East Godavari District News
-
సేకరించిన భూములు స్వాధీనం చేసుకోండి
ఫ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఫ రియల్ ఎస్టేట్ మాయలో రైతులు పడవద్దు అల్లవరం: కోటిపల్లి – నరసాపురం రైల్వేలైన్ నిర్మాణానికి 25 ఏళ్ల కిందట రైతుల నుంచి సేకరించిన భూమిని కలెక్టర్ స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. వైనతేయ నదిపై బోడసకుర్రు వద్ద నిర్మాణ దశలో ఉన్న రైల్వేలైన్ పనులను కోనసీమ రైల్వే సాధన సమితితో కలసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల క్రితం కోటిపల్లి నుంచి అమలాపురం వరకూ భూసేకరణ పూర్తి చేసి 80 శాతం పరిహారాన్ని రైల్వే బోర్డు ఇచ్చి రైతుల నుంచి భూ రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు బాగా పెరిగాయని అప్పట్లో ఇచ్చిన పరిహారం సరిపోదని కొంత మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారని పలు దినపత్రికల్లో వచ్చిందని ఎమ్మెల్సీ అన్నారు. రైల్వే చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించిన తర్వాత కోర్టును ఆశ్రయించి పనులు నిలుపుదల చేయడం సాధ్యం కాదన్నారు. అమలాపురానికి చెందిన కొంత మంది రియల్ ఎస్టేట్దారులు విశ్రాంతి రెవెన్యూ అధికారుల సహకారంతో కోర్టుల ద్వారా పనులను అడ్డుకుంటున్నారని తెలిపారు. వీరి మాయలో రైతులు పడవద్దని హితవు పలికారు. ఇప్పటికే అన్ని నదుల ఫిల్లర్లు పూర్తి చేసుకుని ట్రాక్ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. రైల్వే బోర్డుకు భూములు ఇచ్చిన రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. కోనసీమ రైల్వే సాధన సమితి సభ్యులు కల్వకొలను తాతాజీ మాట్లాడుతూ కోనసీమ ప్రజల చిరకాల కోరిక తీరనున్న తరుణంలో హైకోర్టుని ఆశ్రయించి స్టే తేవడం దురదృష్టకరమన్నారు. కోనసీమ రైల్వేలైన్ కోసం ఇరవై ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. గతంలో భూమికి పరిహారం పొందుతూ నేటికి ఆ భూముల్లో పంటలు పండించుకుంటూ ఆదాయం పొందుతున్నారని, ఇటీవల కాలంలో భూమి రెట్లు పెరిగాయని, ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలని అడగడం భావ్యం కాదన్నారు. రైల్వే లైన్పై కోర్డుకు వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కోనసీమకు రైలును తీసుకొస్తానని, బాలయోగి చిరకాల కోరికను తాను తీరుస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్మాధుర్ చెప్పారని అన్నారు. ఇలాంటి తరుణంలో అడ్డంకులు రావడం చాలా బాధాకరమని, కోనసీమ రైలు వచ్చేంత వరకు జిల్లా ప్రజలు కృషి చేయాలని తాతాజీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోనసీమ సాధన సమితి కన్వీనర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, సభ్యులు పోలిశెట్టి శివాజీ, ఉప్పుగంటి భాస్కరరావు, బాబీ గాబ్రియేల్ పాల్గొన్నారు. -
ఉత్కంఠగా ఆలిండియా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్, స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ పురుషులు, మహిళల పోటీలు శుక్రవారం ఉల్లాసంగా జరిగాయి. శుక్రవారం నిర్వహించిన మ్యాచ్లను చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రవి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మహిళల విభాగంలో రాజస్థాన్ సెక్టార్, ఏపీ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో ఏపీ సెక్టార్ 15–0 స్కోర్తో, సెంట్రల్ సెక్టార్, కేరళా సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో సెంట్రల్ సెక్టార్ 5–0 స్కోర్తో, ఛత్తీస్ఘడ్ సెక్టార్, మధ్యప్రదేశ్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో ఛత్తీస్ఘడ్ 22–0 స్కోర్తో విజయం సాధించాయి. పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్ సెక్టార్, మహారాష్ట్ర సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర సెక్టార్ 6–2 స్కోర్తో, ఆర్బీఎస్ కాన్పూర్, ఆర్బీఎస్ జైపూర్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్బీఎస్ కాన్ఫూర్ 4–2 స్కోర్తో గెలుపొందాయి. ఛత్తీస్ఘడ్ సెక్టార్, ఉత్తర్ప్రదేశ్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో ఛత్తీస్ఘడ్ 5–0 స్కోర్తో విజయం సాధించాయి. అలరించిన క్యాంప్ ఫైర్ ఆలిండియా హాకీ పోటీల సందర్భంగా శుక్రవారం రాత్రి క్రీడా మైదానంలో క్యాంప్ ఫైర్ నిర్వహించారు. ఈ క్యాంప్ ఫైర్ను కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ఎస్పీ బిందుమాధవ్ ప్రారంభించారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఆయా రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఉల్లాసంగా, సంతోషంగా గడిపారు. ఈ క్యాంప్ ఫైర్లో డీఆర్వో వెంకట్రావు, ఆర్డీఓ మల్లిబాబు, డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కనులకు అందం.. కవలల బంధం
ఫ రూపం ఒకటే.... శరీరాలు రెండు ఫ నేడు ప్రపంచ కవలల దినోత్సవం బిక్కవోలు/ కరప: సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు.. అలాంటి ఏడుగురు మనకు కనిపిస్తారో లేదో తెలియదు కానీ మన చుట్టుపక్కల కవలలను చూస్తే నిజమేనని అనిపిస్తుంది. రూపం ఒకటే.. శరీరాలు రెండుగా ఉండే వీరిని చూస్తే ఆశ్చర్యం కలగదు మానదు. మా పేరేంటో చెప్పుకోండని వారు చిలిపిగా అడిగే ప్రశ్నకు రోజూ చూస్తున్న వారే తికమక పడుతుండడం చూస్తుంటాం.. అశ్వినీ దేవతలు, లవకుశలు కవలలని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. ఒకే రూపంలో ఉండే కవలలంటే ఇష్టపడని హృదయం ఉండదు. గతంలో ఎక్కడో కనిపించే కవలలు నేడు ఎక్కడికక్కడే దర్శనమిస్తున్నారు. అలాంటి కవలల దినోత్సవాన్ని జరుపుకోవడానికి వారు ఉత్సుకత చూపుతున్నారు. 1919లో పోలెండ్ దేశం బర్గ్ పట్టణంలో మోజేష్, ఆరెన్ విల్కార్స్ అనే కవలలు జన్మించారు. ఆడుతూ పాడుతూ జీవిస్తున్న వీరు ఒకే సమయంలో ఒకే రకమైన వ్యాధి సోకి మృతి చెందారు. ఆ దేశఽ నేతలు వారికి గుర్తుగా ఆ పట్టణాన్ని ట్విన్స్ బర్గ్తో పిలిచారు. అనంతరం 1976 ఫిబ్రవరి 22న ప్రపంచ కవలల దినోత్సవం నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా జరుపుకొంటున్నారు.. ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉండే కవలల గురించి తెలుసుకుందాం రండి.. చదువులో తప్ప.. అక్షత, ఆస్రితలు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. వీరి చదువులో తప్ప మిగతా అన్నింట్లో ఒకే అభిరుచి కలిగి ఉంటున్నారు. అక్షత చదువులో మరింత బాగా చదువుతుంది. వారు తినే ఆహారం నుంచి వేషధారణ వరకూ ఇద్దరూ ఒకే రకంగా ఇష్టపడుతున్నారు. –ఆకే అక్షత, ఆస్రిత, పందలపాక అందుకే పెద్దోడినయ్యా.. మా ఇద్దరం కేవలం 20 నిమిషాల వ్యవధిలో జన్మించారు. అందువల్ల నేను అన్నయ్యను అయిపోయాను. పేరుకే అన్నయ్యను. కానీ తను ప్రతి విషయంలో నా కంటే ముందుగా ఆలోచిస్తుంది. నాకు అక్కలా సలహాలు ఇస్తుంది. మా ఇద్దరి ఆలోచనలు, అభిరుచి ఒకేలా ఉంటాయి. –తరుణ్ శ్రీతేజ్, తనుజశ్రీ పల్లవి, జి.మామిడాడ ఎప్పుడూ కలిసే ఉంటాం.. ఆహారం విషయాల్లో మా ఇద్దరి ఆలోచన ఒకేలా ఉండదు. మిగతా విషయాల్లో ఒకేలా అనుకుంటాం. చదువుతో పాటు అన్ని విషయాలు తల్లిదండ్రులు కోరిక మేరకే చేస్తుంటాం. ఎప్పుడూ కలిసే ఉంటాం. –దొంతంశెట్టి త్రిపుర, తేజశ్రీ, కొంకుదురు సావరం తికమక పడుతుంటారు.. మా ఇద్దరినీ చూసి అందరూ తికమక పడుతుంటారు. గురజనాపల్లిలోని పబ్బినీడి పాపారావు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాం. మా రూపం, చేష్టలు ఒకేలా ఉండడంతో మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో ఇష్టంగా చూస్తున్నారు. –పంపన దేవి, పంపన లక్ష్మి, డవిపూడి, కరప మండలం -
మూడు మట్టి లారీల సీజ్
రావులపాలెం: ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న మూడు లారీలను రావులపాలెం మండల స్థాయి టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవారం రాత్రి సీజ్ చేశారు. తహసీల్దార్ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో అక్రమంగా, అనుమతులు లేకుండా బొండు మట్టిని తరలిస్తున్న మూడు లారీలను స్థానిక ఊబలంక, రావులపాలెం రోడ్డులో తనిఖీల్లో పట్టుకున్నారు. ఒక్కో లారీకి రూ.15 వేల చొప్పున మొత్తం రూ. 45 వేలు జరిమానా విధించినట్లు తహసీల్దార్ తెలిపారు. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
No Headline
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
చోరీ కేసులో ముగ్గురికి ఏడాది జైలు
కాకినాడ లీగల్: ఇంట్లోకి ప్రవేశించి మహిళ నోటిలో రుమాలు కుక్కి బీరువాలోని రూ.8 లక్షలు, వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేసిన ముగ్గురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కాకినాడ ఐదో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ షరీన్ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన మల్లాడి దుర్గాప్రసాద్, కాకినాడ ఏటిమొగ ప్రాంతానికి చెందిన డొక్కాడి మహేష్, పేసింగి ప్రసాద్ కలసి 2023 ఏప్రిల్ 30న కాకినాడ రూరల్, ఇంద్రపాలెం మార్కెట్ సమీపంలో ఉంటున్న వెదుళ్లపల్లి సుధారాణి ఇంట్లోకి రాత్రి 8 గంటల సమయంలో వెళ్లి ఆమెను నోటిలో రుమాలు కుక్కారు. బీరువాలో ఉన్న రూ.8 లక్షలు, వెండి, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. దీంతో సుధారాణి ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నిందితుల నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఏడాది జైలు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
కామనగరువులో రోడ్డు ప్రమాదం
ఒకరి మృతి, మరొకరి గాయాలు అమలాపురం రూరల్: కామనగరువులో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తిని స్థానికులు రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేట మండలం ఆర్లపల్లి గ్రామం కండ్రిగపాలేనికి చెందిన తాపీమేస్త్రి గోలకోటి రమేష్ (45), మోడేకుర్రు గొలకోటివారిపాలేనికి చెందిన గునిశెట్టి సోమసుందర్ శేఖర్లు తోడల్లుళ్లు. ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్ పై రాజోలు మండలం తాటిపాకకు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు. పెళ్లి తెల్లవారుజామున కావడంతో భోజనం చేసిన ఇద్దరూ మోటార్ సైకిల్ పై అత్తారిల్లు ఉప్పలగుప్తం మండలం చీకట్లవారిపాలేనికి బయలుదేరారు. కామనగరువు వద్దకు వచ్చేసరికి పంట బోదెకు రక్షణ గోడ లేకపోవడంతో అదుపుతప్పి సరాసరి మోటార్ సైకిల్తో సహా బోదెలోకి వెళ్లిపోయారు. అర్ధరాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. కానీ కుక్కలు పదేపదే అరవడంతో దొంగల బెడద కారణంగా ఆ పక్కనే ఉన్న రాజులపూడి భాస్కరరావు కుటుంబ సభ్యులు లేచారు. పంట బోదె వద్దే కుక్కలు అరవడంతో అక్కడకు వెళ/్ల చూసేసరికి మోటార్ సైకిల్, ఇద్దరు బోదెలో పడిపోయి ఉన్నారు. వెంటనే స్పందించి 108కు, పోలీసులకు సమాచారం అందించారు. గొలకోటి రమేష్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న సోమసుందర్ శేఖర్ను స్థానికులు బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. శేఖర్ను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పంట బోదెకు కల్వర్టు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదంటూ మండి పడుతున్నారు. మృతుని సోదరుడు గొలకోటి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. వ్యక్తి అదృశ్యం అంబాజీపేట: మాచవరం శివారు పోతాయిలంకకు చెందిన ఓ వ్యక్తి అదృశ్యంపై అంబాజీపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మట్టపర్తి వెంకటేశ్వరరావు ఈ నెల 18 నుంచి కనిపించడం లేదు. వెంకటేశ్వరరావు ఇంటి నుంచి వెళ్లే సమయంలో గులాచీ కలర్ షర్టు, నేవీ బ్లూ ఫ్యాంటును ధరించి 5 అడుగుల ఎత్తు ఉంటాడన్నారు. వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీరామమూర్తి దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.చిరంజీవి తెలిపారు. -
తీరు మారలేదు..!
అన్నవరం: అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సత్యదేవుని నిత్య కల్యాణం సుమారు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఎల్ఐసీ సంస్థకు చెందిన కొంతమంది భక్తులు నిత్య కల్యాణ మండపంలో వ్రతాలాచరించడంతో ఈ కార్యక్రమం ఆలస్యమైంది. వాస్తవానికి కార్తిక మాసంలోనూ స్వామివారి నిత్య కల్యాణ మండపంలో వ్రతాలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో కల్యాణ భక్తులకు ఇబ్బంది లేకుండా పాత కల్యాణ మండపంలో యథావిధిగా కల్యాణం చేస్తుంటారు. అయితే శుక్రవారం అటువంటి ఏర్పాట్లు చేయలేదు. ముందుగా ప్రకటించలేదు. సత్యదేవుని నిత్యకల్యాణం ఆచరించే భక్తులు ఉపవాసంతో ఉంటారు. ఉదయం 9–30 కి నిత్యకల్యాణం ప్రారంభించి 11 గంటలకల్లా పూర్తి చేస్తారు. అటువంటిది నిత్యకల్యాణ మండపంలో వ్రతాలు నిర్వహించినందున శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కల్యాణం ప్రారంభించి, మధ్యాహ్నం 12–20 గంటలకు పూర్తి చేశారు. కల్యాణం ఆచరించేందుకు టిక్కెట్లు తీసుకున్న భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వారు కల్యాణం అయ్యాక సత్యదేవుని దర్శనానికి ఆలయానికి వెళ్లగా మధ్యాహ్నం నివేదన కారణంగా ఆలయ తలుపులు అరగంట మూసేశారు. ఒంటి గంటకు ఆలయ తలుపులు తీశాక స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేటప్పటికీ మధ్యాహ్నం 1–30 గంటలు అయ్యింది. కల్యాణం ఆలస్యం కావడానికి గల కారణాలపై సంబంధిత విభాగ అధికారులను వివరణ కోరతానని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు అన్నారు. ఎల్ఐసీ వారు నిత్యకల్యాణ మండపంలో వ్రతాలాచరించడానికి పర్మిషన్ అడిగితే ఇచ్చామన్నారు. ఫ గంట ఆలస్యంగా సత్యదేవుని నిత్య కల్యాణం ఫ అధికారులను వివరణ కోరతానన్న ఈఓ -
ముద్దాయికి పదేళ్ల జైలు శిక్ష
ఐ.పోలవరం: ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి శారీరకంగా మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. ఐదు వేల జరిమానాను రాజమహేంద్రవరం 8వ కోర్టు కం క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్కుమార్ కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామానికి చెందిన బాధితురాలు 2019 నుంచి గ్రామంలో వలంటీరుగా పనిచేశారు. అదే సచివాలయంలో తాళ్లరేవు మండలం చిన గోవలంక గ్రామానికి చెందిన కాశి మధుబాబు వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేశారు. కాశి మధుబాబు బాధితురాలిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకొంటానని నమ్మబలికి మోసం చేశాడు. దీనిపై 2022 డిసెంబర్ 13న ఐ.పోలవరం పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై రాజమహేంద్రవరం ఉమెన్స్ కోర్టులో వాదనల అనంతరం జడ్జి వై.బెన్నయ్య నాయుడు పైవిధంగా తీర్పు చెప్పారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాలీ
ముగ్గురికి తీవ్ర గాయాలు సీతానగరం: మండలంలోని వంగలపూడిలో ఏటిగట్టు పైనుంచి భారీ ట్రాలీ ఇంట్లోకి దూసుకు వెళ్లడంతో నిద్రిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్తున్న ఖాళీగా భారీ ట్రాలీ గురువారం అర్ధరాత్రి 2.30 (తెల్లవారితే శుక్రవారం) గంటలకు వంగలపూడి ఏటిగట్టుపై నుంచి నేరుగా గట్టు ఆనుకుని ఉన్న చిట్రోతు వెంకటేశ్వరరావు తాటాకు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లో నిద్రిస్తున్న చిట్రోతు వెంకటేశ్వరరావు, అతని కుమార్తె దుర్గ, ఇద్దరు మనుమరాళ్లపై మట్టి గోడలు విరిగిపడ్డాయి. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. మట్టిగోడల కింద ఉండి కేకలు వేస్తున్న నలుగురిని బయటకు తీసి కాపాడారు. అప్పటికే వెంకటేశ్వరరావు, కుమార్తె దుర్గ, మనుమరాలు పావనిలకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై డి.రామ్కుమార్ పరిశీలించారు. -
పాఠశాలలో ఐఎఫ్పీ చోరీ
రామచంద్రపురం రూరల్: తాళ్లపొలం ఎంపీయూపీ పాఠశాల నుంచి రూ.లక్షకు పైగా విలువైన ఐఎఫ్పీ(ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్) చోరీకి గురైంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీనిని సమకూర్చింది. పది రోజుల క్రితం ఈ ప్యానల్ను దొంగిలించేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. కటకటాల్లో టీవీ ఇరుక్కుపోవడంతో వదిలి వెళ్లిపోయారు. గతేడాది ఇదే పాఠశాలలో రెండు సిలిండర్లు చోరీకి గురయ్యాయి. అప్పట్లో ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా దొంగలు ఈ ప్యానల్ను అపహరించారు. హెచ్ఎం బొలిశెట్టి లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ తెలిపారు. అమలాపురం క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
విద్యుత్ తీగ తెగిపడి తాటాకిళ్లు దగ్ధం తుని రూరల్: తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో విద్యుత్ సర్వీస్ తీగలు తెగిపడడంతో మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పెద్దాడ నూకరాజు, కాకాడ నాగలక్ష్మి, బత్తిన శ్రీరామ్మూర్తి ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం తెలియడంతో తుని నుంచి అగ్నిమాపక శకటం సంఘటనా స్థలానికి చేరుకుని సమీప ఇళ్లకు మంటలు వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. నూకరాజు, నాగలక్ష్మి, శ్రీరామ్మూర్తి కుటుంబాలు వేర్వేరు పనులకు వెళ్లిన తర్వాత విద్యుత్ లైను నుంచి ఇంటికి సరఫరా అయ్యే సర్వీసు తీగలు తెగిపడడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు అగ్నిమాపక అధికారి కె.రాముడు తెలిపారు. సుమారు రూ.రెండు లక్షల ఆస్తినష్టం జరిగినట్టు వివరించారు. రూ.లక్ష నగదు, బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం పూర్తిగా కాలి బూడిదైందని నూకరాజు కుటుంబ సభ్యులు వాపోయారు. బాధితులకు న్యాయం చేస్తామని, ఆర్థిక సాయం కోసం కలెక్టర్కు నివేదిక పంపిస్తామని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. -
జన గణనతో పాటే కుల గణన
కాకినాడ రూరల్: జాతీయ స్థాయిలో ఈసారి జరిపే జన గణనతో పాటే కుల గణన జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. కాకినాడలో నాగమల్లితోట జంక్షన్ వద్ద శుక్రవారం నిర్వహించిన బీసీ సంఘ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కుల గణన చేపట్టాల్సిన ప్రాధాన్యతను కేంద్రానికి తెలిసేలా ఉద్యమాలు, కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. చట్ట సభలో బీసీలకు సరైన రిజర్వేషన్లు కల్పించాలన్నా, జస్టిస్ రోహిణి కమిషన్ సిఫారసుల మేరకు ఓబీసీల వర్గీకరణ జరపాలన్నా, మండల కమిషన్ సిఫారసులను సంపూర్ణంగా అమలు పరచాలన్నా బీసీ కుల గణన జరపవల్సి ఉందన్నారు. అనంతరం జిల్లా నూతన వర్గానికి నియామకపు పత్రాలు అందించారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా గుత్తుల రమణ నియమితులవ్వడంతో ఆయనతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులకు నియామకపు పత్రాలు అందించారు. త్వరలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అవగాహన ర్యాలీ ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు -
మహాశివరాత్రి ఉత్సవాలపై సమీక్ష
