East Godavari District News
-
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఇలా షెడ్ చేసుకున్నారు!
● సచివాలయం ఆవరణలో కారు షెడ్డు నిర్మించిన తెలుగు తమ్ముడు ● తమ్ముడికి అండగా అక్క ● కళ్లు మూసుకున్న అధికార యంత్రాంగం రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వంలో చెలరేగిపోతున్న అక్రమార్కులు.. తమ వ్యవహారాలకు అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ఈ బరితెగింపు ఏ స్థాయికి చేరిందంటే ప్రభుత్వ భవనాల ప్రాంగణాలను కూడా అక్రమించుకునేంత వరకు వెళ్లిపోయింది. ఇటీవల బొమ్మూరు గ్రామంలోని శ్మశానంలో 30 వేప చెట్లు అక్రమంగా అమ్మేసుకోవడం, రజకుల చెరువు గట్టుపై తుమ్మచెట్లను అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా తొలగించి సొమ్ము చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా బొమ్మూరు రాఘవేంద్రనగర్కాలనీలోని సచివాలయం–3 ప్రాంగణంలో ఆ ప్రాంత తెలుగు తమ్ముడు రేకులతో షెడ్డును నిర్మించి, అందులో కారును పెట్టుకుంటూ తమ ఘనతను చాటుకుంటున్నారు. ఇదేదో తాత్కాలికంగా పార్కింగ్ చేసుకుంటున్నారనుకునేరు.. పక్కాగా షెడ్డును నిర్మించి మరీ శాశ్వత పార్కింగ్ను ఏర్పాటు చేసుకోవడాన్ని చూసిన గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరో అడుగు ముందుకేసి కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తెలుగు తమ్ముడు మాత్రం పైనుంచి కింద వరకు మాదే అధికారం మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ.. కారును, షెడ్డును మాత్రం అలాగే ఉంచేశాడు. సదరు ఆక్రమణ దారుడికి తోడు రూరల్ నియోజకవర్గంలో నెంబర్ 2 నేనే అంటూ చెప్పుకుంటున్న అక్క కూడా అండగా ఉన్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. సదరు అక్క నేరుగా గ్రామ ప్రత్యేకాధికారి అయిన నగరపాలకసంస్థ కమిషనర్కు ఈ షెడ్డు జోలికి వెళ్లొద్దంటూ రికమెండ్ చేశారంటున్నారు. దీంతో ఇక మాకేం అడ్డు అనుకుంటూ కారును దర్జాగానే పార్క్ చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు ఈ విషయంపై తగు చర్యలు చేపట్టకపోతే.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న కమిషనర్ కార్యాలయం వద్దకే ప్రజాందోళన చేరేలా కన్పిస్తోంది. -
లీక్పై అవగాహన అవసరం
పోచవరం వద్ద హెచ్పీసీఎల్, గెయిల్ ఇండియా ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ తాళ్లపూడి: ఆయిల్, గ్యాస్పైపు లైన్ వెళుతున్న భూములలో రైతులు ఏ విధమైన తవ్వకాలు చేయరాదని, పైప్లైన్ లీకయిన సమయంలో తమకు తక్షణం సమాచారం ఇవ్వాలని డిప్యుటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్. త్రినాథరావు అన్నారు. మండలంలోని పోచవరం వద్ద మంగళవారం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెపీసీఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) ఆధ్వర్యంలో ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. వైజాగ్ నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వరకు భూమి లోపల పక్కపక్కనే వెళుతున్న హెచ్పీసీఎల్ పెట్రోల్, గెయిల్ గ్యాస్ పైప్లైన్లు ఉన్న ప్రాంతంలో ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు, ప్రజలకు, సమీపంలోని ఫ్యాక్టరీల సిబ్బందికి అవగాహన కల్పించారు. పంట పొలాల్లోంచి వెళ్లిన పైప్ లైన్ లీక్ అయితే ఆ ఏరియాలో వుండే ప్రతినిధికి సమాచారం అందిస్తే వెంటనే ఫైర్ ఇంజన్, పెట్రోల్ను నింపుకునే వాహనం, అంబులెన్స్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ప్రమాదాన్ని ఎలా నివారిస్తారో ప్రత్యక్షంగా చేసి చూపారు. లీకవుతున్న పెట్రోల్, మంటలను అదుపు చేసే విధానాలను, గాయపడిన వారిని తరలించడం తెలియజేశారు. ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ పింటు నంది, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ వాణిధర్ రామన్, డీఎఫ్వో మార్టిన్ లూథర్ కింగ్, హెచ్పీసీఎల్ చీఫ్ మేనేజర్ పంకజ్ కుమార్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ జి.స్వాతి, గెయిల్ డీజీఎం ఎం.భట్టాచార్య, ఆర్టీవో సీహెచ్ సంపత్ కుమార్, ఇన్చార్జి తహసీల్దార్ మోహన భారతి, తాళ్లపూడి పీహెచ్సీ వైధ్యాధికారి హారిక గుప్తా, పంచాయతీ కార్యదర్శి రామలక్ష్మి బీఆర్వో సాయి, గజ్జరం సర్పంచ్ గండి రాంబాబు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పిట్టా శ్రీను పాల్గొన్నారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
జగ్గంపేట: మోటారు సైకిల్ను వెనుక నుంచి కారు ఢీ కొన్న ప్రమాదంలో మంగళవారం ఒక వ్యక్తి మృతి చెందాడు. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల ప్రకారం జగ్గంపేట లారీ వర్కర్స్ అండ్ యాజమాన్య సంఘం కార్యదర్శిగా వున్న సిగిరెడ్డి రాంబాబు ఉదయం, జగ్గంపేట శివారు రామవరం వద్ద వున్న యూనియిన్ ఆఫీసుకు తన స్కూటీ పై వస్తున్నారు. ఈ నేపథ్యంలో వెనుక నుంచి విశాఖ వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి రాంబాబును ఢీ కొనడంతో ఆయన తలకు తీవ్రగాయమై అక్కడికి అక్కడే మృతి చెందాడు. మృతుడికి కొడుకు, కూతురు వుండగా భార్య ఏడాది క్రితమే అనారోగ్యంతో మృతిచెందారు. మృతుడి కుమారుడు అశోక్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పాస్టర్ మృతిపై అనుమానాలు
26 ఆర్జేసీ 103ఎ–270083: ఫ అది రోడ్డు ప్రమాదం కాదు హత్య అని క్రైస్తవ సంఘాల ఆరోపణ ఫ రాజమహేంద్రవరం చేరుకున్న రాష్ట్రంలోని ప్రముఖ పాస్టర్లు కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/రాజానగరం: హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్కుమార్ పగడాల మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే, ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని, హత్య చేశారంటూ సోషల్ మీడియాలో హల్చల్ అవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్చెరువు నుంచి గామన్ బ్రిడ్జికి వెళ్లే రోడ్డులో నయరా పెట్రోలు బంకు ఎదురుగా కొంతమూరు సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్కుమార్ పగడాల మృతి చెందారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆయన వ్యక్తిగత పనులపై ఇటీవల రాజమహేంద్రవం వచ్చారు. ఎన్ఫీల్డ్ బైకుపై వెళ్తున్న ఆయనను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో, ఆయన బైకుతో సహా రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో పడి, అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం స్థానికుల ద్వారా మంగళవారం తెలుసుకున్న రాజమహేంద్రవరంలోని బొమ్మూరుకు చెందిన అతని సన్నిహితుడు జనగామ రోహన్ ఉదయం 11 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మాజీ ఎంపీలు మార్గాని భరత్రామ్, జీవీ హర్షకుమార్, పాస్టర్లు సబ్బెళ్ల విజయప్రసాద్రెడ్డి, జాన్వెస్లీ, స్థానిక రాజకీయ నాయకులు అక్కడకు చేరుకుని, ప్రవీణ్కుమార్ మృతిపై లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలంటున్న క్రైస్తవ సంఘాలు పాస్టర్ ప్రవీణ్కుమార్ పగడాల మృతి చెందిన విషయం తెలిసిన రాష్ట్రంలోని క్రైస్తవ సంఘాల సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. పాస్టర్లు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆసుపత్రి, పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆయన మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని, దీనిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాలు ఆరోపించాయి. పాస్టర్ సబ్బెళ్ల విజయప్రసాద్రెడ్డి, పాస్టర్ జాన్వెస్లీ మాట్లాడుతూ రక్షణ టీవీ వేదికగా ఎన్నో డిబేట్లు నిర్వహించిన ప్రవీణ్కుమార్ మృతి అనుమానాస్పదంగా ఉందన్నారు. ఆయన తలకు బలమైన గాయాలున్నాయన్నారు. దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని పోలీసులను కోరామన్నారు. తొలుత యాక్సిడెంట్ అని చెప్పారని, అయితే ప్రవీణ్ తలకు తీవ్రమైన గాయాలున్నాయని, దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని పోలీసులను కోరామన్నారు. ప్రమాద స్థలంలో ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని, మా అనుమానాలను పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించాలన్నారు. ప్రవీణ్కుమార్ కో ఆర్డినేటర్ రాజమహేంద్రవరంలో ఉన్నారని, ఆయన సోమవారం నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదన్నారు. ఇదిలావుండగా పాస్టర్ ప్రవీణ్కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రభుత్వాసుపత్రి వద్ద మాట్లాడుతున్న పాస్టర్ సబ్బెళ్ల విజయప్రసాద్రెడ్డి నిజానిజాలు వెలికితీస్తాం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఎటువంటి అపోహలు, అసత్యాలు, సృష్టించవద్దని జిల్లా ఎస్పీ డి.నరసింహాకిశోర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాస్టర్ మృతిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నామన్నారు. త్వరలోనే నిజానిజాలను వెలికి తీస్తామన్నారు. అసత్య ప్రచారాలు చేసి, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు చేపడతామన్నారు. -
అమ్మ, నాన్నకు ప్రేమతో..
ఫ రూ.10 లక్షలతో తల్లిదండ్రులకు ఆరాధ్య మందిరం ఫ ప్రేమ చాటుకున్న తనయుడు ఫ నేడు తల్లి ప్రథమ వర్ధంతి ఫ మందిరం, విగ్రహాల ఆవిష్కరణ కొత్తపేట: అమ్మ కురిపించే ఆప్యాయత, అనురాగం, ఆనందం హృదయానికి గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. నాన్నలోని హుందాతనం, సంతానంపై కనపడకుండా కడుపులో దాచుకున్న ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తాయి. అటువంటి తల్లిదండ్రులకు ఏకంగా ఆరాధ్య మందిరమే నిర్మించారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బొరుసువారిసావరం గ్రామానికి చెందిన బొరుసు వెంకట ఉదయ భాస్కర్. తపాలా శాఖలో పని చేసిన చంద్రరావు – పూర్ణచంద్ర కళావతి దంపతుల కుమారుడైన భాస్కర్.. ప్రముఖ జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలో కీలక స్థానంలో పని చేశారు. ఆ కంపెనీలో అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, ఆయా కుటుంబాలకు కూడా ఓ దారి చూపారు. భాస్కర్ తండ్రి 2000 సంవత్సరంలో మృతి చెందారు. అనంతరం భాస్కర్ తన తల్లిని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆమె స్ఫూర్తి, ప్రోత్సాహం, సూచనల మేరకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా బొరుసువారి సావరం వద్ద కౌశిక తీరాన కనకదుర్గాదేవి గుడిని రూ.కోటితో పునర్నిర్మించారు. కొత్తపేట గ్రామ పరిధిలోని తొలి దుర్గాదేవి గుడి ఇదే కావడం విశేషం. ప్రతి నెలా పౌర్ణమి నాడు మహిళలతో ఇక్కడ సామూహిక కుంకుమ పూజలు, అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ఆ ఆలయానికి సమీపాన బొబ్బర్లంక – అమలాపురం ప్రధాన పంట కాలువ పరీవాహక ప్రాంతంలో ఉద్యానవనం, గ్రామస్తుల సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఎంతో మంది పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి రూ.వేలు, రూ.లక్షల్లో ఆర్థిక సహాయం అందించారు. అనేక దానధర్మాలు చేశారు.. చేస్తున్నారు. భాస్కర్ తల్లి కళావతి గత ఏడాది ఏప్రిల్ 5న కాలం చేశారు. అనంతరం తల్లిదండ్రుల స్మృతిలో భాస్కర్ తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరణించిన అనంతరం కూడా తల్లిదండ్రులు తన కళ్ల ముందే ఉండాలని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న తన వ్యవసాయ క్షేత్రం, ఫామ్ హౌస్ ప్రాంగణంలో సుమారు రూ.10 లక్షల వ్యయంతో తల్లిదండ్రులు చంద్రరావు – పూర్ణచంద్రకళావతి కాంస్య విగ్రహాలు నెలకొల్పారు. వాటికి గ్రానైట్ రాయితో అందమైన మందిరం నిర్మించారు. జీవకళ ఉట్టిపడేలా ఈ విగ్రహాలను స్థానిక ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డి.రాజ్కుమార్ వుడయార్ తీర్చిదిద్దారు. తల్లి కళావతి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ నెల 26న ఈ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ కార్య క్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
దద్దరిల్లుతున్న పోలవరం కాలువ
● రోజుకు మూడుసార్లు బాంబు పేలుళ్లు ● బీటలు వారుతూ, పెచ్చులు ఊడుతున్న గృహాలు ● అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందుతున్న స్థానికులు తుని రూరల్: పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకంలో భాగంగా సాగుతున్న బాంబు పేలుళ్లతో కుమ్మరిలోవ గ్రామస్తులు బిక్కబిక్కుమంటూ జీవిస్తున్నారు. రోజుకు మూడుసార్లు పేలుతున్న బాంబులతో భూకంపం వచ్చినట్టు ఇళ్లు అదురుతుండడం, బీటలు వారడం, పెచ్చులు ఊడిపడుతుండడంతో గృహస్తులు ఆందోళన చెందుతున్నారు. పేలుళ్ల ధాటికి ఎప్పుడు గృహాలు కుప్పకూలిపోతాయోనని పిల్లాపాపలతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం పేలుళ్లకు ఇళ్ల సన్సైడ్లపై ఉన్న సామాన్లు కిందపడడంతో ఒక్కసారిగా ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని స్థానికులు గుడివాడ లోవరాజు, గుడివాడ నూకరాజు, చినలక్ష్మి, తాళ్లవలస బంగారయ్య, రాజబాబు, కచ్చాల సత్యనారాయణ, బొబ్బిలి నాగరత్నం, ఎస్.చినతల్లి, బొత్స వెంకట నాగమణి, మడ్డు నాగమ్మ, కచ్చాల సత్యనారాయణ తదితరులు పేర్కొన్నారు. పేలుళ్ల ధాటికి సన్సైడ్పై ఉన్న ఇత్తిడి సామాన్లు కింద పడడంతో నుదుటిపై స్వల్పంగా గాయమైనట్టు గుడివాడ చినలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు భయంతో పరుగులు తీస్తున్నారన్నారు. 20 రోజులుగా పేలుళ్లు జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోలేదని, స్థానిక నాయకులకు ఫిర్యాదు చేస్తే సంబంధిత కాంట్రాక్ట్ సిబ్బంది వచ్చి సైరన్ ఏర్పాటు చేశారని, సైరన్ మోగినప్పుడు అరగంట సేపు జాగ్రత్తగా ఉండాలని సూచించి వెళ్లిపోయారన్నారు. నాలుగైదు వందల మీటర్ల దూరంలో పేలుళ్లు జరుగుతున్నా మా ఇళ్ల వద్ద కంపిస్తోందని, ఇళ్లు బీటలు వారడంతో ఎప్పుడు కూలిపోతాయోనని భయం భయంగా ఉంటున్నామన్నారు. పాత ఇళ్లే కాకుండా ఇటీవల నిర్మించిన కొత్త ఇళ్లకు సైతం పగుళ్లు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా బాంబులు పేల్చితే తమ ఇళ్లు కూలిపోతాయని, ఇళ్లకు, తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ ప్రసాద్ను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదన్నారు. వీఆర్వోను పంపించి సమాచారాన్ని సేకరిస్తామని, నివేదికను ఉన్నత అధికారులకు పంపిస్తామన్నారు. పోలవరం ఇరిగేషన్ ఈఈ బి.గోవిందును వివరణ కోరగా సమస్య తమ దృష్టికి వచ్చిందన్నారు. కంట్రోలింగ్ బ్లాస్టింగ్ చేపట్టే అంశాలను పరిశీలించేందుకు బుధవారం ఆ ప్రాంతంలో ఎస్ఈ పర్యటిస్తారన్నారు. గ్రామస్తులు ఆందోళన చెందొద్దని, అప్రమత్తంగా ఉండాలన్నారు. -
కాలువలోకి దూకిన యువకుడు
పెరవలి: ఓ వ్యక్తి కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.పెరవలి ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన చల్లా దుర్గారావు (29) మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పెరవలి లాకుల వద్దకు వచ్చి బండి, జోళ్లు విడిచిపెటి్ట్ కాల్వలోకి దూకేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు దుర్గారావుకి వెదురుగెడ ఇచ్చినా, దానిని పట్టుకోకుండా నీట మునిగిపోయాడని తెలిపారు. స్థానికులు సమీపంలో ఉన్న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు తణుకు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు. ఇదే సమయంలో పోలీసులు గజ ఈతగాళ్లను, వలలు వేసే వారిని రప్పించి వెతకటం ప్రారంభించారు. రాత్రి అవ్వటంతో వెతకటం నిలుపుదల చేశామని, బుధవారం ఉదయం తిరిగి వలలు వేస్తామని తెలిపారు. మృతుడి అన్న చల్లా వెంకట సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు. -
సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు
అన్నవరం: ఫాల్గుణ బహుళ ఏకాదశి సందర్భంగా రత్నగిరి వాసుడు సత్యదేవునికి అర్చకులు మంగళవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ పుష్పార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు, వేదాశీస్సులు అందజేశారు. ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, వేద పండితులు యనమండ్ర శర్మ ఘనపాఠి, అర్చకులు వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, కొండవీటి రాజా తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. సత్యదేవుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని సుమారు 20 వేల మంది దర్శించారు. వెయ్యి వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. -
నిర్మలగిరి.. జన కడలి
దేవరపల్లి: నాలుగు రోజులుగా జరుగుతున్న ఉత్సవాల ముగింపు సందర్భంగా గౌరీపట్నంలోని నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం జనసంద్రమే అయ్యింది. సోమవారం రాత్రి పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు, ఫాదర్లు, పాస్టర్లు సాయంత్రం 6 నుంచి రాత్రి 2 గంటల వరకూ ప్రార్థనలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. పుణ్యక్షేత్రంలో క్రీస్తు నామం ప్రతిధ్వనించింది. పీఠాధిపతులు నిర్వహించిన దివ్యబలి పూజ సమర్పణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆశీస్సులు పొందారు. అద్భుతాలకు నిలయం అనేక అద్భుతాలకు నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం నిలయమని ఏలూరు పీఠాఽధిపతి, విశాఖ అగ్రపీఠం అపోస్తోలిక పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర అన్నారు. మేరీమాత మహోత్సవాల సందర్భంగా పుణ్యక్షేత్రంలో జయరావు పొలిమెర, ఖమ్మం పీఠాధిపతి సగిలి ప్రకాష్, నెల్లూరు పీఠాథిపతి పిల్లి ఆంథోనీదాస్, పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్లు మంగళవారం రాత్రి సమష్ఠి దివ్యబలి పూజ సమర్పించారు. ఈ సందర్భంగా అగ్ర పీఠాధిపతి జయరావు పొలిమెర మాట్లాడుతూ, అఖండ దేవాలయాన్ని నిర్మించుకుని 25 వసంతాలైందని అన్నారు. మన దేశం, ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని నిర్మలగిరి మేరీమాత కొండ వద్ద ప్రార్థిస్తున్నామని ఆయన తెలిపారు. ఏలూరు కథోలిక పీఠం పరిధిలోని గౌరీపట్నంలో మరియతల్లి.. నిర్మలగిరి మేరీమాతగా భక్తుల పూజలందుకుంటోందని చెప్పారు. బాధలతో ఉన్న అనేక మంది ఆ తల్లి చెంతకు చేరి ప్రార్థిచగా, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్ఖానాల్లో పని చేస్తున్న కార్మికులకు మంచి వేతనాలు లభించాలని ప్రార్థించామన్నారు. ఖమ్మం పీఠాధిపతి సగిలి ప్రకాష్ మాట్లాడుతూ, నిర్మలగిరి పుణ్యక్షేత్రం ప్రజలందరి కోసం వెలసిన పుణ్యభూమి అని అన్నారు. సమైక్యతా స్థలంగా అలరారుతోందన్నారు. దైవానుభూతికి పుణ్యక్షేత్రం తార్కాణంగా, స్వర్గధామంగా ఉందని చెప్పారు. నెల్లూరు పీఠాధిపతి పిల్లి ఆంథోనీదాస్ మాట్లాడుతూ, రక్షణ చరిత్రలో మరియమాత ప్రధాన భూమిక పోషించిందని తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు వికార్ జనరల్ ఫాదర్ పి.బాల, జి.మోజెస్, దిరిసిన ఆరోన్, పలువురు గురువులు, కన్యలు, భక్తులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పీఠాల నుంచి పుణ్యక్షేత్రం మహోత్సవాలకు వచ్చిన పీఠాధిపతులు, గురువులకు పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ ఘన స్వాగతం పలికారు. మరియతల్లి స్వరూపం వద్ద పీఠాధిపతులు ప్రార్థన చేశారు. అనంతరం కొండపై నిర్మించిన 30 అడుగుల పునీత ఆంథోనీ స్వరూపాన్ని జయరావు పొలిమెర ఆవిష్కరించారు. వివిధ విచారణల నుంచి వచ్చిన బైబిల్ జ్యోతులను పీఠాధిపతులు స్వీకరించారు. ఘనంగా జూబ్లీ వేడుకలు పుణ్యక్షేత్రంలోని అఖండ దేవాలయం నిర్మించి, 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఫ లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఫ సమష్టి దివ్యబలి పూజ సమర్పించిన పీఠాధిపతులు ఫ అశ్వరథంపై ప్రదర్శన -
వెంకన్న రథానికి రూ.లక్ష అందజేత
అమలాపురం టౌన్: అమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో ఊరేగే రథానికి రంగులు, మరమ్మతుల కోసం రాజమహేంద్రవరానికి చెందిన మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామమోహనరావు కుమారులు రాజా, గణేష్ రూ.లక్ష సమకూర్చారు. ఈ మొత్తాన్ని జక్కంపూడి గణేష్ బంధువు స్థానిక వెంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉత్సవ కమిటీ చైర్మన్ జంగా అబ్బాయి వెంకన్న, కమిటీ సభ్యుడు మోకా వెంకట సుబ్బారావుకు మంగళవారం అందజేశారు. రామోమోహనరావు భార్య జక్కంపూడి విజయలక్ష్మి, కుమారులు రాజా (మాజీ ఎమ్మెల్యే), గణేష్లకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. వెంకన్న కల్యాణానికి కుంకుమ భరిణల అందజేత ఏప్రిల్ 7న జరగనున్న వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవాలను వీక్షించేందుకు ప్రత్యేక టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు 350 కుంకుమ భరిణలు, 350 జాకెట్ ముక్కలను మెట్రో కెమ్ కంపెనీల అధినేత డాక్టర్ నందెపు వెంకటేశ్వరరావు సమకూర్చారు.డాక్టర్ వెంకటేశ్వరరావుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. 28న రేషన్ బియ్యానికి వేలం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/దేవరపల్లి: జిల్లాలోని ఆరు కేసులలో సీజ్ చేసిన 47.274 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యానికి ఈ నెల 28న బహిరంగ వేలం వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు గోపాలపురంలోని మండల స్థాయి స్టాక్ పాయింట్ వద్ద ఈ వేలం నిర్వహిస్తామన్నారు. కిలో బియ్యం ధర రూ.25గా నిర్ణయించామన్నారు. ఆసక్తి ఉన్న వ్యాపారులు జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉండాలని, ముందుగా రూ.2 లక్షల ధరావత్తును ‘జాయింట్ కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా’ పేరిట డీడీ రూపంలో చెల్లించి, వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. పాట వాయిదాకు, నిలుపుదలకు లేదా పూర్తిగా రద్దు చేయడానికి జిల్లా యంత్రాంగానికి అధికారాలున్నాయని తెలిపారు. యూత్ పార్లమెంట్కు ఎంపిక ఏలేశ్వరం: రాష్ట్ర స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2025కు ఏలేశ్వరానికి చెందిన సాయిప్రదీప్ ఎంపికయ్యాడు. ఏపీ అసెంబ్లీలో జరిగే యూత్ పార్లమెంట్కు శ్రీకాకుళం జిల్లా నుంచి అతడు ప్రాతినిధ్యం వహిస్తాడు. కోస్తాంధ్ర నుంచి పలువురు విద్యార్థులు ఒక నిమిషం వీడియోను మై భారత్ యాప్లో అప్లోడ్ చేశారు. దీని ఆధారంగా విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ఈ నెల 24న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన ఎంపిక ప్రక్రియ జరిగింది. వీరిలో సాయిప్రదీప్ను టాప్–10లో ఒకరిగా ఎంపిక చేశారు. భారత రాజ్యాంగ వ్యవస్థపై ఈ నెల 28న అసెంబ్లీలో స్పీకర్ ముందు సాయిప్రదీప్ ప్రసంగించనున్నాడు. అతడిని పలువురు అభినందించారు. హుండీల ద్వారా స్వామి ఆదాయం రూ.26,48,813 సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారికి భక్తుల నుంచి వివిధ హుండీల ద్వారా మొత్తం రూ.26,48,813 ఆదాయం వచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకూ 39 రోజులకు గాను అధికారులు నిర్వహించిన హుండీల లెక్కింపులలో పై ఆదాయం స్వామికి వచ్చింది. ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో ఆల య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు లెక్కింపు నిర్వహించారు. మెయిన్ హుండీల ద్వారా రూ.25,86,985, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.20,676, అన్నదానం హుండీ ద్వారా రూ.41,152 ఆదాయం వచ్చినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. సర్పంచ్లు కొండా జాన్బాబు, ఒడుగు శ్రీనివాస్, ఎంపీటీసీ బైరా నాగరాజు పాల్గొన్నారు. బీసీ సాధికార సంస్థ అధ్యక్షుడిగా గుబ్బల మలికిపురం: బీసీ సాధికార సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా మలికిపురంనకు చెందిన గుబ్బల సత్యనారాయణ (బాబ్జి) నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ అధ్యక్షుడు కె.కొండలరావు చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. సమాఖ్యను సమర్థంగా నడిపిస్తానని ఈ సందర్భంగా బాబ్జి మంగళవారం మలికిపురంలో తెలిపారు. -
స్థానిక సంస్థలకు రేపు ఉప ఎన్నికలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని 12 గ్రామాల్లో ఉప సర్పంచ్, బిక్కవోలు ఎంపీపీ, పెరవలి, రంగంపేట మండలాల్లో ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికలు గురువారం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తెలిపారు. ఈ ఎన్నికలను సజావుగాచ నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లేశ్వరం (గోకవరం), పెనకనమెట్ట (కొవ్వూరు), పాత తుంగపాడు (రాజానగరం), కొవ్వూరుపాడు, వెంకటాయపాలెం (గోపాలపురం), తాళ్లపూడి, లక్ష్మీనరసాపురం (అనపర్తి), మర్రిపూడి (రంగంపేట), మురమండ (కడియం), మునికూడలి (సీతానగరం), ఉండ్రాజవరం గ్రామాల్లో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఏదైనా కారణంతో ఎన్నికల అధికారులు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించలేకుంటే తదుపరి రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించి జరపాలని స్పష్టం చేశారు. ఎన్నిక నిలిపివేస్తే దానికి కారణాలను లిఖిత పూర్వకంగా నమోదు చేసి, మరో రోజు నిర్వహించేందుకు అనుమతించవచ్చని తెలిపారు. ఎన్నికల సందర్భంగా పోలీసు బందోబస్తు పకడ్బందీగా ఉండాలని అన్నారు. ఉప సర్పంచ్ ఎన్నికకు ఒక్క సభ్యుడిని మాత్రమే ప్రతిపాదించాలని, మరో సభ్యుడు మద్దతు ఇవ్వాలని తెలిపారు. ప్రతిపాదించిన, మద్దతు పొందిన అభ్యర్థులందరి పేర్లు సమావేశ అధ్యక్షుడు చదివి వినిపించాలన్నారు. పోటీ చేస్తున్న వారు అదే రోజు ఉదయం 10 గంటల్లోగా నామినేషన్లు సమర్పించాలన్నారు. ఉపసంహరణకు అరగంట సమయం ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల్లోగా పరిశీలన పూర్తి చేసి, అభ్యర్థుల జాబితా ప్రకటించాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎన్నిక నిర్వహించాలన్నారు. ఒక్క అభ్యర్థి మాత్రమే వస్తే వారే ఎన్నికై నట్లు ప్రకటించాలన్నారు. ఎన్నిక జరిగితే ప్రతి అభ్యర్థి వచ్చిన ఓట్లను లెక్కించి, సమావేశ అధ్యక్షుడు ప్రకటించాలని జేసీ సూచించారు. -
కదం తొక్కిన కోకో రైతులు
కొవ్వూరు: కోకో గింజల కొనుగోలు, గిట్టుబాటు ధరలపై నెల రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. కోకో గింజలను ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కోకో కాయలు, గింజలు పట్టుకుని ఆర్డీఓ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. గేటు ఎదుట నిలబడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ కోకో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, కంపెనీలు సిండికేట్గా మారి కోకో గింజలు కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతుల వద్ద ఉన్న కోకో పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు మాట్లాడినప్పటికీ కంపెనీలు నిర్లక్ష్య ధోరణి చూపుతున్నాయని అన్నారు. అన్ సీజన్లో కోకో పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు, కౌలు రైతులు నష్టపోతున్నారన్నారు. మరోవైపు కంపెనీలు రోజురోజుకూ ధర తగ్గించేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కిలో కోకో గింజల ధర రూ.650 ఉండగా నేడు రూ.550 నుంచి రూ.500కు పడిపోయిందని చెప్పారు. అన్ సీజన్లో కిలో రూ.200 నుంచి రూ.240కే కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కిలో కోకో గింజలకు రూ.900 చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వం ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని, ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలని, విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేయాలని, ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీలు అందించి, రైతులను ఆదుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ రాణి సుస్మితకు రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఉప్పల కాశీ, నాయుడు లక్ష్మణరావు, ఉండవల్లి కృష్ణారావు, జిల్లా కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ కంపెనీలు కొనుగోలు చేయకపోవడంపై నిరసన ఫ తక్షణం ప్రభుత్వం కొనాలని విన్నపం ఫ కిలోకు రూ.900 ఇవ్వాలని డిమాండ్ -
సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు
అన్నవరం: ఫాల్గుణ బహుళ ఏకాదశి సందర్భంగా రత్నగిరి వాసుడు సత్యదేవునికి అర్చకులు మంగళవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ పుష్పార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు, వేదాశీస్సులు అందజేశారు. ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, వేద పండితులు యనమండ్ర శర్మ ఘనపాఠి, అర్చకులు వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, కొండవీటి రాజా తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. సత్యదేవుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని సుమారు 20 వేల మంది దర్శించారు. వెయ్యి వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. -
అతి వేగానికి ఇద్దరు యువకుల బలి
● మోటార్ సైకిల్ను ఢీకొట్టిన కారు ● ఒకరు అక్కడికక్కడే మృతి, మరొకరు ఆసుపత్రిలో.. ● కన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు పెరవలి: అతి వేగం ఇద్దరు యువకులను బలి తీసుకుంది. జాతీయ రహదారిపై పెరవలి మండలం అన్నవరప్పాడు సెంటర్లో రోడ్డు దాటుతుండగా మోటార్ సైకిల్ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. పెరవలి ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెల్పిన వివరాలిలా ఉన్నాయి. పెరవలి మండలం పిట్టల వేమవరం గ్రామానికి చెందిన మాకా సురేష్ (26), నేతల హనుమంతు (26) అన్నవరప్పాడు సెంటర్లో మోటార్ సైకిల్పై రోడ్డు దాటుతుండగా అదే సమయంలో రావులపాలెం నుంచి తణుకు వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. కారు వచ్చిన వేగానికి మోటార్ సైకిల్ గాలిలోకి ఎగిరి సుమారు 20 మీటర్ల దూరంలో పడి ఆగిఉన్న మరో కారును ఢీకొట్టి పడిపోయింది. దీంతో మాకా సురేష్ తలకు బలమైన గాయం అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు, మోటార్ సైకిల్ను ఢీకొట్టిన వెంటనే పెద్ద శబ్దం రావటంతో సెంటర్లో ఉన్న జనం పరుగున వచ్చి పడిపోయిన ఇద్దరిని లేపటానికి ప్రయత్నించారు. వీరిలో మాకా సురేష్లో ఎటువంటి కదలిక లేదు. నేతల హనుమంతు కదులుతుండటంతో హైవే అంబులెన్స్కు ఫోన్ చేయటంతో వెంటనే వచ్చి తణుకులో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి వచ్చిన సురేష్ తండ్రి వెంకటేశులు, తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. తీవ్ర గాయాలైన నేతల హనుమంతు తండ్రి ప్రసాద్, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లే సమయానికి కుమారుడు మృతి చెందాడని తెలిసి హతాశులయ్యారు. మాకా వెంకటేశులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు కుటుంబాలకు వీరే ఆధారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి కుటుంబీకులు పేదలు. రెండు కుటుంబాలకు వీరే ఆధారం. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు, కుమారులు మృతితో ఇరు కుటుంబాలు తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నాయి. మాకా వెంకటేశులు, భార్య ధనలక్ష్మిలకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు సురేష్. ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేశారు. తల్లి తండ్రులకు సురేష్ ఒక్కడే ఆధారం. అతను ఇలా రోడ్డు ప్రమదంలో మృతి చెందడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నేతల హనుమంతు తండ్రి ప్రసాద్, కృష్ణవేణిలకు ముగ్గురు పిల్లలు పుట్టగా హనుమంతు అన్న మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం మృతుడి చెల్లికి వివాహం జరిగింది. ఇప్పడు రోడ్డు ప్రమాదంలో హనుమంతు మృతిచెందటంతో తల్లితండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. హనుమంతు తెచ్చిన కూలి డబ్బులే ఈ కుటుంబానికి జీవనాధారం కావటంతో తల్లితండ్రులు బిడ్డ పోయాడని ఒకవైపు రోదిస్తూ మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అంటూ విలపిస్తుంటే చూపరులు కూడ కన్నీటి పర్యంతం అయ్యారు. తల్లితండ్రులు ఇద్దరు భగవంతుడా మీకు ఏమి అన్యాయం చేశాము, ఈ చివరి క్షణాల్లో మమ్మల్ని ఆదుకునేదెవరు, ఒక బిడ్డను ముందు తీసుకెళ్లావు. అది మర్చిపోకముందే రెండవ బిడ్డను తీసుకెళ్లిపోయావా అంటూ హృదయ విదారకంగా విలపించారు. -
కోకో గింజల ప్రాసెసింగ్
పులియ బెట్టడం: కోకో గింజలు చుట్టూ వున్న గుజ్జును తొలగించడానికి, మంచి సువాసన, రుచిని కలిగించడానికి పులియ బెట్టడం మంచి పద్ధతి. గింజలలో అమ్లతను 5.5కు తీసుకు రావడం, వగరు, చేదును తగ్గించడానికి, గింజలో మొలకను చంపడానికి, చుట్టూ వున్న పల్చని తొక్కను తొలగించడానికి పులియ బెట్టడం చాలా అవసరం. పెట్టె పద్ధతి, ట్రే పద్ధతి, బుట్ట పద్ధతి ద్వారా కోకో గింజలను పులియబెట్టడం మంచిది. పెట్టె పద్ధతి 60 సెం.మీ. ఇన్టు 60 సెం.మీ. ఇన్టు 45 సెం.మీ. సైజు కరల్రతో చేసిన పెట్టెలు అవసరం. కారిన గుజ్జు పోవడానికి, గాలి తగలడానికి పెట్టె కింద రీపర్ బద్దలు నాటాల్సి ఉంది. తడి గింజలను పెట్టెలో దగ్గరగా అమర్చి అరటి ఆకులతో గాని (లేదా) గోనె సంచులతో గాని కప్పాలి. 24 గంటల తరువాత వేరే పెట్టెలోకి మార్చేటప్పుడు గింజలను మళ్లీ కలపాలి. సమానంగా పులవడానికి సరియైన ఉష్ణోగ్రత తేమ, గాలి ఉండేలా చూడడం ఎంతో అవసరం. పెట్టెలో 48 గంటల తరువాత ఉష్ణోగ్రత 42 నుంచి 48 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరుగుతుంది. పులియబెట్టిన 72 గంటల తరువాత గింజలను వేరే పెట్టెలోకి మార్చాలి. ఒక రోజు తరువాత చివరిగా గింజలను మార్చాలి. ఈ విధంగా పులియడానికి 6 రోజులు అవసరమవుతుంది. -
ప్రియురాలిని, ఆమె తల్లిని హత్య చేసిన ప్రియుడి అరెస్టు
రాజమహేంద్రవరం రూరల్: ప్రియురాలిని, ఆమె తల్లిని హత్యచేసిన ప్రియుడు పల్లి శివకుమార్ను బొమ్మూరు పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఆ వివరాలను సోమవారం రాత్రి రాజమహేంద్రవరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య బొమ్మూరు పోలీస్స్టేషన్లో వెల్లడించారు. మృతిచెందిన మహమ్మద్ సల్మా(37), ఆమె కుమార్తె మహమ్మద్ సుమయ్య(16) హుకుంపేట డిబ్లాకులో నివసిస్తున్నారు. సుమయ్య పెళ్లి ఈవెంట్లు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఈవెంట్లు చేస్తున్న సమయంలో ఈ కేసులో నిందితుడైన శ్రీకాకుళం జిల్లా నందిగాం గ్రామానికి చెందిన ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న పల్లి శివకుమార్తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. పల్లి శివకుమార్ హైదరాబాద్లో నివసిస్తూ అక్కడ పనిచేసేవాడు. మృతిచెందిన సుమయ్యకు ఫోన్ చేసే సమయంలో ఆమె ఫోన్ వెయిటింగ్ వస్తే ఆమెను అనుమానిస్తూ, సుమయ్యతో గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో ఆరురోజుల క్రితం శివకుమార్ మృతుల ఇంటికి వచ్చి వాళ్లతో గొడవపడి చంపుతానని బెదిరించాడు. సుమయ్యకు ఇంకెవరితోనో మాట్లాడేందుకు, ఆమె తల్లి సల్మా సహకరిస్తోంది అనే ఉద్దేశంతో శివకుమార్ ఆదివారం ఉదయం 8.00గంటల సమయంలో సుమయ్య, ఆమె తల్లి సల్మాలను వారి ఇంటిలోనే కత్తితో పొడిచి హత్యచేసి ఇంటికి తాళంవేసి పరారయ్యాడు. మృతురాలు మహమ్మద్ సల్మా కుమారుడు మహమ్మద్ ఆలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేశారు. ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆదేశాల మేరకు ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య ఆధ్వర్యంలో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి శివకుమార్ను కొవ్వూరు రూరల్ పోలీసులు గుర్తించి అదుపులోనికి తీసుకుని, బొమ్మూరు పీఎస్ ఇన్స్పెక్టర్కు సమాచారం ఇచ్చారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్, సిబ్బందితో వెళ్లి శివకుమార్ను అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. బొమ్మూరు పీఎస్ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్, ఎస్సై సీహెచ్వీ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
కోకోకు ఇదే సీజన్
బుట్ట పద్ధతి తడిగింజ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు వెదురు లేదా కేను బుట్టలను పులియబెట్టడానికి వాడుకోవచ్చు. వెదురుబుట్ట లోపలి అంచులను అరటి ఆకులతో కప్పాలి. బుట్ట అడుగుభాగం మాత్రం ఆకులతో కప్పకూడదు. బుట్టను గింజలతో నింపి అరటి ఆకులతో కప్పాలి. దానిపైన కొద్ది బరువును ఉంచాలి. బుట్టను నేలకు తగలకుండా కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంచడం వలన గింజలకున్న గుజ్జు సులభంగా బుట్ట అడుగు భాగం నుండి కారిపోతుంది. తరువాత బుట్టను గోనె సంచితో కప్పాలి. గింజలను 3వ, 5వ రోజున కలిపి, గోనె సంచితో కప్పాలి. ఆరు రోజులలో పులియడం పూర్తవుతుంది. ఎండబెట్టడం: పులియబెట్టిన గింజలను పల్చగా సిమెంటు గచ్చు మీద గాని, వెదురు చాప మీద గాని 5 – 6 రోజుల వరకు ఎండబెట్టాలి. మధ్యలో గింజలను కలియబెడుతూ ఉండాలి. ఎండిన గింజలలో తేమ 67 శాతం మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ● కోతలో మెళకువలు పాటించాలి ● గింజల గ్రేడింగ్తో అధిక ధరలు ● కోనసీమ జిల్లా ఉద్యాన శాఖ అధికారి రమణ ఐ.పోలవరం: కోకో ఏడాది పొడవునా కాపు ఉన్నప్పటికీ మార్చి నుంచి మే నెలాఖరు అంటే మూడు నెలలపాటు అధిక దిగుబడులు వస్తాయి. ఈ సమయంలో వచ్చిన గింజలు అధిక నాణ్యత కలిగి ఉంటాయి. కోకో గింజల ధరలు పొందాలంటే విత్తనాల నాణ్యత పెంచాల్సి ఉంది. ఇందుకు ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించాలని చెబుతున్నారు జిల్లా ఉద్యాన శాఖాధికారి బి.వి.రమణ (89998 35469). కోకో గింజలకు జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నందున నాణ్యమైన గింజల ఉత్పత్తి చేసేందుకు రైతులు చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఆయన మాటల్లోనే.. మన ప్రాంతంలో పండే కోకో గింజలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ప్రపంచంలో గనా దేశం కోకో గింజన నాణ్యతలో ప్రథమస్థానంలో ఉండేది. దానిని ఇప్పుడు మనం అధిగమించాం. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా 2024లో కిలో నాణ్యమైన కోకో గింజలకు రికార్డు స్థాయిలో రూ.950 నుంచి రూ.1,000 వరకు ధర వచ్చింది. ఇప్పుడు ధర కొంత తగ్గినా మార్కెట్లో కేజీ ధర రూ.550 నుంచి రూ.650 వరకు ఉంటోంది. దీనివల్ల ఈ పంట రైతులకు పూర్తిగా లాభదాయకం. పైగా ఇది కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలలో అంతర పంటగా సాగు చేస్తున్నందున రైతుకు అదనపు ఆదాయం వచ్చే పంట. కోకో చెట్టుకు అధికంగా ఆకు రాలుస్తుంది. ఈ కారణంగా రైతుకు రూపాయి పెట్టుబడి లేకుండా మంచి సేంద్రియ ఎరువు పొందే అవకాశముంది. ఇలా బహుళ ప్రయోజనాలు ఉన్న సాగుగా పేరొందిన కోకోలో మంచి దిగుబడి సాధిస్తే రైతులు మరింత లాభాలు పొందే అవకాశముంది. కోకోలో ప్రతి ఏటా రెండు సందర్భాలలో అధిక దిగుబడులు వస్తాయి. ఒకటి సెప్టెంబర్–జనవరి కాగా, రెండవది ఏప్రిల్–జూన్ మాసాలలో వస్తుంది. ఏప్రిల్ – జూన్ మాసాలలో వచ్చే దిగుబడి అధికంగా ఉంటుంది. కృత్రిమంగా ఎండబెట్టడం వర్షాకాలంలో గింజలను ఎండబెట్టటానికి విద్యుత్తు ఓవెన్స్ చాలా ఉపయోగపడతాయి. 72 నుంచి 96 గంటలలో గింజలు ఎండటం పూర్తవుతుంది. నెమ్మదిగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద గింజలు ఎండటం వలన నాణ్యత బాగుంటుంది. ఓవెన్లో గింజలను 50–55 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 8–10 గంటలు మాత్రమే మొదటి 2 రోజులు ఎండబెట్టాలి. తర్వాత 60 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద రోజంతా ఎండబెట్టవచ్చు. ఈ విధంగా 72 నుంచి 96 గంటలలో ఎండడం పూర్తవుతుంది. గింజల గ్రేడింగ్.. నిల్వ చేయడం ఎండబెట్టిన గింజల నుంచి తప్పలు, ముక్కలు, ముడుచుకు పోయిన గింజలు, రాళ్లు తీసివేసి పాలిథీన్ లైనింగ్ (150–200 గేజు) కలిగిన గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి. ఈ సంచులను ఎత్తైన అరుగుల మీద ఉంచాలి. -
అసలేం జరుగుతోంది..!
