫ్రెండ్!
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా అవకాశాల కోసం ఏళ్లతరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు చాలామంది. అదే సమయంలో అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవారూ బోలెడంతమంది ఉన్నారు. అందులో కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా ఒకరు. కుంభమేళాలో పూసలమ్ముకున్న ఈమె.. సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. సినిమా అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. కుంభమేళాతో పాపులర్షాప్ ఓపెనింగ్స్కు రమ్మని ఆహ్వానాలు అందాయి. అవన్నీ చూసి పొంగిపోయింది మోనాలిసా. జీవితం ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని ఆలోచించింది. అన్నింటినీ నవ్వుతూ ఓకే చెప్పింది. ఈ మధ్యే ఆమె నటించిన ఫస్ట్ సాంగ్ 'సాద్గి' కూడా రిలీజైంది. అందులో మోనాలిసా మరింత అందంగా కనిపించింది. కాకపోతే యాక్టింగ్ ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్న కామెంట్లు వినిపించాయి. కెమెరా ముందు నటించడం అదే తనకు తొలిసారి. నా ఫ్రెండ్.. కెమెరాఈ అనుభవం గురించి మోనాలిసా మాట్లాడుతూ.. సింగర్ ఉత్కర్ష్ శర్మ సర్ తన పాటలో నటించాలని అడగ్గానే ముందు మా ఇంట్లో మాట్లాడమన్నాను. వారు ఓకే అన్న తర్వాతే నేను అందులో యాక్ట్ చేశాను. అలాగే సాంగ్ కూడా నాకెంతగానో నచ్చింది. ఇప్పుడు కెమెరానే నా ఫ్రెండ్. కెమెరా ఎదుట కళ్లతోనే భావాలు పలికించడం, డ్యాన్స్ చేయడం కొత్తగా బాగుంది అని చెప్పుకొచ్చింది.రూ.1 కోటి కారులో మోనాలిసాఇదిలా ఉంటే తాజాగా మోనాలిసా ఖరీదైన కారులో కూర్చున్న ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఈ కారు ధర దాదాపు రూ.1 కోటి ఉండొచ్చని అంటున్నారు. రూ.100కు పూసల దండ అమ్ముకున్న మోనాలిసా ఇప్పుడు కోటి విలువైన కారులో తిరుగుతుండటం చూసి ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. మోనాలిసా ప్రస్తుతం ద డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Monalisa Official (@_monalisa_official) View this post on Instagram A post shared by Utkarsh Singh (@utkarshsinghofficial_)చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది! -
విశ్వంభర ‘స్పెషల్’.. కీరవాణి కాదు.. భీమ్స్!
సంగీతం దర్శకుడు కీరవాణిపై ఒక విమర్శ ఉంది. రాజమౌళి సినిమాలకు తప్ప మిగతా చిత్రాలకు సరైన పాటలు అందించరు. నేపథ్య సంగీతం కూడా ఆ స్థాయిలో ఉండదు. ఆర్ఆర్ఆర్ తర్వాత కీరవాణి పలు సినిమాలకు సంగీతం అందించినా.. ఆ స్థాయిలో పాటలు ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఆయన సంగీతం అందిస్తున్న చిత్రాలలో విశ్వంభర(Vishwambhara) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందంట. దాని కోసం కీరవాణిని కాకుండా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ని రంగంతో దించారట మేకర్స్. సినిమా మొత్తానికి కీరవాణి సంగీతం అందించినా.. ఆ ఒక్క పాట మాత్రం భీమ్స్ కంపోజ్ చేస్తాడట.కీరవాణి ఖాతాలో పలు సూపర్ హిట్ స్పెషల్ సాంగ్స్ కూడా ఉన్నాయి. అయితే అవన్నీ రాజమౌళి సినిమాలవే కావడం విశేషం. మిగతా సినిమాలకు కూడా ఐటమ్స్ సాంగ్ చేసినా అవి అంతగా ఆకట్టుకోలేదు. ఆ కారణంగానే విశ్వంభర టీమ్ ఆ బాధ్యతను భీమ్స్ అప్పగించినట్లు సమాచారం. ఇప్పుడీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ ట్రెండ్లో ఉన్నాడు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు విశ్వంభర కోసం స్పెషల్ సాంగ్ చేయబోతున్నాడట. ఫోక్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చేయడంలో భీమ్స్ స్పెషలిస్ట్. మరి విశ్వంభర కోసం కూడా ఫోక్ స్టైల్లోనే స్పెషల్ సాంగ్ చేస్తాడేమో చూడాలి.ఇక విశ్వంభర విషయానికొస్తే.. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ఇది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పెషల్ సాంగ్ మినహా షూటింగ్ అంతా పూర్తయింది. అన్ని కుదిరిలే ఆగస్ట్ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. -
అవమానించారని అనుపమ ఆవేదన.. టాప్ హీరోయిన్లకూ అదే కర్మ?
అనుపమ (Anupama Parameswaran).. మా గుండెకాయ అని చెప్పుకునే కుర్రాళ్లు బోలెడంతమంది. చూపు తిప్పుకోని అందంతో, సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందీ బ్యూటీ. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్కు సొంతగడ్డ అయిన కేరళలో మాత్రం ఆదరణ దక్కలేదట! ఆ విషయాన్ని స్టేజీపై చెప్తూ ఎమోషనలైందీ కేరళ కుట్టి.నటన రాదని హేళనఅనుపమ ప్రస్తుతం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్లో అనుపమ మాట్లాడుతూ.. మలయాళంలో చాలామంది నన్ను రిజెక్ట్ చేశారు. నాకు నటన రాదని హేళన చేశారు. ఎంతో ట్రోల్ చేశారు. అలాంటిది దర్శకుడు ప్రవీణ్ నన్ను నమ్మి శక్తివంతమైన పాత్ర ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. అక్కడే స్టేజీపై ఉన్న నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్ గోపి ఈ మాటలు విని చలించిపోయాడు. ఆయన మాట్లాడుతూ.. అనుపమ మాటలు గుండె లోతుల్లోనుంచి వచ్చాయి. అయినా ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు.ఆ హీరోయిన్ల విషయంలోనూ..ఒకప్పుడు హీరోయిన్ సిమ్రాన్ (Simran)ను కూడా మలయాళ చిత్రపరిశ్రమ పట్టించుకోకుండా వదిలేసింది. తను ఓ స్థాయికి చేరుకున్నాక నాకు తెలిసిన ఎంతోమంది టాప్ డైరెక్టర్లు తనను కథానాయికగా తీసుకోవాలని ఆమె వెంటపడ్డారు. కర్మంటే ఇదే.. అలాగే కేరళకు చెందిన అసిన్, నయనతార (Nayanthara) కూడా వివిధ భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించారు. అనుపమ జీవితంలోనూ ఇదే జరుగుతుంది. తను తప్పకుండా రాణిస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జూన్ 27న విడుదల కానుంది.సినిమాఅనుపమ విషయానికి వస్తే.. నివీన్ పౌలీ 'ప్రేమమ్' అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాగచైతన్య 'ప్రేమమ్', అఆ, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, రాక్షసుడు, కార్తికేయ 2, రౌడీ బాయ్స్, 18 పేజీస్, టిల్లు స్క్వేర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో.. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, బైసన్, లాక్డౌన్, పరదా, పెట్ డిటెక్టివ్ చిత్రాలున్నాయి.చదవండి: హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం -
Thammudu Movie: ఆకట్టుకుంటున్న 'భూ అంటూ భూతం..' సాంగ్
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'భూ అంటూ భూతం..' రిలీజ్ చేశారు. మేనకోడలు బేబి దిత్యకు మేనమామ నితిన్ ధైర్యం చెప్పే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. 'భూ అంటూ భూతం..' పాటను అజనీష్ లోకనాథ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల ఆకట్టుకునేలా పాడారు. సింహాచలం మన్నేలా లిరిక్స్ రాశారు. 'భూ అంటూ భూతం..' పాట ఎలా ఉందో చూస్తే - 'భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడీ, ఛూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి..పుట్టగానే నేరుగా నువు పరుగెత్తలే, పట్టుకుంటూ పడుతూ నడకేనేర్చావే, భయపడి అడుగు ఆపకే..అంటూ సాగుతుందీ పాట. -
సమంత, నాగ చైతన్య మళ్లీ కలుస్తారా?
సమంత(Samantha), నాగ చైనత్య కెరీర్లో మరిచిపోలేని చిత్రం ‘ఏ మాయ చేసావే’. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సమంత నటిగా ఎంట్రి ఇచ్చింది కూడా ఈ చిత్రంతోనే. అంతేకాదు నాగచైతన్యతో ప్రేమలో పడడానికి కారణం కూడా ఈ మూవీనే .అందుకే అటు నాగ చైతన్య(Naga Chaitanya)కు గాని, ఇటు సమంతకు గాని ‘ఏ మాయా చేసావే’ చిత్రం చాలా స్పెషల్. సమంత అయితే ఏకంగా ఈ చిత్రం పేరు (వైసీఎం)తో టాటూనే వేయించుకుంది. చైతన్యతో విడిపోయినా.. ఇప్పటికీ తన ఫేవరేట్ చిత్రం ఇదేనని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. నాగ చైతన్య కూడా తన ఫేవరేట్ చిత్రాల్లో వైఎంసీ ఒకటి అని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇలా ఇద్దరికీ చాలా ఇష్టమైన చిత్రం మళ్లీ థియేటర్స్లో సందడి చేయబోతుంది. జులై 18న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. అటు అక్కినేని ఫ్యాన్స్తో పాటు సమంత అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీరిలీజ్ చేయాలని సగటు సినీ ప్రియులు కూడా కోరుకున్నారు. ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత మళ్లీ జెస్సీ(సమంత), కార్తీక్ (నాగ చైతన్య)ల లవ్స్టోరీ మళ్లీ వెండితెరపై చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఈ సినిమా కంటే ఎక్కువగా మరో విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. రీరిలీజ్ ప్రమోషన్స్ లో సమంత, నాగ చైతన్య కలిసి పాల్గొంటారా? అని ఇరువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుంటున్నారు. ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ ఇది అసాధ్యమనే చెప్పాలి. చైతూ గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మాజీ భర్తని కలిసేందుకు ఇష్టపడుతుందా అంటే .. కష్టమనే చెప్పాలి. అటు నాగ చైతన్య కూడా శోభితతో పెళ్లి తర్వాత అన్ని మర్చిపోయి హాయిగా కొత్త జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన కూడా సామ్తో కలిసి ప్రమోషన్స్లో పాల్గొనడం కష్టమే. అభిమానుల కోరుకున్నట్లుగా వీరిద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోవడం ఇప్పట్లో అసాధ్యం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సుప్రీం కోర్టులో కమల్ సినిమాకు భారీ ఊరట!
కమల్ హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’(Thug Life) చిత్రానికి సుప్రీ కోర్టు(supreme court of india)లో భారీ ఊరట లభించింది. కర్ణాటకలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు ఈ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం కోర్టు హెచ్చరించింది. థియేటర్స్లో ఏమి ప్రదర్శించాలనే అధికారం గుంపులకు, ఆరాచక శక్తులకు లేదని, మూక బెదిరింపులకు చట్ట పాలనను తాకట్టు పెట్టలేమని కోర్టు పేర్కొంది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా విడుదల చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.అలాగే కమల్ వ్యాఖ్యలను వ్యతిరేకించే హక్కు కర్ణాటక ప్రజలకు ఉందని, ప్రాథమిక హక్కులను కాపాడాలని ధర్మాసనం పేర్కొంది. ‘కమల్ వ్యాఖ్యలు తప్పు అని కర్ణాటక, బెంగళూరు వాసులు నమ్మితే.. అలా చెబుతూ ఒక ప్రకటన జారీ చేయవచ్చు. సినిమా థియేటర్లను తగలబెట్టాలని ఎందుకు బెదిరిస్తున్నారు?’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.చిత్ర నిర్మాత దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు నుంచి తనకే బదిలీ చేసుకున్న సుప్రీం కోర్టు.. దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. అలాగే ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది.అసలేం జరిగిందంటే.. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకీ దారి తీశాయి. కమల్ వ్యాఖ్యలపై కన్నడిగులు భగ్గుమన్నారు. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పకపోవడంతో కర్ణాటకలో ఈ సినిమా విడుదలను నిషేధించారు. దీనిపై చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నేడు ఆదేశాలు జారీ చేసింది. -
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్.. రిలీజ్కు ముందే రికార్డు!
రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi). ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చింది. ఒకే ఒక షాట్తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. ‘ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాల, పుడతాం ఏటి మళ్లీ’ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్చరణ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఒక్క గ్లింప్స్తోనే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది ఈ చిత్రం. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఇచ్చేశాడట నిర్మాత వెంకట సతీష్. డిజిటల్ రైట్స్ కోసం రెండు భారీ ఓటీటీ సంస్థలు పోటీ పడగా.. చివరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అయితే ఈ డీల్లో కొన్ని కండీషన్స్ ఉన్నాయట. రూ. 105 కోట్లు తొలుత అందజేసి.. సినిమా రిజల్ట్ని బట్టి మరింత పెంచేస్తామని నెట్ఫ్లిక్స్ కండీషన్ పెట్టిందట. తెలుగు లో ఆడితే ఇంత.. హిందీలో ఈ స్థాయి కలెక్షన్స్ సాధిస్తే మరింత..అని ఒప్పందం కుదుర్చుకున్నారు. రిలీజ్ తర్వాత ఫలితాన్ని బట్టి రూ. 105 కోట్లతో పాటు మరింత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అయిన చిత్రాలకే ఓటీటీ డీల్ కావట్లేదు. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి విశ్వంభర లాంటి చిత్రాలకు కూడా ఇంకా ఓటీటీ బిజినెస్ కాలేదు. అలాంటిది దాదాపు 50 శాతం షూటింగ్ పెండింగ్లో ఉన్న పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ఆ టైమ్లో నాకు ప్రభాస్ ఒక్కడే సపోర్ట్గా నిలిచాడు: మారుతి
‘‘నేను దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో మా కాంబినేషన్లో(ప్రభాస్–మారుతి) మూవీ అనుకున్న ప్రొడ్యూసర్ డ్రాప్ అయ్యారు. కానీ, అలాంటి టైమ్లో నాకు సపోర్ట్గా నిలిచిన ఒకే ఒక వ్యక్తి ప్రభాస్గారు. అందుకే ‘ది రాజా సాబ్’ ను ఒక సవాల్గా తీసుకుని సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని డైరెక్టర్ మారుతి తెలిపారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకానుంది. (చదవండి: 'ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశారు'.. ఎస్కేఎన్ కామెంట్స్ వైరల్!)హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మారుతి మాట్లాడుతూ–‘‘ప్రభాస్గారిని ‘బుజ్జిగాడు’ సినిమా స్టైల్లో ‘ది రాజా సాబ్’ ద్వారా వింటేజ్ లుక్లో చూపిస్తున్నాం. కొంత షూటింగ్, సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి’’ అన్నారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది. ఈ మూవీకి సీక్వెల్ పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుంది’’ అన్నారు. ఈ వేడుకలో ‘ది రాజా సాబ్’ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతి, కెమేరామేన్ కార్తీక్ పళని, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ మాట్లాడారు. -
ఆ పని మానేయండి.. డబ్బు సంపాదించడానికి టైమ్ ఎక్కడ?: నాగ్
దేశంలో అత్యంత ధనిక హీరోల్లో కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) ఒకరు. షారూఖ్ ఖాన్, జుహీ చావ్లా తర్వాత రూ.3500 కోట్ల సంపదతో ఈయన మూడో స్థానంలో ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు వ్యాపార రంగంలో పెట్టుబడులు ఆయన సంపదను మరింత పెంచాయి. తాజాగా నాగ్ జెన్ జెడ్ (Generation Z)కు విలువైన సలహా ఇచ్చాడు.డబ్బు ఎప్పుడు సంపాదిస్తారు?కుబేర సినిమా ఈవెంట్లో యాంకర్ సుమ (Anchor Suma Kanakala) మాట్లాడుతూ.. జెన్ జెడ్ ఫోన్ రీచార్జులపై ఎక్కువ ఖర్చు పెడుతోంది. అసలేం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఓ సలహా ఇవ్వమని నాగార్జునను అడిగింది. అందుకాయన క్షణం ఆలోచించకుండా ఫోన్ చూడటం ఆపేయండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఫోన్ చూస్తూ కూర్చుంటే డబ్బులు సంపాదించేందుకు సమయం ఎక్కడుంది? అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. ఇదేంటి? ఈ సలహా నాకే చెప్తున్నట్లు ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సినిమానాగార్జున చివరగా నా సామిరంగ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కుబేర, కూలీ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇవి రెండు కూడా మల్టీస్టారర్ చిత్రాలే కావడం విశేషం. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కుబేరకు శేఖర్ కమ్ముల డైరెక్టర్. రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా జిమ్ సర్భ్ ముఖ్య పాత్ర పోషించింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. జూన్ 20న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతోంది.#Nagarjuna gives a financial advice to GenZ 🥲👌 pic.twitter.com/uV0pygF06W— Movies4u Official (@Movies4u_Officl) June 15, 2025 చదవండి: ప్రభాస్.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి -
రూ.230 కోట్ల మూవీ.. డైలాగ్తో సహా కథంతా కాపీయే!: దర్శకుడి ఆరోపణలు
మలయాళంలో ఇటీవల బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన చిత్రం తుడరుమ్ (Thudarum Movie). మోహన్లాల్, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.230 కోట్లు రాబట్టింది. దీంతో మలయాళ సినీచరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా తుడరుమ్ నిలిచింది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది.2020లో రాసుకున్న కథతాజాగా ఈ మూవీ చూసిన డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరణ్ (Sanal Kumar Sasidharan) తుడరుమ్పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. 2020లో నేను 'తీయట్టం' అని ఓ స్క్రిప్ట్ రాశాను. తుడరుమ్ చూస్తుంటే.. తీయట్టంలోని మూలకథను దొంగిలించినట్లే అనిపించింది. నా కథను చోరీ చేసి ఈ సినిమా రూపొందించారు. నా కథ సారాంశాన్ని గ్రహించేంత శక్తి వారికి లేకపోవడం వల్ల మూల కథ ఆత్మ ఇందులో చెక్కుచెదరకుండా కనిపిస్తోంది.డైలాగ్ కూడా నాదే!తీయట్టం కథ అంబి అనే ఆటో డ్రైవర్ చుట్టూ నడుస్తుంది. కొందరు ఓ వ్యక్తిని తల నరికి అతడి ఆటోలో పడేస్తారు. దీంతో ఈ హత్య కేసులో అంబి ఇరుక్కుంటాడు. ఇదే ప్రధాన కథ. నాకు మచ్చుకైనా చెప్పకుండా, ఎటువంటి క్రెడిట్ ఇవ్వకుండా దీన్ని కాస్త అటుఇటుగా మార్చేసి తుడరుమ్లో వాడుకున్నారు. అలాగే ఒరిజినల్లో.. నువ్వు చంపితే అది పాపం.. కానీ, తింటే అది శుద్ధి అవుతుంది అన్న డైలాగ్ను కూడా సందర్భం లేకపోయినా తుడురుమ్లో వాడుకున్నారు.ఓవర్ కాన్ఫిడెన్స్ఎంతో అనుభవమున్న దొంగలు కూడా ఎవరికీ దొరకములే అన్న అతి విశ్వాసంతో కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. తుడరుమ్లో ఈ డైలాగ్ను చేర్చడం చూస్తే నాకలాగే అనిపించింది. నేనెప్పుడో ఈ సినిమా చేయాల్సింది. మంజు వారియర్, టోవినో థామస్, మురళీ గోపి వంటి నటులతో ఈ మూవీ చేసేందుకు ఓ పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. కానీ ఐదు సంవత్సరాలు అయిపోయినందున వారంతా దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. త్వరలోనే నా కథను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని రాసుకొచ్చాడు.చదవండి: 'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన -
హారర్ కామెడీగా ‘లోపలికి రా చెప్తా’
కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘లోపలికి రా చెప్తా’. మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ కీలక పాత్రలు పోషించారు. హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మాస్ బంక్ మూవీస్ పతాకంపై లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, పోస్టర్స్ అన్నింటినీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని తెలుపుతూ.. చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘లోపలికి రా చెప్తా’ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. ‘‘మా చిత్రంలో హీరో క్యారెక్టర్ డెలివరీ బాయ్. అందుకే చిత్రంలోని మొదటి సాంగ్ను ఓ డెలివరీ బాయ్తో విడుదల చేయించాం. ఆ పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తయ్యాయి. జూలై 5 న గ్రాండ్గా థియేటర్లలోకి సినిమాను తీసుకు రానున్నాం. ప్రతిష్టాత్మకమైన సరిగమ ఆడియో కంపెనీ ఈ చిత్ర ఆడియో హక్కులు దక్కించుకుంది. అవుట్ ఫుట్ చూసి టీమంతా ఎంతో హ్యాపీగా ఉన్నాం. కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే సినిమాగా ‘లోపలికి రా చెప్తా’ నిలుస్తుంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుసుకుందాం’’ అని అన్నారు. -
అప్పుడు ‘నంది’..ఇప్పుడు ‘గద్దర్’..రెంటాల అరుదైన ఘనత
రచయిత, పరిశోధకుడు, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డు’ను అందుకున్నారు. సినీ రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఉత్తమ తెలుగు చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో భాగంగా ‘తెలుగు సినిమాపై వచ్చిన ఉత్తమ రచనల’ కేటగిరీలో జయదేవ రాసిన పుస్తకానికి 2024వ సంవత్సరానికి గాను ఈ గౌరవం లభించింది. మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలను తవ్వితీసి, జయదేవ రచించిన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకాన్ని ‘ఉత్తమ సినీ గ్రంథం’గా రాష్ట్ర ప్రభుత్వ జ్యూరీ ఎంపిక చేసింది. శనివారం హైదరాబాద్లో వైభవంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గద్దర్ అవార్డు సిల్వర్ మెమెంటో, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని జయదేవకు అందజేశారు. ఈ సందర్భంగా వేదికపై ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం ప్రతిని ఉప ముఖ్యమంత్రి అందుకొని, రచయితను అభినందించారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం సినిమా అవార్డులు ప్రకటించడం ఇదే తొలిసారి. ఆ తొట్టతొలి అవార్డే రెంటాల జయదేవను వరించడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులుగా పాపులరైన ఈ పురస్కారాల్లో... గతంలో 2011వ సంవత్సరానికి గానూ జయదేవకు ‘ఉత్తమ సినీ విమర్శకుడు’గా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ గౌరవం సైతం అందుకున్నారు. తాజా గద్దర్ అవార్డుతో... అటు నంది, ఇటు గద్దర్... రెండూ సాధించి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పురస్కార విజేత అయిన తొలి జర్నలిస్టు అనే అరుదైన రికార్డు జయదేవకు దక్కింది. -
‘సన్రైజర్స్’ ఓనర్తో పెళ్లి.. స్పందించిన అనిరుధ్!
