DC govind reddy
-
బద్వేలు ‘దేశం’లో మూడు ముక్కలాట
సాక్షి, కడప : బద్వేలు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ముగ్గురు నేతలు మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. బిజివేముల వీరారెడ్డి మృతితో ఆయన కూతురు విజయమ్మ టీడీపీ పగ్గాలు చేతపట్టి పార్టీని నడిపిస్తున్నారు. వీరారెడ్డి మృతి సానుభూతితో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె, 2004లో డీసీ గోవిందరెడ్డి చేతిలో పరాజయం పాలయినా, తన తండ్రి వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్థానం కావడంతో 2009లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఎంపిక చేసిన కమలమ్మను బద్వేలు చరిత్రలో ఎన్నడు లేని విధంగా 36 వేల ఓట్ల మెజారిటీతో డీసీ గోవిందరెడ్డి గెలిపించారు. కమలమ్మ కాంగ్రెస్లో ఉండిపోవడంతో 2014లో వైఎస్సార్సీపీ తరపున జయరాములు పోటీ చేసి టీడీపీ అభ్యర్థి విజయజ్యోతిపై విజయం సాధించారు. ఆ తరువాత విజయమ్మకు, విజయజ్యోతికి మనస్పర్థలు ఏర్పడ్డాయి. అవి రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో జయరాములు పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిపోయారు. దాంతో అంతవరకు రెండు కత్తులున్న ఒరలో మూడుకత్తులయ్యాయి. కొన్నాళ్లకే ముగ్గురివి మూడు దారులయ్యాయి. ఈ నేప«థ్యంలో టీడీపీ అభ్యర్థిగా విజయమ్మ సూచించిన లాజరస్ను ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దానిపై తీవ్ర వ్యతిరేక రావడంతో విజయమ్మ ప్రత్యామ్నాయంగా ఓబులాపురం రాజశేఖర్ను సూచించి, ముఖ్యమంత్రితో ఆమోదముద్ర వేయించుకున్నారు. దాంతో విజయజ్యోతి రగిలిపోయారు. బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి, 2014లో ఓడిపోయినా పార్టీలో కొనసాగుతూ 2019పై ఆశతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకపోతున్న తనను కాదని ఎవరో కొత్త వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ముఖ్యమంత్రిని నిలదీయడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి చేసిన రాజీప్రయత్నాలు సఫలం కాలేదు. ఇదిలా ఉండగా బుధవారం పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెల రామస్వామి ఆలయంలో విజయమ్మ ఆమె కుమారుడు రితీష్రెడ్డి, పార్టీ నాయకులు రాజశేఖర్తో కలసి పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓ వైపు తాను ముఖ్యమంత్రితో చర్చి స్తున్న సమయంలోనే విజయమ్మ ప్రచారం షురూ చేయడం జ్యోతికి పుండుమీద కారం చల్లినట్లయింది. తనకు టీడీపీ టిక్కెట్ లభించదనే నిర్ణయానికి వచ్చిన విజయజ్యోతి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు శుక్రవారం పోరుమామిళ్లలోని వసుంధర కల్యాణమండపంలో తన వర్గీయులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కాగా, విజయజ్యోతిని గెలిపించండి అంటూ పలు పోస్టర్లు వాట్సాప్లలో చక్కర్లు కొడుతుండటం చర్చనీయాంశంగా మారింది. రగులుతున్న జయరాముడు ఇదిలా ఉండగా మరో వైపు ఎమ్మెల్యే జయరాములు కూడా తనను అధిష్టానం పట్టించుకోకపోవడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. తాను కూడా పోటీలో ఉంటానని, స్వతంత్రంగా అయినా పోటీ చేస్తానని, తన వర్గీయులతో అంటున్నట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం బద్వేలు టీడీపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. -
ఏకగ్రీవం కానున్న ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు
-
ఏకగ్రీవం కానున్న ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం పూర్తయింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఐదు స్థానాలకు గాను ఐదుగురే నామినేషన్లు వేశారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిభాభారతి, ఎంఎ షరీఫ్, టీడీ జనార్ధనరావు నామినేషన్లు వేశారు. బీజేపీ తరపున సోము వీర్రాజు నామివేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ తరపున డీసీ గోవిందరెడ్డి బుధవారమే నామినేషన్ వేశారు. వీటిని పరిశీలించిన తర్వాత ఎన్నిక ఏకగ్రీవమని శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించే అవకాశముంది. -
జగన్ దీక్షకు వెల్లువెత్తిన మద్దతు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : రాష్ట్ర విభజనలో సమన్యాయం డిమాండ్ చేస్తూ చంచలగూడ జైలులో మూడో రోజు ఆమరణ దీక్షలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడిక్డి జిల్లాలో సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఆ పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. తాము మీ వెంటే అంటూ సంఘీభావ దీక్షలు చేపడుతున్నారు. జిల్లాలో దీక్షా శిబిరాలను ఆ పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు డీసీ గోవిందరెడ్డి మంగళవారం సందర్శించారు. దీక్షలో ఉన్న నాయకులను పరామర్శించారు. అలాగే జగన్మోహన్రెడ్డికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన ఆం దోళన కార్యక్రమాల్లోనూ గోవిందరెడ్డి పాల్గొన్నారు. గూడూరు సమీపంలోని పోటుపాళెం క్రాస్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చెంతాటి బాలచెన్నయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని గోవిందరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ మేరిగ మురళి సందర్శించారు. ఇంకా పలువురు పార్టీ జిల్లా నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి బాలచెన్నయ్యకు మద్దతు ప్రకటించారు. బుజబుజ నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులు గోవిందరెడ్డి, జిల్లా కన్వీనర్ మే రిగ మురళీధర్, కాకాణి గోవర్ధన్రెడ్డి, పోలుబోయిన అనిల్కుమార్ హాజరయ్యారు. గూడూరులో పాతబస్టాండ్ సమీపంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్కుమార్ విద్యార్థులతో కలసి రెండో రోజు రిలేదీక్షలు నిర్వహించారు. ఆస్పత్రి రోడ్డులో పాతమోతిమహల్ కూడలి వద్ద బత్తిని విజయ్కుమార్ కూడా రెండో రోజు రిలేదీక్ష నిర్వహించారు. చిల్లకూరు మండలంలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణు లు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ గోవిందరెడ్డి, పా ర్టీ జిల్లా అధ్యక్షులు మేరిగ మురళి, తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్టీరిగ్ కమిటీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు వాకాడులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మర్రిపాడు మండలం తెగళ్లపాడు ఎస్సీ కాలనీ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులు, కొండారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మనుబోలు జాతీయ రహదారిపై భారీ ప్రదర్శన, రాస్తారోకో జరిపారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్ష మూడోరోజుకు చేరింది. మూడోరోజు పట్టణంలోని యువకులు ముందుకొచ్చి జగనన్న దీక్షకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. దొరవారిసత్రంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్ష నాలుగోరోజుకు చేరుకుంది. కావలిలో గాంధీబొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు రిలేనిరాహార దీక్షలను చేపట్టారు. వైఎస్సార్సీపీ కావలి రూరల్ మండల కన్వీనర్ చింతం బాబుల్రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాలడుగు వెంకట్రావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జరుగుమల్లి రామారావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండల కేంద్రంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. జలదంకి పంచాయతీ బస్టాండ్ ఆవరణలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యా యి. సైదాపురంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్షచేపట్టారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.