Combined Commanders Conference
-
భారత సైన్యం ‘భవిష్యత్ శక్తి’గా మారాలి
కెవాడియా(గుజరాత్): భారత సైనిక దళాల దృఢనిశ్చయం, అంకితభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రశంసించారు. గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారితోపాటు సరిహద్దుల్లో ఎదురవుతున్న సవాళ్లను మన సైన్యం ధైర్యంగా ఎదుర్కొంటోందని కొనియాడారు. గుజరాత్లోని కెవాడియాలో శనివారం రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కంబైన్డ్ కమాండర్ల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. కొత్తకొత్త సవాళ్లకు ధీటుగా బదులివ్వడానికి భారత సైన్యం ‘భవిష్యత్ శక్తి’గా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. మూడు రోజులుగా జరుగుతున్న ఆ సదస్సులో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లను కూడా భాగస్వాములుగా చేయడం మంచి పరిణామని అన్నారు. మన దేశం వచ్చే ఏడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనుందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యువతకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సైన్యాన్ని ప్రధాని మోదీ కోరారు. కోల్కతాకు నేడు మోదీ సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సమర శంఖం పూరించేందుకు ప్రధాని మోదీ నేడు కోల్కతాలో పర్యటించనున్నారు. బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు సుమారు 10 లక్షల మందిని సమీకరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, అభ్యర్థుల ప్రకటన జరుగుతుండడంతో ప్రచారంలో మరింత జోరు పెంచేందుకు ప్రధాని రంగంలో దిగారు. మొదటి దశ పోలింగ్ 27న జరగనుంది. బెంగాల్ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని 20 ఎన్నికల ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మరోవైపు సినీ నటుడు మిథున్ చక్రవర్తి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రధాని సమావేశానికి హాజరు కానున్నారు. ఈ వేదికపై ప్రధాని సమక్షంలో వీరిద్దరూ బీజేపీలో చేరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. ఆయనను బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించే అవకాశం ఉంది. -
అంతరిక్షంపై నియంత్రణ ఎంతో అవసరం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ త్రివిద దళాల సైనికాధికారులతో సమావేశమయ్యారు. శుక్రవారం రక్షణ శాఖ వార్ రూమ్లో ఈ భేటీ జరిగింది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితుల్లో మోడీ సైన్యాధికారులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే దేశానికి రక్షణ అవసరమని మోడీ అన్నారు. దౌత్య, రక్షణ విషయాల్లో కొత్త ఆలోచనా విధానం అవసరమని చెప్పారు. ఆకాశం, భూమి, జలాలపై నియంత్రణ కంటే అంతరిక్షంపై నియంత్రణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించాక సైనిక దళాల ప్రధానాధికారులతో మొదటిసారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, త్రివిద దళాల అధిపతులు పాల్గొన్నారు. -
సైనికాధికారులతో మోడీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత సైనికాధికారులతో సమావేశమయ్యారు. శుక్రవారం రక్షణ శాఖ వార్ రూమ్లో ఈ భేటీ జరిగింది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితుల్లో మోడీ సైన్యాధికారులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించాక సైనిక దళాల ప్రధానాధికారులతో మొదటిసారి సమావేశమయ్యారు. త్రివిద దళాధిపతులు దేశ రక్షణకు సంబంధించి మోడీకి నివేదిక సమర్పించనున్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ, హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి సు ష్మా స్వరాజ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, త్రివిద దళాల అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహ, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ కే ధోవన్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ పాల్గొన్నారు.