breaking news
Cinema News
-
పండగపూట ప్రమాదం.. నా భుజం వరకు మంటలు..: బుల్లితెర నటి
దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఇంటి ముంగిట దీపాలు వెలిగించడంతో పాటు పలురకాల పటాసులు కాలుస్తుంటారు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హిందీ బిగ్బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్, బుల్లితెర నటి ప్రియా మాలిక్ (Priya Malik) కూడా అందరిలాగే దీపావళిని వేడుకగా సెలబ్రేట్ చేసుకుంది. ఇరుగుపొరుగువారితో కలిసి ఫోటోలు దిగింది. ఈ సమయంలో తన వెనకున్న దీపానికి ఆమె డ్రెస్ అంటుకుంది.ఫోటోలు దిగుతుండగా..క్షణాల వ్యవధిలోనే అది పెద్ద మంటగా మారింది. కుడి భుజం దగ్గరివరకు అగ్నిరవ్వలు ఎగిసిపడ్డాయి. అది చూసిన నటి తండ్రి.. ఆమె డ్రెస్ చింపేశి ఆమెను కాపాడాడు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ఈ సంఘటన తల్చుకుంటేనే భయంగా ఉంది. నేను, నా కుటుంబసభ్యులు ఇంకా షాక్లోనే ఉన్నాం. ఫోటోలు దిగే సమయంలో నా డ్రెస్కు నిప్పంటుకుంది. నన్ను కాపాడటం కోసం నాన్న డ్రెస్ చింపేశాడు. దానివల్లే నేను బతికిబట్టకట్టాను.నాకే ఆశ్చర్యం!చాలామంది ఏమనుకుంటారంటే.. ఇలాంటివి మనకెందుకు జరుగుతాయిలే అని లైట్ తీసుకుంటారు. కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల నా ప్రాణాలే పోయేవి. నాన్న హీరోలా వచ్చి కాపాడాడు. భుజాలు, వీపు, చేతివేళ్లపై కాలిన గాయాలున్నాయి. చిన్నపాటి గాయాలతో బయటపడ్డందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. సంతోషకర విషయమేంటంటే.. ఆ ప్రమాదం జరిగిన సమయంలో నా చేతిలో నా కొడుకు లేడు అని చెప్పుకొచ్చింది. బిగ్బాస్ 9తో పాపులర్ అయిన ప్రియ మాలిక్.. 2022లో ఎంటర్ప్రెన్యూర్ కరణ్ బక్షిని పెళ్లాడింది. వీరికి 2024లో కుమారుడు జోరావర్ జన్మించాడు.చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ -
రవితేజ- శ్రీలీల 'సూపర్ డూపర్ హిట్టు సాంగ్'.. చూశారా?
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja), హీరోయిన్ శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన 'ధమాకా' మూవీ సూపర్ హిట్గా నిలిచింది. మూడేళ్ల తర్వాత వీరి కలయికలో వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర (Mass Jathara Song). ధమాకాకు బ్లాక్బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మూడు సాంగ్ వచ్చాయి. తూ మేరా లవ్వరు, ఓలే ఓలే.., హుడియో హుడియో.. సాంగ్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా నాలుగో పాట రిలీజ్ చేశారు.సూపర్ డూపర్ హిట్టు సాంగ్అదే సూపర్ డూపర్ హిట్టు సాంగ్! ఈ పాటకు రిథమ్ లేదు.. కదం లేదు, పదం లేదు.. అర్థం లేదు.. పర్థం లేదు అంటూ సాగే ఈ పాట సూపర్ హిట్టని లిరిక్స్లోనే చెప్తున్నారు. రోహిణి, భీమ్స్ సిసిరోలియో ఆలపించిన ఈ పాట సూపర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ జాతర విషయానికి వస్తే.. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. చదవండి: నటి గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఎంత పనైపోయింది? -
నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ
వార్ 2 సినిమా (War 2 Movie)తో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14న విడుదలైంది. మూవీకి పెద్దగా బజ్ లేని సమయంలో నిర్మాత నాగవంశీ (Naga Vamsi)ఇచ్చిన స్పీచ్ బాగా వైరలైంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మూవీ చూశాక ఏమాత్రం అసంతృప్తిగా అనిపించినా పదింతలు తిట్టండి. ఒకవేళ ఇది మీకు అద్భుతమైన సినిమా అన్న ఫీలింగ్ రాకపోతే ఇంకెప్పుడూ నేను మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగను.ఆస్తులమ్ముకుని దుబాయ్కు..తొలిరోజు హిందీ నెట్ వసూళ్లకంటే ఇక్కడ ఒక్క రూపాయి అయినా ఎక్కువరావాలి. తారక్ అన్న ఇండియాలో కాలర్ ఎగరేసేలా చేయాలి అని హైప్ ఇచ్చాడు. కట్ చేస్తే సినిమా దారుణంగా ఫెయిలవడంతో నాగవంశీపై ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఈ సినిమా రిజల్ట్ గురించి నాగవంశీ తొలిసారి స్పందించాడు. మాస్ జాతర మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆగస్టులో ఓ మీడియా నన్ను ఆడేసుకుంది. ఆస్తులమ్ముకుని దుబాయ్ వెళ్లిపోయానన్నారు. నాకర్థం కాని విషయమేంటంటే.. ఆస్తులమ్ముకునేంత దుస్థితిలో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తాం? దుబాయ్ ఏమైనా పల్లెటూరా?తప్పు జరిగిందిఇకపోతే ఆరోజు(వార్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్లో) బాగా ఎగ్జయిట్ అయ్యాను. తప్పు జరిగింది.. తప్పులు చేయకుండా ఉంటామా? నేను, ఎన్టీఆర్.. ఆదిత్య చోప్రా అనే పెద్ద మనిషిని, యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ను నమ్మాం. అందరూ తప్పులు చేస్తారు. వాళ్లు తప్పు చేస్తే మేము దొరికామంతే! అది నేను తీసిన సినిమా కాదు. ఆయన ఇండియాలోనే పెద్ద నిర్మాత. ఆయన్ను నమ్మాం.. మిస్ఫైర్ అయింది. దానికేం చేయగలం? ట్రోల్ చేశారు.. పడ్డాం. మనం తీసిన సినిమాకు కాకుండా బయట సినిమాకు దొరికినందుకు హ్యాపీ అన్నాడు. మాస్ జాతరరవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్లైన్. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రవితేజ కెరీర్లో ఇది 75వ చిత్రం కావడం విశేషం! భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. చదవండి: తనూజను వదిలేశానన్న కల్యాణ్.. సంజనాను ముంచేశారు! -
కరుప్పు నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్
స్టార్ హీరో సూర్య (Suriya) నుంచి సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లో జోష్ పెరిగిపోతుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కరుప్పు ఒకటి. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాష్బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. గాడ్ మోడ్..త్వరలోనే ఈ మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీపావళి పండగ సందర్భంగా సాంగ్ గాడ్ మోడ్ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ను దీపావళి పండగ సందర్భంగా విడుదల చేశారు. నల్లని దుస్తులు, చేతిలో కత్తితో సూర్య నటించిన ఊరమాస్ ట్యూన్స్తో రూపొందిన ఈ పాట ఇప్పుడు అబిమానులను విపరీతంగా అలరిస్తోంది. సినిమాపై అంచనాలను సైతం పెంచేస్తోంది. ఇకపోతే సూర్య ఈ చిత్రంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంనూలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు!
హీరో విశాల్ (Vishal) వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. అంతేకాదు అనూహ్యంగా మెగాఫోన్ పట్టడం విశేషం. ప్రస్తుతం మగుడం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సూపర్గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట రవి అరసును దర్శకుడిగా అనుకున్నారు. ఏమైందో ఏమో కానీ, ఇప్పుడు ఈ చిత్ర దర్శకత్వం బాధ్యతలను విశాల్ తన భుజాన వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన దీపావళి పండగ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో ఇది అనుకోకుండా జరిగిన విషయం కాదని, ముందుగా నిర్ణయించుకున్న విషయమేనని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ సహకారంతోనే మగుడం చిత్రానికి దర్శకత్వం బాధ్యతలను చేపట్టినట్లు చెప్పారు. దర్శకుడిగా..ఈయన మొదట తుప్పరివాలన్– 2 చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. దానికంటే ముందే మగుటం చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇకపోతే ఈ చిత్రం తరువాత సుందర్.సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు వీరి కాంబోలో 12 ఏళ్ల క్రితం మదగజరాజా తెరకెక్కింది. ఈ మూవీ ఎన్నో ఏళ్ల జాడ్యం తర్వాత ఈ ఏడాది విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ హిట్ కాంబో మరో చిత్రానికి సిద్ధం అవుతోంది. ఇద్దరు హీరోయిన్లుసుందర్.సీ చిత్రాల్లో కమర్షియల్ అంశాలు మెండుగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్ల అందాల ఆరబోత కచ్చితంగా ఉంటుంది. వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో విశాల్కు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా, క్రేజీ బ్యూటీ కయాదు లోహర్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
బాక్సాఫీస్ వద్ద కిరణ్ అబ్బవరం రచ్చ.. ‘కె-ర్యాంప్’ కలెక్షన్స్ ఎంతంటే?
ఈ దీపావళికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చివరి చిత్రంగా ఈ నెల 18న ‘కె-ర్యాంప్’(K Ramp ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించినట్లు మెకర్స్ తెలిపారు. రిలీజైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈ సినిమా సక్సెస్ ను ప్రూవ్ చేస్తోంది. ‘మా చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ తో రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సిటీస్ తో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు "K-ర్యాంప్" సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు’ మేకర్స్ తెలిపారు.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.Prekshaka Devullaki 🙏❤️#KRamp #DiwaliKAblockbuster pic.twitter.com/9b5Ednjm4J— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 21, 2025 -
ఆ హీరోయిన్తో ప్రేమలో పడ్డ తరుణ్ భాస్కర్.. ఫోటోలు వైరల్!
సినీ తారల ప్రేమ, పెళ్లిపై రోజూ రకరకాల రూమర్స్ వస్తుంటాయి. రిలేషన్స్లో ఉన్నారని.. పెళ్లి జరిగిందని..ఇలాంటి పుకార్లు దాదాపు అందరిపై వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజం అయితే చాలా వరకు అబద్దాలుగానే మిగిలిపోతాయి. తాజాగా టాలీవుడ్కి చెందిన ఓ హీరోయిన్పై కూడా అలాంటి ‘రిలేషన్’ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. యండ్ డైరెక్టర్తో ఆమె ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరు కలిసి దీపావళి పండగను జరుపుకోవడంలో మరోసారి వీరిద్దరి రిలేషన్పై నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా.. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ(Eesha Rebba). ప్రేమలో పడింది.. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్( Tharun Bhascker ).2012లొ లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి ఈషా రెబ్బ. తొలి చిత్రంతోనే నటన పరంగా మంచి మార్కులే సంపాదించుకుంది. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. దీంతో అరవింద సమేత వీర రాఘవ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. చాలా సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసింది. అలాగే పలు వెబ్ సిరీస్లోనూ నటించింది. త్రీ రోజెస్ సినిమాలో కొంచం బోల్డ్ పాత్రలో నటించినా.. ఈ బ్యూటీకి అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు.తరుణ్తో ప్రేమలో..యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్తో ఈషా ప్రేమలో ఉన్నారనే పుకారు గత కొంతకాలంగా టాలీవుడ్లో వినిపిస్తూనే ఉంది. గతంలో వీరిద్దరు కలిసి తిరుమలకు వెళ్లారు. అప్పుడు వీరిద్దరి ఫోటోలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఇద్దరు కలిసి దీపావళి పండుగను సెలెబ్రేట్ చేసుకున్నారు. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకకి తరుణ్, ఈషా కలిసి వెళ్లారు. విశ్వక్ ఫ్యామిలీతో కలిసి టపాసులు కాలుస్తూ సందడి చేశారు. వీళ్లిద్దరూ క్లోజ్ గా కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే తరుణ్, ఈషా రెబ్బ మధ్య రిలేషన్ ఉన్నారనే విషయంపై మరోసారి నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రేమలో ఉన్నారని..త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కొంతమంది అంటుంటే.. అదేం లేదు.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈషా రెబ్బ త్వరలో కొత్త సినిమా చేయబోతున్నారని, అందుకే అతనితో వెళ్ళినట్లు మరికొంత మంది అంటున్నారు. వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ వాస్తవం ఏది అనేది తెలియదు. View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) -
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
దీపావళి పండగ పూట బాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు గోవర్ధన్ అస్రాని(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. అస్త్రాని(Govardhan Asrani ) మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.గోవర్ధన్ అస్రాని 1941లో జైపుర్లోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలో జన్మించారు. తండ్రి కార్పెట్ షాప్ రన్ చేసేవాడు. ఫ్యామిలీ బిజినెస్పై అస్రానికి ఆసక్తి ఉండేది కాదు. చదువుతున్న రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆర్టిస్ట్గా పని చేశాడు. దర్శకులు కిశోర్ సాహు, హృషికేశ్ ముఖర్జీ సలహా మేరకు పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ‘హమ్ కహా జా రహే హై’(1966) చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ‘షోలే’లోని జైలర్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. గోవర్ధన్ అస్రాని 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా చిత్రాల్లో నటించారు. కమెడియన్గా, సపోర్టింగ్ యాక్టర్గా బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. -
పేరు మార్చుకున్న రిషబ్ శెట్టి.. ఎందుకు? అసలు పేరు ఏంటి?
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే పేరు హాట్ టాపిక్. కేవలం రెండంటే రెండే సినిమాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోనయి, జాతీయ అవార్డు సహా కలెక్షన్ల రికార్డులు కూడా అందుకుంటూ ఒక్కసారిగా భారతీయ సినిమా ప్రభంజనానికి కేంద్ర బిందువుగా నిలిచిందా పేరు. ప్రస్తుతం ప్రతీ సినీ అభిమాన ప్రేక్షకుడికీ చిరపరిచితమైన ఆ పేరు రిషబ్ శెట్టి(Rishab Shetty). అయితే నిజానికి అది ఆయన అసలు పేరు కాకపోవడం విశేషం. మన భారతదేశ సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, భక్తి, విశ్వాసాలు, దైవ బలం ఇలాంటివి తన కాంతారా, కాంతారా చాప్టర్ 1(kantara: Chapter 1) చిత్రాల ద్వారా బలంగా చాటి చెప్పిన రిషబ్ ఆ సినిమాకు కేవలం కధానాయకుడు మాత్రమే కాదనీ అన్నీ తానే అయి నడిపించిన దర్శకుడు కూడా అనేది మనకు తెలుసు. అయితే కోస్తా కర్ణాటకలోని ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అతను నటుడిగా చిత్ర నిర్మాతగా అద్భుతమైన కెరీర్ను నిర్మించుకున్నాడు. ప్రతిభావంతుడైన నట దర్శకుడు రిషబ్ శెట్టి తన సినిమాల ద్వారా ప్రవచించిన ఆధ్యాత్మిక విశ్వాసాలు కేవలం వ్యాపార మెళకువలు అనుకుంటే పొరపాటు. ఆయన తూచ తప్పకుండా నమ్మే, అనుసరించేవి కూడా. అది ఆయన స్వంత ఇంటి అలంకరణ దగ్గర నుంచి ఆయన తన వంటిని అలంకరించుకునే తీరు, వస్త్రధారణలో కూడా అది ప్రస్ఫుటమవుతుంది. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 విజయాన్ని సవినయంగా స్వీకరిస్తూ ఆస్వాదిస్తున్న రిషబ్ పేరు మార్పు వెనుక కూడా ఆయన నమ్మే జ్యోతిష్యశాస్త్ర ప్రభావం ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ‘నేను నా పేరు ఎందుకు మార్చుకున్నాననే దాని వెనుక ఓ కథ ఉంది. నా అసలు పేరు ప్రశాంత్ శెట్టి. అదే పేరుతో సినిమా పరిశ్రమకు ప్రవేశించాను. అయితే సినిమా ఇండస్ట్రీలో తొలి నాళ్లలో నాకు ఎలాంటి విజయం లేదా సినిమాలు రాలేదు‘ అని చెప్పాడు. అదే సమయంలో తనను పేరు మార్చుకోమని అలా చేస్తే విజయాలు, మంచి అవకాశాలు వస్తాయని తన తండ్రి సూచించాడని ఆయన వెల్లడించాడు. అప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పెద్ద స్టార్లు తమ పేర్లు మార్చుకున్నారనే విషయం కూడా తాను విన్నానని చెప్పాడు. దాంతో తాను కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నానని రిషబ్ శెట్టి తెలిపాడు. పేరు మార్పు తన కెరీర్లో మంచి విజయాన్ని తెస్తుందని తన తండ్రి గట్టిగా నమ్మారని ఆయనే తన పేరును రిషబ్గా మార్చమని సూచించినట్టు వివరించాడు. విశేషం ఏమిటంటే రిషబ్ షెట్టి గా పేరు మార్చిన తండ్రే ప్రశాంత్ షెట్టి అనే పేరు కూడా పెట్టడం. మరో విశేషం రిషబ్ తండ్రి స్వయంగా జ్యోతిష్కుడు కావడం. ఏదేమైనా ప్రతిభా సామర్ధ్యాలకు తోడైన పేరు మార్పు కూడా తనను ఇలా శిఖరాగ్రానికి చేర్చిందని రిషబ్ షెట్టి నమ్ముతున్నాడనేది నిస్సందేహం. -
ఒక్కరాత్రిలోనే ఫ్యామిలీ అంతా కోల్పోయింది.. ఎవరికీ తెలీదు!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) చాలాకాలంగా వరుస ఫెయిల్యూర్స్ అందుకుంటున్నాడు. అందుకే, ఈసారి 'ఆంధ్ర కింగ్ తాలుకా' సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది. ఇదలా ఉంటే సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' షోకి హాజరైన రామ్.. తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.ఒక్కరాత్రిలోనే అంతా పోయిందిరామ్ మాట్లాడుతూ.. నా కుటుంబం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అమ్మది హైదరాబాద్, నేనిక్కడే పుట్టాను. నాన్నది విజయవాడ. 1988లో కుల ఘర్షణలు జరిగి చాలా పెద్ద గొడవలు జరగాయి. అప్పుడే నాన్న జపాన్ నుంచి తిరిగొచ్చాడు. ఆ గొడవల్లో మా కుటుంబం అంతా కోల్పోయింది. ఒక్క రాత్రిలోనే మళ్లీ జీరోకు వచ్చేశాం. ఇక విజయవాడలో ఉండటం సరికాదని భావించి చెన్నై షిఫ్ట్ అయ్యాం. సర్వం పోగొట్టుకున్న నాన్న మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాడు. కిందనుంచి పైకి రావడం వేరు.. కానీ కింది నుంచి పైకొచ్చి, అంతా పోగొట్టుకుని ఇంకో సిటీకి వెళ్లి మళ్లీ లైఫ్ స్టార్ట్ చేయడం వేరు.లగ్జరీ ఇంటి నుంచి..అందుకే నాన్నంటే నాకు ఎనలేని గౌరవం. నేను గోల్డెన్ స్పూన్తో పుట్టాను.. మధ్యలో అంతా పోగొట్టుకున్నాను.. నాన్న కష్టం వల్ల మళ్లీ ఒకప్పటి స్థాయికి చేరుకున్నాను. అందుకు మీకో ఉదాహరణ చెప్తా.. విజయవాడలోని మా ఇంట్లో నాకు పెద్ద బొమ్మల గదుండేది. చెన్నైకి షిఫ్ట్ అయ్యాక మేమున్న ఇల్లు.. నా బొమ్మల గదిలో సగం కూడా లేదు. లగ్జరీ భవంతి నుంచి చిన్న ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నాన్న జీతం రూ.4-5 వేలుండేది అని రామ్ పోతినేని చెప్పుకొచ్చాడు.చదవండి: నా కుమారుడి కెరీర్.. అక్కగా తనే చూసుకుంటుంది: రవితేజ -
రెండో వారంలోకి అడుగుపెట్టిన ‘అరి’.. థియేటర్ లో దర్శకుడు !
‘పేపర్బాయ్’ ఫేం జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అరి’. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 10న ఈ చిత్రం ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజైన సంగతి తెలిసిందే. రెండు వారాలుగా థియేటర్స్లో రన్ అవుతూనే ఉంది. దీపావళి సందర్భంగా నాలుగు కొత్త చిత్రాలు (మిత్ర మండలి, డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్) బరిలోకి దిగాయి. అయినా కూడా అరి ఈ రెండో వారంలో కొనసాగుతోంది. పదో రోజు కూడా అరికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు జయ శంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పదో రోజు సినిమాని వీక్షిస్తున్నట్టు జయ శంకర్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.అరి కంటెంట్ బేస్డ్ మూవీ కావడంతో రెండో వారం కూడా కొనసాగించాలని మేకర్లు ఫిక్స్ అయ్యారు. అసలు ఈ మూవీ కోసం ఆర్టిస్టులంతా కలిసి ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తే నెక్ట్స్ లెవెల్లో ఉండేది. ఆడియెన్స్లోకి మరింత ఎక్కువగా వెళ్లే అవకాశం ఉండేది. మరి ఈ రెండో వారంలోనూ అరిని మేకర్లు ప్రమోట్ చేసి ఆడియెన్స్లోకి మరింతగా వెళ్తారా? లేదా? అన్నది చూడాలి. View this post on Instagram A post shared by Jayashankarr (@jayashankarr_) -
Bomb Movie Review: రెండు ఊళ్ళను కలిపిన మరణం
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘బాంబ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఆలోచన... ఓ అణువంత ఆలోచన కూడా పరమాణువంత ఫలితాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఇదే ఆలోచనకు సృజనాత్మకత తోడైతే వెండితెరకు ప్రేక్షకులు పూర్తిగా కట్టుబడిపోతారు. అదే పంథాలో విడుదలైన సినిమా ‘బాంబ్’(Bomb Movie Review). ఈ టైటిల్ చూసి ఇదేదో ఫక్తు క్రైమ్ థ్రిల్లర్ అనుకునేరు! అస్సలు కానే కాదు. ఈ సినిమా ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం అందదు. అందుకే ఈ సినిమా ఆలోచన ఓ అద్భుతం. మణికందన్, అభిషేక్తోపాటు విశాల్ వెంకట్ అందించిన ఈ కథను విశాల్ వెంకట్ దర్శకత్వం వహించి దృశ్య కావ్యంగా మలిచిన విధానం అభినందనీయం. అంతలా ఈ ‘బాంబు’లో ఏముందో ఓసారి చూద్దాం. కాలకమ్మాయిపట్టి అనే ఊరు పెద్ద గాలివాన సమయంలో ఓ బండ పగలడం వల్ల కాలపట్టి, కమ్మాయిపట్టి అని రెండు గ్రామాలుగా విడిపోతుంది. బండ పగిలి ఒకటి చిన్న ముక్కగా, మరొకటి పెద్ద ముక్కగా... రెండు వేరు వేరు ప్రాంతాలలో పడడం వల్ల ఆ ఊరులోని జనాల మధ్య భేదాభ్రిపాయాలు రగిలి రెండు ఊళ్ళుగా విడిపోతారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ ఊరు ముక్కలవడంతో ఊరిలో పాటించే కట్టుబాట్లతో పాటు జరగబోయే పండగ పబ్బాలు కూడా కళ తప్పుతాయి. ఊరు కలిసున్నప్పటి నుండి ఉంటున్న కదిరవన్ అనే వ్యక్తి రెండుగా విడిపోయిన ఊరుని చూసి బాధతో ఉన్నట్టుండి చనిపోతాడు. కదిరవన్నే అంటిపెట్టుకుని ఉండే స్నేహితుడైన మణిముత్తు మాత్రం తను చనిపోలేదనే వాదిస్తుంటాడు. దానికి తోడు చనిపోయిన కదిరవన్ శరీరం నుండి అపానవాయువు వింత వింత శబ్దాలతో ఇంకా వస్తూనే ఉంటుంది. ఇంతలో కదిరవన్ శరీరాన్ని ఊరు మధ్యలో ఉన్న ఓ కుర్చీలో శవంగా కూర్చోపెడతారు. చనిపోయిన కదిరవన్ శరీరం విడిపోయిన రెండు గ్రామాలను ఎలా కలుపుతుందనేది మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘బాంబ్’ సినిమాలోనే చూడాలి. రాబోయే దీపావళికి చెవులు దద్దరిల్లే శబ్దాలతో ఎన్నో బాంబులు మన చెవులను అదరగొడతాయి. కానీ ఈ సినిమా బాంబు మాత్రం మీ అంచనాలకు అందకుండా ఆహ్లాదపరుస్తుంది. కాబట్టి మీ దీపావళి బాంబులతో పాటు ఈ ‘బాంబు’ను కూడా ఓసారి చూసేయండి. వర్త్ టు వాచ్ ఫర్ దిస్ దివాలి. – హరికృష్ణ ఇంటూరు -
నాగార్జున లానే...మాకూ న్యాయం కావాలి అంటున్న నటీనటులు
ఓ చేత్తో భారతీయ సినిమాల స్థాయిని అమాంతం పెంచేస్తున్న సాంకేతిక విప్లవం మరో చేత్తో భారతీయ సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. విఎఫ్ఎక్స్లూ, ఏఐలూ వాడేస్తూ తెరపై అద్భుతాలను ఆవిష్కరిస్తున్న తెరవేల్పులు.. అదే టెక్నాలజీ తమ కొంప ముంచుతుందేమోనని బెంబేలెత్తుతుండడం సాంకేతికత అనే కత్తికి ఉన్న రెండు వైపులా పదనుకు అద్దం పడుతోంది.ఇటీవల తమ పర్సనాలిటీ రైట్స్(Personality Rights) కాపాడాలంటూ న్యాయ స్థానాల గడప తొక్కిన వారిలో బాలీవుడ్ నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆ తర్వాత మన టాలీవుడ్ నుంచి నాగార్జునలు ఉండగా ప్రస్తుతం అదే బాటలో అనేక మంది న్యాయం కావాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. తన గొంతు, రూపం...తదితర తనకు సంబంధించిన వాటిని తన అనుమతి లేకుండా దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాలని నాగార్జున కోరగా ఢిల్లీ హైకోర్ట్ దీనిపై సానుకూలంగా స్పందించింది. దీంతో అభిషేక్ బచ్చన్, ఆశా భోంస్లే, సునీల్ శెట్టి, కరణ్ జోహార్ అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్ అనేక మంది బాలీవుడ్ నటులతో పాటు గాయకులు దర్శకులు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోరుతూ న్యాయస్థానాల బాట పట్టడం కనిపిస్తోంది. తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని, తమ సెలబ్రిటీ స్టేటస్ దుర్వినియోగం కాకుండా రక్షణ కల్పించాలని బాంబే హైకోర్టు ఢిల్లీ హైకోర్టులను వీరు ఆశ్రయిస్తున్నారు.భయపెడుతున్న ఏఐ..ఓ వైపు సోషల్ మీడియాతోనే నానా ఇబ్బందులు పడుతున్న సెలబ్రిటీలను కృత్రిమ మేధస్సు (ఏఐ) మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు వెలుగు చూడడం మిగిలిన వారిని కూడా అప్రమత్తం చేస్తోంది. ఏఐ దుర్వినియోగం నుంచి రక్షణ కల్పించాలని కూడా నాగార్జున, అక్షయ్ కుమార్ లు తమ పిటిషన్ లో కోరడం గమనార్హం. దాదాపు 150 కి పైగా చిత్రాలలో పనిచేసిన అక్షయ్ కుమార్, స్క్రీన్ మేయర్ ‘అక్షయ్ కుమార్‘, చిత్రాలు, పోలిక, వాయిస్, విలక్షణమైన ప్రదర్శన శైలి, ప్రవర్తన ఇతర గుర్తించదగిన లక్షణాలను దుర్వినియోగం చేయడాన్ని నివారించాలనుకుంటున్నారు. అదే విధంగా హృతిక్ రోషన్ దాఖలు చేసిన దావాలో ’ఏదో ఒక రకమైన ’ఏఐ సృష్టించిన నకిలీ చిత్రాలు వీడియోలు, నకిలీ వస్తువులు, మోసపూరిత ప్రకటనలు, తప్పుడు బ్రాండ్ ఎండార్స్మెంట్లు ప్లాట్ఫారమ్లలో సోషల్ మీడియా ప్రొఫైల్లను అనుకరించడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. ఆయన తన దావాలో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఇ–కామర్స్ సైట్లను కూడా ప్రతివాదులుగా ఆయన చేర్చాడు.న్యాయస్థానాలు ఏం చేయనున్నాయి?సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై న్యాయస్థానాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ హైకోర్టు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను కాపాడుతూ, ఆన్ లైన్ ప్లాట్ఫారమ్లు ఆమె పేరు, చిత్రాలను వాణిజ్య లాభం కోసం చట్టవిరుద్ధంగా ఉపయోగించకుండా నిషేధించింది. ప్రముఖ వ్యక్తి గుర్తింపును వారి అనుమతి లేదా అనుమతి లేకుండా ఉపయోగించినప్పుడు, అది సంబంధిత వ్యక్తికి వాణిజ్యపరంగా హాని కలిగించడమే కాకుండా, గౌరవంగా జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ‘ఒకరి వ్యక్తిత్వ హక్కులను అనధికారికంగా దోపిడీ చేసే కేసుల్లో కోర్టులు వాటిని చూసి కళ్ళు మూసుకోలేవు ఆ అనధికార దోపిడీ ఫలితంగా బాధిత పార్టీలకు ఏదైనా హాని జరగకుండా వారిని రక్షించాలి‘ అని జస్టిస్ తేజస్ కరియా సెప్టెంబర్ 9న జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. అదే విధంగా సునీల్ శెట్టి దావాపై ఇచ్చిన ఆదేశాలలో, ‘సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వాది (షెట్టి) డీప్ఫేక్ చిత్రాలను అనధికారికంగా సృష్టించడం/అప్లోడ్ చేయడం అతని వ్యక్తిత్వ హక్కులను మాత్రమే కాకుండా గౌరవంగా జీవించే హక్కును కూడా తీవ్రంగా ఉల్లంఘించడమే‘ అని కోర్టు స్పష్టం చేసింది.అయితే రెండు వైపులా పదును ఉన్న టెక్నాలజీ చట్టాలు, నిబంధనలపై అవగాహన లేని పిచ్చోళ్ల చేతిలో రాయిలా అవుతుండగా . మరోవైపు చట్టాల్ని లెక్కచేయని అతి తెలివి మంతులూ పెరుగుతున్నారు. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో పర్సనాలిటీ రైట్స్కు సంబంధించిన న్యాయ వివాదాలు పెద్ద సంఖ్యలో చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
దీపావళి సినిమాలు.. జోరు మీదున్న హీరో.. వెనకబడ్డ సిద్ధు!
ఈసారి దీపావళి పండగ అక్టోబర్ 20వ తారీఖున వస్తోంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అప్పుడే పండగ మొదలైంది. తెలుగులో పోటాపోటీగా సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఒకటి ఉల్లిగడ్డ బాంబ్లా సౌండ్ చేస్తుంటే మరోటి చిచ్చుబుడ్డిలా వెలుగుతోంది. ఒకటైతే మందుగుండు లేని పటాకాలా మిగిలిపోయింది. అవేంటి? వాటి కలెక్షన్స్ ఏంటో చూద్దాం..రేసులో లేని మిత్రమండలిప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిత్రమండలి. అక్టోబర్ 16న రిలీజైన ఈ మూవీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్న చందంగా మారింది పరిస్థితి! మొదటిరోజే ఈ పటాకా ఎవరికీ నచ్చలేదు. ఇప్పుడిక వేరే సినిమాల ఆప్షన్స్ ఉండటంతో రేసులో చివరి స్థానానికి వెళ్లిపోయింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ తెలుసు కదా. ఈ మూవీ అక్టోబర్ 17న విడుదలైంది. కథ బాగున్నా కాస్త ల్యాగ్ అవడంతో మిక్స్డ్ టాక్ అందుకుంటోంది.స్పీడు మీదున్న డ్యూడ్తొలి రోజు ఈ సినిమా రూ.3 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది జాక్ కంటే కూడా తక్కువ! అయితే మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త మెరుగయ్యాయని చెప్తున్నారు. ఇక అక్టోబర్ 17న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ (Dude Movie) కూడా రిలీజైంది. ఈ మూవీ సెకండాఫ్పై కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లు రాబట్టిందని అధికారిక ప్రకటన విడుదల చేశారు.కె-ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్అన్నిటికంటే ఆలస్యంగా (అక్టోబర్ 18న) వచ్చిన మూవీ కె-ర్యాంప్ (K-Ramp Movie). ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్టు దిగిందా? లేదా? అంటూ బరిలోకి దిగిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమాకు హిట్ టాక్ వస్తోంది. తొలిరోజు ఈ చిత్రానికి రూ.4.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చిత్రయూనిట్ ప్రకటించింది. మరి ఏ సినిమా వసూళ్లు పెరగబోతున్నాయి? దీపావళి హిట్ బొమ్మ ఏదనేది చూడాలి! DAY 2 > DAY 1 for #TelusuKada ❤🔥DIWALI'S RADICAL BLOCKBUSTER sees massive growth on Saturday with housefulls all over 💥💥Book your tickets now!🎟️ https://t.co/QvC10IjSqS#LoveU2 #UnapologeticallyRadicalSTAR BOY @Siddubuoyoffl @NeerajaKona #RaashiiKhanna… pic.twitter.com/UdtkfHUrmu— People Media Factory (@peoplemediafcy) October 18, 2025 DUDE DIWALI BLAST is unstoppable at the box office with massive love from the audience ❤️#Dude collects a gross of 45 CRORES WORLDWIDE in 2 days & going super strong ❤🔥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️ https://t.co/4rgutQNl2n… pic.twitter.com/TLNPYTpNsV— Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2025Box-Office daggara tana Mass Madness chupinchina Kumar Abbavaram 🤙🔥𝟰.𝟱 𝗖𝗿𝗼𝗿𝗲 Day1 GROSS for the 𝐃𝐈𝐖𝐀𝐋𝐈 𝐖𝐈𝐍𝐍𝐄𝐑 #KRamp 💥❤️🔥Grab Your Seats Now!!— https://t.co/nS9p8rSUlZ#KRampKaDiwali pic.twitter.com/BoeIifohez— Hasya Movies (@HasyaMovies) October 19, 2025చదవండి: కోటిలో బ్యాగులు అమ్ముకున్నా.. బాత్రూమ్లు కడిగా: ‘జబర్దస్త్’ కమెడియన్ -
కోఠిలో బ్యాగులు అమ్ముకున్నా.. బాత్రూమ్లు కడిగా: ‘జబర్దస్త్’ కమెడియన్
‘పనే నాకు దేవుడు. మనం చేసే పనే డబ్బుతో పాటు గుర్తింపు, గౌరవం తెచ్చిపెడుతుంది. నిజాయితీగా పని చేసేవాడికే దేవుడు సక్సెస్ ఇస్తాడని నేను నమ్ముతాను’ అంటున్నాడు నటుడు కుమార్ అలియాస్ ‘జబర్దస్త్’ కొమురక్క. లేడీ గెటప్తో అందరిని అలరిస్తున్న కొమురం.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి చాలానే కష్టపడ్డాడు. ఒకప్పుడు హోటల్లో పని చేయడమే కాదు.. బాత్రూంలు కడిగాడట. వచ్చిన ప్రతీ రూపాయిని భూమిపై ఇన్వెస్ట్ చేయడంతో ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటున్నాడు ఈ కమెడియన్. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.కోఠిలో బ్యాగులు అమ్ముకున్నా..పదో తరగతి అయిపోగానే నేను హైదరాబాద్కి వచ్చాను. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. హోటల్లో పని చేశాను. కిరాణం దుకాణం పెట్టి స్టాఫ్కి ఉద్దెర ఇచ్చేవాడిని. హోటల్లో పని అయిపోగానే కోటిలో ఎఫ్ఎమ్ రేడీయోలు, బ్యాగులు అమ్ముకునేవాడిని. వర్షాకాలం వస్తే గొడుగులు, పర్సులు అమ్ముకునేవాడిని. అలా ఎమిమిదేళ్ల పాటు కష్టపడి పని చేశాను. ఒకవైపు హోటల్లో పని.. కిరాణ దుకాణం.. గ్యాప్లో కోటిలో బ్యాగులు అమ్ముకోవడం..ఇలా రెస్ట్ లేకుండా పని చేసేవాడిని. ఫ్యామిలీని వదిలి హైదరాబాద్కు వచ్చిందే డబ్బుల కోసం. అందుకే నేను ఖాళీగా ఉండేవాడిని కాదు.రూ.4500 జీతం.. బాత్రూంలు కడిగా..హైదరాబాద్లో ఎనిమిదేళ్లు పని చేసిన తర్వాత తిరిగి సొంతూరు(షాద్నగర్)కు వచ్చేశా. పెళ్లి తర్వాత ఓ కంపెనీలో హమాలీ పనికి చేరాను. అప్పుడు నా జీతం రూ. 4500 మాత్రమే. హమాలీ పనితో పాటు అక్కడ బాత్రూంలు కూడా కడిగేవాడిని. అందరూ నన్ను హేళన చేసిన పట్టించుకునేవాడిని కాదు. ఏ పని చేసినా నిజాయితీగా చేయడమే నా లక్ష్యం. బాబు పుట్టిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు హమాలీ పని చేశాడు. సినిమాల కోసం ప్రయత్నాలుఓ రోజు నా భార్య ‘ ఎన్నాళ్లు ఇలా దుమ్ములో పని చేస్తావ్?, నీకు సినిమాలు అంటే ఇష్టం కదా.. ఆ ప్రయత్నాలు చెయ్. బాబుని నేను చూసుకుంటా’అని చెప్పింది.మూడేళ్ల పాటు సినిమా ప్రయత్నాలు చెయ్..అప్పటికీ సక్సెస్ కాకపోతే తిరిగి వచ్చేసి ఏదైనా పని చేసుకుందాం’ అని ఆమె చెప్పింది. నేను ఐదేళ్ల పాటు చాన్స్ల కోసం తిరిగాను. ఆ సమయంలో నా భార్యే నాకు నెలకు రూ. 3000 పంపించేది. కుట్టు మిషన్ కుడుతూ పిల్లాడిని పెంచింది. బంధువులంతా నానా మాటలు అనేవాళ్లు. సినిమా ఇండస్ట్రీపై చెడుగా చెప్పేవారు. నా భార్య మాత్రం అవేవి పట్టించుకునేది కాదు.కొమురక్క పాత్ర అలా పుట్టిందిఓసారి ఓ న్యూస్ చానల్కి నేనే ఓ కొత్త ప్రోగ్రాం ఐడియా ఇచ్చాను. ఓ లేడీ ఉంటుందని, ఇలా మాట్లాడుతుందని చెప్పి ఓ గెటప్ని నాకు నేనే క్రియేట్ చేసుకున్నా. ఆ పాత్రకు ముందుగా పోచమ్మ అని పేరు పెట్టుకున్నాను. కానీ అప్పటి ఆంథోల్ ఎమ్మెల్యేగా ఉన్న క్రాంతి కుమార్ ‘కొమురమ్మ’అని పెట్టు అని సలహా ఇచ్చాడు. ఆయన తల్లిగారి పేరు అది. నేను గెటప్ వేస్తే తన తల్లిలాగే అనిపించిందని.. ఆ పేరు పెట్టుకోమని చెప్పాడు. నేను అమ్మ అని పెడితే ఏది పడితే అది మాట్లాడలేమని చెప్పి ‘కొమురక్క’అని పెట్టుకున్నాను. అప్పటి నుంచి అది ఫేమస్ అయిపోయింది. జబర్దస్త్లో ‘పశువులు అంటే ప్రాణం’అంటూ నేను చేసిన ఓ కామెడీ ఎపిసోడ్ బాగా వైరల్ కావడంతో ‘కొమురక్క’పేరు అందరికి తెలిసింది.ప్రతిపైసా భూమిపై పెట్టా..ఒకప్పుడు మాకు షాద్నగర్లో 20 ఎకరాల వరకు భూమి ఉండేది. మా నాన్న అమ్ముకుంటూ వచ్చి చివరకు 5 ఎకరాలకు తీసుకొచ్చాడు. అప్పటి నుంచే నాకు భూమి కొనాలనే ఆశ ఉండేది. నేను, నా భార్య సంపాదించిన ప్రతి పైసా భూమిపై పెట్టా. నాకు ఏ చెడు అలవాట్లు లేవు. అప్పట్లో చాలా తక్కువ ధరకు భూమిని కొన్నాను. ఇప్పుడు దాని విలువ పెరిగింది. నా చుట్టుపక్కల వారికి కూడా అదే చెప్తాను. డబ్బులు వృథా చేయకుండా.. ఇలా ల్యాండ్పై ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ బాగుంటుందని చెప్తాను’ అని కొమురం చెప్పుకొచ్చాడు. ‘మీ ఆస్తి మొత్తం విలువ దాదాపు రూ. 200 కోట్ల వరకు ఉంటుందా?’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు..నవ్వుతూ ‘అంత ఉందని చెప్పలేను కానీ.. అదృష్టం కొద్ది అప్పట్లో తక్కువ ధరకు ల్యాండ్ కొంటే.. ఇప్పుడు దాని విలువ పెరిగింది’ అని చెప్పాడు. -
నారా రోహిత్ పెళ్లి సందడి.. హీరోయిన్ ఇంట హల్దీ ఫంక్షన్
టాలీవుడ్లో హీరో నారా రోహిత్ (Nara Rohith) పెళ్లికి సమయం ఆసన్నమైంది. రోహిత్-శిరీష (Siree Lella) జంట ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని శిరీష సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పసుపు దంచే కార్యక్రమం జరిగిందంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. చీర కట్టుకుని సాంప్రదాయంగా ముస్తాబైన శిరీష.. తన కుటుంబసభ్యులతో కలిసి పసుపు దంచింది.ఆ సినిమాతో ప్రేమ షురూనారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్ చేసింది. ఈ మూవీలో రోహిత్ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్లో వీరికి ఎంగేజ్మెంట్ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.సినిమాబాణం సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమయ్యాడు రోహిత్. సోలో మూవీతో హిట్ కొట్టాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో మెప్పించాడు. View this post on Instagram A post shared by Siree Lella (@siree_lella) చదవండి: బండ్ల గణేశ్ దీపావళి పార్టీ.. హాజరైన టాలీవుడ్ స్టార్స్ -
ఆ రెండు చిత్రాల కంటే ‘డ్యూడ్’కే ఎక్కువ కలెక్షన్స్: ప్రదీప్ రంగనాథన్
‘‘డ్యూడ్’ సినిమాను అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మీరు అందిస్తున్న ప్రేమ మర్చిపోలేనిది. నేను హీరోగా నటించిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు మించిన ఆదరణ, అభిమానం ‘డ్యూడ్’ సినిమాకి చూపిస్తున్నారు. నా గత చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కంటే తొలి, మలి రోజుల్లోనే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’ సినిమాకు వచ్చాయని మా నిర్మాతలు చెబుతుంటే ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని ప్రదీప్ రంగనాథన్ అన్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా, ఆర్. శరత్కుమార్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా ‘డ్యూడ్ దివాళి బ్లాస్ట్’ పేరిట నిర్వహించిన సమావేశంలో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ– ‘‘తమిళనాడులోనూ నా గత చిత్రాలకంటే ‘డ్యూడ్’కు ఎక్కవ కలెక్షన్స్ వస్తున్నాయి’’ అని తెలిపారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘ప్రదీప్గారి గత సినిమాలతో పోల్చుకుంటే కొన్ని ఏరియాల్లో నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’కు వస్తున్నాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ వచ్చింది. ‘డ్యూడ్’ దివాళి బిగ్ విన్నర్’’ అని ప్పారు. ‘‘జెన్ జి కాన్సెప్ట్తో ఫ్యామిలీ ఎమోషన్స్ బ్లెండ్ అయిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’’ అని తెలి΄ారు వై. రవిశంకర్. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. -
పోటీలోనూ వసూళ్లు బాగున్నాయి
‘‘ఈ పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని, చిన్న మెసేజ్ ఇవ్వాలని, ఒక వైబ్ క్రియేట్ అవ్వాలని మేం చేసిన ప్రయత్నం ‘కె–ర్యాంప్’ సినిమా. ప్రేక్షకుల నుంచి ΄పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పుడున్న పోటీలో ఇంతమంచి కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వెళ్తున్నారు. షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి. ఈ దీపావళికి ‘కె–ర్యాంప్’తో నాకు మంచి సక్సెస్ అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, యుక్తీ తరేజా హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలైంది. శనివారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన సక్సెస్మీట్లో రాజేశ్ దండ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ వెతక్కూడదు. అయితే కొందరు మా సినిమా పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. దీపావళికి రిలీజైన సినిమాల్లో ఏ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసి, నిజాలు తెలుసుకోవాలి’’ అని చెప్పారు. ‘‘కె–ర్యాంప్’ను హీరో కిరణ్గారు భుజాన వేసుకుని మోశారు కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది. ప్రేక్షకుల స్పందన బాగుంది’’ అన్నారు జైన్స్ నాని. ‘కె–ర్యాంప్’ విజయం పట్ల వీకే నరేశ్, యుక్తీ తరేజా సంతోషం వ్యక్తం చేశారు. -
