Drinking Water Front of Telangana
-
మినరల్ కాదు.. జనరల్
ప్రజల తాగునీటి అవసరాలను ఆసరా చేసుకున్నారు ఆ వ్యాపారులు. నీరున్న ప్రాంతం.. రవాణాకు అనువుగా ఉండే ప్రదేశంలో గది అద్దెకు తీసుకుని బోరేసుకుంటారు. మూడు ఆటోలు, వంద క్యాన్లు కొనుగోలు చేసి.. నలుగురు మనుషులను వర్కర్లుగా పెట్టుకుంటారు. ఉదయం లేచింది మొదలు పొద్దుపోయే వరకు మోటారుతో క్యాన్లలో నీటిని నింపుతూ.. వీధుల్లో రయ్యరయ్య తిరుగుతూ విక్రయిస్తుంటారు. డబ్బులు పెట్టి కొంటున్నాం కదా.. మినరల్ వాటరే తాగుతున్నాం అనుకుంటారు. కానీ.. అవన్నీ జనరల్ వాటర్ అనే విషయం సామాన్య ప్రజలకు తెలియదు. జిల్లాలో అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నా.. మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం కొనసాగుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. సంబంధిత అధికారులు అనుమతి లేని ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడకపోవడంతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో అనుమతి పొందిన ప్లాంట్ల కంటే లేనివే ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మంరూరల్: జిల్లా కేంద్రంతోపాటు మున్సిపాలిటీలు, చిన్న పట్టణాల్లో సుమారు 1,026 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో మూడొంతులకు పైగా అనుమ తి లేకుండా నడిచే ప్లాంట్లే ఉండడం గమనార్హం. కొందరు వ్యాపారులు సంపాదనే లక్ష్యం గా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్లాంటు నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎటువం టి అనుమతులు తీసుకోకుండా.. మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లోపించిన నీటిని క్యాన్ ఒక్కంటికి రూ.10 నుంచి రూ.15 చొప్పున విక్రయిస్తూ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. బస్టాండ్లు, దుకాణాల్లో నీళ్లు అమ్మే వ్యాపారులు ప్లాంట్ల నిర్వాహకులతో కుమ్మక్కై లీటర్ నీళ్ల బాటిల్ రూ.4 నుంచి రూ.5 వరకు అమ్ముతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ఇదంతా యథేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టానుసారంగా లిక్విడ్ వినియోగం.. నీటిని శుద్ధి చేయడానికి మినరల్ వాటర్ ప్లాంట్లలో డోజింగ్ లిక్విడ్ను వినియోగి స్తుం టారు. ఈ లిక్విడ్ను 20 లీటర్ల శుద్ధి జలాన్ని తయారు చేసేందుకు 100 నుంచి 150 గ్రాముల వరకు ఉపయోగిస్తారు. మిషన్ ద్వారా పంపించిన లిక్విడ్ నీటిని శుద్ధి చేసి.. వృథా నీటి ద్వారా బయటకు వస్తుంది. చాలా వాటర్ ప్లాంట్లలో ఈ లిక్విడ్ను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లలో నీటిని శుద్ధి చేయడానికి నీటిలో ఫ్లోరైడ్ శాతాన్ని లెక్కించి నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. నీటిలో ఫ్లోరైడ్ శాతం 1000 నుంచి 1500 శాతానికి పైగా ఉంటే.. ఆ నీటిని శుద్ధి చేస్తే అధిక శాతం నీరు వృథా అవుతుంది. దీంతో అత్యధిక శాతం నీరు నిరుపయోగంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వరు. ప్లాంట్ స్థాపనకు ఉండాల్సిన నిబంధనలిలా.. వాటర్ ప్లాంట్లు నిర్వహించాలంటే ప్లాంట్లలో మినరల్తోపాటు కెమిస్ట్ మైక్రోబయాలజీ ల్యాబ్ కలిగి ఉండాలి. ఆయా ల్యాబ్లలో నీటి పరీక్షలు చేసేందుకు సల్ఫ్యూరిక్ ఆమ్లం వంటి 108 రకాల కెమికల్స్ అవసరం ఉంటుంది. ప్రతి రోజూ ఫిజికల్ టెస్టులు (రంగు, రుచి, వాసన పీహెచ్ హైడ్రోజన్ ఆయాన్ కాన్సంట్రేషన్) నిర్వహించాలి. ఫ్లోరైడ్, క్లోరైడ్ పరీక్షలు జరపాలి. క్వాలిటీ టెక్నీషియన్లు ఉండాలి. నిత్యం శుభ్రమైన వాటర్ క్యాన్లను వినియోగించాలి. మూడు నెలలకు ఒకసారి క్యాన్లను మార్చాలి. వాటర్ క్యాన్లపై మాన్యుఫ్యాక్చరింగ్ తేదీ, బ్యాచ్ నంబర్, ఎక్స్పైరీ తేదీ తదితర సమాచారం ఉండాలి. ఫ్యూరీఫై చేసిన తర్వాత నీటిని కనీసం 24 గంటలు నిల్వ ఉండాలి. వాటర్ ఫిల్లింగ్ ఏసీలో జరపాలి. వాటర్ ట్యాంక్లపై తప్పనిసరిగా మూతలు ఉండాలి. డ్రెస్సింగ్ గది, ప్రొడక్షన్ రూం, ఫిల్లింగ్ గదులు ఉండాలి. రోజుకు నాలుగు గంటలకోసారి నీటి పరీక్షలు జరపాలి. కానీ.. ఇటువంటి నిబంధనలను జిల్లాలోని వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు కనీసం 25 శాతం కూడా పాటించడం లేదని తెలుస్తోంది. ప్లాంట్ల నిర్వహణ కోసం అనుమతులు లేకుండా బోర్లు వేస్తున్నా.. రెవెన్యూ, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా బోర్ వేయాలంటే భూగర్భ జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారుల అనుమతి తప్పక తీసుకోవాలి. కానీ.. నిర్వాహకులు అటువంటి నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా బోర్లు వేస్తుండడంతో భూగర్భ జలాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ప్లాంట్ నిర్వాహకులు బోర్లు వేసి.. వాటి నుంచి సుమారుగా 10వేల లీటర్ల నీటిని తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతంలోని బోర్లు, బావుల్లో నీరు ఇంకిపోయి ప్రజలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వేసవి కాలంలో వారి పరిస్థితి చెప్పలేకుండా ఉంది. శుద్ధ జలానికే ప్రజల మొగ్గు.. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణాలు, గ్రామీణ ప్రాం తాలు అనే తేడా లేకుండా శుద్ధి చేసిన జలాలను తాగేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న ప్లాంట్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా నీటిని అందించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాల్లో అధిక శాతం మినరల్ వాటర్ వ్యాపారులు క్యాన్లను ఆర్డర్ ప్రకారం ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, విందులు, వినోదాల్లో కూల్ వాటర్ను కొందరు వినియోగిస్తున్నారు. కూల్ వాటర్ క్యాన్ రూ.40 నుంచి రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. గృహావసరాలకే కాకుండా వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, హోటళ్లలో ఫ్యూరిఫైడ్ నీటినే వినియోగిస్తున్నారు. మార్కెట్లో ఉన్న పోటీ నిమిత్తం పలువురు వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, బేకరీల నిర్వాహకులు శుద్ధ జలాన్ని వినియోగదారులకు అందించాలని కోరుకుంటారు. వివాహాది శుభకార్యాలకు వేలాది లీటర్ల మినరల్ వాటర్ను వినియోగిస్తున్నారు. అనుమతి లేని ప్లాంట్ల ద్వారా సరఫరా అయ్యే నీరు కలుషితం అవుతుండడం.. వాటిని ప్రజలు సేవిస్తుండడంతో 80 శాతం మంది వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారని వైద్యులే స్వయం గా పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు సురక్షితమైన తాగునీటి కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నా రు. సురక్షితమైన తాగునీటి కోసం సంపన్న వర్గాల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి నెల కొం త సొమ్మును వెచ్చించడం ప్రస్తుతం తప్పనిసరి అయింది. గతంలో వేసవి కాలానికే పరిమితమైన శుద్ధ జలం వినియోగం ఇప్పుడు ఏడాది పొడవునా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అనుమతి లేని ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒళ్లంతా నొప్పులే.. గ్రామాల్లో ఎలాగూ పరిశుభ్రమైన తాగునీరు అందించరు. దీంతో డబ్బులు పెట్టి మరీ కొనుక్కు న్న మినరల్ వాటర్ తాగితే ఒళ్లం తా నొప్పులుగా ఉం టుంది. పైగా నీళ్లు తాగినప్పుడే తీపిగా ఉంటున్నాయి. ఆ తర్వాత మళ్లీ దాహం వేస్తుంది. ఆరోగ్యం కోసం మినరల్ వాటర్ తాగితే అవి మినరల్ నీళ్లో, జనరల్ నీళ్లో తెలియడం లేదు. – కర్లపూడి వెంకటేశ్వర్లు, మద్దులపల్లి తనిఖీలు చేయాలి.. పరిమితికి మించి నీటిలో రసాయనాలు కలపడం వల్ల ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి. నీటి పరీక్షలు చేయించి నిబంధనల ప్రకారమే మినరల్స్ ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలి. పైగా మినరల్ క్యాన్ల ధరలు కూడా ఇష్టానుసారం పెంచుతున్నారు. వాటిని కట్టడి చేయాలి. – యాట శ్రీను, కామంచికల్ నిబంధనల మేరకే