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందన్(Anirudh Ravichander ) పెళ్లిపై ప్రతిసారి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. గతంలో నటి ఆండ్రియాతో అనిరుధ్ పెళ్లి అనే ప్రచారం జరిగింది. అందులో కూడా వాస్తవం లేదని తేలింది. వారిద్దరు డేటింగ్ చేసినా..కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత కీర్తి సురేశ్తో పెళ్లి పక్కా అని కోలీవుడ్ అంతా కోడై కూసింది. కీర్తి పెళ్లయిన తర్వాత ఆ రూమర్స్ తగ్గిపోయాయి. ఇక ఇప్పుడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లిపై మరో రూమర్ బయటకు వచ్చింది. ఐపీఎల్లో కీలక జట్టు ‘సన్రైజర్స్ హైదరాబాద్’ అధినేత కావ్యా మారన్( kavya Maran)ని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త గత రెండు రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టింది. 2014 నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో మాత్రం పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై అనిరుధ్ స్పందించాడు. ‘‘నాకు పెళ్లా..? చిల్ అవ్వండి.. ఇలాంటి రూమర్స్ని స్ప్రెడ్ చేయకండి’అని అనిరుధ్ ట్వీట్ చేశాడు. దీంతో కావ్యా మారన్ తో పెళ్లి అనేది కూడా పుకారేనని తేలిపోయింది. అనిరుధ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ కూలీ, విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. దీంతో పాటు నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రం %ప్యారడైజ్’కి కూడా అనిరుధే మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. -
నా సూపర్ హీరోని స్మరించుకుంటున్నా : చిరంజీవి
ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి నీరాజనం అర్పిస్తూ హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. మనం స్థిరంగా ఉండడానికి, జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి నాన్న ఎంతో తోడ్పాటు అందిస్తారని చెబుతూ.. ‘నా తండ్రిని, నా సూపర్ హీరోని స్మరించుకుంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ‘తమ బలం, జ్ఞానం, ప్రేమతో జీవితాలను తీర్చిదిద్దే ప్రపంచంలోని అద్భుతమైన తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అని కోట్ చేశారు. కాగా, చిరంజీవి నాన్న వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారు. ఉద్యోగ రీత్యా ఆయనకు పలు ప్రాంతాలకు బదిలీలు జరిగడంతో చిరంజీవి బాల్యం నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరు వంటి వివిధ ప్రాంతాల్లో గడిచింది. నాన్న సాధారణ పోలీసు అయినప్పటికీ తమను ఎంతో క్రమశిక్షణగా పెంచారని గతంలో చిరంజీవి గుర్తు చేసుకున్నారు. Fathers give us roots to stay grounded and wings to soar high in our lives. Remembering My father, My Super Hero and wishing a Happy Father’s Day to all the wonderful fathers of the world, who shape lives with their strength, wisdom and love ! 🙏#HappyFathersDay— Chiranjeevi Konidela (@KChiruTweets) June 15, 2025 -
సీఎం రేవంత్ సమక్షంలో అల్లు అర్జున్ మాస్ డైలాగ్..వీడియో వైరల్
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ సినిమా అవార్డుల వేడుకలో అల్లు అర్జున్కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. 2024 ఏడాదిగాను పుష్ప-2 మూవీకి అల్లు అర్జున్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప 2 చిత్రానికి అందిన తొలి అవార్డు ఇది. తెలంగాణ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఈ అవార్డు వేడుకను ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను’అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పుష్ప-2 మూవీలోని మాస్ డైలాన్ని చెప్పి ఆకట్టుకున్నాడు. ఇది సినిమా ఫంక్షన్ కదా.. తన సినిమాలోని డైలాగ్ను చెప్పవచ్చా.. అని అడిగి మరీ అల్లు అర్జున్ ‘రప్పా రప్పా’ డైలాగ్ చెప్పాడు. -
యముడు: ధర్మో రక్షతి రక్షిత: పాట రిలీజ్
మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్గా ‘యముడు’ అనే చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు 'ధర్మో రక్షతి రక్షితః' అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది.తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధర్మో రక్షతి’ అంటూ సాగే ఓ అద్భుతమైన పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు వంశీ సరోజిని వికాస్ సాహిత్యాన్ని అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి, అరుణ్ కౌండిన్య, హర్ష వర్దన్ చావలి ఆలపించారు. భవానీ రాకేష్ అందించిన బాణీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ‘యముడు’ రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటించనున్నారు. -
కాంతారను వెంటాడుతున్న విషాదాలు.. ఎందుకిలా జరుగుతోంది?
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించిన బ్లాక్బస్టర్ మూవీ కాంతార (Kantara Movie). 2022లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి మేకర్స్ ప్రీక్వెల్ (కాంతార: చాప్టర్ 1) ప్రకటించారు.అయితే ఏ ముహూర్తాన కాంతార 1 ప్రకటించారో కానీ అప్పటినుంచి ఏదో ఒక అడ్డంకులు, విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాంతార నటుడు, మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు (43) గుండెపోటుతో మరణించాడు. తీర్థహళ్లిలో చిత్రయూనిట్తో బస చేసిన అతడికి బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశాడు. ఇతడు మాలికాపురం, మార్కో వంటి పలు చిత్రాల్లో నటించాడు. 25 ఏళ్లుగా మిమిక్రీ రంగంలో రాణిస్తున్నాడు.గతంలో..షూటింగ్ ప్రారంభించిన కొత్తలో కర్ణాటకలోని ముడూరులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారేమో తీవ్రమైన గాలివాన వల్ల భారీ సెట్ కూలిపోయింది. ఇటీవల మలయాళ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నదిలో మునిగి విగతజీవిగా తేలాడు. ఆ తర్వాత కన్నడ నటుడు, హాస్య నటుడు రాకేశ్ పూజారి (33) గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు కళాభవన్ కన్నుమూశాడు. ఈ వరుస విషాదాలు కాంతార చిత్రయూనిట్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.అడవిలో పేలుళ్లుఅయితే నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ఆరోపణలు వచ్చాయి. అడవిలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని, పేలుళ్లతో ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయం అక్కడి అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె దృష్టికి రాగా.. తక్షణమే షూటింగ్ ఆపేయాలని అధికారులను ఆదేశించారు.ఇకపోతే పంజుర్లి దేవుడి ఆగ్రహంతోనే ఇలా జరుగుతోందన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. కాంతార సినిమాతోనే పంజుర్లి దేవుడు గురించి వెలుగులోకి వచ్చింది. పంజుర్లి అంటే పంది. చెడు చేసేవారిని శిక్షించి, మంచిని ఆశీర్వదించే భగవంతుడే పంజుర్లీ అని నమ్ముతారు.చదవండి: మా అక్కను పెళ్లి చేసుకుంటే 1+1 ఆఫర్.. అవాక్కైన హీరో -
హైదరాబాద్లో అత్యంత భారీ తెర.. వేచి ఉండక తప్పదు!
అత్యంత భారీ తెరపై సినీ అనుభవం కోసం.. హైదరాబాద్లోని సినీ ప్రియులు మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. ఐ మ్యాక్స్ కార్పొరేషన్ ప్రకటనతో ఈ విషయం స్పష్టమైంది. పదేళ్ల క్రితం.. తెరమరుగై.. ఇటీవలే ఏషియన్ సినిమా గ్రూప్ అధిపతి సునీల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నగరంలోని హకీంపేట ప్రాంతానికి సమీపంలో తమ ఆధ్వర్యంలో ఐమాక్స్ స్క్రీన్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 70 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న స్క్రీన్ కోసం ప్రణాళికలను కూడా ఆయన వెల్లడించారు. ఇది ఐమాక్స్ అనుభవం కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. 2014లో ఐకానిక్ ప్రసాద్స్ ఐమాక్స్ తెర‘మరుగై’పోయిన దగ్గర నుంచి మళ్లీ ఐమాక్స్ తిరిగి రావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారు ఐమాక్స్ మ్యాప్లో సిటీ తన స్థానాన్ని తిరిగి పొందే అవకాశం ఉందని సంతోషించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఖండించిన ఐమ్యాక్స్.. అయితే ఐమ్యాక్స్ కార్పొరేషన్ అధికారికంగా ఏషియన్ సినిమాస్తో భాగస్వామ్యం వార్తల్ని ఖండించింది. ఈ మేరకు ఐమ్యాక్స్ కార్పొరేషన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రీతం డేనియల్, ఎక్స్లో పోస్ట్ చేసారు. దాంతో ఐమ్యాక్స్ నగరానికి ఇప్పట్లో రాదనే విషయం ఖరారైంది. దేశంలోనే తొలి ఐమ్యాక్స్ కలిగి ఉన్న నగరం అనే హోదాను పోగొట్టుకున్న సిటీ ఐమ్యాక్స్ తెరలు ఉన్న నగరాల జాబితాలో చేరడానికి కూడా మరింత కాలం వేచి ఉండక తప్పదు. The recent reports that IMAX is partnering with Asian Cinemas to bring an IMAX location to Hyderabad are entirely false. While IMAX is in conversation with multiple exhibitors about bringing IMAX to Hyderabad, no agreement is currently in place. IMAX is eager to expand into…— Preetham Daniel (@preethamdnl) June 11, 2025 -
పదేళ్ల వయసులోనే డైరెక్టర్.. గిన్నిస్ బుక్లో చోటు
ప్రతి వారం టీవీలోనో, ఓటిటి (OTT)లోనో, థియేటర్లోనో ఏదో ఒక సినిమా చూస్తూ ఉంటాం. సినిమా తీయడం టీమ్ ఎఫెర్ట్. చాలామంది కలిసి పని చేస్తేనే సినిమా తయారవుతుంది. వాళ్లందరూ ఏమేం చేయాలో చెప్పేవాడే డైరెక్టర్. అందుకే డైరెక్టర్ని ‘కెప్టెన్ ఆఫ్ ద షిఫ్’ అని పిలుస్తారు. ఎంతో అనుభవం, టాలెంట్ ఉంటే తప్ప డైరెక్టర్గా మారడం కష్టం. అలాంటిది పదేళ్ళ పిల్లాడు దర్శకుడిగా మారి సినిమా తీశాడంటే, ఆ సినిమా గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటు సంపాదించిందంటే నమ్మడం సాధ్యమేనా? అవును సాధ్యమే! చిన్న వయసులోనే..ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసాడు కర్ణాటకకి చెందిన కిషన్ శ్రీకాంత్. బెంగళూరులో జన్మించిన కిషన్ చిన్నప్పటినుంచే సినిమాల మీద విపరీతమైన ఆసక్తి చూపించాడు. ఆ ఆసక్తి ఇష్టంగా మారి ఏకంగా సినిమాని డైరెక్ట్ చేసేదాక తీసుకెళ్లింది. 2006లో Care of Footpath సినిమాను పదేళ్ళ వయస్సులో కన్నడలో తీశాడు కిషన్. అనాథ బాలుడు విద్యను కాంక్షించే నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, సౌరభ్ శుక్లా, జయశ్రీ వంటి ప్రముఖ నటులు నటించారు. అంతర్జాతీయంగా..మొత్తం ఐదు భారతీయ భాషల్లో డబ్ అయిన ఈ సినిమా 54వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో గోల్డెన్ లోటస్ అవార్డ్తో పాటు కర్ణాటక స్టేట్ అవార్డును గెలుచుకుంది. అంతర్జాతీయంగా కూడా సైప్రస్, ఇటలీ, దక్షిణ కొరియా ఫిలిం ఫెస్టివల్స్లో ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా, పూర్తి నిడివిగల ఫీచర్ ఫిలింని డైరెక్ట్ చేసినందుకు ‘అతి పిన్న ఫీచర్ ఫిలిం డైరక్టర్గా గిన్నిస్ బుక్లో రికార్డ్స్ సాధించాడు కిషన్.సినిమాలుఆ తరువాత కాలంలో Care of Footpath సీక్వెల్ను త్రిభాషా చిత్రంగా కన్నడ, హిందీ, తెలుగులో డైరెక్ట్ చేశాడు కిషన్. ఇందులో జువెనైల్ నేరాలు, న్యాయ వ్యవస్థ పనితీరుల గురించి చర్చించారు. ఇషా డియోల్, అవికా గోర్ నటించారు. ఈ రెండు సినిమాలతో పాటు Kill Them Young (2015), Teenage (2013), Enidu Manasali (2014), Maanja (2016) వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. మరికొన్నిట్లో నటించాడు కూడా! -
మా అక్కను పెళ్లి చేసుకుంటే 1+1 ఆఫర్.. అవాక్కైన హీరో
అశ్విని శ్రీ (Ashwini Sree).. పలు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసినా రాని గుర్తింపు బిగ్బాస్ షోతో వచ్చింది. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొన్న ఈమె షోకు గ్లామర్ అద్దింది. ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తోంది. తాజాగా ఓ డ్యాన్స్ షోలో అశ్విని చేసిన కామెంట్లు నెట్టింట వైరల్గా మారాయి. ఆ డ్యాన్స్ షోలో హీరో అడివి శేష్ గెస్టుగా రావడాన్ని చూసి ఈ బిగ్బాస్ బ్యూటీ సర్ప్రైజ్ అయింది. మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని శేష్కు చెప్పింది. అక్కను పెళ్లి చేసుకుంటే..అందుకా హీరో.. నాక్కూడా మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని బదులిచ్చాడు. అప్పుడు అశ్విని.. మీరు మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి. మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుంది. అంటే అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వస్తాను అనేసరికి శేష్ నోరెళ్లబెట్టాడు. అయితే ఎలా వస్తాననేది కూడా చెప్తాననేసరికి హీరో నవ్వుతూనే సరేనని బదులిచ్చాడు. సదరు డ్యాన్స్ షో ప్రోమోలో ఇంతవరకే చూపించారు. ఏదేమైనా అశ్విని మాట్లాడిన తీరుకు అక్కడున్న జనం నవ్వాపుకోలేకపోయారు. ఇలా ట్విస్టులు ఇచ్చుకుంటూ మాట్లాడేబదులు అసలు విషయమేంటో డైరెక్ట్గా చెప్పొచ్చుగా అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 11A సీట్.. 1998లో అచ్చం ఇలాగే.. రెండో జన్మ ఎత్తిన సింగర్! -
Bhool Chuk Maaf Review: తెల్లారితే పెళ్లి.. కానీ రోజు మారదు.. ఇదేం ట్విస్ట్!