బండ్ల గణేశ్ దీపావళి పార్టీ.. హాజరైన టాలీవుడ్ స్టార్స్
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఇంట దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ దీపావళి సెలబ్రేషన్స్ కోసం పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీకాంత్, రోషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తేజ సజ్జ, జేడీ చక్రవర్తి, తరుణ్, మౌలి, దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత నవీన్ యెర్నేని తదితరులు శనివారం నాడు ఈ పార్టీకి హాజరయ్యారు.అందుకోసమే ఈ పార్టీ!ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందులో చిరంజీవి, శ్రీకాంత్ ఒకే కారులో నుంచి దిగారు. చిరు కారు దిగగ్గానే బండ్ల గణేశ్ ఆయన పాదాలకు నమస్కరించాడు. తర్వాత చేతులు పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ప్రత్యేకమైన కుర్చీలో కూర్చోబెట్టాడు. కాగా కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు బండ్ల గణేశ్. మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అయ్యే క్రమంలోనే శనివారంనాడు దీపావళి పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Bandla Ganesh (@bandlaganesh_official) View this post on Instagram A post shared by Bandla Ganesh (@bandlaganesh_official)చదవండి: Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్.. -
రివాల్వర్ రీటా.. హ్యాపీ బర్త్డే సాంగ్ రిలీజ్
మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కీర్తి సురేశ్ (Keerthy Suresh)కు 2024 పెద్దగా కలిసి రాలేదు. వృత్తిపరంగా వరుస అపజయాలను చవి చూసిన ఆమె వ్యక్తిగతంగా మాత్రం మధురమైన ఘట్టానికి చేరుకున్నారు. తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లి చేరుకున్నారు. అయితే సినిమాలకు మాత్రం కాస్త దూరం అయ్యారనే చెప్పాలి. ఈమె నటించిన రఘు తాత, హిందీ చిత్రం మేరీజాన్ చిత్రాలు నిరాశపరిచాయి. ఉప్పు కప్పరంబు అనే వెబ్సీరీస్లో నటించినా, అది ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో పెద్దగా రీచ్ కాలేదు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బాగానే డబ్బు సంపాదించారు.సినిమాఇప్పుడు కీర్తి సురేశ్ మళ్లీ బిజీ అయ్యారు. ఇప్పటికే తెలుగులో రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకుముందు నటించిన రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. వాటిలో ఒకటి రివాల్వర్ రీటా (Revolver Rita Movie). ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి చంద్రు దర్శకుడు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలు నిర్వహించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. శుక్రవారం (అక్టోబర్ 17) కీర్తిసురేష్ 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రివాల్వర్ రీటా చిత్ర యూనిట్ ఒక సాంగ్ విడుదల చేసింది. -
రేబిస్ టీకా తీసుకున్న రేణూ దేశాయ్
టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ (Renu Desai) ఆస్పత్రికి వెళ్లింది. అనారోగ్యంతోనో, అస్వస్థతకు గురయ్యో కాదు.. రేబిస్ టీకా వేయించుకోవడానికి హాస్పిటల్కు వెళ్లింది. రేణూ దేశాయ్.. జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తుందన్న విషయం తెలిసిందే! ఈ క్రమంలో కొన్నిసార్లు మూగజీవాలు తనను గీరడం, కొరకడం వంటివి చేస్తున్నాయట! అందుకోసమే ఈ వీడియోఅందుకని రేబిస్, టెటానస్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపింది. రేబిస్ టీకా తీసుకునేటప్పుడు ఎన్నడూ ఫోటోలు, వీడియోలు తీయలేదు. అసలు ఆ ఆలోచన కూడా రాలేదు. కానీ, అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈసారి టీకా తీసుకున్నప్పుడు ఇలా వీడియో రికార్డ్ చేశాను అంటూ సదరు వీడియోను షేర్ చేసింది.ఏడ్చేసిన నటిరేణూ దేశాయ్.. రెండు రోజుల క్రితం జబ్బు పడి ఉన్న కుక్కను కాపాడింది. ఆ శునకం పరిస్థితి చూసి రేణూ కన్నీళ్లు పెట్టుకుంది. వీటిని కాపాడే క్రమంలో నాకో విషయం అర్థమైంది. ఇటువంటి పనులకు ఇంకా చాలామంది వలంటీర్లు కావాలి. మనుషులుగా మనం తోటి మానవులతో పాటు ఇతర జాతులను కూడా కాపాడుకోవాలి అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. రేణూ చివరగా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కనిపించింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) చదవండి: మాధురికి క్లాస్ పీకిన నాగార్జున.. తీరు మార్చుకోమని హెచ్చరిక! -
నా కోడళ్లు బంగారం.. డిమాండ్ చేసే అత్తను కాను: అమల
'నా కోడళ్లు బంగారం అంటోంది' హీరో అక్కినేని నాగార్జున భార్య, నటి అమల అక్కినేని (Amala Akkineni). మంచి కోడళ్లు దొరికినందుకు సంతోషంగా ఉన్నానని చెప్తోంది. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ, జైనబ్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అమల మాట్లాడుతూ.. నాకు అద్భుతమైన కోడళ్లు దొరికారు. వాళ్లు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు. వాళ్ల రాకతో నా జీవితం కొత్తగా మారింది. వారి వల్లే నాకు గర్ల్స్ సర్కిల్ ఏర్పడింది. బిజీగా ఉండటం మంచిదే!కోడళ్లిద్దరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఈ కాలం అమ్మాయిలు బిజీగా ఉండటం మంచిదే! వాళ్ల పనుల్లో వారు బిజీగా ఉంటే నా పనులతో నేను బిజీగా ఉంటాను. సమయం దొరికినప్పుడు అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తుంటాం. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలని డిమాండ్ చేసే అత్తను కాదు, అలాగే డిమాండ్ చేసే భార్యను కూడా కాదు.. ఒక సాధారణ తల్లిని మాత్రమే! అని అమల చెప్పుకొచ్చింది.అక్కినేని కుటుంబంనాగార్జున 1984లో లక్ష్మీ దగ్గుబాటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాగచైతన్య సంతానం. 1990వ సంవత్సరంలో దంపతులు విడిపోయారు. అనంతరం 1992లో నాగ్.. నటి అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అఖిల్ సంతానం. నాగచైతన్య గతంలో సమంతను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నాడు. 2024లో హీరోయిన్ శోభిత ధూళిపాళను పెళ్లాడాడు. అఖిల్.. జైనబ్ను పెళ్లి చేసుకున్నాడు.చదవండి: ఒక్క టాస్క్కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం! -
సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నీ చూశా: కిరణ్ అబ్బవరం
‘‘నేను సక్సెస్ చూశాను. ఫెయిల్యూర్స్ కూడా చూశాను. సో... వీటి విషయంలో పరిణతి చెందాను. కానీ విజయం వచ్చిన ప్రతిసారీ చాలా పాజిటివ్గా ఉంటుంది. నా సినిమా వస్తే బాగుంటుందనే ఇమేజ్ను ప్రేక్షకుల నుంచి తెచ్చుకోవాలన్నదే నా ప్రయత్నం. ‘కె–ర్యాంప్’ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు’’ అని కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) అన్నారు. ఆయన హీరోగా, యుక్తి తరేజా హీరోయిన్గా నటించిన చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం నేడు (అక్టోబర్ 18న) విడుదలవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ‘‘కె–ర్యాంప్’లాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది. క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్ ఇది. ఇందులో కుమార్ అనే పాత్ర చేశాను. ఈ సినిమా ఫస్టాఫ్ యూత్ఫుల్ ఎలిమెంట్స్తో ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఎంగేజ్ చేస్తుంది’’ అని అన్నారు. ‘‘పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులను ఈ సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది’’ అని తెలిపారు వీకే నరేశ్. ‘‘ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసుకుని, సినిమా చేశాను’’ అన్నారు జైన్స్ నాని. ‘‘ఈ చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను’’ అని పేర్కొన్నారు యుక్తీ తరేజా.చదవండి: ‘కె-ర్యాంప్’ మూవీ ట్విటర్ రివ్యూ -
‘జటాధర’ ధమ్ బిర్యానీలా ఉంటుంది : సుధీర్ బాబు
‘‘చిన్నప్పుడు ‘ఓ స్త్రీ రేపు రా, లంకె బిందెలు’ వంటి కథలు విన్నప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతాం. వెంకట్ ‘జటాధర’(Jatadhara Movie) కథ చెప్పినప్పుడు అంతే థ్రిల్గా అనిపించింది. మా సినిమా చూసినప్పుడు ఆడియన్స్ థియేటర్స్లో అదే థ్రిల్ ఫీల్ అవుతారు’’ అని సుధీర్బాబు(Sudheer Babu) తెలిపారు. ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ఝాన్సీ కీలక ΄ాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సాల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ని హీరో మహేశ్బాబు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో సుధీర్బాబు మాట్లాడుతూ–‘‘జటాధర’లో అద్భుతమైన కథ, భావోద్వేగాలు ఉంటాయి. ధన పిశాచి అనే పవర్ఫుల్ రోల్లో సోనాక్షి నటనను ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మా సినిమా ఒక ధమ్ బిర్యానీలా తయారైంది’’ అని చెప్పారు. ‘‘జటాధర’ నా తొలి తెలుగు సినిమా. ధన పిశాచిలాంటి పాత్ర నేనిప్పటివరకూ చేయలేదు’’ అని తెలిపారు సోనాక్షీ సిన్హా. ‘‘బ్రహ్మ’ నా తొలి తెలుగు చిత్రం. మళ్లీ ‘జటాధర’తో తెలుగుకి రావడం హ్యాపీగా ఉంది’’ అని శిల్పా శిరోద్కర్ పేర్కొన్నారు. ‘‘మా ‘జటాధర’ పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం’’ అని ఉమేశ్ కుమార్ బన్సల్, ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్ తెలి΄ారు. ‘‘కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. ఈ సినిమాని గట్టిగా ఎంజాయ్ చేస్తారు. ఇందుకు 100 శాతం మాది గ్యారంటీ’’ అని వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ అన్నారు. -
‘కె-ర్యాంప్’ మూవీ ట్విటర్ రివ్యూ
గతేడాది దీపావళికి ‘క’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం..ఈ సారి ‘కె-ర్యాంప్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించింది.ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(అక్టోబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘కె-ర్యాంప్’ ఎలా ఉంది? కిరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా ? తదితర అంశాలను ఎక్స్లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.ఎక్స్లో కె-ర్యాంప్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిస్తుంది. సినిమా బాగుందని, కిరణ్కి భారీ విజయం సాధించిందని కొంతమంది అంటుంటే.. బాగోలేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.#KRamp Review : A Good Festive Fun filled Entertainer - 3/5 💥💥💥Youth Star ⭐️ @Kiran_Abbavaram RAMPAGE TIMING with one man show totally 👍🔥❤️🔥 Mass Center audience ki eyyite eye feast 🤩🙌💥#KiranAbbavaram #JainsNani Director @JainsNani presented second half so superbly… pic.twitter.com/vsMkne6yP0— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) October 18, 2025ఈ పండక్కి మంచి ఫన్ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఈ మూవీకి కిరణ్ వన్మ్యాన్ షో. మాస్ సెంటర్ ఆడియన్స్ సినిమా బాగా ఎక్కేస్తుంది. సెకండాఫ్ని దర్శకుడు బాగా డీల్ చేశాడు. డైలాగ్స్ మరో ప్రధాన బలం’ అంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు.A good overall watch Family entertainer 👌Second half pub scene 😂😂 Ee #Diwali kuda needhey @Kiran_Abbavaram #KRamp #KrampReview https://t.co/mwsuneMLhA— Karthik Chowdary (@KChowdaryyy) October 18, 2025 ఓవరాల్గా సినిమా బాగుంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సెకండాఫ్ పబ్ సీన్ బాగుంది. ఈ దిపావళి కూడా కిరణ్ అబ్బవరందే అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#KRamp A Silly, Outdated Film that’s Over the Top from Start to Finish!The film follows a very simple story with a routine to the core screenplay that we’ve seen countless times before. This might have worked for a genre that aims purely to entertain, but here the comedy and…— Venky Reviews (@venkyreviews) October 18, 2025 ప్రారంభం నుంచి ముగింపు వరకు ఓవర్ ది టాప్గా ఉండే ఒక సిల్లీ చిత్రమిది. ఇలాంటి కథలను మనం చాలా వరకు చూశాం. కేవలం వినోదాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే క్రింజ్గానే అనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్లను దర్శకుడు బాగా డీల్ చేశాడు. మిగిలి రచన పేలవంగా ఉంది అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు.Done with my show, good 2nd half followed..!! Disorder characterization scenes comedy worked in parts. Kumar abbavaram steals the show from scene 1 except during father sentiment. Climax is just good. Overall a decent entertainer. 2.5/5 #KRamp— Peter Reviews (@urstrulyPeter) October 17, 2025#KRamp LOUD MASS ENTERTAINER What team promised is Completly Fulfilled👍, Okayish 1st half followed by Very good 2nd half🌟Introduction 🔥🔥, 2nd half Some comedy scenes🔥. Good film for @Kiran_AbbavaramAfter #KA MASSSY ENTERTAINERDIWALI WINNER 🏆 🌟🌟🌟/5— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) October 18, 2025#KRampExcept for a couple of sequences in the second half nothing is interesting. Outdated story,Unwanted songs, Predictable screenplay and those comedy scenes 🙏 Forget about music. No emotional depth except climax sequence. @ItsActorNaresh and @vennelakishore are the saviours.— Vaishu Mahadevan (@VaishuMahadeva2) October 17, 2025Second half >>>Full tooo Fun 😂🔥Fully entertainment Bomma 3.25/5 - #KRamp https://t.co/9a8mqTUMc5— let's x Cinematica (@letsxCinematica) October 17, 2025 -
పన్నెండు వేల కోట్లకు అధిపతివి.. పాన్ మసాలా అమ్ముకునే ఖర్మేంటి?
గత కొంత కాలంగా పలువురు యూట్యూబర్లు తీవ్రమైన విమర్శలకు గురవుతున్నారు. చేతిలో చానెల్ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వీడియోలు చేసేసి జనం మీదకు వదులుతున్నారని వీరిపై అనేక మంది మండిపడుతున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం కొందరు విశ్లేషణాత్మక, ఆలోచింపజేసే వీడియోలను చేస్తూ ఆసక్తిని కలిగిస్తున్నారు. అలాంటిదే ఒక తాజా వీడియో ని యూ ట్యూబర్ థృవ్ రాథీ విడుదల చేశాడు. తన వీడియో ద్వారా కనీస సామాజిక బాధ్యత లేకుండా డబ్బే పరమావధిగా ప్రకటనల్లో నటించేందుకు తెగబడుతున్న సెలబ్రిటీలు అందరికీ రాథీ వాతపెట్టాడు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అని తేడా లేకుండా సెలబ్రిటీలు తమ పాప్యులారిటీని పైసల కోసం ఎడాపెడా వాడుకుంటున్న నేపధ్యంలో ఈ వీడియో అనేకమందిని ఆకర్షించింది.హాలీవుడ్ స్టార్స్ని దాటేసిన షారూఖ్షారూఖ్ ఖాన్ కు నా ప్రశ్న‘ పేరుతో భారతీయ యూట్యూబర్ థృవ్ రాథీ విడుదల చేసిన ఇటీవలి వీడియో లో చెప్పిన ప్రకారం... బాలీవుడ్ మెగా స్టార్ షారుఖ్ ఖాన్ అధికారికంగా బిలియనీర్ ట్యాగ్ని అందుకున్నారు, హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ఈ నటుడి నికర విలువను 1.4 బిలియన్ డాలర్లుగా లెక్కించింది. ఈ నేపధ్యంలో ఈ బాలీవుడ్ స్టార్ నికర విలువ, సంపదల విషయంలో టామ్ క్రూజ్ ది రాక్ (డ్వేన్ జాన్సన్) వంటి టాప్ హాలీవుడ్ నటులను సైతం అధిగమించిట్టు వెల్లడించింది. ప్రస్తుతం షారూఖ్ ఆస్తుల విలువ అక్షరాలా.. దాదాపు రూ. 12,400 కోట్లు. మీరు విన్నది నిజమే ‘షారూఖ్ ఖాన్ ఇప్పుడు బిలియనీర్ అయ్యాడు. వార్తా నివేదికల ప్రకారం, ఆయన నికర విలువ 1.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే రూ. 12,400 కోట్లకు పెరిగింది‘ అని రాతీ చెప్పారు. ‘అది ఎంత డబ్బో మీకు తెలుసా? అబ్బో మనం ఊహించడం కూడా కష్టం,‘ అని అతను నొక్కి చెప్పాడు.కూర్చుని తిన్నా తరగనంత...పన్నులు వడ్డీ రేట్లు తీసివేసిన తర్వాత , ప్రతిరోజూ ఫస్ట్ క్లాస్లో ప్రయాణించి, అత్యంత ఖరీదైన హోటళ్లలో జవాన్ నటుడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపినప్పటికీ కూడా, అతను తన మొత్తం నికర విలువలో దాదాపు రూ. 400–500 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తాడని రాథీ వీడియోలో విశ్లేషించాడు. ఈ నేపధ్యంలో ‘షారూఖ్ ఖాన్కి నా ప్రశ్న, మీకు ఈ డబ్బు సరిపోలేదా? అది సరిపోతే, మీరు ఇంకా పాన్ మసాలా వంటి హానికరమైనదాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మీరు ఇంకా ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు?‘అంటూ రాథీ బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ కి సూటిగా ప్రశ్నిస్తున్నాడు.గత 2014లో పాన్ మసాలా బ్రాండ్ కోసం ఖాన్ వసూలు చేసిన ఎండార్స్మెంట్ రుసుము గురించి కూడా రాథీ చర్చించాడు ‘‘మీకు నిజంగా ఈ అదనపు రూ. 100–200 కోట్లు అవసరమా?‘ అని నిలదీశాడు‘ దాని గురించి మరొక విధంగా ఆలోచించండి: దేశంలోని అగ్ర నటుడు ఈ హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేయడాన్ని ఆపివేస్తే, అది దేశంపై ఎంతటి మంచి ప్రభావం చూపుతుంది?‘ అంటూ ఆలోచించమని కోరాడు. అంతేకాదు ఆ వీడియోను సదరు సూపర్స్టార్కి చేరేలా ప్రచారం చేయమని ప్రేక్షకులను కోరడం ద్వారా అతను వీడియోను ముగించాడు.గత కొంతకాలంగా తారలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సహా అనేక రకాలైన సమాజ వ్యతిరేక ప్రచారాల్లో పాల్గొంటూ విమర్శలకు గురవుతున్నారు. కొన్ని వందల కోట్లకు అధిపతి అయిన టాలీవుడ్ హీరో బాలకృష్ణ సైతం ఓ మద్యం బ్రాండ్ కు ప్రచారం చేయడం తీవ్రమైన విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రతీ సెలబ్రిటీని, సినీ అభిమానిని ఆలోచింపజేసేలా థృవ్ రాథీ వీడియో ఉందనేది నిస్సందేహం.My question to Shah Rukh Khan.@iamsrk pic.twitter.com/MZjCbsIkjx— Dhruv Rathee (@dhruv_rathee) October 15, 2025 -
అప్పుడు గాజులమ్ముకున్నా.. ఇప్పుడు కిడ్నీ అమ్ముకుని సినిమా చేస్తా!
బోల్డ్ సినిమాల్లో నటించి పాపులర్ అయింది వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్ (Rekha Boj). సినిమా అవకాశాలు ఎక్కువ పెద్దగా అవకాశాలు రాకపోయేసరికి యూట్యూబ్లో కవర్ సాంగ్స్ చేస్తోంది. ఆ మధ్య పుష్ప మూవీలోని సామి సామి.. పాట కవర్ సాంగ్ చేసేందుకు రెండు గాజులు అమ్ముకుంది. అంతటితో ఆగడం లేదు.. కుదిరితే కిడ్నీలైనా అమ్ముకుంటాను కానీ యాక్టింగ్ను మాత్రం వదిలేది లేదని తెగేసి చెప్తోంది.షార్ట్ఫిలింతో జర్నీ మొదలురేఖా భోజ్ మాట్లాడుతూ.. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం 'లవ్ ఇన్ వైజాగ్'. షణ్ముఖ్ జశ్వంత్తో కలిసి యాక్ట్ చేశాను. తర్వాత డర్టీ పిక్చర్ అనే లఘు చిత్రం చేశాను. కాలాయా తస్మై నమః సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాను. నా జీవితంలో ఫస్ట్ కవర్ సాంగ్ సామి సామి.. బంగారు గాజులు అమ్మి మరీ ఈ పాట చేశాను. ఈ సాంగ్ వల్లే మాంగళ్యం సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ మూవీ నాకు మంచి పేరు తీసుకొచ్చింది.కమిట్మెంట్స్ ఇచ్చుంటే..గత ఐదారేళ్లుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ కమిట్మెంట్స్ అడుగుతున్నారు. బంగ్లా రాసిస్తా.. అవి కొనిస్తా.. అదీ ఇదీ అని మభ్యపెట్టేవారు. కమిట్మెంట్ అడిగినవాళ్లకు గట్టిగానే కౌంటర్లిచ్చాను. అలాంటివి చేసుంటే ఈపాటికి చాలా సంపాదించేదాన్ని. నేనేదో.. నా దగ్గరున్న వస్తువులు అమ్ముకుంటూ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ ఇండస్ట్రీని వదిలి ఎక్కడికీ వెళ్లలేను. నాతో పనిచేసేందుకు నిర్మాతలు ముందుకు రాకపోతే నా ఆస్తి అమ్మేసైనా సరే.. ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. గాజులమ్మగా వచ్చిన రూ.4 లక్షలతో సామి సామి పాట ఎలా చేశానో.. కిడ్నీ అమ్మి, ఆ డబ్బుతో సినిమా చేద్దామనుకుంటున్నా.. నాలుగేళ్లుగా బిగ్బాస్కు వెళ్లేందుకు..ఎందుకంటే సినిమానే నా ప్రపంచం. ఇకపోతే పాపులారిటీ కోసం బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కి వెళ్లేందుకు ప్రయత్నించాను. గత నాలుగేళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నా.. గతేడాది ఇంటర్వ్యూ కూడా అయింది. అంతా ఓకే అన్నారు.. ఇంకో వారంలో షో స్టార్ట్ అన్న సమయంలో రిజెక్ట్ చేశారు. ముక్కూమొహం తెలియనివాళ్లు కూడా షోకి వస్తున్నారు. మరి నన్నెందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. నాకు అవకాశం ఇచ్చుంటే దాన్ని బాగా ఉపయోగించుకునేదాన్ని. బిగ్బాస్ తెలుగు తొమ్మిదో సీజన్కు సైతం వీడియో పంపించాను. కానీ అదృష్టం కలిసి రావడం లేదు అని రేఖా బోజ్ చెప్పుకొచ్చింది.చదవండి: ఈసారి ఇద్దరు కెప్టెన్స్.. సుమన్ ప్రమాణ స్వీకారం! -
నడవలేని స్థితిలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. రాఘవతో ఫోటో
ఊహ తెలియని వయసులో కెమెరా ముందు చురుకుగా యాక్ట్ చేశాడు. దాదాపు 25కి పైగా సినిమాలు చేశాడు. కానీ, విక్రమార్కుడు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్గానే అందరికీ ఎక్కువగా గుర్తుండిపోయాడు. అతడే రవి రాథోడ్ (Ravi Rathod).. అతడి టాలెంట్ చూసిన రాఘవ.. ముందుగా పిల్లాడికి మంచి చదువు అవసరం అని భావించాడు. రవిని దత్తత తీసుకుని పెద్ద స్కూల్లో చేర్పించాడు. కానీ అతడికి చదువు అబ్బలేదు. అసలు చదవాలన్న ఆసక్తే లేకపోవడంతో లారెన్స్కు ఒక్క మాటైనా చెప్పకుండా స్కూలు మానేశాడు.తాగుడుకు బానిసతర్వాతికాలంలో చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వస్తున్నాడు. మద్యానికి బానిసై మందు తాగకపోతే బతకను అనే స్టేజీకి దిగజారిపోయాడు. అతిగా మద్యం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయి. కిడ్నీలో రాళ్లు చేరి.. సరిగా నడవలేని స్థితికి చేరుకున్నాడు. అతడి పరిస్థితి తెలుసుకున్న రాఘవ లారెన్స్ (Raghava Lawrence)కు గుండె తరుక్కుపోయింది. రవిని ఒక్కసారి కలవమని సోషల్ మీడియా వేదికగా కోరాడు.రాఘవతో రవి రాథోడ్దీంతో రవి రాథోడ్.. చెన్నై వెళ్లి లారెన్స్ను కలిశాడు. మద్యానికి బానిసైన విషయం తెలిసి రాథోడ్పై కోప్పడ్డాడు. తన మంచి కోరుతున్న లారెన్స్ కోసం.. జీవితంలో మళ్లీ మందు ముట్టనని మాటిచ్చాడు. ఆయన ఇచ్చిన డబ్బుతో తనకంటూ ఓ ఫోన్ కొనుక్కుని ఆరోగ్యంపై ఫోకస్ చేశాడు. తాజాగా అతడు లారెన్స్తో కలిసి దిగిన ఫోటో షేర్ చేశాడు. ఇది చూసిన జనాలు.. రాఘవ మంచి మనసును మరోసారి మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇతడి ఆస్పత్రి బిల్లులు కూడా లారెన్సే చూసుకోవడం విశేషం! View this post on Instagram A post shared by actor ravi raj rathod (@actor_ravi_child_artist) చదవండి: డ్యూడ్ X రివ్యూ: టాక్ ఎలా ఉందంటే? -
డ్యూడ్ X రివ్యూ: టాక్ ఎలా ఉందంటే?
లవ్టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన సినిమా డ్యూడ్ (Dude Movie X Review). కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శుక్రవారం (అక్టోబర్ 17న) డ్యూడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో ప్రదీప్ హిట్టు కొట్టాడా? మూవీకి ఏది ప్లస్ అయింది? ఏది మైనస్ అయిందని ఎక్స్ (ట్విటర్)లో నెటిజన్లు చర్చిస్తున్నారు. డ్యూడ్ చాలా బాగుందని కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం సెకండాఫ్ పోయిందని చెప్తున్నారు. మరింకా ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయో కింద చూసేద్దాం.. మంచి సందేశంకీర్తిశ్వరన్ ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టాడు. ఇది అసలుసిసలైన జెన్ జెడ్ మూవీ. సాయి అభ్యంకర్ ఇచ్చిన బీజీఎమ్ సినిమాకు ప్రధాన బలం. హీరోహీరోయిన్లు వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. మంచి సందేశాన్ని వినోదాత్మకంగా అందించారు అని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డాడు. Dude - Winner 🏆 What a fabulous debut for @Keerthiswaran_ 💯👏 A proper Gen Z rom-com ❤️🔥 @SaiAbhyankkar BGM & songs are a major plus ✨ Both PR & Mamitha were perfect in their roles 🤩 Much needed social message said in the most entertaining way 🔥#Dude #DudeDiwali #DudeReview pic.twitter.com/SdCJTKqxWD— Alex (@callmeajas) October 17, 2025సెకండాఫే..ఫస్టాఫ్ బాగుంది.. సెకండాఫ్ పోయింది. కథ నెమ్మదిగా మొదలై ప్రీ ఇంటర్వెల్కు వేగం పుంజుకుంటుంది. కానీ ఆ వేగం సెకండాఫ్లో ఎక్కడా కనిపించదు. సెకండాఫ్ను ఇంకాస్త బాగా ఎడిట్ చేయాల్సింది అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. #Dude A Mid Rom-Com with a Fairly Engaging First Half but a Lackluster Second Half!The film hits all the familiar beats of a typical rom-com. The first half starts off a bit slow but picks up well toward the pre-interval, ending with a well-executed interval block. However, the…— Venky Reviews (@venkyreviews) October 17, 2025సూపర్ ఎంటర్టైనర్డ్యూడ్తో ప్రదీప్ మళ్లీ అదరగొట్టాడు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అదిరిపోయింది. సంగీతం, విజువల్స్ అన్నీ బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీసినట్లు అనిపించినా ఓవరాల్గా సూపర్ ఎంటర్టైనింగ్గా ఉంది అని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు.Just watched #Dude 🎬🔥Pradeep strikes again with youthful energy & emotions!Fun, fresh & emotional ride!💥Pradeep & #MamithaBaiju chemistry 💯🎧 Music & visuals top-notch😅 Few scenes feel stretched, but overall super entertainer!⭐⭐⭐⭐☆ #DudeReview #PradeepRanganathan pic.twitter.com/NRwyKYDHhx— Dragon (@yours_dragon) October 17, 2025మిక్స్డ్ ఫీలింగ్డ్యూడ్ మూవీ చూశాక మిక్స్డ్ ఫీలింగ్ వస్తోంది. కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. పర్ఫామెన్స్ అయితే బాగుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.#Dude Might work / Might not....!!Mixed feeling after watching film, Performances are good, 1st half is Good, and 2nd half moves to the different pattern and completes with okayish watch. Might work for some people. Pradeep with performance 🔥OKAYISH ENTERTAINER 🌟🌟.5/5— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) October 17, 2025 #Dude - PR’s Style, his combo with Mamitha Nice. Sarathkumar shines in versatile role. Hridhu Gud addition. Music ok. Slow start, Interval block 20Mins ROFL. Final act could have been better. Though less emotional connect, Humour drives d narration to an extent. ONE TIME WATCH!— Christopher Kanagaraj (@Chrissuccess) October 17, 2025VERY GOOD first half. Right from the first scene, there’s entertainment and the screenplay is engaging. The chemistry of @pradeeponelife and @_mamithabaiju is EXCELLENT. The storyline is good, the moments are cute, emotions land and the music is great. If this holds for the… pic.twitter.com/IrbdKWSbNw— Sharat Chandra (@Sharatsays2) October 17, 2025 First half is simply excellent #Dude 2nd half idey range lo untey good... https://t.co/YGO1ih1SCq— Ajayvinay (@Ajayvinay1) October 17, 2025#Dude is a partly engaging effort with fine performances but limited emotional resonance.written and directed by Keerthiswaran, #Dude is a modest romantic drama that blends light humor with emotional undertones. The film begins on a slow note but gradually finds its energy,…— Thyview (@Thyview) October 17, 2025#Dude 🌟🌟🌟 /5A very Pradeep Ranganathan coded film. The hidden conflict was a great strategic move. The first and second halves sit on completely opposite sides of the spectrum. Though predictable at times.#BiggBossTamil9 #Bisonpic.twitter.com/EMpTj7TGBQ— Cine News (@cinema_online2) October 17, 2025#Dude #Dudefirsthalf Neither good nor Bad .... Just ok !!!No story !! Routine scenes only music n bgm fresh 🔥🔥🔥🔥#SaiAbhyankkar killed it with BGM N songs..... @Chrissuccess @Karthikravivarm @itisprashanth— Movie Addict 😈 (@Madraspayen) October 17, 2025#Dude - 3.5/5🎯 Hat-trick hero! After Love Today and Dragon, #PradeepRanganathan delivers yet another blockbuster with #Dude! Three in a row — the young sensation is on fire! 🔥— Box Office (@Box_Office_BO) October 17, 2025 -
సినీ ఇండస్ట్రీలో వివక్ష? ప్రేమలు బ్యూటీ ఆన్సరిదే!
హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకోవడం అంత సులభం కాదు. అలాగే ఏ మూవీ కెరీర్ను ఎటు మలుపు తిప్పుతుందో చెప్పలేని పరిస్థితి. మలయాళంలో అనేక సినిమాలు చేసిన మమిత బైజు (Mamitha Baiju) 'ప్రేమలు' అనే ఒక్క మూవీతో సెన్సేషన్ అయింది. ఈ ఒక్క చిత్రంతోనే తమిళంలో అవకాశాలు వచ్చాయి. అలా జి. ప్రకాష్ కుమార్ సరసన రెబల్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ, ఈ మూవీ పూర్తిగా నిరాశపరిచింది. సాధారణంగా తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోతే అవకాశాలు మందగిస్తాయి. కానీ, మమిత బైజు విషయంలో ఇది రివర్స్ అయిందనే చెప్పాలి. తమిళంలో అవకాశాలుప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్లో ముఖ్య భూమిక పోషిస్తోంది. అదేవిధంగా క్రేజీ నటుడు ప్రదీప్ రంగనాథన్కు జంటగా డ్యూడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా నటి నమిత బైజు మాట్లాడుతూ.. తమిళ సినిమాల్లో నటించాలని తాను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదని తెలిపింది. అయినప్పటికీ తమిళంలో పలు వైవిద్యభరిత పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేసింది. అలా వచ్చిన వాటిలో మంచి కథలను ఎంపిక చేసుకొని నటిస్తున్నట్లు చెప్పింది.తమిళం వచ్చేసిందిఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వివక్ష ఎదుర్కొన్నారా ? అన్న ప్రశ్నకు.. అలాంటి పరిస్థితులు తనకు ఎదురవ్వలేదని స్పష్టం చేసింది. మొదట్లో తమిళ భాష మాట్లాడటం తనకు ఛాలెంజింగ్ అనిపించినా, తన యూనిట్లో మేకప్ మాన్, హెయిర్ స్టైలిస్ట్ వంటి వారు తమిళులు కావడంతో వారి మాటలే తాను తమిళం నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యాయంది. ఇప్పుడు తాను తమిళ భాషలో మాట్లాడటం, రాయడం కూడా నేర్చుకున్నానంది. డ్యూడ్ చిత్రంలో నటుడు ప్రదీప్ రంగనాథన్తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. ఆయన ఫ్రెండ్లీగా ఉంటారని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని మమిత బైజు పేర్కొంది.చదవండి: ముచ్చటగా మూడోసారి! -
‘కాంతార చాప్టర్ 1’ దీపావళి బ్లాస్ట్.. కొత్త ట్రైలర్ అదిరింది!
రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 680 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికీ అత్యధిక థియేటర్స్లో రన్ అవుతున్న ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్(Kantara Chapter 1 Deepavali Trailer)ని రిలీజ్ చేశారు మేకర్స్. దీపావళి కానుకగా నేడు(గురువారం) విడుదలైన ఈ కొత్త ట్రైలర్ సినిమాలోని కీలక సన్నివేశాలన్నింటిని చూపించారు. యాక్షన్ సీన్లను హైలెట్ చేస్తూ ఈ ట్రైలర్ని కట్ చేశారు. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించి ఈ చిత్రంలో యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించింది. గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషించాడు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. -
ముంబైలో ల్యాండ్ కొన్న సోనూసూద్.. ధర ఎంతంటే?
విలక్షణ నటుడు సోనూసూద్ (Sonu Sood) ప్లాట్ కొనుగోలు చేశాడు. కుమారుడు ఇషాన్తో కలిసి ముంబై పన్వేల్లోని 777 చదరపు గజాల భూమిని తన సొంతం చేసుకున్నాడు. దీనికోసం రూ.1.09 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కోసం రూ.30 వేలు, స్టాంప్డ్యూటీ కింద రూ. 6.3 లక్షలు చెల్లించాడు. ముంబై-పుణె మార్గంలో పన్వేల్ ప్రాంతం ఉంది. పన్వేల్లో ఐటీ సంస్థలు, విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రాబోతున్నాయి.ఇటీవలే అపార్ట్మెంట్ కొనుగోలుముంబై రెండో అంతర్జాతీయ విమానాశ్రయం (Navi Mumbai International Airport) కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. కాగా సోనూసూద్ కుమారుడు ఇషాన్.. ఇటీవల ఆగస్టులో సైతం ముంబైలోని అంధేరి వెస్ట్లో ఓ అపార్ట్మెంట్ కొన్నాడు. దీనికోసం రూ. 2.6 కోట్లు ఖర్చు చేశాడు. అదే నెలలో సోనూసూద్.. ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో తన అపార్ట్మెంట్ను రూ.8.10 కోట్లకు అమ్మేశాడు. దీన్ని 2012లో రూ.5 కోట్లకు కొనుగోలు చేయగా దాదాపు 13 ఏళ్ల తర్వాత 8 కోట్లకు అమ్మేశాడు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. సోనూసూద్ చివరగా ఫతే సినిమాలో నటించాడు. స్వీయదర్శకత్వంతో పాటు సోనూసూద్ హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఇతడు పుష్కరకాలం క్రితం నటించిన తమిళ మూవీ మదజగరాజ మాత్రం జనవరిలో రిలీజై సూపర్ హిట్ అందుకుంది.చదవండి: కొత్తింట్లోకి యాంకర్ లాస్య.. ఘనంగా గృహప్రవేశం -
కొత్తింట్లోకి యాంకర్ లాస్య.. ఘనంగా గృహప్రవేశం
ప్రముఖ తెలుగు యాంకర్ లాస్య (Anchor Lasya Manjunath) కొత్తింట్లో అడుగుపెట్టింది. భర్త మంజునాథ్తో కలిసి బుధవారం గృహప్రవేశం చేసింది. ఈ వేడుకను ఘనంగా జరుపుకుంది. బంధుమిత్రులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. వారిలో నయని పావని, బంచిక్ బబ్లూ, గీతూ రాయల్, దేత్తడి హారిక, నోయెల్.. తదితరులు ఉన్నారు. లాస్య గృహప్రవేశానికి వెళ్లిన వారు ఆమె ఇల్లు చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు.కుళ్లుకుంటావ్..లాస్య ఫ్రెండ్ నోయెల్ (Noel Sean) అయితే ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 'నా ఇల్లు చూసి నువ్వు కచ్చితంగా కుళ్లుకుంటావు' అని లాస్య నాతో అంది. నిజంగానే ఇల్లు చూశాక నేను జెలసీగా ఫీలయ్యాను. ఇల్లు అంత బాగుంది. ఆ దేవుడు మీ జంటను ఎప్పుడూ ఇలాగే ఆశీర్వదించాలి అంటూ లాస్యతో దిగిన ఫోటోలు షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు లాస్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.బిగ్బాస్ నుంచి ఫ్రెండ్స్బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్గా ఓ వెలుగు వెలిగింది లాస్య. మంజునాథ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె వైవాహిక జీవితంలో అడుగుపెట్టాక కెరీర్కు గ్యాప్ ఇచ్చింది. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉండేది. తెలుగు బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది. ఆ సమయంలోనే లాస్య, దేత్తడి హారిక, నోయెల్ సేన్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇకపోతే పేరెంట్స్ కోసం గతంలో ఇల్లు కట్టించిన లాస్య.. నాలుగు నెలల కిందట తండ్రికి మంచి కారును బహుమతిగా ఇచ్చింది. View this post on Instagram A post shared by Noel Sean (@mr.noelsean) చదవండి: శ్రియాతో లవ్ సీన్.. ఇబ్బందిపడ్డ రామ్చరణ్.. వీడియో చూశారా? -
శ్రియాతో లవ్ సీన్.. ఇబ్బందిపడ్డ రామ్చరణ్.. వీడియో చూశారా?
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్చరణ్ చిరుత (2007) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. హీరోయిన్ శ్రియ 2001లో వచ్చిన ఇష్టం చిత్రంతో సినిమాల్లో ప్రవేశించింది. అంటే చరణ్ కంటే శ్రియ సీనియర్. వీరిద్దరూ జంటగా ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ మధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్లో చరణ్ తల్లిగా కనిపించింది.తొలిసారి కెమెరా ముందు రామ్చరణ్దానికంటే ముందు కూడా వీరు కలిసి యాక్ట్ చేశారు. అదెప్పుడంటారా? ఓ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఓ సీన్ ప్రాక్టీస్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సదరు ఇన్స్టిట్యూట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా యాక్టింగ్ కోచ్ కిశోర్ నమిత్ కపూర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ (Ram Charan), శ్రియా శరణ్లపై ఓ సీన్ చిత్రీకరించాం. చరణ్ కెమెరా ముందుకు రావడం ఇదే మొదటిసారి.ఇబ్బందిపడ్డ చరణ్చెప్పాలంటే అది ఒక వరంలాంటిది. ఫస్ట్ టైం కావడంతో చరణ్ చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడు. శ్రియా (Shriya Saran) అప్పటికే దక్షిణాదిన స్టార్ హీరోయిన్ అయిపోయింది. చాలా సినిమాలు చేసింది. కానీ శిక్షణ తీసుకుంటే మరింత రాటుదేలుతుందని నా అభిప్రాయం. కోచ్గా తనకెప్పుడూ పాజిటివ్ ఫీడ్బ్యాకే ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ క్లిప్ వైరల్గా మారింది. అందులో చరణ్ కాస్త పొడవుగా పెంచిన జుట్టు, గడ్డం, కళ్లజోడుతో కనిపించాడు. కెమెరా వంక చూసేందుకు సిగ్గుపడ్డాడు. డైలాగులు చెప్పేందుకు తనలో తానే ఘర్షణకు లోనయ్యాడు.అప్పటికీ, ఇప్పటికీ అంతే అందం!అప్పటికే శ్రియ దక్షిణాదిలో పాపులర్ హీరోయిన్ కావడంతో ఏమాత్రం బెరుకు లేకుండా యాక్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. చరణ్ ఇలా ఉన్నాడేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడెలా ఉన్నాడు? ఇప్పుడే రేంజ్కు ఎదిగిపోయాడు అని కొందరు అబ్బురపడుతున్నారు. శ్రియ.. అప్పటికీ, ఇప్పటికీ అంతే అందంగా ఉందని ప్రశంసిస్తున్నారు. శ్రియ చివరగా మిరాయ్ సినిమాలో నటించింది. రామ్చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ మూవీ చేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Kishore Namit Kapoor (@knk_worldwide_actinginstitute) View this post on Instagram A post shared by Kishore Namit Kapoor (@knk_worldwide_actinginstitute) చదవండి: స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లి, జుట్టు పట్టుకుని లాగిన హీరో -
యూత్కి ప్రేమ సలహాలు.. అబ్బాయిలు.. ఏడ్చినా పర్లేదు, కానీ!
టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తెలుసు కదా (Telusu Kada Movie). రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. ఈ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ నేటి యువతరానికి ముఖ్యమైన సందేశం ఇచ్చాడు. మరీ ముఖ్యంగా అబ్బాయిలకు లవ్బ్రేకప్ అయినప్పుడు ఏం చేయాలో సలహా ఇచ్చాడు.ఆడవారి కోసం యుద్ధాలుసిద్ధు ఏమన్నాడంటే.. ఈ సృష్టి మొదలైందే ఆడవారితో! మీకోసం యుద్ధాలు జరిగాయని చరిత్ర చెప్తోంది. మీ ముందు మేము నిమిత్తమాత్రులం! మేము ఎప్పుడైనా తెలియక ఏవైనా తప్పులు చేస్తే పెద్దమనసుతో క్షమించేయాలి. మీరు గొప్ప.. మీవల్ల మేము గొప్ప. ఇప్పుడు అబ్బాయిలకు సీరియస్గా ఓ విషయం చెప్తున్నా.. ఎప్పుడైనా ఒకమ్మాయి మీ మనసు ముక్కలు చేసి వెళ్లిపోయిందంటే.. తనను వెళ్లిపోనివ్వండి. లేదని వెంటపడ్డారనుకోండి. మీ ఆత్మగౌరవాన్ని మీరు కోల్పోయినట్లే లెక్క! ఎంత వెంటపడితే అంత మర్యాద కోల్పోతారు.ఏం పర్లేదు, ఏడ్వండి..ఆత్మగౌరవం ముఖ్యమని గుర్తుంచుకోండి. అమ్మాయి దూరమైతే బాధేస్తుంది. హృదయం ముక్కలవుతుంది, ఎందుకిలా అయిందని ఏడుస్తాం.. ఏం పర్లేదు బాధపడండి. కానీ, అప్పుడే వరుణ్ (తెలుసు కదాలో హీరో పాత్ర)లాంటివాడు మీలో నుంచి బయటకు వస్తాడు. మన ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండాలి. మీకింకా డౌట్స్ ఉంటే తెలుసు కదా సినిమా చూడండి. వరుణ్ అన్నింటికీ ఆన్సర్ ఇస్తాడు అని సిద్ధు చెప్పుకొచ్చాడు.చదవండి: బిగ్బాస్లో మాధురి కొత్త రూల్స్.. నచ్చకపోతే వెళ్లిపోమని వార్నింగ్! -
థియేటర్స్లోకి ‘సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్’
తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా రోజుల తర్వాత ఓ సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ రాబోతోంది. శ్రీ శివ సాయి ఫిలిం బ్యానర్పై వెంకట్ రెడ్డి నంది స్వీయ దర్శకత్వం లో శ్రీకరణ్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తారకేశ్వరి’. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ బోర్డు సభ్యుల నుండి ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ నిర్వహించి కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంది.ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత వెంకట్ రెడ్డి నంది మాట్లాడుతూ – “నా టీమ్ నాకు అండగా నిలిచింది. అందుకే ఈ తరహా సినిమాలు చేయగలుగుతున్నాను. సినిమా పట్ల అందరి కృషి, ప్రేమతోనే ఈ స్థాయికి వచ్చింది. అక్టోబర్ 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. నవంబర్ 7న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకుల ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం” అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము మాట్లాడుతూ – “ఈ సినిమాకి మ్యూజిక్ చాలా చక్కగా కుదిరింది. వెంకట్ రెడ్డి గారి 16 సినిమాల్లో సగానికి పైగా నేను సంగీతం సమకూర్చాను. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే తృప్తి ఉంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ – “ఈ సినిమా ఓ పల్లెటూరిలో జరిగిన యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కింది. గ్రామీణ వాతావరణంలో జరిగిన షూటింగ్ మరిచిపోలేని అనుభవం. వెంకట్ రెడ్డి నంది గారు మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. కథ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. నవంబర్ 7న థియేటర్లలో కలుద్దాం” అన్నారు. -
కించ పర్చాలని, కిందకు తొక్కాలని చూస్తున్నారు : ప్రియదర్శి
‘విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే బాగుంటుంది. కానీ కావాలనే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. కించ పర్చాలని, కిందకు తొక్కాలని టార్గెటెడ్గా హేట్ను వ్యాప్తి చేస్తున్నారు. ‘మిత్ర మండలి’ మీద కావాలనే నెగెటివ్ క్యాంపైన్ చేస్తున్నారు. అలా టార్గెటెడ్ హేట్రెడ్ని స్ప్రెడ్ చేసే వాళ్లు కనీసం సొంత పేరు కూడా పెట్టుకోరు. ఏవేవో పేర్లతో, ఫేక్ ఐడీలతో ఇలాంటి పనుల్ని చేసే వారిని మనం ఏం చేయగలం’అని అసహనం వ్యక్తం చేశారు హీరో ప్రియదర్శి. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిత్రమండలి’.విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్,సత్య, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘మిత్ర మండలి’ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు ఆద్యంతం ఎంటర్టైనింగ్గానే అనిపించింది. అందుకే నేను ‘మిత్ర మండలి’కి ఓకే చెప్పాను. నేను విన్నప్పుడు ఏం అనుకున్నానో.. తెరపైకి కూడా అదే వచ్చింది. అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను.→ అనుదీప్ ‘జాతి రత్నాలు’ కథ చెప్పినప్పుడు ఆయన రైటింగ్ నాకు చాలా నచ్చింది. సమాజంలోని కొన్ని సమస్యల్ని సెటైరికల్గా చెబుతుంటారు. మిత్రమండలి చిత్రంలో కుల వ్యవస్థ మీద విజయేందర్ మంచి సెటైరికల్ సీన్లు రాసుకున్నారు. సినిమాల్లో ఇచ్చే సందేశాల ద్వారా సమాజం మారుతుందని నేను నమ్మను.→ ‘మిత్ర మండలి’లో ఎవ్వరినీ ఉద్దేశించి కథను రాసుకోలేదు. ఓ ఫిక్షనల్ క్యాస్ట్ నేమ్ పెట్టి చాలా సెటైరికల్గా తీశాం. ఏ ఒక్క కులం మీదనో సెటైర్ వేస్తున్నట్టుగా అనిపించదు. ఇది మమ్మల్నే అన్నట్టు ఉందే? అని అనిపిస్తే మాత్రం మేం ఏమీ చేయలేం (నవ్వుతూ). ఎవ్వరి మనోభావాల్ని దెబ్బ తీసేలా మాత్రం మా చిత్రం ఉండదు. అందరినీ నవ్వించేలా, ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది.→ ‘జాతి రత్నాలు’, ‘మిత్ర మండలి’ ఒకేలా ఉండవు. ‘జాతి రత్నాలు’ తరువాత ‘35 చిన్న కథ కాదు’, ‘కోర్ట్’ వంటి డిఫరెంట్ చిత్రాలు చేశాను. ఎప్పుడూ ఒకే రకమైన జానర్ చిత్రాల్ని చేయడం నాకు కూడా ఇష్టం ఉండవు. ‘జాతి రత్నాలు’ టైపులో ఎవరైనా కథ చెబితే కూడా వద్దని అంటాను.→ ‘మిత్ర మండలి’ మీద నాకున్న నమ్మకంతోనే ‘ఈ సినిమా నచ్చకపోతే నా నెక్ట్స్ మూవీని చూడకండి’ అని అన్నాను. నాని అన్నకి ‘కోర్ట్’ మీద ఉన్న నమ్మకంతో ఈవెంట్లో అలా చెప్పారు. నాక్కూడా నా ‘మిత్ర మండలి’ మీద అంతే ప్రేమ, నమ్మకం ఉంది. అందుకే అలా అన్నాను. అంతే కానీ మిగతా చిత్రాల్ని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు.→ అవతలి వాళ్లని నవ్వించే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ అవతలి వాళ్లని తక్కువ చేసి కామెడీ చేయడమే నా దృష్టిలో క్రింజ్ అవుతుంది. కొన్ని సార్లు వాదనలు గెలవలేనప్పుడు, మనల్ని ఏమీ చేయలేకపోతోన్నప్పుడు అలాంటి నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు. కొన్ని కొందరికి వర్కౌట్ అవుతుంది.. ఇంకొన్ని కొందరికి వర్కౌట్ కావు.→ప్రస్తుతం నా దగ్గరకు చాలా డిఫరెంట్ కథలు వచ్చాయి. అందులో ‘ప్రేమంటే’ అనే మూవీ షూటింగ్ జరుగుతోంది. మరో రెండు కథలు నాకెంతో నచ్చాయి. వాటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే జరుగుతుంది. -
‘బలగం’ వేణుకు ‘ఎల్లమ్మ’ కష్టాలు!
సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ పడితే.. సదరు దర్శకుడి, హీరో చుట్టూ నిర్మాతలు క్యూ కడతారు. అడ్వాన్స్లు ఇచ్చి మరీ కొన్నాళ్ల పాటు ఎదురు చూస్తారు. దర్శకుడు వేణు(Venu Yeldandi) విషయంలోనూ అదే జరిగింది. ‘బలగం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వేణు దగ్గరకు చాలా మంది నిర్మాతలు ఆయన దగ్గరకు వెళ్లారు. అడ్వాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వేణు మాత్రం తనకు అవకాశం ఇచ్చి దిల్ రాజుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. అదే ‘ఎల్లమ్మ’(Yellamma).నానితో ప్లాన్బలగం చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించింది దర్శకుడు వేణు రాసుకున్న కథే. పల్లెటూరి నేపథ్యంలో రాసుకున్న ఆ కథ అందరికి కనెక్ట్ అవ్వడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వెంటనే ‘ఎల్లమ్మ’ ప్రాజెక్టును ప్రకటించాడు. దిల్ రాజు బ్యానర్లోనే సినిమా ఉంటుందని కూడా చెప్పాడు. నిర్మాత దిల్ రాజు కూడా ఎల్లమ్మ ప్రాజెక్ట్ని త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్లామని చెప్పాడు. తొలుత ఈ కథను నాని(Nani)తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నాని, వేణు కూడా పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పారు. కానీ కొన్నాళ్ల తర్వాత నాని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. ఎల్లమ్మ సినిమా తాను చేయడం లేదని తేల్చేశాడు. ఇతర కమిట్మెంట్స్తో బీజీగా ఉండడం వల్లే ఆయన తప్పుకున్నట్లు సమాచారం.కొంపముంచిన ‘తమ్ముడు’నాని తప్పుకున్న కొన్నాళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు నితిన్ చేతికి వెళ్లింది. ఆయనకు కథ బాగా నచ్చడంతో ఓకే కూడా చెప్పేశాడు. తమ్ముడు రిలీజ్కి ముందు ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లోనూ నితిన్ తన తర్వాతి ప్రాజెక్టు ఎల్లమ్మనే అని చెప్పేశాడు. దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్పాడు. కానీ తమ్ముడు రిలీజ్ తర్వాత పరిస్థితులు తారుమారు అయ్యాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్గా మిగిలిపోయింది. దీంతో ఎల్లమ్మ ప్రాజెక్టు నుంచి నితిన్ కూడా తప్పుకున్నాడు. బడ్జెట్ ఇష్యూస్ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి నితిన్ తప్పుకున్నట్లు టాలీవుడ్ టాక్. ‘బెల్లం’ చెంతకు ‘ఎల్లమ్మ’ఎల్లమ్మ కథ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరకు వచ్చింది. ఆయనకు కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. బడ్జెట్ దృష్ట్యా బెల్లకొండ అయితేనే ఈ చిత్రానికి సెట్ అవుతాడని దిల్ రాజు భావిస్తున్నాడట. ఇటీవల కిష్కింధపురి చిత్రంతో మంచి విషయాన్ని ఖాతాలో వేసుకున్నాడు బెల్లంకొండ. ఇప్పుడు అదే జోష్తో వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తున్నాడు. ఎల్లమ్మకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. -
30 రోజుల్లోనే ‘కానిస్టేబుల్’..చాలా మంది ఫోన్లు చేశారు : కెమెరామెన్ వళి
‘కానిస్టేబుల్’ చూసి ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్స్ చేశారు. 30 రోజుల్లోనే అంత క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చావా? అని పొగిడేస్తున్నారు. ఓ పెద్ద బ్యానర్ నుంచి కూడా కాల్ వచ్చింది. త్వరలోనే ప్రాజెక్ట్ చేద్దామని అన్నారు. ఇలా ‘కానిస్టేబుల్’కి మంచి స్పందన వస్తుండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు కెమెరామెన్ షేక్ హజాతరయ్య(వళి). కెమెరామెన్గా 25 ఏళ్లలో 78 చిత్రాలకు పైగా చేసిన అనుభవం ఉన్న ఆయన సెంట్గా ‘కానిస్టేబుల్’ అంటూ అందరి ముందుకు వచ్చారు. వరుణ్ సందేశ్ హీరోగా, మధులిక వారణాసి హీరోయిన్గా ఆర్యన్ సుభాష్ తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్గా విడుదలైంది. ఈ క్రమంలో కెమెరామెన్ వళి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..→ మాది నెల్లూరు జిల్లా. మక్కెనవారిపాలెం గ్రామం. నేను ఈ ఇండస్ట్రీలోకి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నారాయణ గారి వల్లే వచ్చాను. ఆయనే నన్ను ఇలా కెమెరా డిపార్ట్మెంట్లో పనిలోకి పెట్టారు. అలా 25 ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రయాణంలో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు పని చేశాను. దాదాపు 8 భాషల్లో పని చేశాను. హిందీ, మరాఠీ భాషల్లో తీసిన చిత్రాలకు అవార్డులు కూడా వచ్చాయి.→ అరుంధతి, అన్నవరం, ఏక్ నిరంజన్, రగడ ఇలా ఎన్నో సినిమాలకు కెమెరా డిపార్ట్మెంట్లో పని చేశాను. నేను చిన్నతనం నుంచీ చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయన వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ తరువాత ‘అన్నవరం’లో పవన్ కళ్యాణ్ను చూశాను. కష్టపడితే పైకి వస్తామని ఆయన్ను చూశాక అర్థమైంది.→ బలగం జగదీష్ ఓ సినిమాకు ఆర్టిస్ట్గా వచ్చారు. ఆ మూవీనికి నేను కెమెరామెన్గా పని చేశాను. అప్పుడు నా వర్కింగ్ స్టైల్ ఆయనకు నచ్చింది. మీతో కచ్చితంగా ఓ సినిమాను తీస్తాను అని అప్పుడు బలగం జగదీష్ అన్నారు.→ జగదీష్ గారు ‘కానిస్టేబుల్’ కథను విన్న వెంటనే నా దగ్గరకు పంపారు. ఆర్యన్ సుభాష్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. కథ అద్భుతంగా ఉంది అని జగదీష్ గారికి చెప్పాను. అలా ఈ మూవీ జర్నీని స్టార్ట్ చేశాం.→ వరుణ్ సందేశ్ గారు మాకు ఎంతో సహకరించారు. ఆయనతో వర్క్ చేస్తే సొంత ఫ్యామిలీ, బ్రదర్లా అనిపిస్తుంది. ఎక్కడా కూడా తన స్థాయిని ప్రదర్శించడు. సెట్లో అందరితో కలిసి మెలిసి ఉంటాడు. ఓ సారి షూటింగ్లో గాయమైనా కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేశారు.→ ప్రస్తుతం నేను రామ్ భీమన దర్శకత్వంలో ఓ మూవీని కమిట్ అయ్యాను. రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాకి కెమెరా డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాను. ఇవి కాకుండా శివ ప్రసాద్ నిర్మాతగా ఓ చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రారంభించనున్నాం. -
బెస్ట్ఫ్రెండ్ని పెళ్లాడిన బుల్లితెర నటుడు
ప్రముఖ సీరియల్ నటుడు దర్శన్ (Darshan K Raju) అలియాస్ సార్థక్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. బెస్ట్ ఫ్రెండ్ కాశిన్ను పెళ్లాడాడు. అక్టోబర్ 13న వీరి వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. నూతన జంట వెడ్డింగ్ స్టిల్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సీరియల్స్ నుంచి సినిమాలుజీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన దర్శన్ జంటకు బుల్లితెర తారలు సహా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దర్శన్.. తమిళంలో 'కట్రుకెన్న వేలి' సీరియల్లో సూర్య మహదేవన్ పాత్రతో ఫేమసయ్యాడు. అవను మాతే శ్రావణి, అరణ్మనై కిలి వంటి పలు సీరియల్స్ చేశాడు. సౌత్ ఇండియన్ హీరో అనే కన్నడ సినిమాలోనూ హీరోగా నటించాడు. View this post on Instagram A post shared by Darshanraju_ExpressionKing (@darshanraju_expressionking)చదవండి: తొలి తెలుగు సింగర్ ఇక లేరు -
తొలి తెలుగు సింగర్ ఇక లేరు
చలనచిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగులో తొలి మహిళా సింగర్ రావు బాలసరస్వతి దేవి (97) (Raavu Balasaraswathi Devi) ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం (అక్టోబర్ 15) హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సంతాపం ప్రకటించిన వైఎస్ జగన్సింగర్ బాల సరస్వతీదేవి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) సంతాపం వ్యక్తం చేశారు. 'తెలుగు సంగీత ప్రపంచంలో బాల సరస్వతీ దేవి తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా' అని ట్వీట్ చేశారు. తెలుగు సంగీత ప్రపంచంలో తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేసిన తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవిగారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. pic.twitter.com/2y2lneAY7O— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025సింగర్ జర్నీబాలసరస్వతి.. స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. 1928లో పుట్టిన ఆమె నాలుగేళ్ల వయసులోనే పలు స్టేజీలపై సాంగ్స్ పాడారు. ఆరో ఏట హెచ్.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్లో రికార్డు చేసింది. మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగువారికి పరిచయమయ్యారు. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగులో తొలి నేపథ్య గాయని రికార్డు కూడా తనదే! సతీ అనసూయ (1936) సినిమాలో తొలిసారి పాట పాడారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక పాటలు ఆలపించారు. దాదాపు రెండువేలకి పైగా సాంగ్స్ పాడారు. భక్త ధ్రువ, ఇల్లాలు, రాధిక వంటి పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు సినిమాల్లో పాడటం మానేశారు. కానీ గొంతు సవరించుకోవడం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారు. కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. అలా చివరి వరకు పాడుతూనే ఉన్నారు. చదవండి: 30లోకి ఎంటరైన హీరోయిన్.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ -
30లోకి ఎంటరైన హీరోయిన్.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ
మలయాళ బ్యూటీ అహానా కృష్ణ (Ahaana Krishna) తన పుట్టినరోజు (అక్టోబర్ 13)కు కొత్త కారును ఇంటికి తెచ్చేసుకుంది. BMW X5 మోడల్ కారు కొనాలన్న కలను ఎట్టకేలకు నెరవేర్చుకుంది. తనకు తానే ఈ లగ్జరీ కారును గిఫ్ట్ ఇచ్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 20's నుంచి 30'sలోకి అడుగుపెడుతున్నందుకు కొంత బాధగా ఉంది. ఏదేమైనా 30 ఏళ్ల వయసుకు హాయ్ చెప్పేందుకు రెడీ అయ్యాను. హీరో సలహాతో..ఇప్పటివరకు నేనేం చేయాలి? ఏం చేయకూడదు? అని ఆంక్షలు విధించని అమ్మానాన్నకు థాంక్యూ. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా బతకనిచ్చే స్వేచ్ఛ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఏదీ కోరుకోకపోయినా అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి. అందుకు ఈ ప్రపంచానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఎలాంటి కారు కొనాలి? ఏదైతే బాగుంటుంది? అని దుల్కర్ సల్మాన్ సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాతే అహానా ఈ కారు కొనుగోలు చేయడం విశేషం. ఈ కారు ధర రూ.95 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.సినిమాఅహానా కెరీర్ విషయానికి వస్తే.. గృహప్రవేశం అనే సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. తండ్రితో కలిసి ఓ సీరియల్ కూడా చేసింది. ఎంజన్ స్టీవ్ లోపేజ్ (2014) అనే మలయాళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. పదినెట్టం పడి, ఆడి, నాన్సీ రాణి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. చివరగా కొత్త లోక: చాప్టర్ 1 మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) చదవండి: వివాదాలతో సతమతం.. అప్పుడే ఫుల్స్టాప్ అంటున్న హన్సిక -
వివాదాలతో సతమతం.. అప్పుడే ఫుల్స్టాప్ అంటున్న హన్సిక
దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా రాణించినవారిలో హన్సిక మొత్వానీ (Hansika Motwani) ఒకరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్డమ్ అందుకున్నారు. దాదాపు 50కిపైగా చిత్రాల్లో కథానాయికగా నటించిన హన్సిక.. 2022లో సోహైల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే ఈమె పెళ్లి కూడా చాలామంది హీరోయిన్లలాగానే మనస్పర్థలతో ముగిసిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది.రెండు వివాదాల మధ్య హన్సికభర్తకు దూరంగా తన తల్లితోనే ఉండడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. మరోవైపు హన్సికపై ఆమె సోదరుని భార్య గృహహింస ఆరోపణలు చేసింది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి, మనశ్శాతి కోసం ఈ బ్యూటీ విహారయాత్రలు చేసి వచ్చినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సినిమాలపైనే ఫుల్ ఫోకస్ చేయాలనే నిర్ణయానికి వచ్చిన హన్సిక తనపై వస్తున్న విమర్శలను తెలుసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.ఈ ఏడాది పూర్తయ్యేసరికి..దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన గురించి ఎవరేం అనుకుంటున్నారు? ఎలాంటి వదంతులు ప్రసారం అవుతున్నాయి? అని తన సన్నిహితుల ద్వారా వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరికల్లా తన సమస్యలు తొలగిపోతాయని తన అత్యంత సన్నిహితురాలు వద్ద హన్సిక అన్నట్లు తెలిసింది. ఈ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. హన్సిక ఆ మధ్య నాలుగు సినిమాలు చేసింది. కానీ, అవింకా రిలీజ్ కాలేదు.చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం -
‘అరి’ కథతో పుస్తకం తీసుకొస్తున్నాం : దర్శకుడు జయశంకర్
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అరి’. ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. అరి షడ్వర్గాలను కాన్సెప్ట్గా తీసుకుని, ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని ఈ పాయింట్ని ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు శంకర్.చివర్లో కృష్ణుడి ఎంట్రీ, అరి షడ్వర్గాల గురించి ఆయన ఇచ్చే సందేశం అందరినీ ఆకట్టుకుంది. మంచి సందేశాత్మకంగా చిత్రంగా అరిని మలిచారంటూ ఆడియెన్స్ దర్శకుడి మీద ప్రశంసల్ని కురిపించారు. ఇక మీడియా, సోషల్ మీడియా, క్రిటిక్స్ ఇలా అందరూ కూడా చివరి 20 నిమిషాల గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అరిపై పాజిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి. అలా డివైన్ ట్రెండ్ను ఫాలో అవుతూ అరి చిత్రం ఆడియెన్స్ గుండెల్లోకి వెళ్లిపోయింది. అరి షడ్వర్గాలను ప్రధాన అంశంగా తీసుకుని, ఆరు పాత్రలతో దర్శకుడు సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది.తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్లో దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ - "అరి" సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మంచి రివ్యూస్, రేటింగ్స్ ఇచ్చిన మీడియా వారికి థ్యాంక్స్. మూవీకి స్లోగా ఓపెనింగ్స్ వచ్చి పికప్ అవుతుందని ముందే అనుకున్నాం. అయితే రెండో రోజునే శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ వల్ల మా సినిమా పోస్టర్స్ ను థియేటర్స్ దగ్గర చించివేయడం చూసి బాధగా అనిపించింది. ఎంతో కష్టపడి చేసిన సినిమాకు ఇలా జరుగుతుందేంటని ఇబ్బందిపడ్డాం. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. థర్డ్ డే నుంచి అరి సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి కనిపించింది. అరిషడ్వర్గాల గురించి ఎంతోమంది గొప్పవాళ్లు చెబుతూ వచ్చారు గానీ వాటికి పరిష్కారం చూపించలేదు. ఈ ఆలోచనతోనే అరి చిత్రాన్ని రూపొందించాను. నేను చూసిన సినిమాలు కొన్ని ఇలాంటి కాన్సెప్ట్ తో చిత్రాన్ని చేసేందుకు స్ఫూర్తినిచ్చాయి. ఈ సినిమా కథతో త్వరలోనే పుస్తకాన్ని తీసుకొస్తున్నాం. మా సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదు. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యాక ఓటీటీ డేట్ అనౌన్స్ చేస్తాం’అన్నారు. -
బిడ్డకు పాలు పట్టి.. షూటింగ్కి వెళ్లా.. ఎవరూ అలా చెప్పరు: నటి
ఏ రంగంలో అయినా మహిళలు రాణించాలంటే.. చాలా త్యాగాలు చేయాల్సిందే. ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు ఎంచుకున్న రంగంపై ఫోకస్ చేయాలి. ఎన్నో కష్టాలను అనుభవిస్తే కానీ ఆ రంగంలో ఉన్నతస్థానానికి చేరుకోలేరు. చిత్రపరిశ్రమలో ఆ కష్టాలు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. ఫ్యామిలీ బాధ్యతతో పాటు వేధింపులను, ఒత్తిడిని తట్టుకొని నిలబడితేనే ‘స్టార్’ హోదా పొందుతారు. అలాంటి కష్టాలను ఎన్నో భరించే ఈ స్థాయికి వచ్చానని చెబుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ(Rani Mukerji). ఇటీవలే ఉత్తమన నటిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కెరీర్ ప్రారంభంలో తకు ఎదురైన ఇబ్బందుల గురించి వివరించింది.‘ఇండస్ట్రీలోకి రావడానికి చాలా పోరాటాలే చేయాల్సి వచ్చింది. నేను ఇండస్ట్రీలోకి రావడం మా పెరెంట్స్కి ఇష్టమే లేదు. బలవంతంగా ఒప్పుకున్నారు. వారి పేరు చెడగొట్టకూడనే ఉద్దేశ్యంతో నేను కమిట్మెంట్తో పని చేశాను. నేను నటించిన ‘హిచ్కీ’ సినిమా షూటింగ్ సమయంలో నా కుమార్తె అదిరాకి కేవలం 14 నెలల వయసు మాత్రమే. అప్పటికీ పాలు పడుతున్నా. ఉదయం ఆరున్నర గంటలకు పాలు పట్టించి.. షూటింగ్కి వెళ్లేదాన్ని. ఒంటి గంటలోపు నా పార్ట్ పూర్తి చేసుకొని తిరిగి నా బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇంటికి వచ్చేదాన్ని. రోజుకు 6-7 గంటలు షూటింగ్ చేసి.. ఇంటికి వెళ్లేదాన్ని. మా దర్శకుడితో పాటు యూనిట్ అంతా నాకు సపోర్ట్ చేసేది. ఈ సినిమా మొత్తం అలానే పూర్తి చేశా. ఇప్పుడు పని గంటల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. నిర్మాతకు, దర్శకుడికి ఓకే అయితే సినిమా చేయాలి. లేదంటే ఆ సినిమా మానేయాలి. అది మన చేతుల్లో ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా చేయాల్సిందే అని ఎవరు చెప్పరు’ అని రాణి ముఖర్జీ అన్నారు. ఇక జాతీయ అవార్డు గురించి మాట్లాడుతూ.. ‘నటీనటులుకు చిన్న పురస్కారం కూడా చాలా గొప్పదే. అయితే ఏ అవార్డు అయినా.. అర్హత గలవారికి వచ్చిందని ప్రేక్షకులు భావించాలి. నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు అందరూ అంగీకరించారు. అలా అందరూ అంగీకారం తెలపడం నాకు అవార్డు కంటే చాలా గొప్పగా అనిపించింది’ అన్నారు. -
రిషబ్ శెట్టి నివాసం..విశేషాల ఆవాసం... రేటు ఎంతంటే..?
కాంతారా: చాప్టర్ 1 బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాతో పాటు, కర్ణాటకలోని ఉడిపిలోని కుందాపురలో ఉన్న రూ. 12 కోట్ల విలువైన రిషబ్ శెట్టి భవనం కళ, సంప్రదాయం సంస్కృతి పట్ల ఆయనకున్న ప్రేమను ప్రతిబింబిస్తుంది,ఆ ఇంట్లోని ప్రతీ చోటూ ఒక కధను చెబుతుంది. ఆ ఇంటిలోని పలు చోట్ల కాంతారా సినిమా ప్రభావం కనిపిస్తుండడం ఆసక్తికరం.ఆయన ముత్తాత యాజమాన్యంలోని పూర్వీకుల భూమిపై నిర్మింతమైన ఈ భవనం ఓ క్లాసిక్ గా అభిమానులు పేర్కొంటారు. అది దక్షిణ భారత వాస్తుశిల్పాన్ని ఆధునిక సౌకర్యాలతో నేర్పుగా మిళితం చేయడం దీని విశేషం. ఘనమైన ప్రవేశ ద్వారం ఇత్తడితో కప్పబడిన బర్మా టేకు కలప తలుపు చేతితో లాగే ఆలయ గంటను కలిగి ఉంటుంది, ఇది ఇంట్లో అడుగుపెట్టిన తక్షణమే ఆధ్యాత్మికతో స్వాగతించే వైబ్ను అందిస్తుందిలోపలికి అడుగు పెట్టగానే ఈ స్థలం నాలుగు మూలల్లో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది, ఇల్లు సూర్యకాంతి తో చుట్టుముట్టేలా...300 కిలోల గ్రానైట్తో నిర్మితమైన తులసికోటతో మన ముందు కొలువు దీరుతుంది. ఇక ఇంటిలో కనపడే యక్షగాన శిరస్త్రాణం, కాంతారా లోని రైఫిల్, యువరాజ్ సింగ్ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ వరకు సావనీర్లు కళలు, క్రీడలు భారతీయ జానపద సంప్రదాయాల పట్ల శెట్టికి ఉన్న ప్రేమను చూపుతాయి.కానీ ఈ భవనంలోని తమ అత్యంత ఆసక్తికరమైన భాగాన్ని శెట్టి ’ఛాంటింగ్ కార్నర్’ అని పిలుస్తారు. ఎవరైనా ఆ ఇంట్లోని ఆ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక నిర్దిష్ట నల్ల రాయిపై ఏడు సెకన్ల పాటు గానీ నిలబడితే, గాలి భూత కోల శ్లోకాలతో నిండిపోతుంది, దాదాపుగా కాంతారా లోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తుచేసే అనుభవాన్ని అందిస్తుంది.ఈ భవనంలో విలాసవంతమైన ప్రైవేట్ స్క్రీనింగ్ గది కూడా ఉంది. ఇటాలియన్ లెదర్ రిక్లైనర్లు, 150–అంగుళాల రిట్రాక్టబుల్ స్క్రీన్ డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్తో అమర్చబడి ఉంటుంది. ఇది పూర్తి స్థాయి సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. స్థానిక టచ్ ఇస్తూ గదిలోని షాండ్లియర్ను మంగళూరు టైల్స్తో తయారు చేశారు. కాంతారా నుంచి ఇచ్చిన అటవీ స్ఫూర్తితో సెలియరాయ అని పేరు కలిగిన ప్రొజెక్టర్, ఆ ఇంటి విశేషాలకు మరో వ్యక్తిగత కథ ను జోడిస్తుంది.తమ మూలాలతో కుటుంబానికి ఉన్న సంబంధం వంటగది వరకూ కొనసాగుతుంది. నల్ల రాయి కౌంటర్ ను కొబ్బరి నూనెను ఉపయోగించి పాలిష్ చేస్తుంటారు. కోరి గస్సీ (చికెన్ కర్రీ) వంటి సాంప్రదాయ వంటకాలను వారసత్వంగా వచ్చే వంటశైలులను ఉపయోగించి తయారు చేస్తారు. పై అంతస్తులోని గదిలో 1,200 కంటే ఎక్కువ పుస్తకాలు కలిగిన లైబ్రరీ ఉంది, వీటిలో ఉండే భారతీయ జానపద కథల నుంచి స్టీఫెన్ కింగ్ థ్రిల్లర్ల వరకు, శెట్టి విస్త్రుత సేకరణను పుస్తకాభిరుచిని ప్రతిబింబిస్తాయి.పురాతన కాలం నాటి ఆకర్షణ సంప్రదాయ విశేషాలు ఎన్నో ఉన్నప్పటికీ, ఈ భవనం అత్యాధునిక భద్రతతో పటిష్టంగా ఉంటుంది. ఫేస్ రికగ్నైజేషన్, కెమెరాలు ప్రవేశ ద్వారం దగ్గర కాపలాగా ఉంటాయి యక్ష అనే రిటైర్డ్ కోస్టల్ పోలీసు శునకం సైతం ఇంటికి కాపలా కాస్తుంటుంది. సందర్శకులు ప్రవేశించే ముందు వారి ఫోన్ లను ఇత్తడి లాకర్లలో జమ చేయాలి ఆసక్తికరంగా, కాంతారా సంభాషణల నుంచి ప్రేరణ పొంది ప్రతి నెలా వైఫై పాస్వర్డ్ మారుతుంటుంది. View this post on Instagram A post shared by PragathiRishabShetty (@pragathirishabshetty) -
నిజ జీవితంలో అమ్మాయిల పిచ్చి ఉందా?.. సిద్ధు షాక్!
డీజే టిల్లు సినిమాతో సెన్సేషన్ అయ్యాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). టిల్లు స్క్వేర్తో మరో పెద్ద హిట్ అందుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన జాక్ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఇప్పుడు తెలుసు కదా చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సోమవారం (అక్టోబర్ 13) చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రేమించారా?ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో హీరో సిద్ధుకు ఊహించని ప్రశ్న ఎదురైంది. రియల్ లైఫ్లో మీరు స్త్రీలోలుడా? టీనేజ్లో ఒకేసారి ఇద్దరమ్మాయిలను ప్రేమించడం లాంటివేమైనా చేశారా? అని ఓ మహిళా విలేఖరి ప్రశ్నించింది. అది విని సిద్ధుకు మండిపోయింది. ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్ ఇంటర్వ్యూనా? అని కోప్పడ్డాడు. ఈ మధ్యే తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్పైనా సదరు మహిళా జర్నలిస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళ హీరోను కించపరుస్తూ..మీరు హీరోలానే ఉండరు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే.. అది మీ హార్డ్ వర్కా? లేక అదృష్టమా? అని ప్రశ్నించారు. వెంటనే శరత్ కుమార్ మైక్ అందుకుని ఆమె ప్రశ్నను తప్పుపడుతూ కౌంటరిచ్చాడు. కిరణ్ అబ్బవరం సైతం స్పందిస్తూ... పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోలను అలా కించపరిచే ప్రశ్నలు అడగొద్దని విజ్ఞప్తి చేశాడు. బిగ్బాస్ షోలో నాగార్జున సైతం.. ప్రదీప్ను రజనీకాంత్, ధనుష్తో పోలుస్తూ అతడు ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి ఎదుగుతాడని మెచ్చుకున్నాడు.చదవండి: యూరిన్ తాగి 48 రోజులు బతికాడు: హీరో -
యూరిన్ తాగి 48 రోజులు బతికాడు: హీరో
కోలీవుడ్ హీరో హరీశ్ కల్యాణ్ (Harish Kalyan), అతుల్య రవి జంటగా నటించిన చిత్రం 'డీజిల్' (Diesel Movie). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ 2022లోనే పూర్తయింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్కు నోచుకుంది. దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 17న విడుదల కాబోతోంది. పార్కింగ్, లబ్బర్ పండు మూవీతో హిట్లు అందుకున్న హరీశ్.. ఈ సినిమాతో ముచ్చటగా మూడో హిట్ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు.షూటింగ్కు ముందు ప్రిపరేషన్ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించాడు. హరీశ్ కల్యాణ్ మాట్లాడుతూ.. డీజిల్ మూవీ షూటింగ్ ప్రారంభించడానికి ముందు రెండుమూడు రోజులు సముద్రతీరానికి వెళ్లాం. ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు సముద్రంలోకి కూడా వెళ్లొచ్చాం. అప్పుడు 70 ఏళ్ల మత్య్సకారుడు నాకో విషయం చెప్పాడు. జీవితం విలువ తెలిసొచ్చిందికొన్నేళ్ల క్రితం ఓ తుపాను వల్ల అతడి పడవ సముద్రంలో నెల రోజులకు పైగా చిక్కుకుపోయింది. తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దువైపు లాక్కొనిపోయింది. బక్కచిక్కిపోయి పీలగా మారినప్పటికీ ప్రాణాలతోనే బతికిబయటపడ్డాడు. సముద్రంలో ఉన్న 48 రోజులు అతడు తన యూరిన్ తాగి ప్రాణాలు కాపాడుకున్నాడు. సముద్రపు నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకని ఆ పని చేశాడు. అతడు చెప్పింది విన్నాక జీవితం విలువ మరింత తెలిసొచ్చింది అని చెప్పుకొచ్చాడు. చదవండి: ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి -
దీపిక అడిగింది ఇవ్వాల్సిందే!: అర్జున్ రెడ్డి బ్యూటీ
మిగతా ఇండస్ట్రీల మాదిరిగా సినీ పరిశ్రమ ఓ పద్ధతి ప్రకారం లేదు. ఇక్కడ పనిగంటలు కరెక్ట్గా ఉండవు. అన్నిచోట్లా ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఎనిమిది గంటలు పనిచేసే విధానాన్ని అనుసరించాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. చిన్న, మధ్యతరహా సినిమాలకు ఈ డిమాండ్లు సెట్ అవుతాయేమో కానీ భారీ బడ్జెట్ చిత్రాలకు వీటిని ఫాలో అవడం కష్టం!దీపికా.. నాకు చాలా ఇష్టంఈ కారణం వల్లే స్పిరిట్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు దీపిక చేజారిపోయాయి. దీపిక డిమాండ్ గురించి తాజాగా అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey) స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకు దీపికా పదుకొణె అంటే చాలా ఇష్టం. స్కూల్లో చదువుకునే రోజుల నుంచి తనను చూస్తున్నాను. ఆమె జర్నీని ఫాలో అయ్యాను. తనొక గొప్ప యాక్టర్. తనకు ఏది అవసరమో దాని గురించి నిర్భయంగా మాట్లాడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని నొక్కి చెప్పింది. తనవల్లే మేమందరం మానసిక ఆరోగ్యం గురించి ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాం. సినిమాతను కోరుకున్నది తనకు దక్కాల్సిందేనని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది. అటు కొంకణ సేన్ శర్మ మాట్లాడుతూ.. మేమేం సర్జరీ చేసే డాక్టర్స్ కాదు కదా.. మేమూ మనుషులమే! మాకూ చిన్నపాటి బ్రేక్స్ కావాలి అని పేర్కొంది. షాలిని పాండే తొలి చిత్రం అర్జున్ రెడ్డితో బాగా పాపులర్ అయింది. తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లోనూ తళుక్కుమని మెరిసింది. ధనుష్ ఇడ్లీ కొట్టు మూవీలో కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది.చదవండి: ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి -
కాటాలన్ మూవీ.. మాస్ అవతార్లో హీరో
అంటోని వర్గీస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “కాటాలన్”. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో హీరో మాస్ అవతార్లో కనిపిస్తున్నాడు. మంటల చుట్టూ సిగరెట్తో, కళ్లలో జ్వాలలతో కనిపిస్తున్న అతని లుక్ అదిరిపోయింది. రక్తంతో తడిసిన ముఖం, చేతులు యాక్షన్ ఇన్టెన్సిటీని సూచిస్తున్నాయి.పాన్-ఇండియా బ్లాక్బస్టర్ “మార్కో” తర్వాత, క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కాటాలన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే పాన్-ఇండియా కాన్సెప్ట్గా భారీ స్థాయిలో నిర్మిస్తునారు. పాల్ జార్జ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. థాయ్లాండ్ యాక్షన్ సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత ఒంగ్-బాక్ సిరీస్ యాక్షన్ డైరెక్టర్ కెచా ఖాంఫఖ్డీ తన టీమ్తో కలిసి రూపొందించారు. అదే సిరీస్లో నటించిన పాంగ్ కూడా ఈ సినిమాలో కనిపించనుంది.ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాటాలన్ లో తెలుగు నటుడు సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్), బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి (కిల్ ఫేమ్), అలాగే మలయాళ సినీ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథ, స్క్రీన్ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Cubes Entertainments®️ (@cubesentertainments) చదవండి: అల్లు అర్జున్ గొప్పోడయ్యాడు.. దేశంలోనే..: సాయిదుర్గ తేజ్ -
అల్లు అర్జున్ గొప్పోడయ్యాడు.. దేశంలోనే..: సాయిదుర్గ తేజ్
అల్లు అర్జున్ (Allu Arjun) గారు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అంటున్నాడు మెగా హీరో సాయిదుర్గతేజ్ (Sai Durga Tej). ఆయన్ను చూస్తే చాలా గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తాజాగా సాయిదుర్గ తేజ్ హైదరాబాద్లో.. ఫాస్ట్ అండ్ క్యూరియస్ ది జెన్ జెడ్ ఆటో ఎక్స్పోను ప్రారంభించాడు. ఈ ఈవెంట్లో విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఒకరు అల్లు అర్జున్ గురించి ప్రశ్న అడిగారు.పాన్ ఇండియా స్టార్అందుకు సాయి దుర్గతేజ్ స్పందిస్తూ అల్లు అర్జున్ గారు అని సంబోధించాడు. అల్లు అర్జున్గారి గురించి ఏం చెప్పాలండి? ఆయన సూపర్గా యాక్ట్ చేస్తారు. దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిపోయారు. చాలా గొప్పోళ్లు అయిపోయారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎంతో గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.సినిమాసినిమాల విషయానికి వస్తే.. సాయిదుర్గతేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్లో రిలీజవ్వాల్సిన మూవీని పలు కారణాలతో వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.చదవండి: గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు -
గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఈ మధ్యే కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఆల్రెడీ సినిమాలు చేస్తోంది, నిర్మిస్తోంది. ఓ పక్క ఆరోగ్యం గురించి అవేర్నెస్ కల్పిస్తోంది, మరోవైపు ఫ్యాషన్, పర్ఫ్యూమ్ బిజినెస్ చేస్తోంది. అలాగే ఏకం అనే లెర్నింగ్ సెంటర్ని నడిపిస్తోంది. ఆ మధ్య పికిల్బాల్ టీమ్ కూడా కొనుగోలు చేసి వార్తల్లోకెక్కింది. ఇంకా కొత్త జర్నీ ఏంటనుకుంటున్నారా? మరేం లేదు.. తనకంటూ ఓ ఇల్లు కొనుగోలు చేసింది. ఈమధ్యే గృహప్రవేశంఅందులోనే తన ప్రయాణం ఉండబోతుందని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇటీవలే గృహప్రవేశం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో సమంత ఎరుపు రంగు డ్రెస్ సాంప్రదాయంగా ముస్తాబైంది. ముఖానికి కుంకుమ పెట్టుకుని పూజలో పాల్గొంది. పూజగది ఫోటోను షేర్ చేసింది. అలాగే తన జిమ్ వర్కవుట్స్ వీడియోను కూడా జత చేసింది.సినిమాటాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన సమంత.. ‘ట్రలాలా’ బేనర్తో నిర్మాతగా మారింది. తన సొంత బ్యానర్పై తొలిసారి ‘శుభం’ చిత్రాన్ని నిర్మించింది. ఇదే బేనర్లో తాను కథానాయికగా ‘మా ఇంటి బంగారం’ సినిమా చేస్తోంది. అలాగే రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ అనే హిందీ వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: ఎన్టీఆర్ బామ్మర్ది రిసెప్షన్ వేడుక.. సతీసమేతంగా హాజరైన అక్కినేని అఖిల్ -
శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలతో ప్రజలు కొట్టుకునే పరిస్థితి: .‘మా’కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫిర్యాదు
మహాత్మా గాంధీజీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గాంధీ జయంతి రోజు(అక్టోబర్ 2) రాయడానికి వీల్లేని బూతుపదాలతో గాంధీజీ దూషిస్తూ సోషల్ మీడియాలో శ్రీకాంత్ అయ్యంగార్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్పై చర్యలు తీసుకోవాలని ‘మా’ను కోరారు. అతడి సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ...మా అధ్యక్షులు మంచు విష్ణు కు ఫిర్యాదు చేశాడు.అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసేలా శ్రీకాంత్ మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి ఉంది.నిన్న సైబర్ క్రైమ్ లో శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఫిర్యాదు చేశాం. ఇప్పుడు ‘మా’ అధ్యక్షుడికి కూడా కలిశాం. ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ చెప్పింది. పెద్ద హీరోలు కూడా శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలపై స్పందించాలి. ఆయనపై చర్యలు తీసుకోవాలి.. లేదంటే మేము యాంటీ బయోటిక్ కావల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. ‘మా’కు డిస్ప్లీనరీ కమిటీ ఉంది. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే మీటింగ్ పెట్టి..తగిన చర్యలు తీసుకుంటాం’ అని మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివ బాలాజీ అన్నారు. -
అమ్మ పంపిన ఆ ఒక్క ఫోటోతో హీరోయిన్ అయిపోయా : మాళవికా మనోజ్
అమ్మ పంపిన ఒక్క ఫొటోతోనే స్కూల్ గర్ల్ నుంచి సడెన్గా సిల్వర్స్క్రీన్పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సోషల్ మీడియాలో జోష్ పెంచి, అభిమానుల గుండెల్లో క్వీన్ గా సింహాసనం దక్కించుకుంది. ఆమె మలయాళీ క్యూటీ మాళవికా మనోజ్. ఆమె చెప్పిన విశేషాలు...→ నా మొదటి సినిమా ‘ప్రకాశన్ పరక్కట్టే’ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పదో తరగతి చదువుతున్నప్పుడు అమ్మ నా ఫోటో పంపింది. నేను సెలెక్ట్ అయ్యే వరకు ఆ విషయం నాకు తెలియలేదు.→ సినిమాలు అసలు నా ప్లాన్స్లోనే లేవు. ప్యూర్ యాక్సిడెంట్! చిన్నప్పుడు ఫొటోలు తీయించుకోవటం అంటే చాలా ఇష్టం. మోడల్ అవుదామనే ఆలోచన లేదు కాని, నా ఫొటోలు చూస్తే నాకే నచ్చేది. నేను సిగ్గరిని కూడా. స్కూల్ డ్రామాల్లో ఒక్కసారి కూడా స్టేజ్ మీదకెళ్లలేదు.→ ప్రకాశన్ పరక్కట్టే టీమ్ను కలిసిన తర్వాతే నాలో స్పార్క్ వచ్చింది. సినిమా పూర్తయ్యాక ఫీల్ బాగుంది. అప్పటినుంచే ఈ జర్నీ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాను.→ ‘జో’ నా కెరీర్లో మైలురాయి. థియేటర్స్ కంటే ఓటీటీలో, రీల్స్లో చూసి చాలామంది నన్ను ఇష్టపడ్డారు. ఇప్పటికీ చాలామంది, నేను మలయాళీ కాదని, తమిళ అమ్మాయిగానే గుర్తిస్తుంటారు. ఇది ఫన్నీ అయినా, నాకు గర్వకారణం.→ తెలుగు తెరపై అడుగుపెట్టడం సవాలు. భాషా అడ్డంకి పెద్దది. కాని, ‘ఓ భామ అయ్యో రామా!’ టీమ్, నన్ను ప్రేమతో ముందుకు నెట్టి, ఎంతో ప్రోత్సహించింది.→ ప్రతి ఒక్కరిలాగే, ‘మా నాన్నే నా మొదటి హీరో’. ఆ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరోస్.→ అమ్మ డ్యాన్సర్ కాబట్టి, చిన్నప్పటి నుంచే నాట్యంలోనూ శిక్షణ తీసుకున్నాను.→ సోషల్ మీడియా, నా కెరీర్కు కొత్త రెక్కలు ఇచ్చింది. ఒక చిన్న రీల్ కూడా సినిమాకు క్రేజ్ తెస్తుంది. అందుకే, అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను.→ ప్రస్తుతం మూడు భాషల్లో సినిమాల్లో బిజీగా ఉన్నాను. కొత్త కథలు, కొత్త ప్రతిభలతో ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను.→ డెసర్ట్స్, స్వీట్స్ అంటే పిచ్చి ఇష్టం. అందులోనూ చాక్లెట్ పేస్ట్రీకి నేను ఎప్పుడూ ‘నో’ చెప్పలేను. అది నా బలహీనత.→ పెసర పిండి, పెరుగు, కస్తూరి పసుపు కలిపిన ఫేస్ మాస్క్ నా చర్మ సౌందర్య రహస్యాల్లో మొదటిది. ఆ తర్వాత గోరువెచ్చని కొబ్బరి నూనె మసాజ్. ఎక్కువగా సహజసిద్ధమైన ఉత్పత్తులతోనే సౌందర్యాన్ని కాపాడుకుంటాను.→ ఫ్యాషన్ డిజైనింగ్లో నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అందుకే సినిమాల్లోనూ ఎక్కువగా నా కాస్ట్యూమ్స్ని నేనే డిజైన్ చేస్తాను.→ ఒక బటన్ నొక్కితే ఎక్కడికైనా తక్షణమే వెళ్లగల పవర్ కావాలన్నది నా కల. ఎందుకంటే, నేనొక పెద్ద ట్రావెల్ లవర్. కాస్త సమయం దొరికినా బ్యాగ్ సర్దేసుకుంటాను. -
అట్లీతో సినిమా.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) తివిక్రమ్తో సినిమా చేయాల్సింది. కానీ అనూహ్యంగా అట్లీతో సినిమా(AA22)ను ప్రకటించి షాకిచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇంత త్వరగా సెట్స్పై వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. పనులన్నీ చకచక పూర్తి చేసి..షూటింగ్ని ప్రారంభించారు. తాజాగా ఈ మూవీకి సంబంధిచి ఓ క్రేజీ రూమర్ నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రానికిగానూ అల్లు అర్జున్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడట.తగ్గేదేలే.. మొన్నటి వరకు తెలుగు నుంచి ప్రభాస్(Prabhas) ఒక్కడే ఇండియన్ బాక్సాఫీస్ని శాసించాడు. ఇప్పుడు ఆ లిస్ట్లో బన్నీ కూడా చేరిపోయాడు. ఆయన నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డును సృష్టించింది. ఈ చిత్రం తర్వాత బన్నీ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న చిత్రానికి అత్యధికంగా రూ. 180 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఒక్కడే రూ. 120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఇప్పుడు ఆ విషయంలో ప్రభాస్ని దాటేశాడు బన్నీ. మార్కెట్లో తనకున్న డిమాండ్ దృష్ట్యా.. నిర్మాతలు కూడా అంత పెద్దమొత్తంలో ఇవ్వడానికి ఒకే చెప్పేశారట. చిత్ర దర్శకుడు అట్లీ, హీరోయిన్ దీపికా పదుకొణెలు కూడా ఎక్కువగానే చార్జ్ చేస్తున్నారట.కొత్త ప్రపంచంఇప్పుడు బన్నీ నుంచి ఒక సినిమా వస్తుందంటే అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయం. ఆ అంచనాలను మించేలా అట్లీ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఇందుకుగాను అట్లీ ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నాడట. అది ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని చెబుతున్నాడు. రూ. 700 కోట్ల బడ్జెట్తో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్ కోసమే రూ. 250 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే.. విజువల్స్ పరంగా సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్కు కూడా పరిచయం చేసేందుకు ప్రముఖ మార్కెటింగ్ సంస్థతో భాగస్వామ్యం అయింది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది. -
రెండు..మూడు..ఏడు..ఇంకోసారి మేజిక్!