అనుమతులు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ముందుగా టీఎస్ ఐపాస్కు దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి ఎంతమేరకు.. ఎన్ని అడుగు లు బోర్ వేయవచ్చనేది పరిశీలించి అనుమతి ఇస్తాం. ప్లాంట్లో బోర్ వేయాలంటే నాలుగు నిబంధనలు పాటించాలి. సేఫ్ ఏరియా, సెమీ క్రిటికల్, క్రిటికల్, వెరీ క్రిటికల్ నిబంధనలుం టాయి. వీటిలో క్రిటికల్, వెరీ క్రిటికల్ పరిస్థితి ఉన్నచోట బోరు వేసేందుకు అనుమతి ఇవ్వం. అలా జిల్లాలో చాలా వరకు బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వలేదు. వాల్టా చట్టం ప్రకారం బోరుకు బోరుకు మధ్య దూరం 300 మీటర్లు పాటించాలి. రోజుకు 500 కిలో లీటర్ల నీరు తోడేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మించి ఉన్నట్లయితే అనుమతి ఇవ్వడం కుదరదు. – రాకేష్చందర్, భూగర్భ జలవనరుల శాఖ డీడీ -
పక్కాగా తాగునీటి లెక్క : కేసీఆర్
-
పక్కాగా తాగునీటి లెక్క
ప్రతి పల్లెకూ నీరందించాలి: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మంచినీటికి రిజర్వు చేశాం. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా నీటి అవసరమెంత అన్న లెక్కలేసుకొని తాగునీటిని అందించాలి..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందుబాటులోకి వస్తాయని, దీంతో పాత వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్కు తాగునీరందుతుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఆపరేషన్ మాన్యువల్స్ రూపొందించాలని, రాష్ట్ర నీటి అవసరాలను తీర్చేందుకు ‘డ్రింకింగ్ వాటర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తికి సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఎన్ని నీళ్లు కావాలో లెక్కలేసి, వాటి వినియోగానికి సంబంధించి ‘పవర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ భూముల రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఉన్నతస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు. మంగళవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి వ్యవసాయం, నీటి పారుదల, మిషన్ భగీరథ, రెవెన్యూ శాఖలపై సంయుక్త సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్కే జోషీ, బీఆర్ మీనా, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్రావు, నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్, మిషన్ భగీరథ ఈఎన్సీ సురేందర్రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ‘‘మిషన్ భగీరథ అధికారులు రెండు రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడున్న నీటి లభ్యత, వనరులను బట్టి వచ్చే ఏడాది జూలై నాటికి ఉండే పరిస్థితిని అంచనా వేసి ఒక ప్రణాళిక వేసుకోవాలి. కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత శాశ్వత ప్రణాళిక తయారు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా నీటి అవసరాలపై లెక్కలేసుకొని తాగునీరు అందించాలి’అని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. హైదరాబాద్ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా తలపెట్టిన రెండు రిజర్వాయర్ల నిర్మాణం వేగంగా జరగాలని చెప్పారు. మండలానికో రిజిస్ట్రార్ కార్యాలయం ప్రతీ మండలానికో రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయాలు, రిజిస్ట్రార్లను యథావిధిగా కొనసాగిస్తూ రిజిస్ట్రార్ కార్యాలయాలు లేని మండలాల్లో కొత్తవి నెలకొల్పాలని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే రిజిస్ట్రార్ కార్యాలయాలకు రిజిస్ట్రార్లుగా మండల రెవెన్యూ అధికారికే అదనపు బాధ్యతలు అప్పగించాల న్నారు. అవినీతికి, జాప్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ విభాగంలో సంస్కరణలు అమలు చేస్తున్నామ న్నారు. మండల స్థాయిలోనే రిజిస్ట్రార్ కార్యాలయం ఉండటం వల్ల ప్రజల కు మేలు జరుగుతుం దని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయా ల్లో భూ రికార్డుల