breaking news
elon musk
-
భారీగా పెరిగిన సంపద: మస్క్ నెట్వర్త్ ఎంతంటే?
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 600 బిలియన్ డాలర్ల (రూ. 54.56 లక్షల కోట్లు) నికర విలువ కలిగిన మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. స్పేస్ఎక్స్ 800 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్తో పబ్లిక్గా (ఐపీఓ) వచ్చే అవకాశం ఉందనే వార్తలు వెలువడిన వెంటనే.. మస్క్ నికర విలువ ఒక రోజులో 168 బిలియన్ డాలర్లు పెరిగింది.స్పేస్ఎక్స్ సీఈఓ ఇప్పటికే.. ఈ ఏడాది అక్టోబర్లో 500 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటారు. కాగా ఇప్పుడు ఈయన సంపద 600 బిలియన్ డాలర్లకు చేరింది. స్పేస్ఎక్స్లో మస్క్ 42 శాతం వాటాను కలిగి ఉండటం వల్ల.. సంపద ఒక రోజులోనే భారీగా పెరిగిపోయింది. ఇది అనేక దేశాల GDP కంటే ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా.. మస్క్ తన స్థానాన్ని మరోమారు సుస్థిరం చేసుకున్నారు.స్పేస్ఎక్స్ మాత్రమే కాదు, ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాలో దాదాపు 12% వాటాను కలిగి ఉన్నారు. ఇది కూడా ఈయన సంపదను పెంచడంలో దోహదపడింది. టెస్లాలో మస్క్ వాటా ఇప్పుడు దాదాపు 197 బిలియన్ డాలర్లుగా ఉంది.మార్చి 2020లో, టెస్లా సీఈఓ సంపద 24.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తరువాత జనవరి 2021లో దాదాపు 190 బిలియన్ డాలర్ల నికర విలువతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. అయితే.. మస్క్ సంపద పెరుగుదల అక్కడితో ఆగలేదు, ఎందుకంటే ఆయన నికర విలువ డిసెంబర్ 2024లో 400 బిలియన్ డాలర్లకు, అక్టోబర్లో 500 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు తాజాగా 600 బిలియన్ డాలర్ల మార్క్ దాటింది. -
'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్మస్క్పై నెటిజన్లు ఫైర్
స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోనీ సైంటిఫిక్గా చెప్పని అందరికి సమంజసంగా ఉండేలా మాట్లాడాలి గానీ మరి ఇలానా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..టెస్లా, స్సేస్ ఎక్స్ దిగ్గజం ఎలోన్ మస్స్ స్త్రీత్వంపై తన అభిప్రాయలను పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శులు వెల్లువెత్తాయి. మస్క్ స్త్రీకి నిర్వచనం గర్భం అంటూ గర్భాశయం ఉన్నవాళ్లను స్త్రీలుగా వ్యవహరిస్తారని, గర్భం ఉనికి ద్వారా స్త్రీని నిర్వచించాలి అని నొక్కి చెప్పాడంతో ఒక్కసారివ ఆయనపై తారాస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన వైఖరిని చాలామంది ఖండించారు. అంతేగాదు అస్సలు మనం ఇంకా ఏ కాలంలో జీవిస్తున్నాం అని విమర్శిస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. గర్భం ఉంటే స్త్రీ అంటే.. మరి ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌసర్ సిండ్రోమ్) అరుదైన పరిస్థితితో బాధపడుతున్న ఆడవాళ్లు..స్త్రీలు కాకుండా పోతారా అని నిలదీశారు. ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్ అంటే గర్భాశయం లేకుండా లేదా అభివృద్ధి చెందని స్త్రీలని అర్థం. లింగ మార్పిడిని బహిరంగంగా వ్యతిరేకిస్తూ తన ట్రాన్స్జెండర్ కుమార్తె పరిస్థితిని "విషాదకరమైన మానసిక అనారోగ్యం"గా అభివర్ణించారు. ఆయన తనను లక్ష్యంగా చేసుకుని డెమొక్రాట్ అభ్యర్థి కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఇలా ప్రతిస్పందించారు. కాగా, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పాడ్కాస్టర్తో తాను ఎక్కువ మంది ట్రాన్స్ పిల్లలను చూడాలనుకుంటున్నానని, తనను తాను ట్రాన్స్-ప్రో చట్టం LGBTQ హక్కుల బలమైన మద్దతుదారుగా భావిస్తానని చెప్పారు. అంతేగాదు సారీ మస్క్ మిమ్మల్ని మీ కూతురు ద్వేషిస్తున్నందుకు అని నేరుగా సెటైర్ వేశారు. దాంతో మస్క్ ఇలా విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. Correct. We’re sorry your daughter hates you, Elon. https://t.co/HeJIm5fJMS— Governor Newsom Press Office (@GovPressOffice) December 11, 2025 (చదవండి: ఔనా ..! ఏకంగా 66 శాతం మగజాతి రాముడిలా ఏకపత్నీవ్రతులా! సర్వేలో షాకింగ్ విషయాలు) -
ఎలాన్ మస్క్ సమర్పించు... మెమొరీ ట్రిక్స్
‘అదేమిటో... చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాను’ అనుకునేవారిలో మీరు కూడా ఉన్నారా? అయితే మీరు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అనుసరించే మెమోరీ ట్రిక్స్ ఫాలో కావాల్సిందే. ‘ట్రిక్స్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్’ అంటున్నాడు మస్క్. వాటిలో కొన్ని...బ్రెయిన్ అనేది కొన్నిసార్లు అనవసర సమాచారంతో, అనవసర ఆలోచనలతో చెత్తబుట్టగా మారిపోతుంది. దీంతో అవసరమైన విషయాలకు చోటు ఉండదు. అందుకే అనవసర విషయాలను ఎప్పటికప్పుడూ డిలీట్ చేసి మంచి విషయాల కోసం స్పేస్ ఏర్పాటు చేసుకోవాలి.ముఖ్యమైన విషయాలతో ‘మెమోరీ ట్రీ’ నిర్మించాలి. ఈ చెట్టుకు కొమ్మలుగా కొత్త విషయాలను అనుసంధానిస్తూ పోవాలి. ఎవరికివారు పర్సనల్ కోడింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలి. విషయాలను వేగంగా గుర్తు తెచ్చుకోవడానికి సంఖ్యలు, చిహ్నాలు, చిత్రాలు.. మొదలైన వాటిని ఉపయోగించాలి. ‘ఈ ట్రిగ్గర్లు మెదడులోని సంక్లిష్ట సమాచారాన్ని త్వరగా, తక్కువ శ్రమతో తిరిగి పోందడానికి ఉపయోగపడతాయి’ అంటాడు మస్క్.విషయాలు, పేర్లను గుర్తు తెచ్చుకోవడంలో ‘మీనింగ్ఫుల్ కనెక్షన్’ ముఖ్యం అంటాడు ఎలాన్ మస్క్. ఉదాహరణకు ఒక వ్యక్తి పేరును గుర్తు తెచ్చుకోవడానికి వారి హాబీ, ఫన్నీస్టోరీ, వారి ముఖానికి సంబంధించి యూనిక్ ఫీచర్, ఆ వ్యక్తి నవ్వు, మాట్లాడే పద్ధతి... మొదలైన వాటితో పేరును గుర్తు పెట్టుకోవాలి.మీనింగ్ఫుల్ కనెక్షన్ అనేది ఎందుకు ముఖ్యమైనది అంటే... మన మెదడు ర్యాండమ్ ఫ్యాక్ట్స్ కంటే స్టోరీలను, ఎమోషన్లనూ ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది.‘అసోసియేట్ ఇన్ఫర్మేషన్’ టెక్నిక్ గురించి నొక్కిచెబుతున్నాడు మస్క్. అసాధారణ దృశ్యాలతో, సమాచారాన్ని గుర్తు పెట్టుకోవడమే... అసోసియేట్ ఇన్ఫర్మేషన్. ఉదాహరణకు... ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు అరటిపండ్లు కొనాలనుకున్నారు. ఇందుకోసం ఒక అసాధారణ దృశ్యాన్ని మదిలో ఆవిష్కరించుకోవాలి. ఏనుగంత సైజులో ఉన్న అరటిపండు సన్గ్లాసెస్ ధరించి మీ కిచెన్లో డ్యాన్స్ చేస్తుంటుంది!‘రిపీట్ అండ్ రివ్యూ’ మెథడ్లో భాగంగా గతంలోకి వెళ్లి మనకు నచ్చిన విషయాలను గుర్తు తెచ్చుకోవాలి. ఇలా తరచుగా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది. -
అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్తో పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో అల్ఫాబెట్ (గూగుల్) ముందుకు వచ్చింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతరిక్షంలో సోలార్ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గూగుల్ దీనికి ‘ప్రాజెక్ట్ సన్క్యాచర్’(Project Suncatcher)గా పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు గురించి పిచాయ్ మాట్లాడుతూ ‘గూగుల్లో మూన్ షాట్లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణం. ఏదో ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేదే మా ప్రస్తుత మూన్ షాట్’ అని తెలిపారు. సూర్యుడి నుంచి లభించే అపార శక్తిని (భూమిపై కంటే అంతరిక్షంలో అధిక ఎనర్జీ ఉంటుంది) ఉపయోగించి స్పేస్లో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటులోని సమస్యలను పరిష్కరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.2027లో తొలి పరీక్షలుఈ అంతరిక్ష డేటా సెంటర్ల ప్రయాణంలో గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘మేము 2027లో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మొదటి అడుగు వేస్తాం. చిన్న యంత్రాల ర్యాక్లను శాటిలైట్ల్లో పంపి పరీక్షిస్తాం. ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తాం’ అని పిచాయ్ ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్ ప్లాట్ఫాంమ్లో వైరల్ అయింది. దాంతో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దృష్టిని ఇది ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూపై మస్క్ కేవలం ‘ఆసక్తికరమైనది (Interesting)’ అనే ఒక్క పదంతో స్పందించారు.Interesting https://t.co/yuTy9Yr3xw— Elon Musk (@elonmusk) December 8, 2025ఇదీ చదవండి: విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది? -
ఇండియాలో స్టార్ లింక్ సబ్ స్క్రిప్షన్ ధరలు ఇవే!
-
భారత్లో స్టార్లింక్ ధరలు ఖరారు
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సాంకేతిక సంస్థ స్పేస్ఎక్స్ భారతదేశంలో ప్రారంభించనున్న శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల ధరలను అధికారికంగా ప్రకటించింది. సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచడానికి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. శాటిలైట్ ద్వారా నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించే ఈ ప్రీమియం సేవను భారతదేశ మార్కెట్లో త్వరలో మొదలు పెట్టనున్నారు.ధరల వివరాలునెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు: రూ.8,600. ఇది ప్రతి నెల సేవలను అందింస్తున్నందుకు వినియోగదారులు చెల్లించే రుసుం.వన్-టైమ్ హార్డ్వేర్ కిట్ ఖర్చు: రూ.34,000. ఇది తొలిసారిగా చెల్లించాల్సిన పరికరాల ధర.హార్డ్వేర్ కిట్లో ఏముంటాయి?రూ.34,000 వన్-టైమ్ ఖర్చుతో వచ్చే ఈ కిట్లో శాటిలైట్ డిష్, వై-ఫై రౌటర్, పవర్ సప్లై, కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటాయి. దీనిని ఇన్స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు స్టార్లింక్ లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల సముదాయానికి కనెక్ట్ అవుతారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు.దీని లక్ష్యం..భారతదేశంలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఫైబర్ లేదా మొబైల్ నెట్వర్క్లు బలహీనంగా ఉన్న చోట ఇంటర్నెట్ యాక్సెస్ అందించడం ద్వారా డిజిటల్ సర్వీసులు మెరుగుపరవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని చిన్న వ్యాపారాలు డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించవచ్చు. వెనుకబడిన కమ్యూనిటీలకు ఆన్లైన్ విద్యను తీసుకురావడం ద్వారా విద్యా అవకాశాలను మెరుగవుతాయి.మార్కెట్ సవాళ్లుసాధారణంగా భారతదేశంలో సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ సేవలు నెలకు రూ.500 నుంచి రూ.1,500 మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్లింక్ నెలకు రూ.8,600 ధర వసూలు చేయడంతో ఎంతమేరకు సబ్స్క్రైబర్లు వస్తారనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా? -
'ఎక్స్'కు భారీ జరిమానా: ఈయూపై విరుచుకుపడ్డ మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'కు భారీ షాక్ తగిలింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద పారదర్శకత & డేటా యాక్సెస్ వంటివి ఉల్లంఘించినందుకు యూరోపియన్ యూనియన్ (EU) ఎక్స్కు వ్యతిరేకంగా 120 మిలియన్ యూరోలు జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడంపై ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, ''ప్రభుత్వాలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగేలా ఈయూని రద్దు చేసి, సార్వభౌమత్వాన్ని వ్యక్తిగత దేశాలకు తిరిగి ఇవ్వాలని'' మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.The EU should be abolished and sovereignty returned to individual countries, so that governments can better represent their people— Elon Musk (@elonmusk) December 6, 2025ఏమిటీ డిజిటల్ సర్వీసెస్ చట్టండిజిటల్ సర్వీసెస్ చట్టం కింద యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది (డిజిటల్ సర్వీసెస్ చట్టం) ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను నియంత్రించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్ను అరికట్టడానికి మాత్రమే కాకుండా 27 సభ్య దేశాలలో పారదర్శకతను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక విస్తృత చట్టం. ఎక్స్ విధివిధానాలపై రెండేళ్ల దర్యాప్తు తరువాత యూరోపియన్ ఈ జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ చర్యను మస్క్ వ్యతిరేకించిన తరువాత.. అమెరికా రాజకీయ ప్రముఖులు కూడా ఖండించారు. దీనిని అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై దాడిగా.. అమెరికా ఆధారిత ప్లాట్ఫామ్ల పట్ల పెరుగుతున్న శత్రుత్వానికి సంకేతంగా అభివర్ణించారు.ఈ ఘర్షణ మస్క్ & యూరోపియన్ సంస్థల మధ్య పెరుగుతున్న అంతరాన్ని హైలైట్ చేస్తుంది. ఎక్స్ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన నియంత్రణ చట్రాలను పదే పదే విమర్శించారు. అయితే ఈయూ సంస్థలు వినియోగదారులను రక్షించడానికి & ప్రజాస్వామ్య ప్రక్రియలను రక్షించడానికి పర్యవేక్షణ అవసరమని వాదిస్తున్నాయి. -
మేధే మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ఎ క్స్లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీ యులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నా యన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవు తుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయలే.. ఎగబడిన జనం ..కట్ చేస్తేడిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్కాస్ట్లు, వీడియో గేమ్లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!చదవండి : ఇంటిహెల్పర్కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నటివితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎడిటోరియల్ టీమ్వ్యూ పాయింట్: పాడ్కాస్ట్: పీపుల్ బై డబ్లు్య.టి.ఎఫ్.అతిథి: ఎలాన్ మస్క్, పారిశ్రామికవేత్తహోస్ట్: నిఖిల్ కామత్,‘జెరోధా’కో–ఫౌండర్ -
'మేధే' మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ ఎక్స్లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీయులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నాయన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవుతుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.డిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్కాస్ట్లు, వీడియో గేమ్లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!వితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. - ఎడిటోరియల్ టీమ్ -
సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి ‘గాడ్ఫాదర్’గా పిలుచుకునే ఏఐ సైంటిస్ట్ జెఫ్రీ హింటన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఏఐ వేగవంతమైన పురోగతి కారణంగా లక్షల్లో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇది సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్తో కలిసి జార్జ్టౌన్ యూనివర్శిటీలో జరిగిన చర్చలో హింటన్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘ఏఐ వల్ల భారీ నిరుద్యోగం రాబోతోందన్న విషయం చాలా మందికి స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. టెక్ దిగ్గజాలు డేటా సెంటర్లు, చిప్స్పై ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయగల ఏఐ వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.2023లో గూగుల్ను వీడిన హింటన్ ఏఐ ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడుతూ.. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందన్న ఆశావాదాన్ని ఖండించారు. ‘కొత్త ఉద్యోగాలు వస్తాయి కానీ, దీని పరిణామాల వల్ల కోల్పోయే ఉద్యోగాల సంఖ్యను అవి ఎప్పటికీ భర్తీ చేయలేవు’ అని స్పష్టం చేశారు.టెక్ దిగ్గజాల అభిప్రాయాలుఏఐ ఉద్యోగాలపై చూసే ప్రభావం గురించి టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఇటీవల ‘ఏఐ సామూహిక తొలగింపులకు దారితీయదు, కానీ ఉద్యోగాల స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాట్లాడుతూ త్వరలోనే చాలా అంశాల్లో మానవుల అవసరం లేకుండా పోతుందన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘మరో 20 సంవత్సరాల్లో చాలా మందికి పని చేయవలసిన అవసరమే ఉండదు’ అని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి.. -
20 ఏళ్లలో డబ్బు కోసం నో వర్క్!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ(ఏఐ) భవిష్యత్తు గురించి సంచలన ప్రకటన చేశారు. ఏఐ, రోబోటిక్స్ కారణంగా రాబోయే 20 ఏళ్లలో మానవులకు డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెప్పారు. పని కేవలం ఒక ‘ఆప్షనల్ హాబీ’గా మాత్రమే మిగులుతుందని అంచనా వేశారు.ఏఐ వేగాన్ని సూపర్సోనిక్ సునామీతో పోల్చారు. దీన్ని మానవ చరిత్రలో అతి తీవ్రమైన సాంకేతిక మార్పుగా అభివర్ణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. ఏఐ మానవ నైపుణ్యాలను అనవసరం చేస్తుందన్న తన వాదనకు మద్దతుగా మస్క్ తన సొంత పిల్లల ఉదాహరణను ఇచ్చారు. ‘నా పిల్లలు టెక్నికల్గా నైపుణ్యం కలిగి ఉన్నారు. ఏఐ వచ్చే రెండు దశాబ్దాల్లో వారి నైపుణ్యాలను పూర్తిగా అనవసరం చేస్తుందని వారే ఒప్పుకుంటున్నారు’ అని మస్క్ చెప్పారు.అయినప్పటికీ వారు కాలేజీ ఎడ్యుకేషన్ను కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. దీనికి సామాజిక అవసరాలే కారణమన్నారు. తమ వయసు వారితో కలిసి ఉండటం, వివిధ రంగాలకు సంబంధించిన నాలెడ్జ్ను సంపాదించేందుకే అలా కాలేజీకి వెళ్తున్నారని చెప్పారు. కాబట్టి కళాశాలకు వెళ్తే వీలైనంత విస్తృతంగా అన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని తెలిపారు.ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే.. -
ఐదేళ్లలో అణుయుద్ధం
వాషింగ్టన్: వివాదాస్పద, ముక్కుసూటి వ్యాఖ్యలకు, గమ్మత్తైన జోస్యాలకు పెట్టింది పేరైన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి నోరు విప్పారు. రానున్న ఐదు నుంచి పదేళ్లలో ప్రపంచం అతి పెద్ద యుద్ధాన్ని చవిచూడటం ఖాయమని జోస్యం చెప్పారు. అది దాదాపుగా అణుయుద్ధమే అవుతుందని కూడా అభిప్రాయపడ్డారు. ‘‘బహుశా అది అతి త్వరలో జరగనుంది. 2030 నాటికే, లేదా అంతకుముందే మొదలైనా ఆశ్చర్యం లేదు. అందుకు ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది’’అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అది ఎలా మొదలవుతుందన్న దానిపై మాత్రం మస్క్ తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు.అణు తటస్థత తదితరాలపై ఎక్స్లో జరిగిన సంభాషణలో ఒక యూజర్ ప్రశ్నకు బదులిస్తూ మస్క్ ఈ మేరకు భవిష్యవాణి వినిపించారు. అణు భయంతో భారీ యుద్ధాలకు దిగేందుకు దేశాలన్నీ భయపడుతున్నాయని సదరు యూజర్ చేసిన వ్యాఖ్యలతో మస్క్ ఏకీభవించలేదు. ‘‘యుద్ధం తప్పదు గాక తప్పదు. ఐదు, లేదంటే మహా అయితే పదేళ్లలోపే ప్రపంచం అతి పెద్ద యుద్ధాన్ని చవిచూడటం ఖాయం’’అని చెప్పుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడంలో మస్క్ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఆయన ఎన్నికల ప్రచారానికి ఇతోధికంగా ఆర్థిక సాయం చేయడమే గాక ఎక్స్ను కూడా అందుకు విరివిగా వాడుకున్నారు.అందుకు ప్రతిగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)లో భాగంగా తెరపైకి తెచ్చిన డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ) విభాగానికి మస్్కను సారథిగా గత జనవరిలో ట్రంప్ నియమించారు. తర్వాత కొద్ది నెలల పాటు మస్క్ అపరిమిత అధికారాలు చెలాయించడమే గాక ప్రభుత్వానికి చెందిన అత్యంత సున్నితమైన, అతి రహస్యమైన డేటాను కూడా చేజిక్కించుకున్నారంటూ అప్పట్లో అమెరికా మీడియా కోడై కూసింది.ఈ నేపథ్యంలో ఏదో విశ్వసనీయమైన సమాచారం ఆధారంగానే మస్క్ ఇప్పుడిలా ఉన్నట్టుండి ‘అణుయుద్ధ’జోస్యానికి దిగారని భావిస్తున్నారు. మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ఏఐకి చెందిన ఏఐ చాట్బోట్ గ్రోక్ను ఆయన జోస్యంపై వివరణ ఇవ్వాల్సిందిగా పలువురు ఎక్స్ యూజర్లు కోరారు. ఆయన గతంలో చెప్పిన జోస్యాలన్నీ దాదాపుగా ఫలించాయిగా అంటూ అది తన బాస్కు బాసటగా నిలవడం విశేషం! -
ఉద్యోగాలు మట్టి కొట్టుకుపోతాయి!.. మస్క్ ఇంటర్వ్యూ
స్పేస్ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్తో జెరోధా సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ జరిపిన ‘పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్’ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చర్చనీయాంశమైంది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ ఇంటర్వ్యూలో ఏఐ, రోబోటిక్స్ కారణంగా భవిష్యత్తులో పని ఐచ్ఛికం(ఆప్షనల్)గా మారుతుందని మస్క్ అంచనా వేశారు. ఈ ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలను కింద చూద్దాం.ఏఐ, రోబోటిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల్లో ప్రజలు పని చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు’ అన్నారు. గరిష్ఠంగా ఈ పరివర్తన 20 సంవత్సరాల్లోపు జరుగుతుంది. ప్రజలు ఇకపై ఉద్యోగం కోసం నగరాల్లో నివసించాల్సిన అవసరం లేదన్నారు. పాశ్చాత్య దేశాల్లో మూడు లేదా నాలుగు రోజుల పని వారాల ట్రయల్స్ గురించి చర్చించినప్పుడు స్టార్టప్లు లేదా సంస్థల్లో క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి అధిక పని గంటలు అవసరమని మస్క్ అన్నారు.మస్క్ ఈ అంశాలను ఉదాహరణతో వివరించారు. ‘కూరగాయలు మీరు దుకాణంలో నుంచి కొనవచ్చు లేదా తోటలో పండించవచ్చు. పని కూడా అలాంటిదే ఆప్షనల్’ అన్నారు. రోబోట్లు మరింత సమర్థంగా ఉత్పాదకతను పెంచుతూ పని చేస్తాయన్నారు. ఈ సందర్భంలో ప్రజలు తమ ఆసక్తి ఆధారంగా పని చేయాల్సి ఉంటుందన్నారు.H-1B వీసాపై..భారతీయుల్లో చాలా ప్రతిభ ఉందన్నారు. ‘అమెరికా భారతీయ ప్రతిభావంతుల నుంచి అపారంగా ప్రయోజనం పొందింది’ అని ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చైలను ఉదాహరణగా పేర్కొన్నారు. H-1B వీసా వివాదంపై మాట్లాడిన మస్క్ ‘అవుట్సోర్సింగ్ కంపెనీలు వ్యవస్థను నిర్ణయిస్తున్నాయి. నిజమైన, అద్భుతమైన ప్రతిభావంతులకు అమెరికా మద్దతు ఇవ్వాలి’ అని చెప్పారు.వ్యక్తిగతం..మస్క్ భాగస్వామి షివాన్ జిలిస్ గురించి మాట్లాడుతూ.. భారత్పై మక్కువతో నా భార్య మా కుమారుడి మధ్య పేరు ‘సేఖర్’ (భారతీయ-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ పేరు) అని పెట్టిందన్నారు. ఇన్వెస్టింగ్ దృక్పథంలో మౌలిక సమస్యలను పరిష్కరించే కంపెనీలపై పెట్టుబడి పెట్టండన్నారు. యూఎస్ ఆర్థిక ఋణాన్ని తగ్గించడానికి ఫ్రీట్రేడ్ మాత్రమే మార్గమని చెప్పారు. ఈ పాడ్కాస్ట్కు ప్రపంచవ్యాప్తంగా భారీగా స్పందన లభించింది. యూట్యూబ్లో 1.5 మిలియన్ వ్యూస్, ఎక్స్లో 6 మిలియన్కు పైగా రీచ్ వచ్చింది.Interview with Nikhil https://t.co/4mmIo9rcKw— Elon Musk (@elonmusk) November 30, 2025 -
భారతీయుల నుంచి అమెరికా ఎంతో లబ్ధి పొందింది: మస్క్
వాషింగ్టన్: ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా అత్యంత లబ్ధిపొందిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. జెరోధా సంస్థ సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ‘డబ్ల్యూటీఎఫ్’ పాడ్కాస్ట్లో మస్క్ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘అమెరికా వలస విధానాలను వ్యతిరేకించే కొన్ని శక్తులే హెచ్–1బీ వీసా కార్యక్రమం దురి్వనియోగమయిందనే వాదనను తెరమీదకు తీసుకొచ్చాయి. వాస్తవానికి ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా ఎంతో లబ్ధిపొందింది’’ అని అన్నారు. భారతీయుల ఉద్యోగాలను స్థానిక అమెరికన్లకు ఇవ్వాలని ట్రంప్ సర్కారు కంకణం కట్టుకుందా? అని ప్రశ్నించగా..‘‘అదెలా సాధ్యం? నిజానికి అత్యంత ప్రతిభావంతులకు అమెరికాలో ఎప్పట్నుంచో కొరత ఉంది. నా సొంత ఎక్స్, టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ఏఐ సంస్థల కోసం సైతం ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కోసం వెతుకుతున్నా. హెచ్–1బీని నిలిపేయాలనే గుంపులో నేను లేను’’ అని ఎలాన్ మస్క్ (Elon Musk) అన్నారు. నా కుమారుని పేరు శేఖర్ మస్క్ తన వ్యక్తిగత జీవిత వివరాలను కొన్నింటిని తొలిసారిగా బహిర్గతంచేశారు. ‘‘నాకూ శివోన్ జిలిస్కు పుట్టిన కుమారుల్లో ఒకరికి శేఖర్ అనే పదం కలిసొచ్చేలా పేరు పెట్టాం. భారతీయమూలాలున్న అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ (Subrahmanyan Chandrasekhar) పేరులోంచే శేఖర్ను తీసుకున్నాం. సహచరిణి శివోన్ సగం భారతీయురాలు. ఆమె తల్లి పంజాబీ. జివోన్ను చిన్నతనంలో ఉన్నప్పుడే వేరే కుటుంబం దత్తత తీసుకుంది. అలా శివోన్ కెనడాలో పెరిగింది’’ అని మస్క్ వెల్లడించారు. -
‘మస్క్’ను తలదన్నేలా.. కుర్రాళ్ల సరికొత్త ఏఐ మోడల్
మిచిగాన్: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అందించే మిలియన్ డాలర్ల ఆఫర్ను తిరస్కరిస్తూ, అమెరికాలోని మిచిగాన్కు చెందిన ఇద్దరు 22 ఏళ్ల కుర్రాళ్లు తమ విప్లవాత్మక ఏఐ ప్రాజెక్ట్ రూపకల్పనకు నడుంబిగించారు. సేపియంట్ ఇంటెలిజెన్స్ సహ వ్యవస్థాపకులైన గువాన్ వాంగ్, విలియం చెన్లు ఎలాన్ మస్క్ను ఢీకొడుతూ మానవ మేధస్సు కంటే తెలివైన ఏఐని సృష్టించే ఉమ్మడి ‘మెటాగోల్స్’తో అనుబంధం ఏర్పరచుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించే మొదటి వ్యక్తులం తామే కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఈ కుర్రాళ్లు తొలుత ఓపెన్చాట్తో విజయం సాధించారు. ఇది అధిక నాణ్యత సంభాషణల క్యూరేటెడ్ సెట్పై శిక్షణ పొందిన ఒక భాషా మోడల్ (ఎల్ఎల్ఏం). సంప్రదాయ ఎల్ఎల్ఎంల పరిమితులను అధిగమించేలా దీనిని తీర్చిదిద్దారు. వీరు రూపొందించిన ఓపెన్చాట్ త్వరగా విద్యా వర్గాలలో దూసుకుపోతోంది. ఈ మోడల్ ఎలాన్ మస్క్ దృష్టిని సైతం ఆకర్షించింది. దీంతో మస్క్ తన కంపెనీ ఎక్స్ ఏఐ ద్వారా ఆ కుర్రాళ్లను సంప్రదించి, మిలియన్ డాలర్ల ఆఫర్ను ఇచ్చారు. అయితే దీనిని చెన్, వాంగ్ తిరస్కరించారు.మస్క్ ఆఫర్ను తిరస్కరించిన తర్వాత వారు హైరార్కికల్ రీజనింగ్ మోడల్ (హెచ్ఆర్ఎం)ను సృష్టించేందుకు సేపియంట్ ఇంటెలిజెన్స్ను స్థాపించారు. ఈ హచ్ఆర్ఎం మోడల్ కేవలం 27 మిలియన్ పారామితులతో కూడిన ప్రోటోటైప్ అయినప్పటికీ, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ను కొలిచే సంక్లిష్టమైన పనులైన సుడోకు పజిల్స్, ఏఆర్సీ-ఏజీఐ బెంచ్మార్క్తో సహా ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, డీప్సీక్ లాంటి ప్రధాన ఏఐ వ్యవస్థలను అధిగమించింది.ఈ కుర్రాళ్లు రూపొందిస్తున్న హెచ్ఆర్ఎం.. గణాంకపరంగా తదుపరి పదాన్ని అంచనా వేసే సాంప్రదాయ ట్రాన్స్ఫార్మర్ల మాదిరిగా కాకుండా, మానవ ఆలోచనను అనుకరించే రెండు-భాగాల పునరావృత నిర్మాణాన్ని ఉపయోగిస్తుంది. ఇది ఉద్దేశపూర్వక తార్కికతను వేగవంతమైన రిఫ్లెక్సివ్ ప్రతిస్పందనలతో కలుపుతుంది. ఇది ఊహించడం కాదని, ఆలోచించడం అని, ఫలితంగా తమ మోడళ్లు సాంప్రదాయ ఎల్ఎల్ఎంల కంటే చాలా తక్కువగా భ్రాంతులు కలిగి ఉంటాయని ఆ కుర్రాళ్లు చెబుతున్నారు. వాతావరణ అంచనా, వ్యాపారం తదితర రంగాలలో ఇప్పటికే వీరి ప్రయోగాలు విజయవంతయ్యాయి.ఇది కూడా చదవండి: చాట్ జీపీటీకి మూడేళ్లు.. ఏం సాధించిందంటే.. -
నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో మస్క్
జెరోధా కో-ఫౌండర్ 'నిఖిల్ కామత్' నిర్వహించే పాడ్కాస్ట్లో ఇప్పటివరకు.. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, బయోటెక్ మార్గదర్శకుడు కిరణ్ మజుందార్-షా, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా మొదలైనవారు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు తాజాగా.. తన పాడ్కాస్ట్లో ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' పాల్గొన్నట్లు, దీనికి సంబంధించిన చిన్న వీడియో షేర్ చేశారు.నిఖిల్ కామత్ షేర్ చేసిన చిన్న వీడియోలో.. వీరిరువురు (ఎలాన్ మస్క్, నిఖిల్ కామత్) ఉండటం చూడవచ్చు. వీడియో షేర్ చేస్తూ.. దీనికి క్యాప్షన్ ఇవ్వండి.. అని ఆయన అన్నారు. కేవలం 39 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇదీ చదవండి: ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..నిఖిల్ కామత్ షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కొందరు దీనిని ఏఐ వీడియో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఏఐ వీడియోనా?, కాదా? అని తెలుసుకోవడానికి పూర్తి ఎపిసోడ్ రిలీజ్ అయితే గానీ ఖచ్చితంగా చెప్పడం కష్టమే!.Caption this@elonmusk pic.twitter.com/cYluYqm8S8— Nikhil Kamath (@nikhilkamathcio) November 28, 2025 -
బిలినీయర్స్ అంతా ఒక్కచోట!
అసాధ్యం అనుకున్న చాలా విషయాలను ఏఐ సాధ్యం చేస్తోంది. టెక్ బిలియనీర్లు అందరూ ఒక్క చోటకు చేరిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ చేసిన ఈ అద్భుతంపై.. నెట్టింట్లో మీమ్స్, జోకులు వెల్లువెత్తుతున్నాయి.1 ట్రిలియన్ స్క్వాడ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో.. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, సుందర్ పిచాయ్, జెన్సెన్ హువాంగ్, సామ్ ఆల్ట్మాన్, టిమ్ కుక్, జెఫ్ బెజోస్లు అందరూ ఒకేచోట ఉన్నారు. ఈ ఫోటోలు మస్క్ కొత్త గ్రోక్ అప్డేట్ ప్రకటనను తెలియజేయడానికే అని కొందరు చెబుతున్నారు.Trillion Squad assembled pic.twitter.com/tQMjRrfxx5— Ambuj Mishra (@Ambujmishra9090) November 22, 2025ఒక ఫొటోలో.. ఎలాన్ మస్క్ సహా చాలామంది దిగ్గజ వ్యాపారవేత్తలు కార్ పార్కింగ్ వద్ద సమావేశమైనట్లు కనిపిస్తున్నారు. మరో చిత్రంలో అందరూ కలిసి ఒక రూములో ఉన్నట్లు చూడవచ్చు. నిజజీవితంలో వీరంతా కలుసుకోవడం చాలా అరుదు అయినప్పటికీ.. ఏఐ మాత్రం వీరిని కలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.Somewhere in a parallel universe: pic.twitter.com/SFlYRiUpcn— DogeDesigner (@cb_doge) November 22, 2025 -
ట్రంప్ అభయం.. ఓ థ్యాంక్స్ పడేస్తే పోలా!
ఎలాన్ మస్క్తో డొనాల్డ్ ట్రంప్ సంబంధాలు మళ్లీ మెరగవుతున్నాయా?.. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. మస్క్ వ్యాపారాల గురించి మాట్లాడిన ట్రంప్.. ఆయన వెంట తాను ఉన్నానంటూ అభయం ఇచ్చారు. దానికి మస్క్ బదులిచ్చిన తీరు నెట్టింట చర్చకు దారి తీసింది.అమెరికా-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో ట్రంప్ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించిన పన్ను రాయితీ గురించి వివరించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు లాభదాయకంగా ఉందని.. కారు కొనుగోలు చేసే వారికి ఇంత రాయితీ ఎప్పుడూ లేదని అన్నారు. ఈ క్రమంలో మస్క్ను ఉద్దేశిస్తూ.. ‘‘ఇంత చేస్తున్నా కనీసం అతను నాకు సరైన థ్యాంక్స్ చెప్పాడా?” అంటూ అక్కడ ఉన్నవాళ్లను ఉద్దేశిస్తూ సరదాగా ప్రశ్నించారు. మధ్య తరగతి ప్రజలు ఒక మంచి టెస్లా కారు కొనుగోలు చేసి, దానికి రుణం తీసుకుంటే, ఆ రుణంపై వడ్డీకి మేము రాయితీ (డిడక్షన్) ఇస్తున్నాం. నువ్వు(మస్క్ను ఉద్దేశించి..) నిజంగా అదృష్టవంతుడివి. నేను నీతో ఉన్నాను ఎలాన్’’ అని ట్రంప్ చిరునవ్వుతో అన్నారు. దీంతో అక్కడ మళ్లీ నవ్వులు విరబూశాయి.అయితే ఈ ప్రసంగం జరిగిన కొన్ని గంటలకు.. మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు థ్యాంక్స్ చెబుతూ.. ఆయన అమెరికాకు, ప్రపంచానికి ఎంతో చేశారంటూ కొనియాడాడు. I would like to thank President Trump for all he has done for America and the world pic.twitter.com/KdK9VC2MLs— Elon Musk (@elonmusk) November 19, 20252024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ విపరీతంగా పని చేశారు. ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించడం, ఆయన కోసం విరాళాల సేకరణ ద్వారా తన బలమైన మద్దతు ప్రకటించారు. ప్రతిగా ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత.. మస్క్ను Department of Government Efficiency (DOGE) అనే కొత్త శాఖకు నాయకుడిగా నియమించారు. ఈ శాఖ ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, వ్యవస్థను సరళతరం చేయడం లక్ష్యాలతో పని చేసింది. మస్క్కు ట్రంప్ అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం సహజంగానే రిపబ్లికన్లకూ కోపం తెప్పించింది. ఈలోపు.. ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు తేవడాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా.. ఈ ఏడాది మే 30న తన డోజ్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆపై ట్రంప్ పాలనా నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒకానొక టైంలో ఇది ట్రంప్నే తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ బహిరంగానే విమర్శలు చేసుకుంటూ, వార్నింగులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది సాధారణంగానే మస్క్ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపెట్టింది. టెస్లా షేర్లు పడిపోయి భారీ నష్టాలను చవిచూసింది. నాసాతో స్పేస్ఎక్స్ ఒప్పందాలు దాదాపుగా రద్దయ్యే స్థితికి చేరుకున్నాయి. ఈ పరిణామాలన్నీ.. మస్క్ను రాజకీయ పార్టీ ప్రకటన వైపు అడుగులేయించింది. అంతేకాదు ట్రంప్ను ఇరకాటంలో పడేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి అంశాన్ని సైతం మస్క్ ప్రధానంగా ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే.. హఠాత్తుగా అన్నీ మరిచిపోయి ఈ ఇద్దరూ ఇలా ఇప్పుడు కలిసి కనిపిస్తున్నారు. ఆ మధ్య కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ స్మారక సభలో ఈ ఇద్దరూ కనిపించి సందడి చేశారు. మరోవైపు.. పాశ్చాత్య దేశాలతో.. ప్రత్యేకించి వాషింగ్టన్తో సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు సౌదీ యువరాజు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆయన్ను వైట్హౌజ్కు ఆహ్వానించి ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్కు టిమ్ కుక్, జెన్సెన్ హువాంగ్ , క్రిస్టియానో రొనాల్డో లాంటి ప్రముఖులు హాజరయ్యారు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ మస్క్ సందడి చేశారు. దీంతో అపర కుబేరుడికి మళ్లీ మంచిరోజులు వచ్చాయనే టాక్ నడుస్తోంది. -
ఏఐ రేసులోకి జెఫ్ బెజోస్ ఎంట్రీ
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకెక్కారు. తాను టెక్ పరిశ్రమలో కీలకంగా మారిన కృత్రిమ మేధ(AI) రేసులోకి అడుగుపెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ ప్రోమిథియస్’ అనే కొత్త ఏఐ స్టార్టప్కు మద్దతు ఇవ్వడంతోపాటు బెజోస్ దాని కో-సీఈఓగా ఎగ్జిక్యూటివ్ హోదాలో పని చేయనున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. 2021లో అమెజాన్ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన తర్వాత బెజోస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ హోదాను చేపట్టడం ఇదే తొలిసారి.భారీ నిధులుప్రాజెక్ట్ ప్రోమిథియస్ ఇప్పటికే 6.2 బిలియన్ డాలర్ల భారీ నిధులను సేకరించింది. ఇందులో కొంత భాగం బెజోస్ సమకూర్చారు. ఇప్పటికే ఈ స్టార్టప్ సీఈఓలుగా వెరిలీ, ఫోర్ సైట్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు విక్ బజాజ్లున్నారు. ఈ కంపెనీ కంప్యూటర్లు, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్ వంటి కీలక రంగాలలో ఇంజినీరింగ్, తయారీ కోసం ప్రత్యేకమైన ఏఐ ఉత్పత్తులను రూపొందించనుంది. ఈ సంస్థలో ఇప్పటికే మెటా, ఓపెన్ఏఐ, గూగుల్ డీప్మైండ్ వంటి కంపెనీల నుంచి వచ్చిన 100 మందికి పైగా ఏఐ పరిశోధకులు పనిచేస్తున్నారు.Haha no way 😂Copy 🐈 https://t.co/TG8UMrWwQr— Elon Musk (@elonmusk) November 17, 2025ఎలాన్ మస్క్ స్పందనఈ వార్తలపై టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. బెజోస్ ఎంట్రీ గురించి తెలుసుకున్న మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో.. ‘హాహా నో వే.. కాపీక్యాట్’ అని తెలిపారు. మస్క్ బెజోస్ను కాపీక్యాట్ అని పిలవడం ఇది మూడోసారి. ఇంతకు ముందు మస్క్ స్పేస్ఎక్స్కు పోటీగా ఇంటర్నెట్ బీమింగ్ ఉపగ్రహాలను ప్రయోగించే ప్రణాళికలను అమెజాన్ ప్రకటించినప్పుడు ఒకసారి అన్నారు. మరోసారి టెస్లాకు పోటీగా అమెజాన్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కంపెనీ జూక్స్ను కొనుగోలు చేసినప్పుడు మస్క్ ఇలాగే స్పందించారు.ఇదీ చదవండి: గిఫ్ట్ సిటీకి ఎందుకంత క్రేజ్.. -
ఎలాన్ మస్క్ జీవితాన్ని మార్చిన 10 పుస్తకాలు
టెస్లా (Tesla), స్పేస్ఎక్స్ (SpaceX) వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ టెక్నాలజీ ఎకోసిస్టమ్లో మార్పులు తీసుకురావాలని నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. తన ఆలోచనలకు మూలమైన కొన్ని పుస్తకాలు ఆయన జీవితంలో కీలకంగా మారాయని చెప్పారు. ఆ పుస్తకాల జాబితా కింది విధంగా ఉంది.1. ది హిచ్చికర్స్ గైడ్ టు ది గెలాక్సీ – డగ్లస్ ఆడమ్స్సైన్స్ ఫిక్షన్ క్లాసిక్2. ఫౌండేషన్ సిరీస్ – ఐజాక్ అసిమోవ్స్పేస్ఎక్స్ స్థాపనలో ఈ సిరీస్ ప్రభావం ఉందని మస్క్ పేర్కొన్నారు.3. అట్లాస్ ష్రగ్డ్ – ఐన్ రాండ్మస్క్ దీన్ని కమ్యూనిజానికి కౌంటర్ పాయింట్గా అభివర్ణించారు.4. జీరో టు వన్ (Zero to One) – పీటర్ థీల్ (Peter Thiel)సంచలనాత్మక కంపెనీలను నిర్మించడంపై ఈ పుస్తకం ఎంతో తోడ్పడినట్లు చెప్పారు.5. బెంజమిన్ ఫ్రాంక్లిన్: యాన్ అమెరికన్ లైఫ్ – వాల్టర్ ఐజాక్సన్ఆచరణాత్మక ఆవిష్కరణతో సైన్స్ను మిళితం చేయడానికి ఈ పుస్తకం ఉపయోగపడినట్లు చెప్పారు.6. ఐన్స్టీన్: హిజ్ లైఫ్ అండ్ యూనివర్స్ – వాల్టర్ ఐజాక్సన్7. ది సెల్ఫిష్ జీన్ – రిచర్డ్ డాకిన్స్పరిణామ జీవశాస్త్రంపై రాసిన పుస్తకం.8. సూపర్ ఇంటెలిజెన్స్ – నిక్ బోస్ట్రోమ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు గురించి ఆందోళనలను స్పష్టం చేస్తుంది.9. ది వెల్త్ ఆఫ్ నేషన్స్ – ఆడమ్ స్మిత్ఆర్థిక శాస్త్రం, స్వేచ్ఛా మార్కెట్లపై రాసిన పుస్తకం.10. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ – జె.ఆర్.ఆర్. టోల్కీన్చిన్నతనంలో మస్క్ ఈ ఫాంటసీ పుస్తకంతోనే గడిపారు.ఇదీ చదవండి: డీ2డీ సర్వీసులకు మార్గం సుగమం -
ఉద్యోగంతో ఊడిగం చేయాల్సిందేనా..!
