Commissioner of Education Department
-
సీఎం చొరవతోనే విద్యా రంగం అభివృద్ధి
గుంటూరు ఎడ్యుకేషన్: సీఎం వైఎస్ జగన్కున్న చిత్తశుద్ధి వల్లే ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధి చెందుతోందని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు పేర్కొన్నారు. ‘మనబడి:నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యాలయాల్లో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే ఆధునిక వసతులను సమకూరుస్తున్నారని వివరించారు. గుంటూరులోని హిందూ కాలేజ్లో సోమవారం భారతీయ శిక్షణా మండల్, నీతి ఆయోగ్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ నూతన విద్యా విధానంపై నిర్వహించిన వర్క్షాప్లో చినవీరభద్రుడు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లలకు కూడా ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సకల వసతులతో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మొదటి దశలో 15 వేలకు పైగా పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని.. మిగిలిన 30 వేల స్కూళ్లతో పాటు జూనియర్, డిగ్రీ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు కూడా అవసరమైన ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు. విద్యా బోధనలో వర్చువల్, ఆన్లైన్ వంటి సదుపాయాలు ఎన్ని వచి్చనా.. తరగతి గదిలో విద్యార్థుల ఎదుట పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదన్నారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గతంలో అదే గ్రామాల్లో నివసిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులకు అందుబాటులో ఉండేవారని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగైందన్నారు. పనిచేసే చోట నివాసముండి, పాఠశాలే తన సర్వస్వంగా భావించే ఉపాధ్యాయులే సమాజంలో గౌరవాన్ని పొందగలరని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు కూడా సివిల్స్ స్థాయిలో శిక్షణ అవసరమని భావించి, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్కూల్ కాంప్లెక్స్ల విధానాన్ని ఎన్ఈపీలో పొందుపర్చిన విషయాన్ని ఈ సందర్భంగా చిన వీరభద్రుడు ప్రస్తావించారు. -
విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి గుంటూరు ఎడ్యుకేషన్ : మోడల్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మెరుగుçపర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి ప్రిన్సిపాల్స్ను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ భవన్లో మంగళవారం నాలుగు జిల్లాల పరిధిలోని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ అక్షరాస్యతలో వెనుకబడిన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ తరహాలో నాణ్యమైన విద్యను అందించేందుకు స్థాపించిన మోడల్ స్కూళ్లలో విద్యార్థుల నమోదు నూరు శాతం పూర్తి చేసేందుకు పటిష్టచర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్ఈ వంటి ప్రతిభ పరీక్షల్లో ప్రతిభ చూపే విధంగా ప్రోత్సహించడంతో పాటు త్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. మోడల్ స్కూళ్ల పరిధిలో గత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్మీడియెట్లో నమోదై ఫలితాలపై సమీక్షించిన కమిషనర్ వచ్చే ఏడాది పరీక్షల్లో ఆయా పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదు చేయాలని సూచించారు. మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు అడిగారు. అనంతరం ఎఫ్ఏ–1, ఎఫ్ఏ–2, ఎస్ఏ–1 పరీక్ష ఫలితాలు, విద్యార్థుల నమోదు, ప్రతిభా అవార్డులు, ఇతర పరిపాలన అంశాలపై చర్చించారు. సమావేశంలో పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి, ఆర్ఎంఎస్ఏ డైరెక్టర్ పి.ప్రభాకర్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్, డీవైఈవోలు తదితరులు పాల్గొన్నారు.