Doctor Rajiv Sharma
-
గ్రూప్-2 కోసం పక్కా ఏర్పాట్లు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 11, 13 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 రాత పరీక్షలను నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్శర్మ ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైనన్ని ప్రత్యేక బస్సులు నడిపించాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్తుపరంగా అంతరాయం లేకుండా చూడటంతోపాటు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం అరుుంది. జిల్లా కలెక్టర్లతోనూ ఏర్పాట్లపై సమీక్షించింది. నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలున్న విద్యా సంస్థలకు 12న సెలవు ఈ నెల 11, 13వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని గ్రూప్-2 పరీక్ష కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలకు ఈ నెల 12వ తేదీన సెలవు దినమేనని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వాస్తవానికి 12వ తేదీ రెండో శనివారం సెలవు దినమే. కానీ వినాయక నిమజ్జనం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో సెప్టెంబరు 15వ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. దానికి ప్రత్యా మ్నాయంగా ఈ నెల 12న పాఠశాలలు నిర్వహించాలని పేర్కొంది. అరుుతే గ్రూప్-2 రాత పరీక్ష 11వ తేదీన, 13వ తేదీన ఉంది. 12వ తేదీన కనుక జీహెచ్ఎంసీ పరిధిలో గ్రూప్-2 పరీక్ష కేంద్రాలున్న విద్యాసంస్థలు కొనసాగితే ఆ పరీక్ష కేంద్రాల్లో 11వ తేదీన పరీక్ష కోసం వేసిన హాల్టికెట్ల నంబర్లను 12వ తేదీన విద్యార్థులు తుడిచివేసే అవకాశముంది. మళ్లీ 13వ తేదీన పరీక్ష ఉన్నందున 12న మళ్లీ హాల్టికెట్ నంబరు వేయాలంటే కష్టంగా మారనుంది. దీంతో 12న సెలవు దినంగా ప్రకటించింది. విద్యాశాఖతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రాలున్న విద్యా సంస్థలకే ఇది వర్తిస్తుంది. మిగతా విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగుతాయి. -
టీ సర్కారుకు ఆర్బీఐ షాక్
-
రుణభారం మీదే
* మాఫీపై టీ సర్కారుకు తేల్చి చెప్పిన ఆర్బీఐ గవర్నర్ * ముందుగా రైతులు రుణాలు చెల్లించేలా చూడాలి * తర్వాత ప్రభుత్వం వాయిదాల్లో రైతులకు ఇవ్వాలి * బ్యాంకులను భాగస్వాములను చేయొద్దు * ఆరేడేళ్లలో వడ్డీతో సహా చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు నో * ఇలాంటి చర్యలు బ్యాంకుల ఆర్థిక స్థితిని దిగజార్చుతాయన్న ఆర్బీఐ సాక్షి, హైదరాబాద్: రైతు రుణాల మాఫీ విషయంలో తెలంగాణ సర్కారుకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది! ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ తన వైఖరిని ఏమాత్రం సడలించలేదు. రుణ మాఫీ నిర్ణయం ప్రభుత్వ ఇష్టమని, ఇందులో బ్యాంకులను భాగస్వాములను చేయరాదని తేల్చి చెప్పింది. రైతులు ముందుగా బ్యాంకులకు రుణాలు చెల్లించేలా చర్యలు తీసుకుని, ఆ మొత్తాన్ని తర్వాత రైతులకు ప్రభుత్వం వాయిదాల్లో చెల్లించుకోవాలని సూటిగా స్పష్టం చేసింది. లక్ష రూపాయల్లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీని అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అనుసరించే విధానంపై ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణా రావుతో కూడిన బృందం శుక్రవారం ముంబైలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్తో భేటీ అయింది. రుణ మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు వివరించారు. దీనికి ఆమోదం తెలపాలని, మాఫీ మొత్తాన్ని ఆరేడు సంవత్సరాల్లో బ్యాంకులకు వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఇందుకు ఆర్బీఐ గవర్నర్ నుంచి సానుకూల స్పందన రానట్లు తెలిసింది. ‘రుణ మాఫీ అంశంలో బ్యాంకులను భాగస్వాములను చేయకండి. ముందుగా రైతులు తీసుకున్న రుణాలను చెల్లించేలా చర్యలు తీసుకోండి. ఆ మొత్తాన్ని తర్వాత ప్రభుత్వం నుంచి ఎన్ని వాయిదాల్లో అయినా రైతులకు వెనక్కి ఇవ్వండి(రీయింబర్స్). ఇలాంటి(రుణ మాఫీ) చర్యలు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తాయి’ అని వ్యాఖ్యానించినట్లు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ నుంచి ఊహించని సమాధానం రావడంతో రాష్ర్ట ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. తొలుత రుణ మాఫీతో రాష్ర్ట ప్రభుత్వంపై రూ. 