breaking news
Company Law
-
క్రిమినల్ చర్యల నుంచి వ్యాపారాలకు ఊరట
చెన్నై: ప్రతీ సంస్థనూ అనుమానించే విధంగా చట్టాలు ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ అభిమతమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే కంపెనీల చట్టంలో వ్యాపార సంస్థలపై క్రిమినల్ చర్యలు సూచించే నిబంధనలన్నింటినీ సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రభుత్వం, వ్యాపారవర్గాల మధ్య విశ్వసనీయత పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నానీ పాల్కీవాలా స్మారకోపన్యాసం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి వేధింపులు ఉండరాదన్నారు. -
ఫైలింగ్స్లో విఫలమైన కంపెనీలకు ఊరట
న్యూఢిల్లీ: కంపెనీల చట్టం ప్రకారం వార్షిక స్టాట్యూటరీ ఫైలింగ్స్లో విఫలమైన వందలాది కంపెనీలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఈ ఫైలింగ్స్కు ఆగస్టు 15 నుంచీ అక్టోబర్ 15 వరకూ రెండు నెలలు గడువునిచ్చింది. ఈ మేరకు ‘కంపెనీ లా సెటిల్మెంట్ స్కీమ్ 2014’ పేరుతో ప్రభుత్వం బుధవారం ఒక పథకాన్ని ప్రకటించింది. తమ వార్షిక స్టాట్యూటరీ ఫైలింగ్స్ (వార్షిక రిటర్న్స్, బ్యాలెన్స్ షీట్స్)లో విఫలమైనవారు ఈ పథకాన్ని వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఆ ఆఫర్ ఉపయోగించుకునే కంపెనీలపై ఎటువంటి చట్టపరమైన చర్యలూ ఉండబోవని ప్రభుత్వం పేర్కొంది. కార్యకలాపాలు నిర్వహించని కంపెనీలు సైతం సులభతరమైన రీతిలో ఈ విషయాన్ని ఒకే ఒక్క అప్లికేషన్, ‘తగ్గించిన’ స్వల్పస్థాయి ఫీజుతో తెలియజేసుకోవచ్చని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. జూన్ నాటికి రిజిస్టరైన కంపెనీల సంఖ్య 14.02 లక్షలు కాగా, వీటిలో దాదాపు 9.74 లక్షల వరకూ మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. దాదాపు 1.42 లక్షల కంపెనీలు క్రియాశీలకంగా పనిచేయని కంపెనీల జాబితాలోకి వెళ్లాయి. వరుసగా మూడేళ్లు తమ వార్షిక ఫైలింగ్స్ దాఖలు చేయని కంపెనీలు ఈ కోవలోకి చేరుతాయి.