నిర్వహ ణకు, కోర్ బ్యాంకింగ్ తరహాలో భూముల క్రయవిక్ర యాల వివరాల నమోదుకు వెయ్యి మంది ఐటీ అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. రిజిస్ట్రేషన్ అయిన రోజే మ్యుటేషన్ కూడా పూర్తి కావాలన్నారు. పహాణీలు సరళతరం చేయండి ప్రస్తుతం పహాణీలో ఉన్న 31 కాలమ్స్ అవసరమా.. లేదా అన్న అంశంపై ఆలోచన చేసి, వాటిని సరళతరం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ‘‘గతంలో భూమి శిస్తు వసూలు చేసే వారు. దానికి అనుగుణంగా పహాణీలు తయారు చేశారు. కానీ ఇప్పుడు భూమి శిస్తు లేదు. పైగా ప్రభుత్వమే ఎకరాకు రూ. 8 వేల చొప్పున పెట్టుబడి అందించనుంది. అందుకే పహాణీల్లో అక్కర్లేని కాలమ్స్ తొలగించాలి. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, అటవీ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉన్న భూముల రికార్డులు ప్రత్యేకంగా నిర్వహించాలి. భూ వివాదాలకు సంబంధించి ఇన్ని కోర్టులు అవసరం లేదు. కలెక్టర్ కోర్టు ఒక్కటే ఉండాలి. మిగతావి రద్దు చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకాల్లో, పహాణీల్లో వాడే భాష సరళంగా, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. అర్థం కాని పదా ల బదులు అందరికీ అర్థమయ్యే తెలుగు భాషను వాడాలి. పహాణీలను కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండాలి. వ్యవసాయ శాఖకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రత్యేకమైన బడ్జెట్ రూపొందిస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి, విధి విధానాలను ఖరారు చేయాలి’’అని సూచించారు. ప్రతి ప్రాజెక్టుకూ మాన్యువల్ ‘‘గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులు కడుతున్నాం. ఏ ప్రాజెక్టు నుంచి సాగునీరు ఎంతివ్వాలి? మంచినీరు ఎంతివ్వాలి? విద్యుత్ కేంద్రాలకు ఎంత నీరు ఇవ్వాలి? పరిశ్రమలకు ఎంతివ్వాలి? అనే విషయాల్లో స్పష్టత ఉండాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రాజెక్టుల్లో చేరిన నీరును కూడా ప్రాధాన్యతల వారీగా విడుదల చేయాలని చెప్పారు. అందుకు తగిన ప్రత్యేక విధానం అమలు చేయాలని సూచించారు. ‘‘రాష్ట్ర రాజధాని నుంచి వచ్చే సూచనలు, ఆదే శాలను పరిగణనలోకి తీసుకొని నీటిని విడుదల చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల నీటి వినియోగం విషయంలో పరిస్థితులను బట్టి వ్యవహరించేం దుకు ‘డ్రింకింగ్ వాటర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ’ ను నెలకొల్పాలి. ఇలాగే పవర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణను ఏర్పాటు చేయాలి. ఏ ప్రాజెక్టు నుంచి ఏ విద్యుత్ కేంద్రానికి ఎంత నీరు అవసరం.. వాటినెలా పొందాలో స్పష్టమైన అంచనాకు రావాలి. పరిశ్రమలకు కూడా ఇదే విధమైన ఏర్పాటు ఉండాలి’’అని వివరించారు. 31న వ్యవసాయాధికారుల సమావేశం ఈ నెల 31న హైదరాబా ద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవ సాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయాధి కారుల సమావేశం జరగనుంది. ఇందులో ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితుల నిర్మాణం, రైతు వేదికల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి అధికారులు ఈ సమావేశంలో చర్చిస్తారు. రేపు కలెక్టర్ల సమావేశం భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరగాల్సిన కార్యక్రమాలపై మార్గనిర్దేశనం చేసేందుకు గురువారం (ఈ నెల 31న) జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం రోజంతా కొనసాగనుంది. సెప్టెంబర్ 1 నుంచి రైతు సమన్వయ కమిటీల నియామకం, సెప్టెంబర్ 15 నుంచి రికార్డుల పరిశీలన ప్రారంభమవుతుంది. రికార్డుల ప్రక్షాళన, రికార్డుల నిర్వహణ, పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులు, పహాణీ పత్రాల్లో మార్పులు, రిజిస్ట్రేషన్ విషయంలో సంస్కరణలు తదితర అంశాలపై విధివిధానాలకు తుదిరూపమిచ్చి కలెక్టర్ల సమావేశంలో వెల్లడించాలని సీఎం నిర్ణయించారు.