ఈ రోజుల్లో తాము చేసిన తప్పుని తెలుసుకొని సరిదిద్దుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. చాలామంది భయం లేకుండానే తప్పులు చేస్తుంటారు. మరి తప్పు చేసినవాడికి తన తప్పు తెలుసుకోవడానికి చిన్న పాటి భయం కలిగిస్తే అన్న ఆలోచనతోనే రూపుదిద్దుకున్న సినిమా భూల్ చుక్ మాఫ్. కరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ధమాన బాలివుడ్ నటుడు రాజ్కుమార్ రావు హీరోగా నటించారు. ఈ సినిమా కథ చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంతే సరదాగా సినిమా అంతా సాగిపోతుంది కూడా.అంతలా కథలో ఏముందంటే... వారణాసి నగరానికి చెందిన తితిలి మిశ్ర, రంజన్ తివారి ప్రేమించుకుంటుంటారు. తితిలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి తమ కూతురుని రంజన్ పెళ్ళాడాలంటే గవర్నమెంట్ ఉద్యోగం తప్పని సరి అని కండిషన్ పెడతారు. ఇది విన్న రంజన్ హమీద్ అంసారీ అనే బ్రోకర్ ద్వారా దొంగ దారిలో గవర్నమెంట్ ఉద్యోగం త్వరగానే సంపాదిస్తాడు. ఇంకేముంది ఇరు కుటుంబాలు కలిసి ఇద్దరికీ పెళ్ళి చేయాలని ఓ తేదీని నిర్ణయిస్తాయి. రేపు పెళ్ళి అనగా ఈ రోజు నిద్ర లేచి నలుగు కార్యక్రమానికి రెడీ అవుతుంటాడు రంజన్. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపి రేపటి తన పెళ్ళి గురించి కలలు కంటూ మరుసటి రోజు నిద్ర లేస్తాడు.కాని ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ నలుగు కార్యక్రమం రోజే రంజన్ నిద్ర లేస్తాడు. ఇలా ఎన్ని రోజులైనా అదే రోజు నిద్ర లేస్తూ ఉంటాడు. రంజన్ టైం లూప్ లో ఇరుక్కుపోయి ఇలా జరుగుతూ ఉంటుంది. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి చక్కగా పెళ్ళి చేసుకుందామన్న సమయంలో ఈ సమస్య రంజన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి రంజన్ ఈ టైం లూప్ నుండి బయటపడి పెళ్ళి చేసుకోగలుగుతాడా, అసలు ఇలాంటి సమస్య రంజన్ కు ఎందుకు వచ్చింది. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న భూల్ చుక్ మాఫ్ చూడాల్సిందే. ఈ సినిమా కథలో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కామెడీతో దానిని ప్రేక్షకుడికి చక్కగా అర్ధమయ్యేలా తీశాడు దర్శకుడు. సినిమా ఆద్యంతం నవ్వులతో గిలిగింతలు పెడుతూ హాయిగా సాగుతుంది. వర్త్ ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్. -
ఇంటిమేట్ సీన్స్ అంటే కష్టంగా ఉంది కానీ.. : హీరోయిన్
ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గరైన మలయాళ నటి అనంతిక. మ్యాడ్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ నటి.. తొలి సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పుడు 8 వసంతాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 20న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన అనంతిక.. సినిమాల్లోని ఇంటిమేట్ సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తను కూడా రెడీ అని చెప్పింది. ‘ఇప్పటి వరకు ఇంటిమేట్ సీన్స్ చేయలేదు. అలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టంగా అనిపిస్తుంది. అలా అని నేను అలాంటి పాత్రను చేయనని చెప్పట్లేదు. నిజంగా కథ డిమాండ్ చేస్తే.. ఇంటిమేట్ సీన్స్ చేయడానికి నాకేమి ఇబ్బంది లేదు. అయితే అప్పుడు కూడా కొంత లిమిటేషన్ ఉంటుంది’ అని చెప్పింది.ఇక తన లక్ష్యాలను గురించి చెబుతూ.. తనకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తే లేదని చెప్పింది. ‘చిన్నప్పటి నుంచే నేను డ్యాన్స్ నేర్చుకున్నాను. దాంతో పాటు కరాటే కూడా నేర్చుకున్నాను. అయితే ఇవ్వన్ని సినిమాల్లోకి రావాలని నేర్చుకోలేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. కోవిడ్ టైంలో ఖాలీగా ఉండడంతో ఓ మలయాళ సినిమాలోకి డ్యాన్సర్గా వెళ్లాను. అక్కడ డీఓపీ నన్ను చూసి హీరోయిన్గా ట్రై చెయ్యొచ్చు కదా అని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచే సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశా. మంచి సందేశం ఇచ్చే చిత్రాలను చేయాలనుకున్నాను. నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటున్నాను. అయితే నటిగా కొనసాగాలని నాకు లేదు. కొన్నేళ్ల తర్వాత అయినా నేను రాజకీయాల్లో వెళ్తా. దాని కోసమే నేను ‘లా’ చదువుతున్నాను. 35-40 ఏళ్ల వయసు వచ్చాక రాజకీయాల్లోకి వెళ్తా’ అని అనంతిక చెప్పుకొచ్చింది. -
సడన్గా ఆ సీన్లో నటించమన్నారు.. ఇష్టం లేకుండానే..: మధుబాల
రోజా సినిమాతో మధుబాల (Madhoo/ Madhubala) క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ హీరోయిన్ కెరీర్ తొలినాళ్లలో తనకంటూ కొన్ని హద్దులు గీసుకుంది. ముద్దు సన్నివేశాల్లో నటించకూడదని భీష్మించుకుని కూర్చుంది. కానీ ఓ సినిమా కోసం దాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మధుబాల మాట్లాడుతూ.. నేను పెరిగిన వాతావరణం వల్ల ఆన్స్క్రీన్లో కొన్ని సన్నివేశాల్లో నటించాలంటే ఇబ్బందిగా అనిపించేది. సడన్గా ఆ సీన్లో..ఆయా సీన్లలో నటించలేక సినిమాలు వదిలేసుకున్న సందర్భాలెన్నో..! అయితే ఓ సినిమా చేస్తున్న సమయంలో ముద్దు సన్నివేశంలో నటించాలన్నారు. దీనిగురించి నాకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. షూటింగ్కు ముందు ఒక్కమాటైనా చెప్పలేదేంటి? అని నిలదీశాను. అప్పుడు నన్ను పక్కకు తీసుకెళ్లి.. ఈ సీన్ అవసరం.. అందుకే చేయమంటున్నాం అని బతిమాలారు. అసలు ఆ సీన్ అవసరమే లేదుఇష్టం లేకపోయినా ఆ సన్నివేశంలో నటించాను. దాన్ని సినిమాలో ఉంచకూడదని దర్శకుడిని నేనడగలేదు. వాళ్ల ఇష్టానికే వదిలేశాను. తీరా ఆ సీన్కు ఎటువంటి ప్రాధాన్యత లేదని పక్కన పెట్టేశారు. అప్పుడు నాది చాలా చిన్నవయసు. కానీ, ఈ రోజుల్లో 22 ఏళ్ల అమ్మాయి కూడా చాలా తెలివిగా ఉంటున్నారు. ఏ సీన్కైనా రెడీ అని సాహసం చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికి వస్తే మధుబాల నటించిన కన్నప్ప జూన్ 27న విడుదల కానుంది.చదవండి: పాకిస్తాన్లో 'దంగల్' ఎందుకు రిలీజ్ చేయలేదో చెప్పిన ఆమిర్ ఖాన్ -
డైరెక్టర్గా మారనున్న పాపులర్ కమెడియన్
అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు, బ్రోచేవారెవరురా, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). సినిమాలతో బిజీగా ఉన్న ఇతడి దృష్టి తాజాగా దర్శకత్వం మీదకు మళ్లింది. డైరెక్టర్గా ఓ సినిమా చేయబోతున్నానని ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించాడు. అడ్వెంచర్ మూవీ తీయబోతున్నట్లు తెలిపాడు. నటనపై ఆసక్తి గలవారు వారి షో రీల్స్, రెజ్యూమ్లను తన మెయిల్ ఐడీకి పంపించాలని కోరాడు.రామకృష్ణ కెరీర్సైన్మా అనే షార్ట్ ఫిలింతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చాడు. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ లఘుచిత్రంతోనే రాహుల్ కెరీర్ ప్రారంభించింది. జయమ్ము నిశ్చయమ్మురా మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. ఈ చిత్రానికి సంభాషణల రచయితగానూ పని చేశాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చివరగా మనమే సినిమాలో కనిపించాడు. ఒకటీరెండు సినిమాల్లో పాటల రచయితగానూ తన ప్రతిభ చూపించాడు.చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది? -
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతే అది సామాన్యులకు సంకటం కావచ్చు కానీ సెలబ్రిటీల భవిష్యత్తుకు ఏ మాత్రం ఆటంకం కాదనేది తెలిసిందే. అందుకే ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్లు సర్వసాధారణంగా కనిపించే తారా లోకంలో సంఘటనలు సామాన్యులకు ఎప్పుడూ వింతల్లా, విశేషాల్లాగే ఉంటాయి. అలాంటిదే అఖిల్ ప్రేమ, నిశ్చితార్ధం, బ్రేకప్... తాజాగా పెళ్లి... అక్కినేని వంశ ఘనమైన నట వారసత్వాన్ని మోయడానికి సినీ రంగంలోకి దిగిన అఖిల్... ఇంకా కెరీర్ నిర్మాణంలో తడబడుతూనే ఉన్నాడనేది తెలిసిందే. అయితే కారణం తెలీదు గానీ చాలా మంది నట వారసులకు భిన్నంగా ఇంకా కెరీర్ రూపుదిద్దుకోకుండానే అఖిల్ పెళ్లికి మాత్రం తొందరపడ్డాడనే చెప్పాలి. నిజానికి 2016లో, అఖిల్ అక్కినేని తన ప్రియురాలైన 26 ఏళ్ల శ్రియా భూపాల్తో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు కేవలం 22 సంవత్సరాలు అని సమాచారం. అంటే అక్కినేని యంగ్ హీరోకి ఆమెకీ దాదాపు 4 సంవత్సరాల వయస్సు అంతరం ఉందని తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే...తాజాగా అఖిల్ పెళ్లి చేసుకున్న యువతి కూడా తనకన్నా వయసులో పెద్ద అంటూన్నారు.మరోవైపు అఖిల్తో పెళ్లి రద్దు చేసుకున్న శ్రియా భూపాల్(Shriya Bhupal) ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తోంది? అనే విషయానికి వస్తే... హైదరాబాద్లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన జివికె వారి ఇంట జన్మించిన శ్రియ, ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ మేకర్. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యాషన్ స్కూల్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఆమె పట్టభద్రురాలైంది, ఫ్యాషన్ డిజైనర్గా శ్రియా శరణ్, సమంతా రూత్ ప్రభు కాజల్ అగర్వాల్ వంటి టాప్ టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఆమె డిజైన్లను అందించారు. అంతేకాకుండా శ్రియా ’శ్రియా సోమ్’ అనే దుస్తుల బ్రాండ్ కు వ్యవస్థాపకురాలు కూడా. ప్రస్తుతం ఆమె లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నా... తన పనిలో బిజీగానే ఉన్నారని సమాచారం.అఖిల్తో బ్రేకప్ తర్వాత ఆమె చాలా వేగంగా కొత్త అనుబంధంలోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాజకీయ ప్రముఖుడు, ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడైన అనిందిత్ రెడ్డి ని ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు. సినిమా సెలబ్రిటీ కాకపోయినా అనిందిత్ రెడ్డి కూడా సాదా సీదా యువకుడేమీ కాదు. అత్యంత అరుదైన రంగంలో అతను రాణిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి టాప్ క్లాస్ రేసింగ్ డ్రైవర్గా నిలిచాడు. గత 2016లో యూరో జెకె 16 ఛాంపియన్ షిప్, యూరో జెకె 2017 ఛాంపియన్ షిప్లలో పాల్గొన్నాడు, ఫెడరేషన్ ఆఫ్ మోటార్స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎమ్ఎస్సి)లో 2017లో మోటార్స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు.అతను ఢిల్లీలో జరిగిన వోక్స్వ్యాగన్ వెంటో కప్ 2015ను గెలుచుకున్నాడు.2019లో, అతను వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ ఫార్మ్ నుంచి అత్యుత్తమ పెర్ఫార్మర్గా ఎంపికయ్యాడు. -
లైఫ్లో ఒక్కసారైనా ఆ హీరోతో నటించాలి, బిగ్బాస్ ప్రైజ్మనీ ఏం చేశానంటే?
తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే కౌశల్ మండా (Kaushal Manda) ఒక సంచలనం. ఇతడు బిగ్బాస్ రెండో సీజన్లో అడుగుపెట్టినప్పుడు అభిమానులు కౌశల్ ఆర్మీ అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు, రోడ్డుపై ర్యాలీలు కూడా చేశారు. ఏదైతేనేం.. రెండో సీజన్ కప్పు కొట్టడంతో పాటు రూ.50 లక్షల ప్రైజ్మనీ గెల్చుకున్నాడు.500 సినిమాలు చేసేవాడినిషోలు, సినిమాలతో బిజీగా ఉన్న అతడు తాజాగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. కౌశల్ మాట్లాడుతూ.. 17 ఏళ్ల వయసులో రాజకుమారుడు మూవీతో సినీప్రయాణం ప్రారంభించాను. అప్పటినుంచి దాదాపు 98 సినిమాల్లో యాక్ట్ చేశాను. అందరూ కేవలం ఒకే వృత్తిపైనే ఫోకస్ పెడతారు. కానీ, నేను మల్టీ టాస్కింగ్ చేస్తాను. మోడలింగ్, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ కొరియోగ్రఫీ.. ఇవన్నీ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నాను. ఇవేవీ లేకుంటే ఈపాటికి 500 సినిమాలు అయిపోయేవి.ఆ హీరోలతో పని చేయాలనుందిహీరో ఉదయ్కిరణ్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అతడు సుమారు 16 సినిమాలు చేసుంటే అందులో 12 చిత్రాల్లో నేనూ యాక్ట్ చేశాను. తనతో నాకు మంచి అనుబంధం ఉండేది. చిరంజీవి, కమల్ హాసన్ గారితో కలిసి పని చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. జీవితంలో ఒక్కసారైనా ఆ ఛాన్స్ వస్తే బాగుండని ఎదురుచూస్తున్నాను. ఇకపోతే మా అమ్మ క్యాన్సర్తో పోరాడుతూ చనిపోయింది. అందుకే బిగ్బాస్ ద్వారా వచ్చిన ప్రైజ్మనీని క్యాన్సర్ బాధితులకే విరాళమిస్తానని ప్రకటించాను. ఆ మాట నిలబెట్టుకున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక -
అక్క డిప్రెషన్లో.. దయచేసి ప్రాణాలు తీయొద్దు.. ఏడ్చేసిన వర్ష
తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన బ్యూటీ వర్ష (Varsha). సీరియల్ నుంచి కామెడీ షోలోకి వచ్చి హైలైట్ అయింది. అయితే తనపై పదేపదే కుళ్లు జోకులు వేస్తుంటే తీసుకోలేకపోయింది. ముఖ్యంగా తనది అబ్బాయి గొంతు అని, అబ్బాయిలాగే ఉంటుందని ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేసినప్పుడు ఒంటరిగా బాధపడింది.డిప్రెషన్లో..అలాగే తన ఇంట్లో జరిగిన ఓ విషాదకర వార్తను తాజాగా పంచుకుంది. ఓ పాడ్కాస్ట్లో వర్ష మాట్లాడుతూ.. మనకు మనుషులు చాలా అవసరం. మా అక్క ఏదో పనిమీద బావగారిని బయటకు పంపించింది. సడన్గా ఓ బైక్ ఢీ కొడితే అక్కడికక్కడే చనిపోయారు. మా అక్క డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. మా బావగారి బట్టల్ని ఒక గదిలోకి తీసుకెళ్లి వాటిని పట్టుకునే నిద్రిస్తోంది. ఎవరికీ శాపం కాకూడదుఆయన శవాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మా అక్క కొడుకు నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. పిన్ని, మాకు టిఫిన్ తెచ్చుకోవడం కూడా తెలియదు. రేపటినుంచి మేము ఎవర్ని అడగాలి? అని ఏడ్చేశాడు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరినీ ఒకటే కోరుకుంటున్నా.. మీ నిర్లక్ష్య డ్రైవింగ్.. వేరొకరి ప్రాణాలు తీసేంత శాపంగా మారకూడదు అని చేతులెత్తి మొక్కుతూ ఏడ్చేసింది వర్ష.చదవండి: నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక -
100% VFX ఉన్న ఫస్ట్ మూవీ.. పోస్టర్ చూశారా?
తల్లాడ సాయికృష్ణ,అమ్మినేని స్వప్న చౌదరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కిషోర్ దాస్,వినోధ్ నువ్వుల, కృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హనీ కిడ్స్. వీరి నటనకు తోడు అత్యాధునిక గ్రాఫిక్స్ టెక్నాలజీ ఈ సినిమాను అద్భుతమైన విజువల్ అనుభవంగా మార్చబోతోంది. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి 100% VFX ఆధారిత సినిమాగా దీనికి గుర్తింపు రాబోతోంది. హర్ష.ఎం దర్శకత్వంలో అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ-సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పోస్టర్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయిక స్వప్న చౌదరి అమ్మినేని మాట్లాడుతూ ఈ జోనర్ సినిమాలు పక్కా పిల్లలకి నచ్చుతాయంది. తనకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపింది. -
ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’
మల్టీ టాలెంటెడ్ తేజ్ నటించిన త్రిభాషా చిత్రం ‘డ్యూడ్. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న "డ్యూడ్" చిత్రం టీజర్ త్వరలో విడుదల చేయనున్నారు!!హీరో కమ్ డైరెక్టర్ తేజ్ మాట్లాడుతూ... "హీరోగా, డైరెక్టర్ గా 'డ్యూడ్" చిత్రం ఔట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. రష్ చూసుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో సినిమా చూసుకుంటామా అని చాలా ఆత్రంగా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో టీజర్ రిలీజ్ చేసి, అప్పటి నుంచి ప్రచార కార్యమాలు ముమ్మరం చేస్తాం" అని అన్నారు!!రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది!!ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్... ఈ చిత్రానికి 'స్క్రిప్ట్ కన్సల్టెంట్'గా కూడా వ్యవహరించడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష... ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు -
శూర్పణఖగా ప్రియాంక అవుట్.. రకుల్తో డీల్?
ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో రామాయణ్ (Ramayan Movie) ఒకటి. రణ్బీర్ కపూర్ రాముడిగా, సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇదివరకే మొదలైంది. వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని, 2027లో రెండో భాగాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.ప్రియాంక అవుట్తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రావణుడి చెల్లెలు శూర్పణఖ పాత్ర కోసం స్టార్ హీరోయిన్లను సంప్రదించారట! మొదట ఈ అవకాశం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను వరించిందట. కానీ, తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో ఆమె ఫుల్ బిజీగా ఉందట. దీంతో రామాయణ్ చిత్రయూనిట్.. ప్రియాంకను వదిలేసి రకుల్ ప్రీత్ సింగ్ను శూర్పణఖ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం కంటే సంతోషం ఇంకేముంటుందని రకుల్ వెంటనే రామాయణ్కు ఓకే చెప్పినట్లు భోగట్టా!రామాయణ్..ఈ క్రమంలో ఆమెకు లుక్ టెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. రామాయణ్ విషయానికి వస్తే సన్నీ డియోల్ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు. ఇక ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం రాజమౌళి- మహేశ్బాబు (SSMB29) సినిమాతో బిజీగా ఉంది. అటు రకుల్.. చివరగా మేరే హజ్బెండ్ కీ బీవీ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.చదవండి: కూతురి బర్త్డే సెలబ్రేట్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా? -
అండర్ వేర్లో క్రికెట్ అడిన స్టార్ హీరో.. ట్రోల్స్పై ఫన్నీ రిప్లై!
బాలీవుడ్ స్టార్ హీరో క్రికెట్ ఆడితే.. అందరూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అదేంటి క్రికెట్ ఆడితే తప్పేంటి? హీరోలు క్రికెట్ ఆడోద్దా ఏంటి? అంటారా? ఆ హీరో ఆటని ఎవరు తప్పుపట్టడం లేదు. ఆ ఆట ఆడేందుకు వేసుకొచ్చిన దుస్తులపైనే అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బంతి-బ్యాట్ ఆట ఆడేందుకు అండర్వేర్ ధరించి గ్రౌండ్లోకి వచ్చాడు. దానికి సంబంధించిన వీడియోని సదరు హీరోనే ఇన్స్టాలో షేర్ చేయగా.. అదికాస్త వైరల్ అయి అతన్ని ట్రోలింగ్కి గురి చేసింది. ఆ హీరో ఎవరో కాదు.. తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్న టైగర్ ష్రాఫ్. 2014లో వచ్చిన హీరోపంతి సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు టైగర్ ష్రాఫ్. ఈ సినిమా అల్లు అర్జున్ నటించిన పరుగు చిత్రానికి బాలీవుడ్ రీమేక్. ఇక ఈ సినిమా తర్వాత బాఘీ, బాఘీ2 వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరో రేంజ్కు వెళ్లిపోయాడు. తాజాగా ఈ యంగ్ హీరో, అక్షయ్ కుమార్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యలతో కలిసి క్రికెట్ ఆడాడు. అయితే ఆ సమయంలో టైగర్ కేవలం అండర్వేర్ మాత్రమే ధరించాడు. తన బాడీని ఎక్స్పోజ్ చేస్తూ క్రికెట్ ఆడాడు. ఆ వీడియోని ఇన్స్టాలో షేర్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. ఈ వీడియోలో అక్షయ్ కుమార్, గణేష్ ఆచార్యలతో కలిసి బీచ్లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. అయితే, టైగర్ ఒక్కడే అండర్వేర్లో ఆడటంతో నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేసి, ట్రోల్ చేశారు. "చెడ్డీ ప్రీమియర్ లీగ్", "ఊర్ఫీ జావేద్ మేల్ వెర్షన్" అంటూ కామెంట్స్ చేశారు. కొందరు అతని ఫిట్నెస్ను ప్రశంసించినప్పటికీ, చాలామంది అతన్ని విమర్శించారు. తాజాగా ఈ ట్రోల్స్పై టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ మరో వీడియోని ఇన్స్టాలో షేర్ చేశాడు. అందులో ఈ సారి ట్రాక్ ప్యాంట్ వేసుకొని క్రికెట్ ఆడుతున్నాడు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘ట్రాక్ ప్యాంట్లోనూ అదే స్థితి’ అని కాస్త ఫన్నీగా రాసుకొచాడు. ఇక టైగర్ ష్రాఫ్ కెరీర్ విషయానికొస్తే.. ఈ మధ్య ఆయనకు సరైన హిట్ పడలేదు. ఆయన చివరగా నటించిన సింగం అగైన్, బడే మియాన్ చోటే మియాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ప్రస్తుతం బాఘీ4 చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) -
విషాదం.. పోలో ఆడుతూ హీరోయిన్ మాజీ భర్త హఠాన్మరణం!
బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి కరిష్మా కపూర్(Karisma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్(53) గుండెపోటుతో మృతి చెందాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంలో .. ఇంగ్లాండ్లో సంజయ్ పోలో అడుతుండగా నోట్లోకి అకస్మాత్తుగా ఒక తేనెటీగ దూరిందట. దీనివల్ల తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ వచ్చి, ఆయనకు ఊపిరాడలేదు. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసిందని సమాచారం. వెంటనే ఆటను నిలిపివేసి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.సంజయ్ కపూర్ ఇండియాలో ప్రముఖ వ్వ్యాపారవేత్తలలో ఒకరు. 2003లో కరిష్మాని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేధాలు వచ్చాయి. దీంతో ఇద్దరు 2014లో విడాకులకు దరఖాస్తు చేయగా.. 2016లో విడాకులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత మోడల్, నటి ప్రియా సచ్దేవ్ను సంజయ్ పెళ్లాడారు. కరిష్మా మాత్రం ఒంటరిగానే ఉంటోంది. -
‘దేవికా అండ్ డానీ’ రివ్యూ : ఆత్మలతో మాట్లాడే టీచరమ్మ!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో వెబ్ సిరీస్ ‘దేవికా అండ్ డానీ’ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.సినిమాలైనా... వెబ్ సిరీస్లైనా... వాటిలో వచ్చే కథలు కొన్ని వాస్తవ రూపాలైతే మరికొన్ని కథలు దర్శకుని కాల్పనిక కళాకృతులు. రెండిటిలోను ప్రేక్షకుల నమ్మకం అనేది కీలకం. అది వాస్తవమైనా, కల్పన అయినా చూసే ప్రేక్షకుడికి నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు. అటువంటి కోవకి చెందినదే ‘దేవికా అండ్ డానీ’ వెబ్ సిరీస్. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. దీపక్ రాజ్ అందించిన ఈ సిరీస్ కథకు బి. కిరణ్ దర్శకత్వం వహించారు. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. సబ్జెక్ట్ సీరియస్ అయినా చక్కటి హాస్యంతో చాలా జాగ్రత్తగా స్క్రీన్ప్లే రాసుకున్నారు దర్శకుడు. ‘పెళ్ళి చూపులు’ ఫేం రీతూ వర్మ ఈ సిరీస్లో ప్రధాన కథానాయిక. ఓ రకంగా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంటుంది. దేవిక పాత్రలో రీతూ జీవించారనే చెప్పాలి. ఇక కథ విషయానికొస్తే... దేవిక ఆ ఊరి స్కూల్లో సంగీతం నేర్పించే టీచర్గా పని చేస్తుంటుంది. దేవిక తాత పెద్ద ఉపాసకుడు. ఆయనకు ఆత్మలతో మాట్లాడే అద్భుతమైన శక్తి ఉంటుంది. అదే శక్తి మనవరాలు దేవికకు కూడా ఉందన్న విషయం కథ మధ్యలో తెలుస్తుంది. దేవికకు ఓ పెళ్ళి సంబంధం ఖాయమవుతుంది. దేవిక స్కూల్కి వెళ్ళే సమయంలో ఓ రోజు డానీ అనే వ్యక్తి పరిచయమవుతాడు. డానీని దేవిక ఇష్టపడుతుంది. కానీ దేవిక దగ్గరకు డానీ ఓ సమస్యతో వస్తాడు. ఆ సమస్య వల్ల దేవిక చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుని ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటుంది. పుట్టి బుద్ధి ఎరిగిన నాటి నుండి ఇల్లు, స్కూలుకి పరిధిలోని 20 కిలోమీటర్లలోనే ప్రయాణిస్తున్న ఓ పెళ్ళి నిశ్చయమైన అమ్మాయి దారిలో కనబడ్డ అబ్బాయితో ప్రేమలో పడి ఆ అబ్బాయికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించి తన ప్రాణాలను పణంగా పెడుతుంది. మరి... డానీ సమస్యను దేవిక తీర్చగలిగిందా? తనకు నిశ్చితార్థమైన అబ్బాయినే పెళ్ళి చేసుకుందా? అన్న విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం ‘దేవికా అండ్ డానీ’ వెబ్ సిరీస్ చూసేయండి. సిరీస్ మొత్తం మంచి ట్విస్టులతో, చక్కటి హ్యూమర్తో ఎక్కడా బోర్ కొట్టదు. ఇంకెందుకు ఆలస్యం... చూసేయండి మరి.– హరికృష్ణ ఇంటూరు -
పబ్లో అల్లరి... నటిపై కేసు.. అనుకున్నదే జరిగిందిగా!
గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అనేది ఒకప్పుడు అవివేకంతో జరిగేది.. ఇప్పుడు అతి తెలివితో జరుగుతోంది. ఆ అతి తెలివి ఎలాంటిది అంటే... వైరంతోనే వైరల్ అవుతామనే అపోహ కల్పిస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో అనవసర వివాదాలతో అవాంఛనీయ ప్రచారాన్ని తెచ్చుకుంటున్న సెలబ్రిటీలు ఎందరో కనిపిస్తున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు చుట్టాలున్నారు జాగ్రత్త అనేది సినిమా తీశారు గానీ చట్టాలున్నాయి జాగ్రత్త అనే సినిమా కూడా ఎవరైనా తీసి వీళ్లకి చూపించి ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది.ట్రెండింగ్లో కల్పికఅది అలా ఉంచితే... సినీ నటి కల్పిక (Kalpika Ganesh) అనగానే ఒకప్పుడు అయితే ఎవరామె? అని అడిగినవాళ్లే ఎక్కువ. అయితే ఇప్పుడు మాత్రం ఓహో ఆ అమ్మాయా? పబ్లో గొడవపడింది ఆమెనా? అని వెంటనే గుర్తుపడుతున్నారు. మరి ఇలాంటి ప్రచారం ఆమె కెరీర్కు ఎంతవరకూ ఉపకరిస్తుందో ఆమెకే తెలియాలి కానీ.. ఆమె వ్యక్తిగత జీవితానికి ఏ మాత్రం ఉపకరించదని పోలీసులు తమ చర్యల ద్వారా తేల్చి చెప్పారు.చిలికి చిలికి గాలివానలా..హైదరాబాద్ నగరంలో ప్రిజమ్ పబ్ అంటే తెలియని పార్టీ ప్రియులు ఉండరు. ఓ రకంగా చెప్పాలంటే వందకు పైగా పబ్స్ ఉన్న సిటీలో టాప్ 5 ప్లేస్లో ఉంటుంది. అలాంటి చోటకి వెళ్లి తాను సెలబ్రిటీని కాబట్టి బర్త్డే కేక్ తనకు కాంప్లిమెంట్రీ ఇవ్వాలని అడగడం, దానికి తాము ఒప్పుకోకపోవడంతో కల్పిక గొడవ సృష్టించారని పబ్ సిబ్బంది ఆరోపణ... ఆ గొడవ చిలికి చిలికి గాలివానలాగా మారింది అనడం కన్నా కల్పిక తన ఇంటర్వ్యూల ద్వారా సోషల్ వేదికలపై హల్ చల్ ద్వారా మరింత రచ్చ చేసింది అనడం సబబుగా ఉండొచ్చు.కల్పికపై కేసుఆ వివాదం ద్వారా ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసింది కల్పిక. దాదాపుగా ఓ వారం రోజుల పాటు ఆ వివాదం సజీవంగా ఉండేలా తన వంతు సఫలయత్నం చేసిందామె. ఏమైతేనేం.. జనం కొత్త వివాదాల అన్వేషణలో తలమునకలవడంతో ప్రస్తుతం కల్పిక వ్యవహారం కాస్త సద్దుమణిగింది. అయితే పబ్లో గొడవను సామరస్యంగా పరిష్కరిద్దామని తాము చూస్తే ఆ సందర్భంగా కల్పిక తమపై వీరంగం చేసిందనే అభిప్రాయంతో ఉన్న పోలీసులు మాత్రం విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేదు. పకడ్బందీగా కేసు తయారు చేసి కల్పికను బుక్ చేసేశారు. గత నెలాఖరులో ప్రిజం పబ్లో అల్లర్లు సృష్టించిందనే ఆరోపణలతో నటి కల్పిక గణేష్పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.పోలీసుల ఎదుటే రెచ్చిపోయిన బ్యూటీపబ్లో గొడవ జరుగుతుందనే సమాచారం మేరకు తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని అయితే తమ సమక్షంలోనే నటి పబ్ సిబ్బందిని దుర్భాషలాడిందని కేసు పెట్టారు. అంతేకాక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడానికి కోర్టు నుంచి పోలీసులు అనుమతి కోరారు. అనంతరం గురువారం కోర్టు అనుమతి పొందిన తర్వాత పోలీసులు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో.. విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని కల్పికకు పోలీసులు రేపో మాపో నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని కల్పిక ఇకపై ఎలా ముగించబోతోంది అనేది వేచి చూడాల్సి ఉంది.చదవండి: బొమ్మలా నిల్చున్న జైనబ్.. తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? -
నాగార్జున తప్ప మరొకరిని ఊహించుకోలేం : కుబేరా నిర్మాతలు
దర్శకుడు శేఖర్ కుబేరా కథ చెప్పినప్పుడే ఇందులో హీరోగా ధనుష్ అయితే బాగుంటుందని చెప్పారు. ధనుష్ కూడా కథ విని 20 నిమిషాల్లోనే సైన్ చేశాడు. ఇక ఇందులో మరో కీలక పాత్రని నాగార్జున చేశాడు. శేఖర్ మొదటి నుంచి ఈ పాత్రకు నాగార్జున తప్పితే మరొకరు చేయలేరని చెప్పాడు. నాగ్కి కూడా ఈ కథ బాగా నచ్చింది. దీంతో వెంటనే ఓకే చేశాడు. ఆ పాత్రలో నాగార్జునని తప్ప మరొకరిని ఊహించేకోలేనంత గొప్పగా పెర్ఫార్మ్ చేశాడు. సినిమా ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు . శేకర్ కమ్ముల దర్శకత్వంలో సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా మూవీ కుబేరా. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 20న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మీడియాతో ముచ్చటించారు. ఈ విశేషాలు..- శేఖర్ కమ్ముల గారు 'లవ్ స్టోరీ' తర్వాత కుబేరా కథ మాకు చెప్పడం జరిగింది. ఈ కథకు ధనుష్ గారు అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆయనకి ఈ కథని చెప్పారు. ధనుష్ గారు కథ 20 నిమిషాలు విని వెంటనే సైన్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాము.- ధనుష్ గారు పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున గారు కూడా ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక గారు గురించి అందరికీ తెలుసు. ఇండియాలో ఆమె పాపులర్ యాక్ట్రెస్. కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్ తో ఈ సినిమాని చేయడం జరిగింది. ధనుష్ గారు, నాగార్జున గారు. రష్మిక గారు అందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు.- కుబేర తెలుగు, తమిళ్ స్ట్రయిట్ మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నామ. ఫస్ట్ కాఫీ ఆల్రెడీ రెడీ అయింది. సినిమా అద్భుతంగా వచ్చింది.- శేఖర్ కమ్ముల గారు మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్ తో తీశారు. కచ్చితంగా ఆడియన్స్ కి చాలా న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది.- శేఖర్ కమ్ముల గారు స్టార్స్ ని క్యారెక్టర్స్ గానే చూస్తూ సినిమా తీసే ఫిలిం మేకర్. ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ కనిపిస్తాయి.- శేఖర్ గారు మంచి ఎమోషన్స్ తో ఆడియన్స్ ని టచ్ చేస్తూ ఫీల్ ఉండే సినిమాలను తీస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఉండే ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.- రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం ఎప్పుడూ కూడా సవాల్ తో కూడుకున్నదే. ఈ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్ లో తీసాము. బొంబాయిలో సినిమాని సూట్ చేయడం మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాని సూట్ చేయడం జరిగింది. అది రియల్ ఛాలెంజ్.మేము బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కంటెంట్ కు కావలసిన బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశాం. సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. దాదాపు 1600 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది. - దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ధనుష్ గారు రెండు పాటలు పాడారు. ఇది డైరెక్టర్ గారు, దేవిశ్రీ గారి కలెక్టివ్ డెసిషన్.- శేఖర్ కమ్ముల గారితో మరో సినిమా చేయనున్నాం. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు. -
బొమ్మలా నిల్చున్న జైనబ్.. తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) పెళ్లి సింపుల్గా, రిసెప్షన్ ఘనంగా జరిగింది. ప్రియురాలు జైనబ్ రవ్జీని అఖిల్ హిందూసాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. జూన్ 6న వెడ్డింగ్, 8న రిసెప్షన్ వేడుకలు జరిపారు. రిసెప్షన్లో ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వీడియో 1జైనబ్ బొమ్మలా నిల్చుని ఉంటే ఓ యువకుడు తనకు చకచకా పెళ్లిచీర కట్టేశాడు. ఇది చూసిన జనాలు అయ్యో, జైనబ్కు చీర కట్టుకోవడం రాదా? అని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సులువుగా ఆమెకు చీర కట్టేసిన యువకుడి నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు.వీడియో 2అఖిల్- జైనబ్ రిసెప్షన్కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా హాజరయ్యాడు. తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో స్టేజీ ఎక్కిన తమన్.. ఫ్రెండ్కు ఊహించలేని బహుమతిచ్చాడు. క్రికెట్ బ్యాట్ను కానుకగా ఇచ్చాడు. దీంతో పెళ్లికూతురు సహా అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. అభిమానులు సైతం ఇదేం గిఫ్ట్రా నాయనా.. అని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి సినిమాల్లో తడబడుతున్న అయ్యగారు (అఖిల్) క్రికెట్లో మాత్రం నెం.1. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్గా ఉన్నారు. తమన్ ఈ జట్టులోనే ఆడుతున్నాడు. Bro wait .! 🙄 pic.twitter.com/3InivJmTjc— 🕴🏼 (@kaali02) June 11, 2025 Thaman gifted a cricket bat to #AkhilAkkineni at his reception! pic.twitter.com/Mu914iRI2a— Movies4u Official (@Movies4u_Officl) June 11, 2025 చదవండి: ఆ హీరోయిన్ను సీక్రెట్గా ఫాలో అవుతున్నా.. ఆమె చాలా స్పీడు -
నా గుండె పగిలింది.. మంచు విష్ణు కీలక నిర్ణయం
గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక టాలీవుడ్ హీరో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఇండోర్లో ఈవెంట్.. మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రేపు(జూన్ 13) ఇండోర్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. దానికి సంబంధించిన పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి. భారీ ఎత్తున జరిగే ఈ ఈవెంట్లోనే ట్రైలర్ని కూడా విడుదల చేయాలనుకున్నారు. కానీ హఠాత్తుగా జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు.నా గుండె పగిలింది.. విమాన ప్రమాదంపై మంచు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ప్రమాదం గురించి తెలియగానే నా గుండె పగిలిపోయింది. చాలా బాధగా ఉంది. కన్నప్ప ట్రైలర్ రిలీజ్ని ఒకరోజు వాయిదా వేస్తున్నాం. అలాగే ఇండోర్లో రేపు జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. -
ఆ హీరోయిన్ను సీక్రెట్గా ఫాలో అవుతున్నా.. ఆమె చాలా స్పీడు.
సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్.ఎమ్ (Niharika NM) టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. మిత్రమండలి చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మ్యాడ్ ఫేమ్ విష్ణు, ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురువారం (జూన్ 12న) మిత్రమండలి సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్వించేలా ఉంది.నేను వయసులో చిన్నవాడినే..అయితే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా అంతే సరదాగా సాగింది. తనను హీరోయిన్గా సెలక్ట్ చేసిన అల్లు అరవింద్ (Allu Aravind)కు హృదయంలో చోటిచ్చానంది నిహారిక. అనంతరం అల్లు అరవింద్ స్టేజీ ఎక్కి మాట్లాడాడు. వీళ్లందరూ కలిసి నన్ను పెద్దవాడిని చేస్తున్నారు. నేనేమో ఇంకా యంగ్గానే ఫీలవుతున్నాను. ఇక్కడ అమ్మాయి కూడా మనసులో చోటిచ్చానంది. నేనెక్కువగా యంగ్ జెనరేషన్తో తిరుగుతూ ఉంటాను. వాళ్లతో ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి స్క్రిప్టులు సెలక్ట్ చేయాలన్నదానిపై కాస్త పట్టు లభించింది.కథ తెలీకుండా సినిమా చూడబోతున్నాఈ సినిమా డైరెక్టర్ విజయేందర్ గురించి చెప్పాలి. ఈయన కథ చెప్తాడట.. వినమని వాసు అడిగాడు. సరేనన్నాను. విజయేందర్ వచ్చి నా గదిలో కూర్చుని పావుగంట కథ చెప్పాడు. సడన్గా నావల్ల కావడం లేదు సర్, నేనెళ్లిపోతాను అన్నాడు. ఏమైందని అడిగితే.. మీ రేంజ్ వేరు, నా వల్ల కావట్లేదు.. మళ్లీ ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యి వస్తాను సర్ అని చెప్పి వెళ్లిపోయాడు. కథ తెలియకుండానే బన్నీ వాసు సినిమా చూడబోతున్నాను.ఫేక్ ఐడీతో ఫాలో కొట్టా..అయితే వాసు.. ఈ సినిమా కోసం ఐదారుగురు అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చాడు. వీరిలో ఎవరు బాగుంటారు? చెప్పమన్నాడు. నేను నిహారిక ఫోటో చూడగానే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో తెగ చూశాం అని చెప్పాను. ఇన్స్టాలో ఆమె చాలా స్పీడు. ఓ ఫేక్ ఐడీతో నిహారికను ఫాలో అవుతున్నాను. అందులో తప్పేముంది. మా ఒరిజినల్ ఐడీతో సోషల్ మీడియాకి వస్తే జనాలు పెట్టే కామెంట్లు చూడలేం, చదవలేం. ఆ దరిద్రమంతా ఎందుకని ఫేక్ ఐడీతో అందర్నీ ఫాలో అవుతా.. అందర్నీ చూస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా నిహారిక.. పెరుసు, ఇదయం మురళి వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా -
బాస్ కూతురితోనే ప్రేమలో.. 12 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న నటుడు!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణం. నటీనటుల మధ్య స్నేహం ఏర్పడడం.. అదికాస్త ప్రేమగా మారి చివరకు మూడు మూళ్ల బంధంలో ఒక్కటైపోతుంటారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్-నటి స్వరూప్ సంపత్ జంట ఒకటి. బాలీవుడ్లో ఒక ఐకానిక్ జంటగా గుర్తింపు పొందిన పరేష్-స్వరూప్ సంపత్ ప్రేమ కథ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. ఒకరికోసం ఒకరు దాదాపు 12 ఏళ్లు ఎదురుచూసి పెళ్లి చేసుకున్నారట.అలా ప్రేమలో.. హిందీలోనే కాదు తెలుగులోనూ పరిచయం అక్కర్లేని పేరు పరేష్ రావల్ . 'హేరా ఫేరీ', 'ఓఎమ్జీ', 'సర్దార్', ‘హంగామా’తదితర చిత్రాలతో బాలీవుడ్ని ఆకట్టుకున్న పరేష్.. మనీ, క్షణ క్షణం, శంకర్ దాదా ఎంబిబిఎస్( లింగం మామ పాత్ర), రిక్షావోడు, గోవిందా గోవిందా తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసునూ దోచుకున్నాడు. ఈ విలక్షణ నటుడు నాటక రంగం నుంచే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడనే సంగతి అందరికి తెలిసిందే. నాటకాలు వేస్తున్న సమయంలోనే స్వరూప్ సంపత్తో ప్రేమలో పడ్డాడట. 1970లలో ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ థియేటర్ ఫెస్టివల్లో నాటకం ప్రదర్శించేందుకు పరేష్ తన కాలేజీ స్నేహితులతో కలిసి వెళ్లాడు. అదే సమయంలో అక్కడి స్వరూప్ వచ్చింది. అప్పుడే స్కూలింగ్ అయిపోయిన స్వరూప్.. చేతిలో ఈవెంట్కి సంబంధించిన పత్రాలను పట్టుకొని బయట నిలబడి ఉందట. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాడు పరేష్. ఆమె అందానికి ముగ్థుడైపోయి.. స్నేహితుడి మహేద్రతో .. ‘నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను’ అని స్వరూప్ని చూపించాడట. ఆమె గురించి ఆరా తీస్తే.. వారి బాస్ కూతురే అని తెలిసింది. ‘చీఫ్ ప్రొడ్యూసర్ కూతురినే ప్రేమిస్తావా?’ అని మహేద్ర నన్ను బెదిరించాడు. ‘ఎవరి కూతురు అయినా సరే.. నేను మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటా’ అని అప్పేడే వాడికి చెప్పేశా’అని పరేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.12 ఏళ్లు ఎదురుచూసి..పరేష్ నటనకు ఫిదా అయిన స్వరూప్.. అతనితో స్నేహం చేసింది. పరేష్ మాత్రం ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. కొన్ని నెలల తర్వాత తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పాడు. ‘స్వరూప్కి సింపుల్గా ప్రపోజ్ చేశా. ఆమెతో 3-4 నెలలు స్నేహం చేసిన తర్వాత ఒక రోజు నా ప్రేమ విషయాన్ని చెప్పేశాను. ‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒకరినొకరం తెలుసుకుందాం అని చెప్పకు. ఇద్దరం కలిసి జీవిస్తూ తెలుసుకుందాం’ అని చెప్పాను’ అని ఓ ఇంటర్వ్యూలో పరేష్ తన ప్రేమ విషయాన్ని పంచుకున్నాడు.అయితే వీరిద్దరు ప్రపోజ్ చేసుకున్న 12 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారట. అప్పుడప్పడే పరేష్ ఇండస్ట్రీలోకి వెళ్లడం.. కెరీర్ పరంగా సెట్ అయ్యాకనే పెళ్లి చేసుకోవాలకున్నాడట. ఈ విషయం స్వరూప్తో చెబితే.. ఆమె కూడా అర్థం చేసుకొని 12 ఏళ్ల పాటు ఎదురు చూసి 1987లో వివాహ బంధంలో ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వరూప్ విషయానికొస్తే.. 1979లో మిస్ ఇండియా విజేతగా నిలిచింది. బాలీవుడ్లో 'నరం గరం' (1981), 'సాగర్' (1985) వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. -
Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా!
అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఇంట వరుస శుభాకార్యాలు జరిగాయి. గతేడాది చివర్లో నాగచైతన్య- శోభిత (Sobhita Dhulipala) పెళ్లి జరగ్గా ఇటీవల (జూన్ 6, 2025న) అఖిల్ వివాహం జరిగింది. బిజినెస్మెన్ జుల్ఫీ రవ్జీ కూతురు జైనబ్ను అఖిల్ (Akhil Akkineni) వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. ఈ వివాహ వేడుకను నాగార్జున సింపుల్గా ఇంట్లోనే జరిపించాడు. అయితే రిసెప్షన్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో గ్రాండ్గా జరిగింది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు మహేశ్బాబు, రామ్చరణ్, సూర్య, యశ్, నిఖిల్, అల్లరి నరేశ్, సుకుమార్, బుచ్చిబాబు, తమన్.. ఇలా ఎంతోమంది వచ్చారు.రిసెప్షన్లో హైలైట్..ఈ ఫోటోలను అన్నపూర్ణ స్టూడియో అధికారిక ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్లో రిలీజ్ చేశారు. తాజాగా నాగచైతన్య- శోభితల స్పెషల్ ఫోటోను వదిలారు. తమ్ముడి పెళ్లిలో చై సూటుబూటేసుకుని హుందాగా కనిపించగా శోభిత ఎరుపు చీరతో ఆకట్టుకుంది. ఈ చీరకు మ్యాచింగ్గా బంగారు వర్ణం బ్లౌజ్ను ధరించడంతో మరింత ట్రెండీగా కనిపించింది. అటు బరాత్లో చై.. డీజే దగ్గర సందడి చేస్తూ కనిపించాడు. చై సంబరం చూసిన నెటిజన్లు.. తమ్ముడి పెళ్లంటే ఆమాత్రం జోష్ ఉండాలిగా.. అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) My Demigod Marriage Vibes 🔥King Akhil Chay 🤯Energy Levels 💥#AkhilWedding #AkhilAkkineni pic.twitter.com/EEIhmEyWy5— King Srinu (@KingSrinu0120) June 6, 2025 చదవండి: ఇది నా జీవితంలో ఓ మైలురాయి.. సింగర్ సునీత ఎమోషనల్ -
దేవుడి అవతారంలో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ స్టోరీ ఇదేనా?
ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. అల్లు అర్జున్(Allu Arjun)తో చేయాల్సిన సినిమా కథలో స్వల్ప మార్పులు చేసి ఎన్టీఆర్తో తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే మొన్నటివరకు ఇది రూమర్గానే ఉండే..కానీ తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్తో ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతుందనే విషయంపై స్పష్టత వచ్చింది. మైథలాజికల్ బ్యాగ్రౌండ్తో తెరకెక్కే ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ‘‘మోస్ట్ పవర్ఫుల్ గాడ్ పాత్రలో నా మోస్ట్ ఫేవరెట్ అన్న నటించనున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్’’ అని నాగవంశీ ట్వీట్ చేశాడు.దాంతో ఎన్టీఆర్ను ఉద్దేశించే నాగవంశీ ఈ పోస్ట్ చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందట. తొలిసారి ఆయన పూర్తిస్థాయిలో దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ ఎలా నటిస్తారో యమదొంగ సినిమాతో కొంతవరకు చూశాం. అందులో కాసేపు యముడి పాత్రలో కనిపించి తనదైన నటనతో అదరగొట్టాడు. ఇక త్రివిక్రమ్ సినిమాలో దేవుడు పాత్ర చేయబోతున్నాడు. అది కూడా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర. కచ్చితంగా ఎన్టీఆర్ అదరగొడతాడు. అందులో నో డౌట్. తన అభిమాన హీరోని దేవుడి పాత్రలో చూసేందుకు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమా డబ్బింగ్ వర్క్లో బిజీగా ఉన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్లు హీరోలుగా నటించగా, కియారా అద్వానీ కీలక పాత్ర పోషించింది. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. -
బన్నీ సినిమా.. ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించబోతున్న అట్లీ!
అల్లు అర్జున్(Allu Arjun) కొత్త సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైంది. ఇక ఆల్ సెట్ గో... అంటూ అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గొననున్నారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ(Atlee ) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తారు. మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ కూడా హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ ఈ వారంలోనే ప్రారంభం కానుందని తెలిసింది. దాదాపు ఇరవై రోజుల పాటు ముంబైలో జరగనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణలో అల్లు అర్జున్, మృణాల్ ఠాగూర్ పాల్గొంటారని, వీరిద్దరి కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను దర్శకుడు అట్లీ ప్లాన్ చేశారని సమాచారం. ఈ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ను సైతం షూట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట అట్లీ. అయితే ఈ తొలి షెడ్యూల్ షూటింగ్లో దీపికా పదుకోన్ పాల్గొనరట. ఇక ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక ప్రపంచాన్ని అట్లీ సృష్టిస్తున్నారని, ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ప్రియుడితో 'చిన్నారి పెళ్లికూతురి' ఎంగేజ్మెంట్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో సెన్సేషన్ సృష్టించిన అవికా గోర్ (Avika Gor) పెళ్లికి రెడీ అయింది. ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఏడడుగులు వేసేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.సంతోషంతో అరిచేశా..ఈ సందర్భంగా అవికా.. 'ఆయన నోరు తెరిచి అడగ్గానే.. సంతోషంతో ఏడ్చేశాను. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అవును అంటూ గట్టిగా అరిచాను. పూర్తిగా సినిమాల్లో మునిగినందున.. నాకు మైండ్లో మంచి బీజీఎమ్ వినిపిస్తోంది. స్లో మోషన్లో మా కల నెరవేరినట్లు కనిపిస్తోంది. అతడేమో ప్రశాంతగా ఉన్నాడు, తెలివిగా కనిపిస్తున్నాడు. అయినా మేమిద్దరం జంటగా ఫిట్టయ్యాం.కన్నీళ్లు..ఎప్పుడైతే అతడు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడో అప్పుడు నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆవహించింది. గాల్లో తేలియాడిపోయా.. కళ్లనిండా నీళ్లు.. మెదడు ఆలోచించడమే మానేసినట్లు.. ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమంటే ఇదే కదా! ప్రేమలో అన్నీ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరు అని అవికా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు.. అవికాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కెరీర్ముంబైలో పుట్టిన అవికా గోర్.. పదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ‘బాలికా వధు’ సీరియల్తో ఆమె జీవితమే మారిపోయింది. ఇదే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురి’గా ప్రసారమైంది. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, 'బ్రో', 'షణ్ముఖ' ఇలా అనేక సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) చదవండి: మంగ్లీ బర్త్డే పార్టీ.. తప్పు నామీదకు తోస్తారేంటి?: దివి -
సంధ్య థియేటర్లో పాముల కలకలం.. వీడియో వైరల్
సంధ్య థియేటర్.. హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఈ సినిమా హాల్ చాలా ఫేమస్. స్టార్ హీరోల అభిమానులంతా ఈ థియేటర్లోనే సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తారు. అలా అని ఇది లగ్జరీ థియేటర్ ఏం కాదు. చాలా కాలం నుంచి ఉండడం.. స్టార్ హీరోలు ఇక్కడకు వచ్చి సినిమా చూస్తుండడంతో ‘సంధ్య థియేటర్’ ఫేమస్ అయింది. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది కూడా ఈ థియేటర్లోనే. ఆ సమయంలో సంథ్య థియేటర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా మారుమోగింది. తాజాగా మరోసారి ఈ థియేటర్ వార్తల్లో నిలిచింది. రోడ్డు పక్కనే ఉన్న ఈ సినిమా థియేటర్స్లో పాములు కలకలం రేపాయి. రూ. 50 టికెట్ ఇచ్చే ఎంట్రీ వద్ద ఓ పెద్ద పాము బుసలు కొడుతూ సిబ్బంది కంట పడింది. చాలా పొడవుగా ఉన్న ఆ పాముని చూసి బయపడి పోయిన సిబ్బంది..వెంటనే పాములు పట్టే స్నేక్ యూనిట్కి కాల్ చేసి రప్పించారు. వారు చాకచక్యంతో పాముని పట్టుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సంధ్య థియేటర్లో పాములు కనిపించడం ఇదేం తొలిసారి కాదు. తరచు థియేటర్స్లోకి పాములు వస్తున్నాయని సిబ్బంది చెబుతోంది. వందల సంఖ్యలో జనాలు వచ్చే థియేటర్లో ఇలా పాములు రావడం ఏంటి? ఇప్పుడంటే లక్కీగా ప్రేక్షకులు లేరు కాబట్టి.. ప్రమాదం తప్పింది. ఒకవేళ థియేటర్లో ప్రేక్షకులు ఉన్నప్పుడే పాము వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అసలే సినిమా థియేటర్స్ చీకటిగా ఉంటాయి.. అలాంటి ప్రదేశాల్లోకి ఇలాంటి విష సర్పాలు రావడం ప్రమాదకరమే... యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సంధ్య థియేటర్లో పాముల కలకలంఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్లో రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు పాములు తరచుగా లోపలికి వస్తున్నాయని సిబ్బంది ఆందోళన pic.twitter.com/l8Q6wDFH0N— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025 -
అక్కడ ‘డా డా’.. ఇక్కడ ‘పా పా’
తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. అందుకే అక్కడ హిట్టయిన చిత్రాలన్నీ తెలుగులోనూ రలీజ్ అవుతుంటాయి. అలా తెలుగులో రిలీజ్ కాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ చిత్రమే డాడా. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రం తమిళ్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఇదే చిత్రం తెలుగులో పాపా పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. "పా పా" చిత్రాన్ని జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 13న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ - ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోవాలి కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ -బడ్జెట్ లో చేసిన తమిళ చిత్రాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. "డా డా " సినిమా తమిళంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగులో "పా పా" పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకుంది. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత నీరజ కోట గారికి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అన్నారు. ప్రొడ్యూసర్ నీరజ కోట మాట్లాడుతూ - మా జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్న ఫస్ట్ మూవీ "పా పా". ఈ చిత్రం తమిళంలో"డా డా " పేరుతో రిలీజై ఘన విజయాన్ని సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ రోజు మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ అందించిన డైరెక్టర్స్ కోదండరామిరెడ్డి గారికి, బి. గోపాల్ గారికి థ్యాంక్స్. అన్నారు. -
ఆడవారి వాష్రూమ్కు వెళ్తుంటే గెంటేశారు: ట్రాన్స్జెండర్ నటి
ఎన్నో అవమానాలు, ఆటంకాలు దాటుకుని వైద్య విద్యను అభ్యసించింది త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు (Trinetra Haldar Gummaraju). దేశంలోనే రెండో ట్రాన్స్జెండర్ డాక్టర్గా ఆ మధ్య తన పేరు వార్తల్లో మార్మోగిపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ రెండో సీజన్తో నటిగానూ మారింది. ఈ మధ్యే కంఖజుర అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. ఇది మే 30 నుంచి సోనీలివ్లో ప్రసారమవుతోంది.హాస్పిటల్లో చేదు అనుభవంతాజాగా త్రినేత్ర.. తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను అమ్మాయిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకున్నాక ఒకసారి డాక్టర్ను కలిసేందుకు వెళ్లాను. ఆస్పత్రిలో ఉన్న్పపుడు వాష్రూమ్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అప్పటికి నా ముఖంలో అమ్మాయి పోలికలే లేవు. అలా అని అబ్బాయిల రెస్ట్రూమ్ వాడుకోలేను. ఏదైతే అదైందని అమ్మాయిల బాత్రూమ్లోకి వెళ్లాను. అంతే.. అక్కడున్న సెక్యురిటీ గార్డు నన్ను కోపంతో బయటకు తరిమేసింది. రచ్చ చేయాలనుకోలే..నేను అబ్బాయిని అనుకుని లోపలకు వెళ్లనివ్వలేదు. నేను ఏమీ అనలేదు. దాన్ని గొడవ చేసి రచ్చ చేయాలనుకోలేదు. అందుకే సైలెంట్గా అక్కడినుంచి వెళ్లిపోయాను. కానీ దీనివల్ల నా మనసు గాయపడింది. అమ్మాయిగా మారినప్పటికీ ఆడవారి బాత్రూమ్ ఉపయోగించుకోలేకపోయాను. ఇలాంటి ఇబ్బందుల్ని, అవమానాల్ని ఊహించే కాలేజీలో చదువుకునే రోజుల్లో వాష్రూమ్కి వెళ్లేదాన్నే కాదు. ఇందుకోసం నీళ్లు సరిగా తాగేదాన్ని కాదు. దీనివల్ల నేను యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఇలా వివక్ష ఎదుర్కొనే సమాజంలో బతకడం దురదృష్టకరం అని చెప్పుకొచ్చింది.చదవండి: శ్రీలీల కోసం మంత్రి స్పీచ్ ఆపేసిన యాంకర్ ఝాన్సీ.. వీడియో వైరల్ -
పౌడర్ వేసుకున్నానని.. తిట్టారు: లావణ్య త్రిపాఠి
మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన తొలి తెలుగు సినిమా ‘అందాల రాక్షసి’. హను రాఘవపూడి దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్ర హీరోలుగా నటించారు. వారిద్దరికి కూడా హీరోలుగా ఇదే తొలి సినిమా. 2012లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. సినిమాలోని డైలాగ్స్, పాటలు బాగా వైరల్ అయ్యాయి. అప్పట్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ క్లాసిక్ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్స్లోకి రాబోతుంది. జూన్ 13న ఈ చిత్రం రీరిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా లావణ్యతో పాటు చిత్రబృందం అంతా మరోసారి సినిమా కోసం ప్రచారం చేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో సినిమా షూటింగ్ నాటి అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా లావణ్య ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. హీరోలతో పాటు తను కూడా మేకప్ లేకుండానే నటించానని చెప్పింది. ఓ సారి అనుకోకుండా ముఖానికి మేకప్ వేసుకొని వస్తే.. దర్శకుడు హను రాఘవపూడి తిట్టాడని చెప్పింది. ‘ఈ సినిమా కోసం నేను ఎలాంటి మేకప్ వేసుకోలేదు. రియల్ హెయిర్తోనే నటించాను. కనీసం పౌడర్ కూడా వేసుకోలేదు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్లోనే నేను పౌడర్ వేసుకొని సెట్కి వచ్చాను. దర్శకుడు హను ఫోటో తీసి నా దగ్గరకు వచ్చి జూమ్ చేసి చూపించాడు. నీ ముఖంపై పౌడర్ పటికలు ఎలా కనిపిస్తున్నాయో చూడు’ అన్నారు. వెంటనే నేను ముఖం కడుక్కొని వచ్చాను’ అంటూ నాటి షూటింగ్ అనుభవాలను లావణ్య పంచుకున్నారు. ఇక రాహుల్ మాట్లాడుతూ.. జీరో మేకప్తో సినిమా చేశాం. కనీసం సన్స్క్రీన్ కూడా వాడలేదని చెప్పారు. -
మంత్రి ప్రసంగిస్తుండగా శ్రీలీల ఎంట్రీ.. అసలేం జరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు (Duddilla Sridhar Babu)కు వింత అనుభవం ఎదురైంది. సీత (షి ఈజ్ ది హీరో ఆల్వేస్ - SITHA) యాప్ ఆవిష్కరణ వేడుకలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో హీరోయిన్ శ్రీలీల అక్కడికి వచ్చేసింది. అది గమనించిన యాంకర్ ఝాన్సీ (Anchor Jhansi) మంత్రి ప్రసంగాన్ని కొద్ది క్షణాలపాటు ఆపింది.మంత్రి ప్రసంగానికి ఆటంకంమంత్రివర్యులు క్షమించాలి అంటూనే హీరోయిన్ శ్రీలీల (Actress Sreeleela)ను స్టేజీపైకి పిలిచింది. 'షి ఈజ్ ది హీరో ఆల్వేస్' అనే యాప్ లాంఛ్ చేస్తున్నాం. కాబట్టి.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఎంటర్ప్రెన్యూర్ శ్రీలీలను స్టేజీపైకి ఆహ్వానిస్తున్నాం అంటూ తన ఇంట్రో ముగించింది. అలా శ్రీలీల.. స్టేజీ ఎక్కగా మంత్రి ఏమాత్రం చిరాకుపడకుండా ఆమెను నవ్వుతూ పలకరించాడు. తర్వాత తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించాడు.సభామర్యాద పాటించరా?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీలీల హీరోయిన్ అయినంత మాత్రాన.. మంత్రి ఉపన్యాసాన్ని మధ్యలో ఆపటం అర్థరహితమని, పైగా ఎంతో అనుభవమున్న యాంకర్ ఝాన్సీ ఇలా చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. స్పందించిన ఝాన్సీఒక వక్త ఉపన్యసించేటప్పుడు వారిని ఆటంకపరచడం అవమానించడమే అవుతుంది. సభా మర్యాద పాటించాల్సి ఉంటే బాగుండేది.. అక్కడ శ్రీధర్బాబు కాకుండా ఇంకా ఎవరున్నా పరిస్థితి మరోలా ఉండేది అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై యాంకర్ ఝాన్సీ స్పందించింది. మంత్రి మాట్లాడుతున్న సమయంలో శ్రీలీల కార్యక్రమానికి వచ్చిందని పేర్కొంది. మంత్రి అనుమతితోనే శ్రీలీలను స్టేజీపైకి తీసుకొచ్చామంది. అంతేతప్ప ఆయన ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకోలేదని వివరణ ఇచ్చింది. హిరోయిన్ శ్రీ లీల కోసం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగాన్ని ఆపిన యాంకర్ ఝాన్సీశ్రీధర్ బాబు మెత్తని వాడు కాబట్టి ఒప్పుకున్నాడు అదే ఇగో వున్న ఏ ఇతర మంత్రి అయిన వుంటే పరిస్థితి వేరుగా వుండేది pic.twitter.com/cjpGi2Rd46— Kumar Reddy.Avula (@Kumar991957) June 10, 2025 చదవండి: సుహాసిని ఫోన్ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు -
Kuberaa: ‘పిపీ డుమ్ డుమ్... ’ అంటున్న రష్మిక
ధనుష్-రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటించారు. శేఖర్ కమ్ముల గిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘పిపీ డుమ్ డుమ్’ అనే పాటను విడుదల చేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు చైతన్య పింగలి లిరిక్స్ అందించగా, ఇంద్రావతి చౌహాన్ అద్భుతంగా ఆలపించారు. -
భారీ బడ్జెట్తో షారుక్- సల్మాన్ సినిమా.. గెస్ట్ రోల్స్లో ఎన్టీఆర్, హృతిక్!
వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) స్పై యూని వర్స్లో భాగంగా ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘ఏక్తా టైగర్’ (2012), ‘టైగర్ జిందా హై’ (2017), ‘టైగర్ 3’ (2023), హృతిక్ రోషన్ ‘వార్’ (2019), షారుక్ ఖాన్ ‘పఠాన్’ (2023) వంటి సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఈ యూనివర్స్లోనే హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ హీరోలుగా చేసిన ‘వార్ 2’, ఆలియా భట్ – శర్వారీ లీడ్ రోల్స్ చేసిన ‘ఆల్ఫా’ చిత్రం రిలీజ్కు సిద్ధమౌతున్నాయి. ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ‘ఆల్ఫా’ చిత్రం ఈ ఏడాది డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా... రెండు సంవత్సరాలుగా ఈ ‘వైఆర్ఎఫ్’ స్పై యూనివర్స్లో భాగంగానే ‘పఠాన్ వర్సెస్ టైగర్’(Pathaan Vs Tiger)చిత్రం రానుందని, ఈ మూవీలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా చేస్తారని, అలాగే ‘పఠాన్ వర్సెస్ టైగర్’ సినిమాలో ఈ యూనివర్స్లో భాగమైన హృతిక్ రోషన్, జాన్ అబ్రహాం, ఆలియా భట్, ఎన్టీఆర్ గెస్ట్ రోల్స్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాని ‘వార్, పఠాన్’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ హఠాత్తుగా ‘పఠాన్ వర్సెస్ టైగర్’ చిత్రం ఆగిపోయిందనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ అలాంటిది ఏమీ లేదని, ‘వార్ 2’, ‘ఆల్ఫా’ చిత్రాలు విడుదలైన తర్వాత ‘పఠాన్ వర్సెస్ టైగర్’ సినిమా గురించి ఓ స్పష్టత వస్తుందని జాతీయ ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో సిల్వర్ స్క్రీన్పై ‘పఠాన్–టైగర్’ల పోరు ఉంటుందని, కాకపోతే కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. -
'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్లోకి పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ పెండింగ్ పెట్టిన ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎన్నికల ముందే ప్రారంభం అయింది. కొన్నాళ్లకే ఎన్నికలు రావడం..పవన్ బిజీ అయిపోవడంతో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ చిత్రం సెట్పైకి వెళ్లింది. ఇటీవల ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కల్యాణ్ అఫీషియల్ గా షూటింగ్లో జాయిన్ అయ్యారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్లో పాల్గొంటోంది. పవన్ ఎంట్రీతో సెట్స్లో జోష్ నెలకొంది అని చిత్రబృందం పేర్కొంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
తెలుగు సినిమా.. నిమిషానికి రూ.4.35 కోట్లు తీసుకున్న హీరో!
చిత్ర పరిశ్రమలో చాన్స్ దొరకడమే కష్టం కానీ..ఒక్కసారి చాన్స్ వచ్చి, మంచి హిట్ పడితే..ఇక ఆ నటీనటులకు తిరుగుండదు. వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి. పారితోషికం సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది ఆ ‘ఒకే ఒక చాన్స్ ’కోసం ఎదురు చూస్తుంటారు. అలా వచ్చిన అవకాశం అందిపుచ్చుకొని నిరూపించుకుంటే.. కొన్ని ఏళ్ల వరకు ఢోకా ఉండదు. ముఖ్యంగా హీరోలకైతే వయసు మీద పడినా.. సినిమా చాన్స్లు తగ్గవు. ఒకవేళ తగ్గినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గానో.. క్యామియో రోల్గానో మెరిసి సొమ్ము చేసుకుంటారు. మరికొంతమంది హీరోలు అయితే సోలోగా సినిమాలు చేస్తూనే..అప్పుడప్పుడు ఇతర హీరోల సినిమాల్లో క్యామియో రోల్ ప్లే చేస్తుంటారు. అలాంటి వారిలో అజయ్ దేవగణ్ ఒకరు. ఒకవైపు సోలో హీరోగా చేస్తూనే.. మరోవైపు అతిధి పాత్రల్లో మెరుస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరో క్యామియో రోల్ చేసినా..రెమ్యునరేషన్ మాత్రం హీరో స్థాయిలోనే తీసుకుంటున్నాడట. ఆర్ఆర్ఆర్ సినిమాలో క్యామియో కోసం నిమిషానికి రూ. 4.35 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే ఈ చిత్రానికిగానే అజయ్ భారీగానే పారితోషికంగా పుచ్చుకున్నాడట. ఈ ఒక్క చిత్రానికి రూ. 35 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అజయ్ కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఈ లెక్కన నిమిషానికి రూ.4.35 కోట్ల చొప్పున ఆయన తీసుకున్నాడు. క్యామియో రోల్కి ఈ స్థాయి రెమ్యునరేషన్(నిమిషాలతో పోల్చి చూస్తే) తీసుకుంటున్న నటుల్లో అజయ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే హీరోగా చేస్తున్న సినిమాలకు మాత్రం ప్రాజెక్ట్ని బట్టి పారితోషికం తీసుకుంటాడట. బడా ప్రాజెక్టు అయితే రూ. 40 కోట్లు తీసుకునే అజయ్.. రైడ్ 2 వంటి చిన్న చిత్రాలకు సగం తగ్గించి రూ. 20 కోట్ల వరకే తీసుకుంన్నాడట. అజయ్ ప్రస్తుతం దేదే ప్యార్ దే 2, సన్నాఫ్ సర్ధార్ 2, దృశ్యం 3 వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. -
కూతురుతో హైదరాబాద్కు సూర్య.. యంగ్ లుక్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది 50 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్నప్పటికీ, చూడటానికి 30 ఏళ్ల యువకుడిలా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వయసుతో పాటు ఆయన అందం కూడా పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ మరింత ఫిట్గా, హ్యాండ్సమ్గా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా, సూర్య తన కూతురు దియాతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియోలో సూర్య, దియా తండ్రి-కూతుళ్లలా కాకుండా అన్నా-చెల్లెల్లా కనిపించారు. సూర్య యంగ్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అవుతూ, ‘మా హీరో రోజురోజుకూ మరింత యంగ్గా మారుతున్నాడు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వీడియోని షేర్ చేస్తున్నారు.సూర్య ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి ఆధ్వర్యంలో కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఈ క్రమంలోనే తన కూతురు దియాని కూడా వెంటబెట్టుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్లో టీషర్ట్లో సింపుల్గా కనిపించిన సూర్య, తన ఫిట్నెస్తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.సూర్య కూతురు దియా సాధారణంగా పబ్లిక్లో ఎక్కువగా కనిపించదు. ఆమెకు సంబంధించిన వివరాలు కూడా పెద్దగా బయటకు రాలేదు. ఇటీవల దియా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, ఆ ఫోటోలను సూర్య భార్య జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. చదువు పూర్తి చేసిన దియా ఇప్పటి వరకు సినిమా రంగంలోకి అడుగుపెట్టలేదు. అయితే, తండ్రితో కలిసి షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం ఆసక్తికరంగా మారింది. ఎయిర్పోర్ట్లో సూర్య, దియా కలిసి నడుచుకుంటూ వెళ్లిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సూర్య ఫిట్నెస్, యంగ్ లుక్కు అభిమానులు మరోసారి ఆకర్షితులవుతూ, అతడి స్టైల్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. Exclusive @Suriya_offl ❤️ #Suriya46 pic.twitter.com/3a5nMaE9Au— Suriya Fanatics Kerala ™ (@TeamSFK__Offl) June 8, 2025 -
డ్యూయల్ రోల్లో కార్తీ.. ‘సర్దార్ 2’ సమాప్తం!