● సాధారణ స్థాయిలోనే బలభద్రపురం క్యాన్సర్ కేసులు ● అధికారులు, వైద్య బృందం స్పష్టీకరణ ● ఆందోళన అవసరం లేదన్న వైద్య, ఆరోగ్య మంత్రి ● 38 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు ● 10 మందికి క్యాన్సర్ లేదని నిర్ధారణ ● మిగిలిన వారి రిపోర్టుల కోసం ఎదురు చూపులు ● రక్త పరీక్షలు చేస్తే తెలుస్తుందన్న ఎమ్మెల్యేసాక్షి, రాజమహేంద్రవరం: బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఏం జరుగుతోంది.. నిజంగానే క్యాన్సర్ కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయా.. పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉందా.. అని ప్రశ్నిస్తే అంత తీవ్రత ఏమీ లేదని అధికార యంత్రాంగం, వైద్య బృందాలు కొట్టిపారేస్తున్నాయి. జాతీయ సగటు గణాంకాలతో పోలిస్తే.. ఇక్కడ నమోదైన కేసులు సాధారణమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా బలభద్రపురంలో క్యాన్సర్ ఆందోళనకర స్థాయిలో లేదని సోమవారం అమరావతిలో ప్రకటించారు. కానీ, స్థానిక అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం.. వ్యాధి బాధితుల గుర్తింపునకు చేపట్టిన సర్వే పారదర్శకంగా జరగడం లేదని, ఏదో ఒక డేటా తీసుకుని సర్వే చేస్తే ఎలాగని, గ్రామంలో 200కు పైగా కేసులున్నాయని వాదిస్తున్నారు. ఈ అంశాన్ని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించడంతో గ్రామంలో మొదలైన ఆందోళన నేటికీ కొనసాగుతోంది. అయితే, అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేనే తమను నమ్మకపోతే ఎలాగని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇన్నేళ్లుగా స్పందించని ఎమ్మెల్యే.. ఇప్పుడు ఎందుకు అంతగా స్పందించాల్సి వస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద గ్రామంలో మూడు రోజులుగా ఆందోళన కలిగించేలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూండటంతో బలభద్రపురం వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగిందంటే.. బలభద్రపురంలో క్యాన్సర్ విస్తరణకు కారణాల్ని అధ్యయనం చేయాలంటూ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల్ని పరిశీలించాలంటూ పర్యావరణ శాఖకు ఎన్నిసార్లు చెప్పినా లెక్క చేయడం లేదని పేర్కొన్నారు. ఆ గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బాధితులున్నారని ఆరోపించారు. అప్పటి నుంచీ ఈ విషయం హాట్టాపిక్గా మారింది. రంగంలోకి దిగిన యంత్రాంగం ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు అధికారులు, వైద్య సిబ్బంది రంగంలోకి దిగారు. బలభద్రపురం గ్రామాన్ని మూడు రోజుల పాటు జల్లెడ పట్టారు. ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. గ్రామంలో 3,500 ఇళ్లున్నాయి. జనాభా 10,800. వైద్య బృందాలు ఈ నెల 22, 23 తేదీల్లో 8,830 మందిపై సర్వే చేశారు. ఏకంగా 31 బృందాలు సర్వేలో భాగస్వాములయ్యాయి. వివిధ మార్గాల ద్వారా డేటా తీసుకుని మరీ పరిశీలించారు. చివరకు సర్వేలో 38 మంది అనుమానితులను మాత్రమే గుర్తించారు. వైద్య పరీక్షల అనంతరం వీరిలో 10 మందికి క్యాన్సర్ లేదని నిర్ధారించారు. మిగిలిన వారికి సంబంధించిన వైద్య పరీక్షల నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. అధికారులపై నిందలు అయితే, అధికారులు చెప్పిన లెక్కలు ఎమ్మెల్యే నల్లమిల్లికి మింగుడుపడలేదు. తాను చేసిన ఆరోపణకు ఎలాగైనా బలం చేకూర్చాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు. సర్వే సక్రమంగా జరగడం లేదని, ఆరోగ్యశ్రీ డేటా తీసుకుని సర్వే చేస్తే ఎలా తెలుస్తుందని అధికారులపై నిందలు వేయడం ప్రారంభించారు. సర్వే పారదర్శకంగా జరగడం లేదన్నారు. పదుల సంఖ్యలో క్యాన్సర్ రోగులను తమ కార్యకర్తలే ఆస్పత్రులకు తీసుకెళ్లారని, అలాంటిది కేసులు లేవంటే ఎలాగని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా అధికారులు మాత్రం తాము చేపట్టిన సర్వేలో భారీ స్థాయిలో కేసులు వెలుగు చూడలేదని బహిర్గతం చేశారు. ఎమ్మెల్యే యూటర్న్? బలభద్రపురం గ్రామంలో తాను ఆరోపించిన స్థాయిలో క్యాన్సర్ కేసులు లేవని అధికారులు, వైద్య బృందాలు నిర్ధారించడంతో ఎమ్మెల్యే నల్లమిల్లి యూటర్న్ తీసుకున్నారు. తాను అసెంబ్లీలో లేవనెత్తిన సమస్యకు ప్రభుత్వం, కలెక్టర్ స్పందించి క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వే చేస్తున్నారని సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తమకు క్యాన్సర్ ఉందని చెప్పడానికి కొంతమంది గ్రామస్తులు ఇష్టపడటం లేదన్నారు. ప్రతి ఇంటి నుంచీ రక్త నమూనాలు సేకరించాలని, తద్వారా సర్వే కొనసాగించాలని కోరారు. గ్రామంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని గ్రామస్తులు చెప్పడంతో తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని సమర్థించుకున్నారు. వైద్య పరీక్షలు చేసి, క్యాన్సర్ లేదని నిర్ధారిస్తే తనకూ సంతోషమేనంటూ మిన్నకుండిపోయారు.డైవర్షన్ పాలిటిక్స్ ఈ మొత్తం ఎపిసోడ్పై అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీశారని విమర్శించారు. కొన్నేళ్లుగా గుర్తుకు రాని బలభద్రపురం ప్రజల సమస్యలు ఒక్కసారిగా ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదని అన్నారు. దీని వెనుక రాజకీయ ఎత్తుగడ దాగి ఉందని దుయ్యబట్టారు. కాపవరం వద్ద చెత్తతో విద్యుత్ తయారీ కేంద్రం పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నాంది పలికిందని, మంత్రి నారాయణ సైతం ఇటీవల ఆ స్థలాన్ని పరిశీలించారని గుర్తు చేశారు. ఈ పరిశ్రమకు పెద్ద మొత్తంలో చెత్తను తరలించాల్సి ఉంటుందని, అదే జరిగితే గ్రామం కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్గా మారే సూచనలున్నాయని, అందువలన స్థానిక ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఇది గ్రహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే.. తనకు తెలియకుండానే మంత్రి వచ్చి వెళ్లారంటూ సాకులు చెబుతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా, సమాచారం ఇవ్వకుండా ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించారు. కేవలం ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించేందుకే ప్రజల్లో ఇలాంటి భయాందోళనలు రేకెత్తించి, రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దారుణమని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వడగాడ్పుల నుంచి రక్షణ చర్యలు చేపట్టాలి
రాజమహేంద్రవరం సిటీ: అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేందుకు జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు తక్షణ చర్యలు చేపట్టాలని సహాయ కార్మిక కమిషనర్ బీఎస్ఎం వలి సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు పరిశ్రమలు, పని ప్రదేశాల్లో కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తీసుకోవలసిన చర్యలపై సూచనలు జారీ చేశారు. కష్టతరమైన పనులు చేసే కార్మికులు, పని వారికి పని వేళలను రీషెడ్యూల్ చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ కార్మికులతో పనులు చేయించరాదు. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే సమయానికి కార్మికుల పని గంటలు మార్చాలి. పని ప్రదేశాల్లో కార్మికులందరికీ తగినంత పరిమాణంలో చల్లని, సురక్షితమైన తాగునీరు, అత్యవసర ఐస్ ప్యాక్లు, వేడి, అనారోగ్య నివారణ సామగ్రిని అందుబాటులో ఉంచాలి. పని ప్రదేశాల్లో షెల్టర్లు, శీతలీకరణ ప్రాంతాలు, అత్యవసర ఔషధాలు, ద్రవాల వంటివి అందించాలి. వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల వల్ల వచ్చే ముప్పు, నివారణ చర్యలపై కార్మికులకు అవగాహన కల్పించాలి. పీజీఆర్ఎస్కు 211 అర్జీలు రాజమహేంద్రవరం సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 211 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. వీటిని నిర్ణీత గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యతతో పరిష్కరించాలని ఈ సందర్భంగా జేసీ అన్నారు. ఒకసారి వచ్చిన అర్జీలు తిరిగి రాకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల శాఖ ఆధ్వర్యాన ముగ్గురికి క్యంపూటర్లు అందజేశారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 29 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 29 మంది ఫిర్యాదులు సమర్పించారు. వారి నుంచి ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడారు. ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (శాంతిభద్రతలు) అల్లూరి వెంకట సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాను టీబీ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా నగరంలో సోమవారం నిర్వహించిన ర్యాలీని స్థానిక వై జంక్షన్ వద్ద ఆమె ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 2023లో 109, ఈ ఏడాది 77 గ్రామ పంచాయతీలు సిల్వర్ మెడల్కు ఎంపికయ్యాయని తెలిపారు. వరుసగా మూడో సంవత్సరం కూడా 77 పంచాయతీలు నామినేషన్కు వెళ్తే గోల్డ్ మెడల్ సాధిస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు కూడా ప్రసంగించారు. అనంతరం జిల్లాలోని 106 గ్రామ పంచాయతీల కార్యదర్శులకు టీబీ ముక్త అవార్డులను జాయింట్ కలెక్టర్, జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎన్.వసుధర చేతుల మీదుగా అందజేశారు. తొలుత కలెక్టర్ ప్రశాంతి తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
నిర్మలగిరి.. వెలుగుల సిరి
● విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతున్న పుణ్యక్షేత్రం ● వైభవంగా మేరీమాత ఉత్సవాలు దేవరపల్లి: గౌరీపట్నంలోని నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతుంది. సుమారు 120 ఎకరాల్లో ఎత్తయిన కొండపై విస్తరించిన ఈ పుణ్యక్షేత్రం మేరీమాత ఉత్సవాల సందర్భంగా ధగద్ధగాయమానంగా వెలుగులీనుతూ, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చీకటి పడితే చాలు.. రంగురంగుల విద్యుద్దీపాలతో ఈ పుణ్యక్షేత్రం ప్రజలకు కనువిందు చేస్తుంది. ఇక్కడి కలవరి కొండపై ఉన్న క్రీస్తు ఆలయం, దిగువన ఉన్న ప్రార్థనా మందిరం, అఖండ దేవాలయం, ప్రధాన ద్వారం వద్ద ఉన్న మరియ తల్లి స్వరూపం, అక్కడే ఉన్న ఫాతిమా టవర్ విద్యుద్దీప తోరణాలతో కొత శోభను అద్దుకున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలకు ఉమ్మడి ఉభయ గోదావరితో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం లక్షలాదిగా భక్తులు, ఫాదర్లు తరలివచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. క్రైస్తవులతో పాటు ఇతర మతస్తులు కూడా ఇక్కడకు తరలి రావడం విశేషం. రాత్రి సమయంలో బస్సులు, లారీలు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలపై ఇక్కడకు చేరుకుని, మిరుమిట్లు గొలుపుతున్న విద్యుద్దీప కాంతులను కన్నులారా తిలకించి, ఆనందపరవశులవుతున్నారు. రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి 8 గంటల నుంచి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమే అవుతోంది. ఉత్సవాల చివరి రోజయిన మంగళవారం భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు రాత్రి పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, జార్జి ఆంథోనీ స్వామి, సకిలి ప్రకాష్, కరణం ధమన్ కుమార్, గోరంట్ల జ్వానేస్, పిల్లి ఆంథోనీదాస్లు పుణ్యక్షేత్రంలో సమష్టి దివ్యబలి పూజ సమర్పిస్తారని పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ తెలిపారు. ఉత్సవాలు జరుగుతున్న నాలుగు రోజుల్లో సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సుమారు 6 లక్షల మంది ప్రార్థనలు చేశారని చెబుతున్నారు. విద్యుద్దీప కాంతుల్లో నిర్మలగిరి పుణ్యక్షేత్రంఆకట్టుకుంటున్న అఖండ దేవాలయం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
కొవ్వూరు: నందమూరు గ్రామానికి చెందిన కలివరపు చాణిక్య(36) సోమవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బై పోలార్ అనే వ్యాధితో బాధపడుతున్న చాణక్య ఉదయం ఇంటి నుంచి బయల్దేరి రోడ్డు కం రైలు వంతెన పై నుంచి గోదావరి నదిలో దూకారు. పోలీసులు రెస్క్యూ టీము సహకారంతో నదిలో గాలించారు. ఎరినమ్మ ర్యాంపు సమీపంలో మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ప్రారంభం
● కిలో గరిష్ట ధర రూ.290 ● దేవరపల్లిలో వేలాన్ని ప్రారంభించిన ఈడీ విశ్వశ్రీదేవరపల్లి: పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల్లో 2024–25 పంట కాలానికి గాను పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో కొనుగోళ్లను పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ ప్రారంభించారు. తొలుత వేలం కేంద్రంలో ఆమె పూజలు నిర్వహించి, ఉదయం 10.54 గంటలకు ఈ–వేలం విధానంలో కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు ఉత్తర తేలిక నేలల (ఎన్ఎల్ఎస్) పొగాకు 18 బేళ్లతో పాటు, తొర్రేడు ప్రాంతం నుంచి సదరన్ బ్లాక్ సాయిల్ (ఎస్బీఎస్) పొగాకు బేళ్లను కూడా రైతులు అమ్మకానికి తీసుకు వచ్చారు. ఎన్ఎల్ఎస్ పొగాకు కిలో గరిష్ట ధర రూ.290, ఎస్బీఎస్ పొగాకు రూ.280 చొప్పున పలికాయి. ట్రేడర్లు గత ఏడాది ప్రారంభ ధర కంటే కిలోకు అదనంగా రూ.50 పెంచి మరీ కొనుగోలు చేశారు. 2023–24 సీజన్లో కిలో ప్రారంభ ధర రూ.240 పలకగా, అమ్మకాల ముగింపు నాటికి రూ.410కు పెరిగింది. ఈడీ విశ్వశ్రీ అధికారులను అడిగి పొగాకు వేలం విధానం తెలుసుకున్నారు. పొగాకు నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో బోర్డు విస్తరణాధికారి దామోదర్, రీజినల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్, వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మిత, పొగాకు వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్, వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు కాట్రు వీర వెంకట సత్యనారాయణ, గౌరవ సలహాదారు నరహరిశెట్టి రాజేంద్రబాబు, కార్యదర్శి దుద్దుపూడి హరిబాబు, రైతులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, పలువురు మహిళా రైతులు, బోర్డు సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మలగిరి.. భక్తజన ఝరి
ఫ కిటకిటలాడిన మేరీ మాత పుణ్యక్షేత్రం ఫ ప్రత్యేక వాహనాలపై తరలి వచ్చిన భక్తులు దేవరపల్లి: గౌరీపట్నంలోని నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీ మాత మహోత్సవాలు రెండు రోజులుగా వైభంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఆదివారం భక్తజన ప్రవాహం పోటెత్తింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు బస్సులు, ఆటోలు, కార్లు, ఇతర వాహనాల్లో తరలి వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, తమ కోర్కెలను మరియతల్లికి విన్నవించుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కుటుంబ సమేతంగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. పలువురు భక్తులు సుమారు 200 మీటర్ల ఎత్తయిన కొండ పైన ఉన్న క్రీస్తు ఆలయానికి మెట్ల దారిలో మోకాళ్లపై ఎక్కి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ మెట్ల దారిపై ఈ ఏడాది రేకుల పందిరి వేశారు. పుణ్యక్షేత్రం ప్రధాన ద్వారం వద్ద ఉన్న మరియతల్లి మండపం వద్ద భక్తులు ఆ తల్లి స్వరూపం వద్ద మోకరిల్లి ప్రత్యేక ప్రార్థనల ద్వారా తమ కోర్కెలు విన్నవించుకుంటున్నారు. మతాలకు అతీతంగా ప్రజలు మేరీ మాత ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. కొబ్బరి కాయలు కొట్టడం, తలనీలాలు సమర్పించడం పుణ్యక్షేత్రంలో ప్రత్యేకత. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక షెడ్లలో భక్తులు విశ్రాంతి తీసుకుంటున్నారు. పెరిగిన రద్దీ సాయంత్రం 6 గంటల నుంచి పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉత్సవాలకు నాలుగు రోజుల్లో సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. పుణ్యక్షేత్రం ఏర్పడి దాదాపు 40 ఏళ్లు కాగా, అఖండ దేవాలయ ప్రతిష్ఠాపన జరిగి 25 ఏళ్లవడంతో, ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకూ తరలివస్తున్న భక్తులతో పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. వారికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసు సిబ్బందితో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యాన దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు మేరీమాత ఉత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు. గుండుగొలను – కొవ్వూరు పాత జాతీయ రహదారికి ఇరువైపులా పుణ్యక్షేత్రం ఉండడంతో ఈ నెల 25వ తేదీ వరకూ ట్రాఫిక్ను హైవే మీదుగా మళ్లించారు. కొవ్వూరు వైపు వెళ్లే భారీ వాహనాలు, క్వారీ లారీలను దేవరపల్లి, దుద్దుకూరు వద్ద.. దేవరపల్లి, జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే వాహనాలను గౌరీపట్నం, పంగిడి వద్ద జాతీయ రహదారి వైపు మళ్లించినట్లు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు యథాతథంగా తిరుగుతాయని చెప్పారు. మార్మోగుతున్న క్రీస్తు ఆరాధన క్రీస్తు ఆరాధనతో పుణ్యక్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 25న పీఠాధిపతులు దివ్యబలి పూజ సమర్పణతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. నవదిన జపాలు, దివ్యబలి పూజలు, పవిత్రాత్మ స్వస్థత ప్రార్థనలు, పరిశుద్ధ జపమాల వంటి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏలూరు పీఠాధిపతి, విశాఖపట్నం అగ్రపీఠం అపోస్తోలిక పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఎస్.జాన్పీటర్ ఆధ్వర్యాన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పుణ్యక్షేత్రంలో ఆదివారం నల్గొండ పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ కరణం ధమన్ కుమార్, వికార జనరల్ పి.బాల, రెవరెండ్ ఫాదర్ డి.ఆరోన్, జి.మోజెస్ దివ్యబలి పూజ, పవిత్రాత్మ స్వస్థత ప్రార్థనలు, పరిశుద్ధ జపమాల, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పీఠాధిపతులు, ఫాదర్లు ప్రార్థనలు చేసి భక్తులను ఆశీర్వదించారు. -
గీత దాటేదే లే..
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025ఫ పిఠాపురం, గొల్లప్రోలుల్లో అవిశ్వాసానికి కుట్ర ఫ బలం లేకపోయినా కుతంత్రాలు ఫ ప్రలోభాలకు లొంగని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఫ జనసేన నేతలకు చుక్కెదురు పిఠాపురం: తుని మున్సిపాలిటీలో చేయాల్సిన అక్రమాలు, అరాచకాలన్నీ చేసి, చివరకు కేసులు కూడా పెట్టి, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను కూటమి నేతలు వేధించిన విషయం తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు అదే కూటమి లోని జనసేన నేతలు పిఠాపురం, గొల్లప్రోలుపై కుట్రకు తెర తీశారు. అయితే, వారి ప్రయత్నాలను వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఆదిలోనే అడ్డుకున్నారు. డబ్బు, పలుకుబడి, అధికారం, ప్రలోభాలు, పైరవీలు.. ఇలా ఒకటీ రెండూ కాదు.. అస్త్రాలన్నీ ప్రయోగించినా.. ఉన్న అడ్డదారులన్నీ తొక్కినా.. తాము వైఎస్సార్ సీపీ శ్రీగీతశ్రీ దాటేదే లేదని ఆ పార్టీ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. తాము వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించేది లేదని, నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ వంగా గీత మాట జవదాటేది లేదని రెండు పట్టణాల్లోనూ ఆ పార్టీ కౌన్సిలర్లు స్పష్టంగా చెబుతున్నారు. దీంతో, అడ్డదారిలో పురపాలన పగ్గాలు చేజిక్కించుకునేందుకు కుట్రలు పన్నిన జనసేన నేతలకు ఆదిలోనే చుక్కెదురైంది. ఏం జరిగిందంటే.. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉంది. అడ్డగోలు హామీలతో ప్రజలను బురిడీ కొట్టించి, గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కూటమి నేతలు.. ము ఖ్యంగా జనసేన నాయకులు ఈ రెండు పట్టణాలపై కన్ను వేశారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభపె ట్టి, అవసరమైతే భయపెట్టి అడ్డదారిలో పురపాలనాధికారం దక్కించుకోవాలనే కుట్రకు తెర తీశారు. ఈ నే పథ్యంలో పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందు కు ఈ నెల 21 నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. బలాబలాలివీ.. ఫ పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లకు గాను గతంలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇక్కడ ప్రస్తుతం 29 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరు కాకుండా స్థానిక ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఎక్స్ అఫీషి యో సభ్యులుగా పిఠాపురంలోనే ఓటు వేసే అవకాశాలున్నాయి. ఈ లెక్కన ఓటింగ్కు మొత్తం 32 మంది సభ్యులు ఉన్నారు. గత ఎన్నికల్లో మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నుంచి గండేపల్లి సూర్యావతిౖ పె చైర్పర్సన్గా ఉన్నారు. ఆమైపె అవిశ్వాసం పెట్టా లంటే మొత్తం సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేయాలి. అంటే కనీసం 22 మంది సంతకాలు అవసరం. ప్రస్తు తం కౌన్సిల్లో వైఎస్సార్ సీపీకి 18 మంది, జనసేనకు తాజాగా చేరిన ఆరుగురు కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి 9 మంది ఉన్నారు. టీడీపీకి చెందిన ఒక సభ్యుడు చనిపోగా.. ఆ పార్టీకి 5 ఓట్లు ఉన్నాయి. ఫ గొల్లప్రోలు నగర పంచాయతీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో వైఎస్సార్ సీపీకి ఏకంగా 19 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీకి ఒక సభ్యుడే ఉన్నాడు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇటీవల కొంత మంది వైఎస్సార్ సీపీ నేతలు జనసేనలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గొల్లప్రోలు నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా జనసేనలో చేరలేదు. ఒక కో ఆప్షన్ సభ్యుడు వెళ్లినా ఆయనకు ఓటు హక్కు లేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఈ నగర పంచాయతీ చైర్పర్సన్ పదవి కూడా జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. ప్రస్తుతం గండేటి మంగతాయారు చైర్పర్సన్గా ఉన్నారు. ఆమైపె అవిశ్వాసం పెట్టాలంటే 14 మంది సభ్యులు అవసరం. ప్రస్తుత తరుణంలో అది జరిగే పని కాదు. బెడిసికొట్టిన జనసేన యత్నాలు పిఠాపురంలో అవిశ్వాసానికి 22 మంది కౌన్సిలర్ల సంతకాలు కావాలి. జనసేన, టీడీపీ కౌన్సిలర్లను కలిపినా ఆ సంఖ్య 14 దాటడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నుంచి మరో ఆరుగురిని తమ పార్టీలో చేర్చుకోవాలని జనసేన నేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కొంత మంది నాయకులు, కౌన్సిలర్లు ఇప్పటికే రహస్య సమావేశాలు జరిపినా చైర్పర్సన్ అభ్యర్థిగా ఎవ్వరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. దీంతో పాటు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు తమ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలబడటంతో జనసేన నేతలు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అధికార జులుం, తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి, నయానో భయానో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకునేందుకు వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాగైనా ఈ రెండు మున్సిపాలిటీలనూ తమ వశం చేసుకునేందుకు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు జనసేన నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పిలిచి టికెట్టు ఇచ్చి, తమను కౌన్సిలర్లను చేసిన తల్లిలాంటి పార్టీని, ప్రతి విషయంలో తమకు అండగా ఉంటున్న నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత మాటను దాటి మరో పార్టీలోకి వెళ్లేది లేదంటూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. అధికారం ఉన్నా విశ్వాసాన్ని కొనలేరని ఆ పార్టీ నేతలు మరోసారి నిరూపించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
జల్సాల కోసం బైకుల చోరీలు
ఫ నిందితుడి అరెస్టు ఫ 31 వాహనాల స్వాధీనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చెడు వ్యసనాలు, జల్సాల కోసం ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న నిందితుడిని ప్రకాష్ నగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్బాబు, సీఐ బాజీలాల్, ఎస్సై శివప్రసాద్ ఈ వివరాలు తెలిపారు. నల్లజర్ల మండలం మర్లపూడి గ్రామానికి చెందిన తూర్ల సోమయ్య ప్రస్తుతం రాజమహేంద్రవరం మంగళవారపేటలో నివాసం ఉంటున్నాడు. అతడు చెడు వ్యసనాలు, తిరుగుళ్లకు బానిసయ్యాడు. తన జల్సాలకు అవసరమైన డబ్బుల కోసం బైకులు దొంగతనం చేసేవాడు. అలా దొంగిలించిన బైకులను నల్లజర్ల మండలం జగన్నాథపురానికి చెందిన చీర్ల కిషోర్ ద్వారా తక్కువ ధరకే విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. రాజమహేంద్రవరంలో ఇటీవల బైకు దొంగతనాలు ఎక్కువగా జరుగుతూండటంతో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు.. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తూర్ల సోమయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా బైకు చోరీల చిట్టా బయట పడింది. దొంగిలించిన బైకులు విక్రయించడానికి సహకారం అందించిన చీర్ల కిషోర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం, కోరుకొండ, ఏలూరు, విజయవాడ ప్రాంతాల్లో నిందితుడు చోరీ చేసిన 31 బైకులు రికవరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.16 లక్షలుంటుందని సీఐ బాజీలాల్ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ బాజీలాల్, ఎస్సై శివప్రసాద్, క్రేన్ కానిస్టేబుళ్లు కె.ప్రదీప్ కుమార్, ఎస్.వీరబాబు, వి.శివప్రసాద్లను ఎస్పీ అభినందించారు. ద్విచక్ర వాహదారులు తమ బైకుల రక్షణకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ రమేష్బాబు కోరారు. హ్యాండిల్ లాక్తో పాటు, ఫోర్క్ లాక్ ఉపయోగిస్తే బైకు దొంగతనాలను కొంతమేరకు అరికట్టవచ్చన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అధునాతన తాళాలు వచ్చాయని, వాటిని ఉపయోగించడం ద్వారా బైకులకు మరింత రక్షణ లభిస్తుందని తెలిపారు. -
వర్గీకరణ బిల్లును వెంటనే విరమించుకోవాలి
రాజమహేంద్రవరం రూరల్: ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఆమోదించడంపై ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ బిల్లును విరమించుకునేంత వరకూ, చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ సమితి ఆధ్వర్యాన స్థానిక మోరంపూడి జంక్షన్లో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం కూట మి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోరంపూడి జంక్షన్లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా పోరాట సమితి నాయకులు ఇసకపట్ల రాంబాబు, పరమట గణేశ్వరరావు, చీరా రాజు, ఆరే చిన్ని, ఎలుగొండ లక్ష్మి (చెల్లాయమ్మ) మాట్లాడుతూ, రాజ్యాంగ విరుద్ధంగా, సహజ సూత్రాలకు వ్యతిరేకంగా ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లును విరమించుకోకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. వర్గీకరణ పేరుతో మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టి రాజ్యాధికారం సాధించకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ చట్ట విరుద్ధమన్నారు. వర్గీకరణ పేరుతో రాజకీయ పబ్బం గడుపుకొంటున్న చంద్రబాబు.. మాలలకు తీవ్ర అన్యాయం చేస్తున్నార ని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఎస్సీ వర్గీకరణ చేయడం లేదని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ పార్టీని ప్రశ్నించగలరా అని నిలదీశారు. కులగణన చేసిన తరువాతే వర్గీకరణ జోలికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. మంద కృష్ణ మాదిగ చెప్పిన కాకి లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మాలల విశ్వరూపం చూపించి, చంద్రబాబు కు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. -
విద్యారంగ సమస్యలపై
uఫ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే బకాయిలు చెల్లించాలి ఫ ఆర్థిక సమస్యలు తక్షణం పరిష్కరించాలి ఫ యూటీఎఫ్ డిమాండ్ ఫ రాజమహేంద్రవరంలో పోరుబాట రాజమహేంద్రవరం సిటీ: విద్యారంగంలో పేరుకుపోతున్న ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తలపెట్టిన పోరుబాటలో భాగంగా రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఆదివారం విద్యా సదస్సు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.30 వేల కోట్లు బకాయిల చెల్లింపులపై సరైన శ్రద్ధ చూపించడం లేదని అన్నారు. 29 శాతం ఐఆర్ ప్రకటించి, 12వ ిపీఆర్సీ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు డీఏలు, పీఆర్సీ ఎరియర్లు, సరెండర్ లీవులు, మెడికల్ రీయింబర్స్మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారో రోడ్ మ్యాప్ తెలియజేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ పోరుబాట ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉనికి కోల్పోతున్నాయన్నారు. భవిష్యత్తులో మోడల్ పాఠశాలల పేరుతో గ్రామాల్లోని చాలా పాఠశాలలను ఎత్తివేసే యోచనతో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామాల్లో కామన్ పాఠశాలలు ఉండాలని, విద్యా రంగానికి జీడీపీలో 6 శాతం నిధులు ఖర్చు చేయాలని ఎన్నో సూచనలు చేసిన కొఠారి కమిషన్ నివేదికను ప్రభుత్వాలు ఆచరించటం లేదన్నారు. ఊరి బడిని బతికించుకోవటానికి ఉపాధ్యాయులంతా నడుం కట్టాలన్నారు. అందుకోసం పిల్లలు, పిల్లల తల్లిదండ్రులతో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. నూతన విద్యావిధానం–2020 అమలు చేస్తూ ప్రభుత్వ విద్యా రంగాన్ని తుంగలోకి తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విద్యారంగ ప్రయోజనాలతో కాకుండా పాలకవర్గ ప్రయోజనాలతో ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నాయని, అందుకే ప్రభుత్వ విద్యారంగం వెనుకబడుతోందని అన్నారు. విద్యారంగానికి నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వ ఉదాశీన వైఖరి ఇలాగే ఉంటే భవిష్యత్తులో వేలాది ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా విధానానికి పాలకులు పెద్దపీట వేయాలన్నారు. పోరాటాల ద్వారా మాత్రమే ఉపాధ్యాయుల హక్కుల సాధన జరుగుతుందన్నారు. టీచర్లు మార్కిస్టు, కమ్యూనిస్టు భావాలతో ఉన్నప్పుడు మాత్రమే నూతన మానవుల్ని, నూతన సమాజాన్ని తయారు చేయగలరన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భారీ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, ఆర్థిక ప్రలోభాలు ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తోటకూర చక్రవర్తి, అరుణకుమారి, రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీదేవి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఐదు జిల్లాల్లోని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా, రాష్ట్ర బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు -
డెల్టాలకు 10,700 క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు ఆదివారం 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,200, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.80 అడుగులకు చేరింది. రత్నగిరిపై భక్తుల సందడిఫ సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ఫ 1,600 వ్రతాల నిర్వహణ ఫ రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో ఉదయం నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని ఆదివారం 40 వేల మంది దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,600 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, టేకు రథంపై వేంచేయించారు. పూజల అనంతరం పండితులు రథ సేవ ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు సేవ అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు ధరించి (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ఆయిల్ పామ్పై తెగుళ్ల దాడి
పెరవలి: జిల్లాలో వరి తరువాత అధిక మొత్తంలో సాగు అవుతున్న పంట ఆయిల్పామ్. 19,266 హెక్టార్లలో ఈ పంట సాగు జరుగుతుండగా సంవత్సరానికి 76 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. ఈ పంటలపై వివిధ రకాల తెగుళ్లు, పురుగులు ఆశించి ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోందని, సత్వరం సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యాన అధికారి సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. తెగుళ్లు సోకినప్పుడు రైతులు తీసుకోవాల్సిన చర్యల గురించి, ఎరువుల యాజమాన్యం గురించి ఆయన వివరించారు. కొమ్ము పురుగు కొమ్ముపురుగు ఆయిల్పామ్ మొక్కలను ఆశించినప్పుడు మొక్కల ఆకులు వి ఆకారంలో కత్తిరించినట్టు ఉంటాయి. ఈ పురుగులు భూమిలో ఏర్పడిన పగుళ్లలో నివసిస్తాయి. అంతేకాకుండా చెట్టు మొదలులో ఉన్న పీచులో కూడా ఇవి చేరి పంటకు హాని చేస్తాయి. ఇవి మొవ్వలోకి కూడా ప్రవేశించి మెత్తని పదార్థాన్ని తినేస్తాయి. నివారణ చర్యలు మొక్కల చుట్టూ చెత్తాచెదారం లేకుండా చూడాలి. ఒకవేళ ఉంటే వాటి మీద కార్బరిల్ మందును 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొవ్వలో పురుగులు ఉన్నట్టు గుర్తిస్తే వాటిని తీగతో తీసివేసి అది చేసిన రంధ్రానికి 25 గ్రాముల కార్బరిల్ మందును 10 గ్రాముల తడి ఇసుకలో కలిపి మొవ్వలో పెట్టాలి. సంచి పురుగు ఈ పురుగులు శంఖు ఆకారంలో ఉండి ఆకు అడుగు భాగాన చేరతాయి. ఆకులకు రంధ్రాలు చేసి తినివేస్తాయి. నివారణ చర్యలు ఈ పురుగులు సోకిన ఆకులను కత్తిరించి తగులబెట్టాలి. మిగిలిన ఆకుల మీదు కార్బరిల్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొవ్వుకుళ్లు తెగులు తేమ ఎక్కువగా ఉన్నప్పుడు దీని ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్క పసుపురంగులోకి మారి మొవ్వ ఆకులను లాగితే తేలికగా వస్తాయి. మొవ్వ లాగిన మొక్క నుంచి తీవ్ర దుర్గంధం వస్తుంది. నివారణ చర్యలు ఈ తెగులు సోకిన భాగాన్ని శుభ్రం చేసి లీటరు నీటికి కార్బండిజమ్ గ్రాము మందు కలిపి ఆ ప్రాంతమంతా పూయాలి. గానోడెర్మా కుళ్లు తెగులు ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు కింద వరుసలో ఎండిపోతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే మొవ్వులోకి చేరి కాండం మొదలు వద్ద కణజాలాన్ని ఆశించడంతో అక్కడ కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది. నివారణ చర్యలు తెగులు సోకి చనిపోయిన చెట్లను వెంటనే చేను నుంచి తొలగించాలి. ఆ చెట్టు వేరును తీసి ట్రైడీమార్ఫ్ మందును 100 మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి ఆ వేరు ద్వారా ఎక్కించాలి. సేంద్రియ ఎరువులను అధికంగా చెట్టు మొదలులో వేయాలి. కాండం తడి తెగులు ఈ తెగులు సోకిన చెట్ల మొవ్వు అకస్మాత్తుగా వడలి, ఎండిపోతుంది. మిగిలిన ఆకులు త్వరితగతిన వడలి ఎండిపోతాయి. మొవ్వు ఆకు వడలిన వెంటనే సస్యరక్షణ చర్యలు ప్రారంభిస్తే చెట్లు కోలుకుని బతుకుతాయి. నివారణ చర్యలు ఈ తెగులు సోకిన చెట్టు మొవ్వును లాగి అందులో కుళ్లిన పదార్థాన్ని తీసి శుభ్రం చేసిన తరువాత కార్బండిజమ్, మోనోక్రోటోఫాస్లను కుళ్లిన చోట పైపూతగా వేసి ఆ తరువాత తారును పూసి ఉంచాలి. గెలకుళ్లు తెగులు ఈ తెగులు సోకిన గెలలు కుళ్లిపోవడంతో తెల్లని శిలీంధ్రాలతో కనిపిస్తాయి. ఈ తెగులు సోకిన గెలలను వెంటనే నరికివేసి ఆ ప్రాంతంలో కుళ్లిన పదార్థాలను తీసి 0.1 శాతం కార్బండిజమ్ మందుతో శుద్ధి చేయాలి. ఇలా చేయడం వలన మిగిలిన గెలలకు ఈ తెగులు వ్యాపించకుండా ఉంటుంది. ఎరువుల యాజమాన్యం ఆయిల్ పామ్ మొక్కలకు సంవత్సరానికి రెండు మోతాదుల్లో ఎరువులు అందించాలి. మొదటి మోతాదు జూన్, జూలై నెలల్లోను, రెండవ మోతాదు డిసెంబర్, జనవరి నెలల్లోనే వేయాలి. మూడేళ్ల వయస్సు దాటిన ఒక్కో మొక్కకు 2 కిలోల 600 గ్రాముల యూరియా, సింగిల్ఫాస్ఫేట్ 3 కిలోల 750 గ్రాములు, పొటాష్ 2 కిలోలు, మెగ్నీషియం సల్ఫేట్ 500 గ్రాములు ఏడాదిలో రెండుసార్లు వేయాలి. జిల్లాలో వరి తరువాత అధికంగా సాగవుతున్న పంట సస్య రక్షణతో సమస్య దూరం -
గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం
నల్లజర్ల:మండలం దూబచర్లలో వైఎస్సార్ వసంత్నగర్ కాలనీలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించి రెండుపోర్షన్ల షెడ్డు అగ్నికి ఆహుతి అయ్యింది. సుంకర సన్యాసమ్మ ఆదివారం ఉదయం టీకాచుకునేందుకు గ్యాస్ స్టౌ వెలిగించగా గ్యాస్ లీకై వ్యాపించిన మంటలలో ఇంటి సామగ్రి అంతా కాలి బూడిదైంది. ఆమె దాచుకున్న రూ.15 వేలు కళ్లముందే కాలిపోయాయి. పక్క పోర్షన్లో అద్దెకు ఉంటున్న పగటి వేషాలు వేసే భైరవపాటి వెంకటేశ్వరావుకు చెందిన సౌండ్ సిస్టమ్, హోర్మోనియం, తబలా, మేకప్ దుస్తులు, రూ.25 వేల నగదు కాలి బూడిదయ్యాయి. మొత్తం రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్టు అంచనావేశారు. భీమడోలు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పంది సత్యనారాయణ, స్థానిక నాయకుడు చేబ్రోలు బాలాజీ తదితరులు పరామర్శించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇనుపగొట్టం పడి జట్టు కూలీ మృతిఅంబాజీపేట: జీవనోపాధి కోసం కూలి పనికి వెళ్లిన వ్యక్తి తలపై ఇనుప గొట్టం పడడంతో అతడు మృత్యువాత పడ్డాడు. పనికి వెళ్లి వస్తానని చెప్పి ఉదయమే వెళ్లిన కొద్ది గంటల్లోనే అతడు మృతి చెందాడన్న విషయం తెలియడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరైంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిరతపూడి గ్రామానికి చెందిన దారపురెడ్డి శ్రీనివాసు (పండు) (25) ఆదివారం అమలాపురంలో ఓ భవన నిర్మాణానికి జట్టు కూలీలతో కాంక్రీటు శ్లాబు కొట్టే పనికి వెళ్లి వెళ్లాడు. అక్కడ పనులు చేస్తున్న సమయంలో పై అంతస్తు నుంచి ఓ ఇనుప గొట్టం శ్రీనివాస్ తలపై పడింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 108 వాహనంలో అతనిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. మృతుడికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ మృతితో తల్లిదండ్రులు లక్ష్మణస్వామి, ధనలక్ష్మితో పాటు భార్య దుర్గ, కుమార్తె లహరి, కుమారుడు విశ్వాస్, బంధువులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
విజేత కోనసీమ వృషభం
సామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. కేవలం సెకండ్ల వ్యత్యాసంలో ఎడ్లు విజేతలుగా నిలిచి యజమానికి గర్వకారణంగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పోటీలను తిలకించి మాట్లాడుతూ గతంలో ఎంత పశు సంపద ఉంటే అంత గొప్పవారిగా పరిగణించే వారని పేర్కొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఏరువాక సాగడానికి కొందరు రైతులు ఎడ్లను పెంచుతూ ఇటువంటి పోటీలకు రావడం హర్షణీయమన్నారు. ఎడ్ల పరుగు పోటీల్లో పాల్గొనే రైతులే నిర్వాహకులుగా శ్రీకుమారా రామ భీమేశ్వర రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలను వల్లూరి సత్యేంద్రకుమార్ మెమోరియల్గా ఏర్పాటు చేయడం ఆయనపై ఉన్న గౌరవ చాటిచెప్తొందని అన్నారు. ఈ పోటీలను మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం ప్రారంభించారు. సీనియర్ విభాగంలో ఉమ్మడి జిల్లాలైన తూర్పు, పశ్చిమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ జిల్లాలకు చెందిన 12 జతల ఎడ్లు, జూనియర్ విభాగంలో 31 జతల ఎడ్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పరుగు పందెంలో కోనసీమ జిల్లా గుమ్మిలేరుకు చెందిన కోరా శృతిచౌదరి ఎడ్లు మొదటి స్థానంలో నిలిచాయి. ద్వితీయ స్థానంలో అనకాపల్లికి జిల్లా అర్జునగిరికి చెందిన పరవన్నాయుడు ఎడ్లు, మూడో స్థానంలో మళ్లీ శృతిచౌదరి ఎడ్లు నిలిచాయి. వారికి వరుసగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నిర్వాహకుడు కంటే ఫణికుమార్, వుండవిల్లి వీరవెంకటరామరాజు బహుమతులను అందజేశారు. మొదటిస్థానంలో నిలచిన ఎడ్లు నిర్ణీత దూరాన్ని ఐదు నిమిషాల 24 సెకండ్ల 93 మిల్లీ సెకండ్లలో, రెండో స్థానంలో నిలచిన ఎడ్లు ఐదు నిమిషాల 31 సెకండ్ల 16 మిల్లీ సెకెండ్లలో, మూడో స్థానంలో నిలచిన ఎడ్లు ఐదు నిమిషాల 34 సెకండ్ల 81 మిల్లీ సెకెండ్లలో విజేతలుగా నిలిచాయి. జూనియర్ విభాగంలో ప్రధమ విజేతగా సామర్లకోటకు చెందిన వల్లూరి సత్యేంద్రకుమార్ ఎడ్లు, ద్వితీయ విజేత వడిశిలేకుకు చెందిన ధరణి శ్రీనివాసు ఎడ్లు, తృతీయ విజేత గాడాలకు చెందిన మద్దాల శ్రీను ఎడ్లు, నాలుగో బహుమతిగా వెల్దుర్తికి చెందిన మొగిలి ఏసుబాబు ఎడ్లు, ఐదవ బహుమతిగా మళ్లీ సత్యేంద్రకుమార్ ఎడ్లు బహుమతులు గెలుచుకున్నాయి. వీరికి రైతు సంఘం అధ్యక్షుడు కంటే బాబు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సిద్దా నానాజీ, యనమల కృష్ణ, చేకూరి రామకృష్ణ వ్యవహరించగా, నిర్వాహకులు వల్లూరి దొరబాబు, బిక్కిన రంగ నాయకులు, వుండవిల్లి వీరవెంకటరామరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు గోలి వెంకట అప్పారావుచౌదరి, యార్లగడ్డ చిన్ని, కౌన్సిలర్ బలుసు వాసు, రైతు సంఘ నాయకుడు కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసు, నిమ్మకాయల రంగనాగ్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగిన ప్రదర్శనను దారి పొడవునా ప్రజలు చెట్లు ఎక్కి మరీ ఆసక్తిగా తిలకించారు. ఉత్కంఠగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు జూనియర్ విభాగంలో విజేత సామర్లకోట -
నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు ప్రారంభం
దేవరపల్లి: గౌరీపట్నం వద్ద ఉన్న నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రం ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర ఈ ఉత్సవాలను ప్రారంభించారు. పుణ్యక్షేత్రం ముఖమండపంలోని మరియతల్లి స్వరూపానికి బిషప్ జయరావు పొలిమెర పూలమాల వేసి, పలువురు ఫాదర్లతో కలిసి ప్రార్థన చేశారు. అఖండ దేవాలయం కింది భాగంలో ఏర్పాటు చేసిన బైబిల్ ప్రదర్శనను, భక్తుల సౌకర్యార్థం పుణ్యక్షేత్రంలో రూ.14 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్ల సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన బైబిల్ ప్రదర్శనను భక్తులు తిలకించి, ఈ గ్రంథం విశిష్టతను తెలుసుకోవాలని అన్నారు. ఈ మహోత్సవాలు ఈ నెల 25 వరకూ జరుగుతాయన్నారు. పుణ్యక్షేత్రంలో అఖండ దేవాలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయినందున సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా 250 మంది వలంటీర్లు, 200 మంది పోలీస్ సిబ్బందితో అన్ని భద్రతా చర్యలూ చేపట్టామని వివరించారు. సుమారు 125 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పుణ్యక్షేత్రంలో అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని బిషప్ జయరావు తెలిపారు. పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ మాట్లాడుతూ ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం మంచినీరు, అన్నదానం, మజ్జిగ పంపిణీ వంటి ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇబ్బందులు ఎదురైతే సమాచార కేంద్రం వద్ద సంప్రదించాలని సూచించారు. రాత్రి దివ్యబలి పూజ, పరిశుద్ధ జపమాల, స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఫాదర్లు పి.బాల, డీవీ ప్రసాద్, అమృతన్, నిత్యాన్నదాన కాంట్రాక్టర్ కళ్ళే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో పరిశుభ్రత వ్యక్తిగత బాధ్యత
రాజానగరం: హాస్టళ్లలో పని చేస్తున్న సిబ్బందితో పాటు ఉంటున్న విద్యార్థులు కూడా పరిశుభ్రతను వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. వర్సిటీ ప్రాంగణంలోని బాలుర హాస్టల్ను శనివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. వంట గది, విద్యార్థులు భోజనం చేసే హాలు వంటి వాటిని పరిశీలించారు. హాస్టల్ నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. వీసీతో పాటు తనిఖీకి వచ్చిన రాజమహేంద్రవరం కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ మాట్లాడుతూ, హాస్టల్ను పరిశుభ్రంగా ఆహార పదార్థాల నాణ్యతను మెరుగుగా ఏవిధంగా ఉంచవచ్చునో సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో చీఫ్ వార్డెన్ ఆచార్య ఎస్కే రమేష్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణ లక్ష్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు ˘ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రస్తుత రబీలో జిల్లావ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. ధాన్యం సేకరణపై రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, తూనికలు – కొలతలు, రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టేక్ హోల్డర్లు, కస్టోడియన్ అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల ఒకటో తేదీ నాటికి జిల్లాలోని 216 రైతు సేవా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలూ కల్పించి, ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన గోనె సంచులు సిద్ధం చేయాలన్నారు. ధాన్యం సేకరణలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని జేసీ కోరారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి పౌర సరఫరాల అధికారి ఎస్.భాస్కర్రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.రాధిక, ఇతర అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు. డొంకరాయి నుంచి 5 వేల క్యూసెక్కులుసీలేరు: గోదావరి డెల్టాలో రబీ సాగుకు సీలేరు కాంప్లెక్స్లోని డొంకరాయి జలాశయం నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని శనివారం నుంచి విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్కో అధికారులు తెలిపారు. గోదావరి డెల్టాకు సీలేరు జలాలు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు గత ఫిబ్రవరి 10న కోరారు. ఈ మేరకు డొంకరాయి నుంచి 5 వేలు, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నుంచి 4,300 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నామని జెన్కో అధికారులు వివరించారు. ఫిబ్రవరి 10 నుంచి శనివారం వరకూ గోదావరి డెల్టాకు 10.19 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. ఈ నెల 31 వరకూ నీటిని విడుదల చేయనున్నామని తెలిపారు. -
అధిక దిగుబడి వంగడాలు అందిస్తున్నాం
కొవ్వూరు: రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని, నూతన వంగడాలను అందిస్తున్నామని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ (వీసీ) డాక్టర్ కె.గోపాల్ అన్నారు. స్థానిక వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానంలో శనివారం కిసాన్ మేళా నిర్వహించారు. తొలుత వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రాలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలసి ప్రారంభించారు. అనంతరం కిసాన్ మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొవ్వూరు పరిశోధన స్థానంలో అరటిపై ఆరేళ్లుగా విశేష పరిశోధనలు చేసి, రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించామన్నారు. రాష్ట్రంలో అరటి ఉత్పత్తులు పెరగడానికి ఇది దోహదపడిందన్నారు. ఈ పరిశోధన స్థానం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. ఇక్కడ విత్తన పిలక ఎంపిక నుంచి యాజమాన్య పద్ధతులు, సస్య రక్షణ, సేంద్రియ సాగు, కోత అనంతరం పరిజ్ఞానం వంటి సమగ్ర సమాచారాన్ని రైతులకు అందిస్తున్నామని వివరించారు. రైతులకు టిష్యూ కల్చర్ మొక్కలు అందిస్తున్న సంస్థల్లో కొవ్వూరు ఒక్కటే ప్రభుత్వ రంగంలో ఉందన్నారు. ఈ పరిశోధన కేంద్రంలో రూపొందించిన సంప్రదాయ రకాలైన తెల్లర చక్కెరకేళీ, కర్పూర, ఎర్ర చక్కెరకేళీ, మార్టమన్, కొవ్వూరు బొంత, గోదావరి బొంత వంటి రకాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. కావేరి కల్కి, పోపోవులు, ఫియా–3 వంటి అరటి రకాల్లో కూడా టిష్యూ కల్చర్ మొక్కలను అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. కొవ్వూరు పరిశోధన స్థానం నుంచి ఇప్పటి వరకూ 13 లక్షలకు పైగా టిష్యూ కల్చర్ మొక్కలను రైతులకు అందించామన్నారు. ఇక్కడ విడుదలైన కొవ్వూరు బొంత అనే కూర అరటి రకం ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. దుంప పంటల్లో గజేంద్ర అనే తీపి కంద రకం, భావపురి, గోదావరి చేమతో పాటు శబరి అనే పెండలం రకాన్ని కూడా ఇక్కడి నుంచే విడుదల చేశామని వీసీ డాక్టర్ గోపాల్ చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో ఉద్యాన పరిశోధన స్థానం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ బి.గోవిందరాజులు, ప్రిన్సిపల్ సైంటిస్టులు పి.లలితా కామేశ్వరి, డి.వెంకటస్వామి, శాస్త్రవేత్తలు ఎ.స్నేహలతారాణి, ఎంపీపీ కాకర్ల నారాయుడు, జెడ్పీటీసీ సభ్యులు బొంతా వెంకటలక్ష్మి, అర్బన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ·˘ OÐðlGÝëÞÆŠ‡ E§éů]l Ð]lÇÞsîæ ÒïÜ Vø´ëÌŒæ ·˘ MöÐ]lNÓÆý‡$ ç³ÇÔZ«§ýl¯]l Ý릯]l…ÌZ కిసాన్ మేళా -
కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసింది. పరీక్షలు ముగియడంతో ఇంటర్ విద్యార్థులు, వారికి ఇతర భక్తులు తోడవడంతో సత్యదేవుని సన్నిధిలో రద్దీ ఏర్పడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 1,600 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సెలవు రోజు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు. ఘనంగా ప్రాకార సేవ సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, తిరుచ్చి వాహనంపై వేంచేయించారు. అర్చకుల పూజల అనంతరం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి ప్రాకార సేవ ప్రారంభించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన, మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ
● ఐదు కాసుల బంగారు నగలు, ● 300 గ్రాముల వెండి వస్తువుల అపహరణ పి.గన్నవరం: మండలంలోని ఊడిమూడి శివారు ఆదిమూలం వారిపాలెంలో దొంగలు ఒక ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని ఐదు కాసుల బంగారు నగలు, 300 గ్రాము ల వెండి వస్తువులను చోరీ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఆదిమూలం రాజరాజేశ్వరి 15 రోజుల క్రితం హైదరాబాద్లోని కుమార్తె ఇంటికి వెళ్లారు. ఆమె సోదరుడు ఊడిమూడికి చెందిన కొండ్రెడ్డి కాశీ విశ్వనాథ్ అప్పుడప్పుడూ వచ్చి రాజరాజేశ్వరి ఇంటిని పరిశీలించి వెళ్తున్నారు. గత సోమవారం చివరగా ఆమె ఇంటిని చూసి వెళ్లాడు. ఇటీవల అదే గ్రామంలోని చింతావారిపేటలో దొంగతనం జరిగిన నేపథ్యంలో.. శనివారం ఉదయం సోదరి ఇంటిని పరిశీలించేందుకు కాశీ విశ్వనాథ్ ఆ ఇంటికి వచ్చి వెనుక తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి సోదరికి సమాచారం అందించారు. ఇంట్లోని బీరువాలు పగులగొట్టి, సామాన్లు చిందరవందరగా ఉండడం, బంగారు, వెండి వస్తువులతో పాటు, రూ.25 వేల నగదును తస్కరించినట్టు వారు గుర్తించారు. -
అనర్హులే పట్టు సాధించారు
ఫ అర్హులకు అందని ప్రోత్సాహం ఫ చేబ్రోలు పట్టు పరిశ్రమ అధికారుల మాయాజాలం ఫ ఆందోళన చేపట్టిన రైతలు పిఠాపురం: అనర్హులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నా రని మల్బరీ రైతులు ఆందోళనకు దిగారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు పట్టు పరిశ్రమ అధికారులు సిఫార్సులకు ప్రాధాన్యమిచ్చి అర్హులను విస్మరించారని రైతులు ఆరోపిస్తున్నారు. 53.19 ఎకరాల్లో 26 మంది రైతులను గుర్తించి, ఇందులో 20 ఎకరాలు దాటి మల్బరీ సాగు చేయలేదని రైతులు వాపోయారు. నువ్వులు ఇతర పంటలు సాగు చేసిన వారికి కూడా మల్బరీ నర్సరీ ప్రోత్సాహం ఎకరానికి 22,500 చొప్పు న ఇస్తున్నారని, ఇందులో అర ఎకరం సాగు చేసిన వా రికి కూడా రెండు నుంచి నాలుగు ఎకరాలలో వేసినట్టు నమోదు చేశారని పట్టు రైతులు ఆరోపించారు. అనర్హులకు పరిహారం గత ఏడాది గూళ్లు నష్టపోయిన వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.11,30,000 సహాయం అందించినప్పటికీ అధికారులకు నచ్చిన రైతులకే పరిహారం అందించారని, మిగిలిన వారిని వదిలేసారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇన్సెంటీవ్లు కూడా సీరియల్ పాటించట్లేదని వారు పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఇష్టం వచ్చిన వారి పేర్లు నమోదు చేసి, అర్హులకు మొండిచేయి చూపారని రైతులు ఓరుగంటి చక్రధర్ రావు, సూరిబాబు, ఉలవల సురేష్, చక్రి వెలుగుల మాణిక్యం తదితరులు కోరుతున్నారు. అధికారులు అన్యాయం చేశారు గత ఏడాది నాలుగు ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టాను. గూళ్లు సక్రమంగా రాకపోవడంతో పట్టు పరిశ్రమ అధికారుల సూచనతో పంట తొలగించి నువ్వు చేను వేశాను. గుళ్లు కట్టిన రైతులకు అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. అందులో కూడా తనను గుర్తించలేదు. నర్సరీ వేసిన వెంటనే ఎకరానికి 22,500 చొప్పున ఇవ్వాల్సిన ప్రోత్సాహం కూడా అందించలేదు. అధికారుల నిర్వాకం వల్ల రూ.మూడు లక్షల వరకు నష్టపోయాను. – ఓరుగంటి సూరిబాబు, పట్టు రైతు చేబ్రోలు అర్హులకే ఇస్తున్నాం మల్బరీ సాగు చేసిన రైతులనే నర్సరీ ప్రోత్సాహకాలు అందించడానికి గుర్తించాం. అలాగే గూళ్లు నష్టం కూడా కొంతమంది రైతులకు అందకపోవటం వాస్తవమే. వారిని రెండో జాబితాలో పెట్టాము. అది ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదని ఇన్సెంటీవ్ పాత సీరియల్ ప్రకారమే అందిస్తాం. ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆ రైతులు ఎనిమిది ఎకరాలు మల్బరీ సాగు చేసినప్పటికీ ఇప్పుడు నువ్వు చేలు వేసుకున్నారు. – టి.మోసయ్య, పట్టు పరిశ్రమ అధికారి, చేబ్రోలు -
టెక్నిక్తో జీవితం సెట్
● ఏప్రిల్ 30న పాలిసెట్ పరీక్ష ● జిల్లాలో 8 పాలిటెక్నిక్ కళాశాలలు ● అందుబాటులో 1820 సీట్లు రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచం సాంకేతికంగా దూసుకుపోతోంది. ఆ వేగాన్ని అందుకోవాలనే లక్ష్యంతో నేటి యువత సైతం తత్సంబంధమైన విషయ పరిజ్ఞానాన్ని అభ్యసించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంజినీరింగ్లో సైతం కంప్యూటర్ ఆధారిత కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల కంటే ముందుగానే ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ ఉత్తీర్ణులకు లభిస్తుంది. దీంతో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులపై దృష్టిపెడుతున్నారు. సాంకేతిక విద్యకు పునాది.. సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ జరగనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025ను ప్రకటించింది. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా మార్చుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పాలిసెట్ ద్వారా పలు కోర్సులతో సాంకేతిక విజ్ఞాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఏప్రిల్ 15 తుది గడువు.. పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఈ నెల పదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఈ నెల 12వ తేదీ నుంచే ఫీజులను ఆన్లైన్లో గేట్వే ద్వారా చెల్లించే సౌకర్యం అందుబాటులో ఉంచారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాయదలుచుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు ఉంది. 10వ తరగతి, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, ఈ ఏడాది అటువంటి పరీక్షలు రాస్తున్నవారు కూడా పాలిసెట్కు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష 120 మార్కులకు నిర్వహిస్తారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాయడానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లభించే కోర్సులు ఇవీ.. పాలిటెక్నిక్లో వివిధ కోర్సులను జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. పాలిటెక్నిక్ కోర్సుల కాల వ్యవధి మూడేళ్ల వరకు ఉంటుంది. ఆరు నెలల పాటు విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ కూడా ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకునే శిక్షణ సైతం ఇస్తారు. జిల్లాలో 8 కళాశాలలు జిల్లాలో విద్యార్థులకు మొత్తం 8 పాలిటెక్నిక్ కళాశాలల్లో 1820 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనపర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రాజానగరం గైట్ పాలిటెక్నిక్, రాజానగరం ఐఎస్టీఎస్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, పిడింగొయ్యిలోని రైట్ పాలిటెక్నిక్, పాలచర్లలోని బీవీసీ పాలిటెక్నిక్, కొండగుంటూరు ఎస్ఎస్ పరిమళ పాలిటెక్నిక్, బూరుగపల్లి బెన్నయ్య పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి పదో తరగతి ముగిసిన వెంటనే పాలిటెక్నిక్ చదివితే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి. పాలిసెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బొమ్మూరులోని జీఎంఆర్ పాలిటెక్నిక్లో ఉచిత శిక్షణ తో పాటు స్టడీమెటీరియల్ ఇస్తారు. పాలిటెక్నిక్ పూర్తయిన తరువాత ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. – వి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్, బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, ఏపీ పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్ పాలిసెట్కు ఉచిత శిక్షణ బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్కు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉచిత శిక్షణతో పాటు ప్రవేశపరీక్షకు సంబంధించి స్టడీ మెటీరియల్ సైతం ఉచితంగా అందజేస్తారు. ఆసక్తి గల విద్యార్థులు ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. -
భక్తులతో శోభిల్లిన వాడపల్లి
● వైభవంగా పూజాదికాలు ● ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులు కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర క్షేత్రం భక్తజనంతో శోభిల్లింది. ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు వేద పండితులు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. తిరుప్పావై ద్రవిడ వేదపారాయణం చేసి సుందరంగా అలంకరించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీదుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. గోవింద నామస్మరణతో వాడపల్లి మార్మోగింది. 11 గంటల నుంచి నుంచి వేలాది మందికి అన్న సమారాధన చేశారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రద్దీ మేరకు ఏర్పాట్లు.. వాడపల్లి క్షేత్రానికి పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని డీఎస్పీ సుంకర మురళీమోహన్ అన్నారు. శనివారం ఆయన క్షేత్రాన్ని సందర్శించి క్యూలైన్లను, పార్కింగ్ స్థలాలను పరిశీలించి భక్తులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించారు. ఈఓ చక్రధరరావు, స్థానిక పోలీసు అధికారులతో ఈ మేరకు సమీక్షించి పలు సూచనలిచ్చారు. దేవస్థానం సెక్యూరిటీ పెంచాలని, బందోబస్తుకు అదనపు సిబ్బందిని పెంచే చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆయన వెంట రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై రాము ఉన్నారు. ఒక్క రోజు ఆదాయం రూ 50.97 లక్షలు దేవస్థానానికి శనివారం సాయంత్రం 4 గంటల వరకూ విశిష్ట దర్శనం ద్వారా రూ.13,05,400, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.8,63,900, వేదాశీర్వచనం ద్వారా రూ.16,76,232, లడ్డు ప్రసాదం ద్వారా రూ 6,11,100, శాశ్వత అన్నదానానికి రూ.83,428, నిత్యాన్నదానానికి రూ.1,45,341, ఆన్లైన్ టిక్కెట్ల ద్వారా రూ.1,57,048 పాటు వివిధ రూపాల్లో రూ.50,96,624 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. బాలబాలాజీ ఆలయంలో కోలాహలం మామిడికుదురు: పవిత్ర వైనతేయ గోదావరి నదీతీరం అప్పనపల్లిలో కొలువు తీరిన బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి వారి సన్నిధిలో శ్రీలక్ష్మీ నారాయణ హోమం నిర్వహించారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.2,58,570 ఆదాయం వచ్చిందని ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. స్వామి వారి నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.55,783 విరాళాలుగా అందించారన్నారు. నాలుగు వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని చెప్పారు. 2,300 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. -
నేడు రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు
పరుగుకు సిద్ధమైన 45 జతల ఎడ్లు సామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు వద్ద ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు జరుగుతున్నాయి. ఈ మేరకు సీనియర్ విభాగం నుంచి 8 జతలు, జూనియర్ విభాగం నుంచి 37 జతల ఎడ్లు కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఉండూరుకు చేరుకున్నాయి. శ్రీ కుమార రామభీమేశ్వర ఎడ్ల పరుగు పోటీలు వల్లూరి సత్యేంద్రకుమార్ మెమోరియల్ పేరుతో ఎడ్ల పరుగు పోటీల్లో పాల్గొనే రైతులే ఏర్పాటు చేయడం విశేషం. మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం పోటీలను ప్రారంభిస్తారని నిర్వాహకులు వల్లూరి దొరబాబు, సీతారామరాజు, బిక్కిన రంగనాయకులు, చేకూరి రామకృష్ణ, మలిరెడ్డి వీరేంద్రలు తెలిపారు. సీనియర్ విభాగంలో మూడు, జూనియర్ విభాగంలో ఐదు బహుమతులను ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సీనియర్ విభాగంలో కిలోమీటరున్నర, జూనియర్ విభాగంలో కిలోమీటరు దూరాన్ని ఎడ్లు పరుగెట్టాల్సి ఉంటుందన్నారు. బాలికలపై వ్యక్తి అత్యాచారయత్నం పెద్దాపురం: ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు శనివారం స్థానిక దర్గా సెంటర్లో వ్యాపారం చేసుకుంటున్న కామేశ్వరరావు రెండు, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలికల అరుపులతో స్థానికు లు అక్కడికి చేరుకుని దేహశుద్ధి చేసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడు అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఎస్ఐ మౌనికను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
గాంధీకాలనీలో అంబేడ్కర్కు అవమానం
● విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులు ● ఆందోళన చేపట్టిన రిజర్వేషన్ల వ్యతిరేక పోరాట సమితి ● బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ హోం మంత్రి వనిత డిమాండ్ నల్లజర్ల: మండలం దూబచర్ల శివారు గాంధీకాలనీలో రహదారి పక్కనున్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. శనివారం ఉదయం విగ్రహానికి చెప్పులదండ ఉండటం చూసి అంబేద్కర్ అభిమానులు, రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దూబచర్ల–లక్కవరం రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆందోళన 11 గంటల వరకు జరుగుతూనే ఉంది. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని చెప్పుల దండను తొలగించి క్లూస్ టీం, డాగ్స్కాడ్లను రంగంలోకి దింపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని అరెస్ట్ చేయాలని కోరారు. అనంతరం మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తానేటి వనిత సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఈ ఘటన హేయమైన చర్య అని, పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇక్కడి విగ్రహాన్ని తొలగించి నూతన విగ్రహం ఏర్పాటు చేసి పైన రూఫ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వారు ఏర్పాటు చేయకపోతే తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండలశాఖ అధ్యక్షులు వెల్లంకి వెంకట సుబ్రమణ్యం, నాయకులు బంక అప్పారావు, ముప్పిడివెంకటరత్నం, సాలి వేణు, తొమ్మండ్రు రమేష్, నక్కా పండు, పంది సత్యనారాయణ, తొమ్మండ్రు రవి, పెండ్యాల హరేరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ దేవకుమార్, నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు సీఐల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు. -
మెగా డీఎస్సీపై మొదటి సంతకం ఏమైంది?