సిల్వర్ స్క్రీన్పై కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఆ జంటను మరిన్ని సినిమాల్లో చూడాలనేంతగా వారి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుంది. పైగా ఈ పెయిర్ నటించిన సినిమా హిట్ అయితే... ‘హిట్ జోడీ’ అనే పేరు కూడా వస్తుంది. అలా వెండితెరపై తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు హిట్ కూడా అందుకున్న కొన్ని జంటలు మళ్లీ కలిసి నటిస్తున్నాయి. ఒకరు రెండోసారి జత కడితే... మరొకరు మూడోసారి... ఇంకొకరు ఏకంగా ఏడో సారి... ఇలా హిట్ మేజిక్ని రిపీట్ చేయడానికి రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం. ఎన్నాళ్లకెన్నాళ్లకు... హీరో చిరంజీవి(Chiranjeevi), హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్టాలిన్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 సెప్టెంబరు 20న విడుదలై, హిట్గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. 19 ఏళ్ల తర్వాత వీరి జోడీ ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాతో రిపీట్ అవుతోంది. ‘బింబిసార’ మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్ రెడ్డి సమర్పణలో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్ కాగా ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్గా రూ΄÷ందుతోన్న ‘విశ్వంభర’ 2026 వేసవిలో విడుదల కానుంది. రెండోసారి... హీరో చిరంజీవి– హీరోయిన్ నయనతార(Nayanthara) కాంబినేషన్ రెండోసారి రిపీట్ అవుతోంది. వీరిద్దరూ తొలిసారి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 అక్టోబరు 2న రిలీజైంది. ఆ తర్వాత చిరంజీవి, నయనతార కలిసి ‘గాడ్ఫాదర్’ (2022) చిత్రంలో అన్నా–చెల్లెలుగా నటించారు. తాజాగా వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ మూవీ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి చిరంజీవి–నయనతార సందడి చేసిన ‘మీసాల పిల్ల...’ అంటూ సాగే తొలి పాట ప్రోమోని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 27 ఏళ్ల తర్వాత... కొన్ని జంటలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. హీరో నాగార్జున(Nagarjuna Akkineni), హీరోయిన్ టబు జోడీ కూడా అలాంటిదే. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు నాగార్జున–టబు. 1996 అక్టోబరు 4న విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున–టబు కలిసి నటించిన రెండో చిత్రం ‘ఆవిడా మా ఆవిడే’. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998 జనవరి 14న విడుదలైంది. ఈ చిత్రంలోనూ తమదైన నటనతో సందడి చేసిన వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారని ఫిల్మ్నగర్ టాక్. నాగార్జున కెరీర్లో 100వ సినిమాగా రూపొందుతోన్న చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఈ చిత్రం కోసం 27 ఏళ్ల తర్వాత మరోసారి జోడీగా నటించనున్నారట నాగార్జున–టబు. నాగార్జున కెరీర్లో మైలురాయిలాంటి ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, వారిలో టబు ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ‘సిసింద్రి’ (1995) సినిమాలో నాగార్జున– టబు ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ సాగే స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఏడోసారి... హీరో వెంకటేశ్(Venkatesh), హీరోయిన్ మీనాలది ప్రత్యేకమైన జోడీ. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ‘చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం, దృశ్యం, దృశ్యం 2’ వంటి అరడజను సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో వీరి జోడీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఇప్పుటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్న వీరిద్దరూ ‘దృశ్యం 3’ సినిమా కోసం మరోసారి జోడీగా నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దృశ్యం’ (2014), ‘దృశ్యం 2’ (2021) సినిమాలు అద్భుతమైన హిట్స్ అందుకున్నాయి. ఈ సిరీస్లో రానున్న తాజా చిత్రం ‘దృశ్యం 3’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్లాల్, మీనా జోడీగా మలయాళంలో ‘దృశ్యం 3’ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. తెలుగులోనూ రూపొందనున్న ‘దృశ్యం 3’లో వెంకటేశ్–మీనా మరోసారి జంటగా నటించి, ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం పూర్తయ్యాక ‘దృశ్యం 3’ సెట్స్పైకి వెళ్లనుంది. థియేటర్లలో జాతర హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల కలిసి థియేటర్లలో ‘మాస్ జాతర’ చూపించేందుకు సిద్ధం అయ్యారు. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. నక్కిన త్రినాథరావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 డిసెంబరు 23న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో రవితేజ–శ్రీలీల డ్యాన్సులు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ధమాకా’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ద్వితీయ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా ‘మాస్ జాతర’ రూ΄÷ందడం.. రవితేజ–శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం.. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి ఇప్పటికే అద్భుతమైన స్పందన రావడం... వంటి కారణాలతో ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. సలార్: శౌర్యాంగపర్వంలో... ‘బాహుబలి’ చిత్రం తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్’ వంటి చిత్రాలు చేస్తున్నారు. ఆ తర్వాత ‘సలార్: శౌర్యాంగపర్వం’ మూవీ చేస్తారు. ప్రభాస్, శ్రుతీహాసన్ జోడీగా నటించిన తొలి చిత్రం ‘సలార్: పార్ట్ 1 సీజ్ఫైర్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ మూవీ 2023 డిసెంబరు 22న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ప్రభాస్ యాక్షన్... ప్రశాంత్ నీల్ టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాకి సీక్వెల్గా ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ రూపొందనున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో అలరించిన ప్రభాస్– శ్రుతీహాసన్ జోడీ ద్వితీయ భాగంలోనూ అలరించబోతుందని ఫిల్మ్నగర్ టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారాయన. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాతే ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ పై దృష్టి పెడతారట. ‘సలార్: ΄ార్ట్ 1 సీజ్ఫైర్’ చూసిన వారందరూ ‘సలార్: ΄ార్ట్ 2 శౌర్యాంగపర్వం’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోసారి... నాని హీరోగా నటించిన ‘నానీస్ గ్యాంగ్లీడర్’ (2019) చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంకా మోహన్. ఆ తర్వాత మరోసారి వీరిద్దరూ ‘సరి΄ోదా శనివారం’ (2024) సినిమాలో నటించారు. ఇప్పటికే రెండు సినిమాల్లో సందడి చేసిన ఈ జంట మరోసారి జోడీగా కనిపించనున్నారని ఫిల్మ్నగర్ టాక్. ‘సాహో, ఓజీ’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ్ర΄ారంభమైంది. ఈ సినిమాలో నానీకి జోడీగా ప్రియాంకా మోహన్ నటించనున్నారట. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన ‘ఓజీ’ చిత్రంలో హీరోయిన్గా నటించారు ప్రియాంక. తాజాగా నాని సినిమాలో ఆమెని హీరోయిన్గా తీసుకోనున్నారట సుజీత్. పైగా నాని–ప్రియాంక కాంబినేషన్కి కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండటంతో వీరు మూడోసారి నటించడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ముచ్చటగా మూడోసారి... హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా కలిసి ముచ్చటగా మూడోసారి జోడీగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘గీత గోవిందం’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 ఆగస్టు 15న విడుదలై సూపర్ హిట్గా నిలవడంతో ΄ాటు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ మూవీ తర్వాత విజయ్–రష్మిక నటించిన ద్వితీయ చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 జూలై 16న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా విడుదలైన ఆరేళ్ల తర్వాత వీరిద్దరూ మూడోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్’). గతంలో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ‘వీడీ 14’కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రంలోనే మరోసారి విజయ్–రష్మిక పెయిర్గా మారారు. ఇదిలా ఉంటే రీల్ లైఫ్లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక రియల్ లైఫ్లో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 3న వీరి నిశ్చితార్థం జరిగింది. 2026 ఫిబ్రవరిలో విజయ్–రష్మికల వివాహం జరగనుంది. ఎనిమిదేళ్ల తర్వాత... హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటిస్తున్నారు. వీరిద్దరూ తొలిసారి నటించిన చిత్రం ‘శతమానం భవతి’. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017 జనవరి 14న రిలీజై, సూపర్ హిట్గా నిలవడంతో ΄ాటు జాతీయ అవార్డు అందుకుంది. ఈ సినిమాలో క్యూట్ జోడీగా ఆకట్టుకున్న శర్వానంద్, అనుపమ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘శర్వా 38’ (వర్కింగ్ టైటిల్). సంపత్ నంది దర్శకత్వంలో లక్ష్మీ రాధా మోహ¯Œ సమర్పణలో కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1960ల కాలంలోని ఉత్తర తెలంగాణ– మహారాష్ట్రల సరిహద్దు ్ర΄ాంతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూ΄÷ందుతోంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ డింపుల్ హయతి ఓ కీలక ΄ాత్ర చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్యలది క్రేజీ కాంబినేషన్ అనే చె΄్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై కల్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. మొదటి చిత్రంతోనే వంద కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన వీరి జోడీ రెండో సారి ప్రేక్షకులను అలరించనుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జంటగా ‘90స్’(ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాస¯Œ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఓ మధ్య తరగతి యువకుడి ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ‘బేబీ’తో బ్లాక్బస్టర్ అందుకున్న ఆనంద్–వైష్ణవి రెండోసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై యువతలో మంచి ఆసక్తి నెలకొంది. రెండోసారి... హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రెబా మోనికాజాన్లది హిట్ పెయిర్. వీరిద్దరూ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘సామజ వరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 జూన్ 29న విడుదలై, ప్రేక్షకులను నవ్వించింది. ఆ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రెబా మోనికాజాన్ కలిసి నటించిన ద్వితీయ చిత్రం ‘మృత్యుంజయ్’. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందింది. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలక΄ాటి నిర్మించారు. తొలి చిత్రం ‘సామజ వరగమన’తో నవ్వులు పంచిన శ్రీవిష్ణు, రెబా ‘మృత్యుంజయ్’తో మాత్రం భయపెట్టనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
సరికొత్త ప్రేమకథతో ‘ప్రేమిస్తున్నా’
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు నటించిన తాజా చిత్రం ‘ప్రేమిస్తున్నా’.భాను దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న ఈ విడియోలో సినిమా ఎలా ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ...‘అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు, అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా, మేము విడుదల చేసిన సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా కు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోందని’అన్నారు. -
‘అరి’పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రశంసలు
జయశంకర్ తెరకెక్కించిన ‘అరి’ చిత్రం నిన్న(అక్టోబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ వారం వచ్చిన చిత్రాలన్నింట్లోనూ అరి కాస్త ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు. అరికి మంచి ప్రశంసలు లభించడం, ఆదరణ దక్కుతుండటంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చినట్టుగా కనిపిస్తోంది.ఇక ‘అరి’ సక్సెస్ సాధించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం దర్శకుడు జయశంకర్ను అభినందించారు. ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కొనియాడారు. అరి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. అర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు. -
వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మూవీ రివ్యూ
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. బలగం జగదీష్ నిర్మాతగా ఆర్యన్ సుభాష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ఈ వారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీలో కానిస్టేబుల్గా వరుణ్ సందేశ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు? అసలు ఈ మూవీ కథ ఏంటి? అన్నది చూద్దాం..కథేంటంటే..మోకిలా మండలంలోని శంకరపల్లి ఊర్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆడ, మగ అని తేడా లేకుండా జరుగుతున్న ఈ సీరియల్ కిల్లింగ్స్ పోలీసులకు పెద్ద ఛాలెంజింగ్గా మారుతుంది. అయితే ఈ ఊరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా కాశీ (వరుణ్ సందేశ్) పని చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్లో కాశీ మేనకోడలు కీర్తి (నిత్య శ్రీ) కూడా బలి అవుతుంది. మరి ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనకాల ఉన్నది ఎవరు? కాశీ ఆ కిల్లర్ను పట్టుకుంటాడా? ఎవరిని అనుమానించినా సరే చివరకు వాళ్లు కూడా చనిపోతుంటారు? అసలు వీటన్నంటి వెనకాల ఉన్నది ఎవరు? చివరకు ఏం జరిగింది? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.ఎలా ఉందంటే..సీరియల్ కిల్లర్స్, క్రైమ్ స్టోరీలకు ఓ ఫార్మూలా ఉంటుంది. చాలా మంది ఆ ఫార్మూలాను వాడుకుని కథను అల్లుకుంటారు. కానీ కానిస్టేబుల్ విషయంలో మాత్రం అంతా కొత్తగా, డిఫరెంట్గా ఉంటుంది. ఆడియెన్స్ ఊహించి ఏదీ కూడా తెరపై జరగదు. ప్రతీ ఒక్క చోట ప్రేక్షకుడ్ని సర్ ప్రైజ్ చేసుకుంటూ వెళ్తుంది.ఫస్ట్ హాఫ్ అంతా కూడా సీరియల్ కిల్లింగ్స్, కొందరి మీద అనుమానం వచ్చేలా సీన్లను చూపించడం, హీరో ఇంట్లోనే విషాదం జరగడం వంటి సీన్లతో సాగుతుంది. ఇంటర్వెల్కు ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్లో అసలు కథ రివీల్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా ఓకే అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే ఊహకు భిన్నంగా ఉంటుంది. అలా మొత్తానికి ఓ మంచి క్రైమ్, థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..ఈ చిత్రంలో కాశీ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటాడు. వరుణ్ సందేశ్కు ఇలాంటి పాత్ర చాలా కొత్త. ఈ మూవీలో వరుణ్ సందేశ్ లుక్స్, యాక్టింగ్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్కు సర్ ప్రైజింగ్గా ఉంటాయి. హీరోయిన్ మధులిక పాత్ర కూడా మెప్పిస్తుంది. యాక్టింగ్కు ఓ మోస్తరుగా స్కోప్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక భవ్య శ్రీ, నిత్య శ్రీ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. అసలు ట్విస్ట్ ఏంటి? విలన్ ఎవరన్నది మాత్రం సినిమాలో చూస్తేనే కిక్ వస్తుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఇలాంటి సీరియల్ కిల్లింగ్ స్టోరీలకు ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. ఇందులోనూ మంచి ఆర్ఆర్ ఉంటుంది. షైక్ హజారా కెమెరా కూడా సీన్లకు తగ్గట్టుగా మూడ్ను రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. మాటలు, పాటలు పర్వాలేదనిపిస్తాయి.ఎడిటింగ్, ఆర్ట్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగానే ఉన్నాయి. -
ర్యాప్ సింగర్ జీవిత ఇతివృత్తంతో బాటిల్
ఎలైట్ టాకీస్ పతాకంపై కే.భాస్కరన్ నిర్మిస్తున్న చిత్రం బాటిల్. 'తంగలాన్' ఫేమ్ అన్భుడన్ అర్జున్, 'గాంధీ కణక్కు' చిత్రంలో చిన్న వయసు అర్చనగా నటించిన ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నారాయణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇటీవల విడుదలైన దండకారణ్యం చిత్రానికి సహాయ రచయితగానూ, దర్శకుడు శక్తివేల్ వద్ద కోడైరెక్టర్గా పని చేశారు. ఈ మూవీలో దర్శకుడు సుబ్రమణియం శివ, శరవణన్ సుబ్బయ్య, గాయత్రి, మునీశ్కాంత్, సురుళి, ఇడ్లీకొట్టు చిత్రంలో చిన్న వయసు ధనుష్గా నటించిన దిహాన్, దివ్యశ్రీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆరు పాటలుదర్శకుడు నారాయణన్ మాట్లాడుతూ.. ఒక ర్యాప్ గాయకుడి పూర్తి జీవిత సంఘటనలతో తెరకెక్కుతున్న తొలి తమిళ చిత్రం ఇదే అన్నారు. ఆ గాయకుడు ఎదుర్కొనే సమస్యలతోపాటు ఒక ముఖ్య విషయాన్ని ఈ చిత్రంలో చెప్పబోతున్నట్లు తెలిపా. సరిగ్గా రెండు గంటల పాటు సాగే ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయన్నారు. ఈ చిత్రానికి జీవా సంగీతం, ప్రముఖ చాయాగ్రహకుడు సెళియన్ శిష్యుడు యువరాజ్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. బాటిల్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయగా విశేష స్పందన వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.చదవండి: ఓటీటీలో హృతిక్ స్టార్మ్ -
అందుకే ‘జాతి రత్నాలు’తో పోల్చుతున్నారు : ‘మిత్రమండలి’ నిర్మాతలు
‘మిత్ర మండలి’ అనేది బడ్డీస్ కామెడీ. అందుకే అందరూ ‘జాతి రత్నాలు’ సినిమాతో పోల్చుతున్నారు. కానీ ‘జాతి రత్నాలు’ కథకు, మా సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మూవీని ఎంతలా ఎంజాయ్ చేశారో మా చిత్రాన్ని చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తారు’ అన్నారు నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ బన్నీ వాస్ మాకు మంచి స్నేహితులు. ఓ సారి మా ఇద్దరినీ ఈ కథ వినమని చెప్పారు. కళ్యాణ్ ఎక్కువగా వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. మేం ఇద్దరం ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నాం. ఆ టైంలో ఈ కథను విన్నాం. ఈ మూవీతో పాటుగా మరో రెండు ప్రాజెక్టుల్ని కూడా స్టార్ట్ చేశాం. వాసు వల్లే ఈ కథ మాకు వచ్చింది. ఈ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఆద్యంతం వినోదాన్ని అందిస్తూనే సెటైరికల్గా ఉంటుంది.→ విజయేందర్ మంచి దర్శకుడు. అనుదీప్, ‘మ్యాడ్’ కళ్యాణ్, ఆదిత్య హాసన్లతో విజయేందర్ పని చేశాడు. పూర్తి స్క్రిప్ట్తోనే మా వద్దకు వచ్చాడు. కథను ఎంత అద్భుతంగా రాసుకున్నాడో.. అంతే అద్భుతంగా తీశాడు. కొత్త దర్శకుడిలా, మొదటి సినిమాలా అనిపించలేదు.→ ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘జంబర్ గింబర్ లాలా’ పాటను అనుకోకుండా చిత్రీకరించాం. ముందు అసలు ఆ పాటను అనుకోలేదు. కానీ మాకు సినిమా పూర్తయిన తరువాత ఏదో అసంతృప్తిగా అనిపించింది. దీంతో బ్రహ్మానందం గారితో అలా పాటను చిత్రీకరించాం. ఆయన కూడా ఆ పాటను, లిరిక్స్ను ఎంజాయ్ చేశారు.→ ఈ సినిమా కోసం ‘జంగ్లీ పట్టణం’ అనే ఓ ఫిక్షనల్ టౌన్తో పాటు ఫిక్షనల్ క్యాస్ట్ని డైరెక్టర్ క్రియేట్ చేశాడు. ఆ ఫిక్షనల్ టౌన్లో జరిగే కథ, అందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఫిక్షనల్ క్యాస్ట్తో సమాజంలో ఉన్న క్యాస్ట్ సిస్టం మీద సెటైరికల్గా సీన్లను చిత్రీకరించాం. ఈ చిత్రం ఎక్కువగా యూత్కు రిలేట్ అవుతుంది.. వారికి ఇంకా ఎక్కువగా నచ్చుతుంది.→ మేం అన్ని రకాల జానర్లలో చిత్రాల్ని చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్తో వస్తున్నాం. త్వరలోనే హారర్ మూవీని ప్రారంభించనున్నాం. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథలతో సినిమాల్ని తీయాలని అనుకుంటున్నాం. -
ఆ హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు: దీపికా పదుకొణె
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కొంతకాలంగా వివాదాల్లో నానుతూనే ఉంది. కల్కి 2, స్పిరిట్ వంటి రెండు పెద్ద సినిమాల్లో భాగమైన ఆమె.. అనూహ్యంగా వాటినుంచి సైడ్ అయిపోయింది. కారణం తను పెట్టిన కండీషన్లే! 8 గంటల పనిదినాలతో పాటు రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేసిందని, తనతో పాటు తన టీమ్ మొత్తానికి వానిటీ వ్యాన్లు, లగ్జరీ హోటల్స్లో వసతులు కల్పించాలని షరతులు పెట్టినట్లు ప్రచారం జరిగింది.భారీ సినిమాలు చేజార్చుకున్న దీపికాస్టార్ హీరోయిన్ కాబట్టి అన్నింటికీ తలాడించిన నిర్మాతలు 8 గంటల పనిదినాల దగ్గర మాత్రం ఒప్పుకోవడానికి నిరాకరించారు. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఈ రూల్ పని చేయదు. అది పాటిస్తే బడ్జెట్ చేయిదాటిపోతుందన్నది వారి వాదన! అందుకే ఆమె చేతినుంచి సినిమాలు చేజారుతున్నాయి. తాజాగా తొలిసారి దీపికా పదుకొణె మీడియా ముందు ఈ వివాదంపై పెదవి విప్పింది. స్టార్ హీరోలు 8 గంటలే..ఆమె మాట్లాడుతూ.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది సూపర్స్టార్స్, టాప్ హీరోలు ఎన్నో ఏళ్లుగా 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. ఇదేమీ సీక్రెట్ కాదు. అయినా ఎప్పుడూ ఈ విషయం వార్తల్లోకెక్కలేదు. వాళ్ల పేర్లు నేను చెప్పను. ఇప్పుడుకానీ వాళ్ల పేర్లు ప్రస్తావిస్తే విషయం పెంటపెంట అవుతుంది. అందుకే ఆ హీరోల గురించి చెప్పాలనుకోవడం లేదు. చాలామంది హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేస్తారు, వీకెండ్లో సెలవు తీసుకుంటారు. నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నా..ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన కొందరు హీరోయిన్లు కూడా 8 గంటలే వర్క్ చేయడం ప్రారంభించారు. కానీ, వాళ్ల గురించి ఎవరూ మాట్లాడరు. నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చింది. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీలో మొదట దీపికను అనుకున్నారు. కానీ, సడన్గా తన స్థానంలోకి త్రిప్తి డిమ్రి వచ్చి చేరింది. కల్కి 2898 ఏడీ సినిమాలో దీపిక నటించిన విషయం తెలిసిందే! ఈ మూవీ సీక్వెల్లో నిబద్ధతతో పనిచేసేవారు అవసరమంటూ దీపికను తప్పించారు.చదవండి: ఇలాగైతే నావల్ల కాదు, ఇంటికి పంపించేయండి.. సంజనా ఏడుపు -
ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్బస్టర్ మూవీ
కొన్ని సినిమాలు ఒక్కసారి చూస్తే చాలు.. కానీ, కొన్ని మాత్రం వన్స్మోర్ అనిపించేలా ఉంటాయి. మిరాయ్ మూవీ (Mirai Movie) కూడా అదే కోవలోకి వస్తుంది. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్.. ఇలా అన్నింటి మేళవింపులతో ఈ మూవీ తెరకెక్కింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించగా రితికా నాయక్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. మంచు మనోజ్ విలన్గా మెప్పించాడు. గౌర హరి సంగీతం అందించాడు. ఓటీటీలో మిరాయ్సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ముందస్తు డీల్ ప్రకారం నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్లో శుక్రవారం (అక్టోబర్ 10) రిలీజైంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఓటీటీలో ఈ సినిమా ఏమేరకు అదరగొడుతుందో చూడాలి! ఈరోజు మిరాయ్ ఒక్కటే కాదు, సన్ నెక్స్ట్లో త్రిబాణధారి బార్బరిక్, నెట్ఫ్లిక్స్లో కురుక్షేత్రం అనే యానిమేడెట్ సిరీస్ కూడా రిలీజయ్యాయి. అటు వార్ 2 మూవీ గురువారమే (అక్టోబర్ 9) నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. వీకెండ్లో మీకు నచ్చిన సినిమాలపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu) చదవండి: అందుకే బిగ్బాస్ ఇంటికి తాళం.. రెండురోజుల్లో మళ్లీ షురూ -
సినిమా పరిశ్రమను కాపాడుకోవాలి : మంత్రి జి.వివేక్
‘‘సినిమా వ్యాపారం అంటేనే రిస్క్. ‘అరి’ చిత్రంతో అలాంటి రిస్క్ చేశారు నిర్మాతలు. వారికి ఈ సినిమా మంచి విజయం అందివ్వాలి. తగినన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ, సినిమా పరిశ్రమను కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చెందేలా చూసుకోవాలి. అప్పుడే స్థానికంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు వస్తాయి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి జి. వివేక్ తెలిపారు. వినోద్ వర్మ, అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. జయశంకర్ దర్శకత్వం వహించారు. రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏషియన్–సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేడు రిలీజ్ అవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘అరి’లాంటి మంచి చిత్రాలను ప్రోత్సహిస్తే ఈ కోవలో మరిన్ని సినిమాలు వస్తాయి’’ అని చెప్పారు. ‘‘మంచి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘అరి’ విజయం సాధించాలి’’ అని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఆకాంక్షించారు. ‘‘మంచి కథతో ఈ చిత్రాన్ని రూ΄÷ందించారు జయశంకర్’’ అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ‘‘అరిషడ్వర్గాల నేపథ్యంలో తీసిన ‘అరి’కి మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం’’ అని తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శ్రీనివాస్ రామిరెడ్డి తెలి΄ారు. ‘‘నా 50 ఏళ్ల నట జీవితంలో ‘అరి’ లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నాను’’ అని నటుడు సాయికుమార్ చె΄్పారు. ఈ వేడుకలో దర్శకుడు జయశంకర్, త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి, తెలంగాణ స్టేట్ ΄్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి తదితరులు మాట్లాడారు. -
డ్యూడ్ ఘనవిజయం సాధిస్తుంది – రవిశంకర్
‘‘డ్యూడ్’ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. మా చిత్రం ఘన విజయం సాధిస్తుంది. ఈ దీ΄ావళికి వస్తున్న ‘మిత్రమండలి, తెలుసు కదా, కె–ర్యాంప్’ చిత్రాలు కూడా విజయం సాధించాలి’’ అని నిర్మాత వై.రవిశంకర్ అన్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ– ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ΄÷ందిన ఈ చిత్రంలో వినోదం, భావోద్వేగాలతో ΄ాటు ఊహించని అంశాలుంటాయి. ‘డ్యూడ్’ కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది’’ అని చె΄్పారు. ‘‘చాలా కొత్త కథ ఇది. కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అన్నారు శరత్ కుమార్. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. -
సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని తేడా చూడను: హీరోయిన్
సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని ఎటువంటి తారతమ్యం చూపనని సోనియా అగర్వాల్ (Sonia Agarwal) అన్నారు. ఈమె ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం విల్. ఫుడ్ స్టెప్స్ ప్రొడక్షన్స్, కొత్తారి మద్రాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్లపై ఈ మూవీ తెరకెక్కింది. ఎస్.శివరామన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా.. సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు. విక్రాంత్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించారు. ఈ మూవీ శుక్రవారం (అక్టోబర్ 10న) రిలీజైంది. ఈ క్రమంలో గురువారం చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు శివరామన్ మాట్లాడుతూ.. ఇది కోర్టు నేపథ్యంలో సాగే వైవిధ్య భరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు. చిన్న, పెద్ద అన్న బేధాలు చూడనుసోనియా అగర్వాల్ జడ్జిగా నటించగా, అలోకియా చిన్న వివాదాస్పద పాత్రలో కనిపించనున్నారని చెప్పారు. సోనియా అగర్వాల్ సోదరుడు సౌరబ్ అగర్వాల్ను సంగీత దర్శకుడుగా పరిచయం చేసినట్లు చెప్పారు. సోనియా అగర్వాల్ మాట్లాడుతూ.. శివరామన్ దర్శకత్వంలో తాను ఇంతకుముందు తనిమై అనే చిత్రంలో నటించానని, ఆ తర్వాత ఇప్పుడు విల్ చిత్రంలో నటించినట్లు చెప్పారు. తాను చిత్రాల విషయంలో చిన్న, పెద్ద అన్న తారతమ్యాన్ని చూడనని, ఇంతకుముందు రూ.కోటి వ్యయంతో రూపొందించిన కాదల్ కొండేన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిందన్న విషయాన్ని గుర్తు చేశారు.చదవండి: అప్పట్నుంచే తెలుగు నేర్చుకుంటున్నా!: శ్రీనిధి శెట్టి -
రాజేంద్రప్రసాద్ మనవరాలి చిత్రానికి ‘ఏ’ సర్టిఫికేట్!
రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన తొలి చిత్రం ‘ఎర్రచీర’. ఈ మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు ‘ఏ(A)’ సర్టిఫికెట్ ఇచ్చారు. హార్ట్ పేషెంట్స్ ఈ సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు తెలిపారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలో ఒకరైన ఎన్. వి. వి. సుబ్బారెడ్డి ( సుభాష్) మాట్లాడుతూ.."సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తాయి" అన్నారు. -
షూటింగ్కి వెళ్తే..ఆ హీరో నా చేతులు గట్టిగా పట్టుకొని.. : సంజనా
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు తప్పవనే టాక్ ఇప్పటికీ ఉంది. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడితే.. అవకాశాల పేరుతో కొంతమంది..అవసరాలకు మరికొంత మంది వారిని ఇబ్బందికి గురి చేస్తూనే ఉంటున్నారు. టాలెంట్తో చాన్స్ దక్కించుకొని షూటింగ్కి వెళ్తే..అక్కడ కూడా వేధింపులు తప్పవు. చాలా మంది అలాంటి వేధింపులను భరించలేక..ఇండస్ట్రీనే వదిలేశారు. కొంత మంది మాత్రమే వాటిని ధైర్యంగా ఎదుర్కొని కెరీర్ పరంగా ముందుకు సాగారు. అలాంటి వారిలో సంజన గల్రానీ ఒకరు. తన కెరీర్లో ఎంతో మందితో వేధింపులు ఎదురయ్యాయని..వాటిని ఎదుర్కొని ముందుకు సాగడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెబుతోంది.తెలుగు, తమిళ, కన్నడలో పలు చిత్రాలతో అలరించిన ఈ బ్యూటి.. ఇప్పుడు బిగ్బాస్ తొమ్మిదో సీజన్(Bigg Boss 9 Telugu)లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ నటి బిగ్బాస్ హౌస్లోనే ఉంది. అయితే ఈమెకు సంబంధించిన ఓ పాట ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది. అందులో ఆమె కెరీర్లో ఓ హీరోతో ఎదురైన ఇబ్బందిని పంచుకుంది. కన్నడ సినిమా షూటింగ్లో ఓ హీరో తనను టార్చర్ చేశాడట. తన చేతులను పట్టుకొని గట్టిగా నొక్కాడట. నొప్పిగా ఉందని చెబితే.. మ్యానేజ్ చేసుకో అని దురుసుగా మాట్లాడినట్లు సంజనా చెప్పింది.‘కన్నడలో ఓ సినిమా షూటింగ్ నాకు ఇబ్బందిగా అనిపించింది. పేరు చెప్పలేను కానీ ఓ హీరో నన్ను టార్చర్ పెట్టాడు. ఆ మూవీ డైరెక్టర్తో అతనికి గొడవలు జరుగుతున్నాయి. అదే సమయంలో షూటింగ్ జరపగా.. హీరో వచ్చిన నా చేతులు గట్టిగా నొక్కాడు. వాస్తవానికి ఆ సీన్లో హీరో నా చేతులు పట్టుకొని ముందుకు మూవ్ అవ్వాలి. కానీ ఆయన కోపంతో వచ్చి గట్టి గట్టిగా నొక్కాడు. నొప్పిగా ఉందని చెబితే.. మ్యానేజ్ చేసుకో అని సీరియస్ లుక్తో చెప్పాడు. నేను కాసేపు షూటింగ్నే ఆపేశా. ‘ నేను దెబ్బలు తినడానికి రాలేదు..ఇదేం యాక్షన్ సీన్ కాదు.. నేను విలన్ కాదు..ఈ సీన్కి తగ్గట్టుగా నీ మైండ్సెట్ మార్చుకో.. ఆ తర్వాతే షూట్ చేద్దాం’ అని అరగంట తర్వాత మళ్లీ ఆ సీన్ చేశాం. ఇలాంటి క్రాక్ ఉన్నవాళ్లు అప్పుడప్పుడు దొరుకుతారు. వారిని పట్టించుకోకుండా..మన పని చేసుకొని పోవాలి’ అని సంజన చెప్పుకొచ్చింది.టాలీవుడ్ చిత్రం సోగ్గాడు(2005) ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంజనా.. తమిళంలో ఒరు కధల్ సేవిర్తో తొలి విజయం అందుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు చిత్రం సంజన జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, దుశ్శాసన, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్గా నటించింది. -
‘అరి’.. ఆ ఇద్దరికి అంకితం : దర్శకుడు ఎమోషనల్ పోస్ట్
పేపర్ బాయ్ తర్వాత దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అరి’. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(అక్టోబర్ 10)న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు జయశంకర్ ఇన్స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘అరి’ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ మూవీ తెరకెక్కించే సమయంలోనే నా జీవితానికి మూల స్థంబాలుగా ఉన్న మా నాన్న, బావగారిని కోల్పోయాను. అరి చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్పై వారి ఆశీస్సులు ఉంటాయి.. ఈ మూవీని నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను. ఇక రేపటి నుంచి ఈ చిత్రం మీ(ఆడియన్స్) సొంతం’ అని ఇన్స్టాలో రాసుకొచ్చాడు.‘అరి’ కోసం జయ శంకర్ ఏడేళ్లు ప్రయాణం చేశాడు. ‘అరి’ కథని సిద్దం చేసుకునేందుకు హిమాలయాలకు కూడా వెళ్లినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంతో మంది ఆధ్యాత్మిక గురువుల్ని కలిసి అరి షడ్వర్గాల మీద పట్టు సాధించాడు. అలా ఇంత వరకు సిల్వర్ స్క్రీన్ మీద రాని కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. View this post on Instagram A post shared by Jayashankarr (@jayashankarr_) -
నా సీన్ చూసి ఇంట్లో వాళ్లు కళ్లు మూసుకోవద్దు : హీరోయిన్
ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుంది. బయట ప్రపంచంలో ఇండస్ట్రీ గురించి మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మన హద్దుల్లో మనం ఉంటే ఏమీ కాదు. తెరపై నన్ను మా ఫ్యామిలీ హాయిగా చూసుకునేలా ఉండాలి. నా సీన్ వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు. అదే నేను పెట్టుకున్న కండీషన్’ అని అన్నారు హీరోయిన్ నిహారిక ఎన్ ఎం. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ నిహారిక..‘మిత్ర మండలి’తో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి విజయేందర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 16న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిహారిక మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘పెరుసు’(నిహారిక నటించిన తొలి తమిళ చిత్రం) కంటే ముందే ‘మిత్ర మండలి’ కథ విన్నాను. కానీ ‘పెరుసు’ ముందు రిలీజ్ అయింది. ‘మిత్ర మండలి’లో ఉండే భారీ క్యాస్టింగ్ వల్ల అందరి డేట్స్ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మొత్తానికి అక్టోబర్ 16న మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.→ ఈ చిత్రంలో నేను ఓ సాఫ్ట్ పాత్రను పోషించాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇన్ ఫ్లూయెన్సర్గా నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సినిమాల్లో నటించడం చాలా కొత్తగా, ఆనందంగా ఉంది.→ ప్రియదర్శి చాలా మంచి వ్యక్తి. అద్భుతమైన నటుడు. ‘మిత్ర మండలి’ షూటింగ్లో ఉండగానే ప్రియదర్శి నటించిన ‘కోర్ట్’ చిత్రం పెద్ద హిట్ అయింది. ప్రియదర్శి ఎంత సక్సెస్ అయినా కూడా ఒదిగి ఉంటారు.→ నాకు అన్ని కూడా కామెడీ బేస్డ్ చిత్రాలే వస్తున్నాయి. అందుకే డిఫరెంట్ సబ్జెక్ట్లను ఎంచుకోవాలని చూస్తున్నాను. కామెడీ ప్రధాన చిత్రాలే అంటే నేను నా ఇన్ స్టాగ్రాంలో రీల్స్ చేసుకుంటాను కదా (నవ్వుతూ).→ నేను పరాజయాలకు ఇట్టే కృంగిపోతాను.. ఫెయిల్యూర్స్ వస్తే చాలా బాధపడతాను. అయితే వెంటనే దాన్నుంచి బయటకు వచ్చేస్తాను.→ తెలుగు చిత్ర సీమ నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించింది. దర్శక, నిర్మాతలు నన్ను సొంత ఫ్యామిలీలా చూసుకున్నారు. టాలీవుడ్లో దొరికినంత ప్రేమ, కంఫర్ట్ నాకు ఇంకెక్కడా దొరకలేదు. -
‘డ్యూడ్’ అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది: హీరో ప్రదీప్ రంగనాథన్
వరుస బ్లాక్బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు'అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. డ్యూడ్ అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ప్రెస్ మీట్ లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డ్యూడ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా రిలేటబుల్ క్యారెక్టర్. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి పని చేయడం హ్యాపీగా ప్రౌడ్ గా ఉంది. డైరెక్టర్ ఈ కథ చెప్తున్నప్పుడే తనలోని కాన్ఫిడెన్స్ కన్వెన్షన్ చాలా నచ్చింది. తిరుపతి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం అనేది ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నాను. తిరుపతిలో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది.సినిమా మీద చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. దయచేసి పైరసీని ఎవరూ కూడా ఎంకరేజ్ చేయకూడదని కోరుకుంటున్నాను’ అన్నారు. -
SSMB29: మహేశ్-ప్రియాంకతో ఫోక్ సాంగ్.. టైటిల్ ఇదే!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్లో ఓ సినిమా(SSMB 29) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్పై ఇప్పటికే చాలా పుకార్లు వచ్చాయి. టైటిల్ ఇదే అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ రాజమౌళి మాత్రం ఎప్పటిమాదిరే టైటిల్ని గోప్యంగా ఉంచాడు. అంతేకాదు సినిమా షూటింగ్ అప్డేట్ కూడా బయటకు రానివ్వడం లేదు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలో మరో కొత్త పేరు ప్రచారంలోని వచ్చింది. అదే వారణాసి. గతంలో పలు పేర్లు అనుకున్నా.. చివరకు రాజమౌళి ఈ పేరుకే మొగ్గు చూపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.డివోషనల్ టచ్..ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి..మహేశ్ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించగానే.. ఇదొక జంగిల్ అడ్వెంచరస్ మూవీ అని ప్రచారం జరిగింది. లీకైన షూటింగ్ క్లింప్స్ కూడా అలానే అనిపించాయి. అయితే జక్కన్న మాత్రం ఈ జంగిల్ అడ్వెంచరస్ కథకి డివోషినల్ టచ్ ఇచ్చాడట. ఆగస్ట్లో రాజమౌళి రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే కూడా ఇది నిజమనే తెలుస్తుంది. అందులో మహేశ్ మెడలో నంది, త్రిశూలం-ఢమరుకం లాకెట్ ఉంది. అది చూస్తే.. ఇందులో డివోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన ‘వారణాసి’ టైటిల్ కూడా ఆ పుకారుకి మరింత బలం చేకూర్చింది.నవంబర్లో క్లారిటీ!రాజమౌళి చిత్రాల టైటిల్స్ యూనిక్గా ఉంటాయి. కథకు తగ్గట్లుగా టైటిల్స్ పెట్టడంలో ఆయన దిట్ట. ఇప్పుడు మహేశ్ సినిమాకు వారణాసి అని పెట్టినట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ కూడా అన్ని భాషలకు అర్థమయ్యేలా ఉంది. కానీ జక్కన్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి ఈ టైటిల్ ఇండియా మినహా మిగతా ప్రపంచానికి అర్థమవుతుందా? అక్కడ వేరే టైటిల్తో రిలీజ్ చేస్తాడా? అసలు వారణాసి టైటిల్ ఫైనల్ అయిందా లేదా అనేది తెలియాలంటే.. నవంబర్ వరకు ఆగాల్సిందే. (చదవండి: ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకోలేను..రూమర్స్పై స్పందించిన రష్మిక)నవంబర్ 16న సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో వారణాసి నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేశారట. అందులోనే మేజర్ సన్నివేశాలన్నీ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఫోక్ సాంగ్?ఈ సినిమాలో ఓ ఫోక్ సాంగ్ కూడా ఉంటుందట. ఇప్పటికే సంగీత దర్శకుడు కీరవాణీ ఓ జానపద బాణీని రాజమౌళికి ఇచ్చాడట. అది ఆయనకు బాగా నచ్చిందట. ట్రయల్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మహేశ్-ప్రియాంక చోప్రాల మధ్య ఆ సాంగ్ ఉంటుందట. ఆ ఫోక్ సాంగ్కి వీరిద్దరు వేసే ఊరమాస్ స్టెప్పులు అదిరిపోతాయట. మొత్తానికి ‘నాటు నాటు’ ని మించేలా ఆ పాటను తీర్చి దిద్దాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. -
ఉద్యోగం వదిలేశా..‘అరి’ కోసం హిమాలయాలకు వెళ్లా : డైరెక్టర్ జయశంకర్
‘నాకు చిన్నప్పటి నుంచి పురాణాలు, ఇతిహాసాలు అంటే ఆసక్తి. వాటి గురించి తెలుసుకుని, అవగాహన పెంచుకున్నాను. మన పురణాల్లో అరిషడ్వర్గాలను జయించాలి అని చెప్పారే తప్ప ఎక్కడా వాటిని ఎలా జయించాలో చెప్పలేదు. 2016లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. హిమాలయాలకు వెళ్లి కొందరు యోగులను కలిసి అరిషడ్వర్గాల గురించి సినిమా చేయాలనే ఆలోచనను తెలిపాను. వారు మంచి ప్రయత్నమని చెప్పి అనేక విషయాలు వెల్లడించారు. అరిషడ్వర్గాలను జయించేందుకు వారి ద్వారా మార్గాలు, సూచనలు తెలుసుకున్నాను. వాటి ఆధారంగానే ‘అరి’ చిత్రాన్ని రూపొందించాను’ అన్నారు దర్శకుడు జయ శంకర్. ‘పేపర్ బాయ్’లాంటి సూపర్ హిట్ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘అరి’. . వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు జయశంకర్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ సినిమాల మీద ప్యాషన్ తో మంచి ఉద్యోగం వదులుకుని ఇండస్ట్రీకి వచ్చాను. 2014లో టాలీవుడ్ లో అడుగుపెట్టి నాలుగేళ్లకు 2018లో పేపర్ బాయ్ మూవీతో దర్శకుడిని అయ్యాను. తక్కువ టైమ్ లోనే దర్శకుడివి అయ్యావు అన్నారు. నా మొదటి సినిమా తర్వాత పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే కోవిడ్, ఇతర పరిస్థితుల వల్ల ఆ ప్రాజెక్ట్స్ మొటీరియలైజ్ కాలేదు. అప్పుడు బయటకు వచ్చి 2021లో అరి మూవీకి వర్క్ చేయడం ప్రారంభించాను.→ ‘అరి’ లాంటి మూవీని స్టార్స్ కూడా చేయొచ్చు. అయితే పాత్రల కంటే వారి స్టార్ డమ్ రిఫ్లెక్ట్ అవుతుందని పాత్రలకు సరిపోయేలా సాయి కుమార్, అనసూయ, వైవా హర్ష ..ఇలాంటి వారిని తీసుకున్నాను. ఆరు ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటుల పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ పాత్రలన్నీ మీకు బాగా గుర్తుండిపోతాయి. ఇలాంటి కథల్ని పూర్తిగా సందేశాత్మకంగా కాకుండా ఎంటర్ టైనింగ్ గా చెప్పాలి. ఆ ప్రయత్నంలో సఫలమయ్యాననే అనుకుంటున్నా. వైవా హర్ష కామెడీ బాగా నవ్విస్తుంది.→ నాకు ఉపేంద్ర గారి మూవీస్ బాగా ఇష్టం. ఆయన సినిమాలు కమర్షియల్ గా ఉంటూనే ఒక మెసేజ్ ఉంటుంది. ఉపేంద్ర మూవీ చూసినప్పుడు అలా ఒక సినిమా తెరకెక్కించాలనే ఆలోచన కలిగింది. ‘అరి’ కథ చెప్పినప్పుడు మా మూవీలో నటించిన ఆర్టిస్టులంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఇలాంటి సబ్జెక్ట్ తో మూవీ రాలేదని అన్నారు.→ మా ‘అరి’ మూవీలో వీఎఫ్ఎక్స్ ఆకర్షణగా నిలుస్తాయి. మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు చేశాం. అలాగే ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించాం. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మనిషి కోరికలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడే ఉంటాయి. మనం కోరుకున్నది దక్కినప్పుడు అహం ఏర్పడుతుంది, అదే పక్కవారికి దక్కితే అసూయ కలుగుతుంది.→ అరిషడ్వర్గాలు అనే సబ్జెక్ట్ సాధారణ ప్రేక్షకులకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా ‘అరి’ సినిమాను రూపొందించాను. ఈ కారణం వల్లే చిత్రీకరణ ఆలస్యమైంది. వీలైనంత సింపుల్ గా ఈ సబ్జెక్ట్ ను తెరకెక్కించాం. సెన్సార్ వాళ్లు సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. హార్ట్ టచింగ్ గా మూవీ రూపొందించారని ప్రశంసించారు. మా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నా. ఎందుకంటే మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.→ వెంకయ్య నాయుడు, మల్లాది, యండమూరి లాంటి వాళ్లు మా సినిమాను చూసి అభినందించారు. వెంకయ్య నాయుడు ‘అరి’ సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉంది అన్నారు. పురణాలు, ఇతిహాసాలు చదవని యువత ఈ సినిమా చూస్తే వాటిలోని సారం తెలుస్తుంది అన్నారు. ఆయన మాటల్ని గొప్ప ప్రశంసగా తీసుకున్నాం.→ ఈ మూవీ యూత్ ఆడియెన్స్ కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు మా మూవీ ఏం జరుగుతుంది నెక్ట్స్ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. తమకు కావాల్సినది దక్కించుకునేందుకు కొందరు వ్యక్తులు ఏం చేశారు అనేది ఈ చిత్ర నేపథ్యం. ఈ మూవీని హిందీలో ఒక పెద్ద హీరో, కన్నడలో ఒక స్టార్ చూశారు. వారికి బాగా నచ్చింది. అన్నీ కుదిరితే వారితో ఆయా భాషల్లో ‘అరి’ రీమేక్ చేస్తా.→ మన దేశంలో పబ్బులకు వెళ్లేవాళ్లు ఎంతమంది ఉన్నారో, గుడికి వెళ్లేవారు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. అలా స్పిరిచువల్ ఆలోచనలు ఉన్నవారు మా సినిమాను చూసినా చాలు అనుకుంటున్నాం.→ త్వరలోనే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్ నుంచి ఆ మూవీ షూటింగ్ కు వెళ్తున్నాం. -
కన్నడలో బ్యాన్.. స్పందించిన రష్మిక!
ఈ మధ్య రష్మిక(Rashmika Mandanna ) పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఒకపక్క కెరీర్..మరోపక్క పర్సనల్ విషయాల్లో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ఇటీవల విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరోవైపు రష్మిక నటించిన తాజా చిత్రం ‘థామా’(Thama)ని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. అక్టోబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అఅయితే రష్మిక సొంత రాష్ట్రం అయిన కర్ణాటకలో మాత్రం విడుదల కాదని.. కన్నడ ఇండస్ట్రీ ఆమెను బహిష్కరించిందనే వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్పై రష్మిక స్పందించింది. ఇప్పటివరకు తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని వెల్లడించింది. అపార్థం చేసుకోవడం వల్లే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని ఆమె అన్నారు.ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకోలేను కన్నడ చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ అదే ప్రాంతానికి చెందిన రష్మిక మాత్రం ఈ చిత్రంపై స్పందించలేదు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది. థామా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..‘ఏ సినిమా రిలీజ్ అయినా..నేను రెండు, మూడు రోజుల్లోనే చూడలేను. కాంతార కూడా విడుదలైన కొన్ని రోజుల తర్వాత చూశాను. చిత్రబృందాన్ని అభినందిస్తూ మెసేజ్ కూడా చేశా. వాళ్లు నాకు ధన్యవాదాలు కూడా తెలిపారు. తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మన వ్యక్తిగత విషయాలన్నీ కెమెరా ముందుకు తీసుకురాలేం కదా. ప్రతి విషయాన్ని ఆన్లైన్లో పంచుకునే వ్యక్తిని కాదు. . అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను. వాళ్లు నా నటన గురించి ఏం మాట్లాడతారు అనేదే నాకు ముఖ్యం. దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాను’ అని రష్మిక అన్నారు. -
వింటేజ్ రవితేజను గుర్తుచేస్తున్న 'హుడియో హుడియో'
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాటను రిలీజ్ చేశారు.'హుడియో హుడియో' అంటూ సాగే ఈ గీతాన్ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో హుషారుగా ఉండేలా తనదైన శైలిలో అద్భుతంగా స్వరపరిచారు. మాస్ చిత్రానికి తగ్గట్టుగా ఓ సరికొత్త మెలోడీని అందించారు. సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ తన మనోహరమైన స్వరంతో భీమ్స్తో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
గాయంతోనూ షూటింగ్.. రవితేజ సహజ నటుడు : శ్రీలీల
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara). భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్గా నటించింది.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల పలు మార్లు వాయిదా పడుతూ.. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేఫథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెచ్చింది చిత్రబృందం. తాజాగా యాంకర్ సుమతో కలిసి ఒక ఫన్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో రవితేజపై హీరోయిన్ శ్రీలీల ప్రశంసల వర్షం కురిపించింది.ఆయనతో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉంటుందని, అత్యంత ఆహ్లాదకరమైన సహనటులలో ఆయన ఒకరని శ్రీలీల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.రవితేజ అంకితభావం గురించి మాట్లాడుతూ.. గాయంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన ఆసుపత్రికి వెళ్లే ముందు 'తూ మేరా లవర్' పాటను పూర్తి చేసి, తన నిబద్ధతను చాటుకున్నారని శ్రీలీల కొనియాడారు. మాస్ జతారలో తాను సైన్స్ టీచర్గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఉల్లాసభరితమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తానని ఆమె వెల్లడించారు. తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా ఇది ఉంటుంది. స్క్రిప్ట్ చదివినప్పుడే తాను నవ్వుకున్నానని, ఇక సెట్ లో దానిని ప్రదర్శించే సమయంలో ఆ నవ్వులు రెట్టింపు అయ్యాయని శ్రీలీల పేర్కొన్నారు.రవితేజ ఈ సినిమాలో తాను పోషించిన ఆర్పిఎఫ్(రైల్వే పోలీస్ ఫోర్స్) అధికారి పాత్ర గురించి మాట్లాడుతూ, ఇది తన సినీ ప్రయాణంలో ప్రత్యేకమైన పాత్ర అని అభివర్ణించారు. అలాగే చిత్ర దర్శకుడు భాను భోగవరపు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోపై ప్రశంసలు కురిపించారు. భాను ప్రతిభావంతుడని, చిత్రీకరణ సమయంలో కూడా సన్నివేశాన్ని ఇంకా మెరుగ్గా మలచడానికి ప్రయత్నిస్తుంటాడని, చాలా వేగంగా మార్పులు చేయగలడని కొనియాడారు. భీమ్స్ ఎంతో కృషి చేసి, ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడని అన్నారు. ఇక మాస్ జాతర సినిమా గురించి మాట్లాడుతూ.. వినోదం, మాస్ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలతో నిండి ఉంటుందని తెలిపారు. -
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి : వరుణ్ సందేశ్
‘నా కెరీర్ లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం "హ్యాపీడేస్" 2007లో ఇదే నెలలో విడుదలై, ఘన విజయం సాధించి, నా కెరీర్ నే మలుపు తిప్పింది. అందుకే నా జీవితంలో అక్టోబర్ మాసం గుర్తుండి పోయింది. ఇప్పుడు కానిస్టేబుల్ చిత్రం కూడా ఇదే నెలలో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు.వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని మలచడం జరిగింది. కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, సందేశం వంటి అంశాలను మిళతం చేసి రూపొందించడం జరిగింది" అని అన్నారు.నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ, "ఈ చిత్రానికి సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 10న చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నాం. ఒక అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని చూపించాం. అమ్మాయిలతో పాటు తల్లి తండ్రులు కూడా ఈ సినిమాను చూడాలి" అని అన్నారు.దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన సినిమా పట్ల మా నమ్మకాన్ని పెంచింది. నిర్మాత కథను నమ్మి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఈ సినిమా తెరపైకి వచ్చింది" అని అన్నారు. -
ఇన్స్టాలో చాటింగ్.. లవ్స్టోరీ బయటపెట్టిన నాగ చైతన్య
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఎక్కువ సమయంలో సతీమణి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala)కే కేటాయిస్తున్నాడు. ఖాలీ సమయం దొరికితే భార్యతో కలిసి ఫారిన్ ట్రిప్కి వెళ్తున్నారు. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా తన ప్రేమ కథను చెబుతూ.. శోభితను పొగడ్తలతో ముంచేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభితతో ఎలా ప్రేమలో పడ్డాడో వివరించాడు.(చదవండి: ‘బుజ్జితల్లి’ పాట వల్ల శోభిత నాతో గొడవపడింది : నాగ చైతన్య)ఓ టీవీ చానల్లో జగపతి బాబు నిర్వహిస్తున్న టాక్ షోకి వెళ్లిన నాగ చైతన్య.. తన ప్రేమ కథ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సోషల్ మీడియా వల్లే వీరిద్దరికి పరిచయం ఏర్పడి..అది కాస్త ప్రేమ, పెళ్లి వరకు దారి తీసిందట. ‘ఓ సారి నేను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నా క్లౌడ్ కిచెన్ 'షోయు' గురించి పోస్ట్ పెట్టాను. దానికి శోభిత ఎమోజీతో కామెంట్ చేసింది. వెంటనే నేను రిప్లై ఇచ్చాను. అలా చాటింగ్ ద్వారా మేమిద్దరం క్లోజ్ అయ్యాం. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. నా జీవిత భాగస్వామిని ఇన్స్టాగ్రామ్ ద్వారా కలుస్తానని అస్సలు ఊహించుకోలేదు’ అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అదే షోలో ‘మీరు ఏది లేకుండా జీవించలేరు’ అని జగపతి బాబు అడగ్గా.. చైతన్య వెంటనే ‘నా భార్య శోభిత’ అని సమాధానమిచ్చాడు. తన జీవితంలో శోభితకు అధిక ప్రాధాన్యత ఉందని చైతూ చెప్పారు.కాగా, నాగచైతన్య-శోభితల పెళ్లి గతేడాది డిసెంబర్లో జరిగింది. అంతకు ముందు 2017లో సమంతను ప్రేమ వివాహం చేసుకున్న చైతూ.. 2021లో విడాకులు ఇచ్చాడు. కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉండి.. 2024లో శోభితను రెండో వివాహం చేసుకున్నాడు.కొద్దిమంది అతిథుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుక అట్టహాసంగా ముగిసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నాడు. -
గాంధీజీపై నటుడు శ్రీకాంత్ భరత్ అనుచిత వ్యాఖ్యలు
మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గాంధీ మహాత్ముడా? జాతిపితనా? అంటూ రాయడానికి వీల్లేని బూతుపదాలతో దూషించాడు. దీనికి సంబంధించిన వీడియోని స్వయంగా ఆయనే ఎక్స్లో షేర్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. వీడియోలో ఏముంది?గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 శ్రీకాంత్ భరత్.. గాంధీజీని దూషిస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాజాగా శ్రీకాంత్ భరత్ మరో వీడియోని షేర్ చేశాడు. అందులో గాంధీజీ స్త్రీలోలుడని, ఏంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఆరోపించాడు. ‘నమస్కారం. నేను శ్రీకాంత్ భరత్. నేను ఏ పోస్టు పెట్టినా కామెంట్స్ బాగా వస్తున్నాయి. అయినా నేను పెద్దగా పట్టించుకోను. కానీ అక్టోబర్ 2న ఓ పోస్టు పెడితే.. చాలా బూతులు తిట్టారు. నేను కామెంట్ చేసిన వ్యక్తి గురించి మీకు ఏం తెలుసురా? అంటూ శ్రీకాంత్ భరత్ రెచ్చిపోయారు. గాంధీజీ జాతిపిత అయితే తాను సిటిజన్ ఆఫ్ బాస్టర్డ్ అంటూ’ ధైర్యం ఉంటే ఈ వీడియో చూడండి.. ఇది నిజం’ అని ఎక్స్లో రాసుకొచ్చాడు. శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలపై గాంధీయ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసలు వీడు ఇంత వాగుతున్నా కూడా పోలీస్ లు ఏం చేస్తున్నారు?? ఫాదర్ ఆఫ్ నేషన్ నీ ఇలా ఎవరైనా ఎలా పడితే అలా మాట్లాడొచ్చా సార్ ’ అంటూ హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘నువ్వు మానసిక సన్యాసి లా ఉన్నావ్. చరిత్ర అసలు తెలియదు. విగడ్ ఆస్పత్రిలో చూపించుకో’ అని మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. మరికొంత మంది శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలను సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.గతంలోనూ..నటుడు శ్రీకాంత్ భరత్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులపై ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. సినీ క్రిటిక్స్ని బూతులు తిడుతూ విడియో పెట్టి.. తర్వాత క్షమాపణలు చెప్పాడు. కొన్నాళ్లకు మరోసారి రివ్యూవర్స్పై రాయడానికి వీల్లేని పదాలతో రెచ్చిపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా జాతిపితపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నటనతో కంటే ఇలాంటి వివాదస్పద పోస్టులతోనే శ్రీకాంత్ భరత్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. Dare to WATCH?!?!?!THE TRUTH!!!!!!! pic.twitter.com/0Y0kO2cvDP— Shrikanth BHARAT (@Shri__Bharat) October 6, 2025 -
ఇది ఐదో నెల సీమంతం.. మళ్లీ గ్రాండ్గా జరుపుకుంటా!: శివజ్యోతి
బిగ్బాస్ ఫేమ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శివజ్యోతి (Shiva Jyothi) త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. వచ్చే ఏడాది తన పొత్తిళ్లలోకి పండంటి బిడ్డ రానుందని ఈ మధ్యే ప్రెగ్నెన్సీ వార్తను షేర్ చేసింది. పెళ్లయిన పదేళ్లకు తల్లి కాబోతుండటంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా శివజ్యోతి సీమంతం జరిగింది. మా ఇద్దరి హృదయాలు ఓ చిన్ని గుండెచప్పుడి కోసం ఎదురుచూస్తున్నాయంటూ ఐదో నెల సీమంతం ఫోటోలను షేర్ చేసింది.మీరు లేకుండా ఎలా?ఇది చూసిన చాలామంది మమ్మల్ని ఎందుకు పిలవలేదు అక్కా? అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో శివజ్యోతి.. ఇది ఊర్లో జరిగిన వేడుక అని.. 7 లేదా 9వ నెలలో మళ్లీ ఘనంగా సీమంతం వేడుకలు జరుపుకుందామని చెప్పుకొచ్చింది. మీరు నాకు చాలా ఇంపార్టెంట్, నా బిడ్డ కోసం మీరంతా ఎదురుచూశారు. మీరు లేకుండా నా సీమంతం ఎలా జరుగుతుంది? అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. అంటే మరోసారి ఈ వేడుకను మరింత గ్రాండ్గా జరుపుకోనుందన్నమాట!ఎవరీ శివజ్యోతి?శివజ్యోతి.. తీన్మార్ వార్తలతో సావిత్రిగా గుర్తింపు పొందింది. తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అక్కడినుంచి బిగ్బాస్ మూడో సీజన్లో అడుగుపెట్టి పాపులారిటీ దక్కించుకుంది. ఈ షోలో టాప్ 6 కంటెస్టెంట్గా నిలిచింది. ఈ రియాలిటీ షో తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. యూట్యూబ్ వీడియోలు చేస్తూ షోలలో పాల్గొంటూ బాగానే సంపాదించింది. తన ఊరికి చెందిన గంగూలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Ganguly Mantri (@ganguly_manthri) చదవండి: రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి -
రచయిత కోన వెంకట్ కూతురి రిసెప్షన్.. హాజరైన చిరంజీవి
ప్రముఖ సినీరచయిత కోన వెంకట్ (Kona Venkat) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. రచయిత రెండో కూతురు శ్రావ్య వివాహం ఘనంగా జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, రామ్ పోతినేని, అంజలి, రామ్గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, బాబీ, కోర్ట్ జంట శ్రీదేవి- హర్ష్ రోషన్ తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు. పూరీ జగన్నాథ్- చార్మి ఒకే కారులో వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.కోన వెంకట్ జర్నీకోన వెంకట్ సినిమా ఇండస్ట్రీలో కథా, సంభాషణల రచయితగా కెరీర్ ప్రారంభించాడు. ఢీ, రెడీ, దూకుడు, అదుర్స్, గీతాంజలి, అల్లుడు శీను, నిన్ను కోరి వంటి పలు హిట్ చిత్రాలకు రచయితగా వ్యవహరించాడు. చివరగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. సత్య, దిల్సే, కౌన్, జంగల్, కంపెనీ వంటి కొన్ని హిందీ సినిమాలకు తెలుగు డబ్బింగ్ రైటర్గానూ పని చేశాడు. MEGASTAR #Chiranjeevi garu at Kona Venkat daughter’s wedding@KChiruTweets #MegastarChiranjeevi pic.twitter.com/XvYz3tk3t0— Chiruholic (@chiruholicc) October 6, 2025 చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ -
సిగ్గులేని మనిషి.. పుట్టబోయే బిడ్డ శాపం తగులుతుంది!
జిల్లా, వేలైక్కారన్, మెర్సల్ తదితర చిత్రాల్లో కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసిన జాయ్ క్రిజిల్డా (Joy Crizildaa) ప్రముఖ చెఫ్, నటుడు మాధంపట్టి రంగరాజ్తో పరిచయం పెంచుకుంది. మాధంపట్టి రంగరాజ్కు అప్పటికే వివాహితుడు కాగా, జాయ్ క్రిజిల్డాను రెండో పెళ్లి చేసుకున్నాడు. జాయ్ క్రిస్టిల్డా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తాను గర్భవతి అని ప్రకటించింది. కానీ ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు.మోసం చేశాడన్న కాస్ట్యూమ్ డిజైనర్మాధంపట్టి రంగరాజ్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ జాయ్ క్రిజిల్డా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తన కడుపులో పెరిగే బిడ్డకు రంగరాజ్ బాధ్యత వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత వారం జాయ్ను దాదాపు 6 గంటలపాటు విచారించారు. త్వరలోనే మాధంపట్టి రంగరాజ్ను కూడా విచారించనున్నారు. ఈ స్థితిలో జాయ్ క్రిజిల్డా శనివారం తన సోషల్ మీడియా పేజీలో ఒక సంచలనాత్మక పోస్ట్ చేసింది.సిగ్గులేని మనిషి“ఒక వ్యక్తి ఎలాంటి అపరాధ భావన లేకుండా తిరుగుతాడు. అతను గర్వంగా తల పైకెత్తి నడుస్తాడు. నువ్వు మంచివాడివిగా నిన్ను నువ్వు నిరూపించుకుంటూనే ఉన్నావు. నీలాంటి సిగ్గులేని మనిషిని ఇంతవరకు చూడలేదు. నువ్వు పరిగెత్తినా, దాక్కున్నా, పుట్టబోయే బిడ్డ శాపం నీడలా నిన్ను అనుసరిస్తుంది. అది నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్లదు’ అని రాసుకొచ్చింది. మరో పోస్ట్లో బిడ్డ పుట్టకముందే వదిలేసి వెళ్లిపోయావ్, నువ్వేం తండ్రివి అని తిట్టిపోసింది. View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa) చదవండి: రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా! -
రజినీకాంత్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశా!
ప్రదీప్ రంగనాథన్, నటి మమిత బైజు జంటగా నటిస్తున్న చిత్రం డ్యూడ్ (Dude Movie). సుధా కొంగర వద్ద ఏడెనిమిది సంవత్సరాలు సహాయ దర్శకుడిగా పని చేసిన కీర్తిశ్వరన్ ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగారి అనే పాటను రిలీజ్ చేశారు.అలా కథ చెప్పాఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి ద్వారా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేతలకు ఈ కథను చెప్పే అవకాశం కలిగిందన్నారు. వాళ్లకు కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. రజనీకాంత్ 30 ఏళ్ల వయసును దృష్టిలో పెట్టుకొని డ్యూడ్ కథ రాసినట్లు తెలిపారు. ఈ పాత్రలో నటుడు ప్రదీప్ రంగనాథన్ ఒదిగిపోయారన్నారు. ఇది లవ్ సబ్జెక్ట్ అయినప్పటికీ మాస్ యాంగిల్స్ కూడా ఉంటాయన్నారు. ఒక దర్శకుడిగా తన తొలి చిత్రం దీపావళికి విడుదల కావడం అనేది.. తన కల నిజం అవుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ప్రేమలుకు ముందే..ప్రేమలు చిత్రం విడుదలకు ముందే నటి మమిత బైజు నటించిన సూపర్ శరణ్య చిత్రాన్ని చూసి ఆమెను తమ చిత్రం కోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ఆమె ఈ చిత్రంలోకి రాగానే రజనీకాంత్, శ్రీదేవి జంటగా నటించినట్లు అనిపిస్తోందన్నారు. నటుడు శరత్ కుమార్, రోహిణి, పరిదాపంగాల్ ఫేమ్ డేవిడ్ తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు.చదవండి: విలన్ రోల్స్ చేస్తున్న హీరోయిన్స్ -
ఆకట్టుకుంటున్న ‘ఏమి మాయ ప్రేమలోన' పాట
అనిల్ ఇనుమడుగు హీరోగా, వేణి రావ్ హీరోయిన్ గా తెరకెక్కిన ' ఏమి మాయ ప్రేమలోన' మ్యూజిక్ ఆల్బం కు మంచి ఆదరణ లభిస్తోంది. లీడ్ రోల్ లో నటించిన అనిల్ ఇనుమడుగు ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం. మార్క్ ప్రశాంత్ సంగీతం అందిచిన ఏమి మాయ ప్రేమలోన' సాంగ్ ను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు.కేరళలో టూరిస్ట్ గైడ్గా పని చేసే ఓ అనాథ కుర్రాడి జీవితంలో ఓ మేఘాలు కమ్ముకున్న రోజు కనిపించిన మేఘాల మధ్యన దాగిన మెరుపులా ఆ కుర్రాడికి తారాసపడిన ఆ అమ్మాయి ప్రేమని గెలుచుకునే ఓ సున్నితమైన కథాంశం నేపధ్యంలో తెరకెక్కిన ఏమి మాయ ప్రేమాలోన సాంగ్ దసరా కానుకగా యూట్యూబ్ లో రిలీజ్ అయి భారీ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తోంది. కాన్సెప్ట్ తో పాటు డైరెక్షన్ కూడా మెచ్చుకోదగిన విధంగా ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉందని చెప్పాలి. కేరళలోని లొకేషన్స్ ను చూడముచ్చటగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ శ్రవణ్. ప్రతి ఫ్రెమ్ ను రిచ్ గా మలిచాడు. లీడ్ రోల్స్ చేసిన అనిల్, వేణి రావ్ జోడి బాగుంది. స్క్రీన్ మీదా ఇద్దరు సహజంగా నటించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పది నిమిషాల నిడివి కలిగిన ఏమి మాయ ప్రేమలోన సాంగ్ ను అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో యంగ్ నిర్మాతలు అజయ్, విష్ణు నిర్మించారు. -
‘కాంతార’ కథ వెనుక పెద్ద కథే ఉందిగా!
రిషబ్ శెట్టి(Rishab Shetty ) దర్శకత్వం వహించి, నటించిన ‘కాంతార చాప్టర్ 1’(Kantara: Chapter 1)ఇప్పుడు బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. విడుదలైన తొలి రోజే(అక్టోబర్ 2) ఈ చిత్రం రూ. 89 కోట్ల మేర వసూళ్లను సాధించింది. వీకెండ్లోగా రూ. 300 కోట్లు ఈజీగా రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంతార మాదిరే ప్రీక్వెల్గా వచ్చిన కాంతార చాప్టర్ 1 కూడా సూపర్ హిట్ కావడం పట్ల రిషబ్ శెట్టి ఆనందం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అసలు ఈ కథ రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందో వివరించాడు. తన ఊర్లో జరిగిన ఓ గొడవే ఈ సినిమా కథను రాసేలా చేసిందని ఆయన చెప్పారు. ‘20 ఏళ్ల క్రితం మా గ్రామంలో జరిగిన ఓ సంఘటన ‘కాంతార’ కథకు పునాది వేసింది. వ్యవసాయ భూమి కోసం ఒక రైతు, అటవీ శాఖ అధికారి మధ్య ఘర్షణ జరిగింది. అది నాకు ఇద్దరి మనుషుల మధ్య గొడవలా అనిపించలేదు. ప్రకృతిని కాపాడే వారి మధ్య ఘర్షణలా చూశాను. ఈ అంశంతోనే కథను రాయాలనుకున్నాను. మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించడం ప్రారంభించాను. ఈ క్రమంలో గ్రామీణ ప్రజల సంప్రదాయాలపై దృష్టి పెట్టి ‘కాంతార’ కథను రాశాను’ అని రిషబ్ చెప్పుకొచ్చాడు. కాంతార, కాంతార చాప్టర్ 1 కథలు కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతల్లో ప్రసిద్ధి చెందిన భూతకోల నేపథ్యంలో సాగుతుందన్న సంగతి తెలిసిందే. -
ఆయన రూ. 50 ఇస్తేనే తినేవాడిని.. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు: మహేశ్ విట్టా
మహేశ్ విట్టా.. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి... షార్ట్ ఫిల్మ్స్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చి కమెడియన్గానూ ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ మూడో సీజన్లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బిగ్బాస్ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు. తండ్రి కూడా అయ్యాడు. మంచి ఫేం అయితే సంపాదించాడు కానీ ఆర్థికంగా మాత్రం ఇంకా స్థిరపడలేదంటున్నాడు మహేశ్. ఇప్పటికీ ఆయనకంటూ సొంత ఇల్లు లేదట. తనకే కాదు తన ఫ్యామిలీ వాళ్లకు కూడా ఆస్తులేమి లేవని అంటున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న మహేశ్.. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.సినిమాలంటే పిచ్చి..నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. ఇంటర్ అయిపోగానే నేను సినిమాల్లోకి వెళ్తా అని ఇంట్లో చెప్పా. మా వాళ్లు..చదువు అంతా పూర్తయిన తర్వాత పంపిస్తా అన్నారు. దీంతో కడప ప్రొద్దుటూరులోనే డిగ్రీ పూర్తి, హైదరాబాద్లో ఎంసీఏ పూర్తి చేశా. ఒక ఏడాది పాటు ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకి చెప్పి ఇండస్ట్రీకి వచ్చా. డైరెక్టర్ కావాలని నా ఆశ. వచ్చిన మూడు నెలల్లోనే నాకు ఫన్ బకెట్ సిరీస్ చాన్స్ వచ్చింది. దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్. కానీ అనుకోకుండా నేను నటించాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్లు యాక్టింగ్ చేస్తేనే డబ్బులు ఇస్తా అన్నారు. దీంతో ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూనే యాక్టింగ్ చేశా. తినడానికి డబ్బులు లేకుంటే.. ఊరికనే ఆఫీస్కి వెళ్లి అటు ఇటు తిరిగేవాడిని. ఎవరైనా అడిగితే డైరెక్టర్ హర్ష పిలిచాడని అబద్దం చెప్పేవాడిని. ఆయన అడిగితే మేడం పిలిచిందని చెప్పేవాడి. ఆయనే అర్థం చేసుకొని రూ. 50 జేబులో పెట్టి తిని రమ్మని చెప్పేవాడు. అలా నన్ను ఆరు నెలల పాటు చంటి పిల్లాడిలా కాపాడాడు. ఇక్కడ లేదు.. ఊర్లో లేదు..ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చా. మంచి ఫేం అయితే సంపాదించా కానీ డబ్బులు మాత్ర జమ చేయలేదు. ఇప్పటి వరకు నాకంటూ సొంత ఇల్లు లేదు. సిటీలోనే కాదు ఊర్లో కూడా నాకు ఇల్లు లేదు. మా ఫ్యామిలీ పేరున ప్రాపర్టీస్ కూడా లేవు. ఉన్నంతలో సంతోషంగా అయితే ఉన్నాం. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కోటి రూపాయలు సంపాదిస్తే చాలు హ్యాపీగా బతకొచ్చు అనుకున్నా. కానీ కోటీ రూపాయలు జమ చేయాలంటే ఎన్ని సినిమాలు చేయాలి? పైగా ఇక్కడ చాలా వరకు డబ్బులు రావు. చాలామంది నిర్మాతలు నాకు డబ్బులు ఎగ్గొట్టారు. షూటింగ్ అంతా పూర్తయ్యాక.. డబ్బులు ఇవ్వమని ముఖంపైనే చెప్పేవాళ్లు. కొంతమంది అకౌంట్లో వేస్తామని చెప్పి.. వేయరు. గట్టిగా అడుగుదామంటే.. మిగతావాళ్లకు ఎక్కడ తప్పుగా చెప్పి అవకాశాలు రాకుండా చేస్తారోననే భయం. నాకే కాదు ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులది ఇదే పరిస్థితి’ అని మహేశ్ చెప్పుకొచ్చాడు. -
హాలీవుడ్లో తెలుగోడి ‘కింగ్ బుద్ధ’
టాలీవుడ్ దర్శక,నిర్మాత సత్యారెడ్డి హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.ప్రపంచ శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో 'కింగ్ బుద్ధ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గ్రాండ్గా జరిగింది.ఈ ఈవెంట్కు మూడుసార్లు కెడర్ పార్క్ మేయర్గా పనిచేసిన మ్యాట్ పోవెల్ చీఫ్ గెస్ట్గా హాజరై, 'కింగ్ బుద్ధ' పోస్టర్ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ‘గౌతమ బుద్ధుడు ప్రపంచ శాంతి కోసం అమితమైన కృషి చేశారు. ఒక టాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి ఈ సినిమాను టాలీవుడ్ లేదా బాలీవుడ్లో తీసి హాలీవుడ్లో డబ్బింగ్ చేయకుండా, డైరెక్ట్గా హాలీవుడ్లోనే నిర్మించడం చాలా సంతోషకరం. తెలుగు సంతతికి చెందిన వ్యక్తిగా భారీ బడ్జెట్తో హాలీవుడ్లో సినిమా తీస్తున్న సత్యారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు" అని పేర్కొన్నారు.చిత్ర నిర్మాతల్లో ఒకరైన శైలర్ మాట్లాడుతూ.. గతంలో సత్యారెడ్డి దర్శకత్వం వహించిన 'ఉక్కు సత్యాగ్రహం' సినిమాలో గద్దర్ నటించారు. షూటింగ్ సమయంలో గద్దర్ బుద్దుడి శాంతి ప్రవచనాలు చూసి ఆకర్షితులైనట్లు పేర్కొన్నారు. ఆ సినిమాను చూసినప్పుడే సత్యారెడ్డి డైరెక్షన్లో ప్రపంచ శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో 'కింగ్ బుద్ధ'ను పూర్తిస్థాయిలో హాలీవుడ్లో నిర్మించాలని నిర్ణయించుకున్నాము. డైరెక్టర్ సత్యారెడ్డి చెప్పిన స్టోరీతో ఇప్పుడు ఆ కల నెరవేరబోతోంది అన్నారునటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, రచయితగా, గాయకుడుగా 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నేను, ప్రపంచ శాంతి కోసం 'కింగ్ బుద్ధ' కాన్సెప్ట్ను నా నిర్మాతలకు చెప్పగానే వారు భారీ బడ్జెట్తో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అతి త్వరలో ఇండియాలోని ఒక ప్రముఖ బౌద్ధారామంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం’ అని సత్యారెడ్డి అన్నారు. -
సుహాస్-సూరి సినిమా షూటింగ్లో ప్రమాదం.. వీడియో వైరల్
సుహాస్, సూరి కలిసి నటిస్తున్న ‘మండాడి’ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కొన్ని సన్నివేశాలను సముద్రంలో చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ఉన్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోయారు. రామనాథ పురం జిల్లా తొండి అనే సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి నీట మునిగిపోయింది.మండాడి విషయానికొస్తే.. క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు నటుడు సుహాస్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదే సినిమా తెలుగులో సుహాస్ హీరోగా సూరి విలన్గా కనిపించనున్నాడు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. Video - A boat capsized during the shooting of #Soori's film #Mandaadi, causing damage to the cameras on board....🫣- This kind of accident happened while the shooting of this film was taking place at a location called Thundi in Ramanathapuram....🥹pic.twitter.com/yDjTrLOHT1— Movie Tamil (@_MovieTamil) October 4, 2025 -
సింగర్గా మారిన వెన్నెల కిశోర్.. పాటతోనూ నవ్వించేశాడు!