‘సర్దార్’ సీక్వెల్ ‘సర్దార్ 2’ షూటింగ్ సమాప్తం అయింది. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా ‘సర్దార్’. 2022 అక్టోబరులో విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచింది. తాజాగా కార్తీ, పీఎస్ మిత్రన్ కాంబినేషన్లోనే ‘సర్దార్’ సినిమాకు సీక్వెల్గా ‘సర్దార్ 2’ రానుంది. ఈ సీక్వెల్ చిత్రీకరణ పూర్తయినట్లుగా మేకర్స్ వెల్లడించారు. కార్తీ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్జే సూర్య పవర్ఫుల్ పాత్రలో నటించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ‘సర్దార్’ సినిమాలో తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. సీక్వెల్లోనూ ద్విపాత్రాభినయం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా. -
అటు బాలయ్య.. ఇటు పవన్.. తగ్గేదెవరు?
టాలీవుడ్కి సంక్రాంతి, దసరా, దీపావళి పండగలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో పలు బడా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పండగ వేళ సెలవులు ఉండడం.. అంతా ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటారు కాబట్టి.. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ ఈ పండగ సమయాల్లోనే వస్తుంటాయి. అయితే ఒక్కోసారి రెండు మూడు పెద్ద సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కొన్ని సార్లు అవన్నీ హిట్ అయితే..మరికొన్ని సార్లు వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే విజయం సాధిస్తుంది. ఈ పోటీ కారణంగా కొన్ని మంచి చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోతున్నాయి. అందుకే ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్దాలేవి జరగట్లేదు. స్టార్ హీరోలలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతున్నారు. పోటీ ఉన్నా తమకు సినిమాకు ఢోకా లేదు అనుకుంటే తప్ప.. రిలీజ్ చేయట్లేదు. కానీ త్వరలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్దం జరగబోతుంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారిలో ఒకరు బాలకృష్ణ(Nandamuri Balakrishna) అయితే మరో స్టార్ హీరో పవన్ కల్యాణ్( Pawan Kalyan). వీరిద్దరు బక్సాఫీస్ వార్కి రెడీ అవుతున్నారు.మరోసారి బాక్సాఫీస్పై ‘తాండవం’?బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ: తాండవం’(Akhanda 2). వీరిద్దరి కాంబినేషన్లో 2021లో వచ్చిన ‘అఖండ’సినిమాకు సీక్వెల్ ఇది. తాజాగా ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో పాటు రిలీజ్ డేట్ని కూడా ప్రకటించారు. దసర కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం రాబోతుందని వెల్లడించారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఓజీ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కానుంది.‘ఓజీ’ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఓజీ(OG) ఒకటి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కానీ రిలీజ్ డేట్ మాత్రం చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అదే రోజు బాలయ్య కూడా అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇద్దరి సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకేసారి రావడం రెండూ సినిమాకు మంచిది కాదని సినీ పండితులు చెబుతున్నారు. కాస్త గ్యాప్ తీసుకొని వస్తే రెండు చిత్రాలకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని, ఒకోసారి వస్తే కొంచెం తేడా అయితే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా? లేదా ‘తగ్గేదే లే’ అంటూ బాక్సాఫీస్ వార్కి సై అంటారా? కొద్ది రోజుల్లో తెలుస్తుంది. -
అమ్మవారి సినిమా.. క్లాప్ కొట్టిన కమెడియన్ అలీ
నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్.బి.జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా 'చండీ దుర్గమా'. జయశ్రీ వెల్ది నిర్మాతగా, ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో సోమవారం (జూన్ 9న) హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చిట్టి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, రఘు కారుమంచి ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. కమెడియన్ అలీ మాట్లాడుతూ.. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. డైరెక్టర్ మైను ఖాన్. ఎండీ. మాట్లాడుతూ.. ఈ రోజు మా చండీ దుర్గమా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన అలీ గారికి థాంక్స్. రఘు కారుమంచి, చిట్టి కూడా మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఈ మధ్య అమ్మవారి నేపథ్యంగా సినిమాలు రూపొందడం లేదు. సౌందర్య గారి అమ్మోరు, విజయశాంతి గారి చండీ సినిమా తర్వాత అమ్మవారి కథతో సినిమా రాలేదు. ఇప్పటి ట్రెండ్కు అనుగుణంగా, ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా డార్క్ థీమ్లో సరికొత్త కాన్సెప్ట్ తో చండీ దుర్గమా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్కు ఆడియన్స్ను రప్పించేలా చండీ దుర్గమా సినిమా మేకింగ్ను డిజైన్ చేస్తున్నాం అన్నారు. నిర్మాత జయశ్రీ వెల్ది మాట్లాడుతూ.. తెలుగు ఆడియన్స్ అమ్మవారి నేపథ్యంగా వచ్చిన చిత్రాలను ఎంతో ఆదరించారు. మా సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం అన్నారు. -
రెండుసార్లు విడాకులు.. ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం?: హీరో
పెళ్లైన దంపతులను నిండునూరేళ్లు కలిసి జీవించమని పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కానీ, ఈ కాలంలో నూరేళ్లు బతకడం కష్టమే అయితే, అంతవరకు కలిసి జీవించడం పెద్ద సవాల్గా మారింది. ఎన్నో జంటలు ఆడంబరంగా వివాహం చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. సినీ ఇండస్ట్రీలో ఈ ధోరణి కాస్త ఎక్కువే కనిపిస్తుంది.నిందలు- బాధలుఅయితే విడాకులు తీసుకోవడం ఈజీ అయినా, ఆ బాధను మర్చిపోవడం అంత తేలిక కాదంటున్నాడు హీరో ప్రోసెంజిత్ చటర్జీ (Prosenjit Chatterjee). ఇతడు సహనటి దెబశ్రీ రాయ్ (Debashree Roy)ను పెళ్లాడాడు. వివాహమైన కొంతకాలానికే విడిపోయారు. ఈ విషయం గురించి ప్రొసెంజిత్ తాజాగా టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అప్పుడు మా వయసు పెద్దదేం కాదు. విడిపోయినప్పుడు ఒకరినొకరు నిందించుకున్నాం.టాప్ 10 నటుల్లో నేను లేనుకానీ ఆ బాధ నుంచి బయటపడలేకపోయాను. పనిపై దృష్టి సారించలేకపోయాను. కొంత డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగ్గా అదే సమయంలో బెంగాల్లో టాప్ 10 నటుల గురించి ఓ వార్త రాశారు. టాప్ 10 జాబితాలో ఎక్కడా నా పేరు లేదు. అది నన్ను మరింత బాధలోకి నెట్టేసింది. నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. తిరిగి ఆఫీస్కు వెళ్లి ఒకేసారి తొమ్మిది సినిమాలు సంతకం చేశాను. ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేం లేదు.ప్రొసెంజిత్ చటర్జీ- దెబశ్రీ రాయ్మూడు పెళ్లిళ్లుబాధగా అనిపించినప్పుడల్లా నా తోటకి వెళ్లేవాడిని. ఎవరితోనూ మాట్లాడకుండా కాసేపు ప్రశాంతంగా కూర్చునేవాడిని అని చెప్పుకొచ్చాడు. దెబశ్రీకి విడాకులు ఇచ్చాక ప్రొసెంజిత్ మరోసారి ప్రేమలో పడ్డాడు. అపర్ణ గుహ తకుర్తను పెళ్లాడాడు. వీరికి ప్రేరణ అనే కూతురు పుట్టింది. తర్వాత ఈ జంట మధ్య కూడా విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. నటి అర్పితా పాల్ను మూడో పెళ్లి చేసుకున్నాడు. కెరీర్బాలీవుడ్ నటుడు బిస్వజిత్ చటర్జీ కుమారుడే ప్రొసెంజిత్. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ప్రొసెంజిత్ హీరోగా, విలన్గా అనేక సినిమాలు చేశాడు. బెంగాలీ, హిందీలో అనేక చిత్రాల్లో నటించాడు. దోసర్ మూవీకి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. చివరగా ఖాకీ: ద బెంగాల్ చాప్టర్ అనే వెబ్ సిరీస్లో కనిపించాడు. ప్రస్తుతం మాలిక్ అనే మూవీ చేస్తున్నాడు. పులకిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాజ్ కుమార్ రావు, మానుషి చిల్లరి, మేధా శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 11న విడుదల కానుంది. చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా? -
అఖిల్ రిసెప్షన్లో సింపుల్గా మహేశ్.. ఆ టీ షర్ట్ ధర లక్షల్లో..!
అందరికీ వయసు పెరుగుతుంది. కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu)కు మాత్రం వయసు తగ్గిపోతూ వస్తుంది. అన్నం తింటాడా? అందం తింటాడా? అన్నంత హ్యాండ్సమ్గా కనిపిస్తుంటాడు. కుమారుడు గౌతమ్ పక్కన నిలబడితే అతడికి తండ్రిలా కాదు, అన్నలా ఉంటాడు. మహేశ్ అందం గురించి చెప్తే మాటలు సరిపోవు. అతడి ఫోటో కనిపిస్తే చాలు సోషల్ మీడియా షేకైపోతుంది.సింపుల్గా టీ షర్ట్లో మహేశ్తాజాగా మహేశ్.. అక్కినేని ఇంట శుభకార్యానికి హాజరయ్యాడు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని- జైనబ్ రవ్జీలు జూన్ 6న పెళ్లి చేసుకున్నారు. ఆదివారం (జూన్ 8న) అన్నపూర్ణ స్టూడియోలో వీరి రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్.. భార్య నమ్రత, కూతురు సితారను తీసుకుని హాజరయ్యాడు. అయితే మహేశ్.. సింపుల్గా టీ షర్ట్ వేసుకుని వెళ్లాడు. లక్ష పైచిలుకు..చూడటానికి సింపుల్గా కనిపిస్తున్న ఈ టీ షర్ట్ ధర వేలల్లో కాదు లక్షల్లోనే ఉంది. ఫ్లవర్ ప్రింటింగ్ ఉన్న ఈ టీషర్ట్.. హెర్మ్స్ అనే లగ్జరీ బ్రాండ్కు చెందినది. దీని ధర దాదాపు రూ.1.37 లక్షలని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే మహేశ్ చివరగా గుంటూరు కారం అనే సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం రాజమౌళితో #SSMB 29 చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా? -
బీ గ్రేడ్ చిత్రాలతో కెరీర్ నాశనం.. పెద్ద సినిమాలు చేజార్చుకున్నా!
దీప్శిఖ నగ్పాల్ (Deepshikha Nagpal).. కోయిల, బాద్షా, దిల్లగీ, పార్ట్నర్ వంటి బాలీవుడ్ (Bollywood) హిట్ సినిమాల్లో నటించింది. హిందీ బిగ్బాస్ 8వ సీజన్లోనూ పాల్గొంది. బుల్లితెరపైనా పలు సీరియల్స్లో తళుక్కుమని మెరిసింది. అయితే కొన్ని చెత్త సినిమాలను సెలక్ట్ చేసుకోవడం వల్ల అవకాశాలు తగ్గడంతో బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చిందంటోంది.తప్పుడు నిర్ణయాలతో కెరీర్ తలకిందులుఇన్స్టంట్ బాలీవుడ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్శిఖ మాట్లాడుతూ.. నేను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కెరీర్ను దెబ్బకొట్టాయి. అప్పట్లో ఎలా ఉండేదంటే.. యశ్ రాజ్, సుభాష్ వంటివారు నిర్మించేవి మాత్రమే ఏ గ్రేడ్ సినిమాలుగా పరిగణించేవారు. కొత్త నిర్మాణ సంస్థ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుందంటే అది బీ గ్రేడ్ సినిమాలకిందే లెక్కేసేవారు. నాకు ఏవి సెలక్ట్ చేసుకోవాలనేది అర్థం కాలేదు.ఏదైనా పనే అనుకున్నా..పైగా నా ఫ్యామిలీలో ఎవరికీ సినీరంగంతో పరిచయమే లేదు. కానీ సినీరంగంలో మనకు సలహాలిచ్చే వ్యక్తి ఉంటే బాగుంటుందని నాకిప్పుడనిపిస్తుంది. సినిమాల ఎంపికలో చాలా తప్పులు చేశాను. మా తాతయ్య ఏమనేవారంటే.. ఏ పనీ చిన్నది, పెద్దది అని వ్యత్యాసం చూపించకూడదనేవారు. ఏదైనా పనే అనేవారు. దాన్ని నేను సీరియస్గా తీసుకున్నాను. అందుకనే నాకు ఏ అవకాశం వచ్చినా ముందూవెనకా ఆలోచించకుండా చేసుకుంటూ పోయాను. ఈ క్రమంలో ఎన్నో చెత్త సినిమాలు చేశా.. అవి ఇప్పటికీ రిలీజ్ కాకుండా ఆగిపోయాయి.(చదవండి: అరటిపండ్లు అమ్మా, నెంబర్ ప్లేట్లు తయారు చేశా.. మారుతి)ఆ పోస్టర్ దెబ్బ కొట్టిందికొన్ని విడుదలయ్యాయి.. కానీ, అవి నా కెరీర్ను దెబ్బకొట్టాయి. ఉదాహరణకు ట్రేడ్ గైడ్ అనే సినిమా చేసినప్పుడు ఓ పోస్టర్ వదిలారు. అప్పటికే నేను చాలా పెద్ద సినిమాలకు సంతకం చేశాను. కానీ ఆ పోస్టర్ చూశాక నేను బీ గ్రేడ్ సినిమాలు చేస్తున్నానని పక్కన పెట్టేశారు. నాకు విషయం అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ సినిమాల గురించి మర్చిపోదాం అని కోరినా కూడా వాళ్లు వినలేదు. నిన్ను తీసుకుంటే మేము నష్టపోవాల్సి వస్తుంది అని రిజెక్ట్ చేశారు. చెత్త సినిమాలు చేసినందున జనాలు నన్ను నమ్మడం మానేశారు.ఆ కోపంతో బుల్లితెరకు షిఫ్ట్పెద్ద సినిమాల్లో పని చేసే అర్హత లేదని భావించారు. నాకు పట్టరానంత కోపం వచ్చింది. అందుకే బుల్లితెరపై ఫోకస్ పెట్టాను. ఇక్కడ సీరియల్స్, షోలు చేయడం స్టార్ట్ చేశాను. శాశ్వతంగా కనుమరుగైపోకుండా నటిగా నిలబడ్డాను అని చెప్పుకొచ్చింది. దీప్శిక.. సన్ పరి, రామాయణ్, కరిష్మా- ద మిరాకిల్స్ ఆఫ్ డెస్టినీ, బల్వీర్, మధుబాలా- ఏక్ ఇష్క్ ఏక్ జునూన్, సంతోషి మా వంటి పలు సీరియల్స్లో నెగెటివ్ పాత్రలు చేసింది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన కుంకుమ భాగ్య సీరియల్ నటి -
అరటిపండ్లు అమ్మా, నెంబర్ ప్లేట్లు తయారు చేశా.. మారుతి
సాక్షి, మచిలీపట్నం: జీవితం అందరికీ పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలు చూసిన తర్వాత కానీ విజయాలు సొంతం కావు. దర్శకుడు మారుతి (Maruthi) జీవితం కూడా అంతే! ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేశాడు. టాలీవుడ్లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా పని చేశాడు. తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో ఆర్య సినిమా కొని డిస్ట్రిబ్యూటర్గా హిట్టందుకున్నాడు. తర్వాతి కాలంలో దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్లు, ఫ్లాపులు అన్నీ చూశాడు. హారర్ జానర్అంతెందుకు, 2022లో ఆయన చివరగా తీసిన పక్కా కమర్షియల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అందుకుంది. అయినా సరే తనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రభాస్ (Prabhas)తో ద రాజా సాబ్ (The Raja Saab Movie) అనే హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. తాజాగా మారుతి.. మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసులా బీచ్ ఫెస్టివల్కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1999లో హైదరాబాద్కు వెళ్లాను. అంతకుముందు వైజాగ్లో అరటిపండ్లు అమ్మేవాడిని. ఇక్కడ రాధికా థియేటర్ ఎదురుగా నాన్నకు అరటిపండ్ల బండి ఉండేది. బొమ్మలు గీసుకునేవాడినినేను కూడా అక్కడ పండ్లు అమ్ముతూ.. సినిమాలు రిలీజైనప్పుడు వాటిని చూసి నా నోట్బుక్లో బొమ్మలు గీసుకుంటూ ఉండేవాడిని. తర్వాత 1999లో హైదరాబాద్కు వచ్చాను. అప్పుడు నాకు స్టిక్కరింగ్ షాపు ఉండేది. నెంబర్ ప్లేట్లు తయారు చేసేవాడిని. హిందూ కాలేజీలో చదువుకుంటూనే నెంబర్ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి కష్టపడితే ఎంత దూరమైనా వెళ్తాడనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే! రూ.400 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా మూవీ తీస్తున్నా.. అంచనాలు పెంచేసిన మారుతిరాజా సాబ్ మీరు ఊహించినదానికంటే ఒకశాతం ఎక్కువే ఉంటుంది. జూన్ 16న టీజర్ రిలీజ్ చేస్తున్నాం అని రాజాసాబ్పై అంచనాలు పెంచేశాడు మారుతి. అటు ఎక్స్ (ట్విటర్)లోనూ ఒట్టేసి చెబుతున్నా.. రాజా సాబ్ మూవీ ఓ వేడుకలా ఉంటుందని ట్వీట్ చేశాడు. మారుతి దర్శకుడిగా ఈ రోజుల్లో, బస్స్టాప్, ప్రేమకథా చిత్రం, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే, బాబు బంగారం, మంచి రోజులొచ్చాయ్.. ఇలా పలు సినిమాలు చేశాడు. Still feels like yesterday :)#PremaKathaChitram Memories are fresh in my mind….♥️ And now even more excited for this anniversary… because after a long time stepping back into that zone again…..But this time it’s a horror fantasy.I promise #TheRajaSaab will be a celebration… https://t.co/naoZekmCBH— Director Maruthi (@DirectorMaruthi) June 7, 2025 చదవండి: ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు -
ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు
సినిమా కోసం కొన్నిసార్లు విన్యాసాలు చేయక తప్పదంటున్నాడు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher). అదేదో సినిమాలో స్టంటనుకునేరు, కానే కాదు సినిమా సెట్కు వెళ్లేందుకు స్టంట్ చేయాల్సి వచ్చింది. అనుపమ్ ఖేర్.. ప్రభాస్ ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే సెట్లోకి వెళ్లేందుకు అనుపమ్ గోడ దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇదే తొలిసారినా 40 ఏళ్ల జర్నీలో ఎన్నో రకాలుగా షూటింగ్ లొకేషన్కు వెళ్లాను. కానీ ఈరోజు ఇలా సెట్కు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి, ప్రత్యేకం కూడా! హైదరాబాద్లో ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్కు బయలుదేరాం. మా డ్రైవర్ దాన్ని సాహసోపేతంగా మార్చాలనుకున్నాడేమో బహుశా.. ఏకంగా అడవిలాంటి ప్రదేశంలోకి తీసుకొచ్చాడు. తీరా డెడ్ ఎండ్కు చేరుకున్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. గోడ దూకి సెట్లోకి..కారు రివర్స్ తీద్దామని ప్రయత్నించినా వీలు కాలేదు. మా పక్కనే సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతో గోడ దూకి సెట్లోకి అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన జనాలు.. కెరీర్ తొలినాళ్లలో ముసలి వ్యక్తిగా నటించారు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో అడవిలో ఈ స్టంట్లు చేస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఫౌజీ సినిమా విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్కు జంటగా సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) చదవండి: చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ.. -
ఓటీటీలో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ తొలి వెబ్ సిరీస్
బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దేవిక అండ్ డాని. ‘శ్రీకారం’ ఫేమ్ బి. కిశోర్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించగా, సూర్య వశిష్ట, శివ కందుకూరి హీరోలుగా నటించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కామెడీ, హారర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది.రీతు వర్మ ఓటీటీ లో డెబ్యూ , పల్లెటూరి అమ్మాయి గా క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయింది అందంగా ఉంది , టీచర్ గా ప్రాబ్లం వస్తే ఎదిరించే అమ్మాయి లాగా బాగా చేసింది. సూర్య వశిష్ఠ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది , శివ కందుకూరి పల్లెటూరి అబ్బాయి గా బాగా సెట్ అయ్యాడు. సుబ్బరాజు నీ పల్లెటూరి క్యారెక్టర్ లో కొత్తగా అనిపించాడు. చాలా రోజుల తర్వాత కోవై సరళ గారు ఒక మంచి పాత్రలో కనిచించారు... సిరీస్ కి ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది. -
రెండు వేల కోట్ల అధిపతి.. శ్రీను వైట్ల ఏం అన్నారంటే..
