ఏసీబీ చార్జ్షీట్లో నిమ్స్ వైద్యుల పేర్లు
హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో పరికరాల కొనుగోలు అవకతవకలపై ఏసీబీ గురువారం దాఖలు చేసింది. మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ తన చార్జ్షీట్లో పేర్కొంది. పరికరాల కోసం రూ. 10 కోట్ల టెండర్లలో రూ. 3.14 కోట్ల మేర అవినీతి జరిగిందని ఏసీబీ తెలిపింది. అలాగే మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్తోపాటు ఆసుపత్రి వైద్యులు ముకుందరెడ్డి, సూర్యప్రకాశ్రెడ్డి, వికాస్ కన్నా పేర్లను కూడా చార్జ్షీటులో ఏసీబీ చేర్చింది.