breaking news
Cinema News
-
గుడ్న్యూస్ చెప్పిన 'రంగస్థలం' నటుడు.. బేబీ బంప్తో భార్య!
బుల్లితెర షో ద్వారా కమెడియన్గా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మహేశ్ ఆచంట (Mahesh Achanta). జబర్దస్త్ కామెడీతో సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నాడు. శతమానం భవతి చిత్రంతో క్లిక్ అయ్యాడు. రంగస్థలం సినిమాతో టాప్ ఆర్టిస్ట్గా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత అతడు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటినుంచి రంగస్థలం మహేశ్గా స్థిరపడిపోయాడు.సినిమామహానటి, యాత్ర, మహర్షి, గుణ 369, గుంటూరుకారం, జాతిరత్నాలు, విరూపాక్ష, సీతారామం, తండేల్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సెటిలయ్యాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహేశ్.. బంధువులమ్మాయి పావనిని వివాహమాడాడు. 2020లో లాక్డౌన్లోనే వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఓ కూతురు సంతానం.గుడ్న్యూస్తాజాగా మహేశ్ ఆచంట ఓ గుడ్న్యూస్ చెప్పాడు. రెండోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భార్య మెటర్నటీ ఫోటోషూట్లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఇది చూసిన తారలు, అభిమానులు మహేశ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by kidsography by Nikhil Ronald (@kidsography_by_nikhil_ronald) చదవండి: బాలీవుడ్లో నన్ను గ్లామర్ డాల్గానే చూస్తున్నారు: పూజా హెగ్డే -
వాళ్ళు అడిగేది ‘జీతాలు’ పెంచమని! ‘లాభాలు’ పంచమని కాదు!
ఒక వారం రోజులుగా, తెలుగు సినిమారంగంలో పనిచేస్తున్న కార్మికులు ‘మా జీతాలు 30 శాతం పెంచాలి’! అనే డిమాండుతో సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె చేస్తున్న వేలాదిమంది కార్మికులలో, వేరు వేరు శాఖల్లో, రకరకాల శ్రమలు చేసే వాళ్ళున్నారు. మేధా శ్రమలు చేసేవారూ, శారీరక శ్రమలు చేసేవారూ, వాళ్ళల్లోనే నైపుణ్యంగల శ్రమలు చేసేవారూ, నైపుణ్యం లేని శ్రమలు చేసేవారూ, వాళ్ళల్లోనే మురికిని శుభ్రం చేసే శ్రమలు చేసే వారూ... ఇలా! రకరకాల శ్రమలు చేసే వారిని ఏ పేర్లతో పిలుస్తారో, వాళ్ళకి జీతాలు ఎంత తేడాగా ఉంటాయో– అటువంటి వివరాలన్నీ ఇక్కడ అనవసరం. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవలసింది, సమ్మె చేస్తున్న కార్మికులు అడుగుతున్న ‘జీతాల పెంపు’ గురించి! జీతాలు పెంచాలి– అనేవాళ్ళ డిమాండ్ న్యాయమా, కాదా అన్నది తేలాలంటే, ‘జీతం’అంటే ఏమిటో తెలుసుకోవాలి.అసలు ‘జీతం’అనేది ఒక మాయ తెర! దాని వెనక ఒక రహస్యం వుంది. ఈ సంగతి సమ్మె చేస్తున్న కార్మికులకూ తెలియదు, వాళ్ళకి జీతాలు ఇచ్చే యజమానులకూ తెలియదు. ‘జీతం’ అనేది, కార్మికులు చేసే ‘శ్రమ మొత్తానికి’ కాక, వాళ్ళు కేవలం శ్రమ చేసేవారిగా జీవించడానికి సరిపడేది మాత్రమే– అనేదే ఆ రహస్యం! అసలు విషయం, ‘జీతంగా వచ్చేది ఏమిటీ’ అన్నది తెలియాలి! విషయాలు తేలిగ్గా అర్థం కావడానికి ఒక్క కార్మికుణ్ణే తీసుకుందాం.మన ఉదాహరణలో, ‘కాల్షీట్’ అనే పేరుతో నడిచే ‘పనిదినం’ లో, కార్మికుడు 12 గంటలు పని చేసినందుకు, నిర్మాత 1,200 జీతం ఇస్తాడనుకుందాం. కానీ, కార్మికుడు చేసే శ్రమ, యజమానికి ఎంత విలువని ఇస్తుందంటే, ఉదాహరణ తేలిగ్గా వుండడం కోసం 2,400 విలువని ఇస్తుంది. అంటే, కార్మికుడు ఏ రోజు పనిచేసినా ఆ రోజున, యజమానికి 1,200 విలువ గల శ్రమని ‘ఉచితంగా’ ఇస్తున్నాడన్నమాట! జీతాన్ని 30 శాతంగా పెంచినా, అది మొత్తం శ్రమ విలువ అవదు! అదీ తక్కువే! అప్పుడు కూడా, తీసుకునే జీతం కన్నా అదనంగా ఇచ్చే శ్రమ విలువే ‘అదనపు విలువ’. ఇది ‘శ్రమ దోపిడీ’! కానీ, ఈ విషయం, ఇటు కార్మికులకూ తెలియదు; అటు యజమానులకూ తెలియదు! ఇప్పుడు వచ్చిన సమస్య కార్మికుడు యజమానితో అనేది: ‘ఒక రోజుకి నువ్విచ్చే 1,200, మా కుటుంబ పోషణకి చాలడం లేదు. ఇంకో 30 శాతం పెంచు! ఇక నించీ 1,200 కాకుండా, 1,360 ఇవ్వు!’ అని కార్మికుడు అనడం. ‘అలా వీల్లేదు. నాకు అసలే ఖర్చులు బాగా పెరిగిపోయాయి. (హీరో గారికి కోట్లలో ఇవ్వాలి మరి!)’ అంటాడు నిర్మాత! నిజం చెప్పాలంటే, నిర్మాత కార్మికుడికి జీతం 30 శాతం పెంచి, 1,360 ఇచ్చినా, ఆ కార్మికుడి నించీ 70 శాతం విలువ గల శ్రమని ‘ఉచితంగానే’ లాగుతాడు! ఉచితంగా లాగే ఈ అదనపు విలువను, పెట్టుబడిదారీ యజమానులూ, వారి ఆర్థిక శాస్త్రవేత్తలూ ‘లాభం’ అని ముద్దుగా పిల్చుకుంటారు. కార్మికులు ఇచ్చే అదనపు విలువ నించే, సినిమా తీయడానికి ఖర్చు పెట్టిన డబ్బుకి వడ్డీ, షూటింగు చేసే స్టూడియోకి అద్దే, సినిమాని ప్రదర్శించే సినిమా హాళ్ళకి అద్దే, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులూ, చివరికి తనకి మిగిలే ‘లాభమూ’– అన్నీ... కార్మికుల అదనపు విలువనించీ వచ్చేవే!ఈ సమ్మె సందర్భంగా కొందరు మధ్యవర్తులు, ‘నిర్మాత కూడా బాగుండాలి గదా? అతన్ని ఇబ్బంది పెడితే ఎలా? నిర్మాతలుంటేనే గదా, కార్మికులకి పనులు దొరికేది?’ అంటూ, కార్మికులకు సర్ది చెపుతూ, జీతం మరీ అంతగా పెంచమని ఒత్తిడి చెయ్యవద్దని హితవు పలుకుతున్నారు. మన అమాయక సమ్మెకారులు కూడా, ‘అవును! నిర్మాతలు బాగుంటేనే కదా, మాకు పనులు దొరికేది. కాకపోతే, మా బాగు కూడా కొంచెం ఆలోచించమంటున్నాం’ అని అంటారు. అసలు ఆలోచించవలసింది – నిర్మాతలకి పెట్టుబడికి, ఆ మొదటి డబ్బు ఎక్కడిది?– అని! వాళ్ళ తండ్రులదీ, తాతలదీ అంటారా? ఆ తాతలకి అంత డబ్బు కూడటానికి కారణం – ఈనాటి కార్మికుల తాతల్నించీ ఆనాడు లాగిన అదనపు విలువే! (‘‘అదనపు విలువలో ఒక భాగాన్ని ఆదాయంగా పెట్టుబడిదారుడే తన కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటాడు. ఇంకో భాగాన్ని కొత్త పెట్టుబడిగా ఉపయోగించుకుంటాడు’’ అనే విషయాన్ని, మార్క్స్ తన ‘పెట్టుబడి’ అనే పరిశోధనా గ్రంథంలో – రుజువు చేశాడు.) ఇంతకీ, సమ్మె చేస్తున్న, సినిమా రంగంలోని, మన పిచ్చి కార్మికులు ఏ మడుగుతున్నారు? వాళ్ళు అడిగేది జీతాలు పెంచమని! లాభాలు పంచమని కాదు! ఎంత అల్ప సంతోషులు మన కార్మిక జనాలు!వ్యాసకర్త: ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ -
బాలీవుడ్లో నన్ను గ్లామర్ డాల్గానే చూస్తున్నారు: పూజా హెగ్డే
తమిళసినిమా: పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న నటి పూజాహెగ్డే. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా హిందీ భాషల్లో నటిస్తున్నా ఈ అమ్మడికి క్రేజ్ తెచ్చిపెట్టింది తెలుగు చిత్ర పరిశ్రమనే. అక్కడ వరుస పెట్టి హిట్ చిత్రాల్లో నటించిన పూజాహెగ్డే ఆ తర్వాత వరుసగా ఫ్లాప్లను ఎదుర్కొన్నారు. దీంతో టాలీవుడ్లో మార్కెట్ డౌన్ అయిపోయింది. అయితే ఈ బ్యూటీని కోలీవుడ్ రెండోసారి అక్కున చేర్చుకుంది. 13 ఏళ్ల క్రితం ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదట్లోనే అపజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత విజయ్ సరసన బీస్ట్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో సంబరపడ్డారు. అయితే ఆ చిత్రం కూడా పూర్తిగా నిరాశనే మిగిల్చింది. అయినప్పటికీ కోలీవుడ్ ఈమెను వదులుకోలేదు ఇటీవల సూర్యకు జంటగా రెట్రో చిత్రంలో నటించారు. ప్రస్తుతం మరోసారి విజయ్కు జంటగా జననాయకన్ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి రాఘవ లారెన్స్తో కాంచన–4 చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. మధ్యలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన కూలీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. విశేషమేమిటంటే పూజాహెగ్డే ఇప్పటివరకు నటించిన ఏ చిత్రానికి రానటువంటి పాపులారిటీ ఈ ఒక్క పాటకే రావడం. కూలీ చిత్రం గురువారం అంతర్జాతీయ స్థాయిలో తెరపైకి రానుంది. పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రత్యేక పాటలో నటించడానికి అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. బాలీవుడ్లో తనను గ్లామర్డాల్గానే చూస్తున్నారన్నారు. బహుశా తెలుగు, తమిళ చిత్రాల్లో తను నటించడం వారు చూసి ఉండరేమో అని అన్నారు. తాను ఈ సమయంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రెట్రో చిత్రంలో తనను రుక్మిణీ కథాపాత్ర గానే మార్చారన్నారు. తనలోని నటనా ప్రతిభను ఆయన నమ్మారని పూజాహెగ్డే పేర్కొన్నారు. -
ఉపాసన ఫోన్లో చరణ్ నెంబర్ ఏ పేరుతో ఉంటుందో తెలుసా?
సినిమా సెలబ్రిటీల జీవనశైలి ఎప్పుడూ ఒక మాయాజాలంలా అభిమానులను, సినీ ప్రియులను ఆకర్షిస్తుంది. వారు ధరించే దుస్తులు మొదలు వాడే వస్తువుల వరకు ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. వారు ఇళ్లలో ఎలా ఉంటారు? రోజువారీ జీవితంలో వారి ఆహారపు అలవాట్లు ఏమిటి? జీవిత భాగస్వామితో వాళ్లు ఎలా ఉంటారు? తదితర విషయాలపై అందరికి ఆసక్తి ఉంటుంది. అందుకే పలు ఇంటర్వ్యూల్లో సినీ ప్రముఖులు తమ పర్సనల్ లైఫ్ గురించి చెబుతుంటారు. తాజాగా మెగా కోడలు ఉపాసన తన భర్త రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది.ఆ పేరుతో చరణ్ మొబైల్ నెంబర్సాధారణంగా భార్యభర్తలు తమ భాగస్వామి మొబైల్ నెంబర్లను ముద్దు పేరుతో సేవ్ చేసుకుంటారు. మహిళలు అయితే తమ భర్త పేరుని హబ్బీ, బేబీ, స్వీట్హార్ట్, మై లవ్..తదితర పేర్లతో సేవ్ చేసుకుంటారు. కానీ ఉపాసన మాత్రం చరణ్ నెంబర్ని వెరైటీ పేరుతో సేవ్ చేసుకుంది. తన ఫోన్లో చరణ్ నెంబర్ని ‘రామ్ చరణ్ 200(Ram Charan 200)’ అనే పేరుతో సేవ్ చేసుకుందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఉపాసననే తెలియజేస్తూ..ఆ పేరు వెనుక ఉన్న కథ కూడా చెప్పింది.అందుకే ఆ పేరు.. చరణ్ నెంబర్ని రామ్ చరణ్ 200 అని ఎందుకు సేవ్ చేసుకుందో ఉపాసన వివరించింది. ప్రస్తుతం చరణ్ వాడుతున్న సిమ్ సంఖ్య ఇదట. ఇప్పటి వరకు ఆయన 199 సార్లు తన మొబైల్ నెంబర్ని మార్చుకున్నారట. ప్రస్తుతం వాడుతున్నది 200వ నెంబర్ అట. అందుకే రామ్ చరణ్ 200 అని సేవ్ చేసుకున్నానని నవ్వూతూ చెప్పింది ఉపాసన. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. చరణ్ 200 సార్లు మొబైల్ నెంబర్స్ మార్చారా? అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
‘కూలీ’ కోసం హాలీడే, ఫ్రీ టికెట్.. ఇది కదా రజనీ క్రేజ్!
రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ సంబరాలు మొదలవుతాయి. జపాన్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో రజనీకాంత్కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక ఇండియాలో చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాక అంతటా ఆయనకు అభిమానులు ఉన్నారు. తొలి రోజు ఆయన సినిమా చూసేందుకు వేలల్లో ఖర్చు పెట్టిమరీ టికెట్ కొనేవాళ్లు చాలా మందే ఉన్నారు. సినిమా రిలీజ్ రోజు చాలా మంది ఉద్యోగస్తులు ఆఫీస్కి సెలవు పెడతారు. బాస్కి ఏదో ఒక కారణం చెప్పి ఆ రోజు ఆఫీస్కి డుమ్మా కొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇదంతా ఎందుకు అనుకుందో ఏమో కానీ..ఓ కంపెనీ ఏకంగా తమ ఉద్యోగస్తులకు హాలీడేనే ప్రకటించింది. (చదవండి: ఇదెక్కడి విడ్డూరం.. తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?)సౌత్తో పాటు ఇండియా వ్యాప్తంగా పలు బ్రాంచ్లు కలిగి ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ రజనీకాంత్ కొత్త సినిమా ‘కూలీ’(Coolie Movie) రిలీజ్ రోజు(ఆగస్ట్ 14) తమ ఉద్యోగులకు వేతనంతో కూడా సెలవును ప్రకటించింది. అంతేకాదు రిలీజ్ రోజు తమ ఎంప్లాయిస్కి ఉచితంగా టికెట్ని కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది.దీంతో పాటు రజనీకాంత్ 50 ఏళ్ల సినీ కెరీర్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనాథ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ కంపెనీపై తలైవా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.(చదవండి: రెమ్యునరేషన్తో ఆర్ నారాయణ మూర్తిని కొనలేం: త్రివిక్రమ్)కూలీ విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున విలన్గా నటించాడు. సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్పై రజిని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఏమవుతుందనేది చూడాలి.As usual Holiday being declared for offices as COOLIE releasing 😂🫨🦖🔥 pic.twitter.com/pj54B8uqA2— Hello (@RockinggRAJINI) August 9, 2025 -
Bhagyashri Borse: ‘కాంతా’తో వెలిగిపోతుందా?
ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహిస్తుంది సినిమా. ముఖ్యంగా నటీమణులకు అవకాశాలు తలుపుతడతాయి. అందుకు కొంచెం అందం, కాస్త అదృష్టం ఉంటే చాలు, ఇండియన్ సినిమానే ఏలేయవచ్చు. అలా యువ కథానాయకి భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్పై కన్నేశారనే చెప్పవచ్చు. 26 ఏళ్ల ఈ మహారాష్ట్రీ పరువాల బ్యూటీ 2023లోనే నటిగా తెరంగ్రేటం చేశారు. అలా ముందుగా హిందీలో నటించిన భాగ్యశ్రీ బోర్సేకు వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ రవితేజకు జంటగా మిస్టర్ బచ్చన్ నటించారు. ఈ చిత్రం విజయాన్ని సాధించకపోకపోయినా ఈ అమ్మడు మాత్రం డాన్స్, అందాలారబోతలతో పాపులర్ అయ్యారు. తరువాత కింగ్డమ్లో విజయ్ దేవరకొండ సరసన నటించారు. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కాంతా అనే బహుభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దుల్కర్సల్మాన్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్పిరిట్ మీడియా సంస్థ, వేఫారర్ ఫిలింస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాంతా చిత్రం కన్నడం, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రతిభావంతులైన చిత్ర టీమ్తో కలిసి నటిస్తున్న కాంతా వంటి చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ చిత్రంలోని భాగ్యశ్రీబోర్సే ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఈమె గెటప్ పలువురిని ఆకట్టుకుంది. ఈ భామ కోలీవుడ్లో ఏమాత్రం రాణిస్తారో వేచి చూద్దాం. -
ఆ విషయంలో గెలుపు నాగార్జునదే.. టాలీవుడ్ చరిత్రలో తొలిసారి!
అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni ) అకస్మాత్తుగా అన్ని సోషల్ మీడియా వేదికలపైనా వైరల్గా మారారు. దీనికి కారణం ఆయన తాజాగా నటించిన కూలీ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్ లాంచ్ అయి సూపర్ డూపర్ హిట్ అంచనాలను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ టీజర్లో నాగార్జున లుక్ బాగా క్లిక్ అయింది. నాగార్జున తన సినీ జీవితంలో తొలిసారిగా విలన్ గా నటిస్తుండడం దక్షిణాది ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అందుకు తగ్గట్టే నాగార్జున రోల్ అత్యంత స్టైలిష్గా తీర్చిదిద్దినట్టు తెలుస్తుండడం కూడా నాగ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేసింది. నిజానికి ఈ సినిమా లో విలన్ పాత్ర ను ఎంచుకోవడం పట్ల మొదట్లో నాగ్ ఫ్యాన్స్ కొంత ఇబ్బంది పడ్డారనేది నిర్వివాదం. అయితే తాజా అప్ డేట్స్తో వారిలో కూడా ఫుల్ జోష్ కనిపిస్తోంది.ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున తన వయసులో సగం తగ్గిపోయినట్టు కనపడ్డారు. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ తన పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని నాగ్ స్వయంగా చెప్పడం, తాను నాగార్జున అభిమానినని లోకేష్ అనడం... కూడా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రీ రిలీజ్లో నాగ్ లుక్, ఆయన మాటలు ఆయన గురించి తలైవా రజనీ కాంత్ పొగడ్తలు... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీజర్లో నాగార్జున తన హెయిర్ని కుడి చేత్తో వెనక్కి తోస్తున్న బిట్ను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఏతావాతా కూలీ సినిమా విడుదలకు ముందే ఒక విషయం మాత్రం రూఢీ అయిపోతోంది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర అనూహ్యంగా ఉండబోతోందని. రజనీకాంత్ లాంటి వీర మాస్ హీరోకి సమ ఉజ్జీగా ఆయన తెరపై విలన్ రోల్లో దుమ్మురేపనున్నారని.ఈ నేపధ్యంలో మరోసారి సీనియర్ హీరోల పాత్రల ఎంపిక ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుతం నాగార్జునతో పాటు ఆయన సమకాలీకులు ఒకనాటి అగ్ర హీరోలు ముగ్గురు ఇంకా ఫుల్ యాక్టివ్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరెవరూ సాహసించని రీతిలో నాగార్జున తన పాత్రల ఎంపికను అమాంతం మార్చుకుని ఈ విషయంలో అందర్నీ దాటేశారు. సీనియర్ హీరోల్లో నాగార్జున గ్లామర్తో పోటీపడే వారు ఎవరూ లేరనేది నిజం. అయినప్పటికీ వయసుకు తగ్గట్టుగా మార్పు చేర్పులు చేసుకుంటున్నారు. కుబేర సినిమాలో డీ గ్లామర్ రోల్ పోషించి, కూలీ లో ఏకంగా విలన్ పాత్రకు కూడా సై అనడం ద్వారా ఒక నటుడికి సినిమా కలెక్షన్లు, ఇమేజ్లు మాత్రమే కాదు వైవిధ్య భరిత పాత్రల్లో నటించానన్న తృప్తి కూడా చాలా అవసరమని చెప్పకనే చెప్పారు. నిన్నే పెళ్లాడుతా తో గ్రీకు వీరుడి ఇమేజ్ తెచ్చుకుని వెంటనే అన్నమయ్య లాంటి పాత్ర చేసిన నాటి దమ్మూ ధైర్యం, తెగువనే ఇప్పటికీ చూపిస్తున్నారు నాగార్జున. అందుకే.. టాలీవుడ్ చరిత్ర లో తొలిసారిగా... సినిమా విడుదల కాకముందే జనం మనసులు గెలిచిన విలన్ అనిపించుకుంటున్నారు. -
విడాకుల రూమర్స్.. హన్సిక ఆసక్తికర పోస్ట్
హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఆమె భర్తకు దూరంగా ఉందని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హన్సిక తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా పుట్టిన రోజు (ఆగస్ట్ 9) వేడుకలు జరుపుకున్న ఆమె.. ఈ ఏడాది తనకు చాలా స్పెషల్ అని..ఎన్నో పాఠాలు నేర్పిందని అన్నారు.‘ఈ ఏడాది(2025) నేను అడగకుండానే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాలో నాకు తెలియనంత బలం ఉందని తెలిసేలా చేసింది. ఈ పుట్టినరోజున మీ అందరి శుభాకాంక్షలతో నా హృదయం ఉప్పొంగిపోతోంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఎంతో ఆనందాన్నిస్తాయి. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని హన్సిక ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చింది. దీంతో మరోసారి హన్సిక విడాకుల విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.2022 డిసెంబర్లో హన్సిక తన ప్రియుడు సోహైల్ని వివాహం చేసుకుంది. సోహల్కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్నాడు. వీరి వివాహాన్ని ‘లవ్ షాదీ డ్రామా’ అనే పేరుతో డాక్యుమెంటరీ సిరీస్గా కూడా విడుదల చేశారు. పెళ్లయిన రెండేళ్లకే హన్సికకు, భర్తకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్ అవుతోంది. సోహల్ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయిస్తున్నారు: రష్మిక
నేషనల్ క్రష్గా మారిన కన్నడ కస్తూరి రష్మిక మందన్న. కన్నడ చిత్ర పరిశ్రమల్లో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ భామ ఆ తర్వాత తెలుగు, తమిళం, ఇప్పుడు హిందీ అంటూ పాన్ ఇండియా కథానాయకిగా వెలిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేక పోతున్నారు. ఎదిగే కొద్దీ మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ అవతారన్నది పెద్దల మాట. రష్మిక మందన్న కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు.ఈమె తన గురించి వస్తున్న ట్రోలింగ్ల గురించి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ శ్రీనేనూ భావోద్రేకాలు కలిగిన అమ్మాయినే. అయితే వాటిని నేను బయటకు వ్యక్తం చేయడానికి ఇష్టపడను. అలా చేస్తే రష్మిక కెమెరా కోసం చేస్తున్నారు అని అంటారు. ఇకపోతే నాపై ట్రోల్ చేయడానికి కొందరు డబ్బు కూడా ఇస్తున్నారు. వారు ఎందుకు అంత క్రూరంగా మారుతున్నారో అర్థం కావడం లేదు. అలా నా ఎదుగుదలను అడ్డుకుంటున్నారు.ఇలాంటి చర్యలు చాలా బాధిస్తున్నాయి. నాపై ప్రేమ, అభిమానాలు కురిపించకపోయినా పర్వాలేదు. ప్రశాంతంగా ఉండండి చాలు అంటూ రష్మిక తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారు. ఆమె పడుతున్న ఆవేదన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా కుబేర చిత్రంలో నటించి విజయాన్ని అందుకోవడంతోపాటు పలువురి ప్రశంసలను అందుకున్న ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ భాషల్లో నటించిన గర్ల్ ఫ్రెండ్ చిత్రం రావడానికి రెడీ అవుతుంది. అదేవిధంగా మైస అనే మరో ఉమెన్న్ సెంట్రిక్ కథా చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తామా అనే హిందీ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. -
మంచినీళ్లు అమ్ముతున్న హీరోయిన్.. 750 ml @ రూ.200
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. సోదరి సమీక్షా పెడ్నేకర్ (Samiksha Pednekar)తో కలిసి బ్యాక్బే అనే బ్రాండ్ స్థాపించి ఎంటర్ప్రెన్యూర్గా మారింది. ప్రజలకు సురక్షితమైన మంచినీళ్లు అందివ్వడమే తన లక్ష్యం అని చెప్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపింది. భూమి ఇంకా మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్లో సొంతంగా ఓ ప్లాంట్ స్థాపించాం. అందుకు మాకెంతో గర్వంగా ఉంది. ప్లాస్టిక్ వాడకుండా..అక్కడ మహిళలే పని చేస్తున్నారు. మాది ప్రీమియం వాటర్ బ్రాండ్ కంపెనీ. మూడు రకాల ఫ్లేవర్స్తో లభ్యం అవుతుంది. ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ను వాడలేదు. బాటిల్ క్యాప్ భూమిలో కలిసిపోయేదిగా తయారు చేశాం. ఇలా పర్యావరణ స్పృహతో పనిచేస్తున్న వాటర్ కంపెనీ ఏదైనా ఉందా అంటే అది మాది మాత్రమే! అరలీటర్ వాటర్ బాటిల్ రూ.150, రూ.750 ml వాటర్ బాటిల్ ధర రూ.200గా నిర్ణయించాం. రూ.200కే మంచినీరుఅందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే రూ.200కే హిమాలయ వాటర్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజుల్లో అందరూ ఎనర్జీ డ్రింక్స్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది స్వచ్ఛమైన నీళ్లు. మా బాటిల్లో సహజసిద్ధమైన మినరల్స్, ఎలెక్టోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. వచ్చే నాలుగేళ్లలో రూ.100 కోట్ల మార్కెట్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. 15 ఏళ్లలో ప్రతి ఇంట్లో మా బాటిల్ కనిపించాలని ఆశపడుతున్నాం.పెట్టుబడి ఎలా?17 ఏళ్ల వయసులో నా సంపాదన మొదలైంది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో పనిచేసినప్పుడు నాకు ఇచ్చిన తొలి పారితోషికం రూ.7 వేలు. అప్పటినుంచే నాకు పొదుపు చేయడం అలవాటు. అలా నా సంపాదనలో కొంతభాగాన్ని కూడబెడుతూ వచ్చాను. ఆ డబ్బుతోనే బ్యాక్బే ప్రారంభించగలిగాం అని చెప్పుకొచ్చింది. భూమి పెడ్నేకర్ చివరగా మేరే హజ్బెండ్ కి బివి సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) చదవండి: ఆ సినిమాకు ఫహద్ ఫాజిల్ రెమ్యునరేషన్ రూ.1 లక్ష మాత్రమే! -
ఆ సినిమాకు ఫహద్ ఫాజిల్ రెమ్యునరేషన్ రూ.1 లక్ష మాత్రమే!
హీరోల పారితోషికాలు ఆకాశన్నంటుతున్నాయి. మామూలు హీరోలు లక్షల్లో మీడియం హీరోలు కోట్లల్లో తీసుకుంటే స్టార్ హీరోలు పదులు, వందల కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెమ్యునరేషన్లకే సగం బడ్జెట్ కేటాయించాల్సి వస్తోందని బాధపడే నిర్మాతలున్నారు. ఎంతెక్కువైనా సరే కానీ, ఆయా హీరోలతో కలిసి పని చేయాల్సిందేనని అడిగినంత ఇచ్చేందుకు ముందుకొచ్చే నిర్మాతలూ ఉన్నారు. అయితే వీళ్లందరూ చాలా తక్కువ మొత్తం నుంచి కెరీర్ మొదలుపెట్టినవాళ్లే.. అందులో మలయాళ స్టార్, పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ ఒకరు.ఆ సినిమాకు రూ.1 లక్ష రెమ్యునరేషన్చాప్ప కురిష్ సినిమాకుగానూ ఫహద్ ఫాజిల్ కేవలం రూ.1 లక్ష మాత్రమే పారితోషికం తీసుకున్నాడు. ఈ విషయాన్ని నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. చప్ప కురిష్ తర్వాత ఫహద్, నేను మళ్లీ సినిమా చేయలేదు. 2011లో ఆ సినిమా వచ్చింది. మొదట అతడికి నేను డబ్బు ఇవ్వలేదు. సినిమా పూర్తయ్యాకే ఇచ్చాను. దానికంటే ముందు టోర్నమెంట్ మూవీకిగానూ రూ.65వేలు తీసుకున్నట్లు చెప్పాడు. నేను నా చిత్రానికి రూ.1 లక్ష ఇచ్చాను. ఇప్పుడు రూ.5-10 కోట్లు ఇచ్చినా ఫహద్ దొరకడు.సక్సెస్ రాలేదని వెనక్కువెళ్లిపోలేదుఇప్పుడతడు పాన్ ఇండియా రేంజ్కు ఎదిగాడు. ప్రముఖ దర్శకుడు ఫాజిల్ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతడికి తొలినాళ్లలో అంత సక్సెస్ రాలేదు. దీంతో కొంతకాలం బ్రేక్ తీసుకుని తిరిగి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. అంకితభావంతో సినిమాలు చేశాడు. తన టాలెంట్తో దూసుకుపోయాడు. ఓ ఇంటర్వ్యూలో ఫహద్ 'చప్ప కురిష్' తన బెస్ట్ సినిమాల్లో ఒకటని పేర్కొన్నాడు. ఆ క్లిప్పింగ్ భద్రంగా దాచుకున్నా.. సినిమాల్లోకి రావాలనుకునేవారు ఆయన్ను చూసి నేర్చుకోండి అని చెప్పుకొచ్చాడు.చదవండి: నేను నీ డైపర్లు మారిస్తే నువ్వేమో.. అమ్మతనంపై కియారా పోస్ట్ -
నేను నీ డైపర్లు మారిస్తే నువ్వేమో.. అమ్మతనంపై కియారా పోస్ట్
బాలీవుడ్ జంట సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra)- కియారా అద్వాణీ (Kiara Advani) పట్టలేనంత సంతోషంలో ఉంది. కారణం.. వీరికి ఈ ఏడాది జూలైలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. అప్పటినుంచి పసిపాపతోనే వీలైనంత ఎక్కువ సమయం గడుపుతున్నారు. తొలిసారి మాతృత్వాన్ని అనుభవిస్తున్న కియారాకు అమ్మతనం కొత్తగానూ, తన్మయత్వంగానూ ఉంది. ఈ డీల్ బాగుంది..తన ఫీలింగ్స్ను సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చింది.. నేను నీ డైపర్లు మారుస్తున్నాను.. నువ్వేమో నా ప్రపంచాన్నే మార్చేశావు. ఈ డీల్ చాలా బాగుంది అని రాసుకొచ్చింది. దీనికి కళ్లలో నీళ్లు తిరుగుతున్న ఎమోజీ, చేతితో హార్ట్ సింబల్ చూపిస్తున్న ఎమోజీని జత చేసింది. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ.. 2021లో వచ్చిన 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. అప్పుడు మొదలైన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. 2023లో వీరు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సినిమారెండేళ్లకే పాప పుట్టడంతో ఆనందంలో తేలియాడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. కియారా చివరగా గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్గా నటించిన 'వార్ 2' ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. అలాగే యశ్ టాక్సిక్ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. సిద్దార్థ్ విషయానికి వస్తే ఇతడు ప్రస్తుతం పరమ్ సుందరి మూవీ చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 29న విడుదల కానుంది.చదవండి: రాఖీ పండగరోజు ప్రభాస్ చెల్లి ఇలా చేసిందేంటి? -
35 ఏళ్లు.. ఎన్నో హార్ట్ బ్రేక్స్.. నొప్పితో బాధపడుతుంటే ఆ డైరెక్టర్..
పైలట్ కావాలని కలలు కని, అనుకోకుండా కెమెరా ముందు ల్యాండ్ అయింది! సినిమాల్లో గ్లామర్ కంటే టాలెంట్తో స్క్రీన్పై మెరుస్తోంది హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen). ఆ విషయాలే మీ కోసం...అలా కెరీర్లో..తెలుగు ప్రేక్షకులు కూడా బాగా దగ్గరైన నటి నిత్యా మీనన్. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు తెరపై చెరగని ముద్ర వేసింది. ఎన్టీఆర్తో ‘జనతా గ్యారేజ్’, అల్లు అర్జున్తో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, పవన్ కల్యాణ్తో ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలు చేసినా, గ్లామరస్ కమర్షియల్ హీరోయిన్గా కాకుండా, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఉత్తమ నటిగా జాతీయ అవార్డుమలయాళీ అయినా, పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. పైలట్ కావాలనేది చిన్ననాటి కల. అయితే ఏవియేషన్ ఫీల్డ్ ఆకర్షణీయంగా లేదని భావించి, మనసు సినిమాలవైపు మళ్లింది. పూణెలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ కోర్సు చేసింది. కానీ డైరెక్టర్ నందిని రెడ్డి పరిచయంతో హీరోయిన్ అయింది. గత ఏడాది ధనుష్తో నటించిన ‘తిరు’ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించింది.ఐదు భాషలు మాట్లాడగలదునిత్యా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడగలదు. ‘సినిమా రంగంలో నటీనటుల, యూనిట్ సభ్యుల అనారోగ్యాలపై చాలామంది పట్టించుకోరు, కాల్షీట్స్ ప్రకారం పనిని పూర్తి చేయాలనుకుంటారు. కానీ, నేను మాత్రం సహచర నటులు, సహవాసుల పట్ల కొద్దిగా అయినా మానవత్వం చూపించాలని నమ్ముతాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పీరియడ్స్ టైంలో అలా..మిస్కిన్ దర్శకత్వంలో ‘సైకో’ సినిమాలో నటించేటప్పుడు, షూటింగ్ మొదటి రోజే తాను పీరియడ్స్లో ఉన్నానని, నొప్పితో బాధపడుతూ మిస్కిన్ దగ్గరకు వెళ్లి చెప్పిందట! ‘మిస్కిన్ ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. అతను అర్థం చేసుకుని ప్రవర్తించిన తీరు మరచిపోలేను’ అని తెలిపింది. దాదాపు ముఫ్పై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని చాలామంది అడుగుతుంటారు. ఎన్నోసార్లు హార్ట్బ్రేక్దీనికి నిత్యా స్పందిస్తూ – ‘చాలాసార్లు హార్ట్ బ్రేక్ అయ్యింది. అందుకే నాకు ఇంకా కొంత టైం కావాలి‘ అని చెప్పింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – చిన్నతనంలోనే ‘హనుమాన్’ అనే సినిమాలో బాల నటిగా నటించింది. ఆ సినిమాలో టబు చెల్లెలుగా కనిపిస్తుంది.చదవండి: అక్కడ సక్సెస్ లేక తెలుగులో సినిమాలు చేశా.. ఆ ఒక్క మూవీతో..రమ్యకృష్ణ స్పీచ్ -
రాఖీ పండగరోజు ప్రభాస్ చెల్లి ఇలా చేసిందేంటి?
దివంగత నటుడు కృష్ణంరాజు కూతుర్లలో ప్రసీద ఉప్పలపాటి (Sai Praseedha Uppalapati) ఒక్కరే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. పండగలు, హాలీడే ట్రిప్, ఫ్రెండ్స్తో చిట్చాట్, ఫ్యామిలీతో కాలక్షేపం, అన్న ప్రభాస్తో ఫన్నీ టైమ్.. ఇలా ఏవైనా సరే అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. దీంతో ఆమె రక్షా బంధన్ రోజు ప్రభాస్ (Prabhas)కు రాఖీ కట్టిన ఫోటో ఎప్పుడెప్పుడు షేర్ చేస్తుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు.రాఖీ పోస్ట్తీరా ప్రసీద ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టనే పెట్టింది. తను ఎవరెవరికైతే రాఖీ కట్టిందో వాళ్లందరి ఫోటోలు షేర్ చేసింది. కానీ ప్రభాస్ పిక్ మాత్రం షేర్ చేయలేదు. దీంతో అభిమానులు ప్రభాస్ అన్న ఎక్కడ? తన ఫోటో ఎందుకు వదిలేశావ్? అని నిరాశతో కామెంట్లు పెడుతున్నారు. నిజానికి ప్రసీద.. ప్రభాస్కు రాఖీ కట్టింది. అందుకు ఫస్ట్ ఫోటోనే నిదర్శనం.నిరాశలో ప్రభాస్ అభిమానులుప్రభాస్ రాఖీ కట్టించుకున్న చేతి ఫోటోను మాత్రమే అప్లోడ్ చేసింది. దానికి ప్రభాస్ను కూడా ట్యాగ్ చేసింది. గతంలో ప్రభాస్కు రాఖీ కడుతూ దిగిన ఫోటోలు షేర్ చేసే ప్రసీద.. ఈసారి ఇలా డిసప్పాయింట్ చేసిందేంటని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అతడు ది రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్), స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవే కాకుండా సలార్ 2, కల్కి 2 చిత్రాలు చేయనున్నాడు. View this post on Instagram A post shared by Sai Praseedha Uppalapati (@praseedhauppalapati) చదవండి: మృణాల్ అయితే బాగుంటుందన్న స్టార్ హీరో! -
అక్కడ సక్సెస్ లేక తెలుగులో సినిమాలు చేశా.. ఆ ఒక్క మూవీ వల్లే..
34 ఏళ్లుగా సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ (Captain Prabhakaran Movie). దివంగత నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కాంత్ కథానాయకుడిగా నటించిన 100వ చిత్రం ఇది. ఆర్కే సెల్వమణి కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా రావుత్తర్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. రూపిని, రమ్యకష్ణ (Ramya Krishna), శరత్ కుమార్ ,లివింగ్స్టన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. 1991 ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. రీరిలీజ్సుమారు 34 ఏళ్ల తర్వాత కెప్టెన్ ప్రభాకరన్ 4 కే వర్షన్లో ఈనెల 22న విడుదలకు సిద్ధమవుతోంది. స్పారో సినిమాస్ సంస్థ అధినేత కార్తీక్ వెంకటేషన్ రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని చైన్నె, వడపళనిలోని కమల థియేటర్లో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్తో పాటూ దర్శకుడు ఎస్ ఏ.చంద్రశేఖర్, విక్రమన్, నిర్మాత కలైపులి ఎస్. థాను, టీ.శివ, ఆర్వీ. ఉదయ్ కుమార్, పేరరసు, లింగుస్వామి, లియాకత్ అలీఖాన్ సహా పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. విజయకాంత్ వారసుడు విజయ్ ప్రభాకరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీరంగంలో వాళ్లే తల్లిదండ్రులుఈ సందర్భంగా దర్శకుడు ఎస్.ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు ఈ సమాజంపై, రాజకీయాలపై ఉన్న కోపాన్ని సినిమాల ద్వారా చూపించడానికి ఒక నటుడు అవసరం అయ్యారన్నారు. ఆయనే విజయకాంత్ అని పేర్కొన్నారు. విజయ్ కాంత్ హీరోగా తాను 18 చిత్రాలు చేసినట్లు పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ.. సినీ రంగంలో తన తల్లిదండ్రులు అంటే విజయకాంత్, నిర్మాత ఇబ్రహీం రావుత్తర్ మాత్రమేనని తెలిపారు. విజయ కాంత్ నూరు జన్మలకు చేరవలసిన పుణ్యాలను తన వారసుల కోసం సంపాదించి వెళ్లిపోయారన్నారన్నారు. ఇక్కడ సక్సెస్ లేక తెలుగులో..నటి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. తనకు తమిళంలో సరైన సక్సెస్ రాకపోవడంతో తెలుగు చిత్రాల్లో నటించానని అలాంటి సమయంలో కెప్టెన్ ప్రభాకర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, ఆ చిత్ర విజయం తనకు మరో 10 ఏళ్లపాటు వరుసగా అవకాశాలు వచ్చేలా చేసిందని చెప్పారు. విజయ్ కాంత్ వారసుడు విజయ్ ప్రభాకరన్ మాట్లాడుతూ.. తనకు విజయకాంత్ కొడుకు అనే పేరు మాత్రమే చాలు అన్నారు. కాగా ఇకపై తన తండ్రి నటించిన చిత్రాలను ఏడాదికి ఒకటి రీ రిలీజ్ చేస్తామని చెప్పారు.చదవండి: పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే..? పరంతు పో మూవీ చూడాల్సిందే! -
సినీకార్మికుల సమ్మె: అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం!
సాక్షి, హైదరాబాద్: ఫిలిం ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలం అయిన నేపథ్యంలో సినీ కార్మికులు నేడు (ఆగస్టు 10) నిరసన కార్యక్రమం చేపట్టారురు. ఈ నిరసనలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొన్నారు. అన్నపూర్ణ 7 ఎకర్స్ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. మూడేండ్ల నుంచి జీతాలు పెంచలేదు. 30% వేతనాలు పెంచే వరకు బంద్ కొనసాగుతూనే ఉంటుంది. ఎనిమిది రోజులుగా సమ్మెపనిగంటలు, వేతనాలపై సమస్య పరిష్కరిస్తేనే షూటింగ్స్కు వస్తాం. కార్మికుల వేతనాల పెంపు గురించి గత ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నాం.. ఎవరయితే 30 శాతం వేతనాలు ఇస్తున్నారో వారికి పని చేస్తున్నాం. సినీ కార్మికులు పొట్ట కాలితే వాళ్ళే తిరిగి వస్తారు అని నిర్మాతలు అంటున్నారు. మేమేమి గెంతెమ్మ కొరికలు కొరలేదు. తొలుత 20% ఇవ్వండి.. రెండేళ్ల తరువాత 10% పెంచమని అడిగాము. వాళ్లు ఏడాదికో పర్సెంటేజ్ చెప్పారు. ఫైటర్స్, డాన్సర్స్, టెక్నిషియన్స్కు పెంచమన్నారు. కార్మికులందరికీ వేతనాలు పెంచాలి.నిర్మాత క్షమాపణలు చెప్పాలని డిమాండ్కార్మికులను తక్కువ చేసి మాట్లాడుతున్న నిర్మాత విశ్వప్రసాద్ ఫిలిం ఫెడరేషన్కు రూ.90 లక్షలు బాకీ ఉన్నారు. ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని మా కార్మికులు గట్టిగా కోరుకుంటున్నారు. వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఛాంబర్కు చెప్పాలి తప్ప ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఫిలిం ఛాంబర్ న్యాయం చేయకపోతే సినీ పెద్దలను, ప్రభుత్వాన్ని కలుస్తాం. మొత్తం 24 వేల మంది కార్మికులు ఉన్నాం. త్వరలో మా సమస్య సాల్వ్ కాకుంటే కార్మికులతో కలిసి ఛాంబర్నే ముట్టడిస్తాం. అవసరమయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అన్నారు.బయనుంచి రానివ్వంఫిలిం ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అమ్మిరాజు మాట్లాడుతూ.. మాకు నచ్చిన వారిని తీసుకుంటామని నిర్మాతలు అంటున్నారు. అలాగే ఒకరిద్దరు నిర్మాతలు స్కిల్స్ లేవని అవమానిస్తున్నారు. బయట రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా రానివ్వము. 30% వేతనాల పెంపుపై ప్రభుత్వం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ సానుకూలంగా స్పందించారు. చిరంజీవిగారు ఈ సమస్య పరిష్కారమవుతుందనుకున్నారు. ఏదైనా హెచ్చుతగ్గులుంటే ఫిలిం ఛాంబర్ వారు మాతో మాడ్లాడండి. ఈరోజే సమస్య సమసిపోతుంది అన్నారు.అందుకే ఆ నిర్మాతపై ఆగ్రహం?నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో మంత్రి కోమటి రెడ్డి సోమవారం చర్చలు జరపనున్నారు. కాగా పీపుల్స్ మీడియా అధినేత విశ్వ ప్రసాద్ సిటీ సివిల్ కోర్టులో యూనియన్పై కేసు వేశారు. ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాటి వెంకటకృష్ణకు లీగల్ నోటీసు పంపారు. ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వేతనాల పెంపుపై చర్చలు విఫలంతెలుగు సినీ కార్మికుల వేతనాల పెంపు విషయమై కార్మికుల సంఘం – నిర్మాతల మండలి మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగడం లేదు. శనివారం హైదరాబాద్లోని తెలుగు ఫిల్మ్ చాంబర్లో నిర్మాతల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సినీ కార్మికుల వేతనాల పెంపుపై తమ నిర్ణయాలను నిర్మాతలు వెల్లడించారు. మూడు విడతలుగా కార్మికుల వేతన పెంపును అమలు చేయనున్నట్లుగా తెలిపారు. జీతాన్ని బట్టి పెంపుతెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి దామోదరప్రసాద్ మాట్లాడుతూ– ‘‘రోజుకి రూ. 2000 లేదా అంతకన్నా తక్కువ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంపు ఉంటుంది. రోజుకి రూ. 1000 రూపాయలు లేదా అంతకన్నా తక్కువ వేతనం తీసుకుంటున్న కార్మికులకు స్ట్రయిట్గా 20 శాతం పెంపుదల చేస్తాం. మళ్లీ మూడో ఏడాది 5 శాతం పెంపుదల ఉంటుంది. మేము ఇప్పటికే కార్మికుల సంఘం ముందు ఉంచిన నాలుగు ప్రతిపాదనలను వారు అంగీకరిస్తేనే ఇవి అమలు అవుతాయి. అలాగే చిన్న బడ్జెట్ సినిమాలకు పాత వేతనాలనే చెల్లిస్తాం. అయితే చిన్న సినిమా బడ్జెట్ పరిమితి... తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ఇప్పటికే రోజుకి రూ. 4 వేలు, రూ. 5 వేలు తీసుకుంటున్న కార్మికులకు వేతనాలు పెంచమనడం సరైంది కాదు’’ అని పేర్కొన్నారు.వారి ప్రతిపాదనలు ఒప్పుకోలేదుకార్మికుల సంఘం అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. ‘‘మా చర్చలు విఫలమైనట్లుగా మేం భావిస్తున్నాం. చర్చలంటూ పిలిచారు. పర్సెంటేజ్ విధానం చెప్పారు. కానీ అందరికీ ఇస్తే అంగీకరిస్తాం అని చెప్పాం. అయితే ఫెడరేషన్ను విభజించాలనుకున్నట్లుగా పర్సెంటేజ్లను క్రియేట్ చేశారు. అది మేం అస్సలు ఒప్పుకోలేదు. 30 శాతం పెంపుదల విభజన (ఒక్కో ఏడాది కొంచెం కొంచెంగా)కు మేం సిద్ధం. కానీ వాళ్లు ఫెడరేషన్లోని కొన్ని యూనియన్లకు పెంచుతామని, మరికొన్ని యూనియన్లకు పెంచమని చెప్పారు. ఇందుకు ఒప్పుకునేది లేదు. అందరికీ సమానంగా పెంచాలిరోజువారీ వేతనాలు తీసుకునే యూనియన్స్ 13 ఉన్నాయి. అందరికీ సమానంగా పెంచాలని చెప్పాం. తక్కువ, ఎక్కువలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదామన్నాం. కానీ వాళ్ళు ఒక ఫిగర్ చెప్పుకుండానే వెళ్లిపోయారు. అక్కడ జరిగింది వేరు... బయటికి వచ్చి మాట్లాడింది వేరు. ఫైటర్స్, డ్యాన్సర్స్, టెక్నిషియన్స్.. ముఖ్యంగా కెమెరా టెక్నిషియన్స్ గురించి మాట్లాడలేదు. మేం 24 యూనియన్స్ ఉన్నాం. యూనియన్లను విడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు’’ అని అనిల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడంతో ఆదివారం నుంచి తమ నిరసనలను తీవ్రతరం చేస్తామని కార్మికుల సంఘం నాయకులు అంటున్నారు.చదవండి: మృణాల్ అయితే బాగుంటుందన్న స్టార్ హీరో! -
మృణాల్ అయితే బాగుంటుందన్న స్టార్ హీరో!