కూటమి హామీలపై ధ్వజమెత్తిన ఏఐవైఎఫ్ అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే తొమ్మిడి నెలలు గడస్తున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు మాటే మరిచిందని ఏఐవైఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి సతీష్కుమార్ ధ్వజమెత్తారు. అమలాపురంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో 17వ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల లోగోను జిల్లా శాఖ ప్రతినిధులు శనివారం ఆవిష్కరించారు. సతీష్కుమార్, కార్యదర్శి యనమదల ఉమేష్ తదితరులు కూటమి ప్రభుత్వ హామీల వైఫల్యాలను ఎండగట్టారు. మెగా డీఎస్సీ అంటూ అధికారంలోకి వచ్చిన రోజు మొదటి సంతకంగా చేసినా నేటికీ చర్యలు లేవని ఆరోపించారు. నిరుద్యోగ భృతిపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలోని ఓఎన్జీసీ వనరులను గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్న పరిణామాలపై ఏఐవైఎఫ్ జిల్లా శాఖ ప్రతినిధులు దుయ్యబట్టారు. తిరుపతిలో వచ్చే మే 15వ తేదీ నుంచి ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహా సభల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను చర్చించనున్నట్టు వారు తెలిపారు. జతీయ మహాసభల లోగో ఆవిష్కరణలో ఏఐవైఎఫ్ జిల్లా కోశాధికారి యాండ్ర నాగరాజు, జిల్లా శాఖ సభ్యులు నిమ్మకాయల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
త్వరలో కొత్త ట్రస్ట్బోర్డు?
● ముగిసిన అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి కాలపరిమితి ● ఈ నెలాఖరులోగా ఏర్పాటయ్యే అవకాశం ● ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఆశావహుల పేర్లు తీసుకున్న ప్రభుత్వం ● కొత్త ట్రస్ట్బోర్డులో చైర్మన్తో కలిసి 18 మంది సభ్యులు? ● ఇద్దరు చొప్పున అవకాశం కల్పించాలంటున్న బీజేపీ, జనసేన ● దాత, శ్రీలలితా ఇండస్ట్రీ అధినేత మట్టే సత్యప్రసాద్ పేరు సిఫారసు అన్నవరం: స్థానిక శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి త్వరలో నూతన ధర్మకర్తల మండలిని నియమించనున్నారు. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. దేవస్థానం ధర్మకర్తల మండలి (ట్రస్ట్బోర్డు) కాల పరిమితి ఫిబ్రవరి ఎనిమిదో తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. నూతనంగా ఏర్పాటయ్యే ధర్మకర్తల మండలిలో సభ్యత్వాల కోసం పేర్లు పంపించాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలువురు శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీ అధిష్టానం గతంలోనే కోరింది. దీంతో మంత్రులు, ఆయా శాసనసభ్యులు ఆశావహుల జాబితాలను అధిష్టానానికి అందచేశారు. ఈ నెలాఖరులోగా ట్రస్ట్బోర్డు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 18 మందికి అవకాశం కొత్త ట్రస్ట్బోర్డులో చైర్మన్తో సహా 18 మంది సభ్యులు ఉంటారని సమాచారం. దేవదాయశాఖ చట్టం ప్రకారం దేవస్థానం వ్యవస్థాపక కుటుంబానికి చెందిన ఐవీ రోహిత్ ఈ బోర్డుకు చైర్మన్గా నియమితులవ్వనున్నారు. సభ్యులుగా 17 మందిని నియమించనున్నారు. వీరిలో సుమారు 12 మంది పురుషులు, ఐదు లేదా ఆరుగురు మహిళలు ఉంటారని సమాచారం. అన్ని సామాజికవర్గాలతో బాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వర్గాలకు చెందిన వారికి ట్రస్ట్బోర్డులో స్థానం కల్పించనున్నట్టు సమాచారం. గతంలో 16 మందితో.. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండాలని, 50 శాతం మహిళలు ఉండాలని భావిస్తూ మొత్తం 16 మందితో ట్రస్ట్బోర్డు ఏర్పాటు చేసింది. వీరిలో ఏడుగురు మహిళలు. మొత్తం 15 మందిలో ఎనిమిది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కావడం విశేషం. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీ ప్రకారం నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ట్రస్ట్బోర్డులో స్థానం కల్పించారు. దేవస్థానం చరిత్రలో ఈ విధంగా సగం మంది మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఏర్పాటైన ట్రస్ట్బోర్డుగా నిలిచిపోయింది. కొత్త ట్రస్ట్బోర్డు సభ్యత్వాల కోసం మంత్రులు, ఎంఎల్ఎ లపై వత్తిడులు అన్నవరం దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యత్వాల కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల పై దిగువ శ్రేణి నాయకులు ఒత్తిడులు తెస్తున్నారు. అయితే ఇప్పటికే వారు ఈ పదవుల కోసం కొన్ని పేర్లు సిఫారసు చేసినట్టు సమాచారం. ● దేవస్థానానికి ఎక్కువ మొత్తంలో విరాళాలు సమర్పించిన దాతగా, స్వామి, అమ్మవార్లకు వజ్రకిరీటాలు చేయించడం, రూ.ఐదు కోట్లు వ్యయంతో ప్రసాదం భవనం నిర్మించిన పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్ పేరు ఆ నియోజకవర్గం నుంచి సిఫారసు చేసినట్లు సమాచారం. ● ట్రస్ట్బోర్డులో బీజేపీ, జనసేన నుంచి ఇద్దరు చొప్పున నియమించాలని ఒత్తిడి వస్తున్నా ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం ఉండనుంది. ఒకవేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గట్టిగా పట్టుబడితే రెండో వ్యక్తిని ఆ పార్టీ నుంచి నియమించే అవకాశం ఉంది. ● సత్యదేవుని ఆలయం కలిగిన ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గతంలో మాదిరిగా ఇద్దరికి ట్రస్ట్బోర్డులో అవకాశం కల్పించనున్నారు. అయితే ఒకరు టీడీపీ, ఇంకొకరు జనసేన లేదా బీజేపీ నుంచి నియమితులవుతారని అంటున్నారు. ● జగ్గంపేట, కాకినాడ టౌన్ లేదా కాకినాడ రూరల్, తుని నియోజకవర్గాల నుంచి టీడీపీ నుంచి ఒక్కొక్కరికి ట్రస్ట్బోర్డులో అవకాశం లభించే అవకాశం ఉంది. ● అనపర్తి నియోజకవర్గం, కోనసీమ నుంచి కూడా ఒక్కొక్కరికి అవకాశం కల్పించనున్నారు. ● గతంలో గుంటూరు జిల్లా నుంచి కూడా ఒకరికి ఈ ట్రస్ట్బోర్డులో ప్రాతినిధ్యం కల్పించారు. అదే ఆనవాయితీని ఈ సారి కూడా పాటిస్తారంటున్నారు.అన్నవరం దేవస్థానం -
ఏపీఎస్పీ సిబ్బందికి ఉగాది పురస్కారాలు
కమాండెంట్ నాగేంద్రరావుకు మహోన్నత సేవా పతకం కాకినాడ రూరల్: కాకినాడ ఏపీఎస్పీ మూడవ బెటాలియన్ ప్రస్తుత కమాండెంట్ ఎం.నాగేంద్రరావుకు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది మహోన్నత సేవా పతకం లభించింది. ఏపీ పోలీసు అండ్ ఫైర్ సర్వీసు పతకాలు– సేవా పతకాలను ఉగాది – 25కు శుక్రవారం ప్రకటించింది. నాగేంద్రరావు అక్టోపస్ ఎస్పీ (ఆపరేషన్స్ అండ్ అడ్మిన్)గా పనిచేసి ఇటీవల ఏపీఎస్సీ 3వ బెటాలియన్కు వచ్చారు. అక్టోపస్ ఎస్పీగా అందించిన సేవలకు గాను ఆయనకు ఉగాది పురస్కారం లభించింది. 13 మంది ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బందికి పురస్కారాలు కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ సిబ్బంది 13మందికి పతకాలు వరించాయి. అడిషనల్ కమాండెంట్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్ బి.శ్రీనివాస బాబ్జీ ఉత్తమ సేవా పతకాలు పొందారు. కఠిన సేవా పతకం హెచ్సీ బీవీ అప్పన్న, సేవా పతకాలను ఆర్ఐలు బి.శ్రీనివాసరావు, కె.రవిశంకరరావు, ఆర్ఎస్సైలు ఎం.,రాజా, డి.నిర్మలకుమార్, బి.రవిశంకరబాబు, ఏఆర్ఎస్సైలు బి.మోహనరావు, జి.ఆదియ్య, టి.సూర్యనారాయణ, డి.రామనాయుడు, ఎన్.జాకబ్రాజు పొందారు. -
తీస్రా అష్రాతో అల్లాహ్ సాన్నిహిత్యం
ఫ ముగింపు దశలోకి పవిత్ర రంజాన్ మాసం ఫ ముగిసిన మగ్ఫిరత్ ఫ ప్రారంభమైన తీస్రా అష్రా ఫ నరకం నుంచి విముక్తి కోరడమే చివరి పది రోజుల విశిష్టత సాక్షి, రాజమహేంద్రవరం: ముస్లింల పవిత్ర రంజాన్ మాసం చివరి అంకానికి చేరుకుంది. రెండో పది రోజుల కాలం శ్రీమగ్ఫిరత్ కా అష్రాశ్రీ ముగిసింది. మూడో పది రోజుల కాలం ప్రారంభమైంది. మరో తొమ్మిది రోజుల్లో ఉపవాస దీక్షలు ముగియనున్నాయి. మనిషి చేసిన పాపాలకు మరణానంతరం విధించే నరకాగ్ని నుంచి విముక్తి కోరుకునేందుకు ఈ చివరి అష్రా (పది రోజులు) కేటాయించారు. ఇదీ ఉద్దేశం ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12 నెలల్లో రంజాన్ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. రంజాన్ 30 లేదా 29 రోజులు కూడా వస్తుంది. ఈ మాసాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి పది రోజులు రహమత్కా అష్రా అంటారు. ఇందులో అల్లాహ్ కరుణ, దయ ఎక్కువగా ఉంటాయి. రెందో దశకాన్ని మగ్ఫిరత్ కా అష్రా అంటారు. మూడో దశకాన్ని జహన్నంసే పనాహ్ మాంగ్నేకా అష్రా అంటారు. ఇందులో అనేక విశిష్టతలున్నాయి. ఇది రంజాన్ మాసం ముగింపు సందర్భంగా కనిపించే చంద్ర దర్శనం వరకూ (21 రోజాల నుంచి 30 లేదా 29) ఉంటుంది. చేసిన పాపాలను కడిగేసుకునేందుకు తౌబా, అస్తగ్ఫర్ను పదేపదే పఠించాలి. నమాజులు చదివి, తెలిసీ తెలియక చేసిన తప్పులకు క్షమించమని అల్లాహ్ను దువా ద్వారా వేడుకోవాలి. జీవితంలో మరోసారి అలాంటి తప్పులు చేయబోమని స్వచ్ఛమైన మనసుతో వేడుకుంటే (తౌబా) కరడుగట్టిన పాపాత్ములకు కూడా అల్లాహ్ విముక్తి కల్పిస్తారని పవిత్ర గ్రంథం ఖురాన్ బోధిస్తోంది. దీనిని అనుసరించి ముక్తి పొందాలని మౌల్వీలు, మత పెద్దలు ఉపదేశిస్తున్నారు. లైలతుల్ ఖదర్ ప్రత్యేకం రంజాన్ మాసం చివరి పది రోజుల్లో వచ్చే శ్రీలైలతుల్ ఖదర్ (పెద్ద రాత్రి) ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ రాత్రి జాగరణ చేసి, అల్లాహ్ను ఆరాధించి, నమాజులు చేసి, ఖురాన్ పఠించి, దువా చేసి, అనుగ్రహం పొందితే మరణం తరువాత స్వర్గం లభిస్తుందని ఖురాన్ బోధిస్తోంది. వెయ్యి నెలల పాటు నిత్యం అల్లాహ్ను ఆరాధిస్తే లభించే పుణ్యం కేవలం పెద్ద రాత్రి ఆరాధనలతో లభిస్తుందని మౌల్వీలు చెబుతున్నారు. ఖురాన్ అవతరించింది ఈ అష్రాలోనే. ఇఖ్రా బిస్మి రబ్బిక్ అనే పారా భూమి పైకి వచ్చిందని మౌల్వీలు చెబుతారు. రంజాన్ మాసంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న పెద్ద రాత్రి ఏ రోజు రాత్రి ఉందో స్పష్టత లేదు. అయితే అది ఐదు తాఖ్రాత్లలో వెతుక్కోవాల్సి ఉంది. ఈ నెల 21, 23, 25, 27, 29 తేదీ ఉపవాస దీక్షలు పాటించడం కంటే ముందు వచ్చే రాత్రుల్లో ఏదైనా ఒక దానిలో ఉందని మహ్మద్ ప్రవక్త (సొల్లెల్లాహు అలైహి వసొల్లెం) బోధించిన హదీసు పుస్తకాల ద్వారా తెలుస్తోంది. ఈ ఐదు రాత్రులూ జాగారం చేస్తే లైలతుల్ ఖదర్ విశిష్టతలను పొందవచ్చు. ఇందులో భాగంగానే ముస్లింలు జిల్లా వ్యాప్తంగా జాగరణ ద్వారా అల్లాహ్ను ఆరాధిస్తున్నారు. ఉదయం వరకూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. భక్తిశ్రద్ధలతో తాఖ్రాత్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 400 మసీదులున్నాయి. దాదాపు అన్నిచోట్లా తాఖ్రాత్లు నిర్వహిస్తున్నారు. మసీదులను రంగురంగుల విద్యుత్ద్దీపాలతో సుందరంగా అలంకరించారు. రాత్రంతా జాగారం చేసి, దైవారాధన చేపడుతున్నారు. జాగారం చేసిన వారికి మసీదుల్లో సెహరీకా ఇంతిజామ్ (భోజన ఏర్పాట్లు) చేపడుతున్నారు. ఇతికాఫ్ ప్రపంచంతో పాటు సమాజ సుఖాలను త్యజించి, పూర్తిగా పది రోజుల పాటు అల్లాహ్ కోసం గడిపే కార్యక్రమాన్ని ఇతికాఫ్ అంటారు. మసీదులోనే ఒక మూలన ప్రత్యేక గదిలా డేరాల గుడారం ఏర్పాటు చేసుకుని, అక్కడే ఉండాలి. ప్రార్థనలూ చేసుకోవాలి. బయటకు రాకుండా అవసరమైన వాటిని అక్కడే ఉంచుకుని దైవ సాన్నిధ్యంలోనే గడపాలి. రంజాన్ చివరి రోజుల్లో నిర్వహించే అష్రాతో అల్లాహ్ సాన్నిధ్యం లభిస్తుంది. పూర్వీకుల పాప విముక్తి రంజాన్ రోజాల అనంతరం సాయంత్రం ఇఫ్తార్ వేళను మొర ఆలకించే సమయం అంటారు. ఆ సమయంలో కోరుకున్న వాటిని అల్లాహ్ ప్రసాదిస్తారని ఖురాన్ బోధిస్తోంది. ఇఫ్తార్కు ముందు చేసే దువాకు కూడా తప్పక ఆమోదం లభిస్తుంది. నరకం ఖరారైన పాపుల్లో (చనిపోయిన వ్యక్తులు) లక్షల మందికి ప్రతి ఇఫ్తార్ వేళలో అల్లా విముక్తి కల్పిస్తారని మత పెద్దలు చెబుతున్నారు. మొదటి రోజా నుంచి చివరి రోజా వరకూ ఎంత మందికి విముక్తి కల్పిస్తారో.. అంత మందికి రంజాన్ చివరి రోజు ఇఫ్తార్ సమయంలో ఒకేసారి విముక్తి కల్పిస్తారని అంటున్నారు. ఇఫ్తార్ వేళ చేసే దువాల్లో పూర్వీకులకు నరకం ఖరారై ఉంటే వారిని క్షమించి, విముక్తి కల్పించి, స్వర్గంలో ప్రవేశం కల్పించాలని కోరుకుంటే అది ఫలిస్తుందని మౌల్వీలు అంటున్నారు. నమాజ్, దువాలోసమయం గడపాలి రంజాన్ చివరి పది రోజుల్లో నమాజ్, దువాలోనే సమయం గడపాలి. ఇతికాఫ్ అనే ప్రత్యేక ఇబాదత్ చేయాలి. తద్వారా అల్లాహ్ సాన్నిహిత్యాన్ని పొందవచ్చు. చేసిన పాపాల నుంచి విముక్తి పొందవచ్చు. ఇఫ్తార్ వేళల్లో పూర్వీకుల పాపాలను క్షమించాల్సిందిగా దువా చేయాలి. – మొహమ్మద్ ఆరిఫ్, జిల్లా వక్ఫ్బోర్డ్ మాజీ చైర్మన్విద్యుద్దీప కాంతుల్లో రాజమహేంద్రవరంలోని ఓ మసీదుచివరి రాత్రి రంజాన్ చివరి రోజు రాత్రిని శ్రీలైలతుల్ జాయిజాశ్రీ (తెల్లవారితే ఈదుల్ ఫితర్ పండగ) అంటారు. ఈ రాత్రి చేసిన దువాలు తప్పక ఫలిస్తాయని హదీసులు బోధిస్తున్నాయి. సాధారణంగా పండగ చేసుకోవాలనే సంబరంతో ముస్లింలు షాపింగ్లు, సరదాలతో ఉంటారు. కానీ ఆ రోజు చేసే దువాలకు దైవదూతలు (ఫిరిస్తే) కూడా ఆమీన్ (తథాస్తు) అంటాయని చెబుతున్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
రాజమహేంద్రవరం సిటీ: సమస్యల పరిష్కారానికి ఈ నెల 24, 25 తేదీల్లో జరపతలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి లక్ష్మీపతిరావు, నాయకులు శేషుకుమార్, పాపారావు తెలిపారు. బ్యాంక్ యాజమాన్యాలు, సెంట్రల్ లేబర్ కమిషనర్తో శుక్రవారం చర్చలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా త్వరలో తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో సమ్మె వాయిదా వేశామని తెలిపారు. అందువలన సోమ, మంగళవారాల్లో బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని వారు తెలిపారు. యువికా దరఖాస్తు గడువు రేపటితో పూర్తి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇస్రో ఉచిత సందర్శనకు దరఖాస్తు చేసుకోవడానికి ఆదివారంతో గడువు ముగుస్తుందని జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ నెహ్రూ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇస్రో యువికా–2025కు (యువ విజ్ఞాన కార్యక్రమం) దేశంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికై న వారికి మే నెలలో రెండు వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహించి, అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పిస్తారన్నారు. అలాగే దేశంలోని 7 ఇస్రో సెంటర్లను సందర్శించే అవకాశం కల్పిస్తారన్నారు. యువికాకు అర్హత సాధించిన విద్యార్థులకు ప్రయాణ, వసతి, భోజన సదుపాయాలను ఇస్రో ఉచితంగా అందిస్తుందని తెలిపారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నెహ్రూ కోరారు. రేపు అక్షరాస్యతా పరీక్ష రాజమహేంద్రవరం రూరల్: శ్రీఉల్లాస్ – నవభారత సాక్షరతా కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యుమరసీ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వీవీఎస్ మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. జిల్లాలోని రంగంపేట, రాజానగరం, బిక్కవోలు, చాగల్లు, నిడదవోలు, పెరవలి మండలాల్లోని 5,087 మంది నిరక్షరాస్యులైన గ్రామీణ మహిళలకు 509 మంది వలంటీర్లతో శిక్షణ తరగతులు నిర్వహించామని వివరించారు. వీరు చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో సాధించిన పురోగతిని అంచనా వేసేందుకు ఈ అక్షరాస్యతా పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 10 నుంచి మూడు గంటల పాటు ఈ పరీక్ష జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన వారు వారి గ్రామాల్లోనే పరీక్ష రాయవచ్చని తెలిపారు. మొత్తం 5,087 మంది అభ్యాసకుల కోసం 143 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని అక్షరాస్యులుగా గుర్తిస్తూ జాతీయ సాక్షరతా విద్యా సంస్థ (ఎన్ఐఓఎస్) ధ్రువీకరణ పత్రం అందజేస్తుందని మూర్తి తెలిపారు. పనిభారం తగ్గించండిరాజమహేంద్రవరం రూరల్: పనిభారం పెరిగిపోయి, మానసిక ఒత్తిళ్లతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) శాంతామణికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మునుపెన్నడూ లేని విధంగా సర్వేలతో పాటు, పదుల సంఖ్యలో పనులు అప్పగించడంతో వాటి నిర్వహణ కష్టంగా ఉందన్నారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగులు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పనిభారం తగ్గించాలని కోరారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ దృష్టికి కూడా తమ సంఘం నాయకులు ఈ విషయాన్ని తీసుకు వెళ్లారన్నారు. పంచాయతీల్లో ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, లైసెన్స్ ఫీజులు, లీజులు, వేలం పా టలు, ఇతర పన్నుల వసూళ్ల వంటివి చేపట్టాల్సి ఉందన్నారు. అంతే కాకుండా పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, వీధిలైట్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు అనేక ధ్రువీకరణలు చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే, రికార్డుల నిర్వహణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఉన్నాయన్నారు. ఇవి కాకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన 15 రకాల సర్వే యాప్ల ద్వారా పని చేయడం భారంగా మారుతోందని డీపీవో దృష్టికి తీసుకుని వెళ్లారు. డివిజన్ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు టంకాల శ్రీనివాస్, మేకా ప్రసాద్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి జి.వెంకట్రావు, సీనియర్ కార్యదర్శులు రూప్చంద్, వి.శ్రీనివాసరావు, శ్రీరామమూర్తి, కొవ్వూరు డివిజన్ నాయకులు షేక్ ఖాసిం సాహెబ్, మహ్మద్ జానీ పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
పెదవేగి: మండలంలోని విజయరాయి సీతారామ కల్యాణ మండపంలో శుక్రవారం కోకో రైతుల రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బొల్లు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా కె.శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోళ్ల సుబ్బారావు (పశ్చిమగోదావరి), పానుగంటి అచ్యుతరామయ్య (ఏలూరు), ఉప్పుగంటి భాస్కరరావు (కోనసీమ), గుదిబండి బండి వీరారెడ్డి (ఏలూరు), మార్ని శ్రీనివాసరావు (తూర్పుగోదావరి) సహా య కార్యదర్శులుగా ఉప్పల కాశీ (తూర్పుగోదావరి), కొసరాజు రాధాకష్ణ (ఏలూరు), కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ (కోనసీమ), కోశాధికారిగా జాస్తి కాశీ బాబు (ఏలూరు) మరో 35 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోకో రైతుల సమస్యలను పరిష్కరించాలని 24, 25 తేదీల్లో కోకో సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆలిండియా సపక్ తక్రా పోటీల్లో ప్రతిభఅమలాపురం టౌన్: ఆలిండియా పోలీస్ క్రీడా పోటీల్లో వరుసగా మూడోసారి పతకాలు సాధించిన యాండ్ర గౌతమ్ను ఎస్పీ బి.కృష్ణారావు తన కార్యాలయంలో శుక్రవారం అభినందించారు. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకూ హర్యానా రాష్ట్రం మడగడలో జరిగిన 73వ ఆలిండియా పోలీస్ క్రీడా పోటీల్లో వాలీబాల్ క్లస్టర్ క్రీడా విభాగం విభాగంలో గౌతమ్ కాంస్య పతకాన్ని సాధించారు. జిల్లాకు చెందిన 2108 బ్యాచ్కు చెందిన సివిల్ కానిస్టేబుల్ గౌతమ్ సపక్ తక్రా క్రీడలో నైపుణ్యం సాధించాడు. గౌతమ్ సపక్ తక్రా క్రీడలో రాణిస్తూ ఇప్పటి వరకూ మూడు కాంస్య పతకాలు సాధించడం అభినందనీయమని ఎస్పీ కృష్ణారావు అన్నారు. 2003లో పంజాబ్ రాష్ట్రం జలంధర్లోజరిగిన, 2024లో మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన ఆలిండియా పోలీస్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించి ఇప్పుడు మరో కాంస్య పతకాన్ని కై వసం చేసుకోవడం విశేషమని ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. 70 రకాల డ్రగ్స్ పట్టివేత కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్, విజిలెన్స్, ఈగల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 70 రకాల నార్కోటిక్ డ్రగ్స్ను పట్టుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు రూ.3 లక్షలకు పైగా విలువైన మత్తు మందులను అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రావులపాలెంతో పాటు పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. డ్రగ్స్ కంట్రోలర్ ఏడీ డి.నాగమణి, విజిలెన్స్ ఏఎస్పీ ఎం.స్నేహిత ఈ దాడుల్లో పాల్గొని అనధికారంగా విక్రయించిన మత్తుమందులతో పాటు, పలు రకాల ఔఽషధాలను గుర్తించారు. నార్కోటిక్ డ్రగ్స్ హోల్సేల్ దుకాణల నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా నేరుగా రిటైల్ దుకాణాలకు అమ్మడం, వారు తిరిగి వినియోగదారులకు విక్రయించడం ఈ దాడుల్లో కనుగొన్నారు. డాక్టర్ చీటీ లేకుండా మందులు అమ్మడం, బిల్లులు లేకుండా అమ్మడం, కొనడం నేరాల కింద ఉమ్మడి తూర్పుగోదారి జిల్లా పరిధిలో 20 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. పోక్సో కేసులో ఐదేళ్ల జైలు అయినవిల్లి: అయినవిల్లిలంక గ్రామ శివారు గాలితిప్పపేటకు చెందిన మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విఽధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు జడ్జి ఓ.శ్రీదేవి శుక్రవారం తీర్పు వెలువరించినట్లు పి.గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.రుద్రరాజు భీమరాజు, అయినవిల్లి ఎస్సై హరికోటి శాస్త్రి తెలిపారు. 2023 మే 11న అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల డెక్క రాంబాబు మూడేళ్ల బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆశ చూపి మాయమాటలతో తన ఇంటిలోకి అఘాయిత్యం చేశాడు. బాలిక తల్లి అదే రోజు ఫిర్యాదు ఇవ్వగా అప్పటి ఎస్సై నాగేశ్వరరావు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి కొత్తపేట డీఎస్పీ కేవీరమణ దర్యాప్తు చేసి డెక్క రాంబాబును అరెస్టు చేసి కోర్టుకు అప్పగించారు. కాకినాడ పోక్సో కోర్టులో కేసు విచారణ జరగగా, పీపీ జి.వెంకటరత్నంబాబు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో జడ్జి తీర్చు ఇచ్చారు. -
ముస్లింలకు ఇఫ్తార్ విందు
రాజమహేంద్రవరం సిటీ: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు కఠిన నిబద్ధతతో చేసే ఉపవాస దీక్షలు అందరికీ స్ఫూర్తిదాయకమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ జక్కంపూడి గణేష్ అన్నారు. నగరంలోని ముస్లింలకు జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యాన హోటల్ ఆనంద్ రీజెన్సీ పందిరి హాలులో జక్కంపూడి గణేష్ శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, నగరంలోని ముస్లింలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి, ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందదాయకమని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, నేతలు నందెపు శ్రీనివాస్, హబీబుల్లా ఖాన్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఆరీఫ్, కరీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ షాపుల్లో ‘విజలెన్స్’ తనిఖీలు రికార్డులు సక్రమంగా లేని నాలుగు షాపులపై చర్యలు
అమలాపురం టౌన్: స్థానికంగా ఉన్న పలు మెడికల్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్స్, వాణిజ్య పన్నులు, లీగల్ మెట్రాలిజీ శాఖల అధికారులు మూకుమ్మడిగా, ఆకస్మికంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. పట్టణంలోని ఎ టు జెడ్, మోహన్, లీలాశ్రీ, శ్రీదేవి మెడికల్ షాపుల్లో ఆ నాలుగు శాఖలకు చెందిన అధికారుల బృందం దాడులు నిర్వహించాయి. మెడికల్ షాపుల్లో ఎక్కడా ఎలాంటి నిషేధిత మందులు లభ్యం కాలేదని విజిలెన్స్ సీఐ మధుబాబు తెలిపారు. నాలుగు మెడికల్ షాపుల్లో మందుల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని అధికారులు గుర్తించారు. వాటిపై చర్యలకు సిఫారసు చేస్తూ డ్రగ్ ఇన్స్పెక్టర్ మురళీ తమ శాఖ ఏడీకి లేఖ రాశారు. త్వరలోనే ఈ షాపులకు షోకాజ్ నోటీసులు రానున్నాయని అధికారులు తెలిపారు. తనిఖీలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్వహించారు. తనిఖీల్లో పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. అధికారుల ఆకస్మిక దాడుల భయంతో పట్టణంలోని మిగిలిన మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలకు చెందిన షాపులను ముందు జాగ్రత్తగా మూసివేశారు. ఈ దాడుల్లో డీసీటీవో నవీన్కుమార్, లీగల్ మెట్రాలిజీ ఇన్స్పెక్టర్ మురళీ పాల్గొన్నారు. -
నేత్రాలకు చల్లని నేస్తాలు!
