Cinema News
-
'నీ ముఖానికి గోల్డ్ చైన్ ఉందా'.. తట్టుకోలేకపోయా: నటి
రంగుల ప్రపంచంలో రాణించాలని ఎంతోమందికి ఉంటుంది. కానీ, కొందరే ఎన్నో కష్టాలను అధిగమించి, ముళ్లదారిపై నడిచి చివరకు అవకాశాలు సాధిస్తారు. నువ్వు యాక్టరేంటి? నీకంత సీన్ లేదు? అని హేళన చేసేవారికి సీరియల్, సినిమా ఛాన్సులతోనే తగిన బుద్ధి చెప్తారు. అలా తాను కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు పడ్డానంటోంది కన్నడ నటి, బిగ్బాస్ బ్యూటీ రాశిక శెట్టి.సూటిపోటి మాటలురాశిక మాట్లాడుతూ.. నా జర్నీ ప్రారంభంలో ఆడిషన్స్ చాలా కష్టంగా ఉండేవి. ప్రోత్సహించడం పక్కనపెట్టి సూటిపోటి మాటలతో విమర్శలు ఎక్కుపెట్టేవారు. చాలామాటలనేవారు. అవకాశాలిచ్చేవారు కాదు. ఒకసారైతే.. నీ ముఖానికి నిజమైన బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా? అని ముఖం మీదే అన్నారు. చాలా బాధపడ్డాను, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాను.ఆ నమ్మకంతోనే..నావల్ల అవుతుందా? అని నాలో నేనే మథనపడ్డాను. అవకాశాలు రాకపోయేవి, వచ్చిన ఒకటీరెండు కూడా చివరి నిమిషంలో చేజారేవి. అప్పుడు మరింత కుంగిపోయాను. అయినా సరే వెనకడుగు వేయాలనుకోలేదు. నాకంటూ ఓ రోజు వస్తుందని ఎదురు చూశాను. ఆ నమ్మకం, ఆశతోనే ఇండస్ట్రీలో అడుగులు వేశాను అని చెప్పుకొచ్చింది. రాశిక శెట్టి.. కన్నడ బిగ్బాస్ 12వ సీజన్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సందేహం చిత్రంలో యాక్ట్ చేసింది.చదవండి: రామాయణ సినిమా రిజెక్ట్ చేశా: రణ్బీర్ కపూర్ -
దుల్కర్తో విభేదాలు? అందుకే దూరం పెట్టారా? హీరో ఆన్సరిదే!
గతేడాది విడుదలైన మలయాళ మూవీ 'లోక' (తెలుగులో కొత్త లోక చాప్టర్:1 పేరిట రిలీజైంది) బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ హీరోలు దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ అతిథి పాత్రల్లో మెరిశారు. దీనికి త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతోంది.దుల్కర్తో విభేదాలు?అయితే ఫస్ట్ పార్ట్ ప్రమోషన్స్లో టొవినో థామస్ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. దాంతో అతడికి, దుల్కర్కు మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా? అని ప్రేక్షకుల్లో సందేహం తలెత్తింది. తాజాగా ఈ అనుమానాన్ని టొవినో నివృత్తి చేశాడు. టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పళ్లిచట్టంబి. ఈ చిత్రం ఏప్రిల్ 10న తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఫోన్ చేయమంటారా?సినిమా ప్రమోషన్స్లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతడికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. లోక ఈవెంట్స్లో ఎవరూ మీ గురించి మాట్లాడలేదు. మీకు, దుల్కర్కు మధ్య ఏదైనా సమస్య ఉందా? అని ఓ విలేకరి ప్రశ్నించాడు. అందుకు టొవినో థామస్ స్పందిస్తూ.. నేనిప్పుడు అతడికి ఫోన్ చేసి అడగనా? (నవ్వుతూ) మామధ్య అలాంటి గొడవలేం లేవు. మేము ఒకరికొకరం చాలాకాలంగా తెలుసు. నేను అతడి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. అప్పుడు అడగండి!తర్వాత తన సినిమాలో విలన్గా నటించాను. అప్పటి నుంచి ఇప్పటివరకు మేమిద్దరం చాలా బాగున్నాం. కావాలంటే నేను మీకు మా వాట్సాప్ చాట్స్ కూడా చూపిస్తాను. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడీ వీడియో క్లిప్పింగ్ తనకు చూపించి ఇద్దరం నవ్వుకుంటాం. ఈ రూమర్స్ సృష్టించడం చాలా ఈజీ. లోక 2 వచ్చినప్పుడు మేమందరం కలిసొస్తాం. అప్పుడు ఈ ప్రశ్న అడగండి, నా గురించి వాళ్లే మాట్లాడతారు అని టొవినో థామస్ చెప్పుకొచ్చాడు.చదవండి: రామాయణ సినిమా ఫస్ట్ రిజెక్ట్ చేశా: రణ్బీర్ కపూర్ -
రామాయణలో శ్రీరాముడి పాత్ర చేయనన్నా..: రణ్బీర్ కపూర్
దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా, సౌత్ సెన్సేషన్ హీరోయిన్ సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. రాఖీభాయ్ యష్ రావణుడిగా కనిపించనున్నాడు.రిజెక్ట్ చేశా..అయితే ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఎగిరి గంతేయడానికి బదులుగా రిజెక్ట్ చేసేందుకే మొగ్గు చూపానంటున్నాడు రణ్బీర్ కపూర్. న్యూయార్క్లో రామాయణ దర్శకుడు నితీశ్ తివారి, నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి ఓ ఈవెంట్కు హాజరయ్యాడు రణ్బీర్. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితమే నితేశ్ తివారి నాకు రామాయణ సినిమా గురించి చెప్పాడు. ప్రధాన పాత్రలో నటించమని కోరగా నేను క్షణం ఆలోచించకుండా నో చెప్పాను.కీలకమైన మలుపునేను ఆ పాత్రకు సెట్ అవనేమో, బాగోనేమో అని నాపై నాకే అనుమానం వేసింది. రాముడి పాత్రకు నేను పూర్తి న్యాయం చేయలేనని తిరస్కరించాను. కానీ, ఆ భయం చాలా త్వరగానే కనుమరుగవగా అంత మంచి ఛాన్స్ వచ్చినందుకు సంతోషించాను. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు నా జీవితానికి చాలా అవసరమయ్యాయి. ఆ సమయంలో నేను తండ్రినయ్యాను. నా పద్ధతుల్ని, జీవితాన్ని మార్చుకోవాల్సిన దశలో ఉన్నాను. శ్రీరాముడి పాత్ర పోషించడం, తొలిసారి తండ్రి కావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ నా జీవితాన్ని కీలక మలుపు తిప్పిన అందమైన అనుభూతి అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా రణ్బీర్ కపూర్, ఆలియా భట్ కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్లో కూతురు రాహా జన్మించింది. రామాయణ విషయానికి వస్తే.. ఏర్ రెహ్మాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్లో దీపావళికి విడుదలవుతుండగా రెండో భాగం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న రామాయణ సినిమా గ్లింప్స్ విడుదల కానుంది.చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన ప్రియాంక చోప్రా -
పూనమ్ పాండే ప్రెగ్నెంట్? నిజమా.. లేక?
పబ్లిసిటీ స్టంట్స్ చేయడంలో నటి పూనమ్ పాండేను మించినవారు లేరు. 2019లో టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే మైదానంలో దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. తీరా భారత్ కప్పు గెలవగా.. ఆమె అన్నంత పని చేయకుండా బీసీసీఐ పూనమ్ను అడ్డుకుంది. రెండేళ్ల క్రితం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో మరణించినట్లు తనపై తనే రూమర్ సృష్టించింది. అది నిజమేనని నమ్మిన జనం తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో క్షమించండి, కేవలం అవగాహన కోసమే ఇలా చనిపోయినట్లు నాటకమాడానంది. మరో డ్రామా?ఇప్పుడు మరో స్టంట్ చేసినట్లు కనిపిస్తోంది. అదేంటంటే.. తను గర్భవతిని అని ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. అదేంటి, భర్తతో విడిపోయిన పూనమ్ ప్రెగ్నెంట్ ఎలా అయింది? అని డౌట్ పడుతున్నారు. అంతలోనే అది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఫోటోలని తేల్చేశారు. ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ కింద ఇది ఏఐతో చేసిన ఫోటో అని స్పష్టంగా రాసుంది. అంటే అందర్నీ ఏప్రిల్ ఫూల్ చేసేందుకు ఇలా తాను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడినట్లు తెలుస్తోంది.సినిమాకాగా పూనమ్ పాండే బాలీవుడ్లో నషా, జీఎస్టీ, ద జర్నీ ఆఫ్ కర్మ, టచ్ ద ఫైర్ వంటి సినిమాలు చేసింది. తెలుగులో మాలిని అండ్ కో చిత్రంలో కథానాయికగా నటించింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. 2020 సెప్టెంబర్ 1న ప్రియుడు సామ్ అహ్మద్ బాంబేని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన పదిరోజులకే అతడు తనపై అత్యాచారం చేశాడని, వేధింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అలా కొంతకాలానికే దంపతులిద్దరూ విడిపోయారు.🤰🍼👶👼 pic.twitter.com/6UUAAc9rKj— Poonam Pandey (@iPoonampandey) March 31, 2026 చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన స్టార్ హీరోయిన్ -
సూరి సినిమాలో హీరోయిన్గా 'డ్యూడ్' బ్యూటీ!
సినిమా ఎవరిని ఎప్పుడు? ఏ స్థాయిలో నిలబెడుతుందో చెప్పలేం. అప్పటివరకు ప్రయత్నలోపం లేకుండా శ్రమిస్తూనే ఉండాలి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సహాయనటుడి నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు నటుడు సూరి. విడుదలై మూవీతో హీరోగా ట్రాక్ ఎక్కిన ఈయన ఇటీవల విడుదలైన మామన్ మూవీ వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.కమెడియన్ నుంచి హీరోగా..ప్రస్తుతం ఇతడు మండాడి సినిమా చేస్తున్నాడు. సముద్రతీరంలో జాలర్ల పడవల పోటీ నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రమిది. మదిమారన్ పుహళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోంది. ఇది నిర్మాణంలో ఉండగా మరో సినిమాకు కమిటయ్యాడు సూరి.రియల్ స్టోరీ ఆధారంగా మూవీరవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ నిర్మించనుంది. 2015లో చెన్నైలో బీభత్సం సృష్టించిన వరదల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం. ఈ మూవీ త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఇందులో సూరికి జంటగా మమిత బైజు హీరోయిన్గా నటించనున్నట్లు వినికిడి. ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ డ్యూడ్ సినిమాతో మరో హిట్ అందుకుంది. హీరోయిన్ ఎవరంటే?విజయ్ హీరోగా నటించిన జననాయకన్లోనూ కీలక పాత్ర పోషించింది. సూర్యకు జంటగా విశ్వనాథ్ అండ్ సన్స్, ధనుష్తో కర సినిమాలు చేసింది. ఇవన్నీ త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సూరితో మమిత బైజు జోడీ కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే! -
నయనతార.. ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్
పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్కి నిజమైన అర్హత సాధించిన నటి నయనతార. ఒక్కో భాషలో ఒక్కో సినిమా చేస్తూ, ఐదు భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నయనతార తెలుగులో ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది. మలయాళంలో రెండు సినిమాలు సెట్స్పై కొనసాగుతున్నాయి. తమిళంలో రెండు సినిమాలు రెడీ అయ్యాయి. మరో సినిమా షూటింగ్లో ఉంది. కన్నడలో ఆమె నటించిన టాక్సిక్ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఇక హిందీ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు సైన్ చేసింది. ఇంతకుముందు షారూక్ ఖాన్తో కలిసి జవాన్ చిత్రంలో నయనతార నటించింది. ఇప్పుడు సల్మాన్తో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో కూడా ఆమె పాత్రకు యాక్షన్ టచ్ ఉండనుందని సమాచారం. ఇలా ఒకేసారి ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ నిజమైన పాన్ ఇండియా హీరోయిన్గా నిలుస్తోంది నయనతార. నయనతార ఈ స్థాయికి రావడానికి గల కారణాల్లో ఆమె సినిమాల ఎంపికలో చూపే వైవిధ్యం ఒకటి. తన నటనతో ఇప్పటికే దక్షిణాది భాషల్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు బాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకునే ప్రయత్నంలో ఉంది. -
ప్రభాస్, మహేశ్, తారక్ సినిమాలు చూస్తా.. అవన్నీ కూడా!
స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడానీ అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. చేసింది ఒక్క సినిమా (ఆజాద్)నే అయినా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఆజాద్ మూవీలో ఉయి అమ్మా పాటలో డ్యాన్స్తో ఇరగదీసి సెన్సేషన్ అయింది. ఈ బ్యూటీ శ్రీనివాస మంగాపురం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. సూపర్స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఘట్టమనేని జయకృష్ణ (రమేశ్బాబు తనయుడు) వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు.సౌత్ సినిమాలంటే ఇష్టంఈ మూవీలో రాషా తడానీ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నాకు దక్షిణాది సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్బాబు.. ఇలా అందరి సినిమాలు చూస్తుంటాను. వాళ్ల సినిమాలన్నీ కొత్త అనుభూతినిస్తాయి. ఇప్పుడదే ఇండస్ట్రీలో భాగం కావడం సంతోషంగా ఉంది. దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను.హీరోయిన్స్ కూడా..హీరోలే కాదు, అక్కడ హీరోయిన్స్ రష్మిక మందన్నా, శ్రీలీల.. ఇలా అందరూ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అలాంటి సినీ ప్రపంచంలో భాగమయ్యే అవకాశం లభించినందుకు గర్వంగా ఉంది. నా జర్నీ చక్కగా ముందుకు సాగుతుందనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే.. ఆర్ఎక్స్ 100, మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు రాషా.. లైకే లైకా అని ఓ హిందీ మూవీ కూడా చేస్తోంది.చదవండి: బాలీవుడ్ అంటే భయపడుతున్న నాగచైతన్య? నిజమిదే! -
అది నిజం కాదు, ఎవరూ నమ్మకండి: ఖుష్బూ
చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా అంటే తమను జనాలతో కలిపే వారధిగా భావిస్తారు. వ్యక్తిగత, వృత్తిపర విషయాలను పంచుకుంటూ ఉంటారు. మరికొందరు ఎప్పుడో ఒకసారి కానీ పోస్టులు పెట్టరు. అయితే సెలబ్రిటీల పేరుతో కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడదే జరిగింది. ఎక్స్ (ట్విటర్)లో ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సి పేరిట ఓ అకౌంట్ ఉంది. త్వరలోనే కొత్తది..దానికి సంబంధించిన స్క్రీన్షాట్ను ఖుష్బూ షేర్ చేస్తూ.. అది ఫేక్ అకౌంట్ అని స్పష్టం చేసింది. తన భర్త ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లేడని వెల్లడించింది. కాబట్టి సుందర్.సి పేరుపై కనిపించే ఖాతాలను నమ్మవద్దని కోరింది. త్వరలోనే అతడికి ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేయనున్నట్లు తెలిపింది. ఇకపోతే ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన ఖుష్బూ.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. మొదట్లో డీఎంకేలో చేరింది. నాలుగేళ్లకే ఆ పార్టీని వదిలి కాంగ్రెస్లో అడుగుపెట్టింది. రాజకీయ ప్రవేశంఆరేళ్లకే కాంగ్రెస్ను సైతం వీడి బీజేపీలో చేరింది. 2025లో ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఇదిలా ఉంటే త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో ఖుష్బూ భర్త సుందర్. సి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎన్డీయే కూటమి మిత్రపక్షమైన పుతియ నీది కట్చి (Puthiya Neethi Katchi (PNK) పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నాడు. మధురై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నాడు. This is a fake account of Director #SundarC . He is not not any social media platform as on date. Pls do not follow this or interact on this or any other similar account on any social platform. . Shall be creating a new and verified account for him soon. 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/9P1VYV67U7— KhushbuSundar (@khushsundar) March 30, 2026 చదవండి: ప్రేమిస్తే ఛాన్స్ మిస్ అయ్యేది.. ముఖానికి గ్రీజు పూసుకోవడంతో..: హీరో -
'ప్రేమిస్తే' ఆడిషన్కు గ్రీజు పూసుకుని వెళ్లా.. అప్పుడుకానీ..!
తమిళ హీరో భరత్.. బాయ్స్, ప్రేమిస్తే, స్పైడర్, హంట్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితుడు. ప్రస్తుతం ఇతడు 'కాళిదాస్ 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన అతడు కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. భరత్ మాట్లాడుతూ... దర్శకుడు బాలాజీ శక్తివేల్ నాకు కాదల్ (తెలుగులో ప్రేమిస్తే పేరిట డబ్ అయింది) కథ చెప్పాడు. హీరో ఎంపిక కరెక్టేనా?చిన్న టౌన్లో మెకానిక్ పనిచేసుకునే అబ్బాయిగా నటించాల్సి ఉంటుందని పాత్ర పరిచయం చేశాడు. నేను కూడా ఒప్పుకున్నాను. తీరా దర్శకుడు హీరోగా నేను కరెక్టేనా? అన్న డైలమాలో పడ్డాడు. నా రంగు, మాటతీరు.. అన్నీ సిటీ అబ్బాయి లక్షణాలే ఉన్నాయి.. పక్కా పల్లెటూరి భాష మాట్లాడే మెకానిక్ రోల్కు సెట్ అవుతానా? లేదా? అన్న అనుమానం ఆయన మెదడును తొలిచేసింది.అదే వీధిలో ఇల్లు కొన్నా..నేనేమో ఎలాగైనా ఈ సినిమా చేయాలనుకున్నాను. ముఖానికి గ్రీజు పూసుకుని ఆడిషన్కు వెళ్లాను. పైగా దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. వారిలాగే మాట్లాడాను. నా తాపత్రయం నిర్మాత ఎస్.శంకర్కు అర్థమైంది. ఆయన ఆఫీసులోనే స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు. అలా కాదల్ మూవీ చేయగా, మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఆ ఆఫీస్ ఉన్న వీధిలోనే నేను ఇల్లు కొనుక్కున్నాను. అదెంతో గర్వకారణంగా అనిపించింది అని భరత్ చెప్పుకొచ్చాడు.చదవండి: నేను సినిమాలు చూడను: ఆమిర్ ఖాన్ -
సినిమాలు చూసే అలవాటు లేదు.. ఇంట్లో ఒప్పుకోరు!: ఆమిర్ ఖాన్
తాను పెద్దగా సినిమాలు చూడనంటున్నాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. చిన్నప్పుడు చేతికి పుస్తకాలిచ్చేవారే తప్ప సినిమాలు చూసేందుకు అనుమతిచ్చేవారు కాదని, దాంతో అదే అలవాటైపోయిందని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను చాలా సాంప్రదాయ కుటుంబంలో పెరిగాను. మా అమ్మానాన్న చాలా స్ట్రిక్ట్.. సినిమాలు చూసేందుకు అంతగా అనుమతిచ్చేవారు కాదు. అమ్మ అనుమతితోనే..దాంతో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడిని. కేవలం దూరదర్శన్లో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, మరీ పాత సినిమాలు మాత్రమే చూశాను. ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే మా అమ్మను అనుమతి అడిగేవాడిని. తను ఓకే చెప్తేనే చూసేదాన్ని, లేదంటే లేదు. అయితే రొమాంటిక్ సినిమాలు చూడటం మాత్రం నిషిద్ధం. కేవలం వారాంతాల్లో మూవీస్ చూసేవాడిని.సినిమాలు చూడనుఅయితే విచిత్రంగా 18 ఏళ్లకే నేను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోగా మారాను. అయితే ఇప్పటికీ నేను పెద్దగా సినిమాలు చూడను. ఫన్నీగా చెప్పాలంటే.. కొందరికి ఫుట్బాల్ ఆడటం ఇష్టం, మరికొందరికి చూడటం ఇష్టం. అలా నేను సినిమాలు చేస్తాను, కానీ చూడను. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన సినిమాలేవీ చూడలేదు. నా ప్రపంచంలో నేను బతికేస్తుంటాను అని చెప్పుకొచ్చాడు.సినిమాఇకపోతే ఆమిర్ చివరగా సితారే జమీన్ పర్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం నిర్మాతగా ఏక్ దిన్, లాహోర్ 1947 అని రెండు సినిమాలు చేస్తున్నాడు. ఏక్ దిన్లో.. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించగా సాయిపల్లవి కథానాయికగా కనిపించనుంది. ఇది వన్ డే అనే థాయ్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కింది. ఏక్ దిన్ మే 1న విడుదల కానుంది.చదవండి: ధురంధర్ రికార్డు బ్రేక్ చేసిన ధురంధర్ 2 -
విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత
బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హీరో రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (42) ప్రమాదవశాత్తూ మరణించారు. సీరియల్ షూటింగ్ కోసం ఆదివారం (మార్చి 29) నాడు పశ్చిమ బెంగాల్లోని డిఘ ప్రాంతానికి వెళ్లిన ఆయన చిత్రీకరణ ముగిశాక కాలక్షేపం కోసం ఒంటరిగా సముద్రంలో విహారానికి వెళ్లారు. అయితే పడవలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయారు. బీచ్లో విషాదంఅది గమనించిన రక్షణా సిబ్బంది వెంటనే ఆయన్ను బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒడిశా- పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్లో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా రాహుల్ బెనర్జీకి భార్య ప్రియాంక సర్కార్, ఒక కుమారుడు ఉన్నారు.ఇండస్ట్రీకి తీరని లోటుహీరో మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాకు ఇష్టమైన నటుల్లో రాహుల్ ఒకరు.. ఆయన ఇక లేరనే వార్త నన్ను షాక్కు గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. తన మరణం బెంగాలీ చిత్రపరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.సినిమారాహుల్ అరుణోదయ్ బెనర్జీ (Rahul Arunoday Banerjee) 1983 అక్టోబర్ 16న జన్మించారు. చిరోదిని తుమీ జే అమర్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ సర్కస్, షోనో మోన్ బోలీ తోమయ్, నా హణ్యతే, కగోజెర్ బో వంటి పలు సినిమాలు చేశారు. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.చదవండి: ఓపక్క షూటింగ్.. మరోపక్క భార్య కోసం ఆరాటం -
ఓపక్క షూటింగ్స్.. మరోపక్క భార్య కోసం హీరో ఆరాటం!
ఒక సినిమా హిట్టయిందంటే.. దానికి సీక్వెల్గా వచ్చేదానిపై భారీ అంచనాలుంటాయి. ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. అయితే ఈ పరీక్షను ఈజీగా నెగ్గేసింది ధురంధర్ టీమ్. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీ వచ్చిన మూడు నెలల్లోపే సీక్వెల్ కూడా రెడీ చేసి వదిలాడు దర్శకుడు ఆదిత్య ధర్.గర్భిణి అయిన భార్య కోసం..రెండో భాగం కూడా ప్రేక్షకుల మనసు గెల్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డు తిరగరాస్తోంది. రణ్వీర్ సింగ్ యాక్టింగ్, డెడికేషన్కు సినీప్రియులు ఫిదా అవుతున్నారు. ధురంధర్ మొదటి భాగం చిత్రీకరణ సమయంలో అతడి భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గర్భిణీ అన్న విషయం తెలిసిందే! ఓపక్క బిజీ షెడ్యూల్లో పని చేస్తూనే మరోపక్క భార్య కోసం సమయం కేటాయించాడట! ఈ విషయాన్ని ధురంధర్ మూవీ నటుడు అభయ్ అరోరా వెల్లడించాడు.నిజంగా అద్భుతంరణ్వీర్ షూటింగ్ మధ్యలో మూడు, నాలుగు రోజులు గ్యాప్ దొరికినా సరే.. వెంటనే విమానం ఎక్కి ఇంట్లో వాలిపోయేవాడు. భార్యను, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. కాస్తంత సమయం దొరికినా కుటుంబం కోసం సమయం కేటాయించేవాడు. అతడు ఫ్యామిలీని చూసుకునే విధానం నిజంగా అద్భుతం అని పేర్కొన్నాడు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె.. రామ్లీలా సినిమా (2013) సెట్లో ప్రేమలో పడ్డారు. 2015లో ఎంగేజ్మెంట్ చేసుకోగా 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2024 సెప్టెంబర్ 8న కూతురు దువా జన్మించింది.చదవండి: ఈవారం ఓటీటీల్లో బోలెడన్ని సినిమాలు.. ఏమేం ఉన్నాయంటే? -
సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బెస్ట్ ఫ్రెండ్స్
ఇప్పటి హీరోలు క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్దంగా ఉంటారు. తమ మేకోవర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. రీసెంట్గా వచ్చిన ఇద్దరు హీరోల లుక్స్ చూస్తే ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు మెగా పవర్స్టార్ రామ్ చరణ్, మరొకరు అతడి బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్.వీరిద్దరూ తమ మేకోవర్స్తో టోటల్ ఇండస్ట్రీని ఆకర్షిస్తున్నారు. ముందుగా రామ్ చరణ్ విషయానికొస్తే, తాజాగా తన పుట్టినరోజు నాడు రిలీజైన 'పెద్ది' సినిమా రెండో గ్లింప్స్ లో అందర్నీ ఆకట్టుకున్న అంశం చరణ్ బాడీ. ఆ పహిల్వాన్ లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో ఆ లుక్ చూస్తుంటే ఇట్టే అర్థమైపోతుంది.చరణ్ ఈ లుక్ కోసం కొన్ని నెలల పాటు మాంసాహారం మానేశాడని సమాచారం. ఓవైపు అయ్యప్ప దీక్షలో ఉంటూనే, మరోవైపు పహిల్వాన్ లుక్ కోసం కసరత్తులు చేశాడు. పహిల్వాన్ లుక్ కోసం నిజమైన పహిల్వాన్లు చేసే కసరత్తులనే చరణ్ చేశాడు. అలా దాదాపు 8 నెలల పాటు ఎంతో కష్టపడి మరీ ఈ కండలు తిరిగే దేహాన్ని చరణ్ సొంతం చేసుకున్నాడు.అయితే శర్వానంద్ బైకర్ రోల్ కోసం మరింత స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చేశాడు. ఆ రోల్ కోసం ఇతడు పడిన కష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. బైకర్ చిత్ర దర్శకుడు శర్వాను 6-8 కిలోలు తగ్గితే చాలన్నాడట. కానీ శర్వానంద్ మాత్రం అంతకుమించి కష్టపడ్డాడు. అక్షరాలా రోజుకు 32 కిలోమీటర్లు పరుగెత్తేవాడని సమాచారం.42 సంవత్సరాల శర్వానంద్ 18 ఏళ్ల బైక్ రేసర్గా కనిపించేందుకు తన శరీరంలోని ప్రతి అణువునూ కరిగించేలా కసరత్తు చేశాడట. ప్రస్తుతం తన ఒంట్లో ఏమాత్రం కొవ్వు లేనంత బక్కపల్చగా తయారయ్యాడు. ఇలా టీనేజర్ గా కనిపించడం కోసం శర్వానంద్ ఏకంగా రెండేళ్లు కష్టపడ్డాడు. ఇక బైకర్ ట్రయిలర్ ఎంత క్లిక్ అయిందో, అందులో శర్వా లుక్ అంతకంటే ఎక్కువగా అందరి ప్రశంసలు పొందింది. -
'డోర్ తీసి చీర మార్చుకో'.. ఆ స్టార్ నిర్మాతను కాలితో తన్నా: నటి
భయం తన బ్లడ్డులోనే లేదంటోంది నటి రాధా ప్రశాంతి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమెను టైగర్, ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 125 సినిమాలు చేసిన ఆమె చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యను ఏకరువు పెట్టింది.అర్ధరాత్రి రాద్ధాంతంరాధా ప్రశాంతి మాట్లాడుతూ.. 'నేనుంటున్న ఫ్లాట్ 2005లో బిల్డర్ దగ్గర కొనుక్కున్నాను. మొదట్లో దాన్ని అద్దెకిచ్చాము. అక్కడేం జరుగుతుందో నాకు తెలిసేది కాదు. 2012లో మేము ఆ ఫ్లాట్కు షిఫ్ట్ అయ్యాం. ఆ అపార్ట్మెంట్లో అక్రమ కార్యకలాపాల ఆఫీసులు నడిపిస్తున్నారని తెలిసింది. వాళ్లు తాగి వచ్చి అర్ధరాత్రి మా ఇంటి తలుపు తట్టేవారు. ముఖ్యంగా వాచ్మెన్ కుటుంబంతోనే నాకు ప్రాణభయం ఉంది.నా ఇంటిని తగలపెట్టారునా ఇంటి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతోంది. 2014లో పోలీసులు రైడ్ చేసి ఆ బిల్డింగ్ను సీజ్ చేశారు. కొంతకాలానికి మళ్లీ ఆ దందా మొదలుపెట్టారు. వీడియో ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. డ్రగ్స్ బిజినెస్ కూడా చేస్తున్నారు. వాళ్ల దందాకు అడ్డొస్తున్నాననే కరోనా సమయంలో ఓ నిర్మాత నా ఇంటిని కావాలని తగలపెట్టాడు. నన్ను అక్కడినుంచి వెళ్లగొట్టాలని దాడులు చేయించారు.నిజాలు మాట్లాడితే నిందలా?నాకు మానసిక పరిస్థితి సరిగా లేదు, పిచ్చి అని ప్రచారం చేసి నన్ను పంపించేయాలని చూశారు. నిజాలు మాట్లాడేవారిపై ఇలాంటి నిందలేస్తారా? కొన్నేళ్లుగా నా ఇంటి విషయంలో నరకం అనుభవిస్తున్నాను. గతంలో కూడా నాపై ఇలాంటి దుష్ప్రచారమే జరిగింది. ఓసారి టచప్ బాయ్ నా ఇంట్లో నుంచి 15 తులాల బంగారం దొంగతనం చేశాడు. కానీ రివర్స్లో నేను అతడిని చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది పేపర్లో వచ్చింది. నేను అతడిపై చేయి చేసుకోలేదు. దీంతో ఆ వార్త రాసిన వ్యక్తిని అమీర్పేట చౌరస్తాలో కాలర్ పట్టుకుని కొట్టాను. నాపై ఇలాంటి మచ్చ వేస్తే మా జీవితం ఏం కావాలి?కాలర్ పట్టుకుని..షూటింగ్స్లో కూడా ఒకటీరెండుసార్లు చేయి చేసుకున్నాను. ఒక ప్రొడక్షన్ మేనేజర్.. ఇప్పుడు ఆయన పెద్ద నిర్మాతయ్యాడనుకోండి.. నేను గదిలో దుస్తులు మార్చుకుంటుంటే డోర్ తీశాడు. నేను వెంటనే వెళ్లి డోర్ లాక్ చేశాను. క్షణం ఆగకుండా తలుపు తడుతూనే ఉన్నాడు. ఏంటని డోర్ తీశాను. అతడు నవ్వుతూ.. ఔట్ డోర్ షూటింగ్లో చెట్టు పక్కనే చీర మార్చుకుంటారు.. నేనిక్కడే ఉంటా.. చీర మార్చుకో అన్నాడు. కోపంతో తన్నాను. కాలర్ పట్టుకుని కొడుతూ నిర్మాత దగ్గరకు తీసుకెళ్లాను' అని గుర్తు చేసుకుంది.ఏఎన్నార్ సలహా'సినిమాలో అన్నిరకాల మనుషులుంటారు. ఎవరేమన్నా సరే సెట్లో యాక్ట్ చేయడం నేర్చుకో.. కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకో.. సర్దుకుని వెళ్లు, అలాగని తప్పు చేయమని చెప్పడం లేదు, సున్నితంగా తప్పించుకుని వెళ్లు అని ఏఎన్నార్ సలహా ఇచ్చారు. కానీ నాకు నిజ జీవితంలో యాక్టింగ్ చేయడం రాలేదు' అని రాధా ప్రశాంతి చెప్పుకొచ్చింది. కాగా ఈమె.. పరువు ప్రతిష్ట, శ్రీదేవి నర్సింగ్హోం, పెళ్లి పందిరి, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం రా, మధ్యతరగతి మహాభారతం.. ఇలా ఎన్నో సినిమాలు చేసింది. బుల్లితెరపై సీరియల్స్ కూడా చేసింది.చదవండి: పెళ్లయితే సినిమాలు మానేయాలని కండీషన్.. అందుకే రిజెక్ట్ చేశా: హీరోయిన్ -
9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’.. నిర్మాత ట్వీట్ వైరల్
ధురంధర్ 2 చిత్రం ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. బాలీవుడ్,టాలీవుడ్ అని మాత్రమే కాదు ఎక్కడ చూసినా.. ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. విడుదలై 10 రోజులు గడుస్తున్నా.. థియేటర్స్కి జనం పోటెత్తుతున్నారు. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రికార్డులను బద్దలు కొడుతుంది. 10 రోజుల్లో రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాంతో పాటు బాహుబలి రికార్డుని కూడా బద్దలు కొట్టింది. ఉత్తర అమెరికా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా బాహుబలి 2 ఉంది. గత 9 ఏళ్లుగా ఉన్న ఈ రికార్డును తాజాగా ధురంధర్ 2 బద్దలు కొట్టింది. కేవలం 10 రోజుల్లోనే 20+ మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘బాహుబలి 2 రికార్డుని ధురంధర్ 2 అధిగమించింది’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ‘నేను కూడా ఇటీవల ధురంధర్ 2 చూశా. ఆద్యంతం ఆస్వాదించా. ఈ చిత్రం అన్ని రికార్డులు బద్దలుకొడుతూ.. కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పడం ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించారు. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. Yesterday I watched #Dhurandhar2TheRevenge and needless to say I loved it and thoroughly enjoyed the film! Happy to see it breaking all the records and setting new box office benchmarks in India and worldwide! Congratulations to the entire team! 👏🏼👏🏼 https://t.co/ATl3o3bNTu— Shobu Yarlagadda (@Shobu_) March 28, 2026 -
హవ్వ, పెళ్లి కాలేదా? ప్రియురాలి కోసం అబద్ధమాడిన హీరో!
తమిళ హీరో రవి మోహన్ ఓపక్క విడాకుల వ్యవహారం, మరోపక్క సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో డేటింగ్ రూమర్స్తో వార్తల్లో ఉంటున్నాడు. విడాకులు మంజూరవకముందే సింగర్తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చాలాసార్లు విమర్శలపాలయ్యాడు. అయితే ఏకంగా అతడికి అసలు పెళ్లే కాలేదని చెప్తూ ప్రియురాలి కోసం ల్యాండ్ కొన్నట్లు ఓ వార్త కోలీవుడ్ టౌన్లో వైరల్గా మారింది.ఇంకా పెళ్లవలేదు!రవి మోహన్, కెనీషా ప్రాన్సిస్ గోవాలో భూమి కొనుగోలు చేశారట. ఈ ప్రాపర్టీ ఖరీదు రూ.40-42 లక్షలని తెలుస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ సంబంధిత పత్రాల్లో రవి మోహన్.. అన్ మ్యారీడ్ అంటూ తనకింకా పెళ్లవలేదని పేర్కొన్నాడట! విడాకులు మంజూరు కాకముందే సింగిల్ అని ఎలా పేర్కొంటారని పలువురు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో.. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సిబ్బంది పొరపాటున అన్మ్యారీడ్ సెలక్ట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.పేరు మార్పుకాగా రవి మోహన్.. ప్రముఖ నిర్మాత సుజాత విజయ్కుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ సంతానం. 2024లో రవి మోహన్, ఆర్తి విడిపోయారు. అయితే చట్టపరంగా ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఇకపోతే జయం మూవీతో బ్రేక్ అందుకుని జయం రవిగా కొనసాగుతున్న ఆయన.. గతేడాది జనవరిలో తన పేరు మార్చుకున్నాడు. ఇకపై జయం రవి కాకుండా రవి మోహన్ అనే పిలవాలని కోరాడు. చివరగా పరాశక్తి సినిమాలో విలన్గా నటించాడు.చదవండి: నిన్ను నా అంతగా ఇంకెవరూ ప్రేమించలేరు: విజయ్ ఆంటోని -
నా అంతగా ఎవరూ ప్రేమించలేరు, అదే నీకిచ్చే గిఫ్ట్: విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోనీ సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అతడు హీరోగా మారాడు. కొన్ని సినిమాలకు తనే ఎడిటర్గానూ వ్యవహరించాడు. లిరిసిస్ట్గా, సింగర్గానూ టాలెంట్ చూపించాడు. అయితే విజయ్ ఆంటోని వైవాహిక జీవితం మొదలుపెట్టాకే హీరోగా ప్రస్థానం ప్రారంభించాడు. 2006లో ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు.నువ్వే నా ప్రపంచంఅన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఎంతో అందంగా ఉంటుందీ జంట. నేడు (మార్చి 29న) ఫాతిమా పుట్టిన రోజు. ఈ సందర్భంగా భార్య కోసం స్పెషల్ పోస్ట్ పెట్టాడు విజయ్. మిసెస్ విజయ్ ఆంటోని.. మై డియర్ లవ్, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా యజమానివి. మై డియర్ పట్టు.. ఈరోజు నేను చేస్తున్న వాగ్ధానమే నీకిచ్చే బహుమతి. నీ జీవితంలో నేను నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు. ఆఖరికి భగవంతుడు కూడా నీ జీవితంలో నా అంత ప్రేమను పంచలేడు.సినిమానువ్వు నా సహచరివి, సర్వస్వానివి, నా జీవితానికే పరమార్థానివి.. ఐ లవ్యూ అని రాసుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం విజయ్ ఆంటోని నూరు సామి సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగులో వంద దేవుళ్లు పేరిట రిలీజ్ కానుంది. బిచ్చగాడు డైరెక్టర్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.చదవండి: సినిమాలు మానేయాలని కండీషన్.. హీరోతో పెళ్లి రిజెక్ట్ చేశా: హీరోయిన్ -
సినిమాలు మానేయాలని కండీషన్.. అందుకే ఆ హీరోతో పెళ్లి క్యాన్సిల్
ఒకప్పుడు సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణించింది ముంతాజ్. ఖిలోనా, దో రాస్తే, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో మెప్పించింది. కానీ పెళ్లయిన వెంటనే సినిమాలకు దూరమైంది. అందుకు గల కారణాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముంతాజ్ మాట్లాడుతూ.. నేను సాంప్రయదాయక ఇరానీ కుటుంబం నుంచి వచ్చాను. ఫలానా వయసు రాగానే పెళ్లి చేసేయాలని మా నాన్న ఆలోచన. అలాగే 40, 50 ఏళ్లుచ్చేవరకు మహిళలు పని చేయకూడదని అనుకుంటాడు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని..మా ఇంట్లో అందరూ నాకు త్వరగా పెళ్లి చేయాలనే అనుకున్నారు. నాకు ఏడెనిమిదేళ్ల వయసున్నప్పుడే నా భర్త కుటుంబం గురించి తెలుసు. వాళ్లు మా పొరిగింట్లోనే ఉండేవారు. అలా వాళ్ల గురించి పూర్తిగా తెలుసు గనకే నన్ను ఆ ఇంటికి పంపించారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని అమ్మ మరీమరీ చెప్పింది. అత్తింట్లో బాగా చూసుకుంటారని ధైర్యం ఇచ్చింది. నేనెప్పుడూ ఇంట్లో వాళ్ల మాట కాదనలేదు. నాకు ఇంకొంతకాలం సినిమాలు చేయాలన్న ఆశయితే ఉండేది. నా భర్త ఓపికగా ఎదురుచూశాడుకానీ, ఇంట్లో వాళ్లను నొప్పించలేక మయూర్ను పెళ్లి చేసుకున్నాను. అతడు భారత్లో ఉండేవాడు కాదు, ఇంగ్లాండ్లో చదువుకునేవాడు. అతడి కుటుంబం ఉగాండాలో బిజినెస్ చేస్తుండేది. వారిది మంచి ఉన్నత కుటుంబం. అయితే పెళ్లయ్యాక వెంటనే సినిమాలు మానేయలేదు. అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టుల షూటింగ్స్లో పాల్గొన్నాను. దాదాపు రెండేళ్లలో షూటింగ్స్ అన్నీ పూర్తి చేసుకున్నాను. అప్పటివరకు నా భర్త ఎంతో ఓపికగా ఎదురుచూశాడు అంది.చాలా చిన్నదాన్నినటుడు షమ్మీ కపూర్తో పెళ్లి ఎందుకు ఆగిపోయిందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నా మనసులో పెళ్లి ఆలోచనే లేదు. పైగా షమ్మీ తండ్రి పృథ్వీరాజ్ కపూర్.. తనకు కాబోయే కోడలు పని చేయకూడదని కండీషన్ పెట్టాడు. నాకంటూ అప్పుడు చాలా కలలు, కోరికలున్నాయి. అందుకే పెళ్లి కన్నా పని ముఖ్యమనుకున్నాను. పర్సనల్ లైఫ్ఆయన పెట్టిన కండీషన్ వల్లే షమ్మీ భార్య గీతా బాలాజీ కూడా పెళ్లవగానే సినిమాలు మానేసింది అని చెప్పుకొచ్చింది. కాగా ముంతాజ్.. షమ్మీ కపూర్ను పెళ్లాడేందుకు రెడీ అయింది. వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అనంతరం ఉంగాడాలో బిజినెస్ చేసే మయూర్ మాధ్వానిని 1974లో పెళ్లాడింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం.చదవండి: నా బిడ్డను ముద్దు పెట్టుకోకూడదు: మెరీనా వార్నింగ్ -
గాయంతో తిరిగి సెట్స్పైకి రామ్ చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కంటికి తగిలిన దెబ్బ కారణంగా చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది. యూనిట్ ఈ గాయం పెద్దది కాదని ప్రకటించినప్పటికీ, తన అభిమానులు మాత్రం కొంత ఆందోళన చెందారు. అయితే గాయమైన గంటల వ్యవధిలోనే చరణ్ తిరిగి సెట్స్పైకి వచ్చాడు. గురువారం 'పెద్ది' చిత్ర షూటింగ్లో పాల్గొన్నాడు. దాంతో వందల సంఖ్యలో మెగా అభిమానులు సెట్స్కు చేరుకుని ఆయనను కలుసుకున్నారు. చరణ్ వారందరితో మాట్లాడి, సెల్ఫీ వీడియో కూడా దిగాడు. ఆ వీడియోను యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో చరణ్ స్వయంగా తన గాయంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. చరణ్కు సుధాకర్ ప్రసాద్ అనే వైద్యుడు మైనర్ సర్జరీ చేసినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. డాక్టర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక మార్చి 27 (శుక్రవారం) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.45 గంటలకు పెద్ది నుంచి సర్ప్రైజ్ రాబోతోందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందని మరోసారి ధృవీకరించారు. -
చరణ్కు గాయం.. 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది. ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. -
హీరోయిన్తో ప్రేమలో కాలభైరవ! హింట్ ఇచ్చారా?
టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రొఫెషనల్ పనులతోనే బిజీగా ఉండకుండా కాస్త పర్సనల్ లైఫ్పైనా ఓ కన్నేశారు. జీవితంలో ఓ అడుగు, కాదు కాదు.. ఏడడుగుల బంధంలోకి వెళ్లే ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. అటు బెల్లంకొండ శ్రీనివాస్ తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. ఆ సినిమా నుంచే లవ్ఇప్పుడీ జాబితాలోకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, సింగర్ కాలభైరవ చేరనున్నట్లు తెలుస్తోంది. బలగం హీరోయిన్ కావ్య కల్యాణ్రామ్తో అతడు ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా నెట్టింట రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఉస్తాద్ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందట! కాలభైరవ తమ్ముడు శ్రీసింహ హీరోగా నటించిన ఈ చిత్రంలో కావ్య కథానాయికగా నటించింది. హింట్ ఇచ్చారా?అలా ఈ మూవీ సెట్లో వీరికి ఏర్పడిన పరిచయం రానురానూ ప్రేమబంధంగా మారిందట! వీళ్ల ప్రేమాయణానికి పెద్దలు సైతం పచ్చజెండా ఊపారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కావ్య, కాల భైరవ ఓ కార్యక్రమానికి జంటగా వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంటే తాము ప్రేమలో ఉన్నమాని సిగ్నల్స్ ఇచ్చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సినిమాకావ్య కల్యాణ్ రామ్ విషయానికి వస్తే.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఈమె గంగోత్రి మూవీలో బాలనటిగా యాక్ట్ చేసింది. స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, బాలు, బన్నీ, పాండురంగడు.. ఇలా అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించింది. 2022లో వచ్చిన మసూదతో హీరోయిన్గా మారింది. బలగం చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైంది. కాలభైరవ విషయానికి వస్తే.. 2019లో వచ్చిన మత్తు వదలరా మూవీతో సంగీత దర్శకుడిగా మారాడు. కెరీర్కలర్ ఫోటో, ఆకాశవాణి, లక్ష్య, కార్తికేయ 2, గుర్తుందా శీతాకాలం, మోగ్లీ, మత్తు వదలరా 2, యుఫోరియా.. వంటి పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశాడు. బాహుబలి 2లో పాడిన దండాలయ్యా.. పాట సింగర్గా అతడికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆర్ఆర్ఆర్ మూవీలో రాహుల్ సిప్లిగంజ్తో కలిసి పాడిన నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ గెల్చుకుంది. అదే చిత్రంలోని కొమురం భీముడో పాటకుగానూ కాలభైరవకు జాతీయ అవార్డు వచ్చింది. Manollani nenu chala sarlu theatres lo, Restaurants lo chusanu naku appude theda kottindhi. Relation lo unnaru ani ardhamaindhi. Finally Book launch event ki kalisi vaccharu. Andhariki Hint ivvadaniki 🥰🥰Chudali e celebrate couple aina life long unte bagundu❤️❤️🥹🥹 pic.twitter.com/ILVGBRQ7pM— Swaasthi (@swaasthi) March 24, 2026 చదవండి: బ్యాండ్మేళం కోసం చిరంజీవినే రిస్క్లో పడేసిన కోన వెంకట్ -
ఉత్తరాంధ్ర జానపద పాటలో ఆనంది మాస్ స్టెప్పులు.. చూశారా?
తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి. గౌరీ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బుర్రకథలతో ఫేమస్ అయిన గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నల జీలకర్ర మొగ్గ బాగా వైరలయింది. తాజాగా మరో జానపద పాటను వదిలారు.ఉత్తరాంధ్ర జానపదంకోసింది కోయగూర దుబ్బో సందమామ.. వాసనకీ సంపంగి మొగ్గ అంటూ పాట మొదలవుతుంది. ఈ జానపద పాటలో ఆనంది మాస్ స్టెప్పులు వేసింది. చరణ్ అర్జున్ సంగీతం అందించగా అనన్య భట్, షకలక శంకర్, గౌరీ నాయుడు జమ్ము ఆలపించారు. ఈ పాటను ఉత్తరాంధ్ర జానపదాల నుంచి సేకరించినట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.ఆనంది కెరీర్ఆనంది విషయానికి వస్తే.. తెలంగాణలోని వరంగల్ జిల్లా తన స్వస్థలం. ఆమె అసలు పేరు రక్షిత. సినిమాల్లోకి వచ్చాక తన పేరును హాసికగా మార్చుకుంది. అది కలిసిరాకపోయేసరికి ఆనందిగా మారింది. తెలుగులో జాంబిరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్, ప్రేమంటే, భైరవం సినిమాలు చేసింది. తెలుగులోకన్నా కోలీవుడ్లోనే హీరోయిన్గా మంచి పేరు, అవకాశాలు తెచ్చుకుంది. -
చిరంజీవిని రిస్క్లో పడేసిన కోన వెంకట్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో పేరుమోసిన రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు కోన వెంకట్. అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, వెంకీ, ఢీ, రెడీ, అదుర్స్, దూకుడు, అల్లుడు శీను, నిన్ను కోరి. ఇలా అనేక హిట్ సినిమాలకు కథారచయితగా పని చేశాడు. అయితే ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన కోన వెంకట్ తర్వాత వరుస వైఫల్యాలు చూసేసరికి నెమ్మదిగా సైడ్ అయిపోయాడు. రైటర్గా చాలావరకు సినిమాలు తగ్గించేశాడు.కోన వెంకట్కు బూస్ట్అలాంటి కోన వెంకట్కు 'వాల్తేరు వీరయ్య'తో మళ్లీ ఎనర్జీ వచ్చినట్లయింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ బ్లాక్బస్టర్ మూవీకి కోన రచనా సహకారం అందించాడు. ఇకపోతే వీరి కాంబినేషన్లో మరోసారి రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే! చిరంజీవి-బాబీ సినిమాకు కోన రచనా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.అప్పుడు నాని చాలెంజ్కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'. కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. తాజాగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కోన వెంకట్ చిరంజీవి సినిమాకు పని చేస్తున్నట్లు తెలిపాడు. అదే సమయంలో ఓ ఆసక్తికర ఛాలెంజ్ విసిరాడు. కోర్ట్ సినిమా రిలీజ్కు ముందు నాని ఓ మాటన్నాడు. ఈ మూవీ నచ్చకపోతే ఇంకెప్పుడూ తన సినిమా చూడవద్దన్నాడు. ఆ మాట చెప్పడానికి చాలా గుండెధైర్యం కావాలి. సీరియస్గా చెప్తున్నా..ఇప్పుడు నేనూ చెప్తున్నా.. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసే సినిమాలను మీరెవరూ చూడకండి. ఇది నేను సరదాకి చెప్పడం లేదు.. నిజంగానే ఈ మూవీ నచ్చకపోతే నా సినిమాలు చూడకండి. అలాగని రాయడం మానేయను, మీకు నచ్చేంతవరకు కథలు రాస్తూనే ఉంటాను. ఇప్పుడిది చూశారంటే చిరంజీవిగారు కోప్పడతారు. ఎందుకంటే నేను నెక్స్ట్ రాస్తున్న సినిమా ఆయనదే! అన్నాడు. అలా చిరు-బాబీ కాంబినేషన్లో రాబోయే సినిమాకు తాను రైటర్ అని కోన వెంకట్ వెల్లడించాడు. మొత్తానికి ఈ ఓపెన్ ఛాలెంజ్తో చిరు-బాబీ సినిమాను రిస్కులో పడేశాడు.చదవండి: రామ్చరణ్, మహేశ్బాబుకు అలా.. కానీ,, : బండ్ల గణేశ్ -
కోర్ట్ తర్వాత సినిమాలు వద్దని చెప్పా.. నా మాట వినలేదు!
కోర్ట్ సినిమాతో హర్ష్ రోషన్, శ్రీదేవి వెండితెరపై హీరోహీరోయిన్గా పరిచయమయ్యారు. తొలి సినిమాకే భారీ విజయాన్ని అందుకుని అందరి దృష్టిలో పడ్డారు. గతేడాది కోర్ట్ మూవీతో పలకరించిన ఈ జంట ఈ ఏడాది బ్యాండ్మేళంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్లో కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలు మర్చిపోండిఆయన మాట్లాడుతూ.. చందు-జాబిలి(కోర్ట్ మూవీలో ప్రధాన పాత్రల పేర్లు).. వీళ్లనెప్పటికీ ఇదే పేర్లతో పిలుస్తుంటాను. కోర్ట్ తర్వాత వీళ్లు ఏం చేస్తారు? ఏమైపోతారనుకున్నాను. నేనైతే.. కోర్ట్ అయిపోగానే మీరు కనపడొద్దని చెప్పాను. సినిమాలు మర్చిపోండి, మూడునాలుగేళ్లు కనిపించకూడదు. మంచి కాలేజీలో చేరి చదువుకోమని చెప్పాను. పుస్తకాల్లో ఏం చదువుకుంటారో తెలియదు కానీ కాలేజీకి వెళ్తే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. కాలేజీ డేస్ మిస్ మీరు ఫస్ట్ కాలేజీకి వెళ్లండి, కళాశాల జీవితాన్ని మిస్ అవొద్దని చెప్పాను. ఈ వయసులో యాక్టింగ్లో బిజీ అయితే జీవితంలో ముఖ్యమైన కాలేజీ డేస్ మిస్ అవుతారన్నాను. కానీ నా మాట వినలేదు. వినుంటే బ్యాండ్ మేళం వచ్చేది కాదు.. విననందుకు థాంక్స్ అన్నాడు. బ్యాండ్మేళం విషయానికి వస్తే.. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీని కోన వెంకట్ నిర్మించారు.చదవండి: ధురంధర్ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్ -
చిరంజీవితో పని చేయాలని కోరిక: మ్యూజిక్ డైరెక్టర్
దండోరా సినిమాకు నాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా గద్దర్ అవార్డు లభించడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రేక్షకులకు మరింత మంచి సంగీతం ఇచ్చేందుకు ఈ అవార్డు స్ఫూర్తినిస్తుంది. అలాగే సంగీత దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాను అని చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె. రాబిన్.గద్దర్ అవార్డుది ఘోస్ట్, మల్లేశం, జాంబిరెడ్డి, ఏజెంట్, సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలకు సంగీతం అందించి తన ప్రతిభ నిరూపించుకున్నారు. దండోరా సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్న మార్క్ కె.రాబిన్ విలేకరులతో మాట్లాడుతూ.. నాకు బాల్యం నుంచే సంగీతం అంటే ఇష్టం. కొంతకాలం టీచర్గా పని చేశాను. లిరిసిస్ట్ కృష్ణకాంత్ నాకు మంచి మిత్రుడు. నానికి నచ్చడంతో..దర్శకనిర్మాత ప్రశాంత్ వర్మ, కృష్ణకాంత్, నేను తరచూ కలుస్తుండేవాళ్లం. అలా నేను, ప్రశాంత్ కలిసి ఇన్ ది డార్క్ అనే ఇండియా ఫస్ట్ వర్చువల్ ఆడియో షార్ట్ ఫిలిం చేశాం. ఆ తర్వాత నానిగారి మజ్ను మూవీ ట్రైలర్కు ఆర్ఆర్ అందించాను. ఈ మ్యూజిక్ నానిగారికి నచ్చడంతో అ..! చిత్రానికి అవకాశం కల్పించారు.అదే నా కోరికఅలా మ్యూజిక్ డైరెక్టర్గా నా ప్రయాణం మొదలైంది. భావోద్వేగంతో నిండిన మనసుతోనే దండోరాకి సంగీతాన్ని అందించాను. చిరంజీవిగారితో సినిమా చేయాలన్నదే నా ఆకాంక్ష. సంగీతం విషయంలో మనం ఇప్పటికీ చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితులే ఉన్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ప్రస్తుతం కథాకళి, రాజాది రాజా సినిమాలతో పాటు ప్రశాంత్ వర్మగారితో రెండు సినిమాలు చేస్తున్నాను. హిందీలో సైఫ్ అలీఖాన్గారితో ఓ మూవీ చేయాల్సింది కానీ కుదర్లేదు. అదే విధంగా ఒక స్టార్ హీరో సినిమాకు చర్చలు జరుగుతున్నాయి అన్నారు. -
నాకు నత్తి.. ఇప్పటికీ బాధపడుతుంటా: సమీరా రెడ్డి
హీరోయిన్ సమీరారెడ్డి ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తన కష్టాలు, ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం, డెలివరీ తర్వాత ఎదుర్కొన్న సమస్యలు.. వీటన్నింటి గురించి ఓపెన్గా మాట్లడుతూ ఉంటుంది. అయితే చిన్నతనంలో నత్తి వల్ల తనను ఎందరో వెక్కిరించేవారంటోంది.వెక్కిరింతలుతాజాగా ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పుడు నాకు నత్తి ఉండేది. దానివల్ల నన్ను వెక్కిరిస్తూ వేధించేవారు. నాలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి సంవత్సరాల తరబడి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ నేను నత్తిగా మాట్లాడినప్పుడు ఎవరైనా దానిపై సెటైర్లు వేస్తే బాధగా ఉంటుంది. చిన్ననాడు మనల్ని ఏమేం అంటారో అవన్నీ మనసులో లోతుగా పాతుకుపోయుంటాయి.అదే నిజమనుకుని..ఉదాహరణకు.. ఆమె చాలా స్లో, వీక్ అంటుంటారు. ఇలాంటి పదాలు పదేపదే విన్నప్పుడు మనపై మనకే అనుమానం వేస్తుంటుంది. ఫలితంగా పిల్లలు ఏదైనా సాహసం చేసేందుకు వెనుకాడతారు. పిల్లల్ని పదేపదే బుద్ధిహీనుడు, బలహీనుడు, ముసలివాడు.. అని పిలిస్తే వాళ్లు అదే నిజమనుకుంటారు. వాళ్లను వాళ్లు చూసుకునే విధానమే మారిపోతుంది. ఎవరినీ కించపర్చొద్దుఅదే నిజమని నమ్మి, అందరిలా దూకుడుగా ఉండలేరు. ఏవీ ప్రయత్నించకుండా సైలెంట్ అయిపోయే ప్రమాదం ఉంది. నా పిల్లలు.. వారికి ఏ సమస్య ఎదురైనా నాతో చెప్పమంటాను. ఎవరినీ కించపరచొద్దని చెప్తుంటాను. పిల్లలకు సరైన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం చేస్తే మంచి ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. పర్సనల్ లైఫ్తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటివారంతా సపోర్ట్గా నిలబడితే పిల్లలు వారికెదురయ్యే సవాళ్లను ఒక అడ్డంకిగా కాకుండా.. దాన్నుంచి ఎలా బయటపడాలన్నది నేర్చుకుంటారు అని చెప్పుకొచ్చింది. సమీరా.. 2014లో ఎంటర్ప్రెన్యూర్ అక్షయ్ వార్డేను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు 2015లో కుమారుడు హన్స్, 2019లో కూతురు నైరా జన్మించారు. బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి.. తెలుగులో నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ సినిమాల్లో నటించింది.చదవండి: హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం -
అలనాటి హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం
అలనాటి హీరోయిన్లు భానుప్రియ, శాంతిప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వారి తల్లి ఎం. లక్ష్మి (83) ఆదివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఎం.లక్ష్మికి భానుప్రియ, శాంతిప్రియతో పాటు గోపాలకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూతుర్లను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తీర్చిదిద్దారు లక్ష్మి. భానుప్రియకాగా భానుప్రియ 1998లో ఆదర్శ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. వీరికి కూతురు అభినయ సంతానం. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2005లో అతడి నుంచి విడిపోయి కూతుర్ని తీసుకుని చెన్నైకి వచ్చి తల్లితోనే కలిసి ఉంటోంది. 2018లో నటి మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో మరణించాడు. శాంతిప్రియభానుప్రియ చివరగా అయాలన్ అనే తమిళ సినిమాలో కనిపించింది. శాంతిప్రియ విషయానికి వ్తే.. ఈమె ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం మనవడు, నటుడు సిద్దార్థ్ రాయ్ను పెళ్లి చేసుకుంది. 1992లో వీరి వివాహం జరగ్గా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. 2004లో సిద్దార్థ్ కూడా గుండెపోటుతోనే కన్నుమూశాడు. -
భర్త లేకుండా బతకలేనని ఏడ్చా.. చివరకు విడిపోయాం: నటి
మలయాళ ఇండస్ట్రీలో దశాబ్దకాలంగా సహాయ నటిగా రాణిస్తోంది నటి మంజు పాత్రోస్. వెండితెరతో పాటు బుల్లితెరపైనా పలు సీరియల్స్ చేస్తోంది. కొంతకాలంగా ఆమె తన వర్క్ గురించి కాకుండా పర్సనల్ లైఫ్ గురించి వార్తల్లో నిలుస్తోంది. భర్త సునిచన్తో విడిపోయిందని ప్రచారం జరుగుతోంది.అవును, విడిపోయాంతాజాగా ఈ వ్యవహారంపై మంజు పాత్రోస్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. చట్టపరంగా విడిపోలేదు కానీ కొంతకాలంగా వేర్వేరుగానే జీవిస్తున్నాం. సునిచన్తో నేను మాట్లాడటం లేదు. ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేసి నా కొడుకుతో మాట్లాడుతుంటాడు. వాడిని చూసేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు కూడా! దాన్ని నేనేమీ అడ్డుకోను. మేమింకా చట్టపరంగా విడిపోలేదు. అలా అని మళ్లీ కలిసే ఆలోచనలు కూడా చేయడం లేదు.ఎంతో ఏడ్చా..ఇతరులకు నచ్చినట్లుగా ఎక్కువకాలం బతకలేం. మనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలుంటాయి. వాటిని కూడా గౌరవించాలికదా! ఇకపోతే ఇలా విడిపోతామని ఎన్నడూ అనుకోలేదు. నా భర్త లేకుండా ఎలా బతకాలని ఎంతగానో ఏడ్చాను. ఒంటరిగా ఎలా జీవిస్తానని భయపడ్డాను. కానీ, ఇప్పుడా భయం పోయింది.. చేతిలో డబ్బుంది కాబట్టి నిర్భయంగా జీవిస్తున్నారని మీరంటారేమో! ఇక్కడ విషయం డబ్బు కాదు.. అలాగైతే నా అకౌంట్లో ఇప్పటికీ చాలా తక్కువ మొత్తమే ఉంది. చిల్లి గవ్వ లేని స్థితిలో..ఓపక్క అప్పు తీరుస్తున్నాను, మరోపక్క కొడుకును చదివిస్తున్నాను. ఒకానొక సమయంలో ముక్కుపుడక తప్ప నా చేతిలో ఏమీ లేని నిస్సహాయ స్థితికి వెళ్లిపోయాను. అప్పుడు నా చుట్టూ ఉండేవాళ్లు నాకు మద్దతుగా నిలబడ్డారు, సాయం చేశారు అని చెప్పుకొచ్చింది. మంజు మలయాళంలో జిలేబి, కమ్మటిపాదం, స్కూల్ బస్, కల్యాణం, ప్రేమసూత్రం, తోటప్పన్, మై సాంటా, హెవెన్, క్వీన్ ఎలిజబెత్, ఎఎమ్ఐ, భూతకాలం వంటి పలు సినిమాల్లో నటించింది. మలయాళ బిగ్బాస్ రెండో సీజన్లోనూ పాల్గొంది.చదవండి: జూన్లో ధురంధర్ 3? నిజమెంత? -
జూన్లో ధురంధర్ 3? నిజమెంత?
ఏదైనా సినిమా బాగుందంటే చాలు దాని కొనసాగింపు కోసం జనం ఎదురుచూస్తుంటారు. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలు కూడా అలాంటి బజ్ క్రియేట్ చేసుకుని సీక్వెల్లో కూడా కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ధురంధర్ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.ధురంధర్ బ్లాక్బస్టర్రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ 2025 డిసెంబర్లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూసేందుకు జనం థియేటర్ల ఎదుట క్యూ కట్టారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. దీంతో దీని సీక్వెల్ కోసం జనం వెయిట్ చేశారు.ధురంధర్ 3 రాబోతోందా?అయితే వారిని మరీ ఎక్కువ ఎదురుచూడనివ్వకుండా మూడు నెలల్లో ధురంధర్ 2ని తీసుకొచ్చారు మేకర్స్. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. నాలుగు రోజుల్లోనే రూ.761 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 3 రాబోతోందని ప్రచారం మొదలైంది.ఫేక్ ఫోటోఅది కూడా మరో మూడు నెలల్లోనే విడుదల కాబోతుందని రూమర్ సృష్టించారు. జూన్ 14న ధురంధర్: ద ఫైనల్ చాప్టర్ రాబోతుందంటూ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది, అది నెట్టింట వైరల్గా మారగా అది నిజమని చాలామంది భ్రమపడుతున్నారు.సినిమాసినిమా చివర్లో పేర్లు పడి ఆగిపోయేంతవరకు మీరు సీటులో నుంచి లేవొద్దు అని ఆదిత్య ధర్ ప్రేక్షకులకు సూచించాడు. ఆ లెక్కన నిజంగానే చివరాఖరులో మూడో భాగం కోసం ప్రకటించారేమోనని పలువురూ భావించారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. ఇప్పటివరకు చిత్రయూనిట్ మూడో భాగం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి అదంతా ఫేక్ న్యూస్ అని అర్థమవుతోంది. Is This For Real ? 3 Parts #Dhurandhar The Final Chapter on 14 June 2026 pic.twitter.com/EqAINSzpxN— INDIAN (@hindus47) March 18, 2026 చదవండి: కరుప్పు ఫస్ట్ ఛాయిస్ సూర్య కాదా? -
కరుప్పు ఫస్ట్ విజయ్కే చెప్పా.. ఆయనకు నచ్చింది.. కానీ!
స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో కరుప్పు ఒకటి. అయితే ఈ ప్రాజెక్ట్ సూర్య కంటే ముందు దళపతి విజయ్ చేతికి వెళ్లిందట. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజనీకాంత్ కెరీర్లో భాష, ముత్తు, పడయప్ప (నరసింహ) వంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటికీ చాలామంది జనాలు వీటిని మళ్లీ మళ్లీ చూస్తుంటారు. 2023లోనే..అలాంటి ఒక ఫుల్ ఎంటర్టైనర్ సినిమాని తీయాలని నా కోరిక. యాక్టింగ్ అంటే గట్టిగా అరవడం, ఏడవడం కాదు. అన్ని రకాల ఎమోషన్స్ను సమపాళ్లలో పండించాలి. అది సూర్యకు వెన్నతో పెట్టిన విద్య.. తను బాగా డ్యాన్స్ చేస్తాడు, అద్భుతంగా నటిస్తాడు, ఏదైనా సింపుల్గా చేసేస్తాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. నిజానికి 2023లో కరుప్పు కథ రాయడం మొదలుపెట్టాను. విజయ్కు కథ చెప్పా..ఈ కథకు బలమైన స్టార్ ఉంటే బాగుంటుందనిపించింది. అలా హీరో విజయ్ను కలిశాను.. పైగా ఆయన 2021లోనే ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగాడు. ఈ రెండు కారణాల వల్ల తనను కలిశాను. కరుప్పు విజయ్కు చాలా బాగా నచ్చింది. ఇది భారీ సినిమా.. వెంటనే మొదలుపెడదాం అన్నారు. కానీ విజయ్ వంటి స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే పెద్ద బాధ్యత.. నచ్చింది కానీ..అలా హడావుడిగా మొదలుపెట్టలేనని చెప్పాను. తర్వాత కొన్నిసార్లు కలిశాం, మాట్లాడుకున్నాం.. కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆయన నా నుంచి కుటుంబ కథా చిత్రం ఆశించాడు. అయినప్పటికీ ఈ కథ తనకెంతో నచ్చింది.. అదే సంతోషం అని ఊరుకున్నాను. తర్వాత సూర్యను సంప్రదించగా ఆయన ఓకే చెప్పాడు అని తెలిపాడు.సినిమాకరుప్పు విషయానికి వస్తే.. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది. స్వాశిక, ఇందిరన్స్, యోగిబాబు, శివదా, సుప్రీత్ రెడ్డి, అనకా, మాయారవి, నట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్. ప్రకాశ్బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది.చదవండి: ధురంధర్ 2 ప్రభంజనం.. 28 ఏళ్ల కిందటి లేఖ వైరల్ -
ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్
బ్లాక్బస్టర్ ధురంధర్కు కొనసాగింపుగా వచ్చిన చిత్రం ధురంధర్: ద రివేంజ్. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. అటు సోషల్ మీడియాలో నార్త్ నుంచి సౌత్ వరకు ఎందరో సెలబ్రిటీలు దర్శకుడు ఆదిత్య ధర్ను, అతడి సినిమాను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ మూవీలో నటించిన అందరికీ మంచి పేరు, గుర్తింపు వచ్చింది. 28 ఏళ్ల నాటి లేఖఈ క్రమంలో ధురంధర్ 2లో మొహమ్మద్ ఆలంగా నటించిన గౌరవ్ గేరా తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టాడు. 1998లో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన రోజుల్లో పేరెంట్స్కు రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది నేను 1998 డిసెంబర్ 3న మా అమ్మానాన్నలకు రాసిన లేఖ. ముంబైకి వచ్చి అప్పటికింకా నెల రోజులు కూడా కాలేదు. అప్పట్లో ఈమెయిల్స్ గట్రా ఏవీ లేవు.. ఇదిగో ఇలా ఉత్తరాలు రాసుకునేవాళ్లం. అమ్మానాన్న థాంక్యూఆ తర్వాత టీవీ, సినిమా, యాడ్స్, రేడియో, టిక్టాక్ రీల్స్.. ఇలా ఎన్నో ఒడిదుడుకులతో నా ప్రయాణం సాగింది. భగవంతుడు నాపై ఎంతో దయచూపించాడు. ఇదిగో ఇలా ధురంధర్లో నటించే అవకాశం.. రానున్న రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఈ జర్నీలో నాకు అండగా నిలిచిన అమ్మానాన్నకు ధన్యవాదాలు అంటూ లేఖను పంచుకున్నాడు.లేఖలో ఏముందంటే?అమ్మానాన్న, ఎలా ఉన్నారు? నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతానికి డబ్బుపరంగా ఏమీ కలిసిరావడం లేదు. కానీ, త్వరలోనే అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను. ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు ఎక్కువే.. ఖర్చు తగ్గించుకునేందుకు నేను స్నేహితుడితో కలిసి ఓ చిన్న గదిలో ఉంటున్నాను. ఫోన్, కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లుతో పాటు భోజన ఖర్చులు కూడా ఇద్దరం పంచుకుంటున్నాం. భవిష్యత్తుపై కొండంత ఆశ ఉంది. కానీ నేను నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నటీనటులు, అభిమానులు మీరు చాలా దూరం వచ్చారు, మీ కథ వింటుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Gaurav Gera (@gauravgera) చదవండి: ద 50 షో.. విన్నర్గా శివ్ ఠాక్రే.. ప్రైజ్మనీ మాత్రం ఎవరికంటే? -
The 50: అరకోటి ప్రైజ్మనీ.. విన్నర్కు కాదు, అతడి అభిమానికి!
ద 50 రియాలిటీ షోకి శుభం కార్డు పడింది. 50 మంది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ షో మార్చి 22న విజయవంతంగా ముగిసింది. ఫైజల్ షైక్, కృష్ణ ష్రాఫ్, రజత్ దలాల్లను వెనక్కు నెడుతూ శివ్ ఠాక్రే విజేతగా నిల్చాడు. అతడికి ద 50 ట్రోఫీ అయితే దక్కింది. కానీ ప్రైజ్మనీ మాత్రం కాదు! అదే ఈ షో స్పెషాలిటీ.. కంటెస్టెంట్కు బదులుగా అతడి అభిమాని అరకోటి గెల్చుకునే అవకాశం ఉంటుంది. అలా శివ్ ఠాక్రే టైటిల్ గెలిస్తే అతడి అభిమాని సీతారామ్ ప్రహ్లాద్ అఘవ్ రూ.50 లక్షల ప్రైజ్మనీ సొంతం చేసుకున్నాడు.ఫినాలేలో ఏం జరిగిందంటే.. 50 మంది కంటెస్టెంట్లతో ద 50 షో మొదలైంది. ఫైనల్స్కు వచ్చేసరికి ఐదుగురు మాత్రమే మిగిలారు. వారే రజత్ దలాల్, శివ్ ఠాక్రే, కృష్ణ ష్రాఫ్, కాక (రవీందర్ సింగ్), ఫైజల్ షైక్. మీలో ఒకర్ని మీరే ఎలిమినేట్ చేయాలని ద లయన్(షోలో బాస్) చెప్పగా.. శివ్, కృష్ణ, కాక.. రజత్ను ఎలిమినేట్ చేశారు. మిగిలిన నలుగురికి నాలుగు రకాల టాస్కులు అప్పగించారు. వీటన్నింటిని దాటుకుని శివ్ ఠాక్రే గెలిచి సత్తా చూపించాడు. ఫైజల్ షైక్ ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. అభిమానికి రూ.50 లక్షలునిజానికి ప్రిన్స్ నరూలా త్యాగం చేసిన టికెట్ టు ఫినాలేతోనే శివ్ ఠాక్రే ఫైనల్స్లో చోటు దక్కించుకున్నాడు. ఆ ఒక్క అవకాశాన్ని వాడుకుని ఇప్పుడేకంగా ట్రోఫీ గెలవడం విశేషం. రూ.50 లక్షలు గెలిచిన శివ్ ఠాక్రే అభిమాని సీతారాం మాట్లాడుతూ.. నేను, నా కుటుంబం పొలం పని చేసుకుంటాం. ఈ ప్రైజ్మనీ గెలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇదంతా ఒక మోసమేమో అనుకునేవాడిని. జరుగుతుందంతా చూస్తుంటే ఒక కలలా ఉంది. నా తల్లిదండ్రులకు మంచి ఇల్లు, కారు కొనివ్వాలనుకున్నాను, ఈ డబ్బుతో అదే చేస్తాను అని పేర్కొన్నాడు. కాగా శివ్ ఠాక్రే.. గతంలో మరాఠి బిగ్బాస్ రెండో సీజన్ విజేతగా నిలవగా హిందీ బిగ్బాస్ 16వ సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. View this post on Instagram A post shared by JioHotstar Reality (@jiohotstarreality) చదవండి: మంచు లక్ష్మి ఇంట్లో వేడుక.. మోహన్బాబు ఆశీర్వాదం -
మంచు లక్ష్మి కూతురి ఓణీ ఫంక్షన్లో మోహన్బాబు
టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూతురు నిర్వాణ హాఫ్ శారీ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది. ఆ వేడుకకు లక్ష్మి తల్లితో పాటు, సోదరుడు మంచు మనోజ్ భార్యాపిల్లలతో సహా హాజరయ్యాడు. ఎంతో సంబరంగా మేనకోడలిని పల్లకిలో ఎక్కించుకుని మరీ ఊరేగాడు. మరో సోదరుడు విష్ణు, తండ్రి మోహన్బాబు మాత్రం ఫంక్షన్లో ఎక్కడా కనిపించలేదు.మరోసారి ఫంక్షన్దీంతో మంచు కుటుంబంలో విభేదాలు తగ్గలేదా? అన్న అనుమానం మొదలైంది. తాజాగా మరోసారి హాఫ్ శారీ ఫంక్షన్కు సంబంధించిన ఈవెంట్ నిర్వహించడం చూస్తే ఇది నిజమనే తెలుస్తోంది. నిర్వాణ ఓణీల ఫంక్షన్ను మరోసారి ఇంట్లో గ్రాండ్గా నిర్వహించారు. తనకు నలుగుపెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హాజరవని విష్ణుఈ వేడుకను మోహన్బాబు దంపతులు దగ్గరుండి చూసుకున్నారు. మనవరాలిని మనసారా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మంచు విష్ణు భార్య విరానిక, వారి పిల్లలు సైతం హాజరయ్యారు. కానీ విష్ణు మాత్రం హాజరవలేదు. అలాగే మనోజ్ దంపతులు కూడా ఈ ఫంక్షన్లో కనిపించలేదు. దీంతో విడిపోయిన కుటుంబం కోసం రెండుసార్లు ఈ వేడుక జరిపినట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
తమిళ సాంగ్ రిలీజ్.. స్టెప్పులేసిన రోజా
మిలియన్ డాలర్స్ స్టూడియోస్, నీయో కాస్టిల్స్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు సత్య కరికాలన్, యువరాజ్ గణేశన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అన్బే డయానా. జమా చిత్రం ఫేమ్ పారి ఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తుండటంతో పాటు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా రమ్య రంగనాథన్ నటిస్తోంది.సాంగ్ రిలీజ్తమిళనాడులోని ఒక గ్రూప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి సింగిల్ సాంగ్ను విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు నటి రోజా కూడా స్టెప్పులేశారు. జెస్సీ గిఫ్ట్ ఆలపించిన ఈ పాటను ఇప్పుడు సంగీత ప్రియులు రిపీట్ మోడల్ వింటున్నారు. సినిమారొమాంటిక్ వైబ్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే అన్బే డయానా ఆడియో, ట్రైలర్ లాంచ్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నటుడు చేతన్, వైరల్ యూట్యూబర్ పరితాపంగల్ గోపి, ఇస్మత్ భాను, సుదర్శన్ గాంధీ, సెల్ మురుగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతాన్ని, షెల్లీ గెలిస్ట్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. -
పిడుగులాంటి వార్త.. నిస్సహాయస్థితిలో నటుడు
మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కన్నన్ సాగర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. అయితే ఆపరేషన్ చేయించుకునే స్థోమత తనకు లేదని, దాతలు సాయం చేయాలని కోరుతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ వదిలాడు.కుటుంబ బాగోగులు ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కోనివారు ఈ ప్రపంచంలో ఉండరు. అలాగే సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని ఎవరు కాదనగలరు? మన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తాం, పిల్లల్ని చదివిస్తాం.. వాళ్ల బాగోగులు చూసుకుంటాం. అలాగే మనకున్నదాంట్లోనే పక్కవాళ్లకు కూడా సంతోషాన్ని పంచే ప్రయత్నం చేస్తాం.పిడుగులాంటి కుదుపుకానీ సడన్గా అనారోగ్యం అనే ఓ పిడుగులాంటి వార్త మన జీవితాలను కుదిపేస్తుంది. మోయలేనంత భారాన్ని, బాధను తీసుకొస్తుంది. మన దారుల్ని మూసేస్తుంది.. ఇప్పుడెలా ముందుకెళ్తావని ప్రశ్నిస్తుంది. దృడ సంకల్పంతో దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ఆర్థిక అంశాలు వెనక్కులాగుతాయి. అప్పుడే మన నిస్సహాయ స్థితి అర్థమై.. ఇతరుల సాయం కోసం వెతకడం మొదలుపెడతాం. గుండె సమస్యఇలా సాయం కోసం అర్థించడం బలహీనత అని నేననుకోను. ఎందుకంటే మన పరిస్థితి గురించి తెలిసినప్పుడే మంచి మనసున్నవారు మనకు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. కొద్ది రోజులుగా నేను ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాను. నిన్ననే యాంజియోగ్రామ్ చేయించుకున్నాను. గుండె రక్తనాళాల్లో పూడిక ఉందని తెలిసింది. ఓదారుస్తున్నాతక్షణమే బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ఈ విషయం తెలిసినప్పటినుంచి నా భార్యాపిల్లలు బాధతో ఏడుస్తూనే ఉన్నారు. వారిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ, ఆపరేషన్ చేయించుకునేంత స్థోమత నాకు లేదు. సాయం కోసం చూస్తున్నా అన్నాడు. కన్నన్ సాగర్.. మలయాళంలో చార్లీ, అన్వేషిప్పిన్ కండేతుమ్, కర్ణన్ నెపోలియన్ భగత్ సింగ్ సినిమాల్లో నటించాడు.చదవండి: లాభాల్లో 70% వాటా డిమాండ్ చేస్తున్న స్టార్ హీరో -
లాభాల్లో 70% వాటా డిమాండ్ చేస్తున్న హీరో
అమరన్ సినిమా తర్వాత శివకార్తికేయన్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన సినిమాలకు మార్కెట్ వాల్యూ కూడా పెరిగింది. అది దృష్టిలో పెట్టుకున్న హీరో కేవలం పారితోషికం కాకుండా లాభాల్లో వాటా అడుగుతున్నాడు. మదరాసి, పరాశక్తికి ఇదే రూల్ ఫాలో అయ్యాడట.. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు కూడా ఇదే విధానం అమలు చేయనున్నాడంటూ కోలీవుడ్లో తెగ ప్రచారం జరుగుతోంది.సెయాన్ అంటే..శివకార్తికేయన్ ప్రస్తుతం సెయాన్ సినిమా చేస్తున్నాడు. స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. అమరన్ వంటి బ్లాక్బస్టర్ తర్వాత రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్పై శివకార్తికేయన్ చేస్తున్న రెండో చిత్రమిది. ఈ మూవీతోనే శివకుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సెయాన్ అంటే కుమారస్వామికి మరో పేరు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.లాభాల్లో వాటాఈ మూవీకి శివకార్తికేయన్ భారీ పారితోషికాలు గట్రా అడగలేదట! లాభాల్లో వాటా అడిగాడట! ఇప్పటికే రూ.10 కోట్ల అడ్వాన్స్ తీసుకున్న హీరో సినిమా రిలీజయ్యాక 70% లాభాలను డిమాండ్ చేశాడని తెలుస్తోంది. అంటే మిగిలిన 30% మాత్రం కమల్ హాసన్ బ్యానర్కు వెళ్తాయి. సెయాన్ బడ్జెట్ రూ.35 కోట్లని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత జరగనుంది? బాక్సాఫీస్ వద్ద ఎంత రాబడుతుంది? అన్నది చూడాలి!చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రయిన బాలీవుడ్ నిర్మాత -
50 ఏళ్ల వయసులో తండ్రయిన నిర్మాత
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన తండ్రిగా ప్రమోషన్ పొందాడు. 50 ఏళ్ల వయసులో తండ్రయ్యాడు. మధు మంతెన - ఐరా త్రివేది దంపతులకు ఆదివారం (మార్చి 22) తెల్లవారుజామున పండంటి మగ బిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా మధు మంతెన- ఐరా త్రివేది దంపతులు ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ ఏడాది జనవరి 15న వెల్లడించారు. బిడ్డ కోసం ఎదురుచూపులుభార్య బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మార్చిలో డెలివరీ డేట్ ఇచ్చినప్పటినుంచి బిడ్డ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బాబు ఈ ప్రపంచంలో అడుగుపెట్టగానే వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.రెండో పెళ్లిహైదరాబాద్కు చెందిన మధు మంతెన.. 2015లో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి వైవాహిక జీవితం ఎంతోకాలం సజావుగా సాగలేదు. దీంతో 2019లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యోగా ట్రైనర్ ఐరా త్రివేదిని రెండో పెళ్లి చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. ఈయన గతంలో తెలుగులో కార్తీక్ మూవీని నిర్మించాడు. ఆ తర్వాత బాలీవుడ్కు షిఫ్ట్ అయ్యాడు. ఆమిర్ ఖాన్ గజిని, క్వీన్, సూపర్ 30, రక్త చరిత్ర వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.చదవండి: ధురంధర్ 2 నుంచి నన్ను తీసేశారనుకున్నా: బాలీవుడ్ నటుడు -
సల్మాన్ ఖాన్ పేరు.. నన్ను ధురంధర్ 2లో తీసేశారనుకున్నా!