సాధారణంగా హీరోయిన్లు పలానా హీరో సరసన నటించాలని కోరుకుంటుంటారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోనే తనకు జంటగా పలానా హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పడం విశేషం. ఆ హీరో ఎవరో కాదు శివకార్తికేయన్ (Sivakarthikeyan). వరుస విజయాలతో స్టార్ హీరోగా రాణిస్తున్న ఈయన ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్ట్ చేస్తున్న మదరాశి చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. సినిమాలుసుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. రవి మోహన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఇందులో అధర్వ మురళి ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా తర్వాత శివకార్తికేయన్ వెంకట్ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.గతంలో మిస్..ఇది టైమ్ ట్రావెలింగ్తో కూడిన సైన్స్ ఫిక్షన్ జానర్లో సాగే కథా చిత్రమని భోగట్టా! ఈ చిత్రంలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని శివకార్తికేయన్ వ్యక్తం చేశాడట! దీంతో ఆమెను ఒప్పించే దిశగా చర్చలు జరుగుతున్నాయంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె ఇంతకుముందే మదరాశి చిత్రంలో శివకార్తికేయన్తో జత కట్టాల్సి ఉంది. పలు కారణాల రీత్యా ఆ అవకాశాన్ని మృణాల్ జార విడుచుకుందని ప్రచారం జరిగింది. మరి ఈ సారైనా శివ కార్తికేయన్ సరసన నటిస్తుందో? లేదో? వేచి చూడాలి.చదవండి: ప్రముఖుల ‘బయోపిక్స్’ -
పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే..? పరంతు పో మూవీ చూడాల్సిందే!
టైటిల్: పరంతు పో..నటీనటులు: శివ, గ్రేస్ ఆంటోని,, మిథుల్ అంజలి తదితరులుడైరెక్టర్: రాముఓటీటీ: జియో హాట్స్టార్ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ బాగున్న సినిమాలను ఓటీటీ ప్రియులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు థియేటర్లలో అంతగా రాణించలేకపోయినా.. ఓటీటీకి వచ్చేసరికి దూసుకెళ్తున్నాయి. అలాంటి మరో సందేశాత్మక చిత్రమే పరంతు పో. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..గోకుల్ (శివ), గ్లోరీ ( గ్రేస్ ఆంటోనీ) లవ్ మ్యారేజ్ చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ఓ కుమారుడు జన్మిస్తాడు. వాడి పేరు అన్బుల్(మిథుల్). అసలే ప్రేమ పెళ్లి కావడంతో వీరికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి మద్దతు లభించదు. ఫ్యామిలీ నడవాలంటే భార్యాభర్తలిద్దరూ తప్పక పని చేయాల్సిన పరిస్థితి. వీళ్లది మిడిల్ క్లాస్ కావడంతో జీవనం సాగించేందుకు చిన్నపాటి బిజినెస్ చేస్తుంటారు. గ్లోరీ బట్టల షాపు రన్ చేస్తుండగా.. గోకుల్ సైతం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉంటారు. ఇద్దరు కూడా బిజీగా ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్ పిల్లాడిపై పడుతుంది. దీంతో అన్బుల్ ఒక్కడే ఇంట్లో ఉంటూ టీవీకి పరిమితమైపోతాడు. ఒకసారి సడన్గా గ్లోరీ బిజినెస్ పనిమీద కోయంబత్తూరు వెళ్తుంది. అప్పుడు పిల్లాడి బాధ్యత తండ్రి గోకుల్ మీదే పడుతుంది. ఇంట్లో కొడుకు అల్లరిని తట్టుకోలేక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు గోకుల్. ఇంతకీ వాళ్ల ట్రిప్ సజావుగా సాగిందా? ఇంట్లో ఉన్నప్పుడు టీవీ తప్ప మరో ప్రపంచం తెలియని అన్బుల్ ఆ తర్వాత ఎలా మారిపోయాడన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువ జంటలు చేస్తున్న పొరపాటునే డైరెక్టర్ సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పెళ్లి తర్వాత జీవనోపాధి కోసం నగరాలకు వచ్చి చేరుతున్న యువ జంటలు.. పనిలో పడి పిల్లలను పట్టించుకోవడం మానేశారు. నగరాల్లో దాదాపు అందరివీ ఒంటరి జీవితాలే. ఎందుకంటే ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఎవరి పనిలో వాళ్లుండి ఫుల్ బిజీగా లైఫ్ను సాగదీస్తుంటారు. పిల్లలకు టైమ్ కేటాయించడమనేది చాలా అరుదు.స్కూల్కు వెళ్లి వచ్చిన పిల్లాడు.. ఇంట్లో ఎవరు లేకపోతే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పాయింట్నే ప్రధానంగా చూపిస్తూ కథ రాసుకున్నారు. ఈ జనరేషన్ పిల్లలపై ఆ ప్రభావం ఏంటనేది పరతు పోలో చక్కగా చూపించారు. ఈ కథ మొత్తం చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ కథ ప్రారంభంలో గ్లోరీ, గోకుల్ బిజినెస్తో బిజీగా ఉండడం చూపించారు. గ్లోరీ తన బట్టల షాప్ బిజినెస్లో పడి పిల్లాడితో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. దీంతో పిల్లాడి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. స్కూల్కి వెళ్లి రావడం, టీవీకి అతుక్కుపోవడం అదే అతని దినచర్యగా మారుతుంది. అలా ఫస్టాఫ్లో వారి బిజీ లైఫ్, పిల్లాడి చుట్టూ కథ తిరుగుతుంది. గ్లోరీ తన బిజినెస్ పనిమీద కోయంబత్తూరు వెళ్లడంతో ఇంట్లో పిల్లాడిని కంట్రోల్ చేయలేక తండ్రి గోకుల్ రోడ్ ట్రిప్ కోసం బయలుదేరతాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు కామెడీతో పాటు కొత్త లైఫ్ స్టైల్ను పరిచయం చేసే సన్నివేశాలు అంతా రోటీన్గానే ఉంటాయి. తండ్రీ, కుమారుల మధ్య వచ్చే సంభాషణలు ఫుల్ కామెడీగా అనిపిస్తాయి.అయితే ఈ రోడ్ ట్రిప్ మధ్యలో ఎప్పుడో ఐదో క్లాస్ చదివిన అంజలి.. గోకుల్ను చూసి వెంటనే గుర్తు పడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, స్కూల్ లవ్ స్టోరీ చాలా ఫన్నీగా చూపించాడు డైరెక్టర్. ఎప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండే అన్బుల్కు ట్రిప్లో కొత్త దోస్తులు పరిచయమవుతారు. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ.. కొత్త ఫ్రెండ్స్ తోడు కావడంతో అన్బుల్లో ఊహించని మార్పు రావడాన్ని దర్శకుడు చూపించిన విధానం బాగుంది. ట్రిప్ మధ్యలో అన్బుల్ తల్లి గ్లోరీ ఫోన్ చేసి కొడుకు గురించి ఆరా తీయడం, భార్య, భర్తల మధ్య సంభాషణలతో కామెడీ పండించారు డైరెక్టర్. ఈ కథలో సందేశం ఇస్తూనే ఎంటర్టైనింగ్తో పాటు పల్లె జీవితాన్ని ఆడియన్స్కు పరిచయం చేశాడు. కథనం నెమ్మదిగా సాగినాప్పటికీ.. క్లైమాక్స్ చివరి పదిహేను నిమిషాలు పరుగులు పెట్టించిన తీరు ఆకట్టుకుంది. ఓవరాల్గా నేటి జనరేషన్ జాబ్, బిజినెస్ అంటూ పిల్లల్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని తెరపై కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించాడు. ఈ మూవీ చూసిన తర్వాతనైనా తల్లిదండ్రుల్లో కాస్త మార్పు రావాలని ఆశిద్దాం.నటీనటుల విషయానికొస్తే శివ, గ్రేస్ ఆంటోనీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చిన్న పిల్లాడు మిథుల్ తన పాత్రలో అదరగొట్టేశాడు. అంజలి పాత్ర కొద్దిసేపే కనిపించినా తన నటనతో ఆకట్టుకుంది. సాంకేతికత పరంగా ఫర్వాలేదనిపించేలా ఉంది. లోకేషన్స్, కొండ ప్రాంతాల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు నేచురల్ ఫీలింగ్ కలుగుతుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. -
రీఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్.. ఖాకీ చొక్కాలో లాఠీతో..
ఒకప్పటి హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) వెండితెరపై కనిపించి చాలాకాలమే అవుతోంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అతడు బిగ్స్క్రీన్పై రీఎంట్రీ ఇస్తున్నాడు. వడ్డే క్రియేషన్స్ అంటూ ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. తన బ్యానర్లోనే హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.త్రిమూర్తులుఈ చిత్రానికి త్రిమూర్తులు అని టైటిల్ ఫిక్స్ చేశాడు. ఆగస్టు 9 రాఖీ పండగ సందర్భంగా త్రిమూర్తులు నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో వడ్డే నవీన్ ఖాకీ చొక్కా ధరించి, లాఠీ పట్టుకుని సీరియస్గా కాకుండా సరదాగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. రాశీ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నాడు.అప్పట్లో సెన్సేషన్ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ కుమారుడిగా నవీన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. కోరుకున్న ప్రియుడు సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా పెళ్లితో నవీన్కు పెద్ద హిట్ పడింది. మనసిచ్చి చూడు, స్నేహితులు, చెప్పాలని ఉంది, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి పలు చిత్రాల్లో నటించాడు. వడ్డే నవీన్.. చివరగా 2016లో ఎటాక్ చిత్రంలో కనిపించాడు. From silver screen memories to a bold new avatar ✨#VaddeNaveen garu is back — ruling hearts & the screen again, in khaki style!👮🏻♂️Proudly presenting the #FirstLook of @vaddecreations Production No 1- #TransferTrimurthulu ❤️🔥@vaddenaveen @RashiReal_ @MeeKamalTeja @vamsikaka pic.twitter.com/J0ESA6X2Tm— vadde creations (@vaddecreations) August 9, 2025 చదవండి: నాన్న చీపురు, చెప్పులతో కొట్టేవాడు.. కారంపొడి చల్లేవాడు:నటి -
రాఖీ నుంచి దీపావళి వరకు.. పండగలే సినిమా టైటిల్స్ అయితే..!
అన్నయ్య.. అన్నావంటే ఎదురవనా.. ఇది పాట మాత్రమే కాదు నిజం కూడా! అమ్మానాన్నకు చెప్పుకోలేని విషయాలు కూడా ఆడవాళ్లు.. అన్నకు చెప్పుకుంటారు. ఏ కష్టం వచ్చినా అన్న సలహా తీసుకోవాల్సిందే! ఇబ్బందుల్లో ఉంటే అన్నకు ఫోన్ రావాల్సిందే! అతడు క్షణంలో చెల్లెలి ముందు ప్రత్యక్షం కావాల్సిందే! ఈ అనుబంధాన్ని దేనితోనూ వెలకట్టలేము. ఈ అన్నాచెల్లెళ్ల ప్రేమను లోతుగా చూపిస్తూ కంటతడి పెట్టించే సినిమాలు వెండితెరపై ఎన్నో వచ్చాయి. అక్కడిదాకా ఎందుకు రక్షా బంధన్ పండగపై రాఖీ అనే సినిమా కూడా ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. రాఖీయే కాదు, ఇలా ఎన్నో పండగలు సినిమా టైటిల్స్గా ఆవిష్కృతమై తెరపై అద్భుతాలు సృష్టించాయి. అవేంటో చూసేద్దాం..సంక్రాంతివెంకటేశ్, శ్రీకాంత్, శివబాలాజీ, స్నేహ, ఆర్తి అగర్వాల్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. ముప్పలనేని శివ డైరెక్ట్ చేశాడు. 2005లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.మహాశివరాత్రిరాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మహాశివరాత్రి. రేణుకశర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేసింది.దసరానాని హీరోగా వచ్చిన దసరా సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2023లో విడుదలైంది.హోలీఉదయ్కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాకు ఎస్వీఎన్ వరప్రసాద్ దర్శకత్వం వహించాడు. 2002లో వచ్చిన ఈ మూవీ జనాల్ని బాగానే ఆకట్టుకుంది.ఉగాదిఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం వహించిన మూవీ ఉగాది. లైలా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1997లో రిలీజైంది.నందమూరి కల్యాణ్రామ్ విజయదశమి, సునీల్ కృష్ణాష్టమి, కృష్ణ భోగిమంటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురుపౌర్ణమి.. ఇంకా దీపావళిపై రెండు సినిమాలు.. ఇలా బోలెడన్ని వచ్చాయి.చదవండి: నిర్మాతలు ఎటూ తేల్చకపోతే చిరంజీవి ఆ పని చేస్తానన్నారు -
నిర్మాతలు ఎటూ తేల్చకపోతే చిరంజీవి ఆ పని చేస్తానన్నారు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) వ్యాఖ్యలు సినీకార్మికుల పొట్టకొట్టేలా ఉన్నాయని సినిమా ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ టైగర్ రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. విశ్వప్రసాద్కు సినిమా ఇండస్ట్రీపై అవగాహన లేదని, ఆయన ఫిలిం ఫెడరేషన్ నాయకులపై వేసిన కేసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన మాటలు దారుణంశనివారం నాడు సాక్షి టీవీతో టైగర్ రాజు మాట్లాడుతూ.. చిరంజీవిని కలిసి మా సమస్యలను విన్నవించాము. రేపటి వరకు నిర్మాతలు ఏమీ తేల్చకపోతే సోమవారం నుంచి ఆయన షూటింగ్కు ఫెడరేషన్ కార్మికులకు 30 శాతం జీతాలు పెంచి షూటింగ్ జరుపుతానని చెప్పారు. మా సమస్యకు పరిష్కారం దొరుకుతున్న సమయంలో విశ్వప్రసాద్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నిర్మాత సి.కల్యాణ్ కూడా కార్మికుల నుంచి వచ్చినవాడే.. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి అన్నారు.విశ్వ ప్రసాద్ ఏమన్నారు?సినీ కార్మికుల వేతనాల పెంపుపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. 30% వేతనం పెంచేవరకు షూటింగ్స్లో పాల్గొనమని కార్మికులు బంద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. మలయాళంలో రూ.1 కోటి బడ్జెట్తో తీసే సినిమా తెలుగులో తీయాలంటే రూ.15 కోట్లు అవుతోంది. మలయాళంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు తక్కువగా ఉంటాయి. అదే ఇక్కడ నటీనటుల భారీ రెమ్యునరేషన్లు, టెక్నికల్ టీమ్లో భారీ జీతాలు, షూటింగ్స్లో పనిచేసే కార్మికుల వేతనాలు ఎక్కువ ఉండటంతో బడ్జెట్ అధికమవుతోంది. వేతనాలు పెంచి ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ స్కిల్డ్ వర్కర్స్ లేనప్పుడు ఇప్పుడిస్తున్న వేతనాలే ఇబ్బందికరంగా అనిపిస్తోంది. స్కిల్ లేనివారికి ఇంకా జీతాలు పెంచివ్వడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మరుతోంది. ఇండస్ట్రీలో కొన్ని క్రాఫ్ట్స్ వాళ్లు రోజుకు గంటసేపే పనిచేస్తారు. అయినా వారికి మిగతావాళ్లతో సమానంగా వేతనాలిస్తున్నాం అని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.చదవండి: మహేశ్ బాబు సినిమా.. కీలక అప్డేట్ ఇచ్చిన రాజమౌళి -
సీమంతం గ్లింప్స్: ప్రెగ్నెన్సీ మహిళ చేతులు వెనక్కు కట్టేసి..
టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘C-మంతం’ (Cmantham Movie). ఈ మూవీ నుంచి గ్లింప్స్ను చిత్ర బృందం శనివారం (ఆగస్టు 9న) విడుదల చేసింది. ఈ గ్లింప్స్ ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. క్లాసిక్ థ్రిల్, ఎమోషనల్ డెప్త్ కలగలిసినట్లుగా కనిపించే ఈ గ్లింప్స్లో విజువల్స్, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.ముఖ్యంగా గర్భిణీ మహిళ చేతులు వెనక్కి కట్టిన దృశ్యం.. రక్తపు మడుగు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది. దర్శకుడు సుధాకర్ పాణి ఈ సినిమాను కొత్తగా చూపించడానికి ప్రయత్నించారని గ్లింప్స్తోనే అర్థమవుతోంది ప్రశాంత్ టాటా నిర్మాతగా, గాయత్రీ సౌమ్య గుడిసెవా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎస్. సుహాస్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్కు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
K Ramp: కలర్ఫుల్గా ఓనం సాంగ్
'క' సినిమాతో అసలు సిసలైన హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) దిల్రూబా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాడు. ప్రస్తుతం ఇతడు కె- ర్యాంప్ సినిమా చేస్తున్నాడు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు.ఓనం సాంగ్..నేడు (ఆగస్టు 9) రాఖీ పండగను పురస్కరించుకుని కె- ర్యాంప్ (K - Ramp Movie) నుంచి ఓనమ్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. 'ఇన్స్టా ఆపేశానే.. ట్విటర్ మానేశానే.. నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్ల..' అన్న లిరిక్స్తో పాట మొదలైంది. చేతన్ భరద్వాజ్, సాహితి చాగంటి ఈ పాట ఆలపించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. సురేంద్ర కృష్ణ లిరిక్స్ సమకూర్చాడు. పాట కలర్ఫుల్గా ఉంది. కిరణ్ ఎనర్జిటిక్గా డ్యాన్స్ చేశాడు. కె ర్యాంప్ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. చదవండి: 'చిట్టి' గుండెల కోసం మహేశ్ బాబు.. -
అవకాశాల్లేవంటున్న బ్యూటీ.. బాస్ పాటతోనైనా కలిసొచ్చేనా?
'నాగిని' సీరియల్తో పాపులారిటీ సంపాదించుకుంది బుల్లితెర నటి మౌనీ రాయ్ (Mouni Roy). బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లాలన్న ఆశ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే పంజాబీ చిత్రంతో నెరవేరింది. 'గోల్డ్' అనే హిందీ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి చిత్రానికి బెస్ట్ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. భారీ బడ్జెట్ మూవీ 'బ్రహ్మాస్త్ర: పార్ట్ 1'లోనూ భాగమైంది. అంచనాలు తలకిందులుఈ చిత్రానికిగానూ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్, ఐఫా అవార్డులు గెలుచుకుంది. అయితే తాను ఊహించినంతగా భారీ సినిమాల అవకాశాలు మాత్రం రావడం లేదని బాధపడుతోంది. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీరాయ్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్ర మూవీ తర్వాత చాలా ఆఫర్లు వస్తాయనుకున్నాను. కానీ అది నిజమవలేదు. సినిమాకు ఎవర్ని సెలక్ట్ చేయాలన్నప్పుడు కనీసం నా పేరు కూడా ప్రస్తావించడం లేదనుకుంటా!ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీఅందుకు గల కారణాలేంటో తెలియడం లేదు. అయితే కెరీర్ మాత్రం ఆగిపోలేదు. ఓటీటీ ప్రాజెక్టులతో పాటు రియాలిటీ షో జడ్జిగా వ్యవహరిస్తూ, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఇలా ఏదో ఒకరకంగా ఎప్పుడూ బిజీగా ఉంటున్నాను. అవకాశాలు సరైన సమయంలో వాటంతటవే వస్తాయని ఎదురుచూస్తున్నాను. దాని గురించి అంతగా బాధపడుతూ కూర్చోవట్లేదు.నా జర్నీని తక్కువ చేయలేనుఎందుకంటే నా కెరీర్ ఎక్కడో మొదలై.. ఇంతదూరం వచ్చాను. ఇప్పటివరకు ఎన్నో సాధించాను. ఈ విషయంలో సంతృప్తిగా ఉండాలే తప్ప చేసిన పనిని చులకన చేసి మాట్లాడలేను. అయినా సినిమా ఫైనలైజ్ అవ్వాలంటే ముందు ఎన్నో ఉంటాయి. స్క్రిప్ట్ కుదరాలి, నిర్మాణ సంస్థలు భాగమవ్వాలి, బడ్జెట్ లెక్కలేసుకోవాలి. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాకే నటీనటుల సెలక్షన్ ఉంటుంది. విశ్వంభరతోనైనా దశ తిరిగేనా?వాళ్లనుకునే పాత్రలో మనల్ని ఊహించుకోలేకపోతే కనీసం లుక్ టెస్ట్కు కూడా పిలవరు. కాబట్టి సినిమాలో భాగం అవడమనేది నటీనటుల చేతిలో ఉండదు అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మౌనీరాయ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే! విశ్వంభర మూవీలో ఈ నటి చిరంజీవితో స్టెప్పులేసిందట! ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. విశ్వంభరతోనైనా మౌనీ దశ తిరుగుతుందేమో చూడాలి!చదవండి: 49 ఏళ్ల వయసులో సత్తా చాటిన ప్రగతి.. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ -
49 ఏళ్ల వయసులో సత్తా చాటిన ప్రగతి.. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
సినిమాల్లో పాపులారిటీ రాగానే చాలామంది అక్కడే సెటిలవుతారు. కానీ ప్రగతి మాత్రం (Pragathi Mahavadi) విభిన్నంగా ఆలోచించింది. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో హీరోయిన్గా, సహాయనటిగా పలు సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత కొంతకాలం యాక్టింగ్కు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. అంతలో లాక్డౌన్. అందరి జీవితంలోలాగే ప్రగతి జీవితంలోనూ కుదుపు. కానీ ఈ సమయాన్ని ఆమె వృథా చేయాలనుకోలేదు.లాక్డౌన్తో లైఫ్ యూటర్న్వీలైనంత ఎక్కువగా జిమ్లోనే గడిపింది. బరువులు ఎత్తే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మొదట్లో సరదాగా ఎక్సర్సైజ్ చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ పవర్ లిఫ్టింగ్ వైపు తనకు ఆసక్తి పెరిగింది. ఈ రంగంలో ఎదగాలని ఆశపడింది. అనుకున్నట్లుగానే ఓ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో మూడో స్థానంలో నిలిచింది. తర్వాత జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలో రెండో స్థానంలో నిలిచి వెండి పతకం అందుకుంది. తాజాగా మూడు, రెండు స్థానాలను దాటేసి ఏకంగా మొట్టమొదటి స్థానంలో నిలబడింది. బంగారు పతకం గెల్చిన ప్రగతికేరళలో జరిగిన జాతీయ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ - 2025 పోటీలో బంగారు పతకం గెలుచుకుంది. 84 కిలోల బరువు ఎత్తే విభాగంలో ఆమెకు ఈ పతకం వరించింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ప్రగతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 50 ఏళ్లు వచ్చాక ఇంకేం చేస్తాం? అనుకునేవారికి ప్రగతి ఆదర్శం అని కామెంట్లు చేస్తున్నారు. ఓపక్క సినిమాలు చేస్తూ మరోపక్క వెయిట్ లిఫ్టింగ్లో అవార్డులు కొల్లగొట్టడం మామూలు విషయం కాదని కొనియాడుతున్నారు. ప్రగతి చివరగా నారీ: ద ఉమెన్ (2025) సినిమా చేసింది. View this post on Instagram A post shared by FX shotss (@foxy_silver_snapshotss) View this post on Instagram A post shared by Tiruveedhula Kaushik (@tiruveedhula.kaushik)చదవండి: అందరిముందే తిట్టిన ప్రేయసి.. నటుడి సలహాతో బ్రేకప్ చెప్పిన బిగ్బీ -
అందరిముందే తిట్టిన ప్రేయసి.. నటుడి సలహాతో బ్రేకప్ చెప్పిన బిగ్బీ
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)- జయ బచ్చన్ పెళ్లి చేసుకుని 50 ఏళ్లు పైనే అవుతోంది. అయితే జయను ప్రేమించి పెళ్లాడటానికి ముందు బిగ్బీ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట! ఈ విషయాన్ని నటుడు, రచయిత హనిఫ్ జవేరీ వెల్లడించాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనిఫ్ మాట్లాడుతూ.. అమితాబ్ ముంబైకి రావడానికి ముందు ఓ అమ్మాయిని ప్రేమించాడు. తన పేరు మాయ. బ్రిటీష్ ఎయిర్వేస్లో పనిచేసేది. సినిమాల్లోకి రాకముందే లవ్స్టోరీ..అమితాబ్ తనను ఎంతగానో ప్రేమించాడు. ఆమె కూడా ఆయన్ను అంతే ఇష్టపడింది. సినిమాల్లో పని వెతుక్కుందామని అమితాబ్ ముంబై వచ్చేశాడు. ముంబైలోని జుహులో.. తల్లి తేజ్ బచ్చన్ స్నేహితురాలి ఇంట్లో ఉన్నాడు. తరచూ మాయ ఆ ఇంటికి వచ్చి అతడిని పలకరిస్తూ ఉండేది. అయితే బిగ్బీ తల్లి స్నేహితురాలు కూడా అదే ఇంట్లో ఉండేది. దీంతో తన ప్రేమ వ్యవహారం ఎక్కడ బయటకు పొక్కుతుందోనని అమితాబ్ చాలా భయపడ్డాడు.తొలి సినిమా షూటింగ్లో..ఆ ఇంటి నుంచి వచ్చేసి బయటెక్కడైనా రెంట్కు ఉండాలనుకున్నాడు. అప్పుడు అమితాబ్ తన ఫస్ట్ మూవీ సాట్ హిందుస్తానీ సినిమా చేస్తున్నాడు. ఇందులో నటుడు అన్వర్ అలీ (Anwar Ali)తో కలిసి నటించాడు. తన బాధను అన్వర్తో చెప్పుకున్నాడు. విషయం అర్థమైన అన్వర్.. బిగ్బీని తన ఇంట్లోనే ఉండమన్నాడు. అలా అన్వర్ అపార్ట్మెంట్లో బిగ్బీ, మాయ చాలాకాలంపాటు కలిసున్నారు. బహుశా వాళ్లు పెళ్లి కూడా చేసుకునుండొచ్చు. అందరి ముందు అవమానించేదికానీ ఆ సమయంలో అమితాబ్ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. అమితాబ్కు మొహమాటం ఎక్కువ. మాయ మాత్రం కన్నింగ్గా ఉండేది. నోటికొచ్చినట్లు మాట్లాడేది. కొన్నిసార్లు అమితాబ్ పక్కన ఎవరున్నారన్నది కూడా చూసుకోకుండా తిట్టేసేది. అమితాబ్ స్నేహితులకు ఆమె పద్ధతి అస్సలు నచ్చేది కాదు. అతడు కూడా ప్రియురాలు అవమానించడంతో సిగ్గుతో చచ్చిపోయేవాడు. ఒకసారి గోవాకు షూటింగ్కు వెళ్లినప్పుడు మాయకు బ్రేకప్ చెప్పమని అన్వర్ సలహా ఇచ్చాడు. ఫస్ట్ సినిమా రిలీజ్కు ముందే బ్రేకప్సినిమాల్లో ఇంకా పైస్థాయికి వెళ్లేకొద్దీ సమస్యలు ఎక్కువవుతాయని హెచ్చరించాడు. అమితాబ్కు కూడా అది నిజమేననిపించింది. తమ బంధంలో ఏదో సరిగా లేదని ఎన్నాళ్లుగానో అతడు అసంతృప్తిగా ఫీలవుతున్నాడు. దీంతో ఆమెను దూరం పెట్టాడు. తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. అమితాబ్ తొలి చిత్రం సాట్ హిందుస్తానీ 1969లో రిలీజైంది. హీరోయిన్ జయను 1973లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి శ్వేత బచ్చన్, అభిషేక్ బచ్చన్ సంతానం.చదవండి: ఛాన్సుల కోసం బిజీ రెస్టారెంట్లో పిచ్చిదానిలా ఏడవాలా? అక్కర్లేదు! -
ఛాన్సుల కోసం బిజీ రెస్టారెంట్లో పిచ్చిదానిలా ఏడవాలా? అక్కర్లేదు!
కొన్ని ఆడిషన్స్ చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎంత సిద్ధమై వచ్చినా సరే ఊహకందని పనులు చేయిస్తారు. అలా తనకు జరిగిన ఓ విచిత్ర ఆడిషన్ను గుర్తు చేసుకుంది బాలీవుడ్ నటి ఇషా తల్వార్ (Isha Talwar). ఓ ఆడిషన్ కోసం యష్ రాజ్ ఫిలింస్ సంస్థకు చెందిన కాస్టింగ్ డైరెక్టర్ షనూ శర్మను కలిశాను. నాకు ముంబై వెర్సోవాలో ఓ రెస్టారెంట్లో సీన్ ఉందన్నారు. అక్కడికి వెళ్లి అందరి మధ్యలో గట్టిగా ఏడవాలని చెప్పారు.రెస్టారెంట్లో ఏడవమన్నారునటి ఎటువంటి సన్నివేశాలకైనా అభ్యంతరం చెప్పకూడదన్నారు. షనూ, తన అసిస్టెంట్లతో కలిసి రెస్టారెంట్లో నా ముందే కూర్చుంది. అందరూ భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. రద్దీగా ఉన్న రెస్టారెంట్లో అందరికీ వినబడేలా గట్టిగా ఏడ్వాలని చెప్పేసరికి అంతా అయోమయంగా అనిపించింది. అలా చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఒక అమ్మాయిని ఇలా పదిమందిలో ఏడిపించడం దేనికో నాకస్సలు అర్థం కాలేదు. ఇదేం ఆడిషన్?ఆఫీస్లో ఆడిషన్ పెట్టుకుంటారు కానీ, ఇలా జనం మధ్యలోనా? పోనీ.. సహజంగా రావాలంటే ఏదైనా రెస్టారెంట్ను కాసేపటికి అద్దెకు తీసుకుని ఆడిషన్ చేయాలి!ఏదేమైనా ఇది దాదాపు పదేళ్ల కిందట జరిగిన సంఘటన. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవాళ్ల కోసం ఈ స్టోరీ పెడుతున్నాను. ఎవరూ ఒత్తిడికి గురి కాకండి. నేనైతే అలా రెస్టారెంట్లో ఏడవనని చెప్పేశాను, దీంతో సదరు సినిమాలో అవకాశం కూడా దక్కలేదు. కానీ, ఛాన్సుల కోసం ఇలా రెస్టారెంట్లో అస్సలు ఏడవలేను అని చెప్పుకొచ్చింది. ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఎవరంటే?ఇషా.. మీర్జాపూర్ వెబ్ సిరీస్, ఆర్టికల్ 15 చిత్రాల్లో నటించింది. కాగా ఈ సీనియర్ కాస్టింగ్ డైరెక్టర్ షనూ.. బాలీవుడ్కు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసింది. వారిలో రణ్వీర్ సింగ్, భూమి పడ్నేకర్ వంటి స్టార్స్ ఉన్నారు. ఈ మధ్యే సయ్యారా మూవీతో అహాన్ పాండే, అనీత్ పడ్డాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.చదవండి: ఫ్యామిలీతో అల్లు అర్జున్ డిన్నర్.. అర్హకు ఇబ్బంది కలగొద్దని -
ఫ్యామిలీతో అల్లు అర్జున్ డిన్నర్.. అర్హకు ఇబ్బంది కలగొద్దని..
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటాడు అల్లు అర్జున్ (Allu Arjun). బన్నీ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. భార్య స్నేహ, కుమారుడు అయాన్, కూతురు అర్హతో కలిసి ఓ రెస్టారెంట్కు డిన్నర్కు వెళ్లాడు. కుటుంబంతో కలిసి భోజనం చేసి బయటకు వస్తుండగా మీడియా వారి ఫోటోలు క్లిక్మనిపించే పనిలో పడింది. ఈ క్రమంలో కెమెరాలు అదేపనిగా ఫ్లాష్ అవుతుండటంతో బన్నీ.. కూతురి కళ్లపై చేయి అడ్డుపెట్టాడు.కూతురిపై ఎంత ప్రేమో!అర్హ కళ్లకు ఇబ్బందికలగకుండా కూతురి కళ్లపై చేయి పెట్టే ముందుకు నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు.. కూతురిపై ఐకాన్ స్టార్కు ఎంత ప్రేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ చివరగా పుష్ప 2 చిత్రంలో నటించాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లకుపైగా రాబట్టింది. ప్రస్తుతం బన్నీ.. అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో దీపికా పదుకొణె, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఇంట్లో కూర్చుని బాధపడలేను.. ఇకపై అలాంటి సినిమాలే చేస్తా! -
ఇంట్లో కూర్చుని బాధపడలేను.. ఇకపై అలాంటి సినిమాలే చేస్తా!
సరైన పాత్రలు ఆఫర్ చేస్తేనే సినిమాలు చేస్తానంటున్నాడు ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi). తెలుగు, తమిళ, బెంగాలీ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసి విశిష్ట నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆశిష్ విద్యార్థి. ఈయన చివరగా కిల్, ఆవేశం చిత్రాల్లో నటించాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. కొన్ని విషయాలు ఈరోజు చర్చించి తీరాల్సిందే! ప్రేక్షకులుగా మీరెప్పుడూ కరెక్టే! గ్రేట్ యాక్టర్నుఈ మధ్యకాలంలో నేను ఎక్కువ సినిమాలు చేయడం లేదు. అందరు కాకపోయినా కొందరైనా దానికి గల కారణం తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. వారికోసమైనా నేను నోరు విప్పాల్సిందే! నేను గ్రేట్ యాక్టర్ని. కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశాను. అయితే ఇంతవరకు చేయని పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాను. కథలో కీలక పాత్రలు ఆఫర్ చేస్తే తప్పకుండా యాక్ట్ చేస్తాను. ఈ విషయాన్నే దర్శకనిర్మాతలకు చెప్పాను.11 భాషల్లో నటించా..నా 30 ఏళ్ల కెరీర్లో 300 సినిమాలు చేశాను. 11 భాషల్లో నటించాను. ఇప్పుడు కొత్తదనం కావాలనుకుంటున్నాను. ప్రధాన పాత్రలే చేయాలనుకుంటున్నాను. కొన్నిసార్లు మనం ప్రపంచానికి దూరంగా ఉంటాం. కానీ, అలా అందరికీ దూరంగా ఉండి.. ఇంట్లో కూర్చుని ఒత్తిడికి లోనయ్యే టైప్ కాదు నేను అని చెప్పుకొచ్చాడు. కాగా ద్రోహకాల్ సినిమాకుగానూ ఆశిష్ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే!చదవండి: మొన్న నేషనల్ అవార్డ్.. ఇప్పుడు తెలుగు సింగర్ నిశ్చితార్థం -
మహేశ్బాబు అయిష్టంగా చేసిన సినిమా ఏదో తెలుసా?
మహేశ్బాబు (Mahesh Babu) కెరీర్లో సూపర్ హిట్ చిత్రాల్లో మురారి (Murari Movie) ఒకటి. ఈ చిత్రంతోనే బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రె తెలుగు తెరకు పరిచయమైంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. 2001లో రిలీజైన ఈ చిత్రం గతేడాది మహేశ్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి థియేటర్లలో విడుదలై సందడి చేసింది. రీరిలీజ్ సినిమా అయినప్పటికీ ఏకంగా రూ.9 కోట్లపైనే వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది.ఫస్ట్ రియాక్షన్ ఇదే!ఈ మూవీలో మహేశ్ నటన, పాటలు అన్నీ అద్భుతంగా కుదిరాయి. తాజాగా ఓ వ్యక్తి మురారి సినిమాలోని 'చందమామ చందమామ కిందికి చూడమ్మా..' సాంగ్ క్లిప్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సినిమా కథ చెప్పినప్పుడు మహేశ్ రియాక్షన్ ఏంటి సర్? అని కృష్ణవంశీని అడిగాడు. అందుకు దర్శకుడు స్పందిస్తూ.. ఆయనకు నచ్చలేదు అని నవ్వుతున్న ఎమోజీలతో ఎక్స్ (ట్విటర్)లో రిప్లై ఇచ్చాడు.నెక్స్ట్ ఏం జరిగింది?ఇది చూసిన నెటిజన్లు.. తర్వాత ఏం జరిగింది సర్? ఆయన్ను ఎలా ఒప్పించారు? అసలేం జరిగిందో పూర్తిగా చెప్పొచ్చుగా అని ఆరా తీస్తున్నారు. మరికొందరేమో.. ఏముంది? మహేశ్ తండ్రి కృష్ణగారి దగ్గరకు వెళ్తే ఆయన కృష్ణవంశీకి కథపై ఉన్న నమ్మకం చూసి సినిమా చేయమని ఆదేశించినట్లున్నారు. మహేశ్ సరేనని తలాడించడంతో మురారి సినిమా పట్టాలెక్కింది అని ఊహిస్తూ కామెంట్లు చేస్తున్నారు. He hated it 😀😀😀 https://t.co/s8lKwHOWWa— Krishna Vamsi (@director_kv) August 7, 2025 చదవండి: కమల్ హాసన్ కాలి ధూళితో కూడా షారూఖ్ సరిపోడు: నటుడు -
మేఘం వర్షించదా.. లవ్ సాంగ్ రిలీజ్
విజయ రామరాజు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి' (Arjun Chakravarthy Movie). విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ఇన్స్టాగ్రామ్లో 16 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. యూట్యూబ్ లో 1.5 మిలియన్ల వ్యూస్ దాటింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'మేఘం వర్షించదా' రిలీజ్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ కంపోజ్ చేసిన ఈ పాటకు విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా వుంది. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ పాడారు. ఇక ఈ సినిమాలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ చక్రవర్తి ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: సలాం అనాలి సాంగ్ టీజర్: డ్యాన్స్ ఇరగదీసిన స్టార్స్.. కానీ..! -
కమల్ హాసన్ కాలి ధూళితో కూడా షారూఖ్ సరిపోడు: నటుడు
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan).. తమిళ స్టార్ కమల్ హాసన్ కాలి మట్టితో కూడా సరిపోడంటున్నాడు బాలీవుడ్ నటుడు లిల్లీపుట్. షారూఖ్ మరుగుజ్జుగా నటించిన జీరో మూవీ (2018) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. దీంతో అతడు కొంతకాలం పాటు యాక్టింగ్కు బ్రేక్ తీసుకున్నాడు. షారూఖ్ కంటే ముందు కమల్ హాసన్ 1989లో అపూర్వ సగోదరర్గల్ (తెలుగులో విచిత్ర సోదరులు) మూవీలో మరుగుజ్జుగా నటించి సూపర్ హిట్టందుకున్నాడు. మరుగుజ్జుగా నటించడం కష్టంఈ రెండు సినిమాలను పోలుస్తూ నటుడు లిల్లీపుట్ (Lilliput) సంచలన వ్యాఖ్యలు చేశాడు. కళ్లున్నా సరే అంధుడిగా నటించవచ్చు. కానీ మంచి ఎత్తు ఉన్నప్పటికీ మరుగుజ్జుగా నటించడమంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్లు అందరిలాగే మామూలుగానే ఉంటారు. అందరిలాగే నవ్వుతారు, అందరిలాగే ఆలోచిస్తారు. కానీ చూడటానికి మాత్రం కాస్త విచిత్రంగా కనిపిస్తుంటారు. దాన్ని తెరపై చూపించాలి. కాబట్టి మరుగుజ్జుగా కనిపించడమనేది కష్టమైన పని.ప్రతీది నిశితంగా గమనించి..కానీ కమల్ హాసన్ ఏం చేశాడు? మరుగుజ్జులు ఎలా ఉంటారు? అనేది ప్రతీది వివరంగా తెలుసుకున్నాడు. వారి చేతి వేళ్లు చిన్నగా, మందంగా ఉంటాయని గమనించాడు. ముఖం, మోచేతులు, పాదాలు కాస్త భిన్నంగా ఉంటాయని తెలుసుకున్నాడు. ఇవన్నీ గమనించకుండా యాక్ట్ చేస్తే అందులో కొత్తదనం ఏముంటుంది? పోషించే పాత్రను ప్రభావవంతంగా చూపించాలిగా! కమల్ అదే చేశాడు. వీఎఫ్ఎక్స్ వాడకుండా రియల్గా కనిపించాడు.కమల్ను కాపీ కొట్టావ్నువ్వు (షారూఖ్) వీఎఫ్ఎక్స్ సాయంతో పొట్టిగా కనిపించావు. కమల్ను కాపీ కొట్టావు. తనలాగే హావభావాలు ప్రదర్శించేందుకు ట్రై చేశావు. అయినప్పటికీ ఆయన కాలికి ఉన్న మట్టితో కూడా నువ్వు సమానం కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్ ఇటీవలే.. జవాన్ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్.. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో కింగ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో షారూఖ్ కూతురు సుహానా కూడా నటిస్తోంది. అభయ్ వర్మ, అభిషేక్ బ్చన్, జైదీప్ అహ్లావత్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మిని ఆటాడుకున్న అల్లు అర్హ -
జూ.ఎన్టీయార్...నా ప్రచార ‘యుద్ధం’ నాదే
హీరోలు హీరోయిన్లు సినిమా ప్రచారంలో పాల్గొంటారే తప్ప ప్రచార బాధ్యతల్ని స్వయంగా చేపట్టడం అనేది జరగదు. సాధారణంగా ఆ బాధ్యతను కూడా సినిమా నిర్మాతలు, నిర్మాణ సంస్థలే చూసుకుంటాయి. అయితే గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీయార్ దీనికి కొంత విభిన్నంగా ప్రయాణిస్తున్నారు. సినిమా నిర్మాణ సంస్థల ప్రచారపు తీరుతెన్నులు ఎలా ఉన్నప్పటికీ... తాను కూడా వ్యక్తిగతంగా మరోవైపు నుంచి వీటిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. గతంలో రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా ఆయన ఇదే పంథాను అనుసరించారు. వ్యక్తిగతంగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని అంతర్జాతీయ స్థాయి లో ప్రచార వ్యూహాలు అమలు చేశారట. ఆ సినిమా మల్టీ స్టారర్ అయినప్పటికీ జూ.ఎన్టీయార్(Jr NTR)కు వచ్చిన గుర్తింపు మరెవరికీ రాకపోవడానికి అదే కారణం అంటున్నారు. పలువురు హాలీవుడ్ దర్శకులు సైతం జూ.ఎన్టీయార్తో సినిమా చేయడానికి రెడీ అంటూ ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే.(చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మితో అల్లు అర్హ క్యూట్ వీడియో)తాజాగా వార్ 2 సినిమా విషయంలోనూ ఆయన ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న టాలీవుడ్ యంగ్ టైగర్... వార్ 2 ని రూపొందించిన యష్ రాజ్ ఫిలింస్ ప్రచార శైలి పట్ల కినుక వహించారో, లేక తను కూడా మరింత బలం చేకూర్చాలనుకున్నారో తెలీదు గానీ ఈ సినిమా ప్రచారం విషయంలో ఎన్టీయార్ తన పిఆర్ టీమ్ను అలర్ట్ చేశారట. మరోవైపు తాజాగా సయ్యారా సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత, ఆ సినిమాను కూడా సమర్పించిన యశ్ రాజ్ ఫిలింస్ భవిష్యత్తు ప్రమోషన్ వ్యూహంలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. (చదవండి: ఆ సీన్ చేయలేనని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు: తమన్నా)సయ్యారా సినిమా మార్కెటింగ్ను ఈ సంస్థ అత్యంత వినూత్నంగా నిర్వహించింది. ప్రధాన జంట ప్రమోషన్ కోసం చాట్ షోలు షాపింగ్ మాల్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వంటివి చేయడానికి బదులుగా, సినిమా పాటలు విజువల్ ప్రమోషన్ల ద్వారా మాత్రమే సినిమాపై ఆసక్తిని పెంచడం అనే కొత్త వ్యూహాన్ని ఈ సినిమా కోసం అవలంబించి విజయం సాధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వార్ 2 ప్రచార సరళిలో కూడా ఈ సంస్థ కీలక మార్పు చేర్పులు చేసినట్టు సమాచారం. అయితే ఈ మార్పు చేర్పుల పట్ల అంతగా సంతృప్తి చెందని జూనియర్ ఎన్టీఆర్ తన చిత్రం ప్రమోషన్ బాధ్యతలను తానే స్వయంగా చేపట్టారట. యశ్ రాజ్ ఫిలింస్ వారి మార్కెటింగ్ వ్యూహాన్ని వారు అనుసరిస్తున్నారని భావించిన ఎన్టీఆర్, తన వ్యక్తిగత మీడియా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మరో టాప్ హీరోతో కలిసి చేసే మల్టీ స్టారర్స్ విషయంలో జూ.ఎన్టీయర్ మరింత జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది.ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రమోషన్ కార్యక్రమాల్లో స్టార్స్ కనిపించకపోవచ్చుననే అంచనాలతో, అభిమానులు సోషల్ మీడియా ఇతర మార్గాల ద్వారా ఈ సినిమా ప్రచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. -
చిన్న నిర్మాతలు పైసా పెంచమంటున్నారు: సి.కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికులకు వేతనాలు పెంచే ప్రసక్తే లేదని చిన్న నిర్మాతలు తేల్చి చెప్తున్నారు. గురువారం (ఆగస్టు 7) నాడు ఫిలిం ఛాంబర్లో ప్రముఖ ప్రొడ్యూసర్ సి. కల్యాణ్తో చిన్న నిర్మాతలు సమావేశమయ్యారు. 30% వేతనాలు పెంచాలన్న కార్మికుల డిమాండ్లపై చర్చించారు. అనంతరం కల్యాణ్ మాట్లాడుతూ.. చిన్న చిత్రాలు లేకపోతే ఉపాధి లేదు. చిన్న నిర్మాతలు ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు. చిన్న సినిమాలకు వేతనాల పెంపు వర్తించదు. ఒక్క పైసా కూడా పెంచేందుకు వారు సిద్ధంగా లేరు. అలా అని కార్మికులను ఇబ్బంది పెట్టాలని ఏ నిర్మాత అనుకోరు అని చెప్పుకొచ్చాడు.మా బాధ అర్థం చేసుకోరా?30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ నెరవేరేవరకు షూటింగ్స్లో పాల్గొనేది లేదంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Telugu Film Industry Employees Federation) బంద్ ప్రకటించింది. సమ్మె ఫలితంగా మూడురోజులుగా టాలీవుడ్లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నేడు నాలుగోరోజు సమ్మె కొనసాగుతోంది. సమ్మె మొదలై నాలుగు రోజులవుతున్నా మా బాధ అర్థం చేసుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. నెలలో 10 రోజులు మాత్రమే ఉపాధి ఉంటుందని, సరైన వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాన్ ఇండియా సినిమాలకు పని చేయించుకుంటున్నారని, సకాలంలో జీతాలు ఇవ్వట్లేదని వాపోయారు.చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మిని ఆటాడుకున్న అల్లు అర్హ -
మరో లవ్స్టోరీతో రాబోతున్న మణిరత్నం.. హీరో ఎవరంటే?
