రూ.999కే స్పైస్జెట్ టికెట్
న్యూఢిల్లీ: ‘ట్రావెల్ లైట్-సేవ్ మోర్’ ఆఫర్ కింద ఏసీ-2 టైర్ రైలు టికెట్ ధరలతో పోలిస్తే తక్కువ ధరలకే దేశీ విమాన టికెట్ను అందిస్తోంది ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్. ఈ సంస్థ కేవలం రూ.999 ధరతో దాదాపు 1.50 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. సోమవారం ప్రారంభమైన ‘ట్రావెల్ లైట్-సేవ్ మోర్’ డిస్కౌంట్ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ టికెట్ తీసుకున్నవారు మూడు నెలల (జూలై 1-అక్టోబర్ 15) సమయంలో ఎప్పుడైన ప్రయాణం చేయవచ్చు.