స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ సింగర్ గా మారారు. ఇన్నాళ్లు తన హావభావాలతో అలరించిన ఈ కమెడియన్..ఇకపై తన గాత్రంతోనూ ఆకట్టుకోనున్నాడు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో 'అనుకుందొకటిలే..'అనే పాటను ఆయన ఆలపించాడు. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో గర్భగుడి వెల్ నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పంచనున్నారు. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన కథానాయకుడికి ధైర్యం చెబుతున్న సందర్భంలో డాక్టర్ భ్రమరం పాత్ర నేపథ్యంగా 'అనుకుందొకటిలే..' పాటను ఆకట్టుకునేలా రూపొందించారు.'అనుకుందొకటిలే..' పాట ఎలా ఉందో చూస్తే - అనుకుందొకటిలే, అయ్యిందొకటిలే,అయిపోలేదులే, గేరే మార్చులే, భ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే, కళ్లే మూసుకో, నన్నే నమ్ముకో.. అంటూ వినోదాత్మకంగా సాగుతుందీ పాట. ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేయగా, బాలవర్థన్ లిరిక్స్ అందించారు. వెన్నెల కిషోర్ ప్రొఫెషనల్ సింగర్ లా పాడి ఆకట్టుకున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. -
అశ్లీలతకు తావు లేకుండా ఓ మంచి సినిమాను చేశాం : హీరో రక్షిత్ అట్లూరి
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’ అక్టోబర్ 10న విడుదలకు సిద్ధమైంది. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించిన ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. శనివారం జరిగిన ప్రెస్ మీట్లో చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంది.హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. “మూడేళ్ల క్రితం నిర్మాత తేజ గారు ఈ కథ చెప్పారు. మొదట్లో కథ అర్థం కాలేదు, కానీ సీన్స్ నచ్చాయి. ఫాదర్-సన్ ఎమోషనల్ సీన్స్ తెలుగులో ఇంతవరకు రాని విధంగా ఉన్నాయి. శ్రీమాన్ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. గోదావరి జిల్లాల విజువల్స్ అద్భుతంగా చిత్రీకరించిన కెమెరామెన్ సాయి కుమార్, శర్వా మ్యూజిక్, అనుదీప్ ఆర్ఆర్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. అశ్లీలత లేకుండా నిజాయితీగా మంచి సినిమా చేశాం. థియేటర్ నుంచి ఆనందంతో బయటకు వస్తారు’ అన్నారుదర్శకుడు సాయి మోహన్: ‘ఇండస్ట్రీలోకి రావాలన్నది మా నాన్న కల. నన్ను నమ్మిన తేజకి, గౌరీకి థాంక్స్. సాయి కుమార్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కోమలి నా రచనకు మించి నటించారు. శ్రీమాన్ సింగిల్ షాట్ సీన్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అక్టోబర్ 10న అందరూ సినిమా చూసి సపోర్ట్ చేయాలి’ అన్నారు.‘శశివదనే’ నాకు ప్రత్యేకమైన చిత్రం. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. అందరూ థియేటర్లో చూడాలి’ అని హీరోయిన్ కోమలి అన్నారు. -
‘కల్కి’2 కి బ్రేక్.. సాయి పల్లవితో చర్చలు.. నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin ) తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి’ 2898 ఏడీ’(Kalki 2898 AD) ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్లో రిలీజైన అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని రిలీజ్ సమయంలోనే ప్రకటించాడు. అంతేకాదు దానికి సంబంధించిన వర్క్పైనే నాగ్ అశ్విన్ ఇన్నాళ్లు దృష్టి పెట్టాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని భావిస్తున్నవేళ ప్రభాస్ ఫ్యాన్స్కి నాగ్ చిన్నపాటి షాక్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుని కొన్నాళ్ల పాటు పక్కకు పెట్టి.. ఓ లేడి ఓరియెంటెండ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.ఆలియా అవుట్.. సాయి పల్లవి ఇన్?కల్కి చిత్రానికి కంటే ముందే నాగ్ అశ్విన్ ఓ లేడీ ఓరియెంటెండ్ స్టోరీ రాసుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్కి కథ కూడా వినిపించాడట. ఆమె కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుంచి ఆలియా తప్పుకుందట. డేట్స్ కుదరకపోవడంతో నాగ్ అశ్విన్కి నో చెప్పేసిందట. దీంతో నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ కథను సాయి పల్లవి(sai Pallavi)తో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఇప్పటికే సాయి పల్లకి స్టోరీ నెరేట్ చేశాడని..ఆమె కూడా ఒప్పుకుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.కల్కి 2 ఎప్పుడు?వాస్తవానికి నాగ్ అశ్విన్ ఇప్పుడు కల్కి 2 చిత్రాన్నే తెరకెక్కించాలి. ఈ మేరకు పనులు కూడా ప్రారంభించారు. అయితే ప్రభాస్ డేట్స్ కుదరడం లేదట. ప్రస్తుతం ఆయన రాజాసాబ్(పాటలు), ఫౌజీ సినిమాల షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే ‘స్పిరిట్’ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. మరోవైపు సలార్ 2 స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. వీటి తర్వాతే కల్కి 2కి ప్రభాస్ డేట్స్ ఇచ్చే చాన్స్ ఉంది. ఈ లెక్కన దాదాపు ఏడాది వరకు ప్రభాస్(Prabhas) డేట్స్ దొరకడం కష్టమే. మరోవైపు ఈ సినిమా నుంచి దీపికా పదుకొణెను తప్పించారు. ఇప్పుడు కొత్త హీరోయిన్ని ఎంపిక చేయాలి. దీనికి కొంత సమయం పడుతుంది. అందుకే నాగ్ అశ్విన్ ఈ గ్యాప్లో మరో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం సాయి పల్లవి డేట్స్ కూడా ఖాలీగానే ఉన్నాయట. ‘రామాయణ్’ మినహా ఆమె చేతిలో మరో చిత్రమేది లేదు. నాగీ కూడా వచ్చే రెండు, మూడు నెలల్లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలోనే నాగ్ అశ్విన్- సాయి పల్లవిల సినిమాను తెరపై చూడొచ్చు. -
ఓపక్క రష్మిక ఎంగేజ్మెంట్.. మాజీ ప్రియుడి పోస్ట్ వైరల్
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రేమలో పడి చాలాకాలమే అయింది. విజయ్ దేవరకొండతో లవ్లో ఉన్న ఈ బ్యూటీ ఈ విషయాన్ని చాలాసార్లు పరోక్షంగా బయటపెట్టింది. దసరా సందర్భంగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని అప్పుడే సగం పెళ్లి అయిపోయిందనిపించారు. కానీ, ఇది రష్మికకు రెండో ఎంగేజ్మెంట్ కావడం గమనార్హం!ఫస్ట్ సినిమాకే లవ్రష్మిక కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ' (2016)తో సినీ ఇండస్ట్రీలో తొలి అడుగు వేసింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రక్షిత్ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటించాడు. ఫస్ట్ సినిమాకే హీరోతో ప్రేమలో పడింది రష్మిక. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. 2017 జూలై 3న వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకున్న తరుణంలో ఊహించని షాకిచ్చారు. పెళ్లిపీటలు ఎక్కకముందే తమ బంధం ముక్కలైందని ప్రకటించారు. ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అలా అని వీరి మధ్య ఎటువంటి శత్రుత్వమూ లేదు. ఇప్పటికీ ఫోన్లో మెసేజ్ చేసుకుంటామని, సినిమాలు విడుదలైనప్పుడు ఒకరికొకరం విషెస్ తెలియజేసుకుంటామని రక్షిత్ శెట్టి 2023లో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.రష్మిక- రక్షిత్ ఎంగేజ్మెంట్ ఫోటోవిజయ్తో లవ్..రక్షిత్తో విడిపోయాక రష్మిక సినిమాలతో బిజీ అయింది. 2018లో గీత గోవిందం సినిమాలో తొలిసారి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో జత కట్టింది. ఈ మూవీ సమయంలోనే విజయ్- రష్మిక ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరిగింది. అయితే తాము ఫ్రెండ్స్ మాత్రమేనని హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. కానీ తర్వాత ఆ రూమర్సే నిజమయ్యాయి. రష్మిక కలలు చాలా పెద్దవి అని రక్షిత్ చెప్పినట్లుగా... ఆమె కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా హిందీలోనూ సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ ట్యాగ్ అందుకుంది. పుష్పతో పాన్ ఇండియా సెన్సేషన్ అయింది.ఉత్తమ నటుడిగా అవార్డుఅటు రక్షిత్ కూడా.. 777 చార్లీ (777 Charlie Movie), సప్తసాగరాలు దాటి సైడ్ A, సప్తసాగరాలు దాటి సైడ్ B సినిమాలతో ఘన విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా మరో ఘనత అందుకున్నాడు. 2021లో సెన్సార్ అయిన సినిమాలకుగానూ కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ప్రకటించింది. అందులో 777 చార్లి సినిమాకు నాలుగు పురస్కారాలు వరించాయి. ఉత్తమ రెండో చిత్రంతో పాటు ఉత్తమ నటుడిగా రక్షిత్ శెట్టి, ఉత్తమ ఎడిటర్గా ప్రతీక్ శెట్టి, ఉత్తమ గేయరచయితగా నాగార్జున శర్మకు అవార్డులు ప్రకటించారు. హీరో ట్వీట్దీంతో రక్షిత్ సంతోషంలో తేలియాడుతున్నాడు. '777 చార్లీ సినిమాకు 4 అవార్డులు.. మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది. జ్యూరీకి, ప్రేక్షకులకు, చిత్రయూనిట్కు ధన్యవాదాలు. దర్శకుడు కిరణ్ రాజ్ విజన్.. ప్రతీక్ అద్భుతమైన ఎడిటింగ్, నాగార్జున చేతినుంచి జారిపడ్డ అందమైన మాటలు అందరి హృదయాలను తాకాయి' అంటూ ఈ ముగ్గురికి స్పెషల్ థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్గా మారింది. Feeling grateful and humbled! 777 Charlie wins 4 State Awards.. 2nd Best Film, Best Actor, Best Editing & Best Lyricist. Heartfelt thanks to the jury, our amazing audience, and this incredible team.. @Kiranraj61 for his vision, Pratheek for the flawless editing, and…— Rakshit Shetty (@rakshitshetty) October 4, 2025 చదవండి: పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్.. అప్పుడు చచ్చిపోవాలనుకున్నా -
‘ఐ బొమ్మ’పై ఫైర్ అయిన నిర్మాత
సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ( IBomma)పై సినీ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఐబొమ్మ ఇచ్చిన అల్టిమేటం (2023లో చేసిన ఒక X పోస్ట్) గురించి ప్రస్తావిస్తూ – ‘సినీ తారల పారితోషికాలు, డైరెక్టర్స్ ఫీజులు, నిర్మాణ వ్యయాలపై మాట్లాడే హక్కు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే పైరసీదారులకు లేదు. దొంగ పనులు చేసే వారు పరిశ్రమ భవిష్యత్తు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నేరంలో పాలు పంచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 500 చిత్రాలు పైరసీ చేయబడ్డాయి. ఈ నేరంలో పాలుపంచుకున్న వారిని తెలంగాణ పోలీసులు బీహార్, పూణే, తమిళనాడులో అదుపులోకి తీసుకోవడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నాను. విచారణలో తెలిసిన వివరాలు సినీ రంగానికి షాక్ ఇచ్చాయి.కొన్ని సినిమాలను థియేటర్లలో కామ్కార్డర్ ద్వారా రికార్డు చేశారు. అంతేకాకుండా, డిజిటల్ ప్రొవైడర్స్ అయిన యూఎఫ్ఓ(UFO), క్యూబ్(Qube)ల సైట్లను హ్యాక్ చేసి, విడుదలకు ముందే దాదాపు 120 చిత్రాలను నేరుగా డౌన్లోడ్ చేసినట్లు బీహార్లోని గోపాలగంజ్కు చెందిన A1 నిందితుడు అశ్విన్ కుమార్ వాంగ్మూలంలో వెల్లడించాడు.నిర్మాతలు తమ సినిమాలను పూర్తి చేసిన తర్వాత కంటెంట్ను ఈ డిజిటల్ ప్రొవైడర్స్కి అందజేస్తారు. వీరు ఒకే కోడ్తో అన్ని థియేటర్లకు ప్రొజెక్షన్ కోసం అప్లోడ్ చేస్తారు. అయితే ఈ సైట్లను హ్యాక్ చేయడం వల్లే పెద్ద నష్టం జరిగింది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ సకాలంలో చేయకపోవడం, భద్రతా చర్యలు పాటించకపోవడం వలన ప్రొడ్యూసర్లు నష్టపోయారు.అదే సమయంలో నిర్మాతల వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న ఈ డిజిటల్ ప్రొవైడర్స్ నిర్లక్ష్యం పట్ల వారు సమాధానం ఇవ్వడమే కాకుండా, నష్టపరిహారం కూడా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసుల దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం, పైరసీ వల్ల నష్టపోయిన నిర్మాతలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో నిర్మాతలు సంఘటితంగా పోరాటానికి సిద్ధమవుతారు అని ఆయన హెచ్చరించారు. -
‘అరి’ కోసం ఏడేళ్లు.. కారణం ఇదేనట!
'పేపర్ బాయ్' తర్వాత దర్శకుడు జయశంకర్ నుంచి ఎలాంటి చిత్రం రాలేదు. వరుస అవకాశాలు వచ్చినా.. సరైన కాన్సెప్ట్తో ఎదురుచూసి మళ్లీ ఇప్పుడు ‘అరి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం కోసం జయశంకర్ ఏడేళ్ల కష్టపడ్డారు. ఇంత సమయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే.. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ని ఇందులో చూపించారట. కాన్సెప్ట్ కోసమే ఎక్కువ సమయం తీసుకున్నారట.'పేపర్ బాయ్' అందించిన గొప్ప విజయం తర్వాత, జయశంకర్ తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోవాలని బలంగా కోరుకున్నారు. అందుకే, ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద ఎవరూ టచ్ చేయని పాయింట్తో రావాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలోనే, మనిషిలోని ఆరు అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గాల కాన్సెప్ట్ను ఎంచుకున్నారు.'అరి' అనే పదానికి 'శత్రువు' అనే అర్థంతో పాటు, అరిషడ్వర్గాల్లోని మొదటి రెండు అక్షరాలను తీసుకుని ఈ చిత్రానికి పేరు పెట్టారు. ఈ వినూత్నమైన కాన్సెప్ట్ను ప్రేక్షకులకు అందించేందుకు ఆయన విస్తృతమైన పరిశోధన చేశారట. మైథలాజికల్ టచ్ ఇచ్చేందుకు పురాణేతిహాసాలను, గ్రంథాలను అధ్యయనం చేశానని జయశంకర్ చెప్పారు. రమణ మహర్షి ఆశ్రమం సహా పలు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి గురూజీలను కలిసి, వారి కోసం వేచి చూసి ఎన్నో విలువైన విషయాలను సేకరించారట. కొంతకాలం ఆశ్రమంలో గడిపి, ఆధ్యాత్మిక కోణంలో ఈ అంశంపై లోతైన పరిశోధన చేశానని జయశంకర్ అన్నారు.విడుదలకు ముందే, 'అరి' చిత్రం పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శితమై, ఏకంగా 25 అవార్డులను గెలుచుకుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖ రాజకీయ, సినీ, పీఠాధిపతులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రత్యేకంగా అభినందించారు. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. -
నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్.. ఎప్పుడంటే?
యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) వరుస బ్లాక్బస్టర్స్ అందుకుంటున్నాడు. గతేడాది హనుమాన్తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఈ ఏడాది మిరాయ్ (Mirai Movie)తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ఏకంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నెల తిరిగేలోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.ఓటీటీలో మిరాయ్ఈ విషయాన్ని జియో హాట్స్టార్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 10న హాట్స్టార్లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. మిరాయ్ విషయానికి వస్తే.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ కాగా మంచు మనోజ్ విలన్గా నటించారు. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీలో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)చదవండి: సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్స్టోరీ -
లగ్జరీ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్.. ఎన్ని లక్షలంటే?
హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ మాలీవుడ్లో సెన్సేషన్గా మారింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త లోక: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇప్పటికే రికార్డుకెక్కింది. ఇప్పటివరకు రూ.294 కోట్లు అందుకున్న ఈ మూవీ త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరనుంది. అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా నిమిష్ రవి (Nimish Ravi) సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించాడు.చేతి గడియారంతాజాగా నిమిష రవికి కల్యాణి ప్రియదర్శన్ ఖరీదైన బహుమతినిచ్చింది. రూ.9.8 లక్షల విలువైన చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చింది. ఈ వాచ్ను ధరించిన రవి.. ఈమేరకు ఓ ఫోటో షేర్ చేశాడు. ప్రియమైన కల్యాణి, ఈ కానుక ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్.. ఎప్పుడూ కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుందనడానికి లోక సినిమాయే నిదర్శనం. వాచ్ చూసుకున్నప్పుడల్లా ఈ లైన్ గుర్తు చేసుకుంటూ ఉంటాను. నిజమైన హార్డ్ వర్క్కు ఇదొక బహుమానం అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Nimish Ravi (@nimishravi) చదవండి: బాపు.. ఈ బతుకొద్దే, నా భార్య నరకం చూపిస్తోంది: నటుడి సెల్ఫీ వీడియో -
వైవా హర్ష ఇంట్లో ఇన్ని కార్లు, బైక్సా? ఇదంతా మీవల్లేనంటూ ఎమోషనల్
దసరా వచ్చిందంటే ఆయుధపూజ చేయాల్సిందే! ఇంట్లో ఉన్న బండిని తళతళా మెరిసేట్టు శుభ్రంగా కడిగి పూజ చేసి దిష్టి తీయాల్సిందే! కమెడియన్ వైవా హర్ష (Harsha Chemudu) కూడా అదే చేశాడు. తన కార్లు, బైకులన్నింటినీ శుభ్రంగా కడిగి దండవేసి ఇంటి ముందు రెడీగా పెట్టాడు. భార్యతో కలిసి వాహనపూజ చేశాడు. ఈ మేరకు పలు ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.ఫ్యామిలీ త్యాగాలుఆయుధపూజ చేయడానికి ఏడాదంతా ఎదురుచూస్తాం. ఇవన్నీ చేయటానికి ఎంతో కష్టపడతాం. ఆటోమొబైల్స్ మీద నాకున్న ఇష్టాన్ని అర్థం చేసుకుని, నేను ఎన్ని వాహనాలు కొంటున్నా అడ్డు చెప్పని ఫ్యామిలీకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ల త్యాగాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఎప్పుడూ వాటి గురించి మాట్లాడరు. ఎందుకంటే నేను బాధపడకూడదన్నదే వాళ్ల కోరిక. అలాగే ఇది నా చిన్ననాటి కల.నా ఇంటినిండా అవే..చిన్నప్పుడు కార్లు, బైకులంటూ వాటి ఫోటోలతో నా గదినంతా నింపేసేవాడిని. ఎక్కడ చూసినా వాటి స్టిక్కర్లే ఉండేవి. నా పాకెట్మనీలో కొంత డబ్బు దాచుకుని దానితో ఆటోమొబైల్స్ మ్యాగజైన్లు కొనుక్కునేవాడిని. కొద్దిరోజుల్లోనే అది పూర్తిగా చదివేసి.. మళ్లీ తర్వాతి నెల మ్యాగజైన్ కోసం ఎదురుచూసేవాడిని. అలా నా చిన్నప్పుడు నేను ఇష్టపడ్డ వాహనాలను సేకరిస్తున్నాను. ఒక్కొక్కటిగా అన్నీ కొనుక్కుంటూ పోతున్నాను. అందుకే నా దగ్గర ఇన్ని బైక్స్ ఉన్నాయి.మీ వల్లే ఇదంతా..మీ సపోర్ట్ లేకుంటే ఇవన్నీ కొనగలిగేవాడినే కాదు. నన్ను మీలో ఒకడిగా చూసుకుంటున్నందుకు చాలా చాలా థాంక్స్. నా ప్రతి విజయంలో మీ భాగస్వామ్యం ఉంది. మీవల్లే నేనిక్కడ ఉన్నాను. మీవల్లే నా కలల్ని సాకారం చేసుకోగలుగుతున్నాను అని రాసుకొచ్చాడు. వైవా హర్ష.. ఈ ఏడాది వచ్చిన గేమ్ ఛేంజర్, తండేల్, సారంగపాణి జాతకం, జూనియర్, బకాసుర రెస్టారెంట్ చిత్రాల్లో మెరిశాడు. View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) చదవండి: రావణుడు కొంటెవాడు కానీ రాక్షసుడు కాదు: బాలీవుడ్ నటి -
కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత
దసరా పండగ సందర్భంగా తన జీవితంలోని ఓ స్పెషల్ న్యూస్ను అభిమానులతో పంచుకుంది హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu). కొత్తింట్లోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. ఈ మేరకు కొత్త ప్రయాణం అంటూ తన ఇంటి ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అలాగే పూజగది ఫోటోను కూడా షేర్ చేసింది. ఇంటి బయట గోడపై తన నిక్నేమ్ SAM అనే లోగో అందంగా అమర్చి ఉంది. అయితే ఈ ఇల్లు హైదరాబాద్లో ఉందా? ముంబైలోనిదా? అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా కొత్తిల్లు కొన్న సామ్కు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాసమంత సినిమాల విషయానికి వస్తే.. ఏమాయ చేసావె మూవీతో తెలుగులో తన జర్నీ మొదలుపెట్టింది. బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మజిలి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అల్లుడు శీను, అ ఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 1లో ఉ అంటావా మావా.. అనే ఐటం సాంగ్లో తళుక్కుమని మెరిసింది. ఇటీవల శుభం సినిమాలో అతిథి పాత్రలో నటించడంతో పాటు ఈ మూవీని తనే నిర్మించడం విశేషం. ప్రస్తుతం మా ఇంటి బంగారం, రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.చదవండి: ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్తోనే! -
వినాయకుడిపై ఒట్టేసి చెప్పిన రవితేజ.. ‘మాస్ జాతర’ వచ్చేది అప్పుడే!
రవితేజ హీరోగా దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara). ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. ఈ ఏడాది సంక్రాంతి మొదలు మొన్నటి వినాయక చవితి వరకు మూడు, నాలుగుసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి.. వాయిదా వేశారు. ఇక ఇప్పుడు మరోసారి కొత్త డేట్ని వెల్లడించారు. అక్టోబర్ 31న ‘మాస్ జాతర’తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా రవితేజ, హైపర్ ఆది(Hyper Aadi)లపై చిత్రీకరించిన ఒక సరదా వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియోలో హైపర్ ఆది 2025 సంక్రాంతి, వేసవి సెలవులు, వినాయక చవితి అంటూ పలుసార్లు సినిమా వాయిదా పడటాన్ని సరదాగా ఎగతాళి చేయగా.. ఆలస్యానికి గల కారణాలపై రవితేజ అంతే చమత్కారంగా స్పందించారు. చివరిగా వినాయకుడిపై ‘ఒట్టేసి చెబుతున్నా..అక్టోబర్ 31న రిలీజ్ పక్కా’ అని రవితేజ అనడంతో వీడియో ముగుస్తుంది.ఇప్పటికే విడుదలైన 'మాస్ జతర' టీజర్ కి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా మాస్ రాజా అభిమానులను, మాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే, రెండు పాటలు విడుదలై శ్రోతల నుంచి భారీ ప్రశంసలు అందుకున్నాయి. అందరూ కాలు కదిపేలా ఎంతో ఉత్సాహభరితంగా స్వరపరిచిన ఈ పాటలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ-శ్రీలీల జోడి అంటే, ప్రేక్షకులలో ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. Sankranthi Ayipoyindhi,Summer Ayipoyindhi,Vinayaka Chavithi Ayipoyindhi...#MassJathara Yepudu? 🤔Eesari matram release pakkaa!! 💥😎 Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna @NavinNooli @Naveenc212… pic.twitter.com/8V86FiYAkX— Sithara Entertainments (@SitharaEnts) October 1, 2025 -
అంతరిక్షంలో పెళ్లి చేసుకోబోతున్న 63 ఏళ్ల హీరో!
ఆ హీరోకి 63 ఏళ్లు..ఇప్పటికే మూడు పెళ్లిళ్లు..విడాకులు అయ్యాయి. ఇప్పుడు 37 ఏళ్ల హీరోయిన్తో డేటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నారట. పెళ్లంటే మాములు పెళ్లి కాదు..ఇంతవరకు ఎవరూ చేసుకొని విధంగా..అంతరిక్షంతో వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారట. ఆ హీరో ఎవరో కాదు.. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్(Tom Cruise ). హీరోయిన్ అనాడి అర్మాస్(Ana de Armas). వీరిద్దరు గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు హాలీవుడ్లో వార్తలు వచ్చాయి. లండన్లో ఇద్దరు కలిసి తిరిగిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. వీరి ప్రేమ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ.. అప్పుడే పెళ్లికి సంబంధించి పుకార్లు అయితే వచ్చాయి. భూమిపై కాకుండా అంతరిక్షంలో పెళ్లి చేసుకోవాలని ఈ జంట భావిస్తుందట. ఒకవేళ అది కుదరపోతే గాల్లో తేలియాడుతూ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ‘టాక్ క్రూజ్కి అంతరిక్ష ప్రయాణం అంటే చాలా ఇష్టం. స్పేస్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. అవకాశం వస్తే.. అంతరిక్షంలో పెళ్లి చేసుకోని చరిత్రకెక్కాలని టామ్ ఆశపడుతున్నాడు’ అని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఓ హాలీవుడ్ మీడియా పేర్కొంది. అంతేకాదు గాలిలో తేలియాడుతూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. అది కుదరకపోతే అండర్వాటర్ వెడ్డింగ్: (సముద్రంలోకి డైవ్ అయి, అక్వారియం లాంటి సెటప్లో పెళ్లి చేసుకోవడం) చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి సాధారణ పెళ్లి కాకుండా ‘హెడ్లైన్’లో ఉండే వివాహాన్ని చేసుకోవాలని ఇద్దరు కోరుకుంటున్నారట. మరి ఈ స్పెషల్ జంట పెళ్లి ఎలా జరుగుతుందో చూడాలి.కాగా టామ్ క్రూజ్ ఇప్పటికే ముగ్గురికి విడాకులు ఇచ్చాడు. 1987లో మిమీ రోజర్స్ని పెళ్లి చేసుకోగా.. మూడేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. 1990లోనే నికోల్ కిడ్మన్ని వివాహమాడాడు. పదకొండేళ్లు కాపురం చేసిన తర్వాత ఈమె నుంచి కూడా విడిపోయాడు. తర్వాత ఐదేళ్ల పాటు ఒంటరిగానే ఉన్న టామ్.. 2006లో కేట్ హోమ్స్ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆరేళ్ల కాపురం తర్వాత విడాకులు ఇచ్చేశాడు. ఇవే కాకుండా అమెరికన్ నటి హీథర్ లాక్లియర్తో, సింగర్ చెర్తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేశాడు. ఇక అనాడి ఆర్మాస్ కూడా 2011లో స్పానిష్ నటుడు మార్క్ క్లోటెట్ని పెళ్లి చేసుకొని.. రెండేళ్లకే విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత టామ్తో ప్రేమలో పడింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘డీపర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని హాలీవుడ్ టాక్. -
ఆమె లేకపోతే ఇదంతా నా వల్ల అయ్యేదే కాదు : హీరో అజిత్
కోలీవుడ్లో నటుడు అజిత్ రూటే సపరేట్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన లోకమే వేరు. అజిత్ ది చాలా క్రియేటివ్ మైండ్. మొదటి నుంచి నటనపై దష్టి సారించి అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ఆ మధ్య ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం విద్యార్థులకు హెలీకాప్టర్ టెస్ట్ పైలెట్ గానూ,ఎడ్వైజర్ గానూ వ్యవహరించారు. ఆ తరువాత గన్ షూటింగ్ పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ తరువాత బైక్ రేసుల్లోనూ పాల్గొన్నారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయి కారు రేసుల్లోను పొల్గొంటూ పతకాలను సాధిస్తున్నారు.అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో సొంతంగా పందెం పోటీలు సంస్థను ప్రారంభించారు. అలా తన రేస్ టీమ్తో ఇప్పటికే దుబాయి, బెల్జియం వంటి దేశాల్లో కార్ రేస్సుల్లో పోటీ చేసి తృతీయ స్థాయి పతకాలను గెలిచారు. తాజాగా శని, ఆదివారాల్లో స్పెయిన్లో జరిగిన కార్ రేస్సుల్లో పాల్గొని మరోసారి కాంస్య పతాకాన్ని గెలిచారు. కాగా ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో త్వరలో కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది అజిత్ నటించే 64వ చిత్రం అవుతుంది.ఈ సందర్భంగా అజిత్ ఒక భేటీలో పేర్కొంటూ తన తదుపరి కార్ రేస్ పోటిలో ఇండియన్ సినిమాను ప్రమోట్ చేయనున్నారని తెలిపారు. అలా తన కారుపై ఇండియా సినిమా లోగో ను పొందుపరచనున్నట్లు చెప్పారు. తన భార్య శాలిని గురించి పేర్కొంటూ ఆమె ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తోందని చెప్పారు. ఆమె సహకారం లేకపోతే ఇదంతా చేయడం తన వల్ల అయ్యేది కాదన్నారు. తాను లేనప్పుడు ఇల్లు, పిల్లల బాధ్యతలు తానే చూసుకుంటోందని చెప్పారు. తాను పిల్లల్లి చూడడం కూడా అరుదైపోయిందన్నారు. మీరు ఇష్టమైనది చేయాలనుకుంటే కొన్ని సమయాల్లో కొన్ని త్యాగం చేయక తప్పదన్నారు. తాను కొడుకు ఆద్విక్ కూడా బైక్ రేసీలంటే ఇష్టమే నన్నారు. తన గో కార్డింగ్ ప్రారంభించారని, అయితే అందులో ఇంకా పూర్తి శ్రద్ధ పెట్టలేదని పేర్కొన్నారు. సినిమా అయినా, రేసులు అయినా తన భావాలను పిల్లలపై బలవంతంగా రుద్దనన్నారు. వారు ఏం చేయాలనుకుంటారో అందుకు తన మద్దతు ఉంటుందని అజిత్ స్పష్టం చేశారు. -
దేనికీ భయపడను, ఎవరికీ తలవంచను: దీపికా పదుకొణె
తానెన్నడూ భయపడిందే లేదంటోంది స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone). కష్టతరమైన మార్గంలోనూ దర్జాగా నడిచానని, ప్రశ్నించేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదని పేర్కొంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎమ్డీబీ (IMDB) 25 ఏళ్ల భారతీయ సినిమా (2000-2025) అంటూ 130 అత్యుత్తమ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది. అందులో 10 చిత్రాల్లో దీపికా పదుకొణె హీరోయిన్గా నటించడం విశేషం.కష్టాలదారిలోనే నడిచా..ఈ అరుదైన ఘనత అందుకోవడంపై దీపిక సంతోషం వ్యక్తం చేసింది. అలాగే రెండు పెద్ద సినిమాలైన స్పిరిట్, కల్కి 2లు చేజారడంపైనా పరోక్షంగా కామెంట్లు చేసింది. ఈ మేరకు తన జర్నీ గురించి దీపిక మాట్లాడుతూ.. నటిగా ప్రయాణం ప్రారంభించిన కొత్తలో నేనెలా ఉండాలి? ఏం చేస్తే సక్సెస్ అవుతానని నాకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు. అయితే కెరీర్ ప్రారంభం నుంచే నేను ముక్కుసూటిగా ఉన్నాను. ఏదైనా తప్పనిపిస్తే ప్రశ్నించేందుకు వెనకడుగు వేయలేదు. కష్టాలదారిలోనే కొనసాగాను, నాకెదురైన పరిస్థితులను సవాల్ చేస్తూ ముందడుగు వేశాను తప్ప ఎక్కడా తలవంచలేదు.నా తర్వాత వచ్చేవారికోసం..నా కుటుంబసభ్యులు, అభిమానులు నాపై ఉంచిన నమ్మకమే నేను తీసుకునే బలమైన నిర్ణయాలకు కారణం. నా తర్వాత వచ్చేవారు అనుసరించే మార్గాన్ని నేను శాశ్వతంగా మారుస్తానని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. బహుశా 8 గంటల షిఫ్ట్ గురించే ఆమె పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే దీపికా ప్రస్తుతం షారూఖ్ ఖాన్తో కలిసి కింగ్ మూవీ చేస్తోంది. అలాగే అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.చదవండి: విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్-సైంధవి -
ఫేస్బుక్లో చాటింగ్.. పేరెంట్స్ వద్దన్నా పెళ్లి.. ‘కాంతార’ హీరో లవ్స్టోరీ
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishab Shetty) మన తెలుగువారికి కాంతార సినిమా ద్వారా దగ్గరవడం మాత్రమే కాదు మన జూనియర్ ఎన్టీయార్కు సోదర సమానుడుగా మారడం ద్వారా కూడా మరింతగా మనకు చేరవయ్యాడు. కాంతారా చాప్టర్ 1 ప్రమోషన్లో భాగంగా మన దగ్గర కూడా మన జూనియర్ ఎన్టీయార్ సాక్షిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆ ఈవెంట్లో ఎన్టీయార్, రిషబ్ ల తర్వాత హైలెట్గా నిలిచింది రిషబ్ జీవిత భాగస్వామి ప్రగతి శెట్టి. హీరోయిన్ స్థాయి అందంతో మెరిసిపోయిన ఆమె అంతే అణకువతో కూడిన ప్రసంగం ద్వారా కూడా ఆకట్టుకుంది.ప్రస్తుతం కాంతారా కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన ప్రగతి శెట్టి(Pragathi Shetty) రిషబ్ శెట్టి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక సినిమా కార్యక్రమంలో క్యాజువల్గా కలిసిన వీరిద్దరూ ఆ తర్వాత ఫేస్బుక్ ఫ్రెండ్స్గా మారారు. రోజుల తరబడి చాటింగ్ కొనసాగించారు. వీరి స్నేహాన్ని ప్రేమగా మార్చింది ఫేస్బుక్ అనే చెప్పాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ సినిమాలను ఇష్టపడే సగటు ప్రేక్షకురాలిగా రిషబ్కు చేరువైన ప్రగతి ఆ తర్వాత అతనితో ప్రేమలో పడింది. అయితే వీరిద్దరి ప్రేమకధ ప్రారంభమైనప్పుడు రిషబ్ సినిమాల్లో కెరీర్ పరంగా నిలదొక్కుకోలేదు. .దాంతో రిషబ్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రగతి తల్లిదండ్రుల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది అయితే, ప్రగతి పట్టు వీడకపోవడంతో... అతి కష్టం మీద వారు ఒప్పుకున్నారు. అలా ఈ జంట 2017లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు వారికిద్దరు అన్నట్టుగా ప్రస్తుతం ఒక బాబు, పాపలతో వీరిది చక్కని అందమైన సంసారం..సోషల్ మీడియాలో ప్రగతి చాలా యాక్టివ్గా ఉంటుంది తరచుగా తన కుటుంబ జీవితం నుంచి స్నిప్పెట్లను అభిమానులతో పంచుకుంటుంది. రిషబ్ 41 పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఫొటోలు, గత ఫాదర్స్ డే సందర్భంగా తన భర్త, పిల్లలకు ఉన్న అనుబంధం గురించి పెట్టిన పోస్ట్లు నెటిజన్స్ నుంచి మంచి స్పందన అందుకున్నాయి. ఐటీ ఉద్యోగినిగా ఉన్న ప్రగతి రిషబ్తో పెళ్లి తర్వాత ఫ్యాషన్ పై తన టీనేజి అభిరుచికి సానబెట్టింది. అలా ఆమె సినిమారంగంలో కాస్ట్యూమ్ డిజైనర్గా మారేందుకు అదే బాటలు వేసింది. ఇప్పటికీ ఫ్యాషన్ తనకు హాబీ మాత్రమే అని చెబుతున్న ప్రగతి... కాస్ట్యూమ్ డిజైనర్ ప్రొఫెషన్లో అనూహ్యంగా రాణిస్తోంది. ప్రేమ నుంచీ పెళ్లి దాకా ఆ తర్వాత కూడా కష్టసుఖాలు అన్నింటినీ సమానంగా పంచుకుంటూ పరస్పరం విజయాలకు కారణమవుతూ సాగుతున్నదీ జంట. సినీ రంగంలో ఉన్న చాలా మందికి స్ఫూర్తిని అందించే దాంపత్యం వీరిద్దరిదీ అనడం నిస్సందేహం. -
శశిరేఖగా నయనతార.. దసరాకు మరో సర్ప్రైజ్!
మెగాస్టార్ చిరంజీవి కొణిదెల హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నయనతార (Nayanthara) కథానాయికగా నటిస్తోంది. ఈ మధ్యే చిరు-నయనతార కాంబినేషన్లో ఓ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా ఈ మూవీ నుంచి నయనతార ఫస్ట్లుక్ రిలీజ్ చేశారు. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు. దసరాకు సర్ప్రైజ్పసుపురంగు చీరలో, కొప్పున పూలెట్టుకుని, చేతిలో ఓ గొడుగు పట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతోంది నయన్. రేపు (అక్టోబర్ 2న) దసరా కానుకగా ఓ సర్ప్రైజ్ ఉంటుందన్నారు. అంటే మూవీ నుంచి ఏదైనా గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉండొచ్చన్నమాట! ఇక ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదలవుతోంది. Introducing #Nayanthara garu as ‘SASIREKHA’ in our #ManaShankaraVaraPrasadGaru 🤗✨It’s an absolute joy to have her in this beautiful role and to work with her. Tomorrow, get ready for a delightful surprise from #MSG ❤️#ChiruAnil - Sankranthi 2026 🥳 pic.twitter.com/lvS2TO8fSi— Anil Ravipudi (@AnilRavipudi) October 1, 2025 -
రెండో బ్యానర్ స్టార్ట్ చేయనున్న హీరో సూర్య!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇకపోతే ఈయన తన భార్య జ్యోతికతో కలిసి 2డీ ఎంటర్టెయిన్మెంట్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే! తాజాగా సూర్య మరో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.నగరం స్టూడియోస్ పేరుతో కొత్త బ్యానర్ లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థలో మొదటి చిత్రంగా మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించి నిర్మించనున్నట్లు తెలిసింది. ఆ తరువాత పా.రంజిత్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా విడుదల కానుందని తెలిసింది. ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తెరపైకి రానుంది.చదవండి: జ్ఞాపకాలను మోయడం ఆపేశాను -
దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్పై కేసు
హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi), ఆమె భర్త డేవిడ్ వేధిస్తున్నారంటూ వారి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీజులు డింపుల్ హయాతి, ఆమె భర్తపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం రాయ్ఘడ్ జిల్లాకు చెందిన ప్రియాంక బిబర్ (22) షేక్పేటలోని వెస్ట్వుడ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్న హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో పనిమనిషిగా చేరింది. అక్కడ చేరినప్పటినుంచి డింపుల్, డేవిడ్ తనను దూషిస్తూ, అవమానిస్తూ సరైన ఆహారం ఇవ్వకుండా రోజూ హింసిస్తున్నారని ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నంమంగళవారం ఉదయం ఇంట్లో పెంపుడు కుక్క అరిచిందని, అందుకు కారణం తానేనంటూ భార్యాభర్తలిద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని, దుస్తులు విప్పేసి నగ్నంగా నిలబెట్టి కొట్టేందుకు యత్నించారని ఆరోపించింది. వీడియో రికార్డు చేసేందుకు ప్రయత్నించగా డేవిడ్ బలవంతంగా తన ఫోన్ లాక్కొని కిందపడేసి పగలగొట్టాడని పేర్కొంది. తన తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరించారని భయాందోళన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు డింపుల్, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గల్ఫ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన డింపుల్ హయాతి.. యురేఖ, ఖిలాడి, రామబాణం సినిమాలు చేసింది. గద్దలకొండ గణేశ్లో స్పెషల్ సాంగ్లో మెరిసింది.చదవండి: నవంబరులో కొదమసింహం -
ఏపీలో ‘కాంతార: చాప్టర్ 1’ టికెట్ ధరలు పెంపు.. ఎంతంటే?
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించిన ‘కాంతారా ఛాప్టర్-1’(Kantara : Chapter 1) సినిమా టికెట్ ధరలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంపునకు అనుమతి ఇస్తూ ఉతర్వ్యూలు జారీ చేసింది. దీంతో పాటు ప్రీమియర్స్కి కూడా అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1న రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ షో పడనుంది. దీనికి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. అలాగే అక్టోబర్ 2 నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ. 75, మల్లిప్లెక్స్లలో రూ. 100 పెంచుకునే వెలుసుబాటుని కల్పించింది.కాంతార: చాప్టర్ 1 విషయానికొస్తే.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. -
పని మనుషులను వేధించిన హీరోయిన్.. వీడియో వైరల్!
హీరోయిన్ డింపుల్ హయాతి(Dimple Hayathi ) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తన అపార్ట్ మెంట్ లో పార్కింగ్ విషయమై డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడపడి కేసుల పాలైన ఈ బ్యూటీ.. మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇంట్లో పెంపుడు కుక్కలు చూసుకోడానికి పని మనుషులు కావాలని ఒరిస్సా నుంచి పిలుపించుకున్న యువతులను డింపుల్ హయతి, ఆమె భర్త వేధింపులకు గురి చేశారట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించారంటూ ఆ అమ్మాయిలకు పని కుదిర్చిన ఓ మహిళ ఆరోపించింది.‘మీరు నా చెప్పులంత వాల్యూ చేయరు.. మీరు ఎంత? మీ బ్రతుకెంత?’ అంటూ సదరు అమ్మాయిలతో డింపుల్ భర్త దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. జీతం కూడా ఇవ్వకుండా ఇంట్లో నంచి వెళ్లగొట్టడమే కాకుండా.. ‘మా ఆయన లాయర్ మీరు నన్ను ఏమీ పీకలేరు’ అంటూ డింపుల్ హయాతి కూడా అమ్మాయిలపై ఫైర్ అయిందని ఆ మహీళ పేర్కొంది. డింపుల్ భర్త లాయర్ చేప్పడంతో.. అసలు ఆమెకు పెళ్లి ఎప్పుడు అయిందని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అంతేకాదు అమ్మాయిల పట్ల అలా దురుసుగా ప్రవర్తించిన డింపుల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డింపుల్ సినిమా విషయాలకొస్తే.. ‘రామబాణం’లాంటి డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాంప్ తీసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ‘భోగీ’మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు.మరోసారి వివాదంలో హీరోయిన్ డింపుల్ హయాతి కుక్కలు చూసుకోడానికి పని మనుషులు కావాలని పిలిపించి.. ఒరిస్సా నుంచి వచ్చిన యువతులను వేధించిన డింపుల్ హయాతి, ఆమె భర్తపని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించింది అంటూ ఆరోపించిన మహిళమీరు నా చెప్పులు అంత వాల్యూ చేయరు.. నువ్వు… https://t.co/PfeNndxVn2 pic.twitter.com/lqUtEDZPBO— Telugu Scribe (@TeluguScribe) September 30, 2025 -
సంక్రాంతి పోరు.. బరిలో ‘ఆ నలుగురు’
సంక్రాంతి పండగ టాలీవుడ్కి అతి ముఖ్యమైనది. యావరేజ్ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం ఈ పండక్కే ఉంది. ఒక వేళ హిట్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ని షేక్ చేసేది కూడా పండగే. అందుకే సంక్రాంతికి రావాలని పలువురు స్టార్స్ ప్లాన్ చేసుకుంటారు. ఎప్పటి మాదిరే ఈ సారి కూడా టాలీవుడ్లో పొంగల్ పోరు గట్టిగానే ఉంది. ఇప్పటికే రెండు సినిమాలు డేట్స్ని ప్రకటించాయి. మరో రెండు చిత్రాలు కూడా పండగ కోసమే రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) కూడా ఉంది. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ఈ మూవీ ట్యాగ్లైన్. ట్యాగ్లైన్ చూస్తేనే ఇది పక్కా సంక్రాంతి మూవీ అని అర్థమైపోతుంది. కానీ ఇప్పటి వరకు డేట్ మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ప్రభాస్ ‘ది రాజాసాబ్’(The Raja Saab)తో జనవరి 9న వస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’తో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇక మిగిలిన డేట్స్ 12, 13 మాత్రమే. ఈ రెండు రోజుల్లో ఏదొ ఒక రోజు చిరంజీవి(Chiranjeevi) సినిమా రావాల్సింది. మరోవైపు రవితేజ కూడా సంక్రాంతి సమరానికి సై అంటున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తుంది. దు జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్తో జరుగుతోన్న షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తవుతుందని, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి సంక్రాంతికి రంగంలోకి దించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్కన చిరంజీవికి 12వ తేది తప్ప మరో ఆప్షన్ లేదు. దసరాకి ఈ సినిమా అప్డేట్ వస్తుంది. ఓ పాటను రిలీజ్ చేసే చాన్స్ ఉంది. అప్పుడైనా రిలీజ్ డేట్ ప్రకటిస్తారేమో చూడాలి. మొత్తానికి చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్తో పాటు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కూడా పొంగల్ పోరులో ఉన్నాడు. మరీ వీరిలో ఎవరు పై చేయి సాధిస్తారో? ఏ చిత్రం బాక్సాఫీస్ని షేక్ చేస్తుందో చూడాలి. -
OG: ఆహా ఓహో అన్నా... చివరకి లేదుగా సాహో రేంజీ...