జయాపజయాలు అనేవి ఎవరి చేతుల్లోనూ ఉండవు. ఇంకా చెప్పాలంటే అపజయాలను ఎదుర్కోని మనిషే ఉండడు. సినిమా రంగం ఇందుకు అతీతం కాదు. ముఖ్యంగా మణిరత్నంకు ఇండియన్ ఏస్ డైరెక్టర్ అనే పేరు ఉంది. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు అలాంటివి. ఓ నాయకన్, ఒక దళపతి ,ఒక ముంబాయి ఇలా చెప్పుకుంటూ పోతే మణిరత్నం దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలు చాలానే ఉన్నాయి. ఇటీవల కూడా పొన్నియన్ సెల్వన్ అంటే చారిత్రిక కథా చిత్రాన్ని ఆయన అద్భుతంగా సెల్యులాయిడ్పై ఆవిష్కరించారు. అలాంటి దర్శకుడు తాజాగా దర్శకత్వం వహించిన థగ్లైఫ్ చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయనపై విమర్శల దాడే జరిగింది. అలాగని మణిరత్నం కృంగిపోలేదు. అలాగైతే ఆయన అన్ని సూపర్ హిట్ చిత్రాలను అందించే వారే కాదు.తాజాగా మరో యూత్ ఫుల్ లవ్స్టోరీతో రావడానికి సిద్ధమవుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. అందుకు ఆయన యువ నటుడు, స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ను కథానాయకుడిగా ఎంచుకున్నట్లు, కథానాయిక రుక్మిణి వసంత్ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ధ్రువ్ విక్రమ్ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈయన మారిసెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. క్రీడా నేపథ్యంగా రూపొందుతున్న బైసన్ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. కాగా తదుపరి ధ్రువ్విక్రమ్ మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రుక్మిణి వసంత్ జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రాన్ని సెప్టెంబర్లో సెట్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా త్వరలో వెలుపడే అవకాశం ఉంది. -
నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మిని ఆటాడుకున్న అల్లు అర్హ
మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) మాట్లాడే విధానంపై చాలామంది సరదాగా జోకులేస్తుంటారు. ఆమె యాస.. తెలుగు భాషను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్లుగా ఉంటుందని అంటుంటారు. తెలుగును ఖూనీ చేస్తున్నావని విమర్శించేవాళ్లు కూడా లేకపోలేదు. అయితే లక్ష్మి మాటల్ని చూశాక అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అర్హకు ఓ డౌట్ వచ్చింది.ఎన్నాళ్లుగానో వెయిటింగ్తనసలు తెలుగమ్మాయేనా? అన్న ప్రశ్న మదిలో మెదిలింది. మంచు లక్ష్మి కనిపిస్తే అడిగేయాలని ఎన్నాళ్లుగానో వేచి ఉన్నట్లుంది. ఇన్నాళ్లకు ఆ సమయం రానే వచ్చింది. తాజాగా మంచు లక్ష్మి.. సరదాగా కాసేపు బన్నీ ఇంటికి వెళ్లింది. పిల్లలంటే ఇష్టమని చెప్పే ఆమె అర్హ (Allu Arha)తో కబుర్లాడకుండా ఉంటుందా? తనను కూర్చోబెట్టుకుని ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలోనే నన్నేదో అడగాలనుకున్నావంట కదా.. ఏంటది? అని ప్రశ్నించింది. ఎందుకంత డౌట్?అందుకు అర్హ.. నువ్వు తెలుగువేనా? అని నవ్వుతూనే క్వశ్చన్ వేసింది. ఊహించని ప్రశ్నకు అవాక్కయిన మంచు లక్ష్మి.. నేను తెలుగే (తెలుగమ్మాయినే) పాప.. నీకంత డౌట్ ఎందుకొచ్చింది? నీతో తెలుగులోనే కదా మాట్లాడాను అని నవ్వేసింది. అయినా ఎందుకలా అడిగావు? అనగా నీ యాక్సెంట్ అట్లానే ఉంది అని నవ్వుతూ బదులిచ్చింది అర్హ. దీంతో లక్ష్మి.. నీ యాస కూడా అలాగే ఉందంటూ అర్హను పట్టుకుని నవ్వేసింది. ఈ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇన్స్టాగ్రామ్స్టోరీలో షేర్ చేసింది. LMAO, arha got not chills 🤣😭[ #AlluArjun • #AlluSnehaReddy • #AlluArha ] pic.twitter.com/8V2zDf027l— Reshmaˢᵃⁱʸᵃᵃʳᵃ ᵉⁿᵗʰᵘˢⁱᵃˢᵗ (@_Reshma_Classy) August 7, 2025 చదవండి: విడాకుల బాటలో మరో సీనియర్ హీరోయిన్! -
సలాం అనాలి సాంగ్ టీజర్: డ్యాన్స్ ఇరగదీసిన స్టార్స్.. కానీ..!
హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కు పరిచయమవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇకపోతే చిత్రయూనిట్ ఆన్లైన్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.ఆన్లైన్ ప్రమోషన్స్ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లు అంటూ హంగామా చేయకుండా సోషల్ మీడియాలోనే ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. వార్ 2 మూవీలోని తన పోస్టర్తో ఉన్న బిల్బోర్డ్ను హృతిక్ ఇంటికి పంపించాడు. ఈ యుద్ధాన్ని మాతో గెలవలేరు అంటూ హీరోకు సవాలు విసిరాడు. అందుకు హృతిక్.. తన పోస్టర్ ఉన్న బిల్బోర్డ్ను తారక్ ఇంటికి పంపాడు. మీరు నాటునాటు డ్యాన్స్ ఎంత చేసినా.. ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే అని రిప్లై ఇచ్చాడు. అలా వీరి మధ్య సోషల్ మీడియాలో సరదా వార్ జరుగుతోంది.ఫుల్ సాంగ్ కావాలంటే..తాజాగా ఈ యుద్ధాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడుతూ స్టెప్పులేశారు. జనాబే ఆలి (తెలుగులో సలాం అనాలి) పాటకు స్టైలిష్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ఎప్పుడనుకుంటున్నారా? ఆగస్టు 14న.. యూట్యూబ్లో కాదు.. ఏకంగా థియేటర్లోనే ఫుల్ సాంగ్ చూసేయండని చెప్తున్నారు. ఏదేమైనా పాట మాత్రం అదిరిపోయిందంటున్నారు. The dance WAR you’ve been waiting for is almost here. Here’s the tease... #JanaabeAali full song in theatres only! pic.twitter.com/iUgdEWZbJ1#War2 releasing in Hindi, Telugu and Tamil in cinemas worldwide on 14th August.@ihrithik | @advani_kiara | #AyanMukerji | @ipritamofficial…— Jr NTR (@tarak9999) August 7, 2025 చదవండి: ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు -
ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు : తమన్నా
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న చాలామంది కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లే. అవమానాలను భరించి, అవకాశం వచ్చినప్పుడు తమ టాలెంట్ని నిరూపించుకున్నవాళ్లే ఇప్పుడు స్టార్స్గా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో తమన్నా(Tamanna Bhatia ) కూడా ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ మిల్కీ బ్యూటీ.. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిదట. చాలామంది తనను అవమానించి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలినాళ్లలో తనకు ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పింది. తనకు అసౌకర్యంగా ఉందని చెప్పినందుకు ఓ స్టార్ హీరో కేకలు వేసి.. తన స్థానంలో మరో నటిని తీసుకోవాలని ఆదేశించారట.(చదవండి: విడాకుల బాటలో మరో సీనియర్ హీరోయిన్!)‘చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను కాబట్టి నాకేమి తెలియదని చాలా మంది అనుకున్నారు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. చాలాసార్లు నన్ను అవమానించేందుకు ప్రయత్నంచారు. కెరీర్ ప్రారంభంలో సౌత్కి చెందిన ఓ పెద్ద హీరోకి జోడిగా నటించే అవకాశం వచ్చింది. ఆయనతో కొన్ని సీన్లలో నటించాల్సి వచ్చినప్పుడు నాకు కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పి.. నాకు ఇబ్బందిగా ఉంది చేయలేనన్నాను. వెంటనే ఆ స్టార్ వచ్చి నాపై కేకలు వేశాను. దర్శక నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘హీరోయిన్ని మార్చేయండి’ అన్నారు. అప్పుడు నేను కాస్త బాధ పడ్డాను కానీ తిరిగి ఆ హీరోని ఏమి అనలేదు. మౌనంగా ఉండిపోయాను. మరుసటి రోజు ఆ స్టార్ హీరోనే నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. కోపంలో అలా అరిచానని, అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపపడ్డాడు’ అని తమన్నా చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో పేరు చెప్పడానికి మాత్రం నిరాకరించింది.(చదవండి: 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి.. 'మగవాడ్ని ఇలాంటి ప్రశ్నలు అడగ్గలరా?')తమన్నా సీనీ కెరీర్ విషయానికొస్తే.. 2005లో ‘చాంద్ సా రోష్ చెహ్రా’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచు మనోజ్ శ్రీ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. హ్యాపీడేస్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. చిరంజీవి, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలతో పాటు మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసింది. ఆ మధ్య ఓదెల 2 మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. -
నేను హీరో అనుకోవడం లేదు: ప్రవీణ్
‘‘హాస్యనటులు హీరోగా మారితే కమెడియన్గా అవకాశాలు తగ్గిపోతాయని అంటుంటారు. అయితే నన్ను నేను హీరోగా భావిస్తే అలాంటి భావన ఇతరుల్లోనూ వస్తుంది. కానీ, ‘బకాసుర రెస్టారెంట్’ చిత్రంలో నేను లీడ్ రోల్ చేశాననే భావనతో ఉన్నాను. అందుకే ప్రస్తుతం ‘విశ్వంభర, ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర, లెనిన్, ఆకాశంలో ఓ తార’ వంటి చిత్రాలతో నటుడిగా బిజీగా ఉన్నాను’’ అని ప్రవీణ్ అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ప్రవీణ్ హీరోగా నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్జే శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్ చేశారు. లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రవీణ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బకాసుర రెస్టారెంట్’ చిత్రం ఐదుగురు బ్యాచిలర్స్ పాత్రలతో నడుస్తుంది. ఇందులో కథను నడిపించే పరమేష్ అనే పాత్రలో కనిపిస్తాను. నా పాత్రలో వినోదం, భావోద్వేగం ఉంటాయి. ఇకపైనా అన్ని రకాల పాత్రలు చేస్తాను. అయితే లీడ్ రోల్ చేయాలంటే పూర్తి వినోదాత్మక కథ ఉండాలి. ఎందుకంటే నాలాంటి కమెడియన్స్ నుంచి ప్రేక్షకులు వినోదాన్ని ఆశిస్తారు’’ అని తెలిపారు. -
రేణూ దేశాయ్ కీలక పాత్రలో ‘బ్యాడ్ గాళ్స్’.. అమ్మోరులా అమ్మాయిలు!
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్ సూర్య, మొయిన్ కీలక పాత్రధారులు. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ – ‘‘బ్యాడ్ గాళ్స్’లోని నటీనటులు, సాంకేతిక నిపుణులు నాకు పరిచయం ఉన్నవాళ్లే. ఈ మూవీ పెద్ద హిట్టవ్వాలి’’ అని కోరారు. ‘‘నా మిత్రుడు మున్నా కష్టానికి తగ్గ ఫలితం రావాలి’’ అన్నారు కృష్ణ చైతన్య. ‘‘నలుగురు కొత్త అమ్మాయిలను పెట్టి సినిమా చేయడం సాహసమే’’ అని శివ నిర్వాణ చెప్పారు. ‘‘అమ్మాయిలకు పెళ్లికి ముందు ఉండే స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలామంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశాను. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంగా ఓ అమ్మోరులా పెంచాలి’’ అని మున్నా చెప్పారు. ‘‘కుటుంబంతో సహా ప్రేక్షకులు మా సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
విడాకుల బాటలో మరో సీనియర్ హీరోయిన్!
సినీరంగంలో సెలబ్రిటీస్ పెళ్లి పెద్ద వార్త అయితే విడిపోవడం కూడా పెద్ద వార్తగా మారుతోంది. ఇటీవల ధనుష్, రవిమోహన్ వారి సంసార జీవితం విడాకులకు దారి తీయడం పెద్ద సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇలా మరికొన్ని సినీ జంటల్లో విడిపోయిన వారు ఉన్నారు. కాగా తాజాగా మరో సినీ జంట ఈమధ్య ఏర్పడ్డ అభిప్రాయభేదాలు విడాకుల వైపు దారితీస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ జంటే ఫరెవర్ బహుభాషా నటి సంగీత, గాయకుడు, నటుడు క్రిష్. తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికిగా పేరుగాంచిన నటి సంగీత. తెలుగు తమిళం భాషల్లో ప్రముఖ నటుల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట మలయాళ చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించిన సంగీత ఆ తర్వాత కన్నడం, తెలుగు, తమిళ భాషల్లో నటించారు. ముఖ్యంగా తమిళంలో విక్రమ్ సరసన నటించిన పితామగన్ చిత్రం సంగీతకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అలా కథానాయకిగా నటిస్తున్న సమయంలోనే 2009లో గాయకుడు క్రిష్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ప్రస్తుతం 46 ఏళ్ల సంగీత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు. కాగా పదహారేళ్లు సాఫీగా, సుఖసంతోషాలతో సాగిన వీరి వివాహ జీవితంలో ఇప్పుడు ముసలం పుట్టిందని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మనస్పర్థల కారణంగా సంగీత, క్రిష్ విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్స్టాలో పేరు మార్పుసంగీత తన ఇన్స్టా ఖాతాలో పేరు మార్చడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లైయింది. గతంలో ఇన్స్టాలో సంగీత క్రిష్ అని ఉండేది. కానీ ఇప్పుడు సంగీత యాక్ట్గా బయో మారింది. దీంతో వీరి మధ్య నిజంగానే మనస్పర్థలు వచ్చాయంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ విడాకుల ప్రచారంలో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై సంగీతగానీ, క్రిష్గానీ స్పందిస్తే గాని నిజం బయటపడే అవకాశం ఉంది.సంగీత సినీ కెరీర్ విషయానికొస్తే.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ టాలెంటెడ్ నటి.. మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మహేశ్ బాబుకు అత్త పాత్ర.. రష్మిక మందన్నాకు తల్లిగా సంగీత నవ్వులు పూయించింది. ఆ తర్వాత మసూద తో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం కొన్ని రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. -
ఒకే రోజు 15 సినిమాలు.. దర్శకులు వీళ్లే
ఒకే రోజు 15 సినిమాలకు శ్రీకారం చుడుతూ ప్రపంచ రికార్డు సాధించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న భీమవరం టాకీస్ అధినేత - శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ వెనుక తాము ఉంటామని తెలిపారు... ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, సీనియర్ హీరో సుమన్, ప్రఖ్యాత రచయిత జె.కె.భారవి. ఈనెల (ఆగస్టు) 15న హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఒకేసారి ప్రారంభమై ప్రపంచ రికార్డు" నెలకొల్పనున్న 15 సినిమాలకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరంతా సంఘీభావం తెలిపారు.ఈ 15 చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుమన్ ప్రకటించగా... ఈ 15 చిత్రాల్లో యండమూరి సినిమా మినహా... మిగతా సినిమాలకు తాను స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరించి తగిన సలహాలు, సూచనలు ఇస్తానని జె.కె.భారవి పేర్కొన్నారు. రామసత్యనారాయణను చూసి తాను గర్వపడుతుంటానని రేలంగి తెలిపారు. ఈ 15 చిత్రాలకు స్టూడియో పార్టనర్ గా ఉండే అవకాశం లభించడం గర్వంగా ఉందన్నారు కె.ఎల్. ఫిల్మ్ స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్. కెరీర్ బిగినింగ్ లొనే 12 నెలల్లో 13 సినిమాలు తీసి, విడుదల చేసి రికార్డు క్రియేట్ చేసిన తనకు...ఒకేసారి 15 సినిమాలు స్టార్ట్ చేసి, ఏడాదిలోపు పూర్తి చేసి విడుదల చేయడం ఎంతమాత్రం కష్టసాధ్యం కాదని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ఈ 15 సినిమాల్లో... యండమూరి వీరేంద్రనాధ్ వంటి మహా రచయిత చిత్రంతోపాటు... జె.కె.భారవి వంటి మహాజ్ఞాని చిత్రం... ప్రఖ్యాత దర్శకుడు ఓం సాయి ప్రకాష్ చిత్రం ఉండడం చాలా గర్వంగా ఉందని తుమ్మలపల్లి చెప్పారు. ఈ 15 చిత్రాల్లో కేవలం రెండుమూడు చిత్రాలు ప్రజాదరణకు నోచుకున్నా... తాను పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని ఆయన వివరించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించే 15 సినిమాల దర్శకులు వీళ్లేయండమూరి వీరేంద్రనాథ్ సాయి ప్రకాష్జె.కె. భారవిఉదయ భాస్కర్తల్లాడ సాయి కృష్ణసంగ కుమార్శ్రీరాజ్ బళ్ళచిన్నిమోహన్ కాంత్హర్షఎకారి సత్యనారాయణకార్తిక్బి. శ్రీనివాసరావుప్రణయ్రాజ్ వంగరిసతీష్ (PhD) -
భార్యకు వండి పెడతా.. పిల్లల కోసమే ఆ పద్ధతి మార్చుకున్నా: తారక్
దేవర సినిమాతో సూపర్ హిట్టందుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వార్ 2తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. వచ్చేవారమే (ఆగస్టు 14న) ఈ మూవీ బాక్సాఫీస్లో సందడి చేయనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా తారక్.. ఈస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.అది నా ఫేవరెట్ముందుగా బాలీవుడ్లో ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. నేను ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోను. కుంగ్ఫు పాండా సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. 'నిన్న ఒక చరిత్ర- రేపు ఓ రహస్యం- నేడు అనేది ఓ బహుమతి'. ఇది నా ఫేవరెట్. నేను గతం గురించి, జరగబోయేదాని గురించి ఆలోచించను. వర్తమానంపైనే ఫోకస్ చేస్తాను. వార్ 2 సినిమా విషయానికి వస్తే.. కథ నాకు బాగా నచ్చింది. అలాగే హృతిక్ సర్తో పని చేయాలన్న ఉత్సుకత వల్లే వార్ 2 మూవీకి ఓకే చెప్పాను.నెలంతా షూటింగ్స్కే..మొదట్లో ఫ్యామిలీని పక్కనపెట్టి మొత్తం సినిమాలకే పరిమితమయ్యాను. వారంలో ఏడురోజులు షూటింగ్కు వెళ్లేవాడిని. అంటే నెలలో 30 రోజులు షూటింగ్స్కే కేటాయించేవాడిని. కానీ, ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుంటున్నాను. ఆదివారం సెలవు తీసుకుంటున్నాను. నా పిల్లలు అభయ్, భార్గవకు సమయం కేటాయిస్తున్నాను. ఎందుకంటే వారితో నేను సరదాగా, ప్రశాంతంగా గడిపేది ఆ ఒక్కరోజే! వాళ్లకు నచ్చింది చేయనిస్తానా పిల్లలు కూడా నాలాగే యాక్టర్స్ కావాలని ఎప్పుడూ చెప్పను. అది చేయాలి, ఇది చేయాలని ఆదేశించడానికి బదులుగా వారు కోరుకున్న స్థాయికి చేరేందుకు వారధిలా నిలబడతాను. ఇకపోతే నాకు వంట చేయడం ఇష్టం. నా భార్య లక్ష్మీ ప్రణతికి ప్రేమగా వండిపెడతాను. తనకే కాదు, నా స్నేహితుల కోసం, నా చుట్టూ ఉన్నవారి కోసం రుచికరంగా వంట చేస్తుంటాను. నాకు బిర్యానీ ఇష్టమైన వంటకం అని తారక్ చెప్పుకొచ్చాడు.చదవండి: నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం! -
ఓలే ఓలే.. అన్ని బూతులే.. రవితేజ పాటపై విమర్శలు!
ఓలే ఓలే గుంటనీ అయ్యకాడ ఉంటానీ అమ్మకాడ తింటానీ వొళ్ళోకొచ్చి పంటాబుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదుమంచి లేదు మర్యాద లేదుఅంగీ లేదు లుంగీ లేదు పంచె లేదుతాడు లేదు బొంగరం లేదునీ అమ్మని నీ అక్కని నీ తల్లిని నీ చెల్లిని... పట్టుకుని కాళ్లు మొక్కి పోతాచదువుతుంటే ఇవేవో బూతు పదాల్లా అనిపిస్తున్నాయి కదా?.. కానీ ఇవి ఓ సినిమాలో ఉన్న జానపద గీతం లిరిక్స్. ఓ స్టార్ హీరో ఈ పాటకు స్టెప్పులేశాడు. నెట్టింట ఈ పాట తెగ వైరల్ అవుతుంది. కొంతమంది హీరోహీరోయిన్ల స్టెప్పులను ఎంజాయ్ చేస్తుంటే..మరికొంతమంది మాత్రం లిరిక్స్పై తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నారు. జానపద పాట పేరుతో బూతు పాటలు వినిపిస్తున్నారంటూ మండిపడుతున్నారు. #MassJathara songగుంట.. ఉంట.. పంట.. తింటా..నీ అమ్మని.. అక్కని.. చెల్లిని.. పట్టుకుని.....బుద్ది లేదు.. జానం లేదు.. సిగ్గు లేదు.. శరం లేదు..అంగీ లేదు.. లాగు లేదు.. లుంగీ లేదు.....Ole Ole లిరిక్స్..😡స్పెషల్ సాంగే కానీ వినడానికి దరిద్రంగా ఉంది.🤦#RaviTeja #Sreeleela pic.twitter.com/2i9RIBxOSp— Usha Rani Seetha (@RaniUshaa) August 6, 2025రవితేజ-శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ లో ఈ ఫోక్ సాంగ్ ఉంది. నిన్న పాటను విడుదల చేయగా.. కొన్ని గంటల్లోనే అది వైరల్ అయింది. యూట్యూబ్లో భారీ వ్యూస్తో దూసుకెళ్తోంది. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం లిరిక్స్పై మండిపడుతున్నారు. 'నీ యమ్మ...అక్క, తల్లి, చెల్లి...' 'బుద్ది, జ్ఞానం సిగ్గు, శరం లేదు...' లాంటి బూతులతోనే పాటని కంపోజ్ చేయడం, దానికి రవితేజ లాంటి స్టార్ హీరో డ్యాన్స్ చేయడం దారుమని కామెంట్ చేస్తున్నారు. ‘జానపదం లో ఇలాంటి పదాలు అసలు బూతులు కావంటూ మరికొంతమంది రవితేజకు సపోర్ట్గా పోస్టులు పెడుతున్నారు. Me listening to Ole Ole Song be like ....#MassJathara #OleOle #RaviTeja #Sreeleela pic.twitter.com/pgu1UQmtcD— Tharun Tej Musical Audios🎧💥 (@TejaTeja47057) August 5, 2025 ఈ మధ్య సినిమాలో జానపద పాటలు ఎక్కువగా వాడేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఫోక్ సాంగ్కి స్టెప్పులేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు తెలంగాణ ఫోక్ సాంగ్స్ మాత్రమే సినిమాల్లో కనిపించేవి. ఇప్పుడు ఉత్తరాంధ్ర జానపద పాటలకు కూడా స్టార్స్ స్టెప్పులేస్తున్నారు. అవి బాగా వర్కౌట్ అవుతున్నాయి కూడా. అందుకే తాజాగా రవితేజ కూడా ఓ ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్కి స్టెప్పులేశాడు. రోహిణితో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ పాటను పాడాడు. Song ki baaga negative response vachindhi bro try changing the lyrics @vamsi84 or shorten the duration of the song. #OleOle #MassJathara https://t.co/54GSRaEnwK— EAGLE 🦅 (@RT_Zealot) August 6, 2025 -
నేను వాటిని మాత్రమే ప్రమోట్ చేశా.. విజయ్ దేవరకొండ
సాక్షి, హైదరాబాద్: 'నేను కేవలం గేమింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశాను, బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోట్ చేయలేదు' అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్లో భాగంగా చేసిన కాంట్రాక్ట్, తీసుకున్న డబ్బు.. సహా అన్ని వివరాలను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులకు ఇచ్చానని తెలిపాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదుబెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే! ఈ కేసులో విచారణకు రమ్మంటూ విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే బుధవారం ఆయన ఈడీ ఎదుట హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సుమారు నాలుగు గంటలపాటు హీరోను విచారించారు. విచారణ అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడాడు. బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో విచారణకు పిలిచారు. కానీ నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. గేమింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశాను.విచారణకు సహకరించా..A23 అనేది గేమింగ్ యాప్. చాలా రాష్ట్రాల్లో గేమింగ్ యాప్స్ లీగల్. వీటికి జీఎస్టీ, ట్యాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్.. ఇలా అన్నీ ఉంటాయి. ఈ గేమింగ్ యాప్స్.. ఐపీఎల్, కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్స్కు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ అనేది తెలంగాణలో ఓపెన్ అవ్వదు. నా బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన పత్రాలన్నింటినీ ఈడీకి ఇచ్చాను. అధికారుల విచారణకు సహకరించాను అని పేర్కొన్నాడు.చదవండి: నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం! -
ఓటీటీలో హారర్ వెబ్ సిరీస్.. ఎప్పటినుంచంటే?
హారర్ సినిమాలకు క్రేజ్ ఎప్పుడూ ఉండేదే! తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ హారర్ వెబ్ సిరీస్ను ప్రకటించింది. అదే "అంధేరా" (Andhera). ఈ వెబ్ సిరీస్ను ఆగస్టు 14 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అంధేరా విషయానికి వస్తే.. ప్రియా బాపత్, కరణ్వీర్ మల్హోత్రా, ప్రజక్త కోలి, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. గౌరవ్ దేశాయ్ కథ అందించగా రాఘవ్ దర్ దర్శకత్వం వహించాడు. ఇది ఎనిమిది ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. Brace yourself, this Andhera doesn’t just haunt, it hunts 🫣#AndheraOnPrime, New Series, Aug 14 pic.twitter.com/vg5IAB3TgX— prime video IN (@PrimeVideoIN) August 6, 2025 చదవండి: 'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్ -
నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం!
మాతృత్వాన్ని కోరుకోని మహిళ ఉంటుందా? ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఓ వయసు దాటాక తల్లి కావాలని కోరుకుంటుంది. కన్నడ నటి భావన రామన్న (Bhavana Ramanna) కూడా అదే ఆశించింది. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశపడింది. 40 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. ఇంతవరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. వివాహానికి దూరంగా ఉన్న ఆమె సింగిల్ మదర్గానే పిల్లలను పెంచేందుకు సిద్ధమవుతోంది. సీమంతంలో అలాంటి ప్రశ్నలుతాజాగా ఆమె సీమంతం జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు ఈ ఫంక్షన్కు హాజరై ఆమెను దీవించారు. అయితే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించినప్పటి నుంచి కొందరు అదేపనిగా అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారంటోంది భావన. ఆమె మాట్లాడుతూ.. నా సీమంతం వేడుక ఎంతో సంతోషంగా జరిగింది. అయితే కొందరు అనవసరమైన ప్రశ్నలు వేయడమే నన్ను షాక్కు గురి చేసింది. ఇంకా ఛాన్స్ ఉన్నప్పుడు పెళ్లెందుకు చేసుకోలేదన్నారు. నా ఇష్టంమరికొందరేమో పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశం ఒకటుంది, మర్చిపోయావా? అని ఎద్దేవా చేశారు. నేను నా జీవితంలో సంతోషకర క్షణాల్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా? ఇవే ప్రశ్నలు మగవాడిని అడగ్గలరా? నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటాను. అందుకు మీకేంటి అభ్యంతరం? నా జీవితం నా ఇష్టం. సమాజంలో చాలావాటిలో మార్పొచ్చింది. ఏం చేసినా తప్పే!కానీ, ఇప్పటికీ మహిళ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఏం చేసినా తప్పుపడుతూనే ఉన్నారు. ఈ విషయంలో మార్పు రావాలి. వెనకటి కాలంలో సంతానం లేని మహిళలను పండగలకు, శుభకార్యాలకు దూరంగా ఉంచేవారు. అది చూసి నా మనసు చివుక్కుమనేది. ఐవీఎఫ్ వంటి ఆధునాతన పద్ధతులు.. అలాంటివారిలో ఓ కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. నీచమైన కామెంట్లుదానిపై కూడా విమర్శలా? ప్రతిదాన్నీ తప్పుపట్టడం, నీచమైన కామెంట్లు చేయడం మానండి. ఈ ఆన్లైన్ ట్రోలింగ్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. కన్నడలో అనేక సినిమాలు చేసిన భావన రామన్న తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా మలయాళంలో ఒట్ట మూవీ చేసింది. తెలుగులో అమ్మాయి నవ్వితే (2001) అనే ఏకైక మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana Ramanna (@bhavanaramannaofficial) చదవండి: 'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్ -
'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్
సమాజం నాకెంతో ఇచ్చింది.. మరి సమాజానికి నేనేం ఇచ్చాను? అని ఆలోచించేవారు కొద్దిమందే ఉంటారు. వారిలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ముందు వరుసలో ఉంటాడు. నిరుపేద విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలన్న సంకల్పంతో సూర్య.. అగరం పేరిట ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశాడు. తమిళనాడులో పేద, వెనుకబడిన సామాజిక విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఈ సంస్థ తోడ్పడుతుంది. ఇటీవలే ఈ సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.నా జీవితం ఓ సినిమా కథఈ కార్యక్రమంలో ఓ యువతి.. అగరం ఫౌండేషన్ వల్ల తన జీవితమే మారిపోయిందని స్పీచ్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. నాపేరు జయప్రియ. ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నాను. నా జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. మొదట్లో ఆ సంతోషం అన్న పదమే మా జీవితాల్లో లేదు. అదెందుకో మీకు చెప్తాను. ఇదొక సినిమాకథలా అనిపించొచ్చు. మాది చిన్న ఊరు. ఆ ఊరి పేరు అగరం. ఆ గ్రామంలో ఓ తాగుబోతు తండ్రి ఉండేవాడు. పూరి గుడిసెలో జీవితంఅతడితో తాగుడు మాన్పించలేక భార్య మౌనంగా ఏడుస్తూ ఉండేది. వీరికి ఇద్దరు కూతుర్లు. వాళ్లది మట్టి గోడలతో కట్టిన ఇల్లు (పూరి గుడిసె). తాటాకులే ఇంటి పైకప్పు. వర్షం వచ్చిందంటే నీళ్లన్నీ ఇంట్లోకి వచ్చేవి. ఆ ఇంటికి పాములు చుట్టాల్లా తరచూ వస్తుండేవి. ఇదే నా జీవితం. కరెంటు లేదు. ఇంటికి మంచినీటి కనెక్షన్ లేదు. కానీ చదువుకోవాలన్న కోరిక మాత్రం నాకు బలంగా ఉండేది. చదువులోనూ ముందుండేదాన్ని. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేదాన్ని.నెక్స్ట్ ఏంటి?కొంతకాలానికి మేమున్న ఇల్లు కూలిపోయింది. అమ్మానాన్న నిరుపేదలు. ఏమీ చేయలేకపోయారు. చూస్తుండగానే 12వ తరగతి పూర్తి చేశాను. కాలేజీ టాపర్గా నిలిచాను. తర్వాతేం చేయాలో తోచలేదు. మా మేడమ్ అగరం ఫౌండేషన్ నెంబర్ ఇచ్చింది. వాళ్లు నాకు సాయం చేస్తారంది. 2014లో అగరం ఫౌండేషన్కు కాల్ చేశాను. అప్పుడే నా జీవితం ఆనందంగా ముందుకుసాగింది.గోల్డ్ మెడల్మంచి కాలేజీలో చేర్పించారు. కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. అన్నా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నాను. తర్వాత టీసీఎస్లో చేరాను. కొంతకాలానికి ఇన్ఫోసిస్కు మారాను. నాకున్న ఏకైక కల సొంతిల్లు. నేను సంపాదించిన డబ్బుతో మంచి ఇల్లు కట్టాలి. అందులో అమ్మానాన్న ప్రశాంతంగా నిద్రించాలి. అగరం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. పెద్ద ఇల్లు కట్టాను. గర్వంగా చెప్తున్నాఒకటి కాదు ఇప్పుడు నాకు రెండు ఇండ్లున్నాయని గర్వంగా చెప్తున్నాను. దీనంతటికీ కారణం అగరం ఫౌండేషన్. ఆడపిల్లలకు చదువెందుకు అని ఇప్పటికీ కొందరు అంటుంటారు. అమ్మాయిలను చదవనివ్వండి. చదివితేనే కదా ఏదో ఒకటి చేయగలం అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు సూర్య కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆమె విజయాన్ని అభినందిస్తూ లేచి చప్పట్లు కొట్టాడు.చదవండి: నీ సినిమాలు ఆడవ్ అని ప్రొడ్యూసర్ మొహం మీదే చెప్పాడు -
‘డేవిడ్ రెడ్డి’గా మంచు మనోజ్.. పోస్టర్తో అంచనాలు పెంచేశారే!
వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో 21 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. దీనికి ‘డేవిడ్ రెడ్డి’ అనే టైటిల్ పెట్టినట్లు ప్రకటిస్తూ.. పోస్టర్ని విడుదల చేశారు.ఈ హిస్టారికల్ యాక్షన్ సినిమాకు హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నాడు. 1897 - 1922 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందనుంది. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు అంశాలతో ఉత్కంఠభరితమైన కథతో సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో మనోజ్ మంచు ఇంతకు ముందు ఎన్నడూ చూడని అవతారంలో కనిపించనున్నారు. బ్రిటిష్ పాలనను సవాలు చేయడానికి కుల అణచివేత నుంచి లేచిన ధైర్యవంతుడైన తిరుగుబాటు దారుడిగా కనిపించబోతున్నాడట. టైటిల్ పోస్టర్తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు."మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించాడు, ఢిల్లీలో పెరిగాడు. ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు" అంటూ మేకర్స్ ఇచ్చిన రైటప్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంతో పాటు ‘మిరాయ్’, వాట్ ది ఫిష్లోనూ మనోజ్ నటిస్తున్నారు.With a heart full of gratitude… 🙏Today marks 21 years of my journey in cinema. I feel truly blessed to be still doing what I love.And with the same love and hope, sharing my 21st film titled #DavidReddy ❤️🔥A raw, intense, high-octane historical action drama set between… pic.twitter.com/aRZhjoL1jx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 6, 2025 -
వయసు గురించి మాట్లాకండి.. హీరోయిన్ ఫైర్
పాన్ ఇండియా కథానాయకగా పేరు తెచ్చుకున్న నటి మాళవిక మోహన్. ముఖ్యంగా మలయాళం తమిళం తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె ఏ తరహా పాత్రలోనైనా ఒదిగిపోయి నటించగల సత్తా కలిగిన నటి. ప్రస్తుతం ఈమె తమిళంలో కార్తీ కథానాయకుడుగా నటిస్తున్న సర్ధార్ 2 చిత్రంలోనూ, తెలుగులో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ది రాజా సాబ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా సోమవారం నటి మాళవిక మోహన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ది రాజాసాబ్ చిత్రం యూనిట్, సర్ధార్ 2 చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టల్ విడుదల చేశారు. కాగా 32 ఏళ్లు టచ్ చేసిన మాళవిక మోహన్ మలయాళంలో మోహన్ లాల్ కు జంటగా హృదయ పూర్వం అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా మోహన్ లాల్ వయసు 64 ఏళ్లు ఆయనకు జంటగా 32 ఏళ్ల మాళవిక మోహన్ నటించడంతో సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. వాటిపై స్పందించిన మాళవిక మోహన్ నటీనటుల వయసు గురించి గానీ, వయసు వ్యత్యాసం గురించి గానీ మాట్లాడకండి అంటూ హెచ్చరించారు. ముందు ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం ఆపేయండి అంటూ సినిమాలో ప్రతిభను చూడాలి గానీ అర్థం లేని విషయాల గురించి ఆరాలు తీయరాదనే అభిప్రాయాన్ని మాళవిక మోహన్ వ్యక్తం చేశారు. -
Mass Jathara: ‘ఓలే ఓలే' పాట రిలీజ్.. రవితేజ, శ్రీలీల డ్యాన్స్ అదుర్స్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. కర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి గీతంగా విడుదలైన 'తు మేరా లవర్' అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండవ గీతంగా 'ఓలే ఓలే'ను విడుదల చేసింది చిత్ర బృందం. అందరూ కాలు కదిపేలా ఎంతో ఉత్సాహభరితంగా ఈ గీతముంది.ధమాకా జోడి రవితేజ-శ్రీలీల తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. 'ఓలే ఓలే' పాటతో ఈ జోడి మరోసారి ఆకట్టుకుంది. ఇద్దరూ పోటాపోటీగా నర్తించి పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. రవితేజ తన వింటేజ్ స్టెప్పులతో అలరించారు. శ్రీలీల తన అసాధారణ నృత్య ప్రతిభతో మరోసారి కట్టిపడేశారు. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తెరపై మెరుపులు మెరిపిస్తున్నారు. -
టాలీవుడ్ డైరెక్టర్తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సినిమా!
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త్వరలోనే తెలుగు తెరపై సందడి చేయనుందా? అంటే అవుననే అంటోంది టాలీవుడ్. రేస్, రైడ్, వెల్కమ్, హౌస్ఫుల్, ఫతే వంటి చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆలరించిన జాక్వెలిన్ని ‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ టాలీవుడ్కి పరిచయం చేయబోతున్నాడు. ఆయన దర్శకత్వం వహించే ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీలో జాక్వెలిన్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.జయశంకర్ ఆల్రెడీ జాక్వెలిన్కు యాక్షన్, సస్పెన్స్తో నిండిన ఒక ఇంటెన్స్ స్క్రిప్ట్ను వివరించారట. జాక్వెలిన్కు జయశంకర్ చెప్పిన పాత్ర, కథ చాలా నచ్చినట్టుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉన్నందున జాక్వెలిన్ కూడా పాత్రను పోషించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో జాక్వెలిన్ సైతం ఈ ప్రాజెక్ట్కు అనుమతి ఇచ్చినట్టుగా సమాచారం.ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని, జాక్వెలిన్ ఇది వరకు ఎప్పుడూ చూడని పాత్రలో చూడబోతోన్నట్టుగా తెలుస్తోంది. స్క్రిప్ట్లో వీఎఫ్ఎక్స్కు సంబంధించిన వర్క్ కూడా చాలా ఉందని సమాచారం. ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా థ్రిల్లింగ్ వీఎఫ్ఎక్స్ అంశాలతో చిత్రం రూపొందనుందట. జాక్వెలిన్ పాన్ ఇండియా నటి కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో నిర్మించనున్నారట. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి తీసుకెళ్లనున్నట్టుగా సమాచారం. -
ఐటీ ఎంప్లాయీస్ కన్నా సినీ కార్మికుల జీతాలే ఎక్కువ: ప్రసన్న కుమార్
‘పేద సినీ కార్మికులకు మేము వ్యతిరేకం కాదు. వారికి ఎప్పుడు అండగానే ఉంటాం’ అన్నారు నిర్మాత మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్. తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తూ, సోమవారం నుంచి బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. యూనియన్ డిమాండ్స్ని ఫిలిం ఛాంబర్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు చర్చలు జరిపారు. అనంతరం ప్రసన్న కుమార్ మీడియాతో మట్లాడుతూ..‘‘ఫిలిం ఛాంబర్తోనే ‘మా’ అసోసియేషన్ కలిసి వెళ్తుందని మంచి విష్ణు చెప్పారు. పేద సినీ కార్మికులకు మేము ఎప్పుడూ అండగానే ఉంటాం. లేబర్ యాక్ట్ ప్రకారం నిర్మాతలు ఒక్కో కార్మికుడికి భారీగానే వేతనం చెల్లిస్తుంది. ఐటీ ఎంప్లాయీస్ కన్నా యూనియన్ కార్మికులకు జీతాలు ఎక్కువ ఉన్నాయి. ఏడెనిమిది లక్షల రూపాయలు చెల్లిస్తేనే యూనియన్లో సభ్యత్వం ఇస్తున్నారు. మా కార్మికులతోనే పని చేయాలి అని యూనియన్ వాళ్ళు చెప్పడం తప్పు.కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ని కూడా ధిక్కరించి సమ్మెకు పిలుపు నిచ్చారు.ఫెడరేషన్ వాళ్ళవి ఏకపక్ష నిర్ణయాలు.మేం చట్టంపరంగా న్యాయంగా వెళ్తున్నాం. నిర్మాతల పరిస్థితే బాగోలేదు. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరికాదు. కార్మికులు కూడా మాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాం. స్వార్థ పూరిత విధానాలతో కాకుండా అందరం ఒక కుటుంబం లాగా కలసి చర్చించుకుందాం’ అని అన్నారు. -
నటుడితో కాఫీ కోసం నాయకురాలు లేఖ.. రిప్లై ఇవ్వలేదట!
రాజకీయ నాయకులు కూడా వినోదం కోసం సినిమా చూస్తుంటారు. వాళ్లకూ అభిమాన హీరోహీరోయిన్లు ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు తమ అభిమాన నటీనటులను కలుస్తుంటారు. కొంతమంది అయితే ఏ స్థాయిలో ఉన్నా.. తమ అభిమాన నటీనటులు కనిపిస్తే చాలు తమ హోదాని మరచి సాధారణ అభిమానిలాగే వ్యవహరిస్తారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎంపీ మహువా మొయిత్రా కూడా అలానే ప్రవర్తించారు. ఇండియా టుడే చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ నటుడి గురించి, అతన్ని కలిసేందుకు చేసిన ప్రయత్నాల గురించి చెబుతూ.. సిగ్గు పడిపోయింది. పార్లమెంట్లో జంకు లేకుంగా గంభీరంగా మాట్లాడుతూ ఫైర్బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మహువా మొయిత్రా.. ఇలా సిగ్గు పడుతూ మాట్లాడడం చూసి వీక్షకులు అవాక్కయ్యారు. ఇంతకీ మహువా మనసుకు నచ్చిన నటుడి పేరు చెప్పలేదు కదా.. విలక్షణమైన పాత్రలు పోషిస్తూ బాలీవుడ్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న పంకజ్ త్రిపాఠినే ఆమె ఫేవరేట్ యాక్టర్. అతనితో కలిసి కాఫీ తాగేందుకు చాలా ప్రయత్నాలు చేసిందట. చివరకు లేఖ కూడా రాశానని.. కానీ రిప్లై రాలేదని మహువా చెప్పుకొచ్చింది.యాంకర్తో కబురు..పంకజ్ త్రిపాఠి నటన అంటే నాకు చాలా ఇష్టం. బయట కూల్గా కనిపిస్తాడు కానీ తెరపై మాత్రం భయంకరమైన పాత్రల్లో కనిపిస్తాడు. మిర్జాపూర్ వెబ్ సిరీస్లో ఆయన అద్భుతమైన విలనిజం పండించాడు. ఒకసారి అతన్ని కలిసేందుకు ప్రయత్నించాడు. అతనితో కలిసి కాఫీ తాగాలని ఉందని లేఖ రాసి.. అతన్ని ఇంటర్వ్యూ చేయబోయే యాంకర్ ద్వారా ఆ లేఖని అందించాను. కానీ ఆయన నుంచి రిప్లై రాకపోవడంతో నిరాశ చెందాను.సహచర ఎంపీ సహాయంతో..ఎంపీ అయిన తర్వాత సహచర ఎంపీ, నటుడు రవి కిషన్తో నా క్రష్ గురించి చెప్పాను. పంకజ్ త్రిపాఠి నటన అంటే చాలా ఇష్టమని , ఇలా లేఖ కూడా రాశనని చెప్పాను. అతను వెంటనే ఫోన్ చేసి పంకజ్తో మాట్లాడించాడు. అతనితో మాట్లాడే సమయంలో తెలియకుండానే నేను సిగ్గుపడిపోయాను. లేఖ రాసిన విషయాన్ని కూడా గుర్తు చేశాను’ అని ఎంపీ మహువా మొయిత్రా చెప్పుకొచ్చింది.పంకజ్ త్రిపాఠి విషయానికొస్తే.. 2004లో ఆయన బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2012లో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్తో అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకవైపు వెబ్ సిరీస్లు మరోవైపు సినిమాలు చేస్తూ బీజీ ఆర్టిస్ట్గా మారిపోయాడు. ఇటీవల ఆయన మైన్ హీరా అనే సినిమాలో ఒక హీరోగా కనిపించాడు. -
‘డేంజర్’ అంటూ డ్రగ్స్పై హీరో కృష్ణసాయి పోరాటం
కృష్ణసాయి హీరోగా పీఎస్ నారాయణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డేంజర్’. పూజిత, మేకా రామకృష్ణ, రమేశ్ గుత్తుల, వెంకటేశ్వరరావు, నితీష్ ఇతర పాత్రధారులు. కృష్ణసాయి చారిటబుల్ ట్రస్ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శంభు ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఓ యువతా... నీ గమ్యం ఎటు వైపు?’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకి డైరెక్టర్ పీఎస్ నారాయణ సాహిత్యం అందించగా, రమణ సీలం ΄ాడారు. ‘‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగారి పిలుపు మేరకు మా బాధ్యతగా డ్రగ్స్ వాడొద్దంటూ యువతలో చైతన్యం కలిగించేలా మా ‘డేంజర్’ సినిమాలో ‘ఓ యువతా... నీ గమ్యం ఎటు వైపు?’ ΄ాటని చిత్రీకరించాం’’ అన్నారు కృష్ణసాయి. -
రాజాసాబ్ బ్యూటీ బర్త్డే.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan).. ప్రభాస్ "రాజా సాబ్"తో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు (ఆగస్టు 4) ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విషెస్తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో చీరకట్టులో ట్రెడిషనల్గా కనిపించి ఆకట్టుకుంటోంది మాళవిక. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన "రాజా సాబ్" టీజర్లో మాళవిక అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీలో మాళవిక నటన, అందం ప్రత్యేక ఆకర్షణ కానుంది."రాజా సాబ్" లాంటి క్రేజీ మూవీతో తెలుగు ఆడియన్స్కు పరిచయం కావడం ఎంతో స్పెషల్గా భావిస్తోంది మాళవిక మోహనన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న "రాజా సాబ్" చిత్రాన్ని డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. View this post on Instagram A post shared by @peoplemediafactory -
ఖుషి కలెక్షన్స్ దాటేసిన కింగ్డమ్.. ఎంతొచ్చాయంటే?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కింగ్డమ్ మూవీ (Kingdom Movie)కి కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి. జూలై 31న విడుదలైన ఈ సినిమా మౌత్టాక్తోనే దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.82 కోట్లు వచ్చాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ రికార్డు సాధ్యమైంది. నిన్న ఆదివారం కావడంతో వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు.ఖుషిని దాటేసిన కింగ్డమ్విజయ్ హీరోగా నటించిన ఖుషి సినిమా టోటల్ రన్లో దాదాపు రూ.75 కోట్లు వసూలు చేసింది. కింగ్డమ్ ఆ రికార్డును దాటేసింది. ఏకంగా వంద కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతోంది. కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే.. సత్యదేవ్, విజయ్ దేవరకొండ అన్నదమ్ములుగా నటించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు వెంకటేశ్ కీలక పాత్రలో నటించాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీని నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. అనిరుద్ రవించందర్ సంగీతమందించాడు. #KINGDOM continues to reign supreme 🔥#BoxOfficeBlockbusterKingdom strikes 𝟖𝟐 𝐂𝐫+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟒 𝐃𝐚𝐲𝐬💥& Holding strong across all centres even today 🤟🏻🎟️ - https://t.co/4rCYFkA5dI@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev… pic.twitter.com/PpLLjuOpIm— Sithara Entertainments (@SitharaEnts) August 4, 2025 చదవండి: సైలెంట్గా తీసుకునేందుకు ఇదేం పెన్షన్ కాదు.. ఊర్వశి ఫైర్ -
సైలెంట్గా తీసుకునేందుకు ఇదేం పెన్షన్ కాదు.. ఊర్వశి ఫైర్
మలయాళ నటి ఊర్వశి (Urvashi)కి జాతీయ అవార్డు వచ్చింది. ఉళ్లోళుక్కు చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటి పురస్కారం వరించింది. అయితే ఈ అవార్డు గెలిచినందుకు ఊర్వశికి సంతోషం కన్నా బాధే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఉత్తమ నటి పురస్కారం ఇస్తే బాగుండేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఊర్వశి మాట్లాడుతూ.. యాక్టింగ్ అంటే ఇలా ఉండాలనేమైనా కొలమానాలు రాసిపెట్టారా?పెన్షన్ కాదులేదంటే ఫలానా వయసు దాటిందంటే బెస్ట్ యాక్ట్రెస్కు బదులుగా ఇలాంటి అవార్డులే ఇవ్వాలని ఏమైనా రూల్ పెట్టారా? మరేంటిదంతా? సైలెంట్గా ఇచ్చిందేదో తీసుకునేందుకు ఇదేమీ పెన్షన్ డబ్బు కాదు. మీరు నన్ను సహాయ నటిగా ఏ లెక్కన పరిగణించారు? ఏయే విధానాలు ఫాలో అయ్యారో చెప్పండి. ఉత్తమ నటి/నటుడు పురస్కారానికి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారో వెల్లడించండి. అవార్డు ప్రకటించారంటే గర్వంతో పొంగిపోయేలా ఉండాలే తప్ప మేము తిరిగి ప్రశ్నించేలా ఉండకూడదు అని జ్యూరీ సభ్యులపై అసహనం వ్యక్తం చేసింది. జాతీయ అవార్డులు ఏ ప్రాతిపదికన ఇచ్చారో పూర్తి విచారణ జరపాలని కేంద్ర మంత్రి సురేశ్ గోపిని కోరింది.రెండుసార్లు జాతీయ అవార్డుఉళ్లోళుక్కు సినిమా ఉత్తమ మలయాళ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఇందులో ఊర్వశి లీలమ్మ పాత్ర పోషించింది. ఈ పాత్రకుగానూ ఊర్వశికి జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు వరించింది. 2006లో వచ్చిన అచ్చువింటే అమ్మ సినిమాకు సైతం ఊర్వశికి ఉత్తమ సహాయ నటి అవార్డు వచ్చింది. ఈ మూవీలో ఆమె హీరోయిన్ అయినప్పటికీ సహాయనటి పురస్కారమే గెలుచుకుంది.చదవండి: కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్? -
కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్?
