
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
మహబూబాబాద్ రూరల్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్టు మహబూబాబాద్ డీఎస్పీ ఎన్.తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. టౌన్ ఎస్సై కె.శివ తన సిబ్బందితో కలిసి నర్సంపేట బైపాస్లో వాహనాల తనిఖీ చేస్తుండగా, బైక్పై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తారసపడ్డాడు. పోలీసులు ఆపగా, పారిపోయేందుకు యత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఎస్సీ పేట దేవీచౌక్కు చెందిన గొర్రెల చిన్నబాబుగా గుర్తించారు. గత మే 31న డోర్నకల్లో ఓ బైక్, మహబూబాబాద్లోని రామచంద్రాపురంలో 4.5 గ్రాముల బంగారం, 8 గ్రాముల వెండి ఆభరణాలు, ఆర్టీసీ కాలనీలో 4 గ్రాముల వెండి ఆభరణాలను అతడు తస్కరించాడు. చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట, కోదాడ పట్టణాల్లో కూడా రెండు చోరీలకు పాల్పడినట్టు అతడు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.