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీలో డానిష్ ఇక్బాల్.. బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీంగా నటించాడు. అయితే సినిమాలో తనను ఎక్కడ తీసేస్తారో అని తెగ భయపడిపోయానంటున్నాడు డానిష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ధురంధర్ 1 రిలీజయ్యాక సీక్వెల్లో బడే సాహెబ్గా ఎవరు కనిపించనున్నారని జనాల్లో ఆసక్తి మొదలైంది. నన్ను తీసేశారనుకున్నా..ఈ క్రమంలో ఎంతోమంది పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో సల్మాన్ ఖాన్, ఇమ్రాన హష్మీ పేర్లు కూడా ఉన్నాయి. అది చూసి ఒకరకంగా నేను చాలా భయపడ్డాను. బడే సాహెబ్ కోసం అప్పటికే నేను సెలక్ట్ అయ్యాను. కానీ నన్ను పక్కనపెట్టేశారేమో.. నా స్థానంలో పెద్ద స్టార్స్ను తీసుకుంటున్నారేమో అని కంగారుపడ్డాను. డైరెక్టర్ ఆదిత్య ధర్కు ఫోన్ చేసి కనుక్కుందామా? అని ఆందోళన చెందాను.ఆ రెండు పాత్రలు ఒక్కటే అని తెలీదుకానీ, తర్వాత అలాంటిదేం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. నిజానికి బడే సాహెబ్, దావూద్ ఇబ్రహీం ఒక్కరేనని నాకూ ముందు తెలీదు. నాది మంచానికే పరిమితమైన దావూద్ ఇబ్రహీం పాత్ర అని మాత్రమే తెలుసు. తర్వాత హీరో బడే సాహెబ్ కోసం వెతుకుతున్నప్పుడు ఆయనెవరని అందరూ ఆలోచించడం మొదలుపెట్టాం. పర్వీజ్ ముషారఫా? ఒసామా బిన్ లాడెనా? అనుకున్నాం. అదే సమయంలో దావూదే బడే సాహెబా? అన్న అనుమానమూ వచ్చింది. చివరకు అదే జరిగింది.మేకప్ కోసం 12 గంటలుముసలి వయసులో ఉన్న దావూద్గా కనిపించడం కోసం దాదాపు ఏడెనిమిది గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఆ ప్రోస్తటిక్ మేకప్ను తీసేందుకు కనీసం రెండుమూడు గంటలైనా పెట్టేది. అలా మేకప్కే 12 గంటల సమయం అయిపోయేది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
పిచ్చి రీల్స్ పంపుతాడు.. ఆంటీ బాలేదు నాన్న అనగానే..
బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీ అవుతుందని చాలామంది వాదన. ఆ విషయం తాను కూడా అంగీకరిస్తానంటోంది హీరోయిన్ శృతి హాసన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నెపోకిడ్ వంటి అంశాల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నేనస్సలు ఫైట్ చేయను. ఎందుకంటే నాకు తొలిసారి పాట పాడే అవకాశం చాలా ఈజీగా లభించింది. నా గొంతు ఇబ్బందిఇళయారాజా సర్ సంగీత దర్శకత్వంలో నాన్న సినిమాలోనే తొలిసారి పాట పాడాను. నా వాయిస్ గంభీరంగా ఉంటుందని ఇళయరాజా అంటుండేవారు. ఒకసారి ఆయన ఇంటికి వచ్చినప్పుడు నేను మా పేరెంట్స్పై అరుస్తున్నాను. అప్పుడాయన నీ గొంతులో మంచి రేంజ్ ఉందన్నారు. అయితే ఆయన్ని ఇంప్రెస్ చేసిన నా గొంతు చాలామందికి మాత్రం డామినెంట్గా అనిపించింది.నాన్న సలహా తీసుకోనునేను చిన్నప్పుడే పండిత్ మనోహర్ కులకర్ణి, సురేశ్ వాడక్కర్ వంటి మహామహుల వద్ద సంగీతం నేర్చుకున్నాను. అలా నాకు మంచి గురువులు లభించారు. కెరీర్లో ఏం చేయాలి? ఎటువైపు అడుగులు వేయాలి? అనే విషయంలో ఎన్నడూ నాన్న సలహా తీసుకోలేదు. అలాగే రజనీకాంత్ను కూడా సలహా అడగలేదు. కాకపోతే వాళ్లిద్దరూ చాలా కష్టపడతారు. పిచ్చి రీల్స్ దాన్ని ఇబ్బందిగా ఫీలవకుండా ఇష్టంగా, నిశ్శబ్ధంగా కష్టపడతారు. సినిమా కోసం ప్రాణాలైనా ఇస్తారు.. ఇద్దరూ పని రాక్షసులు. అటు ఆఫీసును, ఇటు ఇంటిని చక్కగా నిర్వహిస్తారు. నాన్నయితే ఇన్స్టాగ్రామ్లో కనిపించే పిచ్చి రీల్స్ ఏవేవో పంపుతాడు. అది చూసినప్పుడు ఈ ఆంటీ ఫన్నీగా ఏం లేదు నాన్నా అంటుంటాను. అప్పుడాయన కొన్ని మంచి రీల్స్ పంపుతాడు.. అలాంటి వీడియోలు ఇష్టంచిన్న పాప అందంగా పాడుతున్నట్లు, గ్రామాల్లో వంట చేసే వీడియోలు.. ఇలాంటివి చూసి ఆయనెంతగానో సంతోషిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చింది. కాగా ఐదేళ్లకే సింగర్గా పరిచయమైంది శృతి హాసన్. తేవార్ మగన్ (1992) మూవీలో పొట్రి పాడది పొన్నె అనే పాట ఆలపించింది. తర్వాత హీరోయిన్గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సింగర్గా, హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: మహేశ్బాబు సెట్లో ఎలా ఉంటారంటే?: బాలీవుడ్ నటి -
ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు?, 34 ఏళ్ల నటి షాకింగ్ కామెంట్స్
ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోమనే చెబుతున్నారు. మరికొంతమంది అయితే తనకు నచ్చిన అబ్బాయి దొరికితే చేసుకుంటా..లేదంటే సింగిల్గానే ఉంటామని అంటున్నారు. తాజాగా కన్నడ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా అదే కామెంట్ చేసింది. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి కాదని, తోడు కావాలనుకుంటే సహజీవనం బెటర్ అని చెబుతోంది ఈ 34 ఏళ్ల సుందరి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘గత 30 ఏళ్ల నా జీవితంలో పెళ్లి చేసుకున్న జంటలను ఎన్నో చూశా. వారిలో సంతోషంగా జీవితం గడుపుతున్నవారు చాలా తక్కువ. పెళ్లి తర్వాత భాగస్వామి కెరియర్లో ఆటంకాలు కలగడం నన్ను ఆలోచింపజేశాయి. ఒకప్పుడు అందరి అమ్మాయిల్లాగానే నేను కూడా పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. నా ఫ్రొఫైల్ని మ్యాట్రిమోనీ వెబ్సైట్లోనూ పెట్టాను. అయితే నా ఫోటో చూసి ఫేక్ ప్రొఫెల్ అనుకున్నారు. అదే సమయంలో నాకు పెళ్లి వ్యవస్థపై నమ్మకం పోయింది.నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి. అయితే అది పెళ్లితోనే సాధ్యం కాదని అర్థమైంది. నాకు కూడా తోడుగా ఉండే భాగస్వామి కావాలి. కానీ ఆ బంధం నిలబడడానికి పెళ్లి అనే ట్యాగ్ అవసరం లేదు. ఇద్ధరి మధ్య మంచి అవగాహన, గౌరవం ఉంటే.. సహజీవనం చేయడం బెటర్. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే పెళ్లి కంటే ముందే సహజీవనం చేయడమే మంచిది.’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.ఐశ్వర్య లక్ష్మి సినీ కెరీర్ విషయానికొస్తే.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అయ్యాక 2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్ని ప్రారంభించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం రోహిత్ కెపి దర్శకత్వంలో వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో సాయి ధరమ్ తేజ్కి జోడీగా నటిస్తోంది. -
ట్రోలింగ్ భరించలేక ఏడ్చా.. సినిమాలు మానేయాలనుకున్నా
హిట్టు పడితే యాక్టర్స్ను నెత్తిన పెట్టుకునే జనాలు ఫ్లాప్ రాగానే వారిని దారుణంగా విమర్శిస్తుంటారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లపై ఈ ట్రోలింగ్ తీవ్రస్థాయిలో ఉంటుంది. కథానాయికలనైతే రెండు మూడు ఫ్లాపులు రాగానే ఐరన్ లెగ్ అని ముద్రవేస్తారు. తనకు మరో మూవీ ఛాన్స్ వచ్చిందనగానే అయితే అది ఫ్లాప్ అవడం ఖాయం అని దారుణంగా మాట్లాడుతుంటారు.వరుస ఫ్లాప్స్ఇలాంటి ట్రోలింగ్ను కొన్నేళ్లుగా చవిచూస్తోంది శ్రీలీల. మాస్ జాతర, రాబిన్ హుడ్, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, ఆదికేశవ, స్కంద.. ఇలా తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. తమిళంలో చేసిన పరాశక్తి కూడా లాభాలు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తనను ఈ ఫ్లాప్ ట్యాగ్ నుంచి గట్టెక్కించలేకపోయింది.వెళ్లిపోదామనుకున్నా..అయితే ఈ ట్రోలింగ్ భరించలేక ఎప్పుడో సినిమాలు మానేయాలనుకుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలోనే ఈ ట్రోల్స్కు విపరీతంగా భయపడ్డాను, బాధపడ్డాను, ఏడ్చేశాను. అమ్మా.. ఇదంతా నావల్ల అవుతుందా? కాలేజీకి తిరిగెళ్లిపోనా? అని అడిగాను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. కానీ, ఇప్పుడు వాటిని ఎదుర్కొనేంత ధైర్యం వచ్చింది అని పేర్కొంది. అదే భయంమరో హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ.. నాకు ఇప్పుడే కొంత భయంగా ఉంది. ఎందుకంటే ఇటీవలికాలంలోనే ఈ ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే ఏదో ఒకటి అనేస్తున్నారు. అదే అసలు సమస్య! ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో మనకంటూ ఓ స్థానం సంపాదించుకుంటాం. దాన్ని వాళ్లు చెడగొట్టేస్తున్నారన్న బాధ ఉంటుంది అని చెప్పుకొచ్చింది. రాశీ ఖన్నా, శ్రీలీల.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటించారు. హరీశ్ శంకర్ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైంది.చదవండి: ఐశ్వర్యరాయ్కు సారీ చెప్పిన స్నేహ ఉల్లాల్ -
డూప్, VFX కాదు.. నిజంగా ధురంధర్ హీరోనే!
సినిమాలో కాస్త కఠినమైన సీన్లు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయంటే చాలు చాలామంది హీరోలు వారి డూప్లతోనే చేయిస్తారు. దర్శకనిర్మాతలు సైతం ముందుజాగ్రత్త కొద్దీ డూప్లను పెట్టే సీన్లు పూర్తి చేస్తారు. కొన్ని చోట్లేమో హీరోనే పెట్టి సీన్లు చేసినా.. భారీగా వీఎఫ్ఎక్స్ వాడతారు. అతడే సాహసాలు చేసినట్లుగా తెరపై మాయ చేస్తారు.డూప్ కాదుకానీ ధురంధర్ హీరో రణ్వీర్ సింగ్ మాత్రం నిజంగానే సాహసం చేశాడు. డూప్, వీఎఫ్ఎక్స్ జోలికి పోకుండా రియల్ స్టంట్ చేశాడు. సినిమాలో సీక్రెట్ ఏజెంట్గా మారేందుకు హమ్జా (రణ్వీర్ సింగ్) కఠోరమైన శిక్షణ తీసుకుంటాడు. అందులో భాగంగానే నీటిలో ఊపిరి బిగపట్టుకుని ఉండేలా సాధన చేస్తాడు. కదలకుండా కూర్చున్న హీరోఅందుకోసం నీటి అడుగు భాగంలో కదలకుండా కూర్చుంటాడు. ఈ సీన్ను చాలా సహజంగా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన మేకింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటిదాకా అతడి నటనను మెచ్చుకున్న జనం.. ఈ వీడియో చూశాక అతడి అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నీ కష్టం వృథాకాలేదు, నువ్వు చాలా గ్రేట్ యాక్టర్ అని కితాబిస్తున్నారు.సినిమాసినిమా విషయానికి వస్తే.. 2025 డిసెంబర్లో వచ్చిన బ్లాక్బస్టర్ ధురంధర్ మూవీకి సీక్వెల్గా ధురంధర్ 2 తెరకెక్కింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు రాబట్టింది. #RanveerSingh performs intense underwater scene with no VFX 🔥Pure dedication & madness by Ranveer 💥#Dhurandhar2 #DhurandharTheRevenge pic.twitter.com/go6iHgSoYb— Milagro Movies (@MilagroMovies) March 21, 2026 చదవండి: త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్ ఇదే -
ఐశ్వర్యరాయ్కు సారీ చెప్పిన హీరోయిన్, ఎందుకంటే?
పిల్లి కళ్ల హీరోయిన్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు ఐశ్వర్యరాయ్.. ఆ తర్వాత కాస్త అటూఇటుగా ఐష్లాగే కనిపించే స్నేహా ఉల్లాల్ గుర్తొస్తుంది. తను కూడా హీరోయిన్ అయినప్పటికీ తనను ఐశ్వర్యతో పోల్చినందుకు తెగ సంబరపడిపోయింది. అదే సమయంలో ఒకసారి ఆమెను నేరుగా కలిసి క్షమాపణలు కూడా చెప్పింది.. అదెందుకో ఓసారి చూసేద్దాం..సినిమా'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహా ఉల్లాల్. అప్పటికే 'లక్కీ: నో టైం ఫర్ లవ్' (2005) చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఓపక్క హిందీ సినిమాలు చేస్తూ మరోపక్క తెలుగు చిత్రాల్లో నటించింది. మధ్యలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వగా ఆ తర్వాత అడపడాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.సల్మాన్ ఎలాంటివాడంటే?తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ తన కెరీర్ తొలినాళ్ల గురించి ఓపెన్ అయింది. ఆమె మాట్లాడుతూ.. లక్కీ మూవీతో నా సినీరంగ ప్రవేశం జరిగింది. చిత్రీకరణ సమయంలో హీరో సల్మాన్ ఖాన్ నాకెంతో సపోర్ట్ చేశాడు. ఎప్పుడూ ఓపిక, సహనంతో మెదిలేవాడు. తానో పెద్ద హీరో అని ఎన్నడూ యాటిట్యూడ్ చూపించలేదు.అలా ఫేమస్నిజానికి నేను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది. చూడటానికి నేను ఐశ్వర్యరాయ్లాగే ఉంటానని చాలామంది అంటుంటారు. అలా ఆమె మిస్ వరల్డ్ కిరీటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటే నా చుట్టూ ఉన్న చిన్నప్రపంచంలో నేను సెలబ్రిటీ అయిపోయాను.ఐశ్వర్యకు సారీనేను ఒకే ఒక్కసారి ఐశ్వర్యను కలిశాను. నన్ను చూడగానే ఆమె 'వెల్కమ్ టు ద ఫ్యామిలీ.. బాలీవుడ్కు స్వాగతం' అని సాదరంగా ఆహ్వానించింది. అప్పుడు వెంటనే నేను ఆమెకు సారీ చెప్పాను. మీడియాలో పదేపదే నన్ను ఐష్తో పోలుస్తూనే ఉన్నారు. దాని గురించే చెప్తూ నన్ను క్షమించండి, దయచేసి నన్ను ద్వేషించకండి అన్నాను. మరి ఆమె దాన్ని ఎలా తీసుకుందో నాకు తెలీదు అని స్నేహా ఉల్లాల్ పేర్కొంది.చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పునర్నవి -
త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్ ఇదే!
ఇప్పటివరకు తేజ సజ్జాను హీరోగానే చూశాం.. కానీ త్వరలో అతడిని ఓ హోస్ట్గానూ చూడబోతున్నాం. బాలీవుడ్లో వచ్చిన ద ట్రైటర్ షో త్వరలోనే తెలుగులోనూ రానుంది. సెలబ్రిటీలు పాల్గొనే ఈ షోకి తేజ సజ్జా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది.మొహమాటం లేదుఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్లో తేజ సజ్జా పెళ్లి వార్తలపై స్పందించాడు. త్వరలోనే నా పెళ్లి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు. ఏదైనా ఉంటే నేనే చెప్తాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నిర్మొహమాటంగా సిల్వర్ జ్యువెలరీ వేసుకుని మరీ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఇకపోతే ఇక్కడ స్వయంవరం జరగడంలేదు, కాబట్టి నా పెళ్లి గురించి చర్చ వద్దు అని చెప్పాడు.టాలీవుడ్లో పెళ్లి సందడికాగా ఈ ఏడాది ప్రారంభంలోనే పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కారు. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ సోదరుడు, హీరో శిరీష్ మార్చి 6న పెళ్లి చేసుకున్నాడు. కొంతంకాలంగా ప్రేమలో ఉన్న నయనికా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. తాజాగా బిగ్బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం కూడా వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. అటు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఇటీవలే తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు.చదవండి: ప్రియుడిని పెళ్లాడిన బిగ్బాస్ బ్యూటీ పునర్నవి -
ప్రియుడిని పెళ్లాడిన పునర్నవి.. ఫోటోలు వైరల్
బిగ్బాస్ ఫేమ్, నటి పునర్నవి భూపాలం పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, ఫోటోగ్రాఫర్ హేమంత్ వర్మతో ఏడడుగులు వేసింది. తన పెళ్లిలో ఫ్రెండ్స్ గ్యాంగ్తో దిగిన సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు పునర్నవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గతేడాది డిసెంబర్లోనే తన ప్రియుడిని పరిచయం చేసింది పునర్నవి. హేమంత్ వర్మకు ఎస్ చెప్పానంటూ ఫోటోలు షేర్ చేసింది. సినిమాఫిబ్రవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరగ్గా.. నెల తిరిగేలోపు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. పునర్నవి.. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా నటించింది. ఆ తర్వాత కూడా పిట్టగోడ, మనసుకు నచ్చింది, సైకిల్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగు బిగ్బాస్ మూడో సీజన్తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పైచదువుల కోసం లండన్ వెళ్లిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉండేది.చదవండి: కోర్ట్ జంట బ్యాండ్ మేళం ట్రైలర్ -
కరెక్ట్ పర్సన్ దొరికితేనే పెళ్లి.. లేదంటే జీవితాంతం సింగిల్గానే!
కొందరు పెళ్లంటేనే ముఖం చాటేస్తారు. అలాంటివారిలో బాలీవుడ్ నటి దివ్య దత్తా ఒకరు. 48 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. తాజాగా ఆమె ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. దివ్య దత్తా మాట్లాడుతూ.. గతంలో నేను రిలేషన్షిప్స్లో ఉన్నాను.. కానీ, అవేవీ నాకు సరిపోవని అర్థమైంది. మా ఆలోచనలు భిన్నంగా ఉండేవి. సింగిల్గా ఉన్నానని..దాంతో ప్రేమికులుగా కంటే స్నేహితులుగానే బాగుంటామనిపించింది. అయితే ఇప్పటికీ నేను సింగిల్గా ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. జీవితంలో ఓ తోడు లేకుండా ఏం చేస్తున్నావు?, అసలు పెళ్లెందుకు చేసుకోలేదు? అని ప్రశ్నిస్తుంటారు. నా జీవితంలో ఏది ముఖ్యం? ఏది అవసరం అనేది నాకు బాగా తెలుసు.ప్రశాంతంగా ఉంటా..నాకు కరెక్ట్ అనిపించే వ్యక్తి తారసపడ్డప్పుడు కచ్చితంగా ప్రేమలో పడతాను.. కానీ అలాంటి వ్యక్తి దొరక్కపోతే ఇలా ఎప్పటికీ ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉంటాను. అంతేతప్ప ఓ తోడుండాలి కదా అని ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోలేను. నాకు ఈ సమాజ ఆమోదం కన్నా మానసిక ప్రశాంతత, సంతోషమే ముఖ్యం.సినిమాపైగా రిలేషన్షిప్లో ఇద్దరూ జీవితాంతం కలిసుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. ఎప్పుడు? ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అని తెలిపింది. దివ్య దత్తా.. వీర్ జార, ఢిల్లీ 6, భాగ్ మిల్కా భాగ్ , హీరోయిన్, బ్లాక్మెయిల్ వంటి పలు సినిమాలతో గుర్తింపు పొందింది. చివరగా ఛావా మూవీలో యాక్ట్ చేసింది.చదవండి: ధురంధర్ 2 ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. తెలుగులో కూడా.. -
నిన్ను మస్తు లవ్ చేశిన.. బ్యాండ్మేళం ట్రైలర్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ను శనివారం (మార్చి 21న) విడుదల చేశారు. చిన్నప్పుడే మా అమ్మ సచ్చిపోతే నా అన్నని మా అమ్మ లెక్క చూసుకున్న.. నేనడిగితే పాణం కూడా ఇస్తడు అన్న డైలాగ్తో వీడియో మొదలయింది. ఎమోషనల్గా ట్రైలర్నేను నిన్ను మస్తు లవ్ చేశిన.. కానీ, నువ్వు నన్ను దేఖలే.., నువ్వు వచ్చినతర్వాతే పగిలిపోయిన నా గుండెను అతుకపెట్టుకున్ననే.. నువ్వు మళ్ల పగలగొట్టినవ్.. నన్ను ఇడ్సిపెట్టు పోవే అంటూ హీరో చెప్పే డైలాగులు బాగున్నాయి. మరదలి ప్రేమ కోసం తపించిపోయిన హీరో చివరకు ఆమెను కాదనుకునే స్థితికి వస్తాడు. మొత్తానికి ట్రైలర్ ఎమోషనల్గా సాగింది. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. చదవండి: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు కలెక్షన్స్ -
మాట నిలబెట్టుకున్న విజయ్.. చిన్నారిని ఇంటికి పిలిచి మరీ..
పెళ్లంటే ఇలా ఉండాలి అన్నంత అద్భుతంగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. వైభవంగా పెళ్లిదేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తామని ప్రకటించాడు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్ల పంపిణీ కూడా చేశారు. హైదరాబాద్లో మార్చి 4న గ్రాండ్గా రిసెప్షన్ జరుపుకున్నారు. అయితే ఇంత గొప్పగా పెళ్లి చేసుకున్న విరోష్ జోడీ తననెందుకు పిలవలేదని ఓ చిన్నారి అలిగింది. లడ్డూలు ఇవ్వొచ్చు కదా!నేను కూడా విజయ్కు అభిమానినే కదా.. నన్ను కూడా పెళ్లికి పిలవచ్చు కదా.. లడ్డూలు ఇవ్వొచ్చు కదా.. అంటూ క్యూట్గా రిక్వెస్ట్ చేసింది. ఇంకేముంది, ఆ వీడియో రౌడీబాయ్ కంటపడింది. బుజ్జితల్లి.. మా ఇంటికి రా.. నీకు నచ్చిన ఫుడ్, స్వీట్స్.. అన్నీ ఇంట్లోనే నీకోసం ప్రత్యేకంగా తయారు చేయిస్తా అన్నాడు. అనడమే కాదు చేసి చూపించాడు కూడా! విప్రేమతో ముద్దుల వర్షంరోష్ జోడీ ఆ బుజ్జితల్లిని ఇంటికి పిలిచి తనకు నచ్చిన భోజనం వడ్డించారు. లడ్డూలు తినిపించారు. విజయ్ ఆ పాపను ఆప్యాయంగా ఎత్తుకుంటే రష్మిక తనపై ప్రేమతో ముద్దుల వర్షం కురిపించింది. ఇప్పటినుంచి మనం కూడా ఫ్రెండ్సే అంటూ పాపతో సంభాషించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనం కూడా ఫ్రెండ్సేకదా.. అనుకుంటూనే మొత్తానికి సాధించావ్, విరోష్ను కలిశావ్ అంటూ జనం కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by urs lucky thalli 😍 (@urs_luckythalli) చదవండి: తెలుగు హీరోలని కొడతారెందుకు? ఎందుకంత కోపం? హీరోయిన్ ఆన్సరిదే! -
తమిళ హీరోలతో రొమాన్స్.. తెలుగు హీరోలపై కోపం?
తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్. శ్రీగౌరీ ప్రియ హీరోయిన్గా నటించింది. ఒకప్పటి హీరో అబ్బాస్ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నాడు. లవ్టుడే సినిమాకు ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియ రాజ్ (మరియ ఇళంజెళియన్) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుగు హీరోలపై కోపం?ఈ క్రమంలో శుక్రవారం నాడు హ్యాపీరాజ్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీ గౌరీప్రియకు వింత ప్రశ్న ఎదురైంది. మీరు సినిమాల్లో తమిళ హీరోలతో రొమాంటిక్గా ప్రవర్తిస్తారు.. అదే తెలుగు హీరోలతో యారొగెంట్గా ప్రవర్తిస్తున్నారు, అంటే వాళ్లను కొడతారు. తెలుగు హీరోలపై ఎందుకంత కోపం? అని ఓ విలేకరి ప్రశ్నించాడు.నేనేమైనా కంకణ కట్టుకున్నానా?ఆ ప్రశ్న విని గౌరీప్రియ అవాక్కయింది. నేను ఒక్క సినిమాలోనే హీరోను కొట్టాను.. నేనేమైనా హీరోలను కొట్టాలని కంకణం కట్టుకున్నానా? అసలు నాకు ఎవరి మీదా కోపం లేదు. ఆ లెక్కన చూస్తే.. నేను అన్ని సినిమాల్లో ఏడుస్తానని అంటారు. తమిళ సినిమాల్లో ఏడుస్తుంది, తెలుగు మూవీస్లో మాత్రం సంతోషంగా నవ్వుతుందంటారు. అవేవీ నిజం కాదు.. సినిమాలో నా పాత్ర అలా డిజైన్ చేస్తున్నారు అని బదులిచ్చింది.సినిమాతెలుగమ్మాయి అయిన శ్రీ గౌరీ ప్రియ.. లవర్, మ్యాడ్, మెయిల్ వంటి సినిమాల్లో నటించింది. మ్యాడ్ మూవీలో ఈమె.. హీరో రామ్ నితిన్ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ వైరలయింది. ప్రస్తుతం ఆమె చేతిలో వింటారా సరదాగా, చెన్నై లవ్స్టోరీ చిత్రాలున్నాయి.చదవండి: 10 ఏళ్ల కిందట విడాకులు.. కలిసిపోయిన స్టార్ కపుల్ -
మళ్లీ పెళ్లి చేసుకోలేదు, కానీ కలిసిపోయాం: స్టార్ డైరెక్టర్
మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, హీరోయిన్ లిస్సీ 2016లో విడాకులు తీసుకున్నారు. 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోయారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరూ ఓ పెళ్లిలో జంటగా కనిపించారు. దీంతో ప్రియదర్శన్-లిస్సీ కలిసిపోయారా? అన్న ప్రచారం మొదలైంది. అది మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చెవిలో పడింది.సంతోషంలో మమ్ముట్టిమమ్ముట్టి.. ప్రియదర్శన్ డైరెక్షన్లో, అలాగే లిస్సీతో కలిసి సినిమాలు చేశాడు. అలా ఇద్దరూ తనకెంతో సన్నిహితులు. వారు కలిసిపోవడంతో మమ్ముట్టి చెన్నైలోని ప్రియదర్శన్ స్టూడియోకి ఇద్దర్ని రమ్మని పిలిచాడట! మీ ఇద్దరినీ ఇలా జంటగా చూడటం సంతోషంగా ఉందని వారితో చెప్పాడట! విడిపోయిన పదేళ్ల తర్వాత ఈ దంపతులు మళ్లీ కలవడానికి వారి పిల్లలు కల్యాణి, సిద్దార్థ్ ప్రధాన కారణమని తెలుస్తోంది. పెళ్లిఅయితే వారు కలిసిపోయారు కానీ పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం చేయడం లేదు. మ్యారేజ్ అనేది కేవలం సర్టిఫికెట్ అని.. తమ మధ్య స్నేహం, అన్యోన్యత, ప్రేమ ముఖ్యం అని చెప్తున్నారట! దీనిపై ప్రియదర్శన్ సైతం స్పందిస్తూ.. అవును, మేము కలిసే ఉంటున్నాం అని ధ్రువీకరించాడు.సినిమాకాగా ప్రియదర్శన్, లిస్సీ.. 1990 డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు కల్యాణి, కుమారుడు సిద్ధార్థ్ సంతానం. కల్యాణి ప్రియదర్శన్ లోక సినిమాతో ఇటీవలే సెన్సేషన్ సృష్టించింది. ప్రియదర్శన్.. హిందీలో అక్షయ్కుమార్ హీరోగా భూత్ బంగ్లా సినిమా చేశాడు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.చదవండి: నడిరోడ్డుపై వేధింపులు.. పోలీసులకు నటి ఫిర్యాదు -
విజయ్- సాయిపల్లవితో మణిరత్నం కొత్త మూవీ
సాయిపల్లవికి పెద్ద అభిమానిని అని చెప్పుకునే మణిరత్నం తనతో సినిమా ప్రకటించాడు. థగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన ఓ ప్రేమకథతో కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఇందులో విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటించనున్నారు.అదిరిన కాంబినేషన్లైకా ప్రొడక్షన్స్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ కాంబో చూస్తుంటే సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందని అభిమానులు అప్పుడే ఆశలు పెట్టేసుకుంటున్నారు. రూమర్స్నిజానికి ఈ సినిమాలో మొదటగా ధ్రువ్ విక్రమ్, రుక్మిణి వసంత్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, తర్వాత వారి స్థానంలో విజయ్ సేతుపతి, సాయిపల్లవిని తీసుకున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు అదే నిజమైంది. అలాగే సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు రూమర్స్ రాగా.. చివరకు ఆయన స్థానంలో రెహమాన్ను తీసుకున్నారు.సినిమాకాగా విజయ్ సేతుపతి స్లమ్డాగ్, జైలర్ 2 సహా మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు సాయిపల్లవి హిందీలో రామాయణ, ఏక్ దిన్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి! View this post on Instagram A post shared by Madras Talkies (@madrastalkies) -
నడిరోడ్డుపై వేధింపులు.. తాగొచ్చి కారు ఆపి..: నటి
బాలీవుడ్ నటి నిమిషా నాయర్కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై బాంద్రాలో క్యాబ్లో వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తనను ఇబ్బందిపెట్టారంటోంది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉదయం 4.50 గంటల సమయంలో నేను క్యాబ్లో వెళ్తున్నాను. ఆ సమయంలో డ్రైవర్ ఓ బైక్ను ఓవర్టేక్ చేశాడు. ఆ బైక్పై ఉన్నవారు బాగా తాగినట్లున్నారు. వాళ్లను దాటేసినందుకు కోపంతో ఊగిపోయారు. కొట్టడానికి రెడీ..క్యాబ్ డ్రైవర్కు గుణపాఠం చెప్పాలనుకున్నారు. హైవే మధ్యలో మా కారును అడ్డుకున్నారు. కారు ఎదుటే బైక్ నిలిపి ముందుకు వెళ్లనీయకుండా చేశారు. ఆవేశంతో ఎగబడ్డారు, దుర్భాషలాడారు. డోర్స్ తెరిచేందుకు ప్రయత్నించారు. నన్ను విండోస్ కిందకు దించమన్నారు. వాళ్లెంత రెచ్చగొట్టినా సరే మేము ఆ పని చేయలేదు. ఎందుకంటే అతడు డ్రైవర్ను కొట్టడానికే మా కారు ఆపాడని నాకు బాగా తెలుసు.. మా రక్షణ కోసం మేము సైలెంట్గా ఉండిపోయాం. వీడియో తీస్తున్నానని..మమ్మల్ని చాలాసేపు వేధించారు. నేను వీడియో తీస్తున్నానని గ్రహించి కారు ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు అని పేర్కొంది. వీరిపై చర్యలు తీసుకోమని పోలీసులను కోరింది. ఇది చూసిన నెటిజన్లు.. మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం, ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నిమిషా నాయర్.. అమర్ కాలనీ, 8 ఏఎమ్ మెట్రో సినిమాల్లో నటించింది. 'ట్రయల్ బై ఫైర్' వెబ్ సిరీస్లోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Nimisha Nair 🌸 (@nimnair) చదవండి: యాక్టింగ్ రాదని ట్రోలింగ్ చేశారు: రష్మిక ఎమోషనల్ -
ఫ్రీగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్.. రిజెక్ట్ చేశా: అనుపమ్ ఖేర్
టాలెంట్ ఉంటే చాలు ఎలాగైనా రాణించవచ్చనుకున్నాడు నటుడు అనుపమ్ ఖేర్. కానీ, ఆయన బట్టతలను చూసి ఈయనెలా నటుడవతాడని చాలామంది సంశయించారు. వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ దిల్వాలే దుల్హానియా లేజాయెంగే, హమ్ ఆప్కే హై కోన్, ద కాశ్మీర్ ఫైల్స్ వంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించాడు. రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్నాడు.అంకుల్ అని పిలవద్దుతాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. యువతరం నన్ను సర్, అంకుల్ అని పిలిస్తే నచ్చదు. ఏకే లేదా అనుపమ్ గారు అంటే సరిపోతుంది. అంతేకానీ అంకుల్ అని నన్ను వేరు చేయడం ఇష్టం లేదు. సినిమా దగ్గరినుంచి ఏఐ, సైన్స్.. ఇలా అన్నిరకాల అంశాల గురించి చర్చించడం నాకెంతో ఇష్టం. ఇకపోతే ఎంతోమంది డాక్టర్లు నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామని ముందుకు వచ్చారు. పేపర్లో యాడ్కానీ, వాళ్లందరినీ సున్నితంగా తిరస్కరించాను. నా తలపై వెంట్రుకలు వచ్చేందుకు డబ్బు ఖర్చుపెట్టేందుకు రెడీ అయినవాళ్లూ ఉన్నారు. కానీ, నేను వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. అలా డబ్బు తీసుకోవడం నాకిష్టం లేదు. ఒకసారి ఏమైందంటే నేను న్యూస్పేపర్ చదువుతున్నాను. అందులో హెయిర్ ఆయిల్ కోసం ఓ వాణిజ్య ప్రకటన వేశారు. అది నేను చూడలేదు. సినిమాకానీ, నా కొడుకు సికందర్ నేను యాడ్నే చూస్తున్నా అనుకుని.. దాని గురించి ఆలోచించకు నాన్న అన్నాడు. ఎన్నో ఏళ్ల కిందట ఈ సంఘటన జరిగింది అని చెప్పుకొచ్చాడు. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఘోస్లా 2. ఇది 2006లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఖోస్లా కా ఘోస్లా సినిమాకు సీక్వెల్గా తెరకెక్కింది. ప్రశాంత్ భాగియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 28న విడుదల కానుంది.చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలో కొత్త సినిమా -
కుటుంబానికి దూరంగా.. నాన్న పేరుపై అర్చన: మనోజ్
ప్రతి ఉగాదికి ఫ్యామిలీతో కలిసి ఉండేవాడిని, కానీ ఈసారి దూరంగా ఉండాల్సి వచ్చిందంటున్నాడు హీరో మనోజ్ మంచు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. నేను ఎప్పటినుంచో ఒకటి బలంగా నమ్ముతాను.. సనాతన సాంప్రదాయం, మనకు చిన్నప్పుడు నేర్పించిన విలువలు ఎప్పటికీ మనల్ని వదిలి వెళ్లవు.ఉగాది అంటే..మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఆ విలువలు మనలో, మనతోనే ఉంటాయి. ఈరోజు కూడా నా రాబోయే సినిమా డేవిడ్ రెడ్డి షూటింగ్ కోసం దూరంగా ఉండాల్సి వచ్చింది. బాధ్యతలతో బిజీగా ఉన్నా.. ఆ అనుబంధం మాత్రం అలాగే ఉంది. నాకైతే ఉగాది అంటే నూతన సంవత్సరానికి నాంది మాత్రమే కాదు, అది మనలో జరిగే నిశ్శబ్ధ పునరుజ్జీవనం, ఋతువుల మార్పు, ధర్మం మళ్లీ మేల్కొనడం, కాలపురుషుడి ఆవిర్భావం.నాన్న పేరుపై అర్చనఈ చైత్ర శుక్ల ప్రతిపద రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని నెలకొల్పి, యుగాల చక్రాన్ని ప్రారంభించాడని నమ్ముతారు. అదే మనం ఉగాదిగా జరుపుకుంటాం. నేను ఎంతో దూరంలో ఉన్నప్పటికీ గుడిలో ఉన్న నా కుటుంబాన్ని వీడియో కాల్ ద్వారా చూశాను. ఆ ఆధ్యాత్మికతను నేనూ ఫీల్ అవుతున్నాను. మౌనిక, ధైరవ్, చిట్టి దేవసేన.. నాన్న (మోహన్బాబు) పేరుమీద అర్చన చేయించారు. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. తన మనవళ్లకెప్పుడూ ఆయన ఆశీస్సులుంటాయి.ఇలా తొలిసారిఓపక్క పనిలో బిజీగా ఉంటూనే నా మూలాలను మర్చిపోకుండా ఉండగలగడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. మార్చి 19 అంటేనే నాకు పండుగ.. ఇది నాకు చిన్నప్పటినుంచి సెలవురోజు, ఎందుకంటే ఈరోజు నా తండ్రి పుట్టినరోజు. ఆయనతో కలిసి గడిపే ప్రత్యేకమైన రోజు. కానీ, తొలిసారి ఆ సెలవురోజు పనిదినంగా మారింది. నాకు కుటుంబం తర్వాత అత్యంత ఇష్టమైనది పని! నేను ఏం చేసినా, అందరితో ప్రశంసలు అందుకునేలా పని చేస్తున్నా.. అదంతా మీకోసమే నాన్న.. హ్యాపీ బర్త్డే అని రాసుకొచ్చాడు. चैत्रे मासि जगत् ब्रह्मा ससर्ज प्रथमेऽहनि।शुक्ल पक्षे समग्रेतु तदा सूर्योदये सति॥I have always believed that the Sanatana tradition and the values we are raised with never really leave us. They stay within us, no matter where we are or what we are doing. Even today, being away… pic.twitter.com/c8WE4OAib4— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 19, 2026 చదవండి: రొమాంటిక్ సాంగ్.. డైరెక్టర్కు కాజోల్ వార్నింగ్ -
ఓటీటీ ప్రపంచంలో కిరణ్ అబ్బవరం.. గ్లింప్స్ చూశారా?
క, కె- ర్యాంప్ సినిమాలు కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచాయి. అయితే వీటి మధ్యలో వచ్చిన దిల్రూబా మాత్రం ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడీ హీరో. ఓపక్క వెండితెరపై సినిమాలు చేసుకుంటూనే ఓటీటీ ప్రపంచంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.వెబ్ సిరీస్ఈసారి సినిమాతో కాకుండా వెబ్సిరీస్తో ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్లాన్ చేశాడు. తాజాగా ఆ వెబ్ సిరీస్ టైటిల్తో పాటు గ్లింప్స్ కూడా వదిలారు. డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వం వమిస్తున్న ఈ సిరీస్కు గువ్వల చెరువు ఘాట్ టైటిల్ ఫిక్స్ చేశారు. రూరల్ బ్యాక్డ్రాప్ పొలిటికల్ డ్రామాతో ఈ సిరీస్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సిరీస్ఇందులో తిరువీర్, సంయుక్త మీనన్, తేజస్వి రావు, సిద్ధిఖి, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ లుక్ గ్లింప్స్ చూస్తుంటే ఇంట్రస్టింగ్గా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. -
రొమాంటిక్ సాంగ్.. దర్శకుడికి కాజోల్ వార్నింగ్!
ఫనా.. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లవుతోంది. 2006లో వచ్చిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, కాజోల్ హీరోహీరోయిన్లుగా నటించారు. కాజోల్ అంధురాలిగా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. తాజాగా ఆనాటి సినిమా విశేషాలను దర్శకుడు కునాల్ కోహ్లి పంచుకున్నాడు. హీరోయిన్ వార్నింగ్ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా సినిమాలో హీరోయిన్కు కళ్లు కనిపించవు. అలా అని తనకు కళ్లజోడు పెట్టలేదు. హీరో, ప్రేక్షకులు ఆమె కళ్లలోకి చూడాలనుకున్నాను. సినిమాలో హీరో, హీరోయిన్లపై దేఖోనా.. అని ఓ వర్షం పాట ఉంటుంది. ఆ సాంగ్ షూటింగ్ మొదటిరోజే కాజోల్ నన్ను హెచ్చరించింది. ఈ పాటను నేను నా అత్తామామలతో కలిసి చూడాల్సి ఉంటుంది, అది మైండ్లో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. అంధురాలు ప్రేమలో పడకూడదా?అయితే నేను వెనక్కు తగ్గాలనుకోలేదు.. ఆమె అంధురాలైతే ఏంటి? అందరిలాగే తను కూడా ప్రేమలో పడింది. తనకెందుకు పరిమితులు విధించాలనుకున్నాను. పాటను విచారంగా చూపించాలనుకోలేదు. నాకు నచ్చినట్లుగానే తీశాను అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో టబు, సతీశ్ షా, లారా దత్తా కీలక పాత్రలు పోషించారు.చదవండి: రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా -
రెండు ఫ్లాట్లు అమ్మేసిన ప్రభుదేవా.. ఇంత తక్కువ లాభమా?
కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా రెండు ఫ్లాట్లు అమ్మేశాడు. దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలోని మినర్వా బిల్డింగ్లోని ఫ్లాట్లను తక్కువ లాభానికే వదిలేసుకున్నాడు. సుమారు రూ.14.80 కోట్లకు ఈ ఫ్లాట్స్ అమ్మేశాడు. మార్చి 13న ఈ లావాదేవీ జరిగినట్లు తెలుస్తోంది.అప్పట్లో..కాగా వీటిని ప్రభుదేవా 2012లో రూ.14.45 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. ఒక ఫ్లాట్ 32వ అంతస్తులో ఉండగా, మరొకటి 33వ అంతస్తులో ఉంది. ఒక్క ఫ్లాట్ సుమారు 1295 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగుంది. పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాటిని అమ్మితే ప్రభుదేవాకు కేవలం రూ.35 లక్షలు మాత్రమే లాభం వచ్చింది. ఇది చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.చదవండి: సూర్య అడుగుజాడల్లో చిరంజీవి.. త్వరలోనే.. -
ఉగాది రోజు చిరంజీవి కీలక ప్రకటన.. త్వరలోనే..
మెగాస్టార్ చిరంజీవి మరో బృహత్తర కార్యక్రమానికి ముందడుగు వేయబోతున్నారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపిన ఆయన.. ఇప్పుడు నిరుపేదలకు ఉచితంగా విద్య అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అందుకే బ్లడ్ బ్యాంక్ఉగాది పర్వదినం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. ప్రజలే. నన్ను ఇంతటివారిని చేశారు. అలాంటి వారికోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. సమయానికి రక్తం దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసి ఆనాడు బ్లడ్ బ్యాంక్ స్థాపించాను. అక్కడితోనే ఆగిపోవడం నాకిష్టం లేదు. ఇంకా సేవ చేయాలనుంది. నన్ను స్ఫూర్తిగా తీసుకుని..నిరుపేద చిన్నారులకు ఉచితంగా విద్య ఎలా అందించాలని ఆలోచిస్తున్నాను. పిల్లలకు మంచి విద్య అందితే ఆ కుటుంబమే బాగుపడుతుంది. ఆ దిశగా ఆలోచిస్తున్నాను. తమిళనాడులో హీరో సూర్య నన్ను స్ఫూర్తిగా తీసుకుని అగరం ఫౌండేషన్ స్థాపించినట్లు ఎన్నోసార్లు చెప్పారు. ఆ సంస్థ ద్వారా ఎంతోమందికి ఉచిత విద్య అందించారు. ఇప్పుడు తనే నాకు ఇన్స్పిరేషన్అలా ఆయన చేస్తున్న విద్యాదానం నన్నెంతగానో మోటివేట్ చేసింది. ఒకప్పుడు ఆయనకు నేను ఇన్స్పిరేషన్.. కానీ ఇప్పుడు నేను సూర్య నుంచి స్ఫూర్తి పొందుతున్నాను. నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడమే నా భవిష్యత్తు కార్యాచరణ అని చిరంజీవి పేర్కొన్నారు.చదవండి: 32 ఏళ్ల తర్వాత.. మోహన్బాబు బర్త్డే స్పెషల్ వీడియో -
32 ఏళ్ల తర్వాత ఇలా..: మోహన్బాబు
టాలీవుడ్ హీరో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది ప్యారడైజ్. విలక్షణ నటుడు మోహన్బాబు విలన్గా యాక్ట్ చేస్తున్నారు. నేడు (మార్చి 19న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియో విడుదల చేశారు. అందులో మోహన్బాబు 32 సంవత్సరాల తర్వాత నేను విలన్గా యాక్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ శ్రీకాంత్ నన్ను మాయ చేశాడు అని పేర్కొన్నారు. ఆయనను షికంజి పాత్ర కోసం ఎలా సన్నద్ధం చేస్తున్నారనేది చూపించారు.మోహన్బాబు బర్త్డే స్పెషల్ గ్లింప్స్చివర్లో మోహన్బాబుకు ఎలివేషన్ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. ఈ జనరేషన్కు మోహన్బాబు సర్ అంటే కొంచెం అర్థం కాకపోవచ్చు. కానీ, ప్యారడైజ్తో ఆయనేంటో చూపిస్తాం అన్నాడు. అయితే ఈ గ్లింప్స్ నిడివి కేవలం 46 సెకన్లు మాత్రమే కలిగి ఉంది. ఈ సినిమా విషయానికి వస్తే అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్వీఎల్ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చదవండి: 41 ఏళ్ల వయసులో తల్లయిన బుల్లితెర నటి -
41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి
ప్రముఖ బుల్లితెర జంట దివ్యాంక త్రిపాఠి- వివేక్ దహియా గుడ్న్యూస్ చెప్పారు. పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నట్లు వెల్లడించారు. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది నాడు ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు దివ్యాంక తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.అంతా అయిపోయిందనుకునేలోపు..'పదేళ్ల ప్రయాణంలో ట్విస్ట్ అదిరింది కదూ.. కొన్ని ప్రయాణాలు తొందరపెట్టవు.. అవి సిద్ధంగా ఉన్నప్పుడే మొదలవుతాయి. మన కథ పూర్తయిందనుకులోపే జీవితం ఇలాంటి అందమైన అధ్యాయానికి స్వాగతం పలుకుతుంది. ఇంకా ఆ అనుభూతిని ఆస్వాదిస్తూనే ఉన్నా.. కారణం లేకుండానే నవ్వుతున్నా.. మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.. అవును, మేము బేబీ కోసం ఎదురుచూస్తున్నాం' అని నటి బ్యూటిఫుల్ క్యాప్షన్ జోడించింది.ఇంకా షాపింగ్ మొదలుకాలేదుఓ ఇంటర్వ్యూలో దివ్యాంక మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మొదట నా భర్తకే చెప్పాను. ఆ వెంటనే ఇంట్లో వాళ్లందరితోనూ పంచుకున్నాం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దాదాపు ఆరునెలలపాటు ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డాం. నేను ఎక్కువగా బయటకు రాకపోవడం వల్ల దీన్ని ఇంతకాలం సీక్రెట్గా ఉంచగలిగాం. బేబీ కోసం ఇంకా షాపింగ్ మొదలుపెట్టలేదు.2016లో పెళ్లిజూన్లో డెలివరీ డేట్ ఇచ్చారు అని పేర్కొంది. దివ్యాంక, వివేక్.. యే హై మొహబ్బతే సీరియల్ సెట్లో కలుసుకున్నారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2016లో భోపాల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నాచ్ బలియే 8వ సీజన్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఇప్పుడు 41 ఏళ్ల వయసులో దివ్యాంక తల్లి కాబోతోంది.సీరియల్దివ్యాంక త్రిపాఠి నటి మాత్రమే కాదు మోడల్, యాంకర్ కూడా! 2005లో మిస్ భోపాల్ కిరీటం అందుకుంది. బనూ మే తేరి దుల్హాన్ సీరియల్తో గుర్తింపు పొందింది. అలా వరుస ఛాన్సులు అందుకుంది. మధ్యలో తకనుమరుగైపోయినా యే హై మొహబ్బతే సీరియల్తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. 2017లో ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న సీరియల్ నటిగా రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) చదవండి: ఓటీటీలో అమరావతికి ఆహ్వానం మూవీ -
'యూత్' ట్రైలర్: హీరో వెనక పడుతున్న ముగ్గురమ్మాయిలు
తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం యూత్. ఈ మూవీకి కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. జీవీ ప్రకాశ్ కుమార్ పైసా పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా సంగీతం అందించాడు. ఇటీవలే తమిళ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. తాజాగా యూత్ తెలుగు ట్రైలర్ వదిలారు. యూత్ తెలుగు ట్రైలర్'మీకు పుట్టినవాడు సాధారణమైన అబ్బాయి కాదు మేడమ్.. ఆ దేవుడే మీకు బిడ్డగా పుట్టాడు. వాడిని బ్యాడ్ బాయ్స్తో చేరనివ్వకండి' అన్న సంభాషణతో వీడియో మొదలవుతుంది. తీరా హీరో.. తనను ముగ్గురమ్మాయిలు ప్రేమిస్తున్నారని తెగ సంబరపడిపోతాడు. ఫైటింగ్, లవ్, కామెడీకి ఏమాత్రం కొదవ లేనట్లుగా చూపించారు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా ట్రైలర్ కట్ చేశారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. -
నాన్న చనిపోయినప్పుడు రూ.30 ఉన్నాయి: ఫరా ఖాన్
బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన చేదు బాల్యాన్ని బయటపెట్టింది. తన తండ్రి దర్శకనిర్మాత కమ్రాన్ ఖాన్ నిర్మించిన ఒక్క సినిమాతో ఉన్నదంతా పోగొట్టుకున్నామంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫరా ఖాన్ మాట్లాడుతూ.. ఐసా భీ హోతా హై సినిమాపై నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంటిని తాకట్టు పెట్టి మరీ సినిమా తీశాడు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవాన్ని చవిచూసింది. కటిక పేదరికంలోకిఆ మూవీ శుక్రవారం రిలీజైతే ఆదివారానికల్లా కటిక పేదరికంలోకి నెట్టివేయబడ్డాం. ఎంతో ధనవంతుడైన నాన్న పేదవాడయిపోయాడు. తన కలలు ఛిద్రం కావడం తట్టుకోలేకపోయాడు. మద్యపానానికి బానిసయ్యాడు. రాత్రి అయిందంటే చాలు మేమంతా వణికిపోయేవాళ్లం. అంతలా తాగేవాడు. ఒకే ఒక్క సినిమా మమ్మల్ని ఐదారేళ్లు వెనక్కు నెట్టేసింది. ఆయన తలెత్తుకోలేకపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఎవరికీ తెలీదు13 ఏళ్లు ఏ పనీ చేయలేదు. అమ్మానాన్న విడిపోయినా కూడా ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. నాన్న దర్శకుడిగా విఫలమైనందున నేను డైరెక్టర్ అయి మంచి పేరు తేవాలనుకున్నాను. అలా చిన్నతనంలో ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్లం. ఎక్కువ చిత్రాలు చూసేవాదాన్ని. అయితే నాన్న ఎప్పుడూ కొడుకు గురించి ఆశపడేవాడు. సాజిద్ (ఫరా సోదరుడు) పుట్టాక నన్ను కాస్త పక్కనపెట్టేశాడు. నాన్న చనిపోయినప్పుడునాన్నకు నేనంటే ప్రేమ ఉందని తెలుసు.. కానీ ఫోకస్ అంతా కొడుకుపైనే ఎక్కువ ఉండేది. అప్పుడు సక్సెస్ అవ్వాలన్న సంకల్పం నాలో మరింత బలపడింది. నాన్న చనిపోయినప్పుడు ఆయన జేబులో రూ.30 మాత్రమే ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్ అన్నట్లుగానే హిందీ ఇండస్ట్రీలో మొదట కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శకురాలిగా మై హూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూయర్, తీస్మార్ ఖాన్ వంటి ఎన్నో సినిమాలు తెరకెక్కించింది.చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు -
సన్నాఫ్ కింగ్.. బిజినెస్లో రాకింగ్
కోట్లాది మందికి నాగ చైతన్య ఒక నటుడిగానే తెలుసు. కానీ కొంత మందికి మాత్రం ఆయనలో గొప్ప వ్యాపారవేత్త ఉన్నాడని కూడా తెలుసు. తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్నూ, రాష్ట్ర అవార్డ్ను కూడా అందుకున్న నాగ చైతన్య యువ హీరోల్లో దూసుకుపోతున్న యువహీరోల్లో ముందు వరుసలో ఉన్నాడు. సీనియర్ హీరోల్లో నాగార్జున సైతం వ్యాపార రంగంలో ముఖ్యంగా రెస్టారెంట్ రంగంలో తనను తాను నిరూపించుకున్న నేపధ్యంలో అందులోనూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు నాగ చైతన్య. కుటుంబ సంబంధ పరిశ్రమకు అనుబంధంగా దక్షిణ భారతదేశంలోని అత్యంత అధునాతన సౌండ్ మిక్సింగ్ స్టూడియోలలో ఒకదానిని ఏర్పాటు చేయడం వంటివాటితో పాటు సినిమాకు అవతల కూడా తనదైన వ్యాపార సామ్రాజ్యాన్ని చైతూ నిర్మించుకుంటున్నాడు.టాలీవుడ్ టూ టేస్టీ ఫుడ్...లాక్డౌన్ సమయంలో చాలా మంది నటీనటులు కొత్త కధలు వింటూనో, విభిన్న భాషా చిత్రాలను చూస్తూనో గడిపితే.. నాగ చైతన్య మాత్రం క్లౌడ్ కిచెన్ అనే సరికొత్త కాన్సెప్ట్కి శ్రీకారం చుడుతూ దాని కోసం మెనూలను డిజైన్ చేస్తూ గడిపాడు. జపనీస్ స్ఫూర్తితో ఆయన ప్రారంభించిన క్లౌడ్ కిచెన్ పేరు.. ’షోయు’, నిజానికి ఇది ఒక వ్యాపార ప్రణాళికతో మొదలవ్వలేదు. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో చైతూ చేతిలో ఉన్న ఖాళీ సమయంతో మొదలైంది. ‘జపనీస్ వంటకాలంటే నాకు చాలా ఇష్టం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, మొదటగా రుచి చూసేది జపనీస్ వంటకాలే. ఆ రుచిని, ఆ అనుభూతిని ఏదో ఒక విధంగా హైదరాబాద్కు తీసుకురావాలనుకున్నాను,‘ అని ఆయన గుర్తు చేసుకున్నాడు. తన అభిరుచికి అనుగుణంగా మొదట ఆయన ఒక జపనీస్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసినా కరోనా మహమ్మారి కొత్త ఆలోచనలు అందించింది. డైనింగ్ రూమ్లు మూతపడటం, డెలివరీ యాప్లు విపరీతంగా పెరగడం అనే సంక్షోభం నుంచి ఆయన క్లౌడ్ కిచెన్. అనే ఒక కొత్త అవకాశాన్ని గుర్తించాడు. ‘రెస్టారెంట్లో వడ్డించినట్లుగా ఆహారాన్ని చక్కగా ప్యాక్ చేసి ఇంటికి పంపే క్లౌడ్ కిచెన్ కు మన మార్కెట్లో మంచి స్కోప్ ఉందని గమనించాడు. వినియోగదారుడి ఇంటికి ఆర్డర్ చేసిన ఫుడ్ సరైన విధంగా చేరేలా చూసుకోవడానికి ప్రత్యేకమైన క్రమశిక్షణ కావాలి ‘క్లౌడ్ కిచెన్ లో క్లయింట్ ఏమీ చూడలేరు. ఓ ప్యాకెట్ డెలివరీ బాయ్ ద్వరా తన ఇంటికి రావడం మాత్రమే జరుగుతుంది. అంతా ఆహారం మాత్రమే చెప్పాలి. అక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు ఉండకూడదు.‘ అని చైతన్య అంటున్నాడు. కొత్త వంటకాలను తయారు చేస్తున్నప్పుడు, వాటిని మొదటగా రుచి చూసేది నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాలే. ‘ఇంట్లో, ఫుడ్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు నేను కొత్త వంటకాలను ప్రయత్నిస్తుంటే, శోభిత ఆ వంటకాలను రుచి చూస్తూ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది,‘ అని ఆయన చెప్పాడు. మెనూలను తీర్చిదిద్దడంలో ఆమె సలహాలు కూడా ఒక భాగమని ఆయన వివరిస్తారు. ‘ఈ విషయంలో కుటుంబం నాకు గొప్ప మద్దతుగా నిలుస్తోంది..‘అంటాడు చైతూ.తొలి బ్రాండ్ షోయు మంచి సక్సెస్ కావడంతో రెండవ బ్రాండ్ అయిన స్కూజీ కూడా దూసుకొచ్చింది. తొలి బ్రాండ్కు శోభిత ఫ్యాన్ అయితే చైతూ తండ్రి నాగార్జున రెండ బ్రాండ్కి ఫ్యాన్గా మారారు. తన తండ్రి తమ పిజ్జాలకు వీరాభిమాని అని చైతూ సంతోషంగా చెబుతాడు. అలా నాగచైతన్య స్థాపించిన షోయు శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్లోని అవుట్లెట్, ఎయిర్పోర్ట్ అవుట్లెట్కు అదనంగా, బెంగళూరు ఢిల్లీలో కూడా క్లౌడ్ కిచెన్ లను ఏర్పాటు చేసింది.. బ్రెడ్ చీజ్ ఆధారంగా రూపొందించిన కంఫర్ట్ ఫుడ్ బ్రాండ్ అయిన స్కూజీ, కూడా సక్సెస్ఫుల్గా నడుస్తోంది. వచ్చే జూలై నెలలో మాదాపూర్లో ఒక పూర్తి స్థాయి కేఫ్ ప్రారంభం కానుంది. ఈ రెండు బ్రాండ్లు ఇప్పటికే స్వయం సమృద్ధిని సాధించడం విశేషం.నాటి స్కూల్ డేస్ నుంచి నేటి రేసింగ్ లీగ్ దాకా..ఎందుకో సరిగ్గా తెలియకపోయినా చెన్నైలోని సర్క్యూట్లలో వేగంగా దూసుకుపోయే కార్లను, నాడు స్కూల్ విద్యార్థి గా చైతూ ఆసక్తిగా చూసేవాడు. ‘‘చాలా చిన్నప్పటి నుంచే రేసింగ్ నా హాబీగా ఉంది. నా స్కూల్ రోజుల్లో, దాదాపు ప్రతి వారాంతం శ్రీ పెరంబుదూర్ రేస్ట్రాక్కు వెళ్లి స్థానిక జాతీయ ఛాంపియన్ షిప్లను చూసేవాడిని. రేసింగ్ పట్ల ఇష్టం అక్కడి నుంచే వచ్చింది.’’అంటూ గుర్తు చేసుకుంటాడు.ఆ చిన్ననాటి వారాంతపు అభిరుచి ఇప్పుడు ఓ ట్రాక్ వైపు దారితీసింది. ఇప్పుడు ఇండియన్ రేసింగ్ లీగ్లోని హైదరాబాద్ బ్లాక్బర్డ్స్కు నాగ చైతన్య సహ–యజమానిగా మారేలా చేసింది. ఈ ఓపెన్ సీటర్ ఫార్ములా కార్లతో మోటార్స్పోర్ట్ను ఇంత దగ్గరగా చూడటం దాదాపు ఒక కల నిజమైనట్లుగా ఉంది. స్ట్రీట్ సర్క్యూట్ ఫార్మాటే ఈ లీగ్ను ప్రత్యేకంగా నిలుపుతుందని ఆంటాడు చైతూ.సినిమా అనేది తనను మేల్కొలిపే పలు అంశాలలో ఒకటి మాత్రమేనని చైతూ చెబుతున్నాడు. ‘‘చేస్తున్న ప్రతి పనిలో, పాలుపంచుకున్న ప్రతి చోట, సృజనాత్మకంగా ఉత్తేజితుడనవుతాను. అదే నన్ను సంతోషంగా ఉంచుతుంది, నన్ను ముందుకు నడిపిస్తుంది. మీరు నిజంగా ఆనందించే పనులు చేస్తున్నప్పుడు, ఇక ఏ సమస్య లేదు’’ అని అంటాడీ యంగ్ బిజినెస్ లీడర్.తనలాగే ఒకే కెరీర్కు మించి ఏదైనా నిర్మించాలనుకునే యువ అభిమానులకు ఆయన ఇచ్చే సలహా... ‘రాత్రికి రాత్రే ఫలితాలు రావాలని లక్ష్యంగా పెట్టుకోవద్దు. మంచి విషయాలన్నింటికీ సమయం పడుతుంది. మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలానికి ప్రణాళిక వేసుకోండి. విజయానికి చిన్న చిన్న అడుగులు వేయాలి. షార్ట్కట్స్ వెతకడానికి ప్రయత్నించవద్దు. నిజమైన సహజమైన మార్గాన్ని ఎంచుకోండి.‘ అని. -
నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు
అడుసు తొక్కనేల.. కాలు కడగనేల! గడిచిన పది రోజుల్లో రెండుసార్లు సారీ చెప్పాడు తమిళ దర్శకుడు, నటుడు ఆర్.పార్తీబన్. ఓపక్క హీరో విజయ్ విడాకుల వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగా త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లాడీ హీరో. దీంతో కొన్నాళ్లపాటు త్రిష బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే బాగుంటుందని పార్తిబన్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగగా.. క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది.కుల ప్రస్తావనఇంతలోనే మరో వివాదంలో ఇరుక్కున్నాడు పార్తిబన్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కులం గురించి ప్రస్తావిస్తూ స్పీచ్ మొదలుపెట్టాడు. స్టేజీపై కులం ప్రస్తావన తేవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో మరోసారి క్షమాపణలు చెప్తూ పోస్ట్ పెట్టాడు. నేను ఎలాంటి తప్పునైనా సరే వెంటనే సరిదిద్దుకునే వ్యక్తిని. నిజం చెప్తున్నా.. ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు. ఇదే మొట్టమొదటిసారిఏదో నోరు జారాను. ఇన్నేండ్ల అనుభవంలో కుల ప్రస్తావన తేవడం ఇదే మొట్టమొదటిసారి. కానీ, కులానికి ప్రాధాన్యతనిచ్చేవారిని నేను అస్సలు ఇష్టపడను. కుల వ్యవస్థను తప్పుపడుతూ ఎన్నో సినిమాలు చేశాను. అనుకోకుండా పొరపాటు జరిగింది. అందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలతో ఎంతోమందిని బాధపెట్టానని అర్థమైంది.క్షమించండినేను కేవలం నా ప్రతిభను నమ్ముకుంటానే తప్ప కులాన్ని వాడుకునే వ్యక్తిని కాను. ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు జరగదని మాటిస్తున్నాను. వాస్తవానికి ఈ విషయం గురించి మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను. నా వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోయి ఎప్పటిలాగే నన్ను ప్రోత్సహించండి. సినిమామీరు నాపై ఉంచిన ప్రేమను, నమ్మకాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తాను అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా యాక్ట్ చేశారు.చదవండి: పీలింగ్స్ సాంగ్ బానే చూశారుగా.. ఈ పాటకెందుకంత రాద్ధాంతం? -
పీలింగ్స్ చూశారుగా, ఈ పాటకే అంత రాద్ధాంతమా?
'కేడీ: ద డెవిల్' సినిమా నుంచి రిలీజైన ఐటం సాంగ్ సర్కే చునర్ వివాదాస్పదమైంది. సంజయ్ దత్, నోరా ఫతేహి డ్యాన్స్ చేసిన ఈ సాంగ్లోని లిరిక్స్ డబుల్ మీనింగ్ డైలాగులతో నిండి ఉంది. దీంతో వెంటనే ఆ పాటను తొలగించాలని కేంద్రం ఆదేశించింది. దాంతో హిందీ వర్షన్ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ పరిణామాలపై కేడీ సినిమా డైరెక్టర్ ప్రేమ్ భార్య, నటి రక్షిత సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.పీలింగ్స్ అప్పుడు ఓకేనేనంతా చూస్తూనే ఉన్నాను. మీరందరూ రకరకాల పోస్టులకు నన్ను ట్యాగ్ చేస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. పీలింగ్స్.., డ్రీమమ్ వేకపమ్.., చోలీకే పీచే క్యా హై.. ఇలాంటి వందలాది పాటలు బయటకు వచ్చినప్పుడు అందరికీ బాగానే అనిపించాయి. శృంగారమే ప్రధానంగా సినిమాలు వచ్చినప్పుడు కూడా అందరూ బానే ఉన్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు. చెత్త రచయిత అయిపోడుకానీ ఇప్పుడు ఒక్క పాట విషయంలో మాత్రం పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. అదెందుకో నాకర్థం కావడం లేదు. అలా అని నేను ఈ పాటను సమర్థించడం లేదు. కాకపోతే ఈ వివక్షను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఒక్క పాట సరిగా లేనంత మాత్రాన ఆయనను చెత్త రచయిత అయిపోడు. తను ఇదంతా కావాలని చేస్తున్నారని అనడం కూడా తప్పే! కొన్ని సినిమాలు ఆడనంత మాత్రాన ఆయన్ని మంచి దర్శకుడు కాదని అనలేం. మీకు ఆయన్ని ప్రశ్నించే హక్కుంది, కానీ దూషించే హక్కు ఎవరికీ లేదు.ప్రశ్నించే హక్కుందిఈరోజుల్లో మంచి, చెడు అన్నిరకాల పాటలు నిత్యం వస్తూనే ఉన్నాయి. రక్తపాతం, లైంగికతకు సంబంధించిన సినిమాలను జనాలు ఓపెన్గా చూస్తున్నారు. ప్రేమ్ కన్నడిగుడు. అతడిపై మీకు పూర్తి హక్కులున్నాయి. ఏది తప్పు? ఏది ఒప్పు? అని ప్రశ్నించే హక్కుంది. కానీ అతడి పనితీరును తప్పుపడుతున్నారు. ఒక కన్నడ డైరెక్టర్కు సినిమాను ఓటీటీలో అమ్మడమనేది ఎంత పెద్ద ఛాలెంజో మీకు తెలుసా? అలాగే జనాల్ని థియేటర్కు రప్పించడం కూడా సవాలుగానే మారింది. కొంచెం సమయం ఇవ్వండిఇది కేవలం మా ఒక్క కథే కాదు, కన్నడ చిత్రపరిశ్రమలోని ప్రతి సినిమా కథ ఇంతే! రాబోయే రోజుల్లో అంతా సర్దుకుంటుందన్న నమ్మకం ఉంది. కొంచెం సమయం ఇవ్వండి. కేడీ మాకు బిడ్డలాంటిది. దానికి ఏది సరైనదో చివరకు అదే చేస్తాం. మమ్మల్ని నమ్మండి అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వరుస పోస్టులు పెట్టింది. ప్రేమ్ దర్శకత్వంలో ధ్రువ సర్జా హీరోగా నటించిన కేడీ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది.చదవండి: చికిరి చికిరి నేనే రాశా.. ఈ పాటకు మాత్రం అవమానం: గేయరచయిత -
సినిమాపై భయం.. అబ్బాస్కు మంచి కమ్బ్యాక్!: హీరో
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం హ్యాపీ రాజ్. నటి శ్రీగౌరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ద్వారా నటుడు అబ్బాస్ రీఎంట్రీ ఇస్తున్నాడు. మరియరాజు ఇళంజెలియన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్ధ నిర్మించిన ఈ మూవీకి జయకాంత్ సురేశ్ సహనిర్మాతగా వ్యవహరించాడు.దేనికీ భయపడని వ్యక్తి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 27న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో జీవీ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు మరియరాజు దేనికీ భయపడని వ్యక్తి అన్నారు. ఆయన చెప్పిన కథ నచ్చిందని, అయితే మంచి నిర్మాత కోసం ఎదురుచూస్తున్న సమయంలో జయకాంత్, జయవర్ధ ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. మధ్యలోనే వదిలేస్తారా?కొత్త దర్శకుడు, కొత్త నిర్మాతలు కావడంతో ఈ మూవీని పూర్తి చేస్తారా? మధ్యలోనే వదిలేస్తారా? అన్న భయం కలిగిందన్నారు. ఇదే విషయాన్ని వారిని అడిగానన్నారు. అయితే వారు ఈ సినిమాను చాలా బాగా రూపొందించి, బిజినెస్ పూర్తి చేసి రిలీజ్కు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. హ్యాపీరాజ్ చిత్రం తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు. అందరికీ ఏమో కానీ అబ్బాస్కు కచ్చితంగా ఈ మూవీ కంబ్యాక్గా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన అంత బాగా నటించారని కితాబిచ్చారు. -
వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా అనౌన్స్మెంట్ మొదలు రిలీజ్ వరకు అన్నింట్లోనూ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. ఇక హీరో-డైరెక్టర్, హీరో, హీరోయిన్ల కాంబినేషన్ విషయంలోనూ సెంటిమెంట్ చూస్తుంటారు. ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్కి ఎవరినైనా గెస్ట్గా పిలవాలంటే.. దానికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఫలానా హీరో ప్రీరిలీజ్ ఈవెంట్కి వస్తే సినిమా హిట్ అవుతుందని నమ్మే దర్శకనిర్మాతలు చాలానే ఉన్నారు. ఇదంతా పాజిటివ్ సెంటిమెంట్. ఇదే ఇండస్త్రీలో నెగెటివ్ సెంటిమెంట్ కూడా ఉంది. పలాన హీరో.. పలానా దర్శకుడితో సినిమా తీస్తే ఫ్లాప్ గ్యారెంటీ.. ఆ ఇద్దరు స్టార్స్ రెండోసారి కలిస్తే.. అపజయం తప్పదు అనే నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా అభిమానులు ఎక్కువగా ఈ నెగెటివ్ సెంటిమెంట్లను నమ్ముతుంటారు. కొన్ని సందర్భాలలో వారి నమ్మకం నిజం అవుతుంటాయి కూడా. ఇప్పుడు ఇలాంటి ఒక బ్యాడ్ సెంటిమెంట్ పవన్ కల్యాణ్ అభిమానులను టెన్షన్ పెడుతుంది. అదేంటో చదివేయండి..రెండోసారి ఫ్లాప్పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక డైరెక్టర్తో రెండో సినిమా తీస్తే ప్లాప్ గ్యారెంటీ. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మినహా..ఆయన కెరీర్ మొత్తంలో రెండోసారి సినిమా చేసిన దర్శకులందరికీ అపజయమే ఎదురైంది. పవన్ కల్యాణ్కి ‘తొలిప్రేమ’తో తొలి హిట్ అందించిన దర్శకుడు కరుణాకరన్. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బాలు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అలాగే ‘సుస్వాగతం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్, దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు కాంబినేషన్లో వచ్చిన ‘అన్నవరం’ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.పవన్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘బద్రి’ సూపర్ హిట్ అయితే.. రెండో చిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ డిజాస్టర్ అయింది. ‘ఖుషీ’ తర్వాత ఎస్ జే సూర్య దర్శకత్వంలో నటించిన ‘కొమరం పులి’ సినిమా కూడా ప్లాప్ అయింది. కిషోర్ పార్ధసాని (డాలీ), పవన్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘గోపాల గోపాల’ ఓ మోస్తరు విజయం సాధిస్తే.. ‘కాటమ రాయుడు’ డిజాస్టర్గా నిలిచింది. త్రివిక్రమ్ ఒక్కడే.. పవన్తో రెండోసారి సినిమా తీసిన దర్శకులంతా అపజయాలనే అందించారు. ఒక త్రివిక్రమ్ మాత్రం వరుసగా రెండు హిట్లు(జల్సా, అత్తారింటికి దారేది) ఇచ్చాడు. ఇదే జోష్లో ముచ్చటగా మూడో సినిమాగా ‘అజ్ఞాతవాసి’ తీస్తే..అది అతిపెద్ద డిజాస్టర్ అయింది.ఉస్తాద్ రిలీజ్..టెన్షన్లో ఫ్యాన్స్ఇప్పుడు ఈ బ్యాడ్ సెంటిమెంట్ చూసే పవన్ అభిమానులు భయపడుతున్నారు. హరీశ్ శంకర్- పవన్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh). అంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్సింగ్’బ్లాక్ బస్టర్ అయింది. సెంటిమెంట్ ప్రకారం చూస్తే.. మార్చి 19న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫ్లాప్ కావాలి. ఇప్పుడు అదే అభిమానులను కలవర పెడుతుంది. ఇప్పటీకీ ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. ఈ చిత్రానికి పోటీగా వస్తున్న ‘ధురంధర్ 2’ బుకింగ్స్ విషయంలో దూసుకెళ్తుంది. ట్రైలర్ కూడా అదిరిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్కు మిశ్రమ స్పందన రావడం.. బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి సెంటిమెంట్ ప్రకారం సినిమా ప్లాప్ అవుతుందా లేదా సెంటిమెంట్ని బద్దలు కొట్టి హిట్ అవుతుందా అనేది రెండు రోజుల్లో తేలిపోతుంది. -
ఆ ఆరుగురిపై ఆస్కార్ బ్యాన్.. ఎందుకో తెలుసా?
ఆస్కార్ అవార్డు గెలిస్తే నింగిలోని చందమామను అందుకున్నంత సంతోషం! ఒక్కసారైనా ఆస్కార్ గెలవాలని కలలు కనే ఆర్టిస్టులు ఎంతోమంది. కనీసం అకాడమీ అవార్డుల వేడుకను దగ్గరినుంచైనా చూసి తరించాలనుకునేవారు బోలెడంతమంది! ప్రపంచ ప్రఖ్యాతికెక్కిన ఈ ఆస్కార్ వేడుకలు 1929లో మొదలయ్యాయి. అప్పుడు 12 విభాగాల్లో అవార్డులు అందించేవారు. ఇప్పుడు వాటి సంఖ్య 24 కేటగిరీలకు చేరింది.ఆస్కార్ చరిత్రలో చెరగని చిరునామాఆస్కార్ చరిత్రలో అత్యధిక నామినేషన్లు అందుకున్న వ్యక్తిగా సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ పేరిట చెక్కుచెదరని రికార్డు ఉంది. ఇప్పటివరకు 54 నామినేషన్లు దక్కించుకోగా ఐదుసార్లు పురస్కారం గెలిచాడు. వాల్ట్ డిస్నీ ఏకంగా 26 ఆస్కార్లు అందుకుని చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇకపోతే అకాడమీ పురస్కారాన్ని వేలం వేయకూడదు, బయట అమ్మకూడదు. అంతలా వద్దనుకుంటే అకాడమీకే తిరిగివ్వాలి.. అది కూడా కేవలం ఒక్క డాలర్కి మాత్రమే!వారిపై బ్యాన్ఈ అవార్డుల ఫంక్షన్ కోసం ఏకంగా రూ.500 కోట్ల మేర ఖర్చుపెడతారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి రమ్మని పిలుపు వస్తే సంబరంతో పరిగెత్తేవారెందరో!. అయితే కొందరిపై మాత్రం ఆస్కార్ ఈవెంట్కు హాజరవకుండా, అవార్డులకు నామినేట్ అవకుండా నిషేధం అమల్లో ఉంది. వాళ్లెవరంటే.. మీటూ ఉద్యమం సమయంలో సినీ నిర్మాత హార్వే వైయిన్ స్టీన్ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలాడు. దీంతో అతడిని అకాడమీ కమిటీ బ్యాన్ చేసింది.విల్ స్మిత్పై నిషేధం.. కాకపోతే!2022లో కమెడియన్ క్రిస్ రాక్.. స్మిత్ భార్యపై జోక్ వేశాడు. దీంతో అతడు ఆవేశంగా స్టేజీపైకి వచ్చి క్రిస్ చెంప చెళ్లుమనిపించాడు. దీని కారణంగా విల్ స్మిత్పై పదేళ్ల నిషేధం పడింది. అయితే అతడి నామినేషన్స్పై మాత్రం వేటు వేయలేదు. మైనర్పై లైంగిక వేధింపుల కారణంగా దర్శకుడు రోమన్ పోలంస్కిని, లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన కమెడియన్ బిల్ కాస్బీని సైతం అకాడమీ నిషేధించింది. నేర చరిత్రఆస్కార్కు నామినేట్ అయిన సినిమాలను పైరసీ చేస్తున్నాడని గుర్తించి నటుడు కార్మైన్ కార్డీని సైతం బ్యాన్ చేసింది. లైంగిక నేరాల చరిత్ర కారణంగా నటుడు, సినిమాటోగ్రాఫర్ ఆడమ్ కిమ్మెల్పైనా నిషేధం విధించింది. ఇలా ఈ ఆరుగురు నటులను ఆస్కార్ వేదికపైకి రాకుండా దూరం పెట్టింది.చదవండి: 98వ ఆస్కార్.. పూర్తి జాబితా -
ప్రియుడితో పెళ్లి.. మెసేజ్ పెట్టిందన్న హీరోయిన్ తండ్రి
మలయాళ హీరోయిన్ అహానా కృష్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రియుడు నిమిష్ రవితో ఏడడుగులు వేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తండ్రి, నటుడు కృష్ణ కుమార్ ధ్రువీకరించాడు. వెరైటీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతురి పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.మా ఇంటిక్కూడా..అతడు మాట్లాడుతూ.. అహానా పెళ్లి చేసుకుంటానని నాకు మెసేజ్ పెట్టింది. ఆ అబ్బాయిని మాకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చి వెళ్తుంటాడు. నేను కుర్రవయసులో ఉన్నప్పుడు కూడా అచ్చం నా కూతురిలాగే ఉండేవాడిని. ఏమాత్రం మొహమాటం లేకుండా నా భార్య సింధును పెళ్లికి ముందే ఇంటికి తీసుకెళ్లేవాడిని. దానివల్ల నేనెవర్ని పెళ్లి చేసుకోబోతున్నాను? వాళ్లు ఎలాంటివాళ్లు? అనేది అందరికీ ముందే తెలుస్తుంది. ఏ టెన్షన్ లేకుండా పెళ్లి ప్రశాంతంగా సాగిపోతుంది.30 ఏళ్లుగా తెలుసునిమిష్ తండ్రి, నిర్మాత రవి నాకు 30 ఏళ్లుగా తెలుసు. వాళ్ల కుటుంబంలో ఏ అవసరం వచ్చినా నేను చనువుతో సలహాలు ఇస్తుంటాను. అహానా, నిమిష్ ఓ షార్ట్ ఫిలింలో కలిసి పని చేసినప్పుడు అతడిని కలిశాను. తను చాలా సింపుల్గా ఉంటాడు. అతడి ఎదుగుదల చూస్తుంటే ముచ్చటేస్తేంటుంది. అతడి తండ్రికి ఎన్నో కలలుండేవి. సినిమాకోసం ఎంతో ఖర్చుపెట్టాడు.. ఈ క్రమంలో చాలా కోల్పోయాడు. కానీ దేవుడు అతడి త్యాగాలకు.. పిల్లల రూపంలో ప్రతిఫలాన్ని ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు.సినిమాకాగా అహానా కృష్ణ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవితో ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అహానా తండ్రి మాటల్ని బట్టి వీరిద్దరూ తమ ప్రేమను నెక్స్ట్ స్టెప్కు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి! నిమిష్ రవి.. చివరగా లోక:చాప్టర్ 1 సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. అహానా.. ఎంజన్, స్టీవ్ లోపెజ్, లూకా, పతినేట్టం పది, ఆడి, నాన్సీ రాణి వంటి మలయాళ చిత్రాలతో గుర్తింపు పొందింది.చదవండి: ఆస్కార్ గెలిచిన సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే? -
అజిత్ కేరవాన్లో వంట చేసిపెట్టాడు: తమన్నా
సినిమారంగంలో భాషాబేధాలకు తావుండదు. ప్రతిభే కొలమానం. అలా స్వశక్తితో ఎదిగిన నటీమణుల్లో మిల్కీబ్యూటీ తమన్నా భాటియా ఒకరు. ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాదిలో అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కథానాయికగా సత్తా చాటుతూనే మరోపక్క ఐటమ్ సాంగ్స్లో నటిస్తూ అలరిస్తోంది. అలా ప్రత్యేక పాటల కోసం తమన్నా దాదాపు రూ.6 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్!ఆ మూవీ ఎంతో స్పెషల్ఇకపోతే ఈ హీరోయిన్ ఇటీవల చెన్నైలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను తమిళంలో కల్లూరి చిత్రంలో నటించానని, అది తన సినీజీవితంలో చాలా ముఖ్యమైనదని పేర్కొంది. ఆ సినిమాలోలాగే కాలేజీ లైఫ్ను విద్యార్థులు ఎంజాయ్ చేయాలంది. కాలేజీడేస్ మళ్లీ తిరిగిరావంది.స్వయంగా వంట చేసి..తాను సినీ పరిశ్రమలో 21 ఏళ్లుగా కొనసాగుతున్నానని, ఇంతలా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని సంతోషం వ్యక్తం చేసింది. తమిళంలో విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించినట్లు తెలిపింది. నటుడు విజయ్ చాలా నిరాడంబరుడు, మంచి మనసు కలవాడంది. విజయ్, జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్స్ అని కితాబిచ్చింది. అజిత్ గురించి చెప్పాలంటే వీరం సినిమా సమయంలో తనకు ఆయన కేరవాన్లో ఇడ్లీ వండిపెట్టారని గుర్తు చేసుకుంది. ఆయనకు వంట చేయడం చాలా ఇష్టమని, మంచి కుటుంబ సభ్యుడిలా ఉంటాడని పేర్కొంది.చదవండి: ఆస్కార్ పండగ.. అత్యధికంగా ఆ చిత్రానికే ఎక్కువ అవార్డులు -
98వ ఆస్కార్: ఆ సినిమాకు అత్యధికంగా 6 అవార్డులు
హాలీవుడ్లో ఆస్కార్ పండగ సందడి కనిపించింది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో మార్చి 16న ఉదయం ఘనంగా జరిగింది. ప్రతిసారి 23 విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తారు. కానీ ఈసారి కొత్తగా బెస్ట్ కాస్టింగ్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. అలా ఈసారి 24 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' మూవీకి అత్యధికంగా 6 పురస్కారాలు వరించాయి. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 30 వరకు విడుదలైన సినిమాలను ఈ అవార్డుల కోసం పరిగణించారు. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో రెండు చిత్రాలకు పురస్కారాలు వరించడం విశేషం! ఆస్కార్ స్టేజీపై తళుక్కుమన్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రంగా 'సెంటిమెంటల్ వాల్యూ'ని ప్రకటించింది.ఆస్కార్ విజేతల జాబితాఉత్తమ చిత్రం : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ఉత్తమ నటుడు: మైఖెల్ బి. జోర్డాన్ (సిన్నర్స్)ఉత్తమ నటి: జెస్సీ బక్లే (హామ్నెట్)ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్ (వెపన్స్)ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ సాంగ్ (కె-పాప్ డిమాన్ హంటర్స్)ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్ వాల్యూ (నార్వే దేశపు సినిమా)ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్ డురాల్డ్ అర్కపా (సిన్నర్స్)ఉత్తమ ఎడిటింగ్: యాండీ జుర్గెన్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ (సిన్నర్స్)ఉత్తమ సౌండ్: గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్డాలిన్ యేట్స్ విర్టల్, గేరీ ఎ.రిజో, జాన్ పెరల్ట (ఎఫ్ 1)ఉత్తమ కాస్టింగ్: కసాండ్రా కులుకుందిస్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: మిస్టర్ నోబడీ ఎగైన్స్ట్ పుతిన్ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ఆల్ ద ఎంప్టీ రూమ్స్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: జో లెటరి, రిచర్డ్ బనెహం, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ (అవతార్: ఫైర్ అండ్ యాష్)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తమర డేవెరల్, షేన్ వ్యూ (ఫ్రాంకెన్స్టీన్)ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే: పాల్ థామస్ అండర్సన్ (వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్)ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్స్టీన్)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హాలే (ఫ్రాంకెన్స్టీన్)ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ద గర్ల్ హు క్రైడ్ పర్ల్స్ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: కె-పాప్ డిమాన్ హంటర్స్ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ద సింగర్స్, టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సలైవాచదవండి: ఉత్తమ చిత్రంగా నిలిచిన "వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్" సినిమా రివ్యూ -
రామాయణలో 'కుంభకర్ణ'గా ఆ నటుడు!
ఇండియన్ బిగ్స్క్రీన్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఈ రెండు భాగాలకు కలిపి దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అంటే సినిమాను ఎంత విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నారో ఇక్కడే అర్థమైపోతోంది.రామాయణ సినిమాఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే సన్నీడియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. తాజాగా రావణుడి సోదరుడు, కుంభకర్ణుడి పాత్ర గురించి ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొన్నటివరకు బాబీ డియోల్ కుంభకర్ణుడిగా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది.కుంభకర్ణుడిగా..అతడే ఫైజల్ మాలిక్. పంచాయత్ వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడిని కుంభకర్ణుడిగా ఎంపిక చేయగా, అతడిపై సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. అతడి అవతారం కుంభకర్ణుడి పాత్రకు సరిగ్గా సరిపోయిందని ఇన్సైడ్ వర్గాల టాక్! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే మార్చి 27న శ్రీరామనవమిని పురస్కరించుకుని రామయణ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తుండగా రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.సినిమాలు, సిరీస్లుఫైజల్ మాలిక్.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాలో కామెడీ పోలీస్గా నటించాడు. పంచాయత్ వెబ్ సిరీస్లో డిప్యూటీ ప్రధాన్ ప్రహ్లాద్చాగా అలరించాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాలు, సిరీస్లు చేశాడు. చివరగా హారర్ కామెడీ మూవీ థామాలో పోలీస్గా కనిపించాడు.చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి..: ప్రియదర్శన్ -
అలాంటి సీన్లు చేయమని బలవంతం..: నటి
సల్మాన ఖాన్ 'వీర్' (2010) సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది జరీన్ ఖాన్. ఆ మరుసటి ఏడాది అతడి మూవీలోనే స్పెషల్ సాంగ్లో మెరిసింది. అలా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్ చేసింది. అయితే హేట్ స్టోరీ 3 మూవీ చేశాక తనను అందరూ తక్కువ చేసి చూశారంటోంది జరీన్ ఖాన్.ముందో మాట చెప్పి..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీన్ ఖాన్ మాట్లాడుతూ.. హేట్ స్టోరీ 3లో నటించాక అందరూ నన్ను చులకన చేసి మాట్లాడారు. తనకు యాక్టింగ్ రాదు కాబట్టే అలా దుస్తులు విప్పే సన్నివేశాల్లో నటించిందని కామెంట్స్ చేశారు. ఆ సమయంలో దర్శకుడు అనంత్ మహదేవన్ అక్సర్ 2 సినిమా ఆఫర్ చేశారు. అయితే ఇందులో బోల్డ్ సన్నివేశాలుండవని హామీ ఇచ్చారు. కథంతా చెప్పి ఇది హేట్ స్టోరీ మూవీలా అయితే ఉండదని నొక్కి చెప్పాడు. దాంతో సరేనన్నాను. చెప్పిందొకటి.. చేసిందొకటికానీ, సెట్కు వెళ్లాక అంతా తలకిందులైంది. ముద్దు సన్నివేశం అంటారు.. సడన్ దుస్తులు విప్పేయమంటారు. పొట్టి దుస్తులే ధరించాలంటారు! నా బాధేంటంటే.. స్క్రిప్ట్ ఒకరకంగా చెప్పి షూటింగ్ మరోరకంగా జరిపారు. అదే వాళ్లతోనూ అన్నాను.. ఇలాంటి సన్నివేశాల్లో నటించడం నాకు సమస్య కాదు.. కానీ, మీరు నాకు చెప్పిందేంటని అడిగాను. కేవలం నా గత సినిమా చూసి కావాలని ఇందులో అలాంటి సీన్లు ఇరికిస్తున్నారన్నాను.ఎంత అన్యాయం?నామాట ఎవరూ పట్టించుకోలేదు. నాకు అందరూ వ్యతిరేకంగా మారారు. నిర్మాతలు పూర్తిగా అలా రెచ్చగొట్టే సన్నివేశాలే చేయమని బలవంతపెట్టారు. అదెంత అన్యాయం! అయినా నేను సహించాను. ఇప్పుడు గొడవకు దిగి వెళ్లిపోతే వాళ్ల పెట్టుబడి అంతా వృథా అవుతుందని సినిమా పూర్తి చేశాను. కానీ, చివరకు సినిమా స్క్రీనింగ్కు కూడా నన్ను పిలవలేదు. కానీ నేను సరిగా పని చేయనని నన్ను బద్నాం చేశారు అని జరీనా ఖాన్ చెప్పుకొచ్చింది.చదవండి: నా సినిమాలన్నీ ఫ్లాప్.. నాకు లాభమే లేదు: విజయ్ సేతుపతి -
ఆ సినిమాలన్నీ ఫ్లాప్.. లాభమే లేదు: విజయ్ సేతుపతి
సినిమాలు తీయడమంటే ఆషామాషీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా బాక్సాఫీస్ వద్ద వైఫల్యం మూటగట్టుకోవడం తథ్యం. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది నిర్మాతలే.. కొడితే కుంభస్థలాన్ని కొడతారు.. లేదంటేనేమో తీవ్ర నష్టాలు చూస్తారు. అలా తాను నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదంటున్నాడు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి.ఆ నాలుగు ఫ్లాప్తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నా బ్యానర్లో సంగుతేవన్ అనే సినిమా స్టార్ట్ చేశాను. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల రూ.1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత నాలుగు సినిమాలు తీశాను. అవే.. ఆరెంజ్ మిఠాయి, మేకు తొడర్చి మలై, జుంగ, లాభం. వీటిలో ఒక్కటి కూడా నాకు లాభాల్ని తెచ్చిపెట్టలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకురావడంలో కూడా విఫలమయ్యాయి. సినిమాబాక్సాఫీస్ లెక్కలపరంగా అవి ఫ్లాప్ అయినప్పటికీ నాకు మాత్రం ఆ సినిమాలన్నీ ఇష్టం. కాబట్టి వాటిని నిర్మించినందుకు నేనేం బాధపడటం లేదు అన్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటుడిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ మూవీ చేస్తున్నాడు. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్ చేస్తున్నాడు. ఇది కాకుండా పాకెట్ నోవెల్, జైలర్ 2, అరసన్తో పాటు మణిరత్నం మూవీ ఒకటి ఆయన చేతిలో ఉన్నాయి.చదవండి: నాగార్జున వల్లే నా కూతురు సినిమాల్లోకి: ప్రియదర్శన్ -
నా కూతుర్ని సినిమాల్లో ఊహించలేదు.. నాగార్జున వల్లే..
మలయాళ టాప్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కల్యాణి తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. 2017లో తెలుగు సినిమా హలోతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కొద్దికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలు చేసింది. గతేడాది లోక చాప్టర్ 1 చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించింది.కలలో కూడా అనుకోలేఅయితే ఆమె హీరోయిన్ అవడానికి కింగ్ నాగార్జునే ప్రధాన కారణం అంటున్నాడు ప్రియదర్శన్. పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. నా కూతురు కెమెరా ముందుకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే సినిమా సెట్కు రావడానికి తనెప్పుడూ ఇష్టపడలేదు. తను ఆర్కిటెక్చర్ చదివింది. ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంది. నాగార్జున ఫోన్ చేయడంతో..కానీ, సడన్గా ఒకసారి నాగార్జున ఫోన్ చేసి కల్యాణిని సినిమాలో తీసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. తనకు నటించడం రాదని చెప్పాను. కానీ నా కూతురు ఒకసారి ట్రై చేస్తే పోలా అంది. ఇక్కడ నేను కోల్పోయేదేం లేదు, నాకు సినిమాలు సెట్టవకపోతే మళ్లీ ఆర్కిటెక్చర్ వైపు వెళ్లిపోతానంది. అలా తను సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తండ్రిగా తన సినీజర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంది. కాకపోతే నా సినిమాల గురించి తనతో మాట్లాడను. తను చేసే ప్రాజెక్టుల గురించి నాతో చర్చించదు. సినిమా తప్ప..ఎందుకంటే తను ఇప్పటి జెనరేషన్ అమ్మాయి. ఈతరం వాళ్లు సినిమాను ఒకలా చూస్తారు. నేనేమో పాత స్కూల్కు చెందినవాడిని. మేమిద్దరం సినిమా తప్ప అన్నింటిగురించి మాట్లాడుకుంటాం అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు. కాగా హలో మూవీతో కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా పరిచయమయ్యాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతోనే కల్యాణి ప్రియదర్శన్ కూడా కథానాయికగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.చదవండి: దేవుడు నాకిలా రాసిపెట్టాడు: డిమాన్ పవన్ -
కాళ్లు మొక్కడం తప్ప ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?
సినీ చిత్రపరిశ్రమలో 50 ఏళ్ల నటజీవితాన్ని ఊహించలేదంటున్నారు విలక్షణ నటుడు మోహన్బాబు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రెండేళ్లకే మళ్లీ ఊరిబాట పడతాననుకున్నానని, కానీ సుదీర్ఘకాలంగా నటుడిగా కొనసాగుతున్నానన్నారు. మోహన్బాబు యూనివర్సిటీ 34వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. 1975 నవంబర్ 22న నా మొదటి సినిమా స్వర్గం- నరకం విడుదలైంది. 50 ఏళ్లలో..ఏడాదో, రెండేళ్లు ఇక్కడుంటాను.. తర్వాత సినిమాలుండవు, ఊరికెళ్లిపోవాల్సిందే అనుకున్నాను. అలాంటిది 50 ఏళ్లలో 560 సినిమాలు చేశాను. విభిన్న పాత్రలు.. ఒకదాన్ని మించి మరొకటి చేశాను. తల్లిదండ్రులు, భగవంతులు, నన్ను ప్రోత్సహించిన దర్శకనిర్మాతలు, ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే ఇదంతా సాధ్యమైంది.అది చూసి ఆశ్చర్యపోతుంటా..విద్యార్థులారా.. మీకన్నీ తెలుసు.. ఎలా నడుచుకోవాలి? ఏం చేయాలి? ఎలా బతకాలి? అన్నీ మీకు తెలుసు. మీ వయసులో నేనున్నప్పుడు ఈ కంప్యూటర్లు, సెల్ఫోన్లు లేవు. ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు సెల్ఫోన్లు.. అవి తల్లిదండ్రుల సంపాదనతో కొన్నవే! అది చూసి ఆశ్చర్యపోతుంటాను. ఒక పూట భోజనం చేసి, గంజి తాగి పిల్లల్ని స్కూలుకు పంపుతున్న తల్లిదండ్రులెంతోమంది!ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?అలాంటివాళ్లెందరికో మేము సాయం చేశాం, చేస్తూనే ఉన్నాం. మీరందరూ ఏది మంచిదారి, ఏది చెడుదారి ఆలోచించుకుని ముందుకెళ్లాలి. తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించకండి. వారి పాదాలకు నమస్కరించడం తప్ప ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలం? కాబట్టి మంచి మార్గంలో ప్రయాణించండి అని విద్యార్థులకు మోహన్బాబు సూచించారు.చదవండి: ఉస్తాద్ కోసం శ్రీలీల అంత పారితోషికం తీసుకుందా? -
‘ఉస్తాద్.. ’ కోసం శ్రీలీల అంత తీసుకుందా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ..ధమాకా చిత్రంతో భారీ హిట్ని ఖాతాలో వేసుకుంది. ఆ చిత్రం రిలీజ్ తర్వాత శ్రీలీలకు వరస అవకాశాలు వచ్చాయి. రామ్, నితిన్ లాంటి యంగ్ హీరోలతో పాటు మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్ చిత్రాల్లోనూ నటించింది. దీంతో పాటు పుష్ప 2లో స్పెషల్ సాంగ్కి బన్నీతో స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఇలా తెలుగులో బిజీగా ఉన్నప్పుడే బాలీవుడ్పై కన్నేసింది. అక్కడ కూడా తన టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో ఆమె నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustaad Bhagat Singh)మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీలీల(Sreeleela)తో పాటు రాఖీ ఖన్నా కూడా మరో హీరోయిన్గా నటించింది. కెరీర్తో తొలిసారి పవన్ కల్యాణ్తో కలిసి నటిస్తుంది ఈ భామ. అయితే ఈ సినిమా కోసం భారీగానే పారితోషికం పుచ్చుకుందట.సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న దాని ప్రకారం.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం శ్రీలీల రూ.2.5 నుంచి 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట. గత సినిమాలతో పోలిస్తే..ఇది తక్కువే అని చెబుతున్నారు. ఆమె నటించిన ‘జూనియర్’ చిత్రానికి ఏకంగా రూ. 4 కోట్లు తీసుకుందంట. ఇక ధమాకా తర్వాత రవితేజతో కలిసి నటించిన మరో చిత్రం ‘మాస్ జాతర’కు రూ. 3 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అక్షయ్ ఖన్నా బట్టతల ట్రామాతో కుంగిపోయారు: ఫరా ఖాన్
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నెగిటివ్ రోల్స్లో వరుసగా హిట్స్ అందుకుంటూ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. 'ధురంధర్', ‘చావా' వంటి సినిమాలతో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే కొరియోగ్రాఫర్-డైరెక్టర్ ఫరా ఖాన్ ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్లో పాల్గొని అక్షయ్ ఖన్నా గురించి చేసిన పలు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 'తీస్ మార్ ఖాన్' చిత్రంలో ‘ఆతిష్ కపూర్’ పాత్ర కోసం మొదట షర్మాన్ జోషిని సంప్రదించానని, ఆయన తిరస్కరించడంతో చివరికి అక్షయ్ ఖన్నానే లాస్ట్ ఛాయిస్గా ఎంపికయ్యారని ఫరా వెల్లడించారు. ఫరా ఖాన్ మాటల్లో 90వ దశకంలో అక్షయ్ ప్రవర్తన అంతగా బాగాలేదు. ఆయన చాలా చిరాకుగా ఉండేవారు. చేతిలో వున్న వస్తువులు విసిరేసేవారు. డైలాగుల విషయంలో గొడవపడేవారు. ఆ సమయంలో బట్టతల సమస్యతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. అదే ఆయన కోపానికి కారణమని తెలిపారు. తాల్ సినిమాలో వర్షం పాటలో కూడా టోపీ ధరించి నటించారని గుర్తుచేశారు. 'దిల్ చాహ్తాహై’ సినిమా తర్వాత అక్షయ్ పూర్తిగా మారిపోయారు. తన లుక్, బట్టతల గురించి స్పష్టత వచ్చి, కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. 'కోయి కహే కెహతా రహే' పాటలో ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఇటీవల 'ధురంధర్' సినిమాలో అక్షయ్ నటన చూసి ఫిదా అయ్యాను. వెంటనే ఆయనకు ఫోన్ చేసి అలీబాగ్లోని ఇంటికి వెళ్లి అభినందించాను. అక్షయ్కు అనవసర హడావిడి, షో ఆఫ్ చేయడం అంటే నచ్చదు. తన నటనపై మాత్రమే దృష్టి పెడతారని ఆమె అన్నారు. మొత్తానికి గతంలో హీరోగా ఉన్నప్పుడు కూడా రాని క్రేజ్ ఇప్పుడు నెగిటివ్ రోల్స్తో అక్షయ్ ఖన్నా సంపాదించుకోవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
ఆ మూవీ అప్పుడే తేడా కొట్టింది, కరెక్ట్ కాదన్నాను: రాశీ
తెలుగులో తొలి సినిమా 'ఊహలు గుసుగుసలాడె'తో గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. జోరు, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీమామ, ప్రతిరోజు పండగే ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్ చేసింది. చివరగా తెలుగులో తెలుసు కదా మూవీతో అలరించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.సినిమా రిజల్ట్ ముందే ఊహించిన రాశీఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన రాశీ ఖన్నా తెలుసు కదా సినిమా వైఫల్యాన్ని ముందే ఊహించానంది. ఆమె మాట్లాడుతూ.. తెలుసు కదా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాకు నచ్చని పాయింట్స్ అన్నీ చెప్పాను. కొన్ని సీన్స్ చిత్రీకరించేటప్పుడు ఇదెందుకో నాకు కరెక్ట్ కాదనిపిస్తుందన్నాను. అదే సమయంలో ఇది దర్శకుడి విజన్ అని గౌరవించాను. అదే నేర్చుకున్నాకానీ, షూట్ చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను.. ఇదెక్కడో కొడుతోంది, క్లైమాక్స్ కూడా అందరూ ఒప్పుకునేలా ఉండాలి, కాబట్టి ఆపరేషన్ సీన్ చేయనన్నాను. చివరకు తప్పలేదు. అయినా ఈ సినిమా ద్వారా అందరూ ఏదో ఒక గుణపాఠం నేర్చుకున్నారు. అలా నేను కూడా నా అభిప్రాయాన్ని మరింత గట్టిగా చెప్పాల్సింది అని తెలుసుకున్నాను. ఆ మూవీ షూట్ చేస్తున్నకొద్దీ స్క్రిప్ట్ చాలా మారిపోయింది. నా చేతుల్లో ఏం లేదు అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ రెండోసారి తల్లయింది. గతేడాది ఆగస్టులో గర్భం దాల్చిన ఆమె మార్చి 14న ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దేవుడి ఆశీస్సులతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు పాప పుట్టింది. తను మాకు లభించిన అపురూపమైన కానుక.సాఫీగా డెలివరీఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ అయినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆస్పత్రి బృందానికి కూడా ధన్యవాదాలు అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా పూర్ణ 2022లో వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా 2023లో బాబు పుట్టాడు.సినిమాపూర్ణ మలయాళ నటి. సీమటపాకాయ్, అవును సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. శ్రీ మహాలక్ష్మి, నువ్వలా నేనిలా, రాజుగారి గది, అఖండ 2 ఇలా పలు చిత్రాల్లో నటించింది. మహేశ్బాబు గుంటూరు కారం సినిమాలో 'కుర్చీ మడతపెట్టి..' పాట ప్రారంభంలో కనిపిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ మూవీస్ చేసింది. View this post on Instagram A post shared by DrShanid Thalekoden (@dr.shanid_asifali) చదవండి: గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత -
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. స్పందించిన జీవిత
కంటికి కనిపించేదంతా నిజం కాదన్నట్లుగా సోషల్ మీడియాలో కనిపించేదంతా కూడా నిజం కాదు. ఆమాటకొస్తే రూమర్స్, ఫేక్ న్యూస్, ఏఐ వీడియోలే ఎక్కువగా ఆన్లైన్లో వైరలవుతుంటాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు రాజశేఖర్కు గోటీల ఫ్యాక్టరీ ఉందని, అక్కడ పనిచేసేవారికి లక్షల్లో జీతాలుంటాయంటూ ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. గోటీల ఫ్యాక్టరీఇంకేముంది, రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ అంటూ చిత్ర విచిత్ర పోస్టులు ప్రత్యక్షమవడం, అవి కాస్తా నెట్టింట వైరలవడం జరిగింది. తాజాగా దీనిపై హీరో రాజశేఖర్ భార్య జీవిత స్పందించింది. అసలు గోటీల ఫ్యాక్టరీ ఏంటో? అదెందుకు సృష్టించారో తెలీదు. కానీ, అది చూసి నేను, మా ఆయన, పిల్లలు అంతా నవ్వుకున్నాం. ఇప్పుడున్న సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలే ఎక్కువుంటున్నాయి. అందులో నెగెటివిటీ వచ్చిందా? దాన్ని చూసి బాధపడాలా? అనే ఆలోచన ఎవరికీ లేదు. అంతా ఫేక్ఆ ప్రచారం మాపై ఏమాత్రం ప్రభావం చూపించలేదు. అయితే మాకు గోటీల ఫ్యాక్టరీ ఉందని, అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బు లాగే ప్రయత్నం చేశారని విన్నాను. అది బాధాకరం. సోషల్ మీడియాలో వచ్చే న్యూస్, రీల్స్.. అన్నీ 99% ఫేక్. ప్రతి ఒక్కరిదగ్గరికెళ్లి అది ఫేక్ అని చెప్పలేం. దయచేసి వాటిని ఎవరూ నమ్మకండి అని జీవిత కోరింది.చదవండి: మగవాళ్లు కూడా నగలేసుకోండి: అల్లు శిరీష్ సలహా -
మారండ్రా బాబూ.. మగవాళ్లు కూడా నగలేసుకోండి: శిరీష్
ఆభరణాలు అనగానే ఆడవాళ్లే గుర్తొస్తారు.. ఏ మగవాళ్లు ఎందుకు వేసుకోకూడదు? అంటున్నాడు కొత్త పెళ్లి కొడుకు అల్లు శిరీష్. ఇటీవలే శిరీష్ మనసుపడ్డ అమ్మాయిని మనువాడాడు. నిశ్చితార్థం దగ్గరి నుంచి పెళ్లి వరకు తనకు నచ్చినట్లుగా రెడీ అయ్యాడు. నెక్లెస్ ధరించాడు. హీరో విజయ్ దేవరకొండ కూడా తన పెళ్లిలో వెరైటీ ఆభరణాలు ధరించి హైలైట్ అయ్యాడు.ఎంగేజ్మెంట్ సమయంలో ట్రోలింగ్అయితే ఇలా బంగారు, వజ్రాభరణాలు ధరించడం వల్ల శిరీష్పై కొంత ట్రోలింగ్ జరగ్గా అప్పట్లోనే కౌంటర్ ఇచ్చాడు. తాజాగా మరోసారి తనపై జరిగిన ట్రోలింగ్పై స్పందించాడు. ఇప్పుడు ఆడ, మగ అని తేడాలు చూస్తున్నారు.. కానీ, అప్పట్లో మగవాళ్లు కూడా నగలు వేసుకున్నారు. వందేళ్ల క్రితం పురుషులకు, మహిళలకు కలిపే పర్ఫ్యూమ్స్ తయారు చేశారు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా..ఇప్పుడేమో అబ్బాయిలకు బ్లూ అని, అమ్మాయిలకు పింక్ ఫేవరెట్ అంటూ బేధాలు సృష్టించారు. అందుకే నన్ను ఎంత తిట్టుకున్నా సరే ఈ అడ్డుగోడల్ని కూల్చాలనే అనుకున్నాను. అయితే నా అభిప్రాయాల్ని నా చుట్టూ ఉన్న కొందరు అనుమానించారు. ఇప్పుడీ హారాలు వేసుకోవడం అవసరమా? అని ప్రశ్నించారు. ఎహె, ఊరుకోండి, మనం కూడా ట్రై చేయకపోతే ఇంకెవరు చేస్తారు? లేదంటే ఇంకో ఇరవై ఏళ్లు కూడా ఇలాగే ఉంటుంది అని బదులిచ్చాను. నేనే డిసైడ్ చేసుకుంటా..నా జీవితంలోని ప్రత్యేక సందర్భమైన పెళ్లి వేడుకలో నాకు నచ్చినట్లుగా రెడీ అయ్యాను. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మగవాళ్లు ఎలా ఉండాలి? ఆడవాళ్లు ఎలా ఉండాలి? అని ఇతరులు నిర్ణయించాల్సిన పని లేదు. నేనేం ధరించాలనేది నాకు తెలుసు, ఇతరులు చెప్పనక్కర్లేదు అని శిరీష్ ముగించాడు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి: ధురంధర్ 2 ఛాన్స్ వదిలేసుకున్న ప్రముఖ నటుడు -
ధురంధర్ 2 ఛాన్స్ వస్తే వదిలేసుకున్నా: నటుడు
గతేడాది చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆదిత్య ధర్ డైరెక్టర్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సారా అర్జున్ కథానాయిక. ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు.ధురంధర్: రివేంజ్లో ఛాన్స్అయితే మూడు నెలలు కూడా తిరగకముందే ధురంధర్ పార్ట్ 2 వచ్చేస్తోంది. మార్చి 19న 'ధురంధర్: రివేంజ్' రిలీజ్ కానుంది. మొదటి భాగం బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కాబట్టి ఎవరైనా సరే సీక్వెల్లో ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ ఈ బాలీవుడ్ నటుడు మాత్రం తనకు ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశాడట!డేట్స్ లేవని..ఆయన మరెవరో కాదు, అనిల్ కపూర్. తాజాగా ఆయన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. ధురంధర్ 2 సినిమాలో యాక్ట్ చేయమని దర్శకుడు ఆదిత్య నన్ను సంప్రదించాడు. అతిథి పాత్ర ఉంది, చేస్తావా? అని అడిగాడు. కానీ అప్పటికే నా డేట్స్ ఖాళీగా లేవు. వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. నీ సినిమాలో చేయాలనుంది, కానీ నేను ఖాళీగా లేను అని చెప్పి తిరస్కరించాను. ఆ మూవీ కోసం అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను నేను పక్కనపెట్టలేను. కుదర్లేదుఆ నిబద్ధత వల్లే నేను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నాను. కేవలం టాలెంట్ ఒక్కటే మన స్థాయిని నిర్ణయించదు. కాకపోతే ధురంధర్ మూవీ అనేది మంచి ఆఫర్.. కానీ, ఏం చేద్దాం.. చేయడం కుదర్లేదు. భవిష్యత్తులో ఆదిత్యతో కలిసి పని చేస్తాననుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. అనిల్ కపూర్ చివరగా 'సుబేదార్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. -
బ్యాండ్ మేళం: ఏంటో ఏమో.. సాంగ్ విన్నారా?
కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.ఏంటో ఏమో.. పిచ్చిది ప్రేమతాజాగా ఈ మూవీ నుంచి మరో పాట వదిలారు. ఏంటో ఏమో.. పిచ్చిది ప్రేమ.. ఎపుడో సాయం రానే రాదే.. అంటూ పాట మొదలవుతుంది. ఈ లిరికల్ వీడియోలో శ్రీదేవితో పాటు నటుడు సాయి కుమార్ను చూపించారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశాడు. సింగర్ సునీత అద్భుతంగా ఆలపించింది. -
సినిమాలు చేస్తానని వేషాలు వేస్తున్న అయాన్
అల్లు కుటుంబం నుంచి మరొకరు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ఒక్కరు మరెవరో కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్. ఇప్పటికే తన మాటలు, ప్రవర్తనతో సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిపోయాడు. ఈ మధ్యే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడు. అయితే తను కూడా హీరో అవుతానంటున్నాడట!వేషాలు వేస్తున్నాడుఈ విషయాన్ని స్వయంగా బన్నీ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించాడు. అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ వేడుకలో అరవింద్ మాట్లాడుతూ.. మా నాన్న, నేను, బన్నీయే కాదు.. వాళ్లబ్బాయి అయాన్ కూడా ఈ ఇండస్ట్రీలోనే ఉంటాడు. ఆల్రెడీ వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు. ఎంట్రీ ఎప్పుడో?మా నాలుగు జనరేషన్స్ ఈ ఇండస్ట్రీపైనే ఉన్నాయి. అలాంటి చిత్రపరిశ్రమకు ఏదైనా తిరిగివ్వాలన్న సంకల్పంలో నుంచి పుట్టిందే అల్లు సినిమాస్ అని పేర్కొన్నాడు. మరి అయాన్ బాలనటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇస్తాడా? లేదా పెరిగి పెద్దయ్యాక నేరుగా హీరోగా పరిచయమవుతాడా? చూడాలి! అల్లు అర్జున్ వాళ్ల అబ్బాయి కూడా వేషాలు వేస్తానని. ఇంట్లో వేషాలు వేస్తున్నాడు- #AlluAravind about #AlluAyaan at #AlluCinemas launch pic.twitter.com/F1JvV9FieK— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) March 12, 2026 చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఆన్సరిదే -
అలాంటి సినిమాలు తీస్తే జోకర్లా చూస్తారు: డైరెక్టర్
మలయాళ స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ సొంత భాషలోనే సెటిలైపోకుండా బాలీవుడ్లోనూ అనేక సినిమాలు చేశాడు. హీరా ఫెరి, హంగామా, భూల్ భులయ్యా వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇష్టం లేదుఅయితే తనకు కామెడీ చిత్రాలకంటే సీరియస్ సినిమాలు చేయడమే ఇష్టం అంటున్నాడు తాజాగా పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ మాట్లాడుతూ.. సీరియస్ చిత్రాలు తెరకెక్కించడమంటే నాకు చాలా ఇష్టం. కామెడీ మూవీస్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ నాకు వేరే ఆప్షన్ లేక కామెడీ జానర్లో సినిమాలు చేయాల్సి వస్తోంది.ఎందుకు చూడరు?సీరియస్ సినిమాలు చేస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం చూపిస్తారు అదే కామెడీ జానర్లో ఉంటే మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఒక మంచి దర్శకుడిగా పరిగణించరు. ఈ విషయంలో నాకు చాలా బాధేస్తుంది. కామెడీ సినిమాలు తీసేవాళ్లను మంచి దర్శకులుగా ఎందుకు చూడరు? మనదగ్గరే కాదు, ప్రపంచమంతటా అలాగే ఉంది. హాస్యభరిత చిత్రాలు చేసేవారిని జోకర్లా చూస్తున్నారు. కామెడీ సినిమాలకు ఆస్కార్ రావడం కూడా చాలా అరుదు. ఇది నిజంగా బాధాకరం.. కానీ ఇదే జరుగుతోంది అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చాడు. -
'అవకాశాలు తర్వాత.. బరువు తగ్గు'.. ఏడ్చుకుంటూ వెళ్లా!
నటి సంభావన సేత్.. భోజ్పురి సినిమాల్లో ఎన్నో ఐటం సాంగ్స్ చేసింది. హిందీలోనూ నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్పెషల్ సాంగ్స్లో స్టెప్పులేసింది. అటు బుల్లితెరపై బిగ్బాస్, రాజ్ పిచ్లే జనం కా, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్కె ఖిలాడీ 4 ఇలా అనేక రియాలిటీ షోలలో పాల్గొంది.రెండో సీజన్లో పార్టిసిపేషన్అయితే తనకు ఓ స్టార్ హీరో అవకాశాలిస్తానని చెప్పి ఆ తర్వాత తన ఆశలపై నీళ్లు చల్లాడంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంభావన సేత్ మాట్లాడుతూ.. నేను హిందీ బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాను. నాలుగో సీజన్లో స్టేజీపై పర్ఫామెన్స్ చేశాను. అప్పుడు నటుడు రవికిషన్.. నేను భోజ్పురిలో మంచి పేరున్న డ్యాన్సర్ అని సల్మాన్ ఖాన్కు పరిచయం చేశాడు. ఫోన్ నెంబర్ కూడా..అందుకాయన.. ఇప్పుడే చూశాగా.. డ్యాన్స్ చాలా బాగా చేస్తోందని మెచ్చుకున్నాడు. నేను కొంత ధైర్యం తెచ్చుకుని తన సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగాను. వెంటనే ఆయన తప్పకుండా ఇస్తానన్నాడు. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. షో అయిపోయిన కొంతకాలానికి నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. అప్పుడతడు కాస్త చిరాకుగా ఉన్నాడు. కానీ బానే మాట్లాడాడు. ఏడ్చుకుంటూ వెళ్లా.సినిమా అవకాశం ఇస్తానన్నారు కదా అని గుర్తు చేశాను. అందుకు సల్మాన్.. నాకు గుర్తు లేదు కానీ మీరు కాస్త బరువు తగ్గాలి.. మరో విషయమేంటంటే ఇండస్ట్రీలో నేనెవర్నీ ప్రమోట్ చేయను అని ముక్కుసూటిగా చెప్పాడు. ఆ మాటలు నన్నెంతో బాధపెట్టాయి. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. కానీ, ఇప్పటికీ నేను సల్మాన్ ఖాన్ అభిమానినే అని చెప్పుకొచ్చింది.చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే? -
పొరపాటున MGR గురించి అలా మాట్లాడా..! నన్ను క్షమించండి
-
MGRపై చౌకబారు వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు.కొద్దిగా నోరు జారా..ఆ వీడియోలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తమిళ సినీ ప్రేక్షకులు ఎంజీఆర్ను దైవంలా భావిస్తారు. నేను కూడా ఆయన్ను దేవుడిలాగే భావిస్తాను. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో కొద్దిగా నోరు జారాను. అది కావాలని అనలేదు. కొందరు దీన్ని పెద్దది చేశారు. ఆయనపై కామెంట్స్ చేసేంత ధైర్యం నాకెక్కడిది? నేను చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడతానా? ఏదేమైనా నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలాంటి కామెంట్స్ చేయను అని క్షమాపణలు తెలిపాడు.ఏం జరిగింది?కాగా ఇటీవల ఓ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ కాస్త నోరు జారాడు. తెలుగు నటుడు కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్పై చులకన వ్యాఖ్యలు చేశాడు. కాంతారావును చూసి ఎంజీఆర్ ప్యాంటు తడుపుకునేవాడని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్ సెలబ్రిటీలు విశాల్, నాజర్ మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. வருத்தம் தெரிவித்த நடிகர் ராஜேந்திர பிரசாத்!#ActorRejendraprasad #mgr #nadigarsangam #nasser#vishal pic.twitter.com/8dpyBRPW5Z— FridayCinema (@FridayCinemaOrg) March 13, 2026 -
గుండె ముక్కలైందన్న హీరో! బ్రేకప్ పోస్ట్?
తమిళ హీరో అర్జున్దాస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఎప్పుడూ సినిమా అప్డేట్స్ తప్ప పర్సనల్ విషయాలను పెద్దగా ఫ్యాన్స్తో పంచుకోడు. అలాంటిది ఆయన హార్ట్ బ్రేక్ అయినట్లు ఓ పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.అంతలా ప్రేమిస్తే..ఇంతకీ ఆ పోస్ట్లో ఏముందంటే.. మనం ఎవర్నైనా గాఢంగా ప్రేమిస్తే.. వాళ్లు మనల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు? అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. దీనికి హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశాడు. అర్జున్దాస్కు బ్రేకప్ఇది చూసిన అభిమానులు అర్జున్దాస్కు బ్రేకప్ అయిందా? అని చర్చిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో కొత్త సినిమా ప్రమోషన్స్ అయుంటుంది, అంతా పబ్లిసిటీ స్టంట్ అని భావిస్తున్నారు. మరి ఈ పోస్ట్ వెనక మర్మమేంటో అర్జున్ దాసే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.సినిమాకాగా అర్జున్ దాస్ గతంలో ఐశ్వర్య లక్ష్మితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు. ఇకపోతే ఇతడు చివరగా ఓజీ సినిమాలో యాక్ట్ చేశాడు. ప్రస్తుతం కాన్ సిటీ సినిమా చేస్తున్నాడు.చదవండి: ఆశను కోల్పోవద్దు.. విడాకుల తర్వాత హన్సిక ఫస్ట్ పోస్ట్ -
Allu Cinemas: ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా..డాడీ అరవింద్: అల్లు అర్జున్
హైదరాబాద్లోని కోకాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ప్రసంగం అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు తన తండ్రి అల్లు అరవింద్ దూరదృష్టిని ప్రశంసించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా రేవంతన్న అని సంబోధిస్తూ తమ కలను నిజం చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.తన ప్రసంగంలో తండ్రి గురించి మాట్లాడుతూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. “నాన్న కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు.. ఆయన నాకు దేవుడు” అంటూ గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం వ్యాపార ప్రయోజనాల కోసం కాదని, తెలుగు సినిమా పరిశ్రమ తమకు ఇచ్చిన గౌరవానికి ప్రతిఫలంగా తిరిగి ఏదైనా గొప్పగా ఇవ్వాలనే అభిరుచితో చేసిన ప్రయత్నమని ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ లాభాల కంటే సినిమాపై ఉన్న ప్రేమే అల్లు సినిమాస్ రూపంలో సాకారమైందని పేర్కొన్నారు.అల్లు అరవింద్ను టెక్నాలజీ పయనీర్గా బన్నీ అభివర్ణించారు. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసిన సాంకేతిక మార్పులను గుర్తుచేశారు. పరిశ్రమలో స్టీరియో సౌండ్ మాత్రమే ఉన్న రోజుల్లోనే ‘మాస్టర్’ సినిమాతో 5.1 సరౌండ్ సౌండ్ను పరిచయం చేసిన ఘనత అరవింద్ గారిదేనని చెప్పారు. టెక్నాలజీని ఎంటర్టైన్మెంట్ రంగంలో ముందుగానే తీసుకురావడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. సినిమాలు ఫిలిం రీల్స్ ద్వారా ప్రదర్శించబడుతున్న సమయంలోనే ప్రపంచం డిజిటల్ వైపు వెళ్తోందని గుర్తించి.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను డిజిటల్ వ్యవస్థలోకి మార్చడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారని బన్నీ తెలిపారు. అందుకే ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమలో “ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా” అని పిలవొచ్చని వ్యాఖ్యానించారు.అదే విధంగా ప్రాంతీయ ఓటీటీ రంగంలో కూడా ముందడుగు వేసి ఆహా (Aha) అనే తెలుగు ఓటీటీ ప్లాట్ఫారమ్ను ప్రారంభించడం ఆయన ముందుచూపుకు నిదర్శనమని అన్నారు. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా చెప్పబడుతున్న డాల్బీ విజన్ థియేటర్ను హైదరాబాద్కు అందించడం ద్వారా మరో మైలురాయి సృష్టించారని చెప్పారు. తన తండ్రి నెలకొల్పిన ఈ ఘనమైన వారసత్వాన్ని మరింత గర్వంగా ముందుకు తీసుకెళ్తానని బన్నీ తెలిపారు. హైదరాబాద్ను ప్రపంచ ఎంటర్టైన్మెంట్ మ్యాప్లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. -
మహేష్ ఫ్యాన్స్ కోసమే కామెంట్స్ ఓపెన్ చేశాను: హరీశ్ శంకర్
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోపానికి గురైన దర్శకుడు హరీశ్ శంకర్ తన పొరపాటును బహిరంగంగా ఒప్పుకున్నారు. “BoB రికార్డులు మళ్లీ లేపరా” అంటూ వచ్చిన ఒక పోస్టుకు హరీశ్ శంకర్ ‘తథాస్తు’ అని రిప్లయ్ ఇవ్వడం మహేష్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. వెంటనే ట్వీట్ను డిలీట్ చేసినప్పటికీ, అభిమానుల ఆగ్రహం మాత్రం తగ్గలేదు. “నేను అంత స్పీడ్గా రియాక్ట్ కాకుండా, ట్వీట్ పూర్తిగా చదివి రెస్పాండ్ అవ్వాల్సింది. 30 సెకన్లలోనే డిలీట్ చేశాను. ‘బీ..వో’ అనే పదాలు కనిపించడంతో తొందర్లో బాక్సాఫీస్ అనుకున్నాను. అది పొరపాటు. అయినప్పటికీ కర్మను నమ్ముతాను. అందుకే క్షమాపణలు చెబుతూ నోట్ పెట్టిన తర్వాత కామెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేశాను. ఎంతయినా తిట్టండి అని అనుమతించాను” అని హరీశ్ తెలిపారు. “గద్దలకొండ గణేశ్ సినిమా బాగుందని మహేష్ బాబు స్వయంగా ట్వీట్ చేసి నన్ను అభినందించారు. నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం లేని వ్యక్తి అయినా, మనస్ఫూర్తిగా అభినందించారు. అలాంటి వ్యక్తి గురించి పొరపాటున నేను తప్పుగా ట్వీట్ చేయడం మహాపాపం. నేను ధర్మబద్ధంగా బతికే వ్యక్తిని, అధర్మం పనులు చేయను. ఇది తప్పు కాదు, పొరపాటు మాత్రమే” అని హరీశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా అన్ని రికార్డులను బద్దలుకొడుతుందని తాను కూడా నమ్ముతున్నానని హరీశ్ ప్రకటించారు. -
ప్రేమ్ రక్షిత్పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు
ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్, కింగ్ ఆఫ్ పాప్ 'మైఖేల్ జాక్సన్'కు లెజెండరీ కొరియోగ్రాఫర్ 'విన్సెంట్ ప్యాటర్సన్' ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు. అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన విన్సెంట్.. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు, బ్రాడ్వే, కచేరీలను విన్సెంట్ రూపొందించారు. అలాంటి ప్రముఖ వ్యక్తి.. భారతీయ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ టాలెంట్ను ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. వీడియో వైరల్ప్రపంచ స్థాయి కొరియోగ్రాఫర్ ప్రశంసించడం భారతీయ డాన్స్ టాలెంట్కు గ్లోబల్ గుర్తింపు లభించడమే అని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ప్రేమ్ రక్షిత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ప్రేమ్ ప్రతిభకు విన్సెంట్ పాటర్సన్ ఫిదా అయ్యారు. 'హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్. నేను అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్. ఏదో ఒక రోజు కలుస్తా..చాలా ఏళ్లు మైఖేల్ జాక్సన్తో కలిసి పనిచేశా. నేను మీకు ఓ విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నా. మీ కొరియోగ్రఫీ అద్భుతం. మీరు అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో యంగ్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వారి కలలు సాధించుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిన్ను కలుస్తా రక్షిత్' అంటూ విన్సెంట్ వీడియోలో చెప్పారు.ఎంతో ప్రత్యేకం'నేను చిన్నప్పటి నుంచే స్మూత్ క్రిమినల్ పాటకు పెద్ద అభిమానిని. మైఖేల్ జాక్సన్తో కలిసి పనిచేసిన ఒక లెజెండ్ నుంచి అభినందనలు అందుకోవడం కొరియోగ్రాఫర్గా ఎంతో ప్రత్యేకమైన విషయం. థాంక్స్ డియర్ విన్సెంట్ సర్' అని ప్రేమ్ రక్షిత్ రిప్లై ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. దాంతో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. చెన్నైలో పెరిగిన రక్షిత్.. ప్రభాస్'ఛత్రపతి'తో ప్రయాణం మొదలుపెట్టి.. 'బాహుబలి' వంటి అనేక పెద్ద చిత్రాలకు పనిచేశారు. తెలుగు, తమిళంలో దాదాపు 200కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. View this post on Instagram A post shared by Prem Rakshith (@premrakshith_choreographer) -
నాన్న పిజ్జాలు అడిగి మరీ తెప్పించుకుంటాడు: నాగచైతన్య
టాలీవుడ్ హీరో నాగచైతన్య కొన్నేళ్ల క్రితం షోయూ పేరుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించాడు. ముఖ్యంగా జపనీస్ వంటకాలకు ఇది బాగా ఫేమస్. ఈ ఫుడ్ బిజినెస్ ప్రారంభం నుంచి విజయవంతంగా రన్ అవుతోంది. దాని గురించి తాజాగా చై మాట్లాడుతూ.. జపనీస్ వంటకాలంటే నాకెంతో ఇష్టం. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా జపనీస్ వంటకాలనే ఫస్ట్ ఆర్డర్ చేస్తాను. రెస్టారెంట్ అనుకున్నాంఆ వంటకాలను హైదరాబాద్కు తీసుకురావాలనిపించింది. నిజానికి ఏకంగా రెస్టారెంటే ప్రారంభించాలనుకున్నాను. కానీ, కరోనా వల్ల పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. అప్పుడే క్లౌడ్ కిచెన్ ఆలోచన వచ్చింది. కస్టమర్లకు నేరుగా ఇంటికే డెలివరీ చేసే ఆలోచన బాగుందనిపించింది. మా కిచెన్లో కొత్తగా ఏ వంటకం చేయాలన్నా ముందు ఇంట్లో టెస్ట్ చేయాల్సిందే!నాన్నకు పిజ్జా ఇష్టంఇంట్లో వంటపై ప్రయోగాలు చేసినప్పుడు శోభిత దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. మెనూ తయారీలో తన సూచనలు ఉపయోగపడ్డాయి. నాన్నకు షోయూలో సూజితో చేసే పిజ్జా అంటే బాగా ఇష్టం. ప్రతి ఆదివారం పిలిచి.. ఈసారి కొత్తగా ఏం పిజ్జాలు చేశారు? నాకు పంపించు అని అడుగుతూ ఉంటారు అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండగా బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.చదవండి: 8 ఏళ్లుగా భరిస్తున్నా.. నావల్ల కాదు: రష్మిక మందన్నా -
కార్మేని సెల్వం టీజర్: అప్పు చేసైనా ఖర్చు పెట్టాలి!
సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కార్మేని సెల్వం’. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గురువారం ఈ మూవీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. "డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని వాయిస్ ఓవర్తో టీజర్ మొదలవుతుంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు.. ఇలా నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. రిచ్ కావాలంటే..ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉండనున్నాయి. టీజర్ చివర్లో.. “ధవంతుడివి కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకునైనా ఖర్చు చేయాలి” అని సముద్రఖని చెప్పే డైలాగ్ నేటి మనుషుల పోకడను తెలియజేస్తోంది. సినిమాఈ మూవీని రామ్ చక్రి దర్శకత్వంలో పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదల కానుంది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. -
8 ఏళ్లు ఎంత బాధపెట్టినా మౌనంగా భరించా.. ఇకనావల్ల కాదు!
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మనసుపడ్డవాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికింది. ఫిబ్రవరి 26ప ఉదయ్పూర్లో తెలుగు హీరో విజయ్దేవరకొండను పెళ్లాడింది. ఈ సంతోషకర సమయంలో ఆమె తల్లి సుమన్ మందన్నాకు సంబంధించిన ఓ పాత ఆడియో క్లిప్ కటి నెట్టింట తెగ వైరలవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది రష్మిక గురించి, ఆమె కుటుంబం గురించి సోషల్ మీడియాలో అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది.అన్నీభరించా..ఒక మీడియా వర్గం ఎనిమిదేళ్లుగా నాపై అసత్యప్రచారం చేస్తూ, నన్ను టార్గెట్ చేస్తూ వేధిస్తూనే ఉంది. వాళ్ల వ్యూస్, రీచ్ కోసం నేను అనని మాటల్ని కూడా అన్నట్లుగా తప్పుడు కథనాల్ని రాసింది. అది నన్నెంతో బాధపెట్టినా నేను మౌనంగా ఉన్నాను. కానీ గడిచిన 24 గంటల్లో వారు హద్దులు దాటి నాపై తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. ఎంతదూరం వెళ్తారు?ఇప్పుడు నా జీవితంలో మార్పు చేసుకున్న పరిణామాల కారణంగా కావాలనే వాటిని వైరల్ చేస్తున్నారు. ఇంకా ఎంతదూరం వెళ్తారు? మీరిలా చేయడం వల్ల నా కుటుంబసభ్యులే కాకుండా నాకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేకాదు, నా ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది. మేమిద్దరం (రక్షిత్, నేను) ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నాం. 24 గంటల్లో డిలీట్అయినా సరే కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారు, విషాన్ని చిమ్ముతున్నారు. ఎనిమిదేళ్లుగా మీరేం చేసినా మౌనంగా ఉన్నాను. కానీ, ఈరోజు మిగతావారిని కూడా ఇందులోకి లాగుతూ హద్దులు దాటి ప్రవర్తించారు. ఇక నేను సహనంగా ఉండలేను. మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వెంటనే తప్పుడు కథనాల్ని తొలగించండి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా.. ఆలోపు వాటిని తొలగించకపోతే రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.వివాదం ఏంటి?2016లో కిరిక్ పార్టీ మూవీ షూటింగ్లో రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. ఆ మరుసటి ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ, ఆ ప్రేమ పట్టాలెక్కకముందే 2018లో ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఆ సమయంలో రష్మిక ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె తల్లి మాట్లాడినట్లుగా ఓ ఆడియో వైరలవుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల కిందటి సంభాషణను ఇప్పుడు రష్మిక పెళ్లి జరిగిన సమయంలో బయటపెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 🙏🏻 pic.twitter.com/DdJwFIjeP3— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026 -
నాలుగు పెళ్లిళ్లు.. మీ కన్నా హిందువులే నయం: ముంతాజ్
చైల్డ్ ఆర్టిస్ట్గా.. ఆ తర్వాత హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది సీనియర్ నటి ముంతాజ్. ఖిలోనా, దో రాస్తే, ఆప్కీ కసమ్, తేరే మేరే సాప్నే, రోటి వంటి పలు చిత్రాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 1974లో వ్యాపారవేత్త మయూర్ మద్వానిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణించింది. అయితే 1990లో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించింది.హిందూ దేవుళ్లంటే ఇష్టంతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మతాంతర వివాహాలు, దేవుళ్ల గురించి మాట్లాడింది. ముంతాజ్ మాట్లాడుతూ.. నేను దేవుళ్లను బాగా నమ్ముతాను. శంకరుడు, కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నేను ముస్లిం అయినప్పటికీ ఈ దేవుళ్లపై నాకెంతో విశ్వాసం ఉంది. మా ఇంట్లో మెట్లు దిగి వస్తుంటే బొజ్జ గణపయ్య విగ్రహం కనిపిస్తుంది. ఎప్పుడూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటాను.ఎందుకీ గొడవ?నేను అన్నిమతాలను నమ్ముతాను. నా భర్త హిందువు. నా సోదరి కూడా హిందువునే పెళ్లాడింది. మేమంతా సంతోషంగా ఉన్నాం. కానీ జనాలెందుకు ఈ మతాల గురించి కొట్టుకుంటారో అర్థం కాదు. కాకపోతే మా కమ్యూనిటీలో ఉన్న బహుభార్యత్వం నాకు ఏమాత్రం నచ్చదు. చాలామంది మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారు. అంతకుముందు ఉన్న భార్యల్ని నడిరోడ్డుమీద వదిలేస్తారు. అలా చేస్తే హిందువుల కన్నా మీరెలా గొప్పవారవుతారు? ఏ ఒక్కరూ కూడా మూడునాలుగు పెళ్లిళ్లు చేసుకోకూడదు. అది చాలా పెద్ద తప్పు.అది చాలా తప్పుభార్య ఉండగా మరొకర్ని పెళ్లి చేసుకోవడమేంటి? ఆ మహిళ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి ఆమెను వదిలేసి మరొకర్ని షాదీ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇది మహా పాపం. ఈ విషయంలో హిందువులే నయం. కొన్నిసార్లు వాళ్లు కూడా రెండో పెళ్లి చేసుకుంటారు. కానీ కట్టుకున్న భార్యని అర్ధాంతరంగా వదిలేసి మరొకరి దగ్గరకు అంత ఈజీగా వెళ్లిపోవడం మాత్రం చాలా తప్పు అని ముంతాజ్ నొక్కి చెప్పింది.చదవండి: బలవంతంగా ఐటం సాంగ్స్.. చెండాలమైన లిరిక్స్: నటి -
అవసరం లేకపోయినా ఐటం సాంగ్స్.. చిన్నపిల్లలు కూడా!
సినిమాల్లో ఐటం సాంగ్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. కొన్నిసార్లు అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా చొప్పిస్తున్నారు. అయితే ఆ పాటల్లో మహిళలను చూపించే పద్ధతి మాత్రం అస్సలు బాగోలేదంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ. ముంబైలో బుధవారం జరిగిన వి ద వుమెన్ కార్యక్రమంలో షబానా మాట్లాడుతూ.. ఐటం సాంగ్ అనగానే హీరోయిన్ శరీర అవయమవాలను ఎలా చూపించాలనేదానిపైనే ఫోకస్ చేస్తున్నారు. అవసరం లేకపోయినా..పిచ్చిపిచ్చిగా పెట్టే కెమెరా యాంగిల్స్ దర్శకుడి ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ ఐటం సాంగ్లో స్త్రీ స్వీయనియంత్రణ కోల్పోయి పురుషుల చూపుకు లొంగిపోయినట్లుగా చూపిస్తున్నారు. పైగా సినిమా కథకు అవసరం లేకపోయినా ఈ స్పెషల్ సాంగ్స్ను కావాలని ఇరికిస్తున్నారు.చిన్నపిల్లలు కూడా..ఆడవారిని చూపించే విధానమే కాదు, పాట లిరిక్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఇటువంటి సాంగ్స్ను సమాజం ఆదరించడం కూడా బాధపెడుతోంది. ఏదైనా ఫంక్షన్కు వెళ్తే అక్కడ చిన్నపిల్లలు కూడా చోలీ కే పీచే క్యా హై (ఓ ఐటం సాంగ్) అంటూ పాడుతున్నారు. అది చూసి అందరూ సరదాగా నవ్వుతున్నారు. సినిమాఎవరూ ఆ లిరిక్స్ అర్థాన్ని పట్టించుకోవట్లేదు, కేవలం ఒక జోష్లో పాడేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా షబానా అజ్మీ.. అంకుల్, అర్థ్, ఖాందార్, పార్, గాడ్ మదర్ సినిమాలకుగగానూ ఐదుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెల్చుకుంది. ఈమె చివరగా డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లో మెరిసింది.చదవండి: పవన్ కల్యాణ్ డూప్గా హరీశ్ శంకర్? డైరెక్టర్ ఏమన్నారంటే? -
పెళ్లి తర్వాత తొలిసారి విజయ్, రష్మిక డ్యాన్స్.. వీడియో వైరల్
మొన్నటి వరకు పెళ్లి పనులు, రిసెప్షెన్లతో బిజీగా గడిపిన టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక..ఇప్పుడు రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోయారు. షూటింగ్స్కి గ్యాప్ ఇచ్చి.. ఖాలీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తాజాగా ఈ జంట..ఆనంద్ దేవరకొండ పాటకు డ్యాన్స్ చేసింది. పెళ్లి తర్వాత తొలిసారి విజయ్, రష్మిక కలిసి డ్యాన్స్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.సరదాగా ‘సంచారమే..’ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ . ఈ మూవీ నుంచి ఇటీవల సంచారమే అనే పాట రిలీజ్ అయింది. ప్రముఖ గేయరచయిత గొరటి వెంకన్న లిరిక్స్ అందించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్స్ పెద్ద ఎత్తున ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు. ఇప్పుడీ ట్రెండీ సాంగ్ ను విజయ్ దేవరకొండ, రష్మిక, ఆనంద్ దేవరకొండ కలిసి రీక్రియేట్ చేశారు. ముగ్గురు కలిసి సరదాగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ‘ఇది కొంచెం గందరగోళంగా కనిపించవచ్చు. కానీ ఆ క్షణంలో మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. మనకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణిస్తూ, డ్యాన్స్ చేస్తే దానికన్నా ఆనందం ఇంకేముంటుంది’ అని రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda) -
స్పిరిట్ లుక్ వైరల్.. అది ప్రభాస్ది కాదు నాది!: నటుడు
'స్పిరిట్' అన్న పేరు వినిపిస్తే చాలు ప్రభాస్ ఫ్యాన్స్కు ఎక్కడలేని సంతోషం వస్తుంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల ప్రభాస్ స్పిరిట్ లుక్ అంటూ ఓ ఫోటో తెగ వైరలయింది. అందులో నటుడి ఫేస్ కనిపించకుండా వెనక నుంచి పిక్ తీశారు. దీంతో ఆయన ప్రభాస్ అని చాలామంది భావించారు.ఫోటో వైరల్కానీ ఆయన డార్లింగ్ ప్రభాస్ కాదని, ఆ ఫోటో తనది అంటున్నాడు నటుడు శివ గణేశ్. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన శివ గణేశ్ ఇప్పుడిప్పుడే నటుడిగా బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్లో వెనక నుంచి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా ప్రభాస్ ఫోటో అని వైరల్ అయింది.ఎందుకు వైరల్ అయిందో..దీనిపై శివ గణేశ్ స్పందిస్తూ.. నేను చేస్తున్న సినిమాలోని మేకింగ్ ఫోటో అది. మా డైరెక్టర్ ప్రభాస్ ఫ్యాన్. అలా అని నన్ను ప్రభాస్లా చూపించాలనుకోలేదు. కానీ, అది అనుకోకుండా కుదిరింది. మూడురోజుల క్రితం నా ఫ్రెండ్ ఒకడు మెసేజ్ చేశాడు. ఇది ప్రభాస్ ఫోటో అని ట్విటర్లో వైరలవుతోంది, నువ్వే కదా? అని అడిగాడు. నేనే అని బదులిచ్చాను. కానీ, ప్రభాస్ ఫోటో అని ఎందుకు వైరల్ చేస్తున్నారో అర్థం కాలేదు.సినిమానేను భీమవరంలో పుట్టిపెరిగాను. ప్రభాస్ సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఆయనతో నన్ను పోల్చినందుకు సంతోషంగా ఫీలయ్యాను అని చెప్పుకొచ్చాడు. ఇతడు పుష్ప 2, ఖుషి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోనూ యాక్ట్ చేసినప్పటికీ ఎడిటింగ్లో తీసేశారు. ప్రస్తుతం ఇతడు ఉస్తాద్ భగత్ సింగ్లో నటిస్తున్నాడు. -
పవన్ కల్యాణ్ డూప్గా హరీశ్.. దర్శకుడు ఏమన్నాడంటే..
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్లో ఫుల్ బిజీ అయిపోయాడు దర్శకుడు హరీశ్ శంకర్. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనపై వచ్చిన ఓ క్రేజీ రూమర్పై స్పందించారు.పవన్ కాదు.. డూప్గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఏపీలో ఎన్నికల కంటే ముందే ఈ మూవీ అనౌన్స్మెంట్ జరిగింది. ఎన్నికల తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగ్ వాయిదా పడింది. ఒకనొక దశలో ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ సమయంలోనే ప్రీలుక్ పోస్టర్ని వదిలారు. అందులో పవన్ కల్యాణ్ ఖాకీ డ్రెస్లో కుర్చీలో కూర్చొని ఉంటాడు. అయితే హీరో ముఖం కనిపించకుండా వెనక నుంచి ఫోటో తీసి పోస్టర్ వదిలారు. ఆ సమయంలో అందులో ఉన్నది పవన్ కల్యాణ్ కాదంటూ రూమర్స్ వచ్చాయి. హరీశ్ శంకరే పవన్కు డూప్గా నటించారనే వార్తలు వైరల్ అయ్యాయి. టీజర్ విడుదలైన తర్వాత కూడా కొందరు ప్రేక్షకులు ఆయనే డూప్గా నటించారని అన్నారు.బాధ కాదు.. హ్యాపీగా ఫీలయ్యా.. ఈ రూమర్స్పై తాజాగా హరీశ్ శంకర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇప్పటి వరకు తాను పవన్కు డూప్గా నటించలేదని స్పష్టం చేశాడు. ప్రీలుక్ రిలీజ్ సమయంలో వచ్చిన రూమర్స్ చూసి బాధ పడలేదని, పవన్తో తనను పోల్చడం, తాను ఒక స్టార్ హీరోలా కనిపిస్తున్నానని జనం అనుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. అలాగే బాడీ డూప్ గురించి మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో హీరోలకు చిన్న గాయం తగిలినా షూటింగ్ షెడ్యూల్స్ మొత్తం అస్తవ్యస్తమవుతాయని, దాని వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వస్తుందని, అందుకే డూప్ని వాడతారని చెప్పారు. ఉస్తాద్ విషయానికొస్తే..హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. -
ధురందర్ 2 టికెట్ రేటు రూ. 3100
భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ధురంధర్-2 సినిమా టికెట్ ధరల విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక టికెట్ ధరగా రూ.3100ను ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లోని ఒక ప్రత్యేక స్క్రీన్లో ఫిక్స్ చేశారు. కేవలం 42 సీట్లు మాత్రమే ఉన్న ఈ స్క్రీన్లో ప్రీమియర్స్ కోసం ఈ రేటు అమలు చేస్తున్నారు. బుక్ మై షో చార్జీలతో కలిపితే ధర రూ.3145కి చేరుతుంది. ప్రస్తుతం అదే స్క్రీన్లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ-2 టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. అయితే ధురంధర్-2 క్రేజ్ కారణంగా ప్రీమియర్ షోలకు టికెట్ ధరను అమాంతం పెంచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే సగానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.800 వరకు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఎప్పటిలాగే రేట్లు పెంచారు. సాయంత్రం 5 గంటలకే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. -
నా పెళ్లికి ముందు అన్న ఇచ్చిన సలహా..: అల్లు శిరీష్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. అన్నావదినలైన అల్లు అర్జున్- స్నేహల పెళ్లిరోజు (మార్చి 6న)న ప్రేయసి నయనిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అప్పటినుంచి వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నాడు.విలువైన సలహాతాజాగా తన పెళ్లికి ముందు అన్నయ్య ఇచ్చిన ఐడియా గురించి చెప్పుకొచ్చాడు. వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ.. కొన్ని విషయాలు స్వయంగా అనుభూతి చెందాలని అన్నయ్య, నాన్న భావిస్తారు. అందుకనే మనం అడగనంతవరకు వాళ్లు ఎటువంటి సలహాలు ఇవ్వరు. అయితే నా అన్న నాకో విలువైన సలహా ఇచ్చాడు. ఇవే జీవితంలో మధుర క్షణాలుకొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు. అన్నీ అనుకున్నట్లుగా జరగవు. ఫంక్షన్లో కరెక్ట్ సమయానికి దుస్తులు రాకపోవచ్చు, లేదంటే కాస్త ఆలస్యం అవొచ్చు.. అంతమాత్రానికి ఒత్తిడికి లోనవద్దు. ఇవి నీ జీవితంలోనే మధురమైన క్షణాలు.. వాటిని ఆస్వాదించు అని చెప్పాడని గుర్తు చేసుకున్నాడు.లవ్స్టోరీతన లవ్స్టోరీ గురించి మాట్లాడుతూ.. నా కజిన్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి 2023 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన ఓ పార్టీలో మేమిద్దరం కలుసుకున్నాం. సరదాగా మాట్లాడుకున్నాం.. ఫ్రెండ్స్ అయిపోయాం. తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అయితే నయనిక సోదరి.. మా వదిన స్నేహ మంచి ఫ్రెండ్స్. సీరియస్ కాదేమోనని అనుమానంనావల్ల వారి స్నేహానికి ఆటంకం రాకూడదని భావించాను. అలాగే తను కూడా నేను యాక్టర్ను, నేను సీరియస్గా ప్రేమించడం లేదేమోనని భయపడింది. అయితే హీరో నితిన్ భార్య షాలిని తనకు మంచి స్నేహితురాలు. నాగురించి రెండు మంచి మాటలు చెప్పేసరికి ధైర్యం తెచ్చుకుంది. అలా గతేడాది అక్టోబర్లో డేటింగ్ మొదలుపెట్టాం అని శిరీష్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
వెరైటీగా 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' సినిమా ప్రమోషన్స్
ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తయితే, దాన్ని ప్రమోట్ చేయడం మరో ఎత్తు! ఇటీవల ఒక సినిమా వినూత్నమైన ప్రమోషన్స్తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్”. సినిమా కాన్సెప్ట్ మాత్రమే కాకుండా, ఈ చిత్రబృందం చేస్తున్న ప్రచార కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.వినూత్న ప్రమోషన్స్రైతులకు ఉపయోగపడే అంశాన్ని ఈ సినిమాలో చూపించడంతోపాటు సినిమా ప్రమోషన్స్ కూడా రైతుల మధ్య నుంచే ప్రారంభించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షోలో చిత్రబృందం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన రైతులకు సినిమా కాన్సెప్ట్ను వివరించారు. సాధారణంగా అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లలో వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, విత్తనాలు, కంపెనీల స్టాళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఒక సినిమాకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయడం అరుదైన విషయమే అని చెప్పాలి.ఆరోజు కూడా..అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో జరిగిన మెగా రైతు మేళాలో కూడా “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా టీమ్ స్టాల్ ఏర్పాటు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు, స్కాలర్లు, యాక్టివిస్టులు, మహిళా యాక్టివిస్టులు, రైతులు మూవీ స్టాల్ను సందర్శించి చిత్రబృందాన్ని అభినందించారు. రైతుల కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించారు.ప్రధాన ఉద్దేశంవ్యవసాయం, సాంకేతికత మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని చిత్రబృందం చెబుతోంది. “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” వ్యవసాయంతో పాటు ఆధునిక సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యను కూడా ప్రస్తావిస్తుంది. మునుపటి తరాలు జంటలకు మార్గనిర్దేశం చేయడంలో, కుటుంబ విభేదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయని ఈ సినిమా గుర్తుచేస్తుంది. అలాగే దాదాపు 10 మంది ప్రముఖ కమెడియన్స్తో నవ్వులు పంచేలా రూపొందించారు. ఈ మూవీని వేసవిలో విడుదల చేయనున్నారు. -
ఇప్పటికీ భార్యనే డబ్బు అడుగుతా: శివకార్తికేయన్
తనకు డబ్బు కావాల్సి వస్తే భార్య దగ్గర చేయి చాస్తానంటున్నాడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్. తన బ్యాంకులో ఎంత డబ్బుందన్న విషయం కూడా తనకు తెలియదని చెప్తున్నాడు. ఈయన నిర్మాతగా వ్యవహరించిన 'తాయ్ కిళవి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. రాధికా శరత్కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం రూ.50 కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో శివకార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.చేయి చాచి అడుగుతాఆయన మాట్లాడుతూ.. పెళ్లయినప్పటి నుంచి నా ఆర్థిక వ్యవహారాలన్నీ భార్య ఆర్తియే చూసుకుంటోంది. నా అకౌంట్లో ఎంత డబ్బుందన్న విషయం కూడా నాకు తెలీదు. నేను ఎప్పుడు, ఏ ఖర్చు పెట్టాలన్నా తనను అడిగి తీసుకుంటాను. ఒక టికెట్ కొనాలన్నా కూడా తనను చేయి చాచి మనీ అడుగుతాను. అందుకు నేను ఏమీ బాధపడను, పైగా గర్వపడుతున్నాను. తన ముందుచూపు, దూరదృష్టి, పొదుపు చేసే వైఖరి వల్లే ఈరోజు నేను నిర్మాతగా సినిమాలు తీయగలుగుతున్నాను. వాళ్లందరికీ సినిమా అంకితంతను అవన్నీ చూసుకోకపోయుంటే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. రేపటికోసం జాగ్రత్తపడే ప్రతి మహిళకు మా సినిమా అంకితం. సంపాదన ఎంతున్నా సరే దానిలో ఎంతో కొంత వెనకేయాలనే ఆడవారు ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చాడు. కాగా కొత్త డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన తాయ్ కిళవి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సింగం పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, ముత్తుకుమార్, రేచల్ రెబెకా, జార్జ్ మరియణ్ ప్రధాన పాత్రలు పోషించారు. నివాస్ కె.ప్రసన్న సంగీతం అందించాడు.చదవండి: భర్తకు విడాకులిచ్చిన హీరోయిన్ హన్సిక -
భర్తకు హన్సిక విడాకులు.. భరణం ఆశించని హీరోయిన్
హీరోయిన్ హన్సిక మొత్వానీ నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికింది. భర్త, వ్యాపారవేత్త సోహెల్ ఖతూరియా నుంచి విడాకులు తీసుకుంది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామంటూ హన్సిక బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. భర్త నుంచి ఎలాంటి భరణం అడగకుండానే హన్సిక విడాకులు కోరడం గమనార్హం!రెండేళ్ల నుంచే వేర్వేరుగాతమ మధ్య చిన్న విషయాలు కూడా తగాదాలుగా మారుతున్నాయని, ఒకే ఇంట్లో ఉండటం కూడా కష్టంగా ఉందని హన్సిక పిటిషన్లో పేర్కొంది. 2024 జూలై 2 నుంచే వీరు విడివిడిగా జీవిస్తున్నట్లు హన్సిక తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కాగా హన్సిక 2022 డిసెంబర్ 4న సోహెల్ను పెళ్లాడింది. ఇది హన్సికకు మొదటి పెళ్లి కాగా అతడికి రెండోది కావడం గమనార్హం! హన్సిక - సోహెల్ వివాహ వేడుకకు రాజస్థాన్లోని జైపూర్ ప్యాలెస్ వేదికగా నిలిచింది. పెళ్లయి రెండేళ్లు కూడా కాకముందే దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో చాలాకాలంగా వేర్వేరుగా జీవిస్తున్న వీరు ఇప్పుడు విడాకులతో దూరమయ్యారు.సినిమాహన్సిక హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. దేశముదురు అనే తెలుగు చిత్రంతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. కంత్రి, మస్కా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ, పవర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ మూవీస్ చేసింది.చదవండి: సర్జరీ ఫెయిల్, దేవుడి ముందు మోకరిల్లి: కమెడియన్ -
నాన్న చితికి అల్లుడి స్థానంలో నిలబడి నిప్పు పెట్టాడు: సింగర్
మలయాళ సింగర్ అమృత సురేశ్కు ప్రేమ కలిసి రావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త (నటుడు బాల) కూతురు పుట్టాక విడాకులు తీసుకున్నాడు. ఆ సమయంలో ఒంటరితనంతో కుమిలిపోతున్న తనకు మ్యూజిక్ కంపోజర్ గోపీ సుందర్ దగ్గరయ్యాడు. కానీ, ఇది కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఈ జంట కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే గోపీ సుందర్ తాను జీవితంలో మర్చిపోలేని ఓ పని చేశాడంటోంది.ప్రియుడి తల్లిని..అమృత సురేశ్ మాట్లాడుతూ.. కొన్నేళ్లపాటు నరకం, బాధ అనుభవించిన సమయంలో గోపీ సుందర్ నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. మేము ఎంతో బాగా కలిసిపోయాం. ఎంతలా అంటే అతడి తల్లిని కూడా నేను నా తల్లిగానే భావించాను. అంతలా ఆ కుటుంబాన్ని ప్రేమించాను. ఇప్పటికీ అతడి కుటుంబంపై ప్రేమ అలాగే ఉంది. మా రిలేషన్షిప్ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలనుకున్నాం. కానీ, అది జరగలేదు. అలా అని అతడెప్పుడూ నన్ను బాధపెట్టలేదు. అల్లుడి స్థానంలో నిలబడిమా నాన్న చనిపోయినప్పుడు ఒక కొడుకులా ముందు నిలబడి అంత్యక్రియలు జరిపించాడు. మా నాన్న చితికి అల్లుడి స్థానంలో నిలబడి నిప్పు పెట్టాడు. అది నేనెప్పటికీ మర్చిపోలేను. కానీ రానురానూ మేము కలిసి ఉండటం కష్టమని అర్థమైంది. గొడవపడుతూ కలిసుండటం కన్నా అర్థం చేసుకుని విడిపోవడమే మంచిదని భావించాం. ఇద్దరం విడిపోయాం. బర్త్డే, పండగల సమయంలో మాత్రం ఒకరినొకరం విష్ చేసుకుంటాం అని చెప్పుకొచ్చింది.పెళ్లిఅమృత సురేశ్ గతంలో నటుడు బాలాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2010లో వివాహం చేసుకున్న వీరిద్దరికీ 2012లో కూతురు అవంతిక జన్మించింది. 2015లో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా జీవిస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. చివరకు అవే నిజం చేస్తే 2019లో వీరు విడాకులు తీసుకున్నారు.చదవండి: చేసిన రెండు మూవీస్ ఫ్లాప్.. అయినా మరో బంపరాఫర్ -
సర్జరీ ఫెయిల్.. దేవుడి ముందు మోకరిల్లి..: జేమీ లివర్
వెండితెరపై నవ్వులు పూయించే జానీ లివర్ ఒకానొక సమయంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించాడు. కన్నకొడుకు జెస్సీ చిన్నవయసులో ట్యూమర్తో బాధపడుతుంటే చూడలేక తల్లడిల్లిపోయాడు. అతడే కాదు అతడి కుటుంబం కూడా మానసిక క్షోభ అనుభవించింది. ఈ విషయాన్ని తాజాగా జానీ లివర్ కూతురు జేమీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.కవర్ చేసేందుకు..ఆమె మాట్లాడుతూ.. నా తమ్ముడు స్కూల్లో ఉండగా వాడికి ట్యూమర్ ఉన్నట్లు తెలిసింది. మొదట్లో అదేంటో మాకూ అర్థం కాలేదు. కానీ, ఆ ట్యూమర్ సైజు పెరుగుతూ వాడిని ఇబ్బందిపెట్టింది. రానురానూ దాన్ని కవర్ చేయడం కోసం డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేశాడు. మేమిద్దరం ఒకటే స్కూల్లో చదువుకునేవాళ్లం. తననెప్పుడూ జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ముంబైలో చేసిన మొదటి సర్జరీ విజయవంతం కాలేదు. అప్పుడు చాలా భయపడ్డాం. తన ఆరోగ్యం కుదుటపడాలని, బాగుండాలని నాన్న దేవుడి ముందు మోకాళ్లపై కూర్చుని ప్రార్థించేవాడు.రెండుసార్లు సర్జరీజెస్సీ అడిగినవేవీ కాదనేవాళ్లం కాదు. అతడి కోరిక మేరకే అమెరికా ట్రిప్ వెళ్లాం. అనుకోకుండా అక్కడ సర్జరీకి ప్రయత్నించగా అది విజయవంతమైంది. రెండేళ్లలో రెండు సర్జరీలు జరిగాయి. దేవుడి దయ వల్ల అనారోగ్యం నుంచి కోలుకున్నాడు అని చెప్పుకొచ్చింది. జెస్సీ.. కిస్ కిస్కో ప్యార్ కరూన్, హౌస్ఫుల్ 4, భూత్ పోలీస్ వంటి సినిమాలు చేసింది. ఆ ఒక్కటి అడక్కు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.చదవండి: సీజీ చేయడం రాక మా మీద తోస్తున్నారు: ఛోటా కె నాయుడు -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్.. ఇబ్బందిపడ్డా: హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటుంది నటి సమీరా రెడ్డి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. కలర్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుందని, తాను కూడా ఇది ఫేస్ చేశానని చెబుతోంది. తెలుగులో `నరసింహుడు`, `అశోక్` ‘జై చిరంజీవా’ లాంటి సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. 2014లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయింది. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శరీరంలో భారీ మార్పులు వచ్చాయి. కాస్త బొద్దుగా మారడంతో..సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ట్రోల్స్ గురించి, ఇండస్ట్రీలో హీరోయిన్గా తాను ఎదుర్కొన్న సవాళ్లను గురించి వివరించింది.‘సినిమా ఇండస్ట్రీలో అందానికే ఎక్కువ ప్రాధాన్యత. టాలెంట్ గురించి పట్టించుకోరు. తెల్లతోలు వ్యామోహం నన్ను చాలా ఇబ్బందికి గురి చేసింది. సాధారణంగా ఓ నటిగా, మహిళగా ఎప్పుడూ అందంగా ఉండడానికే ప్రయత్నించాను. కానీ మరింత అందంగా కనబడాలంటూ నాకు మేకప్ వేసేవాళ్లు. ముఖానికి మాత్రమే కాకుండా.. శరీరానికి కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేశారు. అలా చెప్పడం నన్ను చాలా బాధించింది. నిజంగానే నేను అందంగా లేనేమో అనే భావన నాలో కలిగింది. అంతేకాదు, నేను స్లిమ్గా లేనని బాధపడేదాన్ని. నేను చాలా పొడుగ్గా ఉండడంతో.. వయసులో పెద్దదిగా చూసేవాళ్లు. అది నా మైండ్లో అలా ఉండిపోయేది. ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు నా బాడీ సైజు గురించే మాట్లాడేవాళ్లు కానీ.. టాలెంట్, యాక్టింగ్ గురించి చర్చ జరిగేది కాదు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తే.. 'అసలు వాళ్లు చెప్పినట్లు ఎందుకు చేశాను. అలా అనుమతి ఇవ్వకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో కామన్. అలా చేయకతప్పదు’ అని సమీరా(Sameera Reddy) చెప్పుకొచ్చింది.ఇక బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ.. ‘పిల్లలు పుట్టిన తర్వాత నా శరీరంలో మార్పు వచ్చింది. వెయిట్ గైన్ అవ్వడం వల్ల నా ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాను.. ఆ సమయంలో నెటిజన్స్ నుంచి ఎదురైన విమర్శలు మానసికంగా నన్ను ఆవేదనకు గురి చేశాయి. ఇక రెండోసారి తల్లి అయినప్పుడు మాత్రం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాను.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతటి దారుణమైన కామెంట్స్ చేసినా.. ఆ నెగిటివ్ కామెంట్స్ చూస్తే నాకేమీ అనిపించడం లేదు. నేను ప్రస్తుతం న్యూట్రల్ గానే ఉన్నాను' -
Allu Cinemas: 75 అడుగుల డాల్బీ స్క్రీన్.. టికెట్ రేట్లపై చర్చ
హైదరాబాద్లోని కోకాపేట్లో మార్చి 12న కొత్తగా ప్రారంభం కానున్న అల్లు సినిమాస్ ఇప్పుడు సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన అల్లు సినిమాస్ ఒక సినిమా హాల్ మాత్రమే కాదు ఇదొక విజువల్ వండర్. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది. ఇక్కడ సినిమా ఎక్స్పీరియన్స్ మరో లెవెల్లో ఉండనుంది.ఈ మల్టీప్లెక్స్లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకమైన డాల్బీ విజన్ స్క్రీన్. ఇది 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతానికి ఇండియాలో కేవలం మూడు డాల్బీ విజన్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి పూణేలో 55 అడుగుల స్క్రీన్, రెండవది బెంగళూరులో 65 అడుగుల స్క్రీన్, ఇప్పుడు హైదరాబాద్లో 75 అడుగుల స్క్రీన్ రూపంలో అల్లు సినిమాస్. ఈ ప్రత్యేకత వల్ల అల్లు సినిమాస్ టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయన్నది సినీప్రియులలో పెద్ద చర్చగా మారింది. పూణేలోని డాల్బీ స్క్రీన్లో టికెట్ రేట్లు సాధారణ రోజుల్లో రూ.500 లోపు, పెద్ద సినిమాల వీకెండ్స్లో రూ. 900 వరకు ఉంటాయి. ఇక బెంగళూరులోని డాల్బీ స్క్రీన్లో టికెట్ రేట్లు క్యాపింగ్ సిస్టమ్కు ముందు గరిష్టంగా రూ.1000 వరకు ఉంటాయి. దాంతో హైదరాబాద్లోని అల్లు సినిమాస్ టికెట్ రేట్లు కూడా సాధారణ రోజుల్లో రూ.500, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు సీటింగ్ బట్టి రూ.1000 వరకు ఉండే అవకాశం. తెలంగాణలో ప్రత్యేక టెక్నాలజీ, పరిమిత సీటింగ్ సామర్థ్యం ఉన్న స్క్రీన్లకు అధిక ధరలు వసూలు చేయడానికి ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. అల్లు సినిమాస్ అల్ట్రా లగ్జరీ మల్టీప్లెక్స్ సెగ్మెంట్లోకి వస్తుంది. దాంతోడాల్బీ విజన్ స్క్రీన్కు భారీగా టికెట్ రేట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్లోని అల్లు సినిమాస్ ప్రీమియం మల్టీప్లెక్స్లకు కొత్త బెంచ్మార్క్గా నిలవబోతున్నాయి. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 చిత్రాలు ప్రదర్శించబడుతాయి. -
'ఆర్ఆర్ఆర్'కి నాటునాటు.. 'వారణాసి'కి లాటిన్ స్టయిల్!
ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు-నాటు' పాట అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆస్కార్ వేదికపై కూడా మెరిసింది ఈ పాట. అది తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైంది. అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి మరోసారి అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసిలో ఓ ప్రత్యేకమైన డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ పాటను లాటిన్ స్టయిల్లో తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారని సీనియర్ కొరియోగ్రాఫర్ శంకర్ వెల్లడించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటపై తెరకెక్కనున్న ఈ పాట కోసం వందలమంది లాటిన్ డాన్సర్లను తీసుకురావాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట.నాటు-నాటు తరహాలోనే, వారణాసిలో లాటిన్ స్టయిల్లో సాగే ఈ పాట కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటికే వారణాసి టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్ వ్యాఖ్యలతో అంచనాలు మరింత పెరిగాయి. జార్జియాలోని షెడ్యూల్ను పూర్తి చేసుకొని మహేష్ బాబు హైదరాబాద్కి తిరిగొచ్చాడు. ఎయిర్పోర్టులో ఆయన కొత్త లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అంటార్కిటికాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరోయిన్ ప్రియాంక చోప్రా స్వయంగా ఈ విషయం వెల్లడించింది. వారణాసి అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోనున్న తొలి తెలుగు చిత్రంగా గుర్తింపు పొందనుంది. -
మిషన్ నొక్కితే డబ్బే డబ్బు.. కాన్ సిటీ టీజర్ చూశారా?
డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు. దాదాపు అలాంటి కాన్సెప్ట్తో వస్తున్న తమిళ సినిమా "కాన్ సిటీ". కాకపోతే ఇక్కడ డబ్బులు చెట్లకు కాకుండా ఓ మిషన్కు కాస్తున్నాయి. అవును, బటన్ నొక్కితే చాలు లిమిట్ అనేదే లేకుండా ఎన్నిసార్లంటే అన్నిసార్లు డబ్బులు ప్రింట్ చేస్తూనే ఉంది.డబ్బులు ప్రింట్ చేసే మిషన్సోమవారం సాయంత్రం కాన్సిటీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో.. డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని ఓ గంభీర స్వరం ఫోన్లో హీరోను నిలదీస్తుంది. దాంతో అసహనానికి లోనైన హీరో వస్తువులన్నింటినీ కిందపడేస్తాడు. అప్పుడే ఒక మిషన్ను సైతం కిందపడేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పిడుగు పడి యంత్రం ఆన్ అవుతుంది, అందులో నుంచి రూ.500 నోటు బయటకు వస్తుంది. ఇంకేముంది.. నొక్కిన ప్రతిసారి నోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.చేతులు మారిన యంత్రందాంతో ఆ డబ్బంతా బ్యాగులో సర్దుకున్న హీరో ఆ యంత్రాన్ని జాగ్రత్తగా అల్మారాలో పెడతాడు. కట్ చేస్తే బట్టలు సర్దే సమయంలో భార్యకు ఆ మిషన్ కనిపిస్తుంది. బటన్ నొక్కితే డబ్బు వస్తుండటంతో దాన్ని తీసుకెళ్లి వంటగదిలో దాచేస్తుంది. అక్కడి నుంచి అది హీరో తల్లి చేతికి వెళ్తుంది. ఆమె దాన్ని పూజగదిలో దేవుడి ఫోటో వెనకాల భద్రపరుస్తుంది. తర్వాత సడన్గా మిషన్ కనిపించకుండా పోతుంది. వీధిలో నోట్ల వర్షంఇంటిల్లిపాది అంతా వెతుకుతారు. తీరా చూస్తే హీరో కొడుకు ఆ యంత్రంతో బాల్కనీలో ఆడుకుంటాడు. ఇంకేముంది, నడిరోడ్డులో డబ్బుల వర్షం.. దాన్ని దక్కించుకునేందుకు వీధిలో జనం ఎగబడుతుంటారు. మరిం తర్వాతేం జరిగిందో తెలియాలంటే కాన్ సిటీ చూడాల్సిందే! హరీశ్ దురైరాజ్ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ మూవీకి సేన్ రోల్డన్ సంగీతం అందించాడు. అర్జున్ దాస్, అన్నాబెన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రాన్ని టీ సిరీస్ తెలుగులో తీసుకురానుంది. -
రూ.50 కోట్లు కొల్లగొట్టిన రాధిక శరత్ కుమార్ మూవీ
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా అలరించిన రాధిక శరత్కుమార్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే 'తాయ్ కిళవి' కోసం ఆమె ముసలమ్మగా నటించింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటినుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. 75 ఏళ్ల బామ్మగా రాధిక నటించడం, హీరో శివకార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హాఫ్ సెంచరీపాజిటివ్ రివ్యూలతో తొలిరోజు నుంచే బాక్సాఫీస్పై మంచి పట్టు సాధించింది. కేవలం పది రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తాయ్ కిళవి రూ.50 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక సినిమా రిలీజైనప్పటినుంచి టాప్ హీరోలు, దర్శకుడు, హీరోయిన్లు అందరూ సినిమాను, ముఖ్యంగా రాధికను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. #ThaaiKizhavi crosses ₹50 Crore Worldwide GBOC in just 10 days! 💥Overwhelmed by the incredible love and support from everywhere. Thank you for making it a #MegaBlockbusterThaaiKizhavi ❤️#MorattuVasool@Siva_Kartikeyan @Sudhans2017 @KalaiArasu_ @SKProdOffl… pic.twitter.com/4aKJASW3hg— Sivakarthikeyan Productions (@SKProdOffl) March 9, 2026 చదవండి: వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ ఏవీ లేవు: నటి -
గోరేటి వెంకన్న పాడిన 'సంచారమే' సాంగ్ విన్నారా?
'బేబి' సినిమా జోడీ ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం "ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్". 90's సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం నాడు ఈ సినిమా నుంచి సంచారమే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించడంతో పాటు పాట ఆలపించాడు. ప్రజాకవి గోరేటి వెంకన్న కూడా హమ్మింగ్ చేస్తూ మధ్యమధ్యలో లిరిక్స్ అందుకున్నాడు. గోరేటి వెంకన్న నోట..వెంకన్న గొంతుక ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. సంచారమే ఎంతో బాగున్నది.. దీనంత ఆనందం ఏమున్నది? అంటూ పాట మొదలవుతుంది. ఊరు నుంచి విదేశాలకు వెళ్లిన సంచారి అనుభవాలను, ఎగ్జయిట్మెంట్ను పాటలో చూపించారు. ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్ విషయానికి వస్తే.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. చదవండి: అప్ప ట్లో వాష్రూమ్స్ కూడా లేవు: బాలీవుడ్ నటి -
వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ కూడా లేవు: బాలీవుడ్ నటి
ఇప్పుడంటే సకల సౌకర్యాలు ఉన్నాయి కానీ ఒకప్పుడు వానిటీ వ్యాన్స్, వాష్రూమ్స్ లేనేలేవంటోంది సీనియర్ నటి సుప్రియ పాఠక్. 1980వ దశకంలో సెట్లో కనీస వసతులు లేకపోయినా పెద్దగా లెక్కచేయలేదని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రియ పాఠక్ మాట్లాడుతూ.. మేము ప్యాషన్తో యాక్ట్ చేసేవాళ్లం. మాకిచ్చిన పాత్రలను తప్ప మిగతా వేటినీ మేము పట్టించుకునేవాళ్లం కాదు. కానీ రానురానూ కొన్ని విషయాలు పట్టించుకోవాలని అర్థమైంది. బాత్రూమ్స్ తప్పనిసరిషూటింగ్ గ్యాప్లో కూర్చోవడానికి కొంత ప్లేస్ కావాలి. మహిళలకు ముఖ్యంగా బాత్రూమ్స్ ఉండాలి. ఇవి కనీస అవసరాలు అని తెలుసుకున్నాం. సెట్లో అందరూ నిలబడి ఉన్నప్పుడు నిర్మాతలకు కూడా అర్థమైంది. కనీసం కూర్చోవడానికి ఏదైనా వసతి కల్పించాలని వాళ్లూ రియలైజ్ అయ్యారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో షూటింగ్కు వెళ్లినప్పుడు వాష్రూమ్స్ వసతి అనేది ఉండదు.కనీస వసతి అవసరంచలిలో లేదా ఎండలో షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆహారం, నీళ్లు, టీ అనేవి అందించడం కూడా ముఖ్యమే! ఇప్పుడు షూటింగ్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పరిస్థితి అలా లేదు. ఉదాహరణకు 'మిర్చి మసాలా' సినిమా షూటింగ్ ఒక పల్లెలోని మిర్చి ఫ్యాక్టరీలో జరిగింది. నాతోపాటు పది మంది మహిళలు ఫ్యాక్టరీలో షూటింగ్లో పాల్గొన్నారు. రోజంతా మిర్చి ఫ్యాక్టరీలో..అసలే ఎండలు మండిపోతుంటే ఆ ఘాటు తట్టుకుని రోజంతా అక్కడే ఉండేవాళ్లం. వెనకాల ఉన్న గడ్డికుప్పలపై సేదతీరేవాళ్లం. అది పెద్ద సమస్యలా ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే మేమంతా ప్యాషన్తో పని చేస్తున్నాం. కానీ ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పుకొచ్చింది.సినిమాసుప్రియ పాఠక్.. గుజరాతీ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. కలియుగ్, బజార్, రామ్లీలా, మాసూమ్, మిర్చి మసాలా వంటి పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో అరవింద సమేత వీర రాఘవలో జేజిగా, గద్దలకొండ గణేశ్లో హీరో తల్లిగా యాక్ట్ చేసింది. చివరగా అస్సి అనే హిందీ చిత్రంలో కనిపించింది. కిచిడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ సుపరిచితురాలైంది. -
ఆమె గొప్ప హీరోయిన్.. ఇలా సినిమాల్ని వదిలేయడం బాధాకరం!
బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. నేరం అనే ద్విభాషా(తమిళ, మలయాళ) చిత్రంతో హీరోయిన్గా మారింది. రాజా రాణి సినిమాతో ఎక్స్ప్రెషన్స్ క్వీన్గా పేరు తెచ్చుకుంది నజ్రియా నజీమ్. ఈ ఒక్క మూవీతో సౌత్లో సెన్సేషన్ అయిపోయింది. ఆ క్రేజ్తోనే వరుసగా సినిమాలు చేసింది. 2014వ సంవత్సరంలో నాలుగు మలయాళ మూవీస్లో మెరిసింది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరం!అదే ఏడాది ఆగస్టులో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. పన్నెండేళ్ల కాలంలో మలయాళంలో కేవలం నాలుగంటే నాలుగే సినిమాలు చేసింది. అందులోనూ ఒకటి గెస్ట్ రోల్! నజ్రియా మలయాళంలో అదే స్పీడుతో సినిమాలు చేసుంటే బాగుండేదంటోంది సీనియర్ నటి ఊర్వశి.ఫహద్ గొప్ప యాక్టర్తాజాగా ఊర్వశి మాట్లాడుతూ.. నా ఫేవరెట్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. అతడెప్పుడూ హీరోయిజం చూపించే పాత్రలు చేయడు. తన గుండును విగ్గుతో కవర్ చేయడానికీ ప్రయత్నించడు. తను తనలాగే ఉంటాడు. ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా నటిస్తాడు. ఇంకాస్త గట్టిగా కష్టపడితే తనకు మంచి కెరీర్ ఉంది. బసిల్ జోసెఫ్ కూడా గొప్ప నటుడే!నజ్రియా గొప్ప నటిహీరోయిన్స్ విషయానికి వస్తే మీరా జాస్మిన్, నవ్య నాయర్.. ఇలా చాలా మంది మంచి పర్ఫామెన్స్ ఇస్తారు. కానీ, నజ్రియా సినిమాల్లో యాక్టివ్గా ఉండుంటే తనంత గొప్ప నటి మరొకరు ఉండేవారు కాదు. పల్లెటూరి అమ్మాయి, మోడ్రన్ గర్ల్, తెలివైన యువతి.. ఇలా అన్ని రకాల పాత్రలు ఇట్టే చేయగలదు. తనకు మంచి టాలెంట్ ఉంది.. అయినా ఇలా సినిమాలను వదిలేయడం కాస్త విచారకరంగా అనిపిస్తుంది అని ఊర్వశి చెప్పుకొచ్చింది. నజ్రియా అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది.చదవండి: ధురంధర్ 2 తర్వాత ఆ సినిమాకు సంతకం చేసిన సారా అర్జున్? -
మరో సినిమా ఒప్పుకున్న ధురంధర్ హీరోయిన్?!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్గా అదరగొడుతోంది. తను కథానాయికగా నటించిన తొలి చిత్రం ధురంధర్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! అనంతరం యుఫోరియా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ధురంధర్ 2తో ముందుకు రాబోతోంది.రూమర్స్పై క్లారిటీఅయితే ఈ 20 ఏళ్ల బ్యూటీ "హీర్ రాంఝా" (పంజాబీ జానపద విషాద కథ) అనే మూవీ చేస్తున్నట్లు బీటౌన్లో ప్రచారం జరుగుతోంది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లో సారా.. హీర్ పాత్రలో నటించనుందని సదరు వార్తల సారాంశం. ఈ రూమర్స్పై కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా స్పందించాడు. సారా అర్జున్ ఏ సినిమాకి సంతకం చేయలేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎవరితోనూ చర్చలు జరపలేదు, ఎవర్నీ కలవలేదు. నేనే చెప్తా..ప్రస్తుతం మేమంతా ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్నాం. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. తను నెక్స్ట్ ఏదైనా సినిమా ఒప్పుకుంటే నేనే స్వయంగా మీకు వెల్లడిస్తాను. అప్పటివరకు వచ్చే ఏ వార్తనూ మీరు నమ్మకండి అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. అంటే ధురంధర్ 2 తర్వాతే సారా తన నెక్స్ట్ సినిమాపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సినిమాధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించాడు. గతేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్గా ధురంధర్ 2 వస్తోంది. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్.మాధవన్, రాకేశ్ బేడీ, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 19న పాన్ ఇండియావైడ్గా విడుదల కానుంది. Sara Arjun has not signed any other film. We are just waiting for D 2. She has not signed any film and has not met anyone regarding any project. So please relax, guys. I will personally update you about her next project. Just wait all the other news is only rumours🥰🧿❤️ pic.twitter.com/njCE7MsKIR— Mukesh Chhabra CSA (@CastingChhabra) March 7, 2026 చదవండి: విడాకులు, తాగుడుకు బానిసయ్యా: మలయాళ నటుడు -
విడాకులు.. తాగుడుకు బానిసయ్యా.. చావే దిక్కనుకున్నా!
విడాకుల బాధ భరించలేక మద్యపానానికి బానిసయ్యానంటున్నాడు మలయాళ నటుడు భగత్ మాన్యుయెల్. చావు అంచులదాకా వెళ్లిన తనను స్నేహితులే కాపాడారని చెప్తున్నాడు. భగత్ మాన్యుయెల్ గతంలో డాలియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2017లో బాబు పుట్టాడు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. అనంతరం 2019లో జుంబా ట్రైనర్ షెలిన్ చెరిన్ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తనతో సంతోషంగా ఉంటున్నాడు.లవ్ మ్యారేజ్మొదటి పెళ్లి గురించి భగత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాతే నేను పెళ్లి చేసుకున్నాను. మాది ప్రేమ వివాహం. మా దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. మేము విడాకులు తీసుకుంటామని కలలో కూడా అనుకోలేదు. మా బంధం తెగిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. తాగడం మొదలుపెట్టాను. నా కొడుకు బాధ్యత నేనే తీసుకున్నాను. ఏరోజూ ఒంటరిగా..వాడి బాగోగులు మా అమ్మానాన్నే చూసుకున్నారు. నేను సమస్యలతో సతమతమవుతున్న సమయంలో నా ఫ్రెండ్స్ అందరూ బిజీగా ఉన్నారు. వాళ్లందరూ నేను కూడా బిజీగా ఉన్నానని అనుకున్నారు. కానీ ఒంటరిగా కూర్చుని తాగుతూ ఉండేవాడిని. జీవితం నా చేతుల్లోంచి చేజారిపోయింది. చచ్చిపోవాలనుకున్నాను. తర్వాత నా పరిస్థితి తెలుసుకుని స్నేహితులే నన్ను ఆ బాధ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆరేడునెలలపాటు నన్ను ఏ రోజూ ఒంటరిగా వదిలేయలేదు.ఆటోలోనే షూటింగ్కు..ఏడేళ్ల క్రితం నేను మళ్లీ పెళ్లి చేసుకున్నాను. నా భార్య నాకెంతో సపోర్ట్గా నిలబడింది. కరోనా సమయంలో అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. నా ఫ్రెండ్స్ వల్లే అమ్మ ఈరోజు జీవించి ఉంది. ఇప్పుడు నాకు కారు కూడా లేదు. ఆటో, బస్సుల్లోనే షూటింగ్స్కు వెళ్తున్నాను అని చెప్పుకొచ్చాడు. భగత్.. మలర్వాడి ఆర్ట్స్ క్లబ్, మాస్టర్స్, ఉస్తాద్ హోటల్, ఆడు 2, గూడలోచన, మందారం, ఉయరె, ఫోనిక్స్, గెట్ సెట్ బేబీ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించాడు.చదవండి: ముక్కలైన జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నా: హంసనందిని -
రీమేక్ల కాలం ముగిసింది.. ఒరిజినల్ కథలే ఆయుధం
ఒకప్పుడు రీమేక్ హక్కులు దక్కించుకోవడం అంటే నిర్మాతలు గర్వంగా చెప్పుకునేవారు.అది వారకి ఎంతో గర్వకారణం. మినిమం గ్యారెంటీ అనే భరోసా కూడా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సినిమా రీమేక్ చేస్తున్నారని తెలిసిన వెంటనే ప్రేక్షకులు ఒరిజినల్ వెర్షన్ను చూసి పోల్చడం అలవాటుగా మారింది. దాంతో ఈ పోలికల్లో సినిమాలోని లోపాలు ఎక్కువగా బయటపడటంతో రీమేక్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నాయి. ఇటీవల సూర్య హీరోగా నటిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్ర యూనిట్ తమ సినిమా మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటించిన కంగారూ రీమేక్ అని వచ్చిన ప్రచారంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ సినిమా పోస్టర్లు ఒకేలా కనిపించడంతో ఈ పుకారు మొదలైంది. దాంతో వెంటనే యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. తమ సినిమా ఒరిజినల్ కథతో వస్తోందని స్పష్టం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ కూడా మొదటి నుంచి ‘తేరి’ రీమేక్ అని ప్రచారం నడిచింది. ఇప్పుడు విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ దర్శకుడు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇది రీమేక్ కాదని సుదీర్ఘంగా వివరణలు ఇస్తున్నాడు. ప్రేక్షకులు ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో హిట్ అయితే ఏంటి గొప్ప? అని ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా విజృంభనతో రీమేక్ విషయాలు దాచిపెట్టడం అసాధ్యం అయ్యింది.రీమేక్ అని తెలిసిన వెంటనే ట్రోలింగ్ మరింత పెరిగింది.ఫలితంగా నిర్మాతలు రీమేక్లకు పూర్తిగా దూరమవుతున్నారు. ఇప్పుడు ఎక్కడైనా తమ సినిమా రీమేక్ అని ప్రచారం జరిగితే చిత్ర యూనిట్లు వెంటనే మీడియా ముందుకొచ్చి ఖండించడం మొదలుపెట్టాయి. రీమేక్ అనే ముద్ర పడకుండా కిందామీద పడుతున్నారు. మొత్తానికి రీమేక్ల కాలం ముగిసింది. ఒరిజినల్ కథలే ఇప్పుడు ప్రేక్షకులను ఆకర్షించే ప్రధాన ఆయుధం. -
పెళ్లి వద్దన్నాడు, ఆరోజు బోరున ఏడ్చాడు: విజయ్ మేనమామ
చాలామంది పెళ్లంటేనే జంకుతారు. మ్యారేజ్ అనేది మాకు సెట్టవదు, దాని జోలికి వెళ్లమని బీరాలు పలుకుతారు. కానీ అందరికంటే ముందు వారే పెళ్లిపీటలెక్కుతారు. హీరో విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరిగింది. వివాహం అంటే నాలుగడుగులు వెనక్కు వేసే విజయ్ ఫిబ్రవరి 26న రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే గతంలో మాత్రం తనకు పెళ్లి సెట్ అవదని అంటుంటేవాడని విజయ్ మేనమామ, నటుడు, నిర్మాత యశ్ రంగినేని చెప్తున్నాడు.పెళ్లి వద్దని..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన విజయ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. యశ్ రంగినేని మాట్లాడుతూ.. విజయ్ పెళ్లి గురించి పాజిటివ్గా ఉండేవాడు కాదు. కెరీర్ చూసుకోకుండా పెళ్లి అవసరమా? అనేవాడు. కానీ, రష్మిక పరిచయమయ్యాక అతడి ఆలోచన విధానమే మారిపోయింది. డియర్ కామ్రేడ్ నుంచి విరోష్ (విజయ్- రష్మిక) మధ్య ప్రేమ మొదలైంది. ఇంట్లో చెప్పగానే..ఇప్పుడు వాళ్లిద్దరినీ జంటగా చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది. విరోష్ పెళ్లి పట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. విజయ్.. రష్మికతో ప్రేమలో ఉన్నానని చెప్పినప్పుడు ఇంట్లో కొంత కంగారుపడ్డారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక గొడవ(విడాకులు) జరుగుతూనే ఉంది. ఆ భయమైతే మా అందరిలో ఉంది. విజయ్ అమ్మానాన్న ఈ విషయం గురించి మాట్లాడారు. కానీ రష్మిక చాలా మంచి అమ్మాయి. తలరాత చెప్పలేంఈ జంటను చూస్తే తర్వాతెలా ఉంటారో? ఏంటో? అన్న అనుమానమే రాదు. వాళ్లిద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది. జంటగా సంతోషంగా ఉన్నారు. కానీ, తలరాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అయితే ఇద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలన్నదే మా అందరి కోరిక. విజయ్ను రౌడీ బాయ్లా చూస్తారు. కానీ తను చాలా ఎమోషనల్. టాక్సీవాలా రిలీజ్కు రెండురోజుల ముందే సినిమా మొత్తం లీకైంది. దుఃఖం ఆపుకోలేక..ఆ విషయం తెలిసి విజయ్ బోరున ఏడ్చాడు. ఇక రిలీజ్ చేయడం వృథా అనుకుంటున్న సమయంలో విజయ్ పోరాడి సినిమాను విడుదల చేయించాడు. తీరా అది పెద్ద హిట్టయింది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎవరైనా ఏదైనా సాధించొచ్చు అని ఈ జనరేషన్కు ఒక నమ్మకాన్ని తీసుకొచ్చాడు అని యశ్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆ ఫోన్ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ -
10 రోజులకే అన్ని కోట్లా? కమల్కు కళ్లు చెదిరే పారితోషికం
రెండేళ్ల క్రితం వచ్చిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ ప్రముఖ పాత్రలు పోషించారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రెట్టింపు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1200 కోట్లు వసూలు చేసింది.రెమ్యునరేషన్కే అంత బడ్జెట్అయితే ఈ బడ్జెట్లో ఎక్కువ భాగం తారల రెమ్యునరేషన్కే సరిపోయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రభాస్ రూ.150 కోట్లు తీసుకోగా అమితాబ్, బిగ్బీ, దీపికా పదుకొణె చెరో రూ.20 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అంతలోనే సౌత్ ఇండియా స్టార్ కమల్ హాసన్ ఏకంగా రూ.100 కోట్ల మేర పుచ్చుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇవేవీ కాదు, అంతకుమించి పారితోషికం తీసుకున్నాడని తమిళ నటుడు యుగి సేతు వెల్లడించాడు.10 రోజులకే అన్ని కోట్లా?తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కమల్ సర్ కల్కి సినిమాలో 20 రోజుల కాల్షీట్లకు గానూ రూ.150 కోట్లు తీసుకున్నాడు. ఆయన దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు అని కమల్ బర్త్డేరోజే చెప్పాను. ఓసారి కల్కి నిర్మాత అశ్వినీదత్ను కలిశాను. నా స్నేహితుడిని అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వ్యక్తిగా మార్చినందుకు థాంక్యూ సర్..20 రోజులు ఎక్కడ?20 రోజులకు రూ.150 కోట్లు ఇచ్చారంటే మామూలు విషయం కాదన్నాను. వెంటనే ఆయన కలగజేసుకుని నాకు 20 రోజులు ఎక్కడిచ్చారు, 10 రోజుల డేట్సే ఇచ్చారు అని చెప్పాడు. అప్పటిదాకా కమల్ రోజుకు సుమారు రూ.8 కోట్లు సంపాదించాడనుకున్నాను, కానీ రోజుకు రూ.15 కోట్లు ఇచ్చారని తర్వాతే తెలిసింది అని యుగి పేర్కొన్నాడు.సినిమాబ్లాక్బస్టర్గా నిలిచిన కల్కి 2898 ఏడీకి ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్లో ఉన్న స్టార్ నటీనటులందరూ సెకండ్ పార్ట్లోనూ కనిపించనున్నారు. దీపికా పదుకొణెను మాత్రం సీక్వెల్ నుంచి తప్పించారు. ఈ రెండో భాగంలో కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్కు ఎక్కువ నిడివి దక్కనుంది.చదవండి: అదృష్టవంతురాలిని.. కన్నీళ్లు ఆగడం లేదు: తనూజ -
ప్రేమలో పడ్డ కోర్ట్ జంట? రోషన్, శ్రీదేవి రియాక్షన్ ఇదే!
కోర్ట్ జంట హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి జంటగా నటించిన చిత్రం బ్యాండ్మేళం. సతీశ్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ జంట సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా వారికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆన్స్క్రీన్లో ప్రేమపాటలు పాడుకుంటున్న ఈ జంట ఆఫ్స్క్రీన్లోనూ లవ్లో ఉందని ప్రచారం జరుగుతోంది. లవ్ రూమర్స్ఇదెంతవరకు నిజం? అని యాంకర్ ప్రశ్నించాడు. అందుకు రోషన్, శ్రీదేవి స్పందిస్తూ.. కోర్ట్ మూవీ కంటే ముందే మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఇద్దరం చైల్డ్ ఆర్టిస్టులం.. ఎలా పరిచయమయ్యామో గుర్తు లేదు కానీ ఫ్రెండ్స్ అయ్యాం. అందుకే ఇంత క్లోజ్గా ఉంటాం. ఒరేయ్, పోరా అని పిల్చుకుంటాం.అది చూసి నవ్వుకుంటాంకోర్ట్ సినిమా సమయం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్గా మారాం. తెరపై మమ్మల్ని చూసి ప్రేమికులు అనుకుంటారు. ఆ కామెంట్స్ చూసి మేము నవ్వుకుంటాం. కానీ, మేము మంచి మిత్రులం మాత్రమే.. మా మధ్య ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు. తాము కేవలం మిత్రులమే అని నొక్కి చెప్పారు. బ్యాండ్మేళం విషయానికి వస్తే.. దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన బాక్సాఫీస్ వద్ద ఎంత గట్టి సౌండ్ చేస్తుందో చూడాలి!చదవండి: ఆస్తి చూసి పెళ్లి? బిగ్బాస్ బ్యూటీ ఆన్సరిదే! -
నా తల్లి నుంచి కోడలి వరకు..: చిరంజీవి పోస్ట్
స్త్రీ లేనిదే సృష్టి లేదు, సమాజం లేదు. అసలు మహిళ లేనిదే మనుగడే లేదు. నేడు (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. నా జీవితంలో తల్లి నుంచి నా జీవిత భాగస్వామి వరకు, నా కుమార్తెలు నుంచి నా కోడళ్ల వరకు, ప్రతి రూపంలో నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రపంచాన్ని ప్రేమతో, ధైర్యంతో ముందుకు నడిపిస్తున్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.మూవీస్సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి చివరగా మన శంకరవరప్రసాద్గారు సినిమాతో అలరించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతి బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే దర్శకుడు బాబీతో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో చిరంజీవి భార్యగా ప్రియమణి, కూతురిగా అనస్వర రాజన్ కనిపిస్తారని తెలుస్తోంది. అలాగే మోహన్లాల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారట! నా జీవితంలో తల్లి నుంచి నా జీవిత భాగస్వామి వరకు,నా కుమార్తెలు నుంచి నా కోడళ్ల వరకు,ప్రతి రూపంలో నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక వందనాలు.ప్రపంచాన్ని ప్రేమతో, ధైర్యంతో ముందుకు నడిపిస్తున్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 💐💐💐…— Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2026చదవండి: సెకండ్ హ్యాండ్ దుస్తులు కొంటాను: బిగ్బాస్ కంటెస్టెంట్ -
సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటాను: బిగ్బాస్ కంటెస్టెంట్
సెలబ్రిటీలు ఏం చేసినా, చేయకపోయినా విమర్శలపాలవుతూనే ఉంటారు. హిందీ బిగ్బాస్ ఓటీటీ సీజన్ 1 విన్నర్ దివ్య అగర్వాల్ పరిస్థితి కూడా ఇంతే! తరచూ ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటుంది. ఆస్తి చూసే అపూర్వ పడగోయంకర్ను పెళ్లి చేసుకుందని కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలపై తాజా ఇంటర్వ్యూలో నటి స్పందించింది.ఏమైనా అనుకోండిదివ్య అగర్వాల్ మాట్లాడుతూ.. నన్ను గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసమే సంబంధం పెట్టుకోవడం) అని పిలవాలనుకుంటే పిలుచుకోండి.. అవసరమైతే డైమండ్ డిగ్గర్ అని కూడా పిలవండి. నాకు మాత్రం నా జీవితంలో సరైన భాగస్వామి దొరికాడు. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నాకు దొరికిన అత్యంత విలువైన బంగారం ఆయనే!అవేం లేవుగాఅయినా జనం కాస్తయినా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. నేనేమైనా లంబోర్గినిలో తిరుగుతున్నానా? జుహు బీచ్ దగ్గర బంగ్లాలో ఉంటున్నానా? నాకంటూ ఓ ప్రైవేట్ జెట్ ఉందా? ఇవన్నీ లేవే.. నేను ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తాను. మరెందుకు నాపై అంత కోపం, ద్వేషం? ఆడవాళ్లు కేవలం డబ్బు చూసే పెళ్లి చేసుకుంటారని ఎందుకు తప్పుగా అనుకుంటారు?పెళ్లిఆ పెళ్లికి కారణమైన ప్రేమను చూడరా? నేనెప్పుడూ సింపుల్గానే ఉండాలనుకుంటాను, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను. అంతెందుకు.. నేను సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా కొంటుంటాను అని చెప్పుకొచ్చింది. దివ్య- అపూర్వ 2024 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఓటీటీలో ఫంకీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే? -
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి 2025 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును ప్రకటించింది. అలాగే, పైడి జయరాజ్ అవార్డుకు సహజనటుడు కమల్ హాసన్ను ఎంపిక చేసింది. ఈ మేరకు 2025 సంవత్సరం గద్దర్ చలనచిత్ర అవార్డులను జ్యూరీ శనివారం మీడియా సమావేశంలో ప్రకటించింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్నా (ది గర్ల్ఫ్రెండ్)ను ఎంపిక చేసింది. అలాగే, తొలి ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘దండోరా’, తృతీయ ఉత్తమ చిత్రంగా ‘ద గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ ఎంపికయ్యాయి. అలాగే, జాతీయ సమైక్యతను చాటే చిత్రంగా ‘తండేల్’ నిలిచింది. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును ప్రసాద్ ఐ మ్యాక్స్ యజమాని రమేష్ప్రసాద్కు ప్రకటించారు. పలువురు పాతతరం వారికి స్పెషల్ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాలను ఉగాది (ఈనెల 19న) పర్వదినాన హైటెక్స్లో ప్రదానం చేయనున్నారు. మెయిన్ స్ట్రీమ్ అవార్డ్స్ అధ్యక్షుడిగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ వ్యవహరించారు. షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ విభాగానికి కనకమేడల విజయకృష్ణ చైర్మన్ కాగా, పుస్తకాలు– సమీక్షల పరిశీలనకు తనికెళ్ల భరణి చైర్మన్గా వ్యవహరించారు. ప్రత్యేక అవార్డుల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ అధ్యక్షుడిగా వ్యవహరించారు. జ్యూరీ 2025వ సంవత్సరానికి ఎంపిక చేసిన తుది జాబితాను ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, జ్యూరీ సభ్యులు తనికెళ్ల భరణి, రోజా రమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు అందచేశారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, ప్రదానోత్సవ నిర్వహణపై వారు చర్చించారు. అనంతరం చలన చిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జ్యూరీ పురస్కారాల జాబితాను ప్రకటించింది. -
సినిమాల కౌంట్ ఫుల్.. కలెక్షన్ నిల్
వీకెండ్కి టాలీవుడ్లో ఒకేసారి 10 సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఒక్కటీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లు వెలవెలబోతూ, బుక్ మై షోలో టికెట్ల అమ్మకాలు పెద్దగా జరగట్లేదు. ఇటు చూస్తే ప్రచారం మాత్రం హోరెత్తిపోతోంది. ఎక్స్ ఓపెన్ చేస్తే చాలు సినిమాల సందడి. ఇనస్టాగ్రామ్ తెరిస్తే చాలు రీల్స్ రీల్స్ తో ప్రచారం హోరెత్తింది.గివ్-ఎవే పేరిట ఉచిత పొందిన వారు మాత్రమే మొహమాటానికి ట్వీట్లు వేస్తున్నారు. థియేటర్లలో మాత్రం ప్రేక్షకులు కనిపించడం లేదు. వచ్చిన సినిమాల్లో శ్రీవిష్ణు సినిమా ప్రయత్నమైతే గట్టిదే. నిలబడుతుందని ఊహించారు, కానీ కలెక్షన్ పరంగా ఏ మేరకు చేస్తుందో చూడాలి. సరస్వతి సినిమా పెద్దగా చప్పుళ్లు చేయలేదు. ప్రచారం గట్టిగా చేసిన సంప్రదాయిని సుప్పిని.. సినిమా అంతగా పరిస్థితి కూడా అంతే. మిగతా సినిమాల పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడం కష్టమే. వీకెండ్ అయినప్పటికీ థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. వచ్చే వారం కూడా పెద్దగా మార్పు ఉండదని అంచనా. ఎందుకంటే మరో 11 రోజులు తర్వాత పెద్ద సినిమా విడుదల కానుంది. -
విరోష్ రిసెప్షన్లో అల్లు అర్జున్ బౌన్సర్లు ఎందుకలా చేశారంటే?
కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ ఇటీవలే పెళ్లిపీటలెక్కింది. ఈ లవ్బర్డ్స్ ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. తర్వాత మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టేజీపై ఫోటో దిగేందుకు వెళ్తుండగా ఆయన వెనకాల ఉన్న ఓ వ్యక్తిని అడ్డుకుని ఆపేశారు.ఏం జరిగిందంటే?కొందు ఆయన్ను సైడ్ యాంగిల్లో చూసి జూనియర్ ఎన్టీఆర్ అనే భ్రమపడ్డారు. అల్లు అర్జున్ బౌన్సర్లు ఎన్టీఆర్ను ఆపేశారా? అని ఆశ్చర్యపోయారు. కానీ, అక్కడున్నది తారక్ కాదు, ఆయనకు డూప్గా నటించే ఈశ్వర్. తాజాగా ఈశ్వర్ అక్కడేం జరిగిందో క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్తో పాటు వీడియోలో ఉన్నది నేనే.. ఆ రోజు ఏం జరిగిందంటే? అల్లు అర్జున్ సర్ లోపలకు వచ్చే సమయంలో నేను కూడా లోనికి వెళ్తున్నాను. జూమ్ చేస్తూ పెద్దగా..స్టేజీపై ఫోటో దిగడం కోసం ఆయన సడన్గా ఆగిపోయారు. ఆయన బౌన్సర్లు ఏమనుకున్నారంటే నేను ఆయనతో ఫోటో దిగడానికి వెళ్తున్నానని భ్రమపడ్డారు. లేదంటే కెమెరాకు అడ్డొస్తానని భావించి నన్ను ఆపేశారు. అది చాలా చిన్న విషయం. దాన్ని జూమ్ చేస్తూ చాలా పెద్దగా చూపించారు. అలా వీడియో చాలా వైరల్ చేశారు. దానివల్ల నాకు కూడా మంచి రీచ్ వచ్చింది. థాంక్యూ సోమచ్ అని వీడియో షేర్ చేశాడు. ఇతడు ఆర్ఆర్ఆర్ మూవీలోని కొన్ని సన్నివేశాల్లో తారక్కు డూప్గా నటించాడు. View this post on Instagram A post shared by Eshwar Harris (@eshwarharris_1) చదవండి: అణిగిమణిగి ఉండాలి.. లేదంటే సైడ్ చేస్తారు: అషూ -
అణిగిమణిగి ఉండాలి.. ఓవరాక్షన్ చేస్తే తీసేస్తారు: అషూ
టిక్టాక్ ద్వారా జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి. డబ్ స్మాష్, రీల్స్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. ఓటీటీలో ప్రసారమైన బిగ్బాస్ నాన్స్టాప్లోనూ పాల్గొని మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది.ఇప్పటివరకు ఎన్నో చేశా..ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎప్పుడూ అభిమానులతో టచ్లో ఉండే ఈ బ్యూటీ తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్ సిరీస్లో నటించింది. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్ విన్నర్ నిఖిల్ మళయక్కల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా విక్రమ్ ఆన్ డ్యూటీ ప్రెస్మీట్లో అషూ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో స్టేజ్ పర్ఫామెన్స్లు, క్యారెక్టర్ రోల్స్, హోస్టింగ్.. ఇలా అన్నీ చేశాను. హీరోయిన్ అంటుంటే..తొలిసారి హీరోయిన్గా చేశాను. షూటింగ్లో అందరూ హీరోయిన్గారు అని పిలుస్తూ ఉంటే ఏంటి? నన్నేనా? అని ఆశ్చర్యపోయాను అంది. ఈ సమావేశంలో ఓ విలేకరి అషూను ఓ ప్రశ్న అడిగాడు. నిర్మాత ప్రవీణగారి ప్రాజెక్ట్ అంటే బోణీ బాగానే ఉంటుంది. మరి హీరోయిన్గా సినిమాలు కొనసాగిస్తారా? అని ప్రశ్న సంధించాడు.ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా..అందుకు అషూ స్పందిస్తూ.. ఆర్టిస్టులు ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా ప్రొడక్షన్ హౌస్ ఓనర్లు, నిర్మాతలు వారిని తీసేయడానికి వెనుకాడరు. సెట్లో అయినా, ఇంట్లో అయినా కొంచెం అణిగిమణిగి ఉండాలి అంది. దీంతో వెంటనే నిర్మాత మైక్ అందుకుని.. ఎవరూ అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పని వాళ్లు చేసుకుంటూ పోతే ఎవరూ ఇబ్బందిపెట్టరు. సెట్కు వచ్చినప్పటినుంచి, బయటకు వెళ్లేవరకు ఇది నా పని అని అంకితభావంతో పని చేస్తే మిమ్మల్ని ఎవరూ టచ్ కూడా చేయరు అని క్లారిటీ ఇచ్చింది.చదవండి: త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందంటే? -
త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?
హీరోయిన్ త్రిష రెండు దశాబ్దాలకు పైగా సినీప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. వర్షం సినిమాతో తెలుగులో సెన్సేషన్ సృష్టించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సరసన గిల్లిలో హీరోయిన్గా యాక్ట్ చేసి స్టార్ స్టేటస్ అందుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. అయితే ఈ బ్యూటీ దళపతి విజయ్తో ప్రేమాయణం నడుపుతుందని చాలాకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇటీవల విజయ్, త్రిష జంటగా ఓ పెళ్లికి హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే త్రిష విజయ్ కంటే ముందు వేరే హీరోలతో లవ్లో పడింది. ఆ కథేంలో ఇప్పుడు చూసేద్దాం..హీరోలతో లవ్త్రిష తమిళంలో పలువురు స్టార్స్తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శింబుకి జోడీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ముదిరి ప్రేమగా మొగ్గలు తొడిగిందట. బయటకు వెళ్లినప్పుడు కూడా చేతిలోన చెయ్యేసి మరీ నడిచేవారు.. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. ఆ తర్వాత దళపతి విజయ్తో ఎక్కువ సినిమాలు చేసిన సమయంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, కొంతకాలానికి ఆ రూమర్స్ దానంతటవే ఆగిపోయాయి.ప్రకంపనలు రేపిన సుచీలీక్స్అనంతరం త్రిష టాలీవుడ్ హీరో రానాకు క్లోజ్ అయింది. మొదట్లో వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకానొక సమయంలో ఈ స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తర్వాతెందుకో విడిపోయారు. కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సుచీలీక్స్ వ్యవహారంలో త్రిష-రానా క్లోజ్ ఫోటో ఒకటి బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తోనూ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. త్రిష వల్లే ధనుష్- ఐశ్వర్య వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.పెళ్లి క్యాన్సిల్వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ 2015లో పెళ్లికి రెడీ అయింది త్రిష. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో వివాహం రద్దు చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని కండీషన్ పెట్టాడని, అది నచ్చకనే అతడిని పెళ్లి చేసుకోలేదని త్రిష ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ధనుష్తో త్రిష అంత క్లోజ్గా ఉండటం నచ్చకే అతడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని అంటుంటారు.విజయ్తో లవ్ఇప్పుడు మరోసారి విజయ్తో ప్రేమలో మునిగి తేలుతోంది త్రిష. విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది హీరో భార్య సంగీత. ఈ సమయంలో విజయ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అందరికీ తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్తోంది. మరి విజయ్- సంగీత విడాకులు తీసుకున్నాక వీరు ప్రేమను పెళ్లి బంధంతో బలపర్చుకుంటారేమో చూడాలి!చదవండి: నోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? బుర్రసాయి మాధవ్కు వరలక్ష్మి శరత్కుమార్ కౌంటర్ -
రాహులా.. మనం సాధించాం: రష్మిక ట్వీట్ వైరల్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 జాబితాను శనివారం ప్రకటించారు. అందులో ఉత్తమ నటి అవార్డు స్టార్ హీరోయిన్ రష్మికను వరించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ చిత్రానికి గానూ రష్మికకు ఈ అవార్డు లభించింది. ఈ విషయాన్ని దర్శకుడు ఎక్స్ వేదికగా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. రాహుల్ ట్వీట్పై రష్మిక కూడా స్పదించింది. ఆయన పోస్ట్ని రీట్వీట్ చేస్తూ.. ‘రాహులా.. మనం సాధించాం’ అని రాసుకొచ్చింది. దానికి రాహుల్ రిప్లై ఇస్తూ..‘ఈ అవార్డుకి మీరు అర్హులు. థ్యాంక్యూ రష్మిక’ అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం రష్మిక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, రష్మిక ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న తన ప్రియుడు, స్టార్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది. ఈ నెల 4న హైదరాబాద్లో గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. Rahullaaaaaaa!! @23_rahulr 🥹🥹🥹🥹❤️We did it! ❤️❤️ https://t.co/kSHQ79P07p— Rashmika Mandanna (@iamRashmika) March 7, 2026 -
ఆయనలా దిగజారను.. సాయిమాధవ్కు వరలక్ష్మి కౌంటర్
వరలక్ష్మి శరత్కుమార్ స్వీయదర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సరస్వతి. సాయిమాధవ్ బుర్ర కథ అందించిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాను ఇష్టమొచ్చినట్లు మార్చేశారని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు సాయిమాధవ్. సరస్వతి సినిమా పేరు ప్రస్తావించకుండా ఓ పోస్ట్ పెట్టాడు. నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. హర్టయిన సాయి మాధవ్ఒక్కమాటైనా చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మార్చేశారు. కథను మానభంగం చేశారు. నాది రివేంజ్ డ్రామా కాదు, నా సోల్ వేరు, అసలా కథే వేరు అని పేర్కొన్నాడు. ఈ వివాదంపై తాజాగా వరలక్ష్మి శరత్కుమార్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఎవరి కథను దొంగతనం చేయలేదు. కాంట్రాక్ట్ వేసి డబ్బులు ఇచ్చాకే ఆ కథ (సరస్వతి) నాదయింది. ఆయనపై గౌరవంతో క్రెడిట్స్లో తన పేరును పొందుపరిచాం. అందుకే మార్చాంకానీ, ఆయన ఆ గౌరవాన్ని మిగుల్చుకోలేదు. ఒకవేళ నా పేరు పెట్టుంటే ఇంకా సంతోషపడేదాన్ని. నాకే సమస్య లేదు! అసలేమైందంటే.. ఆయన చెప్పిన కథ విన్న ప్రతివాళ్లు సాగదీసినట్లుగా ఉందన్నారు. పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఆ కథను యథాతథంగా ముందుకు తీసుకువెళ్లగలమేమో! కానీ మేము మంచి నటులం తప్ప పెద్ద స్టార్స్ కాదు! కాబట్టి ఆ కథను జనంలోకి ఎలా తీసుకెళ్లాలి? అని ఆలోచించాం.కథ డెవలప్ చేసుకున్నా..దానిపై చాలా వర్క్ చేశాం. ఆ సమయంలో ఆయన ఒక్కసారి కూడా స్టోరీ సిట్టింగ్కు రాలేదు. తను పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. సరేలే, బిజీగా ఉన్నారని అర్థం చేసుకున్నాను. నేనే కథను డెవలప్ చేసుకున్నాను. కనీసం ఫోన్లో అందుబాటులోకి వచ్చినా కథ మార్చామని చెప్పగలిగేవాళ్లం. అప్పుడేమో ఆయనే అలా చేసి ఇప్పుడలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. దిగజారనుఅందులోనూ కథను మానభంగం చేశారని పెద్ద పెద్ద వ్యాఖ్యలు మీలాంటి వ్యక్తి నోటి నుంచి రాకూడదు. ఇది సభ్యత అనిపించుకోదు. సెన్సిటివ్ టాపిక్పై ఎలాంటి పదాలు వాడుతున్నామనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటే బాగుండేది. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. నాకు కావాలంటే చాలా కథలు బయటకు తీసేదాన్ని, కానీ నేనలాంటి మనిషిని కాదు. నేను అందర్నీ గౌరవిస్తాను, మర్యాదిస్తాను. ఆయనలా దిగజారి నేను మాట్లాడను వరలక్ష్మి కౌంటర్ ఇచ్చింది.చదవండి: సెల్ఫీ అడిగిన పిల్లాడిని తోసేసిన రాజేంద్రప్రసాద్ -
సెల్ఫీ అడిగిన పిల్లాడిని తోసేసిన రాజేంద్రప్రసాద్
సెలబ్రిటీలన్నాక కూసింత ఓర్పు, సహనం ఉండాలి. అందులోనూ నలుగురిలో ఉన్నప్పుడు వీలైనంతవరకు శాంతంగా ఉండాలి, చిరునవ్వుతోనే కనిపించాలి. అభిమానంతో ఎవరైనా సెల్ఫీ అడిగినప్పుడు కుదిరితే ఇవ్వాలి.. లేదంటే వినమ్రంగా తిరస్కరించాలి. కానీ, అసహనం ప్రదర్శించారంటే మాత్రం ఇదిగో ఇలా రాజేంద్రప్రసాద్లా విమర్శలపాలు కావాల్సి వస్తుంది.సెల్ఫీ అడిగితే..అసలే కొంతకాలంగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటున్నాడు నటుడు రాజేంద్రప్రసాద్. తాజాగా ఈయన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య- సాక్షిల వివాహానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఓ కుర్రవాడు రాజేంద్రప్రసాద్ను చూసి ఆతృతతో సెల్ఫీ అడిగాడు. కానీ, ఆయన ఆ పిల్లాడిని అసహనంతో పక్కకు తోసేసి హడావుడిగా ముందుకు వెళ్లిపోయాడు. వీడియో వైరల్ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ ముఖకవళికలు ఆ పిల్లాడిని చీదరించుకున్నట్లుగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ఎందుకింత పొగరు చూపిస్తున్నాడు. ఒక్క సెల్ఫీ ఇస్తే ఏమవుతుంది? అసలు ఇలాంటి వాళ్లకు అటెన్షన్ ఇవ్వడం మానేయాలి అని విమర్శిస్తున్నారు. కొందరు మాత్రం.. ఆయనేదో బిజీలో ఉన్నట్లున్నారు, వదిలేయండి అని సమర్థిస్తున్నారు. మరి ఇంత బలుపు అవసరమా ?మనుషులని పురుగులు లాగా చూడటం ఏంటి ? తోస్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ ముఖ కవళికలు చూడండి 👇😡 pic.twitter.com/4jS5UG7X2l— Hungry కుక్క 🐕 (@Truth_Exposer__) March 6, 2026 చదవండి: భార్యాభర్తలిద్దరూ పని చేస్తామంటే కుదరదు: కరీనా కపూర్ -
భార్యాభర్తలిద్దరం పని చేస్తామంటే కుదరదు: కరీనా
రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని వాదించి వార్తల్లోకెక్కింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. తల్లయ్యాక అటు కెరీర్ను, ఇటు పిల్లల బాధ్యతను చూసుకోవడం కష్టమైన పని అని.. కొత్తగా తల్లయిన వారికి అందరూ మద్దతుగా నిలవాలని కోరింది. ఈ విషయంలో కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా, మరికొందరు అన్ని సినిమాలకు అది వర్కవుట్ కాదని విమర్శించారు. తల్లయ్యాక ఎలా?అటు దీపికా... పనిగంటలతో పాటు ఇతరత్రా డిమాండ్స్ కారణంగా కల్కి 2898 ఏడీ సీక్వెల్, స్పిరిట్ సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తల్లయ్యాక సినిమాలు ఎలా మేనేజ్ చేస్తున్నారన్న ప్రశ్నపై బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ద బకింగ్హామ్ మర్డర్స్ మూవీ షూట్ కోసం లండన్లో 35 రోజులు ఉండాల్సి వచ్చింది. ముందుగానే ప్లాన్ఎప్పుడు వెళ్లాలి? మళ్లీ ఎప్పుడు తిరిగి రావాలి? అనేది ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజులు షూటింగ్ అయ్యాక మధ్యలో ఇండియా తిరిగొచ్చాను. పిల్లలతో గడిపాను. ఆ సమయంలో మిగతావారిపై చిత్రీకరణ జరిపారు. నేను తిరిగి వెళ్లగానే నా పాత్ర షూటింగ్ పూర్తిచేశారు. నేను అదృష్టవంతురాలినిచిత్రయూనిట్ నన్ను అర్థం చేసుకుని సహకరించింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. పైగా ఆ సమయంలో సైఫ్ ఇంట్లో పిల్లలతోనే ఉన్నాడు. మేమిద్దరం పని కోసం పరిగెడుతూ ఇంట్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేయలేము. ఒకరు పని చేస్తున్నప్పుడు మరొకరు ఇంటిపట్టున ఉండి పిల్లల్ని చూసుకోవాలి. అలా అర్థం చేసుకునే భాగస్వామి ఉండాలి అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.చదవండి: రణ్బీర్ కపూర్ ప్లేటు నిండా చిప్స్.. అంతా ఒక్కడే తింటాడా? -
రణ్బీర్ కపూర్ ప్లేటు నిండా చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్..
మూడేళ్ల క్రితం వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాసిందో అందరం చూశాం. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.915 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నా సోదరుడిగా నటించాడు శ్రీనాథ్ మాగంటి.మర్చిపోలేని అనుభవంఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్బీర్పై ప్రశంసలు కురిపించాడు. యానిమల్ సినిమాలో నటించడం అస్సలు మర్చిపోలేను. రణ్బీర్ తాత రాజ్కపూర్ పెద్ద స్టార్, తండ్రి రిషి కపూర్ గొప్ప స్టార్,.. రణ్బీర్ కూడా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఆయన అంకిత భావంతో పని చేస్తాడు. సెట్కు భారీ సిబ్బందిని వెంటేసుకుని రాడు. ఒక ప్లేటు నిండా చాక్లెట్స్, చిప్స్తను వచ్చినప్పుడల్లా ప్లేటు నిండా ఆరోగ్యకరమైన చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు వెంటపట్టుకుని వస్తాడు. అవన్నీ కేవలం తనకోసమే కాదు, తన చుట్టుపక్కల ఉన్నవారి కోసం కూడా! ఎవరికి ఆకలైతే వారు తీసుకుని తినవచ్చు. కసారి నేను ఆ ప్లేటులోని స్నాక్ తీసుకుని తిన్నాను. ఇంతలో ఓ వ్యక్తి అది సార్ది అన్నాడు. సర్, ఈ ప్లేటంతా తింటాడా? అని అడిగాను. మా మాటలు విన్న రణ్బీర్.. నన్ను వారించిన వ్యక్తిని మూర్ఖుడా.. అతడిని తిననివ్వు అని చెప్పాడు.సినిమాఅతడిని ఏదో కోపంతో తిట్టలేదు, ప్రేమ, చనువుతోనే అతడిని వారించి నన్ను తినమమన్నాడు అని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం రణ్బీర్ రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది దీపావళిలో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. దీని తర్వాత యానిమల్కు సీక్వెల్గా తెరకెక్కనున్న యానిమల్ పార్క్లో భాగం కానున్నాడు.చదవండి: ఆస్కార్ నుంచి ఆహ్వానం -
కరీనా కపూర్లా చూపిస్తానన్నాడు.. అందుకే బికినీ ధరించా!
హీరోయిన్ ప్రియమణి సినీ జర్నీ తెలుగు సినిమాతోనే మొదలైంది. ఎవరే అతగాడు (2003) మూవీతో కథానాయికగా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. తాజాగా సరస్వతి సినిమాతో పలకరించింది.డైరెక్టర్ అడగడంతో..ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది ప్రియమణి. ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో బికినీ ధరించిన ఘటన గురించి గుర్తు చేసుకుంది. ప్రియమణి మాట్లాడుతూ.. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు చీర కట్టుకుని వెళ్లం కదా.. ఏది కంఫర్ట్గా ఉంటే ఆ దుస్తులే ధరిస్తాం. ద్రోణ సినిమాలో స్విమ్ సూట్ వేసుకోమని డైరెక్టర్ అడిగాడు. కరీనా కపూర్లా..టషన్ మూవీలో కరీనా కపూర్లా నిన్ను డిఫరెంట్గా చూపించాలనుకుంటున్నా అన్నాడు. ఇంతవరకు నేను ఎప్పుడూ స్విమ్సూట్ వేయలేదు, ఒకసారి ట్రై చేద్దాం అని ఓకే చెప్పాను. ఆ తర్వాత చాలా కామెంట్స్ వచ్చాయి. ట్రోలింగ్స్ జరిగాయి. నటిగా ఉన్నప్పుడు పరిస్థితి డిమాండ్ చేస్తే అలాంటి డ్రెస్ వేసుకోక తప్పదు. కానీ మన సౌకర్యం కూడా చూసుకోవాలి. ఇప్పుడు అడిగితే మాత్రం నేను కచ్చితంగా చేయనని చెప్పేస్తాను అని ప్రియమణి పేర్కొంది.చదవండి: ఇది కరెక్ట్ కాదు.. విజయ్పై నటి ఫైర్ -
ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను లెక్కచేయవా? విజయ్పై ఫైర్
స్టార్ హీరో విజయ్- సంగీత విడాకుల వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నేళ్లుగా ఓ నటితో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆ కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంగీత తన విడాకుల పిటిషన్లో పేర్కొంది. దీంతో విజయ్- సంగీత విడాకులకు హీరోయిన్ త్రిష కారణమా? అన్న చర్చ మొదలైంది.విడాకులుఆన్స్క్రీన్పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్లోనూ విజయ్- త్రిష ప్రేమాయణం నడుపుతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. సంగీత విడాకుల పిటిషన్ వేసిన తర్వాత విజయ్.. దర్జాగా త్రిషను తీసుకుని ఓ పెళ్లికి హాజరయ్యాడు. జంటగా నిల్చుని ఫోటోకు పోజిచ్చాడు. ఇది చాలామంది అభిమానులకు మింగుడుపడలేదు. ఇప్పటికే విజయ్- సంగీత కలిసుండాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. అలాంటి సమయంలో భార్యతో కలిసుండే ప్రసక్తే లేదని హింటిస్తూ ఇలా త్రిషతో పెళ్లికి వెళ్లడం అందర్నీ షాక్కు గురి చేసింది.అవతలివారి బాధను లెక్కచేయరా?ఈ వ్యవహారంపై విజయ్ అభిమాని, నటి సనం శెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్, త్రిష పెళ్లికి హాజరైన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను ఇసుమంతైనా పట్టించుకోకపోవడం విచారకరం. ఎంతోకాలంగా అభిమానిస్తున్న మాలాంటివాళ్లను మీరు తీవ్రంగా నిరాశపర్చారు అని రాసుకొచ్చింది. ఆమె కామెంట్స్ను కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం విమర్శించారు.ఎవరీ సనం శెట్టి?కాగా సనం శెట్టి విజయ్కు వీరాభిమాని. కరూర్ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా విజయ్ తప్పు లేదని బాధితులే చెప్పారంటూ అతడిని వెనకేసుకొచ్చింది. కానీ, ఈసారి మాత్రం భార్య బాధను పట్టించుకోకుండా ఇలా ప్రేయసితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం సభ్యత కాదని చురకలంటించింది. సనం శెట్టి.. తమిళ బిగ్బాస్ నాలుగో సీజన్లో పార్టిసిపేట్ చేసింది. తెలుగులో శ్రీమంతుడు, ప్రేమికుడు, సింగం 123 చిత్రాల్లో యాక్ట్ చేసింది.చదవండి: అప్పుడు భార్యను కొట్టి.. ఇప్పుడు అందరి ముందు క్షమాపణలు చెప్పిన మాస్క్ మ్యాన్ -
తండ్రి లేకపోయినా ఆయన కల నెరవేర్చిన కూతురు
పిల్లలు ప్రయోజకులైతే చూడాలని ఏ తల్లిదండ్రులు ఆశపడరు. కానీ ఆ ఆశ తీరకముందే తనువు చాలించాడు కళాభవన్ మణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన 2016 మార్చి 6న మరణించాడు. తండ్రి లేకపోయినా ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కూతురు శ్రీలక్ష్మి. తనను డాక్టర్గా చూడాలన్న తండ్రి కలను నిజం చేసింది.తండ్రి కల సాకారంఈ విషయాన్ని కళాభవన్ మణి సోదరుడు, డాక్టర్ ఆర్ఎల్వీ. రామకృష్ణన్ వెల్లడించాడు. మణి ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తోంది. ఆమెను పేదలకు వైద్యం చేసే డాక్టర్గా చూడాలని మణి ఎన్నో కలలు కన్నాడు. అతడు కోరుకున్నట్లే తను వైద్యురాలయింది. తన కుమార్తెను డాక్టర్ చేయాలని, పేదలకు ఉచిత చికిత్స అందించే ఆస్పత్రి ప్రారంభించాలన్నది మణి ఆశయం.డాక్టర్ విద్య పూర్తిఈ విషయాన్ని తనెప్పుడూ బయటకు చెప్తూ ఉండేవాడు. తండ్రి మరణించిన బాధలోనే శ్రీలక్ష్మి పదో తరగతి పరీక్షలు రాసింది. అయినా తనకు మంచి మార్కులొచ్చాయి. కాలేజీలోనూ అద్భుతమైన మార్కులు సాధించింది. డాక్టర్ కోర్సులో చేరేందుకు రెండేళ్ల శిక్షణ తీసుకుంది. అలా MBBSలో సీటు సంపాదించుకుంది. కూతురి కోసం నిమ్మి (కళాభవన్ భార్య) కూడా కాలేజీ దగ్గర్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని అక్కడే నివసించింది అని పేర్కొన్నాడు.ఆటో నడిపి సినిమాల్లో..కళాభవన్ మణి మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు. బతుకు బండి ముందుకు సాగడం కోసం ఆటో నడిపాడు. కెప్టెన్ ప్రభాకరన్ అనే తమిళ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్గా పని చేశాడు. 1996లో వచ్చిన సల్లప్పం అనే మలయాళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్గా అనేక సినిమాలు చేశాడు. ఆ తర్వాత సహాయక పాత్రలు చేశాడు.తెలుగు సినిమావాసంతియుమ్ లక్ష్మియుం పిన్నె నిజానుం సినిమాలో అంధ సింగర్గా నటించగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత కామెడీ, సహాయక పాత్రలకే పరిమితం కాకుండా విలన్గా ట్రై చేశాడు. తెలుగులో జెమిని, అర్జున్, ఆయుధం, నరసింహుడు, ఎవడైతే నాకేంటి, నగరం.. ఇలా అనేక సినిమాలు చేశాడు. ప్లే బ్యాక్ సింగర్గానూ టాలెంట్ చూపించాడు. నటుడిగా దాదాపు 200 సినిమాలు చేసిన ఆయన అతిగా మద్యం తాగి రక్తం కక్కుకుని చనిపోయాడు.చదవండి: డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన నయనతార దంపతులు -
డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ కొత్తిల్లు కొనుగోలు చేశారు. తమిళనాడు చెన్నైలోని పోయిస్ గార్డెన్లో డూప్లెక్స్ అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు. దీని ధర దాదాపు రూ.31.5 కోట్లు అని తెలుస్తోంది. సూపర్స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఉన్న ఏరియాలోనే నయన్ జంట ఈ ఇల్లు కొనడం విశేషం. డూప్లెక్స్ అపార్ట్మెంట్ తేనాంపేటలోని లెగసీ ప్రాజెక్ట్లో నాలుగు, ఐదవ అంతస్తుల్లో ఈ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఉంది. ఇది 14,369 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాను కలిగి ఉంది. దీని ధర చదరపు అడుగుకు రూ.21,946గా ఉంది. ఈ అపార్ట్మెంట్కు 8 కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించారు. కాగా లేడీ సూపస్టార్ నయనతారకు కేరళలో పూర్వీకుల ఇల్లు ఉంది. సినిమాహైదరాబాద్లోని బంజారాహిల్స్లో రెండు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చెన్నై, కేరళలోని ఇతర ప్రాంతాల్లోనూ తనకు ప్రాపర్టీలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే నయనతార చివరగా మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో అలరించింది. ప్రస్తుతం టాక్సిక్ సహా నాలుగైదు మూవీస్ చేస్తోంది.చదవండి: హీరోయిన్ను అవమానించిన యామీ గౌతమ్? -
బ్యాండ్ మేళం: రామ్ మిరియాల పాడిన బ్రేకప్ సాంగ్ రిలీజ్
కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా సినిమా నుంచి రాజమ్మ అనే మరో పాట వదిలారు.బ్రేకప్ సాంగ్'రాజమ్మ ఇడిసిపోయిందిరో.. రాజమ్మ పొడిసిపోయిందిరో.. నన్నింకా మరిసిపోయిందిరో..' అంటూ హీరో బ్రేకప్ సాంగ్ పాడుతూ బాధతో స్టెప్పులేస్తున్నాడు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ చేకూర్చగా రామ్ మిరియాల ఆలపించాడు.సినిమాబ్యాండ్ మేళం విషయానికి వస్తే.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మించారు. నిజానికి ఈ సినిమా మార్చి 13న విడుదల కావాల్సింది. కానీ దాన్ని పదమూడు రోజులపాటు వాయిదా వేశారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
కృతీని అవమానించిందా? చిల్లర పనులు చేయనన్న హీరోయిన్
హీరోయిన్ కృతిసనన్పై యామీ గౌతమ్ అసూయతో రగిలిపోతుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన జీ సినీ అవార్డ్స్ ఈవెంట్లో కృతి సనన్ 'తేరే ఇష్క్ మే' సినిమాకుగానూ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. అయితే ఈ విజయాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పుట్టుకొచ్చాయి. లైక్ కొట్టడంతో వివాదంకృతీ సనన్కు బదులుగా హక్ సినిమాకుగానూ యామీ గౌతమ్కు ఉత్తమ నటి అవార్డు రావాల్సిందని ఓ వీడియో క్రియేట్ చేశారు. అయినా అవార్డు గెలిస్తే మాత్రమే ఉత్తమ నటి అన్న అభిప్రాయాన్ని తాను ఏకీభవించను. ఈ అవార్డులను పట్టించుకోను అంటూ యామీ గతంలో అన్న మాటల్ని ఆ వీడియోలో పొందుపరిచారు. కృతిని విమర్శిస్తున్న ఆ పోస్టుకు యామీ లైక్ కొట్టడంతో వివాదం మొదలైంది. అవమానించనుతాజాగా ఈ వ్యవహారంపై యామీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. ఒక నటిని అవమానించేలా ఉన్న వీడియోను నేను లైక్ చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ప్రతిరోజు ఎంతోమంది మమ్మల్ని ట్యాగ్ చేస్తూ ఉంటారు. అలా వాటిని చూసే క్రమంలో పొరపాటున లైక్ పడి ఉండవచ్చు. అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా నేను లైక్ చేయలేదు.క్లారిటీనా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి చిల్లర పబ్లిసిటీ స్టంట్లు చేయలేదు. నా పనేంటో నేను చూసుకుని ముందుకు కదిలాను. క్లిక్బైట్ వార్తల కోసం ఇలాంటి చిన్న విషయాల్ని పెద్దది చేయకండి. నాకంటూ మంచి పేరు, గౌరవం ఉందని ఆశిస్తున్నాను. నాకెటువంటి పీఆర్ టీమ్ లేదు. అలాగే అవార్డులపై నా అభిప్రాయాన్ని గతంలోనే వెల్లడించాను. నేను కేవలం నా పనిపైనే దృష్టి పెడతాను అని యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది. The reel Yami is referring to - pic.twitter.com/phE5GTvjUp— Pan India Review (@PanIndiaReview) March 5, 2026చదవండి: క్యూటీ.. నీవల్లే ఇదంతా: అల్లు అర్జున్ పోస్ట -
క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం
టాలీవుడ్ స్టార్ జంట అల్లు అర్జున్- స్నేహ నేడు (మార్చి 6న) 15వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్ధాంగితో దిగిన ఫోటోను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హ్యాపీ యానివర్సరీ క్యూటీ.. మనది 15 ఏళ్ల బంధం.. నువ్వు లేకపోయుంటే ఈ జర్నీ ఇలా ఉండేదే కాదు అని అందమైన క్యాప్షన్ జోడించాడు. ఇది చూసిన అభిమానులు బన్నీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.లవ్ ఎట్ ఫస్ట్ సైట్సినిమాల్లో లవర్బాయ్గా మెప్పించిన అల్లు అర్జున్ నిజజీవితంలో కూడా తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. అమెరికాలో చదువు ముగించుకుని వచ్చిన స్నేహను ఒక స్నేహితుడి పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. మనసులు కలిశాయి. కానీ పెద్దలు ఒప్పుకోలేదు.పెళ్లిఒకరిని విడిచి మరొకరం ఉండలేమని తేల్చి చెప్పేశారు. దాంతో వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. అలా 2010 నవంబర్ 26న అల్లు అర్జున్- స్నేహ నిశ్చితార్థం జరిగింది. 2011 మార్చి 6న వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. 2014లో వీరికి కుమారుడు అయాన్ జన్మించగా.. మరో రెండేళ్లకు కూతురు అర్హ పుట్టింది. బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే.. వీలు కుదుర్చుకుని మరీ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తుంటాడు. వారితో కాలక్షేపం చేస్తుంటాడు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
నేడు థియేటర్లలోకి ఒకేసారి 10 సినిమాలు.. బాక్సాఫీస్కు ఊపిరి పోస్తాయా?
తెలుగు రాష్ట్రాల్లో గత వారం నుంచి థియేటర్లు పెద్దగా సందడిగా కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చాలా థియేటర్లలో ఖాళీ సీట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్కు ఊపిరి పోయేలా ఈ శుక్రవారం ఒకేసారి దాదాపు 10 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా చిన్న చిత్రాలే ఉండటం విశేషం. పెద్దగా బజ్ లేకుండానే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో కొంతమేరకు ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం మృత్యుంజయ. హీరో శ్రీ విష్ణు ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. గత వారం విష్ణు విన్యాసంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఈ వీకెండ్ మృత్యుంజయతో మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సినిమా సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఉంటుందని, ఇందులో కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కంటే థ్రిల్లింగ్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు.మరో చెప్పుకోదగ్గ సినిమా సరస్వతి. ఈ చిత్రాన్ని నటి వరలక్ష్మీ శరత్కుమార్ స్వయంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాదు ఈ సినిమాను ఆమెనే నిర్మించారు. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాదవ్ కథ అందించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. కథ బలంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.ఇవే కాకుండా సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని అనే చిత్రం కూడా ఈ వారం విడుదలవుతోంది. ఇందులో శివాజీ , లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను మొదట ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.ఇవి కాకుండా కాన, మాన్షన్ హౌజ్ మల్లేష్, కాక్రోచ్, విధాత వంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్ నటించిన మున్నా సినిమాను రీ-రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నటి లావన్య త్రీపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి సినిమా మాత్రం చివరి నిమిషంలో వాయిదా పడింది. మొత్తానికి పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ ఒకేసారి పది సినిమాలు విడుదలవుతుండటంతో ఈ వారం బాక్సాఫీస్లో కొంత కదలిక కనిపిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ప్రేక్షకులు ఈ సినిమాలను ఎలా స్వీకరిస్తారో చూడాలి. -
విరోష్ రిసెప్షన్లో రాజకీయ నాయకులు
-
మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి.. మేము ఆడవాళ్ళం బొమ్మలు కాదు
-
రవితేజకు అవమానం.. అడ్డమైనవాళ్లు తింటారన్న నిర్మాత
ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేశాడు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో అటు కోన వెంకట్కు, ఇటు రవితేజకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా వీరి కాంబినేషన్ రిపీట్ అయింది. వెంకీ, భగీరథ, షాక్, డాన్ శీను, బలుపు, పవర్ సినిమాల్లో కలిసి పని చేశారు. అయితే రవితేజ హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. భోజనం చేస్తుండగా..ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న ఘోర అవమానాన్ని తాజాగా కోన వెంకట్ బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సెట్లో కొన్నిసార్లు కొందరు దారుణంగా మాట్లాడతారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భోజనం చేస్తుండగా చూసిన ఓ నిర్మాత.. లంచ్ టైమ్లో అడ్డమైనవాళ్లందరూ వచ్చి తింటారు అని చీదరించుకున్నాడు. ఎవడొస్తే వాడికి భోజనం పెడతావా? నీది కాదు కదా సొమ్ము అని వడ్డించినవాడిని తిట్టాడు. లెవల్ చూపించమన్నా..ఆ అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్తే షాకైపోతారు.. ఆయన మరెవరో కాదు, రవితేజ! అలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు. కష్టాలను దాటుకుని తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు అదే నిర్మాత రవితేజ డేట్స్ కోసం వెంటపడ్డాడు. నిన్ను అవమానించిన అతడికి నీ లెవలేంటో చూపించు, పొరపాటున కూడా డేట్స్ ఇవ్వకు అని నేను సలహా ఇచ్చాను.అదే అసలైన విజయంకానీ రవితేజ నా మాట వినలేదు. ఆ నిర్మాతకు డేట్స్ ఇచ్చి, అతడి బ్యానర్లోనే హిట్టు కొడితేనే నా దృష్టిలో అసలైన విజయం అన్నాడు. చెప్పినట్లుగానే అతడి బ్యానర్లో సినిమా చేసి విజయం సాధించాడు. రవితేజ స్థానంలో నేనుంటే మాత్రం సినిమా చేసేవాడిని కాదు అని కోన వెంకట్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ నిర్మాత ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు.చదవండి: తనూజకు గోల్డ్ గిఫ్ట్ ఇచ్చిన దువ్వాడ మాధురి -
ప్రెగ్నెన్సీ కష్టాలు చూశా.. తనే నా మిరాకిల్ బేబీ: ప్రియాంక
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2018లో సింగర్ నిక్ జోనస్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో సరోగసి ద్వారా కూతురు మాల్తీ మేరీ జన్మించింది. అయితే పుట్టినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా లేకపోగా ఆమెకు రక్తమార్పిడి చేయాల్సి వచ్చింది. పొత్తిళ్లలో ఎత్తుకుని నవ్వులు పంచాల్సిన చిన్నారి ఆపరేషన్ థియేటర్లో పోరాడుతుంటే ప్రియాంక దంపతుల మనసు తల్లడిల్లిపోయింది. కానీ, వీరి ప్రార్థనలు ఫలించి మాల్తీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చింది. మిరాకిల్ బేబీఆనాటి సంగతులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది ప్రియాంక చోప్రా. ప్రియాంక మాట్లాడుతూ.. నాకు ప్రెగ్నెన్సీలు కలిసిరాలేదు. చాలా కష్టాలు చూశాను. అప్పుడు నాకు (సరోగసి ద్వారా) మిరాకిల్ బేబీ పుట్టింది. తను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన మరుక్షణం నాకింక ఏమీ కనిపించలేదు. సమస్తం ఆగిపోయినట్లే అనిపించింది. మాల్తీ ఏం చేస్తుందో? కాకపోతే తనగురించి ఎప్పటికీ భయపడుతూనే ఉంటాను. తను స్కూల్లో ఉన్నా.. నేను వేరే దేశంలో ఉన్నా.. మాల్తీ ఏం చేస్తుందో? ఎలా ఉందో? అని నా గుండె తనకోసమే కొట్టుకుంటూ ఉంటుంది. తను జోక్స్ చెప్తుంది, గొంతెత్తి పాడుతుంది. నన్ను, నా భర్తను, మా కుటుంబం మొత్తాన్ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. నా జీవితంలో తనే గొప్ప బహుమతి. నా ఆలోచనంతా తన చుట్టూనే..తను వచ్చాకే నా ప్రాధాన్యతలన్నీ మారిపోయాయి. మొదటి, చివరి ఆలోచన తన గురించే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ప్రియాంక ఇటీవలే ద బ్లఫ్ అనే హాలీవుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం వారణాసి అనే సినిమా చేస్తోంది. రాజమౌళి దర్శకత్వం మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.చదవండి: కాళ్లు పట్టుకుని బతిమాలా.. నేను చనిపోయాక అయినా! -
దేవిశ్రీ ప్రసాద్కి అవమానం.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
సంగీతం దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు, మ్యూజిక్ లవర్స్కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెలోడీ అయినా.. ఐటమ్ సాంగ్ అయినా డీఎస్పీ తర్వాతే ఎవరైనా..అనేలా మ్యూజిక్తో మ్యాజిక్ చేస్తాడు. ఆయన సంగీతం వల్లే కొన్ని చిత్రాలు హిట్ అయ్యాయి. అలాంటి సంగీత దర్శకుడిని అవమానించారంటూ మైత్రీ మూవీస్ సంస్థతో పాటు దర్శకుడు హరీశ్శంకర్పై డీఎస్పీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం విషయంలో తలెత్తిన వివాదమే ఇందుకు కారణం.డీఎస్పీ అవుట్..తమన్ ఇన్పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్. మార్చి 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. బ్యాగ్గ్రౌండ్ స్కోర్ అందించడంలో బిజీ అయ్యాయని ఓ ఈవెంట్లో స్వయంగా దేవిశ్రీనే చెప్పాడు. కానీ ఇప్పుడేమో ఈ మూవీకి బీజీఎం తమన్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిది.Two stalwart musicians join hands for PSPK ❤🔥#UstaadBhagatSingh songs by @ThisisDSP & the background score by @MusicThaman are going to be a treat 💥💥This will be a grand celebration and a lifetime memory for fans ❤️POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14… pic.twitter.com/060Vz0ONFK— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2026రెండోసారి..మైత్రీ మూవీ మేకర్స్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య గ్యాప్ వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పుష్ప 2 రిలీజ్ సమయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమాకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వేరే సంగీతం దర్శకులను రంగంలోకి దించారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్సింగ్ విషయంలోనూ అదే చేశారు. రిలీజ్కి 20 రోజుల ముందు బీజీఎం తమన్ చేస్తున్నట్లు ప్రకటించి, షాక్ ఇచ్చారు. Request💔:#DeviSriPrasad #DSP @ThisIsDSP Garu #UstaadBhagatSingh & Future Films,Any Projects solo Gane Cheyandi Songs & BGMs. Duo & Collaboration Chesedhi Talent Vallu. Miku Avasaramledhu. Dayachesi Encourage Kuda Cheyodhu 🙏.Also Any Productions@MythriOfficial,@UBSTheFilm pic.twitter.com/fRwbgMZUGj— DSP & Harris jayaraj🎶 (@entertynmentfan) March 4, 2026వర్క్ నచ్చలేదా?ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎం గురించి గతంలో దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్ల వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బీజీఎం ఆల్మోస్ట్ అయిపోయిందని అన్నారని, మరి ఇప్పుడు తమన్ ను తీసుకోవడం ఏంటీ అని డీఎస్పీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. వర్క్ నచ్చలేదా? లేదా దేవిని అవమానించడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇకపై మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమాలు చేయొద్దు అంటూ దేవికి విజ్ఞప్తి చేస్తున్నారు. Why so much negitivity on #Devisriprasad, todays generation kids dont know the value of him. Anyhow people more interested on copycat only not with the original composers..#DSP— Tanneru Ravi Teja (@rav4467) March 5, 2026 -
చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నా: బండ్ల గణేశ్
బండ్ల గణేశ్ మొదట నటుడిగానే అందరికీ పరిచయం. ఆ తర్వాత ఆంజనేయులు చిత్రంతో నిర్మాతగా మారాడు. తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంటి పలు చిత్రాలు నిర్మించాడు. దాదాపు దశాబ్దకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. బీజీ బ్లాక్బస్టర్స్ పేరుతో రెండో నిర్మాణ సంస్థ ప్రారంభించాడు.అంత టైం లేదుతాజాగా ఈయన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రయూనిట్తో ప్రత్యేకంగా సంభాషించాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. నాకు యాక్టింగ్ చేసే సమయం లేదు. నాదగ్గర వెయ్యి మంది పని చేస్తున్నారు. నేను షూటింగ్స్కు వెళ్లి యాక్టింగ్ చేసుకుంటూ కూర్చుంటే నా వ్యాపారం దెబ్బతింటుంది. చిరంజీవి సినిమాలో..కాకపోతే నా మనసుకు నచ్చి ఈ వేషం నేను వేయాల్సిందే అనిపించిన రోల్స్ మాత్రం స్వీకరిస్తాను. ఇప్పుడు చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. నాకు ఓ వేషం వేయాలని కోరిక ఉంది. అది నా బ్యానర్లోనే నిర్మించి ఆ రోల్ నేనే చేస్తాను, కచ్చితంగా సూపర్ హిట్ కొడతాను అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు. కాగా చిరంజీవి- బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనే బండ్ల గణేశ్ యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ -
'రైరై రారా' పాట రాసేందుకు 2 నెలలు: అనంత శ్రీరామ్
ఒక మంచి పాట రాయడం, మాస్ పాట రాయడం అనేది కష్టం కాదు. కానీ, పెద్ది సినిమా కోసం రై రై రా రారా.. పాటలో మాస్ పరిభాషలో ఫిలాసఫీ చెప్పడం అనేది కత్తిమీద సాములా అనిపించింది. రెహమాన్ గారి బాణీ అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాను. ఈ పాట రాయడానికి దాదాపు రెండు నెలలు పట్టింది అని పాటల రచయిత అనంత శ్రీరామ్ తెలిపారు.పెద్ది సెకండ్ సాంగ్రామ్చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీశ్ కిలారు నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి రై రై రారా.. అంటూ సాగే రెండో పాటను మార్చి 2న విడుదల చేశారు.అదే జరిగితే..ఈ పాట రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్తో టాప్ వన్లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట రాసిన అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. రామ్చరణ్గారి రుద్రతాండవం, రెహమాన్ గారి ధీర శంఖారావం, రత్నవేలుగారి చిత్రీకరణలో ఉన్న మాయాజాలం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ.. వీటన్నిటి మధ్యలో నుంచి కూడా రై రై రారా.. పాటలోని లిరిక్స్ బాగున్నాయి అనడం.. సాహిత్యానికి ప్రశంసలు రావడం ఆనందాన్నిచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాళ్లు ఆ ఆలోచన విరమించుకునేలా నా పాట స్ఫూర్తి నింపితే నా రచన సార్థకమైనట్లే అని చెబుతుంటాను. ఆ లక్షణం ఈ పాటకు ఉంది అని చెప్పాడు. -
విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నటుడు విజయ్ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎడాపెడా చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్లో శింబు హీరోగా నటిస్తున్న అరసన్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్న ఈయన తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.బాలీవుడ్ బ్యూటీవిడాముయుర్చి ఫేమ్ మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించనున్నట్లు భోగట్టా! ఇకపోతే ఇందులో విజయ్ సేతుపతికి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్కుగానీ ఆమె ఒప్పుకుంటే కోలీవుడ్లో మరో క్రేజీ కాంబో షురూ అయినట్లే! మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!