సినిమా బాలేకపోతే ఎంత ప్రచారం చేసినా జనాలు అస్సలు పట్టించుకోరు. అదే కంటెంట్ నచ్చితే మాత్రం భాషతో సంబంధం లేకుండా ఎగబడి చూస్తారు. 2022లో వచ్చిన కాంతార (Kantara Movie) అనే కన్నడ సినిమా ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. దాదాపు రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాంతార బ్లాక్బస్టర్ హిట్నిర్మాతలు సినిమా హిట్టని ఊహించుంటారు కానీ ఇలా వందల రెట్ల లాభాలు వస్తాయని మాత్రం కలలో కూడా ఊహించి ఉండరు. ఈ సినిమాను రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడమే కాకుండా అందులో ప్రధాన పాత్రలో నటించాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబలే ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. ఈ బ్లాక్బస్టర్ హిట్ చిత్రానికి ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! కాంతార 3లో తారక్?ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. అంటే ఇది ఫస్ట్ పార్ట్ కాగా, ఇప్పటికే రిలీజైంది రెండో పార్ట్ అన్నమాట! తాజాగా ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రిషబ్ శెట్టి కాంతార 3 కూడా తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడని, అందులో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా భాగం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ రూమర్ కనక నిజమైతే అభిమానులకు మాత్రం పండగే! సినిమా..ప్రస్తుతం ఎన్టీఆర్.. వార్ 2 మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తారక్ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి డ్రాగన్ టైటిల్ పరిశీలిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ పౌరాణిక సినిమా కూడా చేయనున్నాడు. దేవర 2 కూడా లైన్లోనే ఉంది.చదవండి: AI క్లైమాక్స్.. ఆత్మను చంపేశారు: ధనుష్ ఆగ్రహం -
సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే సినీకార్మికులకే జీతాలెక్కువ: నిర్మాత
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఫిలిం ఛాంబర్ (Telugu Film Chamber of Commerce)లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం జరిగిన ఈ భేటిక అల్లు అరవింద్, మైత్రీ రవి, శివలెంక కృష్ణ ప్రసాద్, రాధామోహన్ ఠాగూర్ మధు తదితరులు హాజరయ్యారు. కార్మికుల వేతనాలు 30% పెంచాలన్న ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్పై చర్చించారు. అనంతరం నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ.. సినీ కార్మికులకు బయట ఉన్న కార్మికుల కంటే ఎక్కువ జీతం ఇస్తున్నాము. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే కూడా వీరి వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. వేతనాల పెంపు పర్సంటేజ్పై ఇంకా చర్చ నడుస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు అని తెలిపారు. ఈ సమావేశానికి మరోవైపు తమ సినిమాలకు పనిచేసే కార్మికులకు 30% వేతనం పెంపునకు అంగీకరిస్తూ కొంతమంది నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్కు లెటర్స్ ఇచ్చారు. ఫిలిం ఫెడరేషన్ ప్రస్తుతం నాలుగు సినిమాలు, ఒక సినిమా ఓపెనింగ్, రెండు యాడ్ ఫిలింస్కు వర్క్ చేస్తోంది.షూటింగ్స్ బంద్తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ నాయకులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వేతనాల పెంపు కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్లుగా వీరశంకర్, సయ్యద్ హుమాయూన్లను నియమించారు. వేతనాల పెంపు విషయంపై ఆదివారం ఫిల్మ్ ఫెడరేషన్- ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో నేటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ పేర్కొంది. ఈ మేరకు అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, కోశాధికారి టీవీ అలెగ్జాండర్ (అలెక్స్) ఓ లేఖను విడుదల చేశారు. ‘‘నేటి నుంచి 30 శాతం వేతనం పెంచి ఇస్తామంటూ లేఖ ఇవ్వాలి. ఆ లేఖని ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు అందజేసిన తర్వాతే చిత్రీకరణలకు హాజరవుతాం. అప్పటి వరకూ సినిమాలు, వెబ్ సిరీస్ షూటింగ్స్కి కార్మికులు ఎవరూ హాజరు కాకూడదు. ఈ రూల్స్ తెలుగు సినిమా షూటింగ్స్ ఎక్కడ జరిగినా వర్తిస్తాయి’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.మనమంతా ఐక్యతతో ఉండాలి: ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ తీసుకున్న షూటింగ్స్ బంద్ నిర్ణయంపై ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే... ‘ప్రియమైన నిర్మాతలకు.. ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ పక్షపాతంగా 30శాతం వేతనాల పెంపు డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి, లేని వర్కర్లకు మనం ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాం. ఈ అంతరాయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు నష్టాన్ని కలిగిస్తుంది. చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పనిచేస్తున్న మనం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారం సాధించేందుకు సంబంధిత అధికారులతో ఛాంబర్ చర్చలు జరుపుతుంది. ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు లేక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా, ఛాంబర్ జారీ చేసే మార్గనిర్దేశకాలను కచ్చితంగా అనుసరించాలని తెలియజేస్తున్నాం. శాశ్వత పరిష్కారం కోసం, మెరుగైన భవిష్యత్ కోసం మనమంతా ఐక్యతతో ఉండాలి. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అంటూ ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ పేరుతో ఆ లేఖ విడుదలైంది. చదవండి: AI క్లైమాక్స్.. ఆత్మను చంపేశారు: ధనుష్ ఆగ్రహం -
AI క్లైమాక్స్.. ఆత్మను చంపేశారు: ధనుష్ ఆగ్రహం
చాలాపనులను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చిటికెలో చేసేస్తుంది. అందుకే ఇప్పుడందరూ దీనిపై పడ్డారు. ఏఐతో సెలబ్రిటీల పెళ్లిళ్లు చేస్తున్నారు. వారితో వ్యాపారాలు చేయిస్తున్నారు. ఆఖరికి కొత్త హీరోహీరోయిన్లను సృష్టించి సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నారు. ఇవన్నీ సరేకానీ, ఎప్పుడో రిలీజైన సినిమాను ఏఐను ఉపయోగించి క్లైమాక్స్ మార్చేయడమే చాలామందికి మింగుడుపడలేదు. ఏఐతో క్లైమాక్స్ మార్చేశారుధనుష్, సోనమ్ కపూర్ జంటగా నటించిన చిత్రం రాంఝనా (Raanjhanaa Movie). ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013లో రిలీజై ఘన విజయం సాధించింది. ఇప్పుడంతా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో ఆగస్టు 1న ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేశారు. కాకపోతే అందులో ఒరిజినల్ క్లైమాక్స్ లేదు. ఏఐ సాయంతో రూపొందిన క్లైమాక్స్ జత చేశారు. నిజానికి సినిమా చివర్లో హీరో చనిపోతాడు. కానీ ఏఐ సాయంతో ధనుష్ను చంపకుండా బతికించి కథ సుఖాంతం చేశారు. ఆత్మను చంపేశారుదీనిపై ధనుష్ (Dhanush) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏఐ క్లైమాక్స్తో రీరిలీజ్ అయిన రాంఝన సినిమా చూసి కలత చెందాను. క్లైమాక్స్ మార్చడం వల్ల సినిమా ఆత్మనే కోల్పోయింది. నేను అభ్యంతరం చెప్పినప్పటికీ సంబంధిత పార్టీలు లెక్కచేయకుండా ఏఐ క్లైమాక్స్ ఉపయోగించాయి. ఇది నేను 12 సంవత్సరాల క్రితం కమిట్ అయిన సినిమా కానే కాదు.ఆందోళన కలిగించే విషయంసినిమాలో కంటెంట్ను మార్చడానికి ఏఐను ఉపయోగించడమనేది కళకు, కళాకారులకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇది కథ చెప్పే విధానానికి, సినీవారసత్వానికే ప్రమాదకరం. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ లేఖ షేర్ చేశాడు. For the love of cinema 🙏 pic.twitter.com/VfwxMAdfoM— Dhanush (@dhanushkraja) August 3, 2025చదవండి: విలన్గా నాగార్జున ఎందుకు చేశారంటే.: రజనీకాంత్ -
కిరీటి స్టెప్పులు, శ్రీలీల గ్రేస్.. వైరల్ వయ్యారి ఫుల్ సాంగ్ చూసేయండి
ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటించిన తొలి చిత్రం జూనియర్ (Junior Movie). ఇది మొదటి సినిమా అయినప్పటికీ కిరీటి నటనకు, ముఖ్యంగా అతడి డ్యాన్స్కు ఫుల్ మార్కులు పడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమానిని అని చెప్పుకునే ఇతడు ఆ హీరోకు తగ్గట్లుగానే డ్యాన్స్ చేశాడు. వైరల్ వయ్యారి సాంగ్లో ఎన్టీఆర్ను గుర్తుచేసేలా స్టెప్పులతో అదరగొట్టాడు.వైరల్ వయ్యారి ఫుల్ వీడియో సాంగ్శ్రీలీల (Sreeleela) గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎప్పటిలాగే చించిపడేసింది. ఒకరకంగా చెప్పాలంటే జూనియర్ సినిమాకు వైరల్ వయ్యారి పాట భారీ హైప్ తీసుకొచ్చింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. 4కె వర్షన్లో వైరల్ వయ్యారి సాంగ్ (Viral Vayyari Full Video Song)ను యూట్యూబ్లో అందుబాటులోకి తెచ్చారు. పోటాపోటీగా డ్యాన్స్ చేసిన కిరీటి, శ్రీలీలఇది చూసిన అభిమానులు.. శ్రీలీలకే పోటీ ఇచ్చేలా డ్యాన్స్ చేశాడని కిరీటిని ప్రశంసిస్తున్నారు. ఇక ఈ పాటకు రేవంత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. జూనియర్ సినిమా విషయానికి వస్తే.. కిరీటి, శ్రీలీల జంటగా నటించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: తిరుమలలో 'కిరణ్ అబ్బవరం' కుమారుడి నామకరణం -
ప్రాణంగా పెంచుకున్న కొడుకు చనిపోయాడు: గీతా సింగ్
గీతా సింగ్ (Geeta Singh) అనగానే గుర్తొచ్చే మూవీ కితకితలు. అందులో గీతా యాక్టింగ్, అమాయకత్వం అందరినీ కట్టిపడేశాయి. ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అందరూ తనను కితకితలు హీరోయిన్గానే గుర్తుపెట్టుకున్నారు. ఇటీవల గీతా సింగ్ బరువు తగ్గి కాస్త సన్నబడింది. ఆ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అలాగే బిగ్బాస్ షోపై తన ఆసక్తిని వెల్లడించింది. బిగ్బాస్కు వెళ్లాలనుందిగీతా సింగ్ మాట్లాడుతూ.. మా స్వస్థలం నిజామాబాద్. జై సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్లాను. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఎవడి గోల వాడిదే సినిమాతో గుర్తింపు వచ్చింది. కితకితలు చిత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమాకు రూ.60 లక్షలు పెడితే దాదాపు రూ.9 కోట్లు వచ్చాయి. బిగ్బాస్ షోకు వెళ్లాలనుంది. కానీ ఇంత పేరు తెచ్చుకున్న మమ్మల్ని వదిలేసి కొత్తవారినే సెలక్ట్ చేస్తున్నారు. బిగ్బాస్ 9కి ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తాను. అయితే వెళ్లినప్పుడు ఫస్ట్ నాగార్జునకు ముద్దు పెట్టాకే మాట్లాడతాను. కష్టాల్లో ఎవరూ తోడుగా లేరుబరువు తగ్గడం అంటే అంత ఈజీ కాదు. కడుపు మాడ్చుకుని కష్టపడుతుంటే ఏడుపొచ్చేసేది. అయినా ఇంకా తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను. నా వ్యక్తిగత విషయానికి వస్తే.. డబ్బున్నప్పుడు అందరూ వస్తారు. కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ తోడుగా ఉండరు. నేను నా కొడుకును కోల్పోయినప్పుడు నా దగ్గర ఎవరూ లేరు. కనీసం తిన్నావా? లేదా? ఎలా ఉన్నావు? అని అడిగేవాళ్లే లేరు. నాకు నేనే ధైర్యం చెప్పుకుని బతికాను. నిజానికి వాడు నా కొడుకు కాదు, అన్నయ్య కొడుకు. నేను దత్తత తీసుకుని పెంచుకున్నాను. పిల్లల కోసమే పెళ్లి చేసుకోలే24 ఏళ్లు ప్రాణంగా పెంచుకున్నాను. యాక్సిడెంట్లో చనిపోయాడు. తట్టుకోలేకపోయాను. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడుతున్నాను. అన్నయ్య రెండో కొడుకును కూడా నేనే చూసుకుంటున్నాను. కజిన్ అన్నయ్య కూతురు కూడా నా దగ్గరే ఉంటుంది. పిల్లల కోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. కానీ, దేవుడేమో ఇలా చేశాడు. నేను వెయ్యికి పైగా సినిమాలు చేశాను. కానీ, అందులో చాలావరకు రిలీజవ్వలేదు అని గీతా సింగ్ చెప్పుకొచ్చింది.చదవండి: స్టార్స్ రీయూనియన్.. జల్సాకు బదులు సేవ చేయొచ్చుగా -
మైనర్ను పెళ్లి చేసుకున్నా.. 16 ఏళ్లకే పిల్లలు: సీరియల్ నటుడు
అలౌకిక, పద్మవ్యూహం, ఎండమావులు.. ఇలా ఎన్నో హిట్ సీరియల్స్లో నటించాడు ఇంద్రనాగ్ (Indra Nag). తర్వాతేమైందే ఏమో కానీ నెమ్మదిగా బుల్లితెరకు దూరమైపోయాడు. చాలాకాలం తర్వాత ఇంద్ర నాగ్ కెమెరా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ప్రభాకర్తో ఉన్న గొడవల గురించి, ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలో ఉన్న వాతావరణం గురించి మాట్లాడాడు.రెమ్యునరేషన్తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంద్రనాగ్ మాట్లాడుతూ.. నా అసలు పేరు నాగేంద్ర. మాది తూర్పు గోదావరి. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. కన్నడలో సినిమా ఆఫర్లు వస్తే భాష కష్టంగా ఉందని చేయనని చెప్పేశాను. 23 ఏళ్లకే పెళ్లి పీటలెక్కాను. చిన్నమామయ్య కూతురినే పెళ్లి చేసుకున్నా.. మాకు పాప పుట్టేనాటికి నా భార్య వయసు 16 ఏళ్లే! 24వ ఏట ఇండస్ట్రీలోకి వచ్చాను. కెరీర్ తొలినాళ్లలో నటుడిగా రోజుకు రూ.1500 పారితోషికం ఇచ్చేవారు. దర్శకత్వం చేసేటప్పుడు రోజుకు రూ.15 వేలు తీసుకున్నాను.ప్రభాకర్తో గొడవ?ప్రభాకర్ నాకంటే సీనియర్. తను మొదటినుంచీ నాతో ఎక్కువగా మాట్లాడడు. నేను మాత్రం ఆయన్ను గౌరవిస్తాను. మా మధ్య ప్రత్యేకంగా గొడవలేమీ లేవు. కానీ ఆయనకు నామీద కోపం ఉందని తన ఇంటర్వ్యూ చూశాక తెలిసింది. దానికి నేనేం చేయలేను. ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాను. కరోనా తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. కొంత డిప్రెషన్గా అనిపిస్తోంది. ప్రతిదానికి లోతుగా ఆలోచిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇంద్రనాగ్.. తెలుగులో నాన్స్టాప్ మూవీలో హీరోగా నటించాడు. ప్రస్తుతం నిండు మనసులు సీరియల్ చేస్తున్నాడు.చదవండి: మా జీవితంలోకి అమ్మవారు వచ్చిన రోజు.. ఘనంగా కూతురి ఫస్ట్ బర్త్డే -
పదేళ్లలో ఆదాయం వందల కోట్లు,ఇదీ ప్రభాస్ హీరోయిన్ సత్తా..
ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో అత్యంత సుపరిచితమైన విమర్శకుల ప్రశంసలు పొందిన పేర్లలో ఒకరిగా కృతిసనన్ ఎదిగింది. అయితే, ఆమె స్టార్డమ్కు మార్గం ఇంజనీరింగ్ క్లాస్రూమ్ల నుంచే మొదలైంది.ఇంజనీరింగ్ టూ సిల్వర్స్క్రీన్..సంప్రదాయ. ఇంజనీరింగ్ నేపథ్యం నుంచి వచ్చిన కృతి బాలీవుడ్ తో ఎటువంటి కుటుంబ సంబంధాలు లేకుండా, వినోద ప్రపంచంలోకి పూర్తిగా బయటి వ్యక్తిగా ప్రవేశించింది. ఆమె మొదట్లో మోడలింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది, క్రమంగా తన విలక్షణమైన శైలి ఆత్మవిశ్వాసంతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. 2014లో ప్రముఖ నటుడు జాకీ ష్రో కుమారుడు టైగర్ ష్రోతో కలిసి యాక్షన్ రొమాన్స్ చిత్రం హీరోపంతిలో నటించడంతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ అరంగేట్రం విజయవంతమైన ప్రయాణానికి నాంది పలికింది. శరవేగంగా ఆకట్టుకునే అందాల తారగా మారి భారతీయ సినిమాలోని అత్యంత ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశాన్ని సంపాదించింది. ఆదిపురుష్లో ప్రభాస్ సరసన సీత పాత్రలోనూ నటించింది.2015లో, రోహిత్ శెట్టి బ్లాక్ బస్టర్ దిల్ వాలేలో షారుఖ్ ఖాన్, కాజోల్ లతో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకుంది. తరువాతి కొన్ని సంవత్సరాలలో కృతి బరేలీ కి బార్, లుకా చుప్పీ, హౌస్ ఫుల్ 4 తదితర చిత్రాల ద్వారా స్థిరమైన విజయాలను దక్కించుకుంటూ వచ్చింది. మిమి (2021)లో పోషించిన సర్రోగేట్ తల్లి పాత్ర ఆమెకు ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందించింది. అందంతో పాటు అభినయ ప్రతిభ ఉన్న నటిగా బాలీవుడ్లో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.బిజినెస్లో బిజీ బిజీగా...అనంతరం కృతి అభిరుచులు కెమెరాకు మించి విస్తరించాయి. మోడలింగ్ సినిమా సెట్లలో గ్లామర్ సౌందర్య పోషణతో సంవత్సరాల తరబడి పరిచయం ఉండడంతో కృతి సులభంగా స్కిన్ కేర్ స్పేస్ లోకి ప్రవేశించింది. కోవిడ్, లాక్డౌన్ సమయంలో, ఆమె చర్మ సంరక్షణ దినచర్యలు, ఉత్పత్తులను లోతుగా అర్థం చేసుకోవడంలో మునిగిపోయింది. ఈ అభిరుచి 2023లో తన సొంత బ్యూటీ బ్రాండ్ హైఫర్ ను ప్రారంభించడానికి దారితీసింది. హైఫన్ ఇప్పుడు టాప్ సెలబ్రిటీ బ్యూటీ లేబుల్లలో ఒకటిగా నిలిచింది, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ చర్మ సంరక్షణ లేబుల్ దాని మొదటి సంవత్సరంలోనే రూ. 100 కోట్ల అద్భుతమైన ఆదాయాన్ని ఆర్జించింది, అత్యంత పోటీతత్వ మార్కెట్లో తనను తాను స్థిరపరచుకుంది. కత్రినా కైఫ్ కే బ్యూటీ, మీరా రాజ్పుత్ అకైండ్, ఆష్కా గోరాడియా రెనీ కాస్మెటిక్స్ వంటి వాటితో పోటీ పడుతోంది. కృతికి చర్మ సంరక్షణ పట్ల ఉన్న నిజమైన మక్కువ, ఆమె స్వయంగా అన్నింటినీ పర్యవేక్షించడం ఈ బ్రాండ్ శీఘ్ర విజయానికి మూలస్తంభంగా మారింది.ఫిట్...హిట్...స్కిన్ కేర్ ఉత్పత్తుల కంటే ముందే . 2022లో, ఆమె ఫిట్నెస్ బ్రాండ్ అయిన ది ట్రైబ్ను సహ యజమానురాలిగాస్థాపించింది. దీనికి ఆమె మిమి షూటింగ్ కోసం కృతి తన పాత్రను పండించడం కోసం దాదాపు 15 కిలోగ్రాముల బరువు పెరిగింది. లాక్డౌన్ కారణంగా జిమ్లు మూసేయడంతో అదనపు బరువు తగ్గడం ఆమెకు బాగా కష్టమైంది. దాంతో వర్చువల్ సెషల్ ద్వారా నలుగురు వ్యక్తిగత శిక్షకుల మార్గదర్శకత్వంలో తాను ఇంట్లోనే వ్యాయామం చేశానని కృతి వెల్లడించింది. ఈ లోతైన వ్యక్తిగత సవాలుతో కూడిన దశ ఆమెను ఆ శిక్షకులతో కలిసి ది ట్రైబ్ ఏర్పాటుకు ప్రేరేపించింది. అదే సంవత్సరంలో, ఆమె ముంబైలోని ఉన్నత స్థాయి జుహు ప్రాంతంలో తన మొదటి ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించింది. రెండు సంవత్సరాల తరువాత, 2024లో, ముంబైలోని మరొక ఉన్నత పరిసర ప్రాంతమైన బాంద్రాలో రెండవ స్టూడియో తెరిచింది. -
కింగ్డమ్ బాక్సాఫీస్ ప్రభంజనం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు అంటే..?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "కింగ్డమ్" సినిమా బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తోంది. రిలీజైన 3 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ 67 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ గా మారింది. ఈ సినిమా బాగుందంటూ వస్తున్న మౌత్ టాక్ తో థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. వీక్ డే అయిన గురువారం థియేటర్స్ లోకి వచ్చిన "కింగ్డమ్" సినిమా మొదటి రోజే 39 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. శుక్ర, శనివారాలు కూడా ఈ వసూళ్ల జోరు అలాగే కొనసాగింది. ఈ ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ వీక్ కు రికార్డ్ నెంబర్ కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టే అవకాశాలు ఉన్నాయి.ఓవర్సీస్ లో కూడా కింగ్డమ్ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నార్త్ ఆమెరికన్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ క్రాస్ చేసి దూసుకెళ్తోంది. కింగ్డమ్ 100 కోట్ల రూపాయల వసూళ్ల క్లబ్ లో ఈజీగా చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నాదమ్ముల మధ్య అనుబంధం నేపథ్యంగా ఇంటెన్స్ స్పై యాక్షన్ డ్రామాగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన కింగ్డమ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. విజయ్ దేవరకొండ ఇటీవల మిస్ అయిన సక్సెస్ ను కింగ్డమ్ తిరిగి తీసుకొచ్చింది. -
‘బాహుబలి’ సెట్లో ప్రభాస్ అల్లరి..ఎంత పని చేశావ్ దేవసేనా..?: వీడియో
ప్రభాస్ స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ అయినా..ఇప్పటికీ తన చిన్ననాటి స్నేహితులతోనే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. సమయం దొరికితే ఫ్రెండ్స్ కలిసి టూర్స్ని వెళ్తుంటాడు. బయటకు సైలెంట్గానే కనిపిస్తాడు కానీ ప్రభాస్ చాలా అల్లరోడు అని రాజమౌళితో పాటు చాలా మంది స్నేహితులు చెప్పారు.సెట్లో సరదాగా ఉంటాడని ఆయనతో కలిసి పని చేసిన నటీనటులు చెబుతుంటారు. అయితే తెర వెనుక ప్రభాస్ ఎలా ఉంటాడు? ఏ స్థాయిలో అల్లరి చేస్తాడో తాజాగా బహుబలి చిత్రబృందం బయటి ప్రపంచానికి చూపించింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రభాస్కి సంబంధించిన స్పెషల్ వీడియోని చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ప్రభాస్ చాలా సరదాగా ఉన్నాడు. బాహుబలి గెటప్ వేసుకొని అనుష్కతో పాటు రానాపై ఫన్నీ పంచులు విసిరాడు. ‘ఎంత పని చేశావ్ దేవసేన’ అంటూ ‘అమ్మా లేడు నాన్న లేడు.. ’ అనే పాటను పాడుతూ రానాతో ముచ్చటించాడు. మధ్యలో అనుష్క వచ్చి ప్రభాస్తో మాట్లాడడంతో అంతా నవ్వారు’. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. Every day on set felt like #FriendshipDay 🤗#Prabhas @RanaDaggubati @MsAnushkaShetty #BaahubaliArchives#Baahubali #BaahubaliTheEpic #Celebrating10YearsOfBaahubali#BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/tXDLsbaGxm— Baahubali (@BaahubaliMovie) August 3, 2025 బాహుబలి విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన బాహుబలి తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 10న రిలీజ్ కాగా, మలి భాగం ‘బాహుబలి: ది కన్క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి (శివుడు) పాత్రల్లో ప్రభాస్, భల్లాలదేవుడి పాత్రలో రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవగా నాజర్ కనిపిస్తారు. -
ఇంటికి వెళ్లి పొలం పనులు చేసుకుంటా కానీ.. : సత్యదేవ్
సత్యదేవ్.. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సహాయ నటుడి పాత్రలతో కూడా అలరిస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ఇటీవల విడుదలైన మంచి టాక్ని సంపాదించుకుంది. విజయ్ తో పాటు సత్యదేవ్ పోషించిన పాత్రకు కూడా మంచి స్పందన లభిస్తోంది. సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ఒక హీరోనే అని చాలా మంది అంటున్నారు. హీరో అన్నయ్య శివ పాత్రలో ఆయన ఫెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉందని చెబుతున్నారు. పాత్ర నచ్చడంతోనే ఆ సినిమాకు ఒప్పుకున్నానని అంటున్నాడు సత్యదేవ్. ఈ సినిమా కంటే ముందు చాలా సినిమాల్లో సహాయ నటుడి పాత్రలు వచ్చాయి కానీ నచ్చకపోవడంతో నో చెప్పానని అన్నారు. డబ్బుల కోసం ఎప్పుడు సినిమాలు చేయనని.. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే.. ఇంటికి వెళ్లి పొలం పనులు చేసుకుంటానని సత్యదేవ్ అంటున్నాను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘డబ్బు కోసం అయితే నేను సినిమాలు చేయలేను. గాడ్ ఫాదర్ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. అలాంటి పాత్రలు చేయమని చాలా మంది అడిగారు. కానీ పాత్ర నచ్చక చేయలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను డబ్బు కోసం సినిమా చేయలేదు. మంచి పాత్రల కోసం ఎదురు చూశా. అందుకే ఇప్పుడు శివ లాంటి పాత్రలు దొరికాయి. డబ్బు కోసం సినిమా చేయొద్దని స్ట్రాంగ్గా ఫిక్సయ్యాను. ఒకవేళ డబ్బులే కావాలనుకుంటే ఇంటికి వెళ్లి పొలం పనులు చేసుకుంటాను. అంతేకాని నచ్చని పాత్రలు అయితే చేయను’ అని సత్యదేవ్ అన్నారు. -
మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. ‘ఢీ’ కొరియోగ్రాఫర్పై పోక్సో కేసు, అరెస్ట్!
‘ఢీ’ ఫేం కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్పై పోక్సో కేసు నమోదు అయింది. మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై గచ్చిబౌలి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని కంది జైలుకు తరలించారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ గత నెలలో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పొక్సో కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న కృష్ణ.. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బెంగళూరిలోని తన అన్న నివాసంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడి వెళ్లి అరెస్ట్ చేసి అనంతరం కంది జైలుకు తరలించారు.ఇటీవల కృష్ణకు ఓ మహిళతో వివాహం కూడా జరిగింది. భార్యకు సంబంధించిన రూ. 9.50 లక్షల నగదు తీసుకొని కృష్ణ బెంగళూరికి వెళ్లినట్లు తెలుస్తంది. గతంలో కూడా కృష్ణపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా పలువురు యువతుల్ని మోసం చేసినట్లు కృష్ణపై అభియోగాలు ఉన్నాయి. -
రొమాన్స్ ఇరుక్కు, ట్విస్ట్ ఇరుక్కు.. ఓటీటీలో లవ్ స్టోరీ.. ఎప్పుడంటే?
తమిళ హీరో విష్ణు విశాల్ నిర్మించిన చిత్రం "ఓహో ఎంతన్ బేబి" (Oho Enthan Baby Movie). రుద్ర, మిథిలా పాల్కర్ జంటగా నటించారు. కృష్ణ కుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా దాదాపు నెల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.ఓటీటీలో ఎప్పుడంటే?ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix).. ఓహో ఎంతన్ బేబీ చిత్రాన్ని ఆగస్టు 8న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. రొమాన్స్ ఇరుక్కు (ఉంది), ట్విస్ట్ ఇరుక్కు, డ్రామా ఇరుక్కు.. అంతా ఒకే.. హ్యాపీ ఎండింగ్ ఇరుక్కుమా? (ఉంటుందా?) అని ఈ పోస్ట్కు క్యాప్షన్ జోడించింది. మరి ఈ లవ్స్టోరీ చూడాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే! Open pannaa… oru love story. Romance irukku, twist irukku, drama irukku. Aana, happy ending irukkuma? 👀 pic.twitter.com/YF8H7YtVaG— Netflix India South (@Netflix_INSouth) August 3, 2025 చదవండి: రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో -
రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ (Coolie Movie). టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్, శాండల్వుడ్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, సత్యరాజ్, హీరోయిన్ శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్లో కనిపించనుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.కూలీ సినిమా లుక్లో ఆమిర్శనివారం ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్కు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కూడా హాజరయ్యాడు. కూలీ సినిమాలో చేతి నిండా పచ్చబొట్టుతో ఎలా కనిపించాడో అదే లుక్లో స్టేజీపై దర్శనమిచ్చాడు. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. కాళ్లు మొక్కిన హీరోఆ తర్వాత రజనీకాంత్ కాళ్లకు నమస్కరించాడు. దీంతో తలైవా అతడిని వెంటనే పైకి లేపి మనసారా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఆమిర్ ఖాన్ను మెచ్చుకుంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదేనని కామెంట్లు చేస్తున్నారు. Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9— Sun Pictures (@sunpictures) August 2, 2025For this massive respect, I'll be one of #AmirKhan fan after this .Humble person and knew how to respect legends. pic.twitter.com/swIjQtbbMy— Daemon (@k3_butcher) August 2, 2025చదవండి: 36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ -
నా భక్తి దారి వేరే అంటున్న శ్రుతి హాసన్
‘కమల్ హాసన్ కుమార్తె’ అనే ఓ ప్రత్యేకమైన ట్యాగ్తోనే అందరికీ పరిచయం అయినా, శ్రుతి హాసన్ ఇప్పుడు ఆ పేరుకు మించి తనదైన గుర్తింపును ఏర్పరచుకుంది. త్వరలో రానున్న ‘కూలీ’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనుంది.→ చిన్ననాటి నుంచి మురుగన్ స్వామిని విశ్వసించే శ్రుతి, ఇటీవల వారాహీమాత భక్తురాలిగా మారింది. చెన్నైలోని ఓ చిన్న గుడికి వెళ్లిన తర్వాత తనలో భయాలు తగ్గాయని, జీవితంలో మానసిక ప్రశాంతతను పొందానని చెప్పింది. వారాహిమాతను పూజించడం ప్రారంభించిన తరువాత తన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పింది.→ తనకు వచ్చిన తన తండ్రి కమల్ హాసన్ వాయిస్ కారణంగా కెరీర్ ప్రారంభంలో ఆమె చేసిన డబ్బింగ్, పాటలపై ట్రోల్స్ ఎక్కువైనా, నమ్మకాన్ని కోల్పోలేదట! ఏ ఆర్ రెహమాన్ సంగీతంపై చిరకాల కోరిక. ‘థగ్ లైఫ్’లో ఆయన సంగీత దర్శకత్వంలో పాట పాడుతున్నప్పుడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యిందట!→ జాతకాలను గట్టిగా నమ్ముతుంది. ప్రస్తుతం కుజ మహాదశలో ఉందని చెప్పింది. స్నేహితురాలు సుకన్య జ్యోతిష్య శాస్త్రం మీద రాసిన పుస్తకం ద్వారా, ఆమె సలహాలు తీసుకుంటుందట!→ తండ్రి కమల్ హాసన్లో తనకు నచ్చిన క్వాలిటీ– ఆయన విల్ పవర్. తండ్రి అభిమాన దర్శకుడు అకిరా కురసోవా సినిమాలు చూసి, ఆయన జీవిత చరిత్ర చదివాక జపాన్ మీద ప్రత్యేకమైన అభిమానం పెంచుకుంది.→ తన జీవితంలో రెండు షేడ్స్ ఉన్నాయంటోంది శ్రుతి– ఒకటి ప్రజల కోసం, మరొకటి స్నేహితుల కోసం. మూడున్నరేళ్ల వయసులో పరిచయమైన ఫ్రెండ్తో ఇప్పటికీ స్నేహం కొనసాగుతుందట!→ బాల్యంలో తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక– ఎవరికి వాళ్ళు చాలా బిజీగా ఉండేవారు. కమల్ హాసన్ ఏడెనిమిది గంటల పాటు స్క్రీన్ ప్లే రాసుకుంటుంటే, సారిక సినిమా సౌండ్ డిజైనింగ్ లో బిజీగా ఉండేది.→ తల్లిదండ్రులిద్దరూ స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు కాదు. కాని, పిల్లల చదువు విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. ఇంట్లో పూర్తిగా నాస్తిక వాతావరణం ఉండేది. ఇంట్లో పూజలు చేసేవారు కాదు. అయినా తన భక్తి దారి వేరే అని చెబుతుంది→ వంట అంటే మక్కువ, సౌత్ ఇండియన్ , ఇటాలియన్ వంటకాల్లో ప్రావీణ్యం. సాంబార్ రైస్, మటన్ సూప్, మోచీ ఐస్క్రీమ్– ఆమె ఫేవరెట్డిషెస్. -
కల నెరవేరిన అనుభూతి కలుగుతోంది: ఆనంద్ దేవరకొండ
‘‘బేబి’ చిత్రం కోసం టీమ్ మొత్తం ప్రాణం పెట్టి పని చేశాం. మా చిత్రం జాతీయ అవార్డు గెల్చుకోవడం ఆనందంగా ఉంది. నా సినిమా ‘పోస్టర్ మీద నేషనల్ అవార్డ్ విన్నర్ అనే పేరు చూడటంతో నా కల నెరవేరిన అనుభూతి కలుగుతోంది’’ అని హీరో ఆనంద్ దేవరకొండ తెలిపారు. సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్గా నటించిన చిత్రం ‘బేబి’. ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం 2023 జూలై 13న విడుదలైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డ్స్లో ఈ సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్గా పీవీఎన్ఎస్ రోహిత్ జాతీయ అవార్డుకి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో సాయి రాజేశ్ మాట్లాడుతూ– ‘‘బేబి’ సినిమాకు ప్రతి ఒక్కరూ హీరోనే... అంతా ప్రాణం పెట్టి పని చేశారు. మాకు వచ్చిన బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ మా ఎడిటర్ విప్లవ్గారికి కూడా చెందాలి. నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్కేఎన్ నమ్మినందుకు థ్యాంక్స్’’ అని చెప్పారు. ‘‘బేబి’లో ‘ప్రేమిస్తున్నా...’ పాటకి బెస్ట్ సింగర్గా జాతీయ అవార్డు అందుకోనుండటం సంతోషంగా ఉంది’’ అని పీవీఎన్ఎస్ రోహిత్ పేర్కొన్నారు. ‘‘బేబి’లో నేనూ భాగమైనందుకు చాలా హ్యాపీ’’ అన్నారు వైష్ణవీ చైతన్య. ఎస్కేఎన్ మాట్లాడుతూ– ‘‘బేబి’కి జాతీయ అవార్డులు రావడంతో మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే బాధ్యత మాపై పెరిగింది’’ అని చెప్పారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని, ఎడిటర్ విప్లవ్, లిరిక్ రైటర్ సురేష్ బనిశెట్టి మాట్లాడారు. -
36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్
చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఆ చిత్రాలను 12 ఏళ్ల లోపు పిల్లలు చూడడానికి థియేటర్లో అనుమతించరాదని అర్థం అనే విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ఇప్పుడు పెద్దగా ఏ సినిమా థియేటర్ నిర్వాహకులు పాటించడం లేదన్నది వేరే విషయం. సాధారణంగా క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ కథా చిత్రాలకు, హింసాత్మక సంఘటనలు అధికంగా ఉన్న చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తుంది. అదే సర్టిఫికెట్ను ఇప్పుడు రజనీకాంత్ తాజాగా కథానాయకుడు నటించిన కూలీ చిత్రానికి ఇవ్వడం గమనార్హం.లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్తో పాటు బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్వుడ్ స్టార్ ఉపేంద్ర, ,క్రేజీ స్టార్ శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక అదనపు ఆకర్షణగా పూజాహెగ్డే ఐటమ్ సాంగ్ ఉండనే ఉంది. కాగా అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో కూలీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ను ఇవ్వడం చర్చనీయంగా మారింది. కారణం ఈ చిత్రంలో భారీగా హింసాత్మక సన్నివేశాలు చోటు చేసుకోవడమే అని తెలిసింది. రజనీకాంత్ నటించిన అత్యధిక చిత్రాలు యూ /ఏ సర్టిఫికెట్ తోనే విడుదలయ్యాయి. అయితే 1982లో నటించిన పుదుకవితై, రంగా, 1985లో నటించిన ఊరుక్కావాలన్, 1989లో నటించిన శివ చిత్రాలు మాత్రం ఏ సర్టిఫికెట్తో విడుదలయ్యాయి. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత మళ్లీ కూలీ చిత్రం ఏ సర్టిఫికెట్తో తెరపైకి రాబోతుందన్నది గమనార్హం. అయితే ఈ చిత్ర ట్రైలర్ ,ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ హిందూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. -
ప్రాణాంతకమైన గేమ్.. ఆ చేయి పట్టుకుంటే దెయ్యం వచ్చేస్తుంది!
కొన్ని ఆటలు చాలా ప్రమాదకరం. ఈ విషయం తెలిసినా సరే ఓసారి ఆడి చూస్తే పోలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులోనూ దెయ్యాన్ని చూడొచ్చు అనగానే ఓ పక్క ఎగ్జయిట్ అవుతూ, మరో పక్క భయపడుతూనే రంగంలోకి దిగుతారు. ఒక్క లైన్లో చెప్పాలంటే టాక్ టు మి సినిమా (Talk To Me Movie Review) కథ ఇదే! ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ దగ్గర రాతి చేయి ఉంటుంది. కథఓ క్యాండిల్ వెలిగించి.. ఆ చేయిని పట్టుకుంటే చాలు దెయ్యాలు కనిపిస్తాయి. కనిపించడంతో ఆగవు. చేయి పట్టుకున్న వ్యక్తి శరీరంలోకి కూడా వెళ్తాయి. చేయిని వదిలేసి, క్యాండిల్ ఆర్పేసినప్పుడు ఆ దెయ్యం ఒంట్లో నుంచి తిరిగి వెళ్లిపోతుంది. దెయ్యం శరీరంలోకి చేరినప్పుడు ఎవరేం చేస్తున్నారనేది సరదాగా వీడియోలు షూట్ చేస్తూ ఉంటారు మిగతా ఫ్రెండ్స్. అప్పటివరకు వచ్చిన దెయ్యాలేవీ పెద్దగా భయపెట్టకపోవడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. దీంతో చీకటి అంటేనే భయపడే ఓ బాలుడు కూడా ధైర్యం చేసి తనూ గేమ్ ఆడతానంటాడు.అందుకు అతడి అక్క ఒప్పుకోదు. అప్పటికే ఆమె ప్రియుడి శరీరంలోకి దెయ్యం ప్రవేశించి చేసిన పిచ్చిపనిని చూసి ఆమె బిక్కచచ్చిపోతుంది. ఇదేమంత సరదా గేమ్ కాదని, ఇక ఆపేయమని వారిస్తుంది. అయినా పట్టించుకోకుండా చిన్నపిల్లాడితో గేమ్ ఆడిస్తారు. ఈసారి గేమ్ వైల్డ్గా మారుతుంది. అతడు తన కనుగుడ్లు పీకేసుకుంటాడు. తలను టేబుల్కేసి బాదుకుంటూ చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. రక్తం ఏరులై పారుతుండటంతో అందరూ భయంతో వణికిపోతారు. ఎలా ఉంది?దీంతో అందరూ ఎలాగోలా ఆ రాతి చేతి నుంచి బాలుడి చేతిని విడిపిస్తారు. తర్వాతేం జరిగిందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! దెయ్యాన్ని ఆహ్వానించే ఆటలాడితే ఏం జరుగుతుందనేది చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా అలాంటిదే! కాకపోతే కథ ఎక్కడా దారితప్పకుండా స్పీడ్గా వెళ్లిపోతూ ఉంటుంది. అనవసరమైన సీన్లు ఉండవు. ఎడిటింగ్ క్రిస్ప్గా ఉంది. అయితే మరీ ఎక్కువగా భయపెట్టే సన్నివేశాలు లేవు.టాక్ టు మి.. ఆస్ట్రేలియన్ హారర్ మూవీ. 2023లో రిలీజైన ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్రకటించారు. టాక్ టు మి 2 కథ ఇంకా డెవలప్మెంట్ దశలోనే ఉంది. 'టాక్ టు మి' మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. దీనికి ఐఎమ్డీబీలో 7.1 రేటింగ్ ఉంది. -
గర్భంతో ఉండగా తల్లింట్లో.. విడాకుల వార్తలపై నటి ఏమందంటే?