శ్రీను వైట్ల..ఒకప్పుడు ఆయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. శ్రీను వైట్ల డైరెక్షన్లో సినిమా వచ్చిందంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో ఉండేది. కానీ ‘ఆగడు’ తర్వాత ఆయన జాతకం అడ్డం తిరిగింది. ఆ చిత్రం తర్వాత తెరకెక్కించిన బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా అన్ని చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో కొన్నాళ్ల పాటు ఆయన మెగాఫోన్ పట్టలేదు. చాలా కాలం తర్వాత ‘విశ్వం’తో మళ్లీ తిరిగి వచ్చాడు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ శ్రీను వైట్ల రీఎంట్రీకి పనికొచ్చింది.త్వరలో ఆయన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే.. శ్రీను వైట్ల పర్సనల్ విషయం ఒకటి నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. ఆయన బాగా రిచ్ అట. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 2000 కోట్ల వరకు ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా దీనిపై శ్రీనువైట్ల స్పందించారు. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘రూ. 2000 కోట్ల అధిపతి అన్న మాట అవాస్తవం. అంత రిచ్చెస్ట్ డైరెక్టర్ని నేను కాను. కానీ ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాలపై వచ్చిన డబ్బుతో నేను భూములు కొన్నాను. వాటి రేట్ ఇప్పుడు బాగానే పెరిగింది. నాకు ఇతర అలవాట్లేవి లేదు. సినిమాలు తీయడం తప్ప వేరే ఏ పని రాదు. స్థలాల మీద తప్ప నాకు వేరే నాలెడ్జ్ లేదు. అందుకే వాటిమీదనే ఇన్వెస్ట్ చేశాను. పొలాలు కొన్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది’ అని అన్నారు. ఇక డబ్బుల విషయంలో చాలా పొదుపరి అట కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నిజమే డబ్బుల విషయంలో నేను కాస్త జాగ్రత్తగానే ఉంటాను. అలా అని పిసినారిని కాదు. అవసరం మేరకు ఖర్చు చేస్తాను. డబ్బు కన్నా ఎక్కువ సినిమాకే ఇంపార్టన్స్ ఇస్తాను. నా వల్ల ఇప్పటి వరకు ఏ నిర్మాత నష్టపోలేదు. డిజాస్టర్గా నిలిచిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలోనూ నిర్మాతలు నష్టపోలేదు. నా డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో.. నిర్మాత విషయంలోనూ అలానే ఉంటాను. చెప్పిన దానికంటే తక్కువ బడ్జెట్లోనే సినిమాను ముగిస్తాను’ అని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు. -
ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్
బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (Priyanka Jain), బుల్లితెర నటుడు శివకుమార్ (Shivakumar) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమలో మునిగారు. కొంతకాలంగా కలిసే ఉంటున్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. శనివారం (జూన్ 8న) శివకుమార్ బర్త్డే. ఈ సందర్భంగా అండమాన్- నికోబార్లో అతడి పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని మోకాలిపై కూర్చుని ప్రపోజల్ చేసింది.బీచ్లో ప్రపోజల్..నెచ్చెలి ఎదురుగా వచ్చి చేయందుకోమన్నాక ఎవరైనా ఎలా ఆగుతారు. శివ్ కూడా అంతే.. సంతోషంతో గంతేశాడు. తప్పకుండా అని అంగీకారంగా హత్తుకున్నాడు. అప్పుడు ప్రియాంక సగం పెళ్లి అయిపోనట్లే అన్నట్లుగా ఓ ఉంగరాన్ని అతడి వేలికి తొడిగింది. నా జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు అధికారికంగా నువ్వు నావాడివి. ఎప్పటికీ నాతోనే ఉండాలి. మనం జంటగా ఎన్నో సాహసాలు చేద్దాం. కలిసి ఎదుగుదాం..ఇక్కడివరకు మన ప్రయాణం అంత సులువుగా జరగలేదు. తర్వాత కూడా అంత ఈజీగా ఉండకపోవచ్చు. కానీ మనం ప్రతిరోజు దాన్ని ఉత్తమంగా మార్చుకునేందుకు ప్రయత్నిద్దాం. ఏయేటికాయేడు కాలాన్ని వృథా చేయకుండా జ్ఞాపకాలు కూడబెట్టుకుందాం. కలిసి ముందుకుసాగుదాం అని రాసుకొచ్చింది. ఇది చూసిన బుల్లితెర తారలు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్స్తో పాపులర్కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రియాంక.. జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్తో పాపులర్ అయింది. మౌనరాగం సీరియల్లో శివకుమార్కు జంటగా నటించింది. అక్కడ మొదలైన పరిచయమే తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్న వీళ్లిద్దరూ పెళ్లెప్పుడు చేసుకుంటారని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిగ్బాస్ అయిపోగానే వివాహం చేసుకోవాలనుకున్నారు. గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్కాకపోతే అంగరంగ వైభవంగా, కొన్నిరోజులపాటు పెళ్లి వేడుకలు జరుపుకోవాలని ప్లాన్ చేసుకుందట ప్రియాంక. అందుకు చాలా డబ్బు అవసరం అవుతుందని, అది సంపాదించుకున్నాకే పెళ్లి చేసుకుంటామని గతేడాది శివకుమార్ బయటపెట్టాడు. ఇప్పుడా సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదే వీరి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి: చిన్నతనంలో చేదు అనుభవాలు.. అబ్బాయిల్ని నమ్మాలంటేనే.. -
బాలకృష్ణ బర్త్డే సందేశం... కొత్త సీసాలో పాత సారా కలిపాడుగా!
ఆధునిక టెక్నాలజీతో బ్లాక్ అండ్ వైట్ లో తీసిన సినిమాలను కలర్ లోకి తీసుసుకురావడం, ఆ తరువాత పాత సినిమాలను 4కెలో లో రీరిలీజ్ చేయడం వంటి మార్పుల్ని ఇప్పటికే మనకు పరిచయం చేసిన టాలీవుడ్ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్కు నాంది పలికింది. అదే పాత సినిమాలో కొత్త పాటల్ని కలపడం. పాత విజువల్స్కు కొత్త పాటని జత చేసే ట్రెండ్ కు నాంది పలికింది సినీనటుడు బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహా సినిమా. ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాలకు కాసుల వర్షం కురుస్తుండడంతో మొత్తం టాలీవుడ్ ఫ్లాష్ బ్యాక్లోకి పరుగులు తీస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లి అప్పట్లో హిట్ అయిన చిత్రాల్ని తిరిగి ప్రేక్షకుల ముందుకు తెచ్చే క్రమంలోనే ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 21 ఏళ్ల తరువాత లక్ష్మీ నరసింహా సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. జూన్ 8 న ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అయ్యింది. బాలకృష్ణ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీ నరసింహా. దీనిని నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆసిన్ హీరోయిన్ గా నటించింది. 21ఏళ్ల క్రితం 2004 లో రిలీజ్ అయిన ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు రీరిలీజ్ సినిమా వస్తుంది అంటే కొత్తగా ట్రైలర్ ను రూపొందించి విడుదల చేయడం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఒక కొత్త పాటనే రూపొందించారు. మొదట లక్ష్మీ నరసింహా సినిమాలోనే బాలకృష్ణ క్యారెక్టర్ ను రివీల్ చేసే సాంగ్ ఒకటి రూపొందించారట. అయితే షూటింగ్ కూడా చేసినా ఆ సాంగ్ ని వాడలేదట. దీంతో ఆ పాత బాలయ్య డ్యాన్స్ విజువల్స్ను కొత్తగా పాట రాయించి మరీ ఆ విజువల్స్కు జత చేశారట.తాజాగా ఈ కొత్త సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. మంచినీళ్లు తాగినోడు మామూలోడు, మజ్జిగ తాగినోడు మంచోడు.. మందేసినోడు ఘనుడు.. మ్యాన్షన్ హౌస్ వేసినోడు మహానుభావుడు అంటూ సాగే ఈ పాటనుచంద్రబోస్ రాయగా, స్వరాగ్ కీర్తన్ ఆలపించగా, భీమ్స్ నేపధ్య సంగీతం అందించారు. పాట చివర్లో జై బాలయ్య జైజై బాలయ్య అంటూ బాలకృష్ణకు యధాశక్తి భజన చేశారు బెల్లంకొండ. సినిమా రీరిలీజ్ రోజు కలెక్షన్స్ కోసం రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు..అలాగే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాత సినిమాకు కొత్త ఆకర్షణలను జోడించడం కూడా తప్పు కాదు. కానీ తాజాగా జోడించిన పాటలో వాక్యాలే అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓ వైపు మద్యం ప్రకటనల్లో, ప్రచారాల్లో సినిమా తారలు పాల్గొనడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఏకంగా మందు తాగితేనే ఘనుడు, మ్యాన్షన్ హౌస్ తాగితేనే మహానుభావుడు..వాడిని ఎవడూ ఆపలేడు... అంటూ తన పాటల ద్వారా చెప్పడం అంటే... ఒక ప్రజా ప్రతినిధి యువతకు ఏం సందేశం ఇస్తున్నట్టు? పైగా ఆయన పుట్టిన రోజు నాడు.. అభిమానులకు ఇవ్వాల్సిన సందేశం ఇదేనా? -
Devi Prasad: కెవ్వుమని అరవమంటే.. ‘కెవ్వు’ అని పడిపోయింది
సూపర్స్టార్ హీరోగా"గూఢచారి117" సినిమా షూటింగ్ మద్రాస్ లోని స్టూడియోలో వేసిన "విమానం ఇంటీరియర్ సెట్" లో జరుగుతోంది. సమయం అర్ధరాత్రి 2 గంటలు. బాలనటుడైన మహేష్బాబుతోసహా దాదాపు సినిమాలోవున్న నటీనటులందరూ ఆ ఫ్లైట్ సెట్లో ఉన్నారు. ఫ్లైట్ ఎక్స్టీరియర్ వర్క్ హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో జరిగింది. కృష్ణగారు డైరెక్టర్గారితో "ముందు మహేష్ షాట్స్ తీయగలిగితే తీసి పంపించేయండి. నిద్రకి ఆగలేడు.నేను కావాలంటే తెల్లవారేవరకూ ఉంటాను" అని నవ్వుతూ చెప్పారు. ఆ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు మహేష్బాబు టకటకా డైలాగులు చెబుతుంటే కృష్ణగారు చూస్తూ భలే మురిసిపోతుండేవారు.కధప్రకారం టెర్రరిస్ట్ భానుప్రియ గ్రూప్ ఫ్లైట్ హైజాక్ చేసి వాళ్ళ డిమాండ్స్ కోసం ఒక్కొక్కరినీ చంపుతుంటారు. ఆ ప్రోసెస్ లో భాగంగా కొత్తగా పెళ్ళైన ఓ జంటలోని యువకుడిని చంపుతారు. మా మిత్రుడు పురం రాధాకృష్ణ(తర్వాతికాలంలో"చిరంజీవులు" సినిమాకి దర్శకత్వం వహించాడు) ఆ యువకుడి పాత్ర పోషిస్తే అతని జంటగా ఓ కొత్తమ్మాయి వేసింది. డైరెక్టర్ గారు ఆ అమ్మాయితో "టెర్రరిస్ట్లు మీ ఆయన్ని కాల్చేశారు అది చూసి నువ్వు కెవ్వుమని అరిచి పడిపోవాలి"అని చెప్పారు. సెట్లో ఒకరిద్దరుగురకపెడుతున్నవాళ్ళను,నిద్రకుజోగుతున్నవాళ్ళను లేపి టేక్ అని అరిచాము. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పగానే రాధాకృష్ణ బుల్లెట్ తగిలినట్లు అరిచి పడిపోతే అతన్ని చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా తల పైకెత్తి తన చెవులురెండూ మూసుకుని "కెవ్వు" అనే పదం పెద్దగా పలుకుతూ పడిపోయింది. అంతే దెబ్బకి సెట్లో అందరికీ నిద్రమత్తు ఒదిలిపోయింది. విరగబడి నవ్వారందరూ. మీరు చెప్పిందేకదా చేశాను ఎందుకు నవ్వుతున్నారు అన్నట్లు చూసిందా అమ్మాయి. డైరెక్టర్ గారు "కెవ్వుమనిఅరవమంటే"కెవ్వూ"అనిఅనక్కర్లేదమ్మా.అరిచిపడిపోతే చాలు" అని మళ్ళీ యాక్షన్ చెప్పారు. మళ్ళీ సెకెండ్ టేక్ లో కూడా ఆ అమ్మాయి "కెవ్వూ" అంటూ దీర్ఘం తీయడంతో మళ్ళీ నవ్వులేనవ్వులు.మూడో టేక్ కి అర్ధమైందామెకి.టేక్ ఓకే అయ్యింది. అప్పటి నుండి ఆ అమ్మాయి "కెవ్వుకుమారి" అయ్యింది. కొన్ని తెలుగు తమిళ సినిమాలలో నటించిన ఆ అమ్మాయి తరువాత కనిపించలేదు. నేను దర్శకత్వం వహించిన "బ్లేడ్బాబ్జీ" సినిమాలో.... అల్లరి నరేష్ బృందం బ్యాంక్ రాబరీ చేసి పోలీసులనుండి తప్పించుకున్న ఆనందంలో వైజాగ్ బీచ్ ఒడ్డున లంగరేసివున్న ఓ చిన్న షిప్ లో మందుకొట్టి పడుకుని తెల్లారి లేచి చూసేసరికి షిప్ సముద్రం మధ్యలో ఉంటుంది.షాక్ అయ్యిన వాళ్ళు చేతులు చెవులకు ఆనించి "కెవ్వు" అని అరుస్తారు పెద్దగా. అలా అరిపించటానికి ఆనాటి కెవ్వు కుమారి "కెవ్వే" నాకు ప్రేరణ. ఆ "కెవ్వు" ఆనాడు సెట్లో అందరినీ ఎలా నవ్వించిందో అలాగే ఈ "కెవ్వు" ధియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. వెతకాలేగానీ మనచుట్టూ జరిగే సంఘటనల్లో, చుట్టూ ఉండే మనుషుల్లో ఎన్నో నవ్వులు దాక్కునివుంటాయి.మనిషికి కష్టమొచ్చినపుడు కష్టపడకా,దుఃఖం వచ్చినపుడు దుఃఖపడకా తప్పదు. కానీ మిగిలిన విలువైన సమయాన్నికూడా భారంగా ఎందుకు ఖర్చు చెయ్యటం? ఏమాత్రం "ఖర్చు"లేని "నవ్వు" ని ముఖానికెందుకు దూరం చెయ్యటం? సాధ్యమైనన్ని నవ్వుల్ని పోగేసుకుని బ్రతికేద్దాం. (దర్శకుడు, నటుడు దేవీ ప్రసాద్ స్వీయ అనుభవాలను నుంచి..) -
పవన్ కల్యాణ్ సినిమాను ఎందుకు ఆపుతారు?: సునీల్ నారంగ్
‘‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలని కావాలని ఆపుతున్నారనడం తప్పు. ఆయన (పవన్ కల్యాణ్) సినిమాని ఎవరూ ఆపరు... ఎందుకు ఆపుతారు? ఆయన సినిమా ఆపితే నెక్ట్స్ వీక్ నా సినిమా (‘కుబేర’ని ఉద్దేశించి) కూడా రిలీజ్కి ఉంది కదా? ఆయన సినిమా రిలీజ్ ఆపడం అనేది అసాధ్యం?’’ అని ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడు సునీల్ నారంగ్ అన్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎస్ఎఫ్సీసీ) సమావేశంలో అధ్యక్షుడితో ΄ాటు కొత్త ΄ాలక మండలిని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నిర్మాత సునీల్ నారంగ్ వరుసగా మూడోసారి ఎంపికయ్యారు. ఉ΄ాధ్యక్షులుగా రవీంద్ర గో΄ాల, ఉదయ్ కుమార్ రెడ్డి కె, సెక్రటరీగా శ్రీధర్ వీఎల్, జాయింట్ సెక్రటరీగా చంద్రశేఖర్ రావు జె, ట్రెజరర్గా సత్యనారాయణ గౌడ్ .బి ఎన్నికయ్యారు. అదే విధంగా 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సునీల్ నారంగ్ మాట్లాడుతూ– ‘‘అల్లు అరవింద్గారు, ‘దిల్’ రాజు, సురేష్బాబు, నా వద్ద థియేటర్లు ఉన్నాయనడం కరెక్ట్ కాదు. నా వద్ద 70 థియేటర్లు ఉంటే 40 బుకింగ్స్ ఉన్నాయి. 30 థియేటర్లు లీజ్ తీసుకున్నాం. అది కూడా గ్రౌండ్ లీజ్... ప్లస్ మల్టీప్లెక్స్లు ఉన్నాయి. అవన్నీ కలిపినా కేవలం ఐదారు శాతం మాత్రమే ఉన్నాయి. అనవసరంగా ఆ నలుగురు అంటూ మాట్లాడటం తగదు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అందరి సినిమాలూ రావాలి, విడుదలవ్వాలని కోరుకుంటాం. హీరోలు ఏడాదికి ఐదు సినిమాలు చేయాలి, పది చేయాలి అని మాట్లాడటానికి నేను ఎవరు? అది వాళ్ల ఇష్టం. వాళ్ల పారితోషికం నిర్ణయించడానికి మేము ఎవరు? హీరోలు అనేవాళ్లు దేవుళ్లు. 145 కోట్ల దేశ జనాభాలో ఇరవై ముప్పై మందే హీరోలున్నారు. లేదంటే నలభై మంది ఉంటారు. అలాంటి వాళ్ల గురించి నేను ఏం మాట్లాడాలో తెలియడం లేదు. సినిమా రిలీజైన 28 రోజులకే ఓటీటీలో విడుదల చేయడం అన్నది కూడా ఓ శత్రువులా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీలో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్... ఎవరూ బాగాలేరు. కానీ, డిజిటల్ ప్రొవైడర్స్ అయిన వీఎమ్ఎస్, క్యూబ్ వాళ్లు, ఓటీటీ వాళ్లు బాగున్నారు. నాతో సినిమా తీయమని నిర్మాతలను ఏ డైరెక్టరూ, హీరో పిలవరు. మాకు ఇష్టం అయితే మేం వెళుతున్నాం... మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరి ఇష్టం వారిది’’ అని తెలిపారు.‘టీఎస్ఎఫ్సీసీ’ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ‘సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ 2, కోర్ట్’ సినిమాల ద్వారానే ఎగ్జిబిటర్లకు డబ్బులు వచ్చాయి. మన హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయాలని వినతి చేస్తున్నాను. సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టిక్కెట్ ధరలు, క్యాంటీన్ ధరలు సాధారణంగా ఉంటున్నాయి. కానీ, మల్టీప్లెక్స్లో ఎక్కువ ఉంటాయి. కావాలంటే రెండింటినీ పోల్చి చూడండి’’ అన్నారు. నిర్మాతలు సురేష్బాబు, కిరణ్, కేఎల్ దామోదర్ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా: అతియా ఎమోషనల్
మనకెంతో ఇష్టమైనవారిని కోల్పోతే ఆ బాధ తట్టుకోలేం. వాళ్లిక మనముందుకు ఎప్పటికీ రాలేరన్న నిజాన్ని జీర్ణించుకోలేం. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తోంది హీరోయిన్ అతియా శెట్టి (Athiya Shetty). తను ఎంతో ప్రేమగా చూసుకునే పెంపుడు కుక్క బ్రోడీ కన్నుమూసింది. దీంతో భావోద్వేగానికి లోనైన అతియా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టింది. మై బ్రోడీ.. నువ్వు లేకుండా ఇంటిని, ఈ జీవితాన్ని ఊహించలేకపోతున్నాను. నా చిన్నతనంలో నాకు తోడుగా ఉన్నందుకు థాంక్యూ.. అని రాసుకొచ్చింది.మాటల్లో చెప్పలేకపోతున్నా..అతియా సోదరుడు, నటుడు అహాన్ (Ahan Shetty) సైతం బ్రోడీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. నీకు వీడ్కోలు పలకాలంటే మనసు భారంగా ఉంది. నా జీవితంలో అతి ముఖ్యమైన సమయాల్లో నువ్వు నావెంటే ఉన్నావు. నువ్వు నాకెంత ఇష్టమనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు నాకు తోడుగా ఉన్నావ్.. ఒక తమ్ముడిలా నిలబడ్డావ్.. యు వర్ మై హార్ట్. నీకు గుడ్బై చెప్పడం ఎంతో కష్టంగా ఉంది. ఎంతగానో మిస్ అవుతాను బ్రోడీ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. అటు సునీల్ శెట్టి సైతం.. రిప్ మై బేబీ అని బాధపడ్డాడు.సినిమా..బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty)కి కూతురు అతియా శెట్టి, కుమారుడు అహాన్ సంతానం. హీరో, ముబాకరన్, మోతీచూర్ చక్నాచూర్ సినిమాలతో మెప్పించిన అతియా.. 2023లో క్రికెటర్ కేఎల్ రాహుల్ను పెళ్లాడింది. వీరికి ఈ మధ్యే పాప పుట్టింది. అహాన్.. తడప్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బోర్డర్ 2, సంకి చిత్రాల్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ahan Shetty (@ahan.shetty) చదవండి: 'ఢీ'.. దిల్రాజు సహా ఎవరూ కొనలేదు: మంచు విష్ణు -
'ఢీ'.. దిల్రాజు సహా ఎవరూ కొనలేదు: మంచు విష్ణు
సూపర్ హిట్ కామెడీ చిత్రాల్లో 'ఢీ: కొట్టి చూడు' ఒకటి. మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా, జెనీలియా హీరోయిన్గా నటించిన ఈ మూవీ 2007లో వచ్చింది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఢీ మూవీ(Dhee Movie)ని నిన్న (జూన్ 6) రీరిలీజ్ చేశారు. రీరిలీజ్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే ఢీని మాత్రం పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. ఆడియన్స్ లేక థియేటర్లు ఖాళీగా దర్శనిమస్తున్నాయి.నా బర్త్డే రోజు ఫస్ట్ షోఅయితే ఢీ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు విష్ణు. కన్నప్ప సినిమా (Kannappa Movie) ప్రమోషన్స్లో విష్ణు మాట్లాడుతూ.. నాలుగు గోడల మధ్య మనమంతా ఎక్స్ట్రార్డినరీ అనుకున్న సినిమాలు ఆడియన్స్కు రీచ్ అవకపోవచ్చు. కొన్నేమో రివర్స్లో జరుగుతాయి. 2006లో నా పుట్టినరోజైన నవంబర్ 23న ప్రసాద్ ల్యాబ్లో ఢీ ఫస్ట్ షో పడింది. తర్వాత అది 2007, ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదలైంది.ఆడటం కష్టమే..ఈ మధ్యలో దాదాపు వంద షోలు ప్రసాద్ ల్యాబ్లోనే పడ్డాయి. దిల్రాజు సహా ఎంతోమంది.. ఈ సినిమా యావరేజ్, పెద్దగా ఆడదు.. కష్టం! అని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో చివర్లో నాన్న ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు. తర్వాత మూవీ హిట్టయిన విషయం మీకు తెలిసిందే! అని విష్ణు చెప్పుకొచ్చాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఢీ మూవీని మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించగా చక్రి సంగీతం అందించాడు.చదవండి: 90 ఏళ్ల వయసులో సినిమాలో ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో తల్లి! -
ఘట్టమేని ఫ్యామిలీ నుంచి మరో హీరో... మహేశ్ బాబు భారీ స్కెచ్!