టెస్లా, స్పేస్ఎక్స్కు సారథ్యం వహిస్తూ వాటిని విజయపథంలో నడిపించేందుకు వారానికి 120 గంటలు, రోజుకు సుమారు 17 గంటలు పనిచేశానని ఎలాన్ మస్క్ ఇటీవల ఒక సందర్భంలో తెలిపారు. చాలాసార్లు రాత్రిళ్లు కూడా పని చేసేవాడినని చెప్పారు. ప్రొడక్షన్ను పర్యవేక్షించడానికి ఫ్యాక్టరీలోనే నిద్రపోయిన సంఘటనలున్నాయని తెలిపారు. మస్క్ 2022లో ఎక్స్ను కొనుగోలు చేసినప్పుడు ఉద్యోగులకు ‘పని చేయడానికి జీవితాలను అంకితం చేయాలి లేదా సంస్థలో పని చేయడం మానేయాలి’ అని తన వైఖరిని స్పష్టం చేశారు. ఇటీవల ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి ఇదే తరహా వ్యాఖ్యలు చేసి వైరల్గా నిలిచారు. ఈనేపథ్యంలో జీవితంలో విజయం సాధించిన వారు వర్క్-లైఫ్ సమతుల్యతను వదులుకున్నవారేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.విజయానికి త్యాగం తప్పనిసరి..ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ మార్క్ క్యూబన్ వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమయ్యాయి. అయితే, తనకు నిజాయితీ కలిగిన వ్యక్తిగా పేరుంది. ది ప్లేబుక్ సిరీస్లో ఆయన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ ఉండదని చెప్పారు. ఆయన అభిప్రాయం ప్రకారం, సాధారణంగా 9–5 ఉద్యోగం చేస్తున్నవారు కొంత సమతుల్యతను పొందగలరేమో కానీ అత్యుత్తమ స్థానాన్ని కోరుకునే వారికి అది అసాధ్యమన్నారు. విజయానికి త్యాగం తప్పనిసరని చెప్పారు.సమతుల్యత కంటే సమన్వయం ముఖ్యంఅమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాత్రం వర్క్-లైఫ్ సమతుల్యతకు ఆమోదం తెలిపారు. ‘నేను ఇంట్లో సంతోషంగా ఉంటేనే నా పనిలో ఉత్తమంగా ఉంటాను. పని, వ్యక్తిగత జీవితం మధ్య పోటీ కాకుండా పరస్పర సహకారం అవసరం. సమతుల్యత కంటే సమన్వయం కీలకంగా ఉంటుంది’ అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఈ ఆలోచనకు అనుకూలంగా ఉన్నారు. ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కంటే రెండింటి మధ్య సమన్వయం చాలా ముఖ్యం. అంటే మన ఆసక్తులు, విలువలను వృత్తిలోనూ ఉండేలా జాగ్రత్తపడితే మెరుగైన ఫలితాలు ఉంటాయి’ అన్నారు.9-9-6 రూల్..చైనాలోని అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా ‘9-9-6’ పని సంస్కృతిని సమర్థించారు. అంటే ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు, వారానికి 6 రోజులు పని చేయాలి. యువత వృత్తిపరంగా ఎదగాలంటే దీన్ని అనుసరించాలని చెబుతున్నారు. అయితే ‘మీకు ఇష్టమైన పని దొరికితే 9-9-6 పని సమస్య కాదు’ అని అన్నారు.ఇదీ చదవండి: విద్య అంటే కేవలం చదువేనా? -
టెస్లా బాస్కు భారీ ప్యాకేజ్: దిగ్గజ సీఈఓల వేతనాలు ఇవే..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్.. త్వరలో మొట్టమొదటి ట్రిలియనీర్ కానున్నారు. టెస్లా కంపెనీ నుంచి ఆయనకు ట్రిలియన్ డాలర్ల వేతనం అందించడానికి.. కంపెనీ వాటాదారులలో 75 శాతం కంటే ఎక్కువ మంది అంగీకరించారు. రానున్న దశాబ్దంలో.. టెస్లా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటే.. భారీ ప్యాకేజీ అందుతుందని వారు షరతులు పెట్టారు.గరిష్ట వేతన ప్యాకేజీ అందుకోవాలంటే మస్క్ కొన్ని లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. ఇందులో 2 కోట్ల వాహనాలు, 10 లక్షల రోబోటాక్సీలు, 10 లక్షల హ్యూమనాయిడ్ రోబోట్ల విక్రయించాలి. కంపెనీ సుమారు 400 బిలియన్ డాలర్ల స్థూల లాభాన్ని పొందాలి. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే, మార్కెట్ విలువ ప్రస్తుత 1.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 8.5 ట్రిలియన్ డాలర్లకు చేరాలి.ఎలాన్ మస్క్ ప్యాకేజీ.. 2018లో తీసుకున్న ప్యాకేజీతో పోలిస్తే సుమారు 18 రెట్లు ఎక్కువ (56 బిలియన్ డాలర్లు). కాగా బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ ప్రస్తుత నికర విలువ దాదాపు 460 బిలియన్ డాలర్లు. ఈయన టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ఏఐల ద్వారా ఎక్కువ ఆర్జిస్తున్నారు.మైక్రోసాఫ్ట్, యాపిల్ సీఈఓల వేతనాలు భారీగా ఉన్నప్పటికీ.. మస్క్ వేతనంతో పోలిస్తే చాలా తక్కువ అని తెలుస్తుంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈఓల వేతనాల విషయానికి వస్తే..➤సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్): 79.1 మిలియన్ డాలర్లు➤టిమ్ కుక్ (యాపిల్): 74.6 మిలియన్ డాలర్లు➤జెన్సన్ హువాంగ్ (ఎన్విడియా): 49.9 మిలియన్ డాలర్లు➤డేవిడ్ రిక్స్ (ఎలీ లిల్లి): 29.2 మిలియన్ డాలర్లు➤మార్క్ జుకర్ బర్గ్ (మెటా): 27.2 మిలియన్ డాలర్లు➤సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్): 10.7 మిలియన్ డాలర్లు➤హాక్ టాన్ (బ్రాడ్ కామ్): 2.6 మిలియన్ డాలర్లు➤ఆండీ జస్సీ (అమెజాన్): 1.6 మిలియన్ డాలర్లు➤వారెన్ బఫెట్ (బెర్క్షైర్ హాత్వే): 4 లక్షల డాలర్లుఇదీ చదవండి: భారత్ వైపు జపాన్ చూపు: 2030 నాటికి.. -
మస్క్ సారథ్యంలోని కంపెనీ ఐపీఓకి రానుందా?
ఎలాన్ మస్క్ తన రాకెట్ తయారీ సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)ను పబ్లిక్ కంపెనీగా మార్చబోతున్నట్లు హింట్ ఇచ్చారు. టెస్లా 2025 వాటాదారుల సమావేశంలో ఆయన చేసిన ప్రకటన వల్ల స్పేస్ఎక్స్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) వచ్చే అవకాశం ఉంటుందని కొందరు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.టెస్లా (Tesla) 2025 వాటాదారుల సమావేశంలో మాట్లాడుతూ మస్క్ స్పేస్ఎక్స్ ఐపీఓ గురించి వ్యాఖ్యలు చేశారు. ‘టెస్లా వాటాదారులు స్పేస్ఎక్స్ వృద్ధిలో పాల్గొనడానికి ఏదైనా మార్గాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాను. అది చాలా మేలు చేస్తుంది. స్పేస్ఎక్స్ కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాల్లో పాలుపంచుకోవడానికి ప్రజలకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. ఇప్పటికే ఇతర కంపెనీల్లో స్టాక్స్ కలిగి ఉన్న మద్దతుదారులు స్పేస్ఎక్స్ స్టాక్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. కానీ, ఏ సమయంలో అది జరుగుతుందో కచ్చితంగా చెప్పలేను. అయితే ఏదో ఒక సమయంలో మాత్రం స్పేస్ఎక్స్ పబ్లిక్ కంపెనీగా మారాలి’ అని అన్నారు.ఈ వ్యాఖ్యలు ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీల్లో ఒకటైన స్పేస్ఎక్స్ భవిష్యత్తుపై, సాధారణ ప్రజలు పెట్టుబడి పెట్టే అవకాశంపై ఊహాగానాలకు దారితీశాయి.స్పేస్ఎక్స్2002లో ఎలాన్ మస్క్ దీన్ని స్థాపించారు. స్పేస్ఎక్స్ (స్పేస్ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్ప్) టెక్సాస్లోని బ్రౌన్స్ విల్లేలో ఉన్న స్టార్ బేస్లో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. లో-ఎర్త్ ఆర్బిట్ నుంచి అంతరిక్ష నౌకను విజయవంతంగా తిరిగి భూమిపైకి తెచ్చిన సంస్థగా గుర్తింపు పొందింది.ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అంతరిక్ష నౌక (డ్రాగన్ 2)ను విజయవంతంగా డాక్ చేసింది.స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లు పునర్వినియోగానికి వీలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: రైలులో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా? -
ప్రపంచ కుబేరుడి ఆనంద తాండవం!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరింత సంపన్నుడవుతున్నాడు. కంపెనీ సీఈవోగా ఎలాన్ మస్క్కు దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన గరిష్ట వేతన ప్యాకేజీకి టెస్లా వాటాదారులు ఆమోదించారు. టెక్సాస్లోని ఆస్టిన్లో జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని కంపెనీ బోర్డు ప్రకటించబడింది. ఆమోదం అనంతరం వేదికపైకి వెళ్లిన మస్క్ కంపెనీ హ్యూమనాయిడ్ రోబోట్ ‘ఆప్టిమస్’తో కలిసి నృత్యం చేస్తూ ఈ విజయాన్ని జరుపుకున్నారు.ఈ ఘట్టం టెస్లా (Tesla) భవిష్యత్తు రోబోటిక్స్, కృత్రిమ మేధస్సుతో (AI) ఎంత బలంగా ముడిపడి ఉందో సూచిస్తోంది. మస్క్ ప్రకారం.. ఆప్టిమస్ భవిష్యత్తులో తయారీ, సరఫరాలు, వ్యక్తిగత సహాయక సేవల వరకు విస్తరించగలదు. “ఇతర కంపెనీల వాటాదారుల సమావేశాలు బోరింగ్గా ఉంటాయ. కానీ మనవి ఎప్పుడూ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. దీన్ని చూడండి.. ఇది అద్భుతం!” అంటూ ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. టెస్లా ఇప్పుడు “కేవలం కార్ల కంపెనీ కాదు.. రోబోటిక్స్, AI ఆధారిత కొత్త యుగానికి నాంది” అని ప్రకటించారు.Tesla’s Optimus robots outperformed their fellow robot, Elon in dancing 😂pic.twitter.com/hLBnvZSPuL— SMX 🇺🇸 (@iam_smx) November 6, 2025సాటిలేని వేతన ప్యాకేజీప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాని 1 ట్రిలియన్ డాలర్ల వరకూ వేతన ప్యాకేజీని అందుకునే అవకాశాన్ని టెస్లా వాటాదారులు ఎలాన్ మస్క్కు కల్పించారు. వచ్చే 10 సంవత్సరాల్లో మస్క్ 878 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా స్టాక్ను సంపాదించే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం కంపెనీ నిర్దిష్ట మైలురాళ్లను చేరుకున్నప్పుడు మాత్రమే అమలులోకి వస్తుంది.గరిష్ట వేతన ప్యాకేజీ అందుకోవాలంటే మస్క్ సాధించాల్సిన లక్ష్యాలు.. 2 కోట్ల వాహనాలు, 10 లక్షల రోబోటాక్సీలు, 10 లక్షల హ్యూమనాయిడ్ రోబోట్ల విక్రయాలు సాధించాలి. సుమారు 400 బిలియన్ డాలర్ల స్థూల లాభాన్ని కంపెనీకి ఆర్జించిపెట్టాలి. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే, టెస్లా ప్రస్తుత 1.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కనీసం 8.5 ట్రిలియన్ డాలర్ల వరకు తీసుకెళ్లాలి.నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ వంటి కొంతమంది ప్రధాన పెట్టుబడిదారులు ఈ ప్యాకేజీకి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, టెస్లా బోర్డు దీన్ని మస్క్ను కంపెనీకి కట్టిపడేయడానికి అవసరమైన ప్రోత్సాహంగా భావించింది. బోర్డు అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రణాళిక టెస్లా వాటాదారులకు కూడా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. -
మస్క్లాంటి వారు మాత్రమే సంపన్నులవుతారు!
కృత్రిమ మేధ(AI) వేగంగా అభివృద్ధి చెందడం మొదలైనప్పటి నుంచి ఉద్యోగాల కోత సంచలనంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వాటి కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగిస్తూ వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ గాడ్ ఫాదర్గా పిలువబడే జెఫ్రీ హింటన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐలో వస్తున్న మార్పు భవిష్యత్తులో కోట్లాది మందిని నిరుద్యోగులుగా మారుస్తుందని, ఈలోగా కేవలం ఎలాన్ మస్క్ వంటి కొద్దిమంది మాత్రమే ధనవంతులు అవుతారని జోస్యం చెప్పారు.కంపెనీల వైఖరిఇప్పటికే టెక్ దిగ్గజాలైన ఐబీఎం, టీసీఎస్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు ఏఐని అమలు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఈ ధోరణి ఇప్పట్లో ఆగిపోయే అవకాశం లేదని హింటన్ బ్లూమ్బెర్గ్కు ఇచ్చిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోకుండా ఏఐతో ముందుకు వెళ్లే మార్గం ఉందా అని అడిగినప్పుడు ‘అది సాధ్యం కాదని నమ్ముతున్నాను. డబ్బు సంపాదించాలంటే మానవ శ్రమను భర్తీ చేయాలి. అందుకు ఏఐను వాడుతున్నారు. కంపెనీలు లాభాలు పెంచుకునేందుకు ఈ పంథాను వినియోగిస్తున్నాయి’ అన్నారు.ఏఐ సమస్య కాదు.. సామాజిక సమస్య..ఏఐ అభివృద్ధి వల్ల ఏర్పడే ఆర్థిక అసమానతపై జెఫ్రీ హింటన్ మాట్లాడుతూ.. ‘టెక్ బిలియనీర్లు మాత్రమే ఈ రేసులో విజేతలుగా నిలుస్తారు. గణనీయ సంఖ్యలో ఉద్యోగుల స్థానంగా ఏఐ పని చేస్తుంది. మస్క్ వంటి వ్యక్తులు మాత్రమే ధనవంతులు అవుతారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు. ఇది ఏఐ సమస్య కాదు, సామాజిక సమస్య. ఏఐ మన సమాజాన్ని, మన ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మిస్తుందనేది నిశితంగా గమనించాలి’ అన్నారు.ఇదీ చదవండి: ఏఐ బూమ్ ఎఫెక్ట్: ఫ్లాష్ మెమరీ కాంపోనెంట్ల కొరత -
నేటి నుంచి స్టార్లింక్ సర్వీసుల డెమో
స్టార్లింక్ అక్టోబర్ 30 (నేడు), 31న తమ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవల సెక్యూరిటీ, సాంకేతిక ప్రమాణాల పరీక్షలను ముంబైలో నిర్వహించనుంది. కంపెనీకి ప్రొవిజనల్గా కేటాయించిన స్పెక్ట్రం ఆధారంగా ప్రభుత్వ ఏజెన్సీల సమక్షంలో వీటిని నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్లో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రారంభించేందుకు స్టార్లింక్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.స్టార్లింక్కు సంబంధించి కొన్ని అంశాలు..ఇంటర్నెట్ స్పీడ్ 200 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. లొకేషన్ను అనుసరించి సగటు వేగం 100 ఎంబీపీఎస్గా ఉండొచ్చు.మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ అందిస్తారు.వినియోగదారులు, ఆయా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.హార్డ్ వేర్ కిట్లో భాగంగా శాటిలైట్ డిష్, రౌటర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.33,000 ఉండొచ్చు.ఇంటర్నెట్ సర్వీసుల కోసం అనువైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎయిర్టెల్, జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.బీఎస్ఎన్ఎల్ వంటి ప్రస్తుత టెలికాం సంస్థలకు అంతరాయం కలగకుండా ఉండటానికి భారతదేశం అంతటా 20 లక్షల కనెక్షన్లకే పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ కనెక్టన్లు ఇవ్వకూడదు.2025 చివరి నాటికి భారత్లో ఈ సర్వీసులు లాంచ్ చేస్తారని అంచనా. తర్వలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ‘ఆదాయపన్ను తగ్గించాలి’ -
ఎలాన్ మస్క్ టెస్లాకు బై..బై?
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రతిపాదిత 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల(సుమారు రూ.88 లక్షల కోట్లు) వేతన ప్యాకేజీని వాటాదారులు ఆమోదించడంలో విఫలమైతే అతడు సంస్థను విడిచిపెట్టే ప్రమాదం ఉందని టెస్లా బోర్డు ఛైర్మన్ రాబిన్ డెన్హోమ్ హెచ్చరిక జారీ చేశారు. నవంబర్ 6, 2025న జరగనున్న కంపెనీ వార్షిక సమావేశానికి ముందు డెన్హోమ్ వాటాదారులకు పంపిన లేఖలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఈసారి మస్క్ వేతన ప్యాకేజీకి సంబంధించిన ఓటు టెస్లా భవిష్యత్తుకు అత్యంత కీలకం అని లేఖలో స్పష్టం చేశారు.మస్క్ ఏం చేయబోతున్నారు?మస్క్ ప్రతిపాదించిన ఈ పరిహార ప్రణాళిక ఎందుకు కీలకమో డెన్హోమ్ లేఖలో వివరించారు. ‘మస్క్ ఆధ్వర్యంలోని కంపెనీలు అత్యంత ప్రతిష్టాత్మకమైన పనితీరు లక్ష్యాలతో ముడిపడి ఉన్నాయి. 2035 నాటికి టెస్లా మార్కెట్ క్యాప్ను 1.36 ట్రిలియన్ డాలర్ల నుంచి 8.5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఏటా 20 మిలియన్ వాహనాలను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1 మిలియన్ రోబోటాక్సీలను తయారు చేయాలని, మరో 1 మిలియన్ ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్లను డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు’ అని చెప్పారు.డెన్హోమ్ తన లేఖలో.. ఈ లక్ష్యాలను సాధించడానికి మస్క్ నాయకత్వం చాలా అవసరమని చెప్పారు. మస్క్ లేకపోతే టెస్లా గణనీయమైన విలువను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మస్క్ వేతన ప్యాకేజీ ఓటు టెస్లాకు కీలకమైన భవిష్యత్ పెట్టుబడి అని చెప్పారు. అయితే ఈ ప్యాకేజీపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఐఎస్ఎస్ వంటి కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజరీ సంస్థలు ఈ ప్యాకేజీ నిర్మాణంపై విమర్శలు గుప్పించాయి. దీనిపై మస్క్ స్పందిస్తూ విమర్శకులను ‘కార్పొరేట్ టెర్రరిస్టులు’ అని పేర్కొన్నారు. ఇదిలాఉండగా, వాటాదారుల ఓటు నవంబర్ 5, 2025 రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. టెస్లా వార్షిక సమావేశం నవంబర్ 6, 2025న నిర్వహించనున్నారు.ఇదీ చదవండి: ధర్మ మార్గాన ధనార్జన -
ఎలాన్ మస్క్ మరో సంచలనం
ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెర తీశారు. వికీపీడియాకు పోటీగా.. గ్రోకిపీడియా(Grokipedia)ను తీసుకొచ్చారు. ఇది ఏఐ ఆధారితంగా పని చేస్తుందని.. వికీపీడియా కంటే పది రేట్లు ఎంతో బెటర్ అంటూ ప్రకటించారు. ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI గ్రోకిపీడియా(Grokipedia version 0.1) ప్లాట్ఫారమ్ను ఇవాళ(అక్టోబర్ 28న) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది Grokకు conversational AI మోడల్. వాస్తవాలను ఆధారంగా తీసుకుని.. శరవేగంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా సమాచారం అందించడం దీని ఉద్దేశమని మస్క్ అంటున్నారు. అయితే.. ఇది ప్రారంభమైన కాసేపటికే భారీ ట్రాఫిక్ కారణంగా క్రాష్ అయ్యింది. దీంతో కాసేపటికి సేవల్ని పునరుద్ధరించారు. అంతేకాదు.. కొంత మంది ఇది వికీపీడియాతో పోలిస్తే కొత్తగా ఏం లేదని పెదవి విరుస్తున్నారు. పైగా ప్రాథమిక సమాచారాన్ని వికీపీడియా నుంచే తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు. వికీపీడియాను జిమ్మీ వేల్స్ (Jimmy Wales), ల్యారీ సాంగర్ (Larry Sanger) కలిసి 2001 జనవరి 15న స్థాపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సమాచార వేదికలలో ఒకటి. ఇది ఒక ఫ్రీ ప్లాట్ఫారమ్. ఇందులో ఎవరైనా సమాచారాన్ని పొందుపరచవచ్చు.. లాగిన్ అయ్యి ఎడిట్ కూడా చేయొచ్చు. ఇది వికీమీడియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే.. వికీపీడియాకు పోటీగా, నిజమైన సమాచారం కోసం కొత్త వేదికలు అవసరం అంటూ మస్క్ చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. వికీపీడియాలోని సమాచారం విషయంలో స్పష్టత కొరవడింది. పూర్తిగా పక్షపాత ధోరణి కనిపిస్తోంది. అదే ఏఐతో అయితే అందుకు ఆస్కారం ఉండదని చెబుతూ ఇప్పుడు మస్క్ Grokipedia తీసుకొచ్చారు. -
ఆ ‘సింగిల్ మైండ్సెట్’ మస్క్ కంటే ధనవంతున్ని చేసింది!
బిలియనీర్, ఒరాకిల్ (Oracle) వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ (Larry Ellison) గురించి కొత్తగా వెలుగులోకి వచ్చిన వీడియో.. ఆయన విజయానికి మూలమైన వ్యక్తిత్వ లక్షణాన్ని బయటపెట్టింది. అదే “సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రశ్నించే ధోరణి.” ఈ ధోరణి ఆయన్ను మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లింది. చివరికి ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్ (Elon Musk) సంపదను కూడా అధిగమించే స్థితికి చేర్చింది.ఎల్లిసన్ తన విజయ రహస్యాన్ని వివరిస్తూ, “సాంప్రదాయ ఆలోచనలకు అనుగుణంగా ఉండకండి” అని సలహా ఇచ్చారు. నిపుణుల మాటలను కూడా గుడ్డిగా నమ్మకూడదని, అధికారాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. “నిపుణులు కాబట్టి వారిని అనుమానించకూడదు అనే భావన తప్పు” అని చెప్పిన ఎల్లిసన్, ఈ ఆలోచన పద్ధతి కొంత మందికి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో సంబంధాలను “చాలా బాధాకరంగా” మార్చవచ్చని కూడా అంగీకరించారు. అయినప్పటికీ, ఆయన దృష్టిలో ఉత్సుకత మానవ స్వభావంలోని అత్యంత విలువైన లక్షణం.సెయిల్ బోట్ల రేసింగ్ పట్ల ఆసక్తిని ప్రస్తావిస్తూ, ఎల్లిసన్ దాన్ని స్వీయ-ఆవిష్కరణకు ఒక రూపంగా వివరించారు. తన కెరీర్పై మాట్లాడిన ఎల్లిసన్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ (Microsoft) మధ్య పోటీ రోజులు తనకు స్వీయ అవగాహనను పెంచాయని తెలిపారు. “ప్రతిరోజూ నా గురించి కొత్త విషయాలు నేర్చుకుంటాను” అని చెప్పారు. ఎల్లిసన్ చివరగా చెప్పిన మాటలు ఆయన తత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి. “నా జీవితంలో నేను ఎన్నో పనులు చేశాను. వాటికి జీతం లభించింది. కానీ ఆ పనులన్నీ ఒకే లక్ష్యానికి, స్వీయ ఆవిష్కరణకు దారితీశాయి” అన్నారు.ఇదీ చదవండి: కొడుకుతో వాచ్మెన్కు క్షమాపణ చెప్పించిన ముకేశ్ అంబానీLarry Ellison on success being directly correlated to questioning limits and conventional wisdom pic.twitter.com/gD87fTVxP8— prayingforexits 🏴☠️ (@mrexits) October 24, 2025 -
ప్రపంచ కుబేరురాలు పార్క్బామ్?
దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ పాప్ గాయని పార్క్బామ్ (Park Bom) ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా మారే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్లు దర్శనమిస్తున్నాయి. పార్క్బామ్ గతంలో చేసిన పోస్ట్ను కోట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి.పార్క్బామ్ గతంలో పని చేసిన ఏజెన్సీ వైజీ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకుడు యాంగ్ హ్యున్ సుక్ (Yang Hyun Suk) తనను భారీ మొత్తంలో మోసం చేశారని ఆరోపిస్తూ ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో ఆమె దాదాపు 4.5 క్వాడ్రిలియన్ డాలర్లు (రూ.4,500 లక్షల కోట్లు-Quadrillion - ఒకటి తర్వాత 15 సున్నాలు) చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఒక లీగల్ డాక్యుమెంట్ స్క్రీన్షాట్ను పోస్ట్ చేశారు. ఈ మొత్తం దాదాపు ప్రపంచ జీడీపీకి 41 రెట్లతో సమానం. దాంతో అందులో తెలిపిన మొత్తం చాలా అసాధారణంగా ఉండడంతో ఈమేరకు పోస్ట్లు చక్కర్లు కొడుతున్నాయి.Breaking: Park Bom is expected to become the richest person in the world if she wins the case, surpassing Elon Musk.Park Bom of 2NE1 has reportedly sued YG Entertainment for a demure amount of 1002003004006007001000034'64272e trillion won. pic.twitter.com/tCIUS60kGB— World updates (@itswpceo) October 23, 2025ఈ వివాదంలో పార్క్బామ్ ఈ భారీ మొత్తాన్ని నిజంగా గెలిస్తే ఆమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా, తొలి ట్రిలియనీర్గా, ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్ను అధిగమించిన తొలి మహిళగా మారుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
అమెజాన్లో 6 లక్షల ఉద్యోగాలు గాన్?
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) లక్షలాది ఉద్యోగాలను తొలగించబోతోందన్న సమాచారం కలకలం సృష్టిస్తోంది. దాదాపు 6 లక్షల ఉద్యోగాలను రోబోలతో భర్తీ చేయాలని అమెజాన్ యోచిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ఒక నివేదిక తెలిపింది.ఇదే నివేదికను ఉటంకిస్తూ జాసన్ అనే ‘ఎక్స్’ యూజర్ ఓ పోస్ట్ పెట్టారు. "న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. అమెజాన్ 6,00,000 మందిని భర్తీ చేయబోతోంది. నా ప్రకారం అయితే ఈ అంచనా తక్కువే. ఇక పదేళ్లలో మనుషులే బాక్సులు ప్యాక్ చేసి రవాణా చేస్తారనుకుంటే పిచ్చితనమే. ఇక ఆట ముగిసింది" అంటూ రాసుకొచ్చారు.ఈ పోస్ట్ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) దృష్టిని ఆకర్షించింది. "ఏఐ, రోబోట్లు అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాయి" అని వాదనతో ఆయన ఏకీభవించారు. రానున్న యుగం ఎలా ఉంటుందో మస్క్ మరింత అంచనా వేశారు. భవిష్యత్తులో మనుషులు పనిచేయడమన్నది స్వచ్ఛందంగా ఉంటుందన్నారు. ఉదాహరణకు "దుకాణం నుండి కొనడానికి బదులుగా కూరగాయలను సొంతంగా పండించడం వంటిది" అని ఆయన పోస్ట్ లో వివరించారు.అమెజాన్లో రోబోలతోనే మొత్తం పని?అమెజాన్లో వివిధ విభాగాల్లో ఆటోమేషన్ ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయో తెలిపే అంతర్గత పత్రాలను చూసినట్లు నివేదిక పేర్కొంది. అయితే సుమారు 6,00,000 మానవ ఉద్యోగాలను రోబోలతో భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్న న్యూయార్క్ టైమ్స్ నివేదికను అమెజాన్ ఖండించింది. ఆ పత్రాలు అసంపూర్ణంగా ఉన్నాయని, సంస్థ మొత్తం నియామక వ్యూహాన్ని తెలిపేవికావని కంపెనీ తెలిపింది.రాబోయే హాలిడే సీజన్ కోసం 2,50,000 మందిని నియమించాలని ఈ-కామర్స్ కంపెనీ యోచిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ తెలిపారు. అలాగే నిబంధనల విషయంలో సిబ్బందిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని, కమ్యూనిటీ ప్రమేయానికి, ఆటోమేషన్ కు సంబంధం లేదని అమెజాన్ వివరించింది. -
ఎలాన్ మస్క్ 'బేకరీ'.. కానీ ఇక్కడ కేక్లు, పేస్ట్రీలు ఉండవు..
టెస్లా అధినేత, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపర కుభేరుడు, ఎలాన్ మస్క్ వ్యవస్థపక విజయాలన్నీ..కొత్త వ్యాపారం చేయాలనుకునేవారికి మార్గదర్శకం. అలాంటి టెక్ దిగ్గజం ఒక 'బేకరీ'ని కూడా నడుపుతున్నట్లు మీకు తెలుసా..!. అయితే ఆ బేకరీలో కేక్లు, పేస్ట్రీలు, బ్రెడ్లు ఉండవు ఉండవు. మరీ ఏం తయారవుతాయంటే..ఈ బేకరీ స్టార్షిప్ అంతరిక్ష నౌకలో ఉపయోగించే సిరామిక్ హీట్ షీల్డ్ టైల్స్ తయారు చేస్తుంది. చలా జాగ్రత్తగా రూపొందించే ఈ టైల్స్ పదునైన షడ్భుజాకారాల్లో ఉంటాయి. అవి భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే మండే ఉష్ణోగ్రతలో అంతరిక్ష నౌకను రక్షిస్తాయి. వీటి ష్ణోగ్రతలో కొన్నిసార్లు 1,400 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంటుందట. ఆ నేపథ్యంలోనే వీటికి ప్రత్యేకమైన డిజైన్ ఉంది. ఇందులో సంక్లిష్టమైన పిన్ అటాచ్మెంట్లు, చిన్న విస్తరణ అంతరాలు ఉంటాయి. ఇవి పగుళ్లు లేకుండా వంగడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తాయి. ప్రతి స్టార్షిప్కు 18,000 షడ్భుజాకార టైల్స్ అవసరం. ఇవి నల్లటి బోరోసిలికేట్ గాజుతో పొరలుగా ఉన్న అధునాతన సిలికా-ఆధారిత సిరామిక్స్తో నిర్మిస్తారు. దీనిలో వేసే ముడి పదార్థం నుంచి తుది ఉత్పత్తికి చేరుకునే ప్రక్రియకు సుమారు 40 గంటలు పైనే పడుతుందట. ఈ బేకరీ ప్రతిరోజు వేలాది టైల్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ పేరే ఎందుకంటే..ఇక్కడ టైల్స్ కఠినమైన బేకింగ ప్రక్రియకు లోనవ్వుతాయి కాబట్టి. బ్రెడ్ను తయారు చేసినట్లుగానే ఈ ప్రత్యేకమైన టైల్స్ని అధిక ఉష్ణోగ్రత వద్ద సంపూర్ణ ఏకరీతి నిర్మాణాంలోకి వచ్చేలా చేస్తారు. ఇదంతా ఎందుకంటే.. అంతలా చేస్తేనే అంతరిక్ష ప్రయాణాన్ని సరసమైన ధరలో లభించేలా చేసేందుకు దోహదపడుతుంది ఇది ఎలాన్ మస్క్ కలల వెంచర్. అలాగే ఈ స్టార్షిప్ని ఇంతల బేక్ చేయడం వల్లే చంద్రుడు, భూమి, అంగారక గ్రహాలపై బహుళ రీ ఎంట్రీలు, ల్యాండింగ్లు నావిగేట్ చేసేటప్పుడూ తీవ్ర ఉష్ణోగ్రతలను ఈజీగా తట్టుకుంటుందట. Our fully automated bakery in Florida is setup to produce thousands of heat shield tiles per day to outfit the coming fleet of Starship vehicles pic.twitter.com/9Ki278wakx— SpaceX (@SpaceX) October 13, 2025 (చదవండి: తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..) -
కొత్తకారు కొన్న రోహిత్ శర్మ: ఎలాన్ మస్క్ రీపోస్ట్..
ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ.. ఇటీవల టెస్లా మోడల్ వై కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా టెస్లా చేసిన ఒక ట్వీట్ ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించింది.''టెస్లా ప్రకటన చేయవలసిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లో 45 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్న రోహిత్ శర్మ (భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్) కొత్త టెస్లా మోడల్ వై కొనుగోలు చేశారు''. అనే పోస్టు టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించడంతో.. దానిని రీపోస్ట్ చేశారు. ఎక్కువమంది ఫాలోవర్స్ ఉండటం చేత ఈ కారు గురించి అందరికి తెలుస్తుందనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.టెస్లా మోడల్ వై గురించిటెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: లాంచ్కు ముందే అన్నీ కొనేశారు!స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.This is why Tesla doesn’t need to advertise - Rohit Sharma (captain of India’s national cricket team), who has 45M followers on Instagram, just bought a new Tesla Model Ypic.twitter.com/m02awSltMR https://t.co/XQSLYyo4XZ— Teslaconomics (@Teslaconomics) October 9, 2025 -
‘ఓపెన్ఏఐ పుట్టిందే ఓ అబద్ధంతో..’
ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం OpenAIని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ కంపెనీ దాని వ్యవస్థాపక లక్ష్యానికి పూర్తిగా ద్రోహం చేసిందని తీవ్రంగా ఆరోపించారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా మస్క్ OpenAI ‘ఒక అబద్ధంపై నిర్మించబడింది. ఒక స్వచ్ఛంద సంస్థగా వెలసి సొంత ఆర్థిక లాభం కోసం పని చేస్తుంది’ అని పేర్కొన్నారు.మస్క్ తాజా దాడి నేపథ్యంOpenAI ఇటీవల తన వైరల్ టెక్స్ట్-టు-వీడియో అప్లికేషన్ ‘సోరా’ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దీనిపై వస్తున్న పోస్ట్లకు ప్రతిస్పందనగా మస్క్ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 2022లో వచ్చిన ఓపెన్ ఏఐకు చెందిన చాట్జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్మన్ 2015లో ఓపెన్ఏఐ ప్రారంభించినప్పుడు.. మస్క్ కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత 2018లో బయటకు వచ్చేసారు. మస్క్ ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత.. 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 17 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ మొదలుపెట్టినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంకా ఆ దావాపై తీర్పు వెలువడలేదు.ఇదీ చదవండి: చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు.. -
‘ప్రపంచానికి 200 మంది ఎలాన్ మస్క్లు అవసరం’
అమెరికాకు, ప్రపంచానికి ఎలాన్ మస్క్ వంటి వ్యవస్థాపకులు పెద్ద సంఖ్యలో అవసరమని డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ అన్నారు. ఇటీవల పియర్స్ మోర్గాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ వ్యవస్థాపక విజయాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ వినూత్న రాకెట్ క్యాచింగ్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు.అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే రాకెట్ బూస్టర్లను పట్టుకోవడానికి యాంత్రిక టెక్నాలజీ (చాప్ స్టిక్లు) ఉపయోగించి మస్క్ ఇటీవల ప్రపంచం దృష్టిని ఆకర్షించారని నొక్కి చెబుతూ.. ‘మనకు 200 మంది ఎలాన్ మస్క్లు అవసరం. యూఎస్తోపాటు ప్రపంచానికి మస్క్ అవసరం ఉంది. పాశ్చాత్య నాగరికతకు తనలాంటి వారు కచ్చితంగా ఉపయుక్తంగా మారుతారు. దాంతోపాటు ప్రపంచానికి డొనాల్డ్ ట్రంప్ అవసరం కూడా ఉంది’ అని ఎరిక్ అన్నారు.ఎలాన్ మస్క్, తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాన్ని ప్రస్తావిస్తూ ‘వారు ఇద్దరు బలమైన జట్టుగా ఉన్నారని భావిస్తున్నాను. ఒకరినొకరు భారీ ప్రశంసలతో, అపార గౌరవాన్ని కలిగి ఉన్నారు’ అని పేర్కొన్నారు. మస్క్ ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో స్పందించారు. ఎరిక్ ట్రంప్ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలపై ‘ధన్యవాదాలు’ అని రాసి హార్ట్ ఎమోజీని జోడించారు.ఇదీ చదవండి: రెరా ఉన్నా 10 శాతం మార్టగేజ్ క్లాజ్ అవసరమా? -
‘మస్క్.. నీ సంపద బిల్గేట్స్కు మాత్రం ఇవ్వొద్దు’
టెస్లా అధినేత, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం 485 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. తన సంపదను దానం చేసే గివింగ్ ప్లడ్జ్ తీసుకున్న ఎలాన్ మస్క్కు అలా చేయొద్దని, ఆయన సంపదను బిల్గేట్స్కు మాత్రం ఇవ్వొద్దని సలహా ఇచ్చినట్లు పేపాల్ (PayPal) వ్యవస్థాపకుడు, బిలియనీర్ ఇన్వెస్టర్ పీటర్ థీల్ తాజాగా వెల్లడించారు.2012లో ఎలాన్ మస్క్.. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ (Bill Gates), వారెన్ బఫెట్లు కలిసి తీసుకొచ్చిన "గివింగ్ ప్లెడ్జ్" చొరవపై సంతకం చేశారు. దీని ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ సంపదలో కనీసం సగం భాగాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలి.రాయిటర్స్కు లభించిన ఉపన్యాస సిరీస్ ట్రాన్స్క్రిప్ట్లు, ఆడియో రికార్డింగ్స్ ప్రకారం.. గివింగ్ ప్లెడ్జ్ ప్రకారం బిల్ గేట్స్ ఎంపిక చేసిన వామపక్ష సంస్థలకు ఆయన సంపద వెళ్తుందని మస్క్కు థీల్ (Peter Thiel) చెప్పాడు. ఈ సంభాషణ సందర్భంగా దైవ విరోధుల చేతుల్లోకి అధికారం వెళ్తే ప్రపంచానికే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వెలిబుచ్చారు.తన సంపదను విరాళంగా ఇవ్వవద్దని థీల్ మస్క్కు సలహా ఇచ్చినప్పుడు, "మరి నేనేమి చేయాలి- నా పిల్లలకు ఇవ్వాలా?" అని మస్క్ అడిగినట్లు థీల్ చెప్పారు. దీనికి థీల్ ఇచ్చిన సమాధానం.. "బిల్ గేట్స్కు ఇవ్వడం మాత్రం చాలా తప్పు". బిలియనీర్లు మరణం తర్వాత వారి సంపద విధి గురించి మరింత విమర్శనాత్మకంగా ఆలోచించాలని థీల్ వాదించారు. ఒక వేళ సంవత్సరంలోపు మస్క్ మరణిస్తే బిలియన్ల డాలర్లు గేట్స్ చేతుల్లోకి వెళ్తాయన్నారు. గేట్స్ చొరవ వంటి వాగ్దానాల ద్వారా సంపదను ఇతరులు నిర్దేశించడానికి అనుమతివ్వడం అంత మంచిది కాదని థీల్ సూచించారు.కాగా ఎలాన్ మస్క్ 2012లో "గివింగ్ ప్లెడ్జ్"పై సంతకం చేశారు. కానీ తన సంపదను ఎలా వినియోగించాలన్నది మాత్రం ఆయన వివరంగా పేర్కొనలేదు.ఇదీ చదవండి: ఈ దుబాయ్ యువరాణి ఎంత రిచ్ అంటే.. -
గ్రోక్ ఏఐ వీడియో: స్పందించిన మస్క్
టెక్నాలజీ రంగంలో.. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందులో భాగంగానే ఈయన తన ఏఐ వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్ గ్రోక్ ఇమాజిన్కు సంబంధించిన కొత్త వెర్షన్ 0.9ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త వెర్షన్.. ఇప్పటికే రియాలిటీగా కనిపించే వీడియోలను సృష్టించగల సామర్థ్యంతో యూజర్లను తెగ ఆకట్టుకుంది.ఇండియన్ కంటెంట్ క్రియేటర్ ప్రశాంత్.. ప్రముఖ హాలీవుడ్ చిత్రం ఐరన్ మ్యాన్ నుంచి ఒక సన్నివేశాన్ని.. రీక్రియెట్ చేసి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఇక్కడ కనిపించే వ్యక్తి మస్క్ను పోలి ఉన్నారు. వీడియో మొత్తం ఎడారి ప్రాంతం కనిపిస్తుంది. వీడియో షేర్ చేస్తూ.. ''గ్రోక్ ఇమాజిన్ 0.9 సినిమా నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది. ఐకానిక్ ఐరన్ మ్యాన్ దృశ్యాన్ని తిరిగి ఊహించుకున్నాను. ఇందులో విజువల్ క్వాలిటీ, ఆడియో జనరేషన్ వంటివి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది అద్భుతమైన మోడల్'' అని అన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. 'గ్రోక్ ఇమాజిన్ వెర్షన్ 0.9 నాట్ బ్యాడ్' అని అన్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. గ్రోక్ 0.9 వెర్షన్ ఇంత అద్భుతంగా ఉంటే.. 1.0 ఎలా ఉంటుందో అని ఒకరు అన్నారు. గ్రోక్ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను సృష్టిస్తుందని ఇంకొకరు అన్నారు.Not bad for Grok Imagine version 0.9 … https://t.co/ihIzdVOylj— Elon Musk (@elonmusk) October 9, 2025 -
ఫొటోలకు ప్రాణం పోసేలా వీడియో.. గ్రోక్ ఏఐ కొత్త ఫీచర్
ఎక్స్ఏఐ (xAI) రూపొందించిన గ్రోక్ఏఐ (GrokAI) యాప్లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టినట్లు ఎలాన్మస్క్ తెలిపారు. పాత, కొత్త ఫొటోలను అప్లోడ్ చేసి కేవలం 20 సెకన్లలో వాటిని వీడియోలుగా మార్చేయవచ్చని చెప్పారు. ఈ నూతన సాంకేతికత కృత్రిమ మేధ (Artificial Intelligence) ద్వారా కేవలం ఒక చిత్రాన్ని తీసుకొని దానికి కదలిక (Motion), అనుగుణమైన శబ్దం (Audio) జోడించి 20 సెకన్లలో 6 నుంచి 15 సెకన్ల నిడివి గల వాస్తవిక దృశ్యం (Photorealistic video)లాగా మార్చగలుగుతోంది. గ్రోక్ఏఐ ‘గ్రోక్ ఇమాజిన్’ (Grok Imagine) ఫీచర్ ద్వారా చారిత్రక చిత్రాలు, ఫ్యామిలీ ఫొటోలు లేదా కార్టూన్ పాత్రలను సజీవంగా మార్చవచ్చని కంపెనీ చెబుతుంది.Upload any photos from your phone or take a picture of an old photo and turn it into a video in 20 seconds with the Grok app! https://t.co/ouHoufWeqG— Elon Musk (@elonmusk) October 7, 2025బనానా ఏఐఫొటోలు అప్లోడ్ చేసి వీడియోలు మార్చే క్రమంలో గ్రోక్ఏఐ ముందున్నా, ఇదే తరహా కృత్రిమ మేధ సామర్థ్యాలను బనానా ఏఐ (Banana AI) కలిగి ఉంది. ఇది గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ (Gemini 2.5 Flash Image) మోడల్కు చెందింది. బనానా ఏఐ ప్రధానంగా ఫోటోలను మెరుగుపరచడం, వాటిని మార్చడం, కొత్త చిత్రాలను సృష్టించడం (Text-to-Image) వంటి వాటికి ప్రసిద్ధి చెందింది.ప్రస్తుతం బనానా ఏఐ ఫోటో-టు-వీడియో ఫీచర్ కాకుండా ఫొటో ఎడిటింగ్ వంటి వాటిలో వినియోగదారులకు సహాయపడుతుంది. ఉదాహరణకు వినియోగదారులు తమ సాధారణ ఫొటోలను ‘రెట్రో చీరలు ధరించిన వింటేజ్ ఫొటోలు’గా మార్చడానికి దీన్ని వాడుతున్నారు. ఈ రెండు కంపెనీలు (గ్రోక్, గూగుల్) వేర్వేరు మార్గాల్లో కంటెంట్ సృష్టికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.మానసిక స్వాంతనతమ పాత ఫొటోకు ప్రాణం పోసినప్పుడు నెజిజన్లకు అపూర్వమైన భావోద్వేగ అనుభూతి కలుగుతుంది. దశాబ్దాల నాటి కుటుంబ ఫొటోలు, గతించిపోయిన ప్రియమైన వారి చిత్రాలు వీడియోలుగా మారినప్పుడు గతాన్ని మళ్లీ అనుభూతి చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల సంతోషం, సంతృప్తి, లోతైన భావోద్వేగ బంధం ఏర్పడతాయి. తమ ఊహలకు రూపం ఇచ్చేందుకు, పాత కథలకు దృశ్యరూపం కల్పించేందుకు ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. ఈ సృజనాత్మకత ఒక విధమైన మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.వ్యాపార అవకాశాలుఏఐ ఆధారిత ఫోటో-టు-వీడియో టెక్నాలజీ కేవలం వ్యక్తిగత భావోద్వేగాలకే పరిమితం కాకుండా కంపెనీలకు వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. గ్రోక్ఏఐ ఈ అధునాతన ఫీచర్ను సాధారణంగా ‘సూపర్ గ్రోక్’ (Super Grok) వంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల్లో అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారుల నుంచి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. అధిక నాణ్యత (High-quality), ఎక్కువ నిడివి గల వీడియోల కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది.కంటెంట్ క్రియేటర్ల మార్కెట్నేటి సోషల్ మీడియా యుగంలో కంటెంట్ క్రియేటర్లకు వీడియో అత్యంత ముఖ్యమైన సాధనం. ఈ ఏఐ టూల్స్ ద్వారా నిమిషాల్లో ప్రొఫెషనల్ స్థాయి వీడియోలను సృష్టించవచ్చు. దీనివల్ల సోషల్ మీడియా మార్కెటింగ్, యాడ్స్, షార్ట్ ఫిల్మ్ల తయారీకి అయ్యే ఖర్చు, సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ విధంగా కంటెంట్ తయారీ ప్లాట్ఫామ్లు (FlexClip వంటివి) కూడా ఏఐ ఆధారిత ఫీచర్లను తమ వ్యాపారంలో భాగం చేసుకుంటున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) చేసిన ఒక ట్వీట్.. నెట్ఫ్లిక్స్ (Netflix) మార్కెట్ విలువను భారీగా దెబ్బతీసింది. 2025 సెప్టెంబర్ 27న 514 బిలియన్ డాలర్లుగా ఉన్న దాని మార్కెట్ విలువ.. 2025 అక్టోబర్ 3 నాటికి సుమారు 25 బిలియన్ డాలర్లు తగ్గిపోయి.. 489 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందన్నమాట.పిల్లల షోలలో ట్రాన్స్జెండర్ సందేశాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో మస్క్ స్ట్రీమర్ను విమర్శించారు. ''మీ పిల్లల ఆరోగ్యం కోసం నెట్ఫ్లిక్స్ రద్దు చేయండి'' అని ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: వికీపీడియాకు పోటీగా గ్రోకీపీడియా!: మస్క్హమీష్ స్టీల్ దర్శకత్వం వహించిన.. నెట్ఫ్లిక్స్ యానిమేటెడ్ సిరీస్ 'డెడ్ ఎండ్: పారానార్మల్ పార్క్' లింగ మార్పిడి సమస్యలను ప్రోత్సహిస్తోందని, వోక్ ఎజెండాను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాబట్టి పిల్లల మానసిక ఆరోగ్యం దృష్ట్యా నెట్ఫ్లిక్స్ చూడటం ఆపాలని మస్క్ అన్నారు. దీంతో నెట్ఫ్లిక్స్ మార్కెట్ విలువ భారీ పతనాన్ని చవిచూసింది.Cancel Netflix for the health of your kids https://t.co/uPcGiURaCp— Elon Musk (@elonmusk) October 1, 2025 -
వికీపీడియాకు పోటీగా గ్రోకీపీడియా!: మస్క్
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) వికీపీడియాకు పోటీగా.. గ్రోకీపీడియా (Grokipedia) లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దీని బీటా వెర్షన్ రెండు వారాల్లో ప్రారంభమవుతుందని ఆయన తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.గ్రోకీపీడియాను.. మస్క్ ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ (xAI) రూపొందిస్తోంది. ''గ్రోకిపీడియా ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖచ్చితమైన జ్ఞాన వనరుగా మారబోతోంది'' అని ఒక ఎక్స్ యూజర్ చేసిన పోస్టుకు.. మస్క్ రిప్లై ఇచ్చారు. అయితే ఈ గ్రోకీపీడియాకు సంబంధించిన ఫీచర్లను గురించి అధికారికంగా వెల్లడించలేదు. నిజాలను వెల్లడించానికే ఈ ఫ్లాట్ఫామ్ను రూపొందిస్తున్నట్లు సమాచారం.Version 0.1 early beta of Grokipedia will be published in 2 weeks https://t.co/M6VrGv8zp5— Elon Musk (@elonmusk) October 5, 2025Exactly https://t.co/Ia38jMbJoj— Elon Musk (@elonmusk) October 5, 2025 -
మస్క్ కంపెనీలో జాబ్స్: జీతం ఎంతో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏఐ కంపెనీ అయిన ఎక్స్ఏఐ (xAI) దాని చాట్బాట్ 'గ్రోక్' కోసం ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. వీడియో గేమ్ల కోసం.. వీడియో గేమ్స్ ట్యూటర్లను నియమించుకోనుంది. వీరు గ్రోక్కు గేమ్లను రూపొందించడం, కథలు చెప్పడం, యూజర్ ఆలోచనలకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వనున్నారు.గ్రోక్ టెక్స్ట్ ఆధారిత సంభాషణలకు పరిమితం చేయకుండా.. మరింత సృజనాత్మకంగా ఉండేలా ట్యూటర్స్ శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి వీరు ఎక్స్ఏఐ సాఫ్ట్వేర్తో పని చేస్తారు. గేమ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం కంపెనీ అన్వేషిస్తోంది. అయితే ఎన్ని ఉద్యోగాలు, ఎంతమందిని నియమించుకుంటారనే విషయం వెల్లడించలేదు.ఎంపికైన ఉద్యోగులు కాలిఫోర్నియాలోని ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. కానీ రిమోట్గా కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. రిమోట్గా వర్క్ చేయాలనుకునే అభ్యర్థులకు సెల్ఫ్ డిసిప్లైన్, స్ట్రాంగ్ మోటివేషన్ వంటివి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు మొదటి రెండు వారాలు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అనుకూలమైన టైమ్ ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!జీతం & ప్రయోజనాలుఎంపికైన ఉద్యోగులకు జీతం గంటకు 45 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు ఉంటుంది. ప్రయోజనాలు దరఖాస్తుదారు నివసించే దేశంపై ఆధారపడి ఉంటాయి. ఫుల్ టైమ్ జాబ్ చేసే ఉద్యోగులకు మెడికల్ కవరేజ్ లభిస్తాయి. అయితే, పార్ట్-టైమ్ ఉద్యోగులకు ఇలాంటి ప్రయోజనాలు ఉండవు. -
ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్!
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk).. దాదాపు అర ట్రిలియన్ డాలర్ల నికర విలువను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ ట్రాకర్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి.. ఇప్పుడు 500.1 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. ఈయన నికర విలువ ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ కంటే 150 బిలియన్ డాలర్లు ఎక్కువ.దక్షిణాఫ్రికాలో జన్మించిన బిలియనీర్ ఎలాన్ మస్క్.. సంపద అతని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla)తో ముడిపడి ఉంది. సెప్టెంబర్ 15 నాటికి అతను 12.4 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల నాటికి టెస్లా షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. దీంతో మస్క్ సంపదకు 9.3 బిలియన్ డాలర్లు యాడ్ అయ్యాయి. ఇలా కంపెనీ స్టాక్ వాల్యూ ఎప్పటికప్పుడూ పెరుగుతూ ఉండటం వల్ల.. మస్క్ సంపద కూడా పెరుగుతూనే ఉంది.డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. మస్క్ టెస్లా షేర్స్ భారీగా పెరిగాయి. కాగా కంపెనీ ఇప్పుడు ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ, స్పేస్ఎక్స్ కంపెనీలను కూడా విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. ఇది కూడా మస్క్ సంపదను మరింత పెంచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఆ పాస్పోర్ట్తో అమెరికాలో సమస్యలు!: కెనడా హెచ్చరికపిచ్బుక్ డేటా ప్రకారం, ఎక్స్ఏఐ జూలై నాటికి 75 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. అదే సమయంలో స్పేస్ఎక్స్ విలువ 400 బిలియన్ డాలర్లు (బ్లూమ్బెర్గ్ ప్రకారం). మస్క్ సంపద ఇదే వృద్ధి రేటుతో కొనసాగితే.. 2023 మార్చి నాటికి ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ కాగలరని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. -
అదంతా పచ్చి అబద్ధం: ఎలాన్ మస్క్
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్తో డొనాల్డ్ ట్రంప్ను కొంతకాలం ఎలాన్ మస్క్(Elon Musk) ఇరుకునపెట్టడం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మస్క్.. ఒక్కసారిగా చల్లబడ్డారు. ఈ తరుణంలో మస్క్ పేరే ఎప్స్టీన్ ఫైల్స్లో కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్ను బయటపెట్టడం లేదంటూ ఈ ఏడాది జూన్లో మస్క్ సంచలన ఆరోపణలకు దిగారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ.. వరుసబెట్టి చేసిన ట్వీట్లన్నింటినీ డిలీట్ చేసుకుంటూ వచ్చారాయన. ఈ తరుణంలో.. అమెరికా హౌజ్ ఓవర్సైట్ కమిటీ విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ తాలుకా డాక్యుమెంట్లలో మస్క్ పేరు కనిపించింది.అందులో.. ఒక దగ్గర ఎలాన్ మస్క్ డిసెంబర్ 6న ఐల్యాండ్కు రావాలి అని ఉంది. దీంతో ఎప్స్టీన్కు చెందిన ప్రైవేట్ ద్వీపానికి మస్క్ వెళ్లారా? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. ఎలాన్ మస్క్ ఈ ఆరోపణను ఖండించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే.. మస్క్ ఎప్స్టీన్ ఫైల్స్పై ఇలా స్పందించడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఆయనకు, ఎప్స్టీన్కు మధ్య సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. తానెప్పుడు ఎప్స్టీన్ ఐల్యాండ్కు వెళ్లలేదని మస్క్ చెబుతూ వస్తున్నారు. మరోవైపు.. 8,544 పేజీల డాక్యుమెంట్లలో విమాన ప్రయాణాల వివరాలు, క్యాలెండర్లు, ఎప్స్టీన్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఉన్నాయి. కేవలం మస్క్ పేరు మాత్రమే కాదు.. అందులో ట్రంప్ సహా బిల్గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. అయితే పేర్లు ఉన్నంత మాత్రానా వాళ్లు ఎప్స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో భాగస్వాములు అయి ఉంటారనే నిర్ధారణ లేదని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చెబుతూ వస్తుండడం గమనార్హం.ఎవరీ ఎప్స్టీన్..అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్(Jeffrey Epstein)హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్.. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలపై ఎప్స్టీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే.. ఎఫ్బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని, ప్రాముఖ్యమైన వ్యక్తులపై నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే.. ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్ వివాహ వేడుకలోనూ ఎప్స్టీన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. ఈ సెక్స్ స్కాండల్ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు).. ట్రంప్ను కూడా ఎఫ్బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.ఆ విగ్రహం తొలగింపుఎప్స్టీన్ ఫైల్స్తో ట్రంప్ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వాషింగ్టన్లోని నేషనల్ మాల్ దగ్గర ట్రంప్- ఎప్స్టీన్ చేతులు కలిపి సరదాగా ఉన్న ఓ విగ్రహాన్ని సెప్టెంబర్ 23వ తేదీన ఏర్పాటు చేశారు. Best Friends Forever అనే క్యాప్షన్ అక్కడ ఉంచారు. ఇది జనాలను విపరీతంగా ఆకర్షించింది. అయితే.. నిబంధనల ఉల్లంఘన పేరిట ఆ మరుసటిరోజే అధికారులు దానిని అక్కడి నుంచి తొలగించారు. సీక్రెట్ షేక్హ్యాండ్ అనే సంస్థ ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
మస్క్ కుమార్తె వద్ద డబ్బు లేదంటా..!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి కుమార్తె అంటే వెంటనే గుర్తొచ్చేది.. ఆమె విలాసాలు, లగ్జరీ కార్లు, హంగులు, ఆర్భాటాలు, పార్టీలు.. కానీ అలాంటివేవీ లేకుండా ముగ్గురు స్నేహితులతో ఓ చిన్న అపార్ట్మెంట్లో కాలం వెళ్లదీస్తున్నారు వివియన్ జెన్నా విల్సన్. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్మస్క్ కుమార్తె జెన్నా విల్సన్(జేవియర్ మస్క్) ఇటీవల న్యూయార్క్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఇంటర్వ్యూలో జెన్నా విల్సన్(21) తెలిపిన వివరాల ప్రకారం..‘నా వద్ద వందలు, వేల డాలర్లు లేవు. లాస్ ఏంజిల్స్లోని ఒక షేరింగ్ అపార్ట్మెంట్లో ముగ్గురు రూమ్మేట్స్తో ఉంటున్నాను. ఈ పరిస్థితులను నేను భరించగలను. నాకు జన్మనిచ్చిన తండ్రితో ఏ విధంగానూ సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడను’ అని చెప్పుకొచ్చారు. విల్సన్ 16 ఏళ్ల వయస్సులో ట్రాన్స్జెండర్గా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. 2022లో చట్టబద్ధంగా తన పేరును, జెండర్ను మార్చుకుంది. ఈ సందర్భంగా కోర్టు ద్వారా తన తండ్రితో బహిరంగంగా సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కుటుంబానికి దూరంగానే ఉంటోంది.ఎవరి సాయం అవసరం లేదు..కోర్టు ద్వారా తండ్రి, కుటుంబం నుంచి విడిపోతున్న సమయంలో మస్క్ నుంచి లభించే ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని ఆమె తిరస్కరించారు. తనను తాను పోషించుకోవడానికి సరళంగా జీవించేందుకు ఎవరి సహాయం అవసరం లేదని తేల్చిచెప్పారు. మస్క్ భార్యలకు పుట్టినవారిలో వివియన్ తొలి సంతానం.ఇదీ చదవండి: సమస్యగా కాదు... సదవకాశంగా చూద్దాం! -
‘ఇదేందయ్యా ఇది..!’ ఒకే వేదికపై మెరిసిన ట్రంప్-మస్క్
అమెరికా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో తీవ్రస్థాయి పరస్పర విమర్శలు గుప్పించుకున్న ట్రంప్-మస్క్.. మళ్లీ ఒక్కటయ్యారు!. అరిజోనా స్టేట్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో హేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ వెనుక కూర్చుని ఇద్దరూ తెగ ముచ్చటించుకున్నారు. అంటే.. పొరపచ్చాలను పక్కన పెట్టి అమెరికా కోసం మళ్లా ఒక్కటిగా కలిసి పని చేయబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ను అమెరికా స్వాతంత్ర సమర యోధుడిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెప్టెంబర్ 10వ తేదీన ఉటా యూనివర్సిటీలో జరిగిన దాడిలో కిర్క్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆదివారం అరిజోనా స్టేట్ గ్లెన్డేల్ నగరంలోని స్టేట్ ఫామ్ స్టేడియంలో నిర్వహించిన కిర్క్ స్మారక సభలో ట్రంప్ పై ప్రకటన చేశారు. అయితే.. ఇదే వేదికగా కనిపించిన ఓ దృశ్యం.. ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్గా మారింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా ట్రంప్తో కరచలనం చేసి.. పక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించారు. ట్రంప్ సైతం మస్క్ను టచ్ చేస్తూ ఆప్యాయంగానే మాట్లాడారు. ఆ సమయంలో మస్క్ తన చేతులను ‘‘పిరమిడ్ హ్యాండ్ సింబల్’’ రూపంలో ఉంచడమూ.. ఇంటర్నెట్ను ప్రధానంగా ఆకర్షిస్తోంది. ఊహించని ఈ పరిణామంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.NEW: President Trump and Elon Musk were spotted sitting together and chatting during a surprise reunion at Charlie Kirk’s memorial. pic.twitter.com/5asd3mTiJF— Fox News (@FoxNews) September 21, 20252024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో.. ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ విపరీతంగా పని చేశారు. ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించడం, ఆయన కోసం విరాళాల సేకరణ ద్వారా తన బలమైన మద్దతు ప్రకటించారు. ప్రతిగా ట్రంప్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత.. మస్క్ను Department of Government Efficiency (DOGE) అనే కొత్త శాఖకు నాయకుడిగా నియమించారు. ఈ శాఖ ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, వ్యవస్థను సరళతరం చేయడం లక్ష్యాలతో పని చేసింది. మస్క్కు ట్రంప్ అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం సహజంగానే రిపబ్లికన్లకూ కోపం తెప్పించింది. ఈలోపు.. ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు తేవడాన్ని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా.. ఈ ఏడాది మే 30న తన డోజ్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఆపై ట్రంప్ పాలనా నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఒకానొక టైంలో ఇది ట్రంప్నే తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ బహిరంగానే విమర్శలు చేసుకుంటూ, వార్నింగులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలు.. మస్క్ను రాజకీయ పార్టీ ప్రకటన వైపు అడుగులేయించింది. అంతేకాదు ట్రంప్ను ఇరకాటంలో పడేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి అంశాన్ని సైతం మస్క్ ప్రధానంగా ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.అయితే, కొన్నాళ్లుగా మస్క్ స్వరం మారింది. ట్రంప్లాగే చార్లీ కిర్క్తో ఎలాన్ మస్క్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన స్మారక సభలో మస్క్ భావోద్వేగంగా స్పందించారు. అదే సమయంలో ట్రంప్తో ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత విభేదాలను పక్కనబెట్టి, మళ్లీ కలిసి పనిచేయబోతున్నారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. దీనికి మస్క్ ఎక్స్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. -
అత్యంత అభిమానం నుంచి అత్యంత విద్వేషం దాకా..
వాషింగ్టన్: నూతన హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులకు వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు అమెరికా ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా మూలాలున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గతంలో చేసిన హెచ్–1బీ అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు మరోసారి తెరమీదకొచ్చాయి. హెచ్–1బీ కారణంగానే తనలాంటి ఎంతో మంది దక్షిణాఫ్రికా మొదలు ఎన్నో ప్రపంచదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారని, హెచ్–1బీ అనేది అద్భుతమైన విధానమని గతంలో మస్క్ ‘ఎక్స్’లో ట్వీట్చేసిన అంశాన్ని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. ఆ తర్వాతి కాలంలో హెచ్–1బీ విధానంపై మస్క్ హఠాత్తుగా మాటమార్చారు. అది అత్యంత లోపభూయిష్టమైన విధానమని, అమెరికాకు దీంతో ప్రయోజనంలేదని అభాండాలు వేయడం మొదలెట్టడం చూసి రిపబ్లికన్ పార్టీ నేతలు సైతం విస్మయం వ్యక్తంచేయడం తెల్సిందే. మొదట్లో ట్రంప్ను ఆకాశానికెత్తేసిన మస్క్ ఆ తర్వాత ట్రంప్కు పోటీగా రాజకీయ పార్టీని సైతం ప్రకటించారు. హెచ్–1బీ అమలుతీరులో ఎలాంటి లోపాలు లేవు. సంస్కరణలు అక్కర్లేదని మస్క్ గతంలో అన్నారు. ఇటీవల మాటమార్చారు. ‘అదొక విఫల విధానం. భారీ సంస్కరణలు తేవాల్సిందే’అని అన్నారు. గతంలో దీనికి పూర్తిభిన్నంగా మాట్లాడారు. ‘హెచ్–1బీ కారణంగానే నేను అమెరికాలో స్థిరపడగలిగా. నేను మాత్రమే కాదు నా సంస్థలైన టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్, ఇతర కీలక సంస్థల ఏర్పాటులో నాకు సాయపడిన వారెందరినో హెచ్–1బీ అమెరికా కలలను నెరవేర్చింది. చట్టబద్ధ వలసలకు ఇది స్వర్గధామం. హెచ్–1బీ కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధం. హెచ్–1బీని తప్పుబట్టేవాళ్లను ముఖం మీదనే చాచికొడతా’అని గతంలో అన్నారు. ఇలా మాట్లాడిన కొద్ది కాలానికే మస్క్ స్వరం మార్చారు. ‘హెచ్–1బీ వీసాతో అమెరికాలో అడుగుపెట్టిన వృత్తినిపుణులుకు కనీస వేతనం పెంచడం, మెయింటెన్స్ ఖర్చులు పెరగడంతో స్థానిక ఉద్యోగులతో పోలిస్తే ఇలా విదేశీయులను పనిలో పెట్టుకోవడం ఆర్థికంగా భారమే. ఇవన్నీ చూస్తుంటే హెచ్–1బీ అనేది కాలంచెల్లిన విధానంగా అఘోరించింది. దీనిలో భారీ సంస్కరణలు తీసుకురాక తప్పదు’అని అన్నారు. -
ట్రైనింగ్ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడిపోతాయో చెప్పలేం. అయితే ఆ ఏఐ సాధనానికి శిక్షణ ఇచ్చేవాళ్ల ఉద్యోగాలే పోవడం బాధాకరం. బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్ఏఐ (xAI).. తన డేటా అనోటేషన్ బృందం నుండి సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది. వీరంతా సంస్థ జనరేటివ్ ఏఐ చాట్ బాట్ ‘గ్రోక్’కు శిక్షణ ఇచ్చే సిబ్బంది కావడం గమనార్హం.ఇదీ కారణం నివేదిక ప్రకారం.. ఉద్యోగుల తొలగింపులకు కారణం సంస్థ దృష్టి మారడం. ఎక్స్ఏఐ సాధారణ ఏఐ ట్యూటర్లను అభివృద్ధి చేయడంపై దృష్టిని తగ్గించి స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై వనరులను కేంద్రీకరిస్తుందంటూ సిబ్బందికి పంపిన ఈమెయిల్ లో కంపెనీ తెలిపింది. "మా హ్యూమన్ డేటా ప్రయత్నాలను క్షుణ్ణంగా సమీక్షించిన తరువాత, మా స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్ల విస్తరణ, ప్రాధాన్యతను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నాం. అదే సమయంలో సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోలపై మా దృష్టిని తగ్గించాం. "ఫోకస్ లో ఈ మార్పులో భాగంగా, మాకు ఇకపై చాలా సాధారణ ఏఐ ట్యూటర్ ఉద్యోగులు అవసరం లేదు.. ఎక్స్ఏఐతో మీ ఉద్యోగం ముగుస్తుంది" అని పేర్కొంది.ఉద్యోగులకు సిస్టమ్ యాక్సెస్ రద్దు చేస్తామని చెప్పిన కంపెనీ వారి ఒప్పందాలు ముగిసే వరకు లేదా నవంబర్ 30 వరకు జీతాలు చెల్లింపు కొనసాగుతుందని వివరించింది. వీడియో గేమ్స్, వెబ్ డిజైన్, డేటా సైన్స్, మెడిసిన్, స్టెమ్ వంటి రంగాలలో స్పెషలిస్ట్ ఏఐ ట్యూటర్లపై పెట్టుబడులను పెంచుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసినట్లు తెలిసింది. అందుకుఅనుగుణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను పెంచుకోనున్నట్లు ఇటీవలే ఎక్స్ఏఐ ప్రకటించింది.ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలకు ఓకే కానీ.. టెకీల ఆలోచనలు -
బ్రిటన్లో జరిగిన యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీకి ఎలాన్ మస్క్ మద్దతు
-
బ్రిటన్లో ఉద్రిక్తత.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
లండన్: బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. లక్షల మంది పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో టెస్లా సీఈవో, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసలతో బ్రిటన్ నాశనం అవుతోంది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.బ్రిటన్లో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్బంగా వీడియోలో మాట్లాడుతూ.. ‘భారీగా, అనియంత్రితంగా వస్తున్న వలసలతో బ్రిటన్ నాశనమవుతోంది. వలసల కారణంగా హింస పెరిగిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే హింస ప్రజలందరి వద్దకు వస్తుంది. ఇప్పటికైనా ప్రతిఘటించాల్సిందే.. పోరాడాల్సిందే. మన హక్కులు కాపాడుకోవాల్సిందే. పోరాడండి.. లేదంటే చనిపోతారు.. అని వారికి మద్దతు ఇచ్చారు. చివరగా.. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని నేను అనుకుంటున్నాను’ అని కామెంట్స్ చేశారు.📢 Massive protests in London today! Tens of thousands at "Unite the Kingdom" rally for free speech & anti-immigration, with reports of hundreds of thousands or even 1M+ attendees. 🇬🇧 #LondonProtests #UKNews pic.twitter.com/AD0OjUZjuy— Socially Trendy (@SociallyTrendyX) September 13, 2025 ఇదిలా ఉండగా.. శనివారం సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దది. ఈ సందర్భంగా ప్రజలందరూ..‘మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి, పడవలను ఆపండి వంటి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇక, ఈ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్-రైట్ కార్యకర్త టామీ రాబిన్సన్ నిర్వహించిన 'యునైట్ ది కింగ్డమ్' ర్యాలీ హింసాత్మకంగా మారింది. వలస విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ప్రదర్శనలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనల్లో 26 మంది పోలీసు అధికారులు గాయపడగా, 25 మందిని అరెస్ట్ చేశారు.#BREAKING: Anti-immigration protesters clash with "Stand Up To Racism" counter-demonstrators in London, marching toward Westminster. Heavy police presence deployed to keep groups apart amid tense standoff in Whitehall. #LondonProtests #UKNews pic.twitter.com/ibaKsRxVF5— Uma Shankar✍️ (@umashankermedia) September 13, 2025మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో, సుమారు 1,10,000 నుంచి 1,50,000 మంది ప్రజలు హాజరయ్యారు. ప్రదర్శన చివరి దశలో కొంతమంది నిరసనకారులు అదుపుతప్పి పోలీసులపై బాటిళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. ప్రత్యర్థి వర్గాల నిరసనకారులను వేరుచేయడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించడానికి ప్రయత్నించారు. ఈ దాడుల్లో నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో 'స్టాండ్ అప్ టు రేసిజం' సంస్థ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో వలసదారులకు మద్దతుగా మరో ప్రదర్శన కూడా జరిగింది. Police try to stop #UniteTheKingdom protesters going the route the police GAVE them to walk but the British heavily outnumbering the police push through the line. British men are waking up, they don't fear police. #TommyRobinson #london #reform pic.twitter.com/JEMP5pDX4K— Jamie (@Jamie69660989) September 13, 2025 -
ప్రపంచ కుబేరుడిగా లారీ ఎలిసన్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. ఎలాన్మస్క్. కానీ ఇక నుంచి ఆ స్థానాన్ని ఒరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ భర్తీ చేస్తున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లు ఇటీవల కుదేలవ్వడంతో మస్క్కు కేటాయించిన షేర్ల విలువ భారీగా తగ్గిపోవడం ఇందుకు ఒక కారణం. కుబేరుల జాబితాలో మస్క్ తర్వాతి స్థానంలో ఉన్న ఓరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సంస్థ విలువ పెరగడం కూడా లారీని ప్రపంచంలోని కుబేరుల జాబితాలో ముందుంచింది.ఎలిసన్ నికర విలువ 393 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొన్న మంగళవారం ఒక్కరోజే అతని సంపద 101 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. ఒరాకిల్లో ఎల్లిసన్కు 40 శాతం వాటా ఉంది. ఇటీవల కంపెనీ షేర్లు పుంజుకోవడంతో ఆయన సంపద సైతం భారీగా పెరిగింది. ఒరాకిల్ ఇటీవల బ్లాక్ బస్టర్ త్రైమాసిక ఆదాయాలను విడుదల చేయడం కలిసొచ్చింది. దాని ఏఐ ఆధారిత క్లౌడ్ వ్యాపారం దూసుకుపోతుండడంతో ఈమేరకు ఇన్వెస్టర్లు కంపెనీలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపారు.ఒరాకిల్ ఇటీవల చేసిన ప్రకటనలు..ఓపెన్ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్డ్యాన్స్తో ఒప్పందాలు.2025 ఆర్థిక సంవత్సరంలో 18 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 144 బిలియన్ డాలర్లకు క్లౌడ్ రెవెన్యూ వృద్ధిని అంచనా వేశారు.ఎంటర్ప్రైజ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ ద్వారా మెరుగైన మార్జిన్లు ప్రకటన.ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్తో ప్రత్యక్ష పోటీలో ఉంది.పేరునెట్వర్త్ (సెప్టెంబర్ 2025)సంస్థలుఇటీవలి పరిణామాలులారీ ఎలిసన్393 బిలియన్ డాలర్లు41% ఒరాకిల్ఏఐ క్లౌడ్ ఒప్పందాలు, ఓపెన్ఏఐతో డీల్ఎలాన్మస్క్385 బిలియన్ డాలర్లుటెస్లా, స్పేసెఎక్స్ఏడాదిలో కంపెనీల విలువ 13% తగ్గుదల ఇదీ చదవండి: అనిల్ అంబానీపై కేసులు మీద కేసులు.. -
భారత్కు ‘ఎలాన్ మస్క్’ మద్దతు.. నవారో అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్
వాష్టింగన్: ఇటీవలి కాలంలో భారత్ను టార్గెట్ చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు, యూఎస్కు చెందిన పలువురు నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు విషయంలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాట్లాడుతున్న వారి లిస్టులో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మొదటి స్థానంలో ఉన్నారు. భారత్పై నవాలో పదే పదే నోరుపారేసుకుంటున్నారు. అయితే.. తాజాగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. నవారో ఆరోపణలు అబద్ధమని ‘ఎక్స్’ తన ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పికొట్టింది. దీంతో, నవారోకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. కొద్దిరోజుల క్రితమ నవారో ట్విట్టర్(ఎక్స్) వేదికగా..‘భారత్ అత్యధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి. లాభం కోసమే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్తో మాస్కో చేస్తున్న యుద్ధాన్ని పోషిస్తోంది. యుద్ధంలో ఇరుదేశాల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అని పోస్టు పెట్టారు. అంతటితో ఆగకుండా.. ‘రష్యాకు భారత్ లాండ్రోమ్యాట్లా పనిచేస్తోంది. మీకు తెలుసా.. ఓ వర్గం లబ్ధి పొందేందుకు భారత ప్రజలను పణంగా పెడుతోంది. మనం దానిని అడ్డుకోవాలి. అది ఉక్రెయిన్ వాసులను చంపుతోంది. మనం (అమెరికన్లు) చెల్లింపుదారులుగా ఏం చేయాలో అది చేయాలి’ అంటూ ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.Trump aide Peter Navarro lashes out at India over Russian oil, accuses it of “profiteering” & fueling Moscow’s war machine. Musk’s X fact-checks him, calling out US double standards. Navarro fumes: “Elon is letting propaganda in.” https://t.co/0Bq0SIgPGm via @indiatoday pic.twitter.com/r4jCnATbBm— Ashok Upadhyay (@ashoupadhyay) September 7, 2025ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఆ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది ఇంధన భద్రత కోసమేనని పేర్కొంది. ఆ దేశం ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడంలేదని స్పష్టం చేసింది. అమెరికా కూడా రష్యా నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్నీ ప్రస్తావించింది. నవారో వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని తేల్చింది. అనంతరం, ఈ ఫ్యాక్ట్ చెక్పై నవారో భగ్గుమన్నారు. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ ఒక చెత్తగా అభివర్ణించారు. భారత్ లాభపేక్ష కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ తన ఆరోపణలను సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని మాస్కో ఆక్రమించక ముందు.. ఈ కొనుగోళ్లు జరగలేదన్నారు.ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రజలను చంపడం, అమెరికన్ల ఉద్యోగాలు తీసుకోవడం ఆపాలంటూ పిచ్చి ప్రేలాపణలు చేశారు. దీనిపై కూడా ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ సొంత నిర్ణయమని, అది ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్పై ఒత్తిడి తెస్తూనే.. అమెరికా రష్యా నుంచి యురేనియం వంటి వాటిని దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. యూఎస్ ద్వంద్వ ప్రమాణాలకు ఇది అద్దంపడుతోందని మండిపడింది. ఇక, భారత ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. -
మస్క్ ముంగిట కనీవినీ ఎరుగని జీతం...
టెక్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ముంగిటకు కనీవినీ ఎరుగని జీతం ప్రతిపాదన వచ్చింది. టెస్లా సంస్థ తమ సీఈవో అయిన ఎలాన్ మస్క్కు 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.83 లక్షల కోట్ల) విలువైన జీత ప్యాకేజీని ప్రతిపాదించింది. అయితే ఇది సాధారణ జీతం కాదు. పూర్తిగా పనితీరు ఆధారితమైనది. ఈ ప్యాకేజీని పొందాలంటే మస్క్ కొన్ని అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలి.ముఖ్యమైన షరతులు ఇవే..టెస్లా మార్కెట్ విలువను 2 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలి సంవత్సరానికి 20 మిలియన్ల వాహనాలు డెలివరీ చేయాలి 10 లక్షల సెల్ఫ్ డ్రైవింగ్ రోబో టాక్సీలు ఉత్పత్తి చేయాలి10 లక్షల హ్యూమనాయిడ్ ఏఐ బాట్స్ రూపొందించాలికనీసం 7.5 సంవత్సరాలు టెస్లాలో కొనసాగాలి సీఈవో పదవికి వారసత్వ ప్రణాళిక రూపొందించాలి ఈ ప్రతిపాదనను టెస్లా వాటాదారుల వార్షిక సమావేశంలో ఓటింగ్కు ఉంచనుంది. గతంలో డెలావేర్ కోర్టు కొట్టివేసిన 44.9 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఇది కొనసాగింపుగా వస్తోంది. భారత విస్తరణలో భాగంగా టెస్లా ఢిల్లీలో ఇటీవల రెండవ షోరూమ్ను ప్రారంభించింది. భారతీయ ఈవీ మార్కెట్లో మరింత లోతుగా ప్రవేశించేందుకు ఇది కీలక అడుగు. -
ట్రంప్ విందులో టెస్లా బాస్ మిస్: స్పందించిన మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో టెక్ కంపెనీల అధిపతులకు, సీఈఓల బృందాలకు ఆతిథ్యం ఇచ్చారు. కానీ ఈ విందులో ట్రంప్ సన్నిహితుడు.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' మిస్ అయ్యారు. ఈ విందుకు ట్రంప్ మస్క్ను పిలవడం మరిచారా?, లేక పిలిచినా మస్క్ పట్టించుకోలేదా? అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ట్రంప్ విందుకు బిల్గేట్స్ను ఆహ్వానించారు, కానీ ఎలాన్ మస్క్ను పిలవలేదంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన మస్క్.. ''నన్ను ట్రంప్ విందుకు ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు నేను హాజరు కాలేకపోయారు. నా ప్రతినిధి ఒకరు అక్కడ ఉన్నారు'' అని అన్నారు. కానీ ఈ కార్యక్రమానికి మస్క్.. ప్రతినిధి ఎవరైనా హాజరయ్యారా లేదా అనేది వెల్లడికాలేదు.ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తరువాత.. కొంత కాలంపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) అధిపతిగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల దానికి రాజీనామా ఇచ్చారు. ఇటీవల ట్రంప్తో మస్క్ సంబంధాలను తెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.I was invited, but unfortunately could not attend. A representative of mine will be there.— Elon Musk (@elonmusk) September 4, 2025ట్రంప్ విందుకు హాజరైన సీఈవోలుట్రంప్ విందుకు.. సుందర్ పిచాయ్ (గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ), సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ), వివేక్ రణదివే (టిబ్కో సాఫ్ట్వేర్ ఛైర్మన్), శ్యామ్ శంకర్ (పాలంటీర్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్), బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు), టిమ్ కుక్ (యాపిల్ సీఈఓ), మార్క్ జుకర్బర్గ్ (మెటా సీఈఓ), సెర్గీ బ్రిన్ (గూగుల్ సహ వ్యవస్థాపకుడు), సామ్ ఆల్ట్ మన్ (ఓపెన్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు), గ్రెగ్ బ్రోక్ మన్ (ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు), సఫ్రా కాట్జ్ (ఒరాకిల్ సీఈఓ), డేవిడ్ లింప్ (బ్లూ ఆరిజిన్ సీఈఓ), అలెగ్జాండర్ వాంగ్ (స్కేల్ ఏఐ సీఈఓ), జారెడ్ ఐజాక్ మన్ (షిఫ్ట్ 4 పేమెంట్స్ సీఈఓ) హాజరయ్యారు. -
భారత్లో టెస్లా తొలి కస్టమర్ ఎవరంటే..
ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా ఇటీవల భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికి ఈ కారు కోసం 600 బుకింగ్స్ వచ్చాయిగా. తాజాగా ఈ సంస్థ దేశంలో తొలి కారును (First Tesla Car in India) డెలివరీ చేసింది. ఇంతకీ తొలి కస్టమర్ ఎవరో తెలుసా?తెలుపు రంగు టెస్లా ‘మోడల్ వై’ కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి 'ప్రతాప్ సర్నాయక్' కొనుగోలు చేశారు. ముంబయిలోని ‘టెస్లా (Tesla) ఎక్స్పీరియెన్స్ సెంటర్’లో సంస్థ ప్రతినిధులు ఈ కారు తాళాలను మంత్రికి అందజేశారు. మంత్రి ప్రతాప్ మాట్లాడుతూ.. దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈవీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన టెస్లా సంస్థ ఇటీవలే భారత్లో విక్రయాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జులై 15న ముంబయిలో తొలి షోరూంను ప్రారంభించింది. ఆ తరువాత ‘మోడల్ వై’ కారు (Tesla Model Y) విక్రయాలు మొదలయ్యాయి. చైనా (షాంఘై)లోని తమ ప్లాంటులో పూర్తిగా తయారైన కారును (సీబీయూ) దిగుమతి చేసుకుని టెస్లా విక్రయాలు చేపట్టింది.#WATCH | Mumbai, Maharashtra: Delivery of the first Tesla (Model Y) car from 'Tesla Experience Centre' at Bandra Kurla Complex, Mumbai, being made to the State's Transport Minister Pratap Sarnaik. 'Tesla Experience Center', the first in India, was inaugurated on July 15 this… pic.twitter.com/UyhUBCYygG— ANI (@ANI) September 5, 2025టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!.. జీఎస్టీ వర్తిస్తుందా?స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం. -
మరో అడుగు ముందుకేసిన స్టార్లింక్..