యువికా చౌదరి (Yuvika Chaudhary).. మొదట్లో హీరోయిన్గా సినిమాలు చేసింది. తర్వాత సహాయనటిగా యాక్ట్ చేసింది. హిందీతో పాటు కన్నడ, పంజాబీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. హిందీ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంది. ఈ షోలోనే నటుడు ప్రిన్స్ నరూలాతో ప్రేమలో పడింది. షో తర్వాత కూడా వీరిద్దరూ ఆ ప్రేమను కొనసాగించారు. 2018లో పెళ్లి చేసుకున్నారు. ఐవీఎఫ్ ద్వారా 2024లో కూతురికి జన్మనిచ్చారు. అయితే గర్భంతో ఉన్న సమయంలో యువికా తల్లింట్లోనే ఉంది. దీంతో యువికా- ప్రిన్స్ విడిపోయారంటూ ప్రచారం జరిగింది.నా మనసంతా అదేఈ ప్రచారం గురించి ఇన్నాళ్లకు పెదవి విప్పింది యువికా చౌదరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను గర్భం దాల్చినప్పుడు నా మెదడులో, మనసులో పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాను. పనికిరాని రూమర్లకు ప్రాధాన్యత ఇవ్వకూడదనుకున్నాను. అందుకే వాటిని లైట్ తీసుకున్నాను. ఈ పుకార్లు లైఫ్లో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నా ప్రెగ్నెన్సీ ఎప్పుడంటే అప్పుడు రాదుగా.. అందుకే రూమర్స్ను పట్టించుకోలేదు. ఒకవేళ క్లారిటీ ఇచ్చినప్పటికీ పరిస్థితి చక్కబడటం కాదుకదా.. దాన్ని మరింత రచ్చ చేస్తారని భావించాను. మా మధ్య మనస్పర్థలు నిజమేఅయినా మౌనంగా ఉన్నా కూడా దాన్ని ఇంకా సాగదీశారు. ఏదేమైనా నాకు నా బిడ్డే ముఖ్యం. తనను నేను బాగా చూసుకోవాలి. తనకోసం మరింత స్ట్రాంగ్గా నిలబడాలి.. ఇవే నా మనసులో మెదిలేవి. నిజానికి ప్రిన్స్ నాకెంతో సపోర్ట్ చేస్తాడు. కాకపోతే అందరిలాగే మా మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి. లైఫ్లో ఇది కూడా ఓ ఫేజ్ అని, అదెంతో కాలం ఉండదని నాకు బాగా తెలుసు. ప్రెగ్నెన్సీలో సడన్గా సంతోషంగా ఉంటాం. అంతలోనే బాధగా అనిపిస్తుంది. కొన్నిసార్లు జీవిత భాగస్వామి మనపక్కనే ఉంటే బాగుండనిపిస్తుంది. కానీ మా ఇంట్లో ఇంటీరియర్ పనులు జరుగుతుండటంతో ప్రిన్స్ అవన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. తల్లికంటే ఎక్కువ ఎవరు చూసుకోగలరు?మరోవైపు షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు. అలాంటి సమయంలో నేను మా అమ్మ దగ్గర ఉండటమే మంచిదని భావించాడు. తల్లికంటే బాగా ఎవరూ చూసుకోలేరని పుట్టింటికి పంపించాడు. ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మానాన్నతో కలిసి ఉండటం పాపమేమీ కాదు, అదందరూ చేసేదే! అది అర్థం చేసుకోలేనివాళ్లు పిచ్చి పుకార్లు సృష్టించారు. కానీ ప్రిన్స్ మా విడాకుల రూమర్స్ విని బాధపడ్డాడు. నేను పుట్టింట్లో.. తనేమో నాకు దూరంగా ఉండేవాడు. ఏదేమైనా ఆ ఫేజ్ దాటేశాం. హ్యాపీగా ఉన్నాం అని యువికా చౌదరి చెప్పుకొచ్చింది.చదవండి: కొన్నిరోజులే బతుకుతా.. దీనస్థితిలో హీరో.. సాయం చేసిన కమెడియన్ -
చాన్నాళ్ల తర్వాత ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను : విజయ్ దేవరకొండ
పదేళ్ల క్రితం నేను ఎవరనేది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఈ స్తాయిలో ఉన్నాను. అదే నాకు గొప్ప విషయం. ఇన్ని కోట్ల మందిలో ఈ అవకాశం నాకు మాత్రమే దొరికింది. అది చాలు. ఈ స్థాయికి వచ్చినందుకు ఏదో ఒకటి చేయకపోతే అర్థం ఉండదు. అందుకే అర్జున్ రెడ్డికి వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డుని వేలానికి వేసి ఓ మంచి పనికి ఉపయోగించాను. నెగెటివిటీని నేను పట్టించుకోను. నా చుట్టు ఉన్నవారితో పాటు అభిమానుల్లోనూ పాజిటివిటీ నింపాడానికే ప్రయత్నిస్తాను’ అన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’ జులై 31న విడుదలై మంచి టాక్తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ కింగ్డమ్ సినిమాకు వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్ లో విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మలయాళంలో ఈ స్థాయి స్పందన ఊహించలేదు. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా.. అక్కడి ప్రేక్షకులు ఇంతటి ప్రేమ చూపించడం చాలా ఆనందంగా ఉంది.→ ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాపై కురిపిస్తున్న ప్రేమనే నా దృష్టిలో బెస్ట్ కాంప్లిమెంట్. వాళ్ళకి సినిమా నచ్చడం ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. చాలా రోజుల తరువాత అభిమానుల కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. మొదటి షో పూర్తవ్వగానే చాలామంది ఫోన్లు చేసి 'మనం హిట్ కొట్టినం' అని చెప్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది.→ కెరీర్ ప్రారంభంలో సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ ఉంటుంది. పెళ్లి చూపులు హిట్ అయినప్పుడు.. ఇంకొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ, ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. కింగ్డమ్ విడుదలకు ముందు మాక్కూడా ఆలాంటి ఒత్తిడి ఉంది. ఎప్పుడైతే మొదటి షో పూర్తయ్యి, పాజిటివ్ వచ్చిందో.. అప్పుడు చాలా సంతోషం కలిగింది.→ గౌతమ్(దర్శకుడు) కుటుంబ బంధాలను, ఎమోషన్స్ ని డీల్ చేసే విధానం నాకు ఇష్టం. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామా అనే ఐడియా గౌతమ్ చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. జెర్సీ లాంటి ఎమోషనల్ జర్నీలో కూడా మనకు హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి. గౌతమ్ కి ప్రతి విషయం మీద పట్టు ఉంటుంది. హీరో పాత్ర, షాట్ కంపోజిషన్, మ్యూజిక్ ఇలా ప్రతిదాని మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. కింగ్డమ్ కోసం ఆసక్తికర కథనం రాశాడు. ఇందులో ఏదో యాక్షన్ సన్నివేశం పెట్టాలి కదా అన్నట్టుగా ఎక్కడా పెట్టలేదు. దాని చుట్టూ బలమైన ఎమోషన్ ఉండేలా చూసుకున్నాడు.→ ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ప్రధానంగా కథ ఉంటుంది. కానీ, ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశముంది. అలాగే, ఒక తెగకు చెందిన నాయకుడి గురించి ఉంటుంది. ఇలా ఇన్ని అంశాలను ఒకే భాగంలో చెప్పడం సాధ్యంకాదు. అందుకే రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాము. తన అన్నయ్య శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని మొదటి భాగంలో చూశాం. రెండవ భాగానికి సంబంధించి గౌతమ్ దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంగా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది.→ ఈ కథ విన్న తర్వాత అసలు ఆ కాలంలో ఎలా మాట్లాడేవారు, ఎలాంటి దుస్తులు వేసుకునేవారు వంటి విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాను. రిఫరెన్స్ కోసం పలు వెబ్ సిరీస్ లు చూశాను. అలాగే లుక్ పరంగానూ మరింత దృఢంగా కనిపించే ప్రయత్నం చేశాను. ఒక నటుడిగా ఎప్పుడూ ఫిట్ గా ఉండటానికి ఇష్టపడతాను. అయితే ఇందులో అన్నయ్యని తిరిగి తీసుకురావడం కోసం ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే సమయంలో బల్క్ గా కనిపించాలనే ఉద్దేశంతో దాదాపు ఆరు నెలలు ప్రత్యేక కసరత్తులు చేశాను.→ నా తదుపరి సినిమాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్నాను. నా సినీ జీవితంలో మొదటిసారి రాయలసీమ నేపథ్యంలో చేస్తున్న చిత్రమిది. నాకు సీమ యాస అంటే చాలా ఇష్టం. అనంతరం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాను. ఆంధ్రా నేపథ్యంలో సరికొత్త కథతో ఆ చిత్రం ఉంటుంది. -
కొన్నిరోజులే బతుకుతా.. దీనస్థితిలో హీరో.. సాయం చేసిన కమెడియన్
సినిమా అనేది మాయా ప్రపంచం. స్టార్డమ్ ఉన్నంతకాలం వెండితెరపై ఓ వెలుగు వెలుగుతారు. కానీ ఫేడవుట్ అయ్యాక ఎవరూ పట్టించుకోరు. అప్పటిదాకా టిప్టాప్గా ఉన్న సెలబ్రిటీ బికారిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చేతినిండా సంపాదించిన తారలు చేతులు చాచి సాయం కోసం అర్థించే దీన పరిస్థితులూ ఎదురు కావొచ్చు. పైన కనిపిస్తున్న హీరో ఇప్పుడలాంటి స్థితిలోనే ఉన్నాడు. తనకు సాయం చేయమని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాడు.సినిమాఇంతకీ ఆ హీరో మరెవరో కాదు అభినయ్ కింగర్ (Abhinay Kinger). మలయాళ ప్రముఖ నటి టి.పి. రాధామణి కుమారుడే అభినయ్. తళుల్లువదో ఇళమై సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. జంక్షన్ అనే తమిళ మూవీలో హీరోగా నటించాడు. సక్సెస్, దాస్, పొన్ మేఘలై, సొల్ల సొల్ల ఇనిక్కుం, అరుముగం, ఆరోహణం వంటి పలు తమిళ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. మలయాళ సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. చివరగా 2014లో వచ్చిన వల్లవణుక్కు పుళ్లుం ఆయుధం సినిమా చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేవిద్యుత్ జమ్వాల్, మిలింద్ సోమన్, బాబు ఆంటోని వంటి నటులకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా తన గొంతు అరువిచ్చాడు. సినిమాలతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించాడు. అయితే అభినయ్.. దాదాపు దశాబ్దకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. ఇండస్ట్రీలో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దానికి తోడు అతడి ఆర్థిక పరిస్థితి కూడా అస్సలు బాగోలేదు. ప్రభుత్వం నడిపే క్యాంటీన్లో తింటూ బతుకు నెట్టుకొస్తున్నాడు. పూట గడవడమే కష్టంగా ఉన్న ఇతడు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడా వ్యాధి ముదిరిందని, తాను కొంతకాలం మాత్రమే బతుకుతానని దీనంగా చెప్తున్నాడు.కొన్నాళ్లే బతుకుతా..తాజాగా ఈ నటుడి దుస్థితి గురించి తెలుసుకున్న తమిళ కమెడియన్ కేపీవై బాలా.. అభినయ్ను కలిసి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు. ఈ సందర్భంగా అభినయ్.. నేను ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్ చెప్పారని తెలిపాడు. ఆ మాటతో భావోద్వేగానికి లోనైన బాలా.. నీకు తప్పకుండా నయమవుతుంది, మళ్లీ సినిమాలు చేస్తావు అని ధైర్యం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు.. అభినయ్ బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడని అంటున్నారు. అభినయ్కు సాయం చేసినందుకు బాలాను మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Balan Akassh Balaiyan Jaganathan (@bjbala_kpy) చదవండి: జాతీయ సినీ అవార్డులు.. ప్రైజ్మనీ ఎంత? ఎవరికి ఏమేం ఇస్తారంటే? -
జాతీయ సినీ అవార్డులు.. ప్రైజ్మనీ ఎంత? ఎవరికి ఏమేం ఇస్తారంటే?
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్ హవా కనిపించింది. 71వ జాతీయ సినీ అవార్డుల్లో (National Film Awards 2025) టాలీవుడ్ ఏడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది. 2023లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ నిలవగా.. ఉత్తమ నటుడిగా షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) అవార్డులు కొల్లగొట్టారు. అయితే వీరిద్దరూ రూ.2 లక్షల పురస్కారాన్ని చెరిసగం పంచుకోవాల్సి ఉంది. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకుగానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి పురస్కారం వరించింది. అవార్డుతో పాటు రూ.2 లక్షలు అందుకోనుంది. వీళ్లందరికీ ఇదే తొలి జాతీయ అవార్డు కావడం విశేషం! తెలుగు చలనచిత్రసీమకు ఏయే విభాగంలో జాతీయ అవార్డులు వచ్చాయి? వారికి ఎంత ప్రైజ్మనీ అందుతుందనే వివరాలను చూసేద్దాం..వారికి బంగారు పతకం2024 సంక్రాంతికి విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచిన ‘హను–మాన్’ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ) విభాగంలో పురస్కారాలు వచ్చాయి. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు, యానిమేటర్ జెట్టి వెంకట్ కుమార్కు బంగారు పతకంతో పాటు రూ.3 లక్షల నగదు చొప్పున అందజేయనున్నారు. జెట్టి వెంకట్ కుమార్.. వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గానూ వ్యవహరించినందున అతడికి మరో వెండి పతకంతో పాటు మరో రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు తీసుకోనున్నాడు.బేబీ సింగర్కు రూ.2 లక్షలు‘గాంధీతాత చెట్టు’ సినిమాకుగాను సుకృతికి ఉత్తమ బాలనటి పురస్కారం వరించింది. అయితే ఈ కేటగిరీలో మరో ఇద్దరికి అవార్డులు రావడంతో.. రూ.2 లక్షల ప్రైజ్మనీని ఈ ముగ్గురూ సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. బేబీ మూవీలో ప్రేమిస్తున్నా... పాటకు పీవీఎస్ఎన్ రోహిత్కు ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు వరించింది. ఇతడికి వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు రానున్నాయి.బేబీ డైరెక్టర్కు రూ.1 లక్ష ప్రైజ్మనీబెస్ట్ స్క్రీన్ప్లే విభాగంలో బేబీ రచయిత సాయి రాజేశ్తో పాటు మరో తమిళ దర్శకుడికి అవార్డు వరించింది. దీంతో అతడితో కలిసి రూ.2 లక్షల బహుమానాన్ని సమంగా పంచుకోవాల్సి ఉంటుంది. వీరికి వెండి పతకాలు బహుకరిస్తారు. బలగం సినిమాలో ‘ఊరు పల్లెటూరు..’ పాట రచయిత కాసర్ల శ్యామ్ బెస్ట్ లిరిక్ రైటర్గా వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు అందుకోనున్నాడు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. షైన్ స్క్రీన్స్ నిర్మాతలతో దర్శకుడు అనిల్ రావిపూడి రూ.2 లక్షల ప్రైజ్మనీని సమానంగా పంచుకోనున్నాడు.చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది -
‘కింగ్డమ్’ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. దీంతో తొలి రోజు రూ. 39 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్లోకి చేసింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో రెండో రూ. 14 కోట్ల వసూళ్లు వచ్చాయి. (చదవండి: అర్జున్రెడ్డికి నా రెమ్యునరేషన్ అంతే.. అదే ఎక్కువ!: విజయ్ దేవరకొండ)మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. (చదవండి: 'మహావతార్ నరసింహ' ఆల్టైమ్ రికార్డ్ .. కలెక్షన్స్ ఎంతంటే?)నైజాంలో రూ. 1.85 కోట్లు, సీడెడ్లో రూ. 79 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ.21 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, ఈస్ట్లో రూ. 26, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షల షేర్ వసూళ్లను సాధించింది. మొత్తంగా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 14.03 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. సినిమాకు మంచి టాక్ రావడంతో వీకెండ్లో ఈ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.That’s how #KINGDOM gets hailed big with the audience’s love 💥💥#BoxOfficeBlockbusterKingdom hits 53Cr+ worldwide gross in 2 days 🔥🔥🎟️ - https://t.co/4rCYFkzxoa@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @Venkitesh_VP @dopjomon… pic.twitter.com/xW6M0dd3s8— Sithara Entertainments (@SitharaEnts) August 2, 2025 -
అర్జున్రెడ్డి పారితోషికం.. అప్పుడు నాకదే ఎక్కువ: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అనగానే చాలామందికి గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి సినిమానే! పెళ్లిచూపులు సినిమాతో హీరోగా క్రేజ్ వచ్చినప్పటికీ 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం (Arjun Reddy Movie)తో దమ్మున్న హీరో అని నిరూపించుకున్నాడు. దాదాపు రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విధ్వంసమే సృష్టించింది. ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతోనే విజయ్ రేంజ్ మారింది. కింగ్డమ్కు తొలిరోజు భారీ కెలెక్షన్స్ఈ మధ్య ఫ్లాపులే ఎక్కువగా పలకరిస్తుండటంతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసిమీదున్నాడు విజయ్. ఈ క్రమంలోనే కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జూలై 31న రిలీజైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. తొలిరోజు ఈ చిత్రం ఏకంగా రూ.39 కోట్లు రాబట్టింది.అప్పుడదే ఎక్కువఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ.. కింగ్డమ్కు వస్తున్న రెస్పాన్స్పై సంతోషం వ్యక్తం చేశాడు. తనకు పేరు తెచ్చిపెట్టిన అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు చేసుకుంటూ.. అప్పుడు తన రెమ్యునరేషన్ రూ.5 లక్షలని, ఆ సమయంలో అదే తనకు పెద్ద అమౌంట్ అన్నాడు. ఇప్పుడు రిలీజైన కింగ్డమ్కు మంచి కలెక్షన్స్ వస్తుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో.. -
బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది'
బుల్లితెర నటి అంజలి పవన్ (Anjali Pavan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో నటి శోకసంద్రంలో మునిగిపోయింది. అమ్మ చనిపోయిన విషయాన్ని అంజలి.. సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అమ్మా, నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నువ్వు ఇచ్చిన ప్రేమ, నీ చిరునవ్వు, నీ మాటలు.. ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి. కాలం నిన్ను మా నుంచి దూరం చేసినా.. మా హృదయం నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు.నమ్మలేకపోతున్నాం..నీ ఆశీస్సుల వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాలకు దారి చూపిస్తుంది. అమ్మ ఆత్మకు శాంతి కలగాలి అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన ఇతర నటీనటులు.. అయ్యో, నమ్మలేకపోతున్నాం.. ఓం శాంతి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ మీ అమ్మగారు మీ కడుపున పుడతారు, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ అభిమానులు నటిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.రెండో ప్రెగ్నెన్సీ..మొగలిరేకులు సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న అంజలి ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోంది. 2017లో నటుడు సంతోష్ పవన్ను పెళ్లి చేసుకోగా వీరికి చందమామ అనే కూతురు ఉంది. ఇటీవలే రెండోసారి గర్భం దాల్చగా.. జూన్లో అంజలికి ఘనంగా సీమంతం కూడా చేశారు. త్వరలోనే మరో బుజ్జాయి ఇంట్లో అడుగుపెట్టనుందని సంతోషిస్తుండగా.. అంతలోనే అమ్మ మరణించడంతో నటి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అంజలి.. రాధా కల్యాణం, దేవత వంటి సీరియల్స్తో పాటు లెజెండ్, ఒక లైలా చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Anjali Attota (@anjaliattota) చదవండి: జాతీయ అవార్డ్స్.. వాళ్ల కష్టానికి ఫలితం అంటూ షారుక్ ఖాన్ -
అలాంటి సినిమాకు జాతీయ అవార్డా..? ముఖ్యమంత్రి ఫైర్!
‘ది కేరళ స్టోరీ’ సినిమాకు రెండు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, సినిమాటోగ్రఫీ) అవార్డులు వచ్చాయి. అయితే ఈ సినిమాకు అవార్డులు రావడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తప్పుపట్టారు. ‘‘మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా తీసిన సినిమాకు గౌరవాన్ని కల్పించడం అనేది సంఘ్పరివార్ విభజనాత్మక సిద్ధాంతాలను పరోక్షంగా అవార్డు జ్యూరీ కమిటీ సమర్థించినట్లే. అలాగే మత సామరస్యానికి చిరునామా అయిన కేరళను అవమానించినట్లే. ఇది కేవలం మలయాళీలను మాత్రమే కాదు... ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ బాధించే అంశం. రాజ్యాంగ విలువలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ స్వరం విప్పాలి’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు విజయన్ .By honouring a film that spreads blatant misinformation with the clear intent of tarnishing Kerala’s image and sowing seeds of communal hatred, the jury of the #NationalFilmAwards has lent legitimacy to a narrative rooted in the divisive ideology of the Sangh Parivar. Kerala, a…— Pinarayi Vijayan (@pinarayivijayan) August 1, 2025 -
National Film Awards: హనుమాన్కు జాతీయ అవార్డు.. ఉత్తమ చిత్రంగా..!
సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (71st National Film Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 12th ఫెయిల్ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. భగవంత్ కేసరికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం వరించింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ గేమ్ అండ్ కామిక్ విభాగంలో హనుమాన్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు. సుకుమార్ కూతురికి పురస్కారంమిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి గానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది. గాంధీ తాత చెట్టు చిత్రానికిగానూ సుకుమార్ కూతురు సుకృతి ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకుంది. నేషనల్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ విభాగంలో సామ్ బహదూర్ చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. 2023లో దేశవ్యాప్తంగా విడుదలైన వందలాది సినిమాల నుంచి అందిన నామినేషన్లను జ్యూరీ పరిశీలించి ఈ విజేతలను ఎంపిక చేసింది.71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల జాబితా..(ఫీచర్ ఫిలిం కేటగిరిలో..)ఉత్తమ సహాయ నటుడువిజయరాఘవన్ - పోక్కాలమ్ మలయాళ చిత్రంముధుపెట్టయి సోము భాస్కర్ - పార్కింగ్ తమిళ చిత్రంఉత్తమ సహాయ నటిఊర్వశి - ఉళ్లోళుక్కు మలయాళ చిత్రంజంకీ బోడివాల - వశ్ గుజరాతీ చిత్రంబెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్సుకృతి వేణి బండ్రెడ్డి - గాంధీ తాత చెట్టుకబీర్ ఖాండరి - జిప్సీ మరాఠి మూవీత్రిష తోసార్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్తాప్ - నాల్ 2 మరాఠీ మూవీఉత్తమ దర్శకుడుసుదీప్తో సేన్ -ద కేరళ స్టోరీఉత్తమ డెబ్యూ దర్శకుడుఆశిశ్ బెండె- ఆత్మపాంప్లెట్బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్పీవీఎన్ ఎస్ రోహిత్ - (ప్రేమిస్తున్నా.. బేబీ మూవీ)బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్శిల్పరావు (చెలియా.. జవాన్ మూవీ)బెస్ట్ సినిమాటోగ్రఫీప్రసంతను మొహపాత్ర - ద కేరళ స్టోరీబెస్ట్ లిరిక్స్ఊరు, పల్లెటూరు సాంగ్.. లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ (బలగం)బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)నందు, పృథ్వి (హనుమాన్)బెస్ట్ స్క్రీన్ప్లేఉత్తమ స్క్రీన్ప్లే రచయితసాయిరాజేశ్ నీలం (బేబీ)రాంకుమార్ బాలకృష్ణన్ (పార్కింగ్)డైలాగ్ రచయితదీపక్ కింగక్రాని (సిర్ఫ్ ఏక్ బండా కాఫి హై)ఉత్తమ చిల్డ్రన్స్ ఫిలిం: నాల్ 2 (మరాఠి మూవీ)బెస్ట్ కొరియోగ్రఫీ: దిండోరా బాజ్ రె పాట.. కొరియోగ్రాఫర్: వైభవి మర్చంట్ (రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని)బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్ కుమార్ (సాంగ్స్) - (వాతి), హర్షవర్ధన్ రామేశ్వర్ (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్)- (యానిమల్)బెస్ట్ మేకప్: శ్రీకాంత్ దేశాయ్ (సామ్ బహదూర్)బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: సచిన్ లోవలేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: మోహన్దాస్ (2018: ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో)బెస్ట్ ఎడిటింగ్: మిధున్ మురళి (పొక్కలాం- మలయాళ చిత్రం)బెస్ట్ సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరణ్- హరిహరణ్ మురళీధరన్ (యానిమల్)బెస్ట్ పాపులర్ ఫిలిం (హోల్సమ్ ఎంటర్టైన్మెంట్) - రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానిఉత్తమ ప్రాంతీయ చిత్రాల జాబితాఉత్తమ తమిళ చిత్రం - పార్కింగ్ఉత్తమ పంజాబీ చిత్రం - గొడ్డే గొడ్డే చాఉత్తమ మరాఠి చిత్రం - శ్యాంచీ ఆయ్ఉత్తమ మలయాళ చిత్రం - ఉల్లొళుఉత్తమ కన్నడ చిత్రం - కందిలుఉత్తమ హిందీ చిత్రం: కాథల్ఉత్తమ గుజరాతీ చిత్రం: వశ్ఉత్తమ ఒడియా చిత్రం- పుష్కరఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్ఉత్తమ అస్సామీస్ చిత్రం: రొంగటపు 1982స్పెషల్ మెన్షన్యానిమల్ (రీరికార్డింగ్ మిక్సర్) - ఎమ్ఆర్ రాజకృష్ణన్నాన్ ఫీచర్ ఫిలిం విజేతల జాబితాబెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం: ఫ్లవరింగ్ మ్యాన్ (హిందీ) బెస్ట్ డైరెక్షన్: పీయూశ్ ఠాకూర్ (ద ఫస్ట్ ఫిలిం)బెస్ట్ స్క్రిప్ట్: సన్ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ) - కథారచయిత- చిదానంద నాయక్బెస్ట్ వాయిస్ ఓవర్: ద సేక్రడ్ జాక్: ఎక్స్ప్లోరింగ్ ద ట్రీ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్) - (వాయిస్ ఓవర్: హరికృష్ణన్ ఎస్)బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ప్రణీల్ దేశాయ్ (ద ఫస్ట్ ఫిలిం -హిందీ)బెస్ట్ ఎడిటింగ్: నీలాద్రి రాయ్ (మూవింగ్ ఫోకస్)బెస్ట్ సౌండ్ డిజైన్: శుభరుణ్ సేన్గుప్తా (దుండగిరి కె పూల్)బెస్ట్ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ చిత్రం) - శరవణముత్తు సౌందరపండి, మీనాక్షి సోమన్బెస్ట్ ఫిలిం క్రిటిక్: ఉత్పల్ దత్తా (అస్సామీస్)బెస్ట్ డైరెక్షన్: పీయూశ్ ఠాకూర్ (ద ఫస్ట్ ఫిలిం)ఉత్తమ షార్ట్ ఫిలిం: గిద్ ద స్కావెంజర్బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం (సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ వాల్యూస్): ద సైలెంట్ ఎపిడమిక్ (హిందీ)బెస్ట్ డాక్యుమెంటరీ: గాడ్ వల్చర్ అండ్ హ్యుమన్ (ఇంగ్లీష్, హిందీ, తెలుగు)బెస్ట్ ఆర్ట్స్/కల్చర్ ఫిలిం: టైమ్లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)బెస్ట్ బయోగ్రఫికల్/హిస్టారికల్ రికన్స్ట్రక్షన్ ఫిలిం: మా బో, మా గాన్ (ఒడియా చిత్రం), లెంటినా ఓ: ఎ లైట్ ఆన్ ద ఈస్టర్న్ హారిజన్ (ఇంగ్లీష్ చిత్రం)బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: శిల్పిక బోర్డొలాయ్ (మావ్: ద స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరియూ- మిజోరాం చిత్రం)స్పెషల్ మెన్షన్1. నేకల్: క్రోనికల్ ఆఫ్ ద పాడీ మ్యాన్ (మలయాళం)2. ద సీ అండ్ సెవన్ విలేజెస్ (ఒడియా)చదవండి: ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్ -
గర్భంతో ఉండగా అలా ఎలా చేశావ్?: లావణ్య త్రిపాఠి సోదరి
హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నుంచి సినిమా వచ్చి చాలాకాలమే అవుతోంది. 2022లో వచ్చిన హ్యాపీ బర్త్డే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఆ మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కి కాస్త గ్యాప్ తీసుకుంది. పెళ్లి తర్వాత ఆమె ఓకే చెప్పిన ప్రాజెక్ట్ సతీ లీలావతి. గతేడాది డిసెంబర్లో లావణ్య ఈ సినిమాలో భాగమైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. మే నెలలో చిత్రీకరణ వేగవంతం చేశారు. మరోపక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా కానిచ్చేశారు. గర్వంగా ఉందిమొత్తానికీ సినిమాను ఇటీవలే విజయవంతంగా పూర్తి చేశారు. రెండు రోజుల క్రితమే సతీలీలావతి టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రెగ్నెన్సీతో ఉండగానే చాలా వరకు సినిమా షూటింగ్లో పాల్గొందట లావణ్య. ఈ విషయాన్ని లావణ్య అక్క శివాని త్రిపాఠి వెల్లడించింది. సతీలీలావతి టీజర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లావణ్య, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ ట్రిమిస్టర్ (ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు) మొత్తం పని చేస్తూనే ఉన్నావు, అలా ఎలా చేయగలిగావు? ప్రతిసారిలాగే ఈసారి కూడా టాలెంట్తో చంపేశావు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్టుకు లావణ్య థాంక్యూ అని రిప్లై ఇచ్చింది.ప్రేమ పెళ్లివరుణ్ తేజ్, లావణ్య 'మిస్టర్' సినిమాలో తొలిసారి జంటగా నటించారు. ఆ సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. ఈ ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో 2023లో పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో వివాహం జరగ్గా, హైదరాబాద్ గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మే నెలలో.. లావణ్య గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న లావణ్య.. ఓటీటీలో పులిమేక, మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్లు చేసింది. చదవండి: ఆ క్లబ్బులో చేరిన 'మహావతార్ నరసింహ'.. కలెక్షన్స్ ఎంతంటే? -
ఆ క్లబ్బులో చేరిన 'మహావతార్ నరసింహ'.. కలెక్షన్స్ ఎంతంటే?
ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ అద్భుతాలు సృష్టిస్తున్న చిత్రం మహావతార్ నరసింహ (Mahavatar Narsimha Movie). జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నిజానికి ఈ చిత్రం మొదటి రోజు కేవలం రూ.1.75 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. కానీ మౌత్ టాక్ బాగుండటంతో ఏరోజుకారోజు వసూళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పలుచోట్ల థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయి. దీంతో వారం రోజుల్లోనే నరసింహ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మేరకు హోంబలే ఫిలింస్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది.నరసింహస్వామి కథపురాణాల్లో ఉన్న భక్త ప్రహ్లాద- నరసింహస్వామి కథే మహావతార్: నరసింహ. ఈ యానిమేషన్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించింది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం అందించాడు. డైరెక్టర్ అశ్విన్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ .. గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది.విష్ణు దశావతరాలుహోంబలే ఫిలింస్.. క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి పన్నెండేళ్ల ప్రణాళికతో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రారంభించింది. శ్రీవిష్ణువు దశావతారాల ఆధారంగా ఈ యూనివర్స్లో సినిమాలు తెరకెక్కనున్నాయి. ఈ యూనివర్స్లో వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయి, చైతన్య దేశాయి నిర్మించారు. రాబోయే సినిమాలు..ఈ చిత్రం 3డీ ఫార్మాట్లో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2025లో నరసింహ (ఆల్రెడీ రిలీజైంది), 2027లో పరశురామ, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 ’ చిత్రాలను విడుదల చేస్తామని హోంబలే గతంలో వెల్లడించింది. 53 CRORES India GBOC and counting… 💥The unstoppable #MahavatarNarsimha continues to reign supreme at the box office.Witness the divine rage unfold on the big screen 🦁🔥#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan @AshwinKleem @SamCSmusic… pic.twitter.com/ZeV8LDDelc— Hombale Films (@hombalefilms) August 1, 2025చదవండి: ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్ -
ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్
బుల్లితెర బ్యూటీ సిరి హన్మంత్ బిగ్బాస్ షోతో పాపులర్ అయింది. ఉయ్యాలా జంపాలా సీరియల్తో నటనవైపు అడుగులు వేసిన సిరి.. సావిత్రమ్మగారి అబ్బాయి, అగ్నిసాక్షి వంటి సీరియల్స్లో నటించి ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ బిచ్చగాళ్లు, మేడం సార్ మేడం అంతే, రామ్ లీలా, పులి మేక వంటి వెబ్ సిరీస్లతో ఫుల్ పాపులర్ అయింది. తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. చీరలో అందంగా సిరిఆ మధ్య వచ్చిన షారూఖ్ ఖాన్ జవాన్ చిత్రంలోనూ చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. తాజాగా ఈ బిగ్బాస్ బ్యూటీ ప్రియుడు, నటుడు శ్రీహాన్తో కలిసి వరలక్ష్మి వ్రతం పూజ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీహాన్ పంచెకట్టులో ఉండగా సిరి చీరలో అందంగా ముస్తాబైంది. ఇది చూసిన కొందరు పెళ్లి కాకుండా ఇలా జంటగా వరలక్ష్మి వ్రతం చేయొచ్చా? అని సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. అందుకే పెళ్లి ఆలస్యం?కాగా సిరి, శ్రీహాన్ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చాలాకాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. ఓ బాబును దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. సిరి-శ్రీహాన్ పెళ్లి గురించి ఎన్ని రూమర్లు వచ్చినా వీరు మాత్రం వాటిని పట్టించుకోనట్లే ఉంటున్నారు. దానికింకా టైముంది అన్నట్లుగానే ఓ ఎక్స్ప్రెషన్ పడేస్తున్నారు. అయితే ఓ సందర్భంలో సిరి మాట్లాడుతూ.. చిన్నప్పుడే తండ్రికి దూరం కావడంతో చాలా కష్టాలు చూశా. అందుకే, బాగా సెటిల్ అయి., మంచి స్థాయికి చేరుకున్నాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) చదవండి: వాళ్లు ఒప్పుకోకపోయినా నేనింకా హీరోయిన్నే.. 60 ఏళ్ల సీనియర్ నటి -
వాళ్లు ఒప్పుకోకపోయినా నేనింకా హీరోయిన్నే.. 60 ఏళ్ల సీనియర్ నటి
శాంతి కృష్ణ (Shanthi Krishna).. మలయాళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. మలయాళంలోనే కాదు, తమిళ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. తెలుగులో ప్రియురాలు అనే ఏకైక చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే ఇప్పటికీ తనకు హీరోయిన్గానే నటించాలనుందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శాంతి కృష్ణ మాట్లాడుతూ.. మోహన్లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు నన్ను హీరోయిన్గా పరిగణించరు. హీరోయిన్గా చేస్తా...ఫహద్ ఫాజిల్, నివిన్ పౌలీ వంటి హీరోలకు తల్లిగా నటించాక నన్నెందుకు కథానాయికగా తీసుకోవాలనుకుంటారు? కానీ, ఇప్పటికిప్పుడు నన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీసినా.. మలయాళ ప్రేక్షకులు పెద్ద మనసుతో ఆదరిస్తారు. ఇప్పటికీ వారి మనసుల్లో నాకు ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పుకొచ్చింది. శాంతి కృష్ణకు ఇప్పుడు 60 ఏళ్లు. కొన్నాళ్లపాటు బెంగళూరులో ఉన్న ఆమె ప్రస్తుతం కొచ్చిలో సెటిలైంది. ఇప్పుడు హ్యాపీగా ఉందిదీని గురించి నటి మాట్లాడుతూ.. నేను మళ్లీ కేరళకుట్టిగా మారిపోయాను. కొచ్చిలో ఇల్లు తీసుకున్నాను. దీనికి శ్రీకృష్ణం అనే పేరు పెట్టాను. శ్రీ కృష్ణుని ఆలయం పక్కనే మా ఇల్లు ఉండటంతో అదే పేరు నా నివాసానికి పెట్టుకున్నాను. పిల్లల చదువుల కోసం చాలా ఏళ్లు బెంగళూరులో ఉన్నాను. చివరకు నా మనసుకెంతో దగ్గరైన ప్రదేశంలోనే ఇల్లు తీసుకుని సంతోషంగా జీవిస్తున్నాను. ఇక్కడికి షిఫ్ట్ అవమని నా స్నేహితులు పదేపదే చెప్పారు. మొత్తానికి ఇక్కడికి వచ్చేశాక మనసుకెంతో తృప్తిగా ఉంది అని చెప్పుకొచ్చింది.చదవండి: కింగ్డమ్ తొలిరోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ మాస్ కమ్బ్యాక్ -
కింగ్డమ్ తొలిరోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ మాస్ కమ్బ్యాక్
హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కోటి ఆశలు పెట్టుకున్న కింగ్డమ్ మూవీ (Kingdom Movie) జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కొంత నెగెటివ్ టాక్ ఉన్నప్పటికీ పాజిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఎంతన్నదానిపై అందరి దృష్టి పడింది. కానీ, ఎవరి లెక్కలకు అందనంతంగా భారీ కలెక్షన్స్ వచ్చాయి. కింగ్డమ్.. తొలి రోజు ఏకంగా రూ.39 కోట్లు రాబట్టింది.హిట్టు కొట్టినంఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ను రౌడీ హీరో షేర్ చేస్తూ మనం (హిట్) కొట్టినం అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇది విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్..! ఇకపోతే కింగ్డమ్ వీకెండ్లో రాలేదు, అందులోనూ హాలీడే అసలే లేదు. అయినా ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లైగర్ మూవీ వచ్చినప్పుడు ఎన్నెన్ని మాటలన్నారు.. అప్పుడు ఎత్తిన నోళ్లు దించుకునేలా మా హీరో కింగ్డమ్తో సమాధానం చెప్పాడని సంతోషపడుతున్నారు.ఆ సినిమాలతోనే పోటీఅయితే ఈ చిత్రానికి.. మహావతార్ నరసింహ, సయారా చిత్రాల నుంచి గట్టి పోటీనే ఉంది. హరిహర వీరమల్లును జనాలు ఎలాగో లైట్ తీసుకున్నారు కాబట్టి ఇదేమంత పోటీ కాదు. మున్ముందు కింగ్డమ్ ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి! కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించారు. సత్యదేవ్, వెంకటేశ్, కసిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. BOOM 💥🔥Manam Kottinam 🤗❤️ https://t.co/FOqpt7dxjK— Vijay Deverakonda (@TheDeverakonda) August 1, 2025చదవండి: రెమ్యునరేషన్ విషయంలో అజిత్ సరికొత్త ఢీల్ -
అనుష్కా శెట్టి ‘ఘాటి’ రిలీజ్ అప్పుడేనా?
అనుష్కా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఘాటి’. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో జాగర్ల మూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. జూలైలో విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను నవంబరులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. వీఎఫ్ఎక్స్ వర్క్స్పై మరింత శ్రద్ధ పెట్టి, మంచి క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది టీమ్ ప్లాన్. దీంతో ఓ దశలో సెప్టెంబరులో రిలీజ్ అనుకున్నప్పటికీ నవంబరులో అయితే మరిన్ని థియేటర్స్ కూడా దొరకుతాయని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కు మరింత సమయం లభిస్తుందని కూడా చిత్రయూనిట్ ఆలోచిస్తోందట. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ‘ఘాటి’ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళంతో సహా పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్. -
భాగ్యనగరంలో భారీ సెట్స్.. స్టార్ హీరోల షూటింగ్ అప్డేట్స్
తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు ఇక్కడే నివాసం ఉంటుంటారు (ఇతర భాషల వాళ్లు మినహా). సినిమా షూటింగ్లకు అనువైన స్టూడియోలు ఇటు భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్టింగులు వేసి చిత్రీకరణలు జరుపుతుంటారు మేకర్స్. ప్రస్తుతం భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్లు భలే జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, పవన్కల్యాణ్, ఎన్టీఆర్, రామ్చరణ్, నాగచైతన్య, రామ్ పోతినేని, విజయ్ సేతుపతి, సాయిదుర్గా తేజ్, తేజా సజ్జా, అఖిల్ అక్కినేని, సిద్ధు జొన్నలగడ్డ వంటి పలువురు హీరోలు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషా రుగా పాల్గొంటున్నారు. ఇక భాగ్యనగరంలో ఎవరెక్కడ? షూటింగ్లో పాల్గొంటున్నారో ఆ విశేషాలేంటో చూద్దాం...అజీజ్ నగర్లో రాజా సాబ్ ‘బాహుబలి’ సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతోంది. ప్రభాస్తో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మారుతి. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాత పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయిందట.. మరో పది శాతం చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని టాక్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరగా షూటింగ్ని పూర్తి చేసి ఈ సినిమాకి ఎంతో కీలకం కానున్న గ్రాఫిక్స్ పనులపై దృష్టి పెట్టనున్నారట మారుతి. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నాయని టాక్. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉస్తాద్ హీరో పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ‘గబ్బర్ సింగ్’ (2012) చిత్రం మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ΄ోలీసాఫీసర్ ΄ాత్ర చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇటీవల ఈ సినిమా పతాక సన్నివేశాలు పూర్తయినట్లు ప్రకటించారు మేకర్స్. క్లైమాక్స్లో భాగంగా నబకాంత మాస్టర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. డ్రాగన్ జోరు ‘దేవర’ వంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్తో ΄ాటు ఇతర తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు చూడనటువంటి మాస్ లుక్లో ఎన్టీఆర్ని చూపించనున్నారు దర్శకుడు. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్– ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ΄÷ందుతోన్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జూన్ 25న విడుదలకానుంది. శంకరపల్లిలో పెద్ది రామ్చరణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో(2021) బ్లాక్బస్టర్ అందు కున్న బుచ్చిబాబు సానా ‘పెద్ది’కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ΄ాన్ ఇండియా మూవీలో రామ్చరణ్కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లో సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. రామ్చరణ్తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అలాగే భాగ్యనగరం సమీపంలోని ఓ ప్రముఖ స్టూడియోలో నైట్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. రామ్చరణ్, జాన్వీలపై ఈ సాంగ్ని చిత్రీకరించనున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రత్యేకమైన సెట్లో... ‘తండేల్’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకోవడంతో ΄ాటు వంద కోట్ల క్లబ్లో చేరారు నాగచైతన్య. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీని తెరకెక్కించిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీ చౌదరి, ఇతర తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. మిస్టీక్ థ్రిల్లర్గా భారీ బడ్జెట్తో రూ΄÷ందుతోన్న ఈ సినిమాలో నాగచైతన్య సరికొత్త లుక్లో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన ఫిజికల్గానూ కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కూడా. ‘తండేల్’ తర్వాత నాగచైతన్య, ‘విరూ΄ాక్ష’ తర్వాత కార్తీక్ వర్మ కాంబినేషన్లో రానున్న ‘ఎన్సీ 24’ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ముచ్చింతల్లో ఆంధ్ర కింగ్ రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా, కన్నడ హీరో ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. రామ్–భాగ్యశ్రీలతో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను రూ΄÷ందిస్తున్నారట దర్శకుడు. ఈ చిత్రంలో సూపర్స్టార్గా నటించిన ఉపేంద్రకి వీరాభిమానిగా రామ్ కనిపించనున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో... విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. టబు, కన్నడ నటుడు విజయ్ కుమార్ కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్పై పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ ΄ాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ సేతుపతితో ΄ాటు ఇతర నటీనటులు ఈ షెడ్యూల్ చిత్రీకరణలో ΄ాల్గొంటున్నారట. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. బూత్ బంగ్లాలో లెనిన్ అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న చిత్రం ‘లెనిన్’. ‘ఏజెంట్’ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న చిత్రం ఇది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం ఫుల్ మాస్ లుక్లోకి మారిపోయారు అఖిల్. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో అఖిల్, ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. అయితే కొద్ది రోజులు షూటింగ్లో పాల్గొన్న అనంతరం ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఇందుకుగల కారణాలు మాత్రం బయటకు రాలేదు. అఖిల్కి జోడీగా ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తుక్కుగూడలో సంబరాలు... సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరో, హీరోయిన్తో ΄ాటు ఇతర తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట రోహిత్ కేపీ. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 25న ప్రేక్షకులముందుకు రానుంది. పతాక సన్నివేశాల్లో యోధ ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జా ‘హను–మాన్’ (2024) చిత్రంతో ΄ాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న మరో ΄ా¯Œ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ‘మిరాయ్’ చిత్రం 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లో సెప్టెంబర్ 5న విడుదలకానుంది. శంకరపల్లిలో తెలుసు కదా ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధం, వినోదం, భావోద్వేగాల నేపథ్యంలో రూ΄÷ందుతోన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా హీరో హీరోయిన్లతో ΄ాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు నీరజ కోన. దీ΄ావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ జరుపుకుంటున్న సినిమాలు పైన పేర్కొన్నవి కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
‘హ్రీం’ హిట్ కొట్టాలి: సందీప్ కిషన్
పవన్ తాత, చమిందా వర్మ జంటగా నటిస్తోన్న నూతన చిత్రం ‘హ్రీం’. రాజేశ్ రావూరి ఈ చిత్రంతో దర్శకునిగా మారనున్నారు. శివమ్ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ హీరో సందీప్కిషన్ క్లాప్నివ్వగా నటులు అలీ, బెనర్జీ, తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఆడిటర్గా ఉన్న విజయేంద్రరెడ్డి, సినిజోష్ అధినేత రాంబాబు పర్వతనేని దర్శకుడు రాజేశ్కి స్క్రిప్ట్ని అందించారు. నటులు రాజీవ్ కనకాల కెమెరా స్విఛాన్ చేశారు.చిత్ర ప్రారంభోత్సవం తర్వాత సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘ నా తొలి చిత్రం నుండి ఈ చిత్ర నిర్మాతతో పరిచయం ఉంది. నాకున్న అతికొద్ది మంది మీడియా ఫ్రెండ్స్లో శివ మల్లాల ఎంతో ముఖ్యుడు. ఆయన తీస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ – ‘హ్రీం’ చిత్ర నిర్మాతలు శివమల్లాల , సుజాతలు నాకు కుటుంబ సభ్యులు. వారు నిర్మించ తలపెట్టిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా’ అన్నారు. నటుడు బెనర్జీ మాట్లాడుతూ–‘‘ ఈ సినిమాలో నేను చాలా మంచి పాత్రలో నటిస్తున్నా. తమ్ముడు శివ నాకు ఎంతో ఆప్తుడు. హీరో, హీరోయిన్ పవన్, చమిందా, దర్శకుడు రాజేశ్కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.రాజీవ్ కనకాల మాట్లాడుతూ– ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర పోసిస్తున్నాను. ‘హ్రీం’ చిత్ర హీరోయిన్ చమిందా వర్మ నటే కాదు. దుబాయ్ నుండి తెలుగులో నటించటానికి వచ్చిన తెలుగమ్మాయి. ఆమె డాక్టర్ కూడా. ఈ చిత్రంలో నటిస్తున్న పవన్ తాతా, దర్శకుడు రాజేశ్ నాకు ముందునుండి పరిచయం ఉంది. వారిద్దరికి ఎంతో టాలెంట్ ఉంది. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. నాకు 25 ఏళ్లున్నప్పటినుండి ‘హ్రీం’ చిత్ర నిర్మాత శివ మల్లాల నాకు తెలుసు. ఈ సినిమా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. -
నా సినిమా టిక్కెట్ రూ.20: అమితాబ్ పోస్ట్ పై చర్చ...