అంతన్నారు ఇంతన్నారు చివరకు తుస్సుమన్నారు అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ(OG) చిత్రం పరిస్థితి. విపరీతమైన హైప్తో విడుదలైన దే కాల్ హిమ్ ఓజీ తొలి 2 రోజుల పాటు బ్లాక్ బస్టర్ అన్నంత హంగామా సృష్టించారు. ఇక పవన్ ఫ్యాన్స్ తమ హడావిడికి హద్దే లేదన్నట్టుగా చెలరేగిపోయారు. వెయ్యి కోట్ల దాకా కలెక్షన్లు వచ్చేస్తాయంటూ పుష్ప రికార్డులు కూడా బద్దలైపోతాయంటూ ఊహాగానాలు చేసేశారు. అభిమానుల ఆశలు ఆకాంక్షలు అర్ధం చేసుకోదగినవే కానీ...పాపం వారి ఆశల్ని వమ్ము చేస్తూ ఓజీ నాలుగు రోజుల్లోనే నీరుగారిపోయింది(OG Box Office Collection). నాలుగు రోజుల్లో 252 కోట్ల కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతుంటే...ఇందులో షుమారుగా ఓవర్సీస్ 50 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 145 కోట్లు పైగా. కానీ తమిళ, హిందీ, కన్నడ పరిస్థితి ఏమిటి? తెలుగు వాళ్లున్న చోట్ల తప్ప వేరే భాషా ప్రేక్షకులు ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఓజీని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. హిందీ మార్కెట్లో నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది 2 కోట్లలోపే.. ఇక కన్నడిగులు అయితే మరీ కరివేపాకులా తీసి పారేశారు. నాలుగు రోజుల్లో నాలుగైదు లక్షలు దాటలేదు. దాంతో అక్కడ సినిమా అప్పుడే కనుమరుగైంది తమిళనాడు పరిస్థితి చూస్తే...నాలుగు రోజుల్లో 76 లక్షలు మాత్రమే గ్రాస్. తెలుగు వారున్న ప్రతీ చోటా బెనిఫిట్ షోల రూపంలో ఇష్టా రాజ్యంగా అభిమానుల్ని దోచుకోవడం, తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్లలో టిక్కెట్ల రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం... ఇవన్నీ కలిపితేనే ఆ మాత్రమైనా కలెక్షన్లు. అది కూడా ప్రకటిస్తున్న కలెక్షన్లలో ఎంత వరకూ నిజమో పబ్లిసిటీ స్టంటో తెలీదు.మొత్తం మీద విపరీతమైన అంచనాలతో వచ్చిన పవన్ 2 సినిమాలూ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. హరిహర వీరమల్లు డిజాస్టర్గా నిలిస్తే... ఓజీ కలెక్షన్లు కూడా పాన్ ఇండియా రేంజిలో లేకపోవడం ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరచింది. పవన్ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన మిగిలిన టాలీవుడ్ హీరోలు ఇప్పటికే గ్లోబల్ స్టార్లుగా రూ.వేల కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే బోలెడంత ఫాలోయింగ్ ఉన్నట్టు చెప్పుకుంటున్న పవన్(Pawan Kalyan) మాత్రం పాన్ ఇండియా ఇమేజ్కి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదని ఓజీ సినిమా కుండబద్ధలు కొట్టినట్టు నిరూపించింది. పైగా ఇమ్రాన్ హష్మీ లాంటి బాలీవుడ్ స్టార్ ను ప్రధాన విలన్గా పెట్టుకున్నా అక్కడి ప్రేక్షకులు కన్నెత్తి కూడా ఓజీని చూడలేదంటే... ఇక చెప్పేదేముంది? కొసమెరుపు ఏమిటంటే... ఓజీ సినిమాకు దర్శకత్వం వహించిన సుజిత్ దర్శకత్వంలోనే వచ్చిన ప్రభాస్ సాహో సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే... వసూళ్లు మాత్రం రూ.250 కోట్లు దాటేశాయి. ఇందులో నార్త్ ఇండియా కలెక్షన్లే అత్యధికంగా ఉండడం గమనార్హం. దీనిని బట్టి పవన్ లేదా ఆయనతో సినిమా తీసేవారు తెలుసుకోవాల్సిన చేదు వాస్తవం ఏమిటంటే... హీరోలు మెప్పించాల్సింది అభిమానుల్ని మాత్రమే కాదు. -
వీళ్లే నా జీవితం.. సెపరేట్గా ఉంటున్నా: నిహారిక
మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ మధ్యే పేరెంట్స్గా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు మగపిల్లాడు జన్మించాడు. అత్తగా ప్రమోషన్ పొందడంతో నిహారిక (Niharika Konidela) ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక అత్తగా ఫుల్ బిజీ అయ్యానంటోంది. ఆమె మాట్లాడుతూ.. మా అన్నకు కొడుకు పుట్టినప్పటినుంచి నాకెవరూ పనులు చెప్పడం లేదు. సెపరేట్గా ఉంటున్నా..ఎందుకంటే నేనెప్పుడూ వాడిని ఎత్తుకునే ఉంటున్నాను. లేకపోతే నీళ్లు తీసుకురాపో, ఆ పని చేయు అంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. వాడు పెద్దయ్యాక యాక్టర్ అవుతానంటే మాత్రం కచ్చితంగా నా బ్యానర్లోనే సినిమా తీస్తాను. ప్రస్తుతం నేను సెపరేట్గా ఉంటున్నాను. అలా అని కుటుంబానికి దూరంగా ఉండను. రెండురోజులకోసారైనా కచ్చితంగా ఇంట్లోవాళ్లందరినీ కలుస్తాను. ఎందుకంటే వీళ్లే నా జీవితం.హీరోయిన్గా సినిమా చేస్తాకుటుంబసభ్యుల ముందుకు వెళ్లానంటే నా ఒత్తిడినంతా మర్చిపోతాను. నా మొదటి సినిమా 'ఒక మనసు'లో నేనంత బాగా నటించలేదు. ఆ మూవీ కోసం నేను చాలా కష్టపడ్డాను. కానీ, అప్పుడు నాకు 20 ఏళ్లే! హీరోయిన్గా ఏదైనా మంచి సినిమా ఆఫర్ వస్తే చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య వచ్చినవాటిలో మిరాయ్ మూవీ నచ్చింది. ఇటీవలే పుస్తకాలు చదవడం కూడా మొదలుపెట్టాను అని నిహారిక చెప్పుకొచ్చింది.చదవండి: అమ్మకు క్యాన్సర్.. నాన్నకలా జరిగితే ఏడవలేదు: షణ్ను ఎమోషనల్ -
అమ్మకు క్యాన్సర్.. నాన్నకలా జరిగితే ఏడవలేదు: షణ్ను ఎమోషనల్
షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth).. యూట్యూబ్లో ఒకప్పుడు వెలుగు వెలిగాడు. వెబ్ సిరీస్లు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్తో బాగా క్లిక్కయ్యాడు. టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్న సమయంలోనే బిగ్బాస్ ఆఫర్ వచ్చింది. అలా తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్లో పాల్గొన్నాడు. అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న ఇతడు బిగ్బాస్లో మాత్రం సిరి హన్మంత్తో లవ్ ట్రాక్ నడిపాడు. దీంతో ఇతడిపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది.వివాదాల్లో షణ్నుషో నుంచి బయటకు వచ్చాక దీప్తి సునయనతో బ్రేకప్.. ఓ కేసులో ఇరుక్కోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతూ సినిమాలు చేస్తున్నాడు. చాలాకాలం తర్వాత తొలిసారి షణ్ముఖ్ ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈమేరకు గ్లింప్స్ వదిలారు. అందులో షణ్ను మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్పై చాలా ఆసక్తి ఉందని మా నాన్నకు చెప్తే చెప్పు తెగుద్ది అన్నారు. జీవితం అయిపోయిందనుకున్నానేను బిగ్బాస్కు వెళ్లకుండా ఉండుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. తర్వాత ఓ కేసులో నా పేరు వచ్చింది. చాలా బాధపడ్డాను. దాన్నుంచి అంత ఈజీగా బయటపడలేకపోయాను. ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను. అలా ఒకరోజు రోడ్డుపై వెళ్తుంటే ఒక పిల్లాడు నన్ను పిలిచి, నువ్వంటే చాలా ఇష్టం అన్నా.. కానీ, ఇప్పుడు నచ్చట్లేదని చెప్పాడు. అప్పుడు నాలో ఆలోచన మొదలైంది. కమ్బ్యాక్ ఇవ్వాలని ఆరోజే నిర్ణయించుకున్నాను.అమ్మకు క్యాన్సర్ఈ మధ్య మా నాన్న రైలు అందుకోవాలన్న ఆత్రంతో ప్లాట్ఫామ్పై పరిగెడుతుండగా బీపీ ఎక్కువై పడిపోయాడు. ఆరోజు నేను బాధను పంటికింద బిగపట్టాను. ఎందుకంటే అమ్మకు క్యాన్సర్. తనకు సర్జరీ జరిగింది. నేను ఏడిస్తే తను ఏడుస్తుంది. అమ్మ ఏడిస్తే కుట్లు ఊడిపోతాయి. అందుకని ఆరోజసలు నేను ఏడవనేలేదు. ఏదేమైనా నేను మా నాన్నకు మంచి కొడుకును కాలేకపోయాను అంటూ షణ్ముఖ్ ఎమోషనలయ్యాడు.చదవండి: పేదల బతుకుల్లో విషాదం.. విజయ్ను అరెస్ట్ చేయాలి: హీరోయిన్ -
‘కరూర్ తొక్కిసలాట’.. పూరి జగన్నాథ్ కీలక నిర్ణయం!
తమిళనాడులో నటుడు, టీవీకే అధినేత విజయ్ రాజకీయ సభ పెను విషాదాన్ని మిగిల్చింది. శనివారం సాయంత్రం కరూర్ జిల్లా వెలుచామైపురం వద్ద జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్, టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.డబుల్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న పూరి.. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. #పూరిసేతుపతి అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ కూడా ప్రారంభించారు. ఈ రోజు (సెప్టెంబర్ 28)న చెన్నైలో టైటిల్, టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే కరూర్ తొక్కిసలాట ఘటనతో తమిళనాడులో విషాద ఛాయలు అలుముకోవడంతో పూరి.. ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు.సెప్టెంబర్ 27వ తేదీన తమిళనాడు కరూరులో టీవీకే సభలో జరిగిన దుర్ఘటన కారణంగా ఈరోజు చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్ లో జరగాల్సిన పూరీ సేతుపతి టైటిల్ , టీజర్ లాంచ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తాం’అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కాగా, ఈ చిత్రానికి 'స్లమ్ డాగ్' అనే టైటిల్ పెట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త నటించగా.. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Puri Connects (@puriconnects) -
పేదల బతుకుల్లో విషాదం.. విజయ్ను అరెస్ట్ చేయాలి: హీరోయిన్
గుండెనిండా దాగిన అభిమానం ఆ గుండె ఆగిపోయేలా చేసింది. అభిమాన నటుడు, నేతను దగ్గరి నుంచి చూడాలని వెళ్లిన వారంతా కళ్లనిండా విజయ్ (Actor Vijay) రూపాన్ని నింపుకుని అక్కడే ఆయువు వదిలారు. కొండంత భవిష్యత్తును ఛిద్రం చేస్తూ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, హీరో విజయ్ శనివారం రాత్రి తమిళనాడులోని కరూర్లో నిర్వహించిన 'మీట్ ది పీపుల్' ప్రచారంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 39 మంది మరణించారు.. 60 మందికి పైగా గాయపడ్డారు.విజయ్ను అరెస్ట్ చేయాలిఇంతటి విషాదానికి కారణమైన విజయ్ను అరెస్ట్ చేయాలంటూ హీరోయిన్ ఓవియా (Oviya) డిమాండ్ చేసింది. ఈ మేరకు 'అరెస్ట్ విజయ్' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. దీనిపై విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోయిన్ను బండ బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు. దీంతో ఆమె తన పోస్ట్ను గంటల వ్యవధిలోనే డిలీట్ చేసింది. తనను తిడుతూ పెట్టిన కామెంట్ల స్క్రీన్షాట్లను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. 'జీవితం జ్ఞానవంతులకు కలలాంటిది, మూర్ఖులకు ఆట, ధనవంతులకు కామెడీ, అదే పేదలకు మాత్రం విషాదం' అని రాసుకొచ్చింది.బిగ్బాస్, సినిమాకేరళ కుట్టి ఓవియా 2007లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. కంగారు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా మారింది. ఇది నా లవ్ స్టోరీ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. కాంచన 3లోనూ యాక్ట్ చేసింది. 90 ఎంఎల్ అనే వివాదాస్పద సినిమాతో సెన్సేషన్ అయింది. ఈ సినిమాలో ఓవియా మహిళలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో చనిపోవడానికి ప్రయత్నించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. గతేడాది ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకవగా.. చూసి ఆనందించండి అంటూ బోల్డ్గా రియాక్టైంది.చదవండి: నా గుండె వణికిపోయింది.. కరూర్ ఘటనపై 'కమల్, రజనీ' -
ఆమెకు ముద్దులిస్తే..వారానికి రూ. 1000 ఇచ్చేది : స్టార్ హీరో
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan).. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి స్టార్గా ఎదిగాడు. ఆస్తులు, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ..ఆయనకు ఈజీగా చాన్స్లు రాలేదు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. హీరోగా చాన్స్ రాకకోవడంతో సెకండ్, థర్డ్ లీడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. 1993లో పరంపర సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కాలం పట్టింది. ఒకానొక దశలో పాత్రల కోసం అడుక్కోవాల్సి వచ్చిందంట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదైరన ఓ వింత ఘటన గురించి చెప్పాడు. డబ్బుల కోసం ఓ మహిళా నిర్మాతకు పదిసార్లు ముద్దులు పెట్టానని చెప్పాడు.(చదవండి: సినిమా బాగోలేకపోతే నేనేం చేస్తా? మహేశ్ ఫ్యాన్స్ అన్న మాటలకు ఏడ్చేశా..)‘కెరీర్ ప్రారంభంలో చాన్స్లు రాలేదు. ఓ మహిళా నిర్మాత ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేది. అయితే ఆమె ఒక కండీషన్ పెట్టింది. తన బుగ్గలపై ముద్దు పెడితేనే డబ్బులు ఇస్తానని చెప్పింది. అలా 10 ముద్దులు పెట్టి వారానికి రూ. 1000 తీసుకునేవాడిని’అని సైఫ్ చెప్పుకొచ్చాడు.(చదవండి: ఇమ్మూ కెప్టెన్సీ, రీతూ జుట్టు.. మరి ఆ ఇద్దరు ఏం త్యాగం చేశారు? శ్రీజకు పనిష్మెంట్!)ఇక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడంతోనే అవకాశాలు వచ్చాయన్న ఆరోపణలపై కూడా ఆయన స్పందించాడు. ‘నాకు సినిమా బ్యాక్గ్రౌండ్( బాలీవుడ్ నటి షర్మీలా ఠాగూర్ కొడుకే సైఫ్) ఉందని, అదృష్టంతో స్టార్ అయ్యానని అంతా అనుకుంటారు. కానీ నాకు అవకాశాలు అంత ఈజీగా రాలేదు. చాలా కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేనని నేను భావిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో రాణిస్తారని అనుకోవడం తప్పు. టాలెంట్ లేకపోతే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేం’ అన్నారు. కాగా సైఫ్కు 2001లో వచ్చిన ‘దిల్ చాహ్తా హై’ మూవీతో మంచి బ్రేక్ వచ్చింది. ఈ చిత్రంలో పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. చివరగా జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్ అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్తో కలిసి ‘హైవాన్’అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ థ్రిల్లర్ చిత్రానికి పిరయదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. పదిహేడేళ్ల క్రితం హిందీ చిత్రం ‘తషాన్’ (2008)లో అక్షయ్ కుమార్–సైఫ్ అలీఖాన్ నటించారు. మళ్లీ ఇప్పుడు ‘హైవాన్’లో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్నారు. -
‘కరూర్ తొక్కిసలాట’ ఘటనపై స్పందించిన చిరంజీవి!
తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘తమిళనాడులోని కరూర్లో జరిగిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకోవడం చాలా విషాదకరం, ఈ విషయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు.కాగా,తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో విజయ్(Vijay ) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 39 మంది మరణించారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 10 మంది వరకు చిన్నపిల్లలు, 16 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.Deeply saddened by the tragic stampede at the rally in Karur, Tamil Nadu. My sincere condolences to the families who are living through this unbearable loss. I wish them strength in this difficult time and pray for the speedy recovery of those injured.Om Shanti 🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025 -
ఢిల్లీ సీఎంతో కలిసి బతుకమ్మ ఆడిన ఉపాసన
మెగా హీరో రామ్చరణ్ సతీమణి, బిజినెస్ ఉమెన్ ఉపాసన (Upasana Konidela) బతుకమ్మ ఆడారు. తెలంగాణ పండుగను దేశరాజధాని ఢిల్లీలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఢిల్లీలోని ఓ కళాశాలలో శనివారం (సెప్టెంబర్ 27న) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సీజన్లో నా మొదటి బతుకమ్మను రేఖాగారితో జరుపుకున్నాను అంటూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశారు. కాలేజీ స్టూడెంట్స్తో బతుకమ్మఇందులో ఉపాసన, రేఖా గుప్త.. కాలేజీ విద్యార్థులతో కలిసి అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఆడారు. పండుగ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న సీఎం రేఖా.. ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బతుకమ్మ అంటే పూల పండగ మాత్రమే కాదు. మాతృత్వం, జీవితం, ప్రకృతిని సెలబ్రేట్ చేసుకోవడం..మాతో కలిసి బతుకుమ్మ జరుపుకున్నందుకు థాంక్స్ఢిల్లీలో ఉన్న తెలుగువారు ఈ నగర అభివృద్ధిలోనూ భాగమయ్యారు. తమ సంస్కృతికి కొత్తరంగులు అద్దారు. ఈ పండగ సందర్భంగా.. మనందరం మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని, వాటిని తర్వాతి తరాలకు అందివ్వాలని ప్రతిజ్ఞ చేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ పోస్ట్కు ఉపాసన స్పందిస్తూ.. రేఖా గుప్తాగారు మీరు అద్భుతమైన ముఖ్యమంత్రి. తెలంగాణ సంస్కృతిని సెలబ్రేట్ చేస్తూ, బతుకమ్మ పండగను మాతో కలిసి జరుపుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Rekha Gupta (@officialrekhagupta) Rekha Gupta ji you are an amazing CM. Thank you for embracing our Telangana culture and celebrating Bathukamma Panduga with us. Jai Hind. 🙏❤️ https://t.co/wY7xGYp9DS— Upasana Konidela (@upasanakonidela) September 27, 2025చదవండి: నేనేం తప్పు చేశానని..? డార్క్ రూమ్లో కూర్చుని ఏడ్చా: తమన్ -
నేనేం తప్పు చేశానని..? డార్క్ రూమ్లో కూర్చుని ఏడ్చా: తమన్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (S Thaman).. ఇండస్ట్రీకి ఎన్నో మ్యూజికల్ బ్లాక్బస్టర్స్ ఇచ్చాడు. స్టార్ హీరోలందరి సినిమాలకు పని చేశాడు. అల వైకుంఠపురములో సినిమాకుగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. తమన్.. చివరగా ఓజీ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేనేం తప్పు చేశా?ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.. 'ఓ సినిమా విషయంలో మహేశ్బాబు (Mahesh Babu) అభిమానులు నన్ను నానామాటలన్నారు. ఎంతో బాధపడ్డాను. నేనేం తప్పు చేశాను? మహేశ్బాబుగారికి నేనేం బ్యాడ్ మ్యూజిక్ ఇచ్చాను? నేను ఏ తప్పు చేయలేదే? అని డార్క్ రూమ్లో కూర్చుని ఏడ్చాను. సినిమా బాగోలేకపోతే దానికి మనమేం చేస్తాం? ఈ విషయం అభిమానులెందుకు అర్థం చేసుకోరని బాధేసింది.అండగా ఉన్నాడునా బాధను అర్థం చేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆరు నెలలవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండమన్నాడు. ఆ నెగెటివ్ కామెంట్లు ఏవీ చూడొద్దన్నాడు. నేను నీతో ఉన్నా.. నేను చూసుకుంటా.. నువ్వు మళ్లీ నిరూపించుకోగలవు అని ధైర్యం చెప్పాడు' అని పేర్కొన్నాడు. కాగా మహేశ్బాబు నటించిన బిజినెస్మెన్, ఆగడు, దూకుడు, సర్కారువారిపాట, గుంటూరు కారం చిత్రాలకు తమనే సంగీతం అందించాడు.చదవండి: షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి.. హార్ట్స్ దోచేస్తున్న తెలుగమ్మాయి -
షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి.. హార్ట్స్ దోచేస్తున్న తెలుగమ్మాయి
ప్రేక్షకుల మనసుకు దగ్గరవ్వాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు. ఎంచుకున్న పాత్రలో ఇమిడిపోయి నటించాలి. అలాంటి నటనతో మన పక్కింటి అమ్మాయిలా ఉందేంటి? మనింటి అమ్మాయిలానే ఉంది.. అనుకునేట్టుగా దగ్గరవుతున్న నటి శివాని నాగారం. ఆకర్షించే కళ్లు, ఆకట్టుకునే నటన ఈ తెలుగమ్మాయి సొంతం. ఈ లిటిల్ హార్ట్ గురించి మరెన్నో విశేషాలు మీకోసం..ఆ సినిమాతో క్లిక్అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాలో వెండితెరపై మెరిసిన నటి శివాని (Shivani Nagaram). మొదటి సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో శివాని కుర్రాళ్లకు క్రష్గా మారింది. శివాని స్వస్థలం హైదరాబాద్. విల్లా మేరీ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె మొదట ‘అంతర్గత’ అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. తర్వాత ‘మిస్టర్ గర్ల్ ఫ్రెండ్’ అనే వెబ్ సిరీస్ చేసి తెలుగు యువతకు ముందుగానే పరిచయమైంది.చాలా అవకాశాలొచ్చాయి, కానీ..చిన్నతనం నుంచే శివాని సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకుంది. ఖాళీ సమయాల్లో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ క్లాసులు తీసుకోవడం తనకెంతో ఇష్టమట! సోషల్ మీడియాలో ఆమె తన తమ్ముడితో కలిసి పాటలు పాడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటుంది. దాన్నిబట్టి ఆమెకు సంగీతంపై ఉన్న ఇష్టం అర్థమవుతుంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ హిట్ అయ్యాక, చాలా అవకాశాలు వచ్చాయి కాని, ఒప్పుకోలేదు. ఎందుకంటే అదే తరహా క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదు. నాకు ఎప్పటికప్పుడు చేంజ్ ఓవర్ ఉండాలి.నిత్యవిద్యార్థినిఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కదా.. నేనింకా యాక్టింగ్ లో చాలా నేర్చుకోవాలి. నిత్యవిద్యార్థినిగా ఉండేందుకు సిద్ధంగా ఉంటాను. నా దృష్టిలో సినిమాలు, వెబ్ సిరీస్లు రెండూ గొప్పవే. నటిగా నన్ను మలచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాననే నమ్మకం నాకుంది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి. వచ్చి మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని ఎప్పుడూ కోరుకుంటాను. కాలేజీ రోజుల్నుంచే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది. దాన్ని మా కుటుంబ సభ్యులూ ప్రోత్సహించారు. వాళ్లు నన్నెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు.ఆ హీరోయిన్కు అభిమానినినేను హీరోయిన్ సమంతకు పెద్ద ఫ్యాన్. శ్రీదేవి గారు, సావిత్రి గారి నటన అంటే చాలా ఇష్టం. 'నువ్వు హీరోయిన్ కాకపోయుంటే ఏమయ్యేదానివి’ అని చాలామంది అడుగుతుంటారు. హీరోయిన్ కాకుంటే కచ్చితంగా సింగర్ అయ్యేదాన్ని. నాకు మ్యూజిక్, డ్యాన్స్ అంటే ప్రాణం. నాకు కథ, అందులో నా క్యారెక్టర్ చాలా ముఖ్యం. అవి నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటాను. అంతే తప్ప, గ్లామరస్ రోల్స్ మాత్రమే చేయాలని అనుకోవట్లేదు. నేను రెండు సినిమాలే చేశాను. వాటికే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతలా ప్రేమిస్తుండటం చూస్తే, చాలా అదృష్టవంతురాలిని అనిపిస్తుంది.చదవండి: దమ్ముంటే నాకు సైట్ కొట్టి చూడండి : హీరోయిన్ -
దమ్ముంటే నాకు సైట్ కొట్టి చూడండి : హీరోయిన్
కొందరు కథానాయికలు సినిమాల్లో బాక్సింగ్లో దుమ్ము రేపి ఉండవచ్చు. అయితే నిజ జీవితంలోనే బాక్సింగ్లో అదరగొట్టిన నటి రితికాసింగ్. అవునుఉ రియల్ బాక్సర్గా బరిలో రఫ్పాడించి విన్నర్గానిలిచిన ఈ బ్యాఊటీ ఇరుదుచుట్ర చిత్రంతో రీల్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులోనూ రీమేక్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులకు రితికా సింగ్ను పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ ఉత్తారణి జాణ వరుసగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల వేట్టయాన్ చిత్రంలో రజనీకాంత్తో కలిసి పోలీస్ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ భామ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళ చిత్ర పరిశ్రమలో ఒక్కో నటుడు ఒక్కో విధంగా మానవత్వంతో ప్రశాశిస్తున్నవారేనన్నారు. అలాంటి వారితో నటించిన తరుణాలు తన మనసులో ఎప్పటికీ పదిలమేనన్నారు. అలాంటి వారిలో ఒక్కరిని ఎంపిక చేయాలంటే అది రజనీకాంత్ నే అన్నారు. ఆయన ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా..ఇతరులపై చూపించే ప్రేమాభిమానాలు ఎపప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తాయన్నారు. మహిళలపై అత్యాచారాలంటేనే తనలో కోపం కట్టలు తెంచుకుంటుదన్నారు. మిమ్మల్ని ఎవరైనా సైట్ కొడితే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు కొంచెం పక్కకు రమ్మంటానని, ధైర్యం ఉంటే అలాంటోడిని రమ్మనండి చూద్దాం అని సవాల్ చేశారు. వైవిధ్యమైన కథా పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నట్లు రితికాసింగ్ తెలిపారు. -
35 ఏళ్ల తర్వాత తల్లైయిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!
సినీ తారల పెళ్లిళ్లు కాస్త లేట్గానే అవుతుంటాయి. వయసులో ఉన్నప్పుడు కెరీర్పైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. పెళ్లి చేసుకుంటే ఆఫర్లు రావనే భయంతో చాలా మంది హీరోయిన్లు వివాహాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లయిన తర్వాత కూడా సినిమా చాన్స్లు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు హీరోయిన్కి పెళ్లి అయిందంటే.. ఇండస్ట్రీకి దూరం అయినట్లే. మళ్లీ తెరపై కనిపించేవాళ్లు కాదు. అందుకే పెళ్లి కాస్త లేట్గా చేసుకునేవాళ్లు. దీంతో పిల్లలను కూడా లేటు వయసులోనే కనేవాళ్లు. 42 ఏళ్ల వయసులో కత్రినా కైఫ్ ఇప్పుడు గర్భవతి అయింది. కత్రినా మాత్రమే కాదు.. చాలా మంది తారలు 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అమ్మగా ప్రమోషన్ పొందారు. అలా తల్లైయిన తారలపై ఓ లుక్కేద్దాం.కరీనా కపూర్కరీనా కపూర్ 2012లో నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. 36 ఏళ్ల వయసులో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో రెండో బిడ్డకు జన్మనిచ్చింది.బిపాషా బసుబిపాషా బసు 2016లో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత 2022లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అప్పటికీ బిపాషా వయసు 43 ఏళ్లు.ఐశ్వర్యరాయ్38 ఏళ్ల వయసులో ఐశ్వరరాయ్ బచ్చన్ తల్లయింది. 2011లో ఆమె ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పేరు ఆరాధ్య. ఐశ్వర్య-అభిషేక్ల వివాహం 2007లో జరిగింది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఐశ్వర్య అమ్మగా ప్రమోషన్ పొందింది.రాణి ముఖర్జీ2015లో రాణి ముఖర్జీ ఓ బిడ్డకు జన్మన్చింది. అప్పటికే ఆమె వయసు 37 ఏళ్లు. లేటు వయసులో తల్లయ్యారు. 47 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికిగాను ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. -
‘కె-ర్యాంప్’ అంటే బూతు కానేకాదు.. అర్థం చెప్పిన డైరెక్టర్
కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘కె-ర్యాంప్’( K Ramp). ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే బూతు సినిమా అని ట్రోల్ చేశారు. ఇక ట్రైలర్లో కూడా ఒకటి రెండు బూతు పదాలు ఉండడంతో..కె-ర్యాంప్ అంటే కూడా బూతు పదమే అని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టైటిల్పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. కె-ర్యాంప్ అంటే అసభ్యపదం కాదని.. దాని అర్థం కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని అన్నారు. ఆయనను దృష్టిలో పెట్టుకొనే ఈ స్క్రిప్ట్ రాశానని చెప్పారు. తాజాగా చిత్రయూనిట్ నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకుడు జైన్స్ నాని మాట్లాడుతూ.. ‘టైటిల్ చూసి అది బూతు పదం అని అంతా అనుకుంటున్నారు. కానీ మా ఉద్దేశం అది కాదు. కె-ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్. ఈ సినిమాలో హీరో పేరు కుమార్.. అందుకే టైటిల్ అలా పెట్టాం’ అన్నారు.కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) మాట్లాడుతూ.. థియేటర్లో కూర్చుని నవ్వుకునే వైబ్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కన పెడితే నాకు నాని రూపంలో మంచి బ్రదర్ దొరికాడు. లైఫ్లో నానిని ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాను. సెట్కు వెళ్లగానే ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకొని 20 నిమిషాలు నవ్వుకునే వాళ్లం. ఇది రిలీజ్ అయ్యాక ఆడియన్స్ కూడా అలానే నవ్వుతారు’ అన్నారు.ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేశ్ మాట్లాడుతూ.. ‘‘ దర్శకుడు జైన్స్ నాని ఈ కథ చెప్పగానే, రెండే రెండు మాటలు చెప్పా. ‘నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు. ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్’ అని చెప్పా. యూత్తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడొచ్చు. ముఖ్యంగా మేనమామ, మేనల్లుడు కలిసి చూడ్సాల్సిన చిత్రమిది’ అన్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: ధర్మ మహేశ్
ధర్మ మహేశ్ (Dharma Mahesh).. హీరోగా చేసింది రెండే రెండు సినిమాలు (సిందూరం, డ్రింకర్ సాయి).. కానీ సినిమా వార్తలకంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. అదనపు కట్నం అడుగుతున్నాడని, వేరే మహిళలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ మహేశ్పై సంచలన ఆరోపణలు చేసింది భార్య, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి. ఈ మేరకు బిగ్బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరి (Rithu Chowdary) అతడి ఫ్లాట్కొచ్చిన వీడియోలు బయటపెట్టింది. మీడియా ముందుకు ధర్మ మహేశ్రీతూ కోసం అతడు గొడవపడ్డ చాటింగ్ స్క్రీన్షాట్స్ కూడా రిలీజ్ చేసింది. మహేశ్తో పాటు అతడి కుటుంబాన్ని సైతం నిందించింది. ఈ వివాదంపై చాలారోజులుగా సైలెంట్గా ఉన్న మహేశ్ ఎట్టకేలకు నోరు విప్పాడు. రీతూ తనకు ఫ్రెండ్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ గౌతమి (Gautami Chowdary) వరుస ఆరోపణలు చేస్తూనే ఉంది. దీంతో ఓపిక నశించిన మహేశ్.. తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. తాను కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే గౌతమి కూడా ఎన్నో తప్పులు చేసిందన్నాడు. తన ఫోన్ నెంబర్ తెలీదుఅతడు ఇంకా మాట్లాడుతూ.. గౌతమి ఫోన్లోని సెకండ్ నెంబర్ ఏంటో కూడా నాకు తెలీదు. అడిగితే.. నీ ప్రైవసీ నీది, నా ప్రైవసీ నాది అంటుంది. మొగుడ్ని.. నాకే నెంబర్ చెప్పదు. రాత్రి వేరే ఎవడి కారులోనో బర్త్డే పార్టీకి వెళ్లొస్తుంది. బాగా తాగి నా ఫోటోను కూడా కాల్చేసింది. ఇవన్నీ నేనెలా తట్టుకోవాలి. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందు గుంటూరులో ఒకే గదిలో కలిసున్నాం. ఆ సమయంలో అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు నాకింకా 19 ఏళ్లే!పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీఅయినా సరే నేను నిలబడతాను, ప్రెగ్నెన్సీ ఉంచుకోమన్నాను. కానీ తను ఒప్పుకోలేదు. పరువు పోతుందని అబార్షన్ చేయించుకుంది. వేలెత్తి నన్ను చూపించేముందు నిన్ను నువ్వు చూసుకో అంటున్నా.. నీకూ, నాకు పెద్ద తేడా ఏం లేదు. మే నెలవరకు కలిసుందామనే ప్రయత్నించాను. నేను గౌతమితో తప్ప ఎవరితోనూ ఎమోషనల్గా కనెక్ట్ అవలేదు. నా కొడుకును చూపించమంటే లెక్కచేయడం లేదు. మే తర్వాత నుంచి నా కొడుకును ఇంతవరకు చూపించలేదు. నేను డబ్బు గురించి అడిగానంటే చెప్పుతో కొట్టండి. నాకు డ్రగ్స్ అలవాటు లేదు. కావాలంటే రక్తపరీక్షలు చేయండి.ఈ ఇంటర్వ్యూలో నేను అబద్ధం చెప్తే కుక్కచావు చస్తాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ధర్మ మహేశ్.చదవండి: నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త -
ఓజీలో పవన్ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ (They Call Him OG Movie). ఇందులో పవన్.. గ్యాంగ్స్టర్గానే కాకుండా తండ్రి పాత్రలోనూ యాక్ట్ చేశారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. సినిమాలో పవన్- ప్రియాంకల కూతురిగా సాయేషా అనే పాప యాక్ట్ చేసింది. వెండితెరపై ఆమె నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం!ఇదే ఫస్ట్ మూవీ!ముంబైకి చెందిన సాయేషా ఇప్పటివరకు అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించింది. సంతూర్, లెన్స్కార్ట్, ఫస్ట్క్రై వంటి బ్రాండ్స్తో పాటు రియల్ ఎస్టేట్ యాడ్స్లోనూ యాక్ట్ చేసింది. మృణాల్ ఠాకూర్తోనూ ఓ రియల్ ఎస్టేట్ యాడ్లో నటించింది. ఇప్పుడీ చిన్నారి సినిమాల వైపు అడుగులు వేస్తోంది. లాగౌట్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. కానీ ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఓజీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది. అందరికీ థాంక్స్ఈ పాపను చూసిన వారంతా తనకు మంచి భవిష్యత్తు ఉందని మెచ్చుకుంటున్నారు. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్తో దిగిన ఫోటోలను సాయేషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్ ప్రియాంకతో ఆటలు ఆడుకోవడం మిస్ అవుతానంది. తనకు చాక్లెట్లు ఇచ్చిన అర్జున్దాస్కు కృతజ్ఞతలు చెప్పింది. ప్రకాశ్ రాజ్తో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజిత్కు, అలాగే పవన్ సహా ఓజీ టీమ్కు థాంక్స్ చెప్పింది. View this post on Instagram A post shared by Sayesha Shah (@sayesha0307) చదవండి: ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు -
చార్మినార్లో అనన్యా పాండే సందడి.. వీడియో వైరల్
స్టార్ట్ కెమెరా... టేక్ అన్నారు డైరెక్టర్ వివేక్ సోని. అంతే... హీరో లక్ష్య బైక్ స్టార్ట్ చేశారు... వెనకాల హీరోయిన్ అనన్యా పాండే కూర్చుకున్నారు. రయ్మంటూ బైక్ ముందుకు సాగింది. సీన్ పూర్తయింది. షాట్ ఓకే అన్నారు వివేక్. ఈ షూటింగ్ జరిగింది ఎక్కడంటే హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర. ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో లక్ష్య, అనన్య కలర్ఫుల్గా కనిపించారు. అక్కడి జనాలు వీరిని గుర్తు పట్టి, చుట్టుముట్టారు. సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. లక్ష్య, అనన్యా పాండే జంటగా నటిస్తున్న కాలేజ్ రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’ కోసమే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఈ ఇద్దరూ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం షూటింగ్ని వారం రోజుల పాటు హైదరాబాద్లో ప్లాన్ చేశారు. చార్మినార్ తర్వాత మరో పాపులర్ ప్లేస్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by mainly_hyderbadi ❤️📌 (@mainly_hyderabadi) -
ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు
తల్లయ్యాక తనకంటూ కొన్ని హద్దులు గీసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone). రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేనని కరాఖండిగా చెప్తోంది! భారీ బడ్జెట్ సినిమాలకు ఇలాంటి కండీషన్లు పెడితే కష్టమని కల్కి 2 నుంచి ఆమెను తప్పించేశారు. దానికంటే ముందు స్పిరిట్ నుంచి కూడా దీపికా సైడ్ అయిపోయింది. దీంతో అసలు 8 గంటల షిఫ్ట్ తప్పా? ఒప్పా? అని ఎవరికి వారు చర్చల్లో మునిగిపోయారు.8 గంటలే దీపిక పనిఅయితే ఈ విషయంపై దీపికాపై ఫన్నీ సెటైర్లు వేసింది బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan). తన చెఫ్ దిలీప్తో కలిసి ముంబైలో నటుడు రోహిత్ సరఫ్ ఇంటికి వెళ్లింది ఫరా. ఈ మేరకు ఓ యూట్యూబ్ వ్లాగ్ చేసింది. అందులో మొదటిసారి రోహిత్ సరఫ్ తల్లిని చూపించింది. నా సినిమా కోసం దీపికను ఒప్పించడానికి కూడా ఇంత సమయం పట్టలేదేమో! అంటూ రోహిత్ తల్లిని హత్తుకుంది. ఇంతలో ఫరా చెఫ్ దిలీప్.. దీపిక పదుకొణె మేడమ్ మన షోకి ఎప్పుడొస్తారు? అని అడిగాడు. అందుకామె.. దీపిక ఇప్పుడు రోజులో 8 గంటలు మాత్రమే పని చేస్తుంది. మన షోకి వచ్చేంత తీరిక తనకెక్కడిది? అంది. సినిమాఫరాఖాన్ దర్శకత్వంలోనే దీపిక బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. వీరి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఓం శాంతి ఓం. ఇందులో షారూఖ్ హీరోగా నటించాడు. ఫరా, దీపికా, షారూఖ్.. ముగ్గురూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్ (2014) అనే మరో సినిమా చేశారు. ఆమధ్య 'కల్కి' మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె.. చివరగా ఫైటర్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం షారూఖ్ ఖాన్తో కలిసి 'కింగ్' మూవీ చేస్తోంది. అలాగే అట్లీ-అల్లు అర్జున్ సినిమాలోనూ భాగమైంది. ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ అనే హాలీవుడ్ సినిమా సీక్వెల్లోనూ భాగమైనట్లు ప్రచారం జరుగుతోంది.చదవండి: నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త -
నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త
బతికున్నప్పుడు ఆమె చేయి వదల్లేదు, చనిపోయాక తన జ్ఞాపకాలను, గుర్తులను వదలడం లేదు. ఆమె జీవించినప్పుడే కాదు మరణం తర్వాత కూడా తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. 'కాంటా లగా' సాంగ్ ఫేమ్, బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా (Shefali Jariwala) మరణించి మూడు నెలలు కావస్తున్నా ఆమెను క్షణమైనా మర్చిపోలేకున్నాడు భర్త, నటుడు పరాగ్ త్యాగి (Parag Tyagi). అందుకే అణువణువునా ఉన్న ప్రేమను పచ్చబొట్టు రూపంలో హృదయంపై ఆమె ముఖచిత్రాన్ని పదిలంగా పరుచుకున్నాడు. భార్య దిండుపైనే నిద్రతాజాగా 'షెఫాలీ పరాగ్ త్యాగి' అంటూ ఓ పాడ్కాస్ట్ చానల్ను ప్రారంభించాడు. ఇందులో మొదట తన సెల్ఫ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. పరాగ్ మాట్లాడుతూ.. షెఫాలీ బ్రష్తోనే నా పళ్లు తోముకుంటున్నాను. తన దిండుపైనే నిద్రిస్తున్నాను. తన టీషర్ట్స్, షార్ట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. వాటినెప్పుడూ నాపక్కనే పెట్టుకుంటున్నాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తను ఆర్డర్ చేసిన వస్తువులు ఇప్పటికీ డెలివరీ అవుతూనే ఉన్నాయి. ఆమె విడిచిన బట్టల్ని ఇంతవరకు ఉతకలేదు. అవి మరీ చిన్నగా ఉండటం వల్ల ధరించలేకపోతున్నాను. కానీ, వాటిని కప్పుకునే ప్రతిరోజు నిద్రిస్తున్నాను.సీపీఆర్ చేశా..షెఫాలీ చివరిరోజు మా సింబా(పెంపుడు శునకం)ను వాకింగ్కు తీసుకెళ్లమని నాకు చెప్పింది. బయటకు వెళ్లి వచ్చేలోపు అపస్మారక స్థితిలో పడి ఉంది. సీపీఆర్ కూడా చేశాను. రెండుసార్లు శ్వాస తీసుకుంది. ఆ వెంటనే కన్నుమూసింది అని చెప్పుకొచ్చాడు. యాంటీఏజింగ్ డ్రగ్స్ వల్లే షెఫాలీ మరణించిందన్న వార్తలను పరాగ్ కొట్టిపారేశాడు. తనెప్పుడూ డ్రగ్స్ వాడలేదని క్లారిటీ ఇచ్చాడు. కేవలం మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ తీసుకునేదని తెలిపాడు.చదవండి: మిడ్నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు! నేరుగా సీక్రెట్రూమ్కు -
అలాంటి సినిమా చేయాలనుంది.. కోరిక బయటపెట్టిన అదితి శంకర్
సినిమా రంగుల ప్రపంచం.. ఆశల పల్లకి. ఇందులో గొప్పగా రాణించాలన్న ఆశ నటీనటులకు ఉంటుంది. అందుకోసం ఉన్నత ఉద్యోగాలను, వృత్తిని పక్కనపెట్టినవారున్నారు. హీరోయిన్ అదితి శంకర్ (Aditi Shankar) కూడా అదే కోవకి చెందుతుంది. స్టార్ దర్శకుడు శంకర్ కూతురే అదితి. ఈమె వైద్య విద్యలో పట్టభద్రురాలు. అయినప్పటికీ సినిమాపై ఆసక్తితో కథానాయికగా రంగప్రవేశం చేసింది. విరుమాన్ చిత్రంతో సినిమా కెరీర్ మొదలుపెట్టింది. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ తరువాత మావీరన్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్లో బోర్లాపడ్డ బ్యూటీఈమె నటించిన మూడో చిత్రం నేశిప్పాయా పూర్తిగా నిరాశపరచింది. నాలుగో చిత్రం భైరవంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే భైరవం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అలా 2022లో హీరోయిన్గా పరిచయమైన అదితి శంకర్ ఈ నాలుగేళ్లలో చేసిన నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఐదో చిత్రం ఒన్స్ మోర్ నిర్మాణంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది.మోడ్రన్ లుక్లో..అదితి శంకర్ లంగా ఓణీ ధరిస్తే పక్కింటి అమ్మాయిలా, మోడ్రన్ దుస్తులు ధరిస్తే ఈ తరం అమ్మాయిలా కనిపిస్తుంది. ఈ అమ్మడు ఇప్పటి వరకూ పూర్తిగా మోడ్రన్ యువతి పాత్రల్లో నటించలేదనే చెప్పాలి. అయితే అలాంటి పాత్రలో నటించాలన్న ఆశ ఉందనే అభిప్రాయాన్ని తాజాగా అదితి వ్యక్తం చేసింది. ఒక సమావేశంలో అదితి శంకర్ మాట్లాడుతూ.. తండ్రిని చూసి చిన్నతనంలోనే నటినవ్వాలన్న కోరిక బలంగా కలిగిందని తెలిపింది.అలాంటి సినిమా చేయాలనుందితన ఆశను త్రండి శంకర్కు చెప్పగా ముందు చదువు పూర్తి చేయమని చెప్పారంది. దీంతో తనకు ఇష్టమైన వైద్య విద్యను ఎంపిక చేసుకుని దాన్ని కంప్లీట్ చేశానంది. ఆ తరువాత తనకు నచ్చిన సినిమా రంగంలోకి అడుగు పెట్టానని, నటిగా సక్సెస్ కాకపోతే తిరిగి వైద్య వృత్తిని చేపడతానని నాన్నకు చెప్పానని పేర్కొంది. ఇప్పుడు నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపింది. తనకు ఒక చారిత్రక కథా చిత్రంలో నటించాలన్నది ఆశ అని, అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial)చదవండి: నా కుమార్తెకు అనుమతి లేదు.. అందుకే ఆ నెక్లెస్ ధరించా: రాణీ -
హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ కి మరోసారి షాక్!
తెలంగాణలో హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రాకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టికెట్ల పెంపుకు అంగీకరించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 24న ఓజీ మూవీ టికెట్ ధరల పెంపు మొమోని హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేసిని సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి.‘ఓజీ’ యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రివ్యూ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.కాగా, తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ల పెంపుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న రాత్రి వేసిన ప్రీమియర్ టికెట్ ధరను రూ. 800గా నిర్ణయించారు. అక్టోబరు 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వాటిని తగ్గించాల్సి ఉంటుంది. -
వెండితెరపై గోట్స్ ఫైట్..‘మడ్డీ’ డైరెక్టర్ మరో ప్రయోగం!