టాలీవుడ్లో ఘట్టమనేని ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సాహసానికి, మంచితనానికి కేరాఫ్గా నిలిచారు సూపర్స్టార్ కృష్ణ ఈ ప్యామిలీ నుంచి వచ్చిన వాడే. ఆ తర్వాత కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు(Mahesh Babu) హీరో అయ్యాడు. తనదైన శైలీలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఇప్పుడు ఘట్టమేని ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరో రాబోతున్నాడు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, మహేశ్ అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది.ఈ కొత్త ప్రాజెక్టును దర్శకుడు అజయ్ భూపతి స్వయంగా హెల్మ్ చేయనున్నారని తాజా సమాచారం. RX 100 వంటి బ్లాక్బస్టర్తో తన ప్రతిభను చాటిన అజయ్ భూపతి, ఇటీవల థ్రిల్లర్ "మంగళవరం"తో మళ్ళీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం "మంగళవరం 2" ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే, మరో హై-ప్రొఫైల్ లాంచింగ్ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా జయకృష్ణ వెండితెరకు పరిచయమవుతున్నాడు.ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ నిర్మాతలు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ కేటాయించి వైజయంతి ఆర్ట్స్, అనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన కథ, నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. అయినప్పటికీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నారని తెలియడంతో చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.జయకృష్ణ ప్రస్తుతం లండన్లో ప్రొఫెషనల్ నటనా శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇటీవల బయటకు వచ్చిన ఫోటోల ద్వారా అతని లుక్ పై కూడా జనాల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ను జయకృష్ణ బాబాయి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంచి లాంచ్ కోసం అవసరమైన నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలపై మహేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
సినీ ఇండస్ట్రీలో సమస్యలు: 30 మందితో కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వెలవెలబోతున్న థియేటర్లు, నెలరోజుల్లోనే ఓటీటీ (OTT)లోకి సినిమాలు, సినిమా రిలీజ్ కష్టాలు.. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)ను ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టాయి. వీటి పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటైంది. తెలుగు సినీ పరిశ్రమలో కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్.. అంతర్గత కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ విభాగాల నుంచి పది మంది చొప్పున సభ్యులుగా తీసుకుంది. మొత్తం 30 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. దీనికి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కమిటీ కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్నారు.ఏ విభాగంలో ఎవరున్నారంటే?నిర్మాతల విభాగం: దిల్ రాజు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, సి.కళ్యాణ్, రవి కిశోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియడిస్ట్రిబ్యూటర్ విభాగం: భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, ఎం.సుధాకర్, శిరీశ్ రెడ్డి, వెంకటేశ్ రావు, రాందాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరిఎగ్జిబిటర్ విభాగం: రాంప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణబాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాద్ రావు, విజయేందర్ రెడ్డి.చదవండి: నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా! -
నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!
పెళ్లికి ముందు ప్రేమలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. అయితే ఎన్ని లవ్స్టోరీలు ఉన్నా సరే పెళ్లి దగ్గరపడేసరికి వాటిన్నింటికీ ముగింపు పలికేసి కొత్త జీవితం మొదలుపెడుతున్నారు. బాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది! ఎంతోమంది హీరో, హీరోయిన్లు అనేక లవ్వాయణాల తర్వాతే వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.పెళ్లికి ముందు ప్రేమాయణంస్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. నటుడు హర్మాన్ బవేజా, షాహిద్ కపూర్, షారూఖ్ కపూర్ను ప్రేమించినట్లు భోగట్టా! ఆ తర్వాతే అమెరికన్ సింగర్, నటుడు నిక్ జోనస్ (Nick Jonas)తో ప్రేమలో పడగా ఈసారి దాన్ని పెళ్లిదాకా తీసుకెళ్లింది. అయితే నిక్ కూడా గతంలో అమెరికన్ సింగర్, నటి మిలే సైరస్ను ప్రేమించాడు. వీరిద్దరూ 2006- 2009 వరకు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పి ప్రియాంకను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యాడు.నన్ను దూరం పెట్టాడుతాజాగా తన ప్రేమపురాణం గురించి సైరస్ (Miley Cyrus) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. నాకు నిక్ అంటే చాలా ఇష్టం. నన్ను తన మ్యూజిక్ టూర్లో జాయిన్ చేసుకోనప్పుడు ఎంతో బాధపడ్డాను. ఏడ్చాను. తను నన్ను నెమ్మదిగా దూరం పెడుతున్నాడని అర్థమైంది. ఎందుకు నన్ను వదిలేస్తున్నావ్? అని నిలదీశాను. కలిసుందామని వేడుకున్నాను. కానీ ఫలితం లేకపోయింది.వెధవ.. నన్ను వదిలేశాడునా బయోగ్రఫీలో కూడా నిక్ మంచివాడు కాదు, వెధవ.. నన్ను వదిలేశాడని బూతులు రాయాలనుకున్నాను. కానీ నా టీమ్ అతడ్ని తిడుతూ రాసేందుకు ఒప్పుకోలేదు. అయితే నిక్ ఇప్పటికీ దారితప్పిన పిల్లాడిలాగే కనిపిస్తాడు అని నవ్వేసింది. ఇకపోతే సైరస్ 2021 నుంచి మాక్స్ మొరండోతో డేటింగ్లో ఉంది. నిక్ విషయానికి వస్తే.. ప్రియాంకను పెళ్లి చేసుకోగా వీరికి సరోగసి ద్వారా మూడేళ్ల కూతురు మాల్తీ మారీ జన్మించింది.చదవండి: మెడ భాగంపై ఉన్న టాటూ తొలగించిన సమంత.. వీడియో వైరల్! -
మెడ భాగంపై ఉన్న టాటూ తొలగించిన సమంత.. వీడియో వైరల్!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్లలో సమంత(Samantha) ఒకరు. సినిమాలు ఉన్నా లేకున్నా..ఆమె మాత్రం నెట్టింట ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలు, ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన విషయాలను తన ఫాలోవర్స్తో పంచుకుంటూనే ఉంటారు. అలాగే తను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సంస్థలను కూడా సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అలా తాజాగా ఓ సంస్ధకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ స్పెషల్ వీడియోలో సమంత ‘నథింగ్ టు హైడ్’ అని రాస్తూ.. నవ్వుతూ తిరిగి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారగా..పలువురు నెటిజన్స్ సమంత టాటూపై కామెంట్ చేస్తున్నారు. ఆమె మెడపై ఉన్న ‘వైఎంసీ’ టాటు ఆ వీడియోలు కనిపించడం లేదు. దీంతో ‘వైఎంసీ టాటూని తొలగించావా సమంత?’ అని పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మేకప్తో అది కవర్ చేసినట్లు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.వైఎంసీ టాటూ స్పెషల్ ఏంటి?సమంత హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘ఏమాయ చేసావే’. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించారు. 2010లో విడుదలైన ఈ ప్రేమ కథాచిత్రం .. ఆ ఏడాది సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దానికి గుర్తుగా సమంత ‘వైఎంసీ’(ఏం మాయ చేసావే) అనే టాటుని వేయించుంది. ఈ టాటు తనకు చాలా స్పెషల్ అని సమంత పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ సామ్ మాత్రం ఈ టాటుని తొలగించలేదు. తాజాగా ఈ టాటూ కనిపించకపోవడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాగా, నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడే సామ్ ఈ టాటూలు వేయించుకుంది. విడాకుల తర్వాత ఒక్కో టాటూని తొలగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ‘చై’ అనే టాటూని తొలగించింది. వెబ్ సిరీస్.. సినిమాలతో బిజీ బిజీఇక సమంత కెరీర్ విషయానికొస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు సమంత. అయితే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదలైంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
షూటింగ్లో రచ్చ చేసిన బాయ్ ఫ్రెండ్, సినిమా నుంచి హీరోయిన్ ఔట్!
సినిమా రంగం అంటే విశేషాలకే కాదు వివాదాలకూ చిరునామా. అయితే చాలా వరకూ వివాదాలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో అంతే వేగంగా మరుగునపడిపోతుంటాయి. అయితే కలకాలం నిలిచే కొన్ని సినిమాల్లాగా కొన్ని వివాదాలు కూడా ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటాయి. దానికి కారణం ఆయా వివాదాలకి లేదా ఆ సంఘటనలకి ఉన్న శక్తి, లేదా ప్రత్యేకతలే అని చెప్పొచ్చు. అలాంటిదే ఒక సంఘటన దాదాపు రెండు దశాబ్ధాల క్రితం జరిగింది. ఈ వివాదానికి కేంద్ర బిందువులుగా నిలిచిన వారు అందరూ భారతీయ సినీరంగంలో అత్యంత ప్రముఖులు కావడం మాత్రమే కాదు... ఎన్నో రకాల మనస్ఫర్ధలకు కాలాలకు స్నేహల విఛ్చిన్నానికి దారి తీయడం కూడా ఆ ఒకే సంఘటనను చిరస్మరణీయంగా మార్చింది. ఆ సంఘటనకు ఉన్న గాఢత వల్ల దానికి సంబంధించిన నటీనటులు కూడా తరచుగా దాన్ని పలు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకుంటూ ఉండడం కూడా కనిపిస్తుంటుంది. ఆ సంఘటనకు ప్రస్తుత బాలీవుడ్ అగ్రగామి నటుడు సల్మాన్ఖాన్ ప్రధాన కారణమైతే, ప్రస్తుత అభిషేక్ బచ్చన్ భార్య, బాలీవుడ్ ప్రముఖురాలు ఐశ్వర్యరాయ్ ప్రధాన బాధితురాలుగా చెప్పొచ్చు.వివరాల్లోకి వెళితే...గత 2003లో విడుదలైన చళ్తే చళ్తే సినిమాలో షారుఖ్ ఖాన్( Shah Rukh Khan) సరసన ఐశ్వర్య రాయ్ ( Aishwarya Rai Bachchan) ప్రధాన పాత్రకు ఎంపికయ్యారు. అయితే ఒక పాట (‘ప్రేమ నగరియా‘) చిత్రీకరణ సమయంలో, అప్పటి ఆమె తాజా మాజీ బాయ్ ఫ్రెండ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్ స్పాట్కు వచ్చాడు. అక్కడ నానా రభసా సృష్టించాడు. నాలుగున్నర గంటల పాటు కలకలం సృష్టించాడు. దాంతో దర్శకుడు అజీజ్ మిర్జా షూటింగ్ను నిలిపివేశారు. ఆ తర్వాత ఐశ్వర్య, సల్మాన్ ఇద్దరూ షారుఖ్కు క్షమాపణలు చెప్పినా, నిర్మాతలు ప్రాజెక్ట్ భద్రత కోసం ఆమెను చిత్రంలో నుంచి తప్పించారు.ఇది తనను ఎంతగానో బాధించిందని ఇప్పటికీ ఐశ్వర్య పలుమార్లు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకుంటుంటారు. తన తప్పేం లేకపోయినా ఆ సినిమా నుంచి తనను తప్పించడం అనేది ఆమెను ఎంతో కాలం వేదనకు గురి చేసింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కూడా ఆ నిర్ణయంపై విచారం వ్యక్తం చేశాడు. ‘ఐశ్వర్య నా సన్నిహిత స్నేహితురాలు. ఆమెను నా సినిమా నుంచి తప్పించాల్సి రావడం చాలా బాధాకరం. కానీ ఆ సినిమాకు నేను ఒక్కడినే నిర్మాత కాదు. మా కంపెనీ ప్రతిష్ట పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడడంతో, ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అంటూ షారూఖ్ అన్నాడు.అయితే ఆ తర్వాత కూడా షారుఖ్ ఖాన్తో కలిసి నటించాల్సిన ఐదు సినిమాల నుంచి కూడా ఐశ్వర్య రాయ్ను తప్పించారని, కానీ ఎందుకు అనే వివరణ కూడా ఇవ్వలేదని ఐశ్వర్య సన్నిహితుల దగ్గర వాపోయింది. ఈ అనూహ్య పరిణామం ఆమెను బాధించింది. అప్పటి నుంచీ షారూఖ్ ఐశ్వర్య, సల్మాన్, షారూఖ్ల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి. అలాగే అంతకు ముందు రాణి ముఖర్జీ, ఐశ్వర్య రాయ్ ఇద్దరూ మంచి స్నేహితులు అయితే ఐశ్వర్యరాయ్ను తొలగించిన తర్వాత ఆ స్థానంలో చళ్తే చళ్తే సినిమాలో రాణి ముఖర్జీ నటించడం జరిగింది. ఈ పరిణామం తర్వాత, వారిద్దరి మధ్య స్నేహ బంధం కూడా ముక్కలైంది. ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య పూర్తయిన చళ్తే చళ్తే సినిమా మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే, అంతకు ముందు ఎప్పుడూ లేనట్టుగా ఈ సినిమా వెనుక జరిగిన సంఘటన చిరకాల మిత్రులను శతృవులుగా, స్నేహాలను విడగొట్టి బాలీవుడ్ చరిత్రలో తనదైన చరిత్రను స్వంతం చేసుకుంది. -
ప్రియదర్శి కొత్త మూవీ.. టాలీవుడ్లోకి సోషల్ మీడియా సెన్సేషన్!
హీరో ప్రియదర్శి, 'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిత్ర మండలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో నీలిరంగు ముసుగుల వెనక ఓ గ్యాంగ్ అందర్నీ నవ్వించేందుకు రెడీగా ఉంది. అంతేకాదు, ఈ పోస్టర్లో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. ఉండటం విశేషం.హాలీవుడ్ హీరోతో పనిచేసిన సెన్సేషనల్ బ్యూటీసోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక.. ఇటీవల 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తోంది. విజయేందర్ ఎస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీ వాసు తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై 'మిత్ర మండలి' చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. మ్యాడ్నెస్ మొదలైందిఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్గా పీకే వ్యవహరిస్తున్నారు. 'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది. ఫస్ట్లుక్ పోస్టర్తో మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైందని చెప్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.చదవండి: మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా? -
కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల మనుగడపై నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) ఆవేదన వ్యక్తం చేశాడు. థియేటర్లలో రిలీజైన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైతే భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్లు కనిపించబోవని హెచ్చరించాడు. శుక్రవారం నాడు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా టాలీవుడ్లో నెలకొన్న సంక్షోభం గురించి ఓ ట్వీట్ చేశాడు.ఈ ట్రెండ్ కొనసాగితే..ఎగ్జిబిటర్లు, నిర్మాతలు పర్సంటేజీ సిస్టం గురించి మాట్లాడుకునేబదులు... ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలా? అని ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి? అనేది ఆలోచించాలి. ఇక సినిమా రిలీజైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదేళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి.పెద్ద హీరోలు ఆలోచించాలిఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకో సినిమా, మూడేండ్లకో సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలోనే చాలామంది థియేటర్ యజమానులు వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. పెద్ద హీరోలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సింగిల్ స్క్రీన్స్ మూతపడి కేవలం మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్రమే ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది అని రాసుకొచ్చాడు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి…— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025 చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ బొమ్మ.. ఎక్కడంటే?
సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఈ ఏడాది సింగిల్తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబట్టింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (జూన్ 6) నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇక్కడ మరో సర్ప్రైజ్ ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సింగిల్ అందుబాటులోకి రావడం విశేషం.సింగిల్ సినిమా కథేంటంటే?విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంకులో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్గానే ఉంటాడు. ఓసారి మెట్రో రైలులో పూర్వ (కేతిక శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిశోర్) సాయంతో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తాడు. అదే సమయంలో విజయ్ జీవితంలో హరిణి (ఇవానా) వస్తుంది. పూర్వను పడేసేందుకు విజయ్ ఏమేం చేస్తాడో హరిణి కూడా అవన్నీ చేస్తుంది. అతడు ఛీ కొట్టినా అతడి వెనకాలే తిరుగుతుంది. అసలు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదంటే హరిణి ప్రేమకు పడిపోతాడా? అదీకాక సింగిల్గానే మిగిలిపోయాడా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సింగిల్ (Single Movie) చూడాల్సిందే!చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
ప్రియుడితో 'మనోభావాలు పాప' ఎంగేజ్మెంట్..
తెలుగు బిగ్బాస్ 7 సీజన్ శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru) త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. మనోభావాలు పాపగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ను పెళ్లాడబోతుంది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్మెంట్ జరిగిందని క్యాప్షన్ జోడించింది.ఆన్స్క్రీన్ కపుల్.. రియల్ లైఫ్లోనూ..ఈ ఫోటోల్లో శుభశ్రీ లెహంగాలో మరింత అందంగా కనిపించింది. ఇకపోతే శుభశ్రీ ఇటీవలే మేజెస్టీ అనే పాటలో తళుక్కుమని మెరిసింది. ఈ పాటలో ప్రియుడు అజయ్తో కలిసి నటించింది. అందులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్లోనూ పెళ్లికి సిద్ధపడటం విశేషం. వీరి నిశ్చితార్థం న్యూస్ తెలిసిన అభిమానులు, బుల్లితెర తారలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru)చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
చాకో కారుకు ప్రమాదం.. ‘దసరా’ విలన్ ఇంట తీవ్ర విషాదం!
కోలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు షైన్ టామ్ చాకో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చాకో తండ్రి మృతి చెందగా, తల్లి, సోదరుడు, డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో చాకో కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చాకో కుటుంబం ఎర్నాకులం నుంచి బెంగళూరుకు కారులో ప్రయాణిస్తుండగా, పాలకొట్టై సమీపంలో ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చాకో కుడి చేతికి గాయం అయింది. అతని తల్లి, సోదరుడు, డ్రైవర్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. షైన్కు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుషైన్ టామ్ చాకో మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు మాత్రమే కాకుండా, తెలుగు చిత్రం దసరాలో విలన్ పాత్రతో టాలీవుడ్లో కూడా గుర్తింపు పొందారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో షైన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.