ప్రతి ఆదివారం జుహులో తన ఇంటి ముంగిటకు వచ్చే అభిమానులను పలకరించే దశాబ్దాల సంప్రదాయానికి పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ ఇంకా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ బాలీవుడ్ మెగాస్టార్ అభిమానులను పలకరించిన తరువాత తన బ్లాగులో ఈ సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను, కొన్ని సందేశాలను కూడా పంచుకుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే అదే విధంగా ఆయన తాజాగా కూడా ఓ పోస్ట్ పెట్టారు. అందులో భావోద్వేగ భరిత సందేశాలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటి కన్నా అందరినీ ఆకట్టుకుంది 1975 నాటి భారతీయ సంచలనం... క్లాసిక్ సినిమా ’షోలే’ సినిమా టిక్కెట్. దాదాపు 50 ఏళ్ల వయసు కలిగిన ఈ టిక్కెట్ను అత్యంత జాగ్రత్తగా భధ్రపరచిన అమితాబ్ సోషల్ మీడియా ద్వారా దానిని అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఈ టిక్కెట్ ధర కేవలం రూ. 20 మాత్రమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు .ఆయన తన పోస్ట్లో ‘‘‘’షోలే’ టికెట్ను జాగ్రత్తగా భద్రపరిచా... ఈ టిక్కెట్ అప్పుడు రూ. 20 !! ధర.. ఈ రోజుల్లో థియేటర్ హాళ్లలో ఎరేటెడ్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింక్) ధర అదే నని నాకు చెప్పారు. అది నిజమా?? చెప్పడానికి చాలా ఉంది, కానీ చెప్పడానికి కాదు.. ఆప్యాయత ప్రేమ,‘ అంటూ ఆయన ఆ పోస్ట్లో నర్మగర్భంగా రాశారు.అయితే అమితాబ్ తన దగ్గరున్న ఈ టికెట్ ను పోస్ట్ చేయడం ఎంత ఆసక్తి కలిగించిందో నెటిజన్ల పాజిటివ్ రెస్పాన్స్ అందుకుందో.. అలాగే ఆయన రూ.20కి థియేటర్లో సాఫ్ట్ డ్రింక్ కొనవచ్చునని అనడం కూడా అంత చర్చకు దారి తీసింది. ఎందుకంటే ప్రస్తుతం ధియేటర్లలో రూ.20కి సాఫ్ట్ డ్రింక్ కొనే పరిస్థితి లేదు. రూ.100 ఆ పై ధరల్లో మాత్రమే అవి అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో అమితాబ్ రూ.20కే లభిస్తాయనడంతో... సెలబ్రిటీలకు ధరలపై ఉన్న అవగాహన చాటుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ల ధరలు అదే విధంగా తినుబండారాల ధరలకు సంబంధించిన సోషల్ చర్చకు కూడా బిగ్ బి పోస్ట్ దారి తీసింది.మరోవైపు 1975లో విడుదలైన ‘షోలే‘, వచ్చే ఆగస్టు 15తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, ఇందులో అమితాబ్తో పాటు ధర్మేంద్ర కూడా నటించారు ఈ సినిమా ఆ సంవత్సరం భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, జై వీరు (అమితాబ్ మరియు ధర్మేంద్ర పోషించారు) అనే ఇద్దరు మాజీ ఖైదీల చుట్టూ తిరుగుతుంది, నటులు అమ్జాద్ ఖాన్, సంజీవ్ కుమార్ మరియు హేమ మాలిని మరియు జయ బచ్చన్ ఈ చిత్రంలోని తారాగణాన్ని ముగించారు. -
నచ్చిన దుస్తులు ధరిస్తే.. విలువలను కోల్పోయినట్లా: అనసూయ
తనపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నవారిపై నటి, యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj ) తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని సోషల్ మీడియా చానల్స్ తనను లక్ష్యంగా చేసుకొని ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ సుధీర్గమైన పోస్ట్ని షేర్ చేశారు.(చదవండి: హిట్ అండ్ రన్ కేసులో నటి అరెస్ట్)‘నాపై ఎవరు కామెంట్ చేస్తున్నా..ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నాను. కానీ కొంతమంది నా జీవన విధానంపైనే విమర్శలు చేస్తుంటే స్పందించక తప్పడం లేదు. కొన్ని సోషల్ మీడియా చానల్స్ నన్నే లక్ష్యంగా చేసుకొని అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. కొంతమంది మహిళలనే నన్ను విమర్శిస్తూ వీడియోలు చేస్తున్నారు. వారెవరో నాకు తెలియదు. వారికి నేను తెలియదు. అయినా కూడా నా వ్యక్తిత్వంపై మాట్లాడుతున్నారు. నేను ధరించే దుస్తులపై కామెంట్ చేస్తున్నారు. (చదవండి: కింగ్డమ్లో ఎవరా స్టార్ హీరో?.. విజయ్ దేవరకొండ)అవును.. నేను ఒక స్త్రీని, భార్యని, ఇద్దరు పిల్లల తల్లిని. నాకు సెట్ అయ్యే దుస్తులను ధరించడాన్ని నేను ఆస్వాదిస్తా. నేను ఒక తల్లిగా ప్రవర్తించడంలేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. తల్లికావడం అంటే మనల్ని మనం వదులుకోవడమా? నా భర్త, పిల్లలను నన్ను ప్రేమిస్తున్నారు. నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. వారెప్పుడు నన్ను జడ్జ్ చేయలేదు. బోల్డ్గా ఉండటమంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్టు కాదు. నేను ఇష్టపడే విధంగా దుస్తులు ధరిస్తున్నానంటే నేను నా విలువలను కోల్పోయానని కాదు. నన్ను ఆదర్శంగా తీసుకోమని ఎవరికి చెప్పడం లేదు. నాకు నచ్చినట్లుగా నేను బతుకున్నాను. మీకు నచ్చినట్లుగా మీరు బతకండి’ అని అనసూయ ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
Ekta Kapoor: 17 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. ముచ్చటగా మూడు దశాబ్దాలు
వినోద పరిశ్రమలో మూడు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఏక్తా కపూర్. ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంది. తనను తాను తీర్చిదిద్దుకుంది. పదిహేడు సంవత్సరాల వయసులో కెరీర్ ప్రారంభించిన ఏక్తా కపూర్ హిందీలో ఎన్నో టీవీ సోప్ ఒపెరాలను నిర్మించింది. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ ‘కహాని ఘర్ ఘర్ కీ’... వంటివి వాటిలో బాగా పాపులర్ అయ్యాయి.‘బాలాజీ మోషన్ పిక్చర్స్’ బ్యానర్పై నిర్మాతగా ‘ది డర్టీ పిక్చర్’ ‘డ్రీమ్ గర్ల్’ ‘క్రూ’లాంటి సినిమాలు నిర్మించింది. 2017లో వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్ఫామ్ ‘ఆల్ట్ బాలాజీ’ప్రారంభించింది.ఏక్తా కపూర్ది నల్లేరు మీద నడకేమీ కాదు. మొదట్లో కొన్ని ప్రాజెక్ట్లు ఫెయిల్ అయ్యాయి. ఆరు పైలట్ ఎపిసోడ్లు రిజెక్ట్ అయ్యాయి.‘హమ్ పాంచ్’ టీవీ సిరీస్ రూపంలో తొలి సక్సెస్ వచ్చింది. ఇక ఆ తరవాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆంగ్ల ఆక్షరం ‘కె’ను లక్కీ ఆల్ఫాబెట్గా భావించే ఏక్తా ‘కె’తో ప్రారంభమయ్యే టైటిల్తో ఎన్నో షోలు నిర్మించింది. ఏక్తాకపూర్ అదృష్టాన్ని నమ్ముకుందా, తన కష్టాన్ని నమ్ముకుందా అనే విషయానికి వస్తే... ఒక ప్రసిద్ధ మాటను గుర్తు తెచ్చుకోవడం అవసరం.‘కష్టపడేవారినే అదృష్టం ఇష్టపడుతుంది’‘కింగ్డమ్ ఆఫ్ ది సోప్ క్వీన్: దీ స్టోరీ ఆఫ్ బాలజీ టెలిఫిల్మ్’ పేరుతో ఏక్తా కపూర్ బయోగ్రఫీ వచ్చింది. -
ఆ విషయంలో మేము పాస్ అయ్యాం : నాగవంశీ
‘ఈమధ్య కాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ పరంగా చూస్తే మేము(కింగ్డమ్) పాస్ అయ్యాం. బుకింగ్స్ బాగున్నాయి. మంచి వసూళ్లతో సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ.. ‘ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాదు. గౌతమ్ తిన్ననూరి శైలి ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఈ సినిమా కోసం సెట్స్ వేయలేదు. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. మా టీమ్ పడిన కష్టం మీకు తెర మీద కనిపిస్తుంది." అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘జెర్సీ' సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి 'కింగ్డమ్' ఇది. ఈ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. చరిత్రలో ఏ యుద్ధం చూసుకున్నా.. కుటుంబం కోసమో, పుట్టిన నేల కోసమో, ప్రేమ కోసమో ఉంటుంది. ఈ యుద్ధం కూడా అలాంటిదే. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు 'కింగ్డమ్' ప్రపంచంలోకి వెళ్తారు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి అనుభూతిని ఇస్తుంది." అన్నారు. ‘విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని భాగ్యశ్రీ బోర్సే అన్నారు. -
హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్
హిట్ అండ్ రన్ కేసులో అస్సాం నటి నందినీ కశ్యప్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం ఉత్తర గౌహతిలోని రాజధాని థియేటర్ రిహార్సల్ వద్ద ఆమెను అరెస్ట్ చేసి దిస్పూర్లోని మహిళా పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 25న నందినీ తన కారుతో ఓ స్టూడెంట్ను ఢీ కొట్టి, అక్కడ నుంచి పారిపోయారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు నటిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ విద్యార్థి మంగళవారం రాత్రి మరణించాడు.ఢికొట్టి..ఆపై పారిపోయి..ఈ నెల 25న ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంతో నందినీ 120 కి.మీ వేగంతో కారును నడుపుతూ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సమియుల్ హక్ అనే 21 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె గాయపడిన విద్యార్థికి సాయం చేయకుండా అక్కడ నుంచి పారిపోయింది. నందినీ కశ్యప్ మద్యం మత్తులో ఉందని, ప్రమాదం జరిగిన వెంటనే ఆమె ఆగకుండా అక్కడి నుండి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.ఈ ఘటనపై హిట్ అండ్ రన్ సు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో నందినీని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమియుల్ హక్ తల్లి విలపిస్తూ తన కొడుకుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.నందినీ కశ్యప్ అస్సామీ చిత్రసీమలో ప్రముఖ నటి, రంగస్థల ప్రదర్శనల్లో కూడా గుర్తింపు పొందారు. అస్సామీ సాంస్కృతిక నాటకాలు, థియేటర్ ప్రదర్శనల్లో ఆమె పాత్రలు స్థానిక కళా ప్రేమికుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. -
జపాన్లో నాగార్జున పేరు ‘నాగ్–సమా’ ఎందుకంటే...
గత కొంత కాలంగా భారతీయ నటులు, ముఖ్యంగా దక్షిణాది హీరోలకు జపాన్లో బ్రహ్మరధం పడుతున్నారు. ఈ ట్రెండ్ని టాప్ లెవల్కి చేర్చింది సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అనడం లో సందేహం లేదు. రోబో వంటి సినిమాల ద్వారా ఆయనకు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్, ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా జూ.ఎన్టీయార్ వంటి టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా జపాన్ సినీ అభిమానుల మనసుల్లో ప్రత్యేక అభిమానం సంపాదించారు.ప్రస్తుతం వీరి సినిమాల కలెక్షన్లు అక్కడ భారీ స్థాయిలో ఉంటున్నాయి. అదే క్రమంలో ప్రస్తుతం జపాన్లో మరో హీరో కూడా స్థానికుల ఆదరణ పొందుతున్నట్టు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు... తెలుగు సీనియర్ స్టార్, కింగ్, అక్కినేని నాగార్జున. ఇటీవల ఆయన జపాన్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు, అంతేకాదు అక్కడ ఆయనను ప్రత్యేకమైన పేరుతో పిలుచుకుంటున్నారు. అక్కడి అభిమానులు నాగార్జునను ’నాగ్–సామ’ అని ఇష్టంగా పేర్కొంటున్నారు.ఇటీవల నాగార్జున నటించిన పలు చిత్రాలు జపాన్ ప్రేక్షకులకు ఆయనను దగ్గర చేశాయి. ముఖ్యంగా హిందీలో రూపొందిన బ్రహ్మాస్త్ర లో నాగార్జున ప్రత్యేక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అదే విధంగా తాజాగా విడుదలై సూపర్ హిట్ అయిన కుబేరా సినిమాలో నాగార్జున చేసిన కీలక పాత్ర కూడా అక్కడి వారి ఆదరణ చూరగొంది. దాంతో జపాన్లో అభిమానులను దక్కించుకున్న భారతీయ నటుల సరసన నాగార్జున కూడా చేరారు.జపాన్ సంస్కతిలో, దేవుళ్ళు, రాజవంశం లేదా గొప్ప స్థాయి వ్యక్తులు వంటి ఉన్నత గౌరవం ఉన్న వ్యక్తులకు ‘సామ‘ అనేది వారి స్థాయికి అందించే గౌరవంగా ఉపయోగిస్తారు. నాగార్జున పట్ల అభిమానాన్న చూపడానికి జపనీస్ అభిమానులు ఈ పదాన్ని ఎంచుకోవడం ద్వారా సరిహద్దులకు ఆవలన నాగార్జునకు గొప్ప గౌరవాన్నే అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో త్వరలో రానున్న కూలీ జపాన్లో ఎన్ని సంచలనాలు రేకెత్తిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆ సినిమాలో కూడా తొలిసారి నాగార్జున విలన్గా కనిపించనున్నారు. అంటే అది కూడా ఆయన కెరీర్లో చాలా ప్రత్యేకమైన పాత్రగానే చెప్పాలి. మరోవైపు అదే సినిమాలో జపాన్లో మంచి ఇమేజ్ ఉన్న రజనీకాంత్ హీరోగా వస్తున్నారు. దీంతో.... ఈ ప్రాజెక్ట్ ఇటు ఇండియాతో పాటు జపాన్లో కూడా క్రేజీగా మారిందని చెప్పొచ్చు. -
పృథ్విరాజ్ సుకుమారన్ ‘సర్ జమీన్’ మూవీ రివ్యూ
ఈ రోజుల్లో మంచి కోసం వెతకాలి, అయితే అదే చెడు గురించి ఆలోచిస్తే చాలు చుట్టూ చటుక్కున అల్లుకుపోతుంది. మనవాడు అనేవారు మనకోసం ఎప్పటికీ నిలబడతాడు, అలాగే పగవాడు మన పతనం కోసం ఆరాటపడతాడు. మంచిని దూరం చేసుకోని చెడు మార్గాన వెళుతూ మనవాడు కూడా పగవాడైతే అదే సర్ జమీన్ సినిమా.ఇదో దేశభక్తి స్ఫూర్తిగా అల్లుకున్న కథ. కాయోజీ ఇరానీ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులుగా వర్ధమాన మళయాళ నటుడు పృథ్విరాజ్, బాలీవుడ్ నటి కాజల్ వంటి హేమాహేమీలే కాక ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కొడకు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా నటించడం విశేషం.ఈ కథ ఓ ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. నాలుగంటే నాలుగు ముఖ్య పాత్రలు, రెండున్నర గంటల నిడివి తో దేశ సరిహద్దు వివాదాంశంపై సైనిక నేపధ్యంతో కూడిన సినిమా తీయడం అంటే మాటలు కాదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తాడు దర్శకుడు. అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కల్నల్ విజయ్ మీనన్ పోస్టింగ్ జరుగుతుంది. విజయ్ మీనన్ మహా దేశభక్తుడు. దేశమా, ప్రాణమా అంటేనే నిర్మొహమాటంగా దేశం అని ఎంచుకునే రకం. విజయ్ కి హర్మన్ అనే ఓ కొడుకుంటాడు. చిన్నప్పటి నుండి హర్మన్ చాలా భయస్తుడు. ఈ విషయంలోనే తన తండ్రి విజయ్ పై ద్వేషం పెంచుకుంటాడు హర్మన్. ఓ సారి తీవ్రవాదుల ఘర్షణలో హర్మన్ ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. తమ ముఖ్య అనుచరుడిని విడిపించాలని లేదంటే విజయ్ కొడుకుని చంపేస్తామని టెర్రరిస్టులు విజయ్ ని హెచ్చరిస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా తాను బంధించిన టెర్రరిస్టులపై కాల్పులు జరుపుతాడు విజయ్. ఆ తరువాత విజయ్, విజయ్ భార్య మెహర్ తమ బిడ్డ చనిపోయాడని భావిస్తారు. కాని తీవ్రవాదులు హర్మన్ కి తండ్రి మీదున్న ద్వేషాన్ని ఆయుధంగా చేసుకుని హర్మన్ ని తీవ్రవాదిగా తయారు చేసి మళ్ళీ విజయ్ దగ్గరకు పంపుతారు. ఆ తరువాత విజయ్ అతని భార్య తమ కొడుకు టెర్రరిస్ట్ అని కనిపెడతారా లేదా అన్నదే సినిమా. దేశం మీద మమకారం పెంచుకున్న తండ్రి వేదన గెలుస్తుందా... లేక తండ్రి మీద తనయుడు పెంచుకున్న ద్వేషం గెలుస్తుందా అన్నది హాట్ స్టార్ లోనే చూడాలి. ఈ సినిమా ఓ సూపర్ పేట్రియాటిక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ఇస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్.మస్ట్ వాచ్.- హరికృష్ణ, ఇంటూరు -
పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో.. ఆసక్తికరంగా థాంక్యూ డియర్’ ట్రైలర్
ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ముఖ్యపాత్రలు పోషించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ డియర్. తోట శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు. వీర శంకర్ నాగ మహేష్ రవి ప్రకాష్ చత్రపతి శేఖర్ బలగం సుజాత సంక్రాంతి శ్రీనివాస్ నాయుడు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక పాటను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ లాంచ్ చేయగా చిత్ర టీజర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేశారు. చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా నేడు థాంక్యూ డియర్ చిత్ర బృందం ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.ఇక ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక ప్రేమికుడు కనిపిస్తున్నాడు. అయితే అప్పటికే రేఖ నిరోషాతో పెళ్లయిన ధనుష్ రఘుముద్రి హెబ్బా పటేల్తో ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. వారి ఇద్దరి మధ్య ధనుష్ ఎలా మేనేజ్ చేశాడు ట్రైలర్లో చూస్తుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ట్రైలర్ లోని డైలాగులు అటు హాస్యంగా అలాగే ఇటు ట్రెండ్ కు తగ్గట్లు ఉన్నాయి. అదేవిధంగా సినిమాలో ఎన్నో మలుపులతో కూడిన సస్పెన్షన్ ఉన్నట్లు అర్థమవుతుంది. -
మహేష్,విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్,రవితేజ.. ‘మల్టీ’స్టారర్
అభిమాన హీరో సినిమాను ఫలానా థియేటర్లో చూశాం అని చెప్పుకోవడం ఎప్పుడూ ఉండేదే. అయితే అభిమాన హీరో ధియేటర్లో ఫలానా హీరో సినిమా చూశాం అని చెప్పుకునే రోజులు శర వేగంగా వచ్చేస్తున్నాయి. సినిమా హీరోలు వరుసపెట్టి మల్టీఫ్లెక్స్ సహ యజమానులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.తొలి క్లాప్ మోహన్లాల్దే...నిజానికి ఈ తరహా ట్రెండ్కి శ్రీకారం చుట్టింది మళయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ అని చెప్పొచ్చు. గత పాతికేళ్లకు పైగా ఆశీర్వాద్ సినిమాస్ పేరిట నిర్మాణ సంస్థ ను నిర్వహిస్తున్న ఆయన తాను సహ యజమానిగా కేరళలో ఆశీర్వాద్ సినీప్లెక్స్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ కాంప్లెక్స్ నెలకొల్పారు.కాన్సెప్ట్ ఆధారిత సినీ అనుభవం..కాన్సెప్ట్–ఆధారిత సినిమా చూసే అనుభవం. అనే సరికొత్త శైలితో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఈ రంగంలోకి దూసుకొచ్చారు. ఆయన 2018లో తన పిల్లలు నైసా, యుగ్ పేరు మీద తన సొంత లేబుల్ ఎన్వై సినిమాస్ ను ప్రారంభించడం ద్వారా చిన్న పట్టణాలు నగరాల్లో సినిమా వ్యాప్తిని మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాడు. రూ. 600 కోట్ల నుంచి రూ. 750 కోట్ల పెట్టుబడితో మల్టీఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తున్నారు ఆయన గ్రూప్ తమ మొదటి మల్టీప్లెక్స్ను మధ్యప్రదేశ్లోని రత్లాంలో రైల్వే నేపథ్య ఇంటీరియర్తో ప్రారంభించింది. అలాగే గురుగ్రామ్లోని ఎలాన్ ఎపిక్ మాల్లో ఒక విలాసవంతమైన మల్టీప్లెక్స్ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో మాక్టెయిల్ బార్, ఎన్వై కేఫ్ అమోర్ లాంజ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి‘మల్టీ’ బాటలో ముందున్న టాలీవుడ్కోవిడ్ సమయంలో ఈ ట్రెండ్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ ఒకరి తర్వాత ఒకరుగా హీరోలను జత చేసుకుంటూ శరవేగంగా ముందంజలో దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 2021లో మల్టీఫ్లెక్స్ థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన ఆసియన్ సినిమాస్ తో కలిసి హైదరాబాద్ లో ఎఎంబి సినిమాస్ (ఆసియన్ గ్రూప్ – మహేష్ బాబు జాయింట్ వెంచర్) ను స్థాపించాడు. ఆయనతో పాటే నేను సైతం అంటూ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా అదే ఏడాది థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆసియన్ విజయ్ దేవరకొండ (ఎవిడి) సినిమాస్ కు యజమానినని ఆయన సగర్వంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మొదటి ఎవిడి సినిమా అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, లో ప్రారంభమైంది.మహేష్ బాబు విజయ్ దేవరకొండ తర్వాత ఆసియన్ సినిమాస్తో చేతులు కలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన కూడా అదే సంవత్సరంలో ఆసియన్ సినిమాస్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు హైదరాబాద్లోని అమీర్పేటలో ’ఎఎఎ’ పేరుతో కొత్త మల్టీప్లెక్స్ నెలకొల్పాడు. ఆసియన్ సినిమాస్ ఈ సారి మాస్ మహారాజ్ను ఎంచుకుంది. మాస్ జాతరకు చిరునామాగా పేరున్న హీరో రవితేజతో కలిసి హైదరాబాద్లోని వనస్థలిపురంలో జాయింట్ వెంచర్ ఆర్ట్ సినిమాస్ పేరుతో నెలకొల్పింది. ఇది జులై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్తో ప్రారంభం కానుంది.విస్తరణ బాటలోనూ సై..మరోవైపు మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ యాజమాన్యంలోని కొండాపూర్లోని ఎఎంబి సినిమాస్ మరింతగా విస్తరిస్తోంది. ఈ మల్టీఫ్లెక్స్లో బార్కోహెచ్డిఆర్ ప్రొజెక్షన్ తో కూడిన కొత్త స్క్రీన్ వచ్చే ఆగస్టులో వార్ 2తో ప్రారంభం అవుతుంది, తద్వారా ఇది హైదరాబాద్ టెక్ కారిడార్లో సినీ అభిమానులకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. మరోవైపు జనవరి 2026లో, కోకాపేటలోని అల్లు సినిమాస్ హైదరాబాద్లో మొట్టమొదటి డాల్బీ సినిమాను పరిచయం చేయనుంది. -
ఆ పని కోసం రూ. 2 లక్షలు ఆఫర్.. స్టార్ హీరోపై యువతి ఆరోపణలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు ఇప్పుడు తమిళనాడులో దుమారం రేపాయి. ఓ యువతిని విజయ్ చాలా ఏళ్లుగా ఇబ్బంది పెట్టాడని, క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలు ఆఫర్ చేశాడని ఆరోపించింది. అంతేకాదు సదరు యువతి ప్రస్తుతం రిహబిలేషన్ సెంటర్ చికిత్స పొందుతోందని సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించి.. కాసేపటికే ఆ పోస్ట్ని డిలీట్ చేసింది.అసలేం జరిగింది?కోలీవుడ్లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్ అనే యువతి నిన్న(జులై 28) మధ్యాహ్నం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్ సేతుపతే అని ఆరోపించింది.‘తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఎక్కువైంది. ఇది జోక్ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్లో ఉంది. క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలను స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు. ఇదొక్కటే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది’అంటూ రమ్య విమర్శించింది. అంతేకాదు నిజాన్ని గుర్తించకుండా.. బాధితురాలిపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. డైరీ, ఫోన్ చాట్ల ద్వారా ఆ యువతి అనుభవించిన బాధ బయటకు వచ్చిందని, ఇది కట్టు కథకాదని, ఆమె జీవితం..ఆమె బాధ..అంటూ మరో ట్వీట్ చేసింది.అందుకే డిలీట్ చేశావిజయ్ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. నిజమే అయితే ఎందుకు డిలీట్ చేశావంటూ నెటిజన్స్ రమ్యపై మండిపడ్డారు. దీంతో దానికి వివరణ ఇస్తూ రమ్య మరో ట్వీట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్ను తొలగించినట్లు ఆ ట్వీట్లో పేర్కొంది.I shared that tweet out of frustration and to vent. Didn’t expect it to get this much attention. Getting too many enquiries about it now. Out of concern for her privacy and wellbeing I’ve decided to take it down. Hope that’s respected.— Ramya Mohan (@_Ramya_mohan_) July 28, 2025 -
ఆ హీరో నిజంగానే నా పీక కోశాడు: బాలీవుడ్ నటుడు
నెగెటివ్ పాత్రలు చేయడం అంత ఈజీ కాదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నటుల ప్రాణాలకే ప్రమాదం.. కొన్ని యాక్షన్ సీన్లలో అయితే వీరు చావు చివరి అంచులవరకు కూడా వెళ్లి వస్తుంటారు. తనకూ అలాంటి పరిస్థితే ఏర్పడిందంటున్నాడు బాలీవుడ్ నటుడు అశోక్ సరఫ్ (Ashok Saraf). ఎక్కువగా కామెడీ పాత్రల్లోనే అలరించిన ఈయన జాగృతి (1992) మూవీలో విలన్గా నటించాడు. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. నా మెడపై కత్తిపెట్టి..జాగృతి చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను అశోక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. హీరో సల్మాన్ (Salman Khan) నా పీకపైన కత్తిపెట్టాల్సిన సన్నివేశం అది! ఆయన నిజమైన కత్తి పట్టుకున్నాడు. ఇద్దరం డైలాగ్స్ చెప్తున్నాం. ఆయన చాలా గట్టిగా కత్తిని అదిమిపట్టుకున్నాడు. అది నా మెడకు గుచ్చుకుంటోంది. అతడి చేతుల్లో నుంచి తప్పించుకోవాలనిపించింది. ఆ కత్తిని కిందపడేయమన్నాను. కానీ సల్మాన్.. కత్తి కిందపడేయకుండా కెమెరా మనవైపే ఉంది. ఏం చేయమంటావని అడిగాడు. ఓపక్క రక్తం కారుతున్నా..కెమెరా నావైపే ఉన్నట్లర్థమై సీన్ కంటిన్యూ చేశాం. ఇద్దరం డైలాగ్స్ చెప్పాం. తర్వాత చూసుకుంటే నా మెడ కట్ అయింది. కాస్త లోతైన గాయం ఏర్పడి రక్తం కారుతోంది. ఏమాత్రం నరాలు కట్ అయినా నా చాప్టర్ అక్కడే క్లోజ్ అయ్యేది. మరి సల్మాన్కు ఈ సంఘటన గుర్తుందో, లేదో? అయినా ఇలాంటివాటిని ఎవరూ గుర్తుపెట్టుకోరు, అక్కడే మర్చిపోతారు అని చెప్పుకొచ్చాడు.సినిమాసల్మాన్, అశోక్.. జాగృతి చిత్రంతో పాటు కరణ్ అర్జున్, ప్యార్ కియా తో డర్నా క్యా, బంధన్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఇకపోతే సల్మాన్ చివరగా సికందర్ చిత్రంలో కనిపించాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఇతడు.. కిక్ సీక్వెల్తో పాటు గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు.చదవండి: నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో..:కల్యాణి ప్రియదర్శన్ -
నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో..:కల్యాణి ప్రియదర్శన్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Kalyani Priyadarshan) లేకపోయుంటే తాను ఏమైపోయేదాన్నో అంటోంది హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. తనకు ఏ అవసరమొచ్చినా, ఎటువంటి సలహా కావాలన్నా ఎప్పుడూ అతడు అందుబాటులో ఉంటాడని చెప్తోంది. నేడు (జూలై 28) దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కల్యాణి సోషల్ మీడియాలో వేదికగా హీరోకు బర్త్డే విషెస్ తెలిపింది. ప్రియమైన D(దుల్కర్), ప్రతి ఏడాది నీకు సోషల్ మీడియాలో కాకుండా నేరుగా ఓ పెద్ద మెసేజ్ పంపుతాను.నేనెప్పుడూ ఒంటరిదాన్ని కానుకానీ ఈ సారి మన కలల ప్రపంచానికి సంబంధించిన (మూవీ) గ్లింప్స్ అందరితో షేర్ చేసుకోబోతున్నాం. అందుకే ఈ పోస్ట్.. నిజ జీవితంలో, సినీ ప్రపంచంలో నువ్వు కన్న ప్రతి కల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ఐదేళ్లుగా నాకు ఏ సలహా కావాలన్నా ఫస్ట్ ఫోన్ నీకే చేస్తాను. అంతలా నాకు సపోర్ట్గా నిలబడ్డందుకు థాంక్యూ. నువ్వు లేకపోయుంటే నేనేమైపోయేదాన్నో నాకే తెలీదు. ఒకరకంగా చెప్పాలంటే నేను ఒంటరిదాన్ని కాదు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.అప్పటినుంచే స్నేహందుల్కర్, కల్యాణి.. 2020లో వచ్చిన మలయాళ చిత్రం 'వరణే అవశ్యముంద్'లో జంటగా నటించారు. అప్పుడే వీరు క్లోజ్ ఫ్రెండ్సయ్యారు. అప్పటినుంచి వీరి స్నేహం అలాగే కొనసాగుతూనే ఉంది. నేడు దుల్కర్ బర్త్డే సందర్భంగా.. అతడు నిర్మాతగా వ్యవహరిస్తున్న లోక, చాప్టర్ 1: చంద్ర సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ బ్యూటీ తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం సినిమాలు చేసింది. -
విశ్వంభర స్పెషల్ సాంగ్లో బుల్లితెర నటి.. రెమ్యునరేషన్ ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే డైరెక్టర్ సినిమా కథ కూడా బయటపెట్టేశాడు. 'మనకు తెలిసినవి 14 లోకాలే.. ఈ పద్నాలుగు లోకాలకు పైనున్న లోకమే సత్యలోకం. విశ్వంభర కోసం వీటన్నింటినీ దాటుకుని పైకి వెళ్లాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను హీరో వెతుక్కుంటూ వెళ్లి ఆమెను భూమి మీదకు ఎలా తీసుకొచ్చాడు? అన్నదే సినిమా కథ' అని చెప్పాడు.తెలుగులో తొలిసారి..సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ కూడా రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు. ఈ పాటలో బుల్లితెర సీరియల్స్లో విలనిజం పండించిన మౌనీ రాయ్ను సెలక్ట్ చేశారు. ఈమె చిరుతో కలిసి తొలిసారి చిందేసింది. అంతేకాదు, టాలీవుడ్లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి! ఈ పాటకు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. అయితే ఆమె ఈ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందన్న చర్చ మొదలైంది. నిమిషానికి లక్షల్లో..సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. మౌనీ రాయ్ నాలుగైదు నిమిషాల పాటకుగానూ రూ.50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మౌనీ రాయ్.. నాగిణి సీరియల్తోనే చాలామందికి పరిచయం. ఈ పాటలో కూడా ఆమె నాగిణిగా కనిపించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజమన్నది క్లారిటీ రావాల్సి ఉంది.విశ్వంభర ఆలస్యం?నిజానికి ఈ పాట కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను సంప్రదించారట! కానీ, ఆమె రూ.8 కోట్లు డిమాండ్ చేయడంతో తనను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. విశ్వంభర చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల సినిమా మరింత వాయిదా పడే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.చదవండి: 10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు -
ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్!
బుల్లితెర యాంకర్ నుంచి వెండితెర నటిగా ఎదిగింది అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) రంగస్థలం, పుష్ప, పుష్ప 2, ప్రేమవిమానం, రజాకార్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఫ్లాష్బ్యాక్, వోల్ఫ్ అనే తమిళ మూవీస్లో యాక్ట్ చేస్తోంది. సినిమాల్లో బిజీ అవడంతో బుల్లితెరకు గుడ్బై చెప్పేసి వెండితెరపైనే సెటిలైపోయింది.అనసూయపై ట్రోలింగ్అయితే అనసూయ ఏది మాట్లాడినా ట్రోల్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండపై అనసూయ నెగెటివ్ కామెంట్స్ చేసినప్పటి నుంచి అతడి అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అలాగే 40 ఏళ్ల వయసున్న తనను ఆంటీ అని పిలవొద్దని చెప్తున్నా సరే సోషల్ మీడియాలో నెటిజన్లు తనను పదేపదే ఆంటీ అని పిలుస్తూ చిరాకు తెప్పిస్తూనే ఉన్నారు.అంతమందిని బ్లాక్ చేశాఈ ట్రోలింగ్పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ స్పందించింది. ఎవరైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను వారిని వెంటనే బ్లాక్ చేస్తాను. అలా దగ్గరదగ్గర 3 మిలియన్ల మందిని బ్లాక్ చేశాను. వారి కామెంట్లకు కౌంటర్ ఇచ్చినప్పటికీ.. ఒకానొక సమయంలో అదంతా భరించలేకపోయాను. నా జీవితంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే నువ్వు లేవు, ఇకమీదట కూడా రావు అనుకుని బ్లాక్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్లపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. 3 మిలియన్స్ 30 లక్షలని తెలుసా?'3 మిలియన్స్ అంటే మూడు వేలు అనుకుందేమో 30 లక్షలని ఎవరైనా చెప్పండ్రా..', 'చెప్తే నమ్మేటట్లుండాలి.. హీరోయిన్లకే 30 లక్షల మంది జనాలు మెసేజ్ చేయరు, అలాంటిది నీకు అంతమంది మెసేజ్, కామెంట్స్ చేశారంటే నమ్మాలా?', 'ఇవన్నీ చేయడం కన్నా నీ అకౌంట్ డిలీట్ చేస్తే అయిపోతుందిగా!', '3 మిలియన్ల జనాల్ని బ్లాక్ చేస్తూ పోయానంటున్నారు, అంత ఖాళీగా ఉన్నారా?' అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు తనకు ఇన్స్టాగ్రామ్లో 16 లక్షల ఫాలోవర్లు ఉంటే 30 లక్షల మందిని ఎలా బ్లాక్ చేసిందని ప్రశ్నిస్తున్నారు.చదవండి: పెళ్లి-పిల్లలు.. ఈ రెండూ కావాలి: మృణాల్ ఠాకూర్ -
పెళ్లి-పిల్లలు.. ఈ రెండూ కావాలి: మృణాల్ ఠాకూర్
హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). 32 ఏళ్ల ఈ మహారాష్ట్ర బ్యూటీ సీతారామం చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఠాగూర్కు అక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా సీతారామం చిత్రం తమిళంలోనూ అనువాదమై అక్కడా మంచి గుర్తింపు లభించింది. దీంతో కోలీవుడ్లోనూ అవకాశాలు తలుపుతట్టాయి. అలా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మదరాశి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఏమైందో ఏమోకానీ, ఆ అవకాశాన్ని మృణాల్ ఠాకూర్ చేజార్చుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు తమిళ చిత్రపరిశ్రమ ఆమె వైపు చూడడం లేదు. ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో డకాయిట్ మూవీలో యాక్ట్ చేస్తోంది. అదేవిధంగా అల్లు అర్జున్ సరసన నటించే మరో లక్కీఛాన్స్ ఈ బ్యూటీని వరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ పెళ్లి గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలన్నది తన చిన్న వయసు నుంచే కల అని పేర్కొంది. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా చిత్ర పరిశ్రమపైనే ఉందని, సినిమాల్లో బాగా సక్సెస్ అవ్వాలని తెలిపింది.చదవండి: కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్ -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి
బుల్లితెర నటి లహరి రాఘవేందర్ (Actress Lahari Raghavendar) తల్లిగా ప్రమోషన్ పొందింది. శనివారం (జూలై 26) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. దీంతో అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లహరి రాఘవేందర్.. కోయిలమ్మ సీరియల్లో సింధుగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. కళ్యాణ వైభోగం, కన్యాదానం, రాధమ్మ కూతురు, అమ్మ, అల వైకుంఠపురములో వంటి పలు ధారావాహికలు చేసింది. ఉద్యోగం, సీరియల్స్పలు షార్ట్ ఫిలింస్లో కూడా నటించింది. అయితే లహరి కొంతకాలంగా సీరియల్స్కు దూరంగా ఉంటూ వస్తోంది. అందుకుగల కారణాన్ని ఇటీవల తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించింది. నేను ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూనే సీరియల్స్ చేశాను. దాదాపు ఐదేళ్లపాటు రెండింటినీ మ్యానేజ్ చేశాను. షూటింగ్ గ్యాప్స్లో ల్యాప్టాప్ పట్టుకుని కూర్చునేదాన్ని. అమ్మ నన్ను కష్టపడి చదివించినప్పుడు ఉద్యోగం మానేయడం కరెక్ట్ కాదనిపించింది.చీప్గా చూస్తున్నారనే..ఇకపోతే సీరియల్స్లో ఏమైపోయిందంటే, బెంగళూరు నుంచే ప్రతి ఒక్కరినీ తీసుకునిరావడం మొదలైంది. దాంతో ఇక్కడున్నవారికి డిమాండ్ తగ్గిపోయింది. నేను అడిగినంత ఇచ్చేందుకు కూడా వెనుకాడారు. ఇతర భాషల నుంచి వచ్చే నటీనటుల కోసం ఇక్కడున్న మాకు పారితోషికం తగ్గించడమేంటి? మమ్మల్ని చీప్గా చూడటమేంటి? అనిపించి ఓ సీరియల్ కూడా వదిలేసుకున్నాను. ఒక్కమాటైనా చెప్పకుండా..వేరే సీరియల్స్లో మంచి పాత్రలు పడ్డాయి, కెరీర్ బాగుంది కదా అని నా ఉద్యోగాన్ని వదిలేసుకుంటే చివరకు నాకే షాకిచ్చారు. నాకు ఒక్కమాటైనా చెప్పకుండా ఓ సీరియల్లో నుంచి సడన్గా తీసేశారు. అది నాకు నచ్చలేదు. ఇవన్నీ చూశాక.. ఇక చాలు, సీరియల్స్ ఆపేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే తిరిగి మళ్లీ ఉద్యోగంలో చేరాను అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Dr Shruthis Women & Maternity (@dr_shruthis_women_maternity) View this post on Instagram A post shared by Lahari Sanju (@lahari_raghavendar) చదవండి: పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య -
కెరీర్ పతనంతో డిప్రెషన్.. పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్? 25 ఏళ్లుగా మిస్సింగ్
ఆ రంగు, లుక్స్ చూసి ఫ్యూచర్ హీరో అనుకున్నారు. కొన్ని సినిమాలతోనే చాక్లెట్ బాయ్గా పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి విలనిజం కూడా చేయగలనని హింటిచ్చాడు. సినిమాలకే ఎందుకు పరిమితం కావాలనుకున్నాడో ఏమో కానీ బుల్లితెరపైనా తళుక్కుమని మెరిశాడు. రెండుచోట్లా గుర్తింపు సంపాదించుకున్న ఆయన 25 ఏళ్లుగా కనిపించకుండా పోయాడు. అతడే బాలీవుడ్ నటుడు రాజ్ కిరణ్..అగ్రతారగా ఎదుగుతాడనుకునేలోపే..రాజ్ కిరణ్ (Actor Raj Kiran).. 1975లో 'కాగజ్ కీ నవో' చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు. రిషి కపూర్, గోవింద, అనిల్ కపూర్, శ్రీదేవి, రేఖ, హేమమాలిని వంటి పలువురు అగ్రతారలతో కలిసి పనిచేశాడు. బషీర, కర్జ్, అర్థ్, తేరి మెహర్బనియన్, మజ్దూర్, ఘర్ ఏక్ మందిర్.. వంటి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు! వాకిట్లో ఎప్పుడూ విజయాలే సిద్ధంగా ఉంటాయా? మొదట్లో ఎంతో సక్సెస్ చూసిన రాజ్కిరణ్ తర్వాత ఫ్లాపుల్ని కూడా చూశాడు. కొన్ని సినిమాలైతే అర్ధాంతరంగా ఆగిపోయేవి. అంతా ఓకే అయ్యాక, షూటింగ్ కూడా మొదలుపెట్టాక అటకెక్కేవి. ఇలా తన కెరీర్ కిందకుపడిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్కు వెళ్లిపోయాడు. 25 ఏళ్లుగా మిస్సింగ్దీంతో 2000వ సంవత్సరంలో మానసిక ఆరోగ్య కేంద్రంలో చేరినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేశ్ భట్ కూడా అతడిని చూసేందుకు పలుమార్లు వెళ్లొచ్చాడంటుంటారు. కానీ తర్వాత రాజ్కిరణ్ కనిపించకుండా పోయాడు. అతడి గురించి ఇంటిసభ్యులు వెతకని చోటంటూ లేదు. రిషికపూర్, దీప్తి నావల్.. సిటీ అంతా జల్లెడ పట్టారు. రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలయయ్యాయి. అయినా అతడి జాడలేదు. 25 ఏళ్లుగా అతడు కనిపించకపోవడం అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.పిచ్చి ఆస్పత్రి నుంచి..నటుడి మిస్సింగ్ గురించి ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ముంబైలోని బైకుల్లా పిచ్చి ఆస్పత్రిలో రాజ్కిరణ్ ఉండేవాడని, అక్కడినుంచి సడన్గా మాయమైపోడని అంటుంటారు. కొందరేమో అట్లాంటాలోని పిచ్చాసుపత్రిలో ఉన్నాడంటారు. మరికొందరేమో న్యూయార్క్లో టాక్సీ డ్రైవ్ చేస్తూ కనిపించాడని చెప్తుంటారు. 2000వ సంవత్సరంలో రాజ్ కిరణ్ అదృశ్యమయ్యేనాటికి అతడి భార్య రూప, కూతురు రిషిక ఉన్నారు.ఎప్పటికైనా తిరిగొస్తాడని..తండ్రి ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండుంటాడని, ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది కూతురు రిషిక మహతని. తన తండ్రి అట్లాంటాలో పిచ్చాసుపత్రిలో ఉన్నాడన్న ప్రచారాన్ని సైతం ఖండించింది. పోలీసులు, డిటెక్టివ్ల సాయంతో తండ్రిని వెతికిస్తున్నామంది. అయినా ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. ఏళ్లు గడుస్తున్నా భర్త తిరిగిరాకపోవడంతో రూప రెండో పెళ్లి చేసుకుందని సమచారం.మాట నిలబెట్టుకోలేకపోయిన నటిరాజ్కిరణ్ కోసం సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమి అలీ కూడా తెగ వెతికింది. నీ క్లోజ్ ఫ్రెండ్ ఎక్కడుతన్నా వెతికి తీసుకొస్తాను అని రిషి కపూర్కు మాటిచ్చింది. 20 ఏళ్లపాటు వెతికినా ఫలితం లేకపోయింది. అసలు రాజ్ కిరణ్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకు కనిపించకుండా పోయాడు? ప్రస్తుతం బతికే ఉన్నాడా? లేదా? అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.చదవండి: శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్ -
ఓటీటీలో ‘చౌర్యపాఠం’ నయా రికార్డు
థియేటర్స్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించని ఓ చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి అత్యధిక వ్యూస్తో దూసుకెళ్తోంది. ఆ చిన్న సినిమానే చౌర్యపాఠం. ఇటీవల ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ చిత్రం 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్తో టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఆడియన్స్ను కట్టిపడేసింది.ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడానికి కారణం ఏంటంటే... కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ, నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా, ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించారు. నక్కిన నరేటివ్స్ బ్యానర్పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. -
గిరిజన మహిళలతో రష్మిక నృత్యం..వీడియో వైరల్
రష్మిక ఒకవైపు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెండ్ చిత్రాలతోనూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. దీంతో పాటు మైసా అనే మరో నాయికా ప్రధానమైన సినిమా కూడా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు(జులై 27) ఈ చిత్రం షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమంలో రష్మిక పాల్గొనడమే కాకుండా..గోండు పాటకు స్టెప్పులేసి అందరికి అలరించింది. సినిమా ఓపెనింగ్కి వచ్చిన గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.ఇక మైసా విషయానికొస్తే.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యన ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు. అన్ఫార్ములా ఫిలింస్ పతాకంపై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. స్వీడిష్, అరబిక్, జపనీస్, జార్జియన్ భాషల్లో ‘మైసా’ అనే పదానికి ‘తల్లి’ అని అర్థం. ఈ సినిమాలో గోండు జాతి హక్కులను కాపాడే యోధురాలిగా రష్మిక నటించబోతుందని సమాచారం. -
శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్
శ్రావణమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అంటూ ఎక్కువగా దైవారాధానలోనే మునిగిపోతారు. ఆధ్యాత్మికబాటలో నడుస్తున్నానని చెప్పిన హీరోయిన్ తనుశ్రీ దత్తా (Tanushree Dutta) కూడా శ్రావణ ఉపవాసం చేస్తోంది. కానీ మాంసాహారం తింటోంది. అదేంటో మీరే చదివేయండి..చంపడానికి ప్రయత్నాలుసినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తనుశ్రీ దత్తా ఇటీవల కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో షేర్ చేసింది. నటుడు నానాపటేకర్.. తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడంది. తన మనుషులతో రాత్రిపూట ఇంటి బయట శబ్దాలు చేస్తూ భయపెడుతున్నారంది. బాలీవుడ్ మాఫియా చాలా పెద్దదని, సుశాంత్ సింగ్ రాజ్పుత్లాగే తననూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఇంటర్వ్యూల కోసం ఆమెను చాలామంది సంప్రదించారు. రోజంతా ఉపవాసం.. రాత్రవగానే..దానికామె కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటు పడ్డానని, అందుకే మీడియా ముందుకు రావడం లేదని పేర్కొంది. కట్ చేస్తే.. తాజాగా ఇన్స్టాగ్రామ్లో శ్రావణమాసం సందర్భంగా మటన్ తింటున్నట్లు తెలిపింది. కొట్టు నుంచి తెచ్చుకున్న మటన్ను చూపిస్తూ.. రోజంతా తినకుండా ఉన్నానని, రాత్రి 7 గంటలకు మటన్ తిని ఉపవాసం పూర్తి చేశానంది. "ఎవరైనా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా టార్చర్ చేస్తుంటే మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. మటన్ వండుకుని తిన్నాఎందుకంటే ఆహారమే అసలైన మెడిసిన్. శ్రావణమాసం కావడంతో రాత్రి ఏడు గంటల వరకు ఉపవాసమున్నాను. ఆ తర్వాత అధిక పోషకాలున్న పప్పు, మటన్ వండుకుని డిన్నర్ చేశాను. ఉపవాసాలు మరీ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్లుగా వారు దాన్ని మార్చుకోవచ్చు. నాకైతే ఇలాంటి ఉపవాసమే బాగా పనిచేస్తుంది" అని చెప్పుఒకచ్చింది. అందుకే లావైపోతున్నావ్శ్రావణంలో మటన్ తినడమేమో కానీ ఏకంగా ఉపవాసం రోజు మటన్ తినడమేంటని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఓ వ్యక్తి అయితే నువ్వు కొవ్వు ఎక్కువగా తింటున్నావు, అందుకే లావవుతున్నావు అని కామెంట్ చేశాడు. దానికి తనుశ్రీ స్పందిస్తూ.. ముందుగా నా శరీరం గురించి కామెంట్ చేసేందుకు నీకు ఎటువంటి అర్హత లేదు. రెండోది.. బక్కపల్చగా లేనేమోకానీ ఫిట్గానే ఉన్నాను. ఎటువంటి డ్రెస్ వేసుకున్నా అందంగానే కనిపిస్తాను. కాబట్టి బొద్దుగా, అందంగా ఉండేవాళ్లను బాడీషేమింగ్ చేయడం ఆపండి. కొవ్వు మంచిదే!ప్రతి ఒక్కరూ సన్నగా ఉండాలని కోరుకోరు. అయినా కాస్త కొవ్వు పదార్థాలు తిన్నంతమాత్రాన శరీరంలో కొవ్వు చేరదు. ఆరోగ్యకరమైన కొవ్వు తీసుకోవడం వల్ల సన్నగా కూడా అవుతారు. మన శరీరం బాగా పనిచేయడానికి హెల్తీ ఫ్యాట్స్ అవసరం అని చెప్పుకొచ్చింది. హిందీలో అనేక సినిమాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో వీరభద్ర మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) చదవండి: పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య -
Fighter Shiva : ఇన్విస్టిగేషన్ ఆఫీసర్గా సునీల్
మణికంఠ, ఐరా బన్సాల్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఫైటర్ శివ’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్ ఇన్విస్టిగేషన్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు.అరుణగిరి ఆర్ట్స్ మరియు కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ని దర్శకులు సంపత్ నంది గారి చేతుల మీదుగా నేడు విడుదల చేశారు. ఈ చిత్రంలో మధుసూదన్, యోగి కాట్రి ,దిల్ రమేష్ ,లక్ష్మణ్ ,అభయ్ ,ఆనంద్ భారతి, ఘర్షణ శ్రీనివాస్ మాస్టర్ శన్విత్ నిమ్మల తదితర నటీనటులు నటించారు. -
పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్ చేయాలనుంది: నాగచైతన్య
టాలీవుడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) చివరగా తండేల్ సినిమాతో మెప్పించాడు. ఈ సినిమాతో పాటు ఇందులోని పాటలు కూడా సూపర్ హిట్టయ్యాయి. ఈ చిత్రంలో హీరోయిన్ సాయిపల్లవిని ప్రేమగా బుజ్జితల్లి అని పిలుస్తుంటాడు. అయితే రియల్ లైఫ్లో భార్య శోభిత ధూళిపాళను అలా ముద్దుగా పిలుస్తానంటున్నాడు నాగచైతన్య. తాజాగా చై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. శోభితతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా..అతడు మాట్లాడుతూ.. షూటింగ్స్తో బిజీగా ఉండటం వల్ల శోభితతో ఎక్కువ సమయం గడిపలేకపోతున్నాను. మా మధ్య గ్యాప్ రాకూడదని కొన్ని రూల్స్ ఫాలో అవుతాం. ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా కలిసే భోజనం చేస్తాం. సినిమాలకు, షికార్లకు వెళ్లినా ఆ క్షణాలను ప్రత్యేకంగా మార్చుకుంటాం. ఈ మధ్యే తనకు రేస్ట్రాక్పై డ్రైవింగ్ నేర్పించాను. రేసింగ్ నాకొక థెరపీలా పనిచేస్తుంది.పిల్లలతో గడపాలనుందినాకంటూ పెద్ద కోరికలు లేవు. 50 ఏళ్లు వచ్చేసరికి భార్యాపిల్లలతో సంతోషంగా ఉండాలి. ఒకరో, ఇద్దరో పిల్లలు కావాలనుకుంటున్నాను. కొడుకు పుడితే రేసింగ్ నేర్పిస్తా.. కూతురు పుడితే తన ఇష్టాలను ప్రోత్సహిస్తాను. పిల్లలతో సమయం గడపాలనుంది. చిన్నప్పుడు నేనెలా ఎంజాయ్ చేశానో.. ఇప్పుడు పిల్లలతో అలా ఎంజాయ్ చేయాలనుంది అని చెప్పుకొచ్చాడు. చైతన్య ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.చదవండి: డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్యకు ఆరో నెల -
సన్నగా అవ్వాలని తిండి మానేశా.. ఆ వ్యాధి వచ్చింది!