భారతీయ సినిమాలో తొలిసారిగా మట్టి రేసింగ్ నేపథ్యంలో రూపోందిన మడ్డీ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అదే విజయోత్సాహంతో మరింత ఆసక్తికరమైన కథాంశంతో, ప్రేక్షకులకు థ్రిల్ ను పంచడానికి డా. ప్రగభల్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జాకీ. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయింది.వినుత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోట్స్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ముఖ్యంగా మదురైలో సాంప్రదాయంగా కొనసాగుతున్న ఈ గోట్ ఫైట్ చుట్టు అల్లుకున్న కథ అని తెలుస్తుంది. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థం అవుతుంది. రియల్ లోకేషన్స్ లో చిత్రీకరించడమే కాకుండా 2022 నుంచి అక్కడి సాంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి అదే ప్రాంతంలో ఉన్నట్లు డైరెక్టర్ తెలిపారు.సహజసిద్దంగా చిత్రీకరించేందుకు అక్కడి ప్రజలతో మమేకమై, ప్రతీది తెలుసుకొని జాగ్రత్తగా షూట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాదు సినిమా కావాల్సిన ప్రతీ అంశాన్ని జోడించి ఎంతో గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ను సెట్ చేసినట్లు పేర్కొన్నారు. అందుకోసం నటీనటులు గోట్స్ సంరక్షకులతో కొద్దిరోజులు సవాసం చేసి, వారితో, గోట్స్ తో అనుబంధం పెంచుకున్నట్లు మేకర్స్ తెలిపారు. నటీనటులు అద్భుతమైన ప్రదర్శనతో ఆద్యాంతం కట్టిపడేస్తారని, ఫైట్ సన్నివేశాలకోసం శారీరంగా, మానసికంగా రెడీ అయ్యారని అందుకే ప్రతీ సన్నివేశం అద్భుతంగా వచ్చిందని మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా గోట్ సంరక్షకుల భావోద్వేగాలు కట్టిపడేస్తాయని, అలాగే మదురైలో ఉన్న ఈ సంస్కృతి ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధంచి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు. -
8 ఏళ్లు పేదరికంలోనే ఉన్నాం.. నిజంగా ఇడ్లీ తినేందుకు డబ్బుల్లేవ్!
కుబేరతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ (Dhanush) ఇడ్లీ కొట్టు మూవీ (Idly Kadai Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ధనుష్ స్వీయదర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇటీవల సినిమా ఆడియా లాంచ్ ఈవెంట్లో ధనుష్ తన బాల్యం గురించి చెప్తూ ఎమోషనలయ్యాడు. చిన్నప్పుడు రోజూ ఇడ్లీ తినాలనుండేదని, కానీ తన దగ్గర అంత డబ్బుండేది కాదన్నాడు. ట్రోలింగ్పై స్పందించిన ధనుష్ఏదైనా చిన్నపనికి వెళ్లి, ఆ డబ్బుతో ఇడ్లీ కొనుక్కుని తినేవాడినని గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ కామెంట్స్పై నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ధనుష్ తండ్రి కూడా ఒక దర్శకుడేనని, అలాంటి వ్యక్తి పేదరికంలో ఎందుకుంటాడని, అంతా కట్టుకథ అని విమర్శించారు. ఈ వివాదంపై మధురైలో జరిగిన ఇడ్లీ కొట్టు ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్ స్పందించాడు. నా స్పీచ్ మీరు పూర్తిగా విన్నారా? 1983లో నేను పుట్టాను. 1991లో మా నాన్న దర్శకుడయ్యాడు. ఆ ఎనిమిదేళ్లపాటు మేము కష్టపడుతూనే ఉన్నాం. 1995 తర్వాతే మా కుటుంబ పరిస్థితి మెరుగుపడింది. మేము నలుగురం సంతానం కాబట్టి బయట తినడానికి డబ్బు అడిగినప్పుడు ఇచ్చేవాళ్లు కాదు! అందుకే ఏదైనా పని చేసి కొనుక్కునేవాడిని.అన్న దొంగచిన్నప్పుడు నేను అల్లరి ఎక్కువ చేసేవాడిని. మా అన్న సెల్వరాఘవన్ నన్ను మించిపోయేవాడు. నేను 20 పైసలు, చారానా.. ఇలా కాయిన్లు దాచుకునేవాడిని. అవి నాలుగైదు రూపాయలవగానే మా అన్న వాటిని దొంగిలించేవాడు. క్రికెట్ ఆడేటప్పుడు కూడా మూడున్నరగంటలవరకు ఔట్ అవకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉండేవాడు. నేను బౌలింగ్ చేసేవాడిని. నా వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాడిని. కానీ ఎప్పుడైతే అతడు ఔటయి నేను బ్యాట్ పట్టుకుంటానో.. వెంటనే బౌలింగ్ చేయకుండా అక్కడినుంచి పారిపోయేవాడు. అలా నన్ను చీటింగ్ చేసేవాడు అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.బయోపిక్ కాదుఅలాగే ఇదో ప్రముఖ చెఫ్ బయోపిక్ అంటూ వస్తున్న రూమర్లను కొట్టిపారేశాడు. ఇది ఎవరి బయోపిక్ కాదని, తన బాల్యంలో ఎదురైన సంఘటనలు, అనుభవాలు, తన ఊహలను కలగలిపి ఈ సినిమా తీసినట్లు పేర్కొన్నాడు. ఇడ్లీ కొట్టు సినిమా విషయానికి వస్తే ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అరుణ్ విజయ్, రాజ్కిరణ్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.చదవండి: చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్ -
అధికార మదం తలకెక్కింది.. బాలయ్యపై మెగా అభిమానులు ఆగ్రహం
బాలకృష్ణపై చిరంజీవి అభిమాన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ‘బాలకృష్ణ గతంలో కూడా అనేకసార్లు అమమానకరంగా మాట్లాడడం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి వాటిపై ఎప్పుడు స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన సంయమనం పాటించాం. బాలకృష్ణ కుటుంబం అధికారంలోకి రావడానికి మెగా ఫ్యామిలీ అహర్నిశలూ కృషి చేసిది. ఆ విజ్ఞత మరిచి, అధికార మదంలో బాలకృష్ణ మాట్లాడుతున్నాడు. చట్టసభల్లో సైతం చిరంజీవి ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడేందుకు తెగించారు. ఈ వ్యాఖ్యలు మా దైవం చిరంజీవి గారిని సైతం బాధించాయని ఆయన ప్రతిస్పందన ద్వారా అర్ధమవుతోంది.మెగా కుటుంబం అండగా నిలవకపోయుంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని విన్నవిస్తున్నాం.చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. లేని యెడల బాలకృష్ణ ప్రజాక్షేత్రం తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం’ అని అఖిల భారత చిరంజీవి యువత పేర్కొంది.కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవిని ఏకవచనంతో సంబోధిస్తూ ‘ఎవడు’ అంటూ మాట్లాడాడరు. శాసనసభలో గురువారం శాంతిభద్రతల అంశంపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడిన విషయాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవిని అవమానించారని, ఆయన్ను కలవడానికి వెళితే కలవకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారని శ్రీనివాస్ చెప్పారు. దీనిపై జోక్యం చేసుకున్న బాలకృష్ణ.. కామినేని శ్రీనివాస్ చెప్పినదంతా అబద్ధమని కొట్టిపడేశారు. చిరంజీవి గట్టిగా అడిగితే సీఎం వచ్చాడనేది అబద్ధమని, అక్కడ గట్టిగా ఎవడూ అడగలేదని బాలకృష్ణ అన్నారు. గట్టిగా అడిగితేనే ఆయన కలవడానికి వచ్చాడని, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారనేది అసత్యమని, ఆయన గట్టిగా చెబితే దిగొచ్చాడంట.. అని వ్యంగ్యంగా అన్నారు. ‘గట్టిగా అడిగారా.. ఎవడు అడిగాడు గట్టిగా, అడిగితే వచ్చాడా వీడు కలవడానికి. నాన్సెన్స్’ అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. -
చెల్లికి ఊహించని సర్ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్
అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ! ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది బిగ్బాస్ బ్యూటీ, నటి వితికా షెరు (Vithika Sheru). చెల్లి కృతికను చంటిపాపలా చూసుకుంటుంది. తన పెళ్లి కూడా వితిక చేతుల మీదుగానే జరిగింది. 2022లో కృతిక- కృష్ణల వివాహం ఎంతో ఆడంబరంగా, కన్నులపండగ్గా జరిగింది. రెండు రోజుల క్రితం కృతిక.. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది.చెల్లెలికి సర్ప్రైజ్వితికాకు అసలే సర్ప్రైజ్లంటే చాలా ఇష్టం. తన భర్తను, ఫ్రెండ్స్ను ఎప్పుడూ ఏదో ఒకరంగా సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఈసారి చెల్లెలికి ఊహించని కానుకనిచ్చింది. అదే ఆమె సీమంతం. ఒక గదిని అందంగా డెకరేట్ చేసి చెల్లెలి సీమంతం జరిపింది. ఫ్రెండ్స్, కజిన్స్ సమక్షంలో సర్ప్రైజ్ సీమంతం జరుపుకోవడంతో కృతిక మనసు సంతోషంతో నిండిపోయింది. పెద్దమ్మ గిఫ్ట్వీళ్లంతా కలిసి చిన్నపాటి బేబీ డ్రెస్పై బొమ్మలు పెయింట్ వేశారు. వితిక అయితే అక్షరాభ్యాసానికి రెడీగా టీషర్ట్పై తెలుగు అక్షరాలను గీసింది. అందులో పెద్దమ్మ అనే అక్షరాలను పొందుపరిచి వాటిని అండర్లైన్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను వితికా అభిమానులతో పంచుకుంది. అది చూసిన అభిమానులు.. మీ ఓపికను మెచ్చుకుని తీరాల్సిందే! అవతలివారి సంతోషంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటారు, గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru)చదవండి: ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి తల్లి కన్నుమూత -
ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి తల్లి కన్నుమూత
ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి (Y. V. S. Chowdary) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి యలమంచలి రత్నకుమారి (88) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లితో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఏ లోటూ రాకుండా పెంచిందిమా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’గారు ఒక స్త్రీశక్తి. లారీడ్రైవర్ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యం అందించేది. అంతేకాదు, సినిమాలు చూపించడం దగ్గరి నుంచి దేవాలయ దర్శనాలు, సీజనల్ పిండివంటలు, నిల్వ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. ఎటువంటి లోటు రాకుండా.. తన నోటి మీది లెక్కలతోనే బడ్జెట్ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మగారు.మాలో స్ఫూర్తి నింపిందివీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు.. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన విధానాలతో మాలో కూడా స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మగారు. సినిమాఅటువంటి మా అమ్మగారు (88 యేళ్ళు) 25వ సెప్టెంబరు 2025, రాత్రి 8.31 గంటలకు.. ఈ భువి నుంచి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. వైవీఎస్ చౌదరి విషయానికి వస్తే.. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడిగా మారారు. సీతారామరాజు, యువరాజు సినిమాలు చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, రేయ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. View this post on Instagram A post shared by Yvs Chowdarry (@i_am_yvs) -
ఓం నమః శివాయ.. జటాధర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
సుధీర్బాబు హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’ (Jatadhara Movie). ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకులు. సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రకృష్ణ, రవిప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మిస్తుననారు. ఈ మూవీ నవంబరు 7న విడుదల కానుంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్గురువారం ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధర’ను విడుదల చేశారు. ఈ ట్రాక్లో ‘ఓం నమః శివాయ’ అంటూ వినిపిస్తుంది. రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి పాడారు. ‘‘మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి–విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ‘జటాధర’ చిత్రం చూపించబోతోంది. పౌరాణిక ఇతివృత్తాలు, సూపర్ విజువల్స్తో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీ మ్యూజిక్ కో. చదవండి: జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.. అవతార్-3 తెలుగు ట్రైలర్ -
ఫ్రైడే ధమాకా: ఒక్కరోజే ఓటీటీలో 22 సినిమాలు
ఈ ఫ్రైడే ఓటీటీలో కిక్కిచ్చే సినిమాలు రిలీజవుతున్నాయి. యాక్షన్, హారర్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్.. ఇలా అన్నిరకాల చిత్రాలు ఓటీటీప్రియులను అలరించేందుకు రెడీ అయ్యాయి. వాటిలో ఘాటి, హృదయం పూర్వం, సుమతి వళవు చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి రేపు (సెప్టెంబర్ 26) ఒక్కరోజే ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..జియోహాట్స్టార్👉 హృదయపూర్వం (మలయాళ మూవీ)అమెజాన్ ప్రైమ్👉 ఘాటి (తెలుగు మూవీ)👉 మాదేవా (కన్నడ మూవీ)నెట్ఫ్లిక్స్👉 ధడక్ 2 (హిందీ మూవీ)👉 సనాఫ్ సర్దార్ (హిందీ మూవీ)👉 ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (మలయాళ మూవీ)👉 ది గెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) 👉 అలైస్ (ఇంగ్లీష్ సిరీస్)👉 హౌస్ ఆఫ్ గిన్నీస్ (ఇంగ్లీష్ సిరీస్)👉 మాంటిస్ (దక్షిణ కొరియన్ సినిమా)👉 ఫ్రెంచ్ లవర్ (ఇంగ్లీష్ మూవీ)👉 రుత్ అండ్ బోజ్ (ఇంగ్లీష్ మూవీ)👉 క్రైమ్సీన్ జీరో (కొరియన్ వెబ్సిరీస్ - కొత్త ఎపిసోడ్)జీ5👉 జనావర్: ద బీస్ట్ వితిన్ (హిందీ సిరీస్)👉 సుమతి వళవు (మలయాళ సినిమా)సన్ నెక్స్ట్👉 మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు మూవీ)👉 దూరతీర యానా (కన్నడ మూవీ)ఆపిల్ ప్లస్ టీవీ👉 ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ)👉 ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్)లయన్స్ గేట్ ప్లే👉 డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా)మనోరమ మ్యాక్స్👉 సర్కీత్ (మలయాళ మూవీ)హుళు👉 ద మ్యాన్ ఇన్ మై బేస్మెంట్ (ఇంగ్లీష్ మూవీ)చదవండి: OG మూవీలో హీరోయిన్కు అన్యాయం -
‘ఓజీ’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?
పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను మాత్రం ఈ సినిమా అందుకోలేపోయింది. సాంకేతికంగా సినిమా బాగున్నా.. కథ-కథనం అంతగా ఆకట్టుకోలేకపోయిందని పలు రివ్యూస్ చెబుతున్నాయి. (‘ఓజీ’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఎలివేషన్పైనే ఎక్కువ దృష్టిపెట్టి.. కథనాన్ని గాలికొదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి రిలీజ్ ముందు ఉన్నంత అయితే హైప్ ఇప్పుడు లేదు. మరి ఈ ప్రభావం కలెక్షన్స్పై ఉంటుందో లేదో వీకెండ్లో తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాకు టికెట్ రేట్లు అధికంగా పెంచడంతో సాధారణ సినీ ప్రేక్షకులు థియేటర్స్కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నాలుగు రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అని చాలా మంది అనుకుంటున్నారు. నెట్టింట కూడా ఓజీ ఓటీటీ రిలీజ్పై ఆరా తీస్తున్నారు. ఏ ఓటీటీలో వస్తుంది.. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది.. తదితర విషయాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఆ ఓటీటీలోనే.. ఓజీ డిజిటల్ రైట్స్ని ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 80 కోట్లకు వరకు చెల్లించినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట. ఈ ఒప్పందంతోనే నెట్ఫ్లిక్స్ అంత డబ్బు పెట్టి ఓటీటీ రైట్స్ తీసుకుందట. ఈ లెక్కన అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. -
OG మూవీలో హీరోయిన్కు అన్యాయం
టాలీవుడ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty)కి అన్యాయం జరిగింది. కథానాయికగా తన సినిమాలేవో తను చేసుకుంటున్న ఈ బ్యూటీకి ఐటం సాంగ్ ఆఫర్ వచ్చింది. అదీ ఓజీ మూవీ (They Call Him OG Movie)లో! హీరోయిన్గా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకపోయినా సరే.. పవన్ కల్యాణ్ కోసం తొలిసారి స్పెషల్ సాంగ్కి ఓకే చెప్పింది. అలా థాయ్లాండ్లో ఈ పాటను చిత్రీకరించారు. సర్ప్రైజ్ ఉంటుందన్న బ్యూటీఈ సాంగ్లో పవన్తో కలిసి స్టెప్పులేసిందీ బ్యూటీ! ఈ విషయాన్ని తనే పరోక్షంగా బయటపెట్టింది. ఇటీవల ఓ ఈవెంట్కు వెళ్లినప్పుడు తన నెక్స్ట్ సినిమాల గురించి ప్రస్తావన వచ్చింది. నా సినిమాల గురించి తర్వాత ప్రకటిస్తాను. ఇప్పుడైతే నవంబర్లో ఓజీ మూవీ వస్తుంది కదా.. అందులో ఒక సర్ప్రైజ్ ఉంది. అది చూసి మీరందరూ సంతోషిస్తారనుకుంటున్నాను అంది. కట్ చేస్తే ఓజీ మూవీలో ఆ స్పెషల్ సాంగ్నే తీసేశారు. అది చూసి నేహా అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఎడిటింగ్లో తీసేశారా?ఎడిటింగ్లో నేహా శెట్టినే లేపేయడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి యూట్యూబ్లో అయినా ఆ స్పెషల్ సాంగ్ ఉంటుందేమో చూడాలి! ఓజీ విషయానికి వస్తే.. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్). పవన్ కల్యాణ్ హీరోగా నటించగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఇమ్రాన్ హష్మీ విలన్గా యాక్ట్ చేశాడు. ఓజీ రిలీజ్శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ నేడు (సెప్టెంబర్ 25న) ప్రేక్షకుల ముందుకు రాగా మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. నేహా శెట్టి విషయానికి వస్తే.. డీజే టిల్లు మూవీలో రాధికగా విపరీతమైన క్రేజ్ అందుకుంది. టిల్లు స్క్వేర్లోనూ అతిథి పాత్రలో తళుక్కుమని మెరిసింది. రూల్స్ రంజన్, బెదురులంక 2012, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేసింది. ఈ ఏడాది ఏ సినిమాలోనూ కనిపించలేదు.చదవండి: They Call Him OG Review: ‘ఓజీ’ మూవీ రివ్యూ -
రష్మికకు కొత్త సవాల్.. పోరాడాల్సిందే!
జర్మనీలో జన్మించిన వియత్నామీస్ మూలాలున్న యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ న్గుయెన్(Andy Long Nguyen), ఆయన కుంగ్ ఫూ వారియర్ (2017) యాక్సిడెంట్ మ్యాన్: హిట్మ్యాన్ హాలిడే (2022) వంటి హాలీవుడ్ చిత్రాల నుంచి శివాయ్ (2016), సనక్ (2021) వంటి బాలీవుడ్ చిత్రాల దాకా పనిచేశాడు. ఇటీవల తెలుగు పౌరాణిక సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 ఎడి కి పని చేయడం ద్వారా స్టంట్స్ కొరియోగ్రఫీలో అంతర్జాతీయ కెరీర్ను అందుకున్న టాప్ యాక్షన్ డైరెక్టర్గా నిలిచారు.ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు.‘‘జర్మనీ లో డబ్ చేయబడిన భారతీయ చిత్రాలను చూస్తున్న టీనేజర్గా, అమితాబ్ బచ్చన్ను డైరెక్ట్ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన వయస్సు గురించి తొలుత నాకు ఆందోళన ఉండేది అయితే షూటింగ్ సమయంలో ఆయన తన వయస్సులో సగం మంది కంటే చురుకుగా కదిలారు’’ అంటూ ఆయన చెప్పాడు. ‘‘ దేవుళ్ళు, అమరులు, దిగ్గజాలు, రోబోలు అంతరిక్ష నౌకలతో నా మొదటి పౌరాణిక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం అది. సవాలుగాగానూ, అద్భుతంగా కూడా ఉంది, ’’అని ఆయన గుర్తుచేసుకున్నాడు. నాగ్ అశ్విన్ తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ ‘స్టోరీబోర్డులు లేదా రిఫరెన్స్లపై ఆధారపడకుండా నాగ్ తన టీమ్ని నడిపించే విధానం సూపర్. తక్కువ సూచనలతోనే అందరి దృష్టి తన వైపు మళ్ళించగలిగాడు. అది చాలా ఆకట్టుకుంది.’’ అని చెప్పాడు ఆండీ.తెలుగు సినిమాలో లాంగ్ తదుపరి అతి పెద్ద ప్రాజెక్ట్ మైసా( Mysaa), ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna) నటిస్తోంది. అది కూడా తొలిసారిగా ఆమె ఒక యాక్షన్ క్వీన్గా మారనుంది. ఈ విషయంపై ఆండీ మాట్లాడుతూ ‘‘రష్మికతో అంతకు ముందుగానే పనిచేయాల్సి ఉండింది. ఆమెతో పనిచేయడం పట్ల నేను సంతోషంగా అంతకు మించి ఆసక్తిగా ఉన్నాను. రష్మిక చాలా చురుకైన యువతి.. అయితే నేను డైరెక్ట్ చేయబోయే పాత్ర కోసం తనను తాను మరింత సాన బెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కఠినమైన శారీరక స్టంట్ శిక్షణ పొందవలసి ఉంటుంది, ఇది ఆమెకు పూర్తిగా కొత్త అనుభవం సరికొత్త సవాల్ కూడా ’’అని అంటున్నాడాయన.ఆండీకి, ఫైట్ కొరియోగ్రఫీ అంటే శారీరక కదలికలు గురించి మాత్రమే కాదు – ఇది కథ చెప్పడం కూడా. ‘కథకు ఉపయోగపడే విధంగా పాత్రను మరొక స్థాయికి తీసుకెళ్లే విధంగా యాక్షన్ను రూపొందించడాన్ని ఇష్టపడతాను. ఏ నైపుణ్యాలు అర్ధవంతంగా ఉంటాయో, వారు ఎందుకు పోరాటంలోకి ప్రవేశిస్తారో వారి లక్ష్యం ఏమిటో తెలుసుకోవడం కోసం స్క్రిప్ట్ , పాత్రలను అధ్యయనం చేయడం చాలా ముఖ్యం’’ అని వివరించాడు. అతను యాక్షన్ ను కథనం నుంచి∙విడదీయలేని భాగంగా వర్ణించాడు. ‘యాక్షన్ అనేది సంభాషణ కు మరొక రూపం అది ప్రతి ఇతర సన్నివేశంతో సంపూర్ణంగా మిళితం కావాలి. పోరాటం వెనుక ఉన్న భావోద్వేగం కొరియోగ్రఫీ లాగే ముఖ్యమైనది అంటున్న ఆయన ‘హైదరాబాద్ భారతదేశంలో తన మొదటి గమ్యస్థానంగా తనపై శాశ్వత ముద్ర వేసిందనీ, ఇక్కడి వంటకాలు మరపురానివని చెప్పాడు, గోల్కొండ కోట యాక్షన్–సాహసం కోసం వేచి ఉన్న రెడీమేడ్ మూవీ సెట్ లాగా తనకు అనిపిస్తుంది.‘ అంటూ వర్ణించాడు. -
‘భూతం ప్రేతం’ పెద్ద హిట్ కావాలి: అనిల్ రావిపూడి
‘జబర్దస్త్’ ఫేమ్ యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, ఇమ్మాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భూతం ప్రేతం’. రాజేష్ ధృవ దర్శకత్వంలో బి. వెంకటేశ్వర రావు నిర్మించారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘భూతం ప్రేతం’ టైటిల్, ఫస్ట్ లుక్ చాలా బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూ΄÷ందిన చిత్రం ‘భూతం ప్రేతం’. ఐదుగురు కుర్రాళ్లు అనుకోకుండా భూతానికి చిక్కుకుంటారు. ఆ తర్వాత ఆ భూతం నుంచి వారు ఎలా బయటపడ్డారు? అన్నది కథ. మా చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది... భయపెడుతుంది. ఈ ఏడాదిలోనే మా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: గిరీష్ హోతుర్, కెమెరా: యోగేష్ గౌడ. -
మార్ఫింగ్ వీడియోలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున
సాక్షి, డిల్లీ: తన పేరుతో మార్ఫింగ్ వీడియోలు చేయడం ఆపాలంటూ హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ సాయంతో యూట్యూబ్ షార్ట్స్, వీడియోలు క్రియేట్ చేయడం, వాటికి నాగార్జున హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం ఆపేయాలని పిటిషన్ వేశారు. తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, పేరు ఉపయోగించి వెబ్ సైట్స్ బిజినెస్ చేయడాన్ని ఆపాలని పిటిషన్లో కోరారు. ఐశ్వర్య రాయ్ ఫోటోలు ఉపయోగించి సొమ్ము చేసుకున్న తరహాలోనే తన ఫోటోలు, పేరు వాడుకుంటున్నారని పేర్కొన్నారు.పేరు దుర్వినియోగంఏఐ సాయంతో పోర్నోగ్రఫీ కంటెంట్, లింక్స్ క్రియేట్ చేశారని నాగార్జున తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. టీ షర్టులపై ఆయన ఫోటో ముద్రించి బిజినెస్ చేస్తున్నట్లు వెల్లడించారు. హీరో పేరును, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని, నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడాలని పిటిషన్లో కోరారు. నాగార్జున ఏఐ వీడియోలు అప్లోడ్ చేసిన 14 వెబ్ సైట్స్ ఆ లింక్స్ను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై జస్టిస్ తేజస్ కరియా ధర్మాసం గురువారం విచారించింది. నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కాపాడుతామని తెలిపింది.గతంలో..గతంలో బాలీవుడ్ హీరోహీరోయిన్లు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్ తదితరులు తమ వ్యక్తిగత హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినీనటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే నాగార్జున సైతం కోర్టును ఆశ్రయించారు.చదవండి: పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు: సల్మాన్ ఖాన్ -
తమిళ దర్శకుడు నారాయణమూర్తి కన్నుమూత
సినీ దర్శకుడు నారాయణమూర్తి (59) (R D Narayanamurthy) మంగళవారం రాత్రి చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. నారాయణమూర్తి 'మనదై తిరిడి విట్టాయ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత 'ఒరు పొన్ను ఆరు పయ్యా' చిత్రం చేశారు. పలు టీవీ సీరియల్స్కు సైతం దర్శకత్వం వహించిన నారాయణమూర్తి ఇటీవల అనారోగ్యంతో చైన్నెలోని ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం అంత్యక్రియలుఅక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. స్థానిక పంబల్లో నివసించిన నారాయణమూర్తికి భార్య హంసవేణి, లోకేశ్వరన్ అనే కుమారుడు ఉన్నారు. లోకేశ్వరన్ లండన్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన శుక్రవారం చైన్నెకి రానున్నారు. అదేరోజు పంబల్లో దర్శకుడు నారాయణమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దర్శకుడి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: నేనూ సెలవు తీసుకుంటా! -
ఆ రోజే థియేటర్స్లోకి ‘ఎర్రచీర’
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన తాజా చిత్రం ‘ఎర్రచీర - ది బిగినింగ్’. ఈ మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బిజినెస్ షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని సినిమా తీసుకునేందుకు ముందుకు వచ్చారు.సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని దీపావళి కానుకగా వారం ముందే.. అంటే అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ చిత్ర బృందాన్ని అభినందించారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలిచాయన్నారు.ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు కానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉందని చూసినవారు వెల్లడించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో మదర్ సెంటిమెంట్ తో తీసిన ఈ లేడీ ఓరియేంటెడ్ సినిమా అందరూ కలిసి చూసే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్ కి వచ్చి చూడాలని కోరారు. ప్రమోషన్స్ జోరు పెంచుతున్నామని, అక్టోబర్ 3న రిలీజ్ ట్రైలర్ విడుదల చేసి, అక్టోబర్ 5 న విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపారు. -
ఓటీటీలోకి అనుష్క ‘ఘాటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
అనుష్క శెట్టి(Anushka shetty) నటించిన తాజా చిత్రం ‘ఘాటి’(Ghaati Movie). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలై మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. కథా నేపథ్యం బాగున్నా.. దాన్ని అంతే ఆకర్షనీయంగా తెరపై చూపించడంలో క్రిష్ సఫలం కాలేదు. ఫలితంగా రెండో రోజు నుంచే సినిమా కలెక్షన్స్ తగ్గిపోయాయి. దీంతో విడుదలైన 20 రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ని అమెజాన్ ప్రైమ్(Amazon prime Video) రిలీజ్ చేసింది.స్ట్రీమింగ్ ఎప్పుడంటే..‘ఘాటి’ఓటీటీ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే రిలీజైన 8 వారాలకు ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.ఘాటి కథేంటంటే..ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే ఖరీదైన గంజాయి పంట శీలావతి. ఆ పంటను కోసి, బయటకు తీసుకొచ్చే సత్తా ఘాటీలకు మాత్రమే ఉంటుంది. అలా బయటకు తీసుకొచ్చిన గంజాయిని డ్రగ్స్ మాఫీయా లీడర్ కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), అతని తమ్ముడు కుందుల నాయుడు(చైతన్యరావు) ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అలా ఘాటీలుగా పని చేసిన దేశిరాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క).. ఓ కారణంగా ఆ పని వదిలేస్తారు... వేరే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.కట్ చేస్తే.. కుందుల నాయుడికి తెలియకుండా ఓ గ్యాంగ్ శీలావతి గంజాయిని లిక్విడ్గా మార్చి బయటి ప్రాంతాలకు సరఫరా చేస్తుంటుంది. ఈ ముఠాకి లీడర్గా దేశిరాజు ఉన్నట్లు కుందుల నాయుడికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఘాటీ పని వదిలిన దేశి రాజు, శీలావతి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? శీలావతి క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? దేశిరాజు లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు శీలావతి ఏం చేసింది? అనేదే మిగతా కథ. -
ఇంటిమేట్ సీన్.. హీరోను ఏడిపించిన హీరోయిన్
'బాబీ' సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది డింపుల్ కపాడియా (Dimple Kapadia). హిందీలో అనేక హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది. అయితే అనిల్ కపూర్ (Anil Kapoor)తో చేసిన ఓ సినిమాలో మాత్రం డింపుల్ బాగా ఇబ్బందిపడింది. ఆ సీన్ కహానీ ఏంటో చూసేద్దాం.. 1986లో జన్బాజ్ మూవీలో అనిల్ కపూర్, డింపుల్ కపాడియా జంటగా నటించారు. ఫిరోజ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇందులోని పాటలు ఇప్పటికీ పాడుకుంటూ, వింటూ ఉంటారు.అనిల్ కపూర్, డింపుల్ కపాడియారొమాంటిక్ సీన్అయితే ఈ మూవీలోని ఓ షాట్ కోసం.. ఫిరోజ్ ఖాన్ ఫామ్హౌస్ను ఎంచుకున్నారు. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య కాస్త క్లోజప్ (ఇంటిమేట్) సీన్స్ పెట్టారు. ఆ విషయం హీరోహీరోయిన్లిద్దరికీ చెప్పారు. సమయానికి ఇద్దరూ సెట్లోకి వచ్చారు. కానీ అనిల్ చొక్కా విప్పగానే డింపుల్ అడుగు ముందుకు వేయలేదట! కారణం.. అతడి ఛాతీనిండా గుబురుగా వెంట్రుకలు ఉండటం! దీంతో దర్శకుడు ఆమెను బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. చిట్టచివరకు ఆమె ఆ సీన్ చేసేందుకు అంగీకరించింది. అనిల్ ఛాతీపై వెంట్రుకలు చూసి డింపుల్ అతడిని చాలారోజులపాటు ఏడిపించిందట! ఇకపోతే జన్బాజ్ మూవీలోని ఓ సాంగ్లో హీరోయిన్ శ్రీదేవి తళుక్కుమని మెరిసింది.చదవండి: అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్లో ఉన్నా: ధర్మ మహేశ్ -
వితికా ఇంట వెల్లివిరిసిన ఆనందం.. త్వరలో బుజ్జి పాపాయి
టాలీవుడ్ జంట వరుణ్ సందేశ్- వితికా షెరు (Vithika Sheru) ఇటీవలే కొత్తింట్లోకి గృహప్రవేశం చేశారు. ఇంతలోనే వితికా మరో గుడ్న్యూస్ చెప్పింది. తన చెల్లెలు కృతిక గర్భం దాల్చిందంటూ సదరు ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అందులో కృతిక బేబీ బంప్తో ఫోటోలకు పోజిచ్చింది. చెల్లి పెళ్లికృతిక - కృష్ణల వివాహం 2022లో జరిగింది. చెల్లి పెళ్లిని తన చేతుల మీదుగా జరిపించింది వితికా. పెళ్లయిన మూడేళ్లకు కృతిక తల్లి కాబోతుండటంతో వీరి ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. చెల్లి తల్లి కాబోతోంది, మరి అక్క ఎప్పుడు గుడ్న్యూస్ చెప్తుందో? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.వరుణ్- వితిక జర్నీ'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో వితిక- వరుణ్ జంటగా నటించారు. వీరిద్దరూ 2016లో పెళ్లి చేసుకున్నారు. 2018లో వితిక తొలిసారి గర్భం దాల్చింది. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. కొద్దిరోజులకే గర్భస్రావం అయింది. ఈ సంఘటన తర్వాత వరుణ్తో బిగ్బాస్కు వెళ్లొచ్చింది. దేవుడు కరుణించి పిల్లల్ని ఇస్తే అంతకంటే అదృష్టం ఇంకేముందని ఓసారి ఇంటర్వ్యూలో చెప్పింది. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) చదవండి: కాంతార చూడాలంటే మందు, ముక్క జోలికి వెళ్లకూడదంటూ పోస్ట్! -
అక్కడ అన్ని బూతు సినిమాలే.. మా పేరెంట్స్ నటించవద్దని చెప్పారు: సినీ నటి
ఇంటర్నెట్ పుణ్యమా అని అడల్ట్ సినిమాలు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చేశాయి. కానీ ఒకప్పుడు అంటే షుమారుగా 3 దశాబ్ధాల క్రితం ఈ పరిస్థితి లేదు. పెద్దలకు మాత్రమే అంటూ ఊరించే ఎ సర్టిఫికెట్ సినిమాల కోసం సదరు అడల్ట్ మూవీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. అలాంటి వారందరికీ ఆంగ్ల చిత్రాల తర్వాత మన దేశీయ భాషలో ఒకే ఒక చిత్ర పరిశ్రమ నుంచి సాంత్వన లభించేది. అది...ప్రస్తుతం దేశంలోనే అత్యంత వైవిధ్య భరిత చిత్రాలకు కేరాఫ్గా ఉన్న మళయాల చిత్ర పరిశ్రమ. అదే ఒకప్పుడు బూతు చిత్రాలకు చిరునామాగా ఉండేది. అప్పట్లో షకీలా తదితర అడల్ట్ మూవీ స్టార్స్ మళయాళ సినిమాలపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించేవారు. దాంతో దేశవ్యాప్తంగా బి గ్రేడ్ సినిమాలంటే మళయాళమే అనే గుర్తింపు వచ్చేసింది. బహుశా ఇప్పటి తరానికి పెద్దగా తెలియని ఆనాటి విషయాలను గుర్తుకు వచ్చేలా చేసింది తమిళ సినీనటి ఛార్మిల(Charmila)మలయాళ సినిమాలో ఒకప్పుడు ప్రముఖ తారగా వెలుగొందింది నటి చార్మిల, ఆ పరిశ్రమలో చేరడానికి ముందు తనకు ఆ పరిశ్రమ పట్ల ఉన్న అభిప్రాయం గురించి వెల్లడించింది, గతంలో అంటే 1980– 1990 మధ్య కాలంలో మళయాళ చిత్రపరిశ్రమ ఖ్యాతి బి–గ్రేడ్ చిత్రాలవెల్లువలో కొట్టుకుపోయిందని చెప్పిందామె. ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో మలయాళ సినిమా ఆఫర్లను అంగీకరించకుండా తన తల్లిదండ్రులు అడ్డుకున్నారని గుర్తుచేసుకుంది. ‘‘అప్పట్లో, మలయాళ సినిమా అంటే కేవలం బి–గ్రేడ్ చిత్రాలను మాత్రమే నిర్మిస్తుందని చాలా మంది భావించేవారు, అందుకే నా తల్లిదండ్రులు ఆ పరిశ్రమకు నన్ను పంపడానికి ఇష్టపడలేదు, అందుకే మొదటి ఆఫర్ వచ్చినప్పుడు భయపడ్డా. పేరొందిన దర్శకులు సంప్రదించినప్పుడు కూడా నటించడానికి నిరాకరించాను’’ అంటూ వెల్లడించారామె.కేరళ లోపల కాకుండా ఆ రాష్ట్రం బయట థియేటర్లలో నడిచిన మళయాళ సినిమాల వల్లనే మళయాళ చిత్ర పరిశ్రమకు ఈ రకమైన కళంకం అంటిందని ఆమె అభిప్రాయపడింది. పక్కరాష్ట్రాల్లోని జనం మలయాళ చిత్రాల గురించి మాట్లాడినప్పుడు, వారికి గుర్తుకు వచ్చేది ఎ–సర్టిఫికేట్ సినిమాలు, వాటి పోస్టర్లు మాత్రమే. ‘వారికి మళయాళ వినోదం అంటే డ్రగ్స్ లేడీస్,‘ అంటూ చెప్పిందామె. సీనియర్ నిర్మాత కె బాలాజీ తన కుటుంబాన్ని ఒప్పించిన తర్వాతే బాలాజీ అల్లుడు నేటి సూపర్ స్టార్ మోహన్ లాల్తో తాను నటించానంది. మలయాళ సినిమా అంతా బి–గ్రేడ్ టైప్ కాదని, మోహన్ లాల్ మమ్ముట్టి వంటి ప్రధాన నటులు మంచి చిత్రాలలో మాత్రమే పనిచేస్తారని ఆయన అర్ధం అయేలా చెప్పడంతో చార్మిల తన తొలి మలయాళ ప్రాజెక్ట్లో మోహన్ లాల్ సరసన నటించింది, తరువాత క్లాసిక్ల ద్వారా ఆ భాషలో కెరీర్కు బాటలు వేసుకుంది.ఆ కాలపు మళయాళ చిత్ర పరిశ్రమ గురించి గుర్తు చేసుకుంటూ ‘‘ బి–గ్రేడ్ సినిమాలో పనిచేసిన నటులు ‘పూర్తిగా భిన్నమైన వర్గానికి‘ చెందినవారని వారు బస చేసిన హోటళ్ళు మా హోటళ్ళలా ఉండేవి కావు‘ అని ఆమె చెప్పింది, తరువాత వారిలో చాలామంది సినిమాలను విడిచిపెట్టారని, కొందరు వివాహం తర్వాత విదేశాలకు వెళ్లారని లేదా ఇతర భాషలలో గ్లామర్ పాత్రలకు మారారని ఆమె చెప్పింది.ఆ సమయంలో మలయాళ సినిమా చుట్టూ వివాదాలు ఎలా ఉన్నా చార్మిల సినిమాలు స్వర్ణ యుగంలో భాగంగా పరిగణన పొందాయి. ఆమె తమిళనాడులో జన్మించినప్పటికీ, ’ధనం’లో గ్రామీణ అమ్మాయి థంకమ్ పాత్రలో తన నటనతో మలయాళ ప్రేక్షకుల హదయాలను గెలుచుకుంది. తరువాత ఆమె ’అంకుల్ బన్ ’, ’కేళి’, ’ప్రియపెట్ట కుక్కు’ మోహన్ లాల్, జయరామ్, వినీత్ వంటి తారలతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాల్లో పనిచేస్తోంది. అయినప్పటికీ ఆమె అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలు మాత్రం ఆమె మలయాళ విహారయాత్రలుగా మిగిలిపోయాయి. నటుడు బాబు ఆంటోనీ ఆ తరువాత విడాకులు తీసుకున్న నటుడు హోస్ట్ కిషోర్ సత్యతో ఆమె గత సంబంధాలు సహా ఆమె వ్యక్తిగత జీవితం ఆమె స్క్రీన్ కెరీర్ లాగే అందరి దృష్టినీ ఆకర్షించింది. -
సూర్య పనిమనుషుల చేతివాటం.. రూ.42 లక్షలు స్వాహా!
తమిళ హీరో సూర్య (Suriya)కి భద్రతా అధికారిగా పని చేస్తున్న జార్జ్ ప్రభు ఆర్థికంగా మోసపోయారు. సూర్య ఇంట్లో పనిచేసేవారి చేతుల్లో రూ.42 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్య ఇంట్లో సులోచన, ఆమె కుమారుడు పని చేస్తున్నారు. వీరు సెక్యూరిటీ ఆఫీసర్ జార్జ్కు అధిక వడ్డీ ఆశ చూపారు. దీంతో ఆయన మొదటగా రూ.1 లక్ష ఇచ్చారు. దానికి బదులుగా 30 గ్రాముల బంగారాన్ని వీళ్లు తిరిగిచ్చారు. జార్జ్కు నమ్మకం కుదరడంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం రూ.42 లక్షలను నిందితులకు బదిలీ చేశారు. రూ.2 కోట్ల మేర మోసంఅప్పటినుంచి వాళ్లు డబ్బులివ్వకుండా సైలెంట్ అయ్యారు. దీంతో భద్రతా అధికారి తన డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా సులోచన కుటుంబం అక్కడినుంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఇదే కుటుంబం చెన్నైలో పలువురిని నమ్మించి రూ.2 కోట్ల దాకా మోసాలకు పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ నలుగురూ సూర్య ఇంట్లో పనిచేసేవారే కావడం గమనార్హం! చదవండి: సంజనా హీరోయిన్ కాకుండా ప్రియుడి కుట్ర! చివరకు పిచ్చోడై.. -
‘విద్రోహి’ విజయం సాధించాలి : అల్లరి నరేశ్
రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వి ఎస్ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్ని వివి వినాయక్ , రెండో పాటను ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఆవిష్కరించారు. త్వరలోనే విద్రోహి చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.ట్రైలర్ విడుదల అనంతరం అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘విద్రోహి’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాలో పని చేసిన వారు నాకు చాలా క్లోజ్ పర్సన్స్. వారికి ఈ సినిమా మంచి సక్సెస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’అన్నారు.ఈ చిత్ర నిర్మాత వెంకట సుబ్రమణ్యం మాట్లాడుతూ - మా ‘విద్రోహి’ మూవీ ట్రైలర్ ను విడుదల చేసిన కామెడీ కింగ్ అల్లరి నరేష్గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు హీరో శ్రీకాంత్ గారు, దర్శకుడు వివి వినాయక్గారు , సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ తరపున ఇలాంటి సపోర్ట్ మాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు. -
Bigg Boss 9: ‘సారీ అమ్మా.. ’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన కమెడియన్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 9వ సీజన్ చూస్తుండగానే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఇంట్లో నుంచి ఇద్దరు బయటకు వెళ్లారు. మూడోవారం నామినేషన్స్లో హరీశ్, ప్రియ, కల్యాణ్, రాము, రీతూ,ఫ్లోరా ఉన్నారు. వీరిలో నుంచి ఒకరు బయటకు వెళ్తారు. ఆ ఒక్కరు ఎవరనేది ఈ వీకెండ్లో తెలిసిపోతుంది. ఇప్పటికి వరకు కండబలం, బుద్ది బలంపై ఫోకస్ చేసిన బిగ్ బాస్.. ఇప్పుడు భావోద్వేగ బలంపై దృష్టిపెట్టాడు. కంటెస్టెంట్స్ ఎమోషన్తో గేమ్ ప్లాన్ చేసినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. హౌస్లో ఉన్నవాళ్లకు బిగ్ బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఎవరైతే తొలుత బజర్ ప్రెస్ చేస్తారో..వారికి ఫ్యామిలీ వాళ్లు అందించిన సందేశాలను పంపిస్తామని చెప్పాడు. అయితే అది పొందాలంటే కొంత మూల్యం చెల్లించాల్సిందే అంటూ అక్కడ వందశాతం నిండి ఉన్న బ్యాటరీని చూపించాడు.బటన్ ప్రెస్ చేసి అవకాశం దక్కించుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ముందు మూడు ఆప్షన్లు పెట్టాడు బిగ్బాస్. నాన్న నుంచి వచ్చిన లేఖను పొందలాంటే హౌస్ బ్యాటరీ నుంచి 45 శాతం తగ్గింపోతుందని, అమ్మ నుంచి వచ్చిన ఆడియో మెసేజ్ని పొందాలంటే 30 శాతం బ్యాటరీ తగ్గిపోతుందని, ఫ్యామిలీ ఫోటోని పొందాలంటే 25శాతం తగ్గుతుందని చెప్పి.. ఇందులో ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం అని అన్నాడు. ఇది విని ఇమ్మాన్యుయేల్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ‘నేను ఏడిస్తే..మా అమ్మ తట్టుకోలేదు’ బిగ్బాస్ అంటూ కన్నీళ్లు తూడ్చుకున్నాడు. తోటి కంటెస్టెంట్స్ కోసం ఇమ్మాన్యుయేల్ చివరి ఆప్షన్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది.