breaking news
Cinema News
-
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్గా, వేశ్యగా..
ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్. బాలీవుడ్లో అనేక సక్సెస్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులోనూ ఒకటీరెండు సినిమాల్లో మెప్పించింది. ప్రాణాంతక క్యాన్సర్తో పోరాడి మహమ్మారిపై విజయం సాధించింది. మరి ఎవరో గుర్తుపట్టారా? తనే మనీషా కొయిరాలా.చిన్నతనంలోనే..చిన్నప్పుడు మహారాజు గెటప్ వేసిన ఫోటోను మనీషా కొయిరాలా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో గుబురు మీసం, పెద్ద బొట్టు, భారీ అలంకరణతో ఠీవీగా కనిపిస్తోంది. ఇది చూసిన అభిమానులు నటనను చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకుందని కామెంట్లు చేస్తున్నారు. మనీషా.. ఫెరి బేతాల అనే నేపాలీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సౌదగర్ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. సినిమాతక్కువకాలంలోనే స్టార్ హీరోయి్గా మారింది. 1942: ఎ లవ్స్టోరీ, అకేలే, హమ్ అకేలే తుమ్, ఖామోషి: ద మ్యూజికల్, దిల్సే, కంపెనీ, తాజ్ మహల్, భూత్ రిటర్న్స్ ఇలా అనేక సినిమాలు చేసింది. బాంబే, ఇండియన్ (భారతీయుడు), ముదల్వన్ (ఒకే ఒక్కడు), బాబా, మప్పిళ్లై వంటి చిత్రాలతో తమిళంలోనూ క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో నాగార్జున క్రిమినల్ మూవీ చేసింది.క్యాన్సర్పై పోరాటంమనీషా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో తన జీవిత ఒక్కసారి కుదుపునకు లోనైంది. 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడింది. మంచి చికిత్స, మనోధైర్యంతో క్యాన్సర్ను జయించింది. ఈమె చివరగా 'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్ సిరీస్లో మల్లికాజాన్ అనే వేశ్యపాత్రలో యాక్ట్ చేసింది. గతేడాది లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందింది.చదవండి: పెళ్లిరోజు గిఫ్ట్గా విడాకులు: బాలీవుడ్ నటి -
పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకుల పత్రం..: నటి
పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ తన భర్త విడాకుల పత్రం ఇచ్చాడంటోంది బాలీవడ్ నటి సెలీనా జైట్లీ. భర్త పీటర్ హగ్పై గృహహింస వేధింపుల కేసు పెట్టిన ఆమె తాజాగా తన పిల్లలు దూరమవుతున్నారంటూ అల్లాడిపోతోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఆస్ట్రియాను వదిలేసి వచ్చినరోజు నుంచి నా పిల్లలకు దూరమయ్యాను. దారుణమైన వైవాహిక జీవితాన్ని అనుభవించిన ఎంతోమంది మహిళలకు, పురుషులకు చెప్తున్నా.. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కరే లేరు. నేను కూడా బాధితురాలినే..పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకులు..సెప్టెంబర్ నెల మొదట్లో నా భర్త 15వ పెళ్లిరోజు గిఫ్ట్ అంటూ విడాకుల పత్రం నా చేతిలో పెట్టాడు. పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ.. నేను స్నేహపూర్వకంగా విడిపోవడానికే నిర్ణయించుకున్నాను. కానీ, అతడు మాత్రం నేను పెళ్లికి ముందు సంపాదించిన ఆస్తులు కావాలని అడిగాడు, అసంబద్ధమైన కండీషన్లు పెట్టాడు. వేధింపులు తట్టుకోలేక..అతడి వేధింపులు తట్టుకోలేక 2025 అక్టోబర్ 11న ఉదయం ఒంటిగంటకు ఆస్ట్రియాను వదిలేసి ఇండియాకు వచ్చేశాను. అప్పుడు నా అకౌంట్లో చాలా తక్కువ డబ్బు ఉంది. పీటర్ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఇండియాలో నేను కొనుక్కున్న నా ఇంట్లో ప్రశాంతంగా బతకాలనుకున్నాను.పిల్లలకు దూరంఆ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా దానిపై ఆజమాయిషీ చూపించాలనుకున్నాడు. దీంతో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మరో విషయం.. ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు పిల్లల బాధ్యతను మా ఇద్దరికీ అప్పజెప్పింది. జాయింట్ కస్టడీ అని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నా ముగ్గురు పిల్లలతో నన్ను మాట్లాడనివ్వడం లేదు.శత్రువుగా చిత్రీకరిస్తున్నారుపిల్లల్ని నాకు వ్యతిరేకంగా మార్చేస్తున్నారు. వారికి ప్రేమను పంచడం తప్ప ఏదీ తెలియని తల్లిని శత్రువుగా చిత్రీకరిస్తున్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది. సెలీనా జైట్లీ, పీటర్ హగ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. సెలీనా.. గోల్మాల్ రిటర్న్స్, నో ఎంట్రీ, మనీ హైతో హనీ హై, థాంక్యూ సినిమాల్లో యాక్ట్ చేసింది. -
బాలీవుడ్ పీఆర్ కల్చర్పై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతి దానికీ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గత రెండేళ్లలో బాలీవుడ్లో పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు పీఆర్ అంటే మన గురించి, మన సినిమాల గురించి మంచి మాటలు ప్రచారం చేయడం. ఇప్పుడు ప్రమోషన్ అనేది ఇతరులను తక్కువగా చూపించే స్థాయికి వెళ్లింది. ఇతరులను కిందికి లాగడానికి కూడా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మన ప్రతిభను కూడా డబ్బుతోనే ముడిపెడుతున్నారు’’ అని హీరోయిన్ తాప్సీ(Taapsee Pannu) పేర్కొన్నారు. ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడే తాప్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పీఆర్ వ్యవస్థ గురించి మాట్లాడారు. ‘‘నేను నా పనులతో చాలా బిజీగా ఉన్నాను. రెండేళ్లుగా వర్క్లో స్పీడ్ తగ్గించాను. ఏడాదిన్నర నుంచి ఇండస్ట్రీలోని పీఆర్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఇక్కడ ప్రతి దానికి డబ్బు చెల్లించాలని గ్రహించాను. ప్రతిభను కూడా డబ్బుతోనే ముడిపెడతారు. మీ విజయం వేరొకరి వైఫల్యంపై ఆధారపడి ఉంటుందనేలా కొత్త వెర్షన్స్ సృష్టించారు. కానీ, నా మనస్తత్వం పూర్తి భిన్నమైనది. మన పనే మన గురించి చెప్పాలనుకుంటాను. అందుకే ఇలాంటి వాటి కోసం డబ్బులు ఖర్చు చేయను. నా ప్రయాణాలు, నా కోసం, నా కుటుంబంపై, నాకు దగ్గరైన వాళ్లపై ఖర్చు చేయడానికే ఇష్టపడతాను. నన్ను ప్రశంసిస్తూ ఆర్టికల్స్ రాయడానికి, నన్ను పొగడడం కోసం మాత్రమే సోషల్ మీడియా ఖాతాలకు వేలల్లో చెల్లించడానికి నా దగ్గర అంత డబ్బు లేదు’’ అని స్పష్టం చేశారామె. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు తాప్సీ. -
బోరుమని ఏడ్చిన అనసూయ.. అందుకే కన్నీళ్లాగలేదు!
ఆడవారిపై నోరు పారేసుకున్న నటుడు శివాజీని కడిగిపారేసింది యాంకర్, నటి అనసూయ భరద్వాజ్. కానీ కొందరు శివాజీ లాంటి పురుషాహంకార ధోరణి ఉన్నవాళ్లు మాత్రం అనసూయనే ట్రోల్ చేశారు. ఆమెను, ఆమె కుటుంబాన్ని దారుణంగా విమర్శించారు. అయినా అనసూయ వెనక్కు తగ్గకుండా స్త్రీ హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఓ ప్రెస్మీట్కు వీడియో కాల్ ద్వారా హాజరైంది. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది. నేను బాగున్నా..తాజాగా తన కన్నీళ్లకు గల కారణాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నిన్న జరిగిన ప్రెస్మీట్లో జూమ్ కాల్ ద్వారా మాట్లాడాను. ఆ సమయంలో నాకు లభించిన మద్దతు నన్నెంతో భావోద్వేగానికి గురి చేసింది. అదే సమయంలో కొంతకాలంగా నేను శారీరకంగా అనారోగ్యంతో ఉండటంతో, ఆ బలహీన క్షణంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇది మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. నేను పూర్తిగా బాగున్నాను.మనమంతా మనుషులమేమన స్వయం నిర్ణయాధికారానికి మద్దతుగా మాట్లాడినందుకు నేనుగానీ, ఏ మహిళ అయినా సరే ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుక్కోవడం నిజంగా బాధాకరం. కానీ, అదే సమయంలో నా వెనక నిలబడ్డ అద్బుతమైన, బలమైన మహిళల వల్ల నాకు అపారమైన ధైర్యం లభిస్తోంది. మనమంతా మనుషులమే.. మనిషిగా భావోద్వేగానికి లోనవ్వడంలో నాకు ఎలాంటి సిగ్గు లేదు. అన్నీ దాటుకుని నిలబడతా..ముఖ్యమైనది ఒక్కటే.. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా బూడిద నుంచి మళ్లీ లేచి, అన్ని అడ్డంకులు ఎదురొడ్డి నిలబడతాను. ఎవరి బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాభపడాలని చూస్తారో అది వారి స్వభావాన్ని మాత్రమే చూపిస్తుంది.. నన్ను కాదు. నిన్న జరిగిన ప్రెస్మీట్లో.. నేను అక్కడ లేకపోయినా, ధైర్యం, ఐక్యతతో మాట్లాడిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మానవత్వాన్ని ఎంచుకుందాంఅది నాకు నిజమైన సాధనగా అనిపిస్తోంది. నేను ఏదైనా చెప్పాలనుకుంటే అది నేరుగా నా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారానే తెలియజేస్తాను. అంతవరకు మౌనంగానే ఉంటాను. మనమంతా శాంతి, సానుభూతి, మానవత్వాన్ని ఎంచుకుందాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని అనసూయ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) చదవండి: నన్ను లాక్కెళ్లి ముద్దుపెట్టాలని చూశారు: అనిల్ రావిపూడి -
‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: అనగనగా ఒక రాజునటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, తారక్ పొన్నప్ప, రావు రమేశ్, చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేశ్ తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: మారిసంగీతం: మిక్కీ జె. మేయర్విడుదల తేది: జనవరి 14, 2026హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన కామెడీ టైమింగ్, యాక్టింగ్తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘అనగజగా ఒక రాజు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఆయనే కథ అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్) బాగా రిచ్ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్ పొన్నప్ప)తో నవీన్కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Anaganaga Oka Raju Review).ఎలా ఉందంటే..తెలిసిన కథతోనే సినిమా తీసి మెప్పించడం అనేది...పాత ఇంటికి కొత్త పెయింట్ వేసినట్టే అవుతుంది. లుక్ మారితే చాలా ఇష్టపబతారు. కానీ లోపాలు కనిపిస్తే విమర్శలు తప్పవు. ‘రాజుగారు’ ఆ విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డారు. కథ- కథనం అంతా పాత చింతకాయ పచ్చడే అయినప్పటికీ.. ‘రాజుగారు’ చేసే హంగామా చూసి ఫుల్ ఎంటర్టైన్ అవుతాం. సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల వరకు బోరింగ్గా సాగుతుంది. ఒక్కో సీన్ వచ్చి వెళ్తుంది కానీ.. ఎక్కడా కనెక్ట్ కాలేం. కానీ రాజు గారు పెళ్లి చూపుల వేట మొదలు పెట్టినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇక ‘ఆపరేషన్ చారులత’ ఎపిసోడ్ నుంచి నవ్వుల యుద్ధం ప్రారంభం అవుతుంది. కథనం ఊహకందేలా సాగినా.. నవీన్ పొలిశెట్టి వేసే పంచ్లు, కామెడీ సీన్లతో ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. గోవా ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరో ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత మళ్లీ కథనం పుంజుకుంటుంది. ఎలెక్షన్ క్యాంపెయిన్ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక క్లైమాక్స్లో కథనం ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అప్పటివరకు నవ్వించిన రాజుగారు.. చివరిలో కాస్త ఎమోషనల్కు గురి చేస్తూ.. ఓ మంచి సందేశం ఇస్తాడు. కథ-కథనం గురించి ఆలోచించకుండా.. వెళ్తే.. ‘అనగనగా ఒకరాజు’ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తాన్ని తన భుజానా వేసుకొని ముందుకు నడిపించాడు. రాజు పాత్రలో జీవించేశాడు. ఇక చారులతగా మీనాక్షి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. వీరిద్దరు తప్పితే.. మిగతా పాత్రలేవి అంతగా గుర్తుండవు. హీరోయిన్ తండ్రిగా రావు రమేశ్ రెగ్యులర్ పాత్రలో కనిపించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఎర్రిబాబు పాత్రలో తారక్ పొన్నప్ప.. బాగానే చేశాడు. కానీ ఆయన పాత్రని ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. రంగస్థలం మహేశ్, చమ్మక్ చంద్ర కామెడీ నవ్వులు పూయిస్తుంది. మిగతా నటీనటలు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే. మేయర్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ తెరపై రిచ్గా కనబడుతుంది. ఎడిటింగ్ షార్ప్గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
నన్ను లాక్కెళ్లి ముద్దు పెట్టాలని చూశారు: అనిల్ రావిపూడి
వరుస విజయాలు అందుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు కొల్లగొట్టడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ అవన్నీ నాకు కొట్టిన పిండి అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.. ఒకటీరెండు కాదు వరుసగా తొమ్మిది విజయాలను అందుకుని హిట్ మెషిన్ అని మరోసారి నిరూపించుకున్నాడు.మెగా బ్లాక్బస్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించాడు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మెగా బ్లాక్బస్టర్ థాంక్యూ మీట్లో అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.కనబడితే లాక్కెళ్లి..ఆయన మాట్లాడుతూ.. ఈ కథలోని అన్ని సన్నివేశాలకు చిరంజీవి గారే స్ఫూర్తి. నాకు ఈ సినిమా చేసే అవకాశాన్నిచ్చిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మెగా ఫ్యాన్స్ అయితే నేను కనబడితే లాక్కెళ్లి ముద్దులు పెడదామని చూస్తున్నారు. వాళ్లు చూపిస్తున్న అభిమానాన్ని మర్చిపోలేను.ఫామ్హౌస్ కొనివ్వాలిఅమెరికాలో ప్రీమియర్స్ 1 మిలియన్ డాలర్ వసూలు చేస్తే నిర్మాత సాహు గారపాటికి కారు ఇస్తానన్నాను. నేను అనుకున్న నెంబర్ దాటిపోయింది కాబట్టి ఆయనకు కారు కొనిస్తాను. కాకపోతే.. కలెక్షన్స్ మూడు దాటి నాలుగు మిలియన్ డాలర్లు వస్తే నాకు ఫామ్ హౌస్ కొనివ్వాలి. ఇప్పుడు ఆయన కారు అడుగుతారా? లేదా? అనేది ఆయన ఇష్టం అని అనిల్ రావిపూడి సరదాగా ఓ కండీషన్ పెట్టాడు.చదవండి: మన శంకరవరప్రసాద్ గారు రెండు రోజుల కలెక్షన్స్ -
‘రాయుడు గారి తాలూకా’ నుంచి రెండో సాంగ్ రిలీజ్
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా రూరల్ ఎంటర్టైనర్ ‘రాయుడి గారి తాలుకా’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మొదటి పాట ‘జాతరొచ్చింది’ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ పొందింది. తాజాగా రెండో పాటను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా విడుదల చేశారు.‘ఏలేలో..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ ట్రాక్కు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. జయశ్రీ పల్లెం, సాయి సందీప్ పక్కి మధురమైన స్వరాలతో ఆలపించారు. ఈ పాట ద్వారా సినిమాలోని గ్రామీణ నేపథ్యం, రొమాన్స్ ఎలిమెంట్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : భర్త మహాశయులకు విజ్ఞప్తినటీనటులు: రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్, సత్య, వెన్నెల కిశోర్, సునీల్ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్ఎల్వి సినిమాస్నిర్మాత: చెరుకూరి సుధాకర్దర్శకత్వం: కిషోర్ తిరుమలసంగీతం: భీమ్స్ సిసిరోలియోవిడుదల తేది: జనవరి 13, 2023ఈ ముగ్గుల పండక్కి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. వరుస ఫ్లాపులతో సతమవుతున్న రవితేజ.. తన రూట్ మార్చి చేసిన ఫ్యామిలీ డ్రామా ఇది. సంక్రాంతి పండగనే టార్గెట్గా పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు. మరి ఈ చిత్రంతో అయినా రవితేజ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రామ సత్యనారాయణ అలియాస్ రామ్(రవితేజ) ఓ వైన్యార్ట్ ఓనర్. తాను కొత్తగా రెడీ చేసిన ‘అనార్కలి’ వైన్ని స్పెయిన్లోని ఓ కంపెనీకి శాంపిల్ పంపిస్తే వాళ్లు రిజెక్ట్ చేస్తారు. కారణం తెలుసుకునేందుకు స్పెయిన్ వెళ్లిన రామ్.. అక్కడ అనుకోకుండా కంపెనీ ఎండీ మానసా శెట్టి(ఆషికా రంగనాథ్)తో ఫిజికల్గా దగ్గరవుతాడు. ఈ విషయాన్ని తన భార్య బాలామణి(డింపుల్ హయతి) దగ్గర గోప్యంగా ఉంచుతాడు. తన డ్రెస్తో సహా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకునే భార్య బాలమణిని కాదని రామ్ .. మానసకు ఎలా దగ్గరయ్యాడు. ఈ విషయం బాలమణికి తెలియకుండా చేయడానికి రామ్ ఏం చేశాడు? స్పెయిన్లో ఉన్న మానస మళ్లీ హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు సతీమణి.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న రామ్.. చివరకు ఏం చేశాడు? తన సమస్యను పరిష్కరించుకునేందుకు బెల్లం అలియాస్ విందా(సత్య), లీలా(వెన్నెల కిశోర్), సుదర్శన్(సునీల్)లను ఎలా వాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఒకవైవు భార్య.. మరోవైపు ప్రియురాలు.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పురుషుడి కథతో ‘ఇంట్లో ఇల్లాలు..వంటింట్లో ప్రియురాలు’ తో పాటు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ కూడా అదే. ఇద్దరి ఆడవాళ్ల మధ్య ఇరుకున్న ఓ భర్త.. ఆ ఇరకాటం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు తిరుమల కిషోర్ ఎంచుకున్న పాయింట్ చాలా రొటీన్. కానీ దాని చుట్టూ అల్లుకున్న కామెడీ సన్నివేశాలు మాత్రం ట్రెండ్కు తగ్గట్లు ప్రెష్గా ఉన్నాయి. మీమ్స్ కంటెంట్ని బాగా వాడుకున్నాడు. సోషల్ మీడియాని రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు కొన్ని సీన్లకు బాగా కనెక్ట్ అవుతారు. అయితే ఏ జోనర్ సినిమాకైనా ఎమోషన్ అనేది చాలా ముఖ్యం. ప్రేక్షకుడు ఎమోషనల్గా కనెక్ట్ అయితేనే.. ఆ కథతో ప్రయాణం చేస్తాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో అది మిస్ అయింది. మగాళ్లు ఎలా ఉండాలో చెప్పడానికి తన భర్త ఒక రోల్ మోడల్ అని బాలమణి పదే పదే చెబుతుంది. అయితే అమె అంతలా తన భర్తను నమ్మడానికి గల కారణం ఏంటనేది చూపించలేదు. అలాగే హీరో చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతన్నట్లుగా, భార్య దగ్గర దాచినందుకు టెన్షన్ పడుతున్నట్లుగా చూపించేందుకు రాసుకున్న సన్నివేశాల్లోనూ బలం లేదు. ఫస్టాఫ్లో సత్య, కిశోర్ల కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. స్పెయిన్ ఎపిసోడ్ వరకు చాలా ఎంటర్టైనింగ్గా కథనం సాగుతుంది. ఎప్పుడైతే హీరో తిరిగి ఇండియాకొస్తాడో.. అక్కడ నుంచి కథనం నీరసంగా సాగుతుంది. హైదరాబాద్ వచ్చిన మానస.. భార్య కంట పడకుండా హీరో పడే తిప్పలు కొన్ని చోట్ల నవ్విస్తే..మరికొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. మొత్తంగా పస్టాఫ్లో కథ లేకుండా కామెడీతో లాక్కొచ్చి.. బోర్ కొట్టకుండా చేశారు. కానీ సెకండాఫ్లో మాత్రం ఆ కామెడీ డోస్ తగ్గిపోయింది. ఊహకందేలా కథనం సాగడం.. కామెడీ సీన్లు కూడా పేలకపోవడంతో సెకండాఫ్లో కాస్త బోరింగ్గా అనిపిస్తుంది. కీలకమైన క్లైమాక్స్ సీన్ని కూడా హడావుడిగా ముగించేశారనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్కి వెళితే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. రవితేజకు ఈ తరహా పాత్రలు చేయడం కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లోనూ రామ్ లాంటి పాత్రలు పోషించాడు. అందుకే చాలా అవలీలలా ఆ పాత్రను పోషించాడు. ఇక హీరోయిన్లలో ఆషికా రంగనాథ్, డింపుల్ పోటీ పడి మరీ అందాలను ప్రదర్శించడమే కాదు.. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్, సత్య, సునీల్ల కామెడీ ఈ సినిమాకు ప్లస్ అయింది. మరళీధర్ గౌడ్ కూడా తెరపై కనిపించేదే కాసేపే అయినా.. తనదైన నటనతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. పిన్నీ సీరియల్ సాంగ్తో సహా పాత సినిమాల పాటలు ఇందులో చాలానే వాడారు. అవన్నీ నవ్వులు పూయిస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
'ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా!' సాంగ్ రిలీజ్
సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్ 'ది రాజాసాబ్', చిరంజీవి 'మన శంకరవరప్రసాద్గారు' సినిమాలు దిగాయి. మరో రెండు రోజుల్లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా రిలీజవుతోంది. మీనాక్షి చౌదని హీరోయిన్గా నటించిన ఈ సినిమాతో మారి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భీమవరం బాల్మా.. పాటకైతే నవీన్ పొలిశెట్టి చాలాసార్లు స్టెప్పులేశాడు. మూడో సాంగ్ రిలీజ్తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. అదే ఆంధ్రా టు తెలంగాణ సాంగ్. 'నాలోన సోకులున్నయ్, సొంపులున్నయ్ సానా.. నీతానా సొమ్ములుంటే ఎల్దాం ఎక్కడికైనా.. ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా..' అన్న లిరిక్స్తో పాట మొదలవుతుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చాడు. ధనుంజయ్ సీపన, సమీరా భరద్వాజ్ కలిసి ఆలపించారు. ఈ స్పెషల్ సాంగ్లో హీరోయిన్ శాన్వి మేఘన నవీన్ పొలిశెట్టితో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ పాటను మీరూ చూసేయండి.. చదవండి: బాస్ చింపేశాడు.. మెగాస్టార్పై అల్లు అరవింద్ ప్రశంసలు -
బాస్ చింపేశాడు.. చిరంజీవిపై అల్లు అరవింద్ ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో బ్లాక్బస్టర్ హిట్టు అందుకోబోతున్నాడు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ఎక్కడ చూసినా పాజిటివ్ టాకే వినిపిస్తోంది. వింటేజ్ చిరును చూశామని అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 'మన శంకర వరప్రసాద్గారు' సినిమా చూసి తన అభిప్రాయం చెప్పాడు.బాస్ ఈజ్ బాస్అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమా చూసి చాలా ఎగ్జయిట్ అయ్యాను. బాస్ చింపేశాడు. బాస్ ఈజ్ బాస్. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి సినిమాలు చూసినప్పుడు కలిగిన అనుభూతి, ఆనందం మళ్లీ ఇన్నాళ్లకు కలిగింది. పాత చిరంజీవిని చూసే అవకాశం దొరికింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. వింటేజ్ చిరును తీసుకొచ్చారు. చిరంజీవి- వెంకటేశ్ కాంబినేషన్ అదిరిపోయింది. జనాలకు ఇది పైసా వసూల్ మూవీ అని ప్రశంసలు కురిపించాడు. మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బండోడా అని అమ్మ తిట్లు.. కళ్లు తిరిగి పడిపోయా!
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ మొదట్లో కాస్త లావుగా ఉండేవాడు. కానీ కఠినమైన డైట్ పాటించి, వర్కవుట్స్ చేసి చాలా సన్నబడ్డాడు. గతేడాది అతడి ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఓ పాడ్కాస్ట్లో మాట్లాడాడు.సరైన సమయం దొరక్క..కరణ్ జోహార్ మాట్లాడుతూ.. బరువు తగ్గడం అనేది చాలా ఈజీ. కానీ నా వృత్తిలో సరైన టైమింగ్స్ అంటూ ఉండవు, సెలవులు ఉండవు, పండగ హాలీడేస్ ఉండవు. అర్జంట్ అంటూ తరచూ ఫోన్లు వస్తుంటాయి. కాబట్టి నేను డైటింగ్ను తు.చ తప్పకుండా పాటించడం కాస్త కష్టమైంది. అయితే మా నాన్న.. నేను లావుగా ఉన్నప్పటికీ హ్యాండ్సమ్గానే ఉన్నాననేవారు. అమ్మ తిట్టేదిఅమ్మ మాత్రం ఒప్పుకోకపోయేది. ఏం మాట్లాడుతున్నావ్? వాడు చాలా లావుగా, బండలా ఉన్నాడనేది. నేను హీరో కావాలని మా నాన్న కోరుకుంటే అమ్మ మాత్రం.. నన్ను ఎగాదిగా చూసి అది జరగదని తేల్చిపడేసేది. ఆమె ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉండేది. కాలేజీకి మంచి డ్రెస్ వేసుకుని వెళ్లినప్పుడు అందరూ నాకంటే సన్నగా కనిపించేవారు. కళ్లు తిరిగి పడిపోయా..అప్పుడు తొలిసారి బరువు తగ్గాలనుకున్నాను. ఎన్నో డైట్స్ ప్రయత్నించాను, కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. ఒక నెలపాటు డైటింగ్ చేయగానే అనారోగ్యానికి గురయ్యేవాడిని. ఒకసారి కాలేజీలో నా క్లాస్రూమ్లో కళ్లు తిరిగి కింద పడిపోయాను. అప్పుడే మా అమ్మ నన్ను తిట్టి డైట్ మాన్పించింది. నేను చికిత్స ద్వారా బరువు తగ్గానని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. వాటి వల్లే బరువు తగ్గా..కాకపోతే బరువుకు కారణమేంటి పరీక్షలు చేయించుకుంటే థైరాయిడ్ ఉన్నట్లు తేలింది. శరీరంలో గ్లూటెన్ ఎక్కువగా ఉందని నిర్ధారణ అయింది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశాను. అందుకు బాదం పాలు తోడ్పడ్డాయి. చక్కెర తగ్గించేశాను. వర్కవుట్స్ చేశాను. గేమ్స్ ఆడాను, ఈత కొట్టాను. బరువు తగ్గాను అని కరణ్ జోహార్ చెప్పుకచ్చాడు.చదవండి: ఓటీటీ మూవీ చీకటిలో.. ట్రైలర్ చూశారా? -
క్రైమ్ యాంకర్గా శోభిత.. చీకటిలో ట్రైలర్ చూశారా?
అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ చీకటిలో. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజవుతోంది. సోమవారం (జనవరి 12న) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో శోభిత క్రైమ్ యాంకర్ సంధ్యగా కనిపించింది. మొదట జర్నలిస్ట్గా పనిచేసినా.. తర్వాత జాబ్ నచ్చలేదని మానేసి పాడ్కాస్ట్ ప్రారంభించింది. ఆ పాడ్కాస్ట్కు చీకటిలో అన్న టైటిల్ ఖరారు చేసింది.క్రైమ్ యాంకర్గా శోభితసమాజంలో జరుగుతున్న నేరాల గురించి అందులో మాట్లాడింది. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు అంటూ ఓ సీరియల్ కిల్లర్ గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. దీంతో సదరు సీరియల్ కిల్లర్.. చిమ్మ చీకటిలో ఇంకో ప్రాణం గాల్లో కలిసిపోతుందని ముందుగానే వార్నింగ్ ఇస్తాడు. మరి అతడిని హీరోయిన్ పట్టుకుంటుందా? అదే సమయంలో అతడి బారి నుంచి తనను తాను రక్షించుకుంటుందా? అన్న విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!సినిమాచీకటిలో మూవీలో శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమా జనవరి 23న నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. చదవండి: పీరియడ్స్.. నీళ్లలో తడిచా.. బట్టలు మార్చుకుంటానంటే..: హీరోయిన్ -
పీరియడ్స్.. ఒక్కరూ నా బాధ అర్థం చేసుకోలే: హీరోయిన్
ఒక్కసారి డేట్స్ ఇచ్చాక చెప్పిన సమయానికి సెట్లో ఉండాల్సిందే! అది హీరోలైనా, హీరోయిన్లయినా! అయితే కొన్నిసార్లు పీరియడ్స్ వల్ల నటీమణులు ఇబ్బందిపడుతుంటారు. దాన్ని బయటకు చెప్పుకోలేక, చెప్పినా అర్థం చేసుకోరేమోనన్న భయంతో లోలోపలే మథనపడుతుంటారు. తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది మలయాళ హీరోయిన్ పార్వతి తిరువోతు. ధనుష్ హీరోగా నటించిన 'మార్యన్' అనే తమిళ మూవీలో పార్వతి కథానాయికగా యాక్ట్ చేసింది. రొమాంటిక్ సీన్ఈ సినిమా షూటింగ్లో జరిగిన సంఘటనను పార్వతి తాజాగా గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. మార్యన్ సినిమాలో ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని బీచ్లో షూట్ చేశారు. నన్ను పూర్తిగా నీళ్లలో ముంచి తడిపారు. నేను అదనపు డ్రెస్ తీసుకెళ్లలేదు. షూటింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. నాకేమో చాలా అసౌకర్యంగా ఉంది. అదెవరూ గమనించట్లేదు.ఒప్పుకోలేదుఓ పక్క పీరియడ్స్.. మరోపక్క నీళ్లలో తడవడంతో చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. ఒకసారి హోటల్కు వెళ్లి బట్టలు మార్చుకుని వస్తానని చెప్పాను. వాళ్లు కుదరదన్నారు. అంతే, నా కోపం నషాళానికి అంటింది. నేను పీరియడ్స్లో ఉన్నాను.. కచ్చితంగా వెళ్లి తీరాలి అని గట్టిగా అరిచి చెప్పాను. వెంటనే సెట్లో ఉన్నవారంతా షాకై అలా చూస్తున్నారు. వాళ్లు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఆరోజు సెట్లో నాతో కలిపి ముగ్గురు ఆడవాళ్లే ఉన్నారు.ఒంటరిగా ఫీలయ్యాచాలాసేపటివరకు నా ఇబ్బందిని చూస్తూ ఉన్నారే తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఆ సమయంలో నేను ఒంటరిగా ఫీలయ్యాను. నాలో ఓపిక కూడా నశించింది అని చెప్పుకొచ్చింది. పార్వతి తిరువోతు మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం మలయాళంలో రెండు మూవీస్లో యాక్ట్ చేస్తోంది.చదవండి: మన శంకరవరప్రసాద్గారు మూవీ రివ్యూ అండ్ రేటింగ్ -
బ్లాక్బస్టర్ రెస్పాన్స్.. సంతోషంలో చిరంజీవి, అనిల్ రావిపూడి
సంక్రాంతి బరిలో మన శంకర వరప్రసాద్గారు దిగేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన మొదటి రోజే బ్లాక్బస్టర్ టాక్ అందుకుంటోంది. ప్రీమియర్స్ నుంచే సినిమాకు హిట్ టాక్ మొదలైంది. 'బాస్ ఈజ్ బ్యాక్.. ఈ సంక్రాంతి బాస్దే..' అంటూ సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. సెలబ్రేషన్స్ఇది చూసిన చిత్రయూనిట్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.సంక్రాంతి హిట్ బొమ్మఅనిల్ రావిపూడి ముందుగా చెప్పినట్లుగానే సినిమాలో వింటేజ్ చిరును చూపించాడు. అద్భుతమైన యాక్టింగ్, గ్రేస్, డ్యాన్స్తో మెగాస్టార్ అభిమానులను ఎంతగానో అలరించాడు. మొత్తానికి ఈ సినిమా మెగా ఫ్యాన్స్కు అసలైన పండగను తీసుకొచ్చింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! A beautiful moment celebrating a MEGA BLOCKBUSTER RESPONSE 😀❤️🔥Hit Machine, director @AnilRavipudi, producers @sahugarapati7 & @sushkonidela met Megastar @KChiruTweets to share the happiness after the blockbuster response from the premieres of #ManaShankaraVaraPrasadGaru 🔥… pic.twitter.com/ZL8Tsch547— Gold Box Entertainments (@GoldBoxEnt) January 11, 2026 (మన శంకర వరప్రసాద్గారు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరో ఎవరనేది పట్టించుకోను : మీనాక్షి చౌదరి
‘నా దృష్టిలో కథే హీరో. కథ ఎలా ఉంది?, దర్శకుడు ఆ కథను, అందులోని పాత్రలను ఎలా చూపించబోతున్నారు అనేది ఆలోచిస్తాను. హీరో ఎవరనేది ముఖ్యం కాదు. కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. ఈ పాత్ర నా కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రమే చూస్తాను’ అన్నారు యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందుకున్నాను. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు'తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటాననే నమ్మకం ఉంది.⇢ ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. ఇది చాలా భిన్నమైన పాత్ర. నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూసి ఉన్నాను. డైరెక్టర్ ఇచ్చిన ఇన్ పుట్స్ ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. నేను ప్రాక్టికల్ గా ఉంటాను. చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్ గా ఉంటుంది.⇢ నవీన్తో వర్క్ చేయడం అనేది.. సినిమా టీచింగ్ స్కూల్ లా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్నా.. నా పాత్ర కాస్త సీరియస్ గా ఉంటుంది. కానీ, ఇందులో పూర్తిగా కామెడీగా ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్ ని కరెక్ట్ టైమింగ్ లో చెప్పడం అనేది ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టం. పైగా ఇందులో కామెడీ కామెడీ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.⇢ ఈ సినిమా వల్ల నటిగా నేను మరింత ఓపెన్ అయ్యాను. లక్కీ భాస్కర్ లోని సుమతి పాత్రకు ఈ చారులత పాత్ర పూర్తి భిన్నమైనది. దర్శకులు ఆ పాత్రలను మలిచిన తీరుకి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకుంటాను. ఇందులో అద్భుతమైన కామెడీ టైమింగ్ చూస్తారు.⇢ గోదావరి ప్రాంతంలో చిత్రీకరణ అనుభూతి చాలా బాగుంది. అక్కడి ప్రజలు బాగా చూసుకున్నారు. ఎన్నో వంటకాలు తిన్నాను. ఆలయాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాను. అక్కడి ప్రజలు సినిమా అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. గోదావరి ప్రాంతంలో షూటింగ్ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను.⇢ ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం సంతోషంగా ఉంది. లక్కీ భాస్కర్ ఒక బాబుకి తల్లిగా కనిపించాను. సంక్రాంతికి వస్తున్నాంలో ఐపీఎస్ గా కనిపించాను. ఇప్పుడు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. నటిగా నన్ను మరో కోణంలో చూపించే పాత్ర ఇది.⇢ నా దృష్టిలో సినీ ప్రయాణం అనేది ముగింపు లేని పరుగు పందెం లాంటిది. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి విభిన్న పాత్రలు చేస్తూ నిరంతరం పరుగెడుతూనే ఉండాలి. నా వరకు సెటిల్ అయ్యాను, ఫలానా స్థానానికి చేరుకున్నాను లాంటి లెక్కలు ఉండవు. చేతిలో పని ఉండటం ముఖ్యమని భావిస్తాను.⇢ ప్రస్తుతం నాగ చైతన్య గారితో వృషకర్మ సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఆసక్తికర కథలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వస్తాయి. -
గోశాలకు సోనూసూద్ రూ.11 లక్షలు విరాళం
మంచితనానికి మారుపేరుగా ఉండే ప్రముఖ నటుడు సోనూసూద్ మరో గొప్ప పని చేశాడు. గుజరాత్లోని వారాహి గోశాలకు రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చాడు. వారాహి గోశాలను సందర్శించిన ఆయన గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి సంతోషం వ్యక్తం చేశాడు. సోనూసూద్ మాట్లాడుతూ.. కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య ఏడు వేలకు చేరింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.గోశాలకు విరాళంఈ గ్రామంలోని ప్రజలందరూ వాటి సంరక్షణ కోసం పాటుపడుతుండటం అభినందనీయం. వారు చేసినంత సేవ నేను చేయకపోవచ్చు. కానీ నా తరపున రూ.11 లక్షలు విరాళం ఇచ్చాను. దానివల్ల వారి సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల ప్రేమ నన్నెంతగానో కట్టిపడేసింది. వీలు కుదిరినప్పుడు తప్పకుండా మరోసారి ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఆవులను సంరక్షిస్తున్న విధానాన్ని దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు.సినిమాసోనూసూద్ సినిమాల విషయానికి వస్తే.. సూపర్, అరుంధతి, చంద్రముఖి, దూకుడు, జులాయి, అల్లుడు అదుర్స్.. ఇలా అనేక సినిమాల్లో విలన్గా చేశాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటుడిగా రాణిస్తున్నాడు. చివరగా 'ఫతే' అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ మారాడు.చదవండి: చచ్చిపోవాలన్నంత బాధ.. ఎంతోమందిని కలిశా.. -
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. బాధగా ఉంది : విజయ్ దేవరకొండ
టాలీవుడ్లో ఫేక్ రివ్యూలు, నెగెటివ్ రేటింగ్స్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నిర్మాతలు ఈ సమస్యపై కోర్టును ఆశ్రయించారు. బుక్ మై షో (BookMyShow) వంటి ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్లలో రేటింగ్స్, రివ్యూలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు బుక్ మై షో ఈ సినిమాకు రేటింగ్స్ , రివ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ విషయం తనకు సంతోషాన్నిచ్చినప్పటికీ, కొంత బాధను కూడా కలిగిస్తోందని ట్వీట్ చేశారడు.‘ఫేక్ రేటింగ్స్, రివ్యూలకు చెక్ పెట్టడం సంతోషకరం. ఇది చాలా మంది కష్టం, కలలు, డబ్బును కాపాడుతుంది. అదే సమయంలో బాధ కలిగిస్తోంది ఎందుకంటే... మన సొంత మనుషులే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. ‘మనం బతుకుతూ ఇంకొకరికి బతికించాలి’ అనే సూత్రం ఏమైంది? అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్లింది?(చదవండి: మొన్న అల్లు అర్జున్, ఇప్పుడు ప్రభాస్పై కక్ష.. హరీశ్రావు సంచలన కామెంట్)'డియర్ కామ్రేడ్' సినిమా నుంచే నాకు ఇలాంటి దాడులు ఎదురయ్యాయి. అలా చెబితే ఎవరూ పట్టించుకోలేదు .ఒక మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకే తిరిగి చెప్పారు. కానీ నాతో సినిమా తీసిన దర్శకులకు, నిర్మాతలకు ఈ సమస్య యొక్క తీవ్రత తర్వాత అర్థమయింది.ఇలాంటి పనులు చేసేది ఎలాంటి మనుషులు అని ఆలోచిస్తూ, నా కలలను , నా లాగే నా తర్వాత వచ్చే చాలా మంది కలలను కాపాడుకోవడానికి వారితో ఎలా వ్యవహరించాలో అని ఆలోచిస్తూ అనేక రాత్రులు నిద్రలేకుండా గడిపాను. ఇన్నాళ్లకు ఈ విషయం బహిరంగంగా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. (చదవండి: చిరు-అనిల్ రావిపూడి.. ఈసారి హిట్ కొడతారా?)మెగాస్టార్ లాంటి పెద్ద హీరో సినిమాకు కూడా ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఆదేశాలతో సమస్యను పూర్తి పరిష్కారం లభించదు కానీ, ఆందోళన చెందాల్సిన విషయాల్లో ఒకటి తగ్గుతుంది. ఇదంతా పక్కనపెట్టి ఇప్పుడైతే మనం ‘మన శంకరవరప్రసాద్’(Mana Shankara Varaprasad Garu) తో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు విజయవంతంగా అలరించాలని కోరుకుందాం’ అని విజయ్ ట్వీట్ చేశాడు. Happy and Sad to see this - Happy to know hardwork, dreams and money of many is protected in a way. And Sad because of the reality of our own people causing these problems. What happened to live and let live? and growing together?Since the Days of Dear Comrade i first began… pic.twitter.com/gF55B8nXqt— Vijay Deverakonda (@TheDeverakonda) January 11, 2026 -
చచ్చిపోవాలనిపించింది.. ఎంతోమందిని కలిశా..
చెప్పుకోలేని బాధ, విపరీతమైన ఆలోచనలతో ఇబ్బందిపడుతున్నప్పుడు మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అలా తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు థెరపీ తీసుకుని చాలా మంచి పని చేశానంటోంది మలయాళ నటి పార్వతి తిరువోతు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థెరపీ తీసుకోవడం అనేది నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం. అర్ధరాత్రి థెరపీకాకపోతే మనకు కరెక్ట్ థెరపిస్ట్ దొరకాలి. అందుకు నాకు చాలా సమయం పట్టింది. మొదట్లో నేను అమెరికన్ థెరపిస్ట్ను కలిశాను. అర్ధరాత్రి ఒంటిగంట, రెండు గంటల సమయంలో నాతో మాట్లాడేవారు. తర్వాత ఇక్కడే ఉన్న థెరపిస్ట్లను సంప్రదించాను. వారు నా సమస్యలేంటో గుచ్చిగుచ్చి అడిగి.. వాటిని వెలికితీసి మరింత బాధపెట్టేవారు.చచ్చిపోవాలన్న ఆలోచనలుఅప్పటికే నేను తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నాను. చచ్చిపోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కరెక్ట్ థెరపిస్ట్ దొరికాక నా బాధకు ఉపశమనం లభించింది. నన్ను ఎంతో బాధపెట్టిన 2021 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలల్ని నా జీవితంలో నుంచే తీసేశాను. సినిమాప్రస్తుతం నేను కుటుంబం, ఫ్రెండ్స్, సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. పార్వతి బెంగళూరు డేస్, ఎన్ను నింటె మొయిదీన్, చార్లీ, ఉయరె, వైరస్, పుళు వంటి పలు చిత్రాల్లో నటించింది. దూత వెబ్ సిరీస్తో తెలుగువారికి సైతం పరిచయమైంది.గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
సంక్రాంతి వేడుకల్లో చై-శోభిత.. భోజనం వడ్డిస్తూ..
టాలీవుడ్ స్టార్ జంట నాగచైతన్య- శోభిత ధూళిపాళ ఈసారి సంక్రాంతిని కాస్త ముందుగానే జరుపుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకకు హాజరైన వీరిద్దరూ అక్కడ ఉన్నవారికి ఆప్యాయంగా భోజనం వడ్డించారు. అనంతరం అక్కడి వారితో ఫోటోలు కూడా దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సినిమాకాగా చై- శోభితలది ప్రేమ పెళ్లి. కొంతకాలంపాటు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. కొంతకాలంగా హిట్లు లేక సతమతమైన చైకి 'తండేల్'తో పెద్ద హిట్ లభించింది. రూ.100 కోట్లు రాబట్టిన తొలి సినిమాగా అతడి కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం చై 'వృషకర్మ' సినిమా చేస్తున్నాడు. శోభిత సంగతేంటి?'విరూపాక్ష' వంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన కార్తీక్ వర్మ దండు ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. శోభిత విషయానికి వస్తే.. ఇటీవలే తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది. 'చీకటిలో' అనే థ్రిల్లర్ సినిమాతో జనవరి 23న ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం థియేటర్లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదలవుతోంది. #EverGreen Couple #Yuvasamrat @chay_akkineni sir @sobhitaD Madam 😍💞 at Annapurna Studios Sankranthi Pongal Festival Celebrations ✨🥳#ANRLivesOn #NagaChaitanya #SobhitaDhulipala #Vrushakarma pic.twitter.com/Hse8fBVw7p— En Uyir Chaitu (@Kalyan7781) January 10, 2026 చదవండి: నీ బర్త్డే నాకెంతో స్పెషల్.. పుట్టినందుకు థాంక్స్: అల్లు అర్జున్ -
నా జీవితంలో ప్రత్యేకమైన రోజు.. పుట్టినందుకు థాంక్స్
ట్రోలింగ్ను ఎదుర్కోని హీరో లేడు. కెరీర్ తొలినాళ్లలో దారుణమైన ట్రోల్స్ చూశాడు అల్లు అర్జున్. 'గంగోత్రి' సినిమాలో అతడు ఆడవేషం కడితే అందరూ పడీపడీ నవ్వారు. అదే అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీలో చీరకట్టి తాండవం చేస్తే అదుర్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.నాలుగు సార్లు రిపీట్హీరోగా తన తొలి సినిమా గంగోత్రితో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బన్నీ తర్వాతి మూవీ 'ఆర్య'తో తనేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతోనే సుకుమార్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'ఆర్య 2'తో వీరి కాంబినేషన్ మరోసారి హిట్టు అని నిరూపితమైంది. ఆ ధైర్యంతోనే ముచ్చటగా మూడోసారి జత కట్టి 'పుష్ప' సినిమా తీశారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందడంతో పాటు భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఎనలేని గౌరవంపుష్పకు సీక్వెల్గా వచ్చిన 'పుష్ప 2' చిత్రం అయితే రికార్డులు తిరగరాసింది. అల్లు అర్జున్ను తిరుగులేని పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టింది. తనకు ఇంత గుర్తింపు తీసుకొచ్చిన సుకుమార్ అంటే బన్నీకి ఎనలేని గౌరవం. తన కెరీర్ తారాజువ్వలా వెలగడానికి ఆయనే కారణమని బలంగా నమ్ముతాడు. ఈరోజు (జనవరి 11న) సుకుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.నా జీవితాన్ని మార్చేసిన రోజు హ్యాపీ బర్త్డే డార్లింగ్.. ఈరోజు నీకంటే కూడా నాకే ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చేసిన రోజు ఇదే! నువ్వు నా జీవితంలో ప్రసాదించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. పుట్టినందుకు థాంక్స్ సుకుమార్ అంటూ రెండు ఫోటోలు షేర్ చేశాడు. ఈ పోస్ట్ కింద అభిమానులు 'పుష్ప 3' కోసం వెయిటింగ్ అని కామెంట్లు చేస్తున్నారు. Happy Birthday, darling.It’s a special day for me… more than for you… because this day changed my life. No amount of wishes can convey the joy of having you in my life. #HBDSukumar Puttinandhuku thanks!!! 🖤(Copyrights @pnavdeep26 ) pic.twitter.com/mJ7jNBmFQa— Allu Arjun (@alluarjun) January 11, 2026 చదవండి: పొగిడినా, విమర్శించినా నవ్వుతా: అనిల్ రావిపూడి -
ప్రియుడిని పెళ్లాడిన 'టైగర్ నాగేశ్వరరావు' హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు, కథానాయిక నుపుర్ సనన్ పెళ్లి పీటలెక్కింది. వారం రోజుల క్రితమే ప్రియుడు, ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. పెళ్లికి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా శనివారం (జనవరి 10న)నాడు ప్రియుడిని వివాహం చేసుకుంది. రాజస్తాన్లో ఉదయ్పూర్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.పెళ్లి చేసుకున్న హీరోయిన్ఇరు కుటుంబ సభ్యులు సహా అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన క్షణాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లిలో ఇద్దరూ తెలుపు దుస్తుల్లోనే మెరిశారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఒకే ఒక్క మూవీనుపుర్ సనన్.. 'టైగర్ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్ సాంగ్స్లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం. View this post on Instagram A post shared by Bollywood (@lifestyleofbollywood)Finally its here ✨5 years of love and a start to forever 🫶🏻#StebiNupurOnLoop #StebinBen#NupurSanon#KritiSanon pic.twitter.com/WhlvX3UuzJ— G (@kixtr1KSanon) January 10, 2026 View this post on Instagram A post shared by Stebin Ben (@stebinben) -
పొగిడినా.. విమర్శించినా నవ్వుతా : అనిల్ రావిపూడి
‘‘ప్రతి సంక్రాంతికీ నా సినిమా ఉండాలని నేను కోరుకోవడం లేదు. ఈ బ్రాండ్ నాకు వద్దు. కుదిరినప్పుడల్లా సంక్రాంతికి వచ్చి కుర్రాడు ఏదో నవ్విస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటే చాలు’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూ΄÷ందిన తాజా సినిమా ‘మన శంకర వరప్రసాద్గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం రేపు(సోమవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ రావిపూడి పంచుకున్న విశేషాలు...→ ఈ సినిమా అంతా చిరంజీవిగారు చేసిన శంకరవరప్రసాద్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సాగుతుంది. ఈ తరహా సినిమా చేయడం నాకు కూడా కొత్తే. ఈ చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషనల్ రైడ్ కూడా ఉంది. భార్యా భర్తల మధ్య ఓ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాను. చిరంజీవిగారు సెల్ఫ్ సెటైర్స్ వేసుకున్నారు. అది ఆయన గొప్పదనం. ఇది ఆడియన్స్ను అలరించడానికి మాత్రమే. → కర్ణాటకకు చెందిన మైనింగ్ బిజినెస్మేన్ వెంకీ గౌడ అనే పాత్రలో వెంకటేశ్గారు నటించారు. చిరంజీవి, వెంకటేశ్గార్ల కాంబినేషన్ సీన్స్ 20 నిమిషాలు ఉంటాయి. వారితో షూటింగ్ చేసిన సమయం నా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్. మా సినిమా టికెట్ ధరలు ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉండాలని, చిరంజీవిగారు స్ట్రిక్ట్గా చెప్పారు. దీంతో మేం నార్మల్ హైక్స్ కోసమే రిక్వెస్ట్ పెట్టుకున్నాం. → ఈ సినిమాలోని హుక్స్టెప్ సాంగ్ బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ పాటకు బదులు మేం ముందుగా మరో మెలోడీ ట్యూన్ అనుకున్నాం. కానీ, ఆ తర్వాత వద్దనుకుని లాస్ట్ షెడ్యూల్లో ఈ ‘హుక్ స్టెప్’ సాంగ్ను షూట్ చేశాం. ఫైనల్గా ఇలా మెగా మ్యాజిక్ జరిగింది. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. → నా సినిమాల ప్రొడక్షన్స్ , బడ్జెట్ విషయాల్లో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. అయితే నా లైఫ్లో నేను ప్రొడక్షన్స్ , డిస్ట్రిబ్యూషన్ చేయను. ఇక సోషల్ మీడియాలో నాపై కొన్ని విమర్శలు వస్తుంటాయి. పొగడ్తలను స్వీకరిస్తున్నప్పుడు, విమర్శలను కూడా తీసుకోవాలి. అందుకే నేను దేనికీ A. నన్ను విమర్శించినా నవ్వుతా.. పొగిడినా నవ్వుతా. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణగార్లతో సినిమాలు చేశాను. నాగార్జునగారితో కూడా సినిమా చేయాలని ఉంది. అవకాశం కోసం చూస్తున్నాను. నా కొత్త సినిమా ఇంకా ఖరారు కాలేదు. -
చిన్నప్పుడే లైంగిక వేధింపులు.. లిఫ్ట్లో అలా ప్రవర్తించాడు : హీరోయిన్
దురదృష్టవశాత్తు, ఈ ప్రపంచంలోని ప్రతి మహిళ తన జీవితంలో కనీసం ఒక్కసారైనా లైంగిక వేధింపులకు గురవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి మహిళకు ఈ వేధింపుల తప్పడం లేదు. తాజాగా మలయాళ స్టార్ నటి పార్వతి తిరువోత్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్నప్పటి నుంచి పలు ఘటనలు ఆమెను మానసికంగా కలచివేశాయని చెప్పుకొచ్చారు.ఛాతీపై కొట్టాడు.. నా చిన్నప్పుడు ఒకసారి అమ్మా నాన్నలతో కలిసి రైల్వే స్టేషల్కు వెళ్లాను. ట్రైన్ కోసం పెరెంట్స్తో కలిసి నిలబడితే.. ఒకడు వచ్చి నా ఛాతీపై కొట్టి పారిపోయాడు. అతను కావాలనే అక్కడ టచ్ చేశాడు. ఆ సంఘటన నన్ను చాలా మానసిక క్షోభకు గురిచేసింది. ఆ తర్వాత నేను బయటకు వెళ్తే.. ఎలా ఉండాలో అమ్మ చెప్పేది. మగాళ్ల చేతులను చూస్తూ నడవాలని చెప్పాలి. ఒక తల్లి తన కూతురికి ఇలా నేర్పించాల్సిన పరిస్థితి రావడం దారుణం. ఆ ఒక్క సంఘటననే కాదు. చిన్నప్పుడు నాకు ఇలాంటివి చాలానే ఎదురయ్యాయి. కొంతమంది మగాళ్లు ప్రైవేట్ పార్ట్ని చూపిస్తూ.. అసభ్యకరంగా మాట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. స్కూల్లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించా. అతను నన్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కోరిక తీర్చమని వేధించాడు. ప్రేమిస్తే.. అనుమతి లేకపోయినా సరే ఆ పనికి ఒప్పుకోవాల్సిందేనా?లిఫ్ట్లో అలా.. కొట్టేశా19-20 ఏళ్ల వయసులో కూడా ఓ ఘటన జరిగింది. సినిమా కోసం స్నేహితులతో కలిసి మాల్కి వెళ్లాను. అనంతరం లిఫ్ట్లో కిందికి వస్తుంటే..ఒక వ్యక్తి నా దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. అతని ప్రైవేట్ పార్ట్ నాకు తగిలినట్లుగా అనిపించింది. లిఫ్ట్ దిగగానే అతన్ని చెంపపై కొట్టాను. సెక్యూరిటీ వచ్చి ఆపారు. పోలీసులకు ఫోన్ చేసి రప్పించాను. చివరికి అతను నా కాళ్ళ మీద పడి, 'నాకు ఇప్పుడే గల్ఫ్లో ఉద్యోగం వచ్చింది, నేను పెళ్లి చేసుకుంటున్నాను' అనడంతో వదిలేశా. నేను అతన్ని కొట్టినప్పుడు, అందరూ నన్ను అభినందించారు. కానీ అది పెద్ద విజయం అని నేను అనుకోలేదు. నన్ను నేను రక్షించుకోవడం పెద్ద విషయం కాదు’ అని పార్వతి చెప్పుకొచ్చింది. సినిమాలో విషయానికి వస్తే.. 2024లో వచ్చిన ‘ఉల్లోజుక్కు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పార్వతీ, ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. -
సూపర్ హిట్ మూవీ ఫ్రాంచైజీ.. ఈ నెలలోనే మూడో పార్ట్
రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "మర్దానీ 3". దేశంలోనే అతిపెద్ద మహిళా పోలీస్ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు భాగాలు బ్లాక్బస్టర్గా నిలిచాయి. తాజాగా మూడో పార్ట్ విడుదల తేదీ ప్రకటించారు. జనవరి 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలారు. నిజానికి ఈ సినిమాను హోలి పండగ సందర్భంగా ఫిబ్రవరి 27న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ను ఓ నెల ముందుకు జరిపారు.సినిమామర్దానీ 3 విషయానికి వస్తే.. అన్యాయం, అక్రమాలను ఎదురించే డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీరాయ్గా రాణీ ముఖర్జీ మరోసారి కనిపించనున్నారు. 'ద రైల్వేమెన్' ఫేమ్ ఆయుష్ గుప్తా కథ అందించాడు. అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించగా, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాల్ని సినిమాలో చూపించనున్నారు. View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) చదవండి: ఇలా జరుగుతుందనుకోలేదు.. సారీ: రాజాసాబ్ డైరెక్టర్ -
సడన్ సర్ప్రైజ్.. సంక్రాంతికి విజయ్ మూవీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులకు ఒక గుడ్న్యూస్, ఒక బ్యాడ్న్యూస్. ముందుగా బ్యాడ్న్యూస్ ఏంటంటే.. జన నాయగణ్ ఈ నెలలో రిలీజ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. గుడ్న్యూస్ ఏంటంటే.. సంక్రాంతికి జన నాయగణ్ లేకపోయినా విజయ్ బ్లాక్బస్టర్ మూవీ తేరి థియేటర్లలో రీరిలీజ్ అవుతోంది.పదేళ్ల సందర్భంగా..ఈ విషయాన్ని నిర్మాత ఎస్.కలైపులి థాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తేరి సినిమా వచ్చి ఈ ఏడాది ఏప్రిల్ 14కి పదేళ్లవుతుంది. ఈ క్రమంలో మళ్లీ అదే తారీఖున విజయ్ సినిమాను రీరిలీజ్ చేయాలని ఎప్పుడో ప్లాన్ చేశారు. కానీ విజయ్ చివరి మూవీ 'జననాయగణ్' సంక్రాంతికి రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.తేరి రీరిలీజ్వారికి కాస్త ఊరటనిచ్చేందుకు తేరి రిలీజ్ను ముందుకు జరిపారు. ఈ సంక్రాంతికి అంటే జనవరి 15న మళ్లీ విడుదల చేస్తున్నారు. తేరి సినిమా విషయానికి వస్తే ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. తేరీ తెలుగులో పోలీసుడు పేరిట డబ్ అయింది. ఈ సూపర్ హిట్ సినిమా పలు భాషల్లో రీమేక్ అయింది. గతేడాది హిందీలో బేబీ జాన్గా రీమేక్ అవగా బాలీవుడ్లో ఆకట్టుకోలేకపోయింది. ஜனவரி 15 முதல் அகிலமெங்கும்Thalapathy @actorvijay @Atlee_dir @gvprakash @Samanthaprabhu2 @iamAmyJackson #ThalapathyVijay #Theri #10YearsOfTheri pic.twitter.com/on3Pr30enp— Kalaippuli S Thanu (@theVcreations) January 10, 2026 చదవండి: బాలీవుడ్ ఎంట్రీ? స్పందించిన మలయాళ హీరోయిన్ -
ధురంధర్ హీరోతో మూవీ.. స్పందించిన సౌత్ హీరోయిన్
మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ 'లోక చాప్టర్ 1: చంద్ర' మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఉమెన్ సెంట్రిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో లోక సినిమాతో పాటు కల్యాణి పేరు కూడా నేషనల్ వైడ్గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే కల్యాణికి బాలీవుడ్ నుంచి కబురు వచ్చినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.ధురంధర్ హీరో సరసన..ధురంధర్ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టిన రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీ 'ప్రళయ్' (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కల్యాణి యాక్ట్ చేయనుందంటూ బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంపై ఎట్టకేలకు కల్యాణి ప్రియదర్శన్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు.. కానీ భాషతో సంబంధం లేకుండా మంచి కథలు ఎప్పుడూ నన్ను వెతుక్కుంటూ వస్తాయి. మంచి కథలు చేయాలన్న అత్యాశ నాకు చాలా ఎక్కువ.అన్నీ నాకే కావాలి!మంచి కథ ఉందంటే మాత్రం.. అది హిందీ, మరాఠి, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం.. ఏ ఇండస్ట్రీ అయినా సరే, అది నాకు సొంతం కావాలని అనుకుంటాను. అలా అని కుప్పలుతెప్పలుగా ఒకేసారి పది సనిమాలు చేయలేను. కథ బాగుంటే భాష నాకు అడ్డంకే కాదు అని తెలిపింది.ప్రళయ్ సినిమా!ప్రళయ్ విషయానికి వస్తే.. జాంబీల నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాకు జై మెహతా దర్వకత్వం వహిస్తారని, ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం కల్యాణిని సంప్రదించారట! ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మాత్రం తను నటించబోయే తొలి స్ట్రయిట్ హిందీ సినిమా ప్రళయ్ అవుతుంది.చదవండి: పరిస్థితి మా చేయిదాటింది: జననాయగణ్ నిర్మాత భావోద్వేగం -
పరిస్థితి మా చేయి దాటిపోయింది: నిర్మాత భావోద్వేగం
తన సినిమాలతో దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్నాడు హీరో విజయ్. ఇకపై ప్రజాసేవకే పరిమితం అవాలనుకున్న ఆయన జన నాయగణ్తో సినిమాలకు వీడ్కోలు పలకాలని భావించాడు. ఇదే తన చివరి చిత్రం అని ప్రకటించాడు. అభిమాన హీరోని చివరిసారి థియేటర్లో చూసుకుని సెలబ్రేట్ చేసుకునే రోజు కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. చివరి నిమిషంలో వాయిదాకానీ సెన్సార్ సమస్య కారణంగా చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో జన నాయగణ్ నిర్మాత వెంకట్ కె నారాయణ భావోద్వేగానికి లోనయ్యాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ.. జన నాగయణ్ సినిమాను 2025 డిసెంబర్ 18న సీబీఎఫ్సీకి పంపించాం. డిసెంబర్ 22న యూఏ 16+ సర్టిఫికెట్ ఇస్తామంటూ మాకు మెయిల్ చేశారు. సడన్గా ఓ ఫిర్యాదుఅలాగే కొన్ని మార్పులు చేయాలన్నారు. వాళ్లు సూచించినట్లుగా ఆ మార్పులు చేసి సినిమాను మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాం. సినిమా రిలీజ్కు మేమన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇంతలో సినిమాపై ఒక ఫిర్యాదు వచ్చిందని, దీన్ని రివైజింగ్ కమిటీకి పంపుతున్నామంటూ జనవరి 5న సెన్సార్ బోర్డు మెయిల్ చేసింది. ఆ ఫిర్యాదు ఏంటో? ఎవరు చేశారో? మాకు స్పష్టత లేదు. పరిస్థితి చేయిదాటిందిపైగా రివైజింగ్ కమిటీని సంప్రదించేందుకు సమయం మించిపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఏదేమైనా పరిస్థితి మా చేయిదాటిపోయింది. సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. అందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా అభిమానులను అలరించిన హీరో విజయ్కు మంచి వీడ్కోలు దక్కాల్సింది! అని విచారం వ్యక్తం చేశాడు.అసలేంటి సమస్య?భగవంత్ కేసరి సినిమాను ఆధారంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం జన నాయగణ్. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సీబీఎఫ్సీ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేసింది. దీంతో రిలీజ్కు మూడురోజుల ముందు చిత్ర నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో అటు చిత్రయూనిట్, ఇటు అభిమానులు సంతోషపడేలోపే మరో బాంబు పేలింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఎఫ్సీ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంన్ను ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. View this post on Instagram A post shared by KVN Productions (@kvn.productions)చదవండి: రాజాసాబ్.. అందుకే ఎవరికీ మా సినిమా ఎక్కలేదు: మారుతి -
నయనతారపై ట్రోలింగ్.. స్పందించిన అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ గురించి అందరికి తెలిసిందే. సినిమాను తెరకెక్కించడమే కాదు..ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రమోషన్స్ చేస్తాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయంలో అనిల్ ప్రమోషన్స్ కూడా పాత్ర కూడా బాగానే ఉంది. స్టార్ హీరో వెంకటేశ్తో ఇన్స్టా రీల్స్ కూడా చేయించి.. సినిమాను అందరికి రీచ్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ‘మనశంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి కూడా అప్లై చేశాడు. సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ప్రమోషన్స్ చేయడం మొదలు పెట్టాడు. షూటింగ్ మొదలైన రోజే.. మెగాస్టార్ చిరంజీవిపై ఓ స్పెషల్ వీడియో వదిలాడు. ఒకపక్క షూటింగ్ చేస్తూనే..మరోపక్క ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. చివరకు నయనతారతో కూడా సినిమా ప్రమోషన్స్ చేయించిన ఘనత అనిల్కే దక్కింది.సాధారణంగా నయనతార మూవీ ప్రమోషన్స్కి చాలా దూరంగా ఉంటారు.తనతో సినిమాలు తీసే దర్శక నిర్మాతలతో ముందుగానే ప్రమోషన్స్కి రానని అగ్రిమెంట్ చేసుకుంటారు. దానికి ఒప్పుకుంటేనే సినిమాకు నయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఎంత పెద్ద స్టార్ సినిమాలో నటించినా, దిగ్గజ దర్శకులు డైరెక్ట్ చేసినా ఆమె మాత్రం ప్రమోషన్స్కి వెళ్లరు.అయితే మనశంకరవరప్రసాద్ గారు సినిమాకు వచ్చేసరికి ఆమె తీరే మారిపోయింది. చాలా హుషారుగా ప్రమోషన్స్ చేసున్నారు. ఆమెతో చేయించిన స్పెషల్ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. అదే సమయంలో నయనతారపై కొంతమేర ట్రోలింగ్ కూడా నడిచింది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఆమె తీరును తప్పుబట్టారు. కోలీవుడ్లో ఎంత పెద్ద స్టార్ హీరోలతో నటించినా, చివరికి తను స్వయంగా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ప్రమోషన్స్కు రాని నయనతార... తెలుగు సినిమాల కోసం ఇలా ముందుకు రావడం ఏంటీ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. తెలుగు సినిమా మీకు అంత ఎక్కువైపోయిందా? అంటూ ఆమెపై విమర్శలు చేశారు.తాజాగా ఈ ట్రోలింగ్పై ‘మనశంకర్ వరప్రాసద్ గారు’ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ఇలాంటి ట్రోలింగ్ని ఆమె పట్టించుకోదని.. తనకు నచ్చిన పని చేస్తుందని చెప్పారు. ‘ఒక్కో సినిమాకు ఒక్కో వైబ్ ఉంటుంది. ప్రతి మూవీకి దర్శకుడు వెళ్లి హీరో, హీరోయిన్లకు కథ చెబుతాడు. అయితే వాళ్లను ఎలా ట్రీట్ చేస్తున్నామనేది ముఖ్యం. మన ప్రవర్తనను బట్టి.. వాళ్లు కూడా మారుతుంటారు. నేను అందరితో కలిసిపోతుంటాను. ప్రతి ఆర్టిస్ట్ని కంఫర్టబుల్గా ఉండేలా చూసుకుంటాను. చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా వచ్చి నా భుజంపై చేయి వేసి మాట్లాడతారు. అంతలా వాళ్లతో కలిసిపోతాను. మనం జన్యూన్గా అడిగినప్పుడు.. మనకున్న బాండ్ని బట్టి చేయను అనే వాళ్లు కూడా ప్రమోషన్స్ చేస్తారు. నయనతార చాలా నిజాయితీగా పని చేస్తారు. తను నటించే సినిమాలకు 100 శాతం న్యాయం చేస్తారు. ‘సినిమాకు ఇది అవసరం..దర్శకుడు పని తీరు ఇలా ఉంటుంది’ అని అమె బలంగా నమ్మినప్పుడు కచ్చితంగా ప్రమోషన్స్ చేస్తారు’ అని అనిల్ చెప్పుకొచ్చారు.‘మన శంకరవరప్రసాద్ గారు’ విషయానికొస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. A Sweet New year Surprise to all of you from team #ManaShankaraVaraPrasadGaruGRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.#MSGonJan12th pic.twitter.com/gT1uHFTwmX— Nayanthara✨ (@NayantharaU) January 1, 2026 -
మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. వరుణవి కోసం..
చిన్నారి వరుణవి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే సింగింగ్ రియాలిటీ షోలో ఈ చిన్నారి పాల్గొంది. పాపకు కళ్లు లేనప్పటికీ.. కమ్మనైన మాటలు, పాటలతో అందరినీ ఫిదా చేస్తుంటుంది. అందుకే తనను అందరూ ఎంతో స్పెషల్గా ట్రీట్ చేస్తుంటారు. ఎలిమినేషన్ అనేది లేకుండా గ్రాండ్ ఫినాలే వరకు వరుణవిని తీసుకొచ్చారు.మాటిచ్చిన మెగాస్టార్ఈ షోకి సుధీర్ యాంకర్గా వ్యవహరిస్తుండగా దర్శకుడు అనిల్ రావిపూడి, పాటల రచయిత అనంత్ శ్రీరామ్, సింగర్ శైలజ జడ్జిలుగా ఉన్నారు. ఇటీవలే అనిల్ రావిపూడి.. వరుణవి కోరిక మేరకు ఆమెను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో చిన్నారి గాత్రానికి, మాటలకు తెగ మురిసిపోయాడు మెగాస్టార్. తనకు ఎటువంటి సహాయం చేయడానికైనా రెడీ అని మాటిచ్చాడు.మాట నిలబెట్టుకున్న చిరంజీవిఇప్పుడా మాటను నిలబెట్టుకున్నాడు. సరిగమప లిటిల్ ఛాంప్స్ గ్రాండ్ ఫినాలేకు చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత హాజరైంది. మెగాస్టార్ పంపించిన రూ.5 లక్షల చెక్కును వరుణవి కుటుంబానికి అందించింది. ఈ డబ్బును వరుణవి పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోతున్నట్లు తెలిపింది.చదవండి: నాచే నాచే కాపీనా? రాజాసాబ్కు ఏకంగా చెప్పు చూపించాడా? -
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్పై ఓ అపవాదు ఉంది. కొన్ని పాటలైతే.. వాటిని ఎక్కడో విన్నట్లుందే అని ప్రేక్షకులే అనుమానపడతారు. కానీ ఈసారి ట్యూన్ కాపీ కొట్టి.. ఒరిజినల్ కంపోజర్కే దొరికిపోయాడు. తమన్ లేటెస్ట్గా ది రాజాసాబ్ సినిమాకు సంగీతం అందించాడు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. అదే 'నాచే నాచే'. ఇందులో ప్రభాస్.. ముగ్గురు హీరోయిన్లయిన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్తో కలిసి స్టెప్పులేశాడు.కాపీ కొట్టాడా?అయితే ఈ పాట ఒరిజినల్ కాదంటూ విమర్శలు వస్తున్నాయి. స్వీడన్కు చెందిన ప్రముఖ డీజే విడోజీన్.. తన ఒరిజినల్ సాంగ్ అలమేయో పాటను ప్లే చేశాడు. ఆ వెంటనే రాజాసాబ్లోని నాచే నాచే పాటను ప్లే చేశాడు. అది మక్కీకి మక్కీ అలాగే ఉండటంతో అతడి కోపం నషాళానికి అంటింది. ఆవేశంతో చెప్పు చూపిస్తూ వీడియో పెట్టాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజాసాబ్ రిలీజ్ఇది చూసిన అభిమానులు ఈ సాంగ్ కూడా కాపీ కొట్టారా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కొద్దిమంది మాత్రం పోనీలే.. ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్ విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా నటించిన ఈ హారర్ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించాడు. జనవరి 9న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. View this post on Instagram A post shared by Vidojean (@vidojean) చదవండి: నావాడిని కలిసానోచ్.. రోహిణి -
నావాడిని కలిసానోచ్.. ఫోటో షేర్ చేసిన రోహిణి!
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది నటి రోహిణి. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' ధారావాహికలో రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించింది. నటిగా, కమెడియన్గా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెండితెరకు తన ప్రయాణాన్ని కొనసాగించింది. నావాడిని కలిశా..మత్తు వదలరా, బలగం, హను-మాన్ వంటి సినిమాలతో పాటు సేవ్ ది టైగర్స్, ఎల్జీఎమ్ (లెట్స్ గెట్ మ్యారీడ్) వెబ్సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. మధ్యలో తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొంది. ఆటతో, మాటతో, కామెడీతో ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా రోహిణి ఓ అబ్బాయితో క్లోజ్గా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. నావాడిని కలిశాను అంటూనే ఓ ట్విస్ట్ ఇచ్చింది. షాకయ్యారా?ఇంతమంచి హ్యాండ్సమ్ అబ్బాయిని ఇచ్చిన చాట్జీపీటీకి థాంక్యూ అని రాసుకొచ్చింది. అయితే ఫస్ట్ ఈ ఫోటో చూడగానే అభిమానులే కాదు బుల్లితెర సెలబబ్రిటీలు కూడా రోహిణి ప్రియుడు అని పొరబడ్డారు. తర్వాత క్యాప్షన్ చూసి ఏఐ (కృత్రిమ మేధ) మాయాజాలమా.. అని నోరెళ్లబెడుతున్నారు.నిజమైతే బాగుండు యాంకర్ అరియానా అయితే సీరియస్గా అక్కా.. ఒక్క క్షణం నిజమే అనుకున్నా.. చాలా సంతోషంగా ఫీలయ్యా అంది. అందుకు రోహిణి స్పందిస్తూ.. నిజమైతే బాగుండు అని రిప్లై ఇచ్చింది. సింగర్ గీతామాధురి.. ఈ అబ్బాయి ఎక్కడున్నాడో వెతికేద్దాం అని ఫన్నీగా కామెంట్ పెట్టింది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) చదవండి: అది సవాల్గా అనిపించింది: ఆషికా రంగనాథ్ -
అది సవాల్గా అనిపించింది : ఆషికా రంగనాథ్
‘‘రవితేజగారు అద్భుతమైన నటుడు. ఆయనతో కలసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో నటించడం హ్యాపీగా ఉంది. వినోదం, భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ మూవీలో మానస శెట్టిగా ఈ తరం అమ్మాయిలు రిలేట్ అయ్యే క్యారెక్టర్ చేశాను. నా పీఏ క్యారెక్టర్లో సత్య కనిపిస్తారు. రవితేజ, సునీల్గార్లు, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను... అందరూ అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటులు. వాళ్ల టైమింగ్ని మ్యాచ్ చేయడం సవాల్ అనిపించింది’’ అని ఆషికా రంగనాథ్ తెలిపారు. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి విలేకరులతో మాట్లాడారు. ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘నా సామి రంగ’లోని ΄ాత్రతో పోల్చుకుంటే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో చేసిన పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ప్రస్తుతం ‘విశ్వంభర, సర్దార్ 2, అది నా పిల్లరా’ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. డింపుల్ హయతి మాట్లాడుతూ– ‘‘కిశోర్ తిరుమలగారు ఈ కథ చెప్పగానే రవితేజగారి భార్య బాలామణి పాత్ర చేయాలనుకున్నాను. ‘ఖిలాడి’ మూవీ తర్వాత రవితేజగారితో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. డైరెక్టర్గారు ప్రతిదీ నటించి, చూపించారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అందరూ రిలేట్ అయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అని పేర్కొన్నారు. -
కల్యాణ్ కృష్ణ చేతుల మీదుగా 'రాయుడి గారి తాలుకా’సాంగ్ రిలీజ్
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘జాతరొచ్చింది’ అనే లిరికల్ సాంగ్ను సోగ్గాడే చిన్ని నాయన ,బంగార్రాజు చిత్రాల దర్శకుడు కల్యాణ్ కృష్ణ కూరసాల విడుదల చేశారు. ఈ మాస్ బీట్ పాటకు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నాగేష్ గౌరీష్ హుషారైన సంగీతాన్ని సమకూర్చారు. గాయని జయశ్రీ పల్లె అద్భుతంగా ఆలపించారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ జాతర పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి,కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
18 ఏళ్లుగా ఎదురుచూపులు.. ఇన్నాళ్లకు మెగా సక్సెస్
ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తేనే గౌరవం. కొరియోగ్రాఫర్ ఆట సందీప్కు కావాల్సినంత టాలెంట్ ఉంది. కానీ విజయం మాత్రం ఆవగింజంత కూడా లేదు. చాలాఏళ్లుగా ఆ సక్సెస్ కోసమే తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కొంతకాలం క్రితం డ్యాన్స్ స్టూడియో ప్రారంభించి భార్యతో కలిసి స్టూడెంట్స్కు డ్యాన్స్ క్లాసులు నేర్పిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల కిందట కెరీర్ మొదలుపెట్టిన సందీప్కు ఎట్టకేలకు సక్సెస్ దొరికింది. రోషన్ 'ఛాంపియన్' మూవీలో 'గిరగిర గింగిరానివే..', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్'లో 'హుక్ స్టెప్' పాటలతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. అతడి జర్నీ ఓసారి చూసేద్దాం..సోషల్ మీడియాలో ఫేమస్ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఆట మొదటి సీజన్లో పాల్గొని విన్నర్గా నిలిచాడు సందీప్. అప్పటినుంచి అతడి పేరు ఆట సందీప్గా స్థిరపడింది. తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లోనూ పార్టిసిపేట్ చేశాడు. సందీప్ భార్య జ్యోతిరాజ్ కూడా డ్యాన్స్ మాస్టరే.. వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే రీల్స్కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ జంట టాలెంట్కు బోలెడన్ని సినిమా అవకాశాలు రావాలని అభిమానులు అభిప్రాయపడ్డారు.గిరగిర గింగిరానివే.. పాటతో క్లిక్సందీప్.. కొరియోగ్రాఫర్గా కొన్ని సినిమాలు చేశాడు కానీ మంచి సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆమధ్య హీరోగా లవ్ యూ టూ అని ఓ మూవీ కూడా చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఇక సందీప్ డ్యాన్స్ రీల్ చూసి ఛాంపియన్ మూవీ నిర్మాత స్వప్నదత్ ఓసారి అతడికి కాల్ చేసింది. తన సినిమాలో కొరియోగ్రఫీ చేయమని అడిగింది. అలా అతడి హిట్ లిస్ట్లో మొదటి పాటగా గిరగిర గింగిరానివే.. వచ్చి చేరింది. సందీప్ దంపతుల టాలెంట్ చిరంజీవికి కూడా తెలిసింది. వెంటనే ఆయన వీరిని ఇంటికి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.ఫేవరెట్ హీరోకి కొరియోగ్రఫీమన శంకర వరప్రసాద్ మూవీలో హుక్ స్టెప్ సాంగ్ చేయమని వరం ప్రసాదించాడు. అసలే సందీప్ ఫేవరెట్ హీరో ఆయన.. అలాంటిది పిలిచి మరీ అవకాశం ఇచ్చాక నిరూపించుకోకుండా ఉంటాడా? సింపుల్గా ఉంటూనే గ్రేస్ కనిపించేలా స్టెప్స్ క్రియేట్ చేశాడు. చిరు కూడా.. అంతే గ్రేస్గా, స్టైలిష్గా స్టెప్పులేశాడు. ఆ వీడియో వైరల్ అవడంతో సందీప్కు ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 18 ఏళ్ల తర్వాత ఇంత మంచి విజయం రావడంతో.. ఇన్నేళ్లుగా పడ్డ కష్టాన్నంతా మర్చిపోయాడు. అనుకున్నది సాధించానని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మరి అతడికి మున్ముందు కూడా మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం.. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) చదవండి: ది రాజాసాబ్లో ఆ సీన్స్ డిలీట్ -
ఇంత మోసమా? 'రాజాసాబ్'లో ఆ సీన్స్ డిలీట్
ప్రభాస్ను వింటేజ్ లుక్లో చూడాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. వారి కోరికలను ఆలపించిన ది రాజాసాబ్ టీమ్.. ప్రభాస్ను మోస్ట్ హ్యాండ్సమ్ లుక్లో చూపించారు. సినిమాలో డార్లింగ్ ఆటలు, పాటలు, కామెడీ, రొమాన్స్.. ఇలా అన్ని ఎమోషన్స్ చూపించాడు. అయితే ఒక్కటి మాత్రం జనాలకు అంతు చిక్కడం లేదు.అటు వింటేజ్ లుక్.. ఇటు ఓల్జ్ ఏజ్ లుక్టీజర్, ట్రైలర్లో ప్రభాస్ను ఓల్డ్ ఏజ్ లుక్లో చూపించారు. సినిమాకు హైప్ తీసుకొచ్చిందే ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్. ఈ సన్నివేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. తీరా సినిమా చూస్తే ఆయా సీన్స్ మచ్చుకైనా లేవు. దీంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. అటు వింటేజ్ లుక్, ఇటు ఓల్జ్ ఏజ్ లుక్లో ప్రభాస్ను చూడాలని ఆశపడ్డవారికి భంగపాటే ఎదురైంది. సినిమాఅయితే ఈ సీన్స్ అన్నీ సెకండ్ పార్ట్లో ఉండచ్చని భావిస్తున్నారు. రాజాసాబ్ విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించాడు. జనవరి 9న రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. Anduke scene eh lepesaru risk ani😭😆#TheRajaSaab https://t.co/EZYyncCc8R— Abhi063 (@Ab0612ish) January 9, 2026 View this post on Instagram A post shared by Movie Mirchi (@movie_mirchi___) First scam in 2026This look 😭😭pic.twitter.com/hP14kp8uX6— 🤙🏻😎 (@Ntr1166177) January 9, 2026 చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ -
మా ఇంటి బంగారం టీజర్: అదరగొట్టేసిన సామ్
హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం'. 'ఓ బేబీ' తర్వాత సామ్తో దర్శకురాలు నందిని రెడ్డి చేస్తున్న రెండో మూవీ ఇది. సమంత స్థాపించిన ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తోంది. శుక్రవారం (జనవరి 9న) మా ఇంటి బంగారం టీజర్ రిలీజ్ చేశారు.టీజర్ రిలీజ్'ఎట్లాగో ఇక్కడివరకు వచ్చినాం కదా.. ఉండిపోదాం...' అన్న సామ్ డైలాగ్తో వీడియో మొదలవుతుంది. అత్తగారిల్లిది.. ఇంకోసారి ఆలోచించుకో అంటే 'అందరూ ఎంతో మంచోల్లలాగా ఉండారు. నాకు చూస్తాంటే ఎప్పటినుంచో తెలిసినట్లుంది. నువ్వు చూస్తా ఉండు, వారం రోజుల్లో ఫుల్లుగా కలిసిపోతాం..' అని సామ్ అత్తారింట్లో అందరితో బాగుండేందుకు ప్రయత్నిస్తుంది. అటు క్లాస్, ఇటు మాస్చీర కట్టు, బొట్టుతో సింపుల్గా అమాయకంగా కనిపిస్తూనే.. యాక్షన్ సీన్స్ అదరగొట్టేసింది. ముఖ్యంగా బస్లో, ఏకంగా అత్తగారింట్లో సమంత ఫైట్ సీన్స్ చేసినట్లు చూపించారు. టీజర్ అయితే అదిరిపోయింది. సామ్ అటు క్లాస్, ఇటు మాస్ లుక్లో కనిపించేసరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు, వసంత్ మారిగంటి కథ అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. -
త్వరలో గుడ్న్యూస్ చెప్తానంటున్న హీరోయిన్
హీరోయిన్, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ గతేడాది పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు మిలింద్ చంద్వానీని 2025 సెప్టెంబర్ 30న వివాహం చేసుకుంది. తాజాగా ఈ జంట ఓ వ్లాగ్లో త్వరలోనే ఒక కొత్త ప్రయాణం మొదలు కానుందని ప్రకటించింది. దీంతో అవికా ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం ఊపందుకుంది.ఈ రూమర్స్ను తాజాగా అవికా గోర్ కట్టిపారేసింది. నేను గర్భవతిని కాదు, అలాంటి విశేషం ఏం లేదు. కాపోతే త్వరలోనే ఓ శుభవార్త చెప్తాను, అదేంటో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే! అని చెప్పింది.ప్రేమ- పెళ్లిఅవికా- మిలింద్ 2020లో హైదరాబాద్లో తొలిసారి కలుసుకున్నారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ఆ స్నేహం ప్రేమగా మారింది. 2025 జూన్లో ఈ లవ్బర్డ్స్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది 'పతీ పత్నీ ఔర్ పంగా' అనే రియాలిటీ షోలో పెళ్లి చేసుకున్నారు.సినిమాఅవికా విషయానికి వస్తే.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్గా మారింది. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, 10th క్లాస్ డైరీస్, షణ్ముఖ వంటి పలు తెలుగు సినిమాలు చేసింది.చదవండి: రాజాసాబ్ రిలీజ్.. థియేటర్లలో మొసళ్లు! -
హీరోయిన్గా రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్..
సినిమా మాధ్యమం చాలా పవర్ఫుల్. దీనికి చాలా మంది ఆకర్షితులవుతారు. పలువురు నటించాలని కలలు కంటారు. అందుకు కొందరు స్ఫూర్తి దాయకులవుతారు. అలా అగ్ర హీరోయిన్ నయనతారని స్ఫూర్తిగా తీసుకుని కథానాయికగా మారింది వర్ధమాన నటి ఐశ్వర్య కేఎస్. ఈమె హీరోయిన్గా నటించిన జస్టీస్ ఫర్ జెనీ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందింది. చిన్నతనం నుంచి ఆసక్తిపవర్ ఫుల్ పోలీస్ అధికారిగా భావోద్వేగాలతో కూడిన పాత్రలో నటించిన ఐశ్వర్య నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తాజాగా ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు చెప్పింది. తనకు చిన్నతనం నుంచి కళలు, క్రీడలపై ఆసక్తి ఎక్కువ అంది. తాను కబడ్డీ క్రీడలో రాష్ట్ర స్థాయిలో తమిళనాడు తరఫున పోటీల్లో పాల్గొన్నానని చెప్పింది. అలా శారీరక వ్యాయామం చేయడం వల్ల నటనపై కూడా ఆత్మవిశ్వాసం కలిగిందని తెలిపింది.నా జీవితాన్ని మలుపు తిప్పిందికోవిడ్ కాలంలో ఒక షార్ట్ ఫిలింలో నటించే అవకాశం వచ్చిందని, అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొంది. తర్వాత జస్టిస్ ఫర్ జెనీలో నటించే అవకాశం వచ్చిందంది. తాజాగా నట్టి నటరాజ్కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయంది. స్వయంకృషితో శ్రమించి అగ్ర కథానాయికగా ఎదిగిన నయనతార తనకు స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చింది. దర్శకులు వెట్రిమారన్, మారిసెల్వరాజ్ చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానంది. అలాగే కొత్త ఆలోచనతో వస్తున్న యువ దర్శకుల చిత్రాల్లోనూ నటించడానికి సిద్ధమంటోంది. -
రాజాసాబ్ రిలీజ్.. థియేటర్లలో మొసళ్లు!
డార్లింగ్ ప్రభాస్ హారర్ జానర్లో తొలిసారి నటించిన చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. గురువారం (జనవరి 8) నుంచే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి. దీంతో అభిమానులు థియేటర్ లోపల, బయట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మొసళ్లు పట్టుకుని థియేటర్లో హంగామా చేసినట్లు వీడియోలు వైరలవుతున్నాయి.థియేటర్లో మొసళ్లు?అయితే అవి నిజం మొసళ్లు కాదు, డమ్మీవి.. ఆ మాటకొస్తే కొన్ని వీడియోలు కూడా నిజమైనవి కావని తెలుస్తోంది. ఓ వీడియోలో సీట్లన్నీ ఒకవైపు ఉంటే.. స్క్రీన్ మాత్రం సీట్లకు ఎదురుగా కాకుండా కుడివైపు ఉంది. దీన్ని బట్టి అది ఫేక్ వీడియో అని ఇట్టే అర్థమవుతోంది. మరో వీడియోలో అయితే అందరూ మొసళ్లు పట్టుకుని రాజాసాబ్ అని నినాదాలు చేస్తున్నారు. అదీ సంగతి!ఇక ఇంకో వీడియోలో ఓ బొమ్మ మొసలిని పట్టుకుని ఆడించారు. ఇదైతే నిజమే అని తెలుస్తోంది. ది రాజాసాబ్ మూవీలో ప్రభాస్ మొసలితో పోరాడే సన్నివేశం ఉంటుంది. ట్రైలర్లోనూ ఆ క్లిప్ చూపించారు. దీంతో అభిమానులకు థియేటర్లో మొసళ్లు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. కొందరు డమ్మీ బొమ్మలతో ఆడుతుంటే మరికొందరు ఏకంగా ఏఐ వీడియోలు సృష్టిస్తున్నారు. సినిమారాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటులు సంజయ్దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 9న గ్రాండ్గా విడుదలైంది. Prompt crt ga eyaledu bhai adu screen atu side untey seats etu side pettadu https://t.co/mlcCuWnGui— Nikkar Narayana ™ (@urstrulynikkar1) January 8, 2026Omg 😱 see the Rebels bring crocodile 🐊 to #RajaSaab movie theatres 🥵🔥💥#Prabhas 🔥🔥🥵 pic.twitter.com/4FuA3V1UdP— ℙℝ𝔼𝔼𝕋𝕐 (@MySelf_Preety) January 8, 2026Ehh mental nakoduluu crocodile 🐊 ni sav dengaru climax lo edi USA ani chepandra vadikii 🥵🥵🥵😭😭💥💥💥💥💥#RajaSaab pic.twitter.com/e7Io1fZ1PZ— Virat Kohli (@Kranthi_1322) January 8, 2026 చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ -
పలు సవాళ్లు.. అన్నీ దాటుకుని సినిమా తీశా: సుధా కొంగర
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం పరాశక్తి. శ్రీలీల హీరోయిన్. రవిమోహన్ ప్రతినాయకుడిగా, అధర్వ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో నిర్మాత ఆకాశ్ భాస్కర్ తన డాన్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శనివారం తెరపైకి రానుంది. స్క్రీన్ప్లే రాయడమే ఛాలెంజింగ్ఈ సందర్భంగా దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ.. పరాశక్తి సినిమా కథ రాసినప్పుడు పలువురి నుంచి అభినందనలు, అదే సమయంలో కథ గురించి పలు సందేహాలు తలెత్తాయన్నారు. ఈ సినిమాకు స్క్రీన్ప్లే రాయడమే ఛాలెంజింగ్గా మారిందన్నారు. అదే విధంగా సినిమా రిలీజ్ తర్వాత పలు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురూ హెచ్చరించారన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయాలని అయితే దర్శకుడు మణిరత్నంలాగా ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలని భావించి.. పలు సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ సినిమాను నమ్మిన నిర్మాత ఆకాశ్ భాస్కర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నటీనటులతో పాటు, సాంకేతిక వర్గం ఈ సినిమాకోసం ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. పరాశక్తి తమిళ చిత్రపరిశ్రమలో ప్రత్యేక సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
సినిమాలు తక్కువ.. ఇంటర్వ్యూలు ఎక్కువ!
సినిమాకు ప్రమోషన్స్ కచ్చితంగా కావాల్సిందే! కంటెంట్ సంగతి పక్కనపెడితే.. ఫలానా మూవీ థియేటర్లలో వస్తుందని తెలిసేది ప్రమోషన్స్ వల్లే! కాబట్టి రిలీజయ్యేవరకు గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సిందే.. తర్వాత టాక్ బాగుంటే సినిమా దానంతటదే పుంజుకుంటుంది! అందుకే ఈ మధ్య రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.సినిమాల కన్నా ఇంటర్వ్యూలే ఎక్కువఅయితే పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కూడా ఈ ప్రమోషన్స్లోకి లాగుతున్నారు. సందీప్ రెడ్డి ఇప్పటివరకు మూడే మూడు సినిమాలు తీశాడు. 2017లో అర్జున్ రెడ్డితో బ్లాక్బస్టర్ కొట్టాడు. దాన్నే హిందీలో కబీర్ సింగ్గా రీమేక్ చేసి అక్కడా విజయం సాధించాడు. రెండేళ్ల క్రితం యానిమల్ మూవీతో మరోసారి రికార్డులు తిరగరాశాడు. తొమ్మిదేళ్లలో మూడు సినిమాలు తీస్తే.. ఇంటర్వ్యూలు మాత్రం అందుకు రెట్టింపు సంఖ్యలో చేశాడు.ఆర్ఆర్ఆర్ నుంచి..ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ సమయంలో దర్శకధీరుడు రాజమౌళితో ఇంటర్వ్యూ, దేవర సమయంలో జూనియర్ ఎన్టీఆర్తో, కింగ్డమ్ అప్పుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో, శివ రీరిలీజ్ సమయంలో రాంగోపాల్ వర్మతో.. ఇలా వరుసగా ఇంటర్వ్యూలు చేశాడు. హాయ్ నాన్న రిలీజ్ సమయంలో నానిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడు ది రాజా సాబ్ కోసం రంగంలోకి దిగాడు. రాజాసాబ్ హీరోహీరోయిన్లు ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్లను ఇంటర్వ్యూ చేశాడు. బుల్లెట్ పాయింట్ ప్రశ్నలుఅందరూ సందీప్నే యాంకర్గా ఎంచుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. జనాల్లో అతడికున్న క్రేజ్.. అలాగే తన ఇంటర్వ్యూలో సాగదీత అనేది ఉండదు. బుల్లెట్ పాయింట్స్లా ప్రశ్నలడుగుతాడు. ఇంటర్వ్యూ ఎంతసేపు అయినా బోర్ కొట్టకుండా జనాలు మైమరచిపోయి చూస్తుండిపోయేలా చేయగలడు. అతడి అభిప్రాయాలు చాలామంది సినీప్రేక్షకులకు కనెక్ట్ అవడం మరో విశేషం. పైగా పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి బాలీవుడ్లోనూ బజ్ క్రియేట్ అవుతుందన్న ఆశ కూడా ఉండొచ్చు! అందుకే వంగాతో ఇంటర్వ్యూ అంటే అటు చిత్రయూనిట్కు, ఇటు సినీప్రియులకు ఎంతో ఇష్టం! చదవండి: 23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే -
చైతో పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
హీరోయిన్ శోభిత ధూళిపాళ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత తన మొదటి సినిమాను ప్రకటించింది. ఈ సినిమా పేరు "చీకటిలో". ఇది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో చీకటిలో మూవీ జనవరి 23 నుంచి ప్రసారం కానున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు పోస్ట్ పెట్టింది.థ్రిల్లర్ మూవీలో శోభితఈ మేరకు చీకటిలో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో శోభిత తలకు హెడ్ఫోన్స్ పెట్టుకోగా ఎదుట మైక్ ఉంది. బహుశా తను రేడీయో జాకీ అయి ఉండవచ్చు. ఆమె పాత్ర పేరు సంధ్య అని వెల్లడించారు. హీరోయిన్ వెనకాల ఏదో నేరానికి సంబంధించిన విచారణ తాలూకు సెటప్ ఉంది. దీన్ని బట్టి ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అని ఇట్టే తెలిసిపోతుంది.పెళ్లి తర్వాత మొదటి మూవీకాగా శోభిత ధూళిపాళ.. 2024లో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఎటువంటి సినిమా ప్రాజెక్టు ప్రకటించలేదు. ఇప్పుడు సడన్గా చీకటిలో ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. చీకటిలో సినిమాలో విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని డి.సురేశ్ బాబు నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. మరి ఈ థ్రిల్లర్ తెలుగు మూవీలో శోభిత ఎలా మెప్పిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by prime video IN (@primevideoin)చదవండి: నా కూతురికి కష్టపడాల్సిన అవసరమే లేదు: చిరంజీవి -
‘అనగనగా ఒక రాజు’ మూవీ ట్రైలర్ రివ్యూ
ఈ సంక్రాంతికి చివరిగా రాబోతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్. నవీన్ మార్క్ కామెడీతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది ఈ ట్రైలర్. ‘అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి చాలా పెద్ద మనసు’ అంటూ నాగార్జున వాయిస్ ఓవర్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. గుడిలో ఉన్న హుండీలో నోట్ల కట్టను వేసేందుకు హీరో ప్రయత్నించడం..అందులో పట్టకపోవడంతో ‘పంతులుగారు.. ఎన్నిసార్లు చెప్పానండి..కన్నం పెద్దది చేయమని..నోట్లు పట్టట్లేదు’ అని నవీన్ అంటే.. చిల్లర వేయడం కోసం చిన్నగా పెట్టామని పంతులు అంటాడు. వెంటనే ‘చిల్లరగాళ్ల కోసం సపరేట్ హుండీ పెట్టండి’ అని నవీన్ పంచ్ విసురుతారు. ఇలా ట్రైలర్ మొత్తం నవీన్ మార్క్ కామెడీతో సాగుతుంది. అమెరికాకు వెళ్లే యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకునే యువతి పాత్రలో మీనాక్షి చక్కగా నటించింది. మీనాక్షి, నవీన్ ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరించదని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. నవీన్, మీనాక్షి ప్రేమకథకు వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "పండగకు అల్లుడు వస్తున్నాడు" అంటూ ఎద్దులబండిపై నవీన్ ను చూపిస్తూ సంక్రాంతికి పండుగను ముందుగానే తీసుకొచ్చారు. మొత్తానికి, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పండగ వాతావరణం అన్నీ కలగలిసిన సినిమా ‘అనగనగా ఒక రాజు’ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే!
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 23 ఏళ్లవుతోంది. ఈ రెండు దశాబ్దాలలో ఎన్నో హిట్స్ ఇచ్చాడు. కానీ, ఇంతవరకు ఒక్క అవార్డు కూడా అందుకోలేదు. తను డైరెక్ట్ చేసిన సినిమాలు అవార్డులు గెలిచాయి కానీ ఉత్తమ దర్శకుడిగా ఆయనకు మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. తాజాగా భారత జాతీయ సినీ అకాడమీ (NICA) ప్రెస్మీట్కు హాజరైన రోహిత్ శెట్టి ఈ అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.యాంకరింగ్ చేయమని..ఆయన మాట్లాడుతూ.. నాకు, అవార్డులకు మధ్య సంబంధమే లేదు. ఇప్పటివరకు 17 సినిమాలు తీశాను. అవార్డు ఫంక్షన్కు పిలుస్తుంటారు, కానీ హోస్ట్గా చేయమని మాత్రమే ఇన్విటేషన్ వస్తుంటుంది. అలా అవార్డుల ఫంక్షన్లో యాంకర్గా మాత్రమే కనిపించాను అన్నాడు.ఎప్పుడో మొదలైందినార్త్ వర్సెస్ సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సినిమా రిలీజైతే పండగ చేసుకోవాలి. సినిమా అనేది మొదలైనప్పటినుంచే ఇక్కడి వాళ్లు దక్షిణాదిలో.. దక్షణాదివాళ్లు బాలీవుడ్లో సినిమాలు తీస్తున్నారు. 1950 నుంచే ఇదంతా జరుగుతోంది. మనం ప్రాంతీయ బేధాలు చూడకుండా సినిమా సెలబ్రేట్ చేసుకోవాలి. సోషల్ మీడియా వల్ల ప్రపంచమే చిన్నగా మారిపోయింది. ఇప్పుడు అందరూ అందరికీ తెలుసు. అందరం కలిసికట్టుగా పనిచేసి సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి అని చెప్పుకొచ్చాడు.సినిమారోహిత్ శెట్టి.. జమీన్, గోల్మాల్, సింగం, చెన్నై ఎక్స్ప్రెస్, సింగం రిటర్న్స్, సూర్యవంశీ, సర్కస్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా సింగం అగైన్ సినిమా తీశాడు. అజయ్ దేవ్గణ్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, దీపికా పదుకుణె, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.370 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రోహిత్ శెట్టి 'గోల్మాల్' ఫ్రాంచైజీలో 5వ సినిమా తీస్తున్నాడు.చదవండి: హీరో తరుణ్ రీఎంట్రీ.. మూడేళ్లుగా నిరీక్షణ -
హీరో తరుణ్ రీఎంట్రీ.. మూడేళ్లుగా నిరీక్షణ!
నేచురల్ యాక్టింగ్తో పక్కింటి కుర్రాడు అనిపించుకున్నాడు హీరో తరుణ్. వరుసగా హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లు అందుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఇతడికి తిరుగులేదు.. నెక్స్ట్ స్టార్ హీరో ఇతడే అనుకున్న తరుణంలో సడన్గా కనిపించకుండా పోయాడు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా.. అవేంటో అభిమానులకు కూడా సరిగ్గా తెలీని పరిస్థితి! ఈరోజు (జనవరి 8న) తరుణ్ బర్త్డే.. ఈ సందర్భంగా తరుణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..తల్లిదండ్రుల అడుగుజాడల్లో..సీనియర్ నటి రోజా రమణి, నటుడు సుశాంత్ చక్రపాణిల కుమారుడే తరుణ్. చిన్న వయసులోనే తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిచాడు. నాయకుడు, అగ్ని నక్షత్రం, అంజలి, మనసు మమత, ఆదిత్య 369, పిల్లలు దిద్దిన కాపురం, తేజ వంటి సినిమాల్లో బాలనటుడిగా యాక్ట్ చేశాడు. అంజలి మూవీకిగానూ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్గా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్'నువ్వే కావాలి' మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఫస్ట్ సినిమాకే ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ మూవీ వందరోజులకు పైగా ఆడటంతో పాటు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కొల్లగొట్టింది. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, నవ వసంతం.. ఇలా ఎన్నో హిట్స్ అందుకోవడంతో పాటు లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కోలీవుడ్కి గుడ్బైదీంతో తమిళంలో అవకాశాలు రాగా అక్కడ కూడా రెండు సినిమాలు చేశాడు. కానీ అవి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడేసరికి కోలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. తరుణ్ను తెలుగులోనూ వరుస ఫ్లాపులు వెంటాడాయి. కథల ఎంపికలో పొరపాట్లు చేయడంతో మళ్లీ పరాజయాలే చూశాడు. 2018లో వచ్చిన ఇది నా లవ్ స్టోరీ మూవీలో చివరిసారిగా కనిపించాడు. ఇది డిజాస్టర్ అయ్యేసరికి సినిమాలే వదిలేశాడు.రీ ఎంట్రీ ఆలస్యం!అయితే 2023లో రోజా రమణి.. తరుణ్ రీఎంట్రీ ఉంటుందని ప్రకటించింది. ఒక సినిమాతోపాటు ఒక వెబ్సిరీస్కు కూడా సంతకం చేశాడంది. కానీ, ఇంతవరకు వాటి గురించి ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు. లేటుగా వచ్చినా పర్లేదు కానీ మంచి కంటెంట్తో రీఎంట్రీ ఇస్తే అంతే చాలని కోరుకుంటున్నారు తరుణ్ అభిమానులు. తరుణ్ను మళ్లీ వెండితెరపై చూసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
ఏజెంట్ సమయంలో మాటిచ్చి నిలబెట్టుకున్నారు!
'నారీ నారీ నడుమ మురారి' సినిమా కథ విన్నప్పుడు మంచి సినిమా చేసే అవకాశం వచ్చిందనిపించి, వెంటనే అంగీకరించాను. అంతేకానీ.. ఈ మూవీలో నా క్యారెక్టర్కు ఎంత స్క్రీన్ టైమ్ ఉంటుంది? నాతో పాటు మరో హీరోయిన్ నటిస్తున్నారా? లేదా? అన్న విషయాలను ఆలోచించలేదు. ఈ సినిమాకు స్టోరీ ఈజ్ కింగ్. మంచి వినోదాత్మక చిత్రం. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని తెలిపింది హీరోయిన్ సాక్షి వైద్య.కామెడీ టైమింగ్ అద్భుతంశర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఇందులో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర, రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ మూవీ జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాక్షి వైద్య విలేకరులతో మాట్లాడుతూ.. ఈ మూవీలో అమాయకంగా, చాలా నిజాయితీగా ఉండే నిత్య పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ నాకు పర్సనల్గానూ రిలేట్ అవుతుంది. శర్వాగారి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. సంయుక్తతో నాకు మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. మాట నిలబెట్టుకున్నారుతెలుగులో డైలాగ్స్ చెప్పడంలో దర్శకుడు రామ్గారు నాకు సాయపడ్డారు. నాకు మరోసారి అవకాశం కల్పిస్తానని ఏజెంట్ మూవీ సమయంలోనే నిర్మాత అనిల్ సుంకర గారు చెప్పారు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ఆ మాటను నిలబెట్టుకున్నారు. అనూప్గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను ఫిజియోథెరపీ చేశాను. కానీ, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం లేదు. సంక్రాంతిని మేం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఉత్తరాదితో సంక్రాంతి సెలబ్రేషన్స్ హడావుడి కాస్త తక్కువగా ఉంటుంది. కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశాను అని చెప్పుకొచ్చింది.చదవండి: ఈ కష్టం తనకు అవసరమే లేదు: కూతురిపై చిరంజీవి ప్రశంసలు -
ఈ కష్టం తనకు అవసరమే లేదు.. కూతురిపై చిరు ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్చరణ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాణిస్తున్నాడు. పెద్ద కూతురు సుష్మిత చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా, తండ్రికి స్టైలిస్ట్గా పని చేస్తోంది. అలాగే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి నిర్మాతగానూ మారింది. చిరు ప్రధాన పాత్రలో నటించిన 'మన శంకర వరప్రసాద్గారు' మూవీని సాహు గారపాటితో పాటు మెగాస్టార్ కూతురు సుష్మిత నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కూతురిపై ప్రశంసలు కురిపించాడు చిరంజీవి.ఇదంతా అవసరమా?'నా బిడ్డ సుష్మిత సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు ఈ పరిశ్రమ కచ్చితంగా ఆదరిస్తుందని చెప్పాను. మీరు కష్టపడి పనిచేస్తే విజయం సాధిస్తారన్నాను. నేనయితే కష్టాలు చిన్నప్పుడే చూశాను. కానీ, నా కూతురు కష్టపడుతుంటే ఒక తండ్రిగా ఇదంతా అవసరమా? అనిపించేది. తను మాత్రం ఒక బిడ్డగా మా నాన్నను ఇంప్రెస్ చేయాలి, నిర్మాతగా హీరోకు ది బెస్ట్ ఇవ్వాలి అని మామూలు టెక్నీషియన్లా ప్రయత్నించింది.నన్ను ఆదర్శంగా తీసుకునితనకు అన్నిరకాలుగా కంఫర్ట్స్ ఉన్నాయి. అసలు ఈ సినిమా చేయాల్సిన అవసరమే లేదు. తన కుటుంబాన్ని చూసుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది. కానీ తను అలా ఆలోచించలేదు, ఏదో సాధించాలనుకుంది. నువ్వు సాధించి చూపించావ్.. ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నావు. అలాంటి నిన్ను ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఎంతో కొంత కృషి చేస్తాం అని ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలాగో హిట్టవుతుంది. ఇలాంటి గర్వకారణమైన సినిమాను నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు తనెంతో సంతోషపడుతుందని నాకు తెలుసు.థాంక్యూ పాపఈ పరిశ్రమలో నాకు చేదోడువాదోడుగా ఉంటూ, నాకు భుజం కాస్తూ, అన్ని రకాలుగా అండదండలందిస్తూ.. ఇంటికి పెద్దదైనందుకు పెద్దరికాన్ని సొంతం చేసుకుంటూ తోడుగా ఉన్నందుకు థాంక్యూ పాప.. అన్నాడు. ఆయన స్పీచ్ విని సుష్మిత వెంటనే తండ్రి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వరప్రసాద్ మూవీ జనవరి 12న విడుదల కానుంది.చదవండి: హుక్ స్టెప్.. వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్ -
ఆహా ఓహో..అస్సలు సినిమా ముందుంది అంటున్న ఐశ్వర్య!
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా.. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. అతని మేనల్లుడు ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా నుంచి ‘అస్సలు సినిమా ముందుంది’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఆహా ఓహో అంటాడు.. అందం నీదే అంటాడు అనే పదాలతో మొదలైన ఈ సాంగ్ ఊపుతెప్పించే లిరిక్స్ తో ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రీయ ఘోషల్ పాడారు. ఈ పాటలో ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ అవుతుండగా.. అనూప్ రూబెన్స్ బాణీలు అదుర్స్ అనేలా ఉన్నాయి. -
ఆ డైరెక్టర్ భార్యను కొడితే కోమాలోకి వెళ్లింది: పూనమ్ కౌర్
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్కి టచ్లో ఉంటుంది. తనకు నచ్చిన విషయాలనే ఓపెన్గా మాట్లాడడం.. పాలిటిక్స్తో పాటు సినీ ఇండస్ట్రీ విషయాలపై కూడా స్పందించడం పూనమ్కు అలవాటు. ఆమె చేసే పోస్టులు కొన్ని కాంట్రవర్సీగా, చర్చనీయాంశంగానూ మారాయి. పలుమార్లు ఆమెపై ట్రోలింగ్ కూడా నడిచింది. అయినా కూడా పూనమ్ తన వైఖరిని మార్చుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ హీరోయిన్తో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను చిత్ర హింసలకు గురి చేశాడంటూ పూనమ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారాయి.(చదవండి: ఎన్నో దారుణాలు చూశా.. నాకు విలువ లేదు.. అందుకే విడాకులు!)తాజాగా పూనమ్(Poonam Kaur ) ఓ యూట్యూబ్ చానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేదు అనుభవాల గురించి వివరిస్తూ..సోషల్ మీడియాలో చేసే పోస్టులపై గురించి కూడా మాట్లాడింది. 'మన ఇల్లు బాగుండాలని పక్కింటిని కూల్చేయడం సరికాదు. అది కూడా చదువుకున్న వ్యక్తి ఇలా చేయడం చాలా బాధాకరం. డబ్బు ఏదైనా చేయిస్తుంది' అంటూ గతంలో పూనమ్ చేసిన ట్వీట్ గురించి యాంకర్ ప్రశ్నించగా..దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటో ఆమె వివరించింది.‘నేను ఊరికే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టను. నా హార్ట్కు టచ్ అయిన విషయాల గురించే మాట్లాడుతుంటాను. మీకు తెలుసా... ఓ డైరెక్టర్, ఓ హీరోయిన్ కోసం తన భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. అతడు కొట్టడంతో ఆమె ఐదారు రోజుల పాటు కోమాలోకి వెళ్లింది. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే జరిగింది. అన్యాయం జరిగినా ఆ మహిళ మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అంతేకాదు ఇదంతా జరిగిన తర్వాత కూడా సినిమా ఈవెంట్లకు భర్తతో కలిసి హాజరైంది. ఆ దర్శకుడి సినీ జీవితం గురించి ఆమె ఆలోచించి.. హీరోయిన్తో పెట్టుకున్న సంబంధం గురించి బయటకు చెప్పలేదు. ఈ విషయం తెలుసుకుని నేను చాలా షాకయ్యాను. మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నాను’ అని పూనమ్ చెప్పుకొచ్చింది. అయితే ఆ దర్శకుడు, హీరోయిన్ ఎవరనేది మాత్రం ఆమె బయటకు వెల్లడించలేదు. ప్రస్తుతం పూనమ్ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అతను ఎవరా? అనే చర్చ కొనసాగుతోంది. -
హైకోర్టులో చిరు, ప్రభాస్ నిర్మాతలకు ఊరట
మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లను పెంచుకునేలా అనుమతి ఇవ్వాలంటూ రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టికెట్ ధరల పెంపు తోపాటు ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేశారు. 'రాజాసాబ్' చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ కౌన్సిల్ అవినాష్ దేశాయి వాదనలు వినిపించారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ఈ సినిమాలకు వర్తించవని, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు.గతంలో సింగిల్ బెంచ్, హోమ్ సెక్రటరీకి ఎలాంటి సినిమాలకైనా టికెట్ ధరల పెంపు మెమో జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్' నిర్మాతలు అప్పీల్ చేశారు. "మేము ఇప్పటికే హోమ్ సెక్రటరీకి టికెట్ ధరల పెంపు కోసం అభ్యర్థన చేశాం. కానీ సింగిల్ జడ్జ్ ఆదేశాల వల్ల ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు" అని నిర్మాతల న్యాయవాది వాదించారు.సింగిల్ జడ్జ్ ఆదేశాలు మూడు సినిమాలు - 'పుష్ప 2', 'ఓజీ', 'అఖండ 2', గేమ్ ఛేంజర్ - టికెట్ ధరల విషయంలోనే దృష్టిలో పెట్టుకుని ఇచ్చినవని, అవి 'రాజాసాబ్', 'మన శంకర్ వరప్రసాద్'కు ఎలా వర్తిస్తాయని న్యాయవాది ప్రశ్నించారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప2, ఓజీ, గేమ్ చెంజర్, అఖండ2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేస్తూ.. నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. -
సమంత మాస్ లుక్.. సంక్రాంతికి సర్ప్రైజ్
స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ని స్థాపించి.. తొలి ప్రయత్నంగా 'శుభం' అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అందుకుంది. అదే బ్యానర్పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఇందులో ఆమే హీరోయిన్. ‘ఓ బేబీ’ తర్వాత సామ్తో కలిసి నందిని రెడ్డి చేస్తున్న రెండో సినిమా ఇది. అయితే దర్శకురాలు పేరు తప్ప.. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ని పంచుకుంది సమంత. (చదవండి: ఓటీటీలో తమిళ ఫీల్గుడ్ మూవీ.. ఎక్కడంటే?)సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి.. ఫ్యాన్స్కి సర్ప్రైజ్ చేసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ని కూడా విడుదల చేశారు. ‘మీరు చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది’ అంటూ ఆ పోస్టర్కి క్యాప్షన్ రాసుకొచ్చారు. జనవరి 9న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్తోన్న బ్యూటీ.. ఎప్పుడో మరి!)ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా..సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుఉతున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఓటీటీలో ఫీల్గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యదార్థ సంఘటనలతో తెరకెక్కిన సినిమా అంగమ్మాల్. దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ కోడలైన గీత కైలాసం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించాడు. రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన కొడు తుని అనే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్ నెక్స్ట్లో జనవరి 9 నుంచి ప్రసారం కానుంది. అయితే కేవలం తమిళ భాషలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.అంగమ్మాల్ కథ విషయానికి వస్తే..జీవితాంతం రవిక అంటే ఏంటో తెలీక బండచాకిరీ చేస్తూ కొడుకుల్ని పోషించింది తల్లి. భర్త పోయాక ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాకింది. చిన్న కొడుకు పట్నానికి వెళ్లి చదువుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకుని సంబంధం మాట్లాడేందుకు అతడి ఊరొస్తామంటారు.పట్నంలో పెరిగిన హైక్లాస్ మనుషులు అమ్మ పద్ధతి, ప్రవర్తన చూస్తే ఏమనుకుంటారు? రవిక లేకుండా చూస్తే నోరెళ్లబెట్టరా? అని ఆలోచించిన చిన్నకొడుకు తల్లిని జాకెట్ వేసుకోవాల్సిందేనని పట్టుబడతాడు. చివరకు ఏం జరిగిందనేది మిగతా కథ! Her name says it all. Angammal. Angammal From Jan 9th#SunNXT #AngammalOnSunNXT #Angammal@kaarthekeyens @ksubbaraj @njoy_films @stonebenchersWriter: @perumalmurugan_offl@kailasam.geetha @_saranofficial @actor_bharani @thendral_raghunathan @mullaiyarasii @vinodanandr… pic.twitter.com/B3YeHx5zuk— SUN NXT (@sunnxt) January 6, 2026 చదవండి: పెళ్లి చేసుకుంటా: స్త్రీ 2 హీరోయిన్ -
శ్రీవారి సేవలో 'సంక్రాంతికి వస్తున్నాం' తారలు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ దర్శించుకున్నారు. బుధవారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం హీరోయిన్లు ఇద్దరూ తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. జనవరి 14న తాను హీరోయిన్గా నటించిన అనగనగా ఒక రాజు విడుదలవుతోందని తెలిపింది. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సినిమా రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. అలాగే ఈ ఏడాది మధ్యలో నాగచైతన్యతో నటించిన సినిమా విడుదలవుతుందని వెల్లడించింది. ఐశ్వర్య రాజేశ్.. సంక్రాంతికి విడుదలవుతున్న ప్రతి సినిమాకు ఆల్ ద బెస్ట్ తెలియజేసింది.ఐశ్వర్య రాజేశ్ తెలుగమ్మాయే అయినా తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తూ కోలీవుడ్లో స్థిరపడింది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించి ఇక్కడివారికి దగ్గరైంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా నటించింది.సంక్రాంతి సినిమాల విషయానికి వస్తే..జనవరి 9న ప్రభాస్ ‘ది రాజా సాబ్’, విజయ్ 'జననాయకుడు' విడుదలవుతున్నాయి. జనవరి 10న శివకార్తికేయన్ 'పరాశక్తి', జనవరి 12న చిరంజీవి 'మన శంకర్ వరప్రసాద్ గారు', జనవరి 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', జనవరి 14న నవీన్ పొలిశెట్టి 'అనగనగ ఓరాజు', శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి' రిలీజవుతున్నాయి.చదవండి: వయసు గురించి ఆలోచించేదే లేదంటున్న చందమామ -
శివకార్తికేయన్కు కథ చెప్పిన పార్కింగ్ డైరెక్టర్!
సినిమా ఒక మాయాజాలం. ఇక్కడ ఎవరు, ఎప్పుడు పాపులర్ అవుతారో, ఎవరు ఎవరితో కలసి చిత్రాలు చేస్తారో ఊహించలేం. ఉదాహరణకు రజనీకాంత్ 173వ చిత్రం విషయానికే వస్తే దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే చర్చ జరిగింది. ధనుష్ సహా పలువురు దర్శకుల పేర్లు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా దర్శకుడు సుందర్ సి పేరు ఖరారైంది. డాన్ దర్శకుడితో రజనీకాంత్దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాంటిది హఠాత్తుగా ఆయన ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ పేరు తెరపైకి వచ్చింది. ఆహా.. లక్కీచాన్స్ అని అందరూ అనుకున్నారు. అంతలోనే డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు పేరు వినిపించింది. అయితే తాజాగా డాన్ చిత్రం ఫేమ్ శిబి చక్రవర్తి పేరు ఖరారైంది.పార్కింగ్ డైరెక్టర్ఇకపోతే పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ ఏం చేస్తున్నారని ఆరా తీస్తే ఆయన ఇటీవల శివకార్తికేయన్కు కథ వినిపించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన నటించిన పరాశక్తి చిత్రం ఈనెల 10న తెరపైకి రానుంది. తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఒక వేళ రామ్కుమార్ బాలకృష్ణన్ కథకు పచ్చజెండా ఊపితే వెంకట్ ప్రభుతో మూవీ చేశాకే ఆయన చిత్రం ఉండే అవకాశం ఉంది.చదవండి: ఉస్తాద్ భగత్సింగ్లో ఛాన్స్.. అందుకే వదిలేసుకున్నా: హీరోయిన్ -
నేను పెళ్లి చేసుకుంటా: శ్రద్ధా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కు 38 ఏళ్లు. ఇప్పటికీ తన ఫోకస్ అంతా సినిమాలపైనే తప్ప పెళ్లిగురించి ఆలోచించడమే లేదు. అయితే కొంతకాలంగా రచయిత రాహుల్ మోదీతో ప్రేమాయణం నడుపుతోంది. తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది.పెళ్లి చేసుకుంటాసోషల్ మీడియాలో జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది శ్రద్ధా కపూర్. ఈ మేరకు ఓ యాడ్ వీడియో పోస్ట్ చేసింది. అందులో లవ్- బ్రేకప్ గురించి మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు.. మీ పెళ్లి సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. దానికి హీరోయిన్ స్పందిస్తూ... నేను కూడా పెళ్లి చేసుకుంటా అని రిప్లై ఇచ్చింది. అది చూసి ఆశ్యర్యపోయిన అభిమానులు.. పెళ్లెప్పుడు? అని ఆరా తీస్తున్నారు.సినిమాశ్రద్ధా సినిమాల విషయానికి వస్తే.. ఈమె చివరగా స్త్రీ 2 సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం శ్రద్ధా.. తుంబాడ్ సినిమా ప్రీక్వెల్ పహడ్పాంగిర మూవలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్త్రీ 3, భేడియా 2 మూవీస్లోనూ యాక్ట్ చేయనుంది. ప్రస్తుతం ఈతా సినిమాలో యాక్ట్ చేస్తోంది.చదవండి: దర్శకురాలిగా హనుమాన్ నటి ఎంట్రీ -
వయసు గురించి ఆలోచించనంటున్న చందమామ
అందం ఆనందం.. ఆనందమే మకరందం అన్నారో మహాకవి. సినీతారలకు, ముఖ్యంగా హీరోయిన్లకు ఇది వర్తిస్తుంది. వారికి అదృష్టం, అభినయంతోపాటు తళతళ మెరిసే మేని అందం కూడా చాలా అవసరం. అది ఉంటే వయసు గురించి గుర్తుకురాదు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అదే అంటోంది.ఎందుకంటే పెళ్లి, బాబు అంటూ సంసార జీవితంలో మునిగిన కాజల్.. సినీజీవితాన్ని కూడా సమపాళ్లలో అనుభవిస్తోంది. కథానాయికగా చందమామగా అలరించినా, మగధీరతో అభినయించినా.. అందాలు ఆరబోసినా ఆమెకే చెల్లింది. పాన్ ఇండియా హీరోయిన్గా అలరిస్తున్న కాజల్ అగర్వాల్కు ఇటీవల దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్లో బాగానే ఉన్నాయి. అక్కడ రామాయణం సినిమాలో మండోదరిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.అలాగే ది ఇండియా స్టోరీ అనే మరో మూవీలోనూ హీరోయిన్గా నటిస్తోందట! ఇప్పటికీ మిలమిల మెరిసిపోతున్న కాజల్ తన సౌందర్య రహస్యం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇప్పుడు తన వయసు 40 ఏళ్లని.. సౌందర్యానికి కారణం వర్కవుట్స్, యోగా అంది. తాను నిత్యం వర్కవుట్స్ చేయడంతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటానంది.ముఖ్యంగా ఆకుకూరలు, పళ్లరసాలు తీసుకుంటానని పేర్కొంది. కాయగూరల్లో ఉండే పౌష్టికాహారాలు, కొబ్బరి నీళ్లు, పళ్లరసాల్లో ఉండే ప్రకృతి సిద్ధమైన తీపి ద్వారా వెంటనే సత్ఫలితాలు అందుతాయని తెలిపింది. అందువల్ల తాను వయసు గురించి ఆలోచించనని పేర్కొంది. -
చిరంజీవికి సర్జరీ.. కూతురు సుస్మిత ఏమన్నారంటే..?
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందంటూ గత రెండు రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై చిరంజీవి కూతురు, ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ నిర్మాత సుస్మిత స్పందించారు. ‘దీనిపై ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేను’ అని అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా నేడు(జనవరి 6) చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘చిరంజీవి(Chiranjeevi)కి సర్జరీ జరిగిందట నిజమేనా?’ అని ఓ విలేకరి అడగ్గా.. ఆమె పై విధంగా సమాధానం చెప్పింది. అయితే అదే ప్రశ్నకు కొనసాగింపుగా..‘సర్జరీ కారణంగానే చిరంజీవి ప్రమోషన్స్కి దూరంగా ఉన్నారట కదా?’ అని అడగ్గా.. అలాంటిదేమి లేదని.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పింది. అంతేకాదు ఇటీవల ‘ఓవర్సీస్ అభిమానులతోనూ వీడియో కాల్స్లో మాట్లాడారని, త్వరలోనే జరగబోయే ప్రీరిలీజ్ ఫంక్షన్కి కూడా చిరంజీవి వస్తారని స్పష్టం చేసింది. (చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్పై క్లారిటీ!)దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. సర్జరీ జరిగిందనే వార్తలు రాగానే మెగా ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురయ్యారు. సినిమా ప్రమోషన్స్లో ఇక ఆయన పాల్గొనబోరని అంతా అనుకున్నారు. కానీ ప్రీరిలీజ్ ఈవెంట్కి వస్తారని సుస్మిత చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.(చదవండి: ‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్టైమ్ ఎంతంటే?)మనశంకర్ వరప్రసాద్(Mana Shankara Vara Prasad Garu) విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్టైమ్ ఎంతంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్ పాత్రలో సంజయ్దత్ కనిపించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. (చదవండి: దిలీప్ కుమార్.. ఏఆర్ రెహమాన్గా ఎలా మారాడు?)ఫ్యాన్స్ కోసం ఒకరోజు ముందే..అనగా జనవరి 8న సాయంత్రమే ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఇటీవల ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రన్ టైమ్ బయటకు వచ్చింది. ఈ సినిమా రన్టైమ్ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. ఇక ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు. దీంతో ఆ రెండు సీన్స్ సినిమాలో నుంచి తొలగించిన 189 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. (చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్పై క్లారిటీ!)బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివితోనే రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఎక్కువ రన్టైమ్నే కలిగి ఉన్నాయి. ఇప్పుడు ది రాజాసాబ్(The Raja Saab ) కూడా అత్యధిక నిడివితో విడుదల కాబోతుంది. హారర్ కామెడీతో ప్రేక్షకులను మూడు గంటలు కూర్చోబెట్టడం కాస్త రిస్కే. ఏమాత్రం తేడా వచ్చిన ఫలితం తారుమారు అవుతుంది. ‘రాజాసాబ్’ మాత్రం రిస్క్ చేసి మరీ పెద్ద నిడివితో వస్తున్నాడు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. -
‘మన శంకరవరప్రసాద్’ కి సీక్వెల్ ఉందా?
ఈ మధ్య చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమా చివరన సీక్వెల్ ప్రకటించడం ట్రెండ్గా మారిపోయింది. కొన్ని సినిమాల కథలు ఒకే పార్ట్లో చూపించలేక.. రెండో భాగం తెరకెక్కిస్తుంటే..మరికొన్ని సినిమాలు మాత్రం పూర్తిగా ముగిసిన కథకు కూడా సీక్వెల్ని ప్రకటిస్తున్నారు. కథ రేడీగా ఉండదు కానీ ముందే సీక్వెల్ ప్రకటిస్తారు. సినిమా హిట్ అయితే..అప్పడు కథని డెవలప్ చేస్తారు. ఒకవేళ ప్లాప్ అయితే.. సీక్వెల్ ప్రకటించినప్పటికీ..మళ్లీ దాని జోలికి వెళ్లరు. అలా ఎన్నో సినిమాల సీక్వెల్స్ ఆగిపోయాయి. అయినా కూడా సీక్వెల్ ప్రకటించడం మాత్రం ఆగడం లేదు. చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’కి కూడా సీక్వెల్ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకార్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల స్పందించారు. ఈ సినిమాకు సీక్వెల్ లేదని స్పష్టం చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్మాతలు సాహు, సుస్మిత తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మన శంకర్ వరప్రసాద్’కి సీక్వెల్ ఉంటుందా? అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఇది కంప్లీట్ ఎండింగ్ మూవీ. క్లైమాక్స్లో పార్ట్ 2 ప్రకటన ఏమి ఉండదు. అసలు ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని స్పష్టం చేశారు.మనశంకర్ వరప్రసాద్ విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
టాలీవుడ్ హీరోతో పెళ్లి.. మీనాక్షి చౌదరి ఏమన్నారంటే..
సినీ తారల ప్రేమ, పెళ్లి విషయాలపై పుకార్లు కామన్. వాళ్లు నిజంగా ప్రేమలో ఉన్నా లేకపోయినా సరే.. సోషల్ మీడియాలో అయితే లెక్కలేనన్ని గాసిప్పులు వచ్చేస్తుంటాయి. అయితే కొంతమంది తారలు వాటిని లైట్గా తీసుకొని స్పందించకుండా ఉంటారు. మరికొంతమంది అయితే క్లారిటీ ఇస్తుంటారు. ఈ రెండో కోవాకు చెందిన హీరోయిన్నే మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీపై ఇటీవల ఓ రూమర్ గట్టిగా వినిపించింది. అక్కినేని యంగ్ హీరో సుశాంత్తో మీనాక్షి(Meenakshi Chaudhary ) ప్రేమలో పడిందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై మీనాక్షి స్పందించింది. సుశాంత్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని.. అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.‘ఇలాంటి పుకార్లు విని నవ్వుకుంటాను. సుశాంత్, నేను మంచి స్నేహితులం మాత్రమే. మేమిద్దరం కలిసి నటించాం(మీనాక్షి తొలి సినిమా ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ సుశాంత్ హీరో). అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినా ఇండస్ట్రీలో అవన్నీ కామన్. రోజుకో గాసిప్ వస్తుంది. అవన్నీ నిజం కాదనీ అందరికీ తెలుసు. నేను కూడా వాటిని మైండ్కి తీసుకోను. అలా విని..ఇలా వదిలేస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చెప్పుకొచ్చింది. మీనాక్షి నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే తన పెళ్లి పుకార్లపై స్పష్టత ఇచ్చింది. -
సంక్రాంతికి రిలీజ్ అంటే చాలా మంది నమ్మలేదు : అనిల్ సుంకర
‘‘స్క్రిప్ట్ విని, ఈ కథతో సినిమా చేయగలమా? లేదా అనే ఓ జడ్జ్మెంట్కు రాగలగాలి. సినిమా రిజల్ట్ ఎలాగూ మన చేతిలో ఉండదు. అందుకే సినిమా స్క్రిప్ట్ లెవల్లోనే అన్నీ జాగ్రత్తగా చూసుకోగలగాలి. అఖిల్తో మేం చేసిన ‘ఏజెంట్’ సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ లేదు. దాంతో ఆ సినిమాకు సరైన ఫలితం రాలేదు. అందుకే మంచి స్క్రిప్ట్తో వస్తేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. స్క్రిప్ట్ ప్రకారం సినిమా వచ్చిందంటే ఆ సినిమా బాగున్నట్లే’’ అని చె΄్పారు నిర్మాత అనిల్ సుంకర. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ సుంకర మాట్లాడుతూ–‘‘నారీ నారీ నడుమ మురారి’ పండగ మూవీ. ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రం ఇది. ఈ చిత్రంలో శర్వానంద్ మంచి క్యారెక్టర్ చేశారు. శ్రీవిష్ణు గెస్ట్ రోల్ చేశారు. ఒకే ఆఫీసులో ఓ అబ్బాయి మాజీ ప్రేమికురాలు, ఆ అబ్బాయి ప్రస్తుత లవర్ ఉంటే... ఆ అబ్బాయి పరిస్థితి ఏమిటి? అన్నదే ఈ సినిమా కథ. పెళ్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటాయి. మా సినిమాను మేం సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అంటే చాలా మంది నమ్మలేదు. కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు. కానీ మేం ముందుగా చెప్పినట్లే సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్ ఏరియాల్లో ‘దిల్’ రాజుగారు, వెస్ట్, కృష్ణా, గుంటూరులో రాజా, సీడెడ్లో శోభన్ రిలీజ్ చేస్తున్నారు. ఈస్ట్లో మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. ఇక సంక్రాంతి సీజన్లో నాలుగైదు సినిమాలు రావడం అనేది కామన్. ఈ సీజన్లో విడుదలైన సినిమాలన్నీ హిట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. మన తెలుగు చిత్రాలతో పాటు అనువాద చిత్రాలూ విడుదలవుతున్నాయి. అయితే కంటెంట్ బాగున్న సినిమాలకే ప్రేక్షకాదరణ లభిస్తుంది. ‘నారీ నారీ నడుమ మురారి’కి ఓటీటీ డీల్ పూర్తయింది. నూతన నటీనటులతో ‘ఎయిర్ ఫోర్స్ బెజవాడ బ్యాచ్’ అనే మూవీ చేయబోతున్నాం. అడివి శేష్తో ‘గూఢచారి 2’ రాబోతోంది. సాయిదుర్గాతేజ్, తేజ సజ్జాలతో సినిమాలున్నాయి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘ఏజెంట్’ సినిమా విఫలమైంది. అఖిల్కు ఓ హిట్ ఇస్తే ఆ బాధ పోతుంది. ‘భోళా శంకర్’ సినిమాకూ సరైన ఫలితం రాలేదు. ఇదే సినిమా నాలుగేళ్ల క్రితం విడులై ఉంటే, బాక్సాఫీస్ ఫలితం మరోలా ఉండేది’’ అని పేర్కొన్నారు. -
అమ్మ రెండో పెళ్లి.. నేనే సాక్షి సంతకం పెట్టా!
రాత్రికి రాత్రే ఫేమస్ అయినవారిలో మరాఠి నటి గిరిజ ఓక్ ఒకరు. ఈమె నటిగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఓ చిన్న ఇంటర్వ్యూ క్లిప్ వల్ల సడన్గా ఒక్క రోజులోనే వైరల్ అయిపోయింది. అందులో ఆమె నీలిరంగు చీర కట్టుకుని సింపుల్గా కనిపించింది. ఈ వైరల్ ఫేమ్ వల్ల తన సినిమాలు ఎక్కువమంది చూస్తే చాలని ఆశపడుతోంది.అమ్మ గురించి ఎప్పుడూ..తాజాగా తొలిసారి ఆమె తన కుటుంబం గురించి మాట్లాడింది. నేను మా అమ్మ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఇన్ని గంటలు మాత్రమే పనిచేయాలనే నిబంధన అంటూ ఏమీ ఉండదు. దానివల్ల నేను కొన్నిసార్లు 10-12 గంటలపాటు షూటింగ్లో ఉండేదాన్ని. కొన్నిసార్లు 16 గంటలపాటు ప్రయాణించి సెట్కు వెళ్లేదాన్ని.ఒంటరిగానే..పెళ్లికి ముందు, తర్వాత కూడా ఒంటరిగానే వెళ్లేదాన్ని. కానీ రోజంతా పనిచేసి ఇంటికొస్తే.. ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. అమ్మ నాతో ఎందుకు లేదు? అనిపించేది. ఆమె నాతో లేకపోవడానికి ఓ కారణం ఉంది. నా పెళ్లవడానికి ముందే తను రెండో పెళ్లి చేసుకుంది. అయితే నా చిన్నతనంలోనే అమ్మానాన్న విడిపోవడం అస్సలు తట్టుకోలేకపోయాను. సైకియాట్రిస్ట్ను కలిశా.. 17 ఏళ్ల వయసులోనే తొలిసారి థెరపీ తీసుకున్నాను. కొన్నేళ్లపాటు ఆ థెరపీలు కొనసాగించాను. సాక్షి సంతకంసినిమా షూటింగ్స్కు వెళ్లొచ్చాక ఇంట్లో అంతా నిశ్శబ్ధంగా ఉండేది. అమ్మ నాతో ఉంటే.. ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా భోజనం సిద్ధం చేసేది, నాతో కబుర్లు చెప్పేదని ఫీలయ్యేదాన్ని.. తనను బాగా మిస్ అయ్యేదాన్ని! ఏదేమైనా అమ్మ తన జీవితాన్ని తనే నిర్మించుకుంది. ఆ వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అమ్మ ఎంతగానో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. తన రెండో పెళ్లికి నేను సాక్షి సంతకం పెట్టాను అని చెప్పుకొచ్చింది. గిరిజ ఓక్.. హిందీలో తారే జమీన్పర్, షోర్ ఇన్ ద సిటీ, జవాన్, ద వ్యాక్సిన్ వార్, ఇన్స్పెక్టర్ జిండె వంటి చిత్రాల్లో నటించింది. మరాఠిలో అనేక చిత్రాలు చేసింది.చదవండి: చెల్లి పెళ్లిలో డ్యాన్స్.. పైసా ఇవ్వలేదు: హీరో -
డబ్బు, హోదా ఎంతున్నా అనాథలా అనిపిస్తోంది!
ప్రముఖ సినీ నిర్మాత ఏవీఎం శరవణన్ గతేడాది చివర్లో ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడ్డ ఆయన డిసెంబర్ 4న ఉదయం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఎంతోమంది సినీప్రముఖులు ఆయన్ను చివరిసారిగా చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా చెన్నైలోని ఏవీఎం స్కూల్లో శరవణన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆయన నాకు చాలా క్లోజ్ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. శరవణన్తో నేను 11 సినిమాలు చేశాను. ఆయన తన ఆఫీసులో కూర్చునే.. చాలామందికి అనేక హిట్లు, బ్లాక్బస్టర్లు అందించాడు. కేవలం సినిమాపరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన నాకు చాలా క్లోజ్. శివాజీ సినిమా తర్వాత ఆయన నాకో సలహా ఇచ్చాడు.అనాథగా మిగిలా..ఏజ్ పెరిగేకొద్దీ మరింత బిజీగా ఉండాలన్నాడు. కనీసం ఏడాదికో సినిమా అయినా చేయమని సూచించాడు. ఇప్పటికీ నేను ఆ సలహా పాటిస్తున్నాను. మనకు నచ్చినవారిని కాలం తనకు నచ్చినప్పుడు తీసుకెళ్లిపోతుంది. ఎంత డబ్బు, హోదా ఉన్నా సరే నచ్చినవాళ్లు దూరమైనప్పుడు అనాథగా మిగిలాం అన్న భావన కలగకమానదు. శరవణన్ సర్ చాలా గొప్ప వ్యక్తి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.గర్వంగా ఫీలవుతున్నా.కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఏవీఎమ్ కుటుంబానితో కలిసి పని చేసినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. నేను చదువుకునే రోజుల్లో ఏవీఎమ్ స్కూల్ లేదు. ఒకవేళ ఉండుంటేనా.. నేను కూడా అదే పాఠశాలకు వెళ్లేవాడిని. నేను ఏదైనా తప్పులు చేస్తే శరవణన్ నాపై అరిచేవాడు కాదు.ఏవీఎమ్ బ్యానర్ ద్వారా పరిచయంకానీ, నేనేదైనా మంచి చేస్తే మాత్రం అందరిముందు పొగిడేవాడు, సంతోషపడేవాడు అని పేర్కొన్నాడు. కమల్ హాసన్.. ఏవీఎమ్ బ్యానర్ ద్వారానే వెండితెరకు పరిచయమయ్యాడు. 1960లో వచ్చిన కలతుర్ కన్నమ్మ సినిమాకుగానూ కమల్ ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.చదవండి: సంధ్య థియేటర్లో దారుణం.. లేడీస్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా -
ఈ హీరోకు తొలిసారి రూ.75 కోట్ల బడ్జెట్!
హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి, కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు సూరి. ఈయన హీరోగా నటించి విడుదలైన గరుడన్, మామన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా సూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మండాడి. ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మదిమారన్ పుహళేంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సముద్ర తీరంలో జరిగే జాలర్ల బోటు పందేల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న సినిమా. ఇందులో సూరి జాలరిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చాలా వర్కౌట్ చేసి పూర్తిగా మారిపోయారు. రూ.75 కోట్లతో రూపొందుతున్న మండాడి సూరి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్టంట్ నిపుణులతో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ 40 రోజులపాటు చిత్రికరించినట్లు చెప్పారు. చిత్రంలోని బోటు ఫైట్ సన్నివేశాలు థ్రిల్లింగ్గా ఉంటాయన్నారు. దీనికి ప్రకాష్కుమార్ సంగీతం మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. -
కీర్తి సురేశ్ అక్కలో ఈ టాలెంట్ కూడా ఉందా?
కీర్తి సురేశ్ సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. ఆమె అక్క రేవతి థాంక్యూ అనే షార్ట్ ఫిలింకి డైరెక్టర్గా వ్యవహరించింది. తను భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. అలాగే ఫిలిం కోర్సు కూడా పూర్తి చేసింది. తాజాగా ఆమె వాయిద్య కళాకారిణిగా మారింది. ఈ విషయాన్ని ఆమె తల్లి, నటి మేనక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.తొలిసారి..అట్టుకల్ దేవి అమ్మవారి గుడిలో నా కూతురు రేవతి తొలిసారి డోలు వాయించింది అంటూ వీడియో షేర్ చేసింది. అందులో రేవతి తెల్ల చీర కట్టుకుని, నెత్తిన పూలు పెట్టుకుని డోలును ఓ భుజానికి తగిలించుకుని తన గ్రూపుతో కలిసి వాయిస్తోంది. గతంలో రేవతిని నాట్యకళాకారిణిగా, దర్శకురాలిగా చూసిన అభిమానులు.. ఇప్పుడిలా డోలు వాయించడం చూసి తనలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.సినిమాకాగా రేవతి.. దర్శకుడు ప్రియదర్శన్ దగ్గర కొన్నేళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసింది. మరక్కర్, వాశి, బరోజ్ సినిమాల నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. కీర్తి సురేశ్ తెరపై హీరోయిన్గా కనిపిస్తే, ఆమె అక్క మాత్రం తెర వెనుకే ఎక్కువ భాగమయ్యేది. వీరి తల్లి మేనక మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్గా అనేక సినిమాలు చేసింది. తండ్రి సురేశ్ కుమార్ నిర్మాతగా రాణించాడు. View this post on Instagram A post shared by Menaka Suresh (@menaka.suresh) చదవండి: రామ్చరణ్తో అనిల్ రావిపూడి సినిమా -
జన నాయగణ్ Vs పరాశక్తి.. విజయ్ రియాక్షన్ ఇదే..
శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పరాశక్తి. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ నిర్మించిన ఈ మూవీలో రవిమోహన్, అధర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 10న రిలీజవుతోంది. అయితే దీనికంటే ఒకరోజు ముందు జనవరి 9న విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ మూవీ విడుదలవుతోంది.పొంగల్కు సినిమా లేకపోవడంతో..దీని గురించి శివకార్తికేయన్ స్పందించాడు. శనివారం సాయంత్రం చెన్నైలో పరాశక్తి మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పరాశక్తి సినిమాను 2025 అక్టోబర్లో లేదా దీపావళికి విడుదల చేద్దామని నిర్మాత ఆకాశ్, నేను మాట్లాడుకున్నాం. అయితే విజయ్ మూవీ అక్టోబర్లో తెరపైకి రానుందని.. దీంతో పొంగల్కు వేరే సినిమా లేదని ప్రచారం జరగడంతో మనం పొంగల్కు వద్దామని ఆకాశ్ చెప్పారు.తీరా అదే సమయంలోఅయితే కొన్ని రోజుల తర్వాత విజయ్ నటిస్తున్న జన నాయగణ్ మూవీ పొంగల్కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే నిర్మాత ఆకాశ్కు ఫోన్ చేసి మనం రిలీజ్ పోస్ట్పోన్ చేద్దామా అని అడిగాను. కానీ, అప్పటికే సినిమా రైట్స్ అన్నీ అమ్ముడుపోవడంతో అది కష్టమన్నాడు. తర్వాత నేను విజయ్ మేనేజర్ జగదీష్కు ఫోన్ చేసి.. జననాయగణ్ రిలీజ్ను సంక్రాంతికి మార్చారా? అని అడిగాను. అందుకాయన.. అవును, మార్చాం. అయినా ఏం పర్లేదు, రెండు సినిమాలు విజయం సాధిస్తాయి. మీ సినిమా రిలీజ్ చేయండి అన్నారు. విజయ్తో మాట్లాడా..అప్పటికీ నాకు మనసు కుదుటపడక విజయ్తో అన్ని విషయాలు మాట్లాడాను. పొంగల్కు పదిరోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి రెండు సినిమాలు విడుదల చేయొచ్చని చెప్పారు. దీనివల్ల ఎవరి సినిమా ప్రభావితం కాదన్నారు. నాకు, విజయ్కు మధ్య మంచి స్నేహం ఉంది. ఎవరేమనుకున్నా ఈ పొంగల్ అన్నాతమ్ముళ్లది. జనవరి 9న జన నాయగణ్ మూవీ చూడండి. 33 ఏళ్లుగా మనల్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి చివరి సినిమాను ఆదరించండి. ఆ తర్వాతి రోజు విడుదలవుతున్న పరాశక్తిని సైతం ఆదరించండి అని పేర్కొన్నాడు. -
నా హృదయం ముక్కలు.. హద్దులు మీరుతున్నారు: దర్శన్ భార్య
వేధింపులను భరించాల్సిన అవసరం లేదంటోంది కన్నడ హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి. తనపై ఆన్లైన్ వేధింపులు తీవ్రతరం అవడంతో ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్లైన్లో ట్రోలింగ్స్ ఎదుర్కోవడం నాకు ఇదేం మొదటిసారి కాదు. నాలుగేళ్ల క్రితం నా ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. నాకే ఇలా జరుగుతుందంటే..కానీ, ఈసారి వేధింపుల తీవ్రత మరింత పెరిగింది. కొందరు హద్దులు దాటుతూ ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి హీనమైన చర్యలను ఏమాత్రం సహించకూడదు. నాకే ఇలా జరుగుతుంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? ఎంతోమంది అమ్మాయిలు ఆన్లైన్లో వేధింపులకు గురవుతున్నారు, అది తల్చుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది.నిశ్శబ్ధాన్ని వీడండితప్పు చేసేవారు భయపడాలి, మనం కాదు! ఎవరికోసమో మీరు మారక్కర్లేదు. ట్రోలర్స్ను లెక్క చేయకండి. నిశ్శబ్ధంగా కుమిలిపోకండి, బయటకు రండి, మీపై జరుగుతున్న వేధింపులను నిలదీయండి. ధైర్యంగా ఫిర్యాదు చేయండి. అయితే మహిళా భద్రత విషయంలో సైబర్ న్యాయ వ్యవస్థ మరింత కఠినంగా, సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది అని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది.జైలు జీవితంఇకపోతే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ జైలుపాలైన విషయం తెలిసిందే! ప్రియురాలు పవిత్రకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపాడన్న కోపంతో దర్శన్ కొందరు మనుషులతో కలిసి రేణుకాస్వామిని చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే దర్శన్ జైలు జీవితం గడుపుతున్నాడు.చదవండి: సినిమా ఫ్లాప్.. నాకు బాగా కలిసొచ్చింది: బాలీవుడ్ నటి -
సినిమా ఫెయిల్.. నాకు బాగా కలిసొచ్చింది: నటి
హిందీ సినిమా 'మస్తీ 4' ఫ్లాప్ అయినప్పటికీ తనకు మాత్రం బాగానే కలిసొచ్చిందంటోంది నటి ఎల్నాజ్ నురోజి. మస్తీ 4 బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోనప్పటికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎల్నాజ్ మాట్లాడుతూ.. మస్తీ 4 నాకు చాలా బాగా ఉపయోగపడింది.ట్రై చేశా..సినిమా రిజల్ట్ బాగోలేకపోయినప్పటికీ పర్ఫామెన్స్కు మాత్రం ప్రశంసలు దక్కాయి. నేను కామెడీ యాంగిల్ ట్రై చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా.. అది ఈ సినిమాతో నెరవేరింది. నేను కామెడీ కూడా చేయగలనని ప్రేక్షకులకు నిరూపించాను. సేక్ర్డ్ గేమ్స్, అభయ్ వంటి ప్రాజెక్టులలో సీరియస్ పాత్రలు పోషించాను. రాణ్నీతిలో అయితే మరింత సీరియస్గా కనిపిస్తాను. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. నేనే ధైర్యం తెచ్చుకుని..ఆ విషయంలో మస్తీ 4 నాకు దోహదపడింది. అయితే సినిమా అనుకున్న రీతిలో ఆడనప్పుడు ఎవరైనా బాధపడతారు. అలా అని నేను రోజులకొద్దీ బాధపడుతూ కూర్చునే మనిషిని కాదు. ఒకటీరెండురోజులు ఫీలవుతాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉండదు.నా లైఫ్ నాదిమస్తీ 4 మూవీలోని అడల్ట్ జోక్స్పై జరిగిన ట్రోలింగ్ను నేనస్సలు లెక్క చేయలేదు. ఈ నెగెటివిటీనే నేను పట్టించుకోను. నా జీవితం నాది.. పైగా కొన్నిసార్లు ట్రోల్స్ను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని నవ్వుతుంటాను కూడా! అని నటి ఎల్నాజ్ చెప్పుకొచ్చింది. చదవండి: 'మా జీవితాల్లో విలన్ ఎవరూ లేరు.. 15 ఏళ్ల బంధానికి ముగింపు' -
భర్తతో హీరోయిన్ తెగదెంపులు.. 'మా జీవితంలో విలన్..'
బుల్లితెర జంట జై భానుషాలి - మహి విజ్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి ఫుల్స్టాప్ పెడుతూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జై భానుషాలి, మహి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈరోజు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఎవరి జీవితాలు వారివి. అయినప్పటికీ ఒకరికొకరం సపోర్ట్గా ఉంటాం. దారులు వేరుమా పిల్లలు తార, ఖుషి, రాజ్వీర్లకు తల్లిదండ్రులుగా, బెస్ట్ ఫ్రెండ్స్గా కొనసాగుతాం. వారికోసం ఏదైనా చేస్తాం. మా దారులు వేరయ్యాయి. కానీ, మా కథలో విలన్ అంటూ ఎవరూ లేరు. దయచేసి మా నిర్ణయాన్ని తప్పుపట్టకండి. మేము డ్రామాలు చేయడానికి బదులుగా శాంతియుతంగా ఉండటానికే సిద్ధమయ్యాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నోట్ షేర్ చేశారు.ప్రేమకథజై- మహి ఓ క్లబ్లో తొలిసారి కలిశారు. పరిచయమైన మూడు నెలల్లోనే మహి తనకు కరెక్ట్ పార్ట్నర్ అనిపించింది జైకి. ఇద్దరి మనసులు కలవడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు తమ దగ్గర పనిచేసేవారికి జన్మించిన పిల్లలు రాజ్వీర్, ఖుషిల బాధ్యతను భుజానేసుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు. జై దంపతులకు 2019లో ఐవీఎఫ్ ద్వారా కూతురు తారా జన్మించింది. ఇకపోతే 2025లోనే బుల్లితెర జంట విడిపోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని మహి వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు అదే నిజమని రుజువు చేస్తూ వీరు విడిపోయారు.తెలుగు సినిమా హీరోయిన్మహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్గా కనిపించింది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది. తర్వాత సీరియల్స్కు షిఫ్ట్ అయింది. జై భానుషాలి.. హేట్ స్టోరీ 2, ఏక్ పహేలీ లీలా వంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. అలాగే పలు సీరియల్స్లోనూ తళుక్కుమని మెరిశాడు. జై- మహి జంటగా నాచ్ బలియే అనే డ్యాన్స్ షో సీజన్ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.చదవండి: హీరో విజయ్ సీఎం అవుతాడు: నటుడు సుమన్ -
7 సినిమాలు.. రూ. 1000 కోట్ల బడ్జెట్.. నిర్మాతల ధైర్యం ఏంటి?
టాలీవుడ్కి సంక్రాంతి అతి పెద్ద సీజన్. ప్రతిసారి మూడు,నాలుగు సినిమాలు ఈ పండక్కి రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా 7 సినిమాలు(డబ్బింగ్ సినిమాలతో కలిసి) రిలీజ్ అవుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో పాటు శర్వానంద్, నవీన్ పొలిశెట్టి లాంటి కుర్ర హీరోలు కూడా బాక్సాఫీస్ బరిలో ఉన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ ..ఇలా మూడు రోజులకు మూడు సినిమాలతో పాటు ఆ ముందూ వెనుక కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒకే సారి ఇన్ని సినిమాలు వస్తే... ప్రేక్షకుల అన్నీ చూడగల్గుతారా? అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి.ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఈ ఏడు సినిమాలు చూస్తే.. తక్కువలో తక్కువ 10-12 వేలు ఖర్చు అవుతుంది. పండగకు ఇంట్లో అయ్యే ఖర్చు అదనం. ఓ సగటు ప్రేక్షకుడు ఇంత భరించడం కష్టం. ఆ విషయం సినిమాలు రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు కూడా తెలుసు. కానీ పండక్కి క్లిక్ అయితే భారీగా రాబట్టుకోవచ్చనే ఆశతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొత్తం ఏడు సినిమాల బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల పైనే ఉంటుంది. వాటిల్లో అత్యధికంగా రాజాసాబ్కి రూ. 500 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమాకు కూడా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు అయిందట. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ ‘అనగనగ ఓ రాజు’, శర్వానంద్ నారీ నారి మురారి చిత్రాలన్నీ ఒక్కోటి రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కినవే. ఇక డబ్బింగ్ సినిమాలు జననాయక్, పరాశక్తి కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. మొత్తంగా ఈ చిత్రాల బడ్జెట్ మొత్తం రూ. 1000 కోట్లు దాటింది. నిర్మాతలకు సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే..కనీసం రూ. 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇది అసాధ్యం అనే చెప్పాలి. టాక్తో సంబంధం లేకుండా ప్రభాస్, చిరంజీవి సినిమాలకు తొలిరోజు భారీ కలెక్షన్సే వస్తాయి. హిట్ టాక్ వస్తే.. ఆ రెండు చిత్రాలు భారీగానే వసూలు చేస్తాయి. కానీ మిగిలిన సినిమాల పరిస్థితి అలా కాదు. సినిమా రిలీజ్ అయి.. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప.. ప్రేక్షకులకు థియేటర్స్కి వెళ్లరు. టాక్ని బట్టి వాటి కలెక్షన్స్ ఉంటాయి. మరి సంక్రాంతికి బాక్సాఫీస్ విన్నర్గా ఎవరు నిలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలివే‘ది రాజా సాబ్’ (జనవరి 9)జననాయకుడు(జనవరి 9)పరాశక్తి(జనవరి 10)మన శంకర్ వరప్రసాద్ గారు(జనవరి 12)భర్త మహాశయులకు విజ్ఞప్తి(జనవరి 13)అనగనగ ఓరాజు(జనవరి 14)నారి నారి నడుమ మురారి(జనవరి 14) -
హీరో విజయ్ సీఎం అవుతాడు: సుమన్
తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నాడు. ఈ ఏడాది జరగబోయే ఎలక్షన్స్లో తను స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' తరపున పోటీ చేయనున్నాడు. అయితే ఈసారి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నాడు సీనియర్ నటుడు సుమన్.జనాల్లో అనుమానాలుతాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనాలు సెలబ్రిటీలను చాలారకాలుగా పరిశీలిస్తారు. ఈ హీరో నిజంగానే పొడుగ్గా ఉన్నాడా? ఎర్రగా ఉన్నాడా? ఆయన జుట్టు ఒరిజినలేనా? గొంతు తనదేనా? ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి హీరో సభకు వస్తుంటారు. మొదటిసారి వచ్చినంతమంది జనాలు రెండోసారి రారు. అయినా రెండోసారి, మూడోసారి కూడా పెద్ద మొత్తంలో జనాలు వస్తున్నారంటే అది భయంకరమైన ఫాలోయింగ్ అని అర్థం.సినిమా వదిలేయాల్సిందే!ఏదేమైనా ఆయన అదృష్టం, జాతకాన్ని బట్టి రాజకీయాల్లో ఫలితం ఉంటుంది. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చి గెల్చారంటే మాత్రం మూవీస్ వదిలేయాల్సిందే! ఎందుకంటే ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టి గెలిపించారంటే ఎక్కడా ఏ తప్పూ జరగకుండా చూసుకోవాలి! సినిమా షూటింగ్కు వెళ్లినప్పుడు ఎక్కడైనా తప్పు జరిగిందనుకోండి.. ఆ నింద హీరోపైనే వేస్తారు.రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేంఅందుకే గెలిచేవరకు ఆగండి. గెలిచిన తర్వాత మాత్రం తప్పనిసరిగా సినీ జీవితాన్ని పక్కనపెట్టండి. సినిమాల్లోకి ఎప్పుడైనా రావొచ్చు.. కానీ రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేం.. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం.. ఇలా ఏమేం చేయాలో అన్నీ చేయండి.. ఆల్రెడీ సగంలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ప్రజాసేవకు అంకితం కండి. ప్రజలకు అనేక సమస్యలున్నాయి. విజయ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్మీరు షూటింగ్కు వెళ్తే ఏమంటారంటే.. ఆయన షూటింగ్కు వెళ్లకుంటే ఈ పని పూర్తి చేయొచ్చు అని పెదవి విరుస్తారు. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాను పూర్తి చేశారు తప్ప మళ్లీ సినిమాల్లోకి వెళ్లలేదు. విజయ్కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓటు వేయడానికి ఒకటీరెండు రోజుల ముందు ఏదైనా ఒక సంఘటన జరిగితే అంతా మారిపోతుంది. లేదు, ఆయనకు అదృష్టం ఉంటే కచ్చితంగా విజయ్ సీఎం అవుతాడు అని సుమన్ చెప్పుకొచ్చాడు.చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. గూండా అని పేరెంట్స్ తిట్టారు -
సుమన్ చేతుల మీదుగా ‘రాయుడు గారి తాలుకా’ పోస్టర్ రిలీజ్!
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటించిన చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలిశెట్టి మూవీస్ బ్యానర్పై ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ,, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు నిర్మిస్తున్నారు. సుమన్ , కిట్టయ్య, R.K నాయుడు , సలార్ పూజ , కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు ,సృజనక్షిత, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈమూవీ నుంచి టైటిల్ పోస్టర్ని ప్రముఖ నటుడు సుమన్ గారు విడుదల చేస్తూ.. చిత్రబృంధానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో శ్రీనివాస్ ఉలిశెట్టి గారు మాట్లాడుతూ.. ‘మా సినిమా టైటిల్ పోస్టర్ని సుమన్ గారు రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు. ఓ డిఫరెంట్ కంటెంట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నటీనటులు అంతా కొత్తవారే అయినప్పటికీ.. చాలా బాగా నటించారు. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. మంచి కంటెంట్లో రాబోతున్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం అని తెలిపారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ప్లేని శ్రీనివాస్ ఉలిశెట్టి అందించగా.. నగేశ్ గౌరీష్ సంగీతం సమకూర్చాడు. గౌతమ్ వాయిలాడ సిమాటోగ్రాఫర్గా, ఎంజే సూర్య ఎడిటర్గా పని చేస్తున్నాడు. -
'నారీ నారీ నడుమ మురారి' మూవీలో మరో హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సర్ప్రైజ్ వదిలారు. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు కీలక పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఒక స్పెషల్ సర్ప్రైజ్ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వదిలారు. ఒక ప్రత్యేక జోడింపు.. ఒక ప్రత్యేక ప్రకటన.. నవ్వుల పండగకి సిద్ధంగా ఉండండి అంటూ శ్రీవిష్ణు ఎంట్రీని చూపించారు. నారీనారీ నడుమ మురారి విషయానికి వస్తే.. సామజవరగమన ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర నిర్మించారు. సంక్రాంతి బరిలో సినిమాలుసంక్రాంతి బరిలో నారీనారీ నడుమ మురారితో పాటు మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ 'రాజాసాబ్', విజయ్ 'జననాయగణ్' జనవరి 9న విడుదలవుతున్నాయి. శివకార్తికేయన్ 'పరాశక్తి' జనవరి 10న, చిరంజీవి 'శంకరవరప్రసాద్' జనవరి 12న, రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న, నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' జనవరి 14న విడుదల కానున్నాయి. A special addition, a special announcement! 📢The stage is set to welcome King of Entertainment @sreevishnuoffl into #NariNariNadumaMurari 😍❤️🔥Get ready for laughter overload! 😂🔥Catch it in theatres from Jan 14 | 5:49 PM onwards ✨🍿Charming Star @ImSharwanand… pic.twitter.com/XrmD6fRh5b— AK Entertainments (@AKentsOfficial) January 4, 2026 చదవండి: జన నాయగణ్ ట్రైలర్లో ఏఐ -
అరె.. ఏంట్రా ఇది! జన నాయగణ్ ట్రైలర్లో ఏఐ!
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ ఈ సంక్రాంతితో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టనున్నాడు. ఆయన నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్'. తెలుగులో 'జన నాయకుడు' పేరిట రిలీజవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నిన్న రిలీజైన ట్రైలర్తో ఇది నిజమేనని రుజువైంది.తెలుగు మూవీ రీమేక్భగవంత్ కేసరి సినిమాను, పాత్రలను ఇక్కడ మక్కీకి మక్కీ దింపినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే కొన్ని సీన్ల కోసం ఏఐని వాడారంటూ ప్రచారం మొదలైంది. ట్రైలర్లో ఓ చోట గూగుల్ జెమిని ఏఐ మార్క్ కనిపించగా దానికి సంబంధించిన స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సినిమావిజయ్ చిట్టచివరి సినిమాలో కూడా ఏఐని ఉపయోగించడం ఏంట్రా బాబూ.. పైగా రీమేక్ సినిమాకు ఏఐ అవసరం ఏమొచ్చింది? రూ.400 కోట్ల బడ్జెట్.. ఈ చిన్న మిస్టేక్ కూడా గమనించుకోకపోతే ఎలా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జన నాయగణ్ విషయానికి వస్తే.. ఇందులో మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 9న విడుదలవుతోంది. They used AI Gemini shot and didn't bother to remove the watermark 😭#JanaNayagan pic.twitter.com/voi66tbLg0— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) January 3, 2026 చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్నల చేతిలో చీవాట్లు -
అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్న చేతిలో తిట్లు!
బాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ విలన్స్లో శక్తి కపూర్ ఒకరు. అయితే ఆయన విలన్గా నటించడం ఇంట్లోవాళ్లకు అస్సలు ఇష్టముండేది కాదట! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శక్తి కపూర్ మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటన ఇది. నేను నటించిన ఓ పెద్ద సినిమా 'ఇన్సానియత్కే దుష్మన్' అప్పుడే రిలీజైంది. చున్నీ లాగే సీన్..ఆ మూవీ చూడమని మా పేరెంట్స్కు చెప్పాను. అమ్మానాన్న ఇద్దరూ థియేటర్కు వెళ్లారు. సినిమా ప్రారంభంలోనే నేను ఓ అమ్మాయి చున్నీ లాగుతూ ఉంటాను. అది చూడగానే మా నాన్నకు చిరాకొచ్చింది. చలో, చూసింది చాలు, ఇక వెళ్లిపోదాం అని అమ్మతో అన్నాడు. వాడు బయట గూండాలా చేస్తాడు.. ఇప్పుడు సినిమాలో కూడా అదే చేస్తున్నాడు. చెడామడా తిట్టారుఇది చూసేందుకా మనం వచ్చింది? ఏం అక్కర్లేదు, నాకైతే సినిమా చూడాలని లేదంటూ అమ్మతో కలిసి బయటకు వెళ్లిపోయాడు. ఇంటికి రాగానే నన్ను చెడామడా తిట్టారు. ఎలాంటి పాత్రలు చేస్తున్నావ్? ఇంత నీచమైన పనులు చేయడానికి మనసెలా వస్తుంది? గూండా పాత్రలు పక్కనపెట్టి మంచి రోల్స్ చేయు.. హేమమాలిని, జీనత్ అమన్ వంటి వారి పక్కన హీరోగా నటించమని చెప్పారు. నెగెటివ్ రోల్స్ వల్లే..నాకు జన్మనిచ్చింది మీరే.. ఈ ముఖాన్ని సృష్టించింది మీరే.. నా ముఖం చూసి ఎవరూ హీరోగా లేదా మంచి పాత్రలు ఇవ్వడం లేదు. విలన్గానే నటించమని అడుగుతున్నారు. వాటిని తిరస్కరించేంత శక్తి నాకు లేదు. పైగా ఆ నెగెటివ్ రోల్స్ వల్లే అంతో ఇంతో గుర్తింపు వస్తోంది అని నచ్చజెప్పాను అన్నాడు. కాగా అండాజ్ అప్న అప్న, గుండా వంటి ఎన్నో చిత్రాల్లో తనదైన విలనిజం పండించాడు శక్తి కపూర్. -
ద్రౌపది 2 మూవీలో తుగ్లక్ పాత్ర
దర్శకుడు మోహన్.జి ఇంతకుముందు దర్శకత్వం వహించిన చిత్రం ద్రౌపది. ఆ మూవీ విజయం సాధించడంతో దానికి సీక్వెల్గా ద్రౌపది 2 తెరకెక్కుతోంది. రిచర్డ్ రిషి, రక్షణ జంటగా నటించిన ఇందులో నట్టి నటరాజ్, వైజీ.మహేంద్రన్, నాడోడిగళ్ భరణి, శరవణ సుబ్బయ్య, చిరాగ్ జానీ, దివి, దేవయాని శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నేతాజీ ప్రొడక్షన్స్ అధినేత చోళ చక్రవర్తి జిఎం ఫిలింస్ కార్పొరేషన్ సంస్థతో కలిసి నిర్మించారు.ద్రౌపది 2 విశేషాలుఫిలిప్ ఆర్ సుందర్ ఛాయాగ్రహణం, జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు యూ/ఏ సర్టిఫికెట్ పొంది త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. త్వరలోనే ఆడియో లాంచ్ సహా, ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. కాగా 14వ శతాబ్దానికి చెందిన తమిళ చరిత్రలోని ముఖ్యమైన అంశాలతో ద్రౌపది 2ని తెరకెక్కించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు ప్రతినాయకులు నటిస్తున్నారని.. అందులో ప్రధానంగా నటుడు చిరాగ్ జానీ నటిస్తున్నట్లు తెలిపారు. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్ర పోషించారని వెల్లడించారు. అతి తెలివి కలిగిన తుగ్లక్ పాత్ర తెరపై ఆవిష్కరించడం కాస్త కష్టంగా మారిందని, కానీ, చిరాగ్ జానీ సమర్థవంతంగా పాత్రను పోషించారని తెలిపారు. ఈ మేరకు చిరాగ్ జానీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. Terror Wears A Crown 👑Unveiling the Delhi Sultanate #MohdBinThugluq.. @JaniChiragjani Nailed it.. Roaring as First-Level Antagonist🔥@richardrishi@GhibranVaibodha@Rakshana1826 @natty_nataraj @Nethajifilm1032 @SureshChandraa@AbdulNassarOffl @DoneChannel1 pic.twitter.com/4aFcfLh95E— Mohan G Kshatriyan (@mohandreamer) January 2, 2026 -
సినిమా నచ్చకపోతే మందుబాటిల్ ఇప్పిస్తా: దర్శకుడు
శ్రీనందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ. యామిని భాస్కర్ హీరోయిన్గా నటించగా వరుణ్రెడ్డి దర్శకత్వం వహించాడు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ మూవీ జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సక్సెస్ మీట్పాజిటివ్ టాక్తో తొలిరోజే కోటి రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి దూసుకుపోతోందీ మూవీ. ఈ క్రమంలో శనివారం నాడు సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. మాస్ ఆడియన్స్ నిష్కల్మషంగా సినిమా చూస్తారు. వాళ్లే సినిమాను థియేటర్లో నిలబెడతారు. థియేటర్లలో అరుపులు ఊరికే రావు. ఎన్నో సినిమాల్లో ఎంతో ట్రై చేశారు, కానీ పేలలేదు. మందు తాగి లొల్లి పెడదాంకానీ, మా సినిమాకు విపరీతంగా క్లాప్స్ కొడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలోని క్యారెక్టర్స్కు గట్టిగా కనెక్ట్ అయ్యారు. క్వాటర్ మందు తాగి లొల్లి పెడదాం మామ, ఫుల్ ఎంజాయ్ చేద్దాం మామ అనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా అంకిత. సెకండాఫ్లో మునుపు ఏ సినిమాలోనూ చూడనంత కేకలు మా సినిమాకు చూశాను. గ్యాంగ్స్తో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మీరు క్లైమాక్స్ వరకు కేకలు పెడుతూ బయటకు రాకపోతే నేను మందు క్వాటర్ ఇప్పిస్తా.. అన్నాడు.చదవండి: పోకిరి విలన్కు యాక్సిడెంట్ -
శత్రువులు కూడా మిత్రువులే.. 'అద్దం' స్పెషల్ గిఫ్ట్!
తమిళ నటుడు బాలా.. భార్య కోకిలతో కలిసి కొత్త ఏడాది సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ సందర్భంగా భార్య అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. కొత్త సంవత్సరంలో తాను అందుకున్న స్పెషల్ గిఫ్ట్ అద్దం అని తెలిపాడు.తన సోదరి అమెరికా నుంచి ఈ బహుమతి పంపిందని, ఆ గిఫ్ట్ తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు.శత్రువుల్లేరుట్రోల్స్ను ఎలా డీల్ చేస్తావని కోకిల ప్రశ్నించింది. అందుకు బాలా స్పందిస్తూ.. మనం ఎదుటివారిని చూసేదాన్ని బట్టి వారు శత్రువులుగా కనిపిస్తారు. అదే ఫ్రెండ్స్గా చూస్తే.. ఇంకా శత్రువులుగా ఎందుకుంటారు? అని బదులిచ్చాడు. 2026లో నరదృష్టి ఉండకూడదని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.ముందడుగుపర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. మా పెళ్లి తర్వాత కూడా మేము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. ఈ కొత్త సంవత్సరం మా జీవితాల్లో ఓ అడుగు ముందుకు వేయబోతున్నాం. సినిమాల విషయానికి వస్తే.. నాలుగైదు కథలు విన్నాను, కానీ ఇంకా దేనికీ ఓకే చెప్పలేదు. అర్థవంతమైన పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.నాలుగు పెళ్లిళ్లుబాలా వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 2008లో చందన సదాశివ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదికే ఆమెతో విడిపోయాడు. 2010లో మలయాళ సింగర్ అమృతా సురేశ్ను పెళ్లాడగా వీరికి ఓ కూతురు జన్మించింది. ఈ దంపతులు కూడా ఎంతోకాలం కలిసుండలేదు. 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్ను వివాహం చేసుకోగా వీరు కూడా విడిపోయారు. రెండేళ్ల క్రితం చుట్టాలమ్మాయి కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పోకిరి విలన్కు యాక్సిడెంట్ -
హీరోగా అకీరా నందన్.. రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్- పవన్ కల్యాణ్ల తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి వస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అకీరా డెబ్యూ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా ఎంట్రీ ఎప్పుడనేది అటు పవన్ కానీ, ఇటు రేణూ దేశాయ్ కానీ కచ్చితంగా చెప్పడం లేదు. కొంతమంది బడా దర్శక-నిర్మాతలు మాత్రం అకీరాతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ అయితే తనకు చాన్స్ ఇస్తే..అకీరాతో పాన్ వరల్ట్ సినిమా చేస్తానని చెబుతున్నాడు. అయితే అకీరా(Akira Nandan)కు మాత్రం మొదటి నుంచి నటన మీద కన్నా సంగీతం మీదనే మక్కువ ఎక్కువ. అసలు ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో అకీరా సినీ ఎంట్రీపై తల్లి రేణూ దేశాయ్(Renu Desai ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అకీరా హీరో అవ్వాలని అందరికంటే ఎక్కువ తనే కోరుకుంటున్నానని చెప్పారు.తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అకీరా సినీ ఎంట్రీ గురించి స్పందించారు. ‘అకీరా త్వరగా హీరో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరిలానే నేను కూడా హీరో ఎప్పుడు అవుతావని అకీరాను అడుగుతుంటాను. ప్రతి ఇంటర్వ్యూలోనూ నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఒకటే చెబుతున్నా.. నేను వాడి కన్న తల్లిని.. అకీరా హీరో అవ్వాలని మీ (ఫ్యాన్స్) కంటే ఎక్కువగా నేనే కోరుకుంటున్నాను. ప్రతిరోజు దేవుడికి కొబ్బరికాయ కూడా కొడుతున్నాను. అయితే హీరో అవ్వాలా వద్దా అనేది మాత్రం అకీరా ఇష్టం’ అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక హీరో అవ్వాలని అకీరాకు ఇష్టం ఉందా లేదా ? అని యాంకర్ అడగ్గా.. ‘ఈ టాపిక్ గురించే మాట్లాడొద్దు.. తర్వాత అకీరా నన్ను తిడతాడు. ‘మమ్మీ నా గురించి ఎందుకు మాట్లాడావ్ ’ అంటూ అలుగుతాడు’ అని నవ్వుతూ చెప్పారు. ఇక ఆమె కెరీర్ గురించి మాట్లాడుతూ.. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా నటిగా కొనసాగుతానని చెప్పారు. -
పోకిరి విలన్కు యాక్సిడెంట్.. ఆస్పత్రిలో వీడియో రిలీజ్
ప్రముఖ నటుడు, పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. భార్య రూపాలి బరువాతో కలిసి శుక్రవారం రాత్రి గువహటిలో బయట డిన్నర్ చేశాడు ఆశిష్. డిన్నర్ తర్వాత రోడ్డు దాటే క్రమంలో స్పీడుగా వస్తున్న ఓ బైక్ వీరిని ఢీ కొట్టింది. అది గమనించిన స్థానికులు వెంటనే బైకర్తో పాటు ఆశిష్ దంపతులను ఆస్పత్రిలో చేర్పించారు.యాక్సిడెంట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆశిష్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చాడు. నిన్న రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతానికి ఇద్దరం క్షేమంగానే ఉన్నాం. రూపాలిని ఇంకా అబ్జర్వేషన్లో ఉంచారు. నాకు చిన్న గాయం అయింది, కానీ లేచి నడవగలను, మాట్లాడగలను. మీ ఆశీస్సుల వల్ల అంతా బానే ఉంది. భయపడాల్సిందేమీ లేదు అని చెప్పుకొచ్చాడు.సినిమాఆశిష్ విద్యార్థి.. గుడుంబా శంకర్, అన్నవరం, నరసింహుడు, అతిథి, తులసి, చిరుత, కంత్రి, అదుర్స్, నాయక్, ఆగడు, కిక్ 2, నాన్నకు ప్రేమతో, ఇస్మార్ట్ శంకర్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ, మలయాళ, మరాఠి భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. చివరగా 'ద ట్రేటర్స్' అనే రియాలిటీ షోలో కనిపించాడు. ఆశిష్ గతంలో రాజోషిని పెళ్లి చేసుకోగా వీరికి కుమారుడు అర్థ్ సంతానం. పలు కారణాల రీత్యా 2022లో దంపతులు విడిపోయారు. ఆ మరుసటి ఏడాది ఆశిష్.. రూపాలి బరువాను రెండో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi (@ashishvidyarthi1) చదవండి: మగాడిలా తయారవుతున్నావ్.. నటి కూతురి కౌంటర్ -
'మగాడిలా తయారవుతున్నావ్'.. నటి కూతురి కౌంటర్
మలయాళ నటి, యాంకర్ మంజు పిళ్లై- దర్శకుడు, కొరియోగ్రాఫర్ సుజిత్ వాసుదేవన్ల కూతురు దయ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటోంది. కాస్త బొద్దుగా ఉన్నందుకు కొందరు తనపై నోటికొచ్చిన కామెంట్స్ చేస్తున్నారని వాపోయింది. ఇటీవలే ఆమె జిమ్కు వెళ్లడం మొదలుపెట్టగా.. రానురానూ మగాడిలా తయారవుతున్నావని ఓ వ్యక్తి విమర్శించాడు.నీకు మగతనం లేదుదీనిపై దయ సోషల్ మీడియా వేదికగా కౌంటరిచ్చింది. నాలో మగతనం ఉందని, జిమ్కు వెళ్తే పూర్తిగా మగాడినైపోతానని ఓ వ్యక్తి అన్నాడు. నాలో ఈ మగతనం నీకు అసౌకర్యాన్ని కలిగిస్తే సారీ.. నాలోని ఈ మగతనాన్ని అంగీకరించేంత పౌరుషం మీకు లేకపోవడం బాధగా ఉంది. మీరు నాకంటే పెద్ద మగాడినని ఒప్పుకునేంత మగతనం లేకపోవడం విచారకరం అని పేర్కొంది. View this post on Instagram A post shared by jaaannuuuu (@daya.sujith) చదవండి: హిందీలో డియర్ కామ్రేడ్? స్పందించిన బాలీవుడ్ హీరో -
సోఫాపై నగ్నంగా ఉన్న ఈ టాలీవుడ్ హీరోని గుర్తు పట్టారా?
పలు చిత్రాల్లోనూ... వెబ్ సిరీస్ల్లోనూ కథానాయకుడిగానూ, కీలక పాత్రల్లోనూ నటించి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చైతన్యరావు. ఒకవైపు హీరోగా నటిస్తూనే..మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఆ మధ్య రిలీజైన అనుష్క ‘ఘాటీ’ సినిమాలో విలన్గానూ నటించి మెప్పించాడు. త్వరలోనే ఈ విలక్షణ నటుడు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కె.క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘దిల్ దియా’. ‘ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్. శ్రియాస్ చిత్రాస్, ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్స్పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(ప్రస్తుతం ప్రభాస్తో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు) విడుదల చేసి చిత్ర యూనిట్ను అభినందించారు. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ను గమనిస్తే..దుస్తులు లేకుండా సొఫాలో కూర్చున్న చైతన్య రావును చూడొచ్చు. తను రగ్డ్ లుక్తో స్క్రీన్ను సీరియస్గా చూస్తున్నాడు. వెనుక నుంచి ప్రొజెక్టర్ లైటింగ్ వస్తోంది. తన చూపుల్లోని ఇంటెన్సిటీ తన పాత్రలోని సీరియస్నెస్ను తెలియజేస్తోంది. కథలోని విషయాలను రివీల్ చేయకుండా , పాత్రలు వాటికి కావాల్సిన నిజాన్ని వెతుక్కుంటూ సాగే కథగా ఈ సినిమా ఉంటుందనే ఫీల్ కలుగుతుందిఈ సందర్భంగా... చిత్ర నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్స్, సెన్సిబుల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు క్రాంతి మాధవ్గారు.. మరోసారి ‘దిల్ దియా’తో సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను అందించటానికి సిద్ధమవుతున్నారు. చైతన్యరావు మదాడిని న్యూ అవతార్లో చూడబోతున్నారు. రా ఎమోషన్స్ను అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తున్నాం. ప్రేమ, మమకారం, వైఫల్యం, స్వీయ గౌరవం వంటి ఎలిమెంట్స్ను సినిమాటిక్ లాంగ్వేజ్లో దర్శకుడు ఆవిష్కరిస్తున్నారు. ‘దిల్ దియా’ను సమ్మర్లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. చైతన్యరావు మాదాడి, ఇరా, సఖి, జెస్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో మణి చందన, ప్రమోదిని, వీర శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.Here’s the first look poster of my dear friend's @bykranthi 5th film 🔥 WISHING YOU ALL THE LUCK 🤗CONGRATULATIONS 🎊 Poster is very intriguing and deep 🤝#DILDIYA @IamChaitanyarao @bykranthi @Ira_dayanand @PoornaNaiduProd @phanikalyang @pgvinda @beyondmediapres… pic.twitter.com/4YrwlglagQ— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 3, 2026 -
హిందీలో డియర్ కామ్రేడ్? దాని జోలికే వెళ్లనన్న హీరో
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమా బాలీవుడ్లో 'కబీర్ సింగ్'గా రీమేకై సంచలన విజయం సాధించింది. ఇదే క్రమంలో విజయ్ పాత మూవీ 'డియర్ కామ్రేడ్' ఇప్పుడు హిందీలో రీమేక్ కానుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, ప్రతిభ రంత హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి.రీమేక్స్ జోలికి వెళ్లనుతాజాగా ఈ రూమర్స్పై సిద్దాంత్ చతుర్వేది స్పందించాడు. అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇకపై రీమేక్స్ చేయదల్చుకోలేదన్నాడు. ఒరిజినల్ సినిమాలకు, అందులో నటించిన యాక్టర్స్కు అభిమాని అయినప్పటికీ రీమేక్స్ జోలికి వెళ్లదల్చుకోలేదన్నాడు. అయితే ప్రతిభతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టాడు.అంతా గందరగోళంఅటు ప్రతిభ మాత్రం భిన్నంగా స్పందించింది. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగమని కోరుతోంది. చాలా సినిమాల్లో నేను నటిస్తానని ప్రచారం జరగడం.. చివరకు వాటిలో నేను లేకపోవడంతో గందరగోళం ఏర్పడుతోంది. కాబట్టి ఏ విషయమైనా అఫీషియల్గా చెప్పిన తర్వాతే నమ్మండి అని పేర్కొంది.సినిమాసిద్దాంత్ చతుర్వేది చివరగా 'ధడక్ 2' సినిమాలో నటించాడు. ఇది తమిళ చిత్రం 'పెరియేరుమ్ పెరుమాల్' (2018)కి రీమేక్గా తెరకెక్కింది. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 'డియర్ కామ్రేడ్' విషయానికి వస్తే.. ఇందులో విజయ్, రష్మిక మందన్నా జంటగా నటించారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించింది. -
రూ.70 కోట్ల సినిమా.. 2.19 కోట్ల కలెక్షన్స్.. స్టార్ హీరోకి కోలుకోలేని దెబ్బ!
గతంలో స్టార్ హీరో సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా మినిమం కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంత పెద్ద హీరో అయినా సరే..బలమైన కంటెంట్తో రాకపోతే ప్రేక్షకులు థియేటర్స్ వైపే వెళ్లడం లేదు. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..సినిమాకు మినిమం కలెక్షన్స్ రావడం లేదు. తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ సినిమాకు దారుణమైన పరాజయం ఎదురైంది. ఆయన నటించిన వృషభ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ డిజాస్టర్గా నిలిచింది.దాదాపు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి మొత్తంగా రూ. 2.19 కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడికి కనీసం రెండు శాతం మాత్రం రికవరీ చేసింది. ఓవర్సీస్లో అయితే ఈ మూవీ 8 రోజుల్లో కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇండియాలో రూ. 1.94 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో అయితే ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. తొలి రోజు రూ. 10 లక్షలు వస్తే..నాలుగో రోజు కేవలం రూ. లక్షకు మాత్రమే పరిమితమైంది. తెలుగు వెర్షన్లో మొత్తంగా రూ. 32 లక్షలు, మలయాళంలో రూ. 1.01 కోట్లు, హిందీలో రూ. 8 లక్షలు, కన్నడ వెర్షన్ దాదాపు రూ. 4 లక్షలు మాత్రమే సాధించింది. మొత్తంగా ఈ సినిమాకు దాదాపు రూ. 65 కోట్లకు పైనే నష్టం వచ్చేలా కనిపిస్తుంది.ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలి ఫిల్మ్స్ బ్యానర్తోపాటు కనెక్ట్ మీడియా, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహించారు. సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
శంబాల.. వారం రోజుల్లో ఎంతొచ్చిందంటే?
హిట్టు కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నాడు హీరో ఆది సాయికుమార్. తన కంటే ఎక్కువగా అతడి తండ్రి, నటుడు సాయికుమార్ నిరీక్షిస్తున్నాడు. వీరి ఎదురుచూపులకు తెరదించుతూ 2025 ముగింపులో భారీ విజయం సొంతమైంది. శంబాల సినిమాతో ఆది హిట్టు కొట్టాడు. తండ్రి సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సమయంలో ఈ సక్సెస్ రావడం మరింత విశేషం! వారం రోజుల్లోనే అన్ని కోట్లా?శంబాల విషయానికి వస్తే ఆది హీరోగా, అర్చన్ అయ్యర్ హీరోయిన్గా నటించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించగా మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. శంబాల సక్సెస్తో ఆదికి మంచి బూస్ట్ దొరికినట్లయింది! #Shambhala pic.twitter.com/Bmc71qEtbb— Aadi Saikumar (@iamaadisaikumar) January 2, 2026 చదవండి: భార్యకు విడాకులు! మళ్లీ కలిసే ప్రసక్తే లేదు: నటుడు -
ఆడదానికే ఎందుకు? మగవాడికి నేర్పించండి: రోహిణి
పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటోంది ప్రముఖ నటి రోహిణి. మనం పాటించే మంచి అలవాట్లను వారు కూడా అనుసరించేలా చూడాలని చెప్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో రోహిణి పాల్గొంది. ఈ సందర్భంగా తనను కన్నది తెలుగు తల్లి అయితే పెంచింది తమిళ తల్లి అని పేర్కొందిం.చిన్నప్పటి నుంచే..ఆమె ఇంకా మాట్లాడుతూ... సమాజం నాకు స్త్రీ పాత్ర ఇచ్చింది. స్త్రీ అంటే మగాడికన్నా తక్కువ.. వాళ్లంత చదవనవసరం లేదు, వాళ్లకున్న హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. సమానత్వం లేదని తెలిసింది. చిన్నప్పటినుంచే ఇలా కూర్చోవాలి, వంట చేయాలి, ఈ పనులన్నీ నేర్చుకోవాలి అని చెప్తారు. ఇంకొకరి ఇంటికి వెళ్లినప్పుడు మా పేరు నిలబెట్టాలని తల్లిదండ్రులు చెప్తుంటారు. కొడుక్కి మాత్రం.. ఈ పని చేయొద్దు, ఆడదే చేస్తుంది అని అమ్మ చెప్తుంది. జీతాల్లేని శ్రామికులంఅలా కాకుండా.. మీ ఇద్దరూ కలిసి పనిచేయాలిరా అని అమ్మ చెప్పి పెంచితే ఎంత బాగుంటుంది. సమాజంలోని ఎన్నో విషయాలను సరిచేసే శక్తి మహిళకు ఉంది. అహోరాత్రులు ఇంట్లో శ్రమించే ఆడవాళ్ల గురించి పట్టించుకోవాలి. మనం జీతాల్లేని శ్రామికులం. పుట్టుకతోనే శ్రామికులం. అన్నం ఎవరు వండినా ఉడుకుతుంది. ఆడదాని చేత్తో వండితేనే అన్నం అవుతుందా? అబ్బాయిలకు కూడా అన్నీ నేర్పండి. మా అబ్బాయికి కూడా..సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. దీనివల్ల యువత పక్కదారి పడుతుంది. ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించాలి. బట్టలు వేసుకునే బయటకు వెళ్లాలి.. ఒంటిపై డ్రెస్ లేకుండా వెళ్లకూడదని పిల్లలకు చిన్నప్పుడే చెబుతున్నాం.. దాన్ని అలవాటు చేశాం. ఇక్కడ ఆడవాళ్లం చీరలు కట్టుకుంటాం. లండన్లో షార్ట్స్, స్కర్ట్స్,గౌన్ వేసుకుంటారు. మన అలవాట్లనే పిల్లలకు నేర్పించి మంచిదోవ పట్టించాలి. మా అబ్బాయికి కూడా అదే చెప్తుంటాను. చెడు అలవాట్ల వల్ల వచ్చే కష్టనష్టాలను చెప్పి దానిజోలికి వెళ్లకుండా చూసుకోవాలి అని రోహిణి చెప్పుకొచ్చింది.చదవండి: కల్యాణి కంటే ముందు ఆ హీరోయిన్కు లోక ఆఫర్ -
కల్యాణి కంటే ముందు ఆ హీరోయిన్కు 'లోక' ఆఫర్!
మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం లోక. కల్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్ ఉమెన్ చిత్రం లోక. డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొత్త లోక: చాప్టర్ 1 పేరిట తెలుగులో విడుదలైంది. ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించాడు. 2025 ఆగస్టులో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కల్యాణి ప్రియదర్శన్ కంటే ముందు పార్వతి తిరువోతును సంప్రదించినట్లు ఓ రూమర్ ఉంది.హీరోయిన్ అసహనంతాజాగా ఈ రూమర్పై పార్వతి సీరియస్ అయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ప్రతమదృష్ట్య కుట్టకర్. ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్కు పార్వతి హాజరైంది. ఈ సందర్భంగా ఆమెకు లోక సినిమా ఆఫర్ వచ్చిందా? అన్న ప్రశ్న ఎదురైంది. దానికామె స్పందిస్తూ.. ఇలాంటి ప్రశ్నలు అడగడం అనవసరం. మీరు ఇలాంటివి చాలా వింటుంటారు. మీకు నచ్చింది వినుకోండి అని బదులిచ్చింది.చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలిస్తా: నటికి బంపరాఫర్ -
భార్యతో తెగదెంపులు, మళ్లీ కలిసే ప్రసక్తే లేదు: నటుడు
పెళ్లి చేసుకునేటప్పుడు ఒకరి చేయి మరొకరు జీవితాంతం విడవమని చెప్తుంటారు. కానీ ఇప్పుడంతా రివర్స్లో జరుగుతోంది. చాలామంది దంపతులు కొన్ని నెలలకే విడిపోతుంటే మరికొందరు మాత్రం పెళ్లయిన దశాబ్దాల తర్వాత కూడా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. మలయాళ బుల్లితెర జంట మను వర్మ- సింధు వర్మ ఈ కోవలోకే వస్తారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు.మళ్లీ కలిసే ప్రసక్తే లేదుఈ విషయం గురించి మను వర్మ మాట్లాడుతూ.. నేను, నా భార్య కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నాం. చట్టపరంగా విడాకులు ఇంకా మంజూరు కానప్పటికీ మేము మళ్లీ కలిసే అవకాశాలు చాలా తక్కువ. మళ్లీ జంటగా జీవితాన్ని కొనసాగించే అవకాశం, ఆలోచన ఎంత మాత్రం లేదు. మాకంటే ఎక్కువ ప్రేమించుకున్నవాళ్లు, జంటగా కలిసున్నవాళ్లు కూడా విడిపోయిన సంఘటనలు కోకొల్లలు. లోపించిన సఖ్యతమూడేళ్ల క్రితం మేమిద్దరం ప్రేమగానే కలిసిమెలిసున్నాం. కానీ కొంతకాలానికే అంతా రివర్స్ అయిపోయింది. మా మధ్య సఖ్యత లేనప్పుడు కష్టంగా కలిసుండటం కన్నా విడివిడిగా జీవించడమే మంచిది. విదేశాల్లో దంపతులు విడిపోయినా వారి మధ్య స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అది కేరళలోనూ అవలంబిస్తే బాగుంటుంది. ముగ్గురు పిల్లలుఇక్కడ విడిపోయిన జంట మళ్లీ తారసపడ్డారంటే ఒకరిని మరొకరు ఎద్దేవా చేసుకుంటూ అవతలి వారి పరువు తీయడానికే ప్రయత్నిస్తుంటారు. మాకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్దవాడు అమెరికాలో ఐటీ ఇంజనీర్ కాగా రెండో కొడుకు బెంగళూరులో ఉంటున్నాడు. మాకో కూతురుంది. తనకు ఆరోగ్య సమస్యలున్నాయి అని చెప్పుకొచ్చాడు. సీరియల్స్, సినిమాదివంగత నటుడు జగన్నాథ వర్మ కుమారుడే మను వర్మ. మను వర్మ.. కాదమట్టతు కథనార్, పోక్కాలం వరవై, కుంకుమచెప్పు వంటి పలు సీరియల్స్లో నటించాడు. అలాగే మమ్ముట్టి 'నీలగిరి', జయరామ్ 'నరనాతు తంపురాన్' సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు. సింధు వర్మ విషయానికి వస్తే ఎటో జన్మ కల్పనయిల్, పంచాంగి వంటి సీరియల్స్ చేసింది. మమ్ముట్టి 'సీబీఐ 5: ద బ్రెయిన్', 'అర్థం' చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది.చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలు: నటికి ఆఫర్ -
అందుకే ‘రాజాసాబ్’ ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు: మారుతి
ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’ మరో వారం రోజుల్లో(జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్కి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానని దర్శకుడు మారుతి ముందే హామీ ఇచ్చారు. తేడా వస్తే..ఇంటికొచ్చి అడగొచ్చు అంటూ అడ్రస్ కూడా చెప్పాడు. మారుతి(Director Maruthi) ఇలాంటి ప్రకటనలు చేయడం వెనక ఓ కారణం ఉంది. ఆయన ప్రభాస్తో సినిమా ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు మారుతి అలాంటి ప్రకటనలు చేశాడు. అయినా కూడా ఇండస్ట్రీలో కొంతమంది ది రాజాసాబ్(The Raja Saab) ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే విషయాన్ని మారుతి దగ్గర ప్రస్తావిస్తూ.. వాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మారుతి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కొంతమంది జెలసీతోనే అలా కోరుకుంటున్నారని.. వారికి తన సినిమాతోనే సరైన సమాధానం చెబుతానన్నారు.‘ఈర్ష్య, అసూయ మానవ నైజం. నాకు భారీ హిట్ పడితే.. ఎక్కడ బిజీ అయిపోతాడేమోననే భయంతో కొంతమంది అలా కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు చిన్న చిన్న సినిమాల ఈవెంట్స్కి కూడా వెళ్తున్నాను. రాజాసాబ్ హిట్ అయితే.. ఇలాంటి ఈవెంట్లకు రానేమో అని వాళ్లు భయపడుతున్నారు. నాకు ఫెయిల్యూర్ వస్తే.. వాళ్లకు అది ఫుడ్ పెట్టదు. కానీ జెలసీతో అలా కోరుకుంటున్నారు. ఈసారి కిందపడితే కొన్నాళ్ల పాటు కోలుకోలేడని వాళ్లు అనుకుంటున్నారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. హిట్ వచ్చినా..ఫ్లాప్ వచ్చిన మరో సినిమా తీస్తా. ప్రభాస్తో సినిమా తీశా కదా అని ఇకపై పెద్ద సినిమాలు మాత్రమే తీయాలనే కోరికలు నాకు లేదు. రాజాసాబ్ తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీసేస్తా. నా కథకి ఏ హీరో సెట్ అయితే ఆ హీరోతో వెళ్లిపోతా. బిజీగా ఉండాలని మాత్రమే కోరుకుంటా’ అని మారుతి చెప్పుకొచ్చాడు. -
పొలిటికల్ ఎంటర్ టైనర్గా ‘ధర్మస్థల నియోజకవర్గం’
వరుణ్ సందేశ్ ,వితికా షేరు, సుమన్ ,సాయికుమార్ , నటరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ ధర్మస్థల నియోజకవర్గం. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిమూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుo భాస్కర్ నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి నూతన సంవత్సర కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ "మా చిత్రం ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయికుమార్ సుమన్ లతోపాటు యంగ్ హీరోస్ కూడా నటించారు.మంచి ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కించడం జరిగింది. చంద్ర బోస్ గారు అందించిన లిరిక్స్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. చంద్రబోస్ గారు అందించిన లిరిక్స్ కు సునీత గారు వినసొంపైన వాయిస్ ఇచ్చారు. అన్ని హంగుల్తో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం . తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది" అని అన్నారు . -
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన 'సు ఫ్రమ్ సో' నటి
కన్నడ నటి సంధ్య అరకెరె త్వరలో తల్లి కాబోతోంది. 'సు ఫ్రమ్ సో' మూవీలో సులోచన కూతురిగా నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సంధ్య. అంతకుముందు కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కన్నడ మూవీ 'సు ఫ్రమ్ సో'తో విశేష గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల్లో సక్సెస్ అందుకుంటున్న ఈ నటి పర్సనల్ లైఫ్లో అంతకుమించి సంతోషంగా ఉంది. కారణం.. తానిప్పుడు గర్భవతి!బేబీ బంప్ ఫోటోలు2025 డిసెంబర్లో ఆమె సీమంతం జరిగింది. ఇప్పుడేమో భర్త, నటుడు శోధన్ బర్సూర్తో కలిసి బేబీ బంప్ ఫోటో షూట్ చేయించుకుంది. బేబీ కోసం వెయిటింగ్.. అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు కుట్టి సంధ్య కోసం మేము కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. రంగస్థల కళాకారిణి అయిన సంధ్య.. 'హిందే గాళి ముందె మత్తే' అనే షార్ట్ ఫిలింలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Sandhya Arakere (@sandhyaarakere) View this post on Instagram A post shared by Sandhya Arakere (@sandhyaarakere) చదవండి: ప్రేయసిని పరిచయం చేసిన బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ -
బిగ్బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?
కొందరు బిగ్బాస్ సెలబ్రిటీలు బయటకు రాగానే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఏదైనా ఈవెంట్కు వెళ్లినా, ఫంక్షన్కు వెళ్లినా చుట్టూ బాడీగార్డులను వెంటేసుకుని వెళ్తుంటారు. గతంలో బిగ్బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. సోనియా-యష్ పెళ్లికి కూడా బాడీగార్డులను వెంటేసుకునే పోయాడు. నిన్నగాక మొన్న బిగ్బాస్ 9 విన్నర్ పవన్ కల్యాణ్ పడాల పదిమంది బాడీగార్డులతో ఓ ఈవెంట్కు హాజరయ్యాడు. 150 మంది బాడీగార్డులా?అయితే ఓ హిందీ కంటెస్టెంట్ మాత్రం ఏకంగా 150 మంది బాడీగార్డులను పెట్టుకుందంటూ ఓ వార్త వైరలవుతోంది. తను మరెవరో కాదు, తాన్య మిట్టల్. గొప్పలు చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందీ లేడీ కంటెస్టెంట్. పూటకో చీర కడతానని బిగ్బాస్ హౌస్కు దాదాపు 800 చీరలు తీసుకెళ్లింది. అలాగే 50 కిలోల నగలు కూడా పట్టుకెళ్లింది. లగ్జరీకి పెద్ద పీట వేసే ఈ బ్యూటీ తనకు 150మంది బాడీగార్డులున్నారన్న రూమర్పై తాజాగా స్పందించింది.అందులో నిజం లేదుతాన్య మిట్టల్ మాట్లాడుతూ.. నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. ఇది కావాలని పుట్టించారు. నా కింద 150 మంది సిబ్బంది పనిచేస్తారని మాత్రమే చెప్పాను. దానికి బిగ్బాస్ హౌస్లోని ఓ కంటెస్టెంట్ జైషా ఖాద్రి.. వాళ్లందర్నీ నా బాడీగార్డ్స్ అని సరదాగా అన్నాడు. అంతకుమించి ఏమీ లేదు. అలా అని బాడీగార్డ్స్ లేరని చెప్పను. నాకంటూ కొంత సెక్యూరిటీ సిబ్బంది ఉంది.అబద్ధం చెప్పనుఎందుకంటే నాకు బట్టల పరిశ్రమ, ఫార్మా ఫ్యాక్టరీ, గిఫ్ట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించలేను. కానీ, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అబద్ధాలాడాల్సిన అవసరం నాకసలే లేదు అని పేర్కొంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాన్య మిట్టల్.. హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొని మూడో రన్నరప్గా నిలిచింది. ప్రముఖ దర్శకనిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్లోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది.చదవండి: ప్రేయసిని పరిచయం చేసిన బిగ్బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ -
కుప్పలుతెప్పలు వద్దు.. ఒక్క సినిమానే చేస్తా!: ఆలియా భట్
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈమె చివరగా జిగ్రా (2024) సినిమాలో కనిపించింది. 2025లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం ఆల్ఫా, లవ్ అండ్ వార్ మూవీస్ చేస్తోంది.అర్థం చేసుకోగలిగా..తాజాగా ఆలియా భట్ మాట్లాడుతూ.. నేను హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమా చేశాను. కానీ అందులో నా పాత్రకు మరీ ఎక్కువ స్టంట్ సీన్లు లేవు. కానీ ఆల్ఫా మూవీలో ఎక్కువ యాక్షన్ సన్నివేశాల్లో నటించాను. పాప పుట్టాక ఇలాంటి సీన్లలో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. నా శరీరం ఇటువంటి సన్నివేశాల్లో నటించేందుకు ఏమేరకు సహకరిస్తుందనేది అర్థం చేసుకోగలిగాను.అదే నేర్చుకున్నా..లవ్ అండ్ వార్ మూవీ అయితే నాకు ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ అలిసిపోయినట్లుగా అనిపించలేదు. సంజయ్ లీలా భన్సాలీతో పని చేయడం అందమైన అనుభవాలను మిగిల్చింది. సెట్లో ఎంతగానో నేర్చుకున్నాను. గంగూభాయ్ కతియావాడి సెట్లో మైండ్లో ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా.. ఖాళీ మైండ్తో ముందుకు వెళ్లాలని నేర్చుకున్నాను. అప్పుడే అన్నింటినీ పరిశీలించొచ్చు, గమనించి నేర్చుకోవచ్చు.రెండూ బ్యాలెన్స్ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఒక్కసారి ఒక ప్రాజెక్టులో మాత్రమే నటించాలనుకుంటున్నాను. ఓ పక్క కూతురు రాహాను చూసుకుంటూ మరోపక్క ఏదైనా ఒక సినిమాలో మాత్రమే లీనమవ్వాలని భావిస్తున్నాను. ప్రస్తుతానికి నా పనిని ఆస్వాదిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.చదవండి: మురారి క్లైమాక్స్.. కాస్త తేడా కొట్టినా నన్ను చంపేవాళ్లే: దర్శకుడు -
ఏమాత్రం తేడా కొట్టినా చంపేసేవాళ్లు.. కృష్ణవంశీ
సూపర్స్టార్ మహేశ్బాబు అయిష్టంగా ఒప్పుకున్న సినిమా మురారి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2001లో రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. తర్వాత రీరిలీజ్ సమయంలోనూ కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఎలా జరిగిందనే విషయాలను కృష్ణ వంశీ తాజాగా చెప్పుకొచ్చాడు.క్లైమాక్స్ ఒక్కటే..అది ఆయన మాటల్లోనే చూద్దాం.. మురారి సినిమా షూటింగ్ మొదలైంది. కానీ పతాక సన్నివేశం ఎలా అనేది ఎటూ తెగడం లేదు. మనసులో, మెదడులో అంతా అలజడి. అన్ని సన్నివేశాలు అద్భుతంగా అమరినా క్లైమాక్స్ మాత్రం అస్పష్టంగానే ఉంది. మామూలు సినిమాలా ఒక ఫైట్తో ముగించాలని లేదు, ఏదో అద్భుతం జరగాలి. సరే అని తెగించి ఒక ఆలోచనను పట్టుకున్నాను.అదీ సీన్తనే చచ్చిపోతున్నాను అని మురారికి తెల్సిపోయిన తర్వాత ఛట్.. అదేం కుదరదు అని తన చావుకీ, బామ్మ మాటకి ఎదురెళ్తాడు. దైవశక్తికి తన స్వశక్తిని అడ్డం వేస్తాడు. కానీ, బుల్లిగాడు గునపం దించేశాడు. బొట్టు బొట్టులో ప్రాణం జారిపోతుంది. వసు ఇది చూసి స్పృహ తప్పింది.. బుల్లి రక్తం చూసి కంగారొచ్చేసి పారిపోయాడు. విశాలమైన పొలాల మధ్యలో కనుచూపు మేరలో ఎవరూ లేరు. తిరిగొస్తానని బామ్మకి మాటిచ్చాడు. స్పృహలో లేని వసుని అక్కడినుంచి తీసుకెళ్ళిపోవాలి. ఏ సహాయం లేదు, రాదు.మహేశ్కు ఎక్కించా..శరీరం సహకరించడం లేదు... ప్రాణం పోతూపోతూ ఉంది. నాకు నేనే శక్తి కూడగట్టుకోవాలి. నేను ఏ తప్పూ చేయునప్పుడు నేనెందుకు లొంగాలి? చావైనా సరే నేను తగ్గను అనుకుంటూ ముందుకెళ్లాలి. గొప్పగా అనిపించిన ఈ కాన్సెప్ట్ మొత్తం మహేశ్కు ఎక్కించా... చుట్టూ పంచభూతాలు తప్ప ఎవరూ ఉండరు, ఏమీ ఉండదు. ప్రాణం పోతున్న నొప్పి, ఎవరూ లేని అసహాయత, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, వసూని తీసుకెళ్ళి పోవాలి. బామ్మ ఆఖరి పూజకి అందుకోవాలి.... చావకూడదు... బతకాలి.. వసూని పెళ్లి చేసుకోవాలి.పిచ్చిపిచ్చిగా.. తిక్కతిక్కగా..తల నిండా చిత్రమైన మంచీ చెడూ ఆలోచనలు... నవ్వొస్తుంది, ఏడుపొస్తుంది. నవ్వాలి.....ఏడవాలి.... గంతులెయ్యాలి ... డాన్స్ చేయాలి. నొప్పితో నొప్పిని ఆపుకోవడానికి పాట పాడాలి, అరవాలి... గుర్తొచ్చి మట్టితో గాయంమీద రాసుకోవాలి. పిచ్చిపిచ్చిగా... తిక్కతిక్కగా అటూఇటూ తిరగాలి. అమ్మ గుర్తొస్తోంది, అందరూ గుర్తొస్తున్నారు.... మొత్తానికి వెళ్ళాలి వెళ్ళి తీరాలి. సంకల్పం అంతే! మొత్తం అర్థమయేలా మహేశ్కు వివరించా.... గునపం గుచ్చుకున్న దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ ఏం చేయాలో చిన్న గుర్తులతో చెప్పా..నో రిహార్సల్రిహార్సల్ వద్దన్నా.. డైరెక్ట్ టేక్ అన్నా.. ఒక సెకన్ నన్ను సూటిగా చూసి రెడీ సార్ అన్నాడు. ఈసీన్ కోసమే రామలింగేశ్వరరావు గారికి మూడు కెమెరాలు కావాలి అని అడిగా.. ఆయన తెప్పించిన మూడు కెమెరాలు, లైటింగ్ అమరుస్తూ మహేష్ ఒక్కడ్నీ పది నిమిషాలు వదిలేసా... ఆ ప్రదేశం అంతా యూనిట్ వందమంది, షూటింగ్ చూడటానికి వచ్చిన ఒక వెయ్యి మంది.. నిశ్శబ్దం... భయంకరమైన నిశ్శబ్దం.... మహేశ్ తప్ప తెరమీద ఇంకెవ్వరూ కనపడని సన్నివేశం.... ఏమాత్రం తేడా కొట్టనా అభాసుపాలు అయిపోయే ప్రమాదం... మహేశ్ ఒక సూపర్ స్టార్గా, ఒక నటుడిగా మేక్ ఆర్ బ్రేక్!ఏమాత్రం తేడా జరిగినా..తేడా జరిగితే సీనియర్, జూనియర్ సూపర్ స్టార్ అభిమానులు డైరెక్టర్గా నన్ను చంపేసే ఉపద్రవం... కానీ నాకు మహేశ్ మీద మనసు మూలల్లో నాకే అర్థం కాని ఒక గొప్ప నమ్మకం... చింపేస్తాడు అని...కెమెరాస్ రెడీ అన్నాడు రాంప్రసాద్ ... రెడీయా మహేష్ అని కూడా అడగలేదు. క్లాప్ అని అసంకల్పితంగా వచ్చేసింది.... మహేశ్ ఏం మాట్లాడలేదు... పొజిషన్లోకి వెళ్లిపోయాడు. పదినిమిషాలు ఆగకుండా..యాక్షన్.. అంతే... ఏకధాటిగా మూడు నిముషాల నలభై సెకన్లు. ఆఖరులో కుండలో నీళ్ళు మొహం మీద ఒంపుకొని దాన్ని విసిరేస్తూ అదుపుతప్పి కింద పడిపోగానే కట్ చెప్పాను .... ఒక్క సారిగా అక్కడున్న వాళ్ళందరూ యూనిట్ అంతా కూడా చప్పట్ల హోరు.... ఆగకుండా పదినిమిషాలు కొట్టేశాం అని అర్థం అయింది. ఆర్నెళ్ల ఆత్రత, అలజడి కుదుటపడింది..... దటీజ్ మహేశ్!పస్తులతో షూటింగ్P.S. ముందు రోజు రాత్రి షూటింగ్ అరటితోట ఫైట్ అయిన తరువాత మరుసటిరోజు ఈ సీన్ షూటింగ్.... అప్పటినుంచి షూట్ అయ్యేంతవరకు ఏమీ తినొద్దు, మంచి నీళ్ళు, కాఫీ తప్ప! నాకు అప్పటికే రెండవరోజు.... సరే సార్ డైరెక్టర్ గారూ అని రామలింగేశ్వరరావు గారింటి నుంచి వచ్చిన డిన్నర్ క్యారేజీని అసిస్టెంట్లకు పంపించేశాడు.... పస్తున్నాడు ఎఫెక్ట్ కోసం .... చాలా ఎత్తుకి ఎదుగుతాడు. కృష్ణ గారి పేరు ఇంకా పైకెత్తుతాడు అని కనపడిపోయింది అని ఎక్స్ (ట్విటర్)లో ఆనాటి విశేషాలను గుర్తుచేసుకున్నాడు.చదవండి: ఈషాపై నెగెటివిటీ.. ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: డైరెక్టర్ -
18ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నా.. డబ్బు కంటే గౌరవం ముఖ్యం: నందు
శ్రీ నందు, యామినీ భాస్కర్ జోడీగా నటించిన సినిమా ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో రానా స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్పై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం శ్రీ నందు మాట్లాడుతూ–‘‘ఓ అబ్బాయిని ఓ అమ్మాయి మోసం చేస్తుంది. అదే అబ్బాయి జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో, ఆ అబ్బాయి జీవితం ఎలా బాగుపడింది? అన్నదే కథ. 18ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం. ఈ క్రమంలో నా జడ్జ్మెంట్ ఎంతమేరకు కరెక్ట్ అనేది తెలుసుకోవడానికి నిర్మాతగా మారాను. నిర్మాత డి. సురేశ్బాబుగారు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడే నా జడ్జిమెంట్ కరెక్ట్ అనిపించింది. అలాగే రానాగారి సపోర్ట్ను మర్చిపోలేను. నేను నటించిన ‘అగ్లీ స్టోరీ’ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. అలాగే నేను, వెన్నెల కిషోర్, ‘వైవా’ హర్ష కలిసి ఓ సినిమా చేయబోతున్నాం’’ అని చెప్పారు. -
రాజాసాబ్: 'రాజే.. యువరాజే' సాంగ్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజాసాబ్' సినిమాతో 2026కి స్వాగతం పలుకుతున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీ జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్తో సోషల్మీడియాలో మంచి హైప్ వచ్చింది. కొత్త ఏడాది సందర్భంగా ది రాజాసాబ్ నుంచి ఓ సర్ప్రైజ్ వదిలారు. రాజే యువరాజే సాంగ్'రాజే యువరాజే' పాటను రిలీజ్ చేశారు. ఎటువంటి విజువల్స్ లేకుండా కేవలం ఆడియో సాంగ్ మాత్రమే బయటకు వదిలారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటను అద్వితీయ వొజ్జల, బేబీ రియా సీపన ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ సమకూర్చారు. ఇకపోతే ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఒకేరోజు రెండు సర్ప్రైజ్లుకాగా ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. అందులో డార్లింగ్ ప్రభాస్ ఒంటి నిండా గాయాలు, కట్లతో కనిపించాడు. అయితే ప్రభాస్ను ముందువైపు నుంచి చూపించకుండా బ్యాక్సైడ్ ఫోటో మాత్రమే వదిలారు. దెబ్బలతో ఉన్న ప్రభాస్ ఓపక్క సిగరెట్, మరోపక్క మందు తాగుతున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది. ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
స్టార్ హీరోలను కాదని.. కోతితో దర్శకుడి సినిమా!
అజిత్, విజయ్కాంత్, సూర్య, ఆమిర్ ఖాన్, విజయ్, రజనీకాంత్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు దర్శకుడు ఏఆర్ మురుగదాస్. అయితే ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ చిత్రం పూర్తిగా నిరాశపర్చింది.వరుస అపజయాలుఅలాగే హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్ అపజయంపాలైంది. కొంచెం గ్యాప్ తర్వాత శివకార్తికేయన్ హీరోగా చేసిన మదరాసి కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఏఆర్ మురుగదాస్ నెక్స్ట్ సినిమా ఏంటన్న ఆసక్తి నెలకొంది.ఎప్పుడో అనుకున్నా..అయితే ఈసారి స్టార్ హీరోలను కాకుండా ఒక వానరాన్ని నమ్ముకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ భేటీలో పేర్కొన్నారు. తన నెక్స్ట్ సినిమాలో కోతి ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలిపారు. కాకపోతే ఆ కోతి గ్రాఫిక్స్లో రూపొందించనున్నామన్నారు. తాను సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న సమయంలోనే ఈ కథతో సినిమా చేయాలని భావించానని, ఇది బాలల ఇతివృత్తంతో రూపొందే సినిమాగా ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఈషాపై నెగెటివిటీ.. చచ్చిపోదాం అనిపించింది: డైరెక్టర్
చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. కథ బాగుండే సినిమాయే ఆడుతుంది. కంటెంట్ బాగుండి, నిజాయితీతో సినిమా తీస్తే హిట్ చేస్తామని ఈషా మూవీతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు అని ప్రముఖ నిర్మాత డి.సురేశ్బాబు చెప్పారు. త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ఈషా. డిసెంబర్ 25న రిలీజైన ఈషాశ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ మూవీని వంశీ నందిపాటి, బన్నీ వాస్ డిసెంబర్ 25న విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈషా జర్నీ చాలా పెద్దది. ఈ ప్రయాణంలో శ్రీనివాస్ చాలా కష్టపడ్డాడు అని తెలిపారు. ఈషా ఆడియన్స్కు కనెక్ట్ కాకపోతే ఐదురోజుల్లోనే ఆరు కోట్ల గ్రాస్ వచ్చేవి కావు అని బన్నీ వాస్ పేర్కొన్నారు. ఆడియన్స్ సపోర్ట్ చేయడం వల్లే ఈషా వంటి చిత్రాలు విజయాన్ని సాధిస్తుంటాయి అని వంశీ నందిపాటి చెప్పారు. ఐదు రోజుల్లోనే..సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి.. అంతేకానీ మమ్మల్ని వేధించకండి. మా సినిమాకు వచ్చిన రివ్యూస్, రేటింగ్స్ చూసి సూసైడ్ చేసుకుందాం అనిపించింది. ఈ ప్రపంచానికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్లిపోదామా అని భయంతో వణికిపోయాను. ఆ నెగెటివిటీ చూసి చaనిపోవాలనే అనిపించింది. అదంతా తట్టుకుని ఇప్పుడు స్టేజీపై నిలబడ్డాను అని శ్రీనివాస్ పేర్కొన్నారు. మా మూవీకి ఇప్పటికీ హౌస్ఫుల్స్ పడుతున్నాయి అని హేమ వెంకటేశ్వరరావు అన్నారు.గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఇండియన్ సినిమా ఆజానుబాహుడు.. స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ -
నటుడిగా మారిన ఏఆర్ రెహమాన్
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఇప్పుడు నటుడిగా మారారు. ఇప్పటివరకు స్టేజీలపై తన గానం, సంగీతంతో అలరించిన ఆయన పలు మ్యూజిక్ ఆల్బమ్స్లోనూ నటించారు. గతంలో దర్శకనిర్మాతగానూ పరిచయం చేసుకున్న రెహమాన్ తాజాగా నటుడిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. మూన్వాక్ సినిమాలో డ్యాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో కలిసి నటిస్తున్నారు.యంగ్ డైరెక్టర్గాబిహైండ్వుడ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ ఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ పలు ప్రత్యేకతలతో రూపొందుతోందని దర్శకుడు పేర్కొన్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు అనే తనే ప్రత్యేకతను మించి మూన్వాక్ మూవీ ద్వారా నటుడిగా రంగప్రవేశం చేస్తున్నాననన్నారు. ఇందులో తాను ఆక్రోశం కలిగిన యంగ్ డైరెక్టర్గా కనిపించనున్నట్లు చెప్పారు. అలాగే ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తూ 5 పాటలను ఆయనే పాడటం మరో విశేషం.ప్రభుదేవాతో డ్యాన్స్ఒక పాటలో ప్రభుదేవాతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవమని గుర్తు చేసుకున్నారు. ఆ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారని తెలిపారు. ప్రభుదేవా కొరియోగ్రాఫర్గా నటించగా, యోగిబాబు త్రిపాత్రాభినయం చేశారని చెప్పుకొచ్చారు. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ను జనవరి 4న చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఈ మూవీలో అంజు వర్గీస్, అర్జున్ అశోకన్ సాక్షి, సుష్మిత, నిష్మా, స్వామినాధన్, రెడిన్ కింగ్స్టన్, రాజేంద్రన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే నెలలో మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘ఛాంపియన్’లో ఈ నటుడిని గుర్తుపట్టారా?
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడు రోషన్ మేకా హీరోగా నటించిన తాజా చిత్రం ఛాంపియన్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలై పాజిటిట్ టాక్ని సంపాదించుకుంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఓ ఆటగాడి నేపథ్యంలో చూపిస్తూనే.. ఓ చక్కని ప్రేమ కథను చెప్పారు. ఈ చిత్రంలోని రంగయ్య పాత్ర అందరిని ఆకట్టుకుంది. తక్కువ నిడివే ఉన్నప్పటికీ..సినిమా చూసినవాళ్లకు ఆ పాత్ర కూడా గుర్తిండిపోతుంది. బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా నిలిచిన ఆ కారెక్టర్లో నటించింది విజయ్ దేవరకొండ మేనమామ యశ్ రంగినేని.నిర్మాతగా హిట్ సినిమాలు!యశ్ రంగినేని నిర్మాతగా టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రానీ నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.నటన పై ఇష్టంతో..నిర్మాతగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. యశ్కి నటన అంటే చాలా ఇష్టం. అందుకే వచ్చిన అవకాశం వదులుకోలేదు. ఛాంపియన్లో వీరయ్య పాత్ర కోసం తనను సంప్రదించగానే.. కథ నచ్చి వెంటనే ఓకే చెప్పేశాడట. ఓ చదువు రాని వ్యక్తిగా, గ్రామీణ జీవితాలకు, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా వీరయ్య పాత్రలో యశ్ రంగినేని ఒదిగిపోయారు. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రహించడం, లోలోపల అగ్ని జ్వాలలు రగిలేట్టుగా భావాలతో ఉండే ఈ పాత్రలో యశ్ రంగినేని చక్కగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లో సక్సెస్ ఫుల్గా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. -
నాతో డేట్కు రా.. ఎంత తీసుకుంటావ్?: హీరోయిన్కు ప్రపోజల్
సెలబ్రిటీలను ఆరాధించేవాళ్లు చాలామంది. వారితో ఒక్క సెల్ఫీ అయినా దిగాలని, నేరుగా చూడాలని.. ఇలా చాలా కలలు కంటుంటారు. కొందరైతే ఏకంగా ప్రేమ, పెళ్లి ప్రపోజల్స్ కూడా పంపిస్తుంటారు. తాజాగా మలయాళ హీరోయిన్ సనా ఆల్తఫ్కు అలాంటి ప్రపోజలే వచ్చింది.డేటింగ్ ప్రపోజల్డేట్కు రమ్మని ఓ వ్యక్తి పదేపదే మెసేజ్ చేస్తున్నాడంటూ ఈమెయిల్లో వచ్చిన సందేశాలను స్క్రీన్షాట్ తీసి షేర్ చేసింది. అందులో ఏముందంటే.. డియర్ సనా.. ఎలా ఉన్నావు? నేను చెన్నైకి చెందిన వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త బాలాజీని. నాకు నీతో డేటింగ్కు వెళ్లాలని ఉంది. దానికి ఎంత తీసుకుంటావో చెప్పు.. అలాగే ఎప్పుడు వీలవుతుందో కూడా తెలియజేయు. మాల్దీవులు, దుబాయ్..దాన్నిబట్టి మనం ప్రోగ్రామ్ పెట్టుకుందాం. అయితే ఇండియాలో లేదంటే మాల్దీవులు, దుబాయ్కు వెళదాం. ఒక్కసారి ఆలోచించు అని బాలాజీ అనే వ్యక్తి రాసుకొచ్చాడు. ఇలా పలుమార్లు మెయిల్ చేశాడు. వాటికి సంబంధించిన స్క్రీన్షాట్లను షేర్ చేసిన సనా.. ఎంత ప్రొఫెషనల్గా, రొమాంటిక్గా ప్రపోజ్ చేశాడో.. అని సరదాగా చమత్కరించింది.సినిమాసనా ఆల్తఫ్ 'విక్రమాదిత్య' సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ మలయాళ మూవీలో దుల్కర్ సల్మాన్ సోదరిగా నటించింది. తర్వాత 'మరియం ముక్కు' మూవీలో ఫహద్ ఫాజిల్ సరసన హీరోయిన్గా యాక్ట్ చేసింది. 'రాణి పద్మిని', 'ఓడియన్' చిత్రాల్లోనూ మెరిసింది. తమిళంలో 'ఆర్కే నగర్', 'పంచరాక్షరం' సినిమాలు చేసింది.చదవండి: హీరో విజయ్ పక్కన కచ్చితంగా నటిస్తా: హీరోయిన్ -
ఆ సినిమా చూసి డిస్టర్బ్ అయ్యా.. ఇది ఊహించలేదు!
'బైసన్' మూవీతో ఈ ఏడాది మంచి హిట్ అందుకున్నాడు తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్.. కేవలం ఐదు సినిమాలతోనే టాప్ దర్శకుడిగా మారిపోయాడు. 'పెరియేరమ్ పెరుమాల్', 'కర్ణన్', 'మామన్నన్', 'వాళై', 'బైసన్' చిత్రాలతో ఇండస్ట్రీలో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇటీవల ఓ సినిమా తనను ఎంతగానో డిస్టర్బ్ చేసిందంటున్నాడు మారి సెల్వరాజ్.కలత చెందా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఓటీటీలో 'హోంబౌండ్' అనే హిందీ సినిమా చూశాను. ఆ తర్వాత రెండు, మూడు రోజులు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ సినిమా నాపై ఇంత ప్రభావాన్ని చూపుతుందనుకోలేదు. ఎంతో కలత చెందాను.. మనం మాత్రం కరోనా లాక్డౌన్ను మనం ఇంత ఈజీగా దాటేశామా? అనిపించింది. నా దృక్కోణాన్నే మార్చేసిందిహోంబౌండ్ చూశాక కొద్దిరోజులు ఎవరితోనూ మాట్లాడలేదు. సినిమాను మరింత ప్రామాణికంగా, వాస్తవికంగా ఎలా తీయాలో నన్ను ఆలోచించేలా చేసింది. ఒక దర్శకుడిగా నా దృక్కోణాన్నే మార్చేసింది అని చెప్పుకొచ్చాడు. హోంబౌండ్ విషయానికి వస్తే.. ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. నీరజ్ గెవాన్ దర్శకత్వం వహించాడు. మార్టిన్ స్కోర్సెస్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: చిన్న వయసులో ఆస్తులన్నీ కోల్పోయాం.. షాంపూలు అమ్మా: నటుడు -
Toxic Movie: నయన్ చేతిలో గన్.. లుక్ అదిరింది!
యశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా నయనతార ఫస్ట్లుక్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో ఆమె గంగ అనే పాత్రలో కనిపించనున్నారు. ఒక భారీ క్యాసినో బ్యాక్డ్రాప్లో.. మోడ్రన్ డ్రెస్లో గన్ పట్టుకొని పవర్ఫుల్ లుక్స్తో నయన్ ఎంతో స్టైలిష్గా కనిపించారు. ఆమె హావభావాలు సినిమాలోని ఇంటెన్సిటీని, భారీతనాన్ని తెలియజేస్తున్నాయి. ఈ పాత్ర గురించి డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'టాక్సిక్'లో నయనతార సరికొత్త నటనా ప్రతిభను చూస్తారు. షూటింగ్ జరుగుతున్న కొద్దీ గంగ పాత్ర ఆత్మకు, నయనతార వ్యక్తిత్వానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని నేను గమనించాను’ అని ఆమె అన్నారు. ఈ చిత్రంలో నయనతారతో కలిపి మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే కియరా అద్వానీ, హ్యుమా ఖురేషీకు సంబంధించిన ఫస్ట్లుక్ని విడుదల చేశారు. కియారా..నదియా పాత్రలో కనిపించగా, ఖురేషీ ఎలిజబెత్ పాత్రలో అలరించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. Introducing Nayanthara as GANGA in - A Toxic Fairy Tale For Grown-Ups #TOXIC #TOXICTheMovie @advani_kiara @humasqureshi #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar #KunalSharma #SandeepSharma #JJPerry… pic.twitter.com/FSiWGo7XeC— Yash (@TheNameIsYash) December 31, 2025 -
తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలి: నవీన్ పొలిశెట్టి
‘వరుసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత అదే ఉత్సాహంలో మీ ముందుకు మరో అదిరిపోయే సినిమాని తీసుకొద్దాం అనుకున్నాను. కానీ, 2024లో జరిగిన ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల నేను షూటింగ్ కి దూరమయ్యాను. మానసికంగా, శారీరకంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే అదే సమయంలో మా బృందంతో కలిసి ఈ 'అనగనగా ఒక రాజు' కథ రాసుకోవడం జరిగింది. మీ అందరి ప్రేమతోనే మేము ఈ సినిమా షూటింగ్ ని సరదాగా ఆరు నెలల్లో పూర్తి చేయగలిగాం. జనవరి 14న విడుదలవుతున్న 'అనగనగా ఒక రాజు' చిత్రాన్ని మీరు కుటుంబంతో కలిసి చూసి ఆనందిస్తారని మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అన్నారు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది.జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో 'రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక'ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. నేను ప్రేక్షకుల నుంచి వచ్చిన వాడినే. ఒకప్పుడు నేను ఏ హీరోల సినిమాలైతే థియేటర్ కి వెళ్ళి చూసేవాడినో.. ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు, నా సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి వల్లే ఇంతటి వినోదంతో నిండిన ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకు తీసుకొస్తున్నాం. సంక్రాంతికి సినిమా అంటేనే వినోదం. అందులో ఒక వైబ్ ఉంటుంది. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి గారి 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ గారి 'ది రాజా సాబ్'తో పాటు అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇన్ని మంచి సినిమాలతో ఈసారి సంక్రాంతి నిజంగానే తెలుగు ప్రేక్షకులకు సినిమా పండగను తీసుకొని వస్తుంది. తెలుగు సినిమాల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ‘ఇది నా మూడో సంక్రాంతి సినిమా. 'అనగనగా ఒక రాజు'లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ సినిమాపై మీరు చూపించే ప్రేమ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను’అన్నారు. -
‘ధురంధర్’ కి రూ. 90 కోట్ల నష్టం!
రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది. అయితే, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా తెలిపారు.ఈ సినిమాలో పాకిస్తాన్ వ్యతిరేక సందేశం ఉందనే కారణంతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల్లో 'ధురంధర్'(Dhurandhar)పై బ్యాన్ విధించారు. ఈ ప్రాంతంలో భారతీయ యాక్షన్ సినిమాలు సాధారణంగా బాగా ఆడతాయని, ఈ బ్యాన్ వల్ల కనీసం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.90 కోట్లు) నష్టం వచ్చిందని ప్రణబ్ కపాడియా పేర్కొన్నారు.తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘మిడిల్ ఈస్ట్ మార్కెట్ యాక్షన్ సినిమాలకు చాలా ముఖ్యం. ఈ బ్యాన్ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్లు అయింది. అయినా, డిసెంబర్ హాలిడే సీజన్లో ప్రేక్షకులు ఇతర దేశాలకు ట్రావెల్ చేసి సినిమా చూస్తున్నారు’ అని కపాడియా తెలిపారు.ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే భారత్లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. నార్త్ అమెరికా, యూరప్ మార్కెట్లలో బాగా ఆడినా, గల్ఫ్ బ్యాన్ వల్ల మరింత వసూళ్లు రావాల్సి ఉండగా... ఆ అవకాశం చేజారిపోయింది.ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది. వచ్చే ఏడాది మార్చి 19న ‘ధురంధర్ 2’ను రిలీజ్ చేస్తామని టీమ్ ఇప్పటికే ప్రకటించింది. -
ఆయన కూడా తప్పుకున్నట్లే.. డ్రాగన్ డైరెక్టర్కు ఛాన్స్!
రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒక క్రేజీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. రజనీకాంత్ కథానాయకుడుగా నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మొదట దర్శకుడు సుందర్.సి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటన చేశారు. సుందర్.సి అవుట్అంతేకాదు ఈ చిత్ర పూజ కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా ఆ చిత్రం నుంచి దర్శకుడు సుందర్.సి వైదొలగడంతో పెద్ద చర్చే జరిగింది. అయితే రజనీకాంత్కు కథ సంతృప్తిని కలిగించకపోవడమే ఇందుకు కారణం అని నటుడు, నిర్మాత కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. పార్కింగ్ డైరెక్టర్ కూడా తప్పుకున్నట్లే!ఆ తర్వాత పార్కింగ్ చిత్రంతో జాతీయ అవార్డును పొందిన రామ్కుమార్ రజనీకాంత్ 173వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ మూవీ సెట్పైకి వెళ్లడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం జరిగింది. పార్కింగ్ చిత్రం తర్వాత రామ్కుమార్ శింబు హీరోగా చిత్రం చేయడానికి కమిట్ అయ్యారు. అయితే రజనీకాంత్కు దర్శకత్వం వహించే లక్కీచాన్స్ రావడంతో ముందుగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత శింబు హీరోగా సినిమా చేయాలని దర్శకుడు భావించినట్లు సమాచారం. కొత్తగా ఆయన పేరు తెరపైకి..అందుకు శింబు హీరోగా చిత్రాన్ని నిర్మించతలపెట్టిన డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఇప్పుడు ఈ యువ దర్శకుడు కూడా రజనీకాంత్ (Rajinikanth) సినిమా నుంచి వైదొలగినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా 'డ్రాగన్' చిత్ర దర్శకుడు అశ్వద్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చింది. ఈయన రజనీకాంత్ 173 వ చిత్రానికి దర్శకత్వం వహించినున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇదైనా ఫైనల్ అవుతుందో? లేదో? చూడాలి! -
అమ్మ ఒడిలో తలపెట్టుకుని బాధ.. ఉద్యోగం చేయాల్సింది!
ఈ ఏడాది బోలెడు సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఈ ట్రెండ్ను కొనసాగిస్తూ, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ జనవరి 1న నువ్వు నాకు నచ్చావ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం 2001 సెప్టెంబర్ 1న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.అదీ నా పరిస్థితి!ఈ చిత్రానికి కథ, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన సినిమా రిలీజైనరోజు పడ్డ టెన్షన్ గురించి ఓపెనయ్యాడు. నువ్వు నాకు నచ్చావ్ మొదటిరోజు టాక్ విని భీమవరం వెళ్లిపోయాను. సంతాపసభలో ఉన్నోడిలా ఉంది నా పరిస్థితి!అమ్మ ఒడిలో తలపెట్టుకునిసినిమా చూసి బయటకు వచ్చాక ఎలా ఉందని ఓ వ్యక్తిని రివ్యూ అడిగా.. అతడు రెండు, మూడు వారాలు ఆడుతుందంతే అన్నాడు. నేను చాలా బాధపడ్డాను. ఇంటికెళ్లి మా అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను. ఈ సినిమాలకు నేను పనికిరానేమో.. నువ్వు అన్నట్లుగానే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశాను. ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుండేదన్నాను. మా అమ్మ బెంబేలెత్తిపోయింది.చెమటతో ఒళ్లు తడిచిందికట్ చేస్తే నిర్మాత స్రవంతి రవికిషోర్ ఫోన్ చేసి హైదరాబాద్కు రమ్మన్నారు. నన్ను శాంతి థియేటర్కు తీసుకెళ్లారు. నాకు చెమట్లతో ఒళ్లు తడిచిపోయింది. అక్కడ టికెట్లు తెగుతుంటే అప్పుడు ధైర్యం వచ్చింది అని చెప్పుకొచ్చాడు. అయితే సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చిందని, త్రివిక్రమ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: 2025లో హీరోలు కనిపించలేదు! -
హీరో విజయ్ పక్కన కచ్చితంగా నటిస్తా: హీరోయిన్
హీరో విజయ్కు జంటగా కచ్చితంగా నటిస్తానంటోంది హీరోయిన్, నిర్మాత సింథియా లూర్డే. సింథియా ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఈమె నిర్మించి, కథానాయికగా నటించిన చిత్రం అణలి. దినేశ్ దీన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డైరెక్టర్ పి.వాసు వారసుడు శక్తి వాసు ప్రతినాయకుడిగా నటించగా, బాలీవుడ్ నటుడు కబీన్ దుహాన్ సింగ్ మరో విలన్గా యాక్ట్ చేశాడు.జనవరి 2న రిలీజ్అభిషేక్, ఇళంగో కమరవెల్, నటి ఇనయ, జై సూర్య, మాథ్యూ వర్గీస్, అశోక్ పాండియన్, జాన్సన్ దివాకర్, వినోద్ సాగర్, బేబి శిమాలి, శివ ఇతర పాత్రల్లో నటించారు. రామలింగం చాయాగ్రహణం, దీపన్ చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 2న తెరపైకి రానుంది.హీరో లేడుసోమవారం సాయంత్రం చెన్నైలో ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సింథియా లూర్డే మాట్లాడుతూ.. వర్ణాశ్రమమ్, దినసరి చిత్రాల తర్వాత తాను నిర్మించిన మూడో సినిమాయే అణాలి అని పేర్కొంది. ఇందులో తనే హీరోయిన్ అని.. హీరో ఎవరూ లేరంది. హీరోలు కూడా నటించేందుకు సంకోచించే యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా తానే రిస్క్ తీసుకుని నటించానంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి..ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో కథే ఉండటం లేదని, అయితే దినేష్ దీన చెప్పిక కథలో బలం ఉండటంతో ఈ సినిమా ఒప్పుకున్నానంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా పదివేల కంటైనర్లు కలిగిన యార్డ్లో బ్రహ్మాండమైన సెట్ వేసి 30 రోజులపాటు అక్కడే షూటింగ్ నిర్వహించినట్లు చెప్పింది. విజయ్ సరసన నటిస్తావిజయశాంతి తర్వాత పూర్తి యాక్షన్ హీరోయిన్గా నటించింది తానేనని పేర్కొంది. ఈ సినిమా రిలీజ్ హక్కులను రెడ్ జాయింట్ మూవీస్ సంస్థ పొందిందని తెలిపింది. జనవరి రెండున విడుదల చేస్తున్నామంది. హీరో విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పారంటున్నారని.. కానీ ఆయన మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. విజయ్ సరసన త్వరలోనే కచ్చితంగా నటిస్తానని సింథియా (Cynthia Lourde) బల్లగుద్ది చెప్పింది. -
భర్తతో హనీమూన్ ట్రిప్లో సమంత..! (ఫొటోలు)
-
సల్మాన్ ఖాన్ సినిమాపై చైనా అక్కసు.. కారణం ఇదేనా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్'పై చైనా తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. సినిమా తీసినంతమాత్రన చరిత్ర మారిపోదంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో అక్కసు వెళ్లగక్కింది. ఈ మేరకు తమ సంపాదకీయంలో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇండియన్ సినిమాపై చైనాకు ఎందుకంత అక్కసు? బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ కథేంటి?తెలంగాణ వీర సైనికుడిగా సల్మాన్సల్మాన్ఖాన్(salman Khan) హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’(Battle of Galwan Movie). సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నాడు.అయితే ఈ సినిమా కథపైనే ఇప్పుడు చైనా అభ్యంతరం చెబుతోంది. ఈ చిత్రం చరిత్రను వక్రీకరిస్తోందని చైనా మీడియా ఆరోపిస్తోంది. చైనా ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో తమ సైన్యం సంకల్పాన్ని ఇలాంటి సినిమాలు దెబ్బతీయబోదంటూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనంలో చైనా సైనిక నిపుణులు మాట్లాడుతూ..భారత్-చైనా గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించిన నిజాలను సినిమాలో చూపించలేదని ఆరోపించారు. మూవీ కథాంశం భారత్ కి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి దోహదమవుతుందని చైనా మీడియా ప్రచారం చేస్తోంది.అదే చైనా భయమా?2020 జూన్ 15న గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా ఆర్మీ దుస్సాహసం చేయగా, 16వ బీహార్ బెటాలియన్కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలోనే 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' సినిమా రాబోతుంది. ఈ సినిమా విడుదలైతే..అసలు నిజం చైనీయులకు కూడా తెలిసే అవకాశం ఉంది. భారత్ చేతిలో చైనా సైన్యం ఘోరంగా దెబ్బతిందనే విషయం కూడా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. అందుకే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై చైనా దుష్ప్రచారం చేస్తోంది. ఈ సినిమా చైనా సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత విశ్లేషకులు చెబుతున్నారు. -
ఆ పాత్ర కోసం సందీప్ రెడ్డి, నాగ్ అశ్విన్ని అడిగితే నో చెప్పారు: పతంగ్ డైరెక్టర్
ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల లీడ్ రోల్స్లో ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘పతంగ్’. డి. సురేష్బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలైంది. ఈ సందర్భంగా ప్రణీత్ పత్తిపాటి మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం హైదరాబాద్. ఓ సంక్రాంతి పండగ రోజున పతంగుల పోటీ నేపథ్యంతో ఓ సినిమా తీయాలనే ఆలోచనతో ‘పతంగ్’ ఆరంభించాం. గాల్లో పతంగ్ ఎగరడం, దానికున్న మాంజాని మేము గ్రాఫిక్స్లోనే చూపించాం. క్వాలిటీ విషయంలో నిర్మాతలు రాజీ పడలేదు. మా మూవీకి థియేటర్స్లో మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు చేసిన పాత్రకు ‘దిల్ ’రాజు, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ , ఎస్జే సూర్య వంటి వారిని అనుకున్నాం. కానీ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఒప్పుకోలేదు. ఇక సినిమాలో గౌతమ్ మీనన్ పాత్రనున గౌతమ్మీనన్ చేస్తే బాగుంటుందని అయన్ని ఆప్రోచ్ అయ్యాం. ఆయనపాత్ర కథ,విని ఒప్పుకున్నారు. ఆయన మీద పంచ్లు వేయడం కూడా బాగా నచ్చింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కాస్త కన్ఫ్యూజ్డ్గా కనిపిస్తుంది. చెప్పాలంటే అదీ నా క్యారెక్టరే. నేను కూడా చాలా కన్ఫ్యూజన్ తో ఉంటుంటాను. కానీ, పనిలో మాత్రం క్లారిటీతో ఉంటాను. డి.సురేష్ బాబుగారితో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. జనవరి 1న మా చిత్రం ఓవర్సీస్లో కూడా విడుదలవుతోంది’’ అన్నారు. -
తమన్నా చిందులు గోవాలో...సన్నీలియోన్ సయ్యాట హైదరాబాద్లో...
గుడ్బై 2025 అంటూ వీడ్కోలు పలకడం, వెల్క్మ్ 2026 అంటూ స్వాగతం చెప్పడం.. కోసం ప్రపంచం సకల సన్నాహాలతో సిద్ధమైంది. న్యూ ఇయర్ వేడుకలలో టాక్ ఆఫ్ ద ఈవెంట్స్గా నిలిచే ముఖ్యమైన అంశం సెలబ్రిటీల ప్రదర్శన. అదే క్రమంలో భారతీయ సినీ సెలబ్రిటీలు పలువురు రానున్న నూతన సంవత్సర వేడుకలలో ప్రదర్శన ఇస్తున్నారు. అందులో ఇప్పటివరకూ నిర్ణయమైన వాటిలో చెప్పుకోదగ్గ ఈవెంట్ గోవాలో జరుగుతోంది. మన మిల్క్ బ్యూటీ, తాజా ఐటమ్ నంబర్ల క్వీన్గా పేరొందిన తమన్నా అందులో పాల్గొంటోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం తమన్నా గోవాలోని బీచ్ ఫ్రంట్ హోటల్కు చేరుకుంది. అదే విధంగా బాలీవుడ్ నటి, రొమాంటిక్ చిత్రాల బ్యూటీ సన్నీ లియోన్ తెలంగాణ రాజధాని నగరంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటోంది. ఈ నూతన సంవత్సర వేడుకల్లో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల సైతం ఆమెకు జత కలవనున్నాడు. అదే విధంగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ గోవా, లక్నో... ఇతర ప్రధాన నగరాల్లో జరిగే కార్యక్రమాలలో సినిమా ప్రముఖులు పాల్గొంటున్నారు.–గోవాలో బాలీవుడ్ నైట్ క్లబ్గా పేర్కొనే లాస్ ఒలాస్లో నటి తమన్నా, మరో నటి సోనమ్ బజ్వాలతో పాటు మ్యుజిషియన్ మిళింద్ గాబాలు పాల్గొంటున్నారు.–ప్రముఖ నేపధ్యగాయని సునీత కూడా హైదరాబాద్లో నిర్వహిస్తున్న న్యూ ఇయర్ వేడుకల్లో గళం కలుపుతున్నారు.–ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్... విజయవాడలో జరుగుతున్న ఈవెంట్లో సందడి చేయనున్నాడు.–ఢిల్లీలో ది లీలా యాంబియెన్స్ కన్వెన్షన్ హోటల్ జరిగే ‘డాజిల్ ఫ్రమ్ ది –ఈస్ట్‘ కార్యక్రమంలో పంజాబీ గాయకుడు, నటుడు జాస్సీ గిల్ – బబ్బల్ రాయ్ జంట ప్రత్యక్ష ప్రదర్శనలను అందిస్తుంది.–హిందీ గాయని సప్నా చౌదరి – రేణుకా పన్వర్ లు ఢిల్లీలోని షాహ్దారాలో జరిగే ‘ఎపిక్ నైట్ అవుట్‘ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తోంది.–ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ హైదరబాద్కి వస్తున్నాడు. నగరంలో జరుగుతున్న ఓ నూతన సంవత్సర వేడుకకు హాజరవుతున్నాడు.–బాలీవుడ్ గాయని, నటి సునంద శర్మ: ఢిల్లీలోని లే మెరిడియన్ గుర్గావ్లో నిర్వహిస్తున్న విలాసవంతమైన నూతన సంవత్సర వేడుకలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనుంది.––న్యూజిలాండ్కు చెందిన బాలీవుడ్ గాయని షిర్లీ సెటియా ‘బిగ్ బ్యాంగ్ బెంగళూరు‘ కార్యక్రమంలో ఆటపాటలతో అలరించనుంది.–మాజీ బాలీవుడ్ నటి ర్యాప్ గాయని ఉదితా గోస్వామి బెంగళూరులోని స్టార్ హోటల్ హై అల్ట్రా లాంజ్లో జరిగే న్యూ ఇయర్ పార్టీలో పాల్గొంటోంది. -
ప్రేమలేఖలన్నీ చిత్తు కాగితాలు! 38 ఏళ్లుగా అతడే ఊపిరిగా..
కేరళ నటి అభిరామి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అనేక సినిమాలు చేసింది. తెలుగులో థాంక్యూ సుబ్బారావు, చార్మినార్, చెప్పవే చిరుగాలి, లెవన్, 12ఎ రైల్వే కాలనీ, సరిపోదా శనివారం వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇటీవలే ఈ నటి పెళ్లిరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫోటోలు షేర్ చేసింది.ఇప్పటికీ.. ఎప్పటికీ..'హ్యాపీ యానివర్సరీ మై లవ్.. 14వ ఏట నుంచి ఇప్పటి (42వ ఏట) వరకు నా సుఖదుఃఖాల్ని, జయాపజయాలను, భయాలను, ఆశనిరాశలను అన్నింటినీ నీతోనే పంచుకున్నాను, ఇకమీదట కూడా పంచుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఆప్తమిత్రుడిగా నిలబడ్డందుకు థాంక్యూ.. నీ ఊహకందనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను' అని నటి రాసుకొచ్చింది.ప్రేమ ఎలా మొదలైందంటే?కేరళ తిరువనంతపురానికి చెందిన అభిరామి తల్లిదండ్రులు బ్యాంకు ఉద్యోగులు. వారికి అభిరామి ఒక్కరే సంతానం. స్కూల్ పక్కనే వీరి ఇల్లు ఉండేది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే చాలామంది అభిరామికి ప్రేమలేఖలు రాసి పంపేవారు. కొందరైతే నేరుగా ఇంటికొచ్చేవారు. కానీ ఎవరి ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు నటి. అయితే తనకు స్కూల్లో ఓ స్నేహితుడు ఉండేవాడు. అతడే రాహుల్. ప్రముఖ రచయిత పవన్ మనవడే రాహుల్.అలా మళ్లీ కలిశారువీరిద్దరూ స్కూల్ డేస్ నుంచే మంచి మిత్రులు. తర్వాత పై చదువుల కోసం అభిరామి అమెరికా వెళ్లిపోయింది. కొంతకాలానికి రాహుల్ కూడా యూఎస్ వెళ్లాడు. అలా మళ్లీ ఇద్దరూ కలిశారు. ఈసారి స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది. ఆ ప్రేమను జీవితాంతం పదిలంగా కాపాడుకునేందుకు పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. 2023లో ఈ జంట ఓ పాపను దత్తత తీసుకుంది. తనకు కల్కి అని నామకరణం చేసి పెంచుకుంటున్నారు.చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. సరిగ్గా ఆ హీరోకి ప్రత్యేకమైన రోజే.. -
స్టార్ హీరో కూతురిపై ట్రోలింగ్.. 'నా బాడీ గురించి మీకెందుకు?'
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూతురు శాన్వి సుదీప్ సింగర్గా ఆకట్టుకుంటోంది. ఈమె తెలుగులో హిట్ 3 మూవీలో పోరాటమే 3.0 సాంగ్ పాడింది. ఇటీవల తన తండ్రి హీరోగా నటించిన మార్క్ మూవీలోనూ మస్త్ మలైకా సాంగ్ ఆలపించింది. ఈ పాటతోనే కన్నడ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. ఇకపోతే మస్త్ మలైకా సాంగ్ వైరల్గా మారగా కొందరు నెటిజన్లు శాన్వీపై విమర్శలు గుప్పిస్తున్నారు. హీరో కూతురిపై ట్రోలింగ్కొన్ని పదాలు తను సరిగా పలకలేదంటున్నారు. అక్కడితో ఆగకుండా ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ తిడుతున్నారు. ఈ ట్రోలింగ్పై శాన్వి సుదీప్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నేను మీ అభిప్రాయాలు అడిగానా? లేదు కదా.. నేను అడిగినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి.. అంతే కానీ ఇక్కడ నా శరీరం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని మండిపడింది.ప్రేమ వివాహంమార్క్ సక్సెస్ ఈవెంట్లోనూ కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. శాన్వి చాలా స్ట్రాంగ్. ఎలాంటి పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలదు. ఇండస్ట్రీలో విమర్శలనేవి సాధారణం. వాటిని తను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలదు. ఆ నెగెటివిటీకి పదిరెట్లు ఎక్కువ ధృడంగా నిలబడగలదు అని చెప్పుకొచ్చాడు. కిచ్చా సుదీప్.. కేరళకు చెందిన ప్రియను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2004లో కూతురు శాన్వి జన్మించింది. 2015లో దంపతులు విడిపోగా.. తర్వాత కొంతకాలానికి విడాకుల ఆలోచన మానుకుని మళ్లీ జంటగా కలిసిపోయారు.చదవండి: ఎన్నాళ్లయిందో.. నా లైఫ్లో మర్చిపోలేని జ్ఞాపకం: తనూజ -
హీరోగా శంకర్ కుమారుడి ఎంట్రీ.. హీరోయిన్గా బేబమ్మ!
సాధారణంగా ఏ హీరోకైనా, హీరోయిన్కైనా ఓ మంచి హిట్ పడితే వరుసగా అవకాశాలు వరిస్తాయి అంటారు. కానీ హీరోయిన్ కృతీశెట్టి విషయంలో ఇది తారుమారు అవుతుండటం విశేషం. తెలుగులో ఉప్పెన చిత్రంతో రంగ ప్రవేశం చేసిన ఈ కన్నడ బ్యూటీకి ఆ చిత్రం సక్సెస్తో మరిన్ని అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా ఆ తరువాత నటించిన ఒకటి రెండు చిత్రాలు విజయాలను అందించాయి. ఆ తర్వాత నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్ కావడంతో టాలీవుడ్లో మార్కెట్ తగ్గిపోయింది.కోలీవుడ్లో వరుస సినిమాలుకృతిశెట్టి నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రాలు ది వారియర్, కస్టడీ ఆశించిన విజయాలను సాధించలేదు. అయినప్పటికీ ఈ బ్యూటీకి తమిళంలో వరుసగా మూడు చిత్రాల్లో నటించే ఛాన్స్ దక్కింది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆ మూడు చిత్రాల విడుదలలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కృతిశెట్టికి కోలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్ వరించినట్లు తాజా సమాచారం.శంకర్ కుమారుడు హీరోగా..ప్రముఖ దర్శకుడు శంకర్ వారసుడు అర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఏఆర్ మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఈయన తాజాగా హీరోగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అర్జిత్కు జంటగా మమిత బైజును నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అర్జిత్కు జోడీగా?మళ్లీ ఏమైందో కానీ తాజాగా అర్జిత్ శంకర్కు జంటగా కృతీశెట్టిని ఎంపిక చేసినట్లు టాక్! అదేవిధంగా బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ను ప్రతినాయకుడి పాత్రలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ అట్లీ శిష్యుడొకరు దర్శకుడుగా పరిచయం కానున్నాడు. ఈమేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.చదవండి: అభిమానుల అత్సుత్సాహం.. కిందపడ్డ హీరో విజయ్ -
ఆస్పత్రిలో దర్శకుడు భారతీరాజా
ప్రఖ్యాత సినీ దర్శకుడు, నటుడు భారతీరాజా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది మార్చిలోనే ఆయన కుమారుడు, దర్శకనటుడు మనోజ్ కన్నుమూశారు. దీంతో మనోవేదనకు గురైన భారతీరాజా అనారోగ్యంపాలయ్యారు. వైద్య చికిత్స అనంతరం కోలుకున్న ఈయన మలేషియాలో ఉన్న తన కూతురి వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు.కాగా 80 ఏళ్ల వయసు పైబడ్డ భారతీరాజా మారోసారి అనారోగ్యానికి గురి కావడంతో గత మూడు రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని భారతీరాజా బంధువులు తెలిపారు.సినిమాభారతీరాజా విషయానికి వస్తే.. ఈయన 16 వయదినిలే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవిని డైరెక్ట్ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కళక్కే పోగులు రైల్, ముదల్ మరియాదై, అలైగల్ ఓయ్వదిలై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. రాధిక, రాధ, కార్తీక్ వంటి పలువురు నటీనటులను సినిమాకు పరిచయం చేశారు. తెలుగులో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, ఆరాధన, ఈతరం ఇల్లాలు వంటి పలు సినిమాలు చేశారు. -
మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన'ఈషా'
త్రిగుణ్, అఖిల్రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు గురువారం(డిసెంబర్ 25) విడుదల చేశారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చాయి. విడుదలైన మూడు రోజుల్లో 4 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టి, బ్రేక్ ఈవెన్ సాధించింది. రానున్న రోజుల్లో ఈషా బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందని ట్రెడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా కథ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి దెయ్యాలు ఉన్నాయంటే నమ్మని నలుగురు స్నేహితులు(త్రిగుణ్, హెబ్పాపటేల్, సిని హనుమంతు, అఖిల్ రాజు)..పెద్దయ్యాక టీమ్గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ. -
మారిపోయిన ప్రభాస్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
ప్రభాస్.. పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. ఆయన ఫ్లాపు సినిమాలకు కూడా వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేస్తాయి. అలాంటి హీరో బయటకు వస్తే ఎంత హడావుడి చేయాలి? కానీ ప్రభాస్ చాలా సింపుల్గా ఉంటాడు. స్టార్ హీరో అనే బిల్డప్ ఆయన ముఖంలో ఎప్పుడూ కనిపించదు. తన సినిమాల గురించి కూడా పెద్దగా గొప్పలు చెప్పుకోడు. సినిమా ఈవెంట్లో ఇచ్చే స్పీచులు కూడా ఒకటి, రెండు నిమిషాలకు మించి ఉండదు. కానీ ‘ది రాజాసాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో కొత్త ప్రభాస్ కనిపించాడు. ఎప్పుడూ లేనంతగా చాలా ఎక్కువ సేపు స్పీచ్ ఇచ్చాడు.అందుకే పిలకరాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ దాదాపు 10 నిమిషాల వరకు మాట్లాడితే..అందులో ఎక్కువసేపు ఫ్యాన్స్ ప్రస్తావనే తెచ్చాడు. అభిమానుల కోసమే ది రాజాసాబ్ సినిమా చేశామని చెప్పాడు. అంతేకాదు ‘మీ కోసమే పిలక వేసుకొని వచ్చా’ అంటూ తన పిలక చూపించి..నవ్వించాడు. ఇక ఆయన స్పీచ్ మధ్యలో ఫ్యాన్స్ అంతా ‘బాహుబలి జయహో’ అంటుంటే.. ‘నా స్పీచ్ బోరింగ్గా ఉంటుందని మీరు అలా అంటున్నారు కదా.. ఏదో ఒకరోజు స్టేజ్పై ఎంటర్టైన్ చేస్తా..మీరంతా షాకైపోతారు’ అంటూ చిన్నపిల్లాడిలా ప్రభాస్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఇక తన పెళ్లిపై కూడా ఆయన ఫన్నీగా స్పందించారు. ‘ప్రభాస్ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?’ అని సుమ ప్రశ్నించగా.. ‘అది తెలియకనే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు’ అంటూ నవ్వేశాడు. ఫ్యాన్స్: ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..?హీరో ప్రభాస్: అది తెలియకే ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు pic.twitter.com/VI5FzMAvFc— PulseNewsBreaking (@pulsenewsbreak) December 27, 2025ఇక సూట్లో వచ్చిన తమన్పై కూడా ప్రభాస్ పంచులు వేశాడు. ‘అంత ధైర్యం ఏంటి డార్లింగ్. సీరియస్గా చెబుతున్నా.. నేను కూడా ఇలా సూట్ వేసుకోని రావాలని అన్నీ రెడీ చేసుకుంటా. కబోర్డులో దాదాపు 200 వరకు డ్రెస్సులు ఉంటాయి. బాగా రెడీ అయి రావాలనుకుంటాను. కానీ ఓవర్గా ఉంటుందిలే అనుకొని సింపుల్గా వచ్చేస్తా. తమన్ లాంటి ధైర్యం నాకెప్పుడు వస్తుందో’ అని చెప్పడంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఫుల్గా నవ్వేశారు. ఆ ఒక్క మాటతో..ప్రభాస్ ఎప్పుడూ తన సినిమాల గురించి డబ్బా కొట్టుకోరు. ‘మా సినిమా అదిరిపోయింది..బ్లాక్ బస్టర్ హిట్ పక్కా’ అని ఎక్కడా చెప్పలేడు. కామ్గా సినిమా చేసుకొని పోతాడు.హిట్ అయినా, ఫ్లాప్ అయినా పెద్దగా మాట్లాడడు. ఈ సారి కూడా అలానే మాట్లాడారు. ‘ఈ పండక్కి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వాలి. అందులో మాది కూడా ఉంటే బాగుంటుంది’ అని మాత్రమే అన్నాడు. ఈ ఒక్క మాట చాలు.. మిగిలిన సినిమాలకు ప్రభాస్ ఎంత గౌరవం ఇస్తున్నాడో చెప్పడానికి. అంతేకాదు సీనియర్ హీరోలను కూడా ఆయన ఎంతో గౌరవిస్తాడు. ‘సీనియర్లు సీనియర్లే. వాళ్ల నుంచి మేమంతా నేర్చుకొన్నాం. వాళ్ల సినిమాలు బాగా ఆడాలి’ అంటూ సంక్రాంతి పోటీలో ఉన్న చిరంజీవి, రవితేజ లాంటి సీనియర్ హీరోలకు తన తరపున ఆల్ ది బెస్ట్ చెప్పాడంతే.. ఆయన సీనియర్లకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక మారుతి ఎమోషల్ అయితే..దగ్గరకు వచ్చి ఓదార్చడమే కాదు.. `మూడేళ్ల కష్టం కన్నీళ్ల రూపంలో వచ్చింది` అంటూ తనదైన శైలీలో కవర్ చేశాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ.. ‘డార్లింగ్ పెన్నుతో రాశావా… మిషన్ గన్నుతో రాశావా’ అంటూ మారుతిపై ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు. They Call him 'Lottery Star' 💔#prabhas #RajaSaab pic.twitter.com/hS3uvAO2ao— Naa_istam 🚩 (@Grookk12) December 28, 2025మొత్తంగా ప్రభాస్ ఎప్పుడూ లేని విధంగా చాలా హుషారుగా, సరదాగా ఎక్కువ స్పీచ్ ఇచ్చాడు. తమ అభిమాన హీరో ఇలా ఓపెన్గా మాట్లాడడం చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
‘45’ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు : శివరాజ్ కుమార్
‘‘అర్జున్ జన్య చెప్పిన ‘45’ కథ నచ్చడంతో ‘మీరే డైరెక్ట్ చేయండి’ అని చెప్పాను. తనకు ఇచ్చిన అవకాశానికి పూర్తిగా న్యాయం చేశారు అర్జున్. ఈ మూవీ చూశాక ప్రతి ప్రాణిని ప్రేమిస్తారు... గౌరవిస్తారు. బతికినన్ని రోజులు హ్యాపీగా జీవించాలని మా చిత్రం చెబుతుంది’’ అని శివ రాజ్కుమార్ తెలిపారు. సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకత్వంలో శివ రాజ్కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘45’. ఉమా రమేశ్ రెడ్డి, ఎం. రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జనవరి 1న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ ఎవ్వరూ ఇవ్వని పాత్రను నాకు ఈ సినిమాలో అర్జున్ ఇచ్చారు. స్క్రీన్ప్లేని చాలా గ్రిప్పింగ్గా రాశారు అర్జున్. మంచి చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ‘45’ని కూడా సపోర్ట్ చేయాలి’’ అని చెప్పారు. ‘‘45’లో ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు’’ అన్నారు అర్జున్ జన్య ‘‘గరుడ పురాణం గురించి చాలా గొప్పగా చెప్పే చిత్రమిది’’ అని రమేశ్ రెడ్డి తెలిపారు. ‘‘మంచి సందేశాన్ని ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు మైత్రీ శశి. -
మోహన్లాల్కు కలిసిరాని డిసెంబర్.. డిజాస్టర్ తప్పదా!
యంగ్ హీరోలను సైతం అబ్బురపరిచేలా వరుస విజయాలు అందుకున్నాడు సీనియర్ హీరో మోహన్లాల్. ఒకటా రెండా.. ఈ ఏడాది ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ హిట్లే! కానీ చివరగా ఓ డిజాస్టర్ సినిమాతో 2025కి ముగింపు పలుకుతున్నాడు. అదే విషాదకరం! మరో విషయమేంటంటే.. డిసెంబర్లో రిలీజైన సినిమాలు ఆయనకు అస్సలు అచ్చిరావడం లేదు! అదెలాగో ఓసారి చూసేద్దాం...అన్నీ హిట్లే..తెలుగులో హీరోలు ఏడాదికో, రెండేళ్లకోసారో సినిమా చేస్తారు. కానీ, మలయాళంలో అలా కాదు.. వాళ్లు ఏడాదికి నాలుగైదు సినిమాలైనా ఫటాఫట్ షూట్ చేస్తుంటారు, ఆ వెంటనే రిలీజ్ చేస్తారు. అలా 2025లో మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎల్ 2: ఎంపురాన్, తుడరుమ్, హృదయపూర్వం.. బాక్సాపీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి హిట్లుగా నిలిచాయి. కానీ రూ.70 కోట్లు పెట్టి తీసిన వృషభ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా చతికిలపడింది. మొదటిరోజు కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది.లుక్పై విమర్శలుఅదేంటో కానీ డిసెంబర్ నెల మోహన్లాల్కు ఇటీవలి కాలంలో పెద్దగా కలిసిరావడం లేదు. 2018 డిసెంబర్ ఓడియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్లాల్. కలెక్షన్స్పరంగా సినిమా మంచి హిట్టయినప్పటికీ మోహన్లాల్ లుక్పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. 2021 డిసెంబర్లో రూ.100 కోట్ల బడ్జెట్ మూవీ మరక్కర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్లాల్. సగం కూడా రాలే!ఈ సినిమా రిలీజ్కు ముందే మూడు జాతీయ అవార్డులు అందుకుంది. భారీ ఓటీటీ డీల్స్ వచ్చినా కూడా థియేటర్లోనే ముందుగా రిలీజ్ చేయాలని సినిమాటీమ్ పట్టుబట్టింది. వారి అంచనాలను తలకిందులు చేస్తూ మరక్కర్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.45 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే బడ్జెట్లో సగం కూడా తిరిగి రాలేదు.దర్శకుడిగా డిజాస్టర్వందలాది సినిమాల్లో తన సత్తా ఏంటో చూపించిన మోహన్లాల్ బరోజ్ చిత్రంతో దర్శకుడిగా మారాడు. 2024 డిసెంబర్ 25న విడుదలైన ఈ మూవీ ఘోరంగా చతికిలపడింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.15 కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది.ఈసారి కూడా పరాజయమే!సరిగ్గా ఏడాది తర్వాత అదే తేదీ (డిసెంబర్ 25న) వృషభతో పలకరించాడు ఈ స్టార్ హీరో. కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. బుకింగ్స్ పేలవంగా ఉన్నాయి. దీంతో ఈసారి కూడా మళ్లీ ఘోర పరాజయం తప్పేలా కనిపించడం లేదు. మరి మోహన్లాల్ ఈ డిసెంబర్ సెంటిమెంట్ ఎప్పుడు బ్రేక్ చేస్తాడో చూడాలి! -
డబ్బుల కోసం అలాంటి పని చేశా.. పేరు మార్చుకున్నా : అరియానా
అరియానా గ్లోరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆర్జీవీని ఇంటర్వ్యూలో చేసి బోల్డ్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా, ఆ క్రేజ్తోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా ఎంపికైంది. బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొని..తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చన తర్వాత పలు వెబ్ సిరీస్లు, సినిమాలతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బీజీ అయిపోయింది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్తో పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.అందుకే పేరు మార్చుకున్నానా అసలు పేరు అరియానా(Ariyana Glory) కాదు. మా అమ్మనాన్నలు నాకు అర్చన అని పేరు పెట్టారు. అయితే కష్టాలు ఎక్కువ అవ్వడంతో నేనే పేరు మార్చుకున్నా. అరియానా పేరుతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను.అనుకోకుండా అవకాశం.. మన జీవితంలో ఏం జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. నేను అనుకోకుండా యాంకర్ అయ్యాను. ఒక రోజు నేను, మా చెల్లి టీవీ చూస్తుంటే.. యాంకర్స్ కావలెనన్న ప్రకటన వచ్చింది. అది చూసి నేను ఆడిషన్స్కి వెళ్లాను. అదృష్టం కొద్ది సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి చిన్న చిన్న అవకాశాలతో ఈ స్థాయికి చేరుకున్నాను.ఒకేసారి ఐదారు జాబులు చేశాడబ్బుల కోసం నేను రకరకాల జాబులు చేశా. లైన్లో నిలబడి పన్నీరు చల్లేందుకు కూడా వెళ్లాను. అప్పుడు నాకొచ్చే జీతం రూ. 1800 మాత్రమే. రూమ్ రెంట్ రూ. 3000. ఒకసారి అద్దె కట్టేందుకు డబ్బులు జమ చేయగా.. ఓ అమ్మాయి దొంగతనం చేసింది. దీంతో చాలా ఇబ్బంది పడ్డా. డబ్బులు సరిపోకపోవడంతో ఒకేసారి ఐదారు జాబులు చేశా. ఇప్పుడు నేను బెటర్ పొషిషన్లో ఉన్నాను.ఈ క్షణమైనా చనిపోవడానికి రెడీఇక నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘మా అమ్మ నన్ను క్రిస్టియన్లా పెంచింది. కానీ ఈ మధ్య నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం పెరిగింది. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే.. నన్ను తీసుకెళ్లిపో అని చెబుతా. దేవుడే వచ్చి అడిగాక ఇంకేముంది?. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికిప్పుడు చనిపోయినా నాకు ఓకే’ అని అరియానా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది. -
నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ ఫైర్
'ఎలుక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు' ఈ సామెత శివాజీకి సరిగ్గా సెట్టవుతుంది. పురుషాహంకారంతో విర్రవీగే శివాజీ బిగ్బాస్ హౌస్లోనూ లేడీ కంటెస్టెంట్లపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఆడపిల్ల మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా.. అంటూ దారుణంగా మాట్లాడాడు. ఇప్పుడు దండోరా ఈవెంట్లోనూ హీరోయిన్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెబుతూ రాయడానికి వీల్లేని బూతు పదాలు ఉపయోగించాడు.ఎండగట్టిన అనసూయఆయన వైఖరిని ఎంతోమంది హీరోయిన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. యాంకర్ అనసూయ అయితే.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో మా ఇష్టం.. మీరెవరు చెప్పడానికి అని తిరిగి ప్రశ్నించింది. అసలే మదమెక్కిన ఏనుగులా ప్రవర్తిస్తున్న శివాజీ అందరినీ వదిలేసి అనసూయను మాత్రం టార్గెట్ చేశాడు. కొందరు ఈ విషయంలో శివాజీకి వకాల్తా పుచ్చుకుని అనసూయపై మండిపడుతున్నారు.ట్రోలర్స్పై ఫైర్అలాంటివారికోసం తాజాగా అనసూయ ఓ పోస్ట్ పెట్టింది. కొందరు పనిగట్టుకుని నా మాటలను కావాలనే వక్రీకరించి, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వెస్ట్రన్ దుస్తులు వేసుకోమని సూచించలేదు. నేను వేసుకునేలాంటి దుస్తులే ధరించాలని చెప్పలేదు. నా ఇష్టాయిష్టాలను ఎవరిపైనా రుద్దలేదు. నేను చెప్పిందల్లా ఒక్కటే.. ప్రతి మహిళకు తనకు నచ్చిన డ్రెస్లు వేసుకునే స్వేచ్ఛ ఉందన్నాను. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటాను.నా భర్తను ఎందుకు లాగుతున్నారు?నా మాటల్ని వక్రీకరించి నాపై విషప్రచారం చేస్తున్నారు. నా భర్తను, పిల్లల్ని ఇందులోకి లాగుతున్నారు. మగవాళ్లే కాదు, కొందరు ఆడవాళ్లు కూడా ఒక మహిళగా, తల్లిగా నా క్యారెక్టర్ను ప్రశ్నిస్తున్నారు. కేవలం నేను వేసుకునే బట్టల్ని బట్టి నన్ను తప్పుపడుతున్నారు. మీరెంత విమర్శించినా నేను మరింత బలంగా నిలబడతాను. ఇప్పటికైనా మేల్కొనండి.. ఇకనైనా మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. హేటర్స్.. మీరు కూడా నా ఫ్యాన్సే!ఎవరి చేతిలోనో కీలుబొమ్మగా మారకుండా సొంతంగా ఆలోచించడం నేర్చుకోండి. మీ మైండ్లోకి ఎలాంటివి ఎక్కిస్తున్నారో చెక్ చేసుకోండి. ఇది కేవలం బట్టలకు సంబంధించిన విషయం కాదు. స్వతంత్రంగా ఆలోచించే మహిళలను కంట్రోల్ చేయాలనుకుంటున్న పితృస్వామ్య భావజాలం గురించి! చివరగా.. నేను నచ్చకపోయినా నిరంతరం నన్ను గమనిస్తూ ఉన్నారంటే మీరు నా అభిమానుల కిందే లెక్క అని ట్రోలర్స్కు చురకలంటించింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) చదవండి: కూలీ మూవీపై విమర్శలు.. మళ్లీ అలా జరగనివ్వను: దర్శకుడు -
'కూలీ'పై విమర్శలు.. మళ్లీ అలా జరగనివ్వను: లోకేశ్
లోకేశ్ కనగరాజ్ నుంచి సినిమా వస్తుందంటే హిట్టు గ్యారెంటీ! ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించాడు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'కూలీ' సినిమా మిక్స్డ్ టాక్తోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.వేలల్లో విమర్శలుఈ విమర్శలు, కలెక్షన్స్పై లోకేశ్ తాజాగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. కూలీ సినిమాకు వేలకొద్దీ విమర్శలు వచ్చాయి. ఎక్కడ తప్పు చేశానో గుర్తించి దాన్ని నెక్స్ట్ సినిమాలో పునరావృతం కాకుండా చూసుకుంటాను. అయితే ఓపక్క విమర్శిస్తూనే రజనీకాంత్ సర్ కోసం మా సినిమా ఆదరించారు. ఈ చిత్రానికి రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని మా నిర్మాత చెప్పారు.గతంలో ఏమన్నాడంటే?అంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. గతంలోనూ కూలీ మూవీకి వచ్చిన మిశ్రమ స్పందన గురించి మాట్లాడుతూ.. జనాల అంచనాలకు తగ్గట్లుగా తాను కథలు రాయలేనన్నాడు. తాను రాసిన కథ వారి అంచనాలను అందుకుంటే మంచిది. లేదంటే వాళ్లు సంతోషపడేవరకు మళ్లీమళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.వార్ 2పై కూలీ విజయంకూలీ విషయానికి వస్తే.. ఇందులో రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్ రచిత రామ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల వార్ 2 సినిమాతో పోటీగా బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్లో వార్ 2ని దాటేయడం విశేషం!చదవండి: మొన్న ఆమిర్.. ఇప్పుడు షారూఖ్ -
‘ఛాంపియన్’ మూవీ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఛాంపియన్’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు వచ్చింది.తొలి షోకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ..మొదటి రోజు అత్యధికంగా రూ. 4.5 కోట్లు రాబట్టింది. అయితే రెండో రోజు మాత్రం కలెక్షన్స్ తగ్గిపోయాయి. శుక్రవారం ఈ సినిమాకు రూ. 2.4 కోట్ల కలెక్షన్స్ లభించాయి. మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ ఫుట్బాల్ ఆటగాడిగా నటించి, మెప్పించాడు. అనస్వర రాజన్ హీరోయిన్గా నటించగా.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. (ఛాంపియన్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మొన్న ఆమిర్... ఇప్పుడు షారూఖ్!
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలకు ఇతర ప్రముఖ నటుల సపోర్టింగ్ తప్పనిసరిగా మారిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈయన ఇంతకు ముందు నటించిన జైలర్, వేట్టయయాన్, కూలీ చిత్రాల్లో ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య భూమిక పోషించిన విషయం తెలిసిందే! వీటిలో జైలర్ చిత్రం మినహా ఇతర చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. రజనీకాంత్ సినిమాలో గెస్టులుజైలర్ చిత్రంలో రజనీకాంత్తో పాటు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ సూపర్స్టార్ శివ రాజ్కుమార్, మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించారు. అదేవిధంగా హీరోయిన్ తమన్నా ప్రత్యేక పాట సినిమాకు మరింత బలంగా మారింది. ఇక వేట్టయాన్ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషించారు. అయినప్పటికీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్అదేవిధంగా రజనీకాంత్ ఇటీవల నటించిన కూలీ చిత్రంలోనూ బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్వుడ్ స్టార్ ఉపేంద్ర ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్–2. ఇది జైలర్ చిత్రానికి సీక్వెల్. జైలర్ 2లో సూపర్ స్టార్ఇందులోనూ మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ శివరాజ్కుమార్, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, బాలీవుడ్ భామ విద్యాబాలన్తోపాటు నటి రమ్యకష్ణ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఇందులో అతిథి పాత్రలో బాలీవుడ్ సూపర్స్టార్ షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి.. జైలర్ 2లో షారూఖ్ ఉన్నట్లు పేర్కొన్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. -
హారర్ మూవీ 'అమరావతికి ఆహ్వానం' గ్లింప్స్ చూశారా?
ప్రస్తుతం హారర్ సినిమాల హవా నడుస్తోంది. ఈ ఏడాది విడుదలైన అన్ని హారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం అదే తరహాలో ఉత్కంఠభరితమైన కథ, కథనంతో రూపొందిన చిత్రం అమరావతికి ఆహ్వానం. శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్లోని పలు లొకేషన్స్లో షూటింగ్స్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా క్రిస్మస్ శుభాకాంక్షలతో పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. మా సినిమా టైటిల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని పాత్రలకి ప్రాధాన్యత ఉండేలా దర్శకుడు మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్నాయి అన్నారు.దర్శకుడు జివికె మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో రిలీజైన అన్ని హారర్ సినిమాలు మంచి విజయం సాధించాయి. అదే తరహాలో మరో డిఫరెంట్ కథాశంతో వస్తోన్న చిత్రం అమరావతికి ఆహ్వానం. సీనియర్ సినిమాటోగ్రాఫర్ జె ప్రభాకర్ రెడ్డి గారి విజువల్స్, హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. పద్మనాబ్ బరద్వాజ్ గారి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్స్లో ఆడియన్స్ని హారర్ మూడ్ క్యారీ చేసే విధంగా చేస్తుంది అన్నారు. -
కెమికల్ వాటర్లో పడ్డా.. అప్పటినుంచే..: కమెడియన్
కమెడియన్గా, విలన్గా వెండితెరపై రాణిస్తున్నాడు తమిళ నటుడు మొట్ట రాజేంద్రన్. ఈయన మొదట్లో స్టంట్మెన్గా పనిచేశాడు. నాన్ కడవులే సినిమాకుగానూ రాష్ట్రస్థాయిలో అవార్డులు గెల్చుకున్నాడు. అయితే మొదట్లో రాజేంద్రన్ పలువురు నటుల స్థానంలో యాక్షన్ సీన్లు (స్టంట్ డబుల్) చేసేవాడు. ఇప్పుడు మాత్రం నటుడిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.15 అడుగుల ఎత్తులో నుంఒక మలయాళ సినిమా షూటింగ్లో 15 అడుగుల ఎత్తులో నుంచి కింద నీళ్లలో పడాల్సి ఉంటుంది. నేను ఆలోచించకుండా దూకేశాను. తీరా ఆ ఊరివాళ్లు చూసి.. ఇదంతా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్ వాటర్.. ఈ నీళ్లలో ఎందుకు దూకారు? అన్నారు. అలా అప్పుడే జుట్టురాలడం మొదలైంది. కొంతకాలానికే మొత్తం గుండు అయిపోయింది. కనుబొమ్మలు కూడా పోయాయి. మొదట్లో కొంత బాధపడ్డాను.అదే ప్లస్ అయిందిఅప్పటినుంచే విలన్గా కాకుండా కామెడీ రోల్స్ వచ్చాయి. విగ్ కూడా పెట్టుకోకుండా అలాగే ఉండమంటున్నారు. ఏదైతే మైనస్ అనుకున్నానో అదే నాకు ప్లస్ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు నన్ను థియేటర్లలో చూసి విజిల్స్ వేస్తుంటే ఒక్కోసారి ఆనందంతో కన్నీళ్లు వస్తాయి అన్నాడు. రాజేంద్రన్ తెలుగులో చలో, ఎఫ్ 3, వాల్తేర్ వీరయ్య, సర్, విమానం, దే కాల్ హిమ్ ఓజీ, త్రిబాణధారి బార్బరిక్, త్రిముఖ వంటి పలు చిత్రాల్లో నటించాడు. -
మరో అమ్మాయితో నా భర్త డేటింగ్.. వదిలిపెట్టను : స్టార్ హీరో భార్య
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో గోవిందా, ఆయన భార్య సునీత ఆహుజా విడాకులు తీసుకోబోతున్నారనే వార్త గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం వీరిద్దరు సపరేట్గా ఉంటున్నారు. కానీ అధికారికంగా విడాకులు అయితే తీసుకోలేదు. కోర్టు ద్వారా గోవిందాకు నోటీసులు అందించారని..త్వరలోనే విడాకులు తీసుకునే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భర్త గోవిందాపై సునీత(Sunita Ahuja) సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తకు మరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని.. డబ్బుల కోసమే ఆమె ఆయనకు దగ్గరైందని ఆరోపించారు.తాజాగా ఆమె ఓ మీడియా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్పై స్పందించారు. ‘మేమిద్దరం సపరేట్గా ఉంటున్న విషయం నిజమే. గోవిందా(Govinda) మరోక అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించడం లేదు.. డబ్బుల కోసమై దగ్గరైంది. ఆమె హీరోయిన్ అయితే కాదు. హీరోయిన్లు ఇతరుల కాపురాల్లో చిచ్చు పెట్టేంత చెడ్డవాళ్లు కాదు’ అని సునీత చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ..గోవింద జీవితంలో ముగ్గురే మహిళలు కీలకంగా ఉండాలని కోరుకున్నాం. ఆమె తల్లి, భార్య, కూతురు.. ఈ ముగ్గురు మహిళలే ఆయన జీవితంలో ఉండాలకున్నాం. కానీ నాలుగో మహిళ రావడం జీర్ణించుకోలేకపోయామని సునీత ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికైనా గోవింద తన చుట్టు ఉన్న చెంచాలను వదిలేసి.. వర్క్పై ఫోకస్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాగా.. సునీతా అహుజా, గోవిందల పెళ్లి 1987లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు యశ్, కూతురు పేరు టీనా. గత ఏడాదిగా వీరిద్దరు వేరు వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విడాకుల రూమర్స్ వినిపిస్తున్నా.సునిత మాత్రం గోవిందా ఎప్పటికీ తనవాడే అని.. వదిలేసే ప్రసక్తే లేదన్నారు. -
ఇక నీకు సైడ్ క్యారెక్టర్లే గతి అన్నారు: రాజాసాబ్ హీరోయిన్
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ 'ది రాజాసాబ్' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. చిరంజీవి సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నట్లు రూమర్స్ రాగా.. అందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. అయితే 'పేట' సినిమా తర్వాత తనకు సైడ్ రోల్స్ మాత్రమే సెట్ అవుతాయని కొందరు అన్నారంటోంది.అదేం అక్కర్లేదుఈ విషయం గురించి తాజాగా మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. నటీనటులకు పర్ఫెక్ట్ లాంచ్ అవసరం అని నేను అనుకునేదాన్ని. ఉదాహరణకు దీపికా పదుకొణె ఓం శాంతి ఓంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. నేను కూడా అలాగే ఓ పెద్ద సినిమాతో గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాను. నేనే కాదు, చాలామంది యంగ్ యాక్టర్స్ ఇలాగే ఫీల్ అవుతారు.ఏదైనా ప్రేక్షకుల చేతిలోనే..కానీ పర్ఫెక్ట్ సినిమా అంటూ ఏదీ ఉండదని అర్థమైంది. స్టార్ హీరోల సినిమా అయినా, గొప్ప దర్శకుల మూవీ అయినా రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుందని తెలుసుకున్నాను. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతే ఎవరైనా బోల్తా కొట్టక తప్పదని అర్థమైంది. బియాండ్ ద క్లౌడ్స్ మూవీ చూసి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నాకు రజనీకాంత్ పేట మూవీలో ఆఫర్ ఇచ్చాడు.ఆ తర్వాత మొదలైందిఅది హీరోయిన్ అవకాశం కానప్పటికీ రజనీకాంత్తో నటించే అదృష్టాన్ని వదిలేసుకోవాలనుకోలేదు. కానీ ఆ సినిమా చేశాక నాకు అన్నీ అలాంటి రోల్సే రావడం మొదలైంది. ఇకమీదట సైడ్ రోల్స్ మాత్రమే వస్తాయని కొందరు నిర్మాతలు అన్నారు. యాక్టర్స్ను ఇంత త్వరగా జడ్జ్ చేస్తారని అప్పుడే అర్థమైంది. ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాను. ధైర్యంగా ముందుకు సాగాలిఅంటే నేను మంచి రోల్స్ మాత్రమే చేస్తానని చెప్పకనే చెప్పాను. ఇక్కడ జనాలు మన మైండ్లో ఏవేవో ఎక్కించడానికి ప్రయత్నిస్తారు. కానీ, మనం ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని మాళవిక చెప్పుకొచ్చింది. 'మాస్టర్' సినిమాతో హీరోయిన్గా మాళవిక మళ్లీ ఫేమ్లోకి వచ్చింది. తంగలాన్, హృదయపూర్వం సినిమాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'ది రాజాసాబ్'తో పాటు తమిళంలో కార్తీతో 'సర్దార్ 2' చేస్తోంది.చదవండి: మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక -
ఓటీటీలో మలయాళ హిట్ థ్రిల్లర్.. ఎక్కడంటే?
మలయాళంలో ఈ ఏడాది (క్రిస్మస్ ముందువరకు) 184 సినిమాలు రిలీజైతే వాటిలో కేవలం 15 మాత్రమే లాభాల బాట పట్టాయని అక్కడి నిర్మాతల మండలి అధికారికంగా వెల్లడించింది. వాటిలో పెద్ద హీరోల సినిమాలతో పాటు ఎకో అనే చిన్న చిత్రం కూడా చోటు దక్కించుకుంది. చిన్న సినిమా ఘన విజయంసందీప్ ప్రదీప్ హీరోగా నటించిన ఈ థ్రిల్లర్ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 31న అందుబాటులోకి రానుంది. సినిమాఎకో.. మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ప్రసారం కానుంది. ఈ సినిమాకు బహుల్ రమేశ్ కథ అందించగా దిన్జిత్ అయ్యతన్ దర్శకత్వం వహించాడు. మార్క్ జయరామ్ నిర్మించాడు. వినీత్ నరైన్, సౌరభ్ సచ్దేవ, బిను పప్పు కీలక పాత్రలు పోషించారు. ముజీబ్ మజీద్ సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: మలయాళ బాక్సాఫీస్ రిపోర్టు- 2025పై హీరో ఆగ్రహం -
మెగా ఫోన్ పట్టిన హీరోయిన్.. వరుణ్తో సినిమా!
టాలీవుడ్ హీరోయిన్లలో మల్టీపుల్ టాలెంట్ ఉన్నవారు కుడా ఉన్నారు. నటించడమే కాదు సినిమాను తెరకెక్కించే ప్రతిభావంతులు కూడా తెలుగు పరిశ్రమలో ఉన్నారు. ఇప్పటికే విజయ నిర్మల, జీవితతో సహా పలువురు హీరోయిన్లు దర్శకులుగా మారి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. తాజాగా మరో హీరోయిన్ మెగా ఫోన్ పట్టింది. ఆమే షగ్న శ్రీ వేణున్. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాతో హీరోయిన్ మెప్పించిన షగ్న.. తాజాగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. ఇందులో వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్నాడు. ఎస్ 2ఎస్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్ని తాజాగా రిలీజ్ చేశారు. పోస్టర్లో ఒక బ్లాక్ డ్రెస్ ధరించిన యువ జంట చేతిలో రోజా పూలతో ఉండటం, మరో యువకుడు ఈ జంటలోని యువతి చేయి పట్టుకుని కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షగ్న శ్రీ వేణున్ హీరోయిన్గా కూడా నటిస్తుంది. -
‘పతంగ్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: పతంగ్నటీనటులు: వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ఎస్పీబీ చరణ్, వడ్లమాని శ్రీనివాస్,విష్ణు ఓఐ, అను హసన్ తదితరులురచన, దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటినిర్మాతలు: విజయ్ శేఖర్ అన్నె, సంపత్ మాకా, సురేష్ రెడ్డి కొత్తింటి, నాని బండ్రెడ్డిసంగీతం: జోస్ జిమ్మిసినిమాటోగ్రఫి: శక్తి అరవింద్ఎడిటర్: చాణక్య రెడ్డి తూర్పువిడుదల తేది: డిసెంబర్ 25, 2025ఈ ఏడాది చివరి వారంలో తెలుగులో ఛాంపియన్, శంబాల, దండోరాతో పాటు మొత్తం ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో ఒకటి పతంగ్. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ బాగున్నప్పటికీ నటీనటులంతా కొత్తవారే కావడం.. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయకపోవడంతో సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో ఎలాంటి అంచనాలు లేకుండానే డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘పతంగ్’ కథేంటంటే.. హైదరాబాద్లోని ఓ బస్తీకి చెందిన విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ(వంశీ పూజిత్), అదే ప్రాంతంలో ఉండే రిచ్ కిడ్ అరుణ్(ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) ప్రవేశిస్తుంది. ఆమెది కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్. ఏ విషయంలో అయినా సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అరుణ్ని ఇష్టపడుతుంది. ఆమె వల్ల ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్ల మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యను దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్ల పోటీ పెడతారు. ఇద్దరి మధ్య పతంగ్ల పోటీనే ఎందుకు పెట్టారు? ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. కొన్ని సినిమా కథలలో కొత్తదనం ఉండదు. అలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలే వచ్చి ఉంటాయి. అయినా కూడా తెరపై చూస్తుంటే ఎంజాయ్ చేస్తాం. అలాంటి సినిమానే పతంగ్. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే ఉండదు. దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి ఎంచుకున్న ట్రయాంగిల్ లవ్స్టోరీ పాయింట్ కూడా చాలా రొటీన్. అయితే దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆర్య, ప్రేమదేశం లాంటి ట్రైయాంగిల్ లవ్స్టోరీని హైదరాబాద్ స్టైల్లో చెబుతూ.. తనదైన స్క్రీన్ప్లేతో మ్యాజిక్ చేశాడు దర్శకుడు ప్రణీత్. సన్నివేశాలు పాతవే అయితే.. డైలాగ్స్ ఫ్రెష్గా, యూత్ని ఆకట్టుకునేలా ఉంటాయి. అలా అని బూతు సంభాషణలు, సన్నివేశాలేవి ఇందులో ఉండవు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించారు.ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఐశ్వర్య-విస్కీల లవ్స్టోరీతో పాటు అరుణ్తో ఐశ్వర్య క్లోజ్ అయ్యేలా సాగే సన్నివేశాలన్నీ థియేటర్స్లో నవ్వులు పూయిస్తాయి. అలా చూస్తుండగానే ఇంటర్వెల్ అవుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కాస్త సాగదీతగా అనిపించినప్పటికీ.. పతంగ్ల పోటీ మొదలైన తర్వాత పరుగులు పెడుతుంది. సెకండాఫ్ కథ మొత్తం పతంగ్ల పోటీ చుట్టూనే తిరుగుతుంది. అయినా కూడా ఒక్క చోట బోర్ కొట్టదు. విష్ణు ఇచ్చే కామెంటరీ నవ్వుల డోస్ని మరింత పెంచేస్తుంది. ఇక ముగింపులో దర్శకుడు ఇచ్చిన సందేశం కూడా యువతను ఆలోచింపజేస్తుంది. మొత్తంగా కొత్త కథను ఆశించకుండా పతంగ్ సినిమాకు వెళ్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన నటీనటులంతా కొత్తవారే.అయినా కూడా చక్కగా నటించారు. హైదరాబాద్లోని బస్తీ యువకుడు విస్కీగా వంశీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రణవ్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల ఇందులో హీరోయిన్గా నటించింది.కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ ఉన్న ఐశ్వర్య పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. అరుణ్ చెల్లిగా నటించిన విజ్ఞాని తెరపై క్యూట్గా కనిపించింది. అరుణ్ తండ్రిగా నటించిన ఎస్పీ చరణ్.. ఎమోషనల్ సీన్లని బాగా పండించాడు. అరుణ్ని ఇష్టపడే లక్ష్మీ పాత్ర పోషించిన నటి కూడా బాగా చేసింది. ముఖ్యంగా పతంగ్లో పోటీలో ఆమె చేసిన డ్యాన్స్ నవ్వులు పూయిస్తుంది. అరుణ్-విస్కీల ఫ్రెండ్స్ గ్యాంగ్తో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జోస్ జిమ్మీ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వెరైటీగా, ఆకట్టుకునేలా ఉంటాయి. బీజీఎం అదిరిపోయింది. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్గా ఉంది. చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
బాక్సాఫీస్ రిపోర్టు బయటపెట్టడం అవసరమా?: హీరో
కేరళ చిత్ర నిర్మాతల మండలి ఇటీవలే మలయాళ సినిమా 2025 బాక్సాఫీస్ రిపోర్టును విడుదల చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 184 చిత్రాలు రిలీజైతే వాటిలో కేవలం 15 మాత్రమే హిట్టయ్యాయని తెలిపింది. లోక, ఎల్2: ఎంపురాన్, తుడరుమ్, కలంకావల్, డియస్ ఈరే, హృదయపూర్వం, అలప్పుజ జింఖానా, రేఖాచిత్రం, ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలను సూపర్హిట్గా అభివర్ణించారు. అవి మాత్రమే హిట్ఎకో, పెట్ డిటెక్టివ్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ, పోన్మాన్, పడక్కాలం, బ్రొమాన్స్ సినిమాలను హిట్లుగా పేర్కొన్నారు. 2024లో 10.633% సక్సెస్ రేషియో ఉంటే ఈసారి అది 8.15%కే పరిమితమైందని వెల్లడించారు. అయితే ఈ నివేదికపై పలువురు దర్శకనిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సుమతి వలవు, నరివెట్ట వంటి సినిమాలు ఈ జాబితాలో ఎందుకు లేవని నిలదీస్తున్నారు. అవెందుకు లేవు?నరివెట్ట దర్శకుడు అనురాజ్ మనోహర్ మాట్లాడుతూ.. మా సినిమా విజయం సాధించింది.. కానీ దాన్ని ఎందుకు లిస్టులో చేర్చలేదు? ఏ ప్రాతిపదికన ఈ జాబితా తయారు చేశారు? అని మండిపడ్డాడు. తాజాగా హీరో నివీన్ పౌలీ సైతం ఈ రిపోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈయన హీరోగా నటించిన సర్వం మాయ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. అవసరమా?ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ భేటీకి హాజరయ్యాడు నివిన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బిజినెస్లో ఒడిదుడుకులు సహజం. లాభనష్టాలు వస్తుంటాయి. అంతమాత్రానికి (Kerala Film Producer Association) ఇలా బాక్సాఫీస్ రిపోర్టును బయటపెట్టాల్సిన అవసరం ఏముంది? దీనివల్ల సినిమాను నమ్ముకునేవాళ్లను నిరాశపర్చినట్లు అవుతుంది. గతంలో ఈ ధోరణి లేదు అని అసహనం వ్యక్తం చేశాడు. -
గ్లామర్కు నో.. ఆ ఇద్దరు హీరోయిన్స్లా చేయాలనుంది!
సొంతం సినిమాతో గుజరాతీ బ్యూటీ నమిత కెరీర్ ప్రారంభమైంది. జెమిని, ఐతే ఏంటి!, నాయకుడు, బిల్లా, సింహా సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. 2010 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనేలేదు. మిగతా భాషల్లోనూ ఐదారు సినిమాలు చేసి వదిలేసింది.గతంలో తప్పులుతాజాగా ఓ ఈవెంట్కు హాజరైన నమిత.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయనని చెప్తోంది. అందుకోసమే కొన్ని కథలు నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నానంది. గ్లామరస్ పాత్రల్ని చేయాలనుకోవడం లేదని, పవర్ఫుల్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.అలాంటి పాత్రలు చేయాలనుందిఉదాహరణకు రజనీకాంత్ పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి వంటి పాత్రలు చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నీలాంబరి పాత్ర కోసం మాట్లాడుకుంటున్నారని.. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుందని చెప్పింది. విద్యాబాలన్, రాధికా ఆప్టే.. కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారని.. వాళ్లలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మరి నమిత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి! -
'కాస్త లేట్ అయ్యుంటే నా శరీరం చచ్చుబడిపోయేది'
మలయాళ నటుడు, జైలర్ విలన్ వినాయకన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. ఆడు 3 సినిమా కోసం కేరళలోని తిరువనంతపురంలో యాక్షన్ సన్నివేశాల షూటింగ్ చేస్తుండగా వినాయకన్ ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు. నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన శనివారంనాడు కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన తాజాగా డిశ్చార్జ్ అయ్యాడు. తప్పిన ప్రమాదంఈ సందర్భంగా వినాయకన్ మాట్లాడుతూ.. నా మెడ నరానికి దెబ్బ తగిలింది. సమయానికి ఆస్పత్రికి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నరాల డ్యామేజ్ను ముందుగానే గుర్తించకపోయుంటే నా శరీరం చచ్చుబడిపోయేది అన్నాడు. డాక్టర్లు ఆయన్ను కనీసం ఆరువారాలపాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోమని సూచించారు. దీంతో ఆడు 3 సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.ఆడు 3 మూవీఆడు సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగమే ఆడు 3. జయసూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వినాయకన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2026లో మార్చి 19న రిలీజ్ చేయనున్నారు. వినాయకన్ విషయానికి వస్తే.. ఇతడు 1995లో వచ్చిన మాంత్రికం చిత్రంతో తన యాక్టింగ్ జర్నీ ప్రారంభించాడు. సినిమా'కమ్మట్టి పాదం' మూవీలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర అవార్డును గెల్చుకున్నారు. మలయాళంతోపాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఆయనకు రజనీకాంత్ జైలర్ ఊహించని స్థాయి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. కేరళ పోలీస్స్టేషన్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగిన గొడవతో.. అలాగే ఓ హోటల్లో మద్యం మత్తులో వీరంగం సృష్టించి వార్తల్లోకెక్కాడు.చదవండి: అమ్మ బిల్డింగ్పై నుంచి దూకుతానంది: ఏడ్చేసిన నందు -
మార్క్ క్వీన్.. ఎంట్రీయే స్టార్ హీరోతో..
నటి దీప్శిఖ 'మార్క్ మూవీ'తో కన్నడ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ నేడు (డిసెంబర్ 25న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ సూపర్స్టార్ కిచ్చా సుదీప్తో కలిసి స్క్రీన్ను పంచుకుంది. ఇది దీప్శిఖ సినీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. అరంగేట్రానికి ముందే సోషల్ మీడియాలో తన పేరు మారుమోగిపోతోంది. సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్లో దీప్శిఖ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా..దీంతో అభిమానులు ఆమెకు “మార్క్ క్వీన్” అనే బిరుదును ఇచ్చారు. ఇక దీప్శిఖ మాట్లాడుతూ.. కిచ్చా సుదీప్తో కలిసి పనిచేయడం వల్ల నా కల నెరవేరింది. ఆయన దగ్గరి నుంచి క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం నేర్చుకున్నాను. ఇవి నా నటనను మరింత మెరుగుపర్చేందుకు ప్రోత్సహించాయి. అలాగే ప్రతిష్టాత్మక సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్లో పనిచేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో ప్రేమ ఇలాంటి గొప్ప నిర్మాణ సంస్థతోనే నా కన్నడ ప్రయాణం ప్రారంభం కావడం నా కెరీర్కు మరింత విలువ, ధైర్యాన్ని ఇచ్చింది. ఈ అవకాశం లభించడం నా అదృష్టం. సినిమా విడుదలకంటే ముందే నాపై ఎంతో ప్రేమ చూపించారు. మీ ప్రేమే నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేస్తుంది అని పేర్కొంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, సిబ్బంది, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. -
దేశం విడిచి వెళ్లాలనుకున్నాం.. ఏడ్చేసిన నందు
తెలుగు నటుడు, యాంకర్ నందు ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లవుతోంది. అయినా ఇప్పటికీ తనకు సరైన సక్సెస్ లేదు. ఆ ఒక్క విజయం కోసం ఏళ్లకొద్దీ పరితపిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో సెకండ్ హీరోగా చేసిన నందు తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ మంచి విజయం మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడితడు సైక్ సిద్దార్థ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఉన్నచోటే ఆగిపోయా..ఈ చిత్రం 2026 జనవరి 1న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నందు తన కష్టాల్ని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. నందు మాట్లాడుతూ.. నాతో కలిసి నటించిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రియదర్శి, విజయ్ దేవరకొండ.. వీళ్లంతా ఎక్కడికో వెళ్లిపోయారు. నేను మాత్రం ఉన్నచోటే ఉండిపోయాను. లోపం నాలోనే ఉంది. అది ఈ మధ్యే తెలుసుకున్నాను.లోపం నాలోనే..కథలో లోపాలున్నాయని తెలిసినా సరే.. డబ్బు వస్తుందన్న ఆశతో సినిమాలు ఒప్పేసుకునేవాడిని. అలా నన్ను నేనే మోసం చేసుకున్నాను. దానివల్ల వీడి సినిమాలన్నీ ఇంతేరా.. అన్న మార్క్ పడిపోయింది. దాన్నుంచి బయటకు రావడానికే మూడునాలుగేళ్లు సమయం తీసుకుని మంచి సినిమా చేశాను.చేదు సంఘటనలుసవారి మూవీ తర్వాత పెద్ద బ్యానర్లో హీరోగా సినిమా ఆఫర్ చేశారు. అనుపమ హీరోయిన్ అన్నారు. అంతా ఓకే అనుకున్నాక సడన్గా నా స్థానంలో మరొకర్ని తీసుకున్నారు. కానీ, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మరో సంఘటనలో ఏం జరిగిందంటే.. ఒక పెద్ద నిర్మాత తన కొడుకును హీరోగా పెట్టి మూవీ తీశారు. హీరోతోపాటు సమాన ప్రాధాన్యత ఉన్న పాత్ర నాకిచ్చారు. పైసా తీసుకోకుండా రెండున్నర నెలలు షూటింగ్ చేేశాను. ఘోర అవమానంతీరా ఓ డిస్ట్రిబ్యూటర్ మూవీ చూసి నాకెందుకు అంత ప్రాధాన్యతనిచ్చారని అడిగారట! దాంతో నాకు ఒక్కమాటైనా చెప్పకుండా నా సీన్స్ అన్నీ ఎత్తేశారు. అది తెలియక ఆడియో లాంచ్కు పిలవకపోయినా వెళ్లాను. అక్కడికి వెళ్లాక కనీసం నేను ముందు వరుసలో కూర్చునేందుకు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను.తల్లితోడుగా చెప్తున్నా..అనవసరమైన విషయాల్లో నా పేరు ఇరికించినప్పుడైతే కుమిలిపోయాను. తల్లితోడుగా చెప్తున్నా.. అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామా? అని గీత, నేను అనుకున్నాము. వేరే దేశం వెళ్లి ఏదైనా హోటల్లో పని చేసుకుందాం అని గీతయే ముందుగా అడిగింది. తను సక్సెస్ఫుల్ స్టార్ సింగర్.. అయినా సరే నాకోసం తన కెరీర్ వదిలేసి, వేరే దేశం వెళ్లి హోటల్లో పనిచేసుకుందామంది. అది ఇప్పుడు తల్చుకున్నా ఏడుపొస్తుంది. ఏడ్చేసిన నందునేను ఈ ఫీల్డ్లో లేకపోతే నాపై అలాంటి రూమర్సే రావు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినవారిని బలిపశువును చేస్తారు. ఈ విషయం జనాలకు తెలియదు. లేనిపోనివాటిలో నన్ను ఇరికిస్తే బిల్డింగ్ పై నుంచి దూకేస్తానంది అమ్మ. అలా నేను చేయని తప్పుకు వార్తల్లో నా పేరు రావడం చూసి ఇంట్లో అందరూ నలిగిపోయారు అని చెప్తూ నందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. -
‘బ్యాడ్ గాళ్స్ ’ మూవీ రివ్యూ
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేం ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు)’.రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఈ సినిమా కథంతా హైదరాబాద్లోని హాస్టల్లో ఉంటున్న నలుగురు అమ్మాయిలు రోజీ రెడ్డి, మల్లీశ్వరి, మెర్సీ, వెంకట్ లక్ష్మిల చుట్టూ తిరుగుతుంది. అందులో ఇద్దరికీ జాన్, నాయుడు అనే వ్యక్తులలతో ఎంగేజ్మెంట్ అవుతుంది. పెళ్లికి ముందు ఒక ఫారిన్ ట్రిప్ వేయాలని స్నేహితులంతా అనుకుంటారు. క్క స్రవంతి సహాయంతో మలేషియా ట్రిప్కి ప్లాన్ వేస్తారు. అదే సమయంలో అనకొండ అనే పేరుమోసిన టెర్రరిస్ట్ మలేషియాలో బాంబు దాడిని ప్లాన్ చేస్తాడు. అంతే కాకుండా ఈ నలుగుర్ని కిడ్నాప్ చేయాలని ఉమెన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కూడా రెడీ అవుతుంది. మరి వారి సరదా ప్రయాణం చివరకు ఎలా ముగిసింది? ఈ క్రమంలో ఆ అమ్మాయి ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడతారు? అన్నదే అనేది మిగిలిన కథ.ఎలా ఉందంటే.. సరదాగా సాగిపోయే ఓ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్లడం.. అనుకోని సమస్యలు రావడం..చివరకు ఓ సందేశం ఇవ్వడం.. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. బ్యాడ్ గాళ్స్ స్టోరీ కూడా అలానే సాగుతుంది. నలుగురు స్నేహితులు బయటకు వెళ్లాలని అనుకోవడం, అమ్మాయిలు ఇలా బయటకు వస్తే ఎదురయ్యే పరిస్థితులు వంటి వాటితో ప్రథమార్దాన్ని సరదా సరదాగా సాగించారు. నలుగురు స్నేహితులు ఉన్నప్పుడు పుట్టే హాస్యం, వచ్చే సంఘటనల్ని చక్కగా చూపించాడు. అవన్నీ కూడా నేటి ట్రెండ్కు తగ్గట్టే ఉంటాయి.అయితే కథనం నెమ్మదిగా సాగడం.. పలు సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులో రిపీట్ కావడంతో ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్కు మాత్రం మంచి ట్విస్ట్ ఇచ్చి ముగించేస్తాడు.ఇక సెకండాఫ్లో కథ రకరకాల జానర్లోకి వెళ్తుంది. అప్పటి వరకు కామెడీ జానర్ అని అనుకుంటారు. కానీ థ్రిల్లింగ్, క్రైమ్ అని తరువాత తెలుస్తుంది. కామెడీ, థ్రిల్లర్ అంశాల కలయికతో దర్శకుడు సెకండాఫ్ను బాగానే లాగాడు. మలేషియా గ్యాంగ్, ఉమెన్ ట్రాఫిక్ గ్యాంగ్, ఈ నలుగురు స్నేహితుల చుట్టూనే ఈ కథను ప్రీ క్లైమాక్స్ వరకు తిప్పాడు. ఇక చివర్లో దర్శకుడు తన సందేశాన్ని ఇచ్చాడు. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్గానే టచ్ చేసినట్టు అనిపిస్తుంది. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి స్క్రీన్ప్లే, కామెడీ పంచ్లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.ఎవరెలా చేశారంటే.. నలుగురు ప్రధాన పాత్రలు - అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్న ఎంతో ఎనర్జీగా కనిపించారు. వారి వారి పాత్రల తీరుకు తగ్గట్టుగా తెరపై చక్కగా నటించారు. నలుగురి మధ్య మంచి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని చూపెట్టారు. మోయిన్, రోహన్ సూర్య పాత్రలు కూడా బాగుంటాయి. ఈ రెండు పాత్రలతో కావాల్సినంత వినోదాన్ని ప్రేక్షకులకు అందించారు. అలా మిగిలిన వారిలో రేణు దేశాయ్ బలమైన పాత్రలో, మలేషియా పోలీసుగా రాజా రవీంద్ర, రెండు సన్నివేశాలలో తాగుబోతు రమేష్, బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి కీలక పాత్రలో కనిపించి మెప్పించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం , నేపథ్య సంగీతం బాగుంటుంది. ఆస్కార్ చంద్ర బోస్ రాసిన సాహిత్యం ఆలోచింపజేసేలా ఉంటుంది. అర్లి గణేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే.నిర్మాణ విలువలు బాగున్నాయి.రేటింగ్ : 2.5/5 -
కళ్లకు కాటుక పెట్టుకున్నా బాధనే!: బుల్లితెర నటి
సెలబ్రిటీల ముఖంలో కాస్త తేడా కనిపించినా నెటిజన్లు ఇట్టే పసిగడతారు. అది మేకప్ మహిమో? లేక డైట్ వల్ల అలా అయిందో అనడానికి బదులుగా ఏకంగా సర్జరీ చేయించుకుందని ఈజీగా అనేస్తారు. మరింత అందంగా కనిపించడం కోసం ముక్కుకు, ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని కామెంట్లు చేస్తారు. బుల్లితెర నటి ప్రియాంక చాహర్ చౌదరిపై కూడా కొంతకాలంగా ఇలాంటి రూమర్లే వస్తున్నాయి.ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్తాజాగా వీటిపై ప్రియాంక స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. చాలారోజులుగా నాపై ఎన్నో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. గతేడాది నా ఆరోగ్యం బాగోలేక ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఎక్కువ డోస్ ఉన్న యాంటిబయాటిక్స్ వాడాను. చాలామంది జనాలకు ఈ విషయం తెలియనే తెలియదు. ఆ సమయంలో బరువు తగ్గిపోయాను కానీ ముఖం మాత్రం కాస్త ఉబ్బింది. కళ్లకు కాటుక రుద్దినా..అంతదానికే జనాలు ఏదేదో ఊహించుకున్నారు. అయినా అందాన్ని మెరుగుపర్చుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. నేనేం చేయాలనుకున్నా, చేసినా అది నా ఇష్టం. ఇప్పుడు నేను కళ్లకు కాటుక రుద్దినా, లెన్స్ పెట్టుకున్నా సరే.. ముఖానికి ఏదో చేయించుకున్నానని మాత్రమే అంటారు. అందుకే నేను చెప్పేదేంటంటే.. నా ముఖం.. నా ఇష్టం! సీరియల్అయినా నా ఫేస్కు మేకప్ వేయడం తప్ప ఏదీ చేయలేదు. అయినప్పటికీ జనాలు అది మేకప్ అని నమ్మరు.. ఇంకా ఏదో ఉందని మాట్లాడుతూనే ఉంటారు. అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది. ప్రియాంక చౌదరి.. 'ఉడారియాన్' సీరియల్తో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం 'నాగిని 7' సీరియల్ చేస్తోంది. ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సీరియల్ డిసెంబర్ 27న ప్రారంభం కానుంది. -
ఫహద్ ఫాజిల్ తెలుసా? పార్తీబన్ ఆన్సరిదే!
ఫహద్ ఫాజిల్.. మలయాళంలో అనేక సినిమాలు చేసిన ఈ హీరో పుష్ప సినిమాతో తెలుగువారికి సుపరిచితుడయ్యాడు. ఈ మలయాళ స్టార్ ప్రస్తుతం సొంత భాషతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ దర్శకనటుడు పార్తీబన్తో సెల్ఫీ దిగాడు.ఫహద్ తెలుసా?ఈ ఫోటోను పార్తీబన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్గా మారింది. నేను ఫాజిల్ సర్ను కలిశాను. ఈ సందర్భంగా ఆయన తన కొడుకు ఫహద్ ఫాజిల్ను నాకు పరిచయం చేశాడు. ఫహద్ నాకు తెలుసా? అని అమాయకంగా అడిగారు. ఫహద్ ఇప్పుడు ప్రపంచంలోనే ఫేమస్ యాక్టర్. నాకు తెలియకుండా ఉంటుందా? తనను కలిసినప్పుడు నాకో విషయం అర్థమైంది. మగవాళ్లను సైతం ఆకర్షించే తత్వం..ఫహద్ మంచి వ్యక్తి.. చాలా ఇంట్రస్టింగ్ పర్సన్. అతడి మాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! ఆడవాళ్లనే కాదు, మగవాళ్లను సైతం ఆకర్షించే శక్తి అతడిలో ఉంది.. మనం మళ్లీ కలుద్దాం అని పోస్ట్ కింద రాసుకొచ్చాడు. పార్తీబన్ తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేశాడు. చివరగా ఇడ్లీ కడై (తెలుగులో ఇడ్లీ కొట్టు) సినిమాలో కనిపించాడు. View this post on Instagram A post shared by Radhakrishnan Parthiban (@radhakrishnan_parthiban) చదవండి: నా బిడ్డను దూరం చేశారు.. ఏడ్చేసిన కమెడియన్ -
నా బిడ్డను దూరం చేశారు.. ఏడ్చేసిన కమెడియన్
కమెడియన్ భారతీ సింగ్ ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తను ఇంట్లో ఉన్న సమయంలో సడన్గా ఉమ్మునీరు లీకైంది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన బాబును తొలిసారి తన చేతుల్లోకి తీసుకున్న మధుర క్షణాల గురించి మాట్లాడుతూ యూట్యూబ్లో ఓ వీడియో షేర్ చేసింది.దూరంగా ఉంచారుబాబు పుట్టిన వెంటనే నా నుంచి దూరంగా తీసుకెళ్లారు. పరీక్షలని, అబ్జర్వేషన్లో ఉంచాలని ఏవేవో కారణాలు చెప్పారు. కానీ వాడిని నాకు దూరంగా ఉంచడం తట్టుకోలేకపోయాను. రెండు రోజుల తర్వాత బాబును నా చేతికందించారు. తొలిసారి వాడిని ఎత్తుకున్నప్పుడు సంతోషంతో ఏడ్చేశాను. ఎవరి దిష్టి తగలకూడదుగోలాలాగే వీడు కూడా చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు అంది. బాబును ముద్దుగా కాజు అని పిల్చుకుంటోంది. ఈ వీడియో కింద అభిమానులు.. మీ పిల్లలు కాజు, గోలా.. ఇద్దరికీ ఎవరి దిష్టి తగలకూడదు అని కామెంట్లు చేస్తున్నారు. కమెడియన్ భారతీ సింగ్.. యాంకర్, నిర్మాత హార్ష్ లింబాచియాను 2017లో పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో బాబు లక్ష్ పుట్టాడు. ఇతడిని ముద్దుగా గోలా అని పిల్చుకుంటారు. View this post on Instagram A post shared by Harssh Limbachiyaa (@haarshlimbachiyaa30) -
కొత్త డాన్ తప్పుకున్నాడా?
‘ధురంధర్’ సినిమా బ్లాక్బస్టర్ సక్సెస్తో మంచి జోష్లో ఉన్నారు హీరో రణ్వీర్ సింగ్. అయితే ‘డాన్ 3’ సినిమా నుంచి రణ్వీర్ సింగ్ తప్పుకుంటున్నారనే టాక్ బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ సినిమా రానున్నట్లుగా 2023 ఆగస్టు 9న ప్రకటన వచ్చింది. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ ఈ ‘డాన్ 3’ సినిమాను నిర్మిస్తారని, 2025లో ఈ సినిమా విడుదలవుతుందనేది ఆ అనౌన్స్మెంట్ సారాంశం. కానీ వివిధ కారణాల వల్ల రణ్వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ సినిమా ఇంకా సెట్స్కు వెళ్లలేదు. ‘ధురంధర్’ సినిమా తర్వాత రణ్వీర్ సింగ్ నెక్ట్స్ మూవీ ‘డాన్ 3’ అని అందరూ అనుకున్నారు. కానీ రణ్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటున్నారని బీ టౌక్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘డాన్ 3’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ‘డాన్’గా రణ్వీర్ సింగ్ వెండితెరపై కరెక్ట్ కాదన్నట్లుగా కొంతమంది షారుక్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శించారు (ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్లో వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), ‘డాన్ 2 (2011) చిత్రాల్లో షారుక్ ఖాన్ హీరోగా నటించారు). కానీ ‘డాన్ 3’లో యాక్టర్గా తాను ప్రేక్షకులను మెప్పిస్తానని రణ్వీర్ సింగ్ రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ ్ర΄ాజెక్ట్ నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే... రణ్వీర్ సింగ్ కొత్త సినిమాకు ‘ప్రళయ్’ అనే టైటిల్ ఖరారైందని, ఇదొక జాంబీ ఫిల్మ్ అని, ఒక తండ్రి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ టాక్. -
పెద్ద టైటిల్.. ఇప్పుడు ఇదే ట్రెండ్ గురూ!
టైటిల్ క్యాచీగా ఉంటే ఆడియన్స్ అటెన్షన్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది... అది చిన్న టైటిలా? పెద్ద టైటిలా? అన్నది కాదు. అయితే ఒక్కోసారి రెండక్షరాలతోనే టైటిల్ కుదరొచ్చు... ఇరవై అక్షరాలతోనూ కుదరొచ్చు. ఇప్పుడు కొన్ని టైటిల్స్ చూస్తే మాత్రం ‘పెద్ద’ టైటిల్ ట్రెండ్ సాగుతున్నట్లనిపిస్తోంది. ఆ లెంగ్తీ టైటిల్స్ అన్నీ అచ్చ తెలుగులో చక్కగా క్యాచీగా ఉన్నాయి. ఆ టైటిల్స్, ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోలు, ఆ కథా కమామీషులోకి వెళదాం. మన శంకరవరప్రసాద్గారు... ‘ఆచార్య, గాడ్ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్, విశ్వంభర’ వంటి చిన్న టైటిల్స్ చిత్రాల తర్వాత చిరంజీవి నటిస్తున్న పెద్ద టైటిల్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్గారు’ కావడం విశేషం. ఈ చిత్రంలో శంకర వరప్రసాద్, శశిరేఖల ప్రేమకథ, కుటుంబ గాథల కహానీ ఏంటి? అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ (2019) చిత్రం తర్వాత చిరంజీవి–నయనతార జోడీగా నటిస్తున్న సినిమా ఇది (‘గాడ్ఫాదర్’ చిత్రంలో అన్న, చెల్లెలుగా నటించారు). ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, కేథరీన్ , సచిన్ ఖేడేకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నయనతార (శశిరేఖ), చిరంజీవి (వరప్రసాద్ పాత్రలో) భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వెండితెరపై వీరిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? అన్నది ‘మీసాల పిల్ల...’ అనే పాటలో చూపించారు. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. అంతేకాదు... తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలైన చిరంజీవి–వెంకటేశ్ కలిసి ‘మన శంకరవరప్రసాద్గారు’ చిత్రంలో నటస్తుండటంతో ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి΄ాట ‘మీసాల పిల్ల...’, ద్వితీయ పాట ‘శశిరేఖ...’ ఏ స్థాయిలో శ్రోతలను అలరించాయో తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47... కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ని., మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను అలరించడంలో వెంకటేశ్ దిట్ట. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నారాయన. అంతేకాదు... కెరీర్లో తొలిసారి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సాధించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక– హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ అనే టైటిల్ని ఖరారు చేసి, ఈ నెల 10న ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ‘‘కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేశ్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కలయికలో రానున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా వెండితెరపై వినోదాల విందుని అందించనుంది. వెంకటేశ్–త్రివిక్రమ్ కలయిక ప్రేక్షకులందరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘నారప్ప, దశ్యం 2, ఎఫ్ 3, సైంధవ్, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి షార్ట్ టైటిల్స్ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న బిగ్ టైటిల్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47’. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి.... హీరో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. రవితేజ కెరీర్లో 76వ సినిమాగా రూ΄÷ందుతోన్న ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామసత్యనారాయణ పాత్రలో నటిస్తున్నారు రవితేజ. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోలో.. ‘‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, చాట్ జీపీటీ, జెమిని.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను.. ఆశ్చర్యపోయారే తప్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ.. మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ పలికిన సంభాషణలకు మంచి స్పందన వచ్చింది. ‘‘చాలా రోజుల తర్వాత రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్గా ఉంది. అద్భుతమైన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్తో తన వెర్సటాలిటీని ప్రజెంట్ చేశారు రవితేజ. కిషోర్ తిరుమల టచ్తో ఈ టైటిల్ ఫ్యామిలీ ఫీలింగ్ కలిగించింది. మా సినిమా పక్కా ఎంటర్టైనింగ్గా, మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్కి సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే... ‘ధమాకా, మాస్ జాతర’ వంటి చిత్రాల తర్వాత హీరో రవితేజ–సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కాంబినేషన్లో వస్తోన్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా నుంచి విడుదలైన ‘బెల్లా బెల్లా...’, ‘అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే...’ వంటి ΄ాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా ‘ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర’ వంటి చిన్న టైటిల్స్ సినిమాల తర్వాత రవితేజ నటిస్తున్న పెద్ద టైటిల్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో నిలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘గబ్బర్ సింగ్’ (2012) సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత వీరి కలయికలో రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి విడుదల చేసిన పవన్ కల్యాణ్ ప్రత్యేక ΄ోస్టర్కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘దేఖ్ లేంగే సాలా...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్కి మంచి స్పందన వచ్చింది. ఈ ΄ాటను భాస్కరభట్ల రాయగా, విశాల్ దడ్లానీ ΄ాడారు. ఇప్పటికే టాకీ ΄ార్ట్ పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని 2026లో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నారీ నారీ నడుమ మురారి బాలకృష్ణ హీరోగా శోభన, నిరోషా హీరోయిన్లుగా రూ΄÷ందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఎ. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో నరసింహ నాయుడు నిర్మించిన ఈ మూవీ 1990 ఏప్రిల్ 27న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ రిలీజైన ముప్పై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే.. ‘నారీ నారీ నడుమ మురారి’ పేరుతో శర్వానంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ‘సామజవరగమన’ మూవీ ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త, సాక్షీ వైద్య బావా మరదల్లుగా నటించారట. మరి... ఇద్దరు మరదల్లు కలిసి బావని ఎలా ఆటపట్టించారు? ఈ బావా–మరదల్లు వెండితెరపై చేసిన సందడి ఏ స్థాయిలో నవ్వులు పంచింది? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘ఎక్స్ప్రెస్ రాజా’ (2016’, ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో దిగి హిట్స్ అందుకున్న శర్వానంద్, ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో 2026 సంక్రాంతికి ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. ‘‘ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్గా ఈ చిత్రం ఆడియ¯Œ ్సను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అనగనగా ఒకరాజు ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీ¯Œ ΄÷లిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా వినోదాత్మక చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ΄÷ందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, ప్రోమోస్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రత్యేకించి సంక్రాంతి ప్రోమో అంటూ రిలీజ్ చేసిన నవీన్ లుక్ ఆకట్టుకుంది. బ్లూ అండ్ వైట్ కుర్తా, పైజామా ధరించి కళ్లజోడు పెట్టుకుని పక్కా సంక్రాంతి బుల్లోడిలా ఉన్నారు నవీన్. ఆయన బ్యాక్గ్రౌండ్లో జాయింట్ వీల్, భారీ ఎత్తున ప్రజలు ఉన్నారు. ఆ పోస్టర్ పక్కాగా సంక్రాంతి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి నవంబరు 27న విడుదలైన ‘భీమవరం బల్మా...’ అంటూ సాగే ΄ాటకి అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ‘‘సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే సంక్రాంతికి సరైన సినిమాగా ‘అనగనగా ఒక రాజు’ను రిలీజ్ చేయనున్నాం. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేలా మా చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల ప్రేక్షకులముందుకొస్తోంది. ఓం శాంతి శాంతి శాంతి ‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. దర్శకుడిగా తనకంటూ చక్కని గుర్తింపు సొంతం చేసుకున్న ఆయన నటుడిగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా కథానాయికగా నటించారు. నూతన దర్శకుడు ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్–మూవీవెర్స్ స్టూడియోస్పై సజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మించారు. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ ఇతర పాత్రలు పోషించారు. మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే’కి తెలుగు రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాని తొలుత ఆగస్టు 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ విడుదల వాయిదా పడింది. 2026 జనవరి 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఓ వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా, ఈషా రెబ్బా కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి ΄ాత్ర చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్కి మంచి స్పందన వచ్చింది. ‘‘గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. అంబటి, ప్రశాంతిల పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు ఆరంభమవుతాయి. ఈ సమయంలో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది?’’ అనేది మా సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. మా మూవీ ఆడియన్స్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఆకాశంలో ఒక తార ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో హిట్స్ని తన ఖాతాలో వేసుకున్నారు దుల్కర్ సల్మాన్. అంతేకాదు... మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు కథానాయకుడే అన్నట్లు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారాయన. మలయాళంలో స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకెళుతున్న ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం మంచి ఫ్యాన్ బేస్ సం΄ాదించుకున్నారు. దుల్కర్ నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. జూలై 28న దుల్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్కి చక్కని స్పందన వచ్చినట్లు చిత్రబందం పేర్కొంది. దుల్కర్ సల్మాన్ ఓ సాధారణ రైతు ΄ాత్ర చేశారు. ఓ పల్లెటూరికి చెందిన ఆయన అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కలని ఎలా నెరవేర్చుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని తెలుస్తోంది. ‘‘సీతారామం, లక్కీ భాస్కర్, మహానటి’ వంటి వరుస హిట్లతో టాలీవుడ్లో దూసుకెళుతున్న దుల్కర్ సల్మాన్.. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకుంటారనే నమ్మకం ఉంది. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం మా సినిమాకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ టైటిల్స్ మాత్రమే కాదు... ఇంకా లెంగ్తీ టైటిల్ ఉన్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
‘దండోరా’ సెన్సార్ రిపోర్ట్.. బూతు పదంతో సహా 15 మార్పులు!
రవికృష్ణ, నవదీప్, నందు, మనికా చిక్కాల, బింధు మాధవి, రాధ్య, అదితీ భావరాజు, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఓ బూతు పదంతో సహా మొత్తంగా 15 మార్పులు సూచిస్తూ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. 2.16 గంటల నిడివితో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇందులో వాడిన కొన్ని బూతు పదాలను కచ్చితంగా తొలగించాలని ఆదేశించారు. అలాగే సినిమా ప్రారంభంలో వాయిస్ ఓవర్తో ఇందులోని పాత్రలు కల్పితనమి పేర్కొనాలని సెన్సార్ బోర్డ్ సూచించింది. కొన్ని సన్నివేశాలను బ్లర్ చేయాలని ఆదేశించారు.ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్తో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్కు ముందే బిజినెస్ను పూర్తి చేసుకోవటం విశేషం. చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తుంటే.. ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక ఏరియాల్లో ప్రైమ్ షో రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్లో 200కు పైగా థియేటర్స్లో సినిమాను అథర్వణ భద్రకాళి పిక్చర్స్ గ్రాండ్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్లో అయితే నిన్ననే(డిసెంబర్ 23) ప్రీమియర్స్ పడ్డాయి. -
రిటైర్ అయ్యా కదా.. తెలుగు సినిమాలపైనే నా ఫోకస్!
చాలామందికి సినిమాలకే కాలక్షేపం. కాస్త సమయం దొరికితే చాలు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తుంటారు. తాను కూడా అదే కోవలోకి వస్తానంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. తాజాగా అతడు హైదరాబాద్లో టాలీవుడ్ ప్రో లీగ్ (టీపీఎల్)ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.డబ్బింగ్ మూవీస్ చూస్తా..మీరు సౌత్ ఇండియన్ సినిమాలు చూస్తారా? అన్న ప్రశ్నకు అవునని తలూపాడు. తెలుగు, తమిళ భాషలు అర్థం కానప్పటికీ ఆయా సినిమాలను హిందీ డబ్బింగ్లో చూస్తానని సెహ్వాగ్ చెప్పాడు. పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ను హిందీలో చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ.. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక నేను చాలా ఖాళీ సమయం దొరికింది. నా ఫేవరెట్ హీరోఅప్పుడు నేను టాలీవుడ్ స్టార్స్ అయిన మహేశ్బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు ఎక్కువగా చూడటం మొదలుపెట్టాను. నా ఫేవరెట్ తెలుగు హీరో మహేశ్బాబు. ప్రభాస్ బాహుబలి సినిమానైతే ఎన్నోసార్లు చూశాను అని చెప్పుకచ్చొఆడు. ఇకపోతే వీరూ ఫేవరెట్ హీరో మహేశ్బాబు ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు.సినిమాఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ప్రభాస్ అట్లీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. ప్రభాస్ విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్, హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: వితికా షెరుకు ప్రమోషన్ -
దృశ్యం 3 నుంచి 'ధురంధర్' నటుడు అవుట్?
థ్రిల్లర్ మూవీ 'దృశ్యం' సూపర్ డూపర్ హిట్టు. దర్శకుడు జీతూ జోసెఫ్, హీరో మోహన్లాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అయి అక్కడా ఘన విజయాన్ని అందుకుంది. దీంతో 'దృశ్యం' ఫ్రాంచైజీలో రెండవ భాగాన్ని తీసుకొచ్చారు. కాకపోతే 2021లో కరోనా వల్ల మలయాళ వర్షన్ను ఓటీటీలో రిలీజ్ చేశారు. సూపర్ హిట్ దృశ్యంఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ రావడటంతో తెలుగు, హిందీలో రీమేక్ చేశారు. వెంకటేశ్ 'దృశ్యం 2' కూడా అదే ఏడాది ఓటీటీలో విడుదలైంది. అయితే అజయ్ దేవ్గణ్ హిందీ 'దృశ్యం 2' మాత్రం 2022లో బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు' దృశ్యం' మూడో పార్ట్ రాబోతోంది. మూడో పార్ట్మోహన్లాల్- జీతూ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు హిందీలో అజయ్ దేవ్గణ్ 'దృశ్యం 3' షూటింగ్ ఇటీవలే మొదలైంది. టబు, శ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పాఠక్ డైరెక్టర్. ఈ మూవీ 2026 అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో డిమాండ్ఈయన 'దృశ్యం 2'లో పోలీసాఫీసర్గా కనిపించారు. ఈ ఏడాది ఛావా, ధురంధర్ సినిమాలతో సెన్సేషన్ అయిన అక్షయ్.. మూడో పార్ట్ (Drishyam 3 Movie)లో నటించేందుకు కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట! అలాగే తన పాత్ర తెరపై కనిపించే తీరులో కొన్నిమార్పులు చేయమని సూచించాడట! నిజమెంత?ఈ విషయంలో నటుడికి, నిర్మాతలకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు భోగట్టా.. దీంతో ఆయనే స్వయంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైనప్పటికీ అక్షయ్ ఖన్నా డిమాండ్లకు తలొగ్గి మళ్లీ అతడిని సినిమాలో తీసుకునే అవకాశాలూ లేకపోలేదు.చదవండి: వితికా షెరుకు ప్రమోషన్ -
మైసా నుంచి సర్ప్రైజ్.. రష్మిక రప్పారప్పా..
ఈ ఏడాది బాక్సాఫీస్ను రప్ప రప్పా ఆడించేసింది రష్మిక మందన్నా.. తను హీరోయిన్గా నటించిన ఛావా, థామా, కుబేర, ద గర్ల్ఫ్రెండ్ చిత్రాలు వందల కోట్లు రాబట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మైసా అనే లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేస్తోంది. బుధవారం (డిసెంబర్ 24న) ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. "నా బిడ్డ సచ్చిందన్నారు. కానీ మట్టే వణికిపోయింది.. నా బిడ్డ రక్తాన్ని దాసలేక, గాలే ఆగిపోయింది.. దాని ఊపిరి మోయలేక, అగ్గే బూడిదైంది.. మండుతున్న నా బిడ్డని సూడలేక.." అన్న సంభాషణతో వీడియో మొదలైంది. నా బిడ్డను సంపలేక సావే సచ్చిపోయింది.. నా బిడ్డ ఎవరో తెలుసా.. అంటూ రష్మికను పవరల్ఫుల్ లేడీ వారియర్గా చూపించారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్ఫార్ములా ఫిలింస్ నిర్మిస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2026లో విడుదల కానుంది. -
అప్పుడు అలా..ఇప్పుడు ఇలా.. ఇగ మారవా ‘ఛీ వాజీ
చెప్పేవి శ్రీరంగ నీతులు..చేసేవి దొంగ పనులు అన్నట్లుగా ఉంది నటుడు శివాజీ పరిస్థితి. ఆడవాళ్లు ఇలా ఉండాలి? అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి? అని నీతులు చెప్పే ఈ సుద్దపూస.. తనవరకు వచ్చేసరికి ఇష్టం వచ్చినట్లుగా జీన్స్, హుడీలు వేసుకోని కుర్రహీరోలా రెడీ అయిపోతాడు. స్త్రీ అంటే ప్రకృతి.. తల్లి అంటూనే అదే నోటితో దరిద్రపు ము** అంటూ బూతులు మాట్లాడతాడు. చివరకు క్షమాపణలు చెబుతూనే.. తను చెప్పింది మంచి విషయమే కానీ వాడిన పదాలు తప్పు అంటాడు. మహిళలు ఇలాంటి దుస్తులే ధరించాలి..ఇలానే కనిపించాలి అని చెప్పేందుకు శివాజీ ఎవరు? ఎలా కనబడాలి? ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది ముమ్మాటికి వాళ్ల హక్కే. ఇది శివాజీ లాంటి స్వయంప్రకటిత మేధావులకు ఎప్పుడు అర్థమవుతుందో..బిగ్బాస్ హౌస్లో కూడా చిల్లర మాటలేమహిళలపై ఇలాంటి చిల్లర కామెంట్స్ చేయడం శివాజీకి ఇదే మొదటిసారి కాదు. గతంలో బిగ్బాస్ షోలో కూడా తోటి కంటెస్టెంట్స్పై ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. నటుడుగా తన పేరు కనుమరుగు అవుతున్న సమయంలో బిగ్బాస్ 7 షోతో మళ్లీ వెలుగులోకి వచ్చాడు శివాజీ. అక్కడ కూడా ఆట కంటే ఎక్కువగా ఇలాంటి మాటలతోనే పబ్బం గడిపాడు. బిగ్బాస్ 7లో పాల్గొన్న శోభ, రతిక, ప్రియాంక, అశ్వినితో పాటు మిగిలినవారంతా శివాజీ ప్రవర్తనను, మాటలను తప్పుపట్టారు. (చదవండి: హీరోయిన్ల డ్రెస్పై శివాజీ వ్యాఖ్యలు... అనసూయ పోస్ట్ వైరల్)ఒకనొక సమయంలో అయితే అతని మాటలపై గట్టిగా సీరియస్ అయ్యారు కూడా. బిగ్బాస్ 7 పదో వారం..గేమ్లో భాగంగా హౌస్లో ఉన్న రతిక, ప్రియాంక, శోభ, అశ్వినిలను రాజమాతలుగా బిగ్బాస్ నియమిస్తే.. ‘నా మాట వినకపోతే ***పగుల్తాయ్’ అంటూ అనవసరంగా నోరు పారేసుకున్నాడు. అదే షోలో ప్రియాంకతో కూడా శివాజీ దురుసుగా ప్రవర్తించాడు. ఓ వారం అతన్ని నామినేట్ చేస్తూ.. ‘ఎదుటి వాళ్లని మాట్లాడనీయకుండా దబాయిస్తున్నాడు’ అని ప్రియాంక అంటే.. ఆమెపై వేలు ఎత్తి చూపిస్తూ.. వెళ్లు వెళ్లు అంటూ వెతకారంగా మాట్లాడాడు. వేలు చూపించడం సరికాదంటూ ప్రియాంక సీరియస్ అయితే.. ‘నీకంత లేదమ్మా’ అంటూ హేళన చేస్తూ మాట్లాడాడు.ఏమైనా సంబంధం ఉందా ‘ఛీ’వాజీతాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలు కూడా మీడియా అటెన్షన్ కోసమే అన్నట్లుగా ఉంది. వాస్తవానికి నిన్న శివాజీ వెళ్లింది దండోరా సినిమా ఈవెంట్. అక్కడ సినిమా గురించి మాట్లాడాలి. కానీ అది వదిలేసి.. అమ్మాయిల డ్రెస్పై కామెంట్స్ చేశాడు. ఆడవాళ్ల దుస్తులకు.. ఆయన నటించిన సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? పోనీ గతంలో శివాజీ నటించిన సినిమాల్లో హీరోయిన్లు అంతా చీరలు ధరించే కనిపించారా? ఏదో ఒకటి మాట్లాడి మీడియాలో అటెన్షన్ తెచ్చుకోవాలన్న కోరికతోనే శివాజీ అలాంటి చిల్లర వ్యాఖ్యలు చేశాడు.అదో పిచ్చి.. మీడియాలో తన పేరు వినిపించాలనే పిచ్చి శివాజీకి కాస్త ఎక్కువే. తనకు సంబంధం లేని విషయాల్లో దూరి.. ‘నేను తోపు.. తురుమ్ ఖాన్’ అని గప్పాలు కొట్టుకుంటాడు. రాజకీయాల గురించి ఇంగిత జ్ఞానం కూడా లేని శివాజీ.. 2019 ఎన్నికల ముందు గరుడ పురాణమంటూ ఓ కట్టుకథను అల్లి చంద్రబాబు మెప్పు పొందే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. అనంతరం బీజేపీలో చేరాడు. ఆ విషయం పార్టీతో పాటు జనాలు కూడా మర్చిపోయారు. ఇప్పుడు రాజకీయాలు వదిలేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. ఈ మధ్యే శివాజీ ఇంకా నటుడుగా కొనసాగుతున్నాడన్న విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే.. తనకు గుర్తింపు వచ్చి..మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశతో శివాజీ ఉన్నాడు. చాన్స్ల కోసం ఇంతకు దిగజారాలా ‘ఛీవాజీ’ -
ఆ అందాల నటి వయసు 92 ...ఆరోగ్య రహస్యం ఇదే...
చాలా మందికి కదలడం కూడా కష్టంగా ఉండే వయస్సులో ఆ నటి నృత్యం చేస్తున్నారు. చురుకైన కదలికలు, వన్నె తరగని ముఖ వర్ఛస్సుతో ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఆమె ప్రముఖ సీనియర్ నటి–నర్తకి వైజయంతిమాల బాలి. ప్రస్తుతం 92 ఏళ్ల ఈ ఐకానిక్ సంగం స్టార్ ఇప్పటికీ తరగని తేజస్సుతో కళాత్మక శక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ట్వింకిల్ టోస్ అని ప్రేమగా పిలువబడే ఆమె, ఒక ప్రదర్శనకారిణి, గురువు, పండితురాలు సాంస్కృతిక సంరక్షకురాలిగా బహుళ పాత్రలను సజావుగా సమతుల్యం చేసుకుంటున్నారు. ప్రేక్షకులను తన ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేశారు, భావోద్వేగ లోతు శాస్త్రీయ వైభవంతో నిండిన ప్రదర్శన సమర్పించారు.నాట్యమే...ఆరోగ్యంఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా , తన శారీరక బలాన్ని మానసిక స్పష్టతను నిలబెట్టిన సూత్రాల గురించి వైజయంతిమాల మీడియాతో పంచుకున్నారు. నిర్మాణాత్మక జీవనం, బుద్ధిపూర్వక ఆహారం వీటన్నింటితో పాటు భరతనాట్యం పట్ల అచంచలమైన నిబద్ధత తదనుగుణ శారీరక శ్రమల సమ్మేళనమే తన దీర్ఘాయువు రహస్యం అంటారామె. తన జీవితంలో భరతనాట్యం కేంద్ర శక్తిగా మిగిలిపోయిందని వైజయంతిమాల వివరించారు. ప్రస్తుతం ఆమె ప్రతిరోజూ సాధన చేయకపోవచ్చు, కానీ ఎంపిక చేసిన యువ విద్యార్థుల బృందానికి శిక్షణ ఇవ్వడం ద్వారా తన జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. తన రోజులో మిగిలిన గంటలు పరిశోధనలో పెట్టుబడి పెడతారు, ఇది ఆమె దశాబ్దాలుగా అనుసరించిన కళారూపంతో మేధోపరంగా నిమగ్నమై ఉండటానికి వీలు కల్పిస్తుంది.మితాహారం...యోగా ధ్యానం...ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె దినచర్య గురించి మరింత విపులంగా వెల్లడయింది. ఆ ఛానల్ ప్రకారం, వైజయంతిమాల తన ఉదయాలను క్రమం తప్పని నడకలతో ప్రారంభిస్తుంది, ఈ అలవాటు శరీరాన్ని అప్రమత్తంగా శక్తివంతం చేస్తుందని ఆమె నమ్ముతుంది. ఆమె ఆరోగ్య దినచర్యలో స్థిరమైన యోగాభ్యాసం ధ్యానం కూడా భాగమై ఉంటాయి, ఆహారం కూడా ఆమె చురుకైన జీవనశైలిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె సాంప్రదాయ శాఖాహార దక్షిణ భారత భోజన శైలికి కట్టుబడి ఉంటారు. ఆమె ఉదయం పూట తరచుగా దోస, ఊతప్పం లేదా ఉప్మా వంటి సుపరిచితమైన అల్పాహారాలను తీసుకుంటారు, అదే విధంగా తాజా పండ్ల రసంతో పాటు. పోషకాలతో నిండిన తేలికపాటి భోజనం చేస్తారు. భోజనంలో సాధారణంగా బియ్యంతో రసం లేదా పప్పు చావల్ వడ్డిస్తారు. సాయంత్రం వేళలో ఆమె పండ్ల రసం లేదా కొద్దిగా పొడి పండ్ల వంటి తేలికపాటి రిఫ్రెష్మెంట్లను ఇష్టపడతారు. రాత్రి పూట ఆహారం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా తన డిన్నర్ కూరగాయలతో రోటీ లేదా పప్పు చావల్ లలో ముగుస్తుంది. నమ్మిన వృత్తి పట్ల నిబద్ధత క్రమశిక్షణతో కూడిన జీవనశైలి నిత్యనూతనంగా ఉంచే అభిరుచులు కలగలిపిన మనిషి వయసుతో సంబంధం లేని ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు అనే దానికి వైజయంతిమాల బాలి జీవితం ఓ నిదర్శనం. -
‘శివ’ చూసి ‘ఓం’ స్క్రిప్ట్ మొత్తం మార్చేశా: ఉపేంద్ర
తెలుగు సినిమా చరిత్ర,ఇండియన్ సినిమా గతిని మలుపు తిప్పిన కల్ట్ క్లాసిక్ ‘శివ’. అప్పటివరకు తెలుగు తెరపై చూడని బొమ్మని శివలో చూపించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందుకే తెలుగు సినిమాను శివకు ముందు.. శివకు తర్వాత అని డిఫైన్ చేస్తారు. అయితే ఈ సినిమా ప్రభావం తెలుగు తెరకే పరిమితం కాలేదు.. అన్ని భాషల చిత్రాలకు మరో కొత్త మార్గం చూపించింది. ఎంతలా అంటే.. కన్నడ ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకునే ‘ఓం’ సినిమా స్క్రిప్ట్నే మార్చేసేలా చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఓం దర్శకుడు ఉపేంద్రనే చెప్పాడు.తాజా ఇంటర్వ్యూలో ఉపేంద్ర మాట్లాడుతూ, “నేను కాలేజీ రోజుల్లోనే ఒక గ్యాంగ్స్టర్ కథ రాసుకున్నాను. కానీ ‘శివ’ విడుదలైన తర్వాత నా కథ దాదాపు ఒకేలా ఉందని గ్రహించాను. ప్లాగియారిజం ఆరోపణలు రాకుండా స్క్రిప్ట్ను పూర్తిగా మార్చేశాను. రెండేళ్లు కష్టపడి కొత్త స్క్రీన్ప్లేతో ‘ఓం’ను తెరకెక్కించాను” అని చెప్పారు.శివరాజ్కుమార్ హీరోగా నటించిన ఓం కన్నడ సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్గా నిలిచి, అత్యధిక సార్లు (550కు పైగా) రీ-రిలీజ్ అయిన రికార్డును సృష్టించింది. 'ఓం'కు ప్రేరణ తన స్నేహితుడు పురుషోత్తమ్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటన అని ఉపేంద్ర గతంలో వెల్లడించారు. 'శివ' చిత్రం తెలుగు సినిమాను మార్చేసినట్లే, 'ఓం' కన్నడ ఇండస్ట్రీలో గ్యాంగ్స్టర్ జోనర్కు కొత్త ఒరవడి ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ కూడా తన 'సత్య' చిత్రానికి 'ఓం' నుంచి ప్రేరణ పొందినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపేంద్ర, శివరాజ్కుమార్ కలిసి అర్జున్ జన్య దర్శకత్వంలో ‘45’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది."When I saw #Shiva, I left that script for two years and it kept haunting me. Then I thought of making the screenplay of #OM in a different way."– #Upendra | #NagarjunaAkkineni pic.twitter.com/A6mkbLvCNQ— Whynot Cinemas (@whynotcinemass_) December 22, 2025