ఫేమస్ అవడానికి ఏదైనా చేస్తారు సినీతారలు. ఒక్కసారి పాపులర్ అయ్యాక దాన్ని కాపాడుకునేందుకు కూడా చాలా కష్టపడుతుంటారు. బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) కూడా అదే చేసింది. చిత్రవిచిత్ర వేషధారణతో సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూ ఉండే ఈ బ్యూటీ.. మరింత అందంగా కనిపించాలని గతంలో లిప్ ఫిల్లర్స్ వేయించుకుంది. ఈ మధ్య వాటిని తీసేయించుకోవడానికి చాలా కష్టపడింది. తిండి మానేశా..ఆ ట్రీట్మెంట్ వల్ల పెదాలు, ముఖం అంతా ఉబ్బిపోయి అందవిహీనంగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్నగా కనిపించాలని తిండి మానేశానని చెప్తోంది. ఉర్ఫీ జావెద్ మాట్లాడుతూ.. నేను చాలాసార్లు కడుపుమాడ్చుకునేదాన్ని. తిండి తినకపోయేదాన్ని. చాలా సన్నగా కనిపించాలని నానాతిప్పలు పడ్డాను. దీంతో నాలుగేళ్ల క్రితం నాకు బాడీ డిస్మార్ఫిక్ అనే వ్యాధి వచ్చింది. నాలుగు పీసులు తినేదాన్నంతే!(అందంగా కనిపించడం లేదేమోనని కంగారుపడటం, శరీరంలో ఏదో ఒకటి బాగోలేదని బాధపడటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు) మూడు లేదా నాలుగు చికెన్ ముక్కలు తిని రోజంతా ఖాళీ కడుపుతో ఉండేదాన్ని. వర్కవుట్స్ చేయకపోయేదాన్ని కానీ పరిగెత్తేదాన్ని. ఒంట్లో ఎక్కువ శక్తి లేకపోయేసరికి మైండ్ సరిగా పనిచేసేది కాదు. ఎప్పుడూ కోపంగా ఉండేదాన్ని, చిరాకుపడేదాన్ని. ఎవరైనా నన్ను పలకరించినా సరే నాతో ఎందుకు మాట్లాడుతున్నావ్? అనుకునేదాన్ని. .బక్కచిక్కిపోవాల్సిన అవసరం లేదుఅయితే తర్వాత నా పద్ధతి మార్చుకున్నాను. మరీ బక్కచిక్కిపోయి స్లిమ్గా ఉండాల్సిన అవసరం లేదనుకున్నాను. ఈ మధ్యే జిమ్కు వెళ్లడం మొదలుపెట్టాను. బరువులు ఎత్తుతున్నాను. బాగా తింటున్నాను. కచ్చితంగా సన్నగా ఉండాల్సిందేనని ఏమాత్రం ఆలోచించట్లేదు అని చెప్పుకొచ్చింది. ఉర్ఫీ జావెద్.. బుల్లితెరపై పలు సీరియల్స్లో యాక్ట్ చేసింది. హిందీ బిగ్బాస్ ఓటీటీ తొలి సీజన్లో పాల్గొంది. ఫాలో కర్లో యార్ వెబ్ సిరీస్లో నటించింది. ఇటీవల ద ట్రైటర్స్ ఇండియా అనే షోలో పాల్గొని విజేతగా నిలిచింది.చదవండి: డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్య ఆరో నెల గర్భిణీ -
ఆ హీరోయిన్ నాకు బాగా నచ్చింది..అందుకే సినిమాలో పెట్టుకున్నా : నిర్మాత
టాలీవుడ్ యంగ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ గురించి అందరికి తెలిసిందే. ఏ విషయం అయినా సరే చాలా ఓపెన్గా మాట్లాడతారు. కొన్ని సార్లు ఆయన చేసిన కామెంట్స్ వివాదస్పదంగానూ మారిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన మాట తీరు మాత్రం మార్చుకోలేదు. విమర్శలను సైతం తేలిగ్గా తీసుకుంటూ ఫోకస్ అంతా సినిమాలపైనే పెడుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వరుస సినిమాలను నిర్మిస్తూ.. టాలీవుడ్లో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ‘జర్సీ’ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ని తిరుపతిలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో భాగ్యశ్రీపై నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చడం వల్లే ఆమెను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నానని చెప్పారు. ‘ఒకవేళ ఈ సినిమాలో మీరే హీరో అయితే ఎవరిని హీరోయిన్గా తీసుకుంటారు?’ అని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు వంశీ పై విధంగా సమాధానం ఇచ్చాడు.‘భాగ్యశ్రీని నేను కావాలని హీరోయిన్గా పెట్టుకున్నాను. విజయ్ కానీ, గౌతమ్ కానీ నన్ను అడగలేదు. నాకు భాగ్యశ్రీని నచ్చి హీరోయిన్గా తీసుకున్నాను. నేను హీరో అయితే జనాలు సినిమా చూడరు కాబట్టి విజయ్ని పెట్టాను’ అని వంశీ అన్నారు. -
డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్య ఆరో నెల గర్భిణీ!
మదంపట్టి రంగరాజ్ (Madhampatty Rangaraj).. తమిళనాడులో ఫేమస్ చెఫ్. కూకు విత్ కోమలి రియాలిటీ షో జడ్జిగా బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న ఇతడు 'మెహందీ సర్కస్' సినిమాతో వెండితెరపై హీరోగా అడుగుపెట్టాడు. ఈ మూవీ పెద్దగా ఆడకపోవడంతో మరే సినిమా చేయలేదు. ఇకపోతే రంగరాజ్.. భార్య శృతికి విడాకులిస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. భార్యతో విడిపోతున్నట్లు వస్తున్న వార్తలపై రంగరాజన్ ఇంతవరకు స్పందించలేదు. పైగా అది తన వ్యక్తిగత విషయం అని మౌనంగా ఉన్నాడు.రెండో పెళ్లిమరోవైపు సెలబ్రిటీ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిసిల్డాతో రంగరాజన్ ప్రేమలో ఉన్నట్లు కూడా రూమర్లు వచ్చాయి. సదరు డిజైనర్.. ఇతడిని నా మనిషి అని సంబోధించడంతో ఈ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. చివరకు అదే నిజమైంది. రంగరాజ్ ఆమెను రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మొదటి భార్యకు విడాకులివ్వకుండానే పెళ్లిపీటలెక్కినట్లు ప్రచారం జరుగుతోంది.పెళ్లికి ముందే ప్రెగ్నెంట్గుడిలో సింపుల్గా జరిగిన పెళ్లి ఫోటోలను జాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం తను ఆరో నెల గర్భవతిని అని తెలిపింది. ప్రియురాలు గర్భం దాల్చడంతో రంగరాజ్ ఉన్నపళంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడన్నమాట! మరి ఈ వ్యవహారంపై అతడి మొదటి భార్య శృతి ఎలా స్పందిస్తుందో చూడాలి!రెండో భార్య ఎవరు?జాయ్.. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 24 సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్గా పని చేసింది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా నాలుగు అవార్డులు కూడా అందుకుంది. దాదాపు 12 ఏళ్లుగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. విజయ్, శివకార్తికేయన్, విష్ణు విశాల్, జయం రవి, విక్రమ్ ప్రభు, ప్రభుదేవా, అనిరుధ్ రవించందర్, రెజీనా, కేథరిన్, జీవీ ప్రకాశ్.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీల దగ్గర స్టైలిస్ట్గా పని చేసింది. View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa) View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa)చదవండి: భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించను: శ్రుతీహాసన్ -
ఈ హీరోయిన్కు అప్పట్లో ఫుల్ క్రేజ్.. ఇలా మారిపోయిందేంటి!
పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్లో అగ్ర కథానాయికగా స్టార్డమ్ అందుకుంది. కానీ, అందరిలాగే పెళ్లి కాగానే నటనకు గుడ్బై చెప్పి ఇంటికే పరిమితమైంది. 2009 తర్వాత మరే చిత్రంలోనూ కనిపించనేలేదు. ఇంతకీ ఆ కథానాయిక మరెవరో కాదు మాళవిక (Actress Malavika).పెళ్లయ్యాక సినిమాలకు గుడ్బైమాళవిక అసలు పేరు శ్వేత కొన్నూర్ మీనన్ (Shweta Konnur Menon). చాలా బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, చంద్రముఖి చిత్రాల్లో నటించింది. తమిళంలో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. బోల్డ్ పాత్రల్లోనూ కాదనకుండా యాక్ట్ చేసింది. 2007లో సుమేశ్ మీనన్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆమధ్య రీఎంట్రీకి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా అయిపోయిందేంటి?పుష్పలో సమంతలా 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' వంటి ఐటం సాంగ్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. కానీ ఇంతవరకు ఏ సినిమాలోనూ కనిపించనేలేదు. అప్పట్లో నాజూకుగా ఉన్న మాళవిక ప్రస్తుతం కాస్త బొద్దుగా తయారైంది. యోగాతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటున్న ఈమె.. ఇంతలా లావైపోవడంతో అభిమానులు వెంటనే గుర్తుపట్టలేకపోతున్నారు. మాళవిక ఇలా అయిపోయిందేంటని ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) చదవండి: ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్ దేవరకొండ -
Samantha: పచ్చబొట్టు చెరిగిపోలేదులే..
హీరోయిన్గా సమంత (Samantha Ruth Prabhu) వెండితెరకు పరిచయమైన చిత్రం ఏమాయ చేసావె (Ye Maaya Chesave Movie). నాగచైతన్య హీరోగా నటించాడు. 2010లో వచ్చిన ఈ ప్రేమకథాచిత్రంతోనే వీరి లవ్కు పునాది పడింది. తొలి చిత్రమే బ్లాక్బస్టర్ కావడంతో సామ్కు బోలెడంత గుర్తింపు వచ్చింది. అందుకే ఈ స్పెషల్ చిత్రానికి గుర్తుగా సామ్.. YMC (ఏ మాయ చేసావే) టాటూను మెడపై వేయించుకుంది. ఈ పచ్చబొట్టు తనకెంతో స్పెషల్ అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది.పచ్చబొట్టు మాయం?ఇదే కాదు. చై ప్రేమకు గుర్తుగా కూడా ఓ పచ్చబొట్టు వేయించుకుంది. కానీ వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఆ టూటూ తొలగించుకుంది. ఇటీవల ఓ వీడియో YMC పచ్చబొట్టు కనిపించకపోవడంతో ఆ గుర్తును కూడా పూర్తిగా చెరిపేసుకుందని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా సామ్ పోస్ట్ చేసిన ఫోటోల్లో ఆ పేరు అలాగే చెక్కుచెదరకుండా ఉంది.విడాకులునాగచైతన్య-సమంత 2017లో పెళ్లి చేసుకున్నారు. చూడముచ్చటగా ఉండే ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది. చై.. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సామ్ కూడా.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే.. సమంత చివరగా శుభం చిత్రంలో కనిపించింది. ఈ సినిమాతోనే తను నిర్మాతగా మారింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ వెబ్సిరీస్తో పాటు మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: నా భార్య కండీషన్.. ఇప్పటికీ అదే పాటిస్తున్నా: మురళీ మోహన్ -
నా భార్య కండీషన్.. ఇప్పటికీ అదే పాటిస్తున్నా: మురళీ మోహన్
సూపర్ స్టార్ మహేశ్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ (Athadu Movie Re Release) క్లాసిక్గా నిలిచిన సంగతి తెలిసిందే. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేశ్బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న రీరిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘మా బ్యానర్లో 2005 ఆగస్టు 10న అతడు సినిమా రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న టెక్నాలజీ పరంగా అప్ గ్రేడ్ చేసి మళ్లీ విడుదల చేస్తున్నాం. ఈ మూవీ కోసం ఓ ఇంటి సెట్ను వేస్తే అందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. సెట్ తీసేశారుదాదాపు 90 శాతం సీన్లు అదే సెట్లో షూటింగ్ చేశాం. ఆ తరువాత ఆ సెట్ను చాలా మంది వాడుకున్నారు. అయితే తర్వాతి కాలంలో ఓఆర్ఆర్ రావడంతో ఆ సెట్ వెళ్లిపోయింది. లేదంటే అక్కడే ఓ స్టూడియో కూడా కట్టేవాళ్లం. ‘అతడు’ మూవీ కోసం మహేశ్బాబు చాలా సహకరించారు. ఎంత ఆలస్యమైనా సరే, ఎన్ని డేట్లు అయినా ఇచ్చారు. క్లైమాక్స్ ఫైట్ కోసం చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం మా సంస్థకు మంచి గౌరవాన్ని తీసుకు వచ్చింది.చాలా డబ్బుసెన్సార్ వాళ్లు ‘అతడు’ మూవీ చూసి ఇంగ్లీష్ సినిమాలా ఉందన్నారు. థియేట్రికల్ పరంగా మేం అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. కానీ బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ కోసం వేసిన సెట్ను ఇతర ప్రొడక్షన్ కంపెనీలు కూడా వాడుకున్నాయి. వాటి ద్వారా కూడా చాలా డబ్బులు వచ్చాయి. కమర్షియల్గా ‘అతడు’ పట్ల మేం సంతృప్తిగానే ఉన్నాం. నాకు ఈ చిత్రంలో త్రివిక్రమ్ వేషం ఇవ్వలేదు. ‘నాకు వేషం ఇవ్వండి అని ఎవరినీ అడగొద్దు’ అంటూ మా ఆవిడ నాకొక కండీషన్ పెట్టారు. భార్య కండీషన్అందుకే ఇంత వరకు ఎవ్వరినీ నేను వేషం అడగలేదు. మహేశ్బాబు, త్రివిక్రమ్ డేట్లు ఇస్తే ‘అతడు’ సీక్వెల్ను మా బ్యానర్ నిర్మిస్తుంది. ‘అతడు’ మూవీకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది. కానీ బుల్లితెరపై వచ్చాక ‘అతడు’ గొప్పదనాన్ని అందరూ తెలుసుకున్నారు. అందుకే ఈ రీ రిలీజ్కు ఇంత క్రేజ్ ఏర్పడింది. ఇందులో నాజర్ పోషించిన పాత్రకి శోభన్ బాబును అనుకున్నాం. కానీ, ఆయన అందరికీ నేను హీరోగా మాత్రమే గుర్తుండాలి అంటూ ఆ పాత్ర రిజెక్ట్ చేశారు. బుల్లితెరపై ఎక్కువ సార్లు ప్రదర్శించిన చిత్రంగా ‘అతడు’ రికార్డులు క్రియేట్ చేసింది’ అని అన్నారు.4k వర్షన్మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ మాట్లాడుతూ.. ఈ రీ రిలీజ్ల ద్వారా ఎంత డబ్బు వచ్చినా సరే దాన్ని ఫౌండేషన్ కోసమే వాడుతున్నాం. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామన్నారు. జయభేరి ఆర్ట్స్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల మాట్లాడుతూ .. ‘‘అతడు’ మూవీని ఫిల్మ్లో తీశారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని దాన్ని 8k, సూపర్ 4Kలోకి మార్చాం. డాల్బీ సౌండ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్ ఫైట్లో సౌండింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.చదవండి: టెన్షన్ ఎందుకు? భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి! -
ఒక్కపూట భోజనం.. మంచినీళ్లతో కడుపు నింపుకుంటున్నా: ఏడ్చేసిన నటి
చిత్రపరిశ్రమలో రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. అప్పుడే చేతినిండా అవకాశాలున్నట్లనిపిస్తుంది. అంతలోనే ఖాళీ చేతులతో అవకాశాలకోసం ఎదురుచూడాల్సి వస్తుంది. వయసుపైబడ్డ నటీనటుల పరిస్థైతే మరీ దుర్భరంగా ఉంటుంది. తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతుంటారు. నటి గుంటూరు మహాలక్ష్మి (Actress Guntur Mahalaxmi)కి అలాంటి దుస్థితే వచ్చింది. ఈమె ఇటీవలే హరిహర వీరమల్లు చిత్రంలో యాక్ట్ చేసింది.రూ.4 లక్షల అప్పుతాజాగా నటి మహాలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1998లో సీరియల్స్లోకి వచ్చాను. రెండు, మూడు సినిమాలు కూడా చేశాను. రూ.3 లక్షల అప్పుతో హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఆ అప్పు రూ.4 లక్షలై కూర్చుంది. కొన్ని సినిమాలు, సీరియల్స్లో చేసిన పనికి సరిగా డబ్బులివ్వడం లేదు. నాకసలే మోకాలి నొప్పి ఉంది. దానికి సర్జరీ చేయాలంటే రూ.5 లక్షలు ఖర్చవుతుందన్నారు. దానికితోడు కనీసం రెండు నెలలైనా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది.అమ్మ కోసం వెళ్లిపోయాఇండస్ట్రీలో సెటిలయ్యే సమయంలో అమ్మ కిందపడి కాలుచేయి విరిగింది. అమ్మను చూసుకోవడం కోసం నటనను వదిలేసి ఊరెళ్లిపోయాను. అమ్మ చనిపోయిన కొద్దిరోజులకు ఇక్కడికి వచ్చేశాను. నాకు ఓ తమ్ముడు ఉండేవాడు. అతడి మానసిక స్థితి సరిగా ఉండేది కాదు. తను కూడా ఈమధ్యే చనిపోయాడు. అమ్మ, తమ్ముడు.. ఇద్దర్నీ నేనే చూసుకునేదాన్ని. ఇప్పుడు అప్పులపాలై చాలా కష్టాలుపడుతున్నాను. మంచినీళ్లతో కడుపు నింపుకుని..హైదరాబాద్ వచ్చాక కడుపు మాడ్చుకున్న రోజులెన్నో ఉన్నాయి. మంచినీళ్లు తాగి పడుకునేదాన్ని. ఎన్నోసార్లు పస్తులున్నాను. ప్రస్తుతం ఒక్కపూట భోజనమే చేస్తున్నా.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మహాలక్ష్మి.. నువ్వొస్తావని, సత్యం, రుతురాగాలు వంటి పలు సీరియల్స్ చేసింది. హరిహర వీరమల్లు మూవీలో జాతర సీన్లో యాక్ట్ చేసింది. రంగస్థలం, గేమ్ ఛేంజర్ సహా దాదాపు 50 చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించింది. ప్రస్తుతం డ్రాగన్, ఫౌజీ, శంబాల చిత్రాల్లో నటిస్తోంది. శంబాలలో తనకు మంచి డైలాగులున్నాయని, ఈ మూవీతోనైనా తగిన గుర్తింపు వస్తుందేమోనని ఎదురుచూస్తోంది.చదవండి: బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్ -
టెన్షన్ ఎందుకు? భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి!
భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని చూసుకోవాలి అంటున్నాడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి. ఆమాత్రం అర్థం చేసుకోకపోతే సంబంధాలు ఎలా నిలుస్తాయని ప్రశ్నిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి (Suniel Shetty) మాట్లాడుతూ.. ఈరోజుల్లో పిల్లలకు బొత్తిగా ఓపిక ఉండట్లేదు. పెళ్లి అంటే కాంప్రమైజ్ అనుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటే.. పెళ్లంటే ఒకరికోసం మరొకరు జీవించడం. భార్య పిల్లల్ని చూసుకోవాలిమీకు పిల్లలు ప్టుటారే అనుకోండి.. భర్త ఉద్యోగానికి వెళ్తే భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భర్త కెరీర్ కూడా ముఖ్యమే కదా అని ఆలోచించి పిల్లల బాధ్యత తీసుకోవాలి. భర్త కూడా పిల్లల గురించి ఆలోచిస్తాడు, వారికి అండగా నిలబడతాడు. కానీ ఈరోజుల్లో ప్రతిదానికీ టెన్షన్ పడుతున్నారు. అన్నింటినీ ఒత్తిడిలా ఫీలవుతున్నారు. పైగా ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చేవాళ్లే! పెద్దవాళ్లను చూసి నేర్చుకోండితల్లి ఎలా ఉండాలి? తండ్రి ఎలా ఉండాలి? ఏం తినాలి? ఏం చేయాలి? ఇవన్నీ ఆన్లైన్లో కూడా కనిపిస్తాయి. వాటితో ఇంట్లో వాళ్లను పోలుస్తూ.. నా భాగస్వామి ఇలా లేదేంటని బాధపడతారు. ఏదైనా సరే అనుభవాల నుంచి నేర్చుకుంటేనే మంచిది, లేదంటే అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, అక్క, వదినలు.. వీరిని చూసి కూడా ఎంతోకొంత నేర్చుకోవచ్చు. వారిలో మీకు పనికొచ్చే లక్షణాలను ఎంపిక చేసి ఆచరించండి. పనికిరానివి వదిలేయండి. కానీ అవన్నీ ఇప్పుడెవరు చేస్తున్నారు. అలా పెళ్లయిందో లేదో ఇలా విడాకులు తీసుకుంటున్నారు అని చెప్పుకొచ్చాడు.ఫస్ట్ సినిమాకు ముందే 40 చిత్రాలుసినీ జర్నీ గురించి మాట్లాడుతూ.. నా తొలి సినిమా రిలీజవ్వడానికి ముందే నా చేతిలో 40 చిత్రాలున్నాయి. అందులో ఏవి ఆడతాయి? ఏవి ఫ్లాప్ అవుతాయి? అని నేను పెద్దగా ఆలోచించలేదు. అప్పట్లో మానసిక ఆరోగ్యం, డిప్రెషన్ అన్న పదాలే మాకు తెలియవు. కాస్త బాధపడుకుంటూ ఉన్నా సరే అమ్మ వచ్చి తిట్టగానే అదెటో వెళ్లిపోయేది. బాధపడుతూ కూర్చునేంత టైం ఇచ్చేవాళ్లు కాదు అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ రోజుల్లో మానసిక ఆరోగ్యం దిగజారుతున్న నేపథ్యంలో 2023లో సునీల్ శెట్టి లెట్స్ గెట్ హ్యాపీ అనే హెల్త్ యాప్ రిలీజ్ చేశాడు. సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో అనేక చిత్రాలు సునీల్ శెట్టి తెలుగులో మోసగాళ్లు, గని మూవీస్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్ చిత్రంలో నటిస్తున్నాడు.చదవండి: బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్ -
బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్
కొత్త సినిమాలు వస్తున్నా సరే పాత చిత్రాలను ఇంకా రీరిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మహేశ్బాబు హీరోగా నటించిన క్లాసిక్ మూవీ అతడు (Athadu Movie Re Release)ను వచ్చే నెలలో మళ్లీ విడుదల చేస్తున్నారు. మహేశ్ బర్త్డే రోజైన ఆగస్టు 9న అతడు రీరిలీజ్ కానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చిత్ర నిర్మాత మురళీ మోహన్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. అప్పటికే సినిమాలకు దూరం..ఈ సినిమాలో శోభన్బాబు నటించాల్సిందని, కానీ ఆయన రిజెక్ట్ చేశారని పేర్కొన్నారు. మురళీ మోహన్ (Murali Mohan) మాట్లాడుతూ.. అప్పటికే శోభన్బాబు సినిమాలు చేయడం ఆపేశారు. అతడు మూవీలో నాజర్ వేసిన క్యారెక్టర్ శోభన్బాబు వేస్తే బాగుంటుందనిపించింది. డైరెక్టర్ త్రివిక్రమ్తో చెప్తే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? అన్నాడు. అప్పటికే మేము హైదరాబాద్ వచ్చేశాం. ఆయన చెన్నైలోనే ఉన్నారు. నేను నేరుగా అడగడానికి మొహమాటపడి మేకప్మెన్ రామును పిలిచాను. ఖాళీ చెక్..ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి రాముతో చెన్నై పంపించాం. రెమ్యునరేషన్ తనకెంత కావాలనుకుంటే అంత రాసుకోమన్నాం. దాని గురించి బేరమాడాలనుకోలేదు. ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే ఆ పాత్రకు ప్రాముఖ్యత పెరుగుతుంది, సినిమాకు విలువ వస్తుందనుకున్నాను. కానీ శోభన్బాబు (Sobhan Babu) ఫోన్ చేసి.. సారీ, మురళీ మోహన్గారు, ఏమీ అనుకోవద్దు. హీరోగానే గుర్తుండిపోవాలిఎవరైనా శోభన్బాబు అని గుర్తు చేసుకోగానే హీరోగా అందంగా, టిప్టాప్గా కనిపించాలే తప్ప తండ్రిగా, తాతగా, రోగిష్టిగా వారికి గుర్తు రాకూడదు. అలాంటి క్యారెక్టర్లు నేను చేయదల్చుకోలేదు. మీరేం అనుకోవద్దు. ఇది కచ్చితంగా మంచి సినిమా అయ్యుంటుంది, లేకపోతే మీరు తీయరు. నాకు ఇచ్చిన పాత్ర కూడా మంచిదే అయ్యుంటుంది, లేకుంటే మీరు నన్ను అడగరు. దయచేసి ఏమీ అనుకోవద్దు. నేను చేయలేనని తిరస్కరించారు అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.చదవండి: ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్ దేవరకొండ -
ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్ దేవరకొండ
హిట్టు కోసం ఆరాటపడుతున్నాడు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). వరుస వైఫల్యాలతో సతమతవుతున్న అతడు కింగ్డమ్ మూవీపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 31న విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ తమిళ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.సినిమా వల్లే..విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమా వల్ల సమాజంలో నాకంటూ పేరుప్రఖ్యాతలు వచ్చాయి. జనాల ప్రేమ దొరికింది. సినిమాల్లోకి రాకపోయుంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలుసు. అలాంటి జీవితం నాకొద్దు. కానీ సినిమాల్లో మునిగిపోయి పర్సనల్ లైఫ్ను మిస్ అవుతున్నాను. మన లైఫ్లో బంధాలు అన్నింటికన్నా ముఖ్యమైనవి. గత రెండేళ్లలోనే నాకు వీటి విలువ బాగా తెలిసొచ్చింది. గర్ల్ఫ్రెండ్కు నో టైమ్ఈ రెండుమూడేళ్లలో నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. అమ్మానాన్నకు సమయం కేటాయించలేదు. గర్ల్ ఫ్రెండ్కు కూడా కాస్తైనా టైం ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్తో కూడా గడపలేదు. ఇవన్నీ నన్ను బాధిస్తుండేవి. సడన్గా ఒకరోజు నాకు నేనే రియలైజ్ అయ్యాను. ఇలా బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దని పద్ధతి మార్చుకున్నాను. కుటుంబసభ్యులతో పాటు నా జీవితంలో ఉన్న అందరికీ సమయం కేటాయిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.ప్రేమలో..కాగా విజయ్ దేవరకొండ.. హీరోయిన్ రష్మిక మందన్నాతో చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు. చాలాసార్లు తాను సింగిల్ కాదని హింటిచ్చాడు. విజయ్, రష్మిక.. ఛాన్స్ దొరికినప్పుడల్లా వెకేషన్కు చెక్కేస్తుంటారు. వీరిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు.చదవండి: తరచు బరువు తగ్గి, పెరగడం వెనుక కారణం అదే..: విద్యా బాలన్ -
తరచు బరువు తగ్గి, పెరగడం వెనుక కారణం అదే..: విద్యా బాలన్
నిర్భయమైన వైఖరి స్వీయ వ్యక్తీకరణకు పేరుగాంచిన విద్యాబాలన్, నటన, గ్లామర్ల కలబోతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. దక్షిణాది నటి సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ ద్వారా సౌత్ ప్రేక్షకల ప్రశంసలూ దక్కించుకున్న విద్యాబాలన్కు తరచుగా ఎదురయే విమర్శ, లేదా సలహా ఏదైనా ఉందంటే అది ఆమె ఓవర్ వెయిట్ గురించి మాత్రమే. గతంలోనూ కొన్నిసార్లు బరువు పెరిగి తగ్గి, పెరిగి...మార్పులకు గురవుతున్న విద్యాబాలన్... ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల సందర్భంగా తన శరీరపు బరువు విషయంలో సంవత్సరాలుగా తనపై వచ్చిన విమర్శల నేపధ్యంలో ఈ సమస్యను అధిగమించడానికి తాను పడిన వ్యయ ప్రయాసల్ని ఆమె వెల్లడించింది.‘ నేనొక సిగ్గుపడని ఆశావాదిని నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. బరువు తగ్గడానికి నేను చేయని పోరాటం లేదు. నిజాయితీగా చెప్పాలంటే, ఆ విషయానికి వస్తే నాలో ఏ తప్పు లేదని నేను అనుకుంటున్నాను అంటుందామె. బరువుపై విమర్శలను చూసి బెదిరిపోని ఆమె మనస్తత్వం, విమర్శలను తట్టుకోవడానికి సినీరంగంలో కొనసాగడానికి సహాయపడిందని ఆమె అభిప్రాయపడుతోంది. ‘‘ఆ వైఖరి నాకు సహాయపడింది. నేను ప్రధాన పాత్రలు పోషించడం కొనసాగించాను ఎలాంటి అభద్రతాభావాలు నన్ను ఎప్పుడూ వెనక్కి నెట్టలేదు‘ అంటూ ఓవర్ వెయిట్ అనే సమస్యను జయించడానికి ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో చెప్పకనే చెబుతుందామె.‘నా జీవితాంతం, నేను సన్నగా మారడానికి ప్రయత్నించాను. తీవ్రమైన ఆహార నియమాలు పాటించాను. అన్ని రకాల వ్యాయామాలను చేశాను. కొన్నిసార్లు బరువు తగ్గాను, కానీ మళ్లీ తిరిగి బరువు పెరిగిపోయేదాన్ని.‘ అంటూ గుర్తు చేసుకుంది.ఇటీవల బాగా వెయిట్ లాస్ అయి స్లిమ్ గా కనపడుతున్న విద్యాబాలన్...ఈ సంవత్సరం ప్రారంభంలో చెన్నైకి చెందిన పోషకాహార సంస్థ తో కనెక్ట్ అయినప్పుడు తన సమస్య ఏమిటో తనకి అర్ధం అయిందని చెప్పింది. ‘వారు నాకు, ’మీది కొవ్వు కాదు, అది ఇన్ఫ్లమేషన్’ అని చెప్పారు. అది నా విషయంలో గేమ్–ఛేంజర్ గా పనిచేసింది అని ఆమె వివరించింది తాను స్వతహాగా శాఖాహారిని అని కూరగాయలు తింటున్నా కూడా బరువు పెరగడానికి కారణం ఈ సంస్థను కలిసిన తర్వాత తనకు అర్ధమైందని అంటోంది. ‘‘ అన్ని కూరగాయలు ఆరోగ్యకరమైనవని మనం అనుకుంటాము, కానీ అది నిజం కాదు. మీ శరీరానికి ఏది సరైనదో మీరు అర్థం చేసుకోవాలి. మరొకరికి పనికొచ్చేది మీకు పనికి రాకపోవచ్చు. అదే విధంగా పాలకూర సొరకాయ వంటి కొన్ని నాకు సరిపోవని నాకు అంతకు ముందు తెలియదు’’ అంటూ వెల్లడించింది.ఆత్మవిశ్వాసం అద్దం నుంచి రాదు అది లోపలి నుంచి వస్తుంది అని అంటున్న విద్య... దీర్ఘకాలంగా తాను చేస్తున్న బరువుపై పోరాటంలో సరైన సక్సెస్నే సాధించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె తన ఆహారంలో ‘ఇన్ఫ్లమేషన్ను తొలగించే‘ విధానాన్ని అవలంబించింది, శరీర బరువు త్వరగా తగ్గించగలిగింది. అవగాహనతో కూడిన ఈ విజయం ఇకపైనా కొనసాగిస్తుందని ఆమె అభిమానులు ఆశించవచ్చు. -
ఆ హీరోయిన్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు: ఉపేంద్ర
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(Upendra ) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ అవ్వడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినవి కూడా ఉన్నాయి. ఫలితం ఎలా ఉన్నా సరే ఆయన సినిమాల్లో ఏదో ఒక కొత్త పాయింట్ కచ్చితంగా ఉంటుంది. తొలి సినిమా ‘ఏ’ నుంచే ఆయన ప్రయోగాలు ప్రారంభించాడు. అప్పటివరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ‘ఏ’ సినిమా కథనం సాగుతుంది. అందుకే కన్నడతో పాటు తెలుగులోనూ ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఉపేంద్ర చాలా కష్టపడాల్సి వచ్చిందట. సీనియర్ నటి సరోజా దేవి లేకపోతే ఆ సినిమానే రిలీజ్ అయ్యేది కాదని, ఇప్పుడు మీ కళ్ల ముందు ఇలా హీరోగా నేను ఉండేవాడినే కాదని ఆయన అన్నారు. శుక్రవారం బెంగుళూరులో జరిగిన దివంగత నటి సరోజా దేవి సంతాప సభలో ఉపేంద్ర మాట్లాడుతూ.. సరోజ వల్లే తాను హీరో అయ్యానని చెప్పాడు. ‘నేను దర్శకత్వం వహించి నటించిన తొలి సినిమా ‘ఏ’కి సెన్సార్ సమస్య వచ్చింది. ఇలాంటి సినిమాని రిలీజ్ చేయకూడదని చాలా మంది అన్నారు. సెన్సార్ తిరస్కరించడంతో రివిజింగ్ కమిటీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో సరోజా దేవి నాకు తోడుగా నిలిచింది. సినిమా చూసిన తర్వాత నన్ను లోపలికి పిలిచారు. నేను వెళ్లగానే సరోజా దేవి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆమె కారణంగానే మా సినిమాకు సెన్సార్ పూర్తయింది. ఆమెను కలిసిన ప్రతిసారి ఈ విషయం గుర్తు చేసేవాడిని. ‘మీరే లేకపోతేను నేను హీరో అయ్యేవాడ్ని కాదు’ అని ఆమెకు చెప్పేవాడిని. రాజ్ కుమార్, విష్ణువర్థన్ మాత్రమే కాదు.. సరోజా దేవి పేరు మీద కూడా అవార్డులు ఇవ్వాలి. ఆమె రెండు సార్లు సెంట్రల్ జ్యూరీ మెంబర్గా కూడా పని చేశారు. ఆమె సాధించిన విజయాలు ఏంటో అందరికీ తెలుసు. వాటి గురించి మాట్లాడేంత వయసు నాకు లేదు’ అని అని ఉపేంద్ర అన్నారు. -
‘మిరాయ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ‘వైబ్’ అదిరింది
హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ని విడుదల చేశారు మేకర్స్. ‘వైబ్ ఉంది బేబీ’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. తేజ సజ్జా అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. -
ఒకే రోజు 15 సినిమాలకు శ్రీకారం.. ప్రపంచ రికార్డు
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఒకే రోజు 15 సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘దివంగత నిర్మాత డి. రామానాయుడు తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా, శతాధిక చిత్ర నిర్మాతల్లో రెండవ నిర్మాతగా ఆ ఘనత నా సొంతమైంది. మా భీమవరం టాకీస్పై ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 15 చిత్రాలను ప్రారంభించనున్నాను. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ అరుదైన ఘట్టానికి శ్రీకారం చుడుతున్నాను. ప్రపంచ రికార్డుగా నమోదు కానున్న ఈ చారిత్రక ఘట్టానికి హైదరాబాద్లోని సారధి స్టూడియో వేదిక కానుంది. సినిమాతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రపంచ రికార్డుకు ప్రత్యక్ష సాక్షులు కానున్నారు’’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. -
పెళ్లి చేసుకోలేదు.. తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికైనా..
ఆనందం సినిమా హీరోయిన్ గుర్తుందా? రేఖ వేదవ్యాస్ (Rekha Vedavyas).. 2001లో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమా ఆనందంతోనే సెన్సేషన్ అయింది. ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం.. పెళ్లికి రండి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 2014 తర్వాత వెండితెరకు గుడ్బై చెప్పిన ఈ బ్యూటీ రెండేళ్లక్రితం ఓ షోలో ప్రత్యక్షమైంది.రీఎంట్రీకి రెడీ..పూర్తిగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. అనారోగ్యంతోనే సన్నబడినట్లు ఆ షోలో వెల్లడించింది. తాజాగా ఆమె రీఎంట్రీకి రెడీగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేఖ వేదవ్యాస్ మాట్లాడుతూ.. చిన్నవయసులోనే కెరీర్ ప్రారంభించాను. నేను కన్నడ అమ్మాయి కావడంతో సాండల్వుడ్కు షిఫ్ట్ అయిపోయి అక్కడే ఎక్కువ సినిమాలు చేశాను. అప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేకపోవడంతో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. తీవ్ర అనారోగ్యంతో సమస్యలు2014 తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యాను. ఒకానొక సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. చాలా నరకం అనుభవించాను. చాలాకాలం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు భరించడం అంత ఈజీ కాదు. ఆ బిల్లులు చెల్లిండానికైనా మళ్లీ సినిమాలు చేయాల్సిందే! సినిమాలే కాదు.. యాక్టింగ్ పరంగా ఏ ప్రాజెక్టుల్లోనైనా నటిస్తాను.పెళ్లి చేసుకోలేదుఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్యకాలంలో విడాకులు పెరిగిపోతున్నాయి. అందుకే సరైన వ్యక్తి దొరికాకే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలనుకుంటున్నాను. లేటుగా పెళ్లి చేసుకున్నా సరే ఆ బంధం జీవితాంతం కొనసాగేలా చూసుకుంటాను అని రేఖ వేదవ్యాస్ చెప్పుకొచ్చింది. ఇన్ని చెప్పింది కానీ, తనకు వచ్చిన వ్యాధి ఏంటన్నది మాత్రం బయటపెట్టలేదు. బాధల్ని చెప్పకపోవడమే మంచిదంటూ తన అనారోగ్యానికి గల కారణాన్ని సస్పెన్స్గానే ఉంచింది.చదవండి: అప్పుడంత డబ్బు లేదు.. చెట్టు వెనకాలే చీర మార్చుకున్న హీరోయిన్ -
చిన్నపిల్లలు.. వాళ్లకేమైందని? మీ పిచ్చి సలహాలు..: నటి ఆగ్రహం
పిల్లల్ని ప్రేమతో చూడాలి కానీ, ఒకరు నల్లగా ఉన్నారు, ఒకరు తెల్లగా ఉన్నారు అంటూ కలర్ గురించి మాట్లాడటమేంటి? అని అసహనానికి లోనైంది బుల్లితెర నటి రుబీనా దిలైక్ (Rubina Dilaik). తనకు ఏడాదిన్నర వయసున్న కవల పిల్లలున్నారు. తమ ఇంటికి వచ్చినవారు పిల్లల రంగు గురించి మాట్లాడటం నటికి ఏమాత్రం నచ్చలేదు. నా కూతుర్లకేమైందని..దీని గురించి రుబీనా మాట్లాడుతూ.. నాకు పుట్టిన అమ్మాయిల్లో ఒకరు ఫెయిర్గా ఉంటే మరొకరు కాస్త డస్కీగా ఉంటారు. మా ఇంటికి వచ్చినవాళ్లు అదే విషయం పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఒకరితో మరొకర్ని కంపేర్ చేస్తున్నారు. అది నాకస్సలు నచ్చలేదు. రంగు గురించి మాట్లాడొద్దు, నా కూతుర్లిద్దరూ అందంగా ఉన్నారని వాళ్లకు గట్టిగా ఆన్సరిచ్చేదాన్ని. ఇంకోసారి నా ఇంట్లో.. పిల్లల మధ్య పోలిక తేవొద్దని వార్నింగ్ ఇచ్చాను. మా బంధువులైతే.. పాపకు మంచి రంగు రావడం కోసం శనగపిండితో స్నానం చేయించమనేవారు. అసలు ఆ విషయం గురించి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని బదులిచ్చాను. చిన్నప్పటినుంచే నేర్పిస్తున్నా..నా పిల్లలకేమైందని.. వారెంతో అందంగా ఉన్నారు. అలాగే ఇద్దరికీ ఆత్మస్థైర్యంతో ఉండాలని చిన్నప్పటినుంచే నేర్పిస్తున్నాను. అర్థం చేసుకోవడానికి వారిది చాలా చిన్నవయసు కానీ, ఇప్పటినుంచి నేర్పిస్తేనే విశ్వాసంతో ముందుకు వెళ్తారు అని చెప్పుకొచ్చింది. రుబీనా- అభినవ్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో పాల్గొన్నారు. రుబీనా ఈ సీజన్ ట్రోఫీ గెలిచింది. ఇకపోతే పెళ్లయిన ఐదేళ్లకు రుబీనా గర్భం దాల్చింది. 2023లో కవల కూతుర్లు ఏధ, జీవాకు జన్మనిచ్చింది.చదవండి: గుండెలు పిండేసే చిత్రం.. హిట్టయితే బాగుండు: శృతి హాసన్ -
గుండెలు పిండేసే చిత్రం.. హిట్టయితే బాగుండు: శృతి హాసన్
కొండంత ఆశ పెట్టుకున్న సినిమా ఆడకపోతే ఎంతో బాధగా ఉంటుంది. ఓ సినిమా విషయంలో తనూ అలాగే బాధపడ్డానంటోంది శృతి హాసన్ (Shruti Haasan). తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు నాకెంతో స్పెషల్. వాటికోసం చాలా కష్టపడ్డాను. అవి బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడనప్పుడు గుండె ముక్కలైనట్లు అనిపిస్తుంది.హృదయం ముక్కలైందిచాలామంది ఆ సినిమాను నమ్మి పని చేస్తారు. తీరా అది విజయం సాధించకపోయేసరికి దాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. 3 సినిమా కమర్షియల్గా విజయం సాధించుంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పుడంటే పాన్ ఇండియా ట్రెండ్ ఉంది. ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అప్పుడవన్నీ లేవు. 3 సినిమా హిందీలోకి డబ్ చేశాం. కానీ, ఓటీటీలు లేవు. ఆ మూవీ ఇప్పుడు రిలీజయ్యుంటే కొలవెరి సాంగ్ కంటే కూడా 3 చిత్రమే పెద్ద హిట్టయ్యేది. అలా కొన్ని చిత్రాలు ఎంతో కష్టపడి చేస్తే బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందేవి అని చెప్పుకొచ్చింది.3 మూవీలో ధనుష్, శృతిహాసన్సినిమాకాగా శృతిహాసన్ ప్రస్తుతం కూలీ మూవీ చేస్తోంది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ తదితరులు నటించారు. లోకేశ్ కగనరాజ్ దర్శకత్వం వహించగా అనిరుధ్ సంగీతం అందించాడు. 3 సినిమా విషయానికి వస్తే.. ధనుష్, శృతి హాసన్ జంటగా నటించారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య (ధనుష్ మాజీ భార్య) దర్శకత్వం వహించింది. ఈ సినిమా విషాదకరమైన క్లైమాక్స్తో ముగుస్తుంది. గుండెల్ని పిండేసే ఈ చిత్రం 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడు బాక్సాఫీస్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా రీరిలీజ్ అయినప్పుడు మాత్రం హిట్టుగా నిలవడం విశేషం. చదవండి: సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్గా పని చేస్తా: పుష్ప విలన్ -
అప్పుడంత డబ్బు లేదు.. చెట్టు వెనకాలే చీర మార్చుకున్న హీరోయిన్
బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆనాటి సంగతులను నెమరేసుకున్నాడు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. "ఆరోజుల్లో షూటింగ్ చేయడం అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడున్నన్ని ప్రత్యేక విభాగాలు అప్పుడు లేవు. అసిస్టెంట్ డైరెక్టర్సే అన్నీ చూసుకోవాలి! దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాకు నేను సహాయ దర్శకుడిగా పని చేశాను.అన్ని పనులు ఒక్కరే..డైలాగులు రాసి నటీనటులకు ఇవ్వడం, వారిని చూసేందుకు వచ్చిన జనాల్ని అదుపు చేయడం మా పని. కొన్నిసార్లు హీరోహీరోయిన్లకు మేకప్మ్యాన్ కూడా మేమే అవుతాం. స్విట్జర్లాండ్లో సీన్స్ షూట్ చేసేందుకు మొత్తం 21 మందిమి వెళ్లాం. అందరం ఒకే బస్లో కూర్చునేవాళ్లం. బస్లో వెళ్తుండగా ఎక్కడైనా లొకేషన్ బాగుందనిపించగానే వెంటనే దిగిపోయి షూట్ చేసేవాళ్లం. హీరోహీరోయిన్లు కూడా..సరైన వసతులు లేనిచోట హీరోయిన్ కాజోల్ (Kajol) ఓ చెట్టు వెనక్కు వెళ్లి చీర మార్చుకునేది. షారూఖ్ ఖాన్ ఎక్కడపడితే అక్కడే డ్రెస్ మార్చుకుని రెడీ అయ్యేవాడు. ఎత్తైన కొండలపై షూటింగ్ ఉందంటే అందరూ సామాన్లు పట్టుకుని పైకి నడుచుకుంటూ వెళ్లాల్సిందే! షారూఖ్, కాజోల్ కూడా కొంత సామాను పట్టుకుని నడిచేవారు. అందరం ఒక టీమ్గా ముందుకు కదిలేవాళ్లం. మాకు సాయం చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు. హీరోయిన్ డ్రెస్, జ్యువెలరీ కూడా తక్కువ రేటులో తీసుకునేవాళ్లం. హీరోయిన్ జుట్టు సరిచేశాడబ్బు ఎక్కువ లేకపోయేసరికి రైల్వే స్టేషన్ బయట అతి చవకైన ఆభరణాలు కొనుక్కొచ్చేవాడిని. కానీ ఇప్పుడంతా ఎలా మారిపోయిందో చూస్తున్నారుగా.. హీరో వానిటీ వ్యాన్లో కనీసం ఎనిమిది మందైనా ఉంటున్నారు. అప్పట్లో మేనేజర్, పీఆర్ అని ఎవరూ లేరు. హీరోయిన్ వెంట ఆమె తల్లి మాత్రమే ఉండేది. ఒకసారి కాజోల్ మేకప్మ్యాన్ లేకపోయేసరికి నేనే తన జుట్టు సరి చేశా. ఆమె తల్లి ముఖానికి మేకప్ వేసింది. ఆరోజుల్లో అంతా చాలా సరదాగా ఉండేది, ఇప్పుడంతా బోరింగ్గా మారిపోయింది అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.సినిమాదిల్వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం 1995లో రిలీజైంది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించగా యష్ చోప్రా నిర్మించారు. షారూఖ్ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించగా అమ్రిష్ పురి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ విషయానికి వస్తే.. ఆయన బ్యానర్లో తెరకెక్కిన ధడక్ 2 మూవీ ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, తృప్తి డిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు.చదవండి: సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్గా పని చేస్తా: పుష్ప విలన్ -
చైసామ్ విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. కేసు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున (Nagarjuna Akkineni) దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. అగ్రనటుడు నాగార్జున కుమారుడైన హీరో నాగ చైతన్య–సమంత విడాకుల విషయమై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుపోయిందని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. గైర్హాజరుఈ కేసు విచారణకు ప్రతివాది అయిన మంత్రి కొండా సురేఖ ఎగ్జామినేషన్కు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. పిటిషనర్ నాగార్జున కూడా గైర్హాజరు కావడంతో వారి తరుపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖ ఢిల్లీ వెళ్లారని వచ్చే విచారణకు హాజరు అవుతారని ఆమె తరఫు న్యాయవాది గుర్మిత్సింగ్ కోర్టుకు సూచించారు. దీంతో విచారణను ఈనెల 28కు వాయిదా వేసిన కోర్టు తప్పకుండా ఆ విచారణకు హాజరు కావాలని సూచించింది.ఏం జరిగింది?నాగచైతన్య–సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరు విడిపోవడానికి కేటీఆర్ కారణమన్నారు. నాగార్జున, చైతన్య కలిసి.. సమంతపై ఒత్తిడి తీసుకొచ్చారని, అది నచ్చకే ఆమె విడాకులు తీసుకుందని ఆరోపణలు చేయడం పెను సంచలనమైంది. ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యల్ని సినీ ప్రముఖులు ఖండించారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పడంతోపాటు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అయితే తనకుగానీ, తన కుటుంబానికి కానీ క్షమాపణ చెప్పలేదంటూ.. నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు.చదవండి: మళ్లీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ -
సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్గా పని చేస్తా: పుష్ప విలన్
సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్నాళ్లూ బాగా సంపాదించి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకుంటారు. అయితే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil).. సినిమాలు మానేశాక కూడా పని చేయాలనుకుంటున్నాడు. అవును, యాక్టింగ్కు గుడ్బై చెప్పిననాడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తానని గతంలో కూడా అన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. బోర్ కొట్టాక అదే చేస్తాఫహద్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు నన్ను చూసి బోర్ కొట్టినప్పుడు సినిమాలు మానేసి స్పెయిన్లోని బార్సిలోనాలో ఉబర్ డ్రైవర్గా ఉద్యోగం చేస్తాను. జనాలను వారి గమ్యస్థానాలకు చేర్చడం కంటే సంతృప్తికరమైనది మరోటి లేదు. ఛాన్స్ వచ్చినప్పుడు కచ్చితంగా డ్రైవర్గా మారిపోతాను. అప్పుడు నేను డ్రైవింగ్ చేయడంతోపాటు చుట్టూ ఉన్న పరిసరాలను మరింత నిశితంగా పరిశీలించే అవకాశం దొరుకుతుంది. వ్యక్తిత్వ వికాసానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది అని పేర్కొన్నాడు.రిటైర్ అయ్యాక అక్కడే..కాగా ఫహద్.. భార్య నజ్రియాతో కూడా ఎప్పుడూ ఇదే మాట చెప్తుంటాడు. రిటైర్మెంట్ తర్వాత బార్సిలోనాలో సెటిలైపోయి డ్రైవర్గా పని చేస్తానని పలుమార్లు చెప్పాడు. అందుకు నజ్రియా కూడా సంతోషంగా ఒప్పుకుందట! ఫహద్ ఫాజిల్.. ఆర్టిస్ట్, బెంగళూరు డేస్, కుంబలంగి నైట్స్, ట్రాన్స్, ఆవేశం వంటి పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, విలన్గా అనేక సినిమాలు చేశాడు. తెలుగులో పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లో విలన్గా మెప్పించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి.చదవండి: 'మడిసన్నాక కూసంత కలాపోసనుండాల'.. నేటికీ ఈ డైలాగ్స్.. -
హరిహర వీరమల్లుపై ట్రోలింగ్.. పంచతంత్రం సీరియల్ బెటర్!