17 వేల కోట్ల మేర భారం పడుతుందని, 25 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. మాఫీ మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తనున్న దృష్ట్యా ఈ భారాన్ని రూ. పదివేల కోట్లకే పరిమితం చేయాలని సర్కారు భావించింది. రుణాలకు ఏడాది పరి మితి విధించనున్నట్లు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే సంకేతాలు కూడా ఇచ్చింది. అయితే రైతులు, రాజకీయపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. బంగారం తాకట్టు రుణాలు సహా ఎలాంటి పరిమితి లేకుండా లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో రుణాల చెల్లింపు మార్గాలపై, నిధుల సమీకరణపై ప్రభుత్వ వర్గాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. రైతులకు భారం లేకుండా రుణాలను ఆరేడు సంవత్సరాలకు రీ-షెడ్యూల్ చేయాలని, ఆ వాయిదాల మొ త్తాన్ని వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లిస్తుందని బ్యాంకులకు ప్రతిపాదిస్తున్నాయి. అవసరమైతే ప్రభుత్వ భూములను తనఖా పెడతామని, ప్రభుత్వ ఖాతాలను పూర్తిగా ఈ బ్యాంకుల్లోనే ఉంచుతామని కూడా అధికారులు పేర్కొంటున్నారు. అయితే బాండ్ల జారీ, రుణాల రీ షెడ్యూల్ వంటివి చేపట్టడం అసాధ్యమని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. ఇలాంటి వాటితో తమ ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుందని ఇప్పటికే ఒకట్రెండు ప్రభుత్వ బ్యాంకులు బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ విషయంలో పాటించే విధానాన్ని ఖరారు చేసుకునేందుకు ఆర్బీఐ గవర్నర్తో రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు భేటీ అయ్యాయి. అయితే రుణ మాఫీని గవర్నర్ నేరుగా తిరస్కరించకుండా... అది ప్రభుత్వ బాధ్యతేనని, తమకు సంబంధం లేదన్న సంకేతాలిచ్చారు. -
రుణ మాఫీపై ఆర్బీఐతో భేటీ నేడు
-
రుణ మాఫీపై ఆర్బీఐతో భేటీ నేడు
* ముంబైకి వెళ్తున్న ఆర్థిక సలహాదారు, సీఎస్ బృందం * అన్ని అంశాలపై ఆర్బీఐ గవర్నర్తో చర్చ * ప్రభుత్వ విధానాన్ని వెల్లడించనున్న అధికారులు * ఎలాగైనా అనుమతి పొందేందుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్న రుణ మాఫీ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం మరో అడుగేస్తోంది. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)తో చర్చించేందుకు ఉన్నతాధికారుల బృందం శుక్రవారం ముంబై వెళుతోంది. అక్కడ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్తో ఈ బృందం భేటీ కానుంది. రైతులకు లక్ష రూపాయల్లోపు రుణాల రద్దుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దాని అమలు విషయంలో అనుసరించే విధానంపై రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీని కోసమే ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కూడిన బృందం ఆర్బీఐ గవర్నర్తో చర్చలు జరపనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలు కోరడంతోపాటు, రుణ మాఫీ ద్వారా బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేసేది కూడా రాజన్కు అధికారులు వివరించనున్నారు. రుణ మాఫీపై సీమాంధ్ర ప్రతినిధులు ఇదివరకే రిజర్వ్ బ్యాంకు గవర్నర్తో భేటీ అయిన సంగతి విదితమే. అయితే వారికి సానుకూల సంకేతాలేవీ రాలేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కూడా తన వంతుగా ఆర్బీఐని మెప్పించే ప్రయత్నం చేయాలని భావిస్తోంది. రుణ మాఫీతో రాష్ర్ట ప్రభుత్వంపై దాదాపు రూ. 17 వేల కోట్ల మేర భారం పడుతుందని ఇప్పటికే అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వల్ల 25 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందే అవకాశముంది. ఇదే విషయాన్ని అధికారులు.. ఆర్బీఐకి వివరించనున్నారు. పంటల దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో రైతులు కష్టాల్లో ఉన్నారని, వారికి రుణ మాఫీ చేస్తే తప్ప నష్టాల ఊబి నుంచి బయటపడలేని పరిస్థితి ఉందని వివరించనున్నారు. రుణ మొత్తాన్ని బ్యాంకులకు దశలవారీగా చెల్లిస్తామని చెప్పనున్నారు. రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉన్నందున చెల్లింపు పెద్ద కష్టం కాదని, నాలుగైదేళ్లలో వడ్డీతో సహా రుణ మాఫీ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్బీఐకి వివరించే అవకాశముంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు వెంటనే కొత్త రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని రాజన్ను కోరనున్నారు. ఈ భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మతో గురువారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి భేటీ అయ్యారు. మరోవైపు ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్రెడ్డి సైతం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందున రుణ మాఫీకి ఆర్బీఐని మెప్పించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. బాండ్ల జారీ, భూముల తాకట్టు అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించనున్నట్లు అవి పేర్కొన్నాయి.