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పక్కాగా నిర్వహించి, సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ జిల్లాలోని అన్ని ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, డిఆర్ఓ టి.సీతారామమూర్తి, దేవదాయ, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ , మత్స్యశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నగరంలో, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వున్న శైవక్షేత్రాల్లో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు హాజరవుతారన్నారు. వారందరికీ ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సీతానగరం మండలం వంగలపూడి నుంచి పట్టిసీమ వీరభద్రస్వామి దేవస్థానం, కొవ్వూరు గోష్పాద ఘాట్, రాజమహేంద్రవరం నగరంలో పుష్కర ఘాట్, మార్కండేయస్వామి దేవస్థానం ఘాట్, కోటిలింగాల ఘాట్కు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చెయ్యాలన్నారు. పట్టిసీమలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు, దర్శన సమాచారాన్ని అందించే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చెయ్యాలన్నారు. అదే విధంగా జిల్లాలోని అన్ని శైవక్షేత్రాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఘాట్లో అవసరమైన బోట్లతో పాటు గజ ఈతగాళ్ళను , పోలీసు సిబ్బందిని ఏర్పాటు చెయ్యాలన్నారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలోని శివాలయాల వద్ద, ప్రాంతాల్లో శానిటేషన్ పనులు చేయాలన్నారు. అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్కు, అందుబాటులో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా శైవక్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు రానున్న సందర్భంగా ప్రతి చోటా మహిళలకు ఇబ్బంది లేకుండా పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవగాహనతో పాటు నియమాలు పాటించే చొరవ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన తొలి గంట గోల్డెన్ అవర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు అధ్యక్షతన జరిగింది. జేసీ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్త్రతంగా నిర్వహించాలన్నారు. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో 27 జాతీయ, 6 రాష్ట్ర, 2 ఇతర రహదారులలో మొత్తం 35 బ్లాక్ స్పాట్స్లో గుర్తించామని, ఆయా ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగాయన్నారు. రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడానికి కావలసిన జాగ్రత్తలు పాటించాలన్నారు. బ్లాక్ స్పాట్లలో లైటింగ్, సైన్ బోర్డ్, బ్లింకర్స్ సిగ్నల్ , జీబ్రా లైన్న్స్ , స్పీడ్ బ్రేకర్ లాంటివి ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే చోట ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలపాలని, సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారుల్లో కొన్ని ప్రదేశాల్లో ప్లాంటేషన్, లైటింగ్ చేపట్టాలన్నారు. మోటార్ వాహనాల చట్టం పరిధిలో 2023 ఏడాదిలో 11,849 కేసులు నమోదు చేసి, రూ.10,32,72,000 జరిమానా విధించామని తెలిపారు. 2024లో 4,204 కేసులు నమోదు చేసి రూ.8,82,41,000 జరిమానా విధించామన్నారు. కోర్టు ఆధ్వర్యంలో 2023లో 45 కేసులకు రూ.67,500, 2024 లో 15 కేసులకు రూ.20 వేల అపరాధ రుసుం విధించినట్టు తెలిపారు. ప్రమాదం జరిగిన వ్యక్తిని గంటలోపు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తే విలువైన ప్రాణాలు దక్కుతాయని తెలిపారు. నేషనల్ హైవే హెల్ప్ లైన్ (ఎమర్జన్సీ) నంబర్ 1033 పై విస్త్రతంగా అవగాహన కల్పించాలన్నారు. జాతీయ రహదారులపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. బ్లాక్ స్పాట్లలో లైటింగ్, సైన్ బోర్డ్, బ్లింకర్స్ ఏర్పాటుకు చర్యలు ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగించాలి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం శుక్రవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిట లాడింది. రత్నగిరిపై గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవదంపతులు కూడా వారి బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి విచ్చేశారు. వీరంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో నవ దంపతులు, వారి బంధుమిత్రులు, పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులతో స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మంటపాలు, క్యూ లు నిండిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. తల్లి ప్రోత్సాహంతోనే ఐపీఎస్ ట్రైనీ అసిస్టెంట్ ఎస్పీ సుస్మిత కాకినాడ రూరల్: తల్లి ప్రోత్సాహంతో తాను ఐపీఎస్గాను, సోదరిణి ఐఏఎస్గా ఎంపికయ్యామని 2023 ఏపీ కేడర్ ఐపీఎస్గా ఎంపికై న తమిళనాడుకు చెందిన ఆర్.సుస్మిత తెలిపారు. అసిస్టెంట్ ఎస్పీగా జిల్లాలో ట్రైనీలో ఉన్న ఆమె శుక్రవారం కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని తిమ్మాపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ) బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులోని కడలూరుకు చెందిన తమది వ్యవసాయ కుటుంబమన్నారు. తండ్రి వ్యవసాయం చేస్తారని, తల్లి ఎడ్యూకేషన్ డిపార్టుమెంట్లో నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నారన్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడని, అక్కా, తాను ఐఏఎస్, ఐపీఎస్గా ఎంపికయ్యామన్నారు. తల్లి ప్రోత్సాహంతో తాను ఆరుసార్లు ప్రయత్నంతో ఐపీఎస్ సాధించానన్నారు. ఎస్హెచ్ఓగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువు ఆవశ్యత తెలియజేయడంతో పాటు గుడ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు గురించి అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. తిమ్మాపురం స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు గంజాయి నిర్మూలనపై దృష్టి పెడతామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ఆర్టీఐ నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా నంబరు ప్లేట్లపై దృష్టి పెడతామన్నారు. హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తామన్నారు. -
సాంకేతికత సాయంతో పరీక్షలు
‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ రాజానగరం: పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సకాలంలో ఫలితాలను వెల్లడించేందుకు ప్రయత్నం చేద్దామని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య ప్రసన్నశ్రీని గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాల్స్ శుక్రవారం కలుసుకుని, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో 390 వరకు అనుబంధ కళాశాలలు ఉన్నాయన్నారు. సుమారు ఒక లక్ష మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. అన్ని కళాశాలల్లోనూ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కెమెరా మోనటరింగ్ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నామన్నారు. ఈ విధానాన్ని యూనివర్సిటీ నుంచి పర్యవేక్షిస్తారన్నారు. మారుమూల ఉన్న పరీక్షా కేంద్రాలను సందర్శించేందుకు సమయంతోపాటు ఖర్చు ఆదా అవుతుందన్నారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలనే యూనివర్సిటీ సంకల్పానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కళాశాలలో ప్రెషర్స్ డేలు, డీజేలు, నృత్య ప్రదర్శనలను మానుకొని, సంప్రదాయానికి ప్రాధాన్యతినిచ్చేలా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. రిజిస్టార్ ఆచార్య జి. సుధాకర్, డీన్లు ఆచార్య కేఎస్ రమేష్, డాక్టర్ డి.కల్యాణి, అనుబంధ కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. -
23న ఆర్బీసీ సీజన్ 2 హేవ్ లాక్షో
రాజమహేంద్రవరం సిటీ: బౌ.. వావ్ పెట్ షాపీ, స్పా సమర్పణలో ఈ రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో ఈ నెల 23 న రాజమండ్రి బ్రీడ్ చాంపియన్ షిప్ సీజన్ 2 హేవ్ లాక్ షో (డాగ్, కేట్ షో) నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తరుణ్ కలిం తెలిపారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 23 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుంచి షో జరుగుతుందని తెలిపారు. రాజమండ్రి బ్రీడ్ చాంపియన్ షిప్ సీజన్ 1కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని సీజన్ 2 మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు వారధిగా హేవ్ లాక్ బ్రిడ్జి నిలిచిందని, తాము నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాలకు వారధిగా నిలవాలని హేవ్ లాక్ షోగా నామకరణం చేశామన్నారు. ఈ షోలో 50 రకాల డాగ్స్, కేట్ బ్రీడ్లు పాల్గొంటాయన్నారు. సీజన్ 1 లో ఏపీ, తెలంగాణ, ఒడిశాల నుంచి బ్రీడ్లు పాల్గొన్నాయని, సీజన్ 2 కి కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా బ్రీడ్లు హాజరు అవుతాయన్నారు. చాంపియన్గా నిలిచిన డాగ్కు రూ.50 వేలు బహుమతి అందజేస్తామన్నారు. మన రాష్ట్ర బ్రీడ్ అయిన కొల్లేటి జాగిలం విశిష్టత తెలియజేసే విధంగా కొల్లేటి జాగిలం డాగ్ ప్రత్యేక షో జరుగుతుందన్నారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ కెన్నిల్ క్లబ్ కార్యదర్శి, కెన్నల్ క్లబ్ ఆప్ ఇండియా సభ్యులు విశాల్ సుదాన్, జడ్జిలుగా ప్రొఫెషనల్ ట్రైనర్లు టి.సతీష్గౌడ, జి.దినేష్గౌడలు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా షో పోస్టర్ను విడుదల చేశారు. విలేకర్ల సమావేశంలో శ్రీను, నాగేంద్ర, నాని, దీపక్, అఖిల్, బాజీ పాల్గొన్నారు. -
ఆక్వాకు విద్యుత్ షాక్
సాక్షి, అమలాపురం/ ఉప్పలగుప్తం: ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం కోలుకోలేని విధంగా షాక్ ఇచ్చింది. రాయితీ విద్యుత్ ఇస్తున్నామంటూ ఒకవైపు గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం.. మరోవైపు అదనపు విద్యుత్ వినియోగానికి అపరాధ రుసుం.. కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వేసుకోవాలని మోయలేని భారం మోపుతోంది. విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తోంది. దీనితో రొయ్యలు, చేపలు చనిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తమ చెరువుల్లో రూప్చందువా మృత్యువాత పడిందని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన రైతులతోపాటు చుట్టుపక్కల రైతులు శుక్రవారం రాత్రి విద్యుత్ సబ్ స్టేషన్ను ముట్టడించారు. చనిపోయిన చేపలను పెద్ద ఎత్తున తీసుకువచ్చి కార్యాలయం ఎదుట వేసి నిరసన తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చేపలు చనిపోయాయని వారు ఆరోపించారు. విద్యుత్ శాఖ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెరువుల్లో చేపలను పెద్ద సంఖ్యలో సాగు చేస్తున్నామని, ఏరియేటర్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నామని వారు తెలిపారు. సరఫరా నిలిచిపోవడంతో చెరువులో డెడ్ ఆక్సిజన్ (డీవో) ఏర్పడి చేపలు చనిపోయాయని వారు వాపోయారు. తాము 18 ఎకరాల్లో సాగు చేస్తున్నామని, అధికారుల తీరుతో రూ.20 లక్షల వరకూ నష్టపోయామని ఆరోపించారు. రైతులు వస్తున్న సమాచారం తెలుసుకుని విద్యుత్ శాఖ సిబ్బంది కార్యాలయం వదిలి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేకు సఖినేటిపల్లి రైతుల మొర రాజోలు దీవిలో సఖినేటిపల్లి మండలం అంతర్వేది, గొందికి చెందిన రైతులు సైతం విద్యుత్ సరఫరా నిలుపుదలపై మండిపడుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వద్దకు సుమారు 200 మంది రైతులు వెళ్లి వినతిప్రతం అందజేశారు. అదనపు వినియోగం, పాత బకాయిల పేరుతో ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ‘సీఎండీ ఆర్డర్లు అంటూ మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలా రైతుల నడ్డివిరిచే చర్యలు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ప్రభుత్వం ఏదైనా ప్రయోజనం చేకూర్చే పనులు చేయాలని’ అని సొంత పార్టీ ఎమ్మెల్యే వద్ద ఆ పార్టీ అనుకూల ఆక్వా రైతులు వాపోవడం విశేషం. ప్రస్తుతం ఆక్వా ధరలు బాగున్నాయని, చెరువుల్లో పెద్ద ఎత్తున రొయ్యల పిల్లలు వదిలామని, ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఏరియేటర్లు పనిచేయక చేపలు చనిపోయే ప్రమాదముందని వాపోయారు. రూ.13.62 లక్షలకు నోటీసులు జిల్లాలో కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి తీర ప్రాంత గ్రామాల్లో వెనామీ, చేపల సాగు అధికం. ఇందులో రొయ్యల చెరువుకు ప్రభుత్వం రాయితీ విద్యుత్ అందిస్తోంది. కానీ అదనపు వినియోగం పేరుతో ఇటీవల భారీగా బిల్లులు భారం మోపుతున్నారు. అమలాపురం మండలం సవరప్పాలేనికి చెందిన ఒక రైతుకు అదనపు విద్యుత్ వినియోగం పేరుతో ఒక సర్వీసుకు రూ.60 వేలు, మరో సర్వీసుకు రూ.25 వేల బిల్లు పంపించారు. ఇప్పుడు ఈ రెండు సర్వీసులకు సంబంధించి చెరువుల వద్ద రెండు ట్రాన్మ్ఫార్మర్లు వేయాలని తాజాగా నోటీసులు పంపారు. ఇందుకు ఒక్కదానికి రూ.6,95,900 లక్షలు, మరోదానికి రూ.6,66,981 చొప్పున మొత్తం రూ. 13,62,881 చెల్లించి కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేయించుకోవాలని చెప్పారు. వెంటనే స్పందించనందున విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. ఇదే పరిస్థితి జిల్లాలో పలుచోట్ల ఉంది. ఫ ఇప్పటికే అదనపు లోడ్ పేరుతో వాతలు ఫ చెప్పా పెట్టకుండా కరెంట్ కట్ ఫ ఉప్పలగుప్తం సబ్ స్టేషన్ వద్ద చనిపోయిన చేపలు వదిలి నిరసన -
దేచెర్లలో ఎర్రమట్టి దొంగలు
సాక్షి, రాజమహేంద్రవరం: సహజ సంపద దోపిడీయే ధ్యేయంగా కూటమి నేతలు బరి తెగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డగోలు వ్యవహారానికి తెర తీశారు. అనుకున్నదే తడవుగా అక్రమాలకు తెర తీశారు. గ్రావెల్, మట్టి, ఇసుక ఇలా ప్రకృతి సంపదను కొల్లగొట్టి రూ.కోట్లు దండుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు కావడం, తమను అడ్డుకునే వారెవరన్న ధీమాతో చెలరేగిపోతున్నారు. కూటమి ఎమ్మెల్యేల అండదండలు పుష్కలంగా వారి ఉండటంతో వారి అనుచరులు ఎర్రమట్టి దొంగల అవతారం ఎత్తారు. ఎంతగా అంటే దోపిడీ మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలు అన్న చంద్రంగా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమాన్ని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కాసుల కక్కుర్తితో అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మామూళ్ల దండుకుని తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం మట్టి తవ్వకాలతో సమీప ప్రాంతాల ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ఇదేమీ దోపిడీ అంటూ విస్తుపోతున్నారు. అనధికార తవ్వకాలు కొవ్వూరు నియోజకవర్గం దేచెర్లలో ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం కనీస అనుమతులు లేకుండా ఎర్రమట్టి దందాకు తెర లేపారు. టీడీపీ, జనసేన నేతల కనుసన్నల్లో దందా సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి ధన దాహానికి దేచెర్ల సమీపంలోని ప్రాంతాలు గోతుల మయమయ్యాయి. కనుచూపు మేర ఎక్కడ చూసినా ఎర్రమట్టి తరలించగా ఏర్పడిన గోతులే దర్శనమిస్తున్నాయి. అక్రమ తవ్వకాలకు ఓ ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో ప్రాంతంలో 10 నుంచి 20 అడుగుల లోతు వరకు ఎడాపెడా తవ్వకాలు చేస్తున్నారు. పగలు, రేయి అన్న తేడా లేకుండా మట్టి తవ్వి తరలించేస్తున్నారు. లారీ మట్టి రూ.8వేల నుంచి రూ.15 వేలకు విక్రయం రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సదరు లే అవుట్ల అభివృద్ధికి ఎర్రమట్టి అవసరం. ప్రధానంగా కడియం నర్సరీలకు ఎర్రమట్టి తప్పనిసరి. వీటితోపాటు ఇటుక బట్టీలలో సైతం వినియోగిస్తారు. ప్రభుత్వ అధికారిక మైనింగ్ క్వారీల నుంచి వీటిని తరలించుకోవాలంటే ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో పెద్ద ఎత్తున నగదు చెల్లించాల్సి ఉంటుంది. యూనిట్ గ్రావెల్కు రూ.320 మైనింగ్ శాఖకు చెల్లించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ అక్రమ వ్యాపారంలో రూ.కోట్లు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఈ డిమాండ్ను గమనించిన కూటమి దోపిడీ దారులు ప్రకృతి సంపదను కొల్లగొట్టి రూ.కోట్లు మింగడం కోసం వ్యూహాలు రచించారు. ఇందుకు దేచెర్ల గ్రామంలోని ఎర్రమట్టిని కేంద్రంగా చేసుకున్నారు. బడా నేతల అండదండలతో క్షేత్ర స్థాయినేతలు రంగంలోకి దిగారు. ఎర్రమట్టి అక్రమంగా తరలించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. మైనింగ్ శాఖకు రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండికొడుతున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు అక్రమ తవ్వకాలు కళ్లెదుటే సాగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. వందల లారీలు అక్రమంగా మంటి తరిలించేస్తున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప అడ్డుకున్న దాఖలాలు లేవు. ప్రతి నెలా మామూళ్లు దండుకుని మిన్నకుండి పోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి మాఫియా ప్రతి నెలా రూ.లక్షల్లో మామూళ్లు సమర్పిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు అధికార పార్టీకి చెందిన నేతలు సూత్రధారులు కావడంతో అధికారులు అటు వెళ్లే సాహసం చేయడం లేదు. వచ్చింది చాల్లే అంటూ..జేబుల్లో వేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. మట్టి తరలింపు విషయమై ఇటీవల కొందరు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. ఆ గ్రామం ఎక్కడుంది..? ఎలా వెళ్లాలి..? అని ప్రశ్నించడాన్ని బట్టి చూస్తుంటే దోపిడీదారులకు ఎంతగా సహకరిస్తున్నారో అర్థం అవుతోంది. ఇలా తవ్వేస్తున్నారు..ఇలా తరలించేస్తున్నారు 150 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు రోజుకు 200 లారీలకు పైగా అక్రమ తరలింపు నెలలుగా సాగుతున్న దందా అనుమతులు లేకుండానే యథేచ్ఛగా తరలింపు బరి తెగిస్తున్న కూటమి నేతలు సహజ సంపద దోచుకుంటున్న వైనం మామూళ్ల మత్తులో జోగుతున్న మైనింగ్ అధికారులు రోజుకు 200 లారీలు కొవ్వూరు నియోజకవర్గం దేచెర్లలో 150 ఎకరాల్లో ఎర్రమట్టి దందా సాగుతోంది. ప్రతి రోజూ 200 లారీల్లో వివిధ ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారు. ట్రాక్టర్ మట్టి సుమారుగా రూ.5 వేలు, లారీకి రూ.8వేల నుంచి రూ.15 వేల వరకు దండుకుంటున్నట్లు సమాచారం. అంటే మట్టి మాఫియాకు ప్రతి రోజూ రూ.30 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది. నెలకు రూ.9 కోట్లు కూటమి నేతల జేబుల్లోకి వెళుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరాటంకంగా తవ్వకాలు సాగుతున్నాయి. దీన్ని బట్టిచూస్తే రూ.కోట్లు కూటమి నేతల జేబుల్లోకి వెళ్లినట్లు సమాచారం. -
రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం
● మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం ● మాజీ సీఎం వైఎస్ జగన్ మిర్చి యార్డుకు వెళితే కంగారెందుకో..? ● జగన్తో ఓ చిన్నారి సెల్ఫీ తీసుకుంటే దారుణంగా ట్రోల్ చేస్తారా? ● మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఫైర్ సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం రైతులు, రైతు కూలీలను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు మిర్చి రైతుల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతారహితంగా వ్యహరిస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ గిట్టుబాటు ధర ప్రకటించ లేదని మంత్రి చెప్పడమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోందన్నారు. రైతు నష్టపోతున్నా గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం దారుణమన్నారు. క్వింటాల్ మిర్చి ధర రూ.11,600 చొప్పున మార్కెట్ జోక్యంతో 25 శాతం పంట కొనుగోలు చేయాలని, అందుకు రూ.3,480 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరమంటూ ఉద్యాన శాఖ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం పక్కన పడేసిందని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు గుంటూరుకు వెళ్లడంతో ప్రభుత్వంలో వణుకు మొదలైందన్నారు. నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ మంత్రికి దానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. నాఫెడ్ ద్వారా ఎప్పుడైనా మిర్చి కొందా అని ప్రశ్నించారు. కేవలం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన వల్లే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారన్నారు. ఇది రైతులను మోసగించేందుకు రాసినది కాదా అని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు మాజీ సీఎం జగన్ గుంటూరుకు వెళితే మాజీ సీఎంకు కనీస భద్రత ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జగన్తో ఓ చిన్నారి సెల్ఫీ తీయించుకునేందుకు ప్రయత్నిస్తే.. ఐటీడీపీ దారుణంగా ట్రోల్ చేసిందని మండిపడ్డారు. 20 క్వింటాళ్లు పండాల్సిన మిర్చి 10 క్వింటాళ్లకు పడిపోయిందని, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షం నోరు నొక్కి పాలన సాగించాలనుకోవడం దారుణమన్నారు. కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత జగన్పై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యామా అని నిలదీశారు. కనీస మద్దతు ధర ప్రకటించకపోవడంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, సమస్యలు పరిష్కరించకపోతే ప్రతిపక్షం ఎత్తి చూపుతూనే ఉంటుందని మంత్రి వేణు స్పష్టం చేశారు. -
తగిన పరిహారం ఇవ్వకుండా కూల్చేస్తారా?
గండేపల్లి: ఏడీబీ రోడ్డు విస్తరణకు సంబంధించి తమకు జరుగుతున్న నష్టానికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం పెంచి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ విషయం తేల్చకుండా అధికారులు తమ ఇళ్లు, షాపులు కూల్చివేయడంపై మండిపడ్డారు. వివరాలివీ.. రాజానగరం – కాకినాడ ఏడీబీ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తుతో మండలంలోని సూరంపాలెం పరిధి రామేశంపేటలో 18 ఇళ్లు, షాపుల కూల్చివేత ప్రారంభించారు. దీనిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. 64 గజాల స్థలం కోల్పోతున్న వారికి రూ.8 లక్షల పరిహారం ఇచ్చారని, 130 గజాలు కోల్పోతున్న వారికి కూడా అంతే పరిహారం ఇవ్వడం ఎంతవరకూ న్యాయమని అధికారులను ప్రశ్నించారు. తమకు తగిన నష్ట పరిహారం ఇవ్వకుండా ఏవిధంగా కూలగొడతారని నిలదీశారు. ఎక్కువ, తక్కువ తేడాలు గమనించకుండా అందరికీ ఒకేలా నష్టపరిహారం ఇవ్వడమేమిటని తహసీల్దార్ శ్రీనివాస్ను ప్రశ్నించారు. దుకాణాలు, ఇళ్లల్లో విలువైన సామగ్రితో పాటు గృహోపకరణాలు కూడా ఉన్నాయని, కనీసం వాటిని తీసుకునేందుకై నా సమయం ఇవ్వాలని కొందరు విజ్ఞప్తి చేశారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు రామేశంపేటలో తమ సమస్య చెప్పుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, దీంతో పిఠాపురం వెళ్లి వివరించామని బాధితులు చెప్పారు. దీనిపై ఆయన అధికారులతో మాట్లాడతానన్నారని, ఇంతలోనే కూల్చివేతలు మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కనికరించని అధికారులు తమ ఇల్లు, దుకాణం కోల్పోతున్నామనే ఆందోళనతో స్థానిక మహిళ వరలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు కుటుంబ సభ్యులు ఇంట్లో వైద్యం చేయిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరించి కూల్చివేత కొనసాగించారని వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు ఇంట్లో సిలైన్లు పెట్టినప్పటికీ అధికారులు బలవంతంగా బయటకు తీసుకువచ్చారని వాపోయారు. అధికారులు అంత నిర్దయగా వ్యవహరిస్తే తామెలా బతకాలని ప్రశ్నించారు. -
వర్సిటీ ప్రగతే పరమావధి
రాజానగరం: ఇంటర్మీడియెట్ విద్య పూర్తి చేసుకుని.. జీవితానికి ఓ గమ్యం నిర్దేశించుకుని.. ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా ఉన్నత విద్య అభ్యసించేందుకు వచ్చిన యువత.. జీవితంలో స్థిరపడేలా చేయడమే కాకుండా.. సమాజానికి ఉపయోగపడేలా వారిని తీర్చిదిద్దేవి విశ్వవిద్యాలయాలు. విద్యార్థులకు అడుగడుగునా మార్గదర్శకత్వాన్ని అందించే గురుతర బాధ్యత ఆ విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకులదే. వారితో పాటు విద్యార్థులను సరైన మార్గంలో నడిపించే కీలక బాధ్యత ఆ యూనివర్సిటీ ఉప కులపతి (వైస్ చాన్సలర్) భుజస్కంధాలపై ఉంటుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అటువంటి కీలక పదవిలో నియమితులయ్యారు ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ. గిరిజన తెగలో జన్మించిన ఆమె.. కష్టపడి, ఉన్నత చదువులు చదివి.. అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆమె వైస్ చాన్సలర్ స్థాయికి ఎదిగారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సెమినార్లు నిర్వహించి, 60 సెమినార్లలో పాల్గొన్నారు. ఆమె రచించిన 125 పరిశోధన వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రచురితమయ్యాయి. బోధనారంగంలో అపార అనుభవం కలిగిన ఆమె వీసీగా ప్రత్యేక విజన్తో పని చేసి, ‘నన్నయ’ వర్సిటీ ప్రగతిని ఇనుమడింపజేయాలని భావిస్తున్నారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆచార్య ప్రసన్నశ్రీ అనేక అంశాలు ముచ్చటించారు. ఆ వివరాలు.. ఆనందంగా ఉంది యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కావాలని అధ్యాపకులైన ప్రతి ఒక్కరికీ డ్రీమ్ ఉంటుంది, అది సాధారణ కమ్యూనిటీలోని వారికి సాకారం కావచ్చునేమో కానీ.. నాలాంటి ఒక గిరిజన మహిళకు కష్టమే. చదువు ఎందుకు అనే సమాజంలో పుట్టిన నేను ఒక యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ కావడమంటే అవధులు లేని ఆనందంగానే ఉంది. ఆ అదృష్టం నాదే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1957లో ఆవిర్భవించిన తరువాత ఇంతవరకూ ఏ యూనివర్సిటీకీ గిరిజన మహిళ వీసీ కాలేదు. ఆ అవకాశం తొలిసారి నాకే దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఒకే కుటుంబంగా పని చేయాలి 1987లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బోధనా వృత్తిలోకి అడుగుపెట్టాను. ఆంధ్రా యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ ఇంగ్లిష్ ప్రొఫెసర్గా పని చేశా. 38 సంవత్సరాల సీనియారిటీతో ఉన్న తనను ‘నన్నయ’ వీసీగా నియమించినందుకు కృతజ్ఞతలు. పరిపాలన నాకు కొత్త కాదు. చిందరవందరగా ఉన్న వలకు మాట్లు వేసి, సరిచేసే ప్రయత్నంలో ఉన్నా. వర్గాలు, వైషమ్యాలు విడనాడి, వర్సిటీ ప్రగతికి అందరూ ఒకే కుటుంబంలా పని చేస్తేనే ఇక్కడ ఉంటారు. పరిశోధనలకు ప్రోత్సాహం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, సమాజానికి తోడ్పడేలా పరిశోధనలు జరగాలి. అందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని పరిశోధకులకు ఇచ్చేందుకు ఇక్కడున్న వనరులు, సదుపాయాలపై ఆకళింపు చేసుకుని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రపతి నుంచి అవార్డు ఆకలి వేసి వారికి ఆహారం అందిస్తేనే దానికి విలువ ఉంటుంది. ఆ భావనతోనే అంతరించిపోయే పరిస్థితిలో ఉన్న 19 ఆదిమ జాతి భాషలకు లిపిని అందించే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో అనేక మంది పెద్దల నుంచి సరైన సహకారం లభించకపోగా, అవమానాలు ఎదురయ్యాయి. అయినా వెనుకడుగు వేయలేదు. మనం చేసే పని సమాజానికి ఉపయోగపడుతుందనుకున్నప్పుడు ఒడుదొడుకులను లెక్క చేయకూడదనుకున్నా. ఆదివాసీ తెగల సంస్కృతీ సంప్రదాయాలపై పరిశోధనలు చేసి, బగత, గదబ, కొలామి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపి రూపొందించాను. నా కృషికి గుర్తింపుగా అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి 2022లో నారీశక్తి పురస్కారం అందుకున్నా. ఆదిమ జాతి వారంటే అమాయకులు, తెలివి లేని వారు కాదు. సరైన ప్రోత్సాహం లేకపోవడమే వారి వెనుకబాటుకు ప్రధాన కారణం. నిజం చెప్పాలంటే సమాజానికి ఆది పురుషుడు ఆదిమ జాతివాడే. నేనూ గోదావరి వాసినే.. సాహిత్య, సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరం, ముఖ్యంగా గోదావరి తీరాన ఉన్న నన్నయ వర్సిటీకి వీసీగా పని చేయడం సంతోషంగా ఉంది. నా అత్తింటి వారు రాజమహేంద్రవరం వారే. అల్లు ఎరకయ్య మా మామయ్య. అలా నేను కూడా గోదావరి వాసినే అయినందుకు గర్వపడుతున్నాను. ఇక్కడి సాహిత్య, సాంస్కృతిక శోభను ఇనుమడింపజేసేలా యూనివర్సిటీ పరంగా ప్రయత్నిస్తాను. సంగీతం, సాహిత్యం, కళలు అంటే చాలా ఇష్టం. ఆదికవి నన్నయ నడయాడిన ఈ నేలలో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి.‘నన్నయ’ వీసీగా ప్రసన్నశ్రీ బాధ్యతల స్వీకరణరాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతిగా ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఇన్చార్జి వీసీగా ఉన్న ఆచార్య వై.శ్రీనివాసరావు నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. వీసీగా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన ఆమెకు యూనివర్సిటీ ముఖద్వారం వద్ద అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. వర్సిటీ ముఖద్వారంలోని ఆదికవి నన్నయ విగ్రహానికి, సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆచార్య ప్రసన్నశ్రీ పూలమాలలు వేసి, అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, వీసీ చాంబర్కి వెళ్లి, బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వర్సిటీలోని వివిధ విభాగాలు, తాడేపల్లిగూడెం, కాకినాడ క్యాంపస్లలోని సిబ్బందితో సమావేశమయ్యారు. సమాజహితంగా ఎదగాలి ఈ సందర్భంగా ఆచార్య ప్రసన్నశ్రీ మీడియాతో మాట్లాడుతూ, గిరిజన మహిళగా తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వర్సిటీ ప్రగతికి సమష్టిగా కృషి చేస్తామని చెప్పారు. వర్సిటీ అంతా ఒక కుటుంబమని, దీనికి పెద్దగా తనకు బాధ్యత అప్పగించారని అన్నారు. ఈ కుటుంబ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా సభ్యుల ప్రవర్తన ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలతో సమాజహితంగా ఎదగాలని హితవు పలికారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. వర్గవైషమ్యాలు వీడాలి అవగాహన చేసుకుని.. అవసరమైన చర్యలు తీసుకుంటా ‘నన్నయ’ నూతన వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ -
భార్యను కత్తితో నరికిన భర్త
● ఆమె అక్కడికక్కడే మృతి ● అడ్డు వచ్చిన మామ పైనా దాడి ● తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలు కొవ్వూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న ఇల్లాలిని, పిల్లనిచ్చిన మామను ఓ వ్యక్తి అతి దారుణంగా కత్తితో నరికిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, మామ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. కొవ్వూరు ఎస్సై కె.జగన్మోహన్ కథనం ప్రకారం.. కొవ్వూరు మండలం వాడపల్లి బంగారుపేటకు చెందిన అడ్డాల నాగయ్య రెండో కుమార్తె కృష్ణతులసి(33)కి, కృష్ణా జిల్లా తిరువూరు మండలం రాజుగూడేనికి చెందిన మురళీకృష్ణకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య మనస్పర్థలు రావటంతో కృష్ణతులసి కుమారుడు రాముతో కలసి ఆరు నెలల క్రితం బంగారుపేటలోని తండ్రి నాగయ్య వద్దకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ కూడా బంగారుపేటకు వచ్చి కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటున్నారు. దంపతులిద్దరూ విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. నాగయ్యకు అల్లుడు మురళీకృష్ణ కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు అడిగేందుకు కృష్ణతులసి గురువారం సాయంత్రం భర్త మురళీకృష్ణ వద్దకు వెళ్లింది. తనను డబ్బులు అడగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మురళీకృష్ణ కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమైపె దాడి చేశాడు. అది గమనించిన నాగయ్య అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిపై కూడా మురళీకృష్ణ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కృష్ణతులసి అక్కడికక్కడే మృతి చెందగా, నాగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మురళీకృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కృష్ణతులసి కుమారుడు రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.జగన్మోహన్ తెలిపారు. -
క్లాస్–3, 4 ఉద్యోగులను నియమించాలి
రాజమహేంద్రవరం రూరల్: ఎల్ఐసీలో ఖాళీగా ఉన్న క్లాస్–3, క్లాస్–4 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) రాజమండ్రి డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ఆర్జే మాథ్యూస్, ఎం.కోదండరామ్ డిమాండ్ చేశారు. ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) పిలుపు మేరకు మోరంపూడి సెంటర్లోని ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజనానికి ముందు ఒక గంట పాటు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులనుద్దేశించి కోదండరామ్, మాథ్యూస్ మాట్లాడుతూ, 2020 నోటిఫికేషన్లో భర్తీ కాకుండా మిగిలిన 2,700 క్లాస్–3, 4 ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీలో ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు ఏఐఐఐఈఏకి ట్రేడ్ యూనియన్గా వెంటనే గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్.గన్నెయ్య, పీఎస్ఎన్ రాజు, జి.శ్రీనివాస్, సత్యదేవ, ఈశ్వరరావు, విశ్వనాథ్, మహిళా ఉద్యోగుల కన్వీనర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. వాట్సాప్తో తక్షణ పౌర సేవలుసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా తక్షణ పౌర సేవలు పొందవచ్చని కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల సమయంలో ప్రజలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఈ నంబర్ ద్వారా వేగంగా చేరవేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా ఈ వాట్సాప్ నంబర్ ద్వారా చేరవేయనున్నారని తెలిపారు. అధికారులు తమ కార్యాలయాలు, పని చేసే ప్రదేశాల్లో ఈ వాట్సాప్ నంబర్ ప్రదర్శించాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగానికి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ప్రజలు ఈ నంబరుకు మెసేజ్ పంపితే చాలన్నారు. అనంతరం వచ్చే రిఫరెన్స్ నంబర్ ద్వారా ఆ ఫిర్యాదు, వినతికి సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేయవచ్చన్నారు. మూడు హోటళ్లపై కేసులు అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆహార నియంత్రణ అధికారి బి.శ్రీనివాస్, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల ఆహార నియంత్రణ అధికారులు శ్రీకాంత్ చౌదరి, రుక్కయ్య, సుబ్బారావు తదితరులు అమలాపురంలోని పలు హోటళ్లపై గురువారం దాడులు చేశారు. ఒకసారి మరిగిన నూనెతోనే పదే పదే వంటకాల తయారీ, వంట గదుల్లో అపరిశుభ్రతను గుర్తించారు. సుబ్బారావు, బొండం బాబాయ్, విష్ణుశ్రీ, విజయదుర్గ, గ్రీన్ ట్రీ హోటళ్లతో పాటు గాయత్రి, గణపతి టిఫిన్స్, శ్రీదేవి బార్ అండ్ రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. -
12 మంది ఉద్యోగులపై వేటు
కాకినాడ క్రైం: జీజీహెచ్లో ఒకే రోజు 12 మంది ఉద్యోగులను తొలగించడం తీవ్ర కలకలం రేపింది. వీరిలో ఇద్దరు రెగ్యులర్, ఇద్దరు కాంట్రాక్టు ఫార్మసిస్టులు, ఇద్దరు ఫిజియోథెరపిస్టులు, నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక థియేటర్ అసిస్టెంట్, ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలివీ.. 2020–21లో నిర్వహించిన నర్సింగ్ పోస్టుల విక్రయాలు, లేని పోస్టుల్ని సృష్టించి మరీ భర్తీ చేయడం వంటి ఆరోపణలతో అప్పటి జీజీహెచ్ మేనేజర్ నరసింగరావు కొద్ది నెలల కిందట సస్పెండయ్యారు. అప్పట్లో ఆయన ద్వారా ఉద్యోగాలు పొందిన 12 మంది జీజీహెచ్ సిబ్బందిని గురువారం ఉద్యోగాల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని కలెక్టర్ షణ్మోహన్కు లిఖితపూర్వకంగా నివేదించారు. వేటు పడిన ఉద్యోగులకు మరెక్కడైనా పోస్టింగులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి కలెక్టర్ సూచించారు. కాగా, ఉద్యోగుల తొలగింపు అంశంపై ట్రెజరీ, జీజీహెచ్ అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. వీరికి మళ్లీ ఉద్యోగాలు ఇచ్చేంత వరకూ జీతం ఇచ్చే అవకాశం లేదని జిల్లా ఖజానా శాఖ స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలపై విచారణేదీ! జీజీహెచ్ మేనేజర్గా పని చేస్తూ సస్పెండైన నరసింగరావుపై ప్రధానంగా నర్సింగ్ పోస్టుల విక్రయాలు, లేని పోస్టుల్ని సృష్టించి మరీ భర్తీ చేశారనే ఆరోపణలున్నాయి. నర్సింగ్ పోస్టుల విక్రయాల అవినీతిపై పక్కా ఆధారాలు లభించడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు నరసింగరావును అధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లోనే కొనసాగుతున్నారు. జీవోలో లేని పోస్టుల సృష్టించి మరీ భర్తీ చేసిన అంశానికి సంబంధించి నరసింగరావుపై వైద్య, ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ పద్మా శశిధర్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయాల్సి ఉంది. ఆయన సస్పెండై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కనీసం షోకాజ్ నోటీసు కూడా పంపించలేదు. కనీస విచారణ కూడా జరగకపోవడంతో లేని పోస్టులు సృష్టించడంలో నరసింగరావు ఉద్దేశం ఏమిటనే విషయం తేలలేదు. దీనిపై స్పష్టత వస్తే ఇప్పుడు తొలగించిన ఉద్యోగులు నరసింగరావు అవినీతిలో భాగస్వాములా, పావులా అనే విషయంపై స్పష్టత వచ్చేదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీనినిబట్టి వారికి మరెక్కడైనా ఉద్యోగాలు ఇవ్వాలా, లేక పూర్తిగా తొలగించాలా అనే విషయం కూడా స్పష్టమయ్యేది. నరసింగరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఛార్జెస్ ఫ్రేమ్ చేయడంలో మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో నెల గడిస్తే నరసింగరావు సస్పెండై నాలుగు నెలలు పూర్తవుతాయి. తాజా నిబంధనల ప్రకారం నాలుగు నెలలు దాటితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై ఎటువంటి ఛార్జెస్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉండదు. ఇదే కనుక జరిగితే సస్పెన్షన్ తర్వాత ఎటు వంటి కఠిన చర్యలూ తీసుకోకుండానే మళ్లీ పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. దీనిపై ఉద్యోగ వర్గాల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. జీజీహెచ్లో లేని ఉద్యోగాల భర్తీపై చర్యలు కలెక్టర్కు అధికారుల నివేదిక -
కల కానకనే దివికేగిన దిగ్గజం
● జాతీయ బ్యాడ్మింటన్ రిఫరీ విశ్వనాథం మృతి ● తనయుడు సాత్విక్ ఖేల్రత్న పురస్కార స్వీకారానికి వెళ్తుండగా హఠాన్మరణం ● ఉమ్మడి తూర్పులో క్రీడలపై చెరగని ముద్ర ● పీడీగా, శిక్షకునిగా ఎంతోమందికి తర్ఫీదు క్రీడల్లో ఆయన ఓ ఎవరెస్టు. ఎందరో క్రీడాకారులకు ఆయనో ద్రోణాచార్యుడు. ఎందరో గురువులకు ఆయన ఓ లక్ష్యం. అటువంటి వారెందరినో చూసి మురిసిపోయే ఆయన.. తన కలల పంట.. కుమారుడు సాత్విక్ సాయిరాజ్ ఇంతింతై వటుడింతయై అని అంతకంతకూ ఆయన ప్రవీణుడైన బ్యాడ్మింటన్ క్రీడనే అందిపుచ్చుకుని ఎదిగిపోతుంటే.. ఆ ఘనతలను కళ్లారా చూస్తూ.. వారూ వీరూ మెచ్చుకుంటుంటే.. సంబరపడిపోయారు. ప్రభుత్వం సైతం అత్యున్నత పురస్కారం ధ్యాన్చంద్ ఖేల్ రత్న ప్రకటించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఆ గౌరవాన్ని కుమారుడు అందుకునే ఉద్విగ్న క్షణాలను కళ్లారా చూడాలని ఆశపడ్డారు. ఆ కార్యక్రమానికి బయలుదేరారు. ఉన్న ఊరు దాటారో లేదో విధి అమాంతం ఆయనను అందని తీరాలకు తీసుకుపోయింది. బ్యాడ్మింటన్ క్రీడలో ఆయన తీర్చిదిద్దిన ఎందరో ఆణిముత్యాలు ఈ హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్షి, అమలాపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రీడారంగంలో ‘కాశీ’ అంటే తెలియని వారు ఉండరు. క్రీడాకారునిగా, క్రీడా శిక్షకునిగా, వ్యాయామోపాధ్యాయునిగా, న్యాయ నిర్ణేతగా, అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుని తండ్రిగా ఇలా క్రీడలకు సంబంధించి అన్ని రంగాల్లోనూ అరితేరిన వ్యక్తిగా రంకిరెడ్డి కాశీ విశ్వనాథం చెరగని ముద్ర వేశారు. అటువంటి కాశీ గురువారం మృతి చెందడం ఉమ్మడి తూర్పు క్రీడాకారులు.. క్రీడాభిమానులలో విషాదాన్ని నింపింది. అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి, జాతీయ బ్యాడ్మింటన్ రిఫరీ రంకిరెడ్డి కాశీ విశ్వనాథం (66) మృతి చెందారు. న్యూఢిల్లీలో జరిగే ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును సాత్విక్ అందుకోవాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటి నుంచి ఢిల్లీ బయలుదేరిన కాశీకి సొంత ప్రాంతమైన అమలాపురం పట్టణం దాటిన వెంటనే గుండెపోటుకు గురై మృతి చెందారు. కాశీకి భార్య, ఇద్దరు కుమారులు క్రీడాకారులు, క్రీడాభిమానులకు ‘కాశీ’ సుపరిచితులు. క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారునిగా రాష్ట్రస్థాయిలో పలు పోటీల్లో పాల్గొన్న కాశీ షటిల్ బ్యాడ్మింటన్ జాతీయ రిఫరీగా పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు సేవలందించారు. కాశీ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన పనిచేసిన ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయస్థాయి వాలీబాల్, అంబాజీపేట ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి క్రికెట్, అమలాపురం ఆఫీసర్స్ క్లబ్లో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (కేఎస్బీఏ) కార్యదర్శిగా, అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ కార్యదర్శిగా సైతం సేవలందించారు. గత ప్రభుత్వ హయాంలో తన కుమారుడు సాత్విక్ పేరు మీద రూ.ఐదు లక్షలు, కలెక్టర్ నిధులతో కలిపి ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో వుడెన్ కోర్టు నిర్మాణం చేయించారు. కాశీ వద్ద వ్యాయామోపాధ్యాయ విద్యలో సలహాలు, సహకారం పొందిన సుమారు 18 మంది ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీలుగా, పీడీలుగా పనిచేస్తుండడం విశేషం. బ్యాడ్మింటన్పై మక్కువతో సాత్విక్ను అంతర్జాతీయ క్రీడాకారునిగా తీర్చిదిద్దడంలో తండ్రిగా, తొలి శిక్షకునిగా కాశీ సఫలీకృతులయ్యారు. సాత్విక్ కామన్వెల్త్, థామస్ కప్, ఆసియా కప్లో స్వర్ణ, రజిత పథకాలు పొందిన విషయం తెలిసిందే. సాత్విక్కు 2022–23 సంవత్సరానికి ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. అ అవార్డును కొన్ని అనివార్య కారణాల వల్ల అందుకోవడం ఆలస్యమైంది. తాజాగా సాత్విక్ న్యూ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు బయలుదేరిన విశ్వనాథం అకస్మాత్తుగా మృతి చెందడంతో ఉమ్మడి జిల్లాలోని క్రీడాభిమానుల్లో విషాదాన్ని నింపింది. వెటరన్ క్రీడాకారుడు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కాశికి ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు వంటెద్దు వెంకన్నాయుడు, డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తదితరులు కాశీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
దాతల ఆశయాలకు తూట్లు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో దాతల ఆశయాలు నెరవేరడం లేదు. విరాళాల కోసం, భవనాల నిర్మాణం కోసం దాతల చుట్టూ తిరిగి అవసరం తీరాక వారు నిర్మించిన భవనాలను నిరుపయోగంగా వదిలేస్తుండడం వారి తీవ్ర మనస్తాపానికి తావిస్తోంది . తుని పట్టణానికి చెందిన దాత చెక్కా సూర్యనారాయణ (తాతబాబు) సమర్పించిన రూ.30 లక్షలతో నిర్మించిన నివేదన షెడ్డు నిరుపయోగంగా వదిలేసారు. దీంతో తాతబాబు అక్కడి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే సత్యదేవునికి నిత్యం ఏదో ఒక రూపంలో ఏదో ఒక లక్ష్యంతో దాతలు తోచినంత విరాళం సమర్పిస్తారు. కొన్ని సందర్భాలలో భారీ నిర్మాణాల కోసం అధికారులే దాతల వద్దకు వెళ్లి అభ్యర్థిస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వామివారి నివేదనశాల నిర్మాణానికి షెడ్డు నిర్మాణానికి తుని పట్టణానికి చెందిన చక్కా తాతబాబు నుంచి 2023 జూన్ నెలలో అప్పటి ఈఓ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ రూ.30 లక్షల విరాళాలాన్ని తీసుకువచ్చారు. ఈ మొత్తంతో దేవస్థానం పండితుల అనుమతితో నివేదన శాల నిర్మించి ఆగస్టు నెలలో దాతచే దీనిని ప్రారంభించారు. కొంత కాలం దీనిలోనే నివేదనలు సాగాయి. కాగా 2023 నవంబర్లో ఈఓ చంద్రశేఖర్ అజాద్ బదిలీ కాగా ఆయన స్థానంలో ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నివేదన శాల భూస్పర్శతో భూమి మీదనే ఉండాలని కొందరు పండితులు సూచించడంతో పాత నివేదనశాల లోనే నివేదనలు తయారు చేయాలని ఆదేశించారు. దీంతో 2023 నవంబర్ నుంచి పాత నివేదనశాల లోనే నివేదనలు తయారు చేయించి స్వామివారికి నివేదిస్తున్నారు. ఈ పరిణామాలపై దాత తాతబాబు అధికారులు కోరితేనే నివేదన భవనానికి విరాళం సమర్పించానని పేర్కొన్నారు. దేవస్థానంలో నివేదనలతో బాటు భక్తులకు పంపిణీ చేసేందుకు పులిహోర, దద్దోజనం, బాలభోగం, చక్రపొంగలి, కట్టు పొంగలిని నివేదనశాల లో తయారు చేస్తున్నారు. అలాగే దేవాలయంలో పనిచేసే అర్చకులు, వ్రత పురోహితులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఈ పదార్థాలను కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. అయితే దేవునికి పెట్టే నివేదనలు పాత నివేదన శాలలో తయారు చేసి భక్తులకు పంపిణీ చేసే వాటిని దాత నిర్మించిన షెడ్డులో తయారు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొత్త షెడ్డును వినియోగంలోనికి తెస్తాం దాత తాతబాబు నిర్మించిన నివేదన షెడ్డును కూడా వినియోగంలోకి తేవాలని నిర్ణయించాం. ఇక్కడ భక్తులకు పంపిణీ చేసే పులిహోర, ఇతర ప్రసాదాలు తయారు చేయిస్తాం. ఇవి తయారు చేయడానికి ఒక కుక్, మరో సహాయకుడు అవసరం. వారిని నియమించడానికి ఎంఎల్సీ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉంది. ఆ కోడ్ ముగిసాక వారిని నియమించి తదుపరి చర్యలు తీసుకుంటాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం రూ.30 లక్షలతో నిర్మించిన నివేదనశాల నిరుపయోగం కేవలం మూడు నెలల పాటే వినియోగం లక్ష్యం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న దాత తాతబాబు -
వీక్షణతో విషయాసక్తి వృద్ధి
రాయవరం: తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను ప్రత్యక్షంగా చూడడం ద్వారా విద్యార్థులలో సంబంధిత అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. శాసీ్త్రయ పరిశోధన, ప్రయోగశాల, క్షేత్ర స్థాయి పర్యటనల ద్వారా ఆ అనుభవాన్ని పొందేందుకు ఉద్దేశించినదే ‘సైన్స్ ఎక్స్పోజర్ విజిట్’. వీటినే స్టడీ టూర్స్గా పిలుస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విజ్ఞానంతో కూడిన విహార యాత్రలకు సమగ్ర శిక్ష చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యార్థులకు క్షేత్ర స్థాయి పర్యటనలకు అవకాశం కల్పిస్తూ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేసి ఆ మేరకు నిధులు కేటాయించారు. ప్రాథమిక, సెకండరీ పాఠశాలలకు జిల్లాల వారీగా ప్రాథమిక పాఠశాలలు, సెకండరీ పాఠశాలల విద్యార్థులు విజ్ఞాన యాత్రలకు వెళ్లనున్నారు. 60కు పైగా విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల నుంచి ఒక్కో విద్యార్థిని ఎంపిక చేస్తారు. అలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 46, తూర్పుగోదావరి జిల్లా 113, కాకినాడ జిల్లా 168 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. సెకండరీ పాఠశాలల స్థాయిలో బాలురు, బాలికలు, పాఠశాల ఉపాధ్యాయులు, గైడ్ టీచర్లు, ఏఎంవోలు, డీఎస్వోలు ఈ విజ్ఞాన విహార యాత్రలకు వెళ్లనున్నారు. కాకినాడ జిల్లా నుంచి బాలురు 21, బాలికలు 42, ఉపాధ్యాయులు 21, గైడ్ టీచర్లు 20, తూర్పుగోదావరి నుంచి బాలురు 19, బాలికలు 38, టీచర్లు 19, గైడ్ టీచర్లు 18, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి బాలురు 44, బాలికలు 88, టీచర్లు 38, గైడ్ టీచర్లు 25 మందిని ఎంపిక చేశారు. అలాగే ఆయా జిల్లాల నుంచి సమగ్ర శిక్షా అకడమిక్ మానిటరింగ్ అధికారులు, జిల్లా సైన్స్ అధికారులు వీరితో యాత్రలకు వెళ్లనున్నారు. కేటాయింపులు ఇలా విజ్ఞాన యాత్రలకు వెళ్లే విద్యార్థులకు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఆయా జిల్లాలకు నిధులను కేటాయించారు. ప్రాథమిక స్థాయిలో జిల్లా స్థాయి పర్యటనకు ఒక్కో విద్యార్థికి రూ.200, రాష్ట్రేతర పర్యటనకు ఒక్కో విద్యార్థికి రూ.2వేలు కేటాయించారు. అలాగే సెకండరీ స్థాయి విద్యార్థులకు రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలకు పర్యటనకు వెళ్లే ఒక్కో విద్యార్థికి రూ.2 వేలు కేటాయించారు. ఎంపిక చేసిన ప్రాంతాలు రాష్ట్రం లోపల..● శ్రీహరికోట (షార్), తిరుపతి (సైన్స్ సెంటర్), చిత్తూరు(అగస్త్య), విశాఖపట్నం (నేవల్ డాక్యార్డ్, స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్). ఇతర రాష్ట్రాలలో.. ● వైటమ్, నెహ్రూ ప్లానిటోరియం (బెంగుళూరు), బిర్లా ప్లానిటోరియం (హైదరాబాదు), ఐఐఎస్ఈఆర్( పూనే), గిండీ నేషనల్ పార్క్ మరియు పెరియార్ సైన్స్ సెంటర్ (చైన్నె). స్టడీ ట్రిప్ లక్ష్యాలివీ.. ● సైన్స్, గణిత ప్రయోగాలు, ప్రదర్శనలను విద్యార్థులకు ప్రయోగాత్మకంగా చూపించడం. ● సైన్స్ అండ్ టెక్నాలజీపై విద్యార్థుల్లో ఉత్సుకత, ఆసక్తిని పెంచడం. ● విద్యార్థులు చూసి నేర్చుకోవడానికి అనువుగా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం. ● సమస్యలను ఎదుర్కోవడం, సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనే నైపుణ్యాలను విద్యార్థుల్లో అభివృద్ధి చేయడం. విధి విధానాలు ఇలా.. ● విజ్ఞాన యాత్రలకు లక్ష్యానికి అనుగుణంగా సందర్శించే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. ● సదరన్, జిల్లా సైన్స్ ఫేర్లో విజేతలైన విద్యార్థులను పర్యటనలకు ఎంపిక చేసుకోవాలి. ● ప్రతి 10 మంది బాలికలకు ఒక మహిళా టీచర్ను ఎస్కార్ట్గా ఎంపిక చేయాలి. ● 40–50 మంది విద్యార్థులకు ఒక బస్సును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ● సురక్షిత, భద్రతకు ఆర్టీసీ బస్సులను ఎంపిక చేసుకుంటే మేలు. ● ప్రయాణంలో అవసరమైన ఏర్పాట్లు ముందుగా చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్ను అందుబాటులో ఉంచుకోవాలి. ● ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుని వెళ్లాలి. ● ప్రతి పది మంది విద్యార్థులను ఒక బృందంగా ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి ఒక ఎస్కార్ట్ టీచర్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఏర్పాట్లు చేస్తున్నాం విద్యార్థులు తరగతి గదిలో చదివిన విషయాన్ని ప్రత్యక్షంగా చూడడం ద్వారా లోతైన అధ్యయనం జరుగుతుంది. సమగ్ర శిక్ష ద్వారా ప్రాథమిక, సెకండరీ పాఠశాలల విద్యార్థులకు ఈ మేరకు నిధులు కేటాయించారు. విద్యార్థులు స్టడీ టూర్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విజ్ఞాన యాత్రలు నిధులు కేటాయించిన సమగ్ర శిక్ష విభాగం -
అతి వేగానికి యువకుడి బలి
దేవరపల్లి: అతివేగం ఒక యువకుడి ప్రాణం తీసింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడకు చెందిన కల్లూరి విజయ్కుమార్ (30), ఏలూరులోని వినాయకనగర్కు చెందిన ఏలేటి గోవింద్ వరుసకు బావ, బావమరుదులు. ఇద్దరూ కలసి గురువారం ఉదయం విశాఖపట్నంలో బంధువుల ఇంట జరుగుతున్న వివాహానికి బయలుదేరారు. విజయ్కుమార్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా, గోవింద్ వెనుక కూర్చున్నాడు. దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్దకు వచ్చే సరికి హైవేపై ఆగి ఉన్న ఐషర్ వ్యాన్ను వెనుక నుంచి బలంగా ఢీ కొన్నారు. ఈ ఘటనలో విజయ్కుమార్ తలకు బలమైన గాయం కాగా చికిత్స కోసం 108 అంబులెన్స్లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గోవింద్కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నట్టు ఏఎస్ఐ నాగభూషణం తెలిపారు. విజయ్కుమార్ తల్లిదండ్రులు ఉదయం విశాఖపట్నం వెళ్లగా వెనుక ద్విచక్ర వాహనంపై వీరిద్దరు బయలు దేరారు. విజయ్కుమార్కు హెల్మెట్ ఉన్నప్పటికీ ధరించకపోవడం వల్ల మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖ వెళ్తుండగా ఘటన ఆగి ఉన్న వ్యాన్ను ఢీకొని అక్కడికక్కడే మృతి మరో వ్యక్తికి స్వల్ప గాయాలు -
కోడి పందాలపై పోలీసుల దాడి
నల్లజర్ల: మండలంలోని రిజర్వు ఫారెస్ట్ సమీపంలో ముసుళ్లగుంట వద్ద రాత్రి వేళ ఫ్లడ్లైట్లతో నిర్వహిస్తున్న కోడిపందేలపై గురువారం తెల్లవారు జామున 4 గంటలకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 32 మందిపై కేసు నమోదు చేసి వారి నుంచి 30 సెల్ఫోన్లు, 7 కార్లు, రూ.6 లక్షల 2 వేల 110 స్వాధీనం చేసుకున్నట్టు సీఐ విజయశంకరం తెలిపారు. స్థానిక సిబ్బందితో పాటు కొవ్వూరు ఎస్ఐ జగన్, ప్రత్యేక పోలీస్ దళం పాల్గొంది. ఎస్ఐ సోమరాజు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని కాకినాడ, కడప, గోపాలపురం, ఉంగుటూరు ప్రాంతాల నుంచి జూదగాళ్లు ఈ పందెలలో పాల్గొన్నారు. నిర్వాహకులైన ముగ్గురిని గుర్తించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. జూదాలకు అడ్డాగా రిజర్వు ఫారెస్ట్ మండలంలోని రిజర్వు ఫారెస్ట్ జూదాలకు అడ్డాగా మారింది. ముసుళ్లగుంట, పుల్లలపాడు గ్రామాలకు ఆనుకొని దూరం ఉన్న రిజర్వు ఫారెస్ట్ అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. పగలంతా నాలుగైదు చోట్ల పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. వారాంతరంలో డిస్కో డ్యాన్సులు, ఖవాలీలు, రేవ్ పార్టీలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. నిర్హాకులు వివిధ హోదాలలో ఉండడంతో అందరికీ తెలిసినా తమకేమి పట్టనట్టుగా ఉంటున్నారు. పోలీసులకు మామూళ్లు అందడం వల్లే వారు ఇలా బరితెగిస్తున్నారని స్థానికులు అంటున్నారు. 32 మందిపై కేసు నమోదు 7 కార్లు, 30 సెల్ఫోన్లు, రూ.6.02 లక్షల నగదు స్వాధీనం -
చోరీ కేసులో నిందితుల అరెస్టు
కాకినాడ రూరల్: మోటారు సైకిలిస్టును అడ్డగించి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి కత్తితో బెదిరించి బైక్, సెల్ఫోన్లు, ఇయర్ బడ్స్ అపహరించుకుపోయిన నలుగురు నిందితులను సర్పవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ పెద్దిరాజు తెలిపిన వివరాల మేరకు కాకినాడ శ్రీనగర్లోని ఒక ప్రైవేట్ కళాశాలకు చెందిన హాస్టల్లో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేసే సత్తి వివేకానంద రెడ్డి ఈనెల 17న అర్థరాత్రి టీ తాగేందుకు డీ మార్ట్ ప్రాంతానికి తన మోటారు సైకిల్పై వెళ్లాడు. టీ దుకాణము మూసి ఉండడంతో డైరీ ఫారం సెంటర్ వైపు దుమ్ములపేట సూర్య బార్ అండ్ రెస్టారెంట్ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ డైరీ ఫారం సెంటరుకు చెందిన యెలేపె మేఘశ్యామ్, రామకృష్ణారావుపేటకు చెందిన డెక్కాతి ఎల్లయ్య రెడ్డి, సంజయ్నగర్ పర్లోపేటకు చెందిన కొత్తుర్తి వీరబాబు, రామకృష్ణారావుపేటకు చెందిన షేక్ ఇబ్రహీం అతడిని అడ్డగించి బైక్ కీ లాక్కుని అతడిని తమ మోటారు సైకిల్పై అక్షర స్కూల్ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ అతని మెడపై కత్తి ఉంచి చంపుతామని బెదిరించి దాడి చేసి మూడు ఫోన్లు, ఇయర్ బడ్స్, గ్లామర్ బైక్ తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈనెల 18న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ బిందు మాధవ్, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనిష్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు 24 గంటల వ్యవధిలోనే దుమ్ములపేట కూరగాయల మార్కెట్ వద్ద నిందితులను అరెస్టు చేసి 24 గంటలలోనే కేసు ఛేదించినట్టు సీఐ పెద్దిరాజు తెలిపారు. చోరీ చొత్తుతో పాటు నిందితులు వినియోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
సస్య రక్షణతో మరింత మధురం
పెరవలి: చెరకు సాగు చేయడానికి ఇదే అనువైన కాలం. ఈ సాగు చేసే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని కొవ్వూరు వ్యవసాయ సహాయ సంచాలకుడు (ఏడీఏ) పి.చంద్రశేఖర్ వివరించారు. జిల్లాలో పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, కొవ్వూరు, చాగల్లు, నల్లజర్ల, దేవరపల్లి, ద్వారకాతిరుమల, రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాల్లో 850 హెక్టార్లలో చెరకు సాగవుతోంది. ఈ సాగుకు తీసుకోవలసిన జాగ్రత్తలను పరిశీలిస్తే.. నేలల స్వభావం ఈ పంటకు నీటి సదుపాయం ఉన్న మెరక భూములు అనువైనవి. భూములను 25 నుంచి 30 సెంటీ మీటర్ల లోతు వరకు మెత్తటి దుక్కు చేయాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసి ఆఖరి దుక్కులో కలియదున్నాలి. చేనును సమాంతరంగా చేయాలి. నాట్లు వేసే సమయం ఉభయ గోదావరి జిల్లాల్లో చెరకు పంటను జాన్ నుంచి జాలై వరకు, డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు నాటుకోవచ్చు. నాటే విధానం మొదటిసారి వేసే రైతులు చేలో పూర్తిగా నీరు పెట్టి నీరు ఇంకిన 3 రోజుల తరువాత విత్తనం చెరకు గడలను ముక్కలుగా చేసి 2.5 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. కార్సీ తోటల రైతులు చేలో ఉన్న చెత్తకు నిప్పుపెట్టి అంటించిన తరువాత నీరు పెట్టాలి. నీటి యాజమాన్యం పంట వేసిన తరువాత 6 రోజులకు ఒకసారి 4 నెలల పాటు సాగు నీటిని అందించాలి. పక్వ దశలో 3 వారాలకు ఒకసారి నీరు అందించవచ్చు. ఎరువుల యాజమాన్యం చెరకు తోట వేసిన 45 రోజులు, 90 రోజులు, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని 67 కిలోలు, భాస్వరం 40 కిలోలు, పొటాష్ 48 కిలోలు 3 సమభాగాలుగా చేసి వీటిని అందించాలి. వీటితో పాటు నత్రజనిని అందించే జీవన ఎరువులైన అజటోబాక్టర్ ఎకరానికి 2 కిలోల చొప్పున పశువుల ఎరువుతో కలిపి రెండు దఫాలుగా వేయాలి. నాటిన 3వ రోజున ఒకసారి, 45 రోజులకు మరోసారి వేసుకుంటే నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఎకరానికి 4 కిలోలు పాస్ఫా బాక్టీరియాను నాటిన 6వ రోజున వేసుకుంటే భాస్వరం ఎరువును కూడా తగ్గించుకోవచ్చు. కార్సి తోటల సాగు మొక్క తోటల కన్నా కార్సి తోటలు త్వరగా పక్వానికి వస్తాయి. సాగులో ఖర్చు కూడా తగ్గుతుంది. నీటిని తట్టుకునే గుణం ఈ తోటలకు ఉంటుంది. కార్సి తోటల్లో దుబ్బుల నుండి మొలకెత్తేటప్పుడు కలుపు నివారణకు మందులు వాడకూడదు. కార్సీ తోటలు ఉన్న రైతులు చేలో ఉన్న చెత్తను కాల్చడం కానీ, ఆ చెత్తను కుళ్లబెట్టడానిక ట్రైకోడెర్మా విరిడి మందును పేడనీళ్లతో కలిపి చెత్తపై చల్లాలి. దీనితో పాటు పది కిలోల సూపర్ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా రెండూ కలిపి చెత్తపై చల్లాలి. దీనివలన భూమిలో తేమశాతం నిలబడటమే కాకుండా చెత్త బాగా చివికి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పంటలపై ఎక్కువగా పీక పురుగు, కాండం తొలిచే పురుగు, పొలుసుపురుగు, తెల్ల నల్లి, లద్దె పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు పంటను ఆశించకుండా చేలలో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకుంటే కొంతవరకు వాటిని అరికట్టవచ్చు. పంటపై కాటుక తెగులు, ఎర్ర కుళ్లు తెగులు, మొవ్వ కుళ్లు తెగులు ప్రభావం అధికంగా ఉంటుంది. ఇవి ఆశించినప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పెట్టుబడి వ్యయం తగ్గుదల అధిక, నాణ్యమైన దిగుబడి చెరకులో యాజమాన్య పద్ధతులు సూచిస్తున్న వ్యవసాయ అధికారులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసన్ననగర్కు చెందిన గోపిశెట్టి నాగేశ్వరరావు (65) స్థానిక సిరి అపార్ట్మెంట్లో సొంత ఫ్లాట్లో భార్య విజయలక్ష్మితో కలిసి జీవిస్తున్నాడు. ఆయన పశుసంవర్ధక శాఖలో టెక్నీషియన్గా పనిచేసి ఐదేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో బెడ్ రూంలో ఫ్యాన్కు బెల్ట్తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. భార్య చూసి పొరుగువారి సాయంతో ఆయనను కాకినాడ జీజీహెచ్కు తరలించగా నాగేశ్వరరావు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు విదేశాల్లో స్థిరపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు బుధవారం ఉత్సాహంగా జరిగాయి. పురుషుల విభాగంలో ఆర్ఎస్బీ భువనేశ్వర్తో జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్బీ కొచ్చి జట్టు 5–0 స్కోర్తో, గోవా సెక్టార్తో జరిగిన మ్యాచ్లో మధ్యప్రదేశ్ 4–0 స్కోర్తో, ఆర్ఎస్బీ రాయ్పూర్తో జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్బీ కాన్పూర్ 4–0 స్కోర్తో గెలుపొందాయి. ఢిల్లీ సెక్టార్తో జరిగిన మ్యాచ్లో హర్యానా 0–1 స్కోర్తో విజయం సాధించింది. మహిళల విభాగంలో ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో ఒడిశా 5–0 స్కోర్తో, బీహార్ సెక్టార్తో జరిగిన మ్యాచ్లో 3–2 స్కోర్తో హర్యానా సెక్టార్, తెలంగాణ సెక్టార్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ సెక్టార్ 6–0 స్కోర్తో విజయం సాధించాయి. -
ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు
తాళ్లపూడి: తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ యువతి చదువుతున్న కళాశాలకు వెళ్లి ఆమైపె దాడికి పాల్పడిన ఘటన వేగేశ్వరపురంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో గజ్జరం గ్రామానికి చెందిన యువకుడిని అరెస్టు చేశారు. తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు వేగేశ్వరపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో తనతో చనువుగా ఉన్న విద్యార్థినిని అదే కళాశాలలో చదివి మానేసిన గొల్ల దిలీప్కుమార్ ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఒక రోజు కళాశాలకు వెళ్లి ఆమైపె చేయిచేసుకున్నాడు. అయినా ఆమె స్పందించడం లేదని బుధవారం మరోసారి కళాశాలకు వెళ్లి తనను ప్రేమించకుంటే వదిలేది లేదని, జీవితాన్ని పాడుచేస్తానని బెదిరించి మరో సారి చేయిచేసుకున్నాడు. దీంతో ఆ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు దిలీప్కుమార్ను అదువులోకి తీసుకుని అరెస్టు చేసి కోర్టుకు పంపినట్టు ఎస్సై రామకృష్ణ తెలిపారు. గతంలో పలు మార్లు కళాశాలలోను, పాఠశాలల్లోనూ ఈవ్ టీజింగ్, ర్యాగింగ్పై అవగాహన కల్పించామని, అయినా అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలు వుంటాయని ఎస్సై హెచ్చరించారు. -
ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే..
జేఎన్టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమేనని జేఎన్టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ ఆరో ఉప కులపతిగా బుధవారం మధ్యాహ్నం వీసీ చాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన సీఎం, విద్యా శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వర్సిటీలతో కొత్త కోర్సులపై ఒప్పందం, అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు, పరిశోధనాంశాలు కీలకంగా ఉండేలా ప్రక్షాళన చేపడతానన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ టాప్–100లో ఉంచడంతో పాటు, మెరుగైన ఎన్బీఐ ర్యాంకింగ్ సాధనకు కృషి చేస్తామన్నారు. అధ్యాపకులు పరిశోధన ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని, విద్యార్థులను స్టార్టప్స్, ఆవిష్కరణలకు ఆసక్తి కలిగించేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం సెనెట్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, మాజీ వీసీ ప్రసాదరాజు, పద్మరాజు, మురళీకృష్ణ, డైరెక్టర్లు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇన్చార్జి డీఐజీగా భీమవరం జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కాకినాడ జాయింట్ సబ్రిజిస్ట్రార్–1 ఆర్వీ రామారావు, జాయింట్ సబ్రిజిస్ట్రార్–2 పీఎస్వీఎస్ఎస్ వీరభద్రరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. వెంకటేశ్వర్లు 2022–24 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. ఇక్కడ నుంచి భీమవరం జిల్లా రిజిస్ట్రార్గా బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లా డీఐజీగా ఉన్న బి.శివరామ్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ జిల్లా కె.ఆనందరావుకు ఇన్చార్జి డీఐజీగా నియమించారు. అయితే అదనపు బాధ్యతలుగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు ఈయన పరిధిలోకి వస్తాయి. -
డిజిటల్ అసిస్టెంట్లకు రెండో రోజు శిక్షణ
సామర్లకోట: సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణ రెండో రోజు స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రం(ఈటీసీ)లో బుధవారం కొనసాగింది. ఎన్ఐఆర్డీపీఆర్(హైదరాబాద్) ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని డిజిటల్ అసిస్టెంట్లకు సాంకేతిక నైపుణ్యంపై శిక్షణ ఇస్తున్నారు. గురువారంతో ఈ శిక్షణ ముగుస్తుంది. ప్రతి జిల్లా నుంచి నలుగురిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్టు ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఈ.కృష్ణమోహన్ తెలిపారు. ఎన్ఐఆర్డీపీఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీ రవిబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేశ్వర్ శిక్షణ ఇస్తున్నారు. యువకుడి అదృశ్యం రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బైక్ లభ్యం కొవ్వూరు: దొమ్మేరు గ్రామానికి చెందిన గగ్గురోతు సాయి తేజ(25) బుధవారం ఉదయం నుంచి అదృశ్యమయ్యాడు. ఇంటి నుంచి మోటార్ బైక్పై బయలుదేరిన అతడి వాహనాన్ని రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బంధువులు గుర్తించారు. గోదావరి నదిలో దూకాడా, లేక బైక్ను ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడికై నా వెళ్లాడా అన్నది తెలియడం లేదని, అతడి సెల్ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఓ గేదెల ఫామ్లో సాయి తేజ పనిచేస్తున్నాడు. నిత్యం దొమ్మేరు నుంచి ఉదయాన్నే వెళ్లి, మళ్లీ 11 గంటల సమయానికి ఇంటికి తిరిగొస్తాడు. ఎప్పటిలాగే బుధవారం ఇంటి నుంచి వెళ్లిన అతడు మళ్లీ తిరిగిరాలేదు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్న బంధువులకు స్థానికుల ద్వారా బైక్ వివరాలు తెలిశాయి. ఈ క్రమంలో గోదావరి నదిలో జాలర్ల సాయంతో గాలింపు చేపట్టారు. సాయితేజ సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. -
104, 108 వ్యవస్థల నిర్వీర్యం
అత్యవసర వైద్య సేవలు అందించే 104, 108 వ్యవస్థలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసింది. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన, వేతనాల కోసం ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని ఆందోళన చేస్తున్న ఉద్యోగులు సాక్షి, రాజమహేంద్రవరం: అత్యవసర సేవలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే 104, 108 వ్యవస్థలను నిర్వీర్యం చేసిన సర్కారు తాజాగా మూగజీవాలపై ‘పచ్చ’పాతం చూపుతోంది. పశువులకు అత్యవసర వైద్యం అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార వైద్య సేవలకు మంగళం పాడింది. ఉన్న పళంగా ఆరోగ్య సేవలు నిలిపివేసి వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 16 సంచార పశువైద్య వాహనాలు ఆగిపోయాయి. ఫేజ్–1లో వాహనాలు తిరిగి ఆయా పశువైద్య శాఖ ఏడీ కార్యాలయంలో అప్పగించి తమకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. వీటిలో పనిచేసే పైలట్, పారావిట్, డాక్టర్, పైలట్ రిలీవర్లు సుమారు 48 మంది విధులకు హాజరు కాకూడదని వాట్సాప్ మెసేజ్ ద్వారా సూచించారు. ఉద్యోగాలు తిరిగి ఇస్తారా? లేక ఇంతటితో ఆగిపోవాలా? అన్న స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అకస్మాత్తుగా తొలగింపు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022 మే మాసంలో అంబులెన్స్ సేవలు ప్రారంభించింది. నియోజకవర్గానికి ఒక వాహనం కేటాయించారు. అందులో డాక్టర్కు నెలకు రూ.37,000, పారావిట్స్కు రూ.13,400, డ్రైవర్కు రూ.10,500 వేతనం చెల్లిస్తున్నారు. గత మూడేళ్లుగా సిబ్బంది అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలు అందిస్తున్నారు. ఉన్నపళంగా వెళ్లమని.. పశు అంబులెన్స్ సేవలను జీవీకేఈఎంఆర్ఐ సంస్థ నిర్వహిస్తోంది. ఈనెల 16వ తేదీ నాటికి సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగిసిందని, విధుల నుంచి తప్పుకోవాలంటూ ప్రభుత్వం ఉద్యోగులకు నోటీసులు పంపింది. ఒక్క సారిగా చెప్పడంతో ఉద్యోగులు అవాక్కవుతున్నారు. ఉద్యోగాల తొలగింపు అంశంతో రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెరుగుతాయని భావించిన తమకు చేదు అనుభవం ఎదురైందని వాపోతున్నారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. పశువైద్య శాఖ ఏడీ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉద్దేశం ఇదీ.. పశుపోషకుల ఇంటి ముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. రూ.278 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్లు తీసుకురాగా.. తూర్పుగోదావరి జిల్లాకు 16 అంబులెన్సులు కేటాయించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బృహత్తర కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు 108 అంబులెన్సుల తరహాలో.. అత్యాధునిక సౌకర్యాలతో పశువుల ఆంబులెన్సులు తీర్చిదిద్దారు. వీటి నిర్వహణ ఖర్చులు సైతం ప్రభుత్వమే భరించింది. అంబులెన్స్ సేవలు పొందేందుకు ప్రత్యేకంగా 1962 అనే టోల్ ఫ్రీ నంబరు సైతం ఏర్పాటు చేశారు. ఫోన్ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు.. అంబులెన్స్లో రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పశువును సమీపంలోని ఏరియా పశువైద్యశాల, వెటర్నరీ పాలీక్లినిక్కు తరలించి మరీ వైద్యం అందించారు. తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేర్చేవారు. సేవలు ప్రాంభించిన మూడేళ్లల్లో లక్షల సంఖ్యలో పశువులకు మెరుగైన వైద్యం అందించారు. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న వాహనాలను కూటమి ప్రభుత్వం ఉన్నపళంగా ఆపేయడంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. వైద్యం పొందాలంటే కిలోమీటర్ల దూరంలోని పశువైద్య శాలలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. అంబులెన్స్లో అధునాతన వసతులుపశువుల అంబులెన్స్లో అధునాతన వసతులు కల్పించారు. అవసరమైన వైద్య సిబ్బంది నియామకం చేపట్టారు. ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రో స్కోప్తో కూడిన చిన్న ప్రయోగశాలను ఆ వాహనంలో ఏర్పాటు చేశారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేం దుకు హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం ఉంది. ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. అవసరమైతే హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్ర చికిత్స చేసే సౌలభ్యం వాహనాల్లో కల్పించారు. పశువులకు అత్యవసర వైద్య సేవలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెద్దపీట ఆయా గ్రామాల్లో వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా వాహనాలు కూటమి ప్రభుత్వం వచ్చాక సేవల నిర్వీర్యం సంచార వైద్య వాహనాలు ఆపేయాలని నిర్ణయం ఉన్నపళంగా ఉత్తర్వులు జిల్లాలో 16 వాహనాల ద్వారా సేవలు ఇప్పటికే 104, 108 వ్యవస్థల నిర్వీర్యం -
అర్ధరాత్రి దొంగల హల్చల్
షట్టర్లు పగులగొట్టి పది దుకాణాల్లో చోరీ తుని: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రచ్చతో ఆందోళనకు గురైన ప్రజలకు దొంగలు కంటిపై కునుకు లేకుండా చేశారు. తుని పట్టణంలో రద్దీగా ఉండే జీఎన్టీ రోడ్డులో ఒకేసారి పది దుకాణాల షట్టర్లను పగులగొట్టి, అందిన కాడికి దోచుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక దొంగల ముఠా ఏకకాలంలో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఆయా దుకాణాల్లో సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. తుని పట్టణంతో పాటు, పాయకరావుపేటలోనూ చోరీలకు యత్నించారు. పెద్ద ముఠాయే ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీం ఆయా దుకాణాల్లో సీసీ ఫుటేజ్తో పాటు, దొంగల వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ గీతారామకృష్ణ తెలిపారు. వస్త్ర దుకాణంలో దుస్తులు పట్టుకెళ్లారని, మిగిలిన దుకాణాల్లో నగదును దొంగిలించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. చోరీలకు పాల్పడిన ముఠా ఒడిశా రాష్ట్రానికి చెందినదిగా సీసీ ఫుటేజ్లో గుర్తించామన్నారు. ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. -
వేగంగా డేటా నవీకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సర్వే సమయంలో ఇంటి వద్ద లేని సిటిజన్ల హౌస్ హోల్డ్ డేటా పెండింగ్ లేకుండా ప్రతి శాఖకు చెందిన లబ్ధిదారుల, అర్హుల జాబితాను అనుసరించి క్రమబద్ధీకరించాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో మిస్సింగ్ హౌస్ హోల్ర్స్డ్ పై సమన్వయ శాఖల అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1,65,278 మంది మిస్సింగ్ హౌస్ హోల్డ్ ఉన్నట్లు తెలిపారు. అందులో ఇప్పటికీ ఇంకా 48,232 మంది వివరాలను గుర్తించి డేటా ఎంట్రీ చెయ్యాల్సి ఉందన్నారు. నూరుశాతం మిస్సింగ్ హౌస్ హోల్డ్ గుర్తించడంలో భాగంగా వలస వెళ్లిన, మరణించిన వారి వివరాలు సచివాలయాలు వారీగా గుర్తించి నవీకరించాలన్నారు. విద్యుత్ శాఖ 16,082, పౌర సరఫరాల శాఖ 7,889 , విద్యా శాఖ 5,799 , ఆరోగ్యశ్రీ 5,426 , డ్వామా 4,685 , సర్వే 4,677 పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ ఆధారంగా వారి వివరాలు సేకరించి నవీకరణ చేయాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి టీ సీతారామమూర్తి , డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు పి వీణాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి చొరవ రానున్న ఆగస్టు నాటికి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన పనులు కార్యరూపం దాల్చే విధానం చొరవ తీసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పర్యాటక కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన నిర్వహించగా, ఇంచార్జి జిల్లా ఫారెస్ట్ అధికారి రవీంద్ర దామా, జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామ మూర్తి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి వివిధ ఏజెన్సీలను గుర్తించి చర్యలను చేపట్టాల్సి ఉందన్నారు. జాతీయ రహదారి 216–ఏ పర్యాటక ప్రాంతంగా నర్సరీల స్టాల్స్ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిని గుర్తించాలన్నారు. కడియం నర్సరీలు, ఫ్లవర్ మార్కెట్ వర్గాలు, స్వయం సహక సంఘాలు, చేనేత కుటుంబాలను గుర్తించి లీజ్ పద్ధతిలో షాప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కడియపులంక ప్రాంతంలో బోటింగ్ సౌకర్యం ఒక కిలోమీటర్ తో చేపట్టి, దశల వారీగా నిడివి పెంచుకోవాలన్నారు. -
పాత నేరస్తులపై నిఘా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, గ్రేవ్ ఎక్విటల్, మిస్సింగ్, పోక్సో, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎన్బీఎం మురళీకృష్ణ, ఎల్.అర్జున్, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నవరం ఆలయానికి కోడ్ నుంచి మినహాయింపు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ నిర్మాణ పనులు, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంఎల్సీ ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు కోరుతూ జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించిన లేఖకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అనుమతి మంజూరు చేశారు. దానికి సంబందించిన ఆర్డర్స్ బుధవారం దేవస్థానానికి చేరాయి. అన్నవరం దేవస్థానంలో మార్చి 30 వ తేదీన జరుగనున్న ఉగాది వేడుకలు, ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి, మే నెల ఏడో తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లకు టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే శాసనసమండలి ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికల కోడ్ మార్చి ఎనిమిదో తేదీ వరకు అమలులో ఉంది. దీంతో ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలవడానికి వీలు లేదు. ఈ పనులు అత్యవసరంగా చేయాల్సినవి అయినందున వీటికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు లేఖ రాశారు. ఆ లేఖను జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించగా ఆ మేరకు ఎన్నికల సంఘం మినహాయింపు వచ్చింది. త్వరలోనే ఈ ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలవనున్నట్టు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు కాకినాడ సిటీ: తూర్పు–పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతున్న దృష్ట్యా కాకినాడ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 163(2) ప్రకారం ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ గుమికూడడం నిషిద్ధమని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సభలు సమావేశాలు పెట్టకూడదని, ఆయుధాలు, కర్రలు, రాళ్లు, అగ్ని ప్రమాదాలు సంభవించే వస్తువులు, ఇతర ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని నిషేధించామని కలెక్టర్ వివరించారు. ఈ ఉత్తర్వులు ఈనెల 25వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు ఎవరు సమావేశాలు నిర్వహించడం, గుంపులు గుంపులుగా తిరగడం చేయకూడదన్నారు. -
ఇసుక డ్రెడ్జింగ్ను అడ్డుకున్న కార్మికులు
కొవ్వూరు: భారీ డ్రెజ్జింగ్ యంత్రాలను వినియోగించి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు తక్షణం నిలిపివేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట బోటు కార్మికులు ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. పౌర హక్కుల సంఘం నేతలు,ఐఎఫ్టీయు,దళి ప్రజా వేదిక నాయకులు ఈ ధర్నాకి సంఘీభావం ప్రకటించారు.గోదావరి నదిలో డ్రెజ్జింగ్ చేస్తున్న బోటును పట్టుకుని పోలీసులు,ఇరిగేషన్ శాఖ అధికారులకు అప్పగించామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ ప్రకటించారు.వేలాది మంది కార్మికుల ఉపాధి ని దెబ్బతీస్తూ నది అక్రమంగా డ్రెజ్జింగ్ చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించు కోవడం లేదని దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు పేర్కోన్నారు.ఇసుక సేకరించే కార్మికులు చిన్న పడవల సాయంతో ఇసుక సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారని అన్నారు.పర్యావరణానికి తూట్లు పొడుస్తూ భారీ యంత్రాలను వినియోగించి నది గర్భంలో డ్రెజ్జింగ్ చేయడం మూలంగా కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారని అన్నారు.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా నదిలో భారీ డ్రెజ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నరన్నారు.గ్రీన్ ట్రిబ్యూనల్ మార్గదర్శకాలను విస్మరించి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారని,దీనిపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే గ్రీన్ ట్రిబ్యూనల్ను,హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.అక్రమం గా తవ్వుతున్న యంత్రాలు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు స్పందించి కేసులు నమోదు చేయకపోవడం బాధకరం అన్నారు.కార్మికులే స్వయంగా రంగంలోకి దిగి పట్టుకుని ఫిర్యాదు చేస్తే తప్పా స్పందించే పరిస్ధితి లేకపోవడం విచారకరం అన్నారు. చోళ్ల రాజు మాట్లాడుతూ కార్మికులు అర్ధరాత్రి భారీ బోటుని పట్టుకుని తెల్లవారేంత వరకు కాపలా ఉండి తీసుకోచ్చారన్నారు.అనంతరం నీటి పారుల శాఖ విభాగం ఆర్డీవోకి ఈ డ్రెజ్జింగ్ ప్రక్రియ పై రాతపూర్వకమైన ఫిర్యాదు ఇచ్చారు.ఇసుక సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి ఇసుక పడవల కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని కోరారు.నది అక్రమంగా డ్రెజ్జింగ్ను ఆరికట్టడంతో పాటు డ్రెజ్జింగ్ ప్రక్రియ నిర్వహాకులపైన,ర్యాంపులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భం గా ఆర్డీవో మాట్లాడుతూ డ్రెజ్జింగ్ నిర్వహాకులపై చర్యలు తీసుకుంటామని, కార్మికులకు ఉపాధి కల్పనలో భాగంగా పడవల ర్యాంపులు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రాణిసుస్మిత ప్రకటించారు.గోదావరి ఇసుక కార్మికుల సంఘం అధ్యక్షుడు చీరా అప్పారావు, ఇసుక కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా -
లిల్లీని పిండినల్లిపేస్తోంది
పెరవలి: తూర్పుగోదావరి జిల్లాలో లిల్లీపూల సాగు 300 ఎకరాల్లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో జరుగుతోంది. వాతావరణంలో తేమ, వేడి శాతం అధికంగా ఉండటంతో ఈ పంటలో వివిధ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ముఖ్యంగా మచ్చతెగులు, పిండినల్లి, తామర పురుగులు, మొగ్గతొలుచు పురుగు, నిమటోడులు వంటివి ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణ, ఎరువుల యాజమాన్య పద్ధతులను కొవ్వూరు ఉద్యానవన అధికారి సీహెచ్ శ్రీనివాస్ వివరించారు. ఆకుమచ్చ లిల్లీపూల ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే ఆకు చివరి భాగం నుంచి దుబ్బు వరకు వ్యాపించి మాడిపోతాయి. దీంతో ఆకులు ఎండి వడలిపోతాయి. నివారణ చర్యలు ఈ తెగులు అధికంగా ఉంటే పంట మొత్తం పాడైపోతుంది. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి (మీల్బగ్) ఈ తెగులు పంటను ఆశిస్తే లిల్లీదుబ్బు మొదలు నుంచి ప్రారంభమై ఆకులను ఆశిస్తుంది. ఈ పురుగు పిండి వంటి పదార్థాన్ని వదలడం వలన తెల్లగా కనిపిస్తుంది. ఈ పదార్థంలో నల్లిపురుగులు ఉండి ఆకులలో రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు ఎండిపోయి దుబ్బు చనిపోతుంది. దీని నివారణకు ఎసిటామీఫ్రిడ్ 40 గ్రాములు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ తొలుచు పురుగు పుష్పగుచ్ఛాన్ని మొగ్గతొలిచే పురుగులు ఆశించి, గుచ్ఛాల్లోని పువ్వులకు రంధ్రాలు చేసి లోపలకు వెళ్తాయి. అక్కడ కణజాలాన్ని తినేయడంతో మొగ్గలు వాడిపోతాయి. చిన్న పుష్పగుచ్ఛాన్ని ఈ పురుగులు ఆశిస్తే మొగ్గలు విచ్చుకోకుండా ఎదుగుదల నిలిచిపోయి గుచ్ఛ అలాగే ఉండిపోతుంది. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ గుచ్ఛాలు వాడిపోయి విరిగిపోతాయి. దీని నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగుల నివారణకు.. లిల్లీపూల తోటలపై తామర పురుగులు, పేనుబంక ఎక్కువగా ఆశిస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండం కుళ్లు తెగులు, మొగ్గ కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు కార్బన్డిజం గ్రాము లీటరు నీటికి పిచికారీ చేయాలి. క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే, రైతులకు లాభాలు అందించడంతో పాటు నాణ్యమైన పూలను పొందవచ్చు. 300 ఎకరాల్లో లిల్లీ పూల సాగు దుష్ప్రభావం చూపుతున్న తెగుళ్లు సస్యరక్షణ చర్యలు తప్పవంటున్న నిపుణులుఎరువుల యాజమాన్యం సేంద్రియ ఎరువులతో పాటు, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎకరానికి 80 కిలోల చొప్పున వేయాలి. నత్రజని ఎరువును 3 దఫాలుగా దుంపలు నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. నీటితడులు అవసరం మేరకు 7–10 రోజులకు ఒకసారి పెట్టాలి. ఇలా సాగు చేస్తే మొక్కలు మంచి బలంగా వచ్చి, ఎకరాకి 60 వేల నుంచి 70 వేలు పుష్పగుచ్చాలొచ్చి 3 నుండి 7 టన్నుల పూల దిగుబడి వస్తుంది. -
నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
కోనసీమ జిల్లా డీఈఓ సలీం బాషా సాక్షి, అమలాపురం: రానున్న పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతకు సమన్వయంతో పాటుపడాలని కోనసీమ జిల్లా డీఈఓ షేక్ సలీం బాషా ఉపాధ్యాయులు, ఎంఈఓలకు ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అవసరమైన స్టడీ మెటీరియల్ అందించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడాలన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక, నాలుగు మోడల్ ప్రశ్నపత్రాలను ప్రత్యేకంగా తయారు చేసి, విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఎంఈఓలను ఆదేశించారు. టెన్నికాయిట్ పోటీలకు సర్వం సిద్ధం గోపాలపురం: రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు చిట్యాల జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలతో పాటు, రెండు కొత్తవి కలిపి మొత్తం 15 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ గద్దే చంద్రశేఖర్, హెచ్ఎం ఎస్ఎల్ఎన్ శాస్త్రి తెలిపారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పోటీలు 22వ తేదీతో ముగుస్తాయని చెప్పారు. రేయింబవళ్లు పోటీలు జరుగుతాయని తెలిపారు. -
టీడీపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు
తుని: సుధీర్ఘ చరిత్ర కలిగిన టీడీపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు విరుచుకుపడ్డారు. బుధవారం తుని యనమల కృష్ణుడు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తుని మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీకి చెందిన ఒక్క కౌన్సిలర్ లేరని, బలం లేని చోట అధికార మదంతో పోలీసులు, అధికారులను ఉపయోగించుకుని బలవంతంగా లాక్కుకోవడానికి యత్నంచడం దౌర్జన్యానికి పరాకాష్ట అన్నారు. టీడీపీలో మంత్రిగా, స్పీకర్గా ఉన్నత పదవుల్లో ఉన్న యనమల రామకృష్ణుడు నీచ రాజకీయాలకు పాల్పడి సభ్య సమాజం నివ్వెర పోయే విధంగా వ్యవహరించారని విమర్శించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లను బలవంతంగా టీడీపీలో చేర్చుకుని ప్రజా స్వామ్య వ్యవస్ధను నిర్వీర్యం చేశారన్నారు. మంగళవారం జరిగిన వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లను టీడీపీ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందని, మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా టీడీపీ కుట్రను దీటుగా ఎదుర్కొన్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీకి చెందిన చోటా నాయకులతో నాపై విమర్శలు చేస్తున్నారని, ముందు మీరు నైతిక విలువలు పాటించి తర్వాత నీతులు చెబితే బాగుంటుందన్నారు. తుని వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో నాలుగు సార్లు వాయిదా పడేవిధంగా అధికారులను ప్రభావితం చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారం ఉంది కదా అని విర్ర వీగిపోతే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హితవు పలికారు. బలం లేకపోయినా వైస్ చైర్మన్కు పోటీ పడతారా? వైఎస్సార్ సీపీ నేత యనమల కృష్ణుడు -
ఉన్నపళంగా ఆగిపోమన్నారు
మూడేళ్లుగా సంచార అంబులెన్స్లో పనిచేస్తున్నాం. సీనియారిటీ ఉంది కదా వేతనాలు పెరుగుతాయని భావించాం. కానీ ఒక్కసారిగా ఉద్యోగాల నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒక్కసారిగా రోడ్డున పడ్డాం. ఏ పనిచేసుకుని మా కుటుంబాలను పోషించాలో అర్థం కావడం లేదు. – రాజేష్, డ్రైవర్ 16వ తేదీ నుంచి రావద్దన్నారు పాత సంస్థ కాంట్రాక్ట్ అయిపోయింది. 16వ తేదీ నుంచి ఉద్యోగాలకు రావద్దన్నారు. ముందస్తు సమాచారం లేకుండా టెర్మినేషన్ లెటర్ ఇచ్చేశారు. జిల్లాలో 16 వాహనాల్లో 48 మంది పనిచేస్తున్నాం. మాకు ఉద్యోగాలు చూపించి ఆదుకోవాలి. –రాజారత్నం, డ్రైవర్ -
గామన్ బ్రిడ్జిపై కారు దగ్ధం
కొవ్వూరు: పట్టణ శివారున ఉన్న గామన్ ఇండియా బ్రిడ్జిపై 33వ పిల్లర్ వద్ద బుధవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. బ్యానెట్ నుంచి మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అప్రమత్తమై, వాహనాన్ని ఆపి సురక్షితంగా కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన బందెల కృష్ణ ఆ కారులో రాజమహేంద్రవరానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు – రూ.1.77 లక్షల నగదు, బైక్ స్వాధీనం అమలాపురం టౌన్: పట్టణం సమీపంలోని పేరూరు వై.జంక్షన్లో ఈ నెల 4న ఓ బైక్ నుంచి రూ.1.50 లక్షల నగదును కాజేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు బుధవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అతని వద్ద నుంచి రూ.1.77 లక్షల నగదు, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పి.వీరబాబు తెలిపారు. వై.జంక్షన్లోని ఓ టిఫిన్ సెంటరులో అల్పాహారానికి ఇద్దరు వ్యక్తులు బైక్ పెట్టి వెళ్లారు. ఆ సమయంలో నిందితులు బైక్పై వచ్చి, పార్క్ చేసి ఉన్న బైక్ సైడ్ డిక్కీలో పెట్టిన రూ.1.50 లక్షల నగదును దొంగిలించి పరారైన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరైన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చీడివలస గ్రామానికి చెందిన మేకల బాలరాజును అరెస్ట్ చేసినట్టు సీఐ వీరబాబు తెలిపారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ వీరబాబు పర్యవేక్షణలో, పట్టణ ఎస్సై టి.తిరుమలరావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాలరాజు రావులపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మరో నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ చెప్పారు. -
రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ జట్ల ఎంపిక
తుని రూరల్: తిరుపతి బోనగిరిలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పురుషుల, మహిళల జట్లు ఎంపికయ్యాయి. బుధవారం తుని మండలం హంసవరం మోడల్ స్కూల్ మైదానంలో ఎంపికలు చేసినట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిదిండి సత్యనారాయణరాజు తెలిపారు. ఇరు జట్ల నుంచి 24 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. సంఘ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కేఎస్ జాబ్స్, జిల్లా కార్యదర్శి గంటా విక్టర్బాబు, స్కూల్ ప్రిన్సిపాల్ పద్మజ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. పురుషుల జట్టు: ఆర్.రాహుల్, వై.వెంకట సాత్విక్, టి.కార్తికేయ, ఎం.అరవింద్, జి.శ్రీనాగ వీరసాయితేజ, పి.దుర్గాఅరవింద్, కె.రామ్చరణ్, జి.జగన్ప్రకాష్, టి.ఉమేష్, ఎం.యశ్వంత్, జి.పవన్, జి.ఆకాష్. మహిళల జట్టు: ఎస్.రేణుక, పి.నవ్యశ్రీ, ఎస్.సాయిరేఖ, జె.హరిణి, కె.మౌనిక, సీహెచ్ దేవి, కె.కనకదుర్గ, వి.విజయ దుర్గాభవాని, జి.దుర్గాసత్యశ్రీ, ఎం.త్రినేత్రదేవి, బి.వెన్నెల, పి.గంగ. -
సొమ్ము కాజేసినట్టు ఇద్దరిపై కేసు నమోదు
కొవ్వూరు: తమను మోసం చేసి, సొమ్ము కాజేశారంటూ ధర్మవరం గ్రామానికి చెందిన బొజ్జా సింధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై బుధవారం కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై కె.శ్రీహరిబాబు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దుద్దుకూరు గ్రామానికి చెందిన కడిమి శ్రీనుబాబు, మెరిపో కృష్ణ వద్ద సింధు అప్పు తీసుకుంది. అప్పు తీర్చేందుకు ఇంటిపై రుణం ఇప్పిస్తామని చెప్పి శ్రీనుబాబు, కృష్ణ మోసపూరితంగా ఆమె వద్ద రూ.3.45 లక్షలు దఫాదఫాలుగా కాజేశారు. ఇంటిపై రుణం ఇప్పించకపోవడంతో ఆమె తన భర్తతో వెళ్లి వారిని ప్రశ్నించగా, తమపై దౌర్జన్యం చేసి, చంపుతామని బెదిరించినట్టు సింధు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. రూ.3.60 లక్షల ఎరువుల సీజ్ పిఠాపురం: గొల్లప్రోలు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి చెందిన మన గ్రోమోర్ రిటైల్ సెంటర్లో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ నాగవెంకటరాజు మాట్లాడుతూ, విజిలెన్స్ ఎస్పీ స్నేహిత ఆదేశాల మేరకు, డీఎస్పీ తాతారావు పర్యవేక్షణలో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి 14–35–14 రకం చెందిన 200 బస్తాల ఇన్వాయిస్ రికార్డులు సక్రమంగా లేకపోవడం, రైతుల కోసం ఫిర్యాదు బాక్స్ లేకపోవడం, స్టాక్ బోర్డ్ నిర్వహణ లేకపోవడం తదితర అంశాలను గుర్తించామన్నారు. షాపు యజమానిపై 6ఏ కేసు నమోదు చేసి, రూ 3.60 లక్షల విలువైన కాంప్లెక్స్ ఎరువులను సీజ్ చేశామన్నారు. దాడుల్లో విజిలెన్స్ ఏఓ మధుమోహన్, గొల్లప్రోలు ఏఓ సత్యనారాయణ, తూనికలు, కొలతల అధికారి సరోజ పాల్గొన్నారు. కాకినాడ, సామర్లకోట రైల్వే స్టేషన్లలో తనిఖీలు రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు వాణిజ్య విభాగం బృందంతో కలసి బుధవారం కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా కాకినాడ టౌన్ స్టేషన్లోని ప్లాట్ఫాంలు, టాయిలెట్లు, వెయిటింగ్ హాళ్లు, ప్రయాణికుల సదుపాయాలు, లైటింగ్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. స్టాళ్లలో ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలు, వాటర్ బాటిళ్లను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం ఎమ్మార్పీకే విక్రయించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ టౌన్ స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో రూ.31.37 కోట్లతో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ప్రయాణికులు, సిబ్బంది, స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలోనూ తనిఖీలు చేశారు. -
క్రీడా స్ఫూర్తిని చాటిన హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు బుధవారం క్రీడా స్ఫూర్తిని చాటాయి. పురుషుల విభాగంలో రాజస్థాన్ సెక్టార్పై 7–1 స్కోర్తో ఛత్తీస్గఢ్ సెక్టార్, ఆర్బీఎస్ భువనేశ్వర్పై ఆర్బీఎస్ ఉత్తరాఖండ్ 5–0తో, ఆర్బీఎస్ ఛండీగఢ్పై ఆర్బీఎస్ బెంగళూరు 4–1తో, గోవా సెక్టార్పై తెలంగాణ సెక్టార్ 21–0 స్కోర్తో విజయం సాధించాయి. మహిళల విభాగంలో రాజస్థాన్ సెక్టార్పై సెంట్రల్ సెక్టార్ 5–0 స్కోర్తో, కేరళ సెక్టార్పై ఛత్తీస్గఢ్ సెక్టార్ 13–0 స్కోర్తో, మధ్య ప్రదేశ్ సెక్టార్పై ఏపీ సెక్టార్ 18–0 స్కోర్తో గెలుపొందాయి. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకుని, మ్యాచ్లను ప్రారంభించారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర, సూరిబాబు పర్యవేక్షించారు. -
ప్రశాంతంగా ఈడీఎం రాత పరీక్ష
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్లో ఈ–గవర్నెన్స్ జిల్లా మేనేజర్ (ఈడీఎం) పోస్టును కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు కలెక్టరేట్లో మంగళవారం రాత పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, మొత్తం 93 మంది హాజరయ్యారని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. పరీక్షను కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎండీ ఆలీ, సెక్షన్ సూపరింటెండెంట్ మహేశ్వరి పర్యవేక్షించారు. ఈ పోస్టుకు మొత్తం 115 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. వచ్చే నెల 8 వరకూ 144 సెక్షన్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉన్నందున వచ్చే నెల 8వ తేదీ వరకూ జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని జిల్లా అడ్మిన్ ఏఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, కాకినాడ జిల్లా తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లా నుంచి ఎవరూ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లడానికి అనుమతులు లేవన్నారు. జిల్లావ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎవ్వరినీ గృహనిర్బంధం చేయలేదని చెప్పారు. జిల్లాలో ఎవరిని హౌస్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చెయ్యలేదన్నారు. 1,556 మంది అంగన్వాడీలకు శిక్షణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్యపై అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి సర్టిఫికెట్ కోర్స్ మొదటి విడత శిక్షణను ఆర్యాపురంలోని నన్నయ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఆయన మంగళవారం ప్రారంభించారు. తొలి విడతలో జిల్లాలోని 19 మండలాల్లోని 21 కేంద్రాల్లో 1,556 మందికి ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతి మండలానికి పాఠశాల విద్యా శాఖ నుంచి ముగ్గురు, మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి ముగ్గురు చొప్పున విషయ నిపుణులు శిక్షణ ఇస్తున్నారన్నారు. జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాలు, ఆరోగ్యంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, పిల్లల నమోదు పెంచాలని, అభ్యసన ఫలితాల సాధనకు కృత్యాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డీఐ బి.దిలీప్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు బి.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నేడు పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో పెండింగ్ పెన్షన్, జీపీఎఫ్ కేసులను సమీక్షించేందుకు అకౌంటెంట్ జనరల్ ఆధ్వర్యంలో బుధవారం అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 10 గంటలకు జిల్లా పరిధిలోని పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా, డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి కార్యాలయాల్లో, శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న పెన్షన్ కేసులు, పెన్షన్ అనుబంధ సమస్యల వివరాలతో హాజరు కావాలని సూచించారు. పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ కేసులను సమీక్షించి అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు పదవీ విరమణ తేదీకి ముందే సంబంధిత జిల్లా డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి పెన్షన్ పత్రాలను సమర్పించే విధంగా అవగాహన కల్పిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకూ విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, కడప, పాడేరు, తిరుపతి, ఏపీ సెక్రటేరియట్ వెలగపూడి, మంగళగిరిలోని డీజీపీ కార్యాలయాల్లో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని శాంతిప్రియ వెల్లడించారు. -
టీడీపీ తీరు దుర్మార్గం
రాజమహేంద్రవరం సిటీ: తునిలో టీడీపీ వ్యవరిస్తున్న తీరు పరమ దుర్మార్గంగా ఉందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దుయ్యబట్టారు. తుని మున్సిపాలిటీలో కూటమి నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా లేనప్పటికీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి దుశ్చర్యలకు పాల్పడటం శోచనీయమని మండిపడ్డారు. రాష్ట్ర మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి నిరసనగా చలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు మంగళవారం ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీనిపై జక్కంపూడి రాజా స్పందించారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లూ వైఎస్సార్ సీపీ నుంచే గెలిచారని, టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఒక్కరు కూడా గెలవలేదని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కౌన్సిలర్లను భయపెట్టడం, బెదిరించడం ద్వారా అసలు ఎన్నిక జరగకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. దీనికి తోడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి తెగబడటం సరి కాదన్నారు. ఆయనకు అండగా నిలవాలనే ఉద్దేశంతో చలో తునికి పిలుపునిస్తే అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నాప్లు, రేప్లు, మహిళలపై దాడుల వంటి ఘటనలపై పోలీసులు దృష్టి సారించాల్సింది పోయి, స్థానిక సంస్థలను గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే పార్టీలకు కొమ్ము కాయడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రజలకు మేలు చేయడానికి, అభివృద్ధికి అధికారాన్ని ఉపయోగించుకోవాలనే తప్ప అక్రమాలకు వేదికగా చేసుకోరాదని అన్నారు. దొడ్డిదారిన వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇదే వైఖరి కొనసాగిస్తే వైఎస్సార్ సీపీ నుంచే కాకుండా ప్రజల నుంచి సైతం తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ, కూటమి శ్రేణులను జక్కంపూడి రాజా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జక్కంపూడి గణేష్ అడ్డగింపు చలో తుని పిలుపు నేపథ్యంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ను పోలీసులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ గణేష్ ఆధ్వర్యాన పార్టీ నేతలు, కార్యకర్తలు జేఎన్ రోడ్డులోని ఆయన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ మీడియాతో మాట్లాడుతూ, తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు అధికార యంత్రాంగం, పోలీసులు రక్షణ కల్పించకపోగా, తిరిగి ఆయన పైనే కేసులు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. తుని వైస్ చైర్మన్ పదవి కోసం దుశ్చర్యలకు పాల్పడుతోంది వైఎస్సార్ సీపీ శ్రేణులను అడ్డుకోవడం శోచనీయం వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా -
‘నన్నయ’ వీసీగా ఆచార్య ప్రసన్నశ్రీ
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా సత్తుపాటి ప్రసన్నశ్రీని నియమించారు. ఆమె గురువారం ఉదయం నన్నయ వర్సిటీకి వచ్చి ఇన్చార్జి వీసీ ఆచార్య వై.శ్రీనివాసరావు నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ ఇంగ్లిష్ ప్రొఫెసర్గా ఉన్న ఆమెకు 38 సంవత్సరాల బోధనా అనుభవం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సెమినార్లు నిర్వహించి, 60 సెమినార్లలో పాల్గొన్నారు. ఆమె రచించిన 125 పరిశోధన వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రచురితమయ్యాయి. 19 గిరిజన భాషల లిపికి రూపకల్పన అంతరించిపోతున్న గిరిజన భాషలను కాపాడేందుకు బగత, గదబ, కొలామి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించిన తొలి మహిళగా ఆచార్య ప్రసన్నశ్రీ పేరు పొందారు. 2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం కూడా అందుకున్నారు. అవార్డుల పరంపర విద్యారంగంలో చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఉత్తమ ఉపాధ్యాయ, ఉత్తమ మహిళా స్పీకర్, గిరిజన అరక బ్రహ్మ, దళిత సాహిత్య అకాడమీ, వుమెన్ అచీవర్స్, నారీశక్తి, ఇండియన్ ఇండిగోనెస్ స్క్రిప్టేర్ అవార్డు వంటి వాటితో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. విద్యావేత్తగా, సాహితీవేత్తగా, పరిశోధకురాలిగా, సెమినార్స్, వర్క్షాప్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాములు నిర్వహిస్తూ భాషా సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్నారు. -
ప్రకృతి సాగు అనుసరణీయం
కొవ్వూరు: ఆరోగ్యకరమైన పంటల కోసం రైతులు ప్రకృతి సాగు పద్ధతులను అనుసరించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. దొమ్మేరు గ్రామంలో ప్రకృతి సాగు పంటలను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 42 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు జరుగుతోందని అన్నారు. 12 డ్రోన్ల సాయంతో 3,800 మంది రైతులు 4,200 ఎకరాల్లో కషాయాలు వాడుతూ ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు. కషాయాలు వాడుతూ పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం శుభ పరిణామమని అన్నారు. జిల్లావ్యాప్తంగా 7,300 మంది రైతులు పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ప్రకృతి సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. దొమ్మేరుకు చెందిన రైతు నీరుకొండ సత్యనారాయణ తన 12 ఎకరాల్లో చెరకు, బొప్పాయి, మొక్కజొన్న, నువ్వులు, అరటి, కోకో, కొబ్బరి, కంద, డ్రాగన్ ఫ్రూట్, జామ తదితర పంటలు పండించడం హర్షణీయమని అన్నారు. వరిలో డ్రోన్తో కషాయాల పిచికారీని కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, ఆర్డీఓ రాణి సుస్మిత, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం బి.తాతారావు, అదనపు డీపీఎం మహబూబ్ వలీ, వ్యవసాయ శాఖ ఏడీ పి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ తీరు దుర్మార్గం
రాజమహేంద్రవరం సిటీ: తునిలో టీడీపీ వ్యవరిస్తున్న తీరు పరమ దుర్మార్గంగా ఉందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దుయ్యబట్టారు. తుని మున్సిపాలిటీలో కూటమి నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా లేనప్పటికీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి దుశ్చర్యలకు పాల్పడటం శోచనీయమని మండిపడ్డారు. రాష్ట్ర మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి నిరసనగా చలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు మంగళవారం ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీనిపై జక్కంపూడి రాజా స్పందించారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లూ వైఎస్సార్ సీపీ నుంచే గెలిచారని, టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఒక్కరు కూడా గెలవలేదని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కౌన్సిలర్లను భయపెట్టడం, బెదిరించడం ద్వారా అసలు ఎన్నిక జరగకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. దీనికి తోడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి తెగబడటం సరి కాదన్నారు. ఆయనకు అండగా నిలవాలనే ఉద్దేశంతో చలో తునికి పిలుపునిస్తే అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నాప్లు, రేప్లు, మహిళలపై దాడుల వంటి ఘటనలపై పోలీసులు దృష్టి సారించాల్సింది పోయి, స్థానిక సంస్థలను గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే పార్టీలకు కొమ్ము కాయడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రజలకు మేలు చేయడానికి, అభివృద్ధికి అధికారాన్ని ఉపయోగించుకోవాలనే తప్ప అక్రమాలకు వేదికగా చేసుకోరాదని అన్నారు. దొడ్డిదారిన వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇదే వైఖరి కొనసాగిస్తే వైఎస్సార్ సీపీ నుంచే కాకుండా ప్రజల నుంచి సైతం తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ, కూటమి శ్రేణులను జక్కంపూడి రాజా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జక్కంపూడి గణేష్ అడ్డగింపు చలో తుని పిలుపు నేపథ్యంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ను పోలీసులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ గణేష్ ఆధ్వర్యాన పార్టీ నేతలు, కార్యకర్తలు జేఎన్ రోడ్డులోని ఆయన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ మీడియాతో మాట్లాడుతూ, తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు అధికార యంత్రాంగం, పోలీసులు రక్షణ కల్పించకపోగా, తిరిగి ఆయన పైనే కేసులు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. తుని వైస్ చైర్మన్ పదవి కోసం దుశ్చర్యలకు పాల్పడుతోంది వైఎస్సార్ సీపీ శ్రేణులను అడ్డుకోవడం శోచనీయం వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా -
తునిలో గూండాగిరీ
టీడీపీ ‘అధికార’ దుర్వినియోగం గత మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత ప్రజాదరణతో 30కి 30 కౌన్సిలర్ స్థానాలనూ వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోని టీడీపీ.. ప్రస్తుతం తునిలో అరాచకాలకు పాల్పడుతోంది. వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినా ఎన్నిక ప్రశాంతంగా జరిపించలేక చేతులెత్తేయడం విచిత్రం. ఈ ఎన్నిక సందర్భంగా టీడీపీ అధికార దుర్వినియోగం తునిలో అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రజాస్వామ్యంపై తుని పట్టణంలో కొద్ది రోజులుగా క్రూర పరిహాసం జరుగుతోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క కౌన్సిలర్ను కూడా గెలిపించుకోలేని స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న టీడీపీ.. ఆ పురపాలికలో చిన్నపాటి ‘ఏలిక’ పదవి కోసం అడ్డమైన దారులూ తొక్కుతోంది. ప్రజాస్వామిక విలువలను, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని, ఎన్నికల నిబంధనలను అడ్డగోలుగా కాలరాసి.. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గూండాగిరీకి తెగబడుతోంది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లపై దాడులకు దిగుతూ, వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎలాగైనా మున్సిపాలిటీలో తిష్ట వేయడానికి కుట్రపూరితంగా ప్రయత్నాలు సాగిస్తోంది. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా.. అధికార యంత్రాంగం అధికార మదానికి తల వంచి, చేష్టలుడిగి చూస్తూండటం ప్రజాస్వామిక వాదులను నివ్వెరపరుస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: తునిలో తెలుగుదేశం పార్టీ గుండాగిరీ రాజ్యమేలుతోంది. పోలీసు సహా అధికార వ్యవస్థలన్నీ ఆ పార్టీ నేతలకు జీహుజూర్ అంటూ, వారు చెప్పినట్టే నడుచుకుంటున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని టీడీపీ నేతలు తమ చెప్పుచేతల్లో ఉంచుకుని, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేయించిన విషయం తెలిసిందే. అదే క్రమంలో టీడీపీ అరాచకవాదులు మంగళవారం మరోసారి దౌర్జన్యకాండకు తెగబడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన వైస్ చైర్మన్ ఎన్నికను నాలుగోసారి కూడా వాయిదా వేయించారు. కౌన్సిలర్లపై మూకుమ్మడి దాడి తుని మున్సిపల్ కౌన్సిల్ వేదికగా జిల్లా స్థాయి అధికారులు, పోలీసులు, టీడీపీ నేతలు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా డ్రామాను రక్తి కట్టించారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేలా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పోలీసు రక్షణ బాధ్యతలను జిల్లా అదనపు ఎస్పీ ఎంవీజే భాస్కరరావు, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి దేవరాజ్ మనీష్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజుకు అప్పజెప్పారు. తద్వారా కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొనేలా రక్షణ కల్పిస్తామని జిల్లా యంత్రాంగం చెప్పింది. ఆ భరోసాతో కౌన్సిల్ హాలుకు ఓటింగ్కు బయలుదేరిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లపై టీడీపీ శ్రేణులు తమ కుట్రలో భాగంగా మూకుమ్మడిగా దాడికి దిగాయి. దీనికి పోలీసులు కూడా సహకరించారనే విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను కౌన్సిల్ హాలుకు 200 మీటర్ల దూరాన పోస్టాఫీసు వీధిలో ఉన్న పిఠాపురం డాక్టర్ ఆస్పత్రి దాటి ముందుకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ, టీడీపీ శ్రేణులను మాత్రం కౌన్సిల్ హాలు దగ్గర వరకూ అనుమతించి, ‘పచ్చ’పాత ధోరణి చూపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించి మరీ ‘పచ్చ’ గూండాలు.. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల పైకి దూసుకుపోతున్నా పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప నిలువరించిన దాఖలాలు కనిపించ లేదు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పిస్తామన్న జిల్లా యంత్రాంగం మాటలు చివరకు గాలిలో కలసిపోయాయి. ‘చలో తుని’ అడ్డగింపు తునిలో అధికార టీడీపీ అరాచకాన్ని నిరసిస్తూ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇచ్చిన ‘చలో తుని’ పిలుపునకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందించాయి. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు భారీ సంఖ్యలో తుని తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. సోమవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు ఎక్కడికక్కడ పార్టీ ముఖ్య నేతలకు 41 నోటీసులు జారీ చేసి, తెల్లారేసరికి హౌస్ అరెస్టులు చేశారు. నియోజకవర్గాల నుంచి తుని బయలుదేరిన నేతలను మార్గం మధ్యలో అడ్డుకున్నారు. ● గొల్లప్రోలు టోల్ప్లాజా వద్ద పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ నాయకులు అల్లి రాజబాబు, సుంకర విద్యాసాగర్, రావూరి వెంకటేశ్వరరావు, జమ్మలమడక నాగమణి తదితర నేతలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ● జగ్గంపేట నియోజకవర్గం నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, పార్టీ జగ్గంపేట ఇన్చార్జి తోట నరసింహం, యువ నాయకుడు తోట రాంజీ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను తుని రైల్వే చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ● మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు పార్టీ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తదితరులను తుని రైల్వే గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ● రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు తదితరులను సామర్లకోటలో పోలీసులు అడ్డగించారు. దీనిని నిరసిస్తూ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి, నిరసన తెలిపారు. ● రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం సమన్వయకర్త జక్కంపూడి గణేష్లను పోలీసులు తుని వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుని పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. రాజాను హౌస్ అరెస్టు చేశారనే సమాచారంతో మాజీ మంత్రి, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్లు ఆయన ఇంటికి వెళ్లగా వారిని పోలీసులు అక్కడే నిర్బంధించారు. ● రాజోలు కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును రావులపాలెం వద్ద, పి గన్నవరం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావును అయినవిల్లిలోను హౌస్ అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యంపై క్రూర పరిహాసం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మరోసారి అడ్డుకున్న టీడీపీ పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయిన ‘పచ్చ’ గూండాలు కౌన్సిలర్లపై దాడికి యత్నం భయంతో పరుగు తీసిన కౌన్సిలర్లు కోరం లేక నాలుగోసారీ ఎన్నిక వాయిదా -
ప్రతి మండలంలో రీసర్వేకు పైలట్ గ్రామం
దేవరపల్లి: జిల్లాలోని ప్రతి మండలంలోనూ ఒక గ్రామాన్ని పైలట్గా ఎంపిక చేసి భూముల రీసర్వే చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తెలిపారు. మండలంలో పైలట్ గ్రామంగా ఎంపిక చేసిన చిన్నాయగూడెంలో భూముల రీసర్వే పనులను కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మితతో కలసి ఆయన మంగళవారం పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సర్వే బృందానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ, రీసర్వే సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అభ్యంతరాలుంటే పూర్తి వివరాలు తీసుకుని పరిష్కరిస్తున్నామని చెప్పారు. స్టాండర్డ్ ఆఫ్ ప్రాసెస్ (ఎస్ఓపీ) ప్రకారం సర్వే నంబరులోని ప్రతి రైతుకూ ముందుగా ఫామ్–19 అందజేస్తున్నామన్నారు. ముందుగా గ్రామ సరిహద్దులు ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూములను నమోదు చేశామని తెలిపారు. బ్లాక్లు ఏర్పాటు చేసి, ఆ బ్లాక్లోని రైతులందరికీ నోటీసులిచ్చి అందరి సమక్షంలో వారి అనుభవంలో ఉన్న భూముల విస్తీర్ణం వివరాలు నమోదు చేస్తున్నామని వివరించారు. రైతుల వద్ద ఉన్న కొత్త రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.రాజ్యలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, మండల సర్వేయర్ దిల్లేష్, వీఆర్వోలు పాల్గొన్నారు. -
హోరాహోరీగా ఆలిండియా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు మంగళవారం హోరాహోరీగా జరిగాయి. గుజరాత్ సెక్టార్, రాజస్థాన్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 11–2 స్కోర్తోను, పుదుచ్చేరి సెక్టార్, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఉత్తరాఖండ్ 6–4 స్కోర్తోను, ఆర్ఎస్పీబి సిమ్లా, ఆర్ఎస్పీడి జైపూర్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్పీబి జైపూర్ 9–2 స్కోర్తోను విజయం సాఽధించాయి. ఆర్ఎస్పీబి ముంబయి, ఆర్ఎస్పీబి చైన్నె మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్పీబి ముంబాయి 5–1స్కోర్తో, ఆంధ్రప్రదేశ్ సెక్టార్, గోవా సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ 23–0 స్కోర్తోను గెలుపొందగా జట్టులోని శ్రీనివాస్రావు 6, ఉదయ్కుమార్ 7 గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మహిళల విభాగంలో ఒడిశా సెక్టార్, ఢిల్లీ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒడిశా సెక్టార్ 16–0 స్కోర్ తోను, హర్యానా సెక్టార్, తెలంగాణ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా సెక్టార్ 18–0 స్కోర్తోను, బిహార్ సెక్టార్, ఉత్తరాఖండ్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో బిహార్ సెక్టార్ 7–1 స్కోర్తో విజయం సాధించాయి. మంగళవారం నిర్వహించిన మ్యాచ్లను కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, డిఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్లు పర్యవేక్షించారు. -
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడు విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన మంగళవారం జెడ్పీ సమావేశపు మందిరంలో 1, 2, 4, 7 స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా 3వ స్థాయీ సంఘ సమావేశం వైఎస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు అధ్యక్షతన, 5వ స్థాయీ సంఘ సమావేశం సంఘ చైర్పర్సన్, జెడ్పీటీసీ సభ్యురాలు రొంగల పద్మావతి, 6వ స్థాయీ సంఘ సమావేశం జెడ్పీ వైస్ చైర్మన్ మేరుగు పద్మలత అధ్యక్షతన నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం నిర్వహించబోయే ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నిక దృష్ట్యా ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సమావేశం నిర్వహించినట్లు చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు వివరించారు. ఏవిధమైన శాఖాపరమైన సమీక్షలుగాని, తీర్మానాలుగాని చేయకుండా, ఆమోదించకుండా సమావేశాలు ముగించారు. ఈ సమావేశాలకు జిల్లా పరిషత్ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, ఆయా జిల్లాల వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా ప్రజాపరిషత్ పరిపాలనాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
అమలాపురం టౌన్: అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అల్లవరం గ్రామానికి చెందిన వీరమల్లు హిమ రాజేశ్వరి అదృశ్యమైంది. ఆమె తాను చదువుతున్న కళాశాల నుంచి సాయంత్రం 3.10 గంటలకు వెళ్లిపోయినట్లు పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థిని తండ్రి వీరమల్లు దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హిమ రాజేశ్వరి ఎత్తు 5 అడుగులు, ఎస్కేబీఆర్ కళాశాల యూనిఫాం ధరించింది. తెలుగు రంగు కలిగి ఉంటుంది. ఆమె ఆచూకీ తెలిసిన వారు అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు 9440796561, పట్టణ ఎస్సై శ్రీనివాస్ 9848132305, విద్యార్థిని తండ్రి దుర్గా ప్రసాద్ 9949729616 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని పట్టణ పోలీసులు విజ్ఞప్తి చేశారు. యువతి ఆత్మహత్య కాకినాడ క్రైం: తల్లిదండ్రులు మందలించారనే వేదనతో ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే కాకినాడ సూర్యనారాయణపురంనకు చెందిన అనపాల అరుణ (24) స్థానిక వెంకీ రెసిడెన్సీలో హౌస్ కీపర్గా పనిచేస్తోంది. ఈమె తరచుగా అప్పులు చేస్తుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆవేదన చెంది ఈ నెల 16వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులు కాకినాడ త్రీటౌన్ పోలీసుస్టేషన్లో కుమార్తె అరుణ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. కేసు విచారణ కొనసాగుతుండగా మంగళవారం సాయంత్రం జగన్నాథపురం వంతెన కింద ఉన్న ఉప్పుటేరులో మృతదేహం కొట్టుకొచ్చింది. -
నూనె తయారీపై ‘తేలి’ సినిమా
సామర్లకోట: తమ తెలుకుల, గాండ్ల కులస్తులు అనాధిగా తయారు చేస్తున్న నూనె తయారీపై ‘తేలి’ అనే పేరుతో ప్రత్యేక చిత్రం త్వరలోనే రూపొందించనున్నట్టు సీనియర్ సినీనటుడు మొల్లెటి బాలాజీ తెలిపారు. స్థానిక పంచారామ క్షేత్రాన్ని దర్శించుకున్న సందర్భంగా ఆయన మంగళవారం విలేకరులకు తన సినిమా అనుభవాలను వెల్లడించారు. 1983వ సంవత్సరంలో తాను ఓ ఆడది మగాడు చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రోత్సహంతో చిత్ర సీమలో అడుగుపెట్టానని తెలిపారు. మగమహారాజు, మంగమ్మగారి మనవడు వంటి చిత్రాలు గుర్తింపు తీసుకు వచ్చాయని వివరించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో కలిసి అనేక చిత్రాలల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందడం ఆనందంగా ఉన్నదన్నారు. నూనె పుట్టుక, వినియోగం అన్ని వంటకాల్లోనూ, పూజల్లో నూనెకు అంతటి ప్రాధాన్యత దక్కడం వంటి అంశాలపై చిత్రంలో వివరించనున్నట్లు వివరించారు. త్వరలో త్రినేత్ర సినిమాలో కూడా తాను నటిస్తున్నట్లు చెప్పారు. బుచ్చిబాబు దర్శకత్వలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్చరణ్తో కలిసి నటిస్తున్నట్లు చెప్పారు. వశిష్ట చిత్రంలో పోలీసు ఆఫీసరుగా నటిస్తున్నట్లు తెలిపారు. 40 ఏళ్ల తన సీనీ జీవితంలో అనేక విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఇప్పటి వరకు రెండు పర్యాయాలు సామర్లకోట భీమేశ్వరస్వామి వచ్చానన్నారు. సామర్లకోటలో 100 సంవత్పరాలకు పైబడి అంబటి సుబ్బన్న ఆయిల్ పరిశ్రమలో తయారు అవుతున్న నూనె రాష్ట్ర వ్యాప్తంగా అందించడానికి చేస్తున్న సేవలను బాలాజీ కొనియాడారు. నృత్యకారుడికి అభినందన తెలుకుల గాండ్ల కులానికి చెందిన అలమండ ప్రసాద్ అంతర్జాతీయంగా కూచిపూడి నృత్యంలో రాణించడంపై బాలాజీ అభినందించారు. దేశ, విదేశాల్లో ప్రసాద్ నృత్యాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం అభినందనీయమన్నారు. యోగం ఉంటేనే సామర్లకోటలోని యోగ లింగాన్ని దర్శించుకోగలుగుతామని అన్నారు. సీనియర్ నటుడు బాలాజీ -
ఈఎస్ఐ ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులతో సహా 9 మంది సస్పెన్షన్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విధుల్లో నిర్లక్ష్యంగా వహించిన ఈఎస్ఐ ఆసుపత్రిలో 5 గురు వైద్యులతో సహా 9 మందిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెనన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు. కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన విషయం తెలిసిందే. విధులను సక్రమంగా నిర్వహించని కారణంగా ఐదుగురు వైద్యులు, నలుగురు కార్యాలయ సిబ్బంది సస్పెండ్కు గురయ్యారు. మంత్రి ఆకస్మిక తనిఖీలో కొందరు వైద్యులు, సిబ్బంది హాజరు నమోదు చేసుకుని విధులకు హాజరుకాకండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. హాజరు నమోదు పుస్తకాలను పరిశీలించగా, కొందరు హాజరు నమోదు చేయకపోవడం, కొందరు హాజరు నమోదు చేసి వెంటనే వెళ్లిపోవడం, మరికొందరు సమస్యలకు సరైన సమాధానం ఇవ్వకపోవడం విచారణలో తేలింది. దీన్ని సీరియస్గా తీసుకున్న మంత్రి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ఈఎస్ఐ బీమా చందాదారులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, రోగుల సంరక్షణలో ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. -
ఏజెంట్ వేధింపులతో ఆత్మహత్య
మామిడికుదురు: ఏజెంట్ వేధింపుల వల్లే మా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మా అబ్బాయికి ఎదురైన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు. ఏజెంట్పై చర్య తీసుకోవాలంటూ మొగలికుదురుకు చెందిన నేదూరి సురేష్, రామలక్ష్మి దంపతులు కలెక్టర్ మహేష్కుమార్, ఎస్పీ కృష్ణారావుకు ఈ నెల 15వ తేదీన ఫిర్యాదు చేశారు. మొగలికుదురుకు చెందిన నేదూరి తారక ముత్యాలరాము (24) ఈ నెల 13వ తేదీన కువైట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం సోమవారం స్వగ్రామం మొగలికుదురు చేరింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు, మృతుని అన్న ఫణీంద్రకుమార్ తెలిపిన వివరాలు ఇవీ.. మొగలికుదురుకు చెందిన నేదూరి తారక ముత్యాలరాము బైక్ మెకానిక్గా పనిచేస్తూ కారు డ్రైవింగ్ కూడా చేసేవాడు. అతను గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన కువైట్ బయలు వెళ్లాడు. ఈ ఏడాది జనవరి 1వ తేదీన కువైట్ చేరుకున్నాడు. మామిడికుదురు మండలం కొమరాడకు చెందిన ఏజెంట్ వలవల నాగరాజు ద్వారా అతను కువైట్ వెళ్లాడు. శేఠ్ తనను బాగా చూసుకుంటున్నాడని, తన సహ ఉద్యోగి, రూమ్మేట్ అయిన ఏజెంట్ వలవల నాగరాజు తరచు వేధింపులకు గురి చేస్తున్నాడని ఫోన్లో తల్లిదండ్రులకు చెప్పేవాడు. రెండు, మూడు సార్లు కొట్టాడు. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 1.20 గంటలకు మా అబ్బాయి తనతో మాట్లాడాడని తల్లి రామలక్ష్మి తెలిపారు. అదే రోజు సాయంత్రం 7.18 గంటలకు ఏజెంట్ నాగరాజు నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడని చెప్పారు. 7.50 గంటల సమయంలో ఏజెంట్కు చెందిన ఇద్దరు వ్యక్తులు కొమరాడ నుంచి వచ్చి మీ అబ్బాయి కనిపించడం లేదని, దీని వల్ల ఏజెంట్ నాగరాజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడంటూ చెప్పారన్నారు. అప్పటి నుంచి తన కుమారుడి ఫోన్ పని చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 14వ తేదీ ఉదయం 2 గంటల సమయంలో కువైట్లో ఉంటున్న తమ బంధువు ద్వారా రాము ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందని ఆవేదనతో చెప్పారు. ఏజెంట్ వేధింపులే తమ కుమారుడి మృతికి కారణమని ఆరోపించారు. మరో వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురు కాకూడదని, ఏజెంట్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీకి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన -
గుండెపోటుతో ఇంటలిజెన్స్ హెచ్సీ మృతి
కొవ్వూరు: ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఈ డేవిడ్రాజు (47) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు చాగల్లులోని స్వగృహంలో తెల్లవారు జామున గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నిడదవోలులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి ఈసీజీ తీసిన వైద్యుల సూచనల మేరకు గుండెపోటుగా నిర్ధారించుకుని రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతుండగా మధ్యాహ్నం మరోసారి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయనకి భార్య, ముగ్గురు కుమారులున్నారు. ఈయన స్వస్థలం ఏలూరు సమీపంలోని మముడూరు. ఉద్యోగ రీత్యా కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తూ చాగల్లులో స్వగృహం నిర్మించుకున్నారు. -
బీసీ గురుకులాల్లో ప్రవేశ పరీక్షకు వేళాయె..
రాయవరం: మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాఠశాలల్లో 480 మంది విద్యార్థులకు ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు లభించనున్నాయి. బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో 480 సీట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం వద్ద ఉన్న సమనస బాలుర పాఠశాలలో 80, రామచంద్రపురం బాలికల పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లా కరప బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 80, తుని బాలుర పాఠశాలలో 40, పెద్దాపురం బాలుర పాఠశాలలో 40 సీట్లు, ఇటీవల నూతనంగా పిఠాపురంలో ప్రారంభించిన పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బాలుర గురుకుల పాఠశాలలో 40, రాజమహేంద్రవరం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 40, కొవ్వూరు బాలుర ఉన్నత పాఠశాలలో 40, గోపాలపురం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 480 సీట్లకు ఎంట్రన్స్ నిర్వహిస్తారు. కోనసీమ జిల్లా సమనస పాఠశాలలో 40 శాతం (32 సీట్లు) మత్స్యకారులకు మాత్రమే కేటాయిస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఐదవ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశానికి సంబంధించి ప్రవేశ పరీక్ష 4వ తరగతి స్థాయి పరీక్ష ఉంటుంది. తెలుగు, ఇంగ్లిషు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులపై 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఇస్తారు. తెలుగు–15, ఇంగ్లిషు–25, గణితం–30, పరిసరాల విజ్ఞానం నుంచి 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు. విద్యార్థులు సమాధానాలను ఓఎంఆర్ షీట్లో గుర్తించాల్సి ఉంటుంది. జిల్లా యూనిట్గా ప్రవేశాలకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రం వివరాలను హాల్ టిక్కెట్లో తెలియజేస్తారు. అభ్యర్థులు అర్హతలు పరిశీలించుకుని దరఖాస్తు చేసుకున్న తర్వాత రూ.100 చెల్లించాలి. ఫీజు చెల్లించిన వారికి నంబరును కేటాయిస్తారు. నంబరు ఆధారంగా ఆన్లైన్లో హెచ్టీటీపీఎస్://ఎంజేపీఏపీబీసీడబ్లూఆర్ఈఐఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నంబరును పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన కాలమ్లో నమోదు చేయాలి. వచ్చే నెల 15 తుది గడువు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 15 తుది గడువు. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వత ఒక రిఫరెన్స్ నంబర్ ఇస్తారు. నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థి కులధ్రువీకరణ, ఆదాయం, పుట్టినతేదీ, ప్రత్యేక కేటగిరి ధ్రువీకరణ, స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్ పత్రాలు ఒరిజనల్స్ కౌన్సిలింగ్ సమయంలో చూపవలసి ఉంటుంది. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించరాదు. సర్టిఫికెట్లు సమర్పించకుంటే విద్యార్థి ఎంపిక అయినప్పటికీ సీటు కేటాయించరు. పరీక్ష తేదీకి ఏడు రోజులు ముందుగా రిఫరెన్స్ నంబరు ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు పోస్టులో లేదా నేరుగా పంపించరు. దరఖాస్తు నింపే సమయంలో ఈ సూచనలు పాటించాలి ఫ దరఖాస్తును ఆన్లైన్ లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును పూరించాలి. ఫ దరఖాస్తుదారులు సొంత జిల్లాలో మాత్రమే పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేయాలి. ఫ పాఠశాల ప్రాధాన్యతాక్రమం ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టిక చూసుకుని పూరించాలి. ఫ పాస్పోర్టు సైజ్ ఫొటోను సిద్ధం చేసుకోవాలి. ఫ దరఖాస్తు పూరించే సమయంలో జరిగే పొరపాట్లకు విద్యార్థిదే పూర్తి బాధ్యత. ఫ ఒకసారి దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులకు తావులేదు. సీబీఎస్ఈ విద్యా విధానం అమలు మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లిషు మీడియం విద్య లభిస్తుంది. 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ అమలు చేస్తున్నాం. ప్రాథమిక తరగతుల్లో ప్రాజెక్టు బేస్డ్ లెర్నింగ్ అమలు పరుస్తున్నాం. – డాక్టర్ వైటీఎస్ రాజు, ప్రిన్సిపాల్, ఎంజేపీఏపీబీసీడబ్ల్యుఆర్ స్కూల్, సమనస సద్వినియోగం చేసుకోవాలి వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు విడుదలైన నోటిఫికేషన్ను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ద్రాక్షారామలో బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతికి 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఎంట్రన్స్ పరీక్షలో పాల్గొని విద్యార్థులు మెరిట్ ద్వారా సీటును సంపాదించుకోవాలి. – వి.పావన్య, ప్రిన్సిపాల్, ఎంజెపీఏపీబీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, ద్రాక్షారామదరఖాస్తు చేయాలిలా.. బీసీ, ఈబీసీ, ఇతర విద్యార్థులకు 9–11 సంవత్సరాల వయసు మించి ఉండాలి. 2014 సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి 2016 ఆగస్టు 31 తేదీ మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9–13 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 2013 సెప్టెంబరు ఒకటి నుంచి 2016 ఆగస్టు 31 మధ్యలో జన్మించి ఉండాలి. విద్యార్థులు జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందడానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. గత రెండేళ్లుగా నిరంతరంగా (2023–24, 2024–25) చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతిలో 2024–25 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉండాలి. ఎంజేపీఏపీ బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల 480 మంది విద్యార్థులకు 5వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం మార్చి 15 దరఖాస్తుకు తుది గడువు ఎంపిక విధానం ఇలా.. అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి, అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేస్తారు. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటారు. సమానమైన ర్యాంక్ ఒకరి కంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ ప్రకారం అధిక వయసు ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు. సమానమైన ర్యాంకు వస్తే, గణితంలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడు కూడా సమానమైన ర్యాంకు వస్తే పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణలోనికి తీసుకుంటారు. ప్రవేశానికి ఎంపికై న వారికి మాత్రమే కాల్ లెటర్స్, ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు. మెరిట్ లిస్టు మార్కుల ఆధారంగా మొదటి, రెండవ, మూడవ జాబితాను ఖాళీలను బట్టి ప్రకటిస్తారు. -
27న ప్రత్యేక సెలవు
ఏలూరు(మెట్రో): తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వేగంగా ఫీజుల వసూలు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని మార్కెట్ కమిటీల ఫీజులు వసూలులో వేగం పెంచి, మార్చినాటికి టార్గెట్లు పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ పి.సుధాకర్ ఆదేశించారు. మంగళవారం రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ కమిటీల కార్యదర్శులు, రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 50శాతం లోపు మార్కెట్ ఫీజు వసూలు చేసిన కార్యదర్శులు ఫీజులు వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. మార్కెట్యార్డుల్లో పెండింగ్ పనులును త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అధికారులు సునీల్వినయ్, రాఘవేంద్రరావు, విశాలాక్షి, మార్కెట్ కమిటీ సెక్రటరీలు, ఎస్టేట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు
● రోడ్డున పడ్డ 10 వేల కుటుంబాలు ● అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్న అధికార యంత్రాంగం ● కలెక్టరేట్ వద్ద బోట్స్మెన్ సొసైటీల కార్మికుల ఆందోళన సీటీఆర్ఐ: డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో బోట్లపై ఇసుక ఒడ్డుకు చేర్చే కార్మికులు రోడ్డున పడ్డారని జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు అన్నారు. సోమవారం బోట్స్ మెనన్ సొసైటీ కార్మికులతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాలో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక హామీలను తొంగలో తొక్కుతోందని విమర్శించారు. బోట్స్ మెన్ సొసైటీ కార్మికులతో ఇసుక తవ్వకాలు జరిపితే రెండు మూడు అడుగులు మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతాయని, అయితే అధికార పార్టీ నాయకులు డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహించడం వలన 40 అడుగులు లోతుగా తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జిలకు, ఆనకట్టకు పెను ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం గమన్ బ్రిడ్జి పిల్లర్కు ప్రమాదం పొంచి ఉండడంతో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారని తెలిపారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జి పిల్లర్లు కూడా బలహీనపడ్డాయని తెలిపారు. డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపడం వలన గోదావరి నదిలో 40 అడుగుల లోతు వరకు గోతులు ఏర్పడడంతో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు మృత్యవాత పడుతున్నారని వివరించారు. డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు వెంటనే నిలుపుదల చేసి బోట్స్ మెన్ సొసైటీ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేబర్ యూనియన్ నాయకులు వారా ప్రభాకర్, దేవన వెంకటకృష్ణ, శ్రీకృష్ణ దేవరాయల ఇసుక బోట్స్ మెన్ సొసైటీ నాయకులు మామిడి కృష్ణ, మట్టపర్తి శ్రీను పాల్గొన్నారు. -
రత్నగిరిపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది భక్తులు ● ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి, అమ్మవారు అన్నవరం: వివాహాల సీజన్ సందర్భంగా నవ దంపతులు, వారి బంధుమిత్రులు, ఇతర భక్తులతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సోమవారం రద్దీ నెలకొంది. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అదే ముహూర్తాలకు వివిధ ప్రాంతాలలో వివాహాలు చేసుకున్నవారు కూడా సత్యదేవుని సన్నిధికి తరలివచ్చారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో రద్దీ పెరిగింది. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. సత్యదేవుని దర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు గోశాలలో సప్తగోవులను దర్శించి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 1,500 నిర్వహించగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజనం పెట్టారు. ముత్తంగి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాలతో చేసిన కవచాల (ముత్తంగి) అలంకరణలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరుడు భక్తులకు కనువిందు చేశారు. -
కూ... చిక్కుచిక్కు
● కోనసీమ రైలుకు మరోసారి ‘రెడ్ సిగ్నల్’ ● భూ సేకరణకు అవాంతరాలు ● ఇప్పుడు, గతంలో సేకరించిన భూమిపై వివాదం ● ఇప్పటి ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలంటున్న రైతులు సాక్షి, అమలాపురం: చుక్చుక్ బండి... కూత లేదండి. అడుగడుగునా ఆటంకమండి.. అన్నట్టుంది. కోనసీమ రైల్వే లైన్ పరిస్థితి. దీని నిర్మాణానికి ఓ అడుగు ముందుకు పడుతుంటే.. మూడు అడుగులు వెనకకు వెళ్తున్నాయి. దశాబ్దాలుగా నత్తనడకన సాగుతూ వస్తున్న కోనసీమ రైల్వే లైన్కు తాజాగా మరో అవాంతరం ఏర్పడింది. కొత్తగా చేపట్టిన భూ సేకరణకు అడుగడుగునా అడ్డంకులు రాగా.. ఇప్పుడు గతంలో సేకరించిన భూములపై సైతం వివాదాలు నెలకొనడంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతోందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కాకినాడ నుంచి కోటిపల్లి మీదుగా నరసాపురం వరకూ నిర్మించాల్సిన రైల్వే ప్రాజెక్ట్ నత్తను తలపిస్తోంది. కోటిపల్లి వరకూ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయినా అది కూడా కొన్నేళ్లుగా వినియోగంలో లేదు. కోటిపల్లి నుంచి అమలాపురం మీదుగా నరసాపురం వరకూ నిర్మించాల్సిన రైల్వే లైన్కు తొలుత నిధుల కొరత పట్టిపీడించింది. 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తుండడంతో పనులు వేగం అందుకున్నాయి. గోదావరి నదీపాయలపై మూడు చోట్ల వంతెనల నిర్మాణాలకు సంబంధించి పిల్లర్లు పూర్తయ్యాయి. వీటిపై గెడ్డర్లు, ట్రాక్ నిర్మించాల్సి ఉంది. వైనతేయ వద్ద ఇటు బోడసకుర్రు, అటు పాశర్లపూడి వైపు ఏటిగట్టుకు లోపల (నదిలో పిల్లర్లు) పూర్తవడంతో, ఏటిగట్టుకు బయట ప్రాంతంలో ఇరువైపులా పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. గౌతమీ నదిపై పిల్లర్ల నిర్మాణాలు పూర్తి కాగా, వాటిపై గెడ్డర్ల నిర్మాణాలకు గత ఏడాది ఫిబ్రవరిలోనే రూ.275 కోట్లకు టెండర్లు ఖరారైనా ఇంకా పనులు మొదలు కాలేదు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టెండర్లు ఖరారైన 28 నెలలకు పనులు పూర్తి కావాల్సి ఉంది. భూ సేకరణకు ఆటంకాలు మొన్నటి వరకూ నిధుల కొరత.. ఇప్పుడు భూసేకరణ ఈ ప్రాజెక్టుకు అవరోధంగా మారింది. కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57 కిలోమీటర్ల మేర నిర్మించే రైల్వే ట్రాక్కు పాత అలైన్మెంట్ ప్రకారం 908 ఎకరాల భూమి అవసరం. ఇందులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సుమారు 791 ఎకరాల భూమి సేకరించాలి. కొత్త అలైన్మెంట్ ప్రకారం ఇది స్వల్పంగా పెరగనుంది. కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్కు 2001లో మొదటి అలైన్మెంట్ వచ్చింది. 2003లోనే కోటిపల్లి నుంచి అమలాపురం మండలం భట్నవిల్లి వరకూ భూసేకరణ జరిగింది. తొలి అలైన్మెంట్ ప్రకారం భట్నవిల్లిలో రైల్వే స్టేషన్ నిర్మించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఇక్కడ భూమి సేకరించారు. అయితే ఇక్కడ నాడు భూములు ఇచ్చిన భట్నవిల్లి రైతులు ఇప్పుడు ఎదురు తిరిగారు. భూములు ఇచ్చినా పొజీషన్ తీసుకోనందున ఇప్పుడిస్తున్న తరహాలో పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడ 40 ఎకరాలకు సంబంధించి 24 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు రైల్వే శాఖ కోర్టుకు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంది. అయితే ఈ భూములకు పరిహారం చెల్లించడం, రైల్వే శాఖకు అప్పగించామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది భట్నవిల్లి నుంచి జిల్లాలోని దిండి వరకూ కొత్తగా చేపట్టిన భూ సేకరణకు సైతం అవాంతరాలు వీడడం లేదు. గతంలో రైల్వే శాఖ ఇచ్చిన అలైన్మెంట్ను ఆనుకుని 216 జాతీయ రహదారి వెళ్లింది. 2014–19 మధ్యలో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రైల్వే లైన్కు ఇబ్బంది లేకుండా జాతీయ రహదారి 216లో భాగంగా అమలాపురం బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. ఇలా చేయకపోవడంతో ఇప్పుడు కొత్త అలైన్మెంట్ ఇచ్చి అందుకు అనుగుణంగా అమలాపురం మండలం భట్నవిల్లి, కామనగరువు, చిందాడగరువు, రోళ్లపాలెం, ఇమ్మిడివరప్పాడు, పేరూరుపేట మీదుగా బోడసకుర్రు వెళ్లనుంది. ఈ అలైన్మెంట్కు సైతం రైతులు తొలి నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైల్వే లైన్ తమ గ్రామాల మీదుగా వెళ్లేందుకు అంగీకరించమని, అలైన్మెంట్ మార్పు చేయాలని ఆ ప్రాంత వాసులు పలు సందర్భాల్లో నిరసనలు తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్కు వారు వినతిపత్రాలు అందజేశారు. మరి కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఇలా భూ సేకరణ అంశాలు కోర్టుల వరకూ వెళ్లడంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త ఆలైన్మెంట్కు సంబంధించి రెవెన్యూ శాఖ చేపట్టిన సర్వే దాదాపు పూర్తయ్యింది. కొత్త అలైన్మెంట్లో అడ్డుగా వచ్చే రోడ్లు, పంట కాలువలు, విద్యుత్ లైన్లు, స్తంభాలు, ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల పైప్లైన్లు, నివాసాలు, ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకం పైప్లైన్లను ఈ సర్వేలో గుర్తించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవాంతరాలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. -
డీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరవేయడానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం బొమ్మూరులోని వైటీసీ ఆవరణలో ఉన్న భవనంలోకి నూతనంగా వచ్చిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఏ) కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు స్థిరమైన జీవనోపాధికి ప్రాధాన్యమివ్వడంలో డీఆర్డీఏ సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు. కలెక్టర్ వైటీసీ కాంపౌండ్లో ఉన్న డ్వామా, జిల్లా పరిశ్రమలు, మైక్రో ఇరిగేషన్, సమాచార పౌర సంబంధాలు, జిల్లా స్పోర్ట్స్ కార్యాలయాన్ని సందర్శించి వారికి ఉన్న వసతులను అడిగి తెలుసుకున్నారు. డీఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, జిల్లా సమాఖ్య అధ్యక్షులు కె.సుజాత, సెక్రటరీ టి. సత్యవతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.మాధవరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అప్పలకొండ, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి దుర్గేష్, డ్వామా పీడీ ఎ.నాగమహేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతామణి, జిల్లా స్పోర్ట్స్ అధికారి శేషగిరి, ఎల్డీఎం ప్రసాద్ పాల్గొన్నారు. ప్రైవేట్ టోర్నీలో ఆడడం నిషిద్ధంనాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్లో నమోదయిన ఆటగాళ్లు, కోచ్లు, అంపైర్లు, స్కోరర్లు ప్రైవేట్ టోర్నమెంట్లలో పాల్గొనడం నిషేధం అని జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి పి.సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఎవరైనా ప్రైవేట్ టోర్నమెంట్లలో పాల్గొనాంటే 10 రోజుల ముందు అసోసియేషన్కు లిఖిత పూర్వకంగా తెలిపి అనుమతి తీసుకోవాలని, లేదంటే వారిని జిల్లా స్థాయి పోటీల నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వైద్యులు అలసత్వం వహిస్తే చర్యలు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ హాస్పిటల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఉద్యోగుల హాజరు పట్టీని పరిశీలించి సక్రమంగా విధులకు హాజరు కాని, గైర్హాజరైన ఉద్యోగుల తీరుపై మండిపడ్డారు. రోగులకు అందాల్సిన సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే తీవ్రస్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈఎస్ఐ హాస్పిటల్ సూవరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్, మరి కొంతమంది సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరుకాని ఉద్యోగులకు చార్జ్ మెమోలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంగోకవరం: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని వీర్లంకపల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 2025–26 సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎంయూవీ రాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ఇంగ్లిషు మీడియం ప్రవేశాలకు 80 సీట్లు, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 40 సీట్లు, బైపీసీ గ్రూపులో40 సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. విద్యార్థులు సంబంధిత వెబ్సైట్లో మార్చి 3 నాటికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. -
భద్రతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు
జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్న, భద్రత ప్రమాణాలు పాటించని ఇసుక రవాణా చేసే వాహనాలపై మోటార్ వాహన చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. ఇందుకు సంబంధించి మినిట్స్లో కమిటీ సమావేశం నిర్ణయం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 15 ఓపెన్ సాండ్ రీచ్లలో నిర్దేశించుకున్న 10,39,350 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఇసుకకు సంబంధించి 7,35,766 లభ్యత ఉందన్నారు. వేమగిరి– కడియపులంక 1 కార్యకలాపాలు లేనందు వల్ల రద్దు చేస్తున్నట్లు, జీడిగుంట 13 కోర్ట్ కేసు వలన పెండింగ్లో ఉందని, ములకల్లంక– కాటవరం 9 ర్యాంపు నిర్మాణంలో ఉన్న దృష్ట్యా కార్యకలాపాలు జరగటం లేదని తెలిపారు. ఏడు ప్రాంతాల్లో 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. ఫిబ్రవరి 13 నాటికి ఏడు రీచెస్ పబ్లిక్ హియరింగ్ పూర్తి అయిందని, సింగవరం, కాటవరం లో మార్చి 4 న, కుమారదేవరం మార్చి 5 న పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా కడియం, పెరవలి తీపర్రులో రెండు, నిడదవోలులో జీడిగుంట ఏ, బి ,పందలపర్రు డ్రాఫ్ట్ మైనింగ్ ప్లాన్ ఆమోదించామన్నారు. ఫిర్యాదులు అందిన వాటికి నోటీసులు... ఇసుక రవాణాపై పలు ఫిర్యాదులు అందాయని, నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. మోటార్ వాహన చట్టం ప్రకారం అటువంటి వాహనాలను గుర్తించి జరినామా విధించాలని స్పష్టం చేశారు. రీచ్ల నిర్వహణ ఏజెన్సీ ద్వారా ఆయా ప్రాంతాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా రహదారుల నిర్వహణ బాధ్యతలను చేపట్టాలని, వీటిని మినిట్స్లో నమోదు చేయాలని ఆదేశించారు. జేసీ ఎస్.చిన్న రాముడు, ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, మైన్స్ ఏడీ ఫణిభూషణ్రెడి పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్రంలోని విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అధ్యక్షుడు డి.వేణు మాధవరావు అన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారుల కార్యవర్గ సమావేశం సోమవారం స్థానిక ఎన్జీవో హోమ్లో నిర్వహించారు. రాష్ట్ర పూర్వపు ప్రధాన కార్యదర్శి పాపినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర సంఘ అధ్యక్షులు వేణుమాధవ్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు, ముఖ్యంగా మెడికల్ క్లెయిమ్స్ తదితర క్లెయిమ్స్ పరిష్కారంలో ఏఈఓ సంఘం శ్రమిస్తుందన్నారు. సంఘం అధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికై న వేణుమాధవరావును విశ్రాంత ఏఈవోలు సన్మానించారు. 75 సంవత్సరాలు నిండిన విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా సత్కరించారు. జిల్లా ప్రభుత్వ పెన్షన్సంఘం అధ్యక్షులు కేజీకే మూర్తి, నగర ఎన్జీవో సంఘ ఉపాధ్యక్షులు మీసాల మాధవరావు మాట్లాడారు. అధ్యక్షుడిగా శాంతికుమార్ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల విశ్రాంత వ్యవసాయ విస్తరణా అధికారుల సంఘం అధ్యక్షుడిగా రాజమహేంద్రవరానికి చెందిన జీఎం శాంతికుమార్ను కార్యవర్గం ఎన్నుకుంది. ప్రధాన కార్యదర్శిగా భీమవరానికి చెందిన కపర్దిని, కోశాధికారిగా ఎస్వీ శ్రీనివాస్, సహ అధ్యక్షుడిగా జి సింహాచలం, సంయుక్త కార్యదర్శిగా మురళిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు. -
ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
కొత్తపేట: ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కేంద్రాలు, విక్రయ దుకాణాలపై సోమవారం ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) అధికారులు దాడులు చేశారు. కొంత కాలంగా పూతరేకులు తయారీలో నకిలీ నెయ్యి వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు జరిపారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇన్స్టెక్టర్లు గ్రామంలో పలు పూతరేకుల తయారీ కేంద్రాల్లో ఏకకాలంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు రొక్కయ్య, సుబ్బారావు, ప్రసాద్, శ్రీకాంత్ చౌదరి టీమ్లు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆయా కేంద్రాలు, దుకాణాల్లో పూతరేకులు తయారీకి వినియోగిస్తున్న నెయ్యిని, సీల్ ఫ్యాకెట్లను, ఇతర సరకులు, పరిసరాలు, పరిశుభ్రతను, షాపుల్లో పూతరేకులు, ఇతర తినుబండారాలను పరిశీలించారు. బ్రాండ్ నేమ్ లేబుల్ లేని నెయ్యి ప్యాకెట్లను గుర్తించారు. అలా ఒక తయారీ కేంద్రంలో 15 కిలోలు, మరో రెండు షాపుల్లో 142 కిలోల నెయ్యి ప్యాకెట్లు సీజ్ చేశారు. వీటికి సంబందించి 3 కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. 7 దుకాణాల్లో పూతరేకుల శాంపిల్స్ సేకరించారు. ల్యాబ్ రిపోర్టులను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్ లేని 10 షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ బ్రాండ్ నేమ్ లేని నెయ్యి ప్యాకెట్లు గుర్తించి సీజ్ చేశామన్నారు. తయారీ దారులు లూజ్ ప్యాకెట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దన్నారు. ప్రతి ఒక్కరూ బ్రాండ్ నెయ్యినే వాడాలని చెబుతున్నామన్నారు. ప్రతి విక్రయదారుడు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసుకోవాలన్నారు. తద్వారా నాణ్యమైన పూతరేకులు విక్రయించాలన్నారు. కాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గ్రామంలో ప్రవేశించి దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మరికొన్ని షాపుల యజమానులు ఆ షాపులను మూసేశారు. ఫ ఆత్రేయపురంలో పూతరేకుల తయారీపై తనిఖీలు ఫ ఏడు షాపుల్లో శాంపిల్స్ సేకరణ -
బాలిక కిడ్నాప్, అత్యాచారం
ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం అనాతవరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక (15)ను ఓ వివాహితుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. అనాతవరం గ్రామానికి చెందిన వివాహితుడు పరమట దుర్గాప్రసాద్ (బులి చంటి) సోమవారం స్కూల్కు వెళ్తున్న ఆ బాలికను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. అనంతరం అమలాపురం ఎర్రవంతెన సమీపంలో ఒక నివాసానికి తీసుకువెళ్లి అక్కడ ఆమైపె బలవంతంగా అత్యాచారం చేశాడు. బాలిక కిడ్నాప్ అయిన విషయం ఆమె తల్లిదండ్రులు ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై డి.జ్వాలాసాగర్ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన బులి చంటి ఆ బాలికను రూ.20 ఇచ్చి అమలాపురం ఎర్రవంతెన వద్ద అనాతవరం వెళ్లే బస్సు ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో తోడి కోడళ్లు మృతి
రాజానగరం: రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. భర్త సంపాదనకు భార్య సంపాదన కూడా తోడైతేనేగానీ గడవని పరిస్థితిలో భర్తకు సాయంగా కూలికి పోతున్న తోడి కోడళ్లు రోడ్డు ప్రమాదంలో అశువులు బాసి, ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు. అంతేకాదు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. మండలంలోని దివాన్చెరువులో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కానవరానికి చెందిన కప్పల చంద్రమ్మ (51), కప్పల రిప్కో(55)లు తోడికోడళ్లు. రిప్కో భర్త నాగేశ్వరరావుతో కలసి వారిద్దరూ పాలచర్లలోని నర్సరీలో ప్రతిరోజు కూలి పనికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి బైక్పై తిరిగి వస్తుండగా దివాన్చెరువులో ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో కింద పడిన వారి పైనుంచి లారీ దూసుకుపోయింది. దీంతో ఆ ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చావులోనూ కలిసే.. తోడి కోడళ్లు అయిన చంద్రమ్మ, రిప్కోలు ఇద్దరు సొంత అక్కచెల్లెళ్ల కంటే మిన్నగా కలిసి మెలసి ఉండేవారని, చివరికి మృత్యులోనూ కలిసే ఉన్నారని ప్రమాద దృశ్యాన్ని చూసిన కానవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ నిమిత్తం దూరంగా కూలికి వెళ్లి, కొద్దిసేపట్లోనే ఇళ్లకు చేరుకుంటారనుకునే లోపే మృత్యువు కబళించడం అందరినీ కలచివేసింది. చంద్రమ్మ భర్త గ్రామంలోనే మేకలను కాస్తుంటాడు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఇక రిప్కో భర్త నాగేశ్వరరావు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొకరికి తీవ్ర గాయాలు