హరిహర వీరమల్లు (Harihara Veeramallu Movie).. ఐదేళ్ల కిందట మొదలైన సినిమా! ఎన్నో ఆలస్యాల తర్వాత జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరిహర వీరమల్లుకు ఎటువంటి బజ్ లేకపోయేసరికి హీరోయిన్ నిధి అగర్వాల్ సినిమాను తన భుజాలపై వేసుకుని ప్రమోషన్ చేసుకుంది. అసలే నిర్మాత పెట్టిన డబ్బులు వస్తాయో, లేదోనన్న భయంతో నిలువునా వణికిపోతున్నాడు. ఏం లాభం?అతడి బాధ అర్థం చేసుకుందో, ఏమోకానీ కెరీర్ను పక్కనపెట్టి మరీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్లో చురుకుగా పాల్గొంది నిధి. తననలా చూశాక పవన్ కల్యాణ్కు బుద్ధి వచ్చినట్లుంది. సినిమా కోసం ఇంతలా కష్టపడుతున్న నిధిని చూస్తే సిగ్గేసిందంటూ వెంటనే ప్రమోషన్స్లో పాల్గొన్నారు. అయినా లాభం లేదనుకోండి, అది వేరే విషయం!(చదవండి: హరిహర వీరమల్లు మూవీ రివ్యూ)అభిమానులకే నచ్చట్లేదుపవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా అనగానే అభిమానులు నానా హడావుడి చేశారు. కానీ సాయంత్రమయ్యేసరికి దాదాపుగా సైలెంట్ అయిపోయారు. కొందరు అభిమానుల నుంచి కూడా సినిమాకు నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. కక్కలేక మింగలేక అన్నట్లుంది వారి పరిస్థితి! హరిహర వీరమల్లు వరస్ట్గా ఉంది.. ఓజీ సినిమాకు చూసుకుందాంలే అని వారే ఒప్పేసుకుంటున్నారు.పేలవమైన వీఎఫ్ఎక్స్ముఖ్యంగా రూ.250 కోట్ల బడ్జెట్ అన్నప్పుడు వీఎఫ్ఎక్స్ కూడా దానికి తగ్గట్లే ఉండాలి. కానీ ఈ చిత్రంలో కొన్ని పేలవమైన గ్రాఫిక్స్ సినీప్రియులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. సినిమా అంత కలగూర గంపలా కనిపిస్తుంది. సినిమా కంటే తక్కువ.. సీరియల్ కంటే ఎక్కువ అని నెటిజన్లు హరిహరవీరమల్లును ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో పవన్.. కోహినూర్ వజ్రాన్ని తేవడం ఏమో కానీ ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత తలనొప్పి అందించారు. బహుశా అందుకునేమో.. నిర్మాత రత్నం ఈ సినిమా హిట్టయితేనే పార్ట్ 2 ఉంటుందని థియేటర్ బయట నెమ్మదిగా జారుకున్నాడు. Done with my show #HHVM 🦅 Meeru ikkada review lu ichinantha worst ga aithe ledu antha kanna daridram ga undi💥 pic.twitter.com/NJLv3nEZ0f— 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 𝐈𝐜𝐨𝐧🗡️ (@icon_trolls) July 23, 2025Panchatantram 1episode>#HHVM whole movie 🤣— 🅰️llu🅰️rjun🔥mb🦁ntr🐯 (@BiBrfvr111388) July 24, 2025మిమ్మల్ని ఎవరూ ఆపాల్సిన పని లేదు మార్నింగ్ షోస్ కి మీరే ఆగిపోయారు 😂😂#HariHaraVeeeraMallu #DisasterHariHaraVeeraMallu pic.twitter.com/NyhOAQH8q8— Graduate Adda (@GraduateAdda) July 24, 2025#HHVM review raddam anukunna..Kani review rayadam kosam movie chudali anna kuda bhayam ga undi😭We wait for OG🫡— Telugu Meme Club (@telugumemeclub) July 24, 2025Cinema ki Thakkuva serial ki ekkuva 🍪🐶#HHVM #HHVMReview— GL 𝗔𝗔 DIATOR (@Gowthureddy_) July 24, 2025Manaki #OG undi idi #HHVM already decide ina output average ga untadi anukunnam kani worst ga undi feenini moyalsina pani ledu #OG lekkalu anni sarichestadi— NimmakuruNatukodi (@brolaughsalot) July 24, 2025Aurangzeb: ఎవరు నువ్వు ? చార్మినార్ దగ్గర ఏం పని ? Veera Mallu: నేను చార్మినార్ లోనే పుట్టాను....#HHVM #HariHaraVeeraMallu pic.twitter.com/mBBtePsyvK— 2.0 (@alanatiallari) July 23, 2025చదవండి: నీళ్ల కిచిడీయే ఆహారం.. మా పేదరికాన్ని చూసి వెక్కిరించేవాళ్లు -
నీళ్ల కిచిడీయే ఆహారం.. మా పేదరికాన్ని చూసి వెక్కిరించేవాళ్లు
రేసుగర్రం విలన్ రవికిషన్ బాల్యంలో కటిక పేదరికం అనుభవించారు. సినిమాల మీద ఆసక్తితో రూ.500 నోటుతో ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డ ఆయన రానురానూ తన టాలెంట్తో గుర్తింపు సంపాదించారు. భోజ్పురి, హిందీ చిత్రపరిశ్రమలో టాప్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.కటిక పేదరికంతాజాగా రవికిషన్ (Ravi Kishan) ఓ పాడ్కాస్ట్లో తన బాల్యంలోని బాధల్ని చెప్పుకొచ్చారు. నేను కటిక పేదరికం అనుభవించాను. చాలాసార్లు నా జీవితాన్ని అసహ్యించుకునేవాడిని. మా ఇంట్లో 12 మంది ఉండేవాళ్లం. కొద్దిపాటి బియ్యంతో నీళ్లలా చేసే కిచిడీని కుటుంబమంతా తినేవాళ్లం. చిన్నగదిలోనే మేమందరం పడుకునేవాళ్లం. ఒక్కోసారి ఒకరిపై మరొకరం నిద్రించేవాళ్లం.ఆరోజే అనుకున్నాపేదరికంలో ఉన్న మమ్మల్ని చూసి చాలామంది వెక్కిరించారు. నా తండ్రిని ఎవరూ హేళన చేయకూడదని, ఆ స్థాయికి నేను చేరుకోవాలని చిన్నతనంలోనే బలంగా నిశ్చయించుకున్నాను. ఈ భూమి మీదకు వచ్చామంటే ఏదో ఒకటి చేసి పోవాల్సిందే! అంతేకానీ పక్కింటివాళ్లకు కూడా తెలియకుండా అనామకులుగా చనిపోతే ఏం లాభం? కేవలం పిల్లల్ని కనడానికో, బంగ్లాలు కట్టడానికో ఈ భూమిపైకి రాలేదు కదా! మనకంటూ ఓ గుర్తింపు ఉండాలి. ఒక్కసారి మనకు పేరు వచ్చిందంటే డబ్బు దానంతటదే వస్తుందని బలంగా నమ్మాను అని చెప్పుకొచ్చారు.డబ్బు లేకపోతే..ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ.. ప్రతిరోజు జిమ్కు వెళ్లండి, అంత డబ్బు లేదంటే రోడ్డుపై పరిగెత్తండి. కనీసం 3-5 కి.మీ అయినా పరిగెత్తండి, 200 పుషప్స్ చేయండి. శనగలను రాత్రంతా నానబెట్టి తెల్లారి ఆ నీళ్లను తాగండి, శనగలను తినండి. మీరు పేదవాళ్లయినప్పటికీ ఇవన్నీ చేయొచ్చు. ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చే నిత్యావసర సరుకులను ఇలా వాడుకోవచ్చు. కనీసం సూర్యోదయానికి ముందు లేవడమైనా అలవాటు చేసుకోండి అని సూచించారు.సినిమాపీతాంబర్ (1992) సినిమాతో రవికిషన్ సినీప్రయాణం ఆరంభమైంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో రేసుగుర్రం, కిక్ 2, హీరో, 90 ఎమ్ఎల్, డాకు మహారాజ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది.చదవండి: మహేశ్ ఎన్నో కష్టాలు చూశాడు, అయినా పైకి మాత్రం..! -
మహేశ్ ఎన్నో కష్టాలు చూశాడు, అయినా పైకి మాత్రం..!
మనసుకు నచ్చినవారు దూరమైతే తట్టుకోలేం. అందులోనూ కన్నవారు ఒకరివెంట మరొకరు మనల్ని వీడి వదిలి వెళ్లిపోతే ఆ బాధను భరించలేము. కానీ, అంతకు మించిన బాధనే భరించాల్సి వచ్చింది సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu)కు! 2022 జనవరిలో మహేశ్ సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. అదే ఏడాది సెప్టెంబర్లో తల్లి ఇందిరా దేవి, నవంబర్లో తండ్రి కృష్ణ చనిపోయారు. ఒక్క ఏడాదిలోనే ముగ్గురిని కోల్పోయి తీవ్ర బాధలో కూరుకుపోయాడు.ఎన్నో కష్టాలుఆ విషయాన్ని మహేశ్ మరదలు, ఒకప్పటి హీరోయిన్ శిల్ప శిరోద్కర్ గుర్తు చేసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన అత్యుత్తమ మానవుల్లో మహేశ్ బావ ఒకరు. ఫ్యామిలీ కోసం ధృడంగా నిలబడతాడు. కానీ, తను చాలా కష్టాలు చూశాడు. కుటుంబాన్ని (తల్లిదండ్రులు, సోదరుడు)ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ తనను అభిమానించేవారికోసం చిరునవ్వుతో కనిపించేవాడు. మా పేరెంట్స్ను కోల్పోయినప్పుడు అక్కకు మహేశ్, నాకు నా భర్త అండగా నిలబడి ఓదార్చారు. వీళ్లిద్దరూ మాకోసం ఎంతో చేశారు అని చెప్పుకొచ్చింది.తనకు చంటిబిడ్డనయ్యానమ్రత గురించి మాట్లాడుతూ.. నమ్రత నాకంటే పెద్దది. కానీ సినిమాల్లోకి నేనే ముందు వచ్చాను, నాకే ఫస్ట్ పెళ్లయింది, నాకే ముందు పాప పుట్టింది. దీంతో అందరూ నన్నే పెద్దదాన్ని అనుకుంటారు. నాకు పెళ్లయ్యాకే నమ్రతకు మరింత క్లోజయ్యాను. మా పేరెంట్స్ చనిపోయాక నేను తనకు చంటిబిడ్డగా మారిపోయాను. తన కన్నబిడ్డల కంటే నా గురించే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్క నాపై అంత ప్రేమ చూపిస్తుంది అని శిల్ప శిరోద్కర్ చెప్పుకొచ్చింది.చదవండి: కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా -
తొలి సినిమాకే రూ.150 కోట్ల కలెక్షన్స్.. అయినా సింపుల్గా..
ఒక్క సినిమాతో సెన్సేషన్ అయింది యంగ్ బ్యూటీ అనీత్ పడ్డా (Aneet Padda). తను కథానాయికగా నటించిన తొలి చిత్రం సైయారా (Saiyaara Movie). అహాన్ పాండే (అనన్య పాండే కజిన్) హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోహీరోయిన్లు కొత్తవారైనప్పటికీ జనం ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకున్నారు. కేవలం మౌత్టాక్తోనే ఈ మూవీ ఇప్పటివరకు రూ.153 కోట్లు రాబట్టడం విశేషం. ఈ దూకుడు చూస్తుంటే ఈ వారాంతంలో సైయారా రూ.200 కోట్ల మార్కును చేరడం ఖాయంగా కనిపిస్తోంది.వీడియో వైరల్ఇదిలా ఉంటే తాజాగా అనీత్ పడ్డా ముంబైలోని ఓ సెలూన్కు వెళ్లింది. అక్కడినుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు ఆమెను కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ముఖానికి మాస్క్ ధరించిన అనీత్.. సున్నితంగా అతడి అభ్యర్థనను తిరస్కరించింది. సైలెంట్గా తన కారెక్కి వెళ్లిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా అనీత్ పడ్డా.. గతేడాది అమెజాన్ ప్రైమ్లో రిలీజైన బిగ్ గర్ల్స్ డోంట్ క్రై వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. సలాం వెంకీ చిత్రంలోనూ ఓ పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Snehkumar Zala (@sneyhzala)చదవండి: కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్న హీరోయిన్ -
కాస్టింగ్ కౌచ్.. అసహ్యంతో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా: హీరోయిన్
అవకాశాలిస్తాం.. మరి మాకేంటి? ఒకానొక దశలో ఈ మాటలు వినీవినీ విసిగిపోయానంటోంది హీరోయిన్ సుర్వీన్ చావ్లా (Surveen Chawla). కాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానంది. అయినప్పటికీ ఇండస్ట్రీలో ధైర్యంగా నిలబడ్డానంది. సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో జూలై 25 నుంచి ప్రసారం కానుంది.అసహ్యంగా అనిపించిందిఈ సిరీస్ ప్రమోషన్స్లో సుర్వీన్ చావ్లా మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉండేది. ఏం చేయాలన్నా మాకేంటి? అని చెండాలంగా మాట్లాడేవారు. ఆ పరిస్థితుల్లో నాకు బయటకు వెళ్లాలంటే కూడా అసహ్యంగా అనిపించేది. అసలు ఇవన్నీ నాకు అవసరమా? అని తిట్టుకునేదాన్ని. యాక్టింగ్ మానేయాలన్నంత కోపం వచ్చేది. వాళ్లు అడిగినదానికి ఒప్పుకోకపోవడం వల్ల ఎన్నో అవకాశాలు చేజారాయి. చివరకు రోడ్డుమీద పడ్డట్లు అనిపించింది. వెబ్ సిరీస్లతో టాప్..ఆ రోజులు చాలా కష్టంగా గడిచాయి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చింది దీనికోసమేనా? అని నిరాశచెందేదాన్ని. నా వల్ల కాదు, సినిమాలు మానేద్దాం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. సుర్వీన్ చావ్లా.. రాజు మహారాజు అనే తెలుగు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. హిందీలో అగ్లీ, హేట్ స్టోరీ 2 వంటి మూవీస్ చేసింది. ఓటీటీలో సేక్ర్డ్ గేమ్స్, రానా నాయుడు, క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్ వెబ్ సిరీస్లు చేసింది.చదవండి: ధనుష్ సంచలన నిర్ణయం.. రాజకీయాల్లోకి రానున్నారా..? -
హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల తగ్గించాలి: డీవైఎఫ్ఐ డిమాండ్
సాక్షి, అమరావతి: హరిహర వీరమల్లు సినిమా కోసం పెంచిన టికెట్ ధరలను తక్షణమే తగ్గించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) రాష్ట్ర శాక అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, జి. రామన్నలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిత్యావసరాలతో సహా అన్ని ధరలు చుక్కలంటుతున్నాయని, చివరికి వినోదం కోసం సినిమా వీక్షించే అవకాశం కూడా సామాన్యలకు లేకుండా ఇష్టమొచ్చినట్లుగా వసూలు చేసుకునే అవకాశం కల్పించడం దారుణమని పేర్కొన్నారు. బెనిఫిట్ షోల పేర్ట ఒక్కో టికెట్కు రూ. 700 నుంచి రూ. 1000 వసూలు చేయడం దారుణమని, ఈ దోపిడీ విధానానికి స్వస్తి చెప్పాలన్నారు. మిగిలిన రోజుల్లో కూడా టికెట్ ధరలు రూ. 177 నుంచి రూ.377 వరకు పెంచి సామాన్యులకు సైతం సినిమా చూసే అవకాశం లేకుంటా చేస్తున్నారని మండిపడ్డారు. -
హీరోలతో సమాన అవకాశాలు మాకెక్కడివి? ఆఖరికి వాష్రూమ్కు వెళ్లాలన్నా..
హీరోలతో సమానంగా తమకు ప్రాధాన్యత దక్కడం లేదని ఎంతోమంది హీరోయిన్లు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. తాజగా బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరుచ (Nushrratt Bharuccha) కూడా అదే మాట అంటోంది. హీరోలను ఒకలా.. తమను మాత్రం మరోలా ట్రీట్ చేస్తారని వాపోయింది. కొన్నిసార్లు తమకు కనీస వసతులు కూడా ఉండవని పేర్కొంది.హీరోలతో సమానంగా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో నుష్రత్ బరుచ మాట్లాడుతూ.. ఒక హీరో హిట్టు కొట్టగానే అతడికి కనీసం ఐదు సినిమా ఆఫర్లయినా వస్తాయి. కానీ, హీరోయిన్ పరిస్థితి అలా ఉండదు. ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండాలి. ప్యార్ కా పంచనామా (2011) సినిమా టైం నుంచి నేను ఇదే మాట చెప్తున్నా..! ఎవరైనా సినిమాతో సక్సెస్ అందుకున్నాక ఇంకేం కోరుకుంటారు? మరిన్ని మంచి ప్రాజెక్టులు రావాలని ఎదురుచూస్తారు. హీరోలు అలా వచ్చినవాటిలో బెస్ట్ ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తారు. మాకంత అదృష్టం లేదు. వారికి వచ్చినన్ని అవకాశాలు మాకు రావు.వాష్రూమ్కు వెళ్లేందుకు కూడా..అంతెందుకు? సెట్లో కూడా ఏదైనా అత్యవసరమైతే హీరో వానిటీ వ్యాన్ను ఐదు నిమిషాలు వాడుకోవచ్చా? అని అడగాల్సిన పరిస్థితి కూడా ఫేస్ చేశాను. అది కూడా సెట్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే.. వాష్రూమ్ కోసం ఆ వ్యాన్లోకి వెళ్తానని అడిగేదాన్ని. అప్పుడు హీరోకు ఉన్నన్ని వసతులు, సౌకర్యాలు నాకు అందించలేదేంటని గొడవ చేయలేదు. నేను కూడా ఆ స్థాయికి వెళ్లాలని మాత్రమే బలంగా కోరుకున్నాను అని చెప్పుకొచ్చింది. నుష్రత్ చివరగా చోరీ 2 అనే హారర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హిందీలో అనేక సినిమాలు చేసిన ఈ హీరోయిన్ తెలుగులో శివాజీ తాజ్మహల్ మూవీలో యాక్ట్ చేసింది.చదవండి: HHVM Review: ‘హరి హర వీరమల్లు’ మూవీ రివ్యూ -
నిద్రలేని రాత్రులు.. అయినా గర్వంగానే ఉంది: విజిల్ నటి
ప్రముఖ కమెడియన్ రోబో శంకర్ కూతురు, హాస్య నటి ఇంద్రజ (Indraja Shankar) ఈ ఏడాది ప్రారంభంలో తల్లిగా ప్రమోషన్ పొందింది. 2024 మార్చిలో తన స్నేహితుడు, డైరెక్టర్ కార్తీక్తో ఇంద్రజ ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే! అదే ఏడాది ఆగస్టులో గర్భం దాల్చానంటూ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జనవరిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడు ఏడో నెలలో అడుగుపెట్టడంతో నటి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గర్వంగా భావిస్తున్నా..నా సంబరాల మూటకు ఆరు నెలలు నిండాయి. ఇప్పుడు ఏడో నెలలోకి వచ్చాడు. ఏడు నెలల క్రితం నువ్వు నా జీవితంలోకి వచ్చి నా ప్రపంచాన్నే మార్చేశావు. నీ చిరునవ్వులకు, నీ కౌగిలింతలకు.. ఆఖరికి నాకు అందించిన నిద్రలేని రాత్రులను కూడా నేనెంతో గర్వంగా భావిస్తున్నాను నక్షత్రన్ అని రాసుకొచ్చింది. ఈ మేరకు తన ప్రెగ్నెన్సీ జర్నీ నుంచి బాబును ఎత్తుకునే క్షణాల వరకు సంబంధించిన ఫోటోలు, వీడియోల క్లిప్పింగ్స్ను జత చేసింది.సినిమాకాగా ఇంద్రజ తండ్రి.. రోబో డ్యాన్స్తో ఫేమస్ అవడంతో రోబో శంకర్గా పాపులర్ అయిపోయాడు. ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రం అతడికి బాగా పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఏడాదికి 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. దాదపు తమిళ స్టార్ హీరోలందరితోనూ పని చేశాడు. ఇంద్రజ విషయానికి వస్తే దళపతి విజయ్ బిగిల్ (తెలుగులో విజిల్), విశ్వక్సేన్ పాగల్, కార్తీ విరుమాన్ చిత్రాల్లో యాక్ట్ చేసింది. పలు టీవీ షోలలోనూ కనిపిస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by INDRAJA SANKAR (@indraja_sankar17) చదవండి: నాది దొంగ ఏడుపు కాదు, నేనేం పిచ్చిదాన్ని కాదు.. కాపాడండి: హీరోయిన్ -
నాది దొంగ ఏడుపు కాదు, నేనేం పిచ్చిదాన్ని కాదు.. కాపాడండి: హీరోయిన్
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ బోరున ఏడ్చేసింది హీరోయిన్ తనుశ్రీదత్తా. నాలుగైదేళ్లుగా ఈ బాధను భరిస్తున్నా.. 2018లో మీటూ ఉద్యమం అప్పటినుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది అంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన అభిమానులు, నెటిజన్లు.. హీరోయిన్కు ఏమైందని కంగారుపడ్డారు. తను క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.పబ్లిసిటీ స్టంటా?అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే తనుశ్రీ దత్తా.. తను మామూలుగా ఉన్న వీడియోలు షేర్ చేసింది. ఇది చాలామందికి మింగుడుపడలేదు. అప్పుడే ఏడ్చింది, ఇంతలోనే మళ్లీ నార్మల్గా వీడియోలు పెడుతోంది.. తన బాధ నిజమా? లేక పబ్లిసిటీ స్టంటా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి అయితే.. నేను తనుశ్రీ మేడమ్కు అభిమానిని. కానీ, ఈసారి తననిలా చూస్తుంటే లైమ్లైట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. బహుశా నా ఆలోచన తప్పు కావచ్చు, కానీ చూడటానికి మాత్రం అలాగే ఉంది. మీ వీడియో చూస్తే అలాంటి అభిప్రాయమే కలుగుతోంది. నా మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి అని రాసుకొచ్చాడు. నాటకాలు ఆపేయ్అందుకు తనుశ్రీ స్పందిస్తూ.. అవునా? ఇప్పుడే నీ ప్రొఫైల్ చెక్ చేశా! ఈ రోజే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశావ్.. ఈ కామెంట్ పెట్టడానికేనా? అని కౌంటర్ ఇచ్చింది. పనికిమాలిన వ్యక్తుల కోసం ఎన్నిరోజులు ఏడుస్తూ కూర్చోవాలని ప్రశ్నించింది. మరో వ్యక్తి.. మీ నాటకాలు ఆపండి. మీ డ్రామా చూసీచూసీ విసిగిపోయాం. నిజంగా మీరన్నట్లు ముంబై మీకు సురక్షితం కాకపోతే అమెరికాకు వెళ్లిపోవచ్చుగా.. తెలిసి తెలిసి ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో పెట్టడం? నానా పటేకర్ మంచి మనిషి, బాలీవుడ్లో బెస్ట్ యాక్టర్. అతడి పరువు తీయడానికి ప్రయత్నించకండి. ఇకనైనా డ్రామాలు ఆపేయండి, మాకు నిజమేంటో తెలుసు. మీరెంత చేసినా బాలీవుడ్లో మీకు సినిమాలు రావు అని కామెంట్ పెట్టాడు.నానా పటేకర్, తనుశ్రీ దత్తాహీరో, నటుడు కలిసే..నెగెటివ్ కామెంట్లతో విసిగిపోయిన తనుశ్రీ దత్తా (Tanushree Dutta).. మీటూ ఉద్యమం తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని బయటపెట్టింది. నానాపటేకర్ ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఎన్జీవోలో జరుగుతున్న కార్యకలాపాలను బయటపెడతానన్న భయంతో చుల్మాన్ భాయ్ (సల్మాన్ ఖాన్)కు రూ.5 కోట్లిచ్చి తనకు బ్రేకులు వేయమని చెప్పాడంది. దాంతో చుల్మాన్ ఇలా కొందరు మనుషులను పెట్టించి.. రాత్రిపూట తన ఇంటి ఎదుట ఏవేవో శబ్ధాలు చేయిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది.పిచ్చిదాన్ని కాదుమధ్యలో సల్మాన్ ఎందుకు వచ్చాడో అర్థం కాక తలపట్టుకున్న నెటిజన్లు.. ఆమెను మంచి సైకియాట్రిస్ట్ను కలవమని సలహా ఇచ్చారు. అందుకు తనుశ్రీ.. నేనేమీ పిచ్చిదాన్ని కాదు. వాళ్ల బండారం బయటపెట్టినందుకు పిచ్చిదాన్ని చేస్తారా? నాలాగా టార్చర్ ఫేస్ చేస్తున్న అందరూ ఇలాగే ఆడియో, వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టండి. అప్పుడుకానీ వారి ఆటలు సాగవు అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. అంతలోనే తనను వారి నుంచి కాపాడమంటూ అభ్యర్థించింది.అసలేం జరిగింది?మీటూ ఉద్యమంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన వేధింపులను బయటపెడుతూ సంచలనాలకు తెరలేపింది హీరోయిన్ తనుశ్రీ దత్తా. నానా పటేకర్ (Nana Patekar) తనను లైంగికంగా వేధించాడంటూ 2018లో మీడియా ముందుకు వచ్చింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా కోసం ఓ పాట షూట్ చేస్తున్న సమయంలో నానా పటేకర్ సహా మరో ముగ్గురు తనను వేధించారని ఆరోపించింది. చట్ట ప్రకారం మూడేళ్ల లోపు ఫిర్యాదు చేస్తేనే విచారణకు అర్హత ఉందని, పదేళ్ల నాటి ఘటనని విచారించడం కుదరదని న్యాయమూర్తి కేసు కొట్టివేశారు. కాగా హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన తనుశ్రీ.. తెలుగులో 'వీరభద్ర' మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial)చదవండి: ఛత్రపతి శివాజీ బయోపిక్ లేనట్లే.. ఇండస్ట్రీలో ఇంత దారుణమా? -
సినీ నటుడు రానాకు ఈడీ మళ్లీ సమన్లు
ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన కేసులో రానా(Rana Daggubati)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 11న విచారణకు హాజరు కావాలని మసన్లలో పేర్కొంది. వాస్తవానికి నేడు(జులై 23) రానా ఈడీ విచారణకు హాజరు కావాల్సింది. కానీ ఆయన గడువు పొడిగించాలని ఈడీకి విజ్ఞప్తి చేశాడు. దీంతో తాజాగా మరో తేదిని ఖరారు చేస్తూ సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 11న కచ్చితంగా హాజరు కావాలంటూ సమన్లలో పేర్కొంది.సైబరాబాద్, సూర్యాపేట, పంజగుట్ట, మియాపూర్, విశాఖపట్నంలో లోన్ యాప్లపై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. లోన్ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్లు సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చింది. -
ఛత్రపతి శివాజీ బయోపిక్ లేనట్లే.. ఇండస్ట్రీలో ఇంత దారుణమా?
బయోపిక్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందుకు ఛావా సినిమానే నిదర్శనం. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. దాదాపు రూ.140 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఛావా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. విక్కీ కౌశల్ నటప్రభంజనానికి ఫుల్ మార్కులు పడ్డాయి.బయోపిక్ లేనట్లే?అయితే ఛత్రపతి శివాజీరాజా బయోపిక్ (Chhatrapati Shivaji Biopic) కూడా వస్తోందంటూ అప్పట్లో ఓ ప్రకటన వచ్చింది. ప్రముఖ దర్శకుడు అమిత్ రాయ్.. షాహిద్ కపూర్ను శివాజీగా చూపించనున్నాడని ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో కానీ ఈ మూవీ అటకెక్కిందట! ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. అమిత్ రాయ్ మాట్లాడుతూ.. సిస్టమ్ చాలా దారుణంగా ఉంది. నేను డైరెక్ట్ చేసిన ఓమైగాడ్ 2 మూవీ రూ.180 కోట్లు సాధించింది. ఎలా పనిచేస్తా?అయినప్పటికీ.. నా పనితనం నిరూపించుకోవడానికి ఇది సరిపోదట! నటీనటుల ఎంపిక, ప్రొడక్షన్, మేనేజ్మెంట్.. ఇలాంటి వ్యవస్థల కింద నలుగుతూ ఒక దర్శకుడు ఎలా పని చేయగలడు? ఐదేళ్ల జీవితాన్ని ఒక కథకు అంకితం చేస్తే.. కొందరు సడన్గా వచ్చి అందులో ఇది తప్పు, అది తప్పు అని ప్రతిదానికి వంకపెడితే ఎంత బాధగా అనిపిస్తుంది అంటూ ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేసినట్లు చెప్పకనే చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. కొందరు హీరోలు కేవలం బాక్సాఫీస్ లెక్కల్నే చూస్తారు. హీరోలకు లవ్స్టోరీలే కావాలిమరికొందరు మాత్రం నిజాయితీగా కథల్ని మాత్రమే నమ్ముతారు. కానీ, చాలామంది సమాజంలోని చేదు నిజాలను కళ్లకు కట్టినట్లు చూపించే సినిమాల్లో భాగమవడానికి బదులుగా ప్రేమకథా చిత్రాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అని చెప్పుకొచ్చాడు. అమిత్ రాయ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠితో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ విషయానికి వస్తే.. ఈయన చివరగా దేవా చిత్రంతో డిజాస్టర్ అందుకున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది.చదవండి: మంచు లక్ష్మి గొప్ప మనసు.. అన్నింటికంటే ఆ దానమే -
మంచు లక్ష్మి గొప్ప మనసు.. అన్నింటికంటే ఆ దానమే గొప్పదంటూ..
నటిగా, నిర్మాతగా, హోస్ట్గా తన సత్తా చాటుకుంది మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna). అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్చంద సంస్థను స్థాపించి పలు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా తయారు చేసింది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న ఆమె వేలాది మంది విద్యార్థులకు స్మార్ట్ క్లాస్ విద్యను అందించింది.'మంచు'లాంటి మనసువిద్యాదానం కంటే గొప్పది మరొకటి ఉండదని బలంగా నమ్ముతుంది లక్ష్మి. తాజాగా నెల్లూరులోని కోటమిట్టలో డిజిటల్ క్లాసు రూముల ప్రారంభోత్సవంలో పాల్గొంది. క్లాసును అందంగా తీర్చిదిద్దడంతోపాటు గదిలో ఓ టీవీని కూడా ఏర్పాటు చేయించింది. జిల్లాలోని 12 స్కూళ్లలో రూ.2 లక్షల చొప్పున నిధులతో టీవీ, తదితర సౌకర్యాలతో డిజిటల్ క్లాస్రూమ్స్ ఏర్పాటు చేయించింది మంచు లక్ష్మి.చదవండి: విడాకుల బాటలో హన్సిక.. కారణం ఇదేనా? -
విడాకుల బాటలో హన్సిక.. కారణం ఇదేనా?
అందానికి మారు పేరు హన్సిక(Hansika Motwani). ఈ ముంబై బ్యూటీ హిందీ, తెలుగు, తమిళం పలు భాషల్లో కథానాయకిగా నటించి పైస్థాయికి చేరుకుంది. అలా అర్ధ సెంచరీకి పైగా చిత్రాలు చేసిన హన్సిక ముఖ్యంగా తమిళంలో ధనుష్, విజయ్, సూర్య, శివకార్తికేయన్, సిద్ధార్థ్ వంటి ప్రముఖ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. కాగా కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలోనే 2022లో సోహల్ కత్తూరియా అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఆడంబరంగా జరిగింది. కాగా సోహల్కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్న వ్యక్తి కావడం గమనార్హం. కాగా పెళ్లయిన రెండేళ్లకే హన్సికకు, భర్తకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్ అవుతోంది. సోహల్ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈవ్యవహారంపై ముంబైలోని మీడియా హన్సిక వర్గాన్ని సంప్రదించగా వారు అవునని కానీ కాదని కానీ స్పందించలేదని సమాచారం. అయితే సోహెల్ మాత్రం స్పందిస్తూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. అయితే ఆయన హన్సిక కలిసి ఉంటున్నారా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఏదేమైనా పెళ్లికి ముందు నటించడానికి అంగీకరించిన కొన్ని చిత్రాలను పూర్తి చేయడానికి హన్సిక సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఆమె టీవీ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా, పాల్గొంటూ, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగానే ఉన్నారు. -
నిధీని చూసి సిగ్గు తెచ్చుకొని ప్రమోషన్స్లో పాల్గొంటున్నా: పవన్ కల్యాణ్
‘‘హరిహర వీరమల్లు’(Hari Hara Veeramallu Movie) సినిమా క్రిష్గారి వల్ల నా దగ్గరకు వచ్చింది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల ఆయన మధ్యలో వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆయన తర్వాత జ్యోతికృష్ణ ఈ సినిమాను హ్యాండిల్ చేశారు. ఇక నేను డిప్యూటీని సీయంని కావొచ్చు. కానీ ఈ సినిమాకు హీరోని. నిధీ అగర్వాల్గారు యాక్టివ్గా ఈ సినిమా ప్రమోషన్ చేయడం చూసి, సిగ్గు తెచ్చుకుని నేను మీడియా ఇంట్రాక్షన్లో పాల్గొంటున్నాను’’ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హీరో పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్ హీరోయిన్. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఏపీ మంత్రి కందుల దుర్గేష్, కర్ణాటక మంత్రి కె. ఈశ్వర్ ముఖ్య అతిథులుగా ΄ాల్గొని, ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఇంకా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘హరిహర వీరమల్లు’ అనేది కల్పిత పాత్ర. విజయవాడ దగ్గరలోని కొల్లూరు దగ్గర్లో లభించిన కోహినూర్ వజ్రం నిజాం నవాబు దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత మొఘలులకు వెళ్లి, ఫైనల్గా... ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని క్రిష్గారు కథ చెప్పారు. మా చేతుల్లో ఉన్నది ది బెస్ట్ ఇవ్వడం. అది చేశాం. మీకు (అభిమానులు, ప్రేక్షకులు) నచ్చిందా బద్దలు కొట్టేయండి’’ అన్నారు. ‘‘మేమెంతో కష్టపడి తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు దయాకర్ రావు. ‘‘1684 నుంచి ‘హరిహర వీరమల్లు’ కథ మొదలవుతుంది’’ అని అన్నారు జ్యోతికృష్ణ. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, కీరవాణి తదితరులు పాల్గొన్నారు. -
మేఘాలయ హనీమూన్ కేసుపై సినిమా ప్లాన్ చేస్తున్న హీరో!
పెళ్లంటే ఆషామాషీయా? బోలెడంత ఖర్చు, కట్నకానుకలు, విందుభోజనాలు.. అబ్బో ఇలా చాలానే ఉంటాయి. భాగస్వామితో భవిష్యత్తును ఊహించుకుంటూ గాల్లో తేలిపోతుంటారు వధూవరులు. కానీ ఈ మధ్య పెళ్లి పేరెత్తితే సంతోషం కన్నా భయం, అనుమానాలే ఎక్కువవుతున్నాయి. నిండు నూరేళ్లు కాదు కదా నెల తిరిగేలోపే జీవిత భాగస్వామి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ అందుకు నిలువెత్తు ఉదాహరణ! హత్యోదంతంపై సినిమాఈ హత్య ఉదంతంపై సినిమా రానుందని తెలుస్తోంది. బీటౌన్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఆమిర్ ఖాన్ (Aamir Khan).. మేఘాలయ హనీమూన్ కేసుపై ప్రత్యేక దృష్టి సారించాడట! ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడట! తన సన్నిహితులతో చర్చిస్తున్నాడట! తన ప్రొడక్షన్లోనే ఈ కేసుపై సినిమా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.మేఘాలయ హనీమూన్ మర్డర్ కథేంటి?రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ (Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు. బలవంతంగా పెళ్లితమ వర్గానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. బలవంతంగా పెళ్లి చేస్తే తర్వాత దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోనమ్ బెదిరించినా పేరెంట్స్ లెక్కచేయలేదు. రాజా రఘువంశీతో ఘనంగా పెళ్లి జరిపించారు. వివాహమైన మూడు రోజులకే సోనమ్.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. మేఘాలయలో దాన్ని ఆచరణలో పెట్టింది. కాంట్రాక్ట్ కిల్లర్స్ను మాట్లాడి భర్తను చంపించి, దొంగతనం జరిగినట్లుగా చిత్రీకరించింది. అనుమానం రాకుండా ఉండటం కోసం.. ఏడు జన్మలవరకు మనం ఇలాగే కలిసుండాలి అంటూ రాజా ఫేస్బుక్ అకౌంట్లో తనే స్వయంగా పోస్ట్ పెట్టింది.భర్త అంత్యక్రియల్లో ప్రియుడుఅక్కడి నుంచి ఇండోర్కు పారిపోయింది. తనను కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడాలనుకుంది. కానీ పోలీసులు సోనమ్ను అనుమానించడంతో ఆమె లొంగిపోయింది. ఆమె చాట్స్ చూడగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందని తేలిపోయింది. అయితే రాజ్ కుష్వాహ ఏమీ తెలియనట్లుగా రాజా రఘువంశీ అంత్యక్రియలకు వెళ్లి అతడి తండ్రిని ఓదార్చాడు. హత్యలో తన ప్రమేయం ఉందన్న విషయం బయటపడకుండా ఉండేందుకే అలా నటించాడు. పోలీసులు సోనమ్, రాజ్ కుష్వాహతో పాటు సుపారీ గ్యాంగ్ను సైతం అరెస్టు చేశారు.చదవండి: షాపింగ్మాల్లో ఈ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తోందంటే? -
షాపింగ్మాల్లో ఈ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తోందంటే?
అంగడి తెరు (Angadi Theru).. 2010లో వచ్చిన హిట్ మూవీ. ఇది తెలుగులో షాపింగ్ మాల్ (Shopping Mall Movie) పేరిట డబ్ అయి ఇక్కడా విజయం సాధించింది. ఈ సినిమాకుగానూ తెలుగమ్మాయి అంజలి తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు అందుకుంది. అలాగే సౌత్ ఫిలింఫేర్ పురస్కారం సైతం గెలుచుకుంది. చెన్నైలోని టీ నగర్లో బట్టల దుకాణంలో పని చేసే ఉద్యోగుల సమస్యలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు. సినిమాతో గుర్తింపు, పెళ్లిమహేశ్, అంజలి (Anjali) హీరోహీరోయిన్లుగా నటించారు. వసంత బాలన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి విజయ్ ఆంటోని, జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. ఈ మూవీలో అంజలి స్నేహితురాలిగా నటి సుగుణ యాక్ట్ చేసింది. అంజలితో పాటు తను కూడా బట్టల షాప్లో దుస్తులు అమ్ముతూ ఉంటుంది. ఈ మూవీకి అసోసియేట్ దర్శకుడిగా పని చేసిన నాగరాజన్ను పెళ్లి చేసుకుంది. నల్లగా ఉన్నా, నన్నెవరు ఇష్టపడతారు?అయితే షాపింగ్ మాల్ తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి సుగుణ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత సినిమాలు చేయడం నా భర్తకు ఇష్టం లేదు, అందుకే వెండితెరపై మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకుని నడుపుతున్నాను. నేను నల్లగా ఉండటం వల్ల అందంగా లేనని బాధపడేదాన్ని. ఎవరూ నన్ను ప్రేమించరని అనుకునేదాన్ని. కానీ పెళ్లి తర్వాత ఆ ఆలోచనే పోయింది. బాధ తట్టుకోలేకపోయా..నన్ను ప్రేమించే భర్త దొరికాడు. అతడు వచ్చాక నా జీవితమే మారిపోయింది. అయితే పెళ్లయిన కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నిలవలేదు. ఎనిమిదో నెలలో కడుపులోనే బిడ్డ చనిపోయింది. ఆ బాధ తట్టుకోలేకపోయాను. కానీ, అప్పుడు నా భర్త సపోర్ట్గా నిలబడ్డాడు. తర్వాత మాకు ఓ కొడుకు పుట్టాడు అని సుగుణ చెప్పుకొచ్చింది.చదవండి: ఏయ్ బాబూ, ఫోన్ తీయ్.. హీరో వార్నింగ్.. వీడియో వైరల్