Commonweatlh
-
24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్లో క్రికెట్!
దుబాయ్: కామన్వెల్త్ గేమ్స్లో మళ్లీ క్రికెట్ను ప్రవేశపెట్టడానికి లైన్క్లియర్ అయ్యింది. మహిళల క్రికెట్ను ఓ అంశంగా చేర్చడానికి కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) ఆమోద ముద్ర వేసింది. కొన్ని రోజుల క్రితమే కామన్వెల్త్లో మహిళల టీ20 క్రికెట్ను చేర్చడానికి అంగీకారం తెలిపిన సీజీఎఫ్.. మంగళవారం దాన్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. 2022లో ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా నిర్వహించే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్నూ ఓ అంశంగా చేరుస్తూ సీజీఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత నవంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా సమర్పించిన బిడ్ను పరిశీలించి ఆమోదించిన సంగతి తెలిసిందే. ‘ఇది మహిళా క్రికెట్ విశ్వవ్యాప్తం కావడానికి, మహిళా సాధికారత సాధనకు లభించిన గొప్ప అవకాశం’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్నే తెలిపారు. 1998లో కౌలాలంపూర్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్ను ఓ క్రీడాంశంగా చేర్చారు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. అప్పుడు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్వస్ కల్లిస్ వంటి దిగ్గజ క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ ఎప్పుడూ భాగం కాలేదు. -
కేరళ గవర్నర్ షీలాపై వేటు!
* 19 మంది గవర్నర్లను మార్చే యోచనలో బీజేపీ * ఆమెపై కామన్వెల్త్ స్కాం కేసు దర్యాప్తు యోచన * రాజీనామాకు సిద్ధమైన కర్ణాటక, గుజరాత్ గవర్నర్లు, రాష్ట్రపతితో భేటీ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ అధికారంలోకి రాగానే.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లను తొలగించి కొత్త గవర్నర్లను నియమించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కేరళ గవర్నర్గా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ను తొలగించాలంటూ బీజేపీ ఢిల్లీ విభాగం పట్టుపడుతోంది. కామన్వెల్త్ క్రీడల స్కాంలో దర్యాప్తు సంస్థలు ఆమెను ప్రశ్నించాలని బీజేపీ కోరుతోంది. మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా గత ఏడాది నవంబర్ నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోవడం, కేంద్రంలోని యూపీఏ సర్కారు షీలాను కేరళ గవర్నర్గా నియమించడం తెలిసిందే. అలా చేయటం ద్వారా అవినీతి ఆరోపణల్లో ఆమెపై దర్యాప్తు జరిపే అవకాశం లేకుండా రక్షణ కల్పించారని బీజేపీ విమర్శించింది. ఆమెపై దర్యాప్తు చేయించేందుకు కామన్వెల్త్ కేసును పునఃప్రారంభించాలని ఆ పార్టీ భావిస్తోంది. కొత్త గవర్నర్ జనరల్తోనే ఢిల్లీ ఎన్నికలు..! షీలాతో పాటు మరో 18 రాష్ట్రాల గవర్నర్లను కూడా బీజేపీ సర్కారు తొలగించనున్నట్లు చెప్తున్నారు. ఇందులో చాలా మంది కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులే. బీజేపీ సర్కారు తొలగించనున్న గవర్నర్ల జాబితాలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ పేరు అందరికన్నా ముందు ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. కర్ణాటక గవర్నర్ హన్స్రాజ్భరద్వాజ్, గుజరాత్ గవర్నర్ కమలాబేనీవాల్లు ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాను కలిసి.. తమ పదవులకు రాజీనామా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వారిద్దరూ తమ రాజీనామాలను సమర్పించేందుకు రాష్ట్రపతినీ కలిశారు.