● కూలింగ్ కళ్లద్దాలతో కంటికి రక్షణ ● రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు ● కూలింగ్ గ్లాస్ కళ్లజోడుతో ఎండలో ప్రయాణం శ్రేయస్కరం ● జాగ్రత్తలు సూచిస్తున్న కంటి వైద్య నిపుణులు కొత్తపేట: వేసవిలో శరీరంతో పాటు కళ్లమీద కూడా శ్రద్ధ చూపడం చాలా మంచిది. శరీరానికి వేడి చేయకుండా ఎప్పుడూ చల్లదనంలో ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటాం. గొంతెండిపోతే గుక్కెడు నీరు గానీ, శీతల పానీయాలు గానీ సేవించి సేద తీరుతాం. కానీ కళ్ల గురించి మాత్రం అంతలా పట్టించుకోం. కళ్లు పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం కంటి వ్యాధులకు కారణమవుతాయి. వేసవిలో సరైన కంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అపాయమేనని నేత్ర వైద్యులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో ఎండలో తిరిగే ప్రతి ఒక్కరూ కూలింగ్ గ్లాసెస్ తప్పనిసరిగా వాడాలని చెబుతున్నారు. చలువ కళ్లజోళ్లు వాడడం వల్ల ఎండ వేడిమి నుంచి కళ్లను కాపాడుకోవచ్చని నేత్ర వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చూపు మందగించే ప్రమాదం కళ్లలోని అతి సున్నితమైన భాగాలకు వేడి తగలడం వల్ల చూపు మందగించే ప్రమాదం ఉంది. శరీర భాగాల్లో కళ్లు ఎంతో సున్నితమైనవి. ప్రధానమైనవి. మిట్ట మధ్యాహ్నం లేదా ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణం చేయడం కంటికి మంచిది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనం నడిపితే హెల్మెట్ లేదా కళ్లజోడును తప్పనిసరిగా పెట్టుకోవాలి. దుమ్ము, ధూళి కంటిలో పడడం వల్ల విపరీతమైన కంటి దురదలు ఏర్పడతాయి. నల్లగుడ్డు చుట్టూ పొరలు రావడం. ఎరన్రి చారలు, కంటి వెంట తీగలాంటి స్రావం కారడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి జీవితాంతం చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. నలపకూడదు మధ్యాహ్నం సమయంలో ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది కళ్లకు రక్షణ కవచాలు లేకుండా తిరిగితే మంట పుట్టడంతో పాటు కళ్లు ఎరబ్రడ తాయి. ఇటువంటి సందర్భాల్లో కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వెంటనే సమీపంలోని ఉన్న నేత్ర వైద్యులను సంప్రదించాలి. కళ్లను నలపడం చేయరాదు. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. బైక్, కారు లేదా మరేదైనా వాహనం నడుపుతున్నప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం వల్ల దుమ్ము కణాలు లేదా వేడి గాలి కళ్లలోకి రాకుండా చేస్తుంది. ద్విచక్ర వాహనదారులు వీలైనంత వరకు క్లోజ్డ్ హెల్మెట్లను వాడటం మంచిది. 100% యూవీ రక్షణను అందించే నాణ్యమైన సన్ గ్లాసెస్ని వాడాలి. యూవీ కిరణాలు కళ్ళను దెబ్బతీస్తాయి. ఇది కంటి శుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి యూవీఏ, యూవీబీ కిరణాలను నిరోధించే సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. కంటి చూపు మెరుగు కోసం ఆహారం కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా తీసుకునే ఆహారంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు. ఎ, సి విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు అధికమొత్తంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇవి పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. పాలకూర వంటివి కూడా కంటి ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. అలాగే ఒమెగా–3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు తీసుకోవాలి. ఇవి కంటి చూపు మెరుగు పడేందుకు దోహదపడతాయి. జాగ్రత్తలు పాటించాలి వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వెలుగును తట్టుకోలేని స్థితి ఈ కాలానికి ఉంది. జీవన ఉపాధి దృష్ట్యా ఎక్కువగా ఎండ బారిన పడిన వారు వారి విధుల మూలంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించినప్పుడు, రోడ్లపై వెళ్లేటప్పుడు వేసవిలో ఎండ ప్రభావంతో వచ్చిన వెలుతురు, వేడికి కళ్లకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాళ్ల కళ్లలోని రక్షణ పొర కరిగిపోయి, వారి కళ్లు ఫొటో సెన్సిటివిటీకి గురవుతాయి. దాంతో కళ్లు మరింత సున్నితమైపోయి, క్రమేపీ వెలుగును చూడలేని స్థితికి చేరుకుంటాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా బయటకు వెళ్లినప్పుడల్లా చలువ కళ్లద్దాలను, హెల్మెట్ లేదా క్యాప్ ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ కె.శేషగిరిరావు, ప్రముఖ కంటి వైద్యుడు, కొత్తపేట -
రిలయన్స్ మార్ట్పై కేసు నమోదు
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని పుష్కర్ ఘాట్ వద్ద గల రిలయన్స్ మార్ట్ పై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ శామ్యూల్ రాజు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తయారీ తేదీ, గడువు తేదీని ట్యాంపర్ చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. వినియోగదారులు వస్తువుల కొనుగోలు సమయంలో ప్యాకేజీ ఎక్స్పెయిరీ డేట్, ఎంఆర్పీ ధరను పరిశీలించాలని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు విజ్ఞప్తి చేశారు. ఎంఆర్పీ కన్నా అధిక ధరలకు విక్రయించినా, యూజ్ బై డేట్ ముగిసినవి అమ్మినా లీగల్ మెట్రాలజీ అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ తనిఖీలో పాల్గొన్న అనంతరావు మాట్లాడుతూ వినియోగదారులు తగిన జాగ్రత్తలతో మెలగాలని, ఫిర్యాదులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇటువంటి వ్యవహారాలపై అధికారులు కేసు నమోదు చేస్తారని తెలిపారు. -
23న ప్రాంతీయ విద్యా సదస్సు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఐదు జిల్లాల ప్రాంతీయ విద్యా సదస్సు ఈ నెల 23వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నట్టు యూటీఎఫ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ పేర్కొన్నారు. స్థానిక యూటీఎఫ్ హోమ్లో గురువారం జయకర్ అధ్యక్షతన సంఘ జిల్లా కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. జయకర్ మాట్లాడుతూ ఆనం కళాకేంద్రంలో ఐదు జిల్లాల విద్యా సదస్సు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి మాట్లాడుతూ 117 జీవో రద్దు, పాఠశాలల విలీనాలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్ మాట్లాడుతూ ప్రభుత్వం బకాయి పడ్డ డీఏలను చెల్లించాలని, ఐఆర్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ గౌరి, కోశాధికారి ఇవిఎస్ఆర్ ప్రసాద్, కార్యదర్శులు ఇ శ్రీమణి,దయానిధి, ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కువైట్లో గుండెపోటుతో యువకుడి మృతి
సఖినేటిపల్లి: మండల పరిధిలోని గొంది గ్రామానికి చెందిన చింతా సాగర్(34) ఈ నెల 18వ తేదీన గుండె పోటుతో కువైట్లో మృతి చెందారు. 19వ తేదీన ఆ దేశం నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సాగర్కు భార్య, ఒక బాబు ఉన్నారు. సేఠ్ వద్ద కారు డ్రైవర్గా మొదటిగా 2022లో గల్ఫ్ వెళ్లారు. రెండేళ్లు అనంతరం స్వగ్రామం వచ్చిన సాగర్, గత జూలైలో తిరిగి రెండో దఫా గల్ఫ్ వెళ్లారు. ఎన్నో ఆశలతో బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లి ఎప్పటి మాదిరిగానే మళ్లీ తిరిగి వచ్చి తమను కలుస్తారు అనుకుంటున్న కుటుంబ సభ్యులు జరిగిన ఘటనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న వయసులోనే తమకు అందనంత దూరాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేక పోతున్నామని రోదిస్తున్నారు. మృతదేహం శనివారం నాటికి స్వగ్రామానికి రానున్నట్టు స్థానికులు తెలిపారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నిడదవోలు రూరల్: మండలంలోని పురుషోత్తపల్లి గ్రామంలో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు గురువారం తెలిపారు. పురుషోత్తపల్లికి చెందిన యడ్ల మధుసాగర్ ఈ నెల 15వ తేదీన శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని భార్య షేక్ చాందిని ఇచ్చిన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
‘నన్నయ’ వీసీకి ‘శక్తి ప్రేరణ సమ్మాన్’ అవార్డు
రాజానగరం: గిరిజనుల భాష పరిరక్షణకు తన వంతు కృష్టి చేస్తూ, అణగారిపోతున్న 19 గిరిజన భాషలకు లిపిని అందించి, జీవం పోసిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీకి ‘శక్తి ప్రేరణ సమ్మాన్’ అవార్డు లభించింది. జాతీయ మహిళా స్వచ్చంద సంస్థ, ఆంధ్ర విభాగం ‘ఆంధ్ర శక్తి’ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ వనపల్లి పద్మావతి, సభ్యులు ఈ అవార్డును వీసీకి అందజేశారు. కార్యక్రమంలో ఆచార్య పి.ఉమామహేశ్వరీదేవి, డాక్టర్ ఎన్.సజనరాజ్ పాల్గొన్నారు. అమ్మ పాట రాసిన విద్యార్థిని అభినందించిన వీసీ అమ్మ ప్రేమను వర్ణిస్తూ తాను రాసిన పాటను ఆలపించి, అందరినీ ఆకట్టుకున్న ఎంఏ ఎకనామిక్స్ విద్యార్థిని జి. రాణిశ్రీని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ అభినందించారు. ఆ పాటను తనకే అంకితమివ్వడంపై వీసీ స్పందిస్తూ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నీవు అమ్మా, నాన్నల ఆకాంక్షను నెరవేర్చే దిశగా ఎదగాలని సూచించారు. సాహిత్యంపై ఆ విద్యార్థినికున్న అభిలాషను ప్రశంసించారు. -
రైలు నుంచి జారి పడి మహిళ మృతి
సామర్లకోట: ఒడిశాకు చెందిన ఒక యువతి బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ నుంచి గురువారం జారి పడి మృతిచెందిన సంఘటన ఇది. ఏసీ బోగీలో ప్రయాణం చేస్తున్న సుభాష్మిత దాసు (33) జి. మేడపాడు సమీపంలో బోగీ నుంచి పడిపోయింది. దీనిని గమనించిన ప్రయాణికులు వెంటనే రైలు చైన్ లాగారు. డ్రైవర్, గార్డులు రైలు నుంచి మహిళ పడిపోయిన విషయాన్ని సామర్లకోట స్టేషన్ మేనేజరు ఎం.రమేష్కు సమాచారం ఇచ్చారు. సుభాష్మిత కొన ఊపిరితో ఉన్న విషయాన్ని తెలుసుకొని వెనుక వస్తున్న సరార్ ఎక్స్ప్రెస్లో మహిళను ఎక్కించి సామర్లకోట తీసుకురావాలని మేడపాడులోని రైల్వే సిబ్బందికి సూచించారు. ఈ మేరకు స్టేషన్ మేనేజరు 108కు సామర్లకోట రైల్వే స్టేషన్కు వచ్చే విధంగా సమాచారం ఇచ్చారు. సర్కార్ ఎక్స్ప్రెస్లో సామర్లకోట చేరిన మహిళను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె థర్డు ఏసీలో ప్రయాణం చేస్తున్నట్లు స్టేషన్ మేనేజరు తెలిపారు. సుభాష్మిత మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని విజయవాడ డీఆర్ఎం కార్యాలయం నుంచి సూచనలు వచ్చినట్లు తెలిసింది. -
కన్న బిడ్డలను కాలువలో తోసేసిన తండ్రి లొంగుబాటు
రామచంద్రపురం రూరల్: కన్న బిడ్డలను తండ్రే కాలువలోకి తోసేసి ఊపిరి తీయాలని చూసిన ఘటన పాఠకులకు తెలిసిందే. ఈ సంఘటనలో ఏడేళ్ల కుమార్తె కారుణ్యశ్రీ మృతి చెందగా, 10 ఏళ్ల కుమారుడు రామ సందీప్ ప్రాణాలతో బయట పడ్డాడు.. ఆ తరువాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అందరూ భావించారు. పోలీసులూ అదే కోణంలో కాలువలు, గోదావరిలో గాలించారు. దీనికితోడు నిందితుడు పిల్లి రాజు ఉపయోగించే స్కూటర్ యానాం బ్రిడ్జిపై లభించడంతో గోదావరిలో దూకేశాడని మరింత తీవ్రంగా గోదావరిలో బోట్లు వేసుకుని గాలించారు. అయితే అనూహ్యంగా అతడు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం లొంగిపోయాడు. దీంతో రామచంద్రపురం డీఎస్పీ బి.రఘువీర్ గురువారం తన కార్యాలయంలో ప్రెస్మీట్ పెట్టి నిందితుడిని మీడియా ముందుకు తీసుకువచ్చారు. డీఎస్పీ మాట్లాడుతూ అప్పుల ఒత్తిడితోనే తాను చనిపోతే తన పిల్లలు అనాథలు అయిపోతారని భావించి ముందుగా పిల్లలను నెలపర్తిపాడు శివారు గణపతినగరం వద్ద పంట కాలువలోకి తోసేసి, తానూ ఆత్మహత్య చేసుకోవడానికి యానాం గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకేయాలని వెళ్లాడని, అయితే అక్కడ మనసు మార్చకొని రాథేయపాలెంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. బంధువులు పోలీసులకు లొంగిపోవాలని సూచించడంతో మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం వెళ్లి లొంగిపోయాడు. ప్రెస్మీట్లో రామచంద్రపురం సీఐ ఎం.వెంకటనారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్, రామచంద్రపురం ఎస్సై ఎస్.నాగేశ్వరరావు, కె.గంగవరం ఎస్సై ఎస్కే జానీబాషా, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు. మీడియా ముందుకు తీసుకుని వచ్చిన పోలీసులు అప్పుల బాధతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడి -
మతాతీతంగా మాతకు ఆరాధన
దేవరపల్లి: ఉభయగోదావరి జిల్లాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది నిర్మలగిరి పుణ్యక్షేత్రం. ఇక్కడి మేరీమాతను నిత్య నిష్కళంక మాతగా, మత భేదమెరుగని తల్లిగా అన్ని మతాల వారు ఆరాధిస్తున్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు మేరీ మాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏలూరు పీఠాధిపతి జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎస్.జాన్పీటర్, ఉత్సవాల నిర్వహణ కమిటీ, సహాయక ఫాదర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామానికి ఆనుకుని ఈ క్షేత్రం ఉంది. క్షేత్రం ఆవిర్భావానికి 1978లో అప్పటి ఏలూరు పీఠాధిపతి జాన్ ములగాడ నాంది పలకగా పలువురు ఫాదర్లు పుణ్యక్షేత్రం అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రస్తుత డెరెక్టర్ ఫాదర్ జాన్పీటర్ పుణ్యక్షేత్రాన్ని సర్వాగ సుందరంగా తీర్చిదిద్దారు. కులమతాలకు అతీతంగా భక్తులు మేరీమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ కోర్కెలను మరియతల్లికి విన్నవించుకుంటారు. 1978లో బిషప్ జాన్ములగాడ గౌరీపట్నంలో నిర్మలగిరి క్షేతాన్ని నిర్మించాలని సంకల్పించారు. 1976లో ఏలూరు బలిపీఠం ఏర్పడింది. జాన్ ములగాడ తొలి పీఠాధిపతిగా నియమితులయ్యారు. అనంతరం బిషప్ ములగాడ కారులో విశాఖపట్నం వెళుతుండగా గౌరీపట్నం వద్ద కారు మరమ్మతులకు గురైయింది. కారు దిగి జాన్ములగాడ చుట్టూ పరిశీలించారు. ఎత్తైన కొండలు, కారుచీకటి, ముళ్లపొదలతో నిండి ఉన్న చిట్టడవి. భయంకర వాతావరణం. అంతలోనే ములగాడ మనసులో ప్రేరణ. ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించవా అంటూ ప్రేరణ కలిగింది. కారు మరమ్మతులు చేయించుకుని విశాఖపట్నం బయలుదేరారు. 1978లో గౌరీపట్నం ప్రాంతంలో మేరీమాత ఆలయం నిర్మణానికి సంకల్పం చేశారు. 1979లో ఆలయ నిర్మాణం చేసి ఫాదర్ మైకేల్ను తొలి డైరెక్టర్గా నియమించారు.1982 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1992లో ఫాదర్ దిరిసిన ఆరోన్ పుణ్యక్షేత్రం డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 1995లో పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం కల్పించడానికి ప్రేమసేవా ఆశ్రమం ఏర్పాటు చేశారు. 2000లో అఖండ దేవాలయం నిర్మాణం క్షేత్రంలో అఖండ దేవాలయం నిర్మాణానికి 1992లో శంకుస్థాపన చేశారు. 2000లో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. ఒకేసారి దాదాపు 5,000 మంది ప్రార్థనలు చేసుకొనేందురు వీలుగా దేవాలయం నిర్మించారు. క్షేత్రంలో కళాత్మకంగా పలు కట్టడాలను ఏర్పాటు చేశారు. ప్రేమ సేవా ఆశ్రమం 1995 జూలైలో ప్రేమసేవా ఆశ్రమాన్ని నిర్మలగిరిలో నెలకొల్పారు. మఠవాసులను తీర్చిదిద్దే బాధ్యత జేసురాజన్ చేపట్టారు. బ్రహ్మచర్య వ్రత నియమాలు పాటిస్తూ ప్రభువు సువార్తను ప్రకటించే పరిచర్య ఇక్కడే ఆరంభమవుతుంది. సేవ చేయాలనే ఉత్సహం ఉన్న యువతీ, యువకులు ఏడాది పాటు మఠంలో ఉండవచ్చును. 1997లో నిర్మల హృదయ మహిళా కళాశాలను బిషప్ ములగాడ ప్రారంభించారు. అనురాగ ఆశ్రమం ఏర్పాటు నిర్మలగిరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పుణ్యక్షేత్రానికి ఎదురుగా సుమారు 100 అడుగుల ఎత్తున సుందరమైన క్రీస్తు మందిరాన్ని నిర్మాణం చేశారు. చరిత్రలోని వివిధ ఘట్టాలను కళాత్మకంగా గోపురంలో పొందుపర్చారు. నిత్య అన్నదానం పుణ్యక్షేత్రానికి నిరంతరం వస్తున్న భక్తులకు నిత్య అన్నదానం చేస్తున్నారు. ప్రతి రోజు సుమారు 2 వేల మంది భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. అన్నదానం కాంట్రాక్టర్ కళ్ళే నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతుంది. గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలోని అఖండ దేవాలయం రేపటి నుంచి నిర్మలగిరి మేరీ మాత ఉత్సవాలు సుందరంగా ముస్తాబైన పుణ్యక్షేత్రం అఖండ దేవాలయం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు అగ్ర పీఠాధిపతుల రాక 10 లక్షల మంది భక్తుల వచ్చే అవకాశం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏటా మార్చిలో ఉత్సవాలు ఏటా మార్చి 22 నుంచి 25 వరకు మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పుణ్యక్షేత్రంలోని పలు ప్రదేశాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల రక్షణకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మతాలకు అతీతంగా భక్తులు ఉత్సవాల్లో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి, కొవ్వొత్తులను వెలిగించి, తలనీలాలు సమర్పించి దైవదూత అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. ఉత్సవాల్లో భాగంగా దివ్య బలిపూజలు, దివ్య సత్ప్రసాద ఆరాధనలు నిర్వహిస్తారు. వాటికన్ భారత రాయబారి, ప్రాన్సిస్ మోస్ట్ రెవరెండ్ లియోపోల్డో జిరెల్లి పుణ్యక్షేత్రంలో 2022లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. -
ఆలిండియా ఖోఖో జట్టుకు తులసి ఎంపిక
పెదపూడి: జి.మామిడాడ గ్రామంలో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల్లో గ్రేడ్–2 ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న కోరుమిల్లి తులసి ఆలిండియా సివిల్ సర్వీసెస్ గేమ్స్ జాతీయ స్థాయి ఖోఖో జట్టుకు క్రీడాకారిణిగా ఎంపికయ్యారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్తి వెంకటరెడ్డి గురువారం మాట్లాడుతూ ఆల్ ఇండియా సవిల్ సర్వీసెస్ గేమ్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఖోఖో జట్టుకు క్రీడాకారిణిగా ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు. ఆమె ఈ నెల 19 నుంచి 24 వరకు ఢిల్లీలో జరుగుతున్న పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. ఆమె 2024 నవంబర్7న విజయవాడలో జరిగిన ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభతో జాతీయ జట్టులో స్థానం సంపాదించారని తెలిపారు. ఆమెను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. గేట్లో శ్రీగౌతమ్కు నాలుగో ర్యాంక్ పెదపూడి: జి.మామిడాడ గ్రామానికి చెందిన పోతురాజు శ్రీగౌతమ్ బుధవారం విడుదలైన గేట్–2025 ఫలితాల్లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆల్ఇండియాలో నాలుగో ర్యాక్ సాధించాడని తండ్రి సాయి వెంకటేశం తెలిపారు. ఆయన గురువారం జి.మామిడాడలో మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పట్టుదలగా చదివాడన్నారు. సంవత్సరం నుంచి చేస్తున్న ఉద్యోగానికి ఐదు నెలల క్రితం రాజీనామా చేసి ఇంటికి వచ్చాడన్నారు. ఈ ఐదు నెలలుగా ఇంటి వద్ద ఉండి ప్రణాళిక బద్ధంగా చదివి ఈ ర్యాంక్ సాధించాడన్నారు. తల్లి గృహిణి కాగా తాను పైన గ్రామంలో ఎస్జీటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నానని తండ్రి తెలిపారు. వాసుకు పదో ర్యాంకు అమలాపురం రూరల్: అమలాపురం రూరల్ మండలం బండారులంక చెందిన చేనేత కుటుంబానికి చెందిన పిచ్చిక కుమార్ వాసు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)–2025 ఫలితాల్లో పదో ర్యాంకు సాధించాడు. జాతీయస్థాయిలో వాసు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 10 ర్యాంకు సాధించడంతో బండారులంకలో చేనేత కార్మికులు గురువారం బాణనంచా కాల్చి సంబరాలు చేశారు. చేనేత కార్మికులైన పిచ్చిక మల్లేశ్వరరావు, రేణుక వాణి కుమారుడు వాసు కష్టపడి రెండుసార్లు గేట్ రాసి ఈ ర్యాంకు సాధించాడు. 1 నుంచి 4వ తరగతి వరకు బండారులంక విజడమ్ స్కూలులో చదివి, భూపతిపాలెం గురుకుల పాఠశాలలో 10 తరగతి పూర్తి చేసి రాజమహేంద్రవరం శ్రీచైతన్యలో ఇంటర్మీడియెట్, నర్సారావుపేట జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేశానని వాసు తెలిపాడు. ఐఐటీ, ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తిచేసి మంచి ఇంజీనీరుగా దేశానికి సేవలు అందిస్తానని అన్నాడు. గ్రామస్తులు వాసు తల్లిదండ్రులను ఊరేగించి వీరభద్రస్వామి ఆలయం వద్ద సత్కరించారు. శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్టీ చింతా శంకర మూర్తి, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిచ్చిక శ్యామ్, ఉప్పుగుంటి భాస్కరరావు బళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కోటనందూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ గురువారం తెలిపారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చినగొలుగొండేకు చెందిన కాళ్ల వెంకటేశ్వర్లు(59) డీజిల్ తెచ్చుకునేందుకు టీవీఎస్ మోపెడ్పై కోటనందూరు బయలుదేరాడు. అల్లిపూడిలో బర్ల వరలక్ష్మికి లిఫ్ట్ ఇవ్వడం కోసం బండి ఎక్కించుకున్నాడు. అల్లిపూడి–కాకరాపల్లి రోడ్డులో జీడిపిక్కల ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా ధాన్యం లోడుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా, వరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను 108 అంబులెన్స్లో నర్సీపట్నంలో ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి కుమార్తె బొడ్డు నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సీలింగ్ భూములు ఎస్సీ, ఎస్టీలకు పంచాలి
జైపాల్ సింగ్ ముండాకు ఆదివాసి మహాసభ నివాళులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేసి సీలింగ్ చట్ట ప్రకారం 50 శాతం భూమి ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. భారత రాజ్యాంగ సభ సభ్యులు, ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకుడు జైపాల్ సింగ్ ముండా 55వ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక ప్రెస్క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు ఆదివాసీ మహాసభ తరఫున ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 34,348 ఎకరాల సీలింల్ మిగులు భూములు ఉన్నాయని, వాటిలో 15,500 ఎకరాల పంపిణీ జరిగిందన్నారు. సుమారు 18,848 ఎకరాలు కోర్టు వివాదాలలో ఉన్నాయన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించిన భూ పంపిణీ కార్యక్రమంలో సీలింగ్ భూములు వెయ్యి ఎకరాలు పంచారన్నారు. ఇప్పటికై నా తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు బాధ్యత వహించి సీలింగు భూములన్నీ వేరే పార్టీకి రిజిస్ట్రేషన్న్ జరుగకుండా 22ఎ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తోందన్నారు. నాయకులు జక్కల పాండవులు, సభ్యులు గూన అప్పన్న, అర్జన, మల్లేశ్వరి పాల్గొన్నారు. -
మహాశివరాత్రి ఆదాయం రూ 29.66 లక్షలు
సామర్లకోట: మహాశివరాత్రి సందర్భంగా స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి రూ.29,66,406 ఆదాయం సమకూరిందని ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 6 నుంచి మార్చి 20 వరకూ ఆలయంలో హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. హుండీల ద్వారా రూ.16,15,788 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. 67 గ్రాముల బంగారు, 600 గ్రాముల వెండి వస్తువులు లభించాయని ఈఓ తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకూ దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.7,05,960, వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ.65,747, ప్రసాద విక్రయాల ద్వారా రూ.2,66,215, అన్నదాన విరాళాలు రూ.3,12,696 వచ్చాయని వివరించారు. హుండీల ద్వారా గత ఏడాది కంటే రూ.6 లక్షలు అదనంగా ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. దేవదాయ శాఖ తనిఖీదారు ఫణికుమార్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 30న పాలిసెట్
రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ కోర్సులలో చేరేందుకు ఏప్రిల్ 30న పాలిసెట్ నిర్వహిస్తున్నట్లు బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, హెల్ప్లైన్ కేంద్రం కో ఆర్డినేటర్ వి.నాగేశ్వరరావు తెలిపారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు, ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాస్తున్న వారు ఏప్రిల్ 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రవేశ పరీక్షకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, బీసీ, ఓసీ విద్యార్థులు రూ.400 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు http:// polycetap.nic.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. పాలిటెక్నిక్ చదివిన వారికి ఉద్యోగావకాశాలు 100 శాతం లభిస్తాయయన్నారు. డిప్లొమా పూర్తి చేసిన అనంతరం బీటెక్ రెండో సంవత్సరంలో చేరవచ్చని నాగేశ్వరరావు తెలిపారు. వడగాడ్పులపై విస్తృత ప్రచారంరాజమహేంద్రవరం రూరల్: వడగాడ్పులపై విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బొమ్మూరులోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ, ఆరోగ్య సహాయకులు, పంచాయతీ కార్యదర్శుల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని, తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బస్టాండ్లు, మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం 11 గంటలకు బయటి పనులు ముగించుకుని, ఇళ్లకు చేరుకోవాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్ళినప్పుడు వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వడదెబ్బగా గుర్తించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జె.సంధ్య, కంటి వెలుగు ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్యపై పర్యవేక్షక సెల్ రాజమహేంద్రవరం రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి రాజమహేంద్రవరంలోని తమ కార్యాలయంలో పర్యవేక్షక సెల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) ఇంజినీరింగ్ అధికారి బి.వెంకటగిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రజలు తమ తాగునీటి సమస్యలను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 91001 21190 నంబర్కు తెలియజేయాలని కోరారు. -
అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి
కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం ప్రచార మాధ్యమాలు పెరిగిన ప్రస్తుత తరుణంలో సాహిత్యం మరింతగా అందుబాటులోకి వస్తోంది. తెలుగు భాషపట్ల ఆసక్తి ఉన్నవారు కవితలు, కథలు రాసేందుకు ముందుకొస్తున్నారు. అయితే వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందడం లేదు. స్వశక్తితో తమ కవిత్వాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కవులు అనేక వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారు.అద్దం అరచేతిలో ఇమిడిపోయేదే అయినా.. ఆకాశాన్ని చూపిస్తుంది. చూడటానికి చిన్నగానే కనిపించినా.. జాబిల్లి జగతికి చల్లని వెలుగులను పంచుతుంది. పుస్తకం చిన్నదే అయినా మస్తిష్కానికి వికాసాన్నిస్తుంది. అక్షరం చిన్నదే అయినా నిత్య చైతన్య దీప్తిని, స్ఫూర్తిని నింపుతుంది. కవితా వాహినిగా మారి.. మనిషి లోపల దాగున్న అసలు మనిషిని నిత్యం పరిచయం చేస్తుంది. అర్థం చేసుకునే మనసుతో చదివితే.. నడవడికలో లోపాలను చక్కదిద్ది మనిషిని మనీషిగా చక్కదిద్దుతుంది. మానవ సమాజాన్ని మరో ప్రపంచ వైపు నడిపిస్తుంది.ఇదీ నేపథ్యం ఐక్యరాజ్య సమితి విద్యా, శాసీ్త్రయ, సాంస్కృతిక సంస్థ మార్చి 21వ తేదీన ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహించాలని 1999లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో భాషా వైవిధ్యానికి మద్దతు పలికేందుకు, అంతరించిపోతున్న భాషలను ప్రోత్సహించేందుకు, కవిత్వాన్ని ప్రోత్సహించేందుకు 27 ఏళ్లుగా కృషి సాగుతోంది. కపిలేశ్వరపురం: గోదారి నేలపై పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలనే వస్తువుగా స్వీకరించి ఎంతో మంది కవులు అపార సాహిత్యాన్ని సృజించారు. సమాజోద్ధరణకు శ్రమించారు. ఆవంత్స సోమసుందర్, బోయి భీమన్న, అద్దేపల్లి రామమోహనరావు, దాట్ల దేవదానంరాజు వంటి ప్రముఖులతో పాటు.. ఎంతో మంది కవులు ప్రపంచం నలుమూలలా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలకు గురైన పీడితులపై ద్రవించిన హృదయంతో స్పందించారు. నేడు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. గోదారి తీరాన కవిచంద్రులు ● పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 6వ అధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా విశేషంగా సాహిత్యాన్ని సృజియించారు. 1885 ఫిబ్రవరి 28న ఆయన జన్మించారు. మాతృ భాష కానప్పటికీ తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కాకినాడలో ఆయన జయంతి ఘనంగా నిర్వహించారు. ● దేవులపల్లి కృష్ణశాస్త్రి సామర్లకోట మండలం చంద్రపాలెంలో 1897 నవంబరు 1న జన్మించారు. లలిత గీతాలు, నాటికలు, సినిమా పాటలు రాసి, ఎంతో ఖ్యాతి పొందారు. భావ కవిత్వానికి పెట్టింది పేరు. ● ‘బలం కలవాడు పులి, తెలివి కలవాడు నక్క, ఈ ఇరువర్గాలకో ఆహారంగా బతుకుతున్న వర్గాలు గొర్రెలు’ అంటూ చైతన్యపూరిత మాటలు రాసిన బోయి భీమన్న కోనసీమ జిల్లాలోని మామిడికుదురులో 1911 సెప్టెంబర్ 19న జన్మించారు. సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్తో పాటు లెక్కకు మిక్కిలిగా సన్మానాలందుకున్నారు. అంటరానితనం వంటి దురాచారాలను నిరసించారు. ● 1924 నవంబర్ 18న కాకినాడ జిల్లా శంఖవరంలో పుట్టిన ఆవంత్స సోమసుందర్ సాహిత్య రంగంలో అవిరళ కృషి చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాడు సాగిన ఉద్యమానికి మద్దతుగా ఆయన రచించిన ‘వజ్రాయుధం’ కవిత ఎంతో మందిని ఉత్తేజపరచింది. ● కాకినాడకు చెందిన అద్దేపల్లి రామమోహనరావు జిల్లా నలుమూలలా సాహిత్య సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు నిర్వహించేవారు. తుది శ్వాస విడిచిన 2016 వరకూ సాహిత్య కృషి చేశారు. ‘అయినా ధైర్యంగానే’ పేరుతో అద్దేపల్లి రాసిన కవితలు సామాన్యుడి జీవన స్థితిగతులను తడుముతాయి. ● యానాంలో నివసిస్తున్న ప్రముఖ కవి, కథకుడు దాట్ల దేవదానం రాజు. అభ్యుదయవాది అయిన ఆయన అనేక కథలు, కవితా సంపుటాలు వెలువరించారు. ‘యానాం చరిత్ర’ వంటి గ్రంథాలను వెలువరించారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. ● 1994 ప్రాంతంలో పాశర్లపూడిలో సంభవించిన బ్లో ఔట్నే వస్తువుగా చేసుకుని ఓ కవి ఆ రోజుల్లో అద్భుతమైన కవిత రాశారు. ‘సామ్రాజ్యవాద కాలధూమాల నీడల కింద శిరస్సు తెగి, మొండెంలోంచుబికిన నెత్తుటి ధార, ముద్దయి నింగికెగురుతున్న శైలంలాగ, రాత్రి సూర్యుడై ప్రజ్వలిస్తోంది, గ్యాస్ బావి పాదాల చెంత పారాడే చిత్తడి.. పోరాటానికి సిద్ధమైన ప్రత్యర్థిలా వేడి సెగ వాగయింది’ అంటూ ఆయన కవిత్వం సాగుతుంది. ఇలా ఎంతో మంది తమ కవితా ఝరులతో చైతన్య స్ఫూర్తిని నింపారు. సాహితీ ‘గోదారి’ ● గోదారి నేలపై ఎంతో మంది సాహితీ సేద్యం సాగిస్తున్నారు. ● ‘కవిత కోసమే నేను పుట్టాను.. క్రాంతి కోసము కలము పట్టాను.. ఎండమావులు చెరిపి.. పండు వెన్నెల నిలిపి.. గుండె వాకిలి తలుపు తట్టాను’ అన్న ఆరుద్రను సత్కరించిన ప్రాంతం రాజమహేంద్రవరం. ● అభ్యుదయ కవి డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు పేరిట అద్దేపల్లి ఉదయ భాస్కరరావు కన్వీనర్గా ‘అద్దేపల్లి సాహిత్య వేదిక’ను నిర్వహిస్తున్నారు. ఏటా సాహిత్య పురస్కారాలు అందజేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 8న రాజమహేంద్రవరానికి చెందిన ‘ప్రాణహిత’ కవి సాహితీవేత్త సన్నిధానం నరసింహశర్మకు ‘అద్దేపల్లి సాహిత్య పురస్కారం 2024’ను కాకినాడలో అందజేశారు. ● కొత్తపేటలో కళాసాహితి పేరుతో 37 ఏళ్లుగా సాహిత్య కృషి సాగిస్తున్నారు. 1989 నుంచి క్రమం తప్పకుండా ఉగాది రోజున కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 7న నిర్వహించిన కార్యక్రమంలో కవి గిడ్డి సుబ్బారావును సత్కరించారు. ● కోనసీమకు చెందిన శ్రీశ్రీ కళావేదిక గత ఏడాది ఏప్రిల్ 7న అమలాపురంలో 132వ ఉగాది జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించగా పలు రాష్ట్రాల నుంచి 132 మంది కవులు పాల్గొన్నారు. 2024 సెప్టెంబర్ 21న కాకినాడలో 137వ జాతీయ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ● రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో గత ఏడాది మార్చి 16న కవి కుసుమ ధర్మన్న 125వ జయంతి సందర్భంగా కవితా గోష్టి నిర్వహించారు. ● గత ఏడాది ఏప్రిల్ 14న బండారులంకలో నిర్వహించిన అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా మహాసభలో ప్రతిభ చూపిన కవులను ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్న పెనుగొండ లక్ష్మీనారాయణ సత్కరించారు. ● కాకినాడకు చెందిన డాక్టర్ జోస్యుల కృష్ణబాబు పేరుగాంచిన పుస్తకాలకు సమీక్షలు రాస్తున్నారు. ● ఈ ప్రాంతానికి చెందిన ఎంతో కవులు వివిధ ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పురస్కారాలు అందుకుంటున్నారు. నేడు ప్రపంచ కవితా దినోత్సవంకవుల సంఖ్య విస్తృతమైంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కవితలు రాసేవారి సంఖ్య పెరిగింది. ఆధునిక సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ప్రాచుర్యం పొందిన కవితల పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని అధ్యయనం చేస్తూ కవితలు రాసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. వచన కవిత్వం ప్రాచుర్యంలో ఉంది. కాకినాడ, పెద్దాపురం తదితర ప్రాంతాల్లోని యువ కవులను ప్రోత్సహిస్తున్నాం. సామాన్యుల జీవన శైలినే కవితా వస్తువుగా తీసుకుని కవితలు రాయడం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయవచ్చు. – అద్దేపల్లి ప్రభు, కవి, కాకినాడ క్రమం తప్పకుండా.. యానాం వేదికగా కవి సంధ్య, స్ఫూ ర్తి సాహితీ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఏడేళ్లుగా క్రమం తప్పకుండా ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహిస్తున్నాం. కార్యక్రమ విస్తృతి ఆవశ్యకత నేపథ్యంలో ఈ నెల 23న హైదరాబాద్లో నిర్వహించనున్నాం. ఆధునిక కాలంలో సైతం కవిత్వ రచన పట్ల ఆసక్తి పుష్కలంగా ఉంది. అయితే పదబంధాలు, మెళకువలు నేర్పే యంత్రాంగం అందుబా టులో లేదు. సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూండాలి. పఠనాసక్తి పెంపొందించేందుకు కృషి చేయాలి. – దాట్ల దేవదానం రాజు, కవి, తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత, యానాం మనిషిలో మనీషిని పరిచయం చేస్తున్న కవులు గోదారి నేలపై కవితా వాహిని సామాజిక సమస్యలపై స్పందిస్తున్న కవులెందరో..సామాన్యుల జీవితాలే కవితా వస్తువు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మండపేటలో అరసం, సంగమం వేదిక సంయుక్త ఆధ్వర్యాన శుక్రవారం కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం. మనిషి శ్రమ నుంచి సాహిత్యం పుట్టింది. శ్రమకు విలువ ఉన్నంత కాలం కవిత్వానికి ప్రాధాన్యం తప్పనిసరిగా కొనసాగుతుంది. ప్రస్తుత కాలంలో యువతీ యువకులు సాహిత్య కృషిపై ఆసక్తి చూపుతున్నారు. – డాక్టర్ చల్లా రవికుమార్, సంగమం వేదిక నిర్వాహకుడు, మండపేట -
వందేళ్ల వృద్ధురాలి కన్నుమూత
నల్లజర్ల: ప్రకాశరావుపాలెంలో వృద్ధురాలు గోగులమండ సుందరమ్మ(100) బుధవారం ఉదయం కన్నుమూశారు. మరణించే వరకూ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని బంధువులు తెలిపారు. ఆమెకు ఐదుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నలుగురు కుమారులు వివిధ శాఖల్లో గెజిటెడ్ హోదాల్లో పనిచేస్తున్నారు. నాలుగో కుమారుడు గోగుల మండబాబ్జీ వైఎస్సార్ సీపీ లీగల్సెల్ మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త వీరాస్వామి కమ్యూనిస్టు ఉద్యమ నేతగా వ్యవహరించారు. మహిళ మెడలో గొలుసు చోరీ కొవ్వూరు: ఈవెనింగ్ వాకింగ్ చేస్తున్న మహిళ మెడ నుంచి బంగారు గొలుసును దొంగ అపహరించిన ఉదంతమిది. పట్టణంలోని 23వ వార్డుకు చెందిన కుందుల పద్మకుమారి స్థానిక బైపాస్ రోడ్డు బుధవారం ఈవెనింగ్ వాకింగ్కు బయలుదేరింది. మోటార్ బైక్పై వచ్చిన దొంగ ఆమె మెడలో ఉన్న ఆరున్నర కాసుల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ జి.దేవకుమార్, పట్టణ సీఐ పి.విశ్వం సంఘటన స్థలానికి చేరుకుని, బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ విశ్వం తెలిపారు. గతంలో కొవ్వూరు పట్టణంలో రెండు చైన్ స్నాచింగ్ సంఘటనలు చోటుచేసుకున్నాయి. -
ఐడీఎస్పీ బృందం పర్యటన
డయేరియా రోగుల నుంచి వివరాల సేకరణ గోపాలపురం: ‘పల్లెల్లో పారిచోద్యం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు బుధవారం వైద్యారోగ్య శాఖ, పంచాయతీ అధికారులు స్పందించారు. గోపాలపురం, పెద్దగూడెం, చిట్యాల, తొక్కిరెడ్డిగూడెం తదితర డయేరియా ప్రభావిత గ్రామాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేశారు. పెద్దగూడెం, ఉప్పరగూడెం గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను యంత్రాల సాయంతో ట్రాక్టర్లు, లారీలపై డంపింగ్ యార్డుకు తరలించారు. వివిధ గ్రామాల్లో శానిటేషన్ పనులు చేపట్టారు. నాలుగు రోజులుగా డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల కొత్త కేసులు నమోదు కాలేదని గోపాలపురం సీహెచ్సీ సూపరింటెండెంట్ కె.చైతన్యరాజు తెలిపారు. ఐడీఎస్పీ బృందం పర్యటన అతిసారంతో సుమారు 30 మంది డయేరియా బారిన పడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం బృందం(ఐడీఎస్పీ) గోపాలపురం సీహెచ్సీని సందర్శించింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన వారి వివరాలు సేకరించి, బాధితుల ఇళ్లకు వెళ్లి ఆరా తీసింది. అతిసారానికి కారణాలు, పారిశుధ్యం, తాగునీరు వంటి అంశాలపై బృంద సభ్యులు ప్రజలతో మాట్లాడారు. గోపాలపురం, పెద్దగూడెం, వేళ్లచింతలగూడెం, చిట్యాల, గుడ్డిగూడెం, పెద్దాపురం గ్రామాల్లో స్థితిగతులను పరిశీలించారు. వీరి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.చైతన్యరాజు, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు. -
చెత్త పనులను ప్రశ్నించే వారేరీ..?
పర్యావరణానికి ‘మంట’ జనసేన ఆవిర్భావ సభ అనంతరం పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉండగా, జనసేన నేతలు ఎక్కడికక్కడ పోగేసి, మంట పెట్టేశారు. దీంతో పచ్చని చెట్లతో ఆహ్లాదంగా ఉండే చిత్రాడ, పరిసర ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య పనులకు కమిటీ వేసినట్టు చెప్పుకొన్న జనసేన నేతలు.. నిజానికి వారు పెత్తనం చేసి, ఇతరులతో పని చేయించడమే కాకుండా, పర్యావరణానికి మంట పెట్టారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేస్తామని ఒంటికాలిపై నిలబడే నేతలున్న పార్టీ అది. అవసరమైతే నింగీనేలా ఏకం చేసేస్తామంటే.. జనాలు కూడా నిజమేననుకున్నారు. ఆ పార్టీ ఆవిర్భావ సభ ముగిస్తే కానీ వాస్తవం బోధపడలేదు ప్రజలకు. పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనం దుర్వినియోగం, స్థానికసంస్థల సిబ్బందితో పారిశుధ్య పనులు.. తుదకు భావి పౌరులైన విద్యార్థులతో కూడా ‘చెత్త’ పనులు చేయించి.. వారి నిజ స్వరూపమేమిటో కళ్లకు కట్టినట్టు చూపించారు.పిఠాపురం: పాఠశాలల్లో పేరుకుపోయిన చెత్తను అపాయకర పరిస్థితుల్లో విద్యార్థులతో తొలగించిన అధికారుల తీరును మరువక మునుపే.. పిఠాపురంలో మరిన్ని వింత పోకడలు వెలుగుచూశాయి. ఇటీవల పిఠాపురం మండలం చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణంలో భారీగా చెత్త పేరుకుపోయింది. దీనిని తొలగించడానికి పార్టీ నేతలు శ్రమిస్తున్నట్టుగా ఫొటోలకు ఫోజులిస్తున్నారు. వాస్తవానికి పిఠాపురం మున్సిపల్ పారిశుధ్య కార్మికులను, ఉపాధి కూలీలను, మున్సిపల్ వాహనాలను వినియోగించి చెత్తను తొలగించారు. ఓ పార్టీ కార్యక్రమానికి పోగైన చెత్తను తొలగించడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. పార్టీ కార్యక్రమానికి పారిశుధ్య కార్మికులతో పని చేయించడం స్వర్ణాంధ్ర.. పాఠశాల విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించడం స్వచ్ఛాంధ్ర అన్నట్టుగా ఉంది పిఠాపురంలో అధికారుల తీరు. రాజకీయ పార్టీ కార్యక్రమానికి వచ్చిన చెత్తను మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో తీయించి, పాఠశాలలో చెత్తను విద్యార్థులతో తీయించిన ఘనత పవన్ అడ్డాగా చెబుతున్న పిఠాపురం నేతలకే దక్కింది. ఇటీవల పిఠాపురం మండలం చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా టన్నుల కొద్దీ చెత్త వెలువడింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమం అయినందున, వారి సొంత సొమ్ముతో సభా ప్రాంగణాన్ని శుభ్రం చేయించాల్సి ఉంది. కానీ అధికార దుర్వినియోగం కావాల్సినంత చేసిన జనసేన నేతలు.. మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో, ఉపాధి కూలీలతో అంతా శుభ్రం చేయించడం విమర్శలకు దారితీసింది. పట్టణంలో పేరుకుపోయిన చెత్తను వదిలి, మున్సిపల్ సిబ్బంది జనసేన సభా ప్రాంగణంలో పేరుకున్న చెత్తను తొలగించడంపై పట్టణవాసులు మండిపడుతున్నారు. ఇంతవరకు ఎలా ఉన్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అడ్డాగా చెబుతున్న పిఠాపురంలో విద్యా ప్రదాతగా పేరొందిన పిఠాపురం మహారాజా కలల సౌధమైన ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించిన సంఘటనపై ఏ ఒక్క అధికారీ నోరు మెదపకపోవడాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇదేనా అభివృద్ధి అంటే అంటూ ప్రశ్నిస్తున్నారు. చదువుకునే పిల్లలతో ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయించినా.. ఏఒక్క అధికారి పట్టించుకోకపోవడమేనా పవన్ పర్యావరణ పరిరక్షణ సిద్ధాంతం అని స్థానికులు నిలదీస్తున్నారు. ఏం చేసినా మమ్మల్ని అడిగేదెవరు అన్నట్టుగా ప్రజాప్రతినిధుల తీరు ఉంటే, వారి అండ చూసుకుని ప్రవర్తిస్తున్నారు అధికారులు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, ఎన్నికల ప్రచారం చేసిన మున్సిపల్ కమిషనర్ కనకారావుపై చర్యలు లేవు. ఉన్నతాధికారి నిర్వహించే గ్రీవెన్స్లో జనసేన నేతలు హల్చల్ చేసినా చర్యలు శూన్యం. ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులతో పని చేయించిన ఉపాధ్యాయులపై చర్యలు అసలు లేవు.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ప్రతి నేత చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా.. అధికారులు తమ పరిధిని దాటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నా.. ఎవరూ పట్టించుకునే వారు లేరు. జనసేన బహిరంగ సభ తర్వాత కానీ బోధపడని వాస్తవం పార్టీ చెత్త.. కార్మికులతో, పాఠశాల చెత్త.. విద్యార్థులతో క్లీనింగ్ ఉపాధి కూలీలతో పారిశుధ్య పనులు మున్సిపల్ కార్మికులు, వాహనాల వినియోగం ప్రజాధనం దుర్వినియోగంపై పట్టణవాసుల మండిపాటు పార్టీ పనులకు ఉపాధి కూలీలు చిత్రాడ జనసేన సభా ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త తొలగించడానికి రోజుకు 80 మంది చొప్పున ఉపాధి కూలీలను వినియోగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉపాధి కూలీలను ప్రైవేటు పనులకు ఉపయోగించరాదన్న కీలక నియమాన్ని తుంగలోకి తొక్కిన జనసేన నేతలు.. ఉపాధి కూలీలతో పారిశుధ్య పనులు చేయించారు. ఐదు రోజులుగా పని చేయించుకున్న జనసేన నేతలు కూలీలకు దగ్గరుండి మస్టర్లు వేయించడం, ఉపాధి సిబ్బందితో దగ్గరుండి పనులు చేయించడం వారి అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోందని స్థానికులు పెదవి విరుస్తున్నారు. -
నదీ పాయలో బాట నిర్మాణం
పి.గన్నవరం: పెదకందాలపాలెం ర్యాంపు నుంచి మానేపల్లి లంక వరకూ సుమారు 2 కి.మీ మేర నదీపాయలో తువ్వ మట్టి లారీల రాకపోకల కోసం పొక్లెయిన్లతో బాటలు నిర్మిస్తున్నారు. నేషనల్ హైవే పనుల కోసం తువ్వ మట్టిని తరలించేందుకు ఈ బాటలు ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తెచ్చుకున్నామని చెబుతున్న నిర్వాహకులు మాత్రం వాటిని ఎవ్వరికీ చూపడం లేదు. ఇంతవరకూ స్థానిక రెవెన్యూ అధికారులకు కూడా అనుమతి పత్రాలు అందలేదు. కూటమి నేతల కనుసన్నల్లో మట్టి తరలింపునకు సన్నాహాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూతపడిన ర్యాంపు! ఇటీవల పెదకందాలపాలెం నుంచి అనుమతులు లేకుండా కూటమి నాయకులు ఇసుక, మట్టిని కొల్లగొట్టడంపై పత్రికల్లో కథనాలు రావడంతో ఈ ర్యాంపు మూతబడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా పెదకందాలపాలెం ర్యాంపు నుంచి మానేపల్లి పల్లిపాలెం లంక వరకూ నదీపాయ వెంబడి పొక్లెయిన్లతో బాటలు వేస్తున్నారు. అనుమతులు లేకుండా టిప్పర్లలో తువ్వ మట్టిని తరలించుకుపోతున్నారని బుధవారం స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్ఐ వి.డాంగే, వీఆర్వో వి.సత్యనారాయణ ర్యాంపులోకి వెళ్లారు. నేషనల్ హైవే పనుల కోసం మట్టిని తరలించేందుకు అనుమతులు తెచ్చుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ర్యాంపులోకి వెళ్లే ముందు రోడ్డుపై మట్టి లోడుతో వెళ్తున్న లారీని అధికారులు నిలిపి వీఆర్ఏని కాపలా ఉంచారు. ఈలోగా ర్యాంపు నిర్వాహకులు అక్కడికి వెళ్లి బిల్లు ఉందంటూ లారీని పంపించేశారు. ఈ క్రమంలో స్వల్ప వివాదం కూడా జరిగింది. ఇలాఉండగా మానేపల్లిలంక నుంచి మట్టిని తీసే అనుమతులతో.. పెదకందాలపాలెం లంక పరిసరాల్లో కూడా పెద్దఎత్తున మట్టిని తరలించుకుపోయేందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే నదీపాయలో రెండు కి.మీ. మేర బాట నిర్మించారని చెబుతున్నారు. అనుమతి పత్రాలు రావాలి మానేపల్లి లంక నుంచి హైవే పనుల కోసం మట్టిని తరలించేందుకు అనుమతి ఇచ్చినట్టు మైన్స్ అధికారులు తనకు చెప్పారని తహసీల్దార్ పి.శ్రీపల్లవి తెలిపారు. వారి నుంచి సంబంధిత పత్రాలు రావాల్సి ఉందన్నారు. మానేపల్లిలంక వద్ద పొక్లెయిన్లతో 2 కి.మీ. ఏర్పాటు కూటమి నేతల కనుసన్నల్లో ర్యాంపు నిర్వహణ! -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
గంజాయి విక్రేతల ముఠా అరెస్టు
నిడదవోలు: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు యువకుల ముఠాను నిడదవోలు పోలీసులు అరెస్టు చేశారు. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ బుధవారం విలేకర్లకు ఈ వివరాలు వెల్లడించారు. పట్టణంలో వైఎస్సార్ కాలనీలోని మానే గాంధీ పొలంలో పంపు షెడ్డు వద్ద కొందరు యువకులు గంజాయిని కలిగి ఉన్నారనే సమాచారంతో మంగళవారం సాయంత్రం పట్టణ ఎస్సై జీఎస్ఆర్కే పరమహంస తన సిబ్బందితో దాడి చేశారు. పట్టణానికి చెందిన కొందరు యువకులు ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా కామన్గూడ ప్రాంతం నుంచి కేజీ గంజాయిని రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి, నిడదవోలుకు తీసుకొచ్చారు. మానే గాంధీ పొలంలో పంపు షెడ్డు వద్ద వేయింగ్ మెషీన్పై తూచి, ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు దాడి చేసి, పట్టణంలోని కుమ్మరి వీధికి చెందిన దాసరి పృథ్వీవెంకటసాయి నితీష్, జగనన్న కాలనీకి చెందిన గడిచుకోట భానుప్రకాష్, వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ బషీర్, చర్చిపేటకు చెందిన అక్కాబత్తుల బాలు, సింగవరం గ్రామానికి చెందిన మద్దాల భానుప్రకాష్, తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన పడాల భాగ్య శివసుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్కు పంపించినట్టు సీఐ తిలక్ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.55 వేల విలువైన 11 కేజీల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నిడదవోలు పోలీసులను అభినందించారు. నిందితుల్లో ఆరుగురు యువకులు 11 కేజీల సరకు, ఇతర వస్తువులు స్వాధీనం -
బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాలి
కరప: బాణసంచా తయారీదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కాకినాడ ఏడీఎఫ్ఓ పి.ఏసుబాబు అన్నారు. వేళంగిలో బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీదారుల సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాణసంచా తయారీ, విక్రయదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. తయారు చేసే ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు, అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బాణసంచా తయారీదారుల సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా వెలుగుబంట్ల సత్యనారాయణ, అధ్యక్షుడిగా కొప్పిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారిగా జీవీవీ సత్యనారాయణ, కార్యదర్శిగా కె.విజయ్కుమార్, కె.దుర్గారావు, ఉపాధ్యక్షులుగా విన్నకోటి శ్రీనివాసరావు, సయ్యద్ బాజీబేగ్, ఎన్.దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు ధవళేశ్వరం: నేరం రుజువు కావడంతో హత్య కేసులో నిందితుడు దాడి గణేష్కు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఐదో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డి.విజయగౌతమ్ బుధవారం తీర్పు ఇచ్చారు. పోలీసుల వివరాల మేరకు, నర్సిపట్నం మండలం చెట్టిపల్లి గ్రామానికి చెందిన దాడి గణేష్ 12 ఏళ్ల క్రితం ధవళేశ్వరం గ్రామానికి చెందిన వరలక్ష్మిని ప్రేమించి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ధవళేశ్వరం ఎర్రకొండలో నివాసం ఉండేవారు. 2019 జనవరి 28న తన భార్య ఎవరితోనే ఫోన్ మాట్లాడుతుందనే అనుమానంతో పీటతో తలపై మోది, చాకుతో పొడిచి ఆమెను హతమార్చాడు. ఆమె సోదరుడు కుంచాల శ్రీను ఫిర్యాదు మేరకు అప్పటి సీఐలు బాలశౌరి, ఎ.శ్రీను, ఎస్సై ఎస్.వెంకయ్య చార్జిషీట్లు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున గ్రేడ్–1 స్పెషల్ పీపీ కె.లక్ష్మానాయక్ వాదించారు. కేసును పర్యవేక్షించిన ధవళేశ్వరం సీఐ టి.గణేష్ ,హెచ్సీ బి.జయరామ్రాజును ఎస్పీ బి.నరసింహ కిషోర్ అభినందించారు. రైతు బలవన్మరణం నల్లజర్ల: కారణమేంటో తెలియదు కానీ మండలంలోని తెలికిచెర్లలో బుధవారం తెల్లవారుజామున రైతు బుడిగిన శ్రీను(48) తన పొలంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొలంలో మామిడిచెట్టుకు ఉరి వేసుకున్నాడు. అతడికి భార్య, ఇద్దరు మగ పిల్లలున్నారు. అతడి మరణానికి కారణం తెలియదని బంధువులు తెలిపారు. పామాయిల్ తోట వద్ద మామిడి చెట్టుకు అతడి మృతదేహం వేలాడుతుండడాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై శోభనాద్రి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
త్వరలో అసంపూర్తి భవనాలను పూర్తి చేస్తాం
ఇన్ఫ్రా జాయింట్ డైరెక్టర్ రామలింగం రాయవరం: మనబడి–మన భవిష్యత్తు పథకంలో అసంపూర్తిగా ఉన్న భవనాలను త్వరలోనే పూర్తి చేయనున్నట్టు కమిషనర్ ఆఫ్ స్కూల్స్(ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రోగ్రాం డైరెక్టర్ మువ్వా రామలింగం తెలిపారు. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ప్రాధాన్య క్రమంలో నిధులను కేటాయించి, పనులను పూర్తి చేయనున్నట్టు చెప్పారు. మండలంలో పదో తరగతి పాఠశాలల తనిఖీ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సీబీఎస్ఈ, హైస్కూల్ ప్లస్ పాఠశాలలను విరమించుకునే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత సంస్కరణలకు అనుగుణంగా పనులను పూర్తి చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేయనున్నట్టు తెలిపారు. మనబడి–మన భవిష్యత్తులో తాగునీరు, విద్యుద్దీకరణ, కిచెన్ షెడ్లు, టాయిలెట్లు, మేజర్, మైనర్ రిపేర్లు, గ్రీన్చాక్ బోర్డు, పెయింటింగ్ వంటి పనులను విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా పూర్తి చేస్తామని వివరించారు. అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి చేస్తామన్నారు. సిమెంట్ అవసరమైన పాఠశాలల్లో నిర్మాణాలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో పది పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేనట్టు నిర్వహిస్తున్నట్టు పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు రామలింగం తెలిపారు. చెల్లూరు, పసలపూడి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారన్నారు. కింద కూర్చుని పరీక్షలు రాయకుండా, అన్నిచోట్ల ఫర్నిచర్ను ఏర్పాటు చేశారన్నారు. -
నేర పరిశోధనల్లో టెక్నాలజీ కీలకం
అమలాపురం టౌన్: నేర పరిశోధనల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలకమయ్యేలా దర్యాప్తులు, విచారణలు ఉండాలని ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) జీవీకే అశోక్కుమార్ జిల్లా పోలీస్ శాఖకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా అమలాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని మంగళవారం ఐజీ సందర్శించారు. ఎస్పీ కార్యాలయంలోని అడ్మిషనిస్ట్రేటివ్ విభాగాన్ని ఐజీ పరిశీలించారు. ఆ విభాగంతోపాటు జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (డీసీఆర్బీ), జిల్లా ట్రాఫిక్ రికార్డ్స్ బ్యూరో (డీటీఆర్బీ), స్పెషల్ బ్రాంచి విభాగాల రికార్డులను ఐజీ తనిఖీ చేశారు. ఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కంట్రోల్ రూమ్ను, సోషల్ మీడియా విభాగాన్ని ఐజీ పరిశీలించి సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర పరిశోధనల్లో విరివిగా వాడాలని, జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించడంలో సాంకేతిక ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం పనితీరు మెరుగ్గా ఉంటేనే జిల్లాలోని శాంతి భద్రతల పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధన, క్రైమ్ రేటు తగ్గుదల, చోరీలకు గురైన సొత్తుల రికవరీ అనేవి సాకారమవుతాయని ఐజీ అశోక్కుమార్ జిల్లా పోలీస్ శాఖకు స్పష్టం చేశారు. ఎస్పీ కృష్ణారావు, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, ఎస్పీ కార్యాలయ వివిధ విభాగాల సీఐలు బి.రాజశేఖర్, జి.వెంకటేశ్వరరావు, వి.శ్రీనివాస్ పాల్గొన్నారు.ఎస్పీ కార్యాలయ రికార్డులు తనిఖీ చేసిన ఐజీ అశోక్ కుమార్ -
సేవాభావంతో వైద్య వృత్తి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వైద్య వృత్తి సేవాభావంతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం జరిగిన రాజమహేద్రవరం మెడికల్ కళాశాల ప్రథమ వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కళాశాలలో గత ఏడాది వైద్య విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించడం శుభపరిణామమని అన్నారు. కష్టపడి చదివి, వైద్యులైన తరువాత అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ‘సౌభాగ్య రక్త మిత్ర‘ లోగోను కలెక్టర్ ఆవిష్కరించారు. ఒకరు రక్తాన్ని దానం చేయడం వలన ముగ్గురికి ప్రాణ దానం చేయవచ్చని అన్నారు. వైద్యాధికారులు, వైద్య విద్యార్థులతో రక్తదాన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, అడిషనల్ డీఎంఈ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.సూర్యప్రభ, వైస్ ప్రిన్సిపాల్, కె.శివప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ కె.సూర్యారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వీవీ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో పారిచోద్యం
10 గ్రామాలను చుట్టుముట్టిన డయేరియాఅంబాజీపేట కొబ్బరి మార్కెట్ కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 దేవరపల్లి: పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. దీంతో పలు గ్రామాల్లో వ్యాధులు ప్రబలడంతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. నెలల తరబడి వాటర్ ట్యాంకుల క్లోరినేషన్ చేయకపోవడం, మురుగు కంపు కొడుతున్న డ్రైనేజీలు, దోమల బెడద, అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ వంటి సమస్యలతో గోపాలపురం మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడబడితే అక్కడ రోడ్ల పక్కన పేరుపోయిన చెత్త కుప్పలతో గ్రామాలు స్వాగతం పలుకుతున్నాయి. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయకపోవడం వల్ల కలుషితమైన నీరు తాగి అనారోగ్యాలకు గురవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఏదైనా సంఘటన జరిగితే తప్ప అధికారులు, పాలకులు గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముమ్మరంగా శానిటేషన్ పనులు డయేరియా వ్యాధి విజృంభించడంతో వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీ, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు వ్యాధి లక్షణాలు ఉన్న పది గ్రామాల్లో శానిటేషన్ పనులు ముమ్మరంగా చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో సూపర్ శానిటేషన్ చేపట్టి వాటర్ ట్యాంకులు శుభ్రం చేసి, ఆరబెట్టి క్లోరినేషన్ చేయడం, డ్రైనేజీల్లోని పూడిక తీయడం, రోడ్ల పక్కన గల చెత్తను సంపద కేంద్రాలకు తరలించడం వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. పారిశుధ్య పనులను డివిజినల్ పంచాయతీ అధికారి, ఎంపీడీఓ పర్యవేక్షిస్తున్నారు. కొవ్వూరు ఆర్డీఓ సోమవారం రాత్రి వరకు పలు గ్రామాల్లో పర్యటించి వాటర్ ట్యాంకులను పరిశీలించారు. కొనసాగుతున్న వైద్య శిబిరాలు గ్రామాల్లో వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. 10 గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్త పరీక్షలు చేస్తున్నారు. 20 వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నాయి.క్లుప్తంగా ప్రబలుతున్న వ్యాధులు పది గ్రామాలను చుట్టుముట్టిన డయేరియా నమోదవుతున్న కొత్త కేసులు పర్యటిస్తున్న అధికారులు సూపర్ శానిటేషన్కు కలెక్టర్ ఆదేశం శుభ్ర పడుతున్న వాటర్ ట్యాంకులుగ్రామాల్లో సూపర్ శానిటేషన్ డయేరియా వ్యాధి లక్షణాలు ఉన్న పది గ్రామాల్లో సూపర్ శానిటేషన్ చేస్తున్నాం. పెద్ద పంచాయతీల్లో అదనపు కార్మికులను ఏర్పాటు చేసి శానిటేషన్ పనులు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీల కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం. మంచినీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నాం. క్లోరినేషన్ చేసి ప్రజలకు మంచినీరు సరఫరా చేస్తున్నాం. డ్రైయినేజీల్లోని పూడికతీసి తరలిస్తున్నాం. – వై.అమ్మాజీ, డీఎల్పీఓ, కొవ్వూరు డయేరియా వ్యాధి ప్రజలను భయపెడుతోంది. ఐదు రోజులుగా గోపాలపురం మండలంలోని పది గ్రామాలను డయేరియా వ్యాధి చుట్టుముట్టడడంతో దాదాపు 40 మంది స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గోపాలపురం, పెద్దగూడెం, ఉప్పరగూడెం, వేళ్లచింతలగూడెం, చిట్యాల, పెద్దాపురం గ్రామాలను డయేరియా వ్యాధి చుట్టుముట్టింది. వాంతులు, విరేచనాలతో పలువురు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సుమారు 30 మంది వ్యాధితో ఆసుపత్రిలో చేరగా, చికిత్స అనంతరం కొంతమంది కోలుకుని ఇళ్లకు చేరారు. ప్రతి రోజు కొత్త కేసులు నమోదవుతుండడంతో పరిస్థితి అధికారులకు అంతుపట్టడం లేదు. సోమవారం ఉదయం ఆసుపత్రిలో 15 మంది చికిత్స పొందుతుండగా, సాయంత్రం కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో సుమారు 20 మంది ఆసుపత్రిలో మంచాలపై ఉన్నారు. మంగళవారం ఉదయం ఏడుగురు ఆసుపత్రిలో ఉండగా, మిగిలిన రోగులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. అయితే పెద్దగూడెం నుంచి ఉదయం రెండు కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డయేరియా అదుపులో ఉంది మండలంలో డయేరియా వ్యాధి అదుపులో ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 11 మంది రోగులు ఉండగా, చికిత్స అనంతరం మంగళవారం ఏడుగురు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఉదయం మరొక రెండు కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం ఆరుగురు చికిత్స పొందుతున్నారు. వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. 20 వైద్య బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటా సర్వే చేయిస్తున్నాం. డయేరియా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సేవలు అందిస్తున్నాం. పరిస్థితి చక్కబడింది. వారం రోజులు వైద్యశిబిరాలు కొనసాగుతాయి. డయేరియా సోకడానికి గల కారణాలను తెలుసుకోవడానికి మట్టి, భూగర్భజలాలు, స్టూల్, పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించాం. రిపోర్ట్స్ రావలసి ఉంది. – డాక్టర్ సంధ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ, కొవ్వూరు. -
సత్రం గదిలో ఖాళీ మద్యం సీసాలపై విచారణ
అన్నవరం: స్థానిక శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కొండ దిగువన గల సత్యనికేతన్ సత్రంలోని ఒక గదిలో ఖాళీ మద్యం బాటిల్స్ దొరికిన వైనంపై విచారణ జరుగుతోందని, నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన అన్నవరంలో పంపా నదిని పరిశీలించేందుకు వచ్చిన సందర్బంగా విలేకరులతో మాట్లాడారు. కొండ దిగువన సత్రంలో ఘటన జరిగితే రత్నగిరిపై సత్రాలలో జరిగినట్టుగా కొన్ని చానల్స్లో వార్తలు రావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు పూర్తి వివరాలు తెలుసుకుని వార్తలు ఇవ్వాలని కోరారు. దేవస్థానంలో టాయిలెట్స్ నిర్వహణపై కలెక్టర్ ఆరా తీశారు. స్వామివారి నిత్యకల్యాణ మండపం వద్ద గల టాయిలెట్స్ను ఆయన తనిఖీ చేశారు. మరింత శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నవరం మెయిన్ రోడ్డులో ఆక్రమణలు తొలగించాలని గ్రామస్తుడు ఈర్లు శ్రీనివాసరావు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించగా దీనిపై తగు చర్యలు తీసుకోవాలని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు, గ్రామ పంచాయితీ కార్యదర్శి చక్రవర్తిని కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్ షణ్మోహన్ -
8 నుంచి సైనిక విన్యాసాలు
కాకినాడ సిటీ: కాకినాడ తీరంలోని నేవల్ ఎన్క్లేవ్లో వచ్చే ఏప్రిల్ 8 నుంచి 13వ తేదీ వరకు భారత్, అమెరికా వాయుసేన దళాలు ఉమ్మడిగా నిర్వహించనున్న టైగర్ ట్రియంఫ్–25 సైనిక విన్యాసాలకు అవసరమైన సివిల్ సహకారాన్ని అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను కోరారు. మంగళవారం ఆయన చాంబర్లో సైనిక విన్యాసాల నిర్వహణపై సైనిక, సివిల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సివిల్–మిలటరీ లైజాన్ అధికారి కమాండర్ వైకే కిషోర్ మాట్లాడుతూ భారత్ అమెరికా వాయుసేనల సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుంచి 13వ తేదీ వరకూ టైగర్ ట్రియంఫ్–25 పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలను విశాఖపట్నం, కాకినాడ తీరాలలో నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 8 నుంచి 13వ తేదీ వరకూ కాకినాడ తీరంలోని నేవల్ ఎన్క్లేవ్లో యాంఫీబిఎస్ విన్యాసాలు సముద్రంలోను, ఉపరితలంపైన జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఈ మేరకు సైనికాధికారులు కోరిన అంశాలపై శాఖల వారిగా చేపట్టాల్సిన చర్యలు డీఆర్వో వెంకటరావు ఆయా శాఖల అధికారులకు సూచించారు. విశాఖపట్నం, కాకినాడల మధ్య సంచరించే రూట్లలో రోడ్ కాన్వాయ్ ఆపరేషన్స్కు అవసరమైన సహకారాన్ని సైనిక అధికారులకు అందించాలని సూచించారు. సముద్రంలో విన్యాసాలు జరిగే ప్రాంతానికి సమీపంలోకి మత్స్యకారుల బోట్లు ప్రవేశించకుండా మత్స్యశాఖ, మైరెన్ పోలీస్ శాఖలు కట్టుదిట్టం చేయాలన్నారు. ప్రథమ చికిత్స అందించేందుకు కాకినాడలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి అడ్వాన్సు లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ కలిగిన అంబులెన్స్లను వారం రోజులు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్వోను కోరారు. సైనిక అధికారి టీవీవీ ప్రసాద్, మైరెన్ పోలీస్ అధికారి రామ్మోహన్రెడ్డి, రూరల్ సీఐ చైతన్యకృష్ణ, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ, మత్స్యశాఖ అధికారి అనూరాధ, కేఎస్పీఎల్, ఫైర్ మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీ ఇంటిలిజెన్స్, సమాచారశాఖల అధికారులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలుడు తండ్రి చెంతకు..
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో మంగళవారం మధ్యాహ్నం అనుమానంగా తిరుగుతున్న ఏడేళ్ల బాలుడిని ట్రాఫిక్ ఎస్సై అవుట్ పోస్టు పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి వివరాలు సేకరించి సుమారు మూడు గంటల తరువాత తండ్రి చెంతకు చేర్చిన ఘటన ఇది. ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు కథనం ప్రకారం బాలుడు మన్ను దాసు తండ్రి గణేష్ దాస్ ఏడీబీ రోడ్డులోని అపర్ణ టైల్స్లో పని చేస్తూ సమీపంలో నివాసం ఉంటున్నారు. తల్లి ఒడిశా వెళ్లడంతో ఒంటరిగా ఇంటి వద్ద ఉన్న కుమాడికి తండ్రి సెల్ఫోన్ ఇచ్చాడు. దాంతో ఆడుకొంటూ నడుచుకొంటూ రైల్వే స్టేషన్ సెంటర్కు చేరుకున్నాడు. అనుమానంగా తిరుగుతున్న మన్ను దాసును ప్రశ్నిస్తే అడ్రసు చెప్పలేక పోవడంతో బాలుని వద్ద ఉన్న సెల్ ఫోన్ పరిశీలించగా చార్జింగ్ అయిపోయిందన్నారు. దాంతో ఆసెల్లోని సిమ్ తీసి వేరే ఫోనులో వేసి బంధువులకు ఫోన్ చేసి వివరాలు సేకరించామన్నారు. బాలుడు తండ్రికి సమాచారం ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం అవుట్పోస్టు పోలీసు స్టేషన్కు చేరుకున్నాడు. అతడికి బాలుడిని క్షేమంగా ట్రాఫిక్ ఎస్సై అప్పగించారు. పోలీసుల అదుపులో అనుమానితుడుకాకినాడ క్రైం: కాజులూరు స్టేట్ బ్యాంక్ సమీపంలో తుపాకీతో సంచరిస్తున్న ఓ అనుమానితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తిమ్మాపురం పోలీసులు కాకినాడకు తరలించగా రూరల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఆ వ్యక్తి బ్యాంకు దోపిడీకి రెక్కీ నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. విచారణలో అందుకు తగ్గ ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో జరగబోయే నేరాన్ని ముందుగానే గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై బుధవారం ఎస్పీ బిందుమాధవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. -
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
ఏలేశ్వరం: గత నెల 9వ తేదీన పట్టణంలోని ప్రధాన రహదారిని అనుకుని ఉన్న జ్యూయలరీ షాపులో జరిగిన చోరీలో ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్ వివరాలు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం అత్తిరాల గ్రామానికి చెందిన కరణం కుమార్, కడప జిల్లా అట్లూరు మండలం చలంగారేపల్లి గ్రామానికి చెందిన గుమ్మళ్ల వెంకట సుబ్బయ్య కలిసి చోరీకి పాల్పడ్డారన్నారు. మండల పరిధిలోని తిరుమాలి జంక్షన్లో రాథాస్వామి సత్సంగ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి చోరీ సొత్తు 32.8 గ్రాముల బంగారం, 11.5 కేజీల వెండి రికవరీ చేశామన్నారు. దీంతో పాటు ఇద్దరు ముద్దాలు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. నక్కపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలో 20.450 గ్రాముల బంగారం, తుని పోలీస్స్టేషన్ పరిధిలో బజాజ్ పల్సర్బైక్, ఆత్మకూరు పోలీస్స్టేషన్ పరిధిలో 13గ్రాముల బంగారం రికవరీ చేశామన్నారు. ముద్దాయి కరణం కుమార్పై 30 వరకు దొంగతనం కేసులు ఉండగా కాకినాడ పీఎస్ పరిధి కేసులో 14 ఏళ్ల జైలు శిక్షపడగా బెయిల్పై బయటకు వచ్చాడన్నారు. మరో ముద్దాయి గుమ్మళ్ల వెంకటసుబ్బయ్యపై 11 ఎర్రచందనం కేసులు, 10 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. వేర్వేరు కేసుల్లో 2023లో కడప జైలులో వీరు కలుసుకున్నారన్నారు. ఇప్పటివరకు నాలుగు జ్యూయలరీ షాపుల్లో చోరీలు చేశారన్నారు. సీఐ సూర్యఅప్పారావు, ఏలేశ్వరం, అన్నవరం, రౌతులపూడి ఎస్సైలు రామలింగేశ్వరరావు, హరిబాబు, వెంకటేశ్వరావు, అన్నవరం అడిషనల్ ఎస్సై ప్రసాద్లను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీహరిరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణాన్ని బలిగొన్న వారిని అరెస్ట్ చేయాలి
సఖినేటిపల్లి: స్థానిక సినిమాహాల్ సెంటర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నిండు ప్రాణాన్ని బలిగొన్న వ్యక్తులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఽమంగళవారం పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేశారు. వీరికి సంఘీభావంగా ఒలుపు, దింపు కార్మికులు, కొబ్బరి రైతులు, ప్రముఖులు సరెళ్ల విజయ్ ప్రసాద్, గొల్లమందల చిట్టిబాబు, రుద్రరాజు చిన రాజా, రాపాక మహేష్, కుసుమ చింటూ పాల్గొన్నారు. గుడిమూలలో నివాసం ఉంటూ, తునికి చెందిన బత్తిన పైడిరాజు(23) కొబ్బరి దింపులు తీస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. సఖినేటిపల్లిలో రోడ్డు పక్క బైక్పై ఆగి ఉన్న పైడిరాజును, ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో పైడిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు కారకులైన కారులోని నలుగురిని అరెస్ట్ చేయాలని, నిరుపేద అయిన పైడిరాజు కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో తండ్రి బత్తిన బంగార్రాజు కన్నీరు మున్నీరుగా విలపించాడు. రోడ్డు ప్రమాదంపై ఇప్పటికే నమోదైన కేసు ఆధారంగా అన్ని కోణాలలో దర్యాప్తు సాగుతోందని, చట్టప్రకారం బాధ్యులపై చర్యలు ఉంటాయని ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు తెలిపారు. -
శృంగార వల్లభునికి రూ.28.10 లక్షల ఆదాయం
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి వారికి అన్నదానం, హుండీల ద్వారా రూ.28,10,646 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాస్ తెలిపారు. దేవదాయ శాఖ కాకినాడ డివిజనల్ ఇన్స్పెక్టర్ వి.ఫణీంద్రకుమార్, గ్రామ సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి సమక్షంలో ఆలయంలోని హుండీలను మంగళవారం తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం 90 రోజులకు గాను హుండీల ద్వారా రూ.21,40,696, అన్నదానం హుండీ ద్వారా రూ.6,69,950 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. మహిళలను మోసగించిన సర్కార్ ˘ శాసన మండలిలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ అల్లవరం: అధికారంలోకి వస్తే 50 ఏళ్ల వయస్సు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ.4 వేల పింఛన్ పథకాన్ని వర్తింపజేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. ప్రభుత్వ తీరును శాసన మండలిలో మంగళవారం ఆయన ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పింఛన్లు ఏవని ప్రశ్నించారు. ఈ పథకం కింద బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మహిళలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 65,49,864 మందికి పింఛన్లు పంపిణీ చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 63,53,907కు తగ్గిందని తెలిపారు. రెండు లక్షల పెన్షన్లు కోత పెట్టారని విమర్శించారు. ప్రతి నెలా పెన్షన్లు తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల పంపిణీకి రూ.32,634 కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో రూ.27,512 కోట్లు మాత్రమే కేటాయించారని, దీనినిబట్టి భవిష్యత్లో చాలా పెన్షన్లను తొలగించే అవకాశం ఉందని చెప్పకనే చెబుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు దాటిన వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఐదేళ్ల పాటు అందించి వేలాది కుటుంబాలకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలా ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని ఇజ్రాయిల్ అన్నారు. రూ.9 వేల కనీస పెన్షన్ ఇవ్వాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): దేశవ్యాప్తంగా 75 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్లకు డీఏతో కలిపి కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలనే డిమాండ్తో కాకినాడ ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని పెన్షనర్లు మంగళవారం ముట్టడించారు. ఆలిండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్ల పిలుపు మేరకు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు మాట్లాడుతూ, 13 సంవత్సరాలుగా ఈపీఎఫ్ పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని అన్నారు. 36 లక్షల మంది కనీసం రూ.వెయ్యి పెన్షన్ కూడా పొందలేని పరిస్థితులు దేశంలో ఉన్నాయన్నారు. ఈపీఎఫ్ వద్ద రూ.8.88 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఉందని, దీనిపై ఏటా రూ.52 వేల కోట్ల వడ్డీ వస్తోందని చెప్పారు. అయినప్పటికీ పెన్షన్ల రూపంలో కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. మిగిలిన రూ.38 వేల కోట్లు తిరిగి కార్పస్ ఫండ్కు జమవుతోందని తెలిపారు. ఒకవైపు కార్పొరేట్లకు కేంద్రం రాయితీలు ప్రకటిస్తూ, రూ.వేల కోట్ల బ్యాంకు రుణాలు రద్దు చేస్తోందని, మరోవైపు ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ మంజూరు చేయాలంటే సాకులు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు బాబూరావు, సీనియర్ నాయకుడు రాందాస్ మాట్లాడుతూ, ఈపీఎఫ్ పెన్షనర్లకు సామాజిక పింఛన్లు ఇవ్వాలని, ఉచిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, రైలు ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. -
పెన్షన్ దక్కక పేద కుటుంబం పాట్లు
కడియం: మండలంలోని జేగురుపాడు గ్రామానికి చెందిన 40 ఏళ్ల నాగిరెడ్డి సత్తిబాబు బ్రెయిన్ ట్యూమర్ కారణంగా శరీరం కదల్చలేని పరిస్థితికి చేరాడు. మంచంపైనే అన్నీ చేయాల్సిన స్థితిలో ఉన్నాడు. వ్యవసాయ కూలీ కావడంతో అతడికి వైద్యం చేయించడం, కుటుంబాన్ని పోషించుకోవడం అతడి భార్య చక్రవేణికి శక్తికి మించిన భారమైంది. కనీసం పెన్షన్ అయినా వస్తే మంచంపై ఉన్న సత్తిబాబుకు వైద్యం సక్రమంగా అందుతుందన్న ఆశతో అతడి భార్య తెలిసిన వాళ్ళందరితో మాట్లాడుతోంది. సంబంధిత పత్రాలు పట్టుకుని తిరుగుతోంది. అతికష్టం మీద కాకినాడ తీసుకువెళ్లగా, అక్కడి వైద్యులు 90శాతం వైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్ ఇచ్చారు. వీటన్నిటితో పెన్షన్కు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సత్తిబాబుకు మాత్రం పెన్షన్ మంజూరు కాలేదు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి స్వయంగా సత్తిబాబు పరిస్థితిని చూసి, వెంటనే పెన్షన్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినప్పటికీ పెన్షన్ మంజూరు లిస్టులో పేరు మాత్రం రాలేదు. దీంతో మంచంపైనే ఉన్న భర్త, ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకురావడానికి ఆమె నానా యాతనలు పడుతోంది. ఎవరైనా పలకరిస్తే కన్నీళ్లే ఆమె సమాధానంగా ఉంటోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు కలుగజేసుకుని సత్తిబాబుకు పెన్షన్ మంజూరు చేయించి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 90 శాతం వైకల్యం ఉన్నా ఎదురుచూపులు -
మతి స్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తి మృతి
తాళ్లపూడి: మండలంలోని పెద్దేవం శివారు రావూరుపాడు బస్టాండ్ వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. నాలుగు రోజులుగా ఇక్కడే ఉంటూ పరిసర ప్రజలు పెట్టిన ఆహారం తింటూ ఉన్నాడని అన్నారు. ఈ క్రమంలో మృతి చెందిన వ్యక్తి మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా ఉన్నట్టు సమాచారం. ఇతనికి సంబంధించిన వివరాలు తెలిస్తే తాళ్లపూడి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై రామకృష్ణ తెలిపారు. కొట్లాట కేసులో ఆరు నెలల జైలు తుని రూరల్: తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన మాసా సింహాచలంకు తుని జేఎఫ్సీఎం కోర్టు జడ్జి ఆరు నెలలు జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి మంగళవారం తెలిపారు. 2021లో గ్రామంలో జరిగిన కొట్లాటపై అప్పటి ఎస్సై వై.గణేష్ కుమార్ కేసు నమోదు చేశారన్నారు. సింహాచలంపై నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్టు ఆయన తెలిపారు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు ఆధ్వర్యంలో తన సూచనల మేరకు కోర్టు కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం సాక్షులను ప్రవేశపెట్టగా ఏపీపీ లక్ష్మీదేవి కేసు వాదించినట్టు ఆయన వివరించారు. -
ఆందోళన వద్దు : కలెక్టర్
గోపాలపురం: మండలంలో డయేరియా అదుపులోనే ఉందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. గోపాలపురం సీహెచ్సీలో చికిత్స పొందున్న డయేరియా బాధితులను సోమవారం ఆమె, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును రోగులను అడిగి తెసుకున్నారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ. వివిధ గ్రామాల నుంచి వచ్చిన డయేరియా బాధితులకు సత్వర చికిత్స అందిస్తున్నామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో వైద్య బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటి వరకూ 25 మంది చికిత్స పొందగా 20 మంది డిశ్చార్జి అయ్యారని, కొత్తగా 9 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. డయేరియా కేసులను గుర్తించేందుకు వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తున్నారన్నారు. గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లో అక్కడక్కడ డయేరియా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాలలో వాటర్ ట్యాంకులు, స్టోరేజీ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టామన్నారు. ప్రజలకు అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉంచామన్నారు. వాతావరణ మార్పులు, వడగాల్పులతో డయేరియా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి పరిశీలనకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. అనంతరం డయేరియా కేసులు నమోదైన గోపాలపురం, పెద్దగూడెం, చిట్యాల, పెద్దాపురం, వేళ్లచింతగూడెం గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను కలెక్టర్ ప్రశాంతి, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కె.వెంకటేశ్వరరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి ఎన్వీ పద్మశ్రీ తదితరులు పరిశీలించారు. -
కదిలిస్తే.. కన్నీటి వేదన
దివ్యాంగ పింఛను ఇప్పించండి పుట్టుకతోనే నాకు వైకల్యం. టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తూ, ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నా. పింఛను మంజూరు చేయాలని ఎన్నోసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సదరం సర్టిఫికెట్ పొందినా పింఛను మాత్రం ఇవ్వడం లేదు. – సర్రే దుర్గాప్రసాద్, ధవళేశ్వరం రెండుసార్లు అర్జీ ఇచ్చినా.. కుటుంబ పెద్ద చనిపోయారు. పోషణ భారమైంది. వితంతు పింఛను మంజూరు చేయాలని రెండుసార్లు అర్జీ ఇచ్చినా ఫలితం లేదు. రేషన్ కార్డు, ఇంటి స్థలం కోసం ఇచ్చిన వినతులు కూడా బుట్టదాఖలయ్యాయి. ఇప్పటికైనా అధికారులు ఆదుకోవాలి. – రుద్రపాటి ముత్యవేణి, ధవళేశ్వరం సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/సీటీఆర్ఐ: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ – పీజీఆర్ఎస్) ప్రహసనంగా మారుతోంది. తమ గోడు వెళ్లబోసుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న అర్జీదారులకు సకాలంలో, సరైన పరిష్కారం లభించడం లేదు. సమస్యలపై జిల్లా స్థాయి అధికారులకు వినతులిస్తూండగా.. వారు ఆయా శాఖల అధికారులకు అప్పగించి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో తమ బాధలు చెప్పుకునేందుకు పలువురు అర్జీదారులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎవరిని కదిలించినా కన్నీటి వేదనే వినిపించారు. తమ సమస్యలు తీర్చేవారే లేరంటూ నిట్టూర్చారు. భూ సమస్యలపై అర్జీల వెల్లువ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అత్యధిక శాతం అర్జీలు రెవెన్యూ సమస్యల పైనే వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రతి వారం సుమారు 200 అర్జీలు వస్తూండగా.. వీటిలో 80 శాతం రెవెన్యూ సమస్యలే. మిగిలిన 20 శాతం రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల మంజూరు, తొలగించిన పింఛన్ల పునరుద్ధరణ, పోలీస్, ఇతర శాఖల సమస్యలపై వస్తున్నాయి. గ్రీవెన్స్లో అర్జీలు ఇచ్చేందుకు వచ్చే బాధితులకు వ్యయప్రయాసలు తప్పడం లేదు. మరికొన్ని వినతులు ● ధవళేశ్వరానికి చెందిన పి.కోటకు గతంలో వితంతు పింఛను మంజూరు చేసి, ప్రస్తుతం చెప్పా పెట్టకుండా పింఛను ఆపేశారు. పిల్లల్ని పోషించడం కష్టంగా ఉందని, అధికారులు కరుణించి, పింఛన్ పునరుద్ధరించాలని వేడుకున్నారు. ● సీతానగరం మండలం రామచంద్రపురం వీఆర్ఓ టి.పుల్లారావు అనారోగ్య కారణాలతో 2021 నుంచి విధులకు హాజరు కావడం లేదు. ఆయనకు రావాల్సిన జీతం మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు అర్జీ ఇచ్చారు. సమస్యలపై కలెక్టరేట్కు వస్తున్న బాధితులు ప్రతి వారం వందలాదిగా అర్జీలు పరిష్కారానికి తప్పని నిరీక్షణ వ్యయప్రయాసలు పడినా లాభం లేదంటూ నిట్టూర్పు ప్రహసనంగా పీజీఆర్ఎస్ గత ఏడాది జూన్ 15 నుంచి వచ్చిన అర్జీల వివరాలు అధికారులు స్వీకరించినవి 22,241 పరిష్కరించినవి 20,579 రీ ఓపెన్ చేసిన అర్జీలు 871 పరిష్కరించినవి 803 ఎక్కువగా వస్తున్న అర్జీలు రీసర్వే (80 శాతం) ఇతర సమస్యలపై 20 శాతం ఈ వివరాలు చూస్తూంటే చాలా వరకూ సమస్యలు పరిష్కారమైనట్లు కనిపిస్తోంది. అయితే, సమస్య ఆన్లైన్లో పరిష్కారమైనట్లు చూపిస్తున్నారే తప్ప.. తమకు సాంత్వన చేకూరడం లేదని బాధితులు వాపోతున్నారు.చీకట్లో మగ్గుతున్నాం మా ఊళ్లో జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకున్నాం. గృహ ప్రవేశం చేశాం. నేను దివ్యాంగురాలిని. నా 18 ఏళ్ల కుమారుడు ప్రశాంత్ సైతం దివ్యాంగుడు. విద్యుత్ కనెక్షన్ కోసం గ్రామ సచివాలయంలో రూ.1,800 చెల్లించి, దరఖాస్తు చేసుకుందామని వెళ్లాం. అప్లికేషన్ తీసుకోవద్దని లైన్మన్ చెప్పాడని కార్యాలయంలో చెబుతున్నారు. నా కుమారుడితో పాటు చీకట్లో మగ్గుతున్నా. డబ్బులు చెల్లిస్తామన్నా విద్యుత్ కనెక్షన్ ఎందుకివ్వడం లేదో అర్థం కావడం లేదు. న్యాయం చేయాలంటూ కలెక్టర్లో వినతిపత్రం సమర్పించా. – పలివెల భవాని, దివ్యాంగురాలు, నందరాడ, రాజానగరం మండలం మరుగుదొడ్డి కూల్చేశారు మా ఊళ్లో నాకు సొంతిల్లు ఉంది. రోడ్డు వేయాలంటూ సర్పంచ్, పంచాయతీ అధికారులు, కొంతమంది వచ్చి మా స్థలంలోని మరుగుదొడ్డి, మెట్లను జేసీబీతో కూల్చేశారు. ఈలోగా 112కి ఫోన్ చేస్తే కానిస్టేబుల్ వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేలోపు ఈ నెల 14వ తేదీ రాత్రి మరుగుదొడ్డిని జేసీబీతో పగులగొట్టి సామగ్రి పట్టుకుపోయారు. పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ కేసుతో తమకు సంబంధం లేదని చెప్పారు. జరిగిన అన్యాయంపై ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచని పరిస్థితుల్లో కలెక్టరేట్కు వచ్చాం. మరుగుదొడ్డిని కూల్చిన వారిపై చర్యలు తీసుకుని, తిరిగి నా స్థలంలో మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అర్జీ ఇచ్చా. – పెద్దింటి అనంతలక్ష్మి, చంద్రవరం, చాగల్లు మండలం -
‘పది’ పరీక్షల హాలులో సిమెంట్ బస్తాలు
అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షా కేంద్రంలోని ఒక గదిలో సిమెంటు బస్తాలు నిల్వ ఉంచడం.. విద్యార్థులు వచ్చిన తర్వాత వాటిని తొలగించడానికి చర్యలు చేపట్టడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని నల్ల వంతెన వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని రూమ్ నంబర్ ఏడులో 22 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు. బ్లాక్ బోర్డు, బెంచీలపై నంబర్లు కూడా రాశారు. ఇదిలా ఉండగా పలు పాఠశాలల్లో నిర్మాణ పనులకు అవసరమైన సిమెంటు బస్తాలను ఈ స్కూలును స్టాక్ పాయింట్గా ఉపయోగిస్తూ, ఇదే గదిలో నిల్వ ఉంచారు. సోమవారం ఉదయం నుంచి టెన్త్ పరీక్షలు మొదలవుతున్నాయని తెలిసి కూడా వీటిని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పరీక్షల నిర్వహణాధికారులు అలాగే ఉంచేశారు. ముందు రోజో లేదా పరీక్షలు రాసేందుకు వచ్చేలోగానో ఆ బస్తాలను అక్కడి నుంచి తొలగించి ఉండాల్సింది. కానీ, పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఈ గదికి వచ్చేసరికి కూలీలతో సిమెంట్ బస్తాలను బయటకు తీసుకుని వస్తున్నారు. ఆ దృశ్యాలను చూసి, విద్యార్థుల తల్లిదండ్రులు అసహనానికి గురయ్యారు. పరీక్షల నిర్వహణపై ఇంత నిర్లక్ష్యమేమిటని ఆగ్రహించారు. పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులను తరగతి గది బయట నిలబెట్టి, సిమెంట్ బస్తాలు బయటకు తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో జిల్లా విద్యా శాఖాధికారి షేక్ సలీమ్ బాషా వెంటనే ఈ పాఠశాలను సందర్శించారు. సిమెంట్ బస్తాలు పాడవకూడదనే ఉద్దేశంతోనే వాటిని ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలో ఓ మూల భద్రపరిచారని చెప్పారు. పరీక్ష ప్రారంభం కాకముందే సిమెంట్ బస్తాల తొలగింపు చేపట్టారని తెలిపారు. విద్యార్థులను నిలిపి, బస్తాల తొలగింపు నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం -
ప్రశాంతంగా ప్రారంభం
● మొదలైన పదో తరగతి పరీక్షలు ● 23,523 మంది హాజరు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 134 కేంద్రాల్లో పేపర్–1లో తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలు జరిగాయి. పరీక్షల తొలి రోజు కావడంతో ఏ కేంద్రం వద్ద చూసినా విద్యార్థులు, తల్లిదండ్రుల హడావుడే కనిపించింది. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకుని, తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా రూములు వెతుక్కున్నారు. ఉదయం 9.30కు పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్షకు మొత్తం 23,984 మందికి గాను 23,523 మంది హాజరయ్యారు. ఒక పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, 11 కేంద్రాలను జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, 64 కేంద్రాలను తనిఖీ అధికారులు సందర్శించారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను మూయించివేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ఓఆర్ఎస్, ప్రాథమిక వైద్య సహాయం అందించేలా ఏర్పాట్లు చేశారు. జాగ్రత్తలు తీసుకోండి పదో తరగతి పరీక్షల నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులకు సూచించారు. రాజమహేంద్రవరం లాలాచెరువు మున్సిపల్ హైస్కూలును ఆమె, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖాధికారి కె.వాసుదేవరావు కూడా పాల్గొన్నారు. -
ఉయ్యాల తాడే.. ఆమెకు ఉరితాడు
కాకినాడ క్రైం: అల్లారుముద్దుగా చూసుకుంటున్న తన బిడ్డను నిద్రపుచ్చేందుకు కట్టిన ఉయ్యాల తాడుతోనే.. ఆ తల్లి ఉరి వేసుకుని శాశ్వత నిద్రలోకి జారుకుంది. మద్యానికి బానిసైన భర్త వైఖరి.. అభంశుభం తెలియని ఇద్దరు బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందోననే ఆందోళన.. జీవితాన్ని ఎదురొడ్డలేనేమోనన్న నిస్సహాయత వెరసి.. ఎన్నో కలలుగన్న ఆ వివాహిత తన నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించి తనువు చాలించింది. ఎన్నో కలలు చూపించి, ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తకు మద్యం ముందు భార్యాబిడ్డలు ఆనకపోవడంతో.. తమ మరణంతోనైనా భర్తకు కనువిప్పు కలుగుతుందనుకుంటూ తనకు తాను మరణ దండన విధించుకుంది. తన ఇద్దరు బిడ్డలకు తల్లి ప్రేమను శాశ్వతంగా దూరం చేసి, జీవితాంతం గుండెకోతను మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన కొట్టేడు స్వాతి(26)కి 2017లో కాకినాడకు చెందిన తలాటం సురేష్తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. కార్ ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్న సురేష్ పెళ్లయిన తొలి నాళ్లలో భార్యతో బాగానే ఉండేవాడు. మద్యం అలవాటు శ్రుతి మించడంతో కొంతకాలం తర్వాత భార్యను పట్టించుకోవడం మానేశాడు. వీరికి నాలుగేళ్ల బాబు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. నిత్యం మద్యం మత్తులో జోగుతూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అతడి వైఖరితో స్వాతి తీవ్ర అసహనంతో ఉండేది. ఎంత నచ్చజెప్పినా సురేష్లో మార్పు రాలేదు. స్నేహితులతో కలిసి తాగుబోతులా మారాడని తల్లిదండ్రుల వద్ద స్వాతి బాధపడుతుండేది. ఈ క్రమంలో దంపతుల మధ్య వాదులాటలు జరిగేవి. ఆదివారం అర్థరాత్రి మద్యం తాగొచ్చిన సురేష్.. భార్యాపిల్లలు పడుకున్న గదిలో నిద్రపోయాడు. భర్త రాకను స్వాతి గమనించి, ఇంతేనా జీవితం అంటూ ప్రశ్నించింది. దీంతో సురేష్ భార్యతో గొడవ పడ్డాడు. ఇలాగే ఉంటే తమ పిల్లల సంగతేంటని ప్రశ్నించడంతో, సురేష్ తిరగబడ్డాడు. దీంతో విసుగెత్తిన స్వాతి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. పిల్లల కోసం కట్టిన ఉయ్యాల తాడునే ఉరితాడుగా మార్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోదరుడు నగేష్ ఫిర్యాదుతో కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై కిషోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసైన భర్త నిర్వాకంతో వివాహిత బలవన్మరణం తల్లిని కోల్పోయిన చిన్నారులు -
కాలువలో యువకుడి గల్లంతు
కడియం: మండలంలోని జేగురుపాడు వద్ద కాలువలో గెడ్డం కార్తీక్(19) గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల మేరకు, కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం తోకలంకకు చెందిన గెడ్డం కార్తీక్ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం జేగురుపాడుకు చెందిన అతడి స్నేహితులను కలిసేందుకు వచ్చాడు. అనంతరం వారంతా కలిసి కాలువలో స్నానానికి దిగారు. అందరూ బయటకు వచ్చినప్పటికీ, కార్తీక్ రాలేదు. దీంతో స్థానికులతో కలిసి మిత్రులంతా గాలింపు చేపట్టినా, అతడి ఆచూకీ లభించలేదు. దీంతో కార్తీక్ తల్లిదండ్రులు, కడియం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కార్తీక్ ఆచూకీ కోసం కాలువ, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు. పంట కాలువలో మృతదేహం ఉప్పలగుప్తం: అమలాపురం చల్లపల్లి ప్రధాన పంట కాలువలో సరిపల్లి గ్రామ పరిధిలో గుర్తు తెలియని పురుషుని మృతదేహం లభ్యమైందని ఎస్సై సీహెచ్ రాజేష్కుమార్ సోమవారం తెలిపారు. స్థానిక వీఆర్వో సమాచారం మేరకు, మృతదేహాన్ని వెలికితీశామని చెప్పారు. మృతునికి 50– 55 ఏళ్ల వయస్సు ఉంటుందని చెప్పారు. మృతుని వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కడలి చెరువులో.. మామిడికుదురు: గోగన్నమఠం గ్రామ పరిధిలోని కడలి చెరువులో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి వయస్సు 40 ఏళ్లకు పైగా ఉండవచ్చు. ఈ మేరకు స్థానికులు నగరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సమీప పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను ఆరా తీస్తున్నారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి బిక్కవోలు: రామచంద్రపురం మండలం నేలపర్తిపాడు గ్రామానికి చెందిన వల్లూరి సురేష్బాబు(50) రైలు ఢీకొన్న ఘటనలో మృతి చెందినట్టు సామర్లకోట రైల్వే ఎస్సై పి.వాసు తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల మేరకు, ఆదివారం రాత్రి బిక్కవోలు–పెదబ్రహ్మదేవం గ్రామాల మధ్య రైల్వే ట్రాక్ దాటుతున్న అతడిని గౌతమీ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో మృతి చెందాడన్నారు. -
అంధ విద్యార్థినికి వెలుగు రేఖగా..
కోటనందూరు: తల్లిదండ్రులు కడు పేదవారు. వారి కుమార్తె పుట్టుకతోనే అంధురాలు. కుటుంబ నిర్వహణే కష్టంగా ఉన్న ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను ప్రభుత్వ బడుల్లోనే చదివిస్తున్నారు. చీకటి అలముకున్న బాలిక జీవితంలో ఓ ఉపాధ్యాయుడు కొత్త వెలుగులు నింపాడు. ఆమె విద్యాబుద్ధులను భుజాన వేసుకుని.. జీవితంలో నిలదొక్కుకునే వరకూ అండగా ఉంటానని భరోసా ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని బంగారయ్యపేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొమ్మాకుల వెంకట కుసుమదేవి పుట్టుకతోనే అంధురాలు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈమె ప్రస్తుతం బిళ్లనందూరు ఎంపీయూపీ పాఠశాల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. కోటనందూరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దాడి కొండబాబు వర్క్ అడ్జస్ట్మెంటులో భాగంగా ఈ ఏడాది బిళ్లనందూరు పాఠశాలకు వెళ్లారు. అక్కడ వెంకట కుసుమదేవి వైకల్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఆయన తెలుసుకున్నాడు. దీంతో ఆమె చదువు బాధ్యతను కొండబాబు తన భుజాన వేసుకున్నారు. ఉన్నత చదువు పూర్తి చేసి, ఉద్యోగం సాధించే వరకూ ఆర్థికంగా అండగా ఉంటానని సంకల్పించారు. ఇందులో భాగంగా బ్రెయిలీ లిపి నేర్చుకోడానికి అవసరమైన బ్రెయిలీ స్లేట్, స్టైలస్ తదితర మెటీరియల్ కొనిచ్చి, నేర్పిస్తున్నారు. బ్రెయిలీ నిపుణుల సహకారంతో కుసుమకు ప్రత్యేకంగా విద్యా బోధన చేస్తున్నట్టు కొండబాబు మాస్టారు వివరించారు. ఆ బాలికను ఉన్నత స్థితికి చేర్చేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. ఆ విద్యార్థినికి అండగా ఉంటూ, పలువురికి ఆదర్శంగా నిలిచిన కొండబాబు మాస్టారుని ఎంఈఓలు ఏవీఎస్ శ్రీనివాస్, ఎంవీ రామశేఖర్, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు అభినందించారు. చదువుకు దత్తత తీసుకున్న ఉపాధ్యాయుడు జీవితంలో నిలదొక్కుకునే వరకూ అండగా ఉంటానని భరోసా -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పోలీస్ పీజీఆర్ఎస్కు 26 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టం(పీజీఆర్ఎస్)ను అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్బీఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (శాంతిభద్రతలు) ఏవీ సుబ్బరాజు సోమవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి 26 అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి, అర్జీదారుల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. సివిల్, చీటింగ్, కొట్లాట కేసులు, కుటుంబ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. క్యాన్సర్ రహిత సమాజం నిర్మిద్దాం రాజానగరం: ఫార్మాస్యూటికల్స్లో నైట్రోసమైన్లను నిర్మూలించడం ద్వారా క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యాన ‘కంట్రోల్ ఆఫ్ నిట్రోసామినేష్ ఇన్ ఫార్మాస్యూటికల్స్ అండ్ అనలిటికల్ టెస్టింగ్’ అనే అంశంపై సోమవారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. జీవనశైలి, ఆహారం, ధూమపానం, మద్యపానం వంటి వాటితో పాటు కలుషితమైన మందులు కూడా క్యాన్సర్కు ప్రధాన కారణాలని వీసీ అన్నారు. నెట్రోసమైన్ల వంటి కొన్ని విషపూరిత మలినాలు ఆందోళన కలిగించేవిగా నిరూపితమయ్యాయన్నారు. ఈ సందర్భంగా కాన్సినోజెనిక్ పొటెన్సీ కాలిక్యులేషన్స్, రిస్క్ మిటిగేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నైట్రోసమైన్స్ ఇన్ ఫార్ములేషన్ అనే అంశంపై అమెరికాకు చెందిన సైజెన్ ఫార్మాస్యూటికల్స్ క్వాలిటీ అస్యూరెన్స్ డైరెక్టర్ డాక్టర్ విష్ణు మారిశెట్టి, నైట్రోసమైన్ కంట్రోల్స్ ఇన్ డ్రగ్స్ సింథసిస్ అనే అంశంపై మలేషియాకు చెందిన ఐఎన్టీఐ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్ వి.రవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. కెమిస్ట్రీ అధ్యాపకులు డాక్టర్ బి.జగన్మెహన్రెడ్డి మాట్లాడుతూ, వివిధ రకాల ఔషధాల్లో నైట్రోసమైన్లు ఉండే అవకాశాలను వివరించారు. ఆన్లైన్లో అమెరికాకు చెందిన కెమ్ టెక్స్ లాబొరేటరీస్ సైంటిస్టు డాక్టర్ నరేష్ కటారి తదితరులు కూడా ప్రసంగించారు. నన్నయ, గీతం వర్సిటీల నుంచి 12 మంది పోస్టర్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి 250 మంది విద్యార్థులు, అధ్యాపకులు హాజరయ్యారు. హెల్త్ సెంటర్ అభివృద్ధికి రూ.15 లక్షల విరాళం రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో హెల్త్ సెంటర్ అభివృద్ధికి కాకినాడకు చెందిన ఎలైట్ నేచురల్ ఆయిల్స్ ఎండీ డాక్టర్ తోట సుబ్రహ్మణ్యం రూ.15 లక్షల విరాళం ప్రకటించారు. వర్సిటీలో సోమవారం నిర్వహించిన సెమినార్కు హాజరైన ఆయన వర్సిటీ అభివృద్ధి తదితర అంశాలపై వీసీ ఆచార్య ప్రసన్నశ్రీతో చర్చించారు. అనంతరం తన తండ్రి తోట హరిబాబు పేరిట ఈ విరాళం ప్రకటించారు. దాతను ఆచార్య ప్రసన్నశ్రీ ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. రూ.లక్ష విరాళంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక శాంతినగర్లోని శ్రీరామకృష్ణా సేవా సమితికి ముత్తా రామన్న సత్రం ఫౌండర్ ట్రస్టీలు డాక్టర్ ముత్తా వెంకటేష్, ముత్తా ప్రసాద్బాబు సోమవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని సమితి అధ్యక్షుడు విఎల్ గాంధీ, కార్యదర్శి కె.సతీష్, ఉపాధ్యక్షుడు వక్కలంక రామకృష్ణకు అందజేశారు. -
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
గూడు.. గోడు బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలతో కలెక్టరేట్కు వచ్చిన ఈమె పేరు గండిపాము మంగ. ఊరు నల్లజర్ల మండలం పోతవరం. ఆమెకు బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలతో కలిపి ఐదుగురు సంతానం. భర్త యేసు కూలి పనులు చేస్తూ బతుకుబండి లాగుతున్నాడు. అత్తమామలు ప్రహరీ కట్టి ఇల్లు ఇచ్చారు. ఆ ఇంటిని పడగొట్టి కొత్తగా ఇల్లు కట్టుకోవాలని మంగ అనుకుంది. అయితే పక్కనే ఉన్న తన బావ, ఆయన కుటుంబ సభ్యులు ఆ స్థలాన్ని ఆక్రమించునేందుకు తమపై దౌర్జన్యం చేస్తున్నారని కలెక్టర్ పి.ప్రశాంతి ఎదుట మంగ కన్నీటి పర్యంతమైంది. ఉన్న ఒక్క ఆధారం కోల్పోతే తాము ఎక్కడ నివసించాలని బోరున విలపించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై విచారణ జరపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పింఛను కోసం.. కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గుత్తుల వెంకటలక్ష్మి భర్త వెంకటరావు ఏడాదిన్నర క్రితం మృతి చెందారు. గత ప్రభుత్వ హయాంలో ఆయనకు వృద్ధాప్య పింఛను వచ్చేది. భర్త మరణాంతరం పింఛను ఆగిపోవడంతో వెంకటలక్ష్మికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. తనకు కనీసం వితంతు పింఛన్ అయినా వస్తే కుటుంబ పోషణకు చేదోడుగా ఉంటుందని భావించారు. దీని కోసం గ్రామ సచివాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కలెక్టరేట్లో అర్జీ ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి, అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కాలు లేకున్నా కనికరించరా..? కోరుకొండ మండలం గానుగూడెం గ్రామానికి చెందిన బీర రాఘవ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. షుగర్ వ్యాధి కారణంగా కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో 2024 మే నెలలో కాలు తొలగించారు. దీంతో వ్యవసాయ పనులు చేయాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం దివ్యాం పింఛన్ అయినా వస్తే బతుకుబండి లాగవచ్చని భావించారు. దీని కోసం వైకల్య ధ్రువీకరణ పత్రం సైతం పొందారు. పింఛను మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనికరించే నాథుడే లేడు. ఇప్పటికే రెండుసార్లు అర్జీ ఇచ్చినా పింఛను మంజూరు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇంకెన్ని రోజులు తిరగాలంటూ వాపోతున్నారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తుని: రేగుపాలెం–ఎలమంచిలి స్టేషన్ల మధ్య రైలు నుంచి జారిపడిన సంఘటనలో సుమారు 50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు తుని జీఆర్పీ ఇన్చార్జి ఎస్సై ఎన్.రవికుమార్ తెలిపారు. సోమవారం ఆయనకు అందిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు తెలుపు, నీలం, నలుపు గడుల పొట్టి చేతుల చొక్కా, నీలం రంగు ప్యాంటు ధరించి, మాసిన గెడ్డంతో ఉన్నాడు. మెడలో తాయెత్తులు ఉన్నాయి. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసిన వారు తుని జీఆర్పీ పోలీసులకు సమాచారం అందజేయాలని ఆయన కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నా హజారే దృష్టికి పర్యావరణ విధ్వంసం
తాళ్లరేవు: విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు జరుగుతున్న తీవ్ర పర్యావరణ విధ్వంసాన్ని పరిష్కరించడంలో మార్గదర్శకత్వాలు ఇవ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త అన్నా హజారేకు వైల్డ్కానోపి హేబిటాట్స్ ఓషన్స్ వలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు సంగాడి ధర్మారావు వినతిపత్రం అందజేశారు. పరిశ్రమలు, ముఖ్యంగా చమురు శుద్ధి, రసాయన కర్మాగారాలు చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు పేర్కొన్నారు. కాలుష్యం కారణంగా కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం, కోస్టల్ రెగ్యులేటరీ జోన్, ఎకో సెన్సిటివ్ జోన్లో మడ అడవులను క్రమపద్ధతిలో నాశనం చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో సంచరించే ఆలివ్ రిడ్లే తాబేళ్ల సామూహిక మరణాలు, వలస పక్షుల క్షీణత, అరుదైన వృక్ష, జంతుజాలాలు అంతరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. దీని పరిష్కారానికి కృషి చేయాలని కోరినట్టు ధర్మారావు తెలిపారు. -
ఎక్కడి గింజలు అక్కడే
దిగుబడి వచ్చినా కొనేవారు లేక కోకో గింజలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. కార్పొరేట్ సంస్థలు సిండికేట్గా ఏర్పడడంతో ఎప్పుడైనా వారికే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఎకరాకు 5 క్వింటాళ్లు రాగా, ఈ ఏడాది 3 క్వింటాళ్లు వస్తోంది. రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. గత ఏడాది మార్చి నెలలో కిలో ధర రూ.1,050 ఉండగా, ప్రస్తుతం రూ.550 ఉంది. ఈ ధర నిలబడుతుందనే నమ్మకం లేదు. ఎండల తీవ్రతతో దిగుబడి తగ్గింది. దీనివల్ల ఎకరాకు ప్రస్తుత ధర ప్రకారం రూ.1.2 లక్షల వరకూ ఆదాయం తగ్గుతుంది. – యలమాటి భాస్కరరావు, కోకో రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం -
ఉమ్మడి జిల్లాలో..
సచివాలయాలు 620వలంటీర్లు 12,272సచివాలయాలు 1,644వలంటీర్లు 30,887కపిలేశ్వరపురం: సంక్షేమం, అభివృద్ధి కూటమి అజెండా, ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రానికి పేరుతెస్తా, పాతిక కేజీల బియ్యం కావాలా? పాతికేళ్ల భవిష్యత్ కావాలా.. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాల భర్తీ.. ఏటా జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల.. వలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు.. ఇవీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి నేతలు చెప్పిన మాటలు. ఆయా లక్ష్యాలను అప్పటికే సాధించే క్రమంలో కొనసాగుతున్న వైఎస్సార్ సీపీ సంక్షేమ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కూటమి పన్నిన కుట్రలో భాగంగా వెదజల్లిన హామీలవి. కారణాలేవైనా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఉద్యోగాలు ఇవ్వడం సంగతి పక్కన పెట్టి అప్పటికే పేదలకు సేవలందిస్తున్న వలంటీర్లను విధుల నుంచి పక్కన పెట్టింది. రూ.10 వేల వేతనం మాట దేవుడెరుగు ఉన్న ఉపాధినే ఊడపెరికేశారు. వలంటీర్ల తొలగింపు కేవలం వారి కుటుంబాలకే కాదు యావత్ ఆంధ్ర ప్రజలకూ యాతనే. తెల్లవారుజామునే పింఛను అందజేత నుంచి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, దరఖాస్తు చేయించడం, మొత్తంగా లబ్ది వారి ఖాతాలకు జమ చేయించడమూ... ఇలాంటి సేవలన్నీ మూలన పడ్డాయి. దీంతో వలంటీర్లు సంఘం కట్టి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ పోరాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వలంటీర్లు విధులు నిర్వహించేవారు. సేవలు అమోఘం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 2,36,331 మంది, కాకినాడ జిల్లాలో 2,72,437, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,37,244 మంది కలిపి మొత్తం 7,46,012 మంది వివిధ రకాల సామాజిక పింఛన్లు అందుకుంటున్నారు. వీరంతా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పింఛను మంజూరైనవారే. వారందరికీ ప్రతి నెలా 1వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకే వలంటీర్లు పింఛన్లు అందజేసేవారు. దీంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కృషి చేశారు. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి ప్రభుత్వం అప్పగించిన సేవా కార్యక్రమాల్లో విధులు నిర్వహించారు. తుపాన్లు, వరదల సమయాల్లో కోనసీమ, తూర్పు గోదావరి నదీతీర లంక గ్రామాల్లోని బాధితులకు తాగునీరు, నిత్యావసర సరకులు, ఆహార పొట్లాలు పడవల్లో దరి చేర్చేవారు. వలంటీర్ల తొలగింపు ప్రభావమిలా... ‘ఉమ్మడి’ జిల్లాలోని 1,644 వార్డు, గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా వలంటీర్లుండేవారు. వారు లేకపోవడంతో 7,46,012 మందికి ఒకటో తేదీ తెల్లవారుజామునే పింఛను అందజేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలో వలంటీర్లు లేకుండానే పింఛన్లు పంచగలమన్నది ప్రకటనలకే పరిమితమైంది. అప్పుడు సైతం లబ్ధిదారులను పంచాయతీ కార్యాలయానికి లేదా కూడలికి రమ్మని సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేశారు. ఇక రెండో నెల నుంచి వలంటీర్ల మాదిరిగా పింఛను ఇచ్చిన తీరు కానరాలేదు. వలంటీర్లు లేక సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. చేస్తున్న సర్వేల్లో సేవల్లో నాణ్యత కొరవడుతోందన్న వాదన ఉంది. వలంటీర్లను విస్మరించిన కూటమి ప్రభుత్వం రూ.5 వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతామన్న కూటమి హామీకి అధికారంలోకి వచ్చాక తూట్లు పొడిచింది. నెలకు రూ.10వేలు సంగతి ఎలా ఉన్నా ఒక్క రూపాయి కూడా మేలు చేసింది లేదు. ఐదేళ్లూ సేవలందించిన తమను విస్మరించవద్దంటూ ప్రభుత్వాన్ని వలంటీర్లు వేడుకున్నారు. ప్రభుత్వం వినకపోవడంతో పోరాటబాట పట్టారు. కూటమి అధికారంలోకి వస్తే కేవలం పాతిక కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం కాదు పాతికేళ్ల భవిష్యత్ ఇస్తామన్న పవన్ కల్యాణ్ను ప్రశ్నిస్తున్నారు. పిఠాపురంలో ఈ నెల 14న నిర్వహించిన జనసేన 12వ ఆవిర్భావ సభలో తమకు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించకపోవడంపై వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకుంటే చట్టపరమైన సమస్యలొస్తాయని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చేటప్పుడు ఈ విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. 2025–26 వార్షిక బడ్జెట్లో వలంటీర్లకు సంబంధించి నిధులను కేటాయించకపోవడంపై సీఎం చంద్రబాబుపై మండిపడుతున్నారు. ‘ఉమ్మడి’ జిల్లా వలంటీర్ల ఉద్యమాలిలా..2024 నవంబర్ 9న రాష్ట్ర రాజధానిలో ‘వలంటీర్ల ఆవేదన సదస్సు’ను నిర్వహించారు. అదే ఏడాది నవంబర్ 3న అమలాపురంలో జిల్లా స్థాయి నిరసన సమావేశం నిర్వహించారు. 2024 డిసెంబర్ 10న కాకినాడ సూర్యకళా మందిరంలో వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో వలంటీర్ల ఆందోళనకు పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ ఏడాది జనవరి 17న విజయవాడలో నిర్వహించిన సచివాలయ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనకుండా వలంటీర్లను కూటమి ప్రభుత్వం నిర్భంధించింది. 2025 ఫిబ్రవరి 5న అమలాపురం కలెక్టరేట్ ఎదుట వలంటీర్లు ధర్నా చేశారు. ఈ నెల 12న వైఎస్సార్ సీపీ యువత పోరులో వలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద ఏపీ గ్రామ, వార్డు వలంటీర్స్ యూనియన్ ఆద్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ‘ఉమ్మడి’ జిల్లాలోని వలంటీర్లు సమాయత్తమయ్యారు. సచివాలయాలు 512వలంటీర్లు 9,034సచివాలయాలు 512వలంటీర్లు 9, 581వలంటీర్లు నష్టపోయారిలా..ఫ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్కో వలంటీర్కు ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేది. దీని ప్రకారం కాకినాడ జిల్లాలో 12,272 మంది వలంటీర్లు ప్రతి నెలా రూ.6,13,60,000, కోనసీమ జిల్లాలో 9,581 మంది వలంటీర్లు రూ.4,79,05,000, తూర్పుగోదావరి జిల్లాలో 9,034 మంది వలంటీర్లు రూ.4,51,70,000 చొప్పున అందుకునేవారు. మూడు జిల్లాలు కలిపి రూ.15,44,35,000 మేర వలంటీర్లకు వేతనం అందేది. దీని ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడచిన 9 నెలల్లో వారు రూ.138,99,15,000 మేర నష్టపోయారు. ఫ అదే చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా రూ.10 వేల వేతనం లెక్కేసుకుంటే 9 నెలల్లో కాకినాడ జిల్లా వలంటీర్లు రూ.110,44,80,000, కోనసీమ జిల్లా వలంటీర్లు రూ.86,22,90,000, తూర్పు గోదావరి జిల్లా వలంటీర్లు రూ.81,30,60,000 కలిపి మొత్తం రూ.277,98,30,000 మేర వేతనాలు కోల్పోయారు. వలంటీర్లకు కూటమి వంచన రూ.10 వేల గౌరవ వేతనమంటూ హామీ అధికారంలోకి వచ్చాక అమలు దాటవేత ఆవిర్భావ సభలో ప్రస్తావించని పవన్ పాతికేళ్ల భవిష్యత్ అంటే ఇదేనా అంటున్న వలంటీర్లు చట్టపరమైన సమస్యలొస్తాయంటున్న మంత్రి లోకేశ్ ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వలంటీర్ల ఉద్యమాలు నేడు ‘చలో విజయవాడ’ హామీని విస్మరించడం వలంటీర్లను వంచించడమే.. ఎన్నికల సమయంలో వలంటీర్లను కొనసాగిస్తామని, రూ.10వేలకు గౌరవ వేతనం పెంచుతామంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం వలంటీర్లను వంచించడమే అవుతుంది. ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రకృతి విపత్తుల సమయాల్లో వలంటీర్లు విశేష సేవలందించారు. వారి సేవలను గుర్తించైనా విధుల్లోకి తీసుకోవాలి. – నూకల బలరాం, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, కోనసీమ జిల్లా -
22 నుంచి నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు
దేవరపల్లి: మండలంలోని గౌరీపట్నం వద్ద ఉన్న నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. దీనికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఏలూరు పీఠాధిపతి, విశాఖ అగ్రపీఠం అపోస్తోలిక పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర చెప్పారు. పుణ్యక్షేత్రంలోని కొండపై ఉన్న క్రీస్తు దేవాలయం వద్ద మేరీ మాత పతాకాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించి, అఖండ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేసి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, గౌరీపట్నంలోని మేరీ మాత పుణ్యక్షేత్రానికి నాలుగు జిల్లాల నుంచి ఏడాది పొడవునా అశేషంగా భక్తజనం వస్తున్నారని, కుల మత వర్గ భావాలకు అతీతంగా ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు. ఈ పుణ్యక్షేత్రం వెలసి 40 సంవత్సరాలు కావస్తోందన్నారు. ఇక్కడ అఖండ దేవాలయం ప్రారంభించి 25 ఏళ్లు అయినందున ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకలకు మద్రాసు అగ్రపీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ ఆంథోనీ స్వామి, వివిధ జిల్లాల నుంచి పీఠాధిపతులు హాజరు కానున్నారని తెలిపారు. భక్తులకు మజ్జిగ, నిత్యాన్నదానం, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ఈ ఏడాది మహోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించిందన్నారు. పుణ్యక్షేత్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని జయరావు తెలిపారు. ఉత్సవాలకు పోలీసు సిబ్బందితో పాటు సుమారు 250 మంది వలంటీర్లను ఏర్పాటు చేశామన్నారు. పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ మాట్లాడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలూ, కల్పిస్తున్నామని, సేద తీరడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ పి.బాల కూడా మాట్లాడారు. కార్యక్రమంలో జయరావు పొలిమెరను రెవరెండ్ ఫాదర్ జాన్పీటర్, ఫాదర్లు సన్మానించారు. రెవరెండ్ ఫాదర్ మోజెష్, నిత్యాన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు కళ్లే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫ 25 వరకూ నిర్వహణ ఫ ఏలూరు పీఠాధిపతి జయరావు -
అమరజీవికి ఘన నివాళి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆంధ్ర రాష్ట్ర అవతరణకు జీవితాన్ని అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకుందామని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) సీతారామ్మూర్తి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లక్ష్య సాధనకు శ్రీరాములు వంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి.శశాంక, కలెక్టరేట్, ఇతర కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
గోపాలపురం మండలంలో డయేరియా
గోపాలపురం: మండలంలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా డయేరియా ప్రబలుతోంది. శని, ఆదివారాల్లో సుమారు 25 మంది వాంతులు, విరేచనాలతో గోపాలపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో చేరారు. వీరిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) కె.వెంకటేశ్వరరావు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మండలంలోని వివిధ గ్రామా ల్లో పొగాకు పనులకు వలస వచ్చిన కూలీలు డయేరియా బారిన పడినట్లు గుర్తించామన్నారు. వీరిలో 19 మందికి ప్రథమ చికిత్స చేశామని, మిగిలిన ఆరుగురికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందన్నారు. డయేరియాకు గురైన గ్రామాల్లో 10 వైద్య శిబిరాలు, 20 మొబైల్ క్యాంపులు ఏర్పా టు చేశామని వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో కొవ్వూరు డిప్యూటీ డీఎంహెచ్ఓ జె.సంధ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సహకార శాఖలో నెలాఖరుకు కంప్యూటరీకరణ పూర్తి కొవ్వూరు: జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నట్లు జిల్లా సహకార అధికారి ఎం.జగన్నాథరెడ్డి తెలిపారు. కొవ్వూరులోని శ్రీరామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, కాపవరం పీఏసీఎస్లను ఆదివారం ఆయన సందర్శించి, కంప్యూటీకరణ పురోగతి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, డివిజన్లోని 58 సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 107 సంఘాల్లో డీసీటీ సైన్ ఆఫ్, ఫ్రీ మైగ్రేషన్ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం మూడో దశలో ఆన్లైన్ ఓచర్ల నమోదు ప్రక్రియ చురుకుగా కొనసాగుతోందని చెప్పారు. రత్నగిరికి భక్తుల వెల్లువ అన్నవరం: రత్నగిరికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు కావడంతో ఉదయం నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించగా, వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్నప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ టేకు రథంపై ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు (ముత్తంగిసేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారు?
● ఇసుక విక్రయాలపై ప్రత్యేకాధికారి ప్రశ్న ● అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ‘గతంలో టన్ను ఇసుక ధర రూ.475 ఉంది. ఏజెన్సీలు రూ.229కి కోట్ చేశాయి. కానీ, ఇప్పటికీ రూ.400కు పైగా అమ్ముతున్నారు. దీనికి కారణమేమిటి?’ అని మైన్స్ కమిషనర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇసుక సరఫరా ఏజెన్సీలు సాధ్యం కాని ధర ప్రతిపాదించి, ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నాయని నిలదీశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన డీఎల్ఎస్ఏ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇదే తీరు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై నిర్వహించే సమావేశానికి ఓపెన్, డీసిల్టేషన్ ఏజెన్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. జరిగిన తప్పులు సరిచేసుకోవాలని, ఇకపై రీచ్లలో ప్రభుత్వ సిబ్బందిని కూడా నియమిస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. వినియోగదారులతో నేరుగా సంభాషిస్తామన్నారు. మొదట వచ్చిన వారికి మొదట ఇసుక అందించేలా రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. ఇసుక తవ్వకాల సందర్భంగా పర్యావరణ అనుమతుల విషయంలో ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కచ్చితమైన మార్గదర్శకాలు పాటించాలని అన్నారు. రవాణా వ్యవస్థపై పర్యవేక్షణ తప్పనిసరని స్పష్టం చేశారు. పనితీరు సరిగ్గా లేని కొన్ని ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ డి.నరసింహ కిషోర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, మైన్స్ ఈడీ డి.ఫణిభూషణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ రహిత సమాజం అవశ్యం
రాజమహేంద్రవరం సిటీ: ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యాన స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ ర్యాలీ, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై ప్రచార కార్యక్రమాలు, ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధులు మాటలకు పరిమితం కాకుండా ప్రత్యక్షంగా ఇందులో భాగస్వాములు కావాలని అన్నారు. జిల్లా ప్రత్యేకాధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. దీనికోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్ ప్రశాంతి -
ఇన్చార్జి డీఎస్ఓగా భాస్కరరెడ్డి
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా పౌర సరఫరాల అధికారి(ఎఫ్ఏసీ)గా కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.భాస్కరరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఆయన ఇన్చార్జి డీఎస్ఓగా బాధ్యతలు చేపట్టారు. భాస్కరరెడ్డి జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఎస్ఓగా ఉన్న ఏఎస్ఓ ఎం.నాగాంజనేయులు స్థానంలో భాస్కరరెడ్డిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేశారు. ముగిసిన ఇంటర్ పరీక్షలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో ఈ నెల 1న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు ద్వితీయ సంవత్సరం రసాయన, వాణిజ్య శాస్త్రాలతో పాటు ఒకేషనల్ విభాగంలో గ్రూపు సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. జనరల్ విభాగంలో 17,894 మందికి గాను 17,651 మంది పరీక్షలు రాశారు. 243 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 991 మందికి గాను 874 మంది పరీక్షలు రాశారు. 117 మంది పరీక్షలు రాయలేదు. మొత్తం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోలేదని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ అధికారి ఎన్ఎస్ఎల్వీ నరసింహం తెలిపారు. నేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల స్క్రీనింగ్ టెస్ట్ రాజమహేంద్రవరం రూరల్: ఏపీపీఎస్సీ ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల స్క్రీనింగ్ పరీక్షలు ఆదివారం నిర్వహిస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు ఈ విషయం తెలిపారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో తన చాంబర్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక రాజీవ్గాంధీ విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు 696 మంది హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్టుతో పాటు, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకుని రావాలని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందే కేంద్రంలోకి చేరుకోవాలన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్ష జరుగుతుందన్నారు. పురుషోత్తపట్నం, సీతానగరం గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు పరీక్ష కేంద్రం మార్గంలో వెళ్తాయని, అభ్యర్థులు ఈ విషయం గమనించాలని సూచించారు. పరీక్ష కేంద్రం లోపలకు బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే అనుమతిస్తారన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర పేపర్లు అనుమతించరని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారన్నారు. అవసరమైతే వైద్య సహాయం అందించడానికి మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా, అలాగే, కళాశాలలో అవసరమైన ఏర్పాట్లపై యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని జేసీ చిన్నరాముడు అన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అధికారులు జె.చంద్రరావు, జె.జనార్దన్, సమన్వయ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. రేపటి నుంచి టెన్త్ పరీక్షలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 143 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. బాలురు 12,791, బాలికలు 11,972 కలిపి మొత్తం 24,763 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. అలాగే, ప్రైవేటుగా 960 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు 1,100 మంది ఇన్విజిలేటర్లను, 10 ప్రత్యేక బృందాలను నియమించారు. ఇప్పటికే సెట్–1, సెట్–2 ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలు జిల్లాకు చేరాయి. వీటిని జిల్లావ్యాప్తంగా 22 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. కడియపులంక, పోతవరం, రాజుపాలెం జెడ్పీ హైస్కూళ్లు, ధవళేశ్వరం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, భూపతిపాలెం ఏపీ రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాలలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వీటి వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ‘వాహనాల ఫిట్నెస్కు అక్కడ సంప్రదించండి’ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో వాహనాల ఫిట్నెస్కు ఇకపై రాజానగరంలోని కంట్రోల్ అల్ట్ ఫిక్స్ సొల్యూషన్స్ ప్రైవేటు సంస్థను సంప్రదించాలని జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ శనివారం తెలిపారు. అన్ని రకాల మోటారు వాహనాల ఫిట్నెస్ నిర్వహణను ఈ ఏజెన్సీ నిర్వహిస్తుందన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు వాహనాల తనిఖీలు నిర్వహించి, ధ్రువపత్రాలు జారీ చేస్తారని పేర్కొన్నారు. -
కలెక్టర్లు హాజరు కాకుంటే ఎలా?
కాకినాడ సిటీ: జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అజెండాలోని అంశాలపై జరిగే చర్చలకు తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీన జిల్లాల కలెక్టర్లు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావులతో పాటు ఆయా జిల్లాల జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పనుల ద్వారా సమకూరిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులను, గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ల తీర్మానాలతో ప్రమేయం లేకుండా కలెక్టర్లు తమ ప్రాధాన్యం ప్రకారం కేటాయించడంపై సభ్యులు అభ్యంతరం తెలుపుతూ, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని చైర్మన్ వేణుగోపాలరావును కోరారు. మూడు జిల్లాలోని గోదావరి కాలువ చివరి ఆయకట్టు భూముల్లోని పంటలు సాగునీరు అందక ఎండిపోతున్న పరిస్థితిపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వంతుల వారీ విధానం, డ్రైన్ల నుంచి లిఫ్టింగ్ ద్వారా పంటలను కాపాడాలని కోరారు. కాలువల ఎగువ ప్రాంతాల్లోని రైతులకు సక్రమంగా నీటిని వదులుతున్నప్పటికీ అదనపు నీటిని అక్రమంగా తోడుతుండడం వల్ల శివారు భూములకు నీరు అందడం లేదని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ యానాం–ద్రాక్షారామ ప్రధాన రహదారిలో ఆరేళ్లుగా వంతెన శిథిల స్థితికి చేరడం వల్ల కాలువకు తూరలు వేసి పైన సీసీ రోడ్డు వేశారని, ఫలితంగా నీరు సక్రమంగా పారకపోవడం, ఆ రహదారిలో రాకపోకలు సాగిస్తున్న సుమారు 40 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇంజరం వద్ద పూర్తి స్థాయిలో వంతెన నిర్మించి రైతులను ఆదుకోవాలని, ప్రజల రాకపోకలలో ఇబ్బందులు తొలగించాలని కలెక్టర్ కోరారు. దీనిపై కలెక్టర్ షణ్మోహన్ స్పందించి ఈ విషయం పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పౌరసరఫరాల ద్వారా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు పంపిణీ చేస్తున్న నాసిరకమైన కొత్త బియ్యం వండినప్పుడు ముద్దవుతోందని, పిల్లలు తినడానికి ఇష్టపడడం లేదని కొందరు సభ్యులు ప్రస్తావించారు. మండలాల్లో నిర్వహించిన పనులకు చెల్లింపులు జాప్యం లేకుండా జరపాలని కోరారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా నిర్వహించాలని, ఆరోగ్యంపై వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన జనరిక్ మందుల షాపులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు కోరారు. కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలని, ఉద్యోగులకు జీపీఎఫ్ స్లిప్పులు జారీ చేయాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు. గిరిజన ప్రాంత ప్రజల సమస్యలపై చర్చ, పరిష్కారానికి ఐటీడీఏ సర్వ సభ్య సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్తో పాటు, ఏఎస్ఆర్ జిల్లా పరిధి జెడ్పీటీసీ సభ్యులు కోరారు. దీనిపై ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం స్పందిస్తూ ఏప్రిల్ చివరి లేదా మే తొలివారంలో తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అలాగే గిరిజన ప్రాంత సమస్యలపై సభ్యులు ప్రస్తావించిన అంశాలకు ఆయన వివరణలు ఇచ్చి సమస్యలన్నింటినీ సత్వరం పరిష్కరిస్తామన్నారు. తమ జిల్లాలకు సంబంధించి సభ్యులు లేవనెత్తిన అంశాలపై చర్యలు చేపడతామని తూర్పుగోదావరి జిల్లా జేసీ చినరాముడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఆర్వో రాజకుమారి సభ్యులకు వివరించారు. సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సభ్యులు, అధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన ప్రజాసమస్యలపై సత్వరం సమగ్ర పరిష్కారాలు అందించాలని నాలుగు జిల్లాల అధికారులను చైర్మన్ వేణుగోపాలరావు కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈవో రామ్గోపాల్, ఏవో ఎం.బుజ్జిబాబు, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. రూ.70 లక్షల మిగులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.70 లక్షల మిగులుతో రూ.1,014 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది. ఉమ్మడి జెడ్పీ బడ్జెట్ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్ చినరాముడు, రంపచోడవరం జేసీ కట్టా సింహాచలం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఆర్ఓ బీఎల్ఎస్ రాజకుమారి పాల్గొన్నారు. సమావేశాన్ని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ప్రారంభించగా తొలుత దివంగతులైన కాట్రేనికోన ఎంపీపీ పాలెపు లక్ష్మి మృతికి సంతాపం ప్రకటిస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశంలో 2024–25 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ను, 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన అంచనా బడ్జెట్ ముసాయిదాను జెడ్పీ పరిపాలనాధికారి సభ్యులకు వివరించారు. అనంతరం బడ్జెట్లో పొందుపరిచిన ప్రతిపాదనలపై సమవేశం చర్చించి 2024–25 సంవత్సరానికి సవరించిన ఆదాయం రూ. 846.60 కోట్లు, సవరించిన వ్యయం రూ. 845.95 కోట్లతో రూ.65 లక్షలు మిగులుతో సవరించిన బడ్జెట్ను ఆమోదించారు. అదే విధంగా రానున్న 2025–26 ఆర్థిక సంవత్సరానికి అన్ని పద్దులు కలిపి మొత్తం ఆదాయం అంచనా రూ.1013.80 కోట్లు కాగా, అన్ని పద్దుల కింద అంచనా వ్యయం రూ. 1013.10 కోట్లతో, రూ.70 లక్షలు మిగులు బడ్జెట్ను సమావేశం ఆమోదించింది. ఆదాయంలో జెడ్పీ సాధారణ నిధులు రూ. 28 కోట్లు, ప్రభుత్వం నుంచి కేటాయించిన శాలరీ గ్రాంటులు రూ.10.48 కోట్లు, నిర్థిష్ట ప్రయోజన గ్రాంటు రూ.46.09 కోట్లు, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా, ఇతర శాఖల ద్వారా వచ్చే గ్రాంటు రూ. 922.39 కోట్లుగా ఉన్నాయి. జెడ్పీ సాధారణ నిధుల నుంచి షెడ్యూల్ కులాల సంక్షేమానికి 15 శాతం కేటాయింపు రూ. 2.97 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి 6 శాతం కేటాయింపు రూ.1.19 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 15 శాతం కేటాయింపు, రూ.2.97 కోట్లు, అభివృద్ధి పనులకు 23 శాతంగా రూ.4.55 కోట్లు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పశుసంవర్థక, సాంఘిక సంక్షేమం తదితర సెక్టార్లకు 10 శాతంగా రూ. 2.97 కోట్లు కేటాయింపులను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షిస్తూ, ఆదాయ వనరులను మరింత పెంచాలని సభ్యులు కోరారు. రూ.1014 కోట్లతో బడ్జెట్కు ఆమోదం తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా అధికారులపై సభ్యుల ధ్వజం పలు అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చ -
సేంద్రియ సాగు.. భళా
● 44 వేల ఎకరాలు.. 37 వేల మంది రైతులు ● వరి, ఉద్యాన, కూరగాయ పంటల సాగు ● భూసారానికి మేలు ● నిండుగా దిగుబడులు.. దండిగా లాభాలుపెరవలి: జిల్లాలోని రైతులు సేంద్రియ వ్యవసాయంతో మంచి లాభాలు పండించుకుంటున్నారు. ఇప్పటి వరకూ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ చేస్తున్న సాగుతో భూమి చౌడుబారుతున్నాయి. పైగా రసాయనిక ఎరువులతో పండించిన ఆహార ధాన్యాలు తినడం ఆరోగ్యానికి చేటు తెస్తుందనే అవగాహన చాలా మందిలో పెరుగుతోంది. ఫలితంగా ఈ విధానంలో పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి పలు దేశాలు విముఖత చూపుతున్నాయి. పైగా పెట్టుబడి ఎక్కువ.. రాబడి తక్కువ అన్నట్లుగా ఈ విధానం ఉండటంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సేంద్రియ సాగు విధానాలపై సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తూండటంతో రైతులు కూడా చైతన్యవంతమవుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వస్తూండటం.. పైగా ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకంపై ప్రజల్లో స్పృహ పెరగడంతో జిల్లాలోని పలువురు రైతులు ప్రకృతి సాగుపై మొగ్గు చూపుతున్నారు. ఎక్కడెక్కడంటే.. గతంలో చాలా తక్కువ మంది మాత్రమే సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించగా.. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 37 వేల మంది రైతులు ఏకంగా 44,357 ఎకరాల్లో ఈ విధానంలో పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, చాగల్లు, కొవ్వూరు, నల్లజర్ల, తాళ్లపూడి, కడియం తదితర మండలాల్లో అధిక సంఖ్యలో రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. వరి, వాణిజ్య పంటలైన బొప్పాయి, అరటి, జామతో పాటు వంగ, బెండ, దొండ, చిక్కుడు, పొట్ల, బీర, ఆనప, కాకర వంటి కూరగాయలను సైతం సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. వరి అయితే ఎకరానికి 40 నుంచి 50 బస్తాల వరకూ దిగుబడులు సాధించి, దండిగా లాభాలు ఆర్జిస్తున్నారు. పెరవలి మండలం అన్నవరప్పాడు, మల్లేశ్వరం, ఖండవల్లి, ముక్కామల, తీపర్రు, కాపవరం, అజ్జరం, కాకరపర్రు, వెంకట్రాయపురం, నల్లాకులవారిపాలెం గ్రామాల్లో సుమారు 2,500 ఎకరాల్లో సేంద్రియ సాగు జరుగుతోంది. ఇదీ మేలు రసాయనిక ఎరువులు అధికంగా వినియోగించడంతో వలన భూములు చౌడుబారి, సారం కోల్పోతున్నాయి. పచ్చిరొట్ట పైర్ల సాగుపై నిర్లక్ష్యం వహించడం వలన కూడా ఈ పరిస్థితి ఏర్పడింది. సేంద్రియ సాగులో పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్ల సాగు వంటివి ప్రధాన భూమిక పోషిస్తాయి. జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి పంటలు వేస్తే భూమికి ఎకరానికి రెండు టన్నుల ఎరువు అందుతుందని అధికారులు చెబుతున్నారు. కేవలం కషాయాలతో, పశువుల ఎరువుతో చేపట్టే ఈ సాగు వలన భూసారం పెరిగి, తెగుళ్ల వ్యాప్తి కూడా తగ్గుతోంది. ముఖ్యంగా బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, నీమాస్త్రం, బీజామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, పంచగవ్య వంటివి సొంతంగా తయారు చేసి పంటలపై పిచికారీ చేస్తూండటంతో తెగుళ్ల నివారణ సులువవుతోంది. మూడేళ్లుగా ప్రకృతి సాగు విధానాలు అవలంబించడంతో పంట భూములు ఎంతో సారవంతంగా మారాయని రైతులు అంటున్నారు. పైగా సేంద్రియ విధానంలో పండించిన పంట దిగుబడులకు మార్కెట్లో మంచి ధర లభిస్తోందని చెబుతున్నారు. డ్రోన్లతో పిచికారీ సేంద్రియ వ్యవసాయంలో జిల్లా అధికారులు ఓ అడుగు ముందుకు వేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయంలో పురుగు మందుల పిచికారీకి డ్రోన్లు వినియోగాన్ని ప్రారంభించారు. జిల్లా అధికారులు దీనిని అందిపుచ్చుకుని కషాయాల పిచికారీకి కూడా డ్రోన్లు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని ప్రతి మండలంలో 250 ఎకరాల్లో డ్రోన్ల ద్వారా కషాయాలు పిచికారీ చేయాలని నిర్ణయించారు. డ్రోన్తో పిచికారీకి ఎకరానికి రూ.350 నుంచి రూ.400 వసూలు చేస్తున్నారు. మామూలుగా మనుషులతో ఎకరం విస్తీర్ణంలో పిచికారీ చేయాలంటే ఒక రోజు పడుతుంది. అదే డ్రోన్తో కేవలం 10 నిమిషాల్లో పూర్తవుతోంది. ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతూండటంతో రైతులు డ్రోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రూ.50 వేల లాభం సేంద్రియ విధానంలో రెండేళ్ల కిందట అరటి సాగు చేపట్టాను. గత ఏడాది ఎకరానికి రూ.50 వేల లాభం వచ్చింది. పెట్టుబడి తక్కువ.. నాణ్యమైన దిగుబడులు రావడంతో మార్కెట్టులో మంచి ధర లభించింది. ప్రస్తుతం అరటితో పాటు వరి కూడా ఇదే పద్ధతిలో సాగు చేస్తున్నాను. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం మాని, తెగుళ్ల నివారణకు కేవలం కషాయాలే వినియోగిస్తున్నాను. – ఇ.కన్నయ్య, రైతు, ఖండవల్లి, పెరవలి మండలం పెట్టుబడి తక్కువ సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేశాను. గత ఏడాది అరెకరంలో సాగు చేస్తే మంచి ఆదాయం వచ్చింది. ఇప్పుడు మూడెకరాల్లో అన్ని రకాల కూరగాయలూ పండిస్తున్నాను. ఈ విధానంలో పెట్టుబడి తక్కువ. అంతే కాకుండా భూసారం పెరిగి, మంచి దిగుబడులు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయమే మేలు. – కె.శ్రీరామమూర్తి, రైతు, ఖండవల్లి రైతులను ప్రోత్సహించాం సేంద్రియ సాగు విస్తీర్ణం పెంచాల నే ఉద్దేశంతో రైతులతో ముఖాము ఖి చర్చలు జరిపి, పోత్సహించాం. వారిని ఒప్పించడానికి మొదట చా లా ఇబ్బందులు పడ్డాం. మూడేళ్ల పాటు శ్రమ పడ్డాం. ఆ ఫలితం ఇప్పుడు వస్తోంది. పెరవలి మండలంలోని రైతులు 2,500 ఎకరాల్లో వివిధ పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్ని రకాల పంటలూ పండిస్తూండటంతో గతంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సైతం ఇక్కడకు వచ్చి స్వయంగా పరిశీలించారు. – తాతారావు, సేంద్రియ సాగు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ -
సానుకూల దృక్పథం అవసరం
ఎటువంటి ప్రశ్నలకై నా సమాధానాలు రాయగలననే సానుకూల దృక్పథాన్ని విద్యార్థులు కలిగి ఉండాలి. పరీక్ష ముగిసిన తర్వాత సమాధానాలు సరిపోల్చుకోకూడదు. అలా చేస్తే తరువాతి పరీక్షకు సరిగ్గా సన్నద్ధం కాలేరు. పరీక్షకు వెళ్లే ముందు వజ్రాసనం వేసుకుని ధ్యానం చేసుకుంటే ఎటువంటి ఒత్తిడినైనా అధిగమించవచ్చు. పరీక్షలకు ముందు అలసట, నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. కనీసం ఆరు గంటల నిద్ర అవసరం. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. రివిజన్కు అధిక ప్రాధాన్యతనివ్వాలి. – డాక్టర్ సౌమ్య పసుపులేటి, సైకియాట్రిస్ట్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం ● -
పదిలో పట్టు.. భవితకు మెట్టు
రాయవరం: విద్యార్థి ప్రగతికి పదో తరగతి తొలి మెట్టు. పరీక్షలు అనగానే సహజంగానే విద్యార్థులు భయం, ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ భయాన్ని వీడి పరీక్షలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటే వారి భవిష్యత్ బంగారమవుతుంది. ఆత్మవిశ్వాసం..ఏకాగ్రత..మంచి ఆహారం..కొద్ది సేపు ధ్యానం అవసరం. సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. టెన్షన్ వద్దు పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థులు టెన్షన్ వదిలి అటెన్షన్గా ఉండాలి. ప్రిపరేషన్ ఎంత అవసరమో దానిని పేపర్పై పెట్టగలగడమూ అంతే అవసరం. దానికి తోడు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనసు, శరీరమూ కూడా ప్రశాంతంగా ఉంటాయి. అలాగే పరీక్షలు రాసేముందు పునశ్చరణ ఉండాలే తప్ప కొత్త పాఠ్యాంశం జోలికి వెళ్లకూడదు. ప్రజెంటేషన్ చాలా ముఖ్యం పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు పాజిటివ్ థింకింగ్, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రివ్యూ, ప్రజంటేషన్ అలవర్చుకోవాలి. వీటితో పాటు పరీక్ష ముందు రోజు తగినంత నిద్ర పోవాలి. నిద్ర మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. నేను బాగానే రాయగలను అనే పాజిటివ్ థింకింగ్తో పరీక్షా కేంద్రానికి వెళ్లాలి. ముందుగా బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాసి, తరువాత కష్టంగా అనిపించిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. రేపటి పరీక్షను చక్కగా రాస్తున్నట్లుగా ముందుగానే మనసును సిద్ధం చేయాలి. కొత్త వాతావరణంలో పరీక్షలు రాస్తున్నామనే భయం వద్దు. జవాబు పత్రంలో కొట్టివేతలు, దిద్దుబాట్లు లేకుండా, చక్కటి దస్తూరీతో సమాధానాలు రాస్తే మంచిది. తల్లితండ్రుల పాత్ర కీలకం పరీక్షల సమయంలో మంచి ర్యాంకు, ఎక్కువ మార్కు లు తెచ్చుకోవాలనే ఒత్తిడిని పిల్లలపై రుద్దకూడదు. ఇతరులతో పోల్చడం, గతంలో మార్కులు తక్కువ వచ్చిన అంశాలతో వారిని తక్కువ చేయకూడదు. ఇవి పాటిస్తే మంచిది జవాబు పత్రంలో ఒక్కో పేజీపై 16 నుంచి 18 లైన్లకు మించకుండా సమాధానాలు రాయాలి. ముఖ్యమైన అంశాల కింద అండర్లైన్ చేయాలి. గణితంలో అంకెలు స్పష్టంగా వేసుకోవాలి. తెలుగులో అక్షరాలు స్పష్టంగా కనబడేటట్లుగా రాయాలి. నీలం లేదా నలుపు రంగు సిరా ఉన్న పెన్నులు లేదా బాల్పెన్నులు మాత్రమే వాడాలి. ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలి ఆహార నియమాలతో మానసిక ప్రశాంతత తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం విద్యార్థులూ.. విజయానికి సూత్రాలివిగో.. -
ఉత్సాహంగా పవర్ లిఫ్టింగ్ పోటీలు
పి.గన్నవరం: పోతవరం గ్రామంలోని ఎస్ఎస్ ఫిట్నెస్ జోన్ ఆవరణలో శనివారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ చాంపియన్, బెంచ్ ప్రెస్ 2025 పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఎస్ఎస్ ఫిట్జోన్ అధినేత, కార్యక్రమ నిర్వాహకుడు కత్తుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం ద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుందన్నారు. పవర్ లిఫ్టింగ్, బ్రెంజి ప్రెస్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఎస్ఎస్ ఫిట్నెస్ జోన్, కోనసీమ పవర్ లిప్టింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 150 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. 10 కేటగిరీల్లో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు, పతకాలు, షీల్టులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుమల కృష్ణపద్మరాజు, కార్యదర్శి ఒంటెద్దు వెంకన్నాయుడు, ఈవెంట మేనేజర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ ఫిట్నెస్ అధినేత కత్తుల శ్రీనివాస్, దవులూరి వెంకట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాజమండ్రిలో సీన్ తీస్తే సూపర్ హిట్టే
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): తను హీరోగా నటించిన రాబిన్ హుడ్ చిత్రం అందరికీ నచ్చుతుందని హీరో నితిన్ అన్నారు. గతంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తను నటించిన భీష్మ మంచి విజయం సాధించిందని, ఆ సినిమాలో ఒక సన్నివేశం రాజమండ్రిలో చిత్రీకరించామని అది హిట్టని అన్నారు. ఆ సెంటిమెంటుతో రాబిన్ హుడ్ సినిమాలో ఒక సీన్ ఇక్కడ చిత్రీకరించామని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 28 న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చిన చిత్ర బృందం శనివారం మధ్యాహ్నం మంజీరా హోటల్లో మీడియాతో మాట్లాడింది. నితిన్ మాట్లాడుతూ దర్శకుడు వెంకీ తొలి చిత్రం చలో నుంచి తనకు పరిచయం ఉందని తర్వాత తమ కాంబినేషన్లో వచ్చిన భీష్మ చిత్రం విజయం సాధించిందన్నారు. దర్శకుడు వెంకీ మాట్లాడుతూ ఇప్పటికే రాబిన్ హుడ్ టీజర్, సాంగ్స్కు మంచి స్పందన వస్తోందని సినిమా కూడా హిట్టవుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. శ్రీలీల ఈ చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు వెంకీ తెలిపారు. శ్రీలీల మాట్లాడుతూ తనకు రాజమండ్రి కొత్తకాదని తమ గ్రాండ్ ఫాదర్ ధవళేశ్వరంలో ఉండేవారని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్రను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారని, పిల్లలతో కలిసి చూడాలని కోరారు. -
వాడవాడలూ వాడపల్లివైపే..
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రానికి అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, భారీ క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించే భక్తులతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో సుప్రభాత సేవతో సేవలు ప్రారంభించగా భక్తులు స్వామివారిని దర్శించి అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలర్లు ఏర్పాటు చేశారు. శనివారం స్వామివారికి వివిధ రూపాల్లో రూ. 42,59,486 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రించి, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి బస్సు సర్వీసులను నడిపింది. -
దైవ కార్యానికి బయలుదేరి.. తిరిగిరాని లోకాలకు
● కంచకచర్ల వద్ద రోడ్డు ప్రమాదం ● ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు ● ఒకే కుటుంబంలో ముగ్గురి దుర్మరణం ● మృతులు మండపేట వాసులుతాడేపల్లిగూడెం రూరల్: దైవకార్యంలో పాల్గొనా లన్న సంకల్పంతో కుటుంబ సమేతంగా పొరుగు రాష్ట్రం నుంచి కారులో బయలుదేరారు. అయితే.. లారీ రూపంలో మృత్యువు వారిని మార్గం మధ్యలోనే కబళించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, వారి ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీకి చెందిన హెచ్ఆర్ ఉద్యోగి భోగిళ్ల వెంకట సత్య సురేన్(37), తన భార్య నవ్య(35), కుమార్తె వాసుకి కృష్ణ(5), బంధువు కారులో కోనసీమ జిల్లా మండపేటలో జరగనున్న ఓ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి బయలుదేరారు. శుక్రవారం మధ్యాహ్నం 12.45 ప్రాంతంలో తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై సత్యసురేన్ డ్రైవ్ చేస్తున్న కారు హైవే మెయింటెనెన్స్ పనులు చేస్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో సత్య సురేన్, అతని భార్య నవ్య అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె వాసుకి కృష్ణ, బంధువు శ్రీరమ్యను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వాసుకి కృష్ణ మృతి చెందగా, శ్రీరమ్యను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఏఎస్సై పీవీకే దుర్గారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించి, రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషాద ఛాయలు మండపేట: కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మండపేటకు చెందిన భార్యాభర్తలు, ఐదేళ్ల చిన్నారి మృతి చెందడంతో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్ నుంచి మండపేటకు వస్తూ వీరు ఈ దుర్ఘటనలో మరణించారు. సత్యసురేన్ తండ్రి భోగిళ్ల పాపారావు స్థానిక రావుపేటలో నివసిస్తున్నా రు. ఆయన బీమా కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, సత్య సురేన్ చిన్నవాడు. ఈ ఘటనలో పాపారావు చెల్లెలు కుమార్తె ఉప్పులూరి శ్రీరమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. యూఎస్లో ఉంటున్న ఈమె ఇటీవల గృహ ప్రవేశ శుభకార్యానికి హైదరాబాద్ వచ్చారు. ఆమె తండ్రి పాలచర్ల బాబ్జి మండపేటలో ఉంటున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురిని మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
దగా చేసిన కూటమి సర్కార్
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు ● నల్లజర్లలో కార్యకర్తల సమావేశం నల్లజర్ల: అధికారంలోకి రాకముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, అమలు చేయలేని హామీలిచ్చి, గద్దెనెక్కాక వాటిని అమలు చేయకుండా కూటమి సర్కార్ ప్రజల్ని దగా చేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. నల్లజర్లలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం అధ్యక్షతన శుక్రవారం రాత్రి జరిగిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమాన్ని అందించామన్నారు. వైఎస్సార్ సీపీ వారికి ఏ పథకాలూ ఇవ్వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి ఇదేమన్నా బాబుగారి సొమ్మా అని ప్రశ్నించారు. పక్షపాతం, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడిలా మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మమేనా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ‘నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగాలు లేవు. మహిళలకు ఉచిత బస్సు లేదు. 50 ఏళ్లకే బీసీలందరికి పింఛన్ లేదు. తల్లికి వందనం లేదు. వృద్ధులు, వితంతువుల పింఛన్లలో కోత. దీనిపై ప్రతిపక్షం అడిగితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అంటూ చంద్రబాబు తీరును వేణు దుయ్యబట్టారు. ఏడాది పాటు సంక్షేమాన్ని ఎత్తేశారని చెప్పారు. నయవంచనకు పాల్పడుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి, ఇప్పటి పాలనకు మధ్య తేడాపై ప్రతి ఇంటా చర్చ జరగాలని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేశామని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున ప్రభుత్వంతో పని చేయించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ప్రజలకు మంచి జరగడానికి అందరం ఐక్యంగా ఉండి, వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేద్దామని వేణు అన్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే టైమొస్తుంది మరో ముఖ్య అతిథి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో మండలంలోని పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో మనకు తగిలిన గాయాలను, కేసులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సమయం వస్తుందన్నారు. మండల, నియోజకవర్గ కమిటీల నియామకాలు పూర్తయ్యాయని, త్వరలోనే గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికల వరకూ నిరంతరం పోరాడాలని అన్నారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా అందరూ స్పందించాలని కోరారు. 2019 నుంచి 2024 వరకూ వైఎస్ జగన్ అందించిన పాలనను, కూటమి ప్రభుత్వ పాలనను ప్రతి కుటుంబం, ప్రతి రోజూ బేరీజు వేసుకుంటోందని, జగన్ను తలవని కుటుంబం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు సైతం జగన్ పాలననే తలుస్తున్నారన్నారు. పార్టీ శ్రేయస్సు కోసం ఐక్యతతో పని చేద్దామన్నారు. మనల్ని నమ్ముకున్న వారికి మంచి చేయడానికి మనమంతా తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చేంత వరకూ విశ్రమించకూడదని వనిత పిలుపునిచ్చారు. పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బంక అప్పారావు, నక్కా పండు, తాడిగడప శ్రీనివాసరావు, ముప్పిడి వెంకటనరత్నం, వామిశెట్టి పరమేశ్వరావు, కండెపు రామకృష్ణ, సర్పంచ్లు పల్లి జ్యోతి, గోతం సత్యలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి లక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు వామిశెట్టి పావనీ కుమారి, మాజీ ఎంపీపీ ఖండవల్లి కృష్ణవేణి, వైస్ ఎంపీపీ అచ్యుత శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో కొత్తగా ఏర్పడిన 18 కమిటీల అధ్యక్షులను సభకు పరిచయం చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
డెల్టాలకు నీరు విడుదల
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు శుక్రవారం 10,250 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,050, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 5,200 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.20 అడుగులు ఉంది. వైభవంగా చక్రస్నానం మధురపూడి: కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. నరసింహస్వామితో పాటు అనంత పద్మనాభస్వామి, చక్రపెరుమాళ్ల స్వామి వార్లకు స్థానిక స్వామి వారి కోనేటిలో ఈ ఉత్సవం జరిపారు. రాత్రి 9 గంటలకు స్వామివారికి శేష వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. దేవస్థానం వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రధాన వీధుల్లో కొనసాగింది. దేవస్థానం చైర్మన్ పరాశర రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారులు, పండితులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. నేటితో ఉత్సవాల ముగింపు లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ నెల 9న ఇవి ప్రారంభమైన విషయం తెలిసిందే. చివరి రోజు శ్రీపుష్పయాగం నిర్వహిస్తారు. జనసేన కార్యకర్తల గుండాగిరీ పిఠాపురం: చిత్రాడలో శుక్రవారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన కార్యకర్తలు గుండాగిరీ చేయడంతో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. ట్రాఫిక్ నిలుపుచేసి, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అడిగిన సామాన్య ప్రయాణికులపై జనసేన జెండా కర్రలతో దాడి చేసి, గాయపరిచారు. మమ్మల్నే అడుగుతారా? అధికారం మాది.. అడిగితే చంపుతామంటూ బెదిరించి, కర్రలతో దాడి చేయడంతో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. దీనిని ఆపాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం విమర్శలకు దారి తీసింది. మరోపక్క 216 జాతీయ రహదారిపై జనసేన కార్యకర్తలు బైక్లపై ప్రమాదకర ఫీట్లు చేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపించారు. వారిని కనీసంగా కూడా నిలువరించకపోవడంతో పోలీసులపై ప్రయాణికులు దుమ్మెత్తి పోశారు. -
● రంగుల హరివిల్లై.. సప్తవర్ణాల సంబరమై..
ఆకులు రాలుస్తూ.. హరితావరణాన్ని మోడువార్చి, కళావిహీనంగా చేసిన శిశిరం మరో పక్షం రోజుల్లో కనుమరుగు కానుంది. చెట్టూచేమా కొత్త చివుళ్లు తొడుగుతూ.. ప్రకృతి సరికొత్త రంగులను అద్దుకునే వసంతం ఆగమించనుంది. ఈ శుభతరుణానికి స్వాగతమా అన్నట్లు.. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా పిన్నలు, పెద్దలు, బంధుమిత్రులు హోలీ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్న వేళ.. ఊరూవాడా రంగుల హరివిల్లులా.. సమస్తవర్ణాలతో నూత్న శోభను సంతరించుకుంది. – సాక్షి, రాజమహేంద్రవరం -
మార్గదర్శకాలు పాటించాలి
రాజమహేంద్రవరం రూరల్: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. ‘ఒకసారి వాడిన ప్లాస్టిక్ను నివారించండి.. పునర్వినియోగాన్ని ప్రోత్సహించండి’ అనే నినాదంతో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. నగరపాలక సంస్థ, గ్రామ పంచాయతీల ఆధ్వర్యాన పారిశుధ్యంతో పాటు సింగిల్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు చేపట్టిన అనంతరం జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావాలని జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఆయా శాఖలు, మతపరమైన సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యాన స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. -
నువ్వులు.. రైతన్న మోములో నవ్వులు
పిఠాపురం: గతంలో ఖాళీగా ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయంగా సాగు చేసే నువ్వుల పంటను ఇప్పుడు ప్రధానంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నవ్వుల పంట ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. గతంలో కేవలం ఎకరాకు రెండు బస్తాలు కూడా రాని దిగుబడి.. ఇప్పుడు ఎకరాకు 8 నుంచి 12 బస్తాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొక్కజొన్న, మిరప, వంగ, టమాటా వంటి పంటలను తగ్గించి, ఎక్కువ మంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. దీంతో కాకినాడ జిల్లాలో నువ్వుల సాగు గణనీయంగా పెరిగింది. గతంలో కేవలం 100 ఎకరాల్లో మాత్రమే ఉండే ఈ పంట సాగు, ప్రస్తుతం రికార్డు స్థాయిలో కేవలం ఒక్క గొల్లప్రోలు మండలంలోనే సుమారు 450 ఎకరాల్లో కొనసాగుతోంది. జిల్లాలో 590 ఎకరాల్లో సుమారు 350 మంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. సాధారణంగా ఏటా 3,540 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నారు. ఉష్ణోగ్రతే దీనికి ప్రాధాన్యం ఈ పంటకు 25 డిగ్రీల నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవుతుంది. నీరు నిలవని, మురుగు నీరు రాని ప్రాంతాలు వీటికి అనుకూలం కావడంతో, రేగడి నేలలున్న ప్రాంతాల్లో 90 శాతం మంది రైతులు వీటిని సాగు చేస్తున్నారు. ఆమ్మ, క్షార నేలలు అంతగా అనుకూలం కాదు. గౌరి, మాధవి, వైఎల్ఎం 11, 17, 66 రకాలు మంచి దిగుబడులు ఇస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రకాలనే జిల్లాలో అత్యధికంగా సాగు చేపట్టారు. కేవలం 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికందుతుంది. ఇందులో 50 శాతం నూనె దిగుబడి వస్తుంది. ఎకరాకు వరుసల్లో విత్తుకుంటే 2 కిలోలు, వెదజల్లితే 4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తన శుద్ధి చేయడం ద్వారా తెగుళ్లు, పురుగుల దాడి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలకు మధ్య కనీసం అరడుగు దూరం ఉండేలా నాటడం వల్ల అధిక దిగుబడి వస్తుందని అధికారులు సూచిస్తున్నారు. కలుపు నివారణకు ప్రాధాన్యమివ్వాలి. ఆకు ముడత, కాయ తొలుచు పరుగుల నుంచి రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశాలున్నాయి. ఆకు ఎండు, ఆకు కుళ్లు తెగుళ్ల దాడి చేసే అవకాశం ఉండడంతో, ముందుగానే సస్యరక్షణ చర్యలు పాటించాల్సి ఉంటుంది. ఆకు కాయలు 75 శాతం పసుపు రంగుకు మారితే కోత దశకు చేరుకున్నట్టు గుర్తించి, కోతలు చేపట్టాలని అధికారులు అంటున్నారు. కోసిన పంటను కట్టలుగా కట్టి, అదే పొలంలో ఎండకు ఎండేలా నిలబెట్టి, ఐదు రోజుల తర్వాత నూర్చుకోవాలి. ప్రస్తుతం క్వింటాల్ నువ్వుల ధర రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంది. ఎకరాకు ఆరు క్వాంటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. కేవలం ఆరుతడి, విత్తనం ఎరువులు తదితర అవసరాలకు ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతున్నట్టు తెలిపారు. కరోనాతో నువ్వుల నూనెకు డిమాండ్ పెరిగిన నువ్వుల సాగు ఆశాజనకంగా పంట ఎకరాకు ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి! తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల పంటల్లో నువ్వులు ఒకటి. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో అంది వచ్చే నూనె గింజల పంటల్లో నువ్వుల సాగు మేలైనది. ఖరీఫ్లో వేసిన వివిధ పంటలను తొలగించాక, రెండో పంటగా డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి చివరి వరకు రైతులు ఈ పంట సాగు చేపట్టారు. తక్కువ పెట్టుబడి, తక్కువ వనరులతో నికర లాభాలందించే పంటగా నువ్వులకు గుర్తింపు ఉంది. కేవలం రెండు, మూడు తడులు మాత్రమే ఇస్తే సరిపోయే పంట కావడంతో, వేసవిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఆరుతడి పంటగా వేసవిలో వేయడం వల్ల చీడపీడల బెడద చాలా తక్కువ. కరోనా సమయంలో నువ్వుల నూనెకు డిమాండ్ పెరగడంతో, ఇప్పుడు నువ్వుల పంటను భారీగా సాగు చేస్తున్నారు.సాగు విస్తీర్ణం పెరిగింది ఈ ఏడాది నువ్వుల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గతంలో 100 ఎకరాలు కూడా ఉండని పంట, ఈ ఏడాది ఒక్క గొల్లప్రోలు మండలంలోనే 400 ఎకరాల వరకు వేశారు. ప్రస్తుతం ఎండలు బాగా ఉండడంతో పంట దిగుబడి పెరిగి, ఆదాయం బాగుంటుంది. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు రైతులకు వివరిస్తున్నాం. నీటి వసతితో పెద్దగా పని లేకపోవడం వల్ల ఇతర పంటల కంటే పెట్టుబడి తక్కువ కావడంతో రైతులు ఎక్కువ మంది ఈ పంట సాగు చేశారు. పంట అన్నిచోట్లా ఆశాజనకంగా ఉంది. – సత్యనారాయణ, వ్యవసాయ శాఖాధికారి, గొల్లప్రోలు ఆశాజనకంగా ఉంది అన్ని పంటలు పూర్తయ్యాక మామూలుగా విత్తనాలు చల్లి వదిలేసేవాళ్లం. ఇప్పుడు ఇదే ప్రధాన పంటగా వేశాం. ప్రస్తుతం మార్కెట్లో నువ్వులకు మంచి డిమాండ్ ఉంది. వాతావరణం కలిసి రావడంతో ఈ ఏడాది మంచి దిగుబడి వచ్చేలా కనిపిస్తోంది. పెట్టుబడి తక్కువ కావడంతో పాటు, ఆరుతడి పంట కావడం వల్ల రేగడి నేలల్లో మంచి అనుకూలమైన పంట కావడంతో దీనిని సాగు చేస్తున్నాం. ఆదాయం బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. – సోమిశెట్టి జగ్గారావు, నువ్వుల రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం -
కోర్టుకు వెళ్లామని ఇబ్బందులు
చెరువును 40 ఏళ్ల నుంచి కుల వృత్తికి వినియోగించుకుంటున్నాం. పంచాయతీ నుంచి లీజుకి తీసుకున్నాం. చెరువు గట్టు ఆక్రమణలు తొలగించాలని హైకోర్టుకు వెళ్లాం. కోర్టు ఆదేశించినా ఆక్రమణలు తొలగించడం లేదు. రజకులతో మాట్లాడకూడదని, మాట్లాడితే జరిమానా విధిస్తామని చెబుతున్నారు. – కొండపల్లి వెంకటరత్నం, చిడిపి ఒప్పకోవడం లేదు రెండు వర్గాల మధ్య మాటల్లేవు. 2011 నుంచి చెరువు ఆక్రమణ తొలగించాలని వివాదం నడుస్తుంది. గ్రామ పెద్దలంతా కలిసి ఇరు పక్షాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించాం. పలుమార్లు చర్చలు జరిపాం. రజకుల కుల బహిష్కరణ అంశం నా దృష్టికి వచ్చింది. పరిష్కారానికి ఇరు పక్షాలు ఒప్పుకోవడం లేదు. – పాలగుడుల లక్ష్మణరావు, సర్పంచ్, చిడిపి ● -
చిడిపిలో కుల బహిష్కరణ ?
కొవ్వూరు: ఆధునిక సమాజంలో కొన్ని పల్లెల్లో నేటికీ కుల బహిష్కరణ దూరాచారం పడగ విప్పుతోంది. కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో రెండు వర్గాల మధ్య కార్చిచ్చు రేగింది. గ్రామంలో ఉన్న రజకుల చెరువు గట్టు ఆక్రమణ వ్యవహారంతో రజకులు, గౌడ సంఘం మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో, ఒక వర్గాన్ని మరో వర్గం వారు బహిష్కరించే వరకు వెళ్లింది. ఒకే ప్రాంతంలో కొన్నేళ్లుగా కులమతాలకతీతంగా, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మిత్రులంతా ఇప్పుడు విరోధులుగా మారారు. రజకులతో మాట్లాడవద్దని, పెళ్లిళ్లు, విందులకు వెళ్లరాదని, మాట్లాడిన వారికి రూ.2 వేల జరిమానా విధిస్తామని, సమాచారం ఇచ్చిన వారికి రూ.200 బహుమానం ఇస్తామని గౌడ సంఘం తీర్మానం చేసినట్టు చెబుతున్నారు. చెరువు గట్టు ఆక్రమణలు తొలగించాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సక్రమంగా అమలు చేయని అధికారులపై చర్యలు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని అనంతపురం జిల్లాకు చెందిన రజక సంఘ నాయకులు, న్యాయవాది హనుమన్న తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాకు విడుదల చేసిన వీడియోతో కుల బహిష్కరణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు వివాదం ఇదీ.. గ్రామాన్ని ఆనుకుని రజకులకు 1.24 ఎకరాల వృత్తి చెరువు ఉంది. దీని గట్టు ఆక్రమించుకుని కొందరు గడ్డిమేనులు వేశారు. గౌడ సంఘం చెరువు గట్టున పాపయ్య గౌడ విగ్రహాన్ని నెలకొల్పింది. చిన్న షెడ్డు వేసి, అందులో దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రజకులు ఆక్రమణలపై కోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపునకు పూనుకున్నారు. దీనిని గౌడ సంఘం అడ్డుకోవడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని, ఆక్రమణలను అసంపూర్తిగా తొలగించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. అప్పటి నుంచి ఆయా వర్గాల మధ్య చిచ్చురేగింది. చివరికి రజకులను బహిష్కరించి, వారి వద్ద నుంచి క్రయవిక్రయాలు సైతం మానేశారు. ఈ దురాచారంపై ఏ ఒక్క అధికారి కానీ, రాజకీయ పార్టీలు కానీ పట్టించుకోవడం లేదని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు గట్టు ఆక్రమణతో రెండు వర్గాల మధ్య వివాదం మాట్లాడితే రూ.2 వేల జరిమానాకు నిర్ణయం పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం -
హక్కులకు రక్షణ కవచం
కేసుల నమోదైన అపరాధ స్వభావం కేసులు రుసుం (రూ.లు) హార్డ్వేర్ 54 3,24,500 ఫెర్టిలైజర్స్ 31 3,75,000 చికెన్ షాపులు 37 31,500 బేకరీస్ 22 79,000 రైస్ షాపులు 11 92,500 సాక్షి, రాజమహేంద్రవరం/కాకినాడ లీగల్: ఉప్పు, పప్పు, బియ్యం, పాలు, నూనె, కూరగాయల నుంచి బంగారం వరకూ.. మోసానికి కాదేదీ అనర్హం అన్న చందంగా మారింది వినియోగదారుల పరిస్థితి. ఒక వ్యక్తి రూ.10 వేల కిరాణా సామగ్రి కొనుగోలు చేస్తే.. తూకాల్లో మోసాల కారణంగా రూ.1,000 వరకూ నష్టపోవాల్సి వస్తోంది. దీనికి తోడు వస్తు, సేవల్లో నాణ్యతా లోపాలతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత అవసరాల కోసం పలు రకాల వస్తువులకు, సేవలకు నిర్దేశిత డబ్బు చెల్లించిన ప్రతి ఒక్కరూ వినియోగదారులే. ఆ వస్తువు, సేవలు సంతృప్తికరంగా లేకుంటే మోసపోయినట్టే. దీనిని భరించి, నష్టపోవడంకన్నా, పోరాడితే పరిహారం పొందడమే కాకుండా, మరొకరు మోసపోకుండా ఉండే అవకాశం కలుగుతుంది. వస్తువుకు సంబంధించిన సమాచారం పొందడం, నచ్చిన వస్తువును ఎంచుకునే అవకాశం కల్పించడం, వినియోగదారుకు రక్షణ కల్పించడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నడీ తొలిసారిగా 1962 మార్చి 15న అమెరికన్ కాంగ్రెస్లో ప్రసంగించారు. తదనంతర కాలంలో ఈ అంశాలకు ప్రాధాన్యం పెరగడంతో 1983 నుంచి ఏటా మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం నిర్వహిస్తున్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం 1986లో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, వినియోగదారుల కమిషన్ ఏర్పాటు చేసింది. వస్తు, సేవల్లో నష్టపోయిన వినియోగదారులు కమిషన్లో నామమాత్రపు రుసుంతో కేసు వేసి, తగిన పరిహారం పొందవచ్చు. ఇటువంటి మోసాలపై పలువురు వినియోగదారులు తగిన ఆధారాలతో న్యాయస్థానాలను, వినియోగదారుల కమిషన్లను ఆశ్రయిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా రియల్ ఎస్టేట్, బీమా కంపెనీల మోసాలకు సంబంధించి 168 కేసులు వినియోగదారుల కమిషన్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. తూకాల్లో మోసాలు ఇలా.. ● రాజమహేంద్రవరంలోని ఓ బియ్యం దుకాణంలో ఓ వినియోగదారు రూ.1,600కు 26 కిలోల బియ్యం బస్తా కొనుగోలు చేశారు. వ్యాపారి వద్ద ఎలక్ట్రానిక్ కాటాలో తూకం వేయగా 26 కిలోలు చూపించింది. అదే బస్తాను వేరే కాటాలో తూకం వేయగా 2 కిలోల బియ్యానికి కోత పడింది. ● రాజమహేంద్రవరంలోని ఓ మాంసం దుకాణంలో ఓ వినియోగదారు కిలో చికెన్ రూ.180కి కొనుగోలు చేశారు. అక్కడ వేసిన ఎలక్ట్రానిక్ తూకంలో 1000 గ్రాములు చూపించింది. బయట వేరే చోట తూకం వేయగా.. 100 గ్రాముల వరకూ తగ్గింది. ఈ రెండు సంఘటనలు తూకాల్లో మోసాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఏం జరుగుతోందంటే.. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో తూకాల్లో మోసాలతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. నెల రోజులు రావాల్సిన బియ్యం బస్తా 20 రోజులే వస్తోంది. మరో పది రోజులకు అదనంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అత్యంత ఖరీదైన బంగారం విక్రయాల్లో సైతం దోపిడీ ఆగడం లేదు. తూకం సమయంలో ఏమార్చి మాయ చేస్తున్నారు. ఈ మోసాలకు చెక్ చెప్పేందుకు తూనికలు – కొలతల శాఖ ఉన్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడపాదడపా దాడులు, కేసులు తప్ప.. ఆపై మిన్నకుండిపోతూండటంతో కొందరు వ్యాపారులు తిరిగి అదే తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ● ప్రస్తుతం అన్నిచోట్లా ఎలక్ట్రానిక్ కాటాలు వినియోగిస్తున్నారు. కొందరు మాత్రం ఇంకా తూకం రాళ్లనే వాడుతున్నారు. వీటిని రెండేళ్లకోసారి తూనికలు – కొలతల శాఖ అధికారులు తనిఖీ చేసి, అరిగిన భాగం పరిమాణంలో సీసం నింపి, సీలు వేయాలి. ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలకు ఏడాదికోసారి ముద్ర వేయాలి. ● వంట గ్యాస్ డెలివరీ సమయంలో సిబ్బంది, ఇంటి వద్ద గ్యాస్ బండను స్ప్రింగ్ త్రాసు ద్వారా కొలిచి ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. దీనిని గ్యాస్ ఏజెన్సీలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలి. కానీ, అలా జరగడం లేదు. తూకం వేళ అప్రమత్తం ● వస్తువులను తూచే ముందు కౌంటర్ స్కేలు పళ్లేల రెండు సూచికలు కచ్చితంగా ఒకదానికెదురుగా మరొకటి ఉండేలా చూడాలి. ● ప్రతి తూనిక అడుగు భాగంలో అధికారులు వేసిన ముద్ర ఉందో లేదో గమనించాలి. ● కొలత పాత్రలను కట్ చేయడం, లోపల బాగా మందంగా తారు పూయడం, కింది భాగంలో నొక్కినట్లుగా సొట్టలు పెట్టడం, అడుగు భాగం తగ్గించి వెల్డింగ్ చేయడం వంటి పద్ధతుల్లో వ్యాపారులు మోసగిస్తూంటారు. వీటన్నింటినీ వినియోగదారులు పరిశీలించుకోవాలి. కమిషన్ను ఎప్పుడు ఆశ్రయించవచ్చంటే.. ● కొనుగోలు చేసిన వస్తువులు, మందులు, ఇతర ఉత్పత్తులతో ప్రాణ, ఆస్తినష్టం కలిగినా.. ● ఆసుపత్రుల్లో సేవా లోపంతో ఇబ్బంది కలిగినా.. ● వినియోగించే వస్తువుల నాణ్యత, స్వచ్ఛత లోపించినా.. ● నకిలీ విత్తనాలు, ఇతల అనైతిక వాణిజ్య విధానాలు. ● వ్యాపారి లేదా డీలర్ ద్వారా నష్టపోయినా.. ● అసలు ధర కంటే ఎక్కువ వసూలు చేసినా.. ● బ్యాంకు, బీమా, రవాణా, తయారీ సేవల్లో లోపాలు జరిగినా.. ● అపార్ట్మెంట్ల విక్రయాల్లో మోసం, ఇంటి నిర్మాణంలో లోపాలు. ● వినోదం, వివిధ వృత్తి సేవల్లో లోపాలు. ● ఇతర కారణాలతో నష్టపోయినా.. నోటీసు పంపాలిలా.. ● కొనుగోలు చేసిన ఉత్పత్తి లేదా సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ పూర్తి చిరునామా రాయాలి. కొన్న వస్తువు లేదా సేవల వివరాలివ్వాలి. క్యాష్ మెమో నంబర్, తేదీ ఇవ్వాలి.సంస్థ ఇచ్చిన వారెంటీ లేదా గ్యారెంటీ వివరాలు తెలపాలి. వస్తువు లేదా సేవలో జరిగిన లోపం, దానివల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను విపులంగా వివరించాలి. ఈ ఇబ్బందులపై అప్పటి వరకూ ఎవరెవరికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారో పేర్కొనాలి. ఉంటే కంప్లయింట్ నంబర్ ఇవ్వాలి. ఈ సంప్రదింపులకు సంబంధించిన ఆధారాల జిరాక్స్ పత్రాలు నోటీసుకు జత చేయడం మంచిది. ● నోటీసుకు స్పందించడానికి సంబంధిత సంస్థ లేదా వ్యక్తికి 15 నుంచి 30 రోజుల వరకూ గడువు ఇవ్వాలి. కోరుతున్న నష్టపరిహారం, పూర్తి మొత్తం కోరితే దానికి 18 శాతం వరకూ వడ్డీ లేదా కొత్త వస్తువు ఇవ్వాలని కోరవచ్చు. దానికి నష్టపరిహారం కూడా కావాలని కోరవచ్చు. ● వినియోగదారు పూర్తి పేరు, అడ్రస్ ఇవ్వాలి. ● నోటీసు అవతలి వ్యక్తి లేదా సంస్థకు ఇచ్చినట్లు వినియోగదారు వద్ద తగిన తిరుగు రశీదు లేదా కొరియర్, హ్యాండ్, ఆన్లైన్ డెలివరీ రశీదు వంటి ఆధారాలు ఉండాలి. వీటిని కోర్టులో సమర్పించాలి. ఫిర్యాదు ఇలా.. వస్తు, సేవల కొనుగోలు సందర్భంగా నష్టపోయిన వారు వినియోగదారుల కమిషన్లో నేరుగా లేదా న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అక్కడి సహాయ కేంద్రం సలహాలు తీసుకుని కేసు దాఖలు చేయవచ్చు. గతంలో వస్తువు కొనుగోలు చేసిన ప్రాంతంలోనే కేసు దాఖలు చేయాల్సి ఉండేది. 2019 వినియోగదారుల రక్షణ చట్టంలో మార్పు అనంతరం.. వస్తువు ఎక్కడ కొన్నా తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో కేసు దాఖలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించారు. అలాగే, ఒక వస్తువు సరిగ్గా పని చేయకపోతే గతంలో కంపెనీపై మాత్రమే కేసు వేసేవారు. చట్టంలో మార్పు అనంతరం వస్తువు విక్రయించిన షాపు యాజమాని, ఏజెన్సీ, కంపెనీపై కూడా కేసు దాఖలు చేసే అవకాశఽం కలిగింది. ఈ జాగ్రత్తలు మేలు ● అవసరమైన వస్తువులనే ఎంపిక చేసి, కొనుగోలు చేయాలి. ఆ వస్తువుల పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ● మోసపూరిత ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలి. ● నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ఆఫర్లను పూర్తిగా పరిశీలించుకోవాలి. ● వస్తువులు, సేవల కొనుగోలుకు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. ● గ్యారంటీ లేదా వారంటీ కార్డులపై సంబంధిత విక్రేత సంతకం, ముద్ర సహా ఉండేలా చూసుకోవాలి. ● మోసానికి గురైతే వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించడానికి ఇవి ఉపయోగపడతాయి. 498 కేసులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకూ తూనికలు – కొలతల శాఖ రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలో (కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు మినహా) తూకాలు, ప్యాకేజీ నీడ్స్ వంటి వాటిలో జరిగిన మోసాలపై 498 కేసులు నమోదయ్యాయి. అక్రమాలకు పాల్పడిన వ్యాపారులకు రూ.46,52,500 అపరాధ రుసుం విధించారు. మోసాలను ఉపేక్షించం వినియోగదారులను వ్యాపారులు మోసం చేస్తే ఉపేక్షించం. ఇటీవల ఉల్లిపాయల వ్యాపారులపై కూడా ఫిర్యాదు వస్తున్నాయి. ఫిర్యాదు అందిన వెంటనే దాడులు చేసి కేసులు పెట్టి, అపరాధ రుసుం విధిస్తున్నాం. వినియోగదారులు తాము మోసపోయామని గ్రహిస్తే వెంటనే వ్యాపారిని హెచ్చరించడం లేదా మా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి. వస్తువుల కొనుగోలు సమయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే వ్యాపారుల మోసాలను పూర్తి స్థాయిలో అడ్డుకోవచ్చు. – కె.శామ్యూల్ రాజు, అసిస్టెంట్ కంట్రోలర్, తూనికలు – కొలతల శాఖ, రాజమహేంద్రవరం అప్రమత్తంగా ఉండాలి తూకాల్లో మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. వస్తువు కొనే సమయంలో తూకాల్లో నిబంధనలు పాటిస్తున్నారో, లేదో గమనించాలి. అధికారులు తరచూ తనిఖీలు చేసి, ప్రజలు మోసపోకుండా చర్యలు తీసుకోవాలి. – తాడేపల్లి విజయ్ కుమార్, న్యాయవాది ఆధారాలు భద్రపరచుకోవాలి కొనుగోలు సమయంలో వినియోగదారులు బిల్లులు, గ్యారంటీ కార్డు, జాబ్కార్డు తప్పనిసరిగా తీసుకుని భద్రపరచుకోవాలి. సేవా లోపం జరిగితే కమిషన్ను ఆశ్రయించవచ్చు. కేసు స్వీకరించిన 90 రోజుల్లో పరిష్కారం లభించేలా కృషి చేస్తాం. రూ.5 లక్షలలోపు విలువగల కేసులు కమిషన్లో పూర్తిగా ఉచితం. ఆపై నిర్ణీత రుసుములుంటాయి. కమిషన్ వద్ద రూ.50 లక్షల వరకూ కూడా కేసులు వేయవచ్చు. వాటికి ఎంత వరకూ అయినా పరిహారం పొందవచ్చు. – చెరుకూరి రఘుపతి వసంత్కుమార్, అధ్యక్షుడు, కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్–1 కూరగాయల నుంచి బంగారం వరకూ తూకాల్లో తేడాలు వస్తు, సేవల్లో నాణ్యతా లోపాలు వినియోగదారుల కమిషన్లతో న్యాయం నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవండాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే.. రాజమహేంద్రవరం ఐిసీఐసీఐ బ్యాంక్లో కాకినాడ రూరల్, రమణయ్యపేట చెందిన జంపన చంద్రశేఖర్వర్మ 2006లో ఇంటి రుణం తీసుకున్నారు. రుణం పూర్తిగా చెల్లించినా ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్లను బ్యాంకు అధికారులు తిరిగి ఇవ్వలేదు. చంద్రశేఖర్వర్మ 2019లో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. విచారణ అనంతరం ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు రూ.లక్ష పరిహారం, ఖర్చుల కింద రూ.8 వేలు చెల్లించాలని 2022 ఆగస్టులో కమిషన్ తీర్పు చెప్పింది. అదనపు వసూలు రూ.27.. కమిషన్ వడ్డన రూ.27.27 లక్షలు కాకినాడ రూరల్ గంగానపల్లి చెందిన నున్నా కుసుమ కల్యాణ్ 2023 డిసెంబర్ 8న హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతంలోని హోటల్ ట్యూలిప్స్ గ్రాండ్లో బిర్యానీలు, డ్రింకులు, మూడు మినరల్ వాటర్ బాటిళ్లు జొమాటో డైనింగ్ పే ద్వారా కొనుగోలు చేశాడు. వాటికి రూ.3,083 చెల్లించాడు. వాటర్ బాటిల్ ఎంఆర్పీ రూ.20 కాగా, ఆ హోటల్ నిర్వాహకులు రూ.29 వసూలు చేశారు. మూడు వాటర్ బాటిళ్లకు రూ.60 కాగా, అదనంగా రూ.27 కలిపి మొత్తం రూ.87 వసూలు చేశారు. దీనిపై కల్యాణ్ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపగా హోటల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఆయన కాకినాడ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. విచారణ అనంతరం కల్యాణ్కు రూ.25 వేల సష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చులు రూ.2 వేలు ఇవ్వాలని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.27 లక్షలు చెల్లించాలని గత ఫిబ్రవరి 28న కమిషన్ తీర్పు ఇచ్చింది. రూ.5కు కక్కుర్తి.. రూ.5 లక్షలు పైగా వదిలింది కాకినాడకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లి, సెల్ఫోన్ డిపాజిట్ చేశారు. మొబైల్ డిపాజిట్ కౌంటర్లో సెల్ ఫోన్ పెడితే రూ.5 తీసుకోవాలి. కానీ, రూ.10 గుంజారు. దీనిపై లక్ష్మీనారాయణ కాకినాడ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. ఆయనకు రూ.5తో పాటు మానసిక ఒత్తిడికి గురైనందుకు రూ.15 వేలు, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు, అలాగే, దేవస్థానానికి మరో రూ.5 లక్షల జరిమానాను సంబంధిత కాంట్రాక్టర్ చెల్లించాలంటూ గత ఫిబ్రవరి 11న కమిషన్ తీర్పు చెప్పింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 కిలో 260 -
పౌల్ట్రీ.. నష్టాల పల్టీ
రూ.లక్షల్లో నష్టం కోళ్లున్నా, గుడ్లు ఉత్పత్తి అవుతున్నా మార్కెట్లో ధరలు లేక ఇబ్బందులు పడుతున్నాం, ప్రతి రోజూ మేత ఖర్చులు, విద్యుత్ బిల్లులు, బర్డ్ప్లూ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలకు పెట్టుబడి తడిపి మోపెడవుతోంది. ఇంత చేసినా వినియోగం లేకపోవటంతో రూ.లక్షల్లో నష్టపోవలసి వస్తోంది. – మండ తాతారెడ్డి, పౌల్ట్రీ యజమాని, పిట్టల వేమవరం, పెరవలి మండలం దిక్కు తోచడం లేదు ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర రూ.4.20 మాత్రమే ఉంది, ప్రస్తుత మేత ధరల ప్రకారం గుడ్డుకు రూ.5.50 వస్తేనే పెట్టుబడి దక్కుతుంది. రానున్న వేసవిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. దీనివలన ఖర్చులు మరింత పెరుగుతాయి. వినియోగం, ధరలు పడిపోయి రూ.లక్షల్లో నష్టపోతున్నాం. దిక్కు తోచడం లేదు. – భూపతిరాజు వరహాలరాజు, కోళ్ల రైతు, ఖండవల్లి, పెరవలి మండలం బాగా ఉడికిస్తే హాని ఉండదు బర్డ్ప్లూ సోకిన ఫామ్ల నుంచి కిలోమీటర్ పరిధిలోని ప్రజలు చికెన్, గుడ్లు వినియోగించవద్దని గతంలో ప్రకటించాం. అలాగని మొత్తంగా గుడ్లు, చికెన్ తినవద్దని కాదు. వీటిని 75 డిగ్రీల సెంటీగ్రేట్ వేడిలో ఉడికించి నిరభ్యంతరంగా తినవచ్చు. ఎటువంటి హానీ ఉండదు. చికెన్ బాగా శుభ్రపరచుకోవాలి. గుడ్లు, చికెన్ తినవచ్చంటూ అవగాహన కల్పించేందుకు ప్రధాన పట్టణాల్లో చికెన్, గుడ్డు మేళాలు నిర్వహిస్తున్నాం. – సీహెచ్ చరణ్, పశువైద్యాధికారి, పెరవలి ●● బర్డ్ప్లూతో కుదేలైన కోళ్ల పరిశ్రమ ● తగ్గిన గుడ్లు, చికెన్ వినియోగం ● గుడ్లు తేలేస్తున్న పౌల్ట్రీ యజమానులుపెరవలి: గత నెలలో వ్యాప్తి చెందిన బర్డ్ప్లూ వ్యాధితో జిల్లాలో కోళ్ల పరిశ్రమ కుదేలైంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు మృత్యువాత పడటంతో ప్రస్తుతం కోళ్లఫామ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉన్న ఫామ్ల నుంచి ఉత్పత్తి అవుతున్న గుడ్లు, కోళ్లు కొనే నాథుడు లేక తీవ్ర నష్టాలు చవి చూస్తున్నామని పౌల్ట్రీల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం మిగిలి ఉన్న కోళ్ల నుంచి రోజుకు 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నా, వినియోగం లేక, ధర పెరగక రోజుకు రూ.కోటి పైగా నష్టపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం మిగిలి ఉన్న కోళ్లకు బర్డ్ఫ్లూ సోకకపోయినా చికెన్, గుడ్ల వినియోగంపై ప్రజల్లో ఒక విధమైన ఆందోళన నెలకొంది. దీంతో వీటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో, ఏం చేయాలో తెలియక పౌల్ట్రీల యజమానులు గుడ్లు తేలేస్తున్నారు. ఒకవైపు కోళ్లను మేపక తప్పడం లేదని, మరోవైపు దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర లభించక, గుడ్ల ఎగుమతులు లేక నష్టాలు ఎదుర్కొంటున్నారు. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తమ పరిస్థితి మారిందని ఆవేదన చెందుతున్నారు. షెడ్లు ఖాళీ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని పౌల్ట్రీల్లో సుమారు 1.50 కోట్ల కోళ్లు పెంచుతూంటారు. చాలా వరకూ 50 వేలకు పైగా కోళ్లను పెంచగలిగే సామర్థ్యం కలిగిన పౌల్ట్రీలు ఉన్నాయి. ఇవి కాకుండా 5 వేల నుంచి 40 వేల కోళ్ల సామర్థ్యం కలిగిన మరికొన్ని ఫామ్లలో మరో కోటి కోళ్లను పెంచుతున్నారు. అనపర్తి నియోజకవర్గంలో 70 లక్షలు, నిడదవోలులో 50 లక్షలు, గోపాలపురం, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల్లో మరో 30 లక్షల కోళ్ల పెంపకం జరుగుతోంది. గత నెలలో బర్డ్ప్లూ బారిన పడి 40 లక్షలు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో ప్రజలు చికెన్, గుడ్ల వినియోగం బాగా తగ్గించారు. దీంతో ఒకవైపు బ్రాయిలర్ కోళ్ల పెంపకం నిలిచిపోయింది. మరోవైపు గుడ్ల కోళ్ల ఉత్పత్తి జరుగుతున్నా వినియోగం తగ్గిపోవడంతో ఎక్కడికక్కడ గుడ్లు పేరుకుపోతున్నాయి. బ్రాయిలర్ కోళ్లు పెంచిన రైతులు బర్డ్ఫ్లూతో రూ.2 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ, లేయర్ కోళ్ల రైతులు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో వారు మళ్లీ కోళ్ల పెంపకం చేపట్టడానికి ధైర్యం చేయడం లేదు. చాలాచోట్ల బ్రాయిలర్ కోళ్లు వేయకుండా షెడ్లను ఖాళీగా వదిలేశారు. పెరవలి మండలంలో నిత్యం లక్ష బ్రాయిలర్ కోళ్లు పెంచేవారు. నేడు అవి మచ్చుకు కూడా కనిపించటం లేదు. గుడ్డు ధర పతనం జిల్లాలో కోడి గుడ్ల ఉత్పత్తి ఉన్నా వినియోగం తగ్గిపోవడంతో ధర పతనమైంది. కోళ్ల ఫామ్ల వద్ద గత డిసెంబర్లో గుడ్డు ధర రూ.6.15 ఉండగా.. ఈ నెల మొదటి వారంలో అది రూ.4.50కి, గురువారం నాటికి రూ.4.20కి పడిపోయింది. బర్డ్ఫ్లూ బారిన పడి కోళ్లు పిట్టల్లా రాలిపోయినా కోడి పిల్లల ధర మాత్రం రూ.50కు తగ్గటం లేదు. మృత్యువాత పడిన కోళ్ల స్థానంలో మరో బ్యాచ్ పెంచుదామనుకున్నా గుడ్డు ధరలు నానాటికీ పతనమవుతూండటంతో నష్టపోతున్నామని కోళ్ల రైతులు వాపోతున్నారు. మరోవైపు మేత ధరలు కూడా కొండెక్కాయి. దీంతో, ఉన్న కోళ్లను మేపలేక, పెరిగిన మేత ధరలు తట్టుకోలేక వారు ఇబ్బందులు పడుతున్నారు. కోళ్ల మేత ధరలు పెరిగాయిలా.. (టన్నుకు రూ.లు) మేత డిసెంబర్ మార్చి చేప 48,000 55,000 మొక్కజొన్న 18,000 25,000 నూకలు 20,000 25,000 సోయా 40,000 45,000 తవుడు 15,000 18,000 -
పకడ్బందీగా టెన్త్ పరీక్షలు
●● కలెక్టర్ ఆదేశం ● విద్యా శాఖ అధికారులతో సమీక్షరాజమహేంద్రవరం రూరల్: ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. క్షేత్ర స్థాయి విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో తన క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఆమె జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 25,723 మంది విద్యార్థులు 134 కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 22 పోలీసు స్టేషన్లలో ప్రశ్న, జవాబు పత్రాలు భద్రపరిచామన్నారు. ఇప్పటికే జిల్లాకు సెట్–1, సెట్–2 ప్రశ్న పత్రాలు చేరాయని తెలిపారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు మాట్లాడుతూ, జిల్లాలో ఆరు సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించామని తెలిపారు. ఆ పాఠశాలలో అదనపు భద్రత ఏర్పాటు చేశామన్నారు. పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్గా 24,763 మంది (బాలురు 12,791, బాలికలు 11,972), ప్రైవేటుగా 960 (బాలురు 591, బాలికలు 369) మంది హాజరు కానున్నారని వివరించారు. పరీక్షల నిర్వహణకు 11 వందల మంది ఇన్విజిలేటర్లు, 10 స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. పునర్వ్యవస్థీకరణకు 504 పాఠశాలల అంగీకారం కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, పునర్వ్యవస్థీకరణ లో భాగంగా ఇప్పటికే 570 పాఠశాలలను గుర్తించామన్నారు. వాటిలో 504 పాఠశాలలు అంగీకారం తెలిపాయని, 66 చోట్ల అంగీకారం తెలియజేయనందున ఆయా పాఠశాలల వారీగా అభ్యంతరాలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. మరో 381 స్కూల్స్ పరిశీలన దశలో ఉన్నాయ న్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 22 వేల మంది బడి బయటి పిల్లలున్నారని, వేరొక స్కూలులో చదువుతూండటం, బదిలీపై వెళ్లడం తదితర కారణాలతో డ్రాపౌట్ కింద నమోదయ్యారని వివరించారు. వీరిలో 19 వేల విద్యార్థులను గుర్తించామ న్నారు. మిగిలిన విద్యార్తుల వివరాలను ఆయా పాఠశాలకు పంపించామని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధన విధానంలో సంస్కరణలు రానున్నాయన్నారు. సమావేశంలో ఎస్ఎస్ ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.సుభాషిణి పాల్గొన్నారు. గృహ లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో అసంపూర్తిగా ఇళ్లు నిర్మించుకున్న ఎస్సీ, బీసీ, ఎస్టీ లబ్ధిదారులకు నాలుగు దశల్లో ఆర్థిక సహాయం అందించనున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ఈ అంశంపై జిల్లా, డివిజన్, మండల క్షేత్ర స్థాయి, మండల ప్రత్యేక అధికారులతో తన క్యాంపు కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి, రెండు దశల్లో రూ.15 వేల చొప్పున, మూడు, నాలుగు దశల్లో రూ.10 వేల చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలన్నారు. దీనిపై ఈ నెల 15 నుంచి ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. తాజా కుల ధ్రువీకరణ పత్రం నిర్ధారణ చేసుకుని మాత్రమే లబ్ధిదారులను గుర్తించాలన్నారు. దీనికి సంబంధించిన డిజిటల్ సర్టిఫికెట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో హౌసింగ్ పీడీ ఎస్.భాస్కరరెడ్డి, డ్వామా పీడీ ఎ.నాగమల్లేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బీవీ గిరి పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఎంఎస్ శోభారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణకు షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా, వెబ్ ఆప్షన్లను జ్ఞానభూమి పోర్టల్లోని https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్లో ఇచ్చారన్నారు. వెబ్ ఆప్షన్కు శనివారం వరకూ గడువు ఉందన్నారు. జిల్లాలో ఈ శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలోని స్వయంకృషి గురుకృపా ఎడ్యుకేషన్ సొసైటీని ఎంపిక చేశామని తెలిపారు. ‘నన్నయ’లో 17న అంతర్జాతీయ సెమినార్ రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యాన ఈ నెల 17న అంతర్జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. సెమినార్ బ్రోచర్ను గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘కంట్రోల్ ఆఫ్ నిట్రోసామినేష్ ఇన్ ఫార్మస్యూటికల్స్ అండ్ అనలిటికల్ టెస్టింగ్’ అనే అంశంపై ఈ సెమినార్ జరగనున్నదని తెలిపారు. అమెరికాలోని సైజెన్ ఫార్మాస్యూటికల్స్ క్వాలిటీ అస్యూరెన్స్ డైరెక్టర్ డాక్టర్ విష్ణు మారిశెట్టి, యూనివర్సిటీలోని కెమిస్ట్రీ అధ్యాపకుడు డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, అమెరికాలోని కెమ్టెక్స్ లాబొరేటరీస్ సైంటిస్టు డాక్టర్ నరేష్ కటారి, మలేషియాలోని ఐఎన్టీఐ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్ వి.రవి, ఆంధ్రా యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎస్.పాల్ డగ్లస్, ఎన్ఐటీ కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమరేంద్రరెడ్డి ఈ సెమినార్కు హాజరవుతారని వివరించారు. సెమినార్లో ప్రధాన అంశంపై విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధన పత్రాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు. 15న జెడ్పీ సమావేశం కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, బడ్జెట్ సమావేశం ఈ నెల 15న నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు విధిగా హాజరు కావాలని కోరారు. సరళం.. మొల్ల రామాయణం రాజమహేంద్రవరం రూరల్: తెలుగులో రాసిన అనేక రామాయణాల్లో మొల్ల రామాయణం చాలా సరళమైనదని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. తొలి తెలుగు కవితా రచయిత్రి మొల్ల జయంతి వేడుకలు గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి జేసీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మొల్ల రామాయణాన్ని రచించారన్నారు. ఈ కావ్యాన్ని ఆమె కేవలం ఐదు రోజుల్లో రాసినట్లు ప్రతీతి అని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్ఓ టి.సీతారామమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి.శశాంక తదితరులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛతా కార్యక్రమాలు రాజమహేంద్రవరం రూరల్: ప్రజలను భాగస్వాముల్ని చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు. మెరుగైన పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛత గ్రామసభలు, ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇళ్లల్లో సోక్ పిట్స్, కంపోస్ట్ పిట్ల నిర్మాణం – నిర్వహణ, పర్యవేక్షణ, నివేదికలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.నాగ మహేశ్వరరావు, మండల అధికారులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
ఆ ‘పప్పు’లేం ఉడకవు
పంపిణీకి బ్రేక్..! రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో మార్చి నెల నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. ఈ నెలలో కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని పౌర సరఫరాల శాఖ అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు డీలర్లు చెబుతున్నారు. రెండు నెలలుగా పూర్తి స్థాయిలో కందిపప్పు రాకపోవడంతో ఆసరాగా తీసుకున్న కొందరు రేషన్ సరకులను పక్కదారి పట్టించారనే ఆరోపణలూ లేకపోలేదు. బియ్యం, పంచదారతో పాటు, కందిపప్పు కోసం ఎండీయూ వాహనాల ఆపరేటర్లను అడుగుతుంటే, నో స్టాక్ అనే సమాధానం వస్తుందని లబ్ధిదారులు చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిపివేయడంతో బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పును అధికంగా రూ.150 వరకూ కొనుగోలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే కందిపప్పు పంపిణీని పూర్తిగా ఎత్తివేసేలా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.● కందిపప్పు సరఫరాలో కూటమి సర్కారుది ఆరంభ శూరత్వం ● రేషన్ దుకాణాల్లో పూర్తిగా నిలిపివేత ● మూడు నెలల నుంచి బియ్యం, పంచదారతోనే సరి ● ఉగాదికీ పప్పన్నం పెట్టలేని పాలకులు ఆలమూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నిత్యావసరాలను రాయితీపై అందిస్తామంటూ నేటి పాలకులు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ప్రజలందరూ నిజమేనని నమ్మారు కూడా. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి తొమ్మిది నెలలైనా, ఇంకా అనేక పథకాలు ఆచరణకు నోచుకోలేదు. అమలులో ఉన్న పథకాలూ ఇప్పటికే అర్ధాంతరంగా నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది మార్చి నుంచి రేషన్ డిపోల ద్వారా కందిపప్పు సరఫరాను నిలిపివేసి ప్రభుత్వం తన అసమర్థతను చాటుకుంది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల నియంత్రణ కోసం కృషి చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. రేషన్ దుకాణాల్లో కందిపప్పును కూడా రాయితీపై అందిస్తామన్న హామీనీ అపహాస్యం చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగానే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కంది పప్పును కేజీ రూ.67కే ప్రతి నెలా పంపిణీ చేస్తామని గత ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సుమారు 30 శాతం మందికి మాత్రమే సరఫరా చేశారు. ఈ నెలలో కందిపప్పు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నిత్యావసర సరకుల ధరల నియంత్రణ పేరిట పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు సైతం మూతపడ్డాయి. ప్రజలపై తీవ్ర ప్రభావం రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగా పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం అదుపు చేయలేకపోవడం ప్రజలకు పెనుశాపంగా పరిణమించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 966 రేషన్ డిపోల ద్వారా 355 మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల(ఎండీయూ)తో 5.48 లక్షల మందికి ప్రతి నెలా రేషన్ సరకులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రతి నెలా 20లోపు రేషన్ డీలర్లు డీడీలు తీసి, అవసరమైన సరకులను దిగుమతి చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లా పౌర సరఫరాల శాఖ మాత్రం గతేడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సక్రమంగానే కందిపప్పు సరఫరా చేసింది. జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి కందిపప్పు కోసం డీలర్లు డీడీలు తీయగా, 523 టన్నులకు గానూ ప్రభుత్వం కేవలం 112 టన్నులే సరఫరా చేసింది. డీడీల్లో మిగిలిన సొమ్మును ఇతర సరకులకు సర్దుబాటు చేశారు. దీంతో ఆ రెండు నెలలు కూడా వినియోగదారులకు పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా జరగలేదు. -
పొదుపు ఖాతాలో సొమ్ము మాయం
రెండు నెలల్లో దఫదఫాలుగా రూ.2.40 లక్షలు అదృశ్యం ప్రత్తిపాడు: మహిళా శక్తి సంఘం పొదుపు ఖాతా నుంచి యూపీఐ ద్వారా సొమ్ము మాయమైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి స్టేట్ బ్యాంక్ నుంచి ఈ సొమ్ము మాయమైంది. ఆ గ్రామానికి చెందిన సదా శివ మహిళా శక్తి సంఘం (డ్వాక్రా గ్రూపు) పొదుపు ఖాతాలో జనవరి 14 నుంచి మార్చి 7 మధ్య దఫదఫాలుగా రూ.వెయ్యి నుంచి రూ.46 వేల వరకు 27 లావాదేవీల ద్వారా ఈ సొమ్ము కాజేసినట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి సురక్ష, జీవన జ్యోతి యోజనలకు బ్యాంకు వారే రెన్యువల్ చేస్తారు. ఇందుకు పొదుపు ఖాతాలో కనీసం రూ.2 లక్షలైనా ఉండాలి. బ్యాంక్ మేనేజర్ లలిత్ ఈ పథకాలను రెన్యువల్ చేసేందుకు ఖాతాలను పరిశీలిస్తే, కేవలం రూ.760 ఉన్నాయి. దీంతో ఆయన డ్వాక్రా గ్రూపు సభ్యులకు సమాచారం అందించి, సైబర్ మోసం జరిగినట్టు గుర్తించారు. సదాశివ డ్వాక్రా గ్రూపు ఖాతా నుంచి రూ.2,40,180 యూపీఐ ద్వారా మోసం జరిగినట్టు వెల్లడైంది. దీంతో గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులు కొట్టేటి పార్వతి, చింతల నాగమణి, ఇతర సభ్యులు ప్రత్తిపాడు వెలుగు ఏపీఎం వై.వెంకట్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఏపీఎం వెంకట్ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్త కొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 కిలో 260 -
ములికిపల్లి సర్పంచ్పై విచారణ
రాజోలు: అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ములికిపల్లి పంచాయతీ సర్పంచ్ గుబ్బల లక్ష్మీనీలిమ, ఆమె భర్త గుబ్బల రాజుపై పాలకవర్గ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం విచారణ జరిగింది. సర్పంచ్, ఆమె భర్త ఏకపక్ష నిర్ణయాలతో, తీర్మానాలు లేకుండా సుమారు రూ.3.28 లక్షల నిధులు దుర్వినియోగం చేశారని, పంచాయతీ పాత భవనం తొలగించడానికి బహిరంగ వేలం నిర్వహించకుండా, భవనం తొలగించి నిధులు పంచాయతీకి జమ చేయలేదని, పంచాయతీ చెరువులో వేలం వేయకుండా చేపలను విక్రయించారని, తమకు ఓటు వేయలేదనే అక్కసుతో మామిడిశెట్టి వారి గ్రూపులో జల్జీవన్ మిషన్లో తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని 12 అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. వార్డు సభ్యులు కె.శ్రీనివాస్, వైఎస్కే చైతన్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డీపీఓను కోరారు. డీపీఓ ఆదేశాల మేరకు సఖినేటిపల్లి ఈఓపీఆర్డీ కె.సూర్యనారాయణ, లక్కవరం పంచాయతీ కార్యదర్శి అబ్బాస్ ఆలీ ఈ విచారణ నిర్వహించారు. ములికిపల్లి పంచాయతీ రికార్డులను పరిశీలించారు. 2021 నుంచి ఏడుగురు పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్, ఆమె భర్త ఆగడాలు భరించలేక వెళ్లిపోయారని విచారణాధికారులకు వివరించారు. రూ.7.45 లక్షలతో పారిశుధ్య సామగ్రి కొనుగోలు చేసినట్టు తప్పుడు రికార్డులు చూపించారని, పంచాయతీ ఫర్నిచర్ను సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లిపోయారని తెలిపారు. ఎంపీటీసీ సభ్యురాలు సోమిశెట్టి ధనలక్ష్మిని పంచాయతీ సమావేశాలకు ఆహ్వానించిన పంచాయతీ కార్యదర్శి ఓగూరి విజయభానుపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఎంపీటీసీ సభ్యురాలిని పంచాయతీ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవాలని సర్పంచ్, ఆమె భర్త ఘర్షణ వాతావరణం సృష్టించారని అధికారులకు వివరించారు. ఈ విచారణ నివేదికను డీపీఓకు అందజేస్తామని ఈఓపీఆర్డీ సూర్యనారాయణ తెలిపారు. -
ఆనంద డోలిక.. హోలీ వేడుక
బిక్కవోలు: ఫాల్గుణ మాసం పౌర్ణమి. లేలేత చిగుళ్లు, విరబూసిన పూరెమ్మలు, చెట్లు వసంత రాగం ఆలపిస్తున్న తరుణంలో, చిన్నాపెద్దా తేడా లేకుండా, ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండగ హోలీ. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ పండగను.. ముఖ్యంగా ఉత్తర భారతీయులు ఎంతో సంబరంగా చేసుకుంటారు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఆనందోత్సాహాలతో ఈ సంబరాల్లో మునిగితేలుతున్నారు. పిల్లా, పెద్దా తేడా లేకుండా, రంగులు పులుముకొంటూ ఆనంద డోలికల్లో విహరిస్తున్నారు. శుక్రవారం హోలీ పండగ సందర్భంగా.. పురాణ కథ హోలీ పండగ వెనుక ఓ పురాణ కథ ఉంది. హోలీ అనే రాక్షసి పసిపిల్లల ప్రాణాలు హరిస్తూ కడుపు నింపుకొనేది. పిల్లల తల్లిదండ్రులు గర్భశోకంతో ఆగ్రహించి మూకుమ్మడిగా ఆ రాక్షసిని అంతమొందించారు. దాని మరణాన్ని వేడుకగా భావిస్తూ హోలీ పండగ నిర్వహిస్తారనేది కథనం. ఆనందంతో పాటు ఆరోగ్యం ఒకప్పడు పూలు, పండ్ల ద్వారా వచ్చిన రంగులనే వేడుకల్లో వాడేవారు. పండగకు ఒకరోజు ముందు అడవికి వెళ్లి మోదుగు పూలు సేకరించేవారు. వాటిని ఉడికించగా వచ్చిన ఎర్రటి ద్రావణంలో పసుపు, కుంకుమ కలిపి, ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సంబరాలు జరుపుకొనేవారు. కాలక్రమంలో ఆ రంగులు పోయి, వార్నిష్, సింథటిక్ రంగులను చల్లుకోవడం ఆరంభించారు. అవి ప్రమాదకరమని తెలిసినా.. వాడుతూనే ఉండడం ఆందోళన కలిగించే విషయం. హోలీ ఆడటంలో జాగ్రత్తలు తీసుకోకతప్పదని చర్మ వ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయన రంగులను కాకుండా, సహజసిద్ధ రంగులతో హోలీ జరుపుకోవడం ద్వారా చర్మానికి హాని జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సూచనలు పాటిస్తే మేలు ● పూర్వం ప్రకృతిలో దొరికే మొక్కలు, పూలతో తయారు చేసిన రంగులు చల్లుకోవడంతో చర్మ వ్యాధులు దరిచేరేవి కావు. ● రసాయన రంగులైన లెడ్ ఆకై ్సడ్, అల్యూమినియం, బ్రోమైడ్, మెర్క్యురీ సల్ఫేట్ వంటివి వినియోగించడం ఆందోళన కలిగించే విషయం. అవి కళ్లల్లో పడితే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ● గులాల్ వంటివి వినియోగిస్తుండడం ప్రమాదకరమే. గులాల్ వంటి రంగులతో ఆస్తమా, చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. ● రసాయనాలు కలసిన రంగులతో హోలీ ఆడితే కనుక వాటిని శరీరంపై ఎక్కువ సమయం ఉండనీయరాదు. వెంటనే చల్లని నీటితో శరీరాన్ని శుభ్రం చేయాలి. ● ఎరుపు, గులాబీ రంగులనే హోలీ కోసం వాడాలి. ఇవి తక్కువ గాఢత కలిగి ఉండటం వల్ల శరరంపై నుంచి సులభంగా తొలగిపోతాయి. గ్రీన్, ఎల్లో, ఆరంజ్ రంగులు ఎక్కువ రసాయనాలను కలిగి ఉన్న కారణంగా సులభంగా తొలగిపోవు. ● హోలీ ఆడటానికి ముందు శరీరానికి మాయిశ్చరైజర్ని, తలకు నూనెను రాసుకోవాలి. దీనివల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. రంగులను శుభ్రం చేయడం కూడా సులువవుతుంది. ● ముఖంపై పడిన రంగులను శుభ్రం చేసుకోవడానికి సబ్బు కన్నా, క్లీన్సింగ్ మిల్క్ ఉత్తమమైనది. ● చాలా మంది రంగుల్లో వివిధ ఆయిల్స్ను కలుపుతారు. ఈ కారణంగా రంగులను శుభ్రం చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. అందుకే రంగుల్లో ఆయిల్స్ లేదా నీటిని కలపకుండా హోలీ ఆడితే నీటి వృథాను అరికట్టవచ్చు. జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి మేలు రసాయన రంగులకు దూరంగా ఉండాలి జాగత్తలు పాటించకపోతే కళ్లకు ముప్పే.. సంబరాలకు సిద్ధమైన పిల్లలు, పెద్దలు నేడే వసంతోత్సవం చిన్న పిల్లలను దూరంగా ఉంచండి చాలా మంది సరదా కోసం హోలీ పండగలో చిన్న పిల్లలు కూడా ఉండేలా చేస్తారు. కానీ చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి. రంగులు వారిపై పడితే కంటి సమస్యలు, చర్మ వ్యాధులు, రంగులు నోట్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కనుక వారిని జాగ్రత్తగా చూడాలి. – పులగం రామానందసాగర్, వైద్యుడు, అనపర్తి -
కేఎంసీ రాజకీయ సేవ!
కాకినాడ రూరల్: నవ్వి పోదురు నాకేంటి అన్నట్టుగా ఉంది కూటమి పాలకుల తీరు. పిఠాపురం సమీపం చిత్రాడలో శుక్రవారం జరగనున్న జనసేన ప్లీనరీ కోసం కాకినాడను ఆ పార్టీ స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లతో ముంచెత్తారు. సర్పవరం జంక్షన్ కూడలి వద్ద నాలుగు వైపులా భారీ స్వాగత ద్వారాలను గురువారం ఏర్పాటు చేశారు. ఇందుకు ఉదయం నుంచి రాత్రి వరకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)కి చెందిన ప్రజాధనంతో పనిచేసే రెండు భారీ క్రేన్లను వినియోగించారు. వీధి దీపాల ఏర్పాటుకు వాడే వీటిని జనసేన స్వాగత ద్వారాల కోసం వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ కార్యక్రమాలకు కేఎంసీ క్రేన్ల వినియోగంపై సర్పవరం జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించిన పలువురు నిర్ఘాంతపోయారు. అధికార కూటమి పార్టీ కావడంతో కార్పొరేషన్ అధికారులు నిబంధనలకు పాతర వేశారని పలువురు విమర్శలు గుప్పించారు. సర్పవరం జంక్షన్ వద్ద జనసేన స్వాగత ద్వారాల నిర్మాణంలో క్రేన్లు నిర్ఘాంతపోయిన ప్రజలు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్త కొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 కిలో 260 -
పొదుపు ఖాతాలో సొమ్ము మాయం
రెండు నెలల్లో దఫదఫాలుగా రూ.2.40 లక్షలు అదృశ్యం ప్రత్తిపాడు: మహిళా శక్తి సంఘం పొదుపు ఖాతా నుంచి యూపీఐ ద్వారా సొమ్ము మాయమైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి స్టేట్ బ్యాంక్ నుంచి ఈ సొమ్ము మాయమైంది. ఆ గ్రామానికి చెందిన సదా శివ మహిళా శక్తి సంఘం (డ్వాక్రా గ్రూపు) పొదుపు ఖాతాలో జనవరి 14 నుంచి మార్చి 7 మధ్య దఫదఫాలుగా రూ.వెయ్యి నుంచి రూ.46 వేల వరకు 27 లావాదేవీల ద్వారా ఈ సొమ్ము కాజేసినట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి సురక్ష, జీవన జ్యోతి యోజనలకు బ్యాంకు వారే రెన్యువల్ చేస్తారు. ఇందుకు పొదుపు ఖాతాలో కనీసం రూ.2 లక్షలైనా ఉండాలి. బ్యాంక్ మేనేజర్ లలిత్ ఈ పథకాలను రెన్యువల్ చేసేందుకు ఖాతాలను పరిశీలిస్తే, కేవలం రూ.760 ఉన్నాయి. దీంతో ఆయన డ్వాక్రా గ్రూపు సభ్యులకు సమాచారం అందించి, సైబర్ మోసం జరిగినట్టు గుర్తించారు. సదాశివ డ్వాక్రా గ్రూపు ఖాతా నుంచి రూ.2,40,180 యూపీఐ ద్వారా మోసం జరిగినట్టు వెల్లడైంది. దీంతో గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులు కొట్టేటి పార్వతి, చింతల నాగమణి, ఇతర సభ్యులు ప్రత్తిపాడు వెలుగు ఏపీఎం వై.వెంకట్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఏపీఎం వెంకట్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో నాయనమ్మ, మనవడి మృతి
దేవరపల్లి: ముందు వెళుతున్న లారీని మోటార్ బైక్ ఢీకొన్న ప్రమాదంలో నాయనమ్మ, మనవడు మృతి చెందిన విషాద సంఘటన ఇది. మండలంలోని దుద్దుకూరు వద్ద గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, గోపాలపురానికి చెందిన షేక్ మీరా తున్నీషా(65) కుమార్తె ఇటీవల పంగిడి సమీపంలోని గోవర్థనగిరి మెట్టలో మరణించింది. కీడు దుస్తు లు కట్టుకోవడానికి తున్నీషా తమ్ముడు గోవర్థనగిరిమెట్ట పిలిచాడు. దీంతో తున్నీషా, తన మనవడు షేక్ సమీర్(20) గురువారం ఉదయం మోటార్ బైక్పై గోవర్థనగిరిమెట్టకు వెళ్లారు. దుస్తులు ధరించి, తిరిగొస్తుండగా దుద్దుకూరు వద్ద హైవేపై ముందున్న లారీని మోటార్ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాయనమ్మ, మనవడికి తీవ్ర గాయాలు కాగా, హైవే అంబులెన్స్లో ఆస్పత్రులకు తరలించారు. వారు చికిత్స పొందుతూ కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిలో నాయనమ్మ, రాజమ హేంద్రవరం జీజీహెచ్లో సమీర్ మృతి చెందారు. కాగా షేక్ సమీర్ గోపాలపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తు న్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అతడు శుక్ర వారం పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న బైక్ దుద్దుకూరు వద్ద ఘటన -
మట్టి దొంగలెవరయా..?
కొవ్వూరు: చిడిపి గ్రామంలో గోదావరి లంకలో అక్రమార్కులు మట్టిని కొల్లగొట్టారు. కూటమి నేతల అండదండలతో.. అనధికారికంగా నదీగర్భంలో పొక్లెయిన్లను ఉపయోగించి, లారీల్లో భారీగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానికులు అక్కడకు వెళ్లి తవ్వకం పనులను అడ్డుకున్నారు. మట్టిని తరలిస్తున్న లారీలను, పొక్లెయిన్లను అడ్డగించారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. తీరిగ్గా అధికారులు వచ్చే సమయానికి ఆ ప్రదేశంలో లారీలు, పొక్లెయిన్లు మాయమయ్యాయి. అక్రమంగా తవ్వి వదిలేసిన గోతులు మాత్రమే అక్కడ దర్శనమిచ్చాయి. వాస్తవానికి ఈ భూములను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చిడిపి గ్రామానికి చెందిన 97 మంది పేదలకు పట్టాలుగా పంపిణీ చేశారు. దీంతో గ్రామస్తులు మట్టి తవ్వకం పనులను అడ్డగించి, తహసీల్దార్కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మట్టి తవ్వకానికి సంబంధించిన ఫొటోలనూ పంపించారు. అధికారులు సావధానంగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ గ్రామస్తులు అడ్డుకున్న లారీలు, పొక్లెయిన్లు మాయం కావడం చర్చనీయాంశమైంది. దీంతో టాస్క్ఫోర్స్ ఏఎస్సై జి.శ్రీనివాసరావు, వీఆర్వోలు మట్టి తవ్విన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఏ విధమైన వాహనాలు లేనట్టు చెబుతున్నారు. ఫిర్యాదుదారులు అధికారులకు పంపిన ఫొటోల్లో, మీడియాలో ప్రచురితమైన ఫొటోల్లో లారీ నంబర్ స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ అధికారులు మాత్రం వాహనాలపై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారాన్ని ముందుగా ఫిర్యాదుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాటినే అధికారులకూ పంపించారు. తీరా విషయాన్ని సెటిల్మెంట్ చేసుకుని, ఏ విధమైన కేసుల్లేకుండా సహకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు అధికారులు సైతం తమ వంతు సహకారం అందించినట్టు సమాచారం. అక్రమ తవ్వకాలపై చర్యలేవీ? తాళ్లపూడి మండలం బల్లిపాడు, కొవ్వూరు మండలం చిడిపి గ్రామాల మధ్య రెండు మండలాల సరిహద్దుల్లో ఈ తవ్వకాలు సాగుతున్నాయి. తమ పరిధి కాదంటూ ఒక మండలం అధికారులు మరో మండలం వారిపై నెట్టుకుంటూ, లోపాయికారిగా అక్రమార్కులకు సహకరిస్తున్నట్టు సమాచారం. అక్రమ తవ్వకాలు జరిగిన ప్రదేశంలో ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వి, తరలించారన్నదీ లెక్క తేల్చాల్సిన అధికారులు, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడాన్ని గ్రామస్తులు తప్పుపడుతున్నారు. రెవెన్యూ, టాస్క్ఫోర్స్ అధికారులు మట్టి తవ్వకాల ప్రదేశాన్ని పరిశీలించాక.. అసలు ఎవరి వాహనాలు తవ్వాయి, మట్టి తవ్వకాల వెనుక ఎవరున్నారు, ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వారు, దాని విలువెంత, దానిని ఎవరి నుంచి రికవరీ చేయాలన్న అంశాలపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు చర్చించుకుంటున్నారు. కొందరు కూటమి నాయకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి, ఈ అక్రమ బాగోతాన్ని సర్దుబాటు చేయడంపై జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల దేచెర్ల గ్రామంలో ఎర్రమట్టి తవ్వకాలపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ సమయంలో మైనింగ్ అధికారులు ఆగమేఘాలపై వచ్చి, కొలతలు వేసి, అక్రమ తవ్వకాలు ఏ మేరకు సాగాయో నిర్ధారించారు. వాహనాలను సైతం సీజ్ చేశారు. తాజా వ్యవహారంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది. చిడిపిలో అక్రమ మట్టి తవ్వకాలు వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు సమాచారం ఇచ్చినా.. తాపీగా వచ్చిన అధికారులు తవ్విన పొక్లెయిన్, లారీలు మాయం కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన యంత్రాంగం అక్రమార్కులపై కానరాని చర్యలు మాకు ఫిర్యాదు అందలేదు మట్టి తవ్వకాలపై మాకు ఏ విధమైన రాతపూర్వక ఫిర్యాదు అందలేదు. మాకు అందిన సమాచారం మేరకు మట్టి తవ్విన ప్రదేశానికి వీఆర్వో సుబ్రహ్మణ్యం, టాస్క్ఫోర్స్ ఏఎస్సై జి.శ్రీనివాసరావును పంపించాం. పని ప్రదేశంలో వాహనాలు ఏమీ లేవు. ముందుగా ఫిర్యాదు చేసిన స్థానికులెవరూ స్టేట్మెంట్(వాంగ్మూలం) ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మైనింగ్ చేసిన ప్రదేశాన్ని టాస్క్ఫోర్స్ ఎస్సై, మైనింగ్ అధికారులు పరిశీలించారు. తదుపరి చర్యలు మైనింగ్ అధికారులు తీసుకోవాల్సి ఉంది. – ఎం.దుర్గాప్రసాద్, తహసీల్దార్, కొవ్వూరు -
టీడీపీ అబద్ధాల పుట్ట
విద్యార్థులు, యువతకు మద్దతుగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘యువత పోరు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఇలా అబద్ధాలతో ఆకలి కడుపులు నింపలేరని ప్రజలే గుర్తించారు. విద్య, వైద్యం అనే ప్రధాన అవసరాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మాజీ సీఎం జగన్పై కూటమి నాయకులు లేనిపోని అబద్ధాలు చెప్పారని, రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్లిపోయిందంటూ అసత్య ప్రచారాలు చేశారని ప్రజలు గమనించారు. నిరుద్యోగ భృతి, ఫీజు బకాయిలు తక్షణం ఇవ్వాలి. రూ.4,600 కోట్ల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి. జగన్ ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలని చూస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాబుకు తెలియదా? ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం చంద్రబాబుకు హామీలు ఇచ్చే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? గత ప్రభుత్వం అప్పులు చేయడం వల్లనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకపోతున్నామని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పడం చూస్తూంటే ఆయన అనుభవం ఎక్కడికి పోయిందో అర్థం కావడం లేదు. తప్పుడు వాగ్దానాలు చేసి తల్లిదండ్రులను, నిరుద్యోగులను, యువతను చంద్రబాబు మోసం చేశారు. మాజీ సీఎం జగన్పై అనవసర విమర్శలు మాని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టడం చంద్రబాబు, లోకేష్లకు మంచిది. – తానేటి వనిత, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి -
ప్రజాభ్యుదయమే పరమావధి
● ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతర పోరాటం ● జిల్లాలో ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం ● కేక్ కట్ చేసి, జెండా ఆవిష్కరించిన నేతలు సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజాభ్యుదయమే పరమావధిగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సవాళ్లను సోపానాలుగా మలచుకుని ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ.. మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పార్టీ వైఎస్సార్ సీపీ అని పార్టీ నేతలు అన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలను చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు వెళుతున్నారని కొనియాడారు. జగన్ చెప్పారంటే.. చేస్తారంతే.. అంటూ ప్రజల్లో నమ్మకం, విశ్వాసం గడించిన పార్టీగా వైఎస్సార్ సీపీ చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం జిల్లావ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కేక్లు కట్ చేసి, పార్టీ జెండాలు ఆవిష్కరించారు. రాజమండ్రి రూరల్ వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యాన పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజా శ్రేయస్సు, సమస్యల పరిష్కారానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, చందన నాగేశ్వర్, గిరిజాల బాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ పిలుపునిచ్చారు. మార్గాని ఎస్టేట్లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాష్ట్ర బీసీ నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, నాయకులు అడపా శ్రీహరి, నక్కా శ్రీనగేష్, పోలు విజయలక్ష్మి, వాసంశెట్టి గంగాధరరావు, దాసి వెంకట్రావు, బిల్డర్ చిన్న, కానుబోయిన సాగర్, మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనపర్తి రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా వైఎస్సార్ సీపీదే ఘన విజయమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. అనపర్తిలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎర్ర కాలువ వంతెన వద్ద దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. పార్టీ జెండా ఎగురవేశారు. అందరికీ స్వీట్లు పంచారు. కొవ్వూరు కొవ్వూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యాన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. తలారి, పార్టీ శ్రేణులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కేట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గోపాలపురం దేవరపల్లి మండలం యర్నగూడెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి, పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత ఆధ్వర్యాన ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. నిడదవోలు నిడదవోలు పట్టణంలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ కార్యదర్శి గాజుల రంగారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ వెలగడ బాలరాజు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం దారుణం. సూపర్ సిక్స్ హామీల్లో ఏ పథకానికి ఎన్ని నిధులు బడ్జెట్లో కేటాయించారు? మెగా డీఎస్సీపై తొలి సంతకం కూడా చేశారు. తీరా చూస్తే 16 వేల పోస్టులు ఏరకంగా భర్తీ చేస్తారో అర్థం కాని పరిస్థితి. అటువంటప్పుడు సంతకానికి విలువేముంది? ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని, ఇచ్చిన హామీలన్నీ బేషరతుగా అమలు చేయాలి. లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తాం. – మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హామీలు తుంగలో తొక్కడం కూటమి నైజం కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. పథకాలు ఇవ్వకుండా దగా చేసింది. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కడం, ప్రజలను పక్కదారి పట్టించడం కూటమి ప్రభుత్వ నైజం. 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో కనీస కేటాయింపులు కూడా చేయలేదు. పేద పిల్లలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చేస్తోంది. – డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రైవేటీకరణ ఆపాలి కూటమి ప్రభుత్వం చేపట్టాలనుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణం ఆపాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ప్రతి ఇంట్లో యువత ఉన్నత చదువులు చదువుకుని, జీవితంలో స్థిరపడేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేశారు. రూ.4.76 లక్షల కోట్ల విలువైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. – తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. ఫలితంగా కొత్తగా ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో వచ్చిన కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యకు భయపడి వెనక్కి పోతున్నాయి. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి, ఐదు క్వార్టర్స్కు సంబంధించిన బిల్లులు పెండింగ్లో పెట్టడం దారుణం. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే -
దగాపై నిరసన సెగ
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025భారీ బైక్ ర్యాలీ ‘యువత పోరు’కు మద్దతుగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, యువనేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యాన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రకాష్ నగర్లోని రాజా నివాసం వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నందం గనిరాజు జంక్షన్, బైపాస్ రోడ్డు తాడితోట, స్టేడియం రోడ్డు, శ్యామలా టాకీస్ జంక్షన్, కోటిపల్లి బస్టాండ్, ఐదు బళ్ల మార్కెట్ మీదుగా బొమ్మూరులోని రాజమహేంద్రవరం రూరల్ పార్టీ కార్యాలయానికి చేరుకుంది. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకూ సాగింది. ర్యాలీలో పార్టీ శ్రేణులతో పాటు, యువత వేలాదిగా పాల్గొన్నారు. -
ఆలోచన లేకుండా చేసే పనులతో ఇబ్బందులు
కంబాలచెరువు: ఆలోచన లేకుండా చేసే పనులతో ఇబ్బందులు ఎదురవుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. అక్కడి బాలురు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉచితంగా న్యాయవాదిని పొందే అవకాశం ఉందని తెలిపి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. బాలురతో స్నేహ పూర్వకంగా ఉండాలని, వారికి మంచి ఆహారాన్ని అందించడంతో పాటు వారికి ఎలాంటి వైద్య సహాయం అవసరమైన వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి చెప్పారు. అనంతరం కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని బీసీ బాలికల సమీకృత సంక్షేమ వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అన్యాయం జరిగితే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. మంచి చెడు స్పర్శలకు తేడాలను విద్యార్థినులకు తెలియజేశారు. -
తహసీల్దార్ ఆఫీస్ వద్ద గుండెపోటుతో రైతు మృతి
మృతదేహంతో గ్రామస్తుల ఆందోళన దేవరపల్లి: స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గుండెపోటుతో రైతు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి ఉద్రిక్తతకు దారి తీసింది. మృతుడు దెయ్యాల వెంకట్రావు (44) కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం లక్ష్మీపురానికి చెందిన వెంకట్రావు భార్య రత్నకుమారి, ఆమె అన్నదమ్ములకు 60 సెంట్ల భూమి ఉంది. దీనిని గ్రామ సర్వేయర్ దుర్గారావు అదే గ్రామానికి చెందిన పోలుమాటి రమేష్ పేరున ఆన్లైన్ చేశారు. దీనిని తమ పేరిట మార్చాలని 20 రోజులుగా వెంకట్రావు దంపతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకట్రావుకు సర్వేయర్ బుధవారం సాయంత్రం ఫోన్ చేసి, తహసీల్దార్ కార్యాలయానికి రావాలని చెప్పారు. దీంతో భార్య రత్నకుమారితో కలసి వెంకట్రావు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మండల సర్వేయర్ దిల్లేశ్వరరావు, గ్రామ సర్వేయర్ దుర్గారావు, రైతు వెంకట్రావుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వెంకట్రావు గుండెపోటుతో అక్కిడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు 108 అంబులెన్స్లో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే వెంకట్రావు మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో, ఆగ్రహించిన వెంకట్రావు కుటుంబ సభ్యులు, బంధువులు అతడి మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. గ్రామ సర్వేయర్, మండల సర్వేయర్ వాగ్వాదానికి దిగడం వల్లే తన భర్త గుండెపోటుతో మృతి చెందారని, తన కుటుంబానికి న్యాయం చేయాలని రత్నకుమారి డిమాండ్ చేశారు. స్థానిక ఎస్సై వి.సుబ్రహ్మణ్యం సంఘటన స్థలానికి చేరుకుని, మృతుని కుటుంబ సభ్యులు, బంధువులతో చర్చించారు. వెంకట్రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఐ.పోలవరం: ఐ.పోలవరం మండలం ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యానాం సుంకరపాలెం నుంచి ముమ్మిడివరం వైపు బైక్పై వస్తున్న ఇద్దరి వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఇద్దరూ తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన యాళ్ల వీరేంద్ర(26), ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన వేమవరపు సాంబశివ(14)గా పోలీసులు గుర్తించారు. పోతుకుర్రులో జరిగే పుట్టినరోజు వేడుకలకు బంధువుతో కలసి వారు మోటారు సైకిల్పై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి స్థానిక ఎస్సై మల్లికార్జునరెడ్డి సిబ్బందితో కలసి వెళ్లి మృతదేహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సుంకరపాలెం గ్రామానికి చెందిన యాళ్ల వీరేంద్ర లోడ్ ఆటో నడుపుతూ తండ్రి సూరిబాబుకు అండగా ఉండేవాడు. సూరిబాబుకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఉన్న ఒక్క కొడుకూ ఆటో నడుపూతూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. వీరేంద్ర మృతితో సుంకరపాలెంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. సాంబశివ కొత్తలంక హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. కౌలు రైతు ఆత్మహత్య తాళ్లరేవు: మండల పరిధిలోని పి.మల్లవరం పంచాయతీ పత్తిగొంది గ్రామానికి చెందిన కౌలు రైతు పశ్చెట్టి వెంకటేశ్వరరావు(45) ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలో సొంత భూమితోపాటు కొంత కౌలుకి తీసుకుని వ్యవసాయం చేశాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పులు తీర్చలేక కొంతకాలం హైదరాబాద్లో పనిచేశాడు. ఇటీవల తిరిగి వచ్చి కాకినాడలో కూలిపని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి యానాం బీచ్కు వెళ్లి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వరరావును యానాం పోలీసుల సహకారంతో కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. యానాం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతునికి భార్య నాగలక్ష్మి, వివాహమైన కుమార్తెలు శ్రీదేవి, జ్యోతిశ్రీ ఉన్నారు. వెంకటేశ్వరరావు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి ఆత్మహత్యఅల్లవరం: ఎంట్రుకోన పంచాయతీ పరిధిలో వాసర్లవారిపాలేనికి చెందిన వాసర్ల వెంకట సాయి సునంద్ (24) బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో ఫ్యాన్కు ఊరి వేసుకుని మృతి చెందాడు. ఫంక్షన్ నిమిత్తం వేరే ఊరు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే లోగా ఫ్యాన్కు వేలాడుతున్నాడని తండ్రి వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. కొన ఊపిరితో ఉన్న వెంకట సాయిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి వీర వెంకట సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై హరీష్కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహం స్వాధీనంపెరవలి: పెరవలి మండలం లంకమాలపల్లి గ్రామం వద్ద బ్యాంక్ కెనాల్లో ఒక మృతదేహాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నామని పెరవలి ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు మండలం పంగిడి గ్రామానికి ఆవుగడ్డ మల్లికార్జున(40)గా అతనిని గుర్తించామని చెప్పారు. కాలువలో మృతదేహం కొట్టుకుంటూ ఇక్కడకు వచ్చి తుప్పల్లో ఆగిపోయిందని చెడు వాసన రావటంతో గ్రామస్తులు పరిశీలించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వచ్చి మృతదేహాన్ని పైకి తీసి పోస్టుమార్టం కోసం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెంకటేశ్వరరావు తెలిపారు. బీరు బాటిళ్లతో దాడికి పాల్పడిన నలుగురి అరెస్టుకాకినాడ రూరల్: కాకినాడ అర్బన్ 3వ డివిజన్ పరిధిలోని గుడారిగుంటలో ఒక మద్యం దుకాణం వద్ద ఈ నెల 9న రాత్రి జరిగిన గొడవ హింసాత్మకంగా మారడంతో ఇద్దరు వ్యక్తులపై బీరు బాటిళ్లతో దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను సర్పవరం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి ఎస్సై పి.శ్రీనివాస్కుమార్ వివరాల ప్రకారం గుడారిగుంటలో మద్యం దుకాణం వద్దకు వీరు 9న రాత్రి 8గంటల సమయంలో వెళ్లారు. చిన్న విషయమై గొడవ పడి బీరు బాటిళ్లతో ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులు గుడారిగుంటకు చెందిన సీకోటి రాజు, పెయ్యల ప్రసాద్, సీకోటి ప్రసాద్, కలాడి అర్జునరావుపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. -
ప్రాణం తీస్తున్న వేగం
ప్రాణాలు పోతుంటే బాధేస్తోంది ఎంతో భవిష్యత్ ఉన్న కొందరు యువకులు రోడ్డు ప్రమాదాల్లో కేవలం అతివేగంతో ప్రాణాలు కోల్పోవడాన్ని చూస్తున్నప్పుడు బాధేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలపై, హెల్మెట్ ధారణపై, అతివేగం వద్దని, విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని పోలీస్ శాఖ యువతకు నిత్యం కౌన్సెలింగ్లు ఇస్తోంది. ముఖ్యంగా యానాం –ఎదుర్లంక వారిధిపై జరగుతున్న యువకుల రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేస్తున్నాం. యువకుల బైక్ల డ్రైవింగ్లపై ప్రత్యేక నిఘా పెట్టి, వారు అతివేగం తగ్గించేలా చర్యలు చేపడతాం. – టీఎస్ఆర్కే ప్రసాద్, డీఎస్పీ, అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ అమలాపురం టౌన్: చదువుకుని ఉద్యోగాలు సాధించి ఉన్నతమైన జీవితాన్ని చవిచూడక ముందే... తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలు నెరవేరకుండానే కొందరు యువకులు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని నిమిషాలు ఆలస్యమైనా గమ్యాన్ని చేరుకుంటాం, అతి వేగంతో జరగరానిది ఏదైనా జరిగితే మన వెనక ఉన్న కుటుంబం ఏమైయిపోతుందనే కనీస ఆలోచన, ముందుచూపు లేకుండా యువకులు రోడ్లపై రయ్ రయ్ మంటూ బైక్లను నడుపుతున్నారు. గత ఏడాది కాలంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అతి వేగంతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 34 మంది వరకూ యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెలలోనే ఉమ్మడి జిల్లాలో ఏడుగురు వరకూ రోడ్డు ప్రమాదాల్లో యువకులు మృత్యువాత పడ్డారు. ఐ.పోలవరం మండలం బాలయోగి వారధి (ఎదుర్లంక –యానాం వంతెన)పై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయంటే అతి వేగమే కారణం. మన జాగ్రత్తలో మనం ఉండి..ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే చాలా వరకూ రోడ్డు ప్రమాదాలు మన దరిచేరవు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో యువకులు రైడింగ్ మాదిరిగా బైక్ను అతివేగంగా నడపడం ఫ్యాషన్ అయిపోయింది. ఆధునాతన బైక్లను యమ స్పీడుగా నడుపుతూ మృత్యు కుహరాల్లోకి వెళుతున్నారు. యానాం –ద్రాక్షారామ రహదారిలో ఎకై ్సజ్ అధికారులు వెంబడించడంతో ఓ యువకుడు అతి వేగంతో వెళ్లి ఓ లారీని ఢీకొట్టి ప్రాణాలు విడిచాడు. పి.గన్నవరం మండల ఎల్.గన్నవరం శివారు జొన్నల్లంకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా చెప్పకుంటూ పోతే ఈ ఏడాదిలో అతివేగమనే అనర్థంతో అర్ధంతరంగా యువకులు ప్రాణాలు పొట్టన పెట్టుకున్న రోడ్డు ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. యువకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న సమయంలో వారు కనీసం హెల్మెట్ ధరించకపోవడం గమనార్హం. ప్రమాదాలకు కారణాలు అనేకం యువకులు రోడ్డు ప్రమాదాల్లో బలి అయిపోతున్న సంఘటనలకు కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. అతి వేగం ప్రధాన కారమవుతుంటే దానికితోడు బైక్లతో రైడింగ్లకు దిగడం, మద్యం సేవించడం, డ్రైవింగ్ లైసెన్స్లు లేకుండా వచ్చీ రానీ డ్రైవింగ్తో కొందరు యువకులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. యువకులను బైక్ల డ్రైవింగ్ పరంగా కంట్రోల్ చేయక పోవడంలో తల్లిదండ్రులు ప్రధాన కారకులవుతున్నారు. గొప్పల కోసం వెళ్లి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లోడికి ఖరీదైన, అధునాతన బైక్ కొనిచ్చామని ఆనందిస్తున్నారే తప్ప ఆ బైక్తో తమ బిడ్డ ఎన్ని తప్పిదాలు చేస్తున్నాడో ప్రాణాలు పోయాక గ్రహించి విలపిస్తున్నారు. డ్రైవింగ్లో నిష్ణాతులైన తర్వాతే బైక్ కొనిద్దామని ఆదిలోనే తల్లిదండ్రులు ఆలోచిస్తే ఇన్ని అనర్ధాలు జరవగవని పోలీసులు అంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా బైక్ డ్రైవింగ్పై తమ పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.పోలీసుల కౌన్సెలింగ్లను పెడచెవిన పెడుతున్న యువతజిల్లా పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ముఖ్యంగా అతి వేగంతో వెళుతున్న యువతను నిరోధించేందుకు అనేక కౌన్సెలింగ్లు ఇస్తోంది. అలాగే ప్రతీ పట్టణం, గ్రామాల్లో హెల్మెట్ ధారణ ఎంత విలువనైదో, ప్రాణాలను ఎలా కాపాడుతుందో వివరిస్తూ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సరికొత్త ట్రాఫిక్ రూల్స్, పెరిగిన జరిమానాలపై యువకులను రోడ్డు చెంతే పోలీసులు ఆపి కౌన్సెలింగ్ ఇస్తున్నా వారు వాటిని పెడచెవిని పెడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే ఆ కుటుంబం ఎంత తల్లడిల్లుతుందో, ఎంత క్షోభను అనుభవిస్తుందో జిల్లా పోలీసులు వీడియోలు, ఆడియోలు, ఫ్లెక్సీలు ఎన్నో విడుదల చేస్తున్నా అవి కూడా యువకుల చెవులెక్కడం లేదు. ట్రాఫిక్ రూల్స్ పాటించని నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను తీస్తోంది. ర్యాష్ రైడింగ్, డ్రైవింగ్లతో యువత కన్నవారికి కడుపు కోత బైక్లపై విపరీతమైన వేగంతో ప్రయాణం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ఘోర ప్రమాదాలు తొలి తప్పిదం తల్లిదండ్రులదే అంటున్న పోలీసులు -
ఘనంగా పండిత సదస్యం
మధురపూడి: కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మూడవరోజు బుధవారం సదస్యం నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారి కల్యాణ మండపంలో వేద పండితులు, ఉభయ వేదాంత పండితుల సమక్షంలో సదస్యం జరిగింది. ఉదయం గ్రామబలిహరణ, సాయంత్రం ఆరాధన, సర్వదర్శనములకు అనుమతి, సేవాకాలం జరిగింది. తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమంలో భాగంగా భక్తులకు బూరెలు అందజేశారు. రాత్రి శ్రీఆంజనేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పరాసర రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.ఆంజనేయ వాహనంపై లక్ష్మీ నరసింహుని గ్రామోత్సవం -
కంటిపూడి సుజుకి శాటిలైట్ డీలర్షిప్ ప్రారంభం
రావులపాలెం: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజమైన సుజుకి మోటార్ సైకిల్ అధీకృత డీలర్ కంటిపూడి సుజుకి నూతన శాటిలైట్ డీలర్ షిప్ను బుధవారం రావులపాలెంలో ప్రారంభించారు. కంటిపూడి సుజుకి షోరూమ్ అండ్ సర్వీస్ను సుజుకి సేల్స్ రీజినల్ మేనేజర్ శివరామకృష్ణ, కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠమనేని వినయ్బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠమనేని వినయ్బాబు మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి అత్యాధునిక ఆటోమేటిక్ పరికరాలు కలిగిన వర్క్షాప్ను రూపొందించినట్టు తెలిపారు. కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వారాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.జగన్, సీహెచ్ సత్యనారాయణమూర్తి (చినబాబు), కె.మన్మోహన్రామ్, సేల్స్ ఏఎం బాలకృష్ణ, సర్వీస్ ఏఎం సాయి, కంటిపూడి సుజుకి జీఎం రాజారావు, బ్రాంచ్ మేనేజర్ వంశీ, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పారదర్శకంగా పరీక్షల నిర్వహణ
రాజానగరం: పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల మంజూరు వంటి విషయాలలో పారదర్శకంగా ఉండాలని, ఎక్కడ తేడా వచ్చినా క్షమించేది లేదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ హెచ్చరించారు. యూనివర్సిటీలో యూజీ, పీజీ పరీక్షల విభాగాలను బుధవారం ఆమె నిశితంగా పరిశీలించారు. అనంతరం డీన్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో పరీక్ష విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న విధానం గురించి తెలుసుకుంటూనే ఆటోమేషన్ విధానాన్ని అమలు చేయడంపై ఆరా తీశారు. అనుబంధ కళాశాలలు ఎక్కువగా ఉన్నందున ఎక్కడా, ఎటువంటి సమస్య ఎదురుకాకుండా సమర్థంగా పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన చర్యే అయినా సమష్టిగా పనిచేస్తే ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడవచ్చన్నారు. డీన్ ఆచార్య డి.కల్యాణి, ప్రత్యేకాధికారి డాక్టర్ కె.దీప్తి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమారి, సిస్టమ్ మేనేజర్ జ్యోతి పాల్గొన్నారు.‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
నిమ్మకు తెగుళ్ల బెడద
పెరవలి: జిల్లాలో నిమ్మపంట 720 హెక్టార్లలో సాగు జరుగుతుండగా వివిధ రకాల తెగుళ్లు ఆశించి ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి, తోటలు పాడైపోతున్నాయి. ముఖ్యంగా ఈ పంటపై ఆకు ముడత, పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు, బంక, వేరుకుళ్లు, గజ్జి, మొజాయిక్ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు గురించి కొవ్వూరు ఉద్యాన అధికారి (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాస్ వివరించారు. ఆకుముడత : ఈ తెగులు ఎక్కువగా లేత చిగుర్లపై ఆశించి ఆకులపై తెల్లటి పొరలు వంకర టింకరగా ఏర్పడి ఆకులు ముడుచుకునేలా చేస్తుంది. తద్వారా ఆకులపై గజ్జి తెగులు ఎక్కువగా వ్యాప్తి చెంది ఆకులు రాలిపోతాయి. నివారణ చర్యలు : ఆకులు ముడతలు పడినట్లు గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండవసారి పిచికారీ చేయాలి. తెల్లపొలుసు పురుగులు : ఈ పొలుసు పురుగులు ఎక్కువగా కాండంపై ఆశించి సున్నం పూసినట్లుగా కనపడతాయి. ఇవి కాండం, కొమ్మలలో రసాన్ని పీల్చివేయటం వల్ల అవి ఎండిపోతాయి. నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించిన చోట గోనె సంచితో బాగా రుద్ది మిధైల్డెమటాన్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి కాండం, కొమ్మలపై పిచికారీ చేయాలి. నల్లి పురుగులు : నల్లి పురుగుల్లో ఆకుపచ్చ నల్లి, మంగు నల్లి ముఖ్యమైనవి. ఆకునల్లి ఆకులపైన, మంగునల్లి కాయలపైన ఆశించి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల కాయలపై చిన్న చిన్న తెల్లని మచ్చలు లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. నివారణ చర్యలు : నీటిలో కరిగే గంధకం 3గ్రాములు లేదా డైకోఫాల్ 5.0 మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. రసం పీల్చే రెక్కల పురుగులు : ఈ రెక్కల పురుగులు పండ్లపై రంథ్రాలు చేసి కాయలో ఉండే రసాన్ని పీల్చుతాయి. దీంతో కాయలకు చేసిన రంథ్రాల ద్వారా శిలీంద్రాలు, బ్యాక్టీరియా చేరి పండ్లు కుళ్లి, రాలిపోతాయి. పండ్లపై డాగు ఏర్పడుతుంది. నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించి కుళ్లి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. పురుగులను నాశనం చేయటానికి మలాథియాన్ ఒక మిల్లీలీటరు మందుకు ఒక శాతం పంచదార, పండ్ల రసం కలిపి చెట్ల కింద అమర్చాలి. పురుగులను ఆకర్షించటానికి బల్బులను ఏర్పాటు చేయాలి. దీని ద్వారా పురుగులను అరికట్టవచ్చు. పురుగుల నుంచి కాయలను రక్షించటానికి కాయలకు బుట్టలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బంక తెగులు : బంక తెగులు రెండు రకాలు ఒకటి ఫెటోఫ్తోరా, రెండు డిఫ్లోడియా. మొదటి తెగులు ఆశించిన చెట్టు నుంచి ధారాళంగా బంక కారుతుంది. ఇది చెట్టు వేళ్లకు, మొదలు కింది భాగానికి పరిమితమై ఉంటుంది. డిఫ్లోడియా బంక తెగులు చెట్టు మొదలు పైభాగాన కొమ్మల పంగల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు ఎక్కువగా ఉంటే బంక కారటం, బెరడు కుళ్లటం జరుగుతుంది. నీరు త్వరగా ఇంకని భూముల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. నివారణ చర్యలు : బంక కారి కుళ్లిన బెరడును పూర్తిగా తొలగించి బోర్డోపేస్టు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్టు పూయాలి. ఈ పేస్టును మొదలు చుట్టూ పూయాలి. కొమ్మలపై వచ్చే బంక తెగులు నివారణకు లీటరు నీటికి 1గ్రాము కార్బండజిమ్ కలిపి చెట్టు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మెటలాక్సిల్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి చెట్టు మొదలులో పోయాలి. వేరుకుళ్లు తెగులు : వేరుకుళ్లు తెగులు ఆశించిన చెట్టుకు పోషక పదార్థాలు అందక చెట్లు ఎండిపోతాయి. ఈ తెగులు ఆశించిన చెట్లు ఎక్కువ పూతపూసి కాయలు ముదిరే లోగా చెట్లు వాడి ఎండిపోతాయి. ఎండిన చెట్ల వేర్లను పరీక్షిస్తే కుళ్లిన వాసన వస్తుంది. నివారణ చర్యలు : వ్యాధి సోకిన తొలి దశలోనే గమనించి చెట్టుకు ఎక్కువగా నీరు కట్టి మరుసటి రోజు కార్బండజిమ్ 2 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా చెషంట్ 3 గ్రాములు లేదా ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి చెట్టు చుట్టూ నేల తడిసేలా పిచికారీ చేయాలి. చెట్టుకి కావలిసిన పోషక పదార్థాలు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట ద్వారా అందించాలి. ఒక కిలో ట్రైకోడెర్మా మందును 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేపపిండితో కలిపి 15 రోజులు మాగపెట్టి చెట్టు మొదలు చుట్టూ వేయాలి. ఇలా చేస్తే చెట్టును ఈ తెగులు నుంచి కాపాడవచ్చు. గజ్జి తెగులు (కాంకర్ మచ్చ) : నిమ్మ పంటపై ఎక్కుగా ఆశించే తెగులు ఈ గజ్జి తెగులు. ఇది కాయలు, ఆకులు, చిన్న, పెద్ద కొమ్మలను ఆశిస్తుంది. తెగులు ప్రభావం అధికంగా ఉంటే చెట్లు ఎండిపోయి చనిపోతాయి. నివారణ చర్యలు : ఈ తెగులు సోకి ఎండిన కొమ్మలను కత్తిరించి స్ట్రెప్టోసైక్లిన్ ఒక గ్రాము, 30 గ్రాములు బ్లైటాక్స్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. గజ్జి ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గోకి బెరడును తీసి వేసి బోర్డోపేస్టును పూయాలి. -
బెట్టింగ్ల మోజులో యువత
జీవితాలు బలైపోతాయని హెచ్చరిస్తున్న పోలీసులు రాజానగరం: అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పొందుతున్న విజ్ఞానాన్ని సమాజ హితం కోసం కాకుండా తప్పుడు మార్గాలలో సంపాదనలకు కొంతమంది స్వార్థపరులు ఉపయోగిస్తుంటే, వాటికి ఆకర్షితులై కొంతమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ బిడ్డలు ఉన్నతంగా ఉండాలి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయాలనే ఆశతో చాలామంది తల్లిదండ్రులు తమ కడుపులు మాడ్చుకుని, అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో దూర ప్రాంతాలలోని కళాశాలలలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు హాస్టల్స్లో ఉంటూ చదువులు సాగిస్తుంటారు. అయితే ఇటువంటి వారిలో కొంతమంది చెడు స్నేహాలతో కన్నవారి ఆశలను వమ్ము చేయడమే కాకుండా, తమ బంగారు జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. బ్రిడ్జి కౌంటీ కేంద్రంగా ... విద్యా, వ్యాపార రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరం సమీపంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు అనేక ఉండటంతో యాప్ల ద్వారా బెట్టింగ్లు నిర్వహించే వ్యక్తులు ఈ ప్రాంతాన్నే తమ కేంద్రంగా చేసుకుని, బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బ్రిడ్జి కౌంటీలో 12 మంది నిందితులు పట్టుబడ్డారు. చేపల చెరువుల ద్వారా ఆర్థికంగా నష్టపోయిన భీమవరానికి చెందిన దండు వెంకటవర్మ అనే సంతోష్ (31), కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్కు చెందిన ఇమ్మంది భరత్కుమార్ (34)తో కలిసి బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాను అద్దెకు తీసుకుని, కొన్ని నెలలుగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరినీ అడ్మిన్లుగా చేసుకుని, భీమవరం నుంచి దుబాయ్ వెళ్లిన వినీత్ అనే మరో వ్యక్తి కీ రోల్ పోషిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బ్రిడ్జి కౌంటీలో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి వాటి గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేసి, సహకరించాలని నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. తప్పుడు మార్గాలలో పయనించి, జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు ఆయన హితవు పలికారు. హాస్టల్స్లో ఉంచి చదివిస్తున్న తమ పిల్లల ప్రవర్తనలపై తల్లిదండ్రులు కూడా నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. క్రికెట్ బెట్టింగ్లే అధికం సమాచారం కోసం కనుగొన్న సెల్ఫోన్ నేడు అందరికీ జీవితంలో ఒక భాగమైపోయింది. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు సెల్ఫోన్ ముట్టుకోకుండా రోజుగడవడం లేదనడం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఇక విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో పేకాట, గుండాటల తరహాలోనే ఆన్లైన్లో అనేక రకాల యాప్లు హల్చల్ చేస్తున్నాయి. అనేక మంది వాటికి ఆకర్షితులవుతున్నారు. తెలిసీ తెలియని పరిజ్ఞానంతో వారి బ్యాంకు అకౌంట్ల వివరాలు అపరిచితులకు తెలియజేయడమే కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లను కూడా కొల్లగొట్టేందుకు తోడ్పడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అమాయకులు భయంతో బయటకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందోననే భయంతో జీవితాలను అర్ధంతరంగా ముగించుకునే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఇటువంటి వాటిలో క్రికెట్ బెట్టింగ్లే ఎక్కువగా ఉన్నాయి. బార్బర్ షాపులలో కూడా టీవీలను పెట్టుకుని, యాప్ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. వీటిని నిరోధించేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా, సరైన ఫలితాలు కనిపించడం లేదు.