భారతదేశంలో ట్రయల్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించడానికి, ఎలాన్ మస్క్కు చెందిన 'స్టార్లింక్'.. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుంచి తాత్కాలిక స్పెక్ట్రమ్ క్లియరెన్స్ను పొందిందని. దీంతో కంపెనీ తన కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.స్పెక్ట్రమ్ క్లియరెన్స్ పొందటంతో.. స్టార్లింక్ ఇప్పుడు దాని గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించి, భద్రతా సమ్మతి పరీక్షలను నిర్వహిస్తుంది. దీనికోసం కంపెనీ ముంబై కేంద్రంగా 10 ప్రదేశాలలో బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.భారతదేశంలో తన గ్రౌండ్ స్టేషన్ను ఏర్పాటు చేయడానికి ల్యాండింగ్ స్టేషన్ హార్డ్వేర్తో సహా పరికరాలను తీసుకురావడానికి స్టార్లింక్ దిగుమతి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. అంతే కాకుండా.. స్టార్లింక్ ఇటీవలే తన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) కింద అన్ని భద్రతా అవసరాలను తీర్చిన తర్వాత గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (GMPCS) లైసెన్స్ను పొందిన తాజా ఆపరేటర్గా అవతరించింది. ఇప్పటికే 100 కంటే దేశాల్లో స్టార్లింక్ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: భారత్పై ప్రశ్న.. చైనా రోబో సమాధానంస్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్.. ఈ-కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ను ఉపయోగించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)తో ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఈకేవైసీ చేసుకున్న యూజర్లు హైస్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. -
ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎవరంటే.. అందరూ 'ఎలాన్ మస్క్' అని చెబుతారు. అయన ఏం చదువుకున్నారు అంటే మాత్రం.. బహుశా ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ప్రపంచంలోని ఐదుమంది అత్యంత ధనవంతులు ఏం చదువుకున్నారో తెలుసుకుందాం.ఎలాన్ మస్క్టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల సీఈఓ అయిన ఎలాన్ మస్క్.. తన ప్రాధమిక విద్యను దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలోని పాఠశాలల్లో పూర్తి చేశారు. ఆ తరువాత కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్ చదివారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్లో.. పీహెచ్డీ చేయడానికి చేరినప్పటికీ అది పూర్తి చేయలేదని సమాచారం.లారీ ఎల్లిసన్ఒరాకిల్ కో ఫౌండర్ అయిన లారీ ఎల్లిసన్.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ ఈయనను అత్యంత తెలివైన వ్యక్తిగా ప్రశంసించారు. ఎల్లిసన్ చికాగో యూనివర్సిటీలో చదివారు, కానీ డిగ్రీ పూర్తి చేయలేదు. ఆ తరువాత డిగ్రీ పూర్తి చేయడానికి 'ఇల్లినాయిస్ యూనివర్సిటీ అట్ అర్బనా-షాంపెయిన్'లో చేరారు. కానీ అదే సమయంలో ఆయన తల్లి మరణించడంతో.. డిగ్రీ పూర్తిచేయకుండా ఆపేశారు.మార్క్ జుకర్బర్గ్ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల సమ్మేళనమైన మెటాకు సీఈఓ అయిన.. మార్క్ జుకర్బర్గ్, ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడు. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ & సైకాలజీ చదివాడు. కానీ ఫేస్బుక్ను ప్రారంభించిన తరువాత.. డిగ్రీ పూర్తి చేయలేదు.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరికజెఫ్ బెజోస్వరల్డ్ టాప్ 10 కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్.. అమెజాన్ వ్యవస్థాపకులు. ఈయన ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ & కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఫిజిక్స్ చదవాలనుకున్నారు. కానీ కంప్యూటర్ల పట్ల తనకున్న ఆసక్తితో అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు.లారీ పేజ్గూగుల్ కో-ఫౌండర్ అయిన లారీ పేజ్.. ప్రపంచంలోనే ఐదవ ధనవంతుడు. ఈయన మిచిగాన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్.. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు. స్టాన్ఫర్డ్లోని పీహెచ్డీ రీసెర్చ్ సమయంలోనే లారీ పేజ్ & సెర్గీ బ్రిన్ కలిసి గూగుల్ సర్చ్ ఆల్గోరిథం అభివృద్ధి చేశారు. -
కోర్టుకెక్కిన మస్క్ కంపెనీ: యాపిల్, ఓపెన్ఏఐ దావా..
బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'ఎక్స్ఏఐ' (xAI).. యాపిల్ & ఓపెన్ఏఐపై సోమవారం టెక్సాస్లోని యూఎస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ఏఐలో పోటీని అడ్డుకోవడానికి వారు చట్టవిరుద్ధంగా కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించింది.యాపిల్, ఓపెన్ఏఐ రెండూ కూడా తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించడానికి.. ఎక్స్, ఎక్స్ఏఐ వంటి ఆవిష్కర్తలు పోటీ పడకుండా నిరోధించడానికి మార్కెట్లను లాక్ చేశాయని దావాలో పేర్కొన్నారు. ఎక్స్ఏఐ ఉత్పత్తులను అణిచివేయడానికి ఈ రెండూ పన్నాగం పన్నినట్లు ఫిర్యాదులో పేర్కొంది.ఓపెన్ఏఐతో.. యాపిల్కు ఒప్పందం లేకపోతే దాని యాప్ స్టోర్లో ఎక్స్, గ్రోక్ యాప్లకు ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వడం లేదు. మా సంస్థ యాప్ను ఎందుకు ముందుగా ప్రదర్శించడం లేదని ఎక్స్ఏఐ ప్రశ్నించింది. దీనిపై యాపిల్, ఓపెన్ఏఐ కంపెనీలు స్పందించలేదు.ఇదీ చదవండి: ఇది పరిశ్రమకు కొత్త విజయగాథ: నరేంద్ర మోదీకాగా.. ఈ నెల ప్రారంభంలో, కాలిఫోర్నియాకు చెందిన యాపిల్ సంస్థ కుపెర్టినోపై దావా వేస్తానని మస్క్ పేర్కొన్నారు. యాపిల్ ''యప్ స్టోర్లో OpenAI తప్ప మరే AI కంపెనీ #1 స్థానానికి చేరుకోవడం అసాధ్యం'' అని మస్క్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.Apple is behaving in a manner that makes it impossible for any AI company besides OpenAI to reach #1 in the App Store, which is an unequivocal antitrust violation. xAI will take immediate legal action.— Elon Musk (@elonmusk) August 12, 2025 -
మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రోహార్డ్
వాషింగ్టన్: సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్ను తలదన్నేలా అధునాతన కృత్రిమమేధ సంస్థ ‘మాక్రోహార్డ్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ పేరులోని మైక్రో, సాఫ్ట్ పదాలకు పూర్తి విరుద్ధమైన మాక్రో, హార్డ్ పదాలతో మస్క్ తన కొత్త కంపెనీకి పేరు పెట్టడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ కంటే తన సంస్థ అద్భుతంగా ఎదగబోతోందని అర్థంవచ్చేలా గతంలోనే మస్క్ Macrohard >> Microsoft అని ‘ఎక్స్’ లో పోస్ట్చేసిన విషయం తెల్సిందే. ఎక్స్ఏఐ సంస్థ సారథ్యంలో ఇకపై మాక్రోహార్డ్ సంస్థ పనిమొదలు పెడుతుందని మస్క్ శనివారం ప్రకటించారు. ‘‘ఇకపై సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ తదితరాల కోసం విడిగా హార్డ్వేర్లను కర్మాగారాల్లో తయారు చేయాల్సిన పనిలేదు. ఇకపై అంతా ఆన్లైన్లోనే కృత్రిమమేధతో పని జరిగిపో తుంది. సాఫ్ట్వేర్ అనేవి అంతా ఆన్లైన్లోనే ఇన్స్టాల్ అవుతాయి. ఈ లెక్కన ఒకరకంగా మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, డివైస్లు, ఉపకరణాల విభాగ వ్యాపారం మూలకు పడినట్లే. యావత్ సాఫ్ట్వేర్ రంగాన్ని ఏఐతో భర్తీచేస్తా. హ్యూమన్ స్పీచ్, టెక్స్ట్ సహా పరస్పర సమాచార బదిలీని సాధ్యంచేసే చాట్బాట్ వంటివన్నీ ఇకపై నేరుగా సాఫ్ట్వేర్తోనే జరిగేలా చేస్తా. ఇది వేలాది మంది శ్రామికులు చేసే పనిలో సమానం. భారీ సంఖ్యలో సాఫ్ట్వేర్ శ్రామికశక్తిని మా ఏఐ క్లోన్ భర్తీచేస్తుంది. మాక్రోహార్డ్ అనేది పూర్తిగా ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీ’’అని మస్క్ చెప్పుకొచ్చారు. ఒకేసారి సమాంతర వ్యవస్థ ‘‘ఇకపై వేలాదిగా స్పెషలైజ్డ్ కోడింగ్, ఇమేజ్, వీడియోలను సృష్టించే, అర్థంచేసుకునే కంప్యూటర్ పోగ్రామ్లను అభివృద్ధిచెందించాల్సి ఉంది. ఇవన్నీ ఒకేసారి సమాంతరంగా పనిచేస్తాయి. దీంతో యూజర్లు తమకు కావాల్సిన ఏదైనా సమాచారం, అంశంపై నేరుగా సాఫ్ట్వేర్తోనే మాట్లాడొచ్చు, సంప్రతించవచ్చు. వర్చువల్ మెషీన్లే సాధారణ యూజర్లు అడిగే ఎలాంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో ఇస్తాయి. ఇదంతా ఊహించనంత స్థాయిలో జరగబోతోంది. దీనిని ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ కర్మాగారంగా చెప్పొచ్చు’’అని మస్క్ చెప్పారు. మస్క్కు చెందిన ఎక్స్ఏఐ సంస్థ ఆగస్ట్ ఒకటో తేదీన అమెరికా పేటెంట్ ఆఫీస్లో ‘మాక్రోహార్డ్’పేరిట పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. గతంలోనే మస్క్ ఏఐ ఆధారిత వీడియోగేమ్స్ రంగంలో అడుగుపెట్టాలని భావించారు. ఇప్పుడు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు దశాబ్దాలుగా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉత్పత్తుల రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ ఏకఛత్రాధిపత్యాన్ని కూలదోసేందుకు కొత్త తరహాలో ఏఐ సాఫ్ట్వేర్ తయారీకి మస్క్ నడుంబిగించారు. అయితే ప్రతి కంప్యూటర్లో కనిపించే మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్ వంటి సాఫ్ట్వేర్లకు దీటుగా అంతకుమించిన సౌకర్యాలుండే అన్ని రకాల సాఫ్ట్వేర్ సేవలను అందించడం మస్క్కు కత్తిమీద సాము చేయడంతో సమానమని సాఫ్ట్వేర్ రంగ నిపుణులు చెబుతున్నారు. దిగ్గజ ఎన్విడియా నుంచి తెప్పించిన లక్షలాది గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్(జీపీయూ)లతో అమెరికాలోని మెంఫిస్లో మస్క్ ఇప్పటికే భారీ కేంద్రాలను ఏర్పాటుచేసి కొలోసస్ సూపర్కంప్యూటర్లతో పని మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే తరహాలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు సిద్ధమైన ఓపెన్ఏఐ, మెటా వంటి పెద్ద సంస్థలతో మస్క్ సంస్థ పోటీపడాల్సి ఉంది. -
ఎలాన్ మస్క్ సైబర్ట్రక్: సేఫ్టీలో టాప్ రేటింగ్
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'టెస్లా' మార్కెట్లో సైబర్ట్రక్ లాంచ్ చేసి చాల రోజులే అవుతోంది. ఇటీవల ఈ కారుకు 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) క్రాష్ టెస్ట్ నిర్వహించింది.ఎన్హెచ్టీఎస్ఏ నిర్వహించిన క్రాష్ టెస్టులో టెస్లా సైబర్ట్రక్ 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇది అన్ని టెస్టులలోనూ మంచి స్కోర్ సాధించి.. మొత్తం మీద సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైబర్ట్రక్కు టాప్ సేఫ్టీ రేటింగ్ అందుకుంది.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొంటూ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: మహీంద్రా కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారుప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో టెస్లా సైబర్ట్రక్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కంపెనీ లాంచ్ చేసినప్పుడు దీని ప్రారంభ ధరను 69,990 అమెరికన్ డాలర్లుగా(రూ.59 లక్షలు) ఉండేది. ఇప్పుడు దీని ధర 15000 డాలర్లు పెరిగినట్లు సమాచారం.Cybertruck receives top safety rating! https://t.co/H1wKwSlpYh— Elon Musk (@elonmusk) August 22, 2025 -
మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రోహార్డ్?: ఎలాన్ మస్క్ ప్లాన్ ఇదేనా..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పుడూ.. కొత్త విషయాల మీద ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ పేరు మాదిరిగా అనిపించే 'మాక్రోహార్డ్' (Macrohard) పేరును తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎక్స్ఏఐ(xAI)లో చేరి.. మాక్రోహార్డ్ అనే పూర్తిగా ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీని నిర్మించడంలో సహాయం చేయండి. ఇది సాధారణ పేరు, కానీ ఈ ప్రాజెక్ట్ వాస్తవమైనది. మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు స్వయంగా ఎటువంటి ఫిజికల్ హార్డ్వేర్ను తయారు చేయలేదు. కానీ వాటిని పూర్తిగా ఏఐతో సృష్టించడం సాధ్యమవుతుంది'' అని మస్క్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఆగస్టు 1న యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ కార్యాలయంలో 'మాక్రోహార్డ్' పేటెంట్ కోసం మస్క్ xAI దాఖలు చేసింది. ఇది పూర్తిగా ఏఐ ద్వారానే పనిచేస్తుంది. ఇందులో కృత్రిమ మేధస్సును ఉపయోగించి వీడియో గేమ్లను రూపొందించడం, కోడింగ్, రన్నింగ్, గేమ్స్ కోసం డౌన్లోడ్ చేయగల కంప్యూటర్ సాఫ్ట్వేర్ మొదలైనవి ఉన్నాయి.గత నెలలో Xలో ఒక పోస్ట్లో.. ''xAI లేటెస్ట్ AI సాఫ్ట్వేర్ కంపెనీ, వందలాది ప్రత్యేక కోడింగ్ మరియు ఇమేజ్ / వీడియో జనరేషన్ /అండర్స్టాండింగ్ ఏజెంట్లు అన్నీ కలిసి పనిచేస్తాయి. ఫలితం అద్భుతంగా వచ్చే వరకు వర్చువల్ మెషీన్లలో సాఫ్ట్వేర్తో పరస్పర చర్య చేసే మానవులను అనుకరిస్తాయి" అని మస్క్ అన్నారుఇదీ చదవండి: కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్గత కొన్ని సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ సంస్థను మస్క్ సందర్భం వచ్చినప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్ఏఐ తాజాగా విడుదల చేసిన చాట్జీపీటీ-5 మోడల్ ఎంతో సమర్థంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను నాశనం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రోహార్డ్ తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది.Join @xAI and help build a purely AI software company called Macrohard. It’s a tongue-in-cheek name, but the project is very real!In principle, given that software companies like Microsoft do not themselves manufacture any physical hardware, it should be possible to simulate…— Elon Musk (@elonmusk) August 22, 2025 -
రెండేళ్లకే మస్క్ కంపెనీ వీడిన 16 ఏళ్ల కుర్రాడు
పద్నాలుగేళ్ల వయసులోనే.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగంలో చేరిన 'కైరాన్ క్వాజీ' (Kairan Quazi) గురించి పలు సందర్భాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు కైరాన్.. మస్క్ కంపెనీ విడిచిపెట్టి న్యూయార్క్లోని సిటాడెల్ సెక్యూరిటీస్లో గ్లోబల్ ట్రేడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్గా చేరనున్నాడు.స్పేస్ఎక్స్లో రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత, కొత్త సవాళ్లను స్వీకరించడానికి.. నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త కంపెనీలో చేరుతున్నట్లు కైరాన్ క్వాజీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సిటాడెల్ సెక్యూరిటీస్ నాకు ఎంతగానో ఆసక్తికరమైన పనిని అప్పగిస్తూ పూర్తిగా కొత్త డొమైన్ను కూడా అందించిందని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: డబ్బు పేదవాళ్లను చేస్తుంది!.. రాబర్ట్ కియోసాకితొమ్మిదేళ్ల వయసులో మూడవ తరగతి చదువుతున్నప్పుడు ఇంటెల్ ల్యాబ్స్లో AI రీసెర్చ్ కో-ఆప్ ఫెలోగా ఇంటర్న్షిప్ పొందిన కైరాన్ క్వాజీ.. 11 సంవత్సరాల వయసులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో రీసర్చ్ ప్రారంభించాడు. 2022లో సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ Blackbird.AIలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్గా నాలుగు నెలలు పనిచేశాడు. ఆ తరువాత స్పేస్ఎక్స్లో పనిచేయడమే ఉద్దేశ్యంగా అడుగులు వేసి, అనుకున్నది సాధించాడు. -
మస్క్ తొలగించిన సీఈవో.. మళ్లీ ‘ప్యారలల్’గా దూసుకొచ్చాడు!
ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ మళ్లీ టెక్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన స్థాపించిన కొత్త ఏఐ స్టార్టప్ ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’ ఇటీవలే 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.250 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. ఖోస్లా వెంచర్స్, ఇండెక్స్ వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్ వంటి ప్రముఖ వెంచర్ క్యాపిటల్స్ ఈ సంస్థలో పెట్టుబడి పెట్టాయి.ఏఐకి బ్రౌజర్ ఇచ్చినట్లే!ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ ఒక క్లౌడ్-బేస్డ్ ఏఐ రీసెర్చ్ ప్లాట్ఫారమ్. ఇది ఏఐ మోడల్స్కు రియల్ టైమ్ వెబ్ డేటాను యాక్సెస్ చేయగలిగే సామర్థ్యాన్ని కల్పిస్తుంది. సాధారణంగా AIలు ట్రైనింగ్ డేటాపై ఆధారపడతాయి. కానీ లైవ్ వెబ్ సమాచారం చదవడం, నిజమైన సమాచారం గుర్తించడం, సమాధానాలపై విశ్వాస స్థాయిని అంచనా వేయడం వంటివి ప్యారలల్ ప్రత్యేకతలు.మానవుల కంటే మెరుగైన అన్వేషణఈ స్టార్టప్ అభివృద్ధి చేసిన అల్ట్రా8ఎక్స్ (Ultra8x) అనే రీసెర్చ్ ఇంజిన్ 30 నిమిషాల పాటు లోతైన వెబ్ అన్వేషణ చేయగలదు. ఇది ఓపెన్ఏఐ జీపీటీ-5 (OpenAI GPT-5)తో సహా మానవ రీసెర్చర్ల కంటే 10 శాతం మెరుగైన పనితీరును చూపిందని సంస్థ పేర్కొంది. ట్విట్టర్ నుంచి టెక్ రీ-ఎంట్రీ2022లో ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత, సీఈవో పదవిలో ఉన్న పరాగ్ అగర్వాల్ను ఎలాన్ మస్క్ తొలగించారు. ఆ తర్వాత పరాగ్ పాలో ఆల్టోలోని కాఫీ షాపుల్లో రీసెర్చ్ పేపర్లు చదువుతూ, కోడ్ రాస్తూ గడిపారు. హెల్త్కేర్ ఏఐ స్టార్టప్ ఆలోచించినా, చివరికి ఏఐకి రియల్ టైమ్ వెబ్ డేటాను విశ్వసనీయంగా అందించాలన్న లక్ష్యంపై దృష్టి పెట్టారు.మస్క్తో రూ.420 కోట్ల సెవరెన్స్ వివాదంపరాగ్ అగర్వాల్ ఇంకా 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.420 కోట్లు) సెవరెన్స్ పేమెంట్ కోసం మస్క్తో కోర్టులో పోరాటం చేస్తున్నారు. మస్క్ “ఫర్ కాస్” అనే కారణంతో చెల్లింపును నిలిపివేశాడు. -
భారత్లో టెస్లా బిగ్ డీల్!.. నెలకు రూ.17.22 లక్షల రెంట్
ప్రపంచం కుబేరుడు 'ఎలాన్ మస్క్' యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం 'టెస్లా'.. ముంబైలో తన మొదటి షోరూమ్ ప్రారంభించింది. ఇప్పుడు తన రెండో షోరూంను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.తన రెండో షోరూమ్ కోసం టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీలోని ఏరోసిటీలో 8,200 చదరపు అడుగుల స్థలాన్ని తొమ్మిది సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. దీని నెలవారీ అద్దె రూ. 17.22 లక్షలు. ఈ విషయాన్ని డాక్యుమెంట్స్ను అసెస్ చేసిన 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' వెల్లడించింది.టెస్లా ఈ స్థలాన్ని ఓక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చదరపు అడుగుకు రూ. 210 చొప్పున.. రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్తో లీజుకు తీసుకుంది. అంతే కాకుండా టెస్లా నెలకు రూ. 6,000 చొప్పున 10 పార్కింగ్ స్లాట్లను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..జూలై 15, 2025న ప్రారంభమయ్యే లీజు మొదటి సంవత్సరానికి రూ. 40.17 లక్షలు, రెండవ సంవత్సరంలో రూ. 42.07 లక్షలు, మూడవ సంవత్సరంలో రూ. 44.07 లక్షలు, నాల్గవ సంవత్సరంలో రూ. 46.17 లక్షలు, ఐదవ సంవత్సరంలో రూ. 48.36 లక్షలు, ఆరవ సంవత్సరంలో రూ. 50.66 లక్షలు, ఏడవ సంవత్సరంలో రూ. 53.06 లక్షలు, ఎనిమిదవ సంవత్సరంలో రూ. 55.58 లక్షలు, తొమ్మిదవ సంవత్సరంలో రూ. 58.22 లక్షలకు చేరుకుంటుంది. -
‘ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ సర్వనాశనం’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మాది గొప్ప అంటే మాది గొప్ప.. అంటూ చంకలు చరుచుకోవడం కంపెనీలకు అలవాటైంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్ఏఐ తాజాగా విడుదల చేసిన చాట్జీపీటీ-5 మోడల్ ఎంతో సమర్థంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్మస్క్ స్పందిస్తూ త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను నాశనం చేస్తుందని చెప్పారు.సత్య నాదెళ్ల పోస్ట్ చేస్తూ..‘ఈ రోజు జీపీటీ-5 మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, కోపైలట్, గిట్హబ్ కోపైలట్, అజూర్ ఏఐ ఫౌండ్రీతో సహా మా ప్లాట్ఫామ్ల్లో లాంచ్ అవుతుంది. ఇది ఓపెన్ఏఐ వద్ద ఉన్న అత్యంత సమర్థవంతమైన మోడల్. ఇది రీజనింగ్, కోడింగ్, చాట్లో మెరుగైన పురోగతిని అందిస్తుంది. దీని మోడల్స్ అన్నీ అజూర్లో శిక్షణ పొందాయి. సామ్ఆల్ట్మన్ మాతో చేరి రెండున్నరేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాం. బింగ్లో జీపీటీ-4 ఇంప్లిమెంట్ చేసేందుకు సామ్ మాతో చేరారు. అప్పటి నుంచి ఎంతో సాధించాం. తాజా పురోగతితో వేగం పెరుగుతుంది. ఈ మోడల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.Today, GPT-5 launches across our platforms, including Microsoft 365 Copilot, Copilot, GitHub Copilot, and Azure AI Foundry. It's the most capable model yet from our partners at OpenAI, bringing powerful new advances in reasoning, coding, and chat, all trained on Azure.It’s… pic.twitter.com/jHDA94YOL0— Satya Nadella (@satyanadella) August 7, 2025ఇదీ చదవండి: ‘భారత్ను బెదిరిస్తారు’.. సూపర్ పవర్గా ఎదగాలంటే..సత్య పోస్ట్పై ఎలాన్మస్క్ స్పందిస్తూ.. ‘త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను బ్రతికుండగానే మింగేస్తుంది’ అన్నారు. దీనిపై సత్య ప్రతిస్పందిస్తూ.. ‘కొందరు 50 ఏళ్లుగా అందుకోసం ప్రయత్నిస్తున్నారు. అదే సరదా అయిన విషయం! ప్రతిరోజూ మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. సృజనాత్మకతను జోడిస్తూ భాగస్వామిగా మారుతారు. తర్వాత ఇతరులతో పోటీపడతారు. అజూర్లో గ్రోక్ 4 వినియోగంపట్ల ఉత్సాహంగా ఉన్నాను. గ్రోక్ 5 కోసం ఎదురుచూస్తున్నాను!’ అని రాసుకొచ్చారు. ‘గ్రోక్ 4 హెవీ రెండు వారాల క్రితం జీపీటీ 5 కంటే స్మార్ట్గా ఉంది’ అని మస్క్ రిప్లై ఇచ్చారు. దాన్ని సూచించే కొన్ని డేటా పాయింట్లు ఉన్న పోస్ట్ను కోట్ చేశారు.OpenAI is going to eat Microsoft alive— Elon Musk (@elonmusk) August 7, 2025People have been trying for 50 years and that’s the fun of it! Each day you learn something new, and innovate, partner, and compete. Excited for Grok 4 on Azure and looking forward to Grok 5!— Satya Nadella (@satyanadella) August 7, 2025 -
పాటుపడనిదే 'ఫలితం' రాదు!
ధన్యవాదాలు.నేను చెప్పగలిగినవి, అత్యంత ఉపయోగకరమైనవి, ఏవైనా ఉంటే చెప్పవలసిందని నాకు సుమారు ఐదు నుంచి ఆరు నిమిషాల సమయం ఇచ్చారు. వీలైనంత ప్రయత్నిస్తాను. ఏవైనా మూడు అంశాలకు పరిమితం కావలసిందని కూడా నాకు సూచించారు. నేను నాలుగు అంశాలు చెప్పాలనుకుంటున్నాను. అవి చాలా ముఖ్యమైన అంశాలని నేను భావిస్తున్నాను. వాటిలో కొన్ని ఇంతకు ముందు మీరు విన్నవి కూడా కావచ్చు. కానీ, వాటి గురించి మళ్ళీ చెప్పు కోవడంలో తప్పు లేదు.కష్టపడి పనిచేయాలి!మొదటిది – కృషి చేయడం! మీరు ఒక పనిని ఎంత బాగా చేయాలనుకుంటున్నారో, దాని కోసం అంతగా కృషి చేయాలి. మీరు ఒక కంపెనీని నెలకొల్పదలిస్తే, దానికి సంబంధించి మీరు ఇంకా ఎక్కువ పాటుపడాలి. ఎంతగా అంటారా... నేను, నా సోదరుడు కలసి మొదటి కంపెనీని ప్రారంభించినపుడు, అపార్ట్మెంట్ తీసుకోవడానికి బదులు, ఒక చిన్న ఆఫీసును అద్దెకు తీసుకున్నాం. అక్కడే సోఫాలో పడుకునేవాళ్ళం. స్నానాలు, నిత్యకృత్యాలు వై.ఎం.సి.ఏ.లో కానిచ్చేసే వాళ్ళం. ఎంత కష్టపడ్డామంటే, ఒకటే కంప్యూటర్ ఉండేది. పగటి పూట వెబ్సైట్కి వాడుకునేవాళ్ళం. కోడింగ్ పని నేను రాత్రిపూట చేసేవాడిని. వారంలో 7 రోజులూ, మొత్తం సమయాన్ని దానికే వెచ్చించేవాళ్ళం. నా సంగతి తెలుసుగా! నాకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. నాతో ఉండటం కోసం, ఆమె కూడా ఆఫీసులోనే పడుకునేది. కనుక కష్ట పడాలి. మెలకువగా ఉన్నంతసేపూ పని చేస్తూనే ఉండాలి. అదే నేను చెప్పదలచుకుంది. ముఖ్యంగా మీరు ఏదైనా కంపెనీ ప్రారంభించాలంటే శ్రమించక తప్పదు. ఏమీ లేదు. చిన్న లెక్కే. ఎవరన్నా వారి సంస్థ కోసం వారానికి 50 గంటలు పని చేస్తున్నారనుకుందాం. మీరు 100 గంటలు పని చేయాలి. ఫలితంగా,రెండింతల పని పూర్తవుతుంది. తర్వాత కాలంలో, ఆ ఇతర కంపెనీలలా పనిచేసినా ఫరవాలేదు.గొప్ప బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి!రెండవ సంగతి. మీరు ఏదైనా కంపెనీ ప్రారంభిస్తున్నా లేదా ఏదైనా కంపెనీలో చేరదలచుకున్నా కూడా ప్రజ్ఞావంతుల సాహ చర్యం లభించేటట్లు చూసుకోండి. పెట్టదలచుకుంటే ప్రతిభా వంతులతో కంపెనీ పెట్టండి లేదా మీరు గౌరవించే ప్రతిభావంతులున్న కంపెనీలో చేరండి. కంపెనీ అంటే ఏమిటి? ఒక వస్తువును తయారు చేసేందుకు లేదా ఒక సేవను అందించేందుకు కొంతమంది ఒకచోట చేరి, కలసికట్టుగా పనిచేయడం. అంతేనా? ఒక బృందంలోనివారి శక్తియుక్తులు, కష్టపడి పనిచేసే తత్త్వం, సరైన దిశలో సమన్వయంతో, సమష్టిగా దృష్టి కేంద్రీకరించి పని చేయడాన్ని బట్టి ఆ కంపెనీ విజయం ఆధారపడి ఉంటుంది. అందుకని, కంపెనీని నెలకొల్పదలిస్తే, గొప్ప వ్యక్తులందరినీ ఒక చోట చేర్చేందుకు ఏం చేయాలో అంతా చేయండి. పూర్తిగా మీ పని మీదే దృష్టి పెట్టాలి!హంగు ఆర్భాటాలకన్నా శ్రేష్ఠతపై దృష్టి పెట్టడం మూడవ అంశం. చాలా కంపెనీలు ఈ విషయంలో గందరగోళంగా ఉంటాయి. వస్తువును మెరుగుపరచడానికి, వాస్తవానికి ఏ విధంగానూ తోడ్పని అంశాలపై అవి పెద్ద మొత్తంలో ద్రవ్యాన్ని వెచ్చి స్తూంటాయి. మేం ‘టెస్లా’లో ఎన్నడూ అడ్వర్టయిజింగ్ కోసం ఖర్చు పెట్టింది లేదు. కారును వీలైనంత గొప్పదిగా తీర్చిదిద్దేందుకు డిజైన్, తయారీ, పరిశోధన–అభివృద్ధి విభాగాలపైనే మొత్తం డబ్బు వెచ్చించాం. పయనించాల్సింది ఆ మార్గంలోనేనని అనుకుంటున్నా. ఆ మాటకొస్తే ఏ కంపెనీ విషయంలోనైనా సరే, ‘‘మనం చేస్తున్న ప్రయత్నాలు ప్రజల ఆశలను ప్రతిఫలిస్తున్నాయా? వాటి వల్ల మెరుగైన ఉత్పత్తి ఒనగూడుతోందా? సేవలు సమకూరుతు న్నాయా?’’ అని నిరంతరం ఆలోచిస్తూనే ఉండండి. లేదని భావిస్తే, ఆ ప్రయత్నాలకు అంతటితో స్వస్తి పలకండి. ట్రెండ్స్ను ఫాలో కావొద్దు!చివరగా చెప్పదలచుకున్నది ఏమంటే, గొర్రెదాటు మనస్తత్త్వం వద్దు. వర్తమాన ధోరణిని పరిశీలించాల్సిందే. కానీ, దాన్ని గుడ్డిగా అనుసరించ కూడదు. భౌతిక శాస్త్ర దృక్పథంతో చూడటం అన్నమాట. పోల్చి చూసి ఒక నిర్ణయానికి రావడం కన్నా, ఆ వస్తువుల మూలాల్లోకి వెళ్ళాలి. అత్యంత మౌలిక సత్యాలను తెలుసుకునేందుకు ఎంతవరకు అన్వేషించగలరో అంతవరకు అన్వేషించండి. తార్కికతను అక్కడ నుంచి వర్తింప జేయండి. ఒక వస్తువును సృష్టించడంలో లేదా ఏదైనా ఒక పని చేయడంలో ప్రయోజనం ఏమైనా ఉందా లేక మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు కనుక మనమూ అదే పనిచేస్తున్నామా అని తెలుసుకునేందుకు అదే సరైన మార్గం. ఆ విధంగా ఆలోచించడం కష్టం. అన్నింటి విషయంలోనూ అలాగే ఆలోచించలేం. దానికి చాలా కృషి చేయాలి. ఒప్పుకుంటాను. కానీ, మీరు ఏదైనా కొత్తది చేయదలచుకున్నప్పుడు, అదే ఉత్తమ మార్గం. అది అంతరాత్మ ప్రబోధాలకు వ్యతిరేకమైన అంశాలను అర్థం చేసుకునేందుకు భౌతికశాస్త్రం అభివృద్ధి చేసిన చట్రం. క్వాంటమ్ మెకానిక్స్ లాగా అది చాలా చాలా శక్తిమంతమైన పద్ధతి. రిస్క్ తీసుకోవాలి!అదీ సంగతి. ఇంకొక్కటి చెప్పదలచుకున్నాను. మీరు రిస్క్ తీసుకోవడాన్ని నేను ప్రోత్సహిస్తాను. అందుకు ఇదే సరైన సమయం. మీకు పిల్లాజెల్లా లేరు. బరువు బాధ్యతలు లేవు. మీలో కొందరికి బరువు బాధ్యతలు ఉంటే ఉండవచ్చు. బహుశా పిల్లలు మాత్రం ఉండి ఉండరు. వయసు పెరుగుతున్న కొద్దీ బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీకో కుటుంబం ఏర్పడ్డాక, రిస్కులు తీసుకోవడం ప్రారంభిస్తే, మీతోపాటు మీ కుటుంబంలోని వారు కూడా ఆ రిస్కులను స్వీకరిస్తున్నట్లు లెక్క. ఫలిస్తాయో లేదో తెలియని వాటిని ప్రయత్నించి చూడటం కష్టమవుతుంది. కనుక, సాహసించేందుకు ఇదే తగిన సమయం. బరువు బాధ్యతలు మీద పడకముందే, తెగించండి. ఏమైతే అదవుతుంది అనుకోండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈ విషయంలో మీ భుజం తట్టేందుకు నేను రెడీ. చేసిన పనికి చింతించాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్యూ. నా మాటలు మీకేమైనా ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు. మంచి విషయాలే మాట్లాడుకున్నాం అనుకుంటా! -
‘మెటా మాదిరి అనైతిక ఆఫర్ ఇవ్వట్లేదు’
మెటా వంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న టాలెంట్ వార్పై ఎలాన్ మస్క్ మౌనం వీడారు. సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఏఐ టాలెంట్వార్ను ప్రారంభించారు. దాదాపు చాలా టాప్ టెక్నాలజీ కంపెనీల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను మెటాలో నియమించుకుంటున్నారు. అందుకోసం భారీగా వేతన ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, విండ్సర్ఫ్.. వంటి ప్రముఖ కంపెనీల నుంచి ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు. దీనిపై ఎలాన్ మస్క్ తాజాగా వ్యాఖ్యలు చేశారు.ఎక్స్ఏఐలో చేరిన మెటా ఇంజినీర్లను ఉద్దేశించి ఎలాన్ మస్క్ మాట్లాడుతూ..‘కంపెనీ ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐలో చాలా మంది మెటా ఇంజినీర్లు చేరారు. అయితే మెటా మాదిరిగా కాకుండా, ఎక్స్ఏఐ వారిని అనైతికంగా కంపెనీలో చేరడానికి భారీ వేతనాలు ఇవ్వడం లేదు. మెరుగైన నైపుణ్యం కలిగిన చాలా మంది మెటా ఇంజినీర్లు ఎక్స్ఏఐలో చేరుతున్నారు. మెటా కంటే ఎక్స్ఏఐకి చాలా ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ వృద్ధి సామర్థ్యం ఉంది. హైపర్ మెరిట్ ఆధారంగా నియమకాలు చేపడుతున్నాం. భారీ ప్యాకేజీల ఆశ చూపడం లేదు’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘అల్ట్రా హార్డ్ కోర్ ఇంజినీర్లకు ఎక్స్ఏఐ బెటర్ ప్లేస్’ అని మరో పోస్ట్లో రాసుకొచ్చారు.ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.ఇదీ చదవండి: ట్రంప్ టారిఫ్ ఆందోళనలు.. త్వరలో మంత్రి భేటీగూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. -
భౌతికశాస్త్ర నియమాలకు సవాలు.. మస్క్ ఫైటర్ జెట్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' టెక్నాలజీలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే భౌతిక శాస్త్ర నియమాలనే సవాలు చేసే ఒక కొత్త యుద్ధ విమానాన్ని ఆవిష్కరించారు. దీని పేరు 'యూఎఫ్ఓ ఫైటర్' (UFO Fighter).ఎలాన్ మస్క్ ఆవిష్కరించిన యుద్ధ విమానం యూఎఫ్ఓ ఫైటర్.. ఇప్పటి వరకు ఉన్న అన్ని విమానాలకంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జెట్ చాలా వేగంగా ప్రయాణించగలదు. అంతే కాకుండా.. అసాధ్యమైన విన్యాసాలు చేయగలదని, ఆకాశంలో నిశ్శబ్దంగా పనిచేయగలదని మస్క్ వెల్లడించారు.ఇదీ చదవండి: మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులుమస్క్ ఆవిష్కరించిన కొత్త యూఎఫ్ఓ ఫైటర్.. ఎంతోమంది నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. కొందరు ఈ ఫైటర్ జెట్ మీద కొంత సందేహాస్పదంగానే ఉన్నారు. ఇది టెక్నాలజీనా? లేక దార్శనిక భావననా? అని అనుకుంటున్నారు. అయితే మస్క్ కొత్త ఆవిష్కరణ ఓ సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. లేటెస్ట్ ఏరోస్పేస్ టెక్నాలజీ మానవాళి భవిష్యత్తుకు దోహదపడుతుందని పలువురు చెబుతున్నారు. అయితే మస్క్ యూఎఫ్ఓ ఫైటర్ గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉంది. -
భారత్లో స్టార్లింక్ సబ్స్క్రిప్షన్ ఎంతంటే..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘స్టార్లింక్’ ఇంటర్నెట్ సేవల సంస్థకు భారత్లో ద్వారాలు తెరచుకున్న నేపథ్యంలో సబ్స్క్రిప్షన్ ఎంత ఉండబోతుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భూటాన్, ఇండోనేషియా, ఒమన్, మాల్దీవులు.. వంటి ఆసియా దేశాల్లో స్టార్లింక్ వసూలు చేస్తున్న ఛార్జీలను పరిగణలోకి తీసుకుని భారత్లో నెలవారీ ఇంటర్నెట్ సర్వీసులు ఎంతో ఉండొచ్చనే దానిపై కావాలనుకునేవారు ఎంత చెల్లించాలనే వివరాలపై కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి.ఇదీ చదవండి: త్వరలో మడతెట్టే యాపిల్ ఫోన్?స్టార్లింక్కు సంబంధించి కొన్ని అంశాలు..ఇంటర్నెట్ స్పీడ్ 200 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. లొకేషన్ను అనుసరించి సగటు వేగం 100 ఎంబీపీఎస్గా ఉండొచ్చు.మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ అందిస్తారు.వినియోగదారులు, ఆయా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.హార్డ్ వేర్ కిట్లో భాగంగా శాటిలైట్ డిష్, రౌటర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.33,000 ఉండొచ్చు.ఇంటర్నెట్ సర్వీసుల కోసం అనువైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎయిర్టెల్, జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.బీఎస్ఎన్ఎల్ వంటి ప్రస్తుత టెలికాం సంస్థలకు అంతరాయం కలగకుండా ఉండటానికి భారతదేశం అంతటా 20 లక్షల కనెక్షన్లకే పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ కనెక్టన్లు ఇవ్వకూడదు.2025 చివరి నాటికి భారత్లో ఈ సర్వీసులు లాంచ్ చేస్తారని అంచనా. తర్వలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
టెక్ దిగ్గజాలు.. ఎవరేం చదివారంటే..
టెక్ బిలియనీర్ల ప్రపంచంలో సుందర్ పిచాయ్, ఎలాన్మస్క్లకు ప్రత్యేక స్థానం ఉంది. సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ ఇంక్కు నాయకత్వం వహిస్తూ, బిలియనీర్ జాబితాలో ఇటీవల చోటు సంపాదించారు. టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ఏఐ వ్యవస్థాపకుడిగా ఎలాన్మస్క్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. వీరు సారథ్యం వహిస్తున్న కంపెనీల ఉత్పత్తుల ద్వారా నిత్యం పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు వీరి నుంచి అకడమిక్ ప్రమాణాలతోపాటు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది.సుందర్ పిచాయ్చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ టెక్ ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. చెన్నైలోని అశోక్ నగర్లో ఉన్న జవహర్ విద్యాలయంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. వానవాణి స్కూల్లో హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఐఐటీ ఖరగ్పూర్లో మెటలార్జీ ఇంజినీరింగ్ చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో ఎంఎస్ చేశారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి వార్టన్ స్కూల్ ద్వారా ఎంబీఏ చేశారు. గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ల్లో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’ఎలాన్ మస్క్దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించిన ఎలాన్ మస్క్ చిన్న వయసులోనే కంప్యూటింగ్పై ఆసక్తి పెంచుకుని 10 ఏళ్లకే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. దక్షిణాఫ్రికాలోని తప్పనిసరి సైనిక సేవను నివారించడానికి క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చేరడానికి కెనడా వెళ్లారు. రెండేళ్ల తరువాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరారు. వార్టన్ స్కూల్ నుంచి ఫిజిక్స్, ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. మస్క్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అప్లైడ్ ఫిజిక్స్ అండ్ మెటీరియల్స్ సైన్స్లో పీహెచ్డీ కోసం కొంతకాలం చేరారు. కాని కొద్ది రోజులే అందుకు కొనసాగారు. -
ఆలోచనలతో కంప్యూటర్ని కంట్రోల్ చేస్తున్న తొలి మహిళ!
సాంకేతికత కూడిన వైద్యం ఎందరో రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందుకు ఎన్నో ఉదంతాలు నిదర్శనం. అయితే బ్రెయిన్ సంబంధిత విషయంలో మాత్రం సాంకేతికతను వాడటం కాస్త సవాలు. అయితే దాన్నికూడా అధిగమించి..స్ట్రోక్కి గురై పక్షవాతంతో బాధపడుతున్న పేషెంట్లలో కొత్త ఆశను అందించేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ (Neuralink) కంపెనీ. ఇది మానవ మెదడు, కంప్యూటర్ మధ్య నేరుగా కమ్యూనికేషన్ ఏర్పరిచే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ (BCI) టెక్నాలజీపై పని చేస్తోందనే విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ద్వారా, మెదడులో చిన్న చిప్ను అమర్చి, ఆలోచనల ద్వారా డిజిటల్ పరికరాలను నియంత్రిస్తారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ క్లినకల్ ట్రయల్ దశలో ఉంది. అందులో భాగంగానే ఈ న్యూరాలింక్ చిప్ను పొందింది ఆడ్రీక్రూస్ అనే మహిళ. ఎవరామె.? ఆమె ఈ సాంకేతికత సాయంతో ఏం చేసిందంటే..రెండు దశాబ్దాలకు పైగానే ఆడ్రీ కూస్ పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. క్లినికల్ ట్రయల్లో భాగంగా ఎలోన్ మస్క్ న్యూరాలింక్ చిప్ను ఆమె మెదడులో అమర్చారు. దీంతో న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాట్ ద్వారా తన ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె తన మానసిక ఆదేశాలతో తన పేరుని డిజిటల్ రూపంలో రాసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేసుకున్నారామె. ఆ పోస్ట్లో ఆండ్రీ డిజిటల్ సిరాతో తన పేరును( ఆడ్రీ) సూచించే ల్యాప్టాప్ స్క్రీన్ ఫోటోని షేర్ చేశారు. అంతేగాదు దాంతోపాటు ఎర్రటి హార్ట్ సింబల్, ఒక పక్షి, పిజ్జా ముక్క ఉండే డూడుల్ని కూడా పంచుకుంది. దీన్ని ఆమె టెలిపతి ద్వారా గీసినట్లుగా ఆ పోస్ట్కి క్యాప్షన్ ఇచ్చింది ఆడ్రీ. ఆమె 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన పేరును రాసిన క్షణం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఎందుకంటే ఆమె గత 20 ఏళ్లకు పైగా పక్షవాతానికి గురై కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారామె. ఆమె తన చూపుడు వేలుని క్లిక్గా, కర్సర్గా మణికట్టుని ఊహించుకుంటూ.. తన మానసిక ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తుందామె. ఇదంతా ఆమె తన బ్రెయిన్తో చేస్తుంది. ఇక్కడ ఆడ్రికి ఈ న్యూరాలింక్ క్లినికల్ ట్రయల్లో తొమ్మిదొ పేషెంట్గా ఈ చిప్ను ఆమెకు అమర్చారు. పుర్రెలో రంధ్రం చేసి మోటారు కార్టెక్స్లో సుమారు 128 కనెక్షన్లతో ఈ చిప్ని అమర్చారు. ఈ బీసీఐ(బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ) ఆమె మెదడు కదలికలు, సంకేతాలను చదివి వాటిని కర్సర్ కదలికలుగా అనువదిస్తుంది. ఈ బ్రెయిన్ చిప్ ఆమెను మళ్లీ నడిచేలా సాయం చేయలేకపోయినా..డిజిటల్ పరికరాలతో తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వీలు కల్పిస్తోంది. ఇది పూర్తి మానసిక ఆలోచనలతో పనిచేస్తుంది. న్యూరాలింక్ అంటే.. 2016లో ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్, మానవ మెదడును నేరుగా కంప్యూటర్లకు అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. పక్షవాతం వంటి నాడీ సంబంధిత పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు డిజిటల్ స్వాతంత్య్రాన్ని పొందేలా.. సంభాషించడంలో సహాయపడటమే ఈ సాంకేకతికత లక్ష్యం.కాగా, ఇక్కడ ఆడ్రీ ఇలాంటి మరిన్ని పోస్ట్లను వీడియోలను పంచుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేగాదు ఆమె తన పోస్ట్లో తాను త్వరలో ఇంటికి వస్తానని, ఈ ప్రక్రియ గురించి మరింత వివరంగా తెలిపేలా వీడియోలను కూడా పోస్ట్ చేస్తానని పేర్కొనడం విశేషం. ఈ న్యూరాలింక్ సాంకేతికతను వినియోగించిన తొలి మహిళగా ఆమె ప్రస్థానం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆశిద్దాం.(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!) -
స్టార్లింక్ ఇచ్చేది 20 లక్షల కనెక్షన్లే
న్యూఢిల్లీ: అమెరికన్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్లింక్ నుంచి బీఎస్ఎన్ఎల్లాంటి దేశీ టెలికం సంస్థలకు ఎలాంటి పోటీ ఉండబోదని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుత సామర్థ్యాలను బట్టి స్టార్లింక్ భారత్లో గరిష్టంగా 200 ఎంబీపీఎస్ స్పీడ్తో 20 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలదని ఆయన తెలిపారు. దీనితో టెలికం సర్వీసులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ఈ సర్వీసులను పొందాలంటే ముందుగా భారీ మొత్తం వెచ్చించడంతో పాటు ప్రతి నెలా సుమారు రూ. 3,000 వరకు చెల్లించాల్సి రావచ్చని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్కి గణనీయంగా కార్యకలాపాలున్న గ్రామీణ, మారుమూల ప్రాంతాలే లక్ష్యంగా శాట్కామ్ సర్వీసులు ఉండనున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసుల విస్తరణ పూర్తయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెటింగ్పైనే దృష్టి పెడుతున్నట్లు, టారిఫ్లు పెంచే ప్రతిపాదనేదీ లేనట్లు మంత్రి వివరించారు. బీఎస్ఎన్ఎల్లో చైనా పరికరాల వినియోగంపై స్పందిస్తూ, పూర్తిగా దేశీ సాంకేతికతల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. -
Vaibhav Taneja: ఎలోన్ మస్క్ ఆర్థిక సామ్రాజ్యం మనోడి చేతిలో..
-
మస్క్ ఆర్థిక సామ్రాజ్యం మనోడి చేతిలో.. ఎవరీ వైభవ్ తానేజా?
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆర్థిక భారత సంతతికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వైభవ్ తనేజా. ప్రస్తుతం టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా ఉన్న ఆయనకు ఇప్పుడు మరింత పెద్ద బాధ్యతలు అప్పగించారు మస్క్. కొత్తగా ప్రకటించిన రాజకీయ వెంచర్ అయిన అమెరికా పార్టీకి వైభవ్ తానేజాను ట్రెజరర్, రికార్డుల కస్టోడియన్గానూ చేశారు. సంప్రదాయ ఐఐటీ-ఐఐఎం నుంచి వచ్చినవాడు కాకపోయినా తనేజా రూ.1,100 కోట్ల వేతన పరిహారాన్ని అందుకుంటున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.తనేజా అధికారికంగా అమెరికా పార్టీ ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు చేపట్టినట్లు ఇటీవల ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదిక ధృవీకరించింది. ఈ పాత్రలో ఆయన రాజకీయ నిధులు, బడ్జెట్ పంపిణీని పర్యవేక్షించడం, ఆర్థిక చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఇది కార్పొరేట్ ఫైనాన్స్ లో ఆయన ప్రస్తుత పాత్ర నుండి రాజకీయ రంగానికి గణనీయమైన మార్పును సూచిస్తుంది. తనేజాపై ఉన్న నమ్మకంతో మస్క్ ఇప్పుడు తన రాజకీయ పార్టీ ఆర్థిక బాధ్యతలనూ అప్పగించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మొదలై..వైభవ్ తనేజా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1999 లో కామర్స్ లో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం చార్టర్డ్ అకౌంటెంట్ గా అర్హత సాధించారు. 2006లో అమెరికా వెళ్లి సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (సీసీఏ) అయ్యారు. ఇదే ఆయన ప్రపంచ ఆర్థిక జీవితాన్ని విస్తరించింది.ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ)లో ఆయన దాదాపు 17 సంవత్సరాలు పనిచేశారు. అక్కడాయన 500 మందికి పైగా క్లయింట్లకు రెగ్యులేటరీ ఫైలింగ్స్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్, ఐపీఓలను నిర్వహించారు. పునరుత్పాదక ఇంధన రంగంలోకి ఆయన ప్రవేశం 2016లో సోలార్సిటీతో జరిగింది. ఈ సంస్థ తరువాత టెస్లాలో విలీనమైంది.రూ.1,100 కోట్ల వేతనం2017లో టెస్లాలో చేరిన తనేజా క్రమంగా ఎదుగుతూ 2023లో ఆ సంస్థకు సీఎఫ్ఓ అయ్యారు. 2024లో ఆయన 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,157 కోట్లు) వేతన పరిహారం అందుకున్నారు. ఇందులో మూల వేతనంగా అందుకున్నది 4 లక్షల డాలర్లే అయినప్పటికీ మిగిలినది స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ అవార్డుల ద్వారా వచ్చింది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా కూడా తానేజా పనిచేశారు. -
పతనం దిశగా మస్క్?
-
అంతా ఉత్తుత్తే.. మస్క్ మీద ప్రేమ ఒలకబోస్తున్న ట్రంప్
వాష్టింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెస్లా సీఈవో,అపర కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘నాకు మస్క్ కావాలి. మస్క్తో కలిసి పనిచేయాలని ఉంది. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే భారీ సబ్సిడీలు తీసేస్తానని అందరూ అంటున్నారు. ఇది నిజం కాదు! నేను మస్క్ను, అలాగే అమెరికాలోని అన్ని వ్యాపారాలను అద్భుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’అని ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. తాజా, ట్రంప్ ట్వీట్తో గత కొంతకాలంగా ట్రంప్-మస్క్ల మధ్య కొసాగుతున్న మాటల యుద్ధానికి పులిస్టాప్ పెట్టినట్లైంది. ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్- మస్క్లు స్నేహితులు. కానీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లుతో మిత్రలు కాస్తా బద్ద శత్రువుల్లా మారారు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లాంతా నాన్సెస్ అని మస్క్ అంటే.. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం రాయితీలు ఇవ్వబోదని వార్నింగ్ ఇస్తూ కయ్యానికి కాలుదువ్వారు.అదిగో అప్పడే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ప్రయోమం అందంటూ మస్క్ వరుస ట్వీట్లు, అమెరికాలో ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ది అమెరికా పార్టీ పేరుతో కొత్త పార్టీ అంటూ హడావిడి చేశారు. ఉన్నట్లుండి ఏమైందో ఏమో మస్క్ సైలెంట్ అయ్యారు.ఈ క్రమంలో ట్రంప్ కూడా ఓ మెట్టుదిగొచ్చాడు. ట్రూత్ పోస్టులో ఎలాన్ మస్క్ కంపెనీలపై సబ్సిడీలు తొలగిస్తానన్న ఆరోపణలను ఖండించారు. మస్క్ కంపెనీలతో పాటు అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ ట్వీట్లో చెప్పడంతో వ్యాపార వర్గాల్లోనే కాదు రాజకీయాల్లో సైతం ఆసక్తికరంగా మారింది. -
పాప్కార్న్ రోబోలు వచ్చేస్తున్నాయ్
లాస్ ఏంజెలెస్: వేడివేడి పాప్కార్న్ కావాలంటే చెఫ్కే చెప్పనక్కర్లేదు. తమ హ్యూమనాయిడ్ రోబోట్కు చెప్పినా చకచకా చేసి ఇచ్చేస్తుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెప్పారు. తమ ‘టెస్లా’ సంస్థ అభివృద్ధిచేస్తున్న హ్యూమనాయిడ్ రోబో త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని మస్క్ ప్రకటించారు. లాస్ఏంజెలెస్ నగరంలోని ప్రఖ్యాత హాలీవుడ్ ప్రాంతంలో టెస్లా కొత్తగా ‘డిన్నర్, సూపర్చార్జర్’ అనే రెస్టారెంట్, చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటుచేస్తోంది. ఇందులో ఆప్టిమస్ పేరిట ఒక రోబోట్ను అందుబాటులోకి తేనున్నారు.ఇది పోప్కార్న్ను ఎప్పటికప్పుడు తాజాగా తయారుచేసి అతిధులు, వినియోగదారులకు అందిస్తుంది. సంబంధిత వీడియోను మస్క్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. అడిగిందే తడవుగా కస్టమర్కు కవర్లో పాప్కార్న్ను సర్వ్చేయడం, ప్రతిగా ధన్యవాదాలు తెలిపిన కస్టమర్కు రోబోట్ చేయి ఊపుతూ అభివాదంచేయడం ఆ వీడియోలో ఉంది. ‘‘ ఈరోజు ఇంటర్నెట్లో చూడదగ్గ వీడియో ఉందంటే అది ఇదే. కస్టమర్కు ఆప్టిమస్ ఎంత చక్కగా, పద్ధతిగా, మర్యాదగా సర్వ్ చేస్తోందో చూడండి. ఇదంతా త్వరలో సర్వసాధారణ విషయంగా మారబోతోంది’’ అని మస్క్ ‘ఎక్స్’లో క్యాప్షన్ పెట్టారు.హాలీవుడ్లోని శాంటామోనికా బోల్వార్డ్ ప్రాంతంలో ఈ అధునాతన డిన్నర్, సూపర్చార్జర్ రెస్టారెంట్, చార్జింగ్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. ‘‘ భవిష్యత్తులో ఈ రోబోలు మన దైనందిన జీవిత పనులన్నీ చేస్తూ మనకు సాయంగా ఉంటాయి. మనం కూర్చున్న చోటుకే వచ్చి మనకు కూల్డ్రింక్స్ అందిస్తాయి. పెంపుడు శునకాన్ని అలా బయట వాకింగ్కు తీసుకెళ్తాయి. పిల్లలను ఆడిస్తాయి’’ అని గతేడాది అక్టోబర్లో జరిగిన రోబోల సంబంధ ‘మనం’ కార్యక్రమంలో మస్క్ వ్యాఖ్యానించారు. -
‘బేబీ గ్రోక్’ వస్తుంది.. పిల్లల కోసం ప్రత్యేక ఏఐ యాప్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ పిల్లల కోసం ప్రత్యేక ఏఐ చాట్బాట్ యాప్ను తీసుకురానుంది. తమ గ్రోక్ చాట్బాట్కు కిడ్-ఫ్రెండ్లీ వెర్షన్ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) పోస్ట్ చేశారు.'ఎక్స్ఏఐలో బేబీ గ్రోక్ అనే యాప్ను రూపొందించబోతున్నాం' అని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. పిల్లలకే ప్రత్యేకమైన కంటెంట్తో ఈ యాప్ను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త వెర్షన్ యువ వినియోగదారుల కోసం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు, అయితే మరిన్ని వివరాలను ఇంకా ప్రకటించలేదు.మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ స్పామ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్ఫామ్పై కొత్త గ్రోక్ ప్రస్తావనలను తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు వైరల్ వీడియోలను జనరేట్ చేయడానికి, దాని సృజనాత్మక సాధనాలను మరింత విస్తరించడానికి వీలు కల్పించే ‘ఇమాజిన్’ అనే కొత్త సామర్థ్యాన్ని ‘గ్రోక్’కు జోడించే పనిలో ఉన్నట్లు కూడా మస్క్ ఇటీవల వెల్లడించారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. 44 శాతం మంది పిల్లలు జనరేటివ్ ఏఐని చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఇందులో తమ స్కూల్ వర్క్ లేదా హోమ్ వర్క్ చేయడానికే 54 శాతం వినియోగం ఉంటోంది.We’re going to make Baby Grok @xAI, an app dedicated to kid-friendly content— Elon Musk (@elonmusk) July 20, 2025 -
భారత్లో టెస్లా బ్రాండ్ బాజా బారాత్!
విశాల భారతావని.. 140 కోట్లకుపైగా జనాభా. విభిన్న తరాలు.. ఖర్చుల్లో అంతరాలు. పది రూపాయలకూ వెనుకడుగు వేసే కస్టమరే కాదు.. బ్రాండ్ కోసం రూ.10 కోట్లకూ సై అనే వినియోగదార్లు ఉన్నారు. ఇలా ప్రీమియం ధర చెల్లించే కొనుగోలుదారులు ఉన్నారు కాబట్టే భారత్లో టెస్లా రేస్ ప్రారంభించింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్కు ప్రత్యేక స్థానం ఉంది. ‘బ్రాండ్స్’ అంటే భారతీయులకు మక్కువ. రూ.50 లక్షలకుపైగా విలువ చేసే లగ్జరీ కార్లు సగటున గంటకు ఆరు రోడ్డెక్కుతున్న మార్కెట్ మనది. ఇలాంటి మార్కెట్లో రిటైల్తో పరుగు మొదలుపెట్టిన ఈ అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం రానున్న రోజుల్లో తయారీ చేపట్టే అవకాశమూ లేకపోలేదు.ప్రస్తుతం బీఎండబ్ల్యూ నం.1భారత్లో ప్రీమియం కార్ల మార్కెట్ విభాగంలో 2024–25లో 51,406 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇప్పటికే దేశీయంగా బలమైన తయారీ, సర్వీస్ నెట్వర్క్ వ్యవస్థలను నిర్మించాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) రంగంలో 2025 జూన్ నాటికి ఈవీల వాటా 4.5 శాతం మాత్రమే. లగ్జరీ పీవీల విభాగంలో ఈవీల వాటా 10 శాతం. ఇందులో బీఎండబ్ల్యూ 53 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. 33 శాతం వాటాతో రెండో స్థానంలో మెర్సిడెస్–బెంజ్ పోటీపడుతోంది. టెస్లాకు ఇప్పటికే ఉన్న సవాళ్లకు తోడు ఈ సంస్థకు ప్రపంచ పోటీదారుగా ఉన్న చైనా దిగ్గజం బీవైడీ ఇండియాలో ఇప్పటికే అడుగుపెట్టింది. వియత్నాం కంపెనీ విన్ ఫాస్ట్ ఇక్కడ అడుగుపెట్టబోతోంది.పదేళ్ల నిరీక్షణ తర్వాత మనదేశంలోకి టెస్లా ఎంట్రీ ఇచ్చింది. తొలి ఎక్స్పీరియెన్స్ సెంటర్ను ముంబైలో ఆవిష్కరించింది. పూర్తిగా తయారైన కార్లకు దిగుమతి సుంకం భారత్లో 100 శాతం వరకు ఉంది. మనదేశంలో తయారీ చేపడితేనే ప్రయోజనాలు ఇస్తామని భారత్ స్పష్టం చేసింది. ఈ అంశాలే టెస్లా రాక ఆలస్యానికి కారణమయ్యాయి. మొత్తానికి పాలసీ అడ్డంకులు, సుంకాల సంక్లిష్టతలు, ఇతర బ్రాండ్లతో పోటీ, భౌగోళిక రాజకీయ ఒత్తిడి.. ఇవన్నీ అధిగమించి ఎట్టకేలకు అరంగేట్రం జరిగింది. దేశీయంగా తయారీ చేపట్టే అంశానికి కట్టుబడేముందు ఇక్కడి మార్కెట్ను పరీక్షిస్తామని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు. సుమారు రూ.60 లక్షల ధరతో తొలుత వై మోడల్ను టెస్లా ప్రవేశపెడుతోంది. ప్రపంచంలో అత్యధిక సుంకం ఉన్నది భారత్లోనే అని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అందువల్లే, ఇతర దేశాలతో పోలిస్తే టెస్లా కారు ధర మనదేశంలోనే ఎక్కువ.టెస్లానా మజాకా!యూఎస్, జర్మనీ, చైనాలో టెస్లాకు తయారీ కేంద్రాలున్నాయి. ఇవి ఏటా 25–30 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగలవు. 2019లో చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3.8 శాతం మాత్రమే. అదే ఏడాది డిసెంబర్లో టెస్లా మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. 2024లో ఇది 24.6 శాతానికి చేరడంలో టెస్లా కీలకపాత్ర పోషించింది. ఆటో దిగ్గజాల మాదిరిగా కాకుండా ప్రకటనల విషయంలో టీవీలు, ఇతర మాధ్యమాలకు బదులు సెలబ్రిటీల ప్రభావం, నోటి మాటగా ప్రచారంపై టెస్లా ఆధారపడింది. ప్రీమియం, ప్రత్యేక బ్రాండ్గా కంపెనీ ఇమేజ్ను నిలబెట్టడంలో ఈ విధానం సహాయపడింది. నటుడు బ్రాడ్ పిట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ‘ఈబే’ మొదటి అధ్యక్షుడు జెఫ్ స్కోల్, షావొమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లే యూ.. ఇలా ఎందరో ప్రముఖులు టెస్లా కస్టమర్ల జాబితాలో ఉన్నారు.డెలివరీలు తగ్గాయ్అంతర్జాతీయంగా 2025 జనవరి–మార్చిలో టెస్లా డెలివరీలు 13% పడిపోయాయి. గడిచిన మూడేళ్లలో ఇది అత్యంత భారీ క్షీణత. పెరుగుతున్న ప్రపంచ పోటీ, నూతన మోడళ్ల రాక ముఖ్యంగా మోడల్–వై ఆలస్యం కావడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సలహాదారుగా ఎలాన్ మస్క్ పాత్రపై పెరుగుతున్న వ్యతిరేకత వంటివి ఈ క్షీణతకు దారితీశాయి. ఒకప్పుడు టెస్లాకు బలమైన మార్కెట్లలో ఒకటైన చైనాలో సంస్థ ఈవీ వాటా 2025 మొదటి ఐదు నెలల్లో 7.6%కి పడిపోయింది. ఇది గత సంవత్సరం 10%, 2020లో గరిష్ట స్థాయిలో 15%గా నమోదైంది. బీవైడీ, షావొమీ వంటి ప్రత్యర్థులు ఫీచర్–రిచ్ మోడళ్లు, పోటీ ధరలతో సవాల్ విసిరి మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెస్లా 2025 జనవరి–మార్చి కాలంలో 3,36,681 వాహనాలను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,86,810గా నమోదైంది. -
అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ కేసు
-
ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టెస్లా కార్లు
-
భారత్ లోకి టెస్లా ఎంట్రీ వెనుక మస్క్ మాస్టర్ ప్లాన్
-
ముంబైలో ‘టెస్లా’ కార్ల తొలి షోరూమ్ ప్రారంభం (ఫొటోలు)
-
Shubhanshu Shukla: భూమిపైకి శుభాంశు శుక్లా
వాషింగ్టన్: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొచ్చాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూపైకి చేరుకున్నారుయాక్సియం-4 మిషన్ లో భాగంగా... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 2.50 నిమిషాలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ అయ్యారు. డ్రాగన్ స్పేస్ క్యాప్స్లో భూమి మీదకు చేరుకున్నారు. వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్కు తరలించేందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్ఎస్ నుంచి ఘనంగా వీడ్కోలు ఐఎస్ఎస్లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. జూన్ 25న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభంశుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర జూన్ 25, 2025న ప్రారంభమైంది. అమెరికాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోకి వెళ్లింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించారు. అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించారు. ఫ్లోటింగ్ వాటర్ బబుల్ ఐఎస్ఎస్లో 60కి పైగా ప్రయోగాలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు. దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్ఎస్లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది. నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్ఎస్లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్. నిర్భయ భారత్. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు. అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ 25న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. -
మస్క్ అన్ని కంపెనీల్లో ఒక్కటే ఏఐ
ఎలాన్మస్క్కు చెందిన కంపెనీలన్నింటినీ ఒకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొడుగు కిందకు తీసుకువచ్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతేడాది మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐలో స్పేస్ఎక్స్ రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు రాయిటర్స్ తెలిపింది. స్పేస్ఎక్స్, టెస్లా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)తో సహా అతని అన్ని కంపెనీల్లో ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో ఎక్స్ఏఐ ఎక్స్లో విలీనమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు కంపెనీ విలువ 113 బిలియన్ డాలర్లుగా ఉందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. జూన్లో మోర్గాన్ స్టాన్లీ ఈ భారీ ఫండింగ్కు నేతృత్వం వహించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తన వ్యాపారాల్లో కీలకంగా ఉపయోగించుకోవాలన్న మస్క్ ప్రణాళికపై బలమైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది హైలైట్ చేస్తుంది.ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?ఈ ప్లాన్లో ఎక్స్ఏఐ రూపొందించిన చాట్బాట్ గ్రోక్ కీలకంగా మారింది. స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్లింక్లో కస్టమర్ ప్రశ్నలను నిర్వహించడానికి గ్రోక్ను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. దీన్ని టెస్లా ఆప్టిమస్ రోబోట్లలోకి తీసుకురావడానికి టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. మస్క్కు చెందిన అన్ని కంపెనీల ఎకోసిస్టమ్లో గ్రోక్ను ప్రధాన ఏఐ వ్యవస్థగా ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం. -
టెస్లా షోరూం ప్రారంభిస్తున్నట్లు మస్క్ ట్వీట్
-
మస్క్ కంపెనీకి భారత్లో అనుమతులు
ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్లింక్ భారత్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని అడ్డంకులను అధిగమించింది. భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఈ సంస్థకు అనుమతులు ఇచ్చింది. దాంతో దేశంలో స్టార్లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అడ్డంకులు తొలగినట్లయింది.2022 నుంచి భారతదేశంలో స్టార్లింక్ తన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) నుంచి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కూడా పొందింది. ఇప్పుడు, ఇన్-స్పేస్ ఆమోదంతో స్టార్లింక్ భారత్లోని కంపెనీ ప్రణాళికలకు లైన్ క్లియర్ అయింది.ఐఎన్-స్పేస్ స్టార్లింక్ తన జెన్ 1 ఉపగ్రహ సమూహాన్ని భారతదేశంపై నిలిపేందుకు అనుమతిస్తుంది. ఈ అనుమతులు జులై 7, 2030 వరకు చెల్లుబాటు అవుతాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ ఆమోదంలో భాగంగా IN-SPACe యూజర్లు ఉపయోచించేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కూడా ఖరారు చేస్తుంది. గేట్ వే బీమ్ల కోసం స్టార్లింక్ 27.5–29.1 గిగాహెర్జ్ట్, 29.5–30 గిగాహెర్జ్ట్ అప్లింక్ బ్యాండ్లను, 17.8–18.6 గిగాహెర్జ్ట్, 18.8–19.3 గిగాహెర్జ్ట్ డౌన్లింక్ బ్యాండ్లను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. సరళంగా చెప్పాలంటే స్టార్లింక్ దాని వినియోగదారులు, గ్రౌండ్ స్టేషన్ల నుంచి భారతదేశం అంతటా ఇంటర్నెట్ డేటాను పంపించేందుకు నిర్దిష్ట ఉపగ్రహ సంకేతాలను ఉపయోగించేలా అధికారిక అనుమతులు పొందింది.ఇదీ చదవండి: పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!గేట్వే స్టేషన్లు నిర్మాణం..ఇదిలాఉండగా, ఈ ఆమోదం పొందడం వల్ల స్టార్లింక్ వెంటనే భారత్లో సర్వీసులు ప్రారంభిస్తుందని కాదు. సంస్థ ఇంకా భారత ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ను పొందాల్సి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, భద్రతా అవసరాలను తీర్చడానికి పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కనీసం మూడు గేట్వే స్టేషన్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ వ్యవస్థ పూర్తయితే స్టార్లింక్ కూడా త్వరలో ట్రయల్స్ ప్రారంభించే అవకాశం ఉంది. కంపెనీ భారతదేశ సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిరూపించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం ట్రయల్ స్పెక్ట్రమ్ను మంజూరు చేయబోతున్నట్లు సమాచారం. -
‘స్టార్లింక్’ ఇంటర్నెట్ సేవలకు పచ్చజెండా
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘స్టార్లింక్’ ఇంటర్నెట్ సేవల సంస్థకు భారత్లో ద్వారాలు తెరచుకున్నాయి. ఇంటర్నెట్ సేవలు అందించేందుకుగాను సంస్థకు కీలక అనుమతులు వచ్చాయి. భారత్లో వాణిజ్యపరంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు మొదలుపెట్టేందుకు అవసరమైన అనుమతులను భారత అంతరిక్ష సేవల నియంత్రణ సంస్థ అయిన ‘ఇండియన నేషనల్ స్పేస్ అథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్(ఇన్–స్పేస్)’ మంజూరు చేసింది. 2022 నుంచి వాణిజ్య లైసెన్స్ పొందేందుకు ఎదురుచూస్తున్న ఈ సంస్థకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. టెలికాం విభాగం నుంచి గత నెలలో స్టార్లింక్ అనుమతులు పొందిన విషయం తెల్సిందే. తాజాగా అంతరిక్ష సేవల నియంత్రణ సంస్థ నుంచి కూడా అనుమతులు రావడంతో స్టార్ లింక్కు మార్గం సుగమమైంది. -
మస్క్కు బిగ్ షాక్.. ‘ఎక్స్’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ సీఈవో పదవి నుంచి లిండా యాకరినో(Linda Yaccarino) వైదొలిగారు. 2023 మే నుంచి రెండేళ్లకు పైగా ఈ పదవిలో కొనసాగిన ఆమె బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి ‘ఎక్స్’ (అంతకముందు ట్విటర్) వెళ్లిన తర్వాత తొలి సీఈవోగా లిండానే కావడం తెలిసే ఉంటుంది. తన రాజీనామా విషయాన్ని స్వయంగా లిండా యాకరినో ఎక్స్వేదికగా ప్రకటించారు. మే 2023 నుంచి జూలై 2025 వరకు ఆమె సీఈవోగా కొనసాగారు. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. ‘ఎక్స్’ బృందంతో కలిసి సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు ‘xAI’తో కలిసి సంస్థ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది అని ఆమె పేర్కొన్నారు.After two incredible years, I’ve decided to step down as CEO of 𝕏. When @elonmusk and I first spoke of his vision for X, I knew it would be the opportunity of a lifetime to carry out the extraordinary mission of this company. I’m immensely grateful to him for entrusting me…— Linda Yaccarino (@lindayaX) July 9, 2025xAI అనేది ఎలాన్ మస్క్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఇది Grok(గ్రోక్) అనే చాట్బాట్ను అభివృద్ధి చేసింది. అయితే లిండా రాజీనామా సమయంలో Grokపై వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆమె రాజీనామా వాటికి సంబంధం లేదని సమాచారం. ఇక ఎక్స్ కొత్త తదుపరి సీఈవో ఎవరనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎలాన్ మస్క్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
‘ఎప్స్టీన్ ఫైల్స్ ఎక్కడ?’.. ట్రంప్పై మస్క్ కొత్త దాడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్ తాజాగా మరోమారు ట్రంప్పై విరుచుకుపడ్డారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన కీలక ఫైల్స్ను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నదంటూ ఎలాన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్ను నిలదీశారు.How can people be expected to have faith in Trump if he won’t release the Epstein files?— Elon Musk (@elonmusk) July 8, 2025దీంతో జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం తాజాగా అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ను ట్రంప్ బయటపెట్టకపోతే ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారు?” అంటూ మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తాను కొత్తగా స్థాపించిన అమెరికా పార్టీ అధికారంలోకి వస్తే ఈ కుంభకోణాన్ని బయటపెట్టడానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని మస్క్ పేర్కొన్నారు.ఇటీవల అమెరికా న్యాయశాఖ (డీఓజే) జెఫ్రీ ఎప్స్టీన్ సంబంధించిన కేసుపై కీలక ప్రకటన చేసింది. ఎప్స్టీన్ నివాసాలలో సోదాలు చేసినా ఎటువంటి క్లయింట్ లిస్ట్ దొరకలేదని, ఇకపై ఈ కేసులో ఎలాంటి సమాచారం వెల్లడించబోమని స్పష్టం చేసింది. దీనిపై మస్క్ తీవ్రంగా స్పందించారు. మీడియా సమావేశంలో ఒక విలేకరి ఇదే అంశంపై ట్రంప్ను ప్రశ్నించగా, ఆయన సమాధానాన్ని దాటవేశారు. మీరు ఇంకా ఎప్స్టీన్ గురించే మాట్లాడుతున్నారా? అని తిరుగు ప్రశ్నవేశారు. Will exposing the Epstein files rank high on the America Party’s list?— Community Notes & Violations (@CNviolations) July 8, 2025న్యూయార్క్కు చెందిన ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ సాగించిన దుర్మర్గాల జాబితాను గత ఏడాది న్యూయార్క్ న్యాయస్థానం బట్టబయలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను విడుదల చేసే ప్రక్రియలో భాగంగా తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు. ఈ కుంభకోణంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ల పేర్లతో పాటు మైకెల్ జాక్సన్ తదితరుల పేర్లు బయటికొచ్చాయి. -
మస్క్ కొత్త పార్టీ ఎఫెక్ట్.. కుప్పకూలిన టెస్లా షేర్లు
-
మస్క్ కొత్త పార్టీ ప్రకటనలపై విరుచుకుపడ్డ ట్రంప్
-
మస్క్ను చూస్తే జాలేస్తోంది.. అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు
అమెరికాలో రాజకీయంగా మరో సంచలనం రేగింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా పార్టీ ఏర్పాటుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మస్క్ పార్టీని అసంబద్ధమైనదిగా ఆయన అభివర్ణిస్తూ.. తీవ్ర ఆరోపణలే చేశారాయన. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. పరిపాలన సజావుగా సాగిపోతోంది. మరోవైపు డెమొక్రట్లు తమ ప్రాబల్యం కోల్పోతున్నారు. అయినప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉంది. ఈ తరుణంలో మూడో పార్టీ ఏర్పాటు అనేది అసంబద్దమైన చర్య. మూడో పార్టీ అమెరికా చరిత్రలో ఎప్పుడూ విజయవంతం కాలేదు అని ట్రంప్ అన్నారు. మూడో పార్టీని ఎవరు ఏర్పాటు చేసుకున్నా(మస్క్ను ఉద్దేశిస్తూ..) తమకేం ఫరక్ పడదని, అయితే ఆ పార్టీ వల్ల అమెరికా రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుంది. దేశంలో అస్తవ్యస్తత నెలకొని కలహాలు చెలరేగే అవకాశమూ ఉంది అని ట్రంప్ హెచ్చరించారు. మస్క్ గతంలో తనకు మద్దతు ఇచ్చినా.. ఇప్పుడు పూర్తిగా మారిపోయారని ట్రంప్ అంటున్నారు. ‘‘మస్క్ను చూస్తే జాలేస్తోంది. గత ఐదువారాలుగా ఆయన అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు అని ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. నేను ప్రవేశపెట్టిన బిల్లులో Electric Vehicle (EV) Mandate రద్దు చేయడం ముఖ్యాంశంగా ఉంది. దీని వల్ల ప్రజలు ఇకపై గ్యాస్, హైబ్రిడ్ లేదా కొత్త టెక్నాలజీ వాహనాలను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు. అయితే మస్క్ గతంలో ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చి.. ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అంతేకాదు.. మస్క్ తన సన్నిహితులను NASA చీఫ్గా నియమించాలనుకున్నారు. కానీ ఆ వ్యక్తి రిపబ్లికన్ పార్టీకి మద్దతు లేని డెమొక్రాట్ కావడం వల్లే అలా నియమించడం అనుచితమని భావించా. అమెరికా ప్రజలను రక్షించడమే నా ముందుకు ప్రధాన కర్తవ్యం’’ అంటూ ట్రంప్ పోస్టులో ప్రస్తావించారు.ఇదిలా ఉంటే.. బిగ్ బ్యూటీఫుల్ బిల్లును వ్యతిరేకిస్తూ ట్రంప్ పాలనా విభాగం డోజ్ నుంచి బయటకు వచ్చేసిన ఎలాన్ మస్క్ విమర్శలను తీవ్రతరం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో బిల్లు ఆమోదం గనుక పొందితే మూడో పార్టీ పెడతానంటూ చెబుతూ వచ్చారు. తాజాగా అదీ జరగడంతో శనివారం రాత్రి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్(పూర్వపు ట్విటర్)లో ‘అమెరికా పార్టీ’ని ప్రకటించారు. అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు.. ఒకే పార్టీ వ్యవస్థగా మారిందని, ప్రజలకు తిరిగి స్వేచ్ఛ ఇవ్వడమే తన లక్ష్యమని చెబుతూ అమెరికా పార్టీ పేరును ప్రకటించారు. అలాగే.. ప్రజలలో 65% మంది మూడవ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఓ పోల్ను చూపించారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రవేశపెట్టిన భారీ ఖర్చుల బిల్లును(బిగ్ బ్యూటీఫుల్ బిల్)ను మరోసారి తీవ్రంగా విమర్శించారు. -
‘రెండు తలల పాము’తో మస్క్ ఎలక్షన్ ‘వెర్రి’!
వాషింగ్టన్: అమెరికా (usa) రాజకీయాల్లో కీలక మలుపు అంటూ,. ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (elon musk) రాజకీయ రంగంలోకి వస్తున్నానంటూ ఆయన స్వయంగా షేర్ చేసిన కొత్త పార్టీ ప్రకటన.. తాజాగా పెద్ద చర్చకు దారి తీసింది. ‘ది అమెరికా పార్టీ’ (the america party) అనే పేరుతో మూడో రాజకీయ శక్తిని ప్రకటించిన మస్క్, ఆ పార్టీకి రెండు తలల పాము మీమ్ను షేర్ చేశారు. కానీ మస్క్ నిజంగానే కొత్త పార్టీని పెట్టారా.. ?లేక జనాల్ని వెర్రివాళ్లను చేయడానికే ఇలా చేశారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే.. అమెరికన్ చట్టాల ప్రకారం..ఆయన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు అనర్హులు. దీంతో మస్క్ కొత్త పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదంటే.. కొత్త పార్టీ లేదు. ఏమీ లేదు. తూచ్ అని పక్కకు తప్పుకుంటారా? అని చూడాల్సి ఉండగా.. మస్క్ సౌతాఫ్రికన్ పౌరుడుమస్క్ 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా, అమెరికన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన అనర్హులు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగాల ప్రకారం.. ఆర్టికల్ 2, సెక్షన్ 1 ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సదరు అభ్యర్థి అమెరికా పౌరుడై ఉండాలి. తద్వారా మస్క్కు అర్హత లేదు. కారణం ఆయన జన్మస్థలం దక్షిణాఫ్రికా కావడం. మస్క్ పార్టీపై సవాలక్ష ప్రశ్నలుఈ నేపథ్యంలో, మస్క్ పార్టీ విస్తరణకు ముందు వ్యతిరేక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన మాత్రం అధ్యక్ష పదవిపై నిర్ణయం వచ్చే ఏడాది చెబుతానంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ.. మస్క్ టార్గెట్ ఏంటి? అమెరికాను పాలించాలని చూస్తున్నారా? పార్టీగా ప్రభావం చూపాలని అనుకుంటున్నారా? అనేది సదరు అమెరికన్ పౌరుల్లో పుట్టుకొస్తున్న సవాలక్ష ప్రశ్నలు.. ఈ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మస్క్కే మద్దతు ఈ క్రమంలో మస్క్ కొత్త పార్టీ ఏర్పాటు? అందుకు గల కారణాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలు ప్రజల స్వేచ్ఛను హరించుతున్నాయని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించిన కీలక ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మస్క్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జులై 4న తన కొత్త పార్టీని ప్రకటించారు. ముందుగా కొత్త పార్టీ స్థాపన విషయంలో నెటిజన్ల అభిప్రాయాల్ని సేకరించారు. కొత్త పార్టీకి మద్దతుగా 1.2మిలియన్ల మంది నెటిజన్లు స్పందించారు. దాదాపు 80 శాతం మంది మస్క్కు మద్దతు తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.త్వరలోనే పార్టీ లోగో ప్రకటనపార్టీ పేరు ది అమెరికా పార్టీగా నామకరణం చేసినా.. పార్టీ గుర్తును రెండు తలల పాము మీమ్ను షేర్ చేస్తూ తన పార్టీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనే సంకేతాలిచ్చారు. ఇది అధికారిక పార్టీ లోగోగా ప్రకటించలేదు కానీ.. ప్రారంభ దశలో పార్టీ భావజాలానికి ప్రతీకగా ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీకి ప్రత్యేక లోగో, జెండా, రంగులు ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో మస్క్ పోటీఇక వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో 2–3 సెనేట్ స్థానాలు, 8–10 ప్రతినిధుల సభ స్థానాల్లో ఎలాన్ మస్క్ పోటీ చేయనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. తన పార్టీ ద్వారా ప్రజల గొంతుకను వినిపించడమే తన పార్టీ ఉద్దేశమనే నినాధాలతో ప్రజల్లోకి వెళ్లనుంది. ఎన్నికల్లో మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహం అమెరికాలో ప్రతినిధుల సభ (House of Representatives) సభ్యుల పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తయిన వెంటనే ప్రతినిధుల సభ (House of Representatives) లోని 435 స్థానాలకు, సెనేట్ (Senate) లోని 34 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తన పార్టీ సైతం ఈ ఎన్నికల బరిలో దిగేలా ఎలాన్ మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఈ స్ట్రాటజీ ప్రకారం దేశంలోని అన్నీ స్థానాల్లో పోటీ చేయకుండా.. కేవలం గెలిచే స్థానాల్లో పోటీకి దిగడం, గెలుపు సమీకరణాల్ని మార్చే ప్రయత్నం చేయడం వంటి అంశాలు దీని కిందకే వస్తాయి.మస్క్ ముందున్న సవాళ్లుకాగా,మస్క్ సంపద, ప్రభావం ఉన్నప్పటికీ, మూడో పార్టీగా ఎదగడం సవాలుతో కూడుకున్నదే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరుఫున మస్క్ ప్రచారం చేశారు. ఆ సమయంలో నేను అమెరికా అధ్యక్షుడిని కాలేను. ఎందుకంటే? నేను సౌతాఫ్రికాలో జన్మించాను. మా తాత అమెరిన్. నేను ఆఫ్రికన్. కాబట్టి నేను అమెరికాకు అధ్యక్షుడిని కాలేను. రాకెట్లను, కార్లను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పుకున్న మస్క్ ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ ప్రకటించడం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని పరోక్ష సంకేతాలివ్వడంపై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. మస్క్కు ఎలక్షన్ ఎర్రి ఉందంటూ మండిపడుతున్నారు. -
ఎలాన్ మస్క్ పార్టీ ప్రకటన.. అమెరికాలో మూడో పార్టీ సక్సెస్ ఎలా ఉందంటే?
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ది అమెరికా పార్టీ’ స్థాపిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో, అమెరికాలో మరోసారి మూడో రాజకీయ పార్టీ అంశం తెరపైకి వచ్చింది. కాగా.. దీనిని రిపబ్లికన్, డెమొక్రటిక్ అనే రెండు పార్టీల వ్యవస్థకు సవాల్గా మస్క్ అభివర్ణించారు.అయితే, పార్టీ అధికారికంగా నమోదైనట్లు ఫెడరల్ ఎలక్టోరల్ కమిషన్ ఇంకా ధ్రువీకరించలేదు, దానికి సంబంధించి ఇంకా ఎలాంటి పత్రాలనూ కమిషన్ ప్రచురించలేదు. ఆ పార్టీ అధికారికంగా నమోదైందా? లేదా? అనేది అమెరికా ఎన్నికల అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు, ఎలా ఉండబోతోందనే విషయాలను మస్క్ కూడా వెల్లడించలేదు. ఒకవేళ మస్క్ పార్టీని ఎన్నికల గుర్తిస్తే మూడో పార్టీ అవతరించే అవకాశం ఉంది. మస్క్ పార్టీ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగానే మారనుంది.రెండు పార్టీలదే హవా..ఇక, ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో మెజార్టీ అధ్యక్షులు కేవలం రెండు పార్టీల నుంచే వచ్చారు. అవే రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి. గత అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. ఇదిలా ఉండగా.. అమెరికా ఇప్పటికే పలుమార్లు కొందరు వ్యక్తులు మూడో పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం ఒకే ఒకరు జార్జ్ వాషింగ్టన్ మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి.. అమెరికాకు అధ్యక్షుడు అయ్యారు. ఆయన 1789-97 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఇదిలా ఉండగా.. అమెరికా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. పలు పార్టీలను కొందరు నాయకులు ప్రారంభించినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం ఒకటి, రెండు పార్టీలు మాత్రమే ఎన్నికల్లో ఓట్లను చీల్చగలిగాయి. అంతే తప్ప అధికారంలోకి మాత్రం రాలేకపోయాయి. మెజార్టీ నేతలు తమ మార్కును ఎన్నికల్లో చూపించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మాస్క్ కొత్త పార్టీ.. అమెరికాలో ఎంత మేరకు ప్రభావం చూపించనుంది అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికన్లు మస్క్ను ఎలా ఆదరిస్తారనేది హాట్ టాపిక్గా మారింది.అమెరికాలో మూడో పార్టీ చరిత్ర ఇలా..Anti-Masonic Party (1828): ఇది అమెరికాలో మొట్టమొదటి మూడో పార్టీగా గుర్తించబడుతుంది. మాసన్రి సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఏర్పడింది.Liberty Party (1840): దాస్యవ్యవస్థను వ్యతిరేకించడానికి ఏర్పడింది.Free Soil Party (1848): స్లేవరీ విస్తరణకు వ్యతిరేకంగా.Know-Nothing Party (1850): మైగ్రేషన్, కాథలిక్ వ్యతిరేక భావాలతో పనిచేసింది.Populist Party (People’s Party, 1890s): రైతుల హక్కులు, ఫెడరల్ బ్యాంక్ రిఫార్మ్స్, డైరెక్ట్ సెనేటర్ ఎలెక్షన్స్ వంటివి మద్దతుగా ఉంది.Progressive Party (1912): టెడి రూజవెల్ట్ నాయకత్వంలో ఏర్పడింది. సామాజిక న్యాయం, కార్మిక హక్కులు, వ్యాపార నియంత్రణపై దృష్టి సారించింది.Socialist Party (1901-1950): యుజీన్ డెబ్స్ వంటి నాయకులు ప్రముఖులుగా నిలిచారు.Libertarian Party (1971): వ్యక్తిగత స్వేచ్ఛ, ఉచిత మార్కెట్ సిద్ధాంతాలపై నమ్మకంతో ఏర్పడింది.Green Party (1990): పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, శాంతి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రారంభమైంది.Reform Party (1995): రాస్ పెరో స్థాపించాడు. ప్రభుత్వ ఖర్చులు తగ్గింపు, కరపన్ను సవరణలు వంటివి ప్రధాన అంశాలు.అయితే, అమెరికాలో పలు పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ కేవలం మూడు పార్టీలు మాత్రమే ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించాయి.Theodore Roosevelt (Progressive Party 1912): మూడో పార్టీ అభ్యర్థిగా అత్యధిక ఓట్లు (27%) పొందిన అభ్యర్థి.Ross Perot (Independent/Reform Party 1992): సుమారు 19% ఓటు బ్యాంక్ సంపాదించాడు.George Wallace (American Independent 1968) : ఐదు రాష్ట్రాల్లో విజయం సాధించారు.Ralph Nader (Green Party 2000): ఎన్నికల్లో డెమోక్రాట్ల ఓటు చీల్చాడనే వాదన ఉంది.RFK Jr Cornel West (Independent 2024): ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రభావం చూపించకలేకపోయారు. ఇప్పటి వరకు మూడో రాజకీయ పార్టీ, అభ్యర్థి సాధించిన ఓట్ల శాతం.. -
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పై యుద్ధం ప్రకటించిన మస్క్
-
కొత్తపార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటన
-
అన్నంతపనీ చేసిన మస్క్.. పార్టీ ఫ్యూచర్ ప్లాన్ ఇదే..
వాషింగ్టన్ డీసీ: టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ చట్టం తీసుకువచ్చిన దరిమిలా, దాన్ని వ్యతిరేకిస్తూ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. తాను అనుకున్నది సాధించేవరకూ వదలని చెప్పే మస్క్ ఇప్పుడు అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు.ప్రముఖ టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్, అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపనపై ప్రకటన చేశారు. ఈ పార్టీకి ‘అమెరికా పార్టీ’ అని పేరు పెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో విభేదాల నేపధ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. ఎలన్ మస్క్ తన ‘ఎక్స్’లో ఒక పోల్ నిర్వహించి, తన 22 కోట్ల మంది ఫాలోవర్స్ను ఓ ప్రశ్న అడిగారు ‘అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పాల్సిన సమయం వచ్చిందా?" అని అడిగినప్పుడు 80 శాతం మంది అవును అని సమాధానమిచ్చారు. By a factor of 2 to 1, you want a new political party and you shall have it!When it comes to bankrupting our country with waste & graft, we live in a one-party system, not a democracy.Today, the America Party is formed to give you back your freedom. https://t.co/9K8AD04QQN— Elon Musk (@elonmusk) July 5, 2025ఈ ఫలితాలను వెల్లడిస్తూ మస్క్ ఓ ప్రకటనలో ‘అమెరికాలో 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీ అవసరమని తెలిపారు. ఇది ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మస్క్ అభివర్ణించారు. కొత్త పార్టీ సాయంతో 2026 మధ్యంతర ఎన్నికల్లో హౌస్, సెనేట్ సీట్లపై మస్క్ దృష్టి సారించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇప్పుడు మస్క్ ‘అమెరికా పార్టీ’ వీటికి సవాలుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’
పుట్టకతోనే చెవిటివారా లేదా చెవిలో మిషన్ పెట్టనిదే బయట శబ్దాలు వినిపించట్లేదా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. పుట్టకతోనే ఎవరైనా పూర్తిగా చెవిటివారుగా ఉన్న సందర్భాల్లోనూ వినికిడిని పొందేందుకు న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ సహాయపడుతుందని ఆ కంపెనీ చీఫ్ ఎలాన్ మస్క్ తెలిపారు. వినికిడి లోపం గురించి యూజర్లను హెచ్చరించిన ఎక్స్లోని ఒక పోస్ట్కు ప్రతిస్పందనగా మస్క్ ఈమేరకు వివరాలు వెల్లడించారు.కెర్నల్ కంపెనీ సీఈఓ బ్రెయిన్ జాన్సన్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ..‘మీ చెవులను సంరక్షించుకోండి. వినికిడి కోల్పేతే ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రస్తుతం చికిత్సలు అందుబాటులో లేవు. డెమెన్షియా వల్ల వినికిడి కోల్పోయే ప్రమాదం 5 రెట్లు ఉంటుంది. 30–40% మెదడుపై ప్రభావం పడుతుంది. ఒకసారి చెవి లోపలి కణాలు పాడైతే సహజ వినికిడిని పునరుద్ధరించలేం. కాబట్టి మీ చెవులకు గరిష్టంగా 80 డెసిబుల్స్ మించి శబ్దాలను దరిచేరకుండా జాగ్రత్తపడండి. శబ్దాలను కొలిచే యాప్లో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి’ అన్నారు.దీనికి ప్రతిస్పందనగా మస్క్..‘వినికిడిని పునరుద్ధరించడానికి న్యూరాలింక్ ద్వారా ఒక స్పష్టమైన మార్గం సూచిస్తుంది. పుట్టినప్పటి నుంచి పూర్తిగా వినికిడి లేనివారికి కూడా వినికిడి వచ్చేలా చేయవచ్చు. ఎందుకంటే న్యూరాలింక్ పరికరం ధ్వనిని ప్రాసెస్ చేసే మెదడులోని న్యూరాన్లను యాక్టివేట్ చేస్తుంది’ అని చెప్పారు.There is a clear path to restoring hearing with a @Neuralink, even for someone who has had total loss of hearing since birth, as our device directly activates the neurons in the brain that process sound https://t.co/h5CeELct5m— Elon Musk (@elonmusk) June 28, 2025ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’ఇదిలాఉండగా, ఎలాన్ మస్క్కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ పక్షవాత బాధితుల కోసం రూపొందించిన ఇంప్లాంట్ ఇప్పటికే రెండో ట్రయల్ విజయవంతమైంది. అలెక్స్ అనే వ్యక్తికి అమర్చిన రెండో ఇంప్లాంట్ బాగా పని చేస్తోందని కంపెనీ గతంలో తెలిపింది. -
మస్క్కు ట్రంప్ వార్నింగ్ ..!
-
మస్క్ కంపెనీలో ఉద్యోగం కావాలా?
ఎలాన్ మస్క్కు చెందిన ఏఐ కంపెనీ ఎక్స్ఏఐలో నియామకాలు జోరుగా సాగుతున్నాయి. బ్యాకెండ్ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డిజైనర్లు, డేటా సైంటిస్టులు, లీగల్ ఎక్స్పర్ట్లు.. వంటి ఉద్యోగాల కోసం ఎక్స్ఏఐ తన ఎక్స్ ఖాతాలో ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం పాలో ఆల్టో, శాన్ ఫ్రాన్సిస్కో, మెంఫిస్లోని కార్యాలయాల్లో విస్తృత శ్రేణి ఉద్యోగాలను భర్తీ చేయాలని చూస్తోంది. కొన్ని పోస్టులు రిమోట్ దరఖాస్తుదారులకు కూడా అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ ‘ఎక్స్ మనీ’ని అభివృద్ధి చేయడానికి చురుకుగా పనిచేస్తున్నట్లు ఎక్స్ఏఐ తెలిపింది.ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎక్స్ యూజర్లు ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్మెంట్.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు గతంలో తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.ఇప్పటికే ‘వీసా’తో ఒప్పందంవీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్ ప్లాట్ఫామ్ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ గతంలో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ర్యాపిడో.. ఓలా.. ఉబర్.. ఛార్జీలు పెంపు?వేతనాలు ఇలా..ఎక్స్ఏఐలో చేరే ఉద్యోగులకు ఏటా 2,20,000 డాలర్ల (సుమారు రూ.1.9 కోట్లు) నుంచి 4,40,000 డాలర్ల (సుమారు రూ.3.7 కోట్లు) వరకు పారితోషికం ఆఫర్ చేసింది. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ వంటి రంగాల్లో బలమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, సంక్లిష్టమైన ఆలోచనలను స్పష్టంగా కమ్యూనికేట్ చేసే సామర్థ్యం ఉన్న ఇంజినీర్లకు కంపెనీ మరింత చెల్లిస్తుందని ఎక్స్ఏఐ తెలిపింది. -
మస్క్కు ట్రంప్ వార్నింగ్ ..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. ‘బిగ్, బ్యూటిఫుల్ బిల్’తో వారి మధ్య అప్పట్లో సాగిన వాగ్యుద్ధం మరోసారి తీవ్ర రూపు దాలుస్తోంది. బిల్లును వ్యతిరేకిస్తున్న మస్క్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎవరికీ దక్కని విధంగా ఆయన సబ్సిడీలు పొందారని ఆక్షేపించారు. సబ్సిడీలే లేకపోతే రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వంటివేవీ ఉండేవి కాదన్నారు. దుకాణం మూసేసి, ఇంటికి (దక్షిణాఫ్రికా) వెళ్లాల్సి వస్తుందంటూ ఎద్దేవా చేశారు. ‘‘బిగ్ బిల్లు మన దేశ చాలా సంపదను ఆదా చేస్తుంది. బహుశా డోజ్ దీని గురించి బాగా ఆలోచించాలి. మస్క్ పొందుతున్న ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టులను పరిశీలించాలి’’ అని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు.‘‘మస్క్ నన్ను అధ్యక్షునిగా ఆమోదించడానికి చాలా ముందునుంచే ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నా. ఈ అంశం నా ప్రచారంలో ప్రధానంగా ఉంటూ వస్తోంది. ఎలక్ట్రిక్ కార్లకు నేనేమీ వ్యతిరేకం కాదు. అవి మంచివే. కానీ అంతా వాటినే వాడాలని మాత్రం ఎవరూ బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ఫ్లోరిడా వెళ్లేముందు వైట్హౌస్ ఆవరణలో ఈ అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘మస్క్కు బాగా అసంతృప్తి ఉంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలచా. ఆయన మరెంతో నష్టపోవాల్సి రావచ్చు.ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డోజ్ను మస్క్పైకి ఉసిగొల్పాల్సి రావచ్చు. బహుశా అదే ఆయన్ను కబళించే రాకాసిగా మారవచ్చు!’’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ, తనకిస్తున్న సబ్సిడీలను ఎత్తేయాలంటూ ట్రంప్కు సవాలు విసిరారు. ఆ తర్వాత ఈ అంశంపై మీడియాతో ట్రంప్ స్పందించారు. మస్క్ను అమెరికా నుంచి తిప్పి పంపించే యోచన ఉందా అని ప్రశ్నించగా ‘‘నాకు తెలియదు. దీనిపై దృష్టి సారించి చూడాలి’’ అని బదులిచ్చారు. డోజ్కు ఇటీవలి దాకా సారథ్యం వహించింది మస్కే కావడం విశేషం. ఆయన 1971లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు. అమెరికాలో ఏళ్ల తరబడి నివసించిన అనంతరం 2002లో ఆ దేశ పౌరసత్వం పొందారు.కొత్త పార్టీ దేశావసరం: మస్క్బిగ్, బ్యూటిఫుల్ బిల్పై మస్క్ నెల రోజులుగా ట్రంప్తో విభేదిస్తున్నారు. తుది ఓటింగ్కు ముందు సోమవారం కాంగ్రెస్లో ట్రంప్ చర్చించిన సందర్భంగా మస్క్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాన్ని రుణ బానిసత్వపు బిల్లుగా అభివర్ణించారు. ‘‘ఈ బిల్లు వల్ల జాతీయ రుణం మరో 3 లక్షల కోట్ల డాలర్లకు పైగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నిజంగా ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి బహుశా సమయం ఆసన్నమైంది’’ అని మస్క్ ఎక్స్లో పోస్టు చేశారు. బిల్లును విమర్శించడంతోనే ఆగలేదు.హౌస్ ఫ్రీడమ్ కాకస్ చైర్మన్ ప్రతినిధి ఆండీ హారిస్తో సహా ప్రముఖ రిపబ్లికన్ చట్టసభ సభ్యులపైనా విమర్శలు గుప్పించారు. ‘చరిత్రలో అతిపెద్ద రుణ పరిమితి పెరుగుదలతో రుణ బానిసత్వ బిల్లుకు మీరు ఓటు వేసి.. మిమ్మల్ని మీరు ఫ్రీడమ్ కాకస్ అని ఎలా పిలుచుకుంటారు?’ అని మస్క్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలంటూ మొన్నటిదాకా ప్రచారం చేసి, ఇప్పడిలా దేశ చరిత్రలోనే అతిపెద్ద రుణ పెరుగుదల బిల్లుకు ఓటేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడూ సిగ్గుతో తల దించుకోవాలని వ్యాఖ్యానించారు. మస్క్ పోస్టును సోషల్ మీడియాలో ఏకంగా 2.6 కోట్ల మందికి పైగా చూడటం విశేషం. బిల్లు ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానంటూ ఆ తర్వాత కొద్ది గంటలకే మస్క్ మరో పోస్ట్ పెట్టారు. ‘ఈ పిచ్చి బిల్లు రిపబ్లికన్ పార్టీకి ఆత్మహత్యాసదృశమే అవుతుంది.అది ఆమోదం పొందితే ఆ మర్నాడే ‘అమెరికా పార్టీ’ ఏర్పడుతుంది. డెమొక్రాట్–రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయం ఇప్పుడు దేశానికెంతో అవసరం. రాబోయే పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఆ పోస్టును ఏకంగా 3.2 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం పొందిన ‘బిగ్’ బిల్లుపై మూడు రోజులుగా సెనేట్లో తీవ్రస్థాయి చర్చ జరుగుతోంది. మంగళవారం ఇది ఆమోదం పొందింది. దీనితో విద్యుత్ వాహనాలకు ప్రస్తుతం అందుతున్న భారీ సబ్సిడీలు పూర్తిగా అటకెక్కుతాయి. మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ఎక్స్ ప్రభుత్వం నుంచి భారీ కాంట్రాక్టులు, సబ్సిడీలు పొందుతున్న విషయం తెలిసిందే. -
టెస్లా షేర్లు భారీగా కుదేలు
ఒకప్పుడు ఉమ్మడి ఆకాంక్షలతో పరస్పర సహకారంతో కలిసి ప్రయాణం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య సమీకరణాలు పూర్తిగా మారాయి. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం రాజేసుకుంది. ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతిష్టంభనకు తెరతీసినట్లయింది. తాజాగా మస్క్ కంపెనీలకు అందిస్తున్న సబ్సిడీల్లో కోత విధిస్తే పరిస్థితి ఏమిటని ట్రంప్ ఎద్దేవ చేశారు. దానికి ప్రతిస్పందనగా అన్నీ రాయితీలు కట్ చేయడంటూ మస్క్ బదులిచ్చారు. ఇద్దరిమధ్య పెరుగుతున్న వ్యతిరేకతతో టెస్లా షేర్లు ఒక్క రోజులోనే 5 శాతంకు పైగా క్షీణించాయి.ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ ‘ఆర్థిక నిర్లక్ష్యానికి చిహ్నం’గా అభివర్ణించారు. ప్రస్తుతానికి ఈ బిల్లు యూఎస్ సెనేట్లో ఆమోదం పొందింది. 51–49 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించారు. కానీ ప్రతినిధుల సభలో ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఈ బిల్లు అమెరికా ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మారుస్తుందని ట్రంప్ వాదిస్తుంటే.. కొంతమందికి భారీ పన్ను ఉపశమనం కలిగించేలా, మరికొందరికి ఖర్చులు పెరిగేలా, వలసలపై కఠిన వైఖరి ఉండేలా నిర్ణయాలున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.‘నేను ఈవీ మాండేట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఎలాన్ మస్క్కు చాలాకాలం ముందే తెలుసు. ఇది నా రాజకీయ ప్రచారంలోనూ కీలకంగా ఉంది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ కారును సొంతం చేసుకోవాలని బలవంతం చేయకూడదు. సబ్సిడీలు లేకుండా మస్క్ బహుశా తన దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది’ అని ట్రంప్ అన్నారు. దాంతోపాటు టెస్లా, స్పేస్ఎక్స్ వంటి మస్క్ వెంచర్లు ప్రభుత్వ నిధులపై ఎంతగా ఆధారపడుతున్నాయో డోజ్ దర్యాప్తు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు.BREAKING: Trump implies DOGE may look at Elon Musk’s subsidies: pic.twitter.com/FE9lXj0Ebq— unusual_whales (@unusual_whales) July 1, 2025ఇదీ చదవండి: డియర్ స్టాఫ్.. ఆరోగ్యం జాగ్రత్త!మస్క్ స్పందన ఇలా..ట్రంప్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మస్క్ తన కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించాలని కోరారు. ‘నేను నిజంగా చెబుతున్నా.. అన్ని రాయితీలను కట్ చేయండి’ అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. -
ట్రంప్ పై మరోసారి మండిపడ్డ ఎలన్ మస్క్
-
దుకాణం బంద్ చేసి.. మస్క్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎలాన్ మస్క్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అతడు (మస్క్) అమెరికాలో వ్యాపారం చేయలేకపోతే దుకాణం మూసేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఒకసారి ఆయన అమెరికా ప్రభుత్వం నుంచి పొందిన సబ్సిడీలను తాను చూసుకోవాలి. అమెరికా చరిత్రలోనే ఎవరూ పొందలేనంత సబ్సిడీలను మస్క్ పొందారు. అలాంటి వ్యక్తి నా ప్రభుత్వంలో DOGE (Department of Government Efficiency) చీఫ్గా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఒకవేళ ఆ సబ్సిడీలే వద్దనుకుంటే ఆయన తన వ్యాపారాలను బంద్ చేసుకోవచ్చు. అమెరికా వదిలి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవొచ్చు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే జరిగితే.. ఇంకా రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి అవసరం ఆయనకు ఉండదు. పైగా మన దేశానికి భారీగా డబ్బు ఆదా అవుతుంది. దీనిపై DOGE (Department of Government Efficiency) గట్టిగా పరిశీలన చేయాలి. ఇది పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసే అవకాశం! అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన భారీ ఖర్చుల బిల్లు(One Big, Beautiful Bill)పై ఎలాన్ మస్క్ మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంతోనే ఆయన డోజ్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అయితే మస్క్ ఎంతగా విమర్శించినప్పటికీ.. ట్రంప్ మాత్రం మస్క్ మంచి స్నేహితుడనే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో.. బిల్లు గనుక ఆమోదం పొందితే ఆ మర్నాడే తాను రాజకీయ పార్టీని ప్రకటిస్తానని మస్క్ తాజాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ట్రంప్ కూడా ఇప్పుడు ఘాటుగా స్పందించడం మొదలుపెట్టారు. ట్రంప్ రెండో దఫా అధ్యక్ష విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్రే పోషించారు. ఆ ఎన్నికల సమయంలో దాదాపు $300 మిలియన్ల విరాళాలు ఇచ్చారు. కానీ బిల్లు కారణంగా ఇప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే మస్క్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. -
అదే జరిగితే.. రేపే కొత్త పార్టీ పెడతా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నితుడిగా, రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. ఇప్పుడు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బ్యూటీఫుల్ బిల్పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదొక పిచ్చి ఖర్చు అని, పన్ను చెల్లింపుదారులకు భారంగా మారుతుందని అన్నారాయన. అలాగే పార్టీ ఏర్పాటుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.వాషింగ్టన్: గతంలో ట్రంప్కు మద్దతుగా నిలిచిన మస్క్.. తన ఎక్స్ వేదికగా అదే వ్యక్తి పాలనా విధానాలను వరుస పోస్టులతో తిట్టిపోస్తున్నారు. ట్రంప్ ప్రతిపాదిత బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై మరోసారి స్పందిస్తూ..ఈ బిల్లు సాధారణ అమెరికన్లకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుపైనా ఆయన కీలక ప్రకటన చేశారు. ఖర్చులను తగ్గిస్తామని చెప్పిన రిపబ్లికన్ నాయకులు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతు ఇస్తున్నారు. అమెరికా సెనేట్లో ప్రస్తుతం ఓట్ల పోరు కొనసాగుతోంది. రిపబ్లికన్లు ట్రంప్ రెండో పదవీకాలానికి కీలకమైన ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదితమైతే, ప్రజల కోసం నిజంగా పనిచేసే కొత్త రాజకీయ పార్టీ అమెరికా పార్టీని రేపే స్థాపిస్తానంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ట్రంప్ కోసం 250 మిలియన్ డాలర్లతో మద్దతు ప్రచారం నిర్వహించిన మస్క్.. ట్రంప్ ప్రతిపాదించిన బిల్లు అమెరికన్లకు తీవ్ర నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయం తొలి నుంచి వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుతో జరిగే పిచ్చి ఖర్చు స్పష్టంగా చూపిస్తోంది. ఇది దేశపు అప్పు పరిమితిని రికార్డు స్థాయిలో ఐదు ట్రిలియన్ డాలర్ల వరకు పెంచుతోంది. ప్రజల గురించి నిజంగా పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన సమయం వచ్చింది. అంటూ ఎక్స్ ఖతాలో పోస్ట్ చేశారాయన. తద్వారా.. మస్క్ ప్రస్తుత అమెరికా రాజకీయ వ్యవస్థపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. అమెరికా సెనేట్ ప్రస్తుతం ట్రంప్ ప్రతిపాదించిన "One Big, Beautiful Bill" పై ఓట్ల పోరులో నిమగ్నమై ఉంది. ఈ బిల్లును జూలై 4 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆమోదించాలనే లక్ష్యంతో రిపబ్లికన్లు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలుహౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ గత నెలలో ఈ బిల్లును తక్కువ మెజారిటీతో ఆమోదించింది.ఇప్పుడు సెనేట్ తమ సవరణలతో కూడిన బిల్లును తుది రూపంలోకి తీసుకురావాల్సి ఉంది.ఆ తర్వాత హౌస్ మళ్లీ ఆ సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ బిల్లు చట్టంగా మారేందుకు అధ్యక్షుడి సంతకం కోసం పంపబడుతుంది. ఈ బిల్లులో..సరిహద్దు భద్రత, రక్షణ, శక్తి ఉత్పత్తికి భారీ ఖర్చులు ప్రతిపాదించబడ్డాయి. అయితే ఆరోగ్య సంరక్షణ, పోషకాహార కార్యక్రమాలపై ఖర్చులను తగ్గించనున్నారు.అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా ప్రకారం, ఈ బిల్లు వచ్చే దశాబ్దంలో దాదాపు $3.3 ట్రిలియన్ డాలర్ల లోటును కలిగించనుంది. -
కిరికిరి మొదటికి వచ్చింది .. మరోసారి బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ విమర్శలు
వాషింగ్టన్: అపరకుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఏడాది ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసేలా దిశగా దాదాపు చర్చకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 1,000 పేజీల ప్రతిపాదనను సిద్దం చేసింది. ఈ తరుణంలో.. ఆ బిల్లు అవివేకం, విధ్వంసకరం’ అని మస్క్ అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా మస్క్ ట్వీట్ చేశారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను చట్టం చేసే ప్రయత్నంలో ‘బిల్లు డ్రాఫ్ట్’ను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో బిల్లు డ్రాఫ్ట్ను మస్క్ తప్పుబట్టారు. తాజా సెనేట్ డ్రాఫ్ట్ బిల్లు మిలియన్ల మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అధికార రపబ్లికన్ పార్టీ లీడర్లకు ఇదే నా హెచ్చరిక. బిల్లు చట్టంగా మారిస్తే విధ్వంసం సృష్టించినట్లే. అంతేకాదు, చట్టం అమలైతే ఇప్పటికే స్థాపించిన పరిశ్రమలు, ప్రారంభించబోయే పరిశ్రమలకు రానున్న రోజుల్లో అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా హౌస్లో ప్రవేశపెట్టిన బిల్లును మస్క్ వ్యతిరేకించారు. ఆబిల్లుకు ఆమోదం లభించడంతో టెస్లా విలువ భారీగా పతనమైంది. నాటి నుంచి గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ల మధ్య వైరం మొదలైంది. దుబారా ఖర్చుల్ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (doge) సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వరుసగా ట్రంప్ తీరును బహిరంగంగా ఎండగడుతూ వచ్చారు. ఒకానొక దశలో నేను ప్రచారం చేయకపోతే రిపబ్లికన్ అధికారంలోకి వచ్చేదే కాదు. ఆ పార్టీ నేతలు 50కే పరిమితమయ్యేదని వ్యాఖ్యానించారు. ఎప్సిటీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ బాంబు పేల్చారు. అందుకే ఎప్సిటీన్ ఫైళ్లను బహిర్గతం చేయటం లేదంటూ ట్రంప్పై సంచలన ఆరోపణలు చేశారు. The latest Senate draft bill will destroy millions of jobs in America and cause immense strategic harm to our country!Utterly insane and destructive. It gives handouts to industries of the past while severely damaging industries of the future. https://t.co/TZ9w1g7zHF— Elon Musk (@elonmusk) June 28, 2025ట్రంప్ సైతం మస్క్ను అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. మస్క్ తీరు ఇలాగే కొనసాగితే మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. తాను చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ మస్క్ క్షమాపణలు చెప్పారు. అనూహ్యంగా మళ్లీ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను వ్యతిరేకిస్తూ కామెంట్లు పెట్టారు. మరి ఈ కామెంట్లకు ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
ప్లాంటుపై టెస్లాకు ఆసక్తి లేదు
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు భారత్లో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడంపై పెద్దగా ఆసక్తి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి పునరుద్ఘాటించారు. ఇక్కడ తమ కార్ల విక్రయాల కోసం షోరూమ్లను తెరవడంపై మాత్రమే కంపెనీ ఆసక్తిగా ఉందని చెప్పారు. భారత్లో ఎలక్ట్రిక్ వాహ నాల తయారీపై ఇన్వెస్ట్ చేసే సంస్థలకు దిగుమతి సుంకాలపరంగా ప్రోత్సాహకాలిచ్చే స్కీమునకు సంబంధించి పోర్టల్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అక్టోబర్ 21 వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుంది. అవసరాన్ని బట్టి 2026 మార్చి 15 వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు భారీ పరిశ్రమల శాఖ అప్లికేషన్ విండోను తిరిగి ప్రారంభించవచ్చు. 4–5 వాహన కంపెనీలు ఈ పథకంపై ప్రాథమికంగా ఆసక్తి కనపర్చాయని, అయితే వాస్తవంగా ఎన్ని దరఖాస్తులు వస్తాయనేది వేచి చూడాల్సి ఉంటుందన్నారు. స్కీములో పాలుపంచుకోవాలంటూ జర్మనీ, అమెరికా, బ్రిటన్ తదితర అన్ని దేశాల వాహన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామని.. అయితే చైనా, పాకిస్తాన్లాంటి పొరు గు దేశాల సంస్థలకు ఆంక్షలు వర్తిస్తాయన్నారు. కొత్త ఈవీ పథకం ప్రకారం, భారత్లో తయారీపై రూ. 4,150 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే వాహన సంస్థలు, 15% సుంకానికే 8,000 వరకు వాహనాలను దిగుమతి చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ సుంకాలు 70–100 శాతం వరకు ఉంటున్నాయి. -
తనను తాను డెలివరీ చేసుకుంది!
కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీకి సరికొత్త నిదర్శనం ఇది.. సైన్స్ ఫిక్షన్ సినిమాను పోలిన సన్నివేశం ఇది.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వస్తువు చిటికెలో డోర్ డెలివరీ అవుతున్నట్లుగా ఒక కొత్త టెస్లా కారు ఫ్యాక్టరీ నుంచి స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కస్టమర్ ఇంటికి వచ్చేసింది! హైవేపై సాఫీగా మందుకు కదులుతూ.. మధ్యమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగుతూ.. గరిష్టంగా 115 కి.మీ. వేగంతో దూసుకెళ్తూ తన కొత్త ఓనర్ ఉన్న లొకేషన్కు భద్రంగా చేరుకుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా తమ కొత్త కారును నేరుగా వినియోగదారుడి చెంతకు చేర్చింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నడిచే పూర్తిస్థాయి అటానమస్ కారు ‘మోడల్ వై’ను టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్ ఇంటికి పంపించింది. మార్గమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్లు, ఫ్లైఓవర్లు, హైవేలను దాటుకుంటూ కారు తన కొత్త యజమాని ఇంటికి చేరుకుంది. ఫ్యాక్టరీ నుంచి గమ్యస్థానం చేరుకొనే వరకు కారు సాగించిన ప్రయాణాన్ని అందులోని ‘డాష్ క్యామ్’రికార్డు చేసింది. ఇందుకు సంబంధించి టెస్లా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు తమ అటానమస్ కారు డెలివరీని ఎలాన్ మస్క్ ‘ఎక్స్’వేదికగా ప్రకటించారు. ‘తొలిసారి ఒక కారు యజమానికి తనను తాను డెలివరీ చేసుకుంది’అని పేర్కొన్నారు. నిర్ణీత గడువుకన్నా ఒక రోజు ముందే కారును డెలివరీ చేశామన్నారు. తనకు తెలిసినంత వరకు వాహనంలో వ్యక్తులెవరూ లేకుండా లేదా రిమోట్ ఆపరేటింగ్ లేకుండా ఒక పబ్లిక్ హైవేపై ప్రయాణించిన తొలి పూర్తిస్థాయి అటానమస్ కారు తమదేనన్నారు. ఈ విజయాన్ని సాధించినందుకు టెస్లా సాఫ్ట్వేర్, ఏఐ చిప్ డిజైన్ బృందాలను ఆయన అభినందించారు. మోడల్ వై కారు గంటకు గరిష్టంగా 115 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు టెస్లా ఏఐ, ఆటోపైలట్ విభాగం చీఫ్ అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
కాలం కలిసొచ్చింది... కారు నడిచొచ్చింది!
‘‘కలిసొచ్చే కాలానికి... నడిచొచ్చే కొడుకు పుడతాడంట!’’ పాతకాలపు సామెత. ఈ టెక్నాలజీ యుగంలో ఈ పప్పులేమీ ఉడకవు. కానీ.. డబ్బులు ఉంటే షోరూమ్కు వెళ్లి బోలెడన్ని పత్రాలపై సంతకాలు పెట్టి డ్రైవింగ్ వస్తే సొంతంగా.. లేదంటే అద్దెడ్రైవర్ను పెట్టుకుని మరీ తెచ్చుకోవాల్సిన కారు మాత్రం ఇప్పుడు దానంతట అదే నడిచొస్తుంది!. విషయం ఏమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది!.. ఎలాన్ మస్క్ సృష్టించిన అద్భుతం డ్రైవర్లెస్ కారు మొట్టమొదటిసారి కొనుగోలుదారు ఇంటి వద్దకు వచ్చేసింది. ఈ విషయాన్నే టెస్లా కార్ల కంపెనీ యజమాని ఈలాన్ మస్క్ గర్వంగా తన ‘ఎక్స్’ ప్లాట్ఫామ్పై పంచుకున్నారు కూడా. ఎలాంటి మానవ సాయం, జోక్యం లేకుండా.. టెక్సస్లోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో తయారైన ‘మోడల్ వై’ కారు స్థానికంగా కొనుగోలుదారు వద్దకు గంటకు 72 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ వచ్చిందన్నమాట. First time that a car has delivered itself to its owner! https://t.co/xgZBRDaMiX— Elon Musk (@elonmusk) June 28, 2025పైగా... అనుకున్నదాని కంటే ఒక రోజు ముందుగా ఎలాన్ మస్క్ పుట్టినరోజు నాడే ఈ కారు డెలివరీ కావడం ఒక విశేషం. ఆటోమొబైల్ రంగ చరిత్రలో ఇదో చిరస్మరణీయ ఘట్టం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. డ్రైవర్ల అవసరం లేని వాహనాలతో క్యాబ్లు నడపాలన్న మస్క్ ఆలోచనలు వాస్తవమయ్యే దిశగా ఇంకో ముందడుగూ పడిందన్నమాట!. మోడల్ వై గురించి క్లుప్తంగా..2020లో లాంచ్ అయిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇది. టెస్లా మోడల్ త్రీ ప్లాట్ఫామ్పై నిర్మించారు. ఐదుగురు కూర్చోగలరు. కొన్ని ప్రాంతాల్లో ఏడు సీట్లు ఉన్న వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. టెక్సస్లోని ఆస్టిన్ ప్రాంతం ఫ్రీమాంట్లోని టెస్లా గిగాఫ్యాక్టరీతోపాటు షాంఘై, బెర్లిన్లలో ఈ మోడల్ వై కార్లు తయారవుతున్నాయి. వేరియంట్ను బట్టి 60 - 81 కిలోవాట్ హవర్ల బ్యాటరీతో నడుస్తుంది. లిథియం అయాన్ ఫాస్పే్ట్ (ఎల్ఎఫ్పీ), నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (ఎన్ఎంసీ) బ్యాటరీలతో లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే వేరియంట్ను బట్టి 320 నుంచి 330 మైళ్ల దూరం ప్రయాణించగలదు. పావుగంటలోనే 180 మైళ్ల దూరం ప్రయాణించగలిగేంత విద్యుత్తును ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 5.4 సెకన్లలోనే 60 మైళ్ల వేగాన్ని అందుకోగల శక్తి దీని సొంతం. గరిష్ట వేగం గంటకు 155 మైళ్లు! వాహనం లోపలి విశేషాల గురించి చూస్తే.. 15.4 అంగుళాల విశాలమైన టచ్స్ట్రీన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్లు ఉంటాయి. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వేరియంట్ను కొనుక్కోవచ్చు. లేదంటే కొన్ని పరిమితమైన ఫీచర్లతో డ్రైవింగ్ అవసరాన్ని తగ్గించేవి లభిస్తాయి. తెల్లగీతల మధ్య మాత్రమే ప్రయాణించడం, అడాప్టివ్ క్రూయిజ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివి అన్నమాట. అత్యాధునిక ఆడియో సిస్టమ్ ఉండనే ఉంది. భద్రత విషయానికి వస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది. చివరిగా ధరల గురించి... రకాన్ని బట్టి 39.3 లక్షల రూపాయలు (46000 డాలర్లు) నుంచి 41.01 లక్షల రూపాయలు (48,000 డాలర్లు) వరకూ ఉంటుంది.::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ కార్లను భారత్లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలోనే ముంబయిలో షోరూమ్ ప్రారంభించనున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. యూరప్, చైనా వ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలు ఇటీవల క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్, మస్క్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో టెస్లా షేర్లు మరింత దిగజారాయి. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని తెలిసిన క్షణం నుంచి కొంత కాలంపాటు టెస్లా అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఇటీవల ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరడంతో అమ్మకాలు డీలా పడ్డాయి. దాంతోపాటు చైనాలోనూ టారిఫ్ భయాలతో టెస్లా అమ్మకాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్కు భారత్ భారీ మార్కెట్గా తోస్తుంది. ఇప్పటికే దేశంలో టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.యూరప్, చైనాల్లో అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో టెస్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్లో తన కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా టెస్లా వచ్చే నెలలో ముంబయిలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించనుందని బ్లూమ్బర్గ్ తెలిపింది. ముంబయిలో షోరూమ్ ప్రారంభించిన కొద్ది రోజులకు ఢిల్లీలో షోరూమ్ ఓపెన్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెస్లా కంపెనీ అమెరికా, చైనా, నెదర్లాండ్స్ నుంచి సూపర్ ఛార్జర్ కాంపోనెంట్స్, కార్ యాక్సెసరీస్, మర్కండైజ్, విడిభాగాలను దిగుమతి చేసుకుందని బ్లూమ్బర్గ్ పేర్కొంది.ఇదీ చదవండి: రత్నాభరణాల ఎగుమతులు డౌన్టెస్లా చైనా ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై రేర్-వీల్-డ్రైవ్ ఎస్యూవీలు భారతదేశానికి చేరుకున్నాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు బ్లూమ్బర్గ్కు తెలిపారు. మోడల్ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఎలాన్ మస్క్ ఫిబ్రవరిలో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత టెస్లాను భారతదేశానికి తీసుకురావడంలో పురోగతి వచ్చింది. గతంలో దేశీయ టారిఫ్లు, స్థానిక తయారీపై మస్క్ విభేదించడంతో భారత్లో కంపెనీ ప్రవేశంపై ఏళ్ల తరబడి నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. -
ఫైనాన్షియల్ సెక్టార్పై మస్క్ కన్ను
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్పై కన్నేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఎక్స్ యూజర్లు ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్మెంట్.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!‘వీసా’తో ఒప్పందంవీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్ ప్లాట్ఫామ్ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీగా పిలిచే ఈ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు. -
ఇండియాలో స్టార్లింక్ సేవలకు డేట్ఫిక్స్?
ఎలాన్మస్క్కు చెందిన స్టార్లింక్ మరో రెండు నెలల్లో భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామం భారతదేశం డిజిటల్ అంతరాన్ని, ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు తోడ్పడుతుందని కొందరు భావిస్తున్నారు.సమస్యలకు పరిష్కారం..స్టార్లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం చాలా కాలంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్న కమ్యూనిటీలకు పరిష్కారాన్ని అందిస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఫైబర్ ఆప్టిక్ లేదా సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ల మాదిరిగా కాకుండా స్టార్లింక్లో లో-ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ) ఉపగ్రహాల ద్వారా పనిచేస్తుంది. ఇది చాలా మారుమూల ప్రాంతాల్లో నిరంతర ఇంటర్నెట్ కనెక్టివిటీని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం 4,000 స్టార్లింక్ ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి.ఇదీ చదవండి: ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ!ఇండియాలో స్టార్లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్వేర్కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. -
అమెరికా బడ్జెట్ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!
అమెరికా బడ్జెట్ లోటుతో సతమతమవుతోంది. ఏటా వసూళ్లు చేసే ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తోంది. యూఎస్ జాతీయ రుణం జూన్ 2025 నాటికి 33.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంక్షోభం మధ్య దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ విప్లవాత్మక ఆలోచనను పంచుకున్నారు. అందుకు ప్రముఖుల మద్దతు లభిస్తుంది. యూఎస్ ఆర్థిక లోపాలను సరిచేసేందుకు సీఎన్బీసీ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ పరిష్కారాన్ని ప్రతిపాదించారు.‘నేను అమెరికా ఆర్థిక లోటును ఐదు నిమిషాల్లో ముగించగలను. జీడీపీలో 3 శాతం కంటే ఎక్కువ లోటు ఉంటే కాంగ్రెస్ సిట్టింగ్ సభ్యులందరూ తిరిగి ఎన్నిక కావడానికి అనర్హులని చట్టం చేస్తే సరిపోతుంది’ అని వారెన్ బఫెట్ అన్నారు. ఈ క్లిప్ వైరల్ కావడంతో వాషింగ్టన్లో తీవ్ర చర్చ మొదలైంది. ఉటా సెనేటర్ మైక్ లీ ఈ వీడియోను ఎక్స్లో తిరిగి పోస్ట్ చేశారు. ‘మీరు ఈ ఆలోచనలకు మద్దతు ఇస్తారా?’ అని టెస్లా సీఈఓ ఎలాన్మస్క్ను అడిగారు. దాంతో మస్క్ 100 శాతం మద్దతు తెలుపుతానని, ఇదే మార్గమని చెప్పారు.ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్ఆర్థికవేత్త పీటర్ షిఫ్ స్పందిస్తూ..‘వారెన్ బఫెట్ ఆలోచనలు బ్రూటల్.. కానీ బ్రిలియంట్. ద్రవ్యోల్బణం 3% దాటినప్పుడల్లా కాంగ్రెస్లోని ప్రతి సభ్యుడిని తొలగించడానికి నేను రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తున్నాను. ఒక దేశం మొత్తం ద్రవ్యోల్బణం ముసుగులో బాధపడటం కంటే రాజకీయ నాయకులను అనర్హులుగా ప్రకటించడం మంచిది’ అని తెలిపారు. -
మస్క్ ‘కాల్పుల విరమణ’!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో డోనాల్డ్ ట్రంప్ వెనుకనో, పక్కనో అంతెత్తు గెంతుతూ... ఆయన అధ్యక్షుడయ్యాక తరచుగా వైట్ హౌస్కు సంతాన సమేతంగా వస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్ నాలుగు రోజులపాటు ట్రంప్తో బహిరంగ యుద్ధానికి దిగి, ఇంతలోనే బుధవారం నాడు దానికి శుభం కార్డు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తరచు ఒకటిగానే కనబడే రాజ్యశక్తి, ధనశక్తి నిజంగా కొట్లాటకు దిగితే చివరాఖరికి రాజ్యశక్తిదే పైచేయి అవుతుందని ఈ స్వల్పకాల ఉపాఖ్యానం నిరూపించింది. అధికారంలోకొచ్చినప్పటి నుంచీ ట్రంప్కు దాదాపు ప్రతిపక్షం లేదు. ఆయన పాలనపై ఓ కన్నేసి ఉంచాల్సిన అమెరికన్ కాంగ్రెస్ నిరాసక్తంగా ఉంది. వలస విధానం అంశంలో కోర్టులు కాదంటున్నా పంతం నెగ్గించుకుంటున్నారు. ఒకటి రెండు మినహా మిగిలిన విశ్వవిద్యాలయాలు ఆయనకు తలొంచాయి. మీడియా సరేసరి. పర్యవసానంగా ఆయన తలచుకున్నదే ధర్మం, ఆయన అమలుచేసేదే న్యాయం! మన పురాణాల్లో వైరభక్తి అనేది ఒకటుంది. శాపవశాత్తూ శ్రీమహావిష్ణువుకు దూరం కావాల్సివచ్చిన ద్వారపాలకులు జయవిజ యులు... సత్వర శాపవిమోచనకు ఆయనతో మూడు జన్మల్లో వైరానికి దిగి, ఆయన చేతుల్లోనే హతమారి తిరిగి చేరువవుతారు. ట్రంప్–మస్క్ వైరం నిండా నెల్లాళ్లయినా కొనసాగలేదు. ట్రంప్–మస్క్ల బంధం ఏడాది క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. మస్క్ తన దారిన తాను ‘ఇన్నొవేషన్ గురు’ అనిపించుకుంటూ ప్రయోగాలు చేశారు. భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే అని నమ్మి ఖరీదైన టెస్లా కారును ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ట్విటర్ను కొన్నాడు. ఈ భూమికి భవిష్యత్తు లేదని, అంగారకుడిపై ఆవాసాలు నిర్మించుకోవటమే ప్రత్యా మ్నాయమని అందరి చెవుల్లో హోరెత్తుతూ నిజమేనని భ్రమింపజేస్తున్నాడు. ఈలోగా హైపర్లూప్ రైళ్ల ఆలోచనను వదిలారు. ఇంతలో డెమాక్రటిక్ పార్టీ పెద్దలతో, ముఖ్యంగా మొన్న అధ్యక్ష ఎన్ని కల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కమలా హ్యారిస్తో తేడా వచ్చింది. తాను భారీగా విరాళాలి చ్చినా తన కొత్త సాంకేతికతలను నిర్లక్ష్యం చేశారని అలిగాడు. అంతే... ఉదారవాదానికి స్వస్తిపలికి నిరుడు మితవాది ట్రంప్కు చేరువయ్యాడు. ఆయన ప్రచార సభలకైన వ్యయంలో అత్యధిక వాటా మస్క్దే. దాదాపు 30 కోట్ల డాలర్ల విరాళం ఇవ్వటమే కాదు... వచ్చే ఏడాది నవంబర్లో 435 స్థానా లుండే ప్రతినిధుల సభకు జరగబోయే ఎన్నికలకు 10 కోట్ల డాలర్లు ఇవ్వటానికి వాగ్దానం చేశాడు. ట్రంప్–మస్క్ల మైత్రి ఉభయతారకమైనది. ట్రంప్కు సొంతంగా ఉన్న సామాజిక మాధ్యమం ట్రూత్, మస్క్ నేతృత్వంలోని ఎక్స్ ఒక్కటై అమెరికా ప్రజానీకాన్ని తమ దారికి మళ్లించుకోవటంలో కృతకృత్యులయ్యారు. డెమాక్రటిక్ పార్టీ ప్రచార లోపాలు కూడా తోడవటంతో అవలీలగా ట్రంప్ విజయం సాధించారు. అధికారంలోకొచ్చాక ప్రభుత్వోద్యోగులను సాగనంపే డోజ్లో కీలకపాత్ర పోషించాలని మస్క్ ఉబలాటపడినా అది కాస్తా వివేక్ రామస్వామికి పోయింది. ‘ఉరితీతలు కాదు... ఊచకోతలే’ అంటూ భారీయెత్తున సిబ్బందిని కత్తిరిస్తానని చెప్పిన మస్క్కు అది నిరాశ కలిగించినా, త్వరలోనే వివేక్ నిష్క్రమించేలా చేయగలిగారు. తనకు సన్నిహితుడైన జేర్డ్ ఐజాక్ మాన్కు అంతరిక్ష సంస్థ నాసా బాధ్యతలు అప్పగించాలన్నది మస్క్ ఆకాంక్ష. అదే జరిగితే సొంత సంస్థ స్పేస్ ఎక్స్కు నాసాను తాకట్టుపెడతాడన్న భయం ట్రంప్కు లోలోన ఉంది. ఈ సంగతి అర్థమైన నాటినుంచీ మస్క్ రగిలిపోయారు. పర్యవసానంగా ట్రంప్ అత్యద్భుతమని ప్రకటించిన పన్ను కోతల బిల్లును ఆయన తప్పుబట్టారు. ఒకపక్క తాను ప్రభుత్వ సిబ్బందిని సాగనంపి ఖజానా కళకళల్లాడేలా చేస్తుంటే, ప్రభుత్వ రుణభారాన్ని మరో 3 లక్షల కోట్ల డాలర్లకు పెంచే పన్నుల తగ్గింపేమిటన్నది మస్క్ ప్రశ్న. తన కాంట్రాక్టు ముగిశాక మొదటగా ఆయన దీన్నే ఎత్తు కున్నారు. తనతో ఇన్నాళ్లూ కలిసిమెలిసి తిరిగి, మొదటినుంచీ ఈ బిల్లుపై అవగాహన ఉన్న మస్క్ ఇలా విమర్శించే సరికి ట్రంప్ ఆగ్రహం పట్టలేకపోయారు. ఆ తర్వాత జరిగిందంతా బహిరంగ యుద్ధం! వచ్చేసారి ఎన్నికల్లో డెమాక్రాట్లకు ఆర్థిక సాయం అందిస్తానన్న బెదిరింపు మొదలుకొని బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎపిస్టిన్తో ట్రంప్కు గల సంబంధాలు బయటపెడతాననేవరకూ మస్క్ మాటలు జారారు. ప్రతిగా స్పేస్ ఎక్స్ కాంట్రాక్టులు రద్దుచేస్తానని, ఇవ్వబోయే కాంట్రాక్టులు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజన్కూ, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ ఉమ్మడి భాగస్వామ్య సంస్థ యునైటెడ్ లాంచ్ అలయెన్స్కూ కట్టబెడతానని ట్రంప్ బెదిరించారు. డెమాక్రాట్లకు విరాళమిస్తే పర్యవసానాలెలా ఉంటాయో చూపిస్తానని హెచ్చరించారు. తీరిగ్గా లెక్కలేసుకున్నాక ఈ కయ్యం వల్ల కలిసొచ్చేదేమీ లేదని మస్క్ గ్రహించినట్టున్నారు. ‘కాల్పుల విరమణ’ ప్రకటించటంతోపాటు ‘సారీ’ చెప్పారు. ఏడాది నుంచి అవిభక్త కవలల్లా ఎక్కడికెళ్లినా జంటగా పోతూ, మస్క్ను ‘సహ అధ్యక్షుడు’ అని అందరూ వేళాకోళం చేసేలా వ్యవహరించిన వీరిద్దరూ మునుపటి మాదిరే మళ్లీ సన్నిహితులవుతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. హృదయం అద్దం లాంటిది, పగిలితే అతకదంటారు. కనుక చెలిమి చిగురించినా మునుపటి స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ ఈ ఉపాఖ్యానంలో ప్రపంచ ప్రజానీకం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటుంది. వ్యక్తులైనా, పార్టీలైనా పరస్పరం లాభదాయకం, పంపకాలు బాగుంటాయనుకుంటే కూటములు కడతారు తప్ప, తమను ఉద్ధరించటం కోసం కాదని వారు గ్రహించాలి. -
ఈ అశక్తతలు దేనికి చిహ్నం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి వరుసగా కనిపిస్తున్న అశక్తతలు దేనికి చిహ్నం? ఆయన జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ 140 రోజులలో ప్రకటించిన విధానాలను, తీసు కున్న చర్యలను, వాటి పర్యవసానాలను పరిశీలించినప్పుడు, వాటిలో దాదాపు అన్నింటా తన అశక్తతలే కనిపిస్తాయి. మరొక మాటలో వైఫల్యాలు. అయితే ఆ అశక్తతలు, వైఫల్యాలు వ్యక్తిగతంగా ట్రంప్కు పరిమితమైనవా, లేక అమెరికా మహా సామ్రాజ్యమే క్రమంగా బలహీనపడుతున్న స్థితికి సంకేతాలా అన్నది ఆలోచించవలసిన విషయం. ఒకవేళ ట్రంప్కు పరిమితమైన స్థితి అయితే ఇంకా మిగిలిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అందుకు సవరణలు చేసుకోగల అవకాశం ఉంటుంది. అవి ఆ వ్యవస్థకే మౌలిక బలహీనతలు అయ్యే పక్షంలో సవరణలు తన కాలంలో సాధ్యపడకపోగా, ఆ తర్వాత రాగల అధ్యక్షులకు కూడా అతి పెద్ద పరీక్షలు ఎదురవుతాయి.తగిన భావజాలం ఏది?విధానాలు, చర్యలలో అంతర్గతం, విదేశీయం అని రెండు ఉంటాయి. ఎప్పుడైనా విదేశాంగ విధానాలు అంతర్గత ప్రయోజనాల కోసమేనన్నది తెలిసిందే. ఆ విధంగా చూసినపుడు ట్రంప్ విధానాలకు ఆధారమైనవి ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా), ‘అమెరికా ఫస్ట్’ నినాదాలు. వీటిలో ప్రతిఫలించే ఆలోచన అమెరికా తన ఒకప్పటి గొప్పతనాన్ని కోల్పోయిందని! అందుకు బాధ్యత డెమోక్రాట్ల పరిపాలన అని! అమెరికా విధానాల వల్ల అమెరికన్ ధనిక వర్గాలు, ఇతర దేశాలు విపరీతంగా లాభపడుతుండగా సామాన్యులు నష్టపోతూ అమెరికా వెనుకబడుతున్నదనీ; సామాన్యులు, అలాగే తమ దేశం బాగుపడే విధానాల వల్లనే తిరిగి ‘అమెరికా ఫస్ట్’ కాగల దన్నది ఆయన తర్కం.ఇది యథాతథంగా సహేతుకమైన, ఆహ్వానించదగిన తర్కంగానే కనిపిస్తుంది. కానీ మొదటి నుంచి డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా అనుసరిస్తూ వచ్చిన పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విధానాలను, వాటి ఆధారంగా నిర్మితమైన వ్యవస్థను రద్దు చేయటం కాకున్నా ఒక మేర సవరించాలన్నా మామూలు విషయం కాదు. రద్దు చేయాలన్నది ట్రంప్ ఆలోచన ఎంతమాత్రం కాదు. అంతర్గతంగా, విదేశీయంగా కొన్ని మార్పులు చేయాలని మాత్రం అనుకున్నట్లు ఆయన మాటలు, చేతలు సూచించాయి. ఆ కొద్దిపాటి మార్పులకైనా తగిన ఫిలసాఫికల్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. కానీ ట్రంప్ ప్రధానంగా ఉద్వేగాల వ్యక్తి. ఉద్వేగతలకు లోతు ఉండదు, చంచలత ఉంటుంది.అమెరికా మహా సామ్రాజ్యపు శక్తి ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడటం ఈ 21వ శతాబ్దపు ఆరంభం నుంచే నెమ్మదిగా మొదలై, 2008 నాటి ఆర్థిక సంక్షోభంతో వేగం అందుకున్నది. అమెరికా ‘గ్రేట్నెస్’ పోవటమని ట్రంప్ అన్నదానికి ఆరంభాలు అప్పటి దశాబ్దం నుంచే కనిపిస్తాయి. అమెరికా బలాలు నాలుగింటిలో ఆర్థికం, రాజకీయం రెండు గాక, సైనికం, శాస్త్ర – సాంకేతికం మరొక రెండు. ఈ చివరి రెండింటిలో అమెరికా శక్తి ఆర్థిక, రాజ కీయాలవలె తగ్గలేదు గానీ, ఆ రెండు రంగాలలో ఇతరుల నుంచి పోటీలు పెరగసాగాయి. అనగా అమెరికాకు అవి పరోక్ష బలహీనత లన్నమాట. దెబ్బకొట్టిన నిర్ణయాలుట్రంప్ తమ దేశాన్ని మళ్లీ ‘గొప్పది’ చేయదలచుకుంటే, ఈ నాలుగు బలహీనతలను ఆపటం ఏ విధంగాననే సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. ఒకవేళ ఉన్నా కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఎదుర వుతాయి. వాటిలో మొదటిది–చరిత్రలో ఏ సామ్రాజ్యాలూ శాశ్వతంగా నిలవనపుడు అమెరికా అందుకు భిన్నం కాగలదా అన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, పార్టీలకు, ప్రభుత్వాలకు స్వీయ ప్రయోజ నాల స్పృహలు పెరుగుతూ, ఎవరి దారులు వారు వెతుక్కుంటూ, వాటిలో కొన్ని గణనీయంగా అభివృద్ధి చెందుతూ, అమెరికా, యూరప్ల పట్ల గత విధేయతలు బలహీనపడుతూ, బహుళ ధ్రువ ప్రపంచం క్రమంగా ఆవిష్కారమవుతున్నపుడు, అమెరికాకు గానీ, అమెరికన్ కూటమికి గానీ ఒకప్పటి ‘గొప్పతనం’ తిరిగి ఎట్లా సాధ్యమన్నది మరొక ప్రశ్న. అంతెందుకు, ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాము అధికారానికి వచ్చిన కొత్తలోనే, ‘ఏకధ్రువ ప్రపంచమన్నది గతించిన విషయ’మన్నారు.ఈ విధమైన బలహీనతలు అర్థమవుతూ, అదే సమయంలో అమెరికాను కనీసం ఉన్న స్థాయిలో నిలబెట్టాలని, అట్లాగే అక్కడి సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా రూపొందించాలని కొత్త అధ్యక్షుడు భావించితే, అందులో ప్రశంసించదగినదే తప్ప కొట్టివేయ వలసింది ఉండదు. ఆ విధంగా ఆయన ఒక వాస్తవవాది అను కోవాలి. అందుకు తగిన ఆచరణ ఏమిటన్నది అసలు ప్రశ్న. దిగుమతి సుంకాలను అన్ని దేశాలపై పెంచితే ఆదాయం భారీగా పెరిగి వాణిజ్య లోటు, ద్రవ్యలోటు, అప్పులు తగ్గుతాయనీ, ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చుననీ భావించారు. అందుకు తోడుగా అనేక రూపాలలో వ్యయ నియంత్రణ చేయ బూనారు. ఉద్యోగాల కోత, విదేశీ సహాయాల ఆపివేత వంటివి అందులో ఉన్నాయి. వీటన్నింటిలో ముఖ్యమైన సుంకాల హెచ్చింపు వెంటనే గందరగోళంలో పడింది. ఉద్యోగాల కోత తీవ్రమైన వ్యతి రేకతను తెచ్చిపెట్టింది. స్టాక్ మార్కెట్లు వరుసగా దెబ్బతినగా,బాండ్ల మార్కెట్ ఎదురుతిరిగి, డాలర్ విలువ పడిపోవటం మొదలైంది. అమెరికా ప్రజలకు, పరిశ్రమలకు అవసరమైన వాటిపై ఇతర దేశాలు ఎదురు సుంకాలు విధించటంతో ధరలు పెరగ సాగాయి. ఈ పరిణామాలతో జంకిన ప్రభుత్వం సుంకాల వాయిదాలు, తగ్గింపులు, చర్చల మార్గానికి మళ్లింది. ఇదే ఇప్పటికీ కొనసా గుతున్నది. ఉద్యోగాల కోత, అక్రమ వలసదారులను భయపెట్టి వేలకు వేలుగా పంపివేయటం వల్ల ఉత్పత్తి, సర్వీస్ రంగాలు దెబ్బ తినటం వెంటనే కనిపించింది. అది గ్రహించి యజమానులకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వబూనినా ఉపయోగం లేకపోయింది. ఉక్రెయిన్ వైఫల్యంఆ విధంగా కొన్ని వారాలు గడిచేసరికి ఆ గందరగోళం స్వదేశంలో, విదేశాలలో కూడా అందరికీ అర్థమై ట్రంప్ పట్ల గౌరవం, భయం తగ్గాయి. పరిపాలనా వ్యవహరణలు అస్తవ్యస్తంగా మారటంతో సన్నిహిత సలహాదారులను తొలగించటం కూడా మొదలైంది. ఎలాన్ మస్క్ ఉదంతం తాజా ఉదాహరణ. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు కొత్తగా వినవస్తున్నది. యూనివర్సిటీలు, విద్యా శాఖ, పరిశోధనా సంస్థలు, ఆరోగ్య రంగాలను వేధిస్తూ అమెరికాను తిరిగి గొప్పదిగా ఎట్లా చేయగలరన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి వేసేందుకు నిజంగానే ప్రయత్నించినా అది ఆగకపోగా తీవ్రమవుతున్నది. దానితో ఆయన చేతులెత్తేశారు. గాజా పట్ల గందరగోళం. నెతన్యాహూ తనను ఏ విషయంలోనూ లెక్క చేయటం లేదు. ఉక్రెయిన్, యూరప్ తమ దారి తాము చూసు కుంటున్నాయి. ఇరాన్ లొంగి రావటం లేదు. సిరియా, లెబనాన్పై దాడుల నిలిపివేతకు నెతన్యాహూ అంగీకరించటం లేదు. చైనాతో పాటు ‘బ్రిక్స్’ దేశాలు ట్రంప్ ఎంత భయపెట్టినా తమ కూటమిని మరింతగా విస్తరిస్తూ, డాలర్కు బదులు తమ స్థానిక కరెన్సీలలో చెల్లింపులను పెంచుతూనే ఉన్నాయి. మౌలిక స్థాయిలో, విస్తృత స్థాయిలో ఈ అమెరికన్ సామ్రాజ్యవాద బలహీనతలు ట్రంప్ ధోరణి వల్ల మరింత పెరుగుతున్నాయి. తన అశక్తతలు ఈ మౌలిక స్థితికి చిహ్నాలవుతున్నాయి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్ దగ్గర ఉద్యోగం.. మస్క్ సంపద మటాష్!
ప్రపంచ టెక్ బిలీయనీర్, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత స్నేహంగా మెలిగారు. ఎన్నికల సమయం నుంచే ట్రంప్నకు మద్దతుగా నిలుస్తూ ఆయన విజయానికి కృషి చేశారు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి సలహాదారుగా నియమితులయ్యాయి. ఆ సమయంలో ఎలాన్ మస్క్ సంపద 25 శాతం అంటే సుమారు 113 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) క్షీణించిందని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది.తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, బహిరంగ అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందిన మస్క్, దూకుడు వ్యయ తగ్గింపు చర్యల ద్వారా ఫెడరల్ వ్యయాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన డోజ్లో కీలక సలహాదారుగా పనిచేశారు. ఇటీవల మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ చొరవ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంది. ట్రంప్ దగ్గర పనిచేసినందుకు ఎలాన్ మస్క్ తగిన మూల్యం చెల్లించుకున్నారని, 25 శాతం సంపద కోల్పోయారని పేర్కొన్న బ్లూమ్బర్గ్ నివేదికను జేడీ వాన్స్ న్యూస్ @JDVanceNewsX అనే ఎక్స్ యూజర్ ఇటీవల షేర్ చేయగా దానికి ఎలాన్ మస్క్ స్పందించారు. నిజమే అన్నట్టుగా ‘వర్త్ ఇట్’ అంటూ కామెంట్ చేశారు.మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో.. ట్రంప్ 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను మస్క్ విమర్శించడం, అభిశంసనకు గురిచేయాలని సూచించడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా, మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను తెంచుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. తన మిత్రపక్షాలతో జరిగిన వ్యక్తిగత చర్చల్లో మస్క్ ను 'పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలకు బానిస'గా ట్రంప్ అభివర్ణించారు. నాసా చీఫ్గా మస్క్ ఎంపిక చేసిన జారెడ్ ఐజాక్మన్ నామినేషన్ను ట్రంప్ వెనక్కి తీసుకోవడం వారి సంబంధాలపై మరింత ఒత్తిడి పెంచింది.Worth it https://t.co/fQk2ULx7jh— Elon Musk (@elonmusk) June 11, 2025 -
మస్క్, అమెరికా ఆర్థిక మంత్రి కొట్టుకున్నారు!
వాషింగ్టన్: అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్, లక్షల కోట్లకు అధిపతి ఎలాన్ మస్క్ మధ్య మాటల మంటలకు మూలకారణమైన ఉదంతం తాజాగా వెలుగు చూసింది. వారి మధ్య సఖ్యత చెడటానికి ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ కారణంగా మారినట్టు ట్రంప్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత ఏప్రిల్లో అధ్యక్ష కార్యాలయంలోని ఓవల్ ఆఫీస్లో భేటీ తర్వాత మస్క్, బిసెంట్ బాహాబాహీకి దిగారట! ట్రంప్ సన్నిహితుడు, పాడ్కాస్టర్ స్టీఫెన్ కె.బ్యానన్ ఈ మేరకు బయటపెట్టారు. వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ, వాళ్ల జీతభత్యాలను ట్రంప్ సర్కార్కు ఆదా చేస్తూ, లక్షల కోట్ల విదేశీ నిధులను నిలిపివేస్తూ ఆర్థిక శాఖపై తాను భారం తగ్గిస్తుంటే ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పేరిట పన్నులను తగ్గించి ఆర్థిక శాఖపై అధ్యక్షుడు భారం పెంచుతున్నారంటూ మస్క్ తీవ్రంగా ఆక్షేపించడం తెలిసిందే. బిసెంట్తో ముష్టిఘాతాల పర్వం వారి మధ్య దూరాన్ని బాగా పెంచేసిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది? ఏప్రిల్ నెల మూడోవారంలో ఓవల్ కార్యాలయంలో ట్రంప్తో భేటీ సందర్భంగా అంతర్గత రెవెన్యూ విభాగ కమిషనర్గా మస్క్, బిసెంట్ చెరో పేరు ప్రతిపాదించారు. బిసెంట్ సూచించిన అభ్యర్థి వైపు ట్రంప్ మొగ్గా రు. అవమానభారంతో వెళ్లిపోతున్న మస్క్తో బిసెంట్ వాగ్వాదానికి దిగారు. అది కాస్తా కొట్లాటకు దారితీసింది. ‘రగ్బీ’ మ్యాచ్ తరహాలో బిసెంట్ను మస్క్ తన భుజంతో ఎత్తి కుదేశాడు. ఇద్దరూ కొట్టుకుంటుండటంతో సిబ్బంది నిలువరించారు. ఇది ట్రంప్కు తెలియడంతో ‘మరీ ఓవర్గా ఉంది’ అన్నారు. అనంతరం మీడియా భేటీ సందర్భంగా మస్క్ ముఖం వాచిపోయి, కళ్లు ఎర్రబారడం కన్పించింది. కొడుకుతో ఆడుతుంటే దెబ్బలు తగిలాయని మస్క్ అప్పట్లో కవర్ చేశారు. -
ట్రంప్ గద్దె దిగడమా, నాన్సెన్స్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వివాదంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. అధ్యక్షునితో తలపడటం ద్వారా ఆయన పెద్ద తప్పిదం చేస్తున్నారన్నారు. ఎప్స్టీన్ లైంగిక కుంభకోణంతో ట్రంప్కు సంబంధముందని, ఆయన గద్దె దిగి వాన్స్ అధ్యక్షుడు కావడం ఖాయమని మస్క్ పేర్కొనడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ‘నాన్సెన్స్’అంటూ వాన్స్ శుక్రవారం కొట్టిపారేశారు. అధ్యక్షునిగా ట్రంప్ అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. ఆయనపై మస్క్ ఆరోపణలను ఖండించారు. ‘‘ఇలాంటి గొడవలు అందరి విషయంలోనూ జరుగుతుంటాయి. అందులోనూ మస్క్ చాలా ఎమోషనల్. కాస్త నెమ్మదించారంటే అంతా సర్దుకుంటుంది. కొంతకాలానికి ఆయనే మా వద్దకు తిరిగొస్తారు’’అని అభిప్రాయపడ్డారు. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుందంటూ చేసిన ఎక్స్ పోస్టులను మస్క్ తాజాగా తొలగించారు. అయితే, ‘ఆ పోస్టులను ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దాచిపెట్టుకోండి’అంటూ భావగర్భితంగా పోస్ట్ చేశారు. మరోవైపు, మస్్కతో తాను మాట్లాడబోతున్నానంటూ వచి్చన వార్తలను ట్రంప్ ఖండించారు. ‘‘ఆ మతి చెడిన మనిíÙతోనా? అలాంటి ఉద్దేశమేదీ నాకు లేదు. నిజానికి మస్కే నాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. నేనే పట్టించుకోలేదు’’అని స్పష్టం చేశారు. అంతేగాక ఆయన కంపెనీలకు ప్రభుత్వం కట్టబెట్టిన కాంట్రాక్టులన్నింటినీ పూర్తిగా సమీక్షిస్తానని ప్రకటించారు. ‘‘అంతా నిబంధనల మేరకే ఉంటే ఓకే. లేదంటే ఏం చేయాలో ఆలోచిస్తాం’’అని స్పష్టం చేశారు. మస్క్ కంపెనీలపై గతంలో జరిగిన విచారణలను తిరగదోడతారా అని ప్రశ్నించగా, ‘‘అలాంటివి జరిగాయా? నాకు తెలియదు. అదే నిజమైతే ఏం జరగాలో అదే జరుగుతుంది’’అంటూ స్పందించారు. ‘‘చైనా, రష్యా, ఇరాన్ వంటి అంతర్జాతీయ అంశాలతో నేనిప్పుడు యమా బిజీగా ఉన్నా. మస్క్ గురించి ఆలోచేంచే తీరిక కూడా లేదు. మస్కే కాదు, ఒక్క నేను తప్ప ఎవరున్నా లేకున్నా అమెరికాకు వచి్చన లోటేమీ లేదు’’అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ డెమొక్రాట్లకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మస్క్ కొత్త పార్టీ! ట్రంప్తో రగడ నేపథ్యంలో మస్క్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్టు కని్పస్తోంది. 80 శాతం మంది అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందంటూ ఎక్స్లో ఆయన ఒపీనియన్ పోల్ పెట్టడం తెలిసిందే. దాన్ని 80 శాతం మంది సమరి్థంచినట్టు శుక్రవారం మస్క్ ప్రకటించారు. ‘‘80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే పారీ్టకి 80 శాతం మద్దతు. విధి అంటే ఇదేనేమో!’’అని ఒక పోస్టులో ఆయన హర్షం వెలిబుచ్చారు. ఆ వెంటనే ‘ద అమెరికా పారీ్ట’అంటూ మరో పోస్ట్ పెట్టారు. అది ఆయన పెట్టబోయే కొత్త పార్టీ పేరు కావచ్చని భావిస్తున్నారు. మస్క్ రష్యాలో స్థిరపడాలనుకుంటే రెడ్కార్పెట్ పరుస్తామని ఆ దేశ చట్టసభ డ్యూమా సభ్యుడు ద్మిత్రీ నొవికోవ్ ప్రకటించారు. ఆయన కోరితే రాజకీయ ఆశ్రయం కల్పిస్తామన్నారు. అయితే ట్రంప్–మస్క్ రగడపై స్పందించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నిరాకరించారు. -
‘ఆ పిచ్చోడితో నేను మాట్లాడను’.. మస్క్ను ఉద్దేశిస్తూ ట్రంప్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఒకరు రాజకీయ వేత్త. మరొకరు వ్యాపార వేత్త. నిన్నమొన్నటి వరకు వాళ్లిద్దరూ ఆప్తమిత్రులు. కానీ ఇప్పుడు బద్ద శత్రువులు. ట్రంప్ ఏ ముహూర్తాన బిగ్ బ్యూటిఫుల్ బిల్ తెచ్చారో నాటి నుంచి వాళ్లిద్దరి మధ్య సఖ్యత దెబ్బ తింది. ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఆ పిచ్చోడితో నేను మాట్లాడేంది అని ట్రంప్ అంటుంటే.. జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా ఉందంటూ మస్క్ బాంబు పేల్చారు. సంబంధిత ఆధారాల్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కొద్ది సేపటికే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. ఈ క్రమంలో ట్రంప్తో మస్క్ రాజీకి సిద్ధమయ్యారనే ప్రచారం జోరందుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఢీ అంటే ఢీ అంటున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారా? ట్రంప్తో రాజీకి రెడీ అయ్యారా?. అంటే అవుననే అనిపిస్తున్నాయి మస్క్ చర్యలు.జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుందంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఫైల్స్ను మస్క్ డిలీట్ చేశారు. జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్లో తన పేరు ఉండడం వల్లే ఆ డాక్యుమెంట్ను ట్రంప్ బహిర్ఘతం చేయడం లేదంటూ మొన్న సంచలన వ్యాఖ్యలు చేసిన మస్క్ కొద్ది సేపటిక్రితం ఆ పోస్టును డిలీట్ చేశారు. దీంతో మస్క్ వెనక్కి తగ్గారనే ప్రచారం మొదలైంది.టెస్లాలో భారీ నష్టాలు, స్పేస్ ఎక్స్లో ప్రాజెక్ట్లపై ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో ట్రంప్తో విభేదాల విషయంలో మస్క్ ఆలోచనలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు నేను లేకపోతే డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా అమెరికాకు అధ్యక్షుడు అయ్యే వారు కాదు. కొత్త పార్టీ పెడతానంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు.Trump responds that he has been too busy to think about Elon Musk but added “I just wish him well.”The President is showing so much class, restraint and grace. pic.twitter.com/CfYCqH3aKN— Cassie N (@cass_nguyen_) June 6, 2025 మస్క్ చేసిన వ్యాఖ్యల్ని ఏబీసీ మీడియా ప్రతినిధులు ట్రంప్ వద్ద ప్రస్తావించారు. మీపై మస్క్ ఆరోపణలు గుప్పిస్తున్నారు కదా. మీరు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. మీరు మాట్లాడేది ఆ పిచ్చోడి గురించేనా. ప్రత్యేకంగానే కాదు. అసలు మాట్లాడేందుకే నేనే ఇష్టపడడం లేదు. ఒకవేళ మస్క్ నాతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా.. అందుకు నేను సుముఖంగా లేనన్నారు. ఈ క్రమంలో మస్క్- ట్రంప్ వార్ ఎటుకి దారి తీస్తుందోనని రాజకీయ వేత్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే.. ఇన్వెస్టర్లు మాత్రం ట్రంప్,మస్క్లు మళ్లీ ఏం కొంపముంచుతారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ట్రంప్ కు బిగ్ షాక్.. ఎలన్ మస్క్ కొత్త పార్టీ
-
మస్క్.. ‘ది అమెరికా పార్టీ’కి 80 శాతం మద్దతు
వాషింగ్టన్ డీసీ: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇటీవల మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో యూఎస్లో కొత్త రాజకీయ పార్టీ కోసం పిలుపునిచ్చారు. అగ్రరాజ్యంలో కొత్త పార్టీకి సమయం ఆసన్నమయ్యిందా? అని మస్క్ ‘ఎక్స్’ యూజర్లను అడిగారు. దీనికి వచ్చిన ఆసక్తికర ఫలితాలను తాజాగా ఆయన వెల్లడించారు.మస్క్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు 80 శాతం మంది యూజర్లు మద్దతు పలికారు. ఈ ఫలితాల వెల్లడి తరువాత మస్క్ తన రాజకీయ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ‘ఎక్స్’లో వైరల్ అవుతున్న ఈ పోస్టులో మస్క్.. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని, 80 శాతం ప్రజలు దీనికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్లో మస్క్ పలు విమర్శలు చేశారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, అతనికి కృతజ్ఞత లేదని మస్క్ ఆరోపించారు. దీనికి స్పందనగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్రూత్లో మస్క్ కంపెనీలకు ఫెడరల్ కాంట్రాక్టులు, సబ్సిడీలను రద్దు చేస్తానని హెచ్చరించారు. ఎలాన్ మస్క్- డోనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకూ ఎంతో సన్నిహితులుగా మెలిగారు. గత జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో హత్యాయత్నం నుండి ట్రంప్ తృటిలో బయటపడిన అనంతరం మస్క్ బహిరంగంగా ఆయనకు మద్దతును ప్రకటించారు. అయితే ప్రస్తుతం వీరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఇది కూడా చదవండి: 400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా -
ట్రంప్తో ఫైటింగ్.. మస్క్కు రష్యా బంపరాఫర్
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)ల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎలాన్ మస్క్ను రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. మస్క్ తమ దేశానికి రావాలని.. రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్కు అవకాశం కల్పిస్తామని రష్యా తెలిపింది. ఈ మేరకు దిమిత్రి నోవికోవ్ చెప్పుకొచ్చారు.డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహ బంధం బీటలు వారింది. ఈ నేపథ్యంలో మస్క్ను మచ్చిక చేసుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది. తాజాగా రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోవ్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ భిన్నమైన వ్యక్తి. ఆయన ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తోంది. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్కు కూడా రష్యాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని మస్క్ కోరుకోవడం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు.మరోవైపు.. ట్రంప్, మస్క్ల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ నిరాకరించారు. ఇది యూఎస్ సమస్య అని, తమకు ఇందులో జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము అనుకుంటున్నట్లు తెలిపారు.Breaking News 🔴Russian MP Dmitry Novikov states that Elon Musk may be offered political asylum in Russia. pic.twitter.com/rp2pwqomuD— Global Report (@Globalrepport) June 6, 2025ఇదిలా ఉండగా.. నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు. -
స్టార్లింక్కు లైసెన్స్ వచ్చేసింది...
భారత్లో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్ లింక్కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్కెట్ ను చేజిక్కించుకోవాలన్న శాటిలైట్ కంపెనీ కలలకు ఊతమిచ్చేలా స్టార్ లింక్కు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి కీలక లైసెన్స్ లభించింది.భారత టెలికాం మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స పొందిన స్టార్ లింక్ దేశంలోని 90 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులను అందిపుచ్చుకునే లక్ష్యంతో భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని వార్తా సంస్థలు రాయిటర్స్, బ్లూమ్బర్గ్ నివేదించాయి. కాగా స్టార్ లింక్ కు నిజంగానే లైసెన్స్ లభించిందని, దరఖాస్తు చేసుకున్న 15-20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేస్తామని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వర్గాలు ధ్రువీకరించినట్లుగా పీటీఐ వార్తసంస్థ కూడా పేర్కొంది.దేశంలో సేవలను అందించడానికి యూటెల్ శాట్కు చెందిన వన్వెబ్, రిలయన్స్ జియో ఇలాంటి దరఖాస్తులను ఆమోదించిన భారత టెలికమ్యూనికేషన్ల విభాగం నుండి లైసెన్స్ పొందిన మూడవ సంస్థ స్టార్లింక్. భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలు సాగించడానికి లైసెన్సుల కోసం స్టార్ లింక్ 2022 నుండి ఎదురుచూస్తోంది. కాని జాతీయ భద్రతా ఆందోళనలతో సహా కారణాల వల్ల జాప్యం జరిగింది. అమెజాన్ కు చెందిన కుయిపర్ ఇండియా లైసెన్స్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తోంది.ప్రపంచవ్యాప్తంగా.. స్టార్లింక్ సేవలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్లో, రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు దాదాపు 80 డాలర్లు (రూ. 6,800). అయితే కస్టమర్లు 349 డాలర్లతో (రూ. 29,700) వన్ టైమ్ రుసుముతో స్టార్లింక్ స్టాండర్డ్ కిట్ను కూడా కొనుగోలు చేయాలి. అయితే భారతదేశంలో స్టార్లింక్ సర్వీస్ ప్రారంభమైన తరువాత.. దీని ఛార్జీలు నెలకు 10 డాలర్ల (రూ.850) వరకు ఉండే అవకాశం ఉంది. పరిచయ ఆఫర్లలో భాగంగా సంస్థ అపరిమిత డేటాను అందించే అవకాశం ఉంది. -
ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మరింత దూరం
-
ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు
ఎలాన్ మస్క్ సారథ్యం వహిస్తున్న టెస్లా షేరు విలువ కుప్పకూలింది. గురువారం ఒక్కరోజే 14 శాతం పడిపోయి 150 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచి ఈ షేరు భారీగా క్షీణించింది. ఈ కంపెనీకి సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బహిరంగ విభేదాలే ఇలా టెస్లా షేరు విలువ పడిపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పెరిగిన షేరు ధర ఇద్దరి మధ్య వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వస్తున్న వరుస కథనాలకు భారీగా కుప్పకూలుతోంది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయి 916 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది.ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తాం..ఇటీవల బహిరంగంగా మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి. మస్క్ వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ప్రభుత్వ వ్యయ బిల్లుపై మస్క్ చేసిన విమర్శలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మస్క్ను ఎదుర్కోవడం కష్టంగా మారిందని, ఆయన అతిగా స్పందిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.ఈవీ క్రెడిట్లు లేకపోవడంపై అసంతృప్తిఓవల్ ఆఫీస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎలాన్కు నాకు మంచి అనుబంధం ఉంది. ఇకపై కలిసి పని చేస్తామో లేదో తెలియదు. (ఇటీవల డోజ్ నుంచి మస్క్ వైదొలిగారు) ట్రంప్ ఇటీవలి చర్యలకు నేను ఆశ్చర్యపోయాను’ అంటూ కొత్త బిల్లులో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) క్రెడిట్లు లేకపోవడంపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: రఫేల్ యుద్ధ విమానాల తయారీకి డసో-టాటా ఒప్పందంభవిష్యత్తు ఎన్నికల్లో సవాళ్లుట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా మస్క్ వెంటనే ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో స్పందించారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, డెమ్స్ సభను నియంత్రించేవారని, సెనేట్లో రిపబ్లికన్లు 51-49తో గెలిచేవారని పేర్కొన్నారు. మస్క్ ఇటీవల బలమైన రాజకీయ వైఖరిని తీసుకున్నారు. కొత్త బడ్జెట్ బిల్లు అసహ్యంగా ఉందని, దానికి మద్దతిచ్చే ప్రజాప్రతినిధులు భవిష్యత్ ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. -
బాంబు పేల్చిన మస్క్.. ట్రంప్పై సంచలన ఆరోపణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ల మధ్య గొడవలు నాటకీయ పరిణామాల నడుమ రోజురోజుకీ ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలతో పోటాపోటీ పడుతున్నారు. తాజాగా.. ట్రంప్ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మరో సంచలన ఆరోపణ చేశాడు.వాషింగ్టన్: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సంచలన ఆరోపణలకు దిగాడు. ‘‘పెద్ద బాంబులాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES)లో ట్రంప్ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్టడం’’ లేదంటూ ఓ పోస్ట్ చేశాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరునుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. Time to drop the really big bomb:@realDonaldTrump is in the Epstein files. That is the real reason they have not been made public.Have a nice day, DJT!— Elon Musk (@elonmusk) June 5, 2025 ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అంతకు ముందు.. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ‘నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్లో రిపబ్లికన్లు 5149తో ఉండేవారు’ అని ఆయన గురువారం స్పష్టం చేశారు. అయితే.. అయితే మస్క్ వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేతసౌధంలో తన స్నేహితుడు(మస్క్ను ఉద్దేశించి..) లేకపోవడం విచారకరమని ట్రంప్ సైతం వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో మస్క్ వరుసగా ఎక్స్లో స్పందించారు. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని అన్నాడు. బెదిరింపులకు తలొగ్గనని, అవసరమైతే స్పేస్ఎస్ ఒప్పందాన్ని ఆపేస్తానని బదులిచ్చాడు.In light of the President’s statement about cancellation of my government contracts, @SpaceX will begin decommissioning its Dragon spacecraft immediately pic.twitter.com/NG9sijjkgW— Elon Musk (@elonmusk) June 5, 2025 అదే సమయంలో.. కొత్త పార్టీ పెట్టవచ్చా? అని అభిమానులను ప్రశ్నించారు. ‘80శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా?’ అని అడిగాడు. అలాగే ట్రంప్ను తొలగించాలంటూ ఓ వ్యక్తి వేసిన ప్రశ్నకు అవుననే బదులిచ్చాడు. Yes https://t.co/rqRsX8B4Hg— Elon Musk (@elonmusk) June 5, 2025తాను ప్రతిపాదించిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యతిరేకించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లులోని ముఖ్యఅంశాలు తెలిసి కూడా వ్యతిరేకించారని, దాంతో తాను నిరాశ చెందానని చెప్పారు. ప్రభుత్వ వ్యయ నియంత్రణకు ఉద్దేశించిన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్)కు మస్క్ అధిపతిగా ఉండడం, ఈ బిల్లును చూసిన తరువాత ఆ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. గురువారం ట్రంప్ శ్వేత సౌధంలోని ఓవల్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ఒక్క విద్యుత్తు వాహనాల అంశం తప్ప బిల్లులోని మిగిలిన అంశాలపై మస్క్కు అభ్యంతరాలు లేవని అన్నారు.‘మస్క్కు ఎంతో చేశాను. ఇద్దరి మధ్య గొప్ప స్నేహం ఉంది. అది కొనసాగుతుందో లేదో చెప్ప లేను. ఆయన నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చెడుగా ఒక్క మాట అనలేదు. అయినా ఆయనతో అసంతృప్తి చెందా’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మస్క్ ఎక్స్లో స్పందిస్తూ వ్యయ నియంత్రణ బిల్లును తనకు చూపలేదని తెలిపారు. తన సహకారం లేకుంటే ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉండేవారు కాదని అన్నారు. -
అమెరికా అధ్యక్షుడిపై ఈలాన్ మస్క్ మండిపాటు
-
అయోధ్య రామాలయం అద్భుతం
అయోధ్య: టెక్నా లజీ దిగ్గజం, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ బుధవారం ఉత్తర ప్రదేశ్లోని అయో ధ్య రామమంది రాన్ని దర్శించుకు న్నారు. భారతీయ సంప్రదాయ కుర్తా పైజామా ధరించి, గర్భాలయంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. రామాలయ దర్శనం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తంచేశారు. తాను ఇప్పటిదాకా చేసిన పనుల్లో ఇది చాలా గొప్ప అని చెప్పారు. ఈ ఆలయం చాలా అందంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇది అద్భుతమైన దేవాలయం అవుతుందని వెల్లడించారు. అయోధ్యలో హనుమాన్ గార్హీ ఆలయాన్ని కూడా ఎరోల్ మస్క్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎరోల్ మస్క్ వెంట కుమార్తె అలెగ్జాండ్ర మస్క్ కూడా ఉన్నారు. ఎరోల్ మస్క్ రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్కు ఎరోల్ మస్క్ గ్లోబల్ అడ్వైజర్గా పని చేస్తున్నారు. ఆయన ఈ నెల 1న ఇండియాకు వచ్చారు. 6వ తేదీ దాకా ఇక్కడే పర్యటిస్తారు. -
మస్క్ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రి
అంతరిక్ష సర్వీసులు అందిస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో కీలకంగా ఉన్న స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్మస్క్ ఆలోచనలను ఆయన తండ్రి ఎర్రోల్ మస్క్ వ్యతిరేకించారు. ఎలాన్ మస్క్ ప్రస్తుతం చేస్తున్న గ్రహాంతర ప్రయాణాల ప్రయోగాలపై ఎర్రోల్ మస్క్ విమర్శలు గుప్పించారు. రాకెట్లు మానవులు, ఇతర గ్రహాలను కాలనీలుగా మారుస్తాయని మస్క్ అభిప్రాయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎర్రోల్ మస్క్ తోసిపుచ్చారు. ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పారు. శాస్త్రీయంగా లోపభూయిష్టమైనదిగా పేర్కొన్నారు.ఎలాన్ మస్క్ దీనికి బదులుగా గురుత్వాకర్షణ, అంతరిక్షంలోకి ప్రయాణించేందుకు పట్టే సమయాన్ని కుదించేలా అధ్యయనం చేయడం మేలని ఎర్కోల్ మస్క్ చెప్పారు. అంతరిక్ష అన్వేషణలో ఈమేరకు చేసే అధ్యయనాలు భవిష్యత్తు పురోగతికి కీలకంగా మారుతాయని అభిప్రాయపడ్డారు. ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కృషిని ప్రస్తావిస్తూ మానవాళి కేవలం రాకెట్లపై ఆధారపడకుండా లోతైన శాస్త్రీయ పరిశోధనలపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇదీ చదవండి: ‘ఆర్టిఫిషియల్’ మూవీ.. ఎవరి గురించి అంటే..స్పేస్ఎక్స్ ద్వారా అంగారక గ్రహంలో మానవుల నివాసానికి అనువుగా ఉండే ప్రదేశాలను, అక్కడి వాతావరణాన్ని తెలుసుకునేందుకు ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మక ప్రణాళికలు వేస్తున్నారు. ఈ సమయంలో ఆయన తండ్రి వ్యాఖ్యలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. -
‘ఎక్స్ చాట్’ ప్రారంభించిన మస్క్
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ టూల్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్.. వంటి వాటికి పోటీగా ఎక్స్(గతంలో ట్విటర్) కొత్తగా ‘ఎక్స్ చాట్’ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇది తన వినియోగదారులకు అంతరాయం లేని, సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ సీఈఓ ఎలాన్మస్క్ తెలిపారు.ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, డిసప్పియరింగ్ మెసేజెస్, ఆడియో/ వీడియో కాల్స్ వంటి అధునాతన సామర్థ్యాలను హైలైట్ చేస్తూ మస్క్ ఎక్స్ పోస్ట్లో ఈమేరకు ఎక్స్ చాట్ వివరాలు ప్రకటించారు. ఇన్స్టంట్ మెసేజింగ్ స్పేస్లో ఇప్పటికే దూసుకుపోతున్న కంపెనీలకు ఎక్స్ చాట్ పోటీదారుగా మారే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: దేశంలోని తొలితరం సంపన్న మహిళలుప్రస్తుతం బీటా టెస్టింగ్లో ఉన్న ఈ అప్డేటెడ్ మెసేజింగ్ ఇంటర్ ఫేస్ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్ చాట్లో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, ఫైల్ షేరింగ్, వాయిస్, వీడియో కాల్స్ వంటి అధునాతన మెసేజింగ్ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. ఈ అప్గ్రేడ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్గా ఎక్స్ను అభివృద్ధి చేయాలనే మస్క్ అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. -
అమెరికా దివాళా తీయడం ఖాయం.. ట్రంప్పై మస్క్ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రభుత్వంపై అపరకుబేరుడు, మాజీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్)చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ (elon musk) షాకింగ్ కామెంట్లు చేశారు. అమెరికా ద్రవ్యలోటు 2.5 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇలాగే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలను విభేదించిన ఎలాన్ మస్క్కు డోజ్ నుంచి బయటకు వచ్చారు. అయితే, తొలిసారి ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని విభేదించారు. ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై తీవ్రంగా మండిపడ్డారు బిగ్,బ్యూటిఫుల్’ (Big Beautiful Bill) అంటూ ట్రంప్ (donald trump) చెబుతున్న బిల్లు గొప్పగా ఏమీ లేదన్నారు. ఈ బిల్లు వల్ల త్వరలోనే ట్రంప్ ప్రభుత్వం దివాళా తీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ భారీ, దారుణమైన కాంగ్రెస్ వ్యయ బిల్లు అసహ్యకరమైనది. దీనికి ఓటు వేసిన వారు సిగ్గు పడాలి. మీరు తప్పు చేశారని మీకు తెలుసు’ అని పేర్కొన్నారు. I’m sorry, but I just can’t stand it anymore.This massive, outrageous, pork-filled Congressional spending bill is a disgusting abomination.Shame on those who voted for it: you know you did wrong. You know it.— Elon Musk (@elonmusk) June 3, 2025ట్రంప్ నిర్ణయం మారదుఅయితే, వైట్ హౌస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మాట్లాడుతూ.. ఈ బిల్లుపై మస్క్ నిర్ణయం ఏంటో ట్రంప్కు తెలుసు. అయినప్పటికీ అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదు. ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన దానిని కాపాడుతున్నారు’ చెప్పారు.గతంలో ఇదే బిల్లును విమర్శిస్తూ మస్క్ స్పందించారు. ఈ బిల్లు ఇప్పటికే భారీగా ఉన్న లోటు బడ్జెట్ 2.5 ట్రిలియన్కు పెంచుతుంది. అమెరికన్ కాంగ్రెస్ దేశాన్ని దివాళా తీసే దిశాగా ప్రయత్నాలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం నిరాశ పరిచిందిమస్క్ ఈ బిల్లుపై డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ)కు రాజీనామా అనంతరం సీబీఎస్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘ఈ భారీ ఖర్చుల బిల్లు మమ్మల్ని నిరాశపరిచింది. ఇది బడ్జెట్ లోపాన్ని తగ్గించకుండా పెంచుతోంది. ఇది డోజ్ టీమ్ చేస్తున్న పనిని అడ్డుకుంటోంది. బిల్లు పెద్దదిగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు. కానీ రెండూ ఒకేసారి ఉండటం నాకు తెలియదు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. -
భారత్లో టెస్లా తయారీ లేనట్లే!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా తన కార్లను భారతదేశంలో తయారు చేసే అవకాశం లేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కానీ, దేశంలో షోరూమ్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా కంపెనీ వాహనాలను భారత్లో విక్రయించేందుకు ఆసక్తిగా ఉందని చెప్పారు. అందుకోసం జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్ నుంచి టెస్లా నేరుగా దేశంలో వాహనాలను దిగుమతి చేసుకునే వీలుందని అంచనా వేశారు. దీంతో ఇప్పటివరకు భారత్లో టెస్లా కార్లు తయారవుతాయని భావించిన వారికి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.కొత్త ఈవీ పాలసీభారత్లో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో భాగంగా దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించనున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. ప్రధాన అంతర్జాతీయ వాహన తయారీదారులను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడుతుంది. రాయిటర్స్ నివేదించిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విధానాన్ని ఖరారు చేసింది. ఇది వాహన తయారీదారులకు కేవలం 15% దిగుమతి సుంకంతో 35,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను నేరుగా దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ తక్కువ టారిఫ్లకు అర్హత పొందేందుకు కంపెనీలు దేశంలో తయారీ ప్లాంట్ను స్థాపించాల్సి ఉంటుంది. అందుకు 486 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉండాలి. నిర్ణీత గడువులోపు స్థానికంగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం ప్రారంభించాలి.దేశీయ వాహన తయారీదారులను అంతర్జాతీయ పోటీ నుంచి రక్షించడానికి భారత్లో ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకునే వారు తమ ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల్లో కనీసం 25% మొదటి మూడేళ్లలో స్థానిక కంపెనీల నుంచే తీసుకోవాలి. క్రమంగా తర్వాత ఐదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలనే నిబంధనలున్నాయి. మెర్సిడెస్ బెంజ్, స్కోడా, ఫోక్స్ వ్యాగన్, హ్యుందాయ్, కియా వంటి అనేక ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి చెప్పారు.భారత్లో టెస్లా ప్రణాళికలుటెస్లా ఇప్పటికే ముంబయి, ఢిల్లీలో రెండు షోరూమ్లను ఖరారు చేసింది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో 4,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని సిద్ధం చేస్తుంది. టెస్లా ఈ ప్రాంతంలో అత్యధిక నెలవారీ లీజు రేట్లతో ఈ స్థాలాన్ని దక్కించుకుంది. నెలకు సుమారు రూ.35 లక్షలు (చదరపు అడుగుకు సుమారు రూ.900) చెల్లించడానికి సిద్ధమైంది. ఐదేళ్ల కాలపరిమితితో లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. కంపెనీ మరో విస్తరణ చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్లో రెండో షోరూమ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో తన మోడల్ 3, మోడల్ వై లను పరీక్షిస్తోంది. త్వరలో స్థానికంగా వీటిని ఆవిష్కరించేదుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు!ట్రంప్కు భయపడ్డారా..?ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్ పాలసీను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా యూఎస్ కంపెనీలు స్థానికంగా అమెరికాలోనే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే చైనా, భారత్లో తయారీ సాగిస్తున్న యాపిల్ వంటి దిగ్గజ కంపెనీకి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ టెస్లా భారత్లో తయారీని ప్రారంభిస్తే ట్రంప్ తీవ్రంగా స్పందిస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలాన్మస్క్ ఎంత సన్నిహితుడైనా దేశ అభివృద్ధికి ఆటంకం కలిగితే మాత్రం ట్రంప్ ఊరుకోరని నిపుణులు చెబుతున్నారు. దాంతో రిస్క్ చేయడం ఎందుకనే భావనతో భారత్లో తయారీని వాయిదా వేసుకుంటున్నారా అనే అంచనాలు వెలువడుతున్నాయి. -
వీడ్కోలు వేళ ఎలాన్ మస్క్ ముఖంపై గాయం.. ఏం జరిగింది?
వాషింగ్టన్: బిలియనీర్ ఎలాన్ మస్క్ వీడ్కోల వేళ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. మస్క్ నుదుటి, కంటి వద్ద ఉన్న గాయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మస్క్ ఇచ్చిన సమాధానానికి అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్ష సలహాదారుగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ (DOGE) సారథిగా ఎలాన్ మస్క్ సేవలు అందించారు. మే 30న తన పదవికి చివరి రోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయానికి ఎలాన్ మస్క్ వెళ్లారు. ఈ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే, ఈ కార్యక్రమంలో మస్క్ ముఖంపై ఉన్న గాయం చర్చకు వచ్చింది. దీనిపై అక్కడున్న వారు మస్క్ను ప్రశ్నించారు.But what happened to Elon Musk’s eyes? Black eye? Or am I seeing something else….pic.twitter.com/Dc5SgG1IjH— Chewy Veetton (@bebem00m00) May 31, 2025ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఈ గాయం నా కుమారుడు చేసింది. నేను, నా ఐదేళ్ల కుమారుడు X Æ A-Xii బీచ్లో గుర్రపు స్వారీ చేస్తున్నాం. ఈ క్రమంలో అతడు నా ముఖంపై ఒక పంచ్ ఇచ్చాడు. దీంతో, అక్కడ గాయం ఏర్పడింది. ఆ సమయంలో దీన్ని నేను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇలా మారిపోయింది’ అని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల కుమారుడు కొడితే ఇంతలా గాయమైందా? అని అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్ సైతం స్పందిస్తూ.. ఇన్ని రోజులు తాను కూడా గాయాన్ని చూడలేదని చెప్పుకొచ్చారు. కానీ, మస్క్ కుమారుడు అలా చేయగలడు అని అన్నారు. ఇక, ట్రంప్, టెక్ మాగ్నెట్ కుమారుడే X Æ A-Xii.Elon Musk was seen with a noticeable black eye, showing visible bruising and discoloration around the area while at the White House with President Trump.President Trump presented him with the White House Key, calling it a gift from the nation.Musk will continue to serve as an… pic.twitter.com/CjcR1g9aK6— Shadow of Ezra (@ShadowofEzra) May 30, 2025అయితే, ఎలాన్ మస్క్ కొన్ని రకాల డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియాలో కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైట్హౌస్లో ఉన్నప్పుడు కూడా వాటిని వినియోగించారా? అని మస్క్ను విలేకరి ప్రశ్నించారు. ఈ సందర్బంగా మాస్క్ స్పందిస్తూ.. అది తప్పుడు కథనం అంటూ సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ, మస్క్ ముఖంపై గాయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది.Elon Musk's 5-year-old son, X, punched him so hard he got a black eye😂Reporter: "Mr. Musk, is your eye okay?"Elon: "Well, I wasn't anywhere near France... I was just walking around with Lil X, and I said, 'Go ahead,' punch me in the face, and he did. Turns out even a… pic.twitter.com/m7u2PSTluy— George (@BehizyTweets) May 30, 2025ఇదిలా ఉండగా.. వీడ్కోలు సందర్బంగా ట్రంప్.. మస్క్కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్ తెలిపారు. ఇది దేశం తరఫున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మస్క్ సేవలను ట్రంప్ అభినందించారు. తనకు అప్పగించిన బాధ్యతలను మస్క్ అవిశ్రాంతంగా నిర్వహించారన్నారు. ప్రపంచంలోనే మస్క్ ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. తన ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటా..డోజ్కు వీడ్కోలు సందర్భంగా ఎలాన్ మస్క్ మాట్లాడారు. ఇక నుంచి తరచుగా అధ్యక్ష కార్యాలయాన్ని సందర్శిస్తానని మస్క్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ కోరితే అవసరమైన సమయంలో తన సహాయం అందిస్తానన్నారు. ఇక మీదట సైతం ట్రంప్నకు స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటానని పేర్కొన్నారు. ‘డోజ్’ పదవి కాలం పరిమితితో కూడుకున్నదని మస్క్ తెలిపారు. ఇప్పటినుంచి తన వ్యాపారాలపై మరింత దృష్టి సారిస్తానన్నారు. ‘డోజ్’కు ఇది ముగింపు కాదని, ప్రాజెక్ట్ ఇప్పుడే ప్రారంభమైందన్నారు. ట్రిలియన్ డాలర్ల వృథాను ఇది అరికడుతుందన్నారు. -
నెత్తి మీద మంట పెట్టి వెళ్లిపోతున్నాడు సార్!
నెత్తి మీద మంట పెట్టి వెళ్లిపోతున్నాడు సార్! -
ఎలాన్ మస్క్ ఓ అద్భుతం.. రేపు కలుద్దాం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్పై ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ ఓ అద్భుతమంటూ కితాబిచ్చారు. మస్క్ ఎల్లప్పుడూ తమతోనే ఉంటారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రేపు ఇద్దరం కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటామని ట్రంప్ వెల్లడించారు.అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్.. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ ప్రకటనపై తాజాగా ట్రంప్ స్పందించారు. ట్రంప్ తన ట్రూత్ వేదికగా.. ఎలాన్క్ మస్క్ ఓ అద్భుతమైన వ్యక్తి. నేను, మస్క్ కలిసి రేపు ఓవల్ ఆఫీసులో మీడియా సమావేశంలో పాల్గొంటాం. మస్క్ ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు. అన్ని విధాలుగా సాయం అందిస్తూనే ఉంటారు అని చెప్పుకొచ్చారు.మస్క్ గుడ్బై..ఇదిలా ఉండగా, అంతకుముందు ఎలాన్ మస్క్.. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. ఇక, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక మస్క్ను డోజ్ శాఖ సారథిగా నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ విభాగం పని చేసింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ విభాగం అనేకమంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు అమెరికా ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో ప్రభుత్వంలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు తలెత్తినప్పటికీ ట్రంప్ వాటిని ఖండిస్తూ వచ్చారు.ఇక, ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ బిల్లునకు వ్యతిరేకంగా మస్క్ తొలిసారి తన స్వరాన్ని వినిపించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండడం వల్ల.. ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి డోజ్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృథా అవుతాయని ఆయన నిరాశ వ్యక్తంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మస్క్ వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.కేబినెట్తో ఉద్రిక్తతలు.. నిజానికి ట్రంప్ కేబినెట్కు మస్క్ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. మార్చిలో లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులకు మస్క్ ఇమెయిల్ పంపడాన్ని ఎఫ్బీఐ, స్టేట్ డిపార్ట్మెంట్, పెంటగాన్ విభేదించాయి. మస్క్ తన అధికారాన్ని అతిక్రమిస్తున్నారని, ఇమెయిల్కు సమాధానం ఇవ్వవద్దని తమ ఉద్యోగులకు సూచించాయి. ఆ తరువాత విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, మస్క్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలతో ట్రంప్, మస్క్ మధ్య అంతరం పెరిగింది. ఈ సంక్షోభం ఉన్నప్పటికీ ఫెడరల్ ఖర్చులను 2 ట్రిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్లకు తగ్గించారు. ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాకే డోజ్ సారథ్యం నుంచి నిష్క్రమించబోతున్నానని మస్క్ చెప్పుకొచ్చినా.. ప్రభుత్వంలో ఎదురైనా చేదు అనుభవాలు మస్క్ను ఇబ్బంది పెట్టాయి.కాగా.. అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికీ వరుసగా 130 రోజులకు మించి ఈ హోదాను ఇవ్వకూడదు. ఈ లెక్కల ప్రకారం మే 30తో మస్క్ గడువు పూర్తికానుంది. దీని ప్రకారమే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, మస్క్ వైదొలిగినప్పటికీ డోజ్ తన పనిని కొనసాగిస్తోందని ట్రంప్ గతంలోనే తెలిపారు. క్యాబినెట్ సెక్రటరీలు దీని బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించారు. -
దోస్తానా ముగిసింది!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ల స్నేహానికి ఎండ్ కార్డ్ పడిందా? అవుననే అనిపిస్తోంది. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో 300 మిలియన్డాలర్లకు పైగా నిధులు సమకూర్చి ట్రంప్ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన మస్క్.. ప్రభుత్వ బాద్యతల నుంచి వైదొలిగారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) నుంచి ఆయన తప్పుకున్నారు. ప్రభుత్వంలో తన షెడ్యూల్ ముగిసిందని ప్రకటించారు. వృధా ఖర్చులను తగ్గించే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మస్క్ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తన దృష్టి అంతా టెస్లా, స్పేస్ఎక్స్లపైనే కేంద్రీకరిస్తానని మస్క్ స్పష్టంచేశారు. అయితే.. సమాఖ్య ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయడానికి, పునర్నిర్మించడానికి డోజ్ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతాయని వైట్ హౌస్ పేర్కొంది. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన 130 రోజుల పదవీకాలం మే 30వ తేదీతో ముగియనుండగా.. ముందుగానే ఆయన రాజీనామా చేశారు. ట్రంప్తో సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘ప్రత్యేక వ్యక్తి, సూపర్ జీనియస్, ఫస్ట్ ఫ్రెండ్, దేశభక్తుడు’... డోజ్ బాధ్యతలు చేపట్టక ముందునుంచే మస్క్ను ప్రశంసించడానికి ట్రంప్ ఉపయోగించిన పదాలివి. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన దగ్గర నుంచి ఫిబ్రవరి వరకు అవకాశం దొరికిన ప్రతిచోటా మస్క్ను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్.. మార్చినుంచి కొంత తగ్గించారు. వివాదాస్పద నిర్ణయాలతో వరసబెట్టి కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తున్న డొనాల్డ్ ట్రంప్కు కుడిభుజంగా ఉండి.. వేలమంది కేంద్ర ప్రభుత్వోద్యోగులను మస్క్ సాగనంపడం, వేలకోట్ల విలువైన ప్రభుత్వ ఒప్పందాలు, కాంట్రాక్టులను రద్దుచేయడం తెలిసిందే. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఇటీవలి వైట్హౌస్ కార్యకలాపాలు మస్క్, ట్రంప్ల మధ్య చీలికలు తెచ్చాయి. అందులో ప్రధానమైనది దేశీయ విధాన బిల్లు. ట్రంప్ కొనియాడిన ఈ బిల్లును మస్క్ బహిరంగంగా విమర్శించారు. ట్రిలియన్ డాలర్ల పన్ను మినహా యింపులవల్ల ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయని మస్క్ తెలిపారు. నిధులు తగ్గించే డోజ్ పనికి ఇది విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.వ్యాపార ప్రయోజనాలకు దెబ్బ..అయితే బిల్లు మస్క్ వ్యాపార ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపడమే ప్రధాన కారణం. మస్క్ సంస్థ టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలకు 7,500 డాలర్ల పన్ను మినహాయింపును తొలగిస్తుంది. అంతేకాదు.. అదనంగా ప్రతిపాదించిన వార్షిక ఈవీ రిజిస్ట్రేషన్ రుసుము అతని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. మస్క్ అమెరికా ప్రభుత్వంలోని డోజ్ సారథ్య బాధ్యతలు తీసుకున్న తరువాత.. ఉద్యోగాల నుంచి తొలగింపు, నిధుల కోతలపై ఆగ్రహంతో ఉద్యోగులతో పాటు పలువురు టెస్లా బహిష్కరణకు పిలుపు నివ్వడం తెలిసిందే. డోజ్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అనేకచోట్ల వాహనాలు, ఛార్జింగ్ స్టేషన్ల విధ్వంసం జరిగింది. దీంతో 2025 మొదటి త్రైమాసికంలో టెస్లా అమ్మకాలు 13% తగ్గాయి. దీంతో మొదటి త్రైమాసిక లాభాలు 71% తగ్గాయి. కేబినెట్తో ఉద్రిక్తతలు.. నిజానికి ట్రంప్ కేబినెట్కు మస్క్ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. మార్చిలో లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులకు మస్క్ ఇమెయిల్ పంపడాన్ని ఎఫ్బీఐ, స్టేట్ డిపార్ట్మెంట్, పెంటగాన్ విభేదించాయి. మస్క్ తన అధికారాన్ని అతిక్రమిస్తున్నారని, ఇమెయిల్కు సమాధానం ఇవ్వవద్దని తమ ఉద్యోగులకు సూచించాయి. ఆ తరువాత విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, మస్క్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలతో ట్రంప్, మస్క్ మధ్య అంతరం పెరిగింది. ఈ సంక్షోభం ఉన్నప్పటికీ ఫెడరల్ ఖర్చులను 2 ట్రిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్లకు తగ్గించారు. ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాకే డోజ్ సారథ్యం నుంచి నిష్క్రమించబోతున్నానని మస్క్ చెప్పుకొచ్చినా.. ప్రభుత్వంలో ఎదురైనా చేదు అనుభవాలు మస్క్ను ఇబ్బంది పెట్టాయి. -
టెలిగ్రామ్లో గ్రోక్ఏఐ పాగా
కృత్రిమ మేధకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. దాంతో ఆన్లైన్ మెసేజింగ్ యాప్లు ఏఐను తమ ప్లాట్ఫామ్ల్లో భాగం చేస్తున్నాయి. అందులో భాగంగా టెలిగ్రామ్ ఎక్స్ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది. ఈమేరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఎక్స్ఏఐ గ్రోక్ చాట్బాట్ను వాడేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దాంతోపాటు టెలిగ్రామ్ ద్వారా విక్రయించిన ఎక్స్ఏఐ సబ్స్క్రిప్షన్ల నుంచి ఇరు కంపెనీలకు 50 శాతం ఆదాయ భాగస్వామ్యం ఉన్నట్లు పేర్కొన్నాయి.టెలిగ్రామ్కు ఉన్న యూజర్ బేస్ గ్రోక్ విస్తరణకు కూడా ఎంతో తోడ్పడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సంభాషణాత్మక ఏఐ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ చాట్బాట్ను టెలిగ్రామ్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తన ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించినా, ఎక్స్ఏఐ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.🔥 This summer, Telegram users will gain access to the best AI technology on the market. @elonmusk and I have agreed to a 1-year partnership to bring xAI’s @grok to our billion+ users and integrate it across all Telegram apps 🤝💪 This also strengthens Telegram’s financial… pic.twitter.com/ZPK550AyRV— Pavel Durov (@durov) May 28, 2025ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామంమార్కెట్లో ఇప్పటికే వాట్సప్, గూగుల్చాట్ వంటి మేసేజింగ్ యాప్ల్లో మెటా లామా, జెమిని వంటి ఏఐ టూల్స్ సేవలందిస్తున్నాయి. ఈ కంపెనీలకు మాతృసంస్థలుగా ఉన్న మెటా, గూగుల్ సొంతంగా తయారు చేసిన ఈ ఏఐ టూల్స్ను వాడుతున్నాయి. అయితే టెలిగ్రామ్కు ఆ అవకాశం లేదు. దాంతో తన ప్లాట్ఫామ్లో ఏఐ టూల్ వాడేందుకు ఎక్స్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుందనే వాదనలున్నాయి. -
ట్రంప్ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్కు మండింది (చిత్రాలు)
-
ట్రంప్ పాలకవర్గం నుంచి వైదొలగిన ఎలాన్ మస్క్
-
ట్రంప్ పాలకవర్గం నుంచి మస్క్ ఔట్
ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్((Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మస్క్.. ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తన ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించి ఆయన ఓ పోస్ట్ చేశారు. ‘‘అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసింది’’ అని పోస్టులో పేర్కొన్నారాయన. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. As my scheduled time as a Special Government Employee comes to an end, I would like to thank President @realDonaldTrump for the opportunity to reduce wasteful spending. The @DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government.— Elon Musk (@elonmusk) May 29, 2025ట్రంప్ ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయాలపై మస్క్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజా పన్నులు, వ్యయాల బిల్లులను తప్పు బట్టిన ఆయన.. ట్రిలియన్ డాఆర్ల పన్నులు వేయకపోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే.. రక్షణ రంగంపై వ్యయం పెంచడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో ట్రంప్ విధానాలు సరికావంటూ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంతోనే ఆయన బాధ్యతల నుంచి తప్పుకుని ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం నుంచే ఎలాన్ మస్క్ను తన పాలక వర్గంలోకి తీసుకుంటానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక మస్క్ను డోజ్ శాఖకు సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వశాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేసింది. ఈ క్రమంలో.. అటు డెమోక్రట్ల నుంచి మాత్రమే కాదు, ఇటు రిపబ్లికన్ల నుంచి కూడా మస్క్ వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయితే దీర్ఘకాలిక అభివృద్ధి కావాలంటే.. కొన్నింటిని వదులుకోవాలని మస్క్ తన చర్యలను సమర్థించుకున్నారు.ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థలను పునర్మిర్మాణం.. ఇవన్నీ డోజ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. 2026 జులై 4వ తేదీలోపు మొత్తం ఫెడరల్ బ్రూరోక్రసీని ఇది ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజ్ దానికదే ఎక్స్పైరీ కానుంది. మస్క్ నిర్ణయంతో డోజ్కు ట్రంప్ కొత్త సారథిని నియమిస్తారా? లేదంటే ఆ వ్యవస్థను రద్దు చేస్తారా? అనేది వేచి చూడాలి.ఇదీ చదవండి: యువ పార్లమెంటేరియన్తో సీనియర్ అనుచిత ప్రవర్తన! -
ట్రంప్పై మస్క్ అసమ్మతి గళం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన సన్నిహిత మిత్రుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన పన్నులు, వ్యయాల బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ట్రిలియన్ డాలర్ల మేర పన్నులు చేయకుండా నిలిపివేయడం, రక్షణ రంగంపై వ్యయాన్ని భారీగా పెంచాలని ట్రంప్ నిర్ణయించడం సరైంది కాదని కుండబద్ధలు కొట్టారు. మంగళవారం రాత్రి ఓ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్మాట్లాడారు. ‘బిగ్, బ్యూటిఫుల్’అంటూ ట్రంప్ చెబుతున్న బిల్లు గొప్ప బిల్లుగా తాను భావించడం లేదన్నారు. అది చాలా పెద్దది లేదా అందమైనది అని తాను ఎంతమాత్రం అనుకోవడం లేదని తేల్చిచెప్పారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు ఎలాన్ మస్క్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారీగా ఆర్థిక సాయం సైతం అందజేశారు. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎలాన్ మస్్కకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులను, ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి ఉద్దేశించిన డో జ్ చీఫ్ పదవిని కట్టబెట్టారు. అలాంటి తన మిత్రు డు ట్రంప్పై ఎలాన్ మస్క్ అసమ్మతి గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది. పన్నుల్లో కోతలకు, రక్షణ వ్యయం పెంపునకు తాను వ్యతిరేకం అని పరోక్షంగా ఎలాన్ మస్క్ స్పష్టంచేశారు. -
మస్క్ స్టార్ షిప్ ప్రయోగం ఫెయిల్
-
ఎలాన్ మస్క్.. స్టార్ షిప్ ప్రయోగం విఫలం
టెక్సాస్: బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన స్టార్ షిప్ రాకెట్ మరోసారి పేలిపోయింది. టెక్సాస్లోని స్పేస్ ఎక్స్ నుంచి ప్రయోగించిన స్టార్ షిప్ విఫలమైంది. స్టార్షిప్ రాకెట్ ఇలా పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సుదూర అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన స్టార్ షిప్ ప్రయోగం మరోసారి విఫలమైంది. టెక్సాస్లోని స్పేస్ ఎక్స్ నుంచి ప్రయోగించిన స్టార్ షిప్ తొమ్మిదో ఫ్లైట్ టెస్ట్లో భాగంగా చివరి దశలో ఇంధనం లీక్ కావడంతో నియంత్రణ కోల్పోయింది. తొలుత ఇది విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లినా.. దాదాపు అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. దీంతో, స్టార్ షిప్ శకలాలు సముద్రంలో పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.Starship Flight 9: Ship 35 has lost attitude control. pic.twitter.com/GLEg2cQx12— NSF - NASASpaceflight.com (@NASASpaceflight) May 28, 2025#STARSHIP 🙆🏻♂️🫵🏻 pic.twitter.com/RKjHaZK2p8— ChrisRetro (@BlanquitoPerla_) May 28, 2025Pretty excellent melting shot in the last moments of Starship pic.twitter.com/vebHysj6XE— johnboiles (@johnboiles) May 28, 2025the remnants of starship 9 burning up on re-entry 🥹 so hauntingly beautiful to witness. pic.twitter.com/IddJTXWpVz— All day Astronomy (@forallcurious) May 28, 2025 -
భారత్లో స్టార్లింక్ సర్వీస్: ధరలు ఇలా..
ఎలాన్ మస్క్ తన శాటిలైట్ ఇంటర్నెట్ 'స్టార్లింక్' కార్యకలాపాలను భారతదేశంలో ప్రారంభించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా ఈ సేవలు మనదేశంలో త్వరలోనే ప్రారంభం కానున్నాయని.. కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందిన స్టార్లింక్ చార్జీలు ఎలా ఉండబోతున్నాయంటే..భారతదేశంలో స్టార్లింక్ సర్వీస్ ప్రారంభమైన తరువాత.. దీని ఛార్జీలు నెలకు 10 డాలర్ల (రూ.850) వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ధరలు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. చాలా తక్కువే అని తెలుస్తోంది. పరిచయ ఆఫర్లతో భాగంగా సంస్థ అపరిమిత డేటాను అందించే అవకాశం ఉంది.భారతదేశంలో వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడానికి సంస్థ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పరిచయ ఆఫర్స్ కూడా చాలా తక్కువ ధరకే అందించాలని యోచిస్తోంది. 10 మిలియన్స్ సబ్స్క్రైబర్లను లక్ష్యంగా చేసుకుని సంస్థ ముందడుగు వేస్తోంది. సబ్స్క్రైబర్లు స్టార్లింక్ హార్డ్వేర్ ప్యాకేజీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో శాటిలైట్ డిష్, వైఫై రూటర్ వంటివి ఉన్నాయి. దీని కోసం ఎంత చెల్లించాలనే విషయం వెల్లడికాలేదు.ఇదీ చదవండి: ఫేస్ స్కాన్ చేస్తే.. పేమెంట్ పూర్తయిపోయింది: వీడియోప్రపంచవ్యాప్తంగా.. స్టార్లింక్ సేవలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్లో, రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు దాదాపు 80 డాలర్లు (రూ. 6,800). అయితే కస్టమర్లు 349 డాలర్లతో (రూ. 29,700) వన్ టైమ్ రుసుముతో స్టార్లింక్ స్టాండర్డ్ కిట్ను కూడా కొనుగోలు చేయాలి. -
X Outage: ఎక్స్ సేవల్లో అంతరాయం
ప్రపంచ కుబేరుడు.. టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఆధీనంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్, ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 5:30 గంటల నుంచి యూజర్లు సమస్యలను నివేదిస్తూనే ఉన్నారు. లాగిన్ అవ్వడంలో, టైమ్లైన్లను యాక్సెస్ చేయడంలో మాత్రమే కాకుండా ట్వీట్స్ చేయడంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.ట్రాకింగ్ సర్వీస్ డౌన్డిటెక్టర్ ప్రకారం.. 2,100 కంటే ఎక్కువ మంది యూజర్లు సమస్యలను నివేదించారు. కంపెనీ ప్రస్తుతానికి ఈ సమస్యకు కారణం ఏమిటనే విషయాన్ని వెల్లడించలేదు.శుక్రవారం కూడా భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. డేటా సెంటర్లో ఏర్పడిన టెక్నికల్ సమస్య కారణంగా.. అంతరాయం ఏర్పడిందని ఎక్స్ ఇంజినీర్లు వెల్లడించారు. అయితే ఈ రోజు అంతరాయం కలగడానికి కారణం ఏమిటనే విషయం తెలియాల్సి ఉంది. -
పక్క దేశంలో స్టార్లింక్ పాగా
ఎలాన్మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ యాజమాన్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్ లింక్ బంగ్లాదేశ్లో అధికారికంగా సేవలు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దేశ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గణనీయమైన పురోగతిని సూచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్, నెట్వర్క్ సమస్యలతో పోరాడుతున్న మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించాలనే లక్ష్యంతో ఈ సర్వీసులు ప్రారంభించిస్తున్నట్లు అధికారులు తెలిపారు.స్టార్ లింక్ విభిన్న యూజర్ అవసరాలను తీర్చడానికి బంగ్లాదేశ్లో వివిధ సబ్ స్క్రిప్షన్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. స్టార్ లింక్ రెసిడెన్స్ ప్లాన్లో భాగంగా నెలకు 6,000 టాకా ధర(రూ.4,200)తో ప్రామాణిక గృహ వినియోగానికి ఇంటర్నెట్ అందిస్తున్నారు. రెసిడెన్సీ లైట్ ప్లాన్లో భాగంగా నెలకు 4,200 టాకా(రూ.2,900) ధరతో నెట్ సేవలు అందిస్తున్నారు. వన్ టైమ్ సెటప్ ఫీజు కింద 47,000 టాకాలు(రూ.32,000) చెల్లించాల్సి ఉంటుంది. స్టార్ లింక్ డిష్, రౌటర్తో సహా పరికరాల ఖర్చులు ఇందులో కవర్ అవుతాయి.ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..స్టార్లింక్ ప్రత్యేకతలుఅంతరిక్షంలోని ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ నేరుగా భూమిపై ఉన్న వివిధ డివైజ్లకు చేరుతుంది.ఈ కనెక్షన్కు చందా కేబుల్ సర్వీస్ డైరెక్ట్ టు హోం (డీటీహెచ్)కు కట్టిన మాదిరిగా ఉంటుంది.ఇంటర్నెట్ కోసం ఈ కంపెనీ పోర్టబుల్ శాటిలైట్ డిష్ కిట్ను అందజేస్తుంది. దీనిని ఇంటిపై శాశ్వత పద్ధతిలో బిగించవచ్చు.ముందుగా ఇళ్లలో వైఫై రూటర్ ఆధారిత వైర్ కనెక్షన్ కలిగి ఉండాలి. దీనిని ఆ తర్వాత వైర్లెస్ పద్ధతిలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గాడ్జెట్స్కు జతచేయొచ్చు.ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సర్వీస్ అందించగలదు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. -
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం.. యువతితో మస్క్పై పుతిన్ కుట్ర?
వాషింగ్టన్: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్పై రష్యా యుద్ధంపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభంలో రహస్యాల్ని తెలుసుకునేందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk)పై రష్యా యువతితో వలపు వల విసిరినట్లు మాజీ ఎఫ్బీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఏజెంట్ జోనాథన్ బౌమా సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మన్ బ్రాడ్కాస్టర్ జెడ్డీఎఫ్ తీసిన డాక్యుమెంటరీలో జోనాథ్ బౌమా మాట్లాడారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా రష్యా ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాన్ మస్క్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్పై ఓ యువతి ప్రయోగించారు. మస్క్కు ఉన్న జూదం,మత్తు పదార్ధాల వినియోగంలాంటి వీక్నెస్ను అడ్డం పెట్టుకుని యుద్ధం సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. పుతిన్కు ఆపరేషన్ గురించి తెలుసా?ఇక మస్క్, పీటర్ థీల్పై జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ పుతిన్ కనుసన్నల్లోనే జరిగింది. పుతిన్ అనుమతి లేకుండా స్పై చేయరు కదా? అని జోనాథన్ బౌమా అన్నారు. అయితే, రష్యా జరిపిన సీక్రెట్ ఆపరేషన్లో మస్క్, పీటర్ థీల్ చిక్కుకున్నారా? లేదా? అనే విషయాల్ని వెల్లడించేందుకు జోనాథన్ బౌమా విముఖత వ్యక్తం చేశారు.కాగా, ఎఫ్బీఐలో 16 ఏళ్లు పని చేసిన జోనాథ్ బౌమా ఓ మీడియా సంస్థకు రహస్య సమాచారాన్ని అందించారు. దీంతో అమెరికా ప్రభుత్వం జోనాథ్ బౌమాను అరెస్ట్ చేసింది. చివరకు లక్షడాలర్ల పూచికత్తుతో బెయిల్పై విడుదలయ్యారు. -
వారానికి 90 గంటల పని!.. ఆయనతో పనిచేయడం నా అదృష్టం
ఎలాన్ మస్క్ అనగానే.. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు అని అందరూ చెబుతారు. అయితే ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ, వారానికి ఈయన ఎన్ని గంటలు పనిచేస్తారో తెలిస్తే.. తప్పకుండా అవాక్కవుతారు. ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.టెస్లాలోని ఏఐ సాఫ్ట్వేర్ వైస్ చైర్మన్ 'అశోక్ ఎల్లుస్వామి' ఒక పాడ్కాస్ట్లో ఎలాన్ మస్క్తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ.. ఆయన కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం భయపడని వ్యక్తి అని అభివర్ణించారు. అద్భుతమైన ఊహ, దూరదృష్టి కలిగిన మస్క్ వారానికి 80 గంటల నుంచి 90 గంటలు పనిచేస్తారని పేర్కొన్నారు.నేను ప్రతివారం మస్క్ను కలుస్తాను. అతను చాలా తెలివైనవాడు, భవిష్యత్తును చాలా ముందుగానే అంచనా వేయగలడు. అతని దగ్గర పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అతను రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం భయపడడు. కష్టపడి పనిచేసే తత్త్వం ఉన్న మస్క్.. చాలా సరదాగా ఉంటారని అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?2014లో టెస్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరిన ఎల్లుస్వామి.. దశాబ్దానికి పైగా కంపెనీలో ఉన్నారు. 2024లో AI సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొంది.. మస్క్తో కలిసి పనిచేస్తూ, కృత్రిమ మేధస్సులో టెస్లా వృద్ధికి దోహదపడుతున్నారు.Tesla's VP of AI Software Ashok Elluswamy on what it's like to work with Elon Musk: "I meet with him every week. He is really smart in the sense that he can predict the future very early; He works really hard. Easily 80-90 hours per week. I feel fortunate to work for him. He is… https://t.co/dB5l6EbxEx pic.twitter.com/qLPB0v0hUd— Sawyer Merritt (@SawyerMerritt) May 14, 2025 -
మర మనిషా..? మైఖేల్ జాక్సనా..?
మర మనుషులు మానవుల స్థానాన్ని రీప్లేస్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. హ్యుమనాయిడ్ రోబోల ఆవిష్కరణలో వస్తున్న మార్పులే అందుకు ఉదాహరణ. తాజాగా టెస్లా హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ మనుషుల్లా డ్యాన్స్ చేస్తున్న వీడియోలను ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఎలాంటి ఆధారం లేకుండా అచ్చం మనుషుల్లానే డ్యాన్స్ చేయడం ఆ వీడియోలో చూడవచ్చు.ఇదీ చదవండి: ఈసారి 7,000 మంది బలి?