D. Suresbabu
-
పైరసీని ఎంకరేజ్ చేయవద్దు – డి. సురేశ్బాబు
‘‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. తరుణ్, ఇతర నటీనటులకు థ్యాంక్స్. వాళ్ల కృషికి ప్రేక్షకులు మంచి ఫలితాన్ని ఇచ్చారు. సినిమా చూసిన వారందరూ మా చిన్నతనంలో జరిగిన విషయాలను గుర్తుకు తెస్తోందని, చాలా ఎంటర్టైనింగ్గా ఉందని అంటున్నారు’’ అని నిర్మాత డి. సురేశ్బాబు అన్నారు. విశ్వక్సేన్, సాయిసుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమటం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య తారలుగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. డి. సురేశ్బాబు నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో సురేశ్బాబు మాట్లాడుతూ– ‘‘సినిమా అనేది చాలా మంది కష్టం. ఎంతోమంది భవిష్యత్ సినిమాపై ఆధారపడి ఉంటుంది. అందుకే పైరసీని ఎంకరేజ్ చేయవద్దు. సినిమా విడుదలైన కొన్ని రోజులకే డిజిటల్ ప్లాట్ఫామ్స్, శాటిలైట్ ప్లాట్ఫామ్స్లోకి వస్తున్నందున పైరసీలో చూడాల్సిన అవసరం లేదు’’ అన్నారు. ‘‘ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాను కొందరు ‘పెళ్ళిచూపులు’తో పోల్చుకుంటున్నారు. కానీ ఇది డిఫరెంట్ మూవీ. రెండింటికీ పోలిక లేదు. రివ్యూస్ అనేవి బాధ్యతతో రాయాలి. ఎందుకంటే సినిమాను చాలా కష్టపడి తీస్తాం. రివ్యూస్ వల్లనే ‘పెళ్ళిచూపులు’ పెద్ద హిట్ అయ్యింది. ‘ఈ నగరానికి ఏమైంది?’కి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. ఓ రివ్యూ చదివి డిస్ట్రబ్ అవడం వల్లే అలా మెసేజ్ పెట్టాను. ఇకపై సోషల్ మీడియాలో ఉండకూడదని నిర్ణయించుకున్నా’’ అన్నారు తరుణ్ భాస్కర్. నటీనటులు అభినవ్ గోమటం, విశ్వక్ సేన్, సాయిసుశాంత్, సిమ్రాన్ చౌదరి పాల్గొన్నారు. -
అడిగారు... కానీ చేయనన్నా!
డి.సురేశ్బాబు... అగ్ర నిర్మాత డి.రామానాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకుని చిత్ర నిర్మాణంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఆయన సోదరుడు వెంకటేశ్ అగ్ర కథానాయకుల్లో ఒకరు. తనయుడు రానా ఇప్పుడు హీరోగా, విలన్గా రాణిస్తున్నారు. అయితే మొదట్లో వెంకటేశ్ తరహాలోనే డి.సురేశ్బాబును కూడా నటునిగా చూడాలని ఆయన తండ్రి రామానాయుడు ఆశించారు. కానీ సురేశ్బాబు తెర వెనుకే ఉండటానికి నిర్ణయించుకున్నారు. ఇదంతా ఒకప్పటి విషయం. ఆయనకు తాజాగా ఓ బాలీవుడ్ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించడానికి అవకాశం వచ్చింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ హీరోగా ప్రముఖ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితం ఆధారంగా తీస్తున్న ‘అజహర్’ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం దర్శక-నిర్మాతలు ఆయనను అడిగారట. అందులో నిజానిజాల గురించి అడిగితే... ‘ఆఫర్ వచ్చిన మాట నిజమే. కానీ చేయనన్నా’ అని సురేశ్బాబు తెలిపారు. -
కంగ్రాట్స్ కాదు... థ్యాంక్స్ అంటున్నారు
-
కంగ్రాట్స్ కాదు... థ్యాంక్స్ అంటున్నారు
‘‘సినీ పరిశ్రమ సక్సెస్ వెనక పరుగులు తీస్తుందన్న విషయం నిజమే. కానీ, కిశోర్ తీసిన ‘సెకండ్ హ్యాండ్’ సినిమా సరిగ్గా లేకపోయినా, ‘స్రవంతి’ రవికిశోర్ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా కంటెంట్ను నమ్ముకుంటే ఏ సినిమా అయినా బాగా ఆడుతుందన్న నమ్మకం కలిగించారు’’ అని ప్రముఖ నిర్మాత డి. సురేశ్బాబు అన్నారు. రామ్, కీర్తీ సురేశ్ జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికి శోర్ నిర్మించిన ‘నేను...శైలజ’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలోని సెన్సిటివ్ పాయింట్ను కమర్షియల్గా ఎలా డీల్ చేయగలమా? అని తొలుత సందేహించాం. కానీ కిశోర్ అందరికీ నచ్చేలా తీశాడు. ఇదేదో సూపర్ హిట్ అని మేం గొప్పలు చెప్పట్లేదు. ఓ మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే సంతోషం వ్యక్తం చేయడానికే ఈ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నాం’’ అని చెప్పారు. రామ్ మాట్లాడుతూ- ‘‘ ‘దేవదాసు’ని మినహాయిస్తే నేను చేసినవన్నీ దాదాపుగా ఎంటర్టైనర్సే. ‘గణేశ్’ అనే సాఫ్ట్ మూవీ చే సినప్పుడు అందరూ నన్ను మాస్ సినిమాలు చేయమన్నారు. అప్పుడే ‘కందిరీగ’ చేసి, హిట్ సాధించాను. ఆ తర్వాత ‘ఎందుకంటే ప్రేమంట’ చేశాను. అనుకున్నంత ఫలితం రాలేదు. ఈసారి వేరేలా ప్రయత్నించి విజయం సాధించాం. కిశోర్ ఈ కథ చెప్పినప్పుడు నా లైఫ్లోని కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి. అలాగే మా పెదనాన్నగారికి కూడా కొన్ని కనెక్ట్ అయ్యాయి. ఇలా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయిన సినిమా ఇది. అందుకే ఈ సినిమా చూశాక అందరూ కంగ్రాట్స్ చెప్పట్లేదు... థ్యాంక్స్ అంటున్నారు’’ అని తెలిపారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రవిజయం 2016కి శుభారంభం. ఈ సినిమాలో ఎక్కడా రామ్ కనిపించడు... హరి పాత్ర మాత్రమే కనిపిస్తుంది. నాకెంతో ఇన్స్పిరేషన్ ఇచ్చిన ‘స్రవంతి’ సంస్థ నుంచి మరో మంచి సినిమా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో నటుడు చైతన్యకృష్ణ, రచయితలు భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, సినిమాటోగ్రాఫర్ సమీర్రెడ్డి, దర్శకుడు కిశోర్ తిరుమల, కళా దర్శకుడు ఏఎస్ ప్రకాశ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్లు ప్రభు, బీఏ రాజు, సురేశ్ కొండేటి, మడూరి మధు, తుమ్మల మోహన్ తదితరులు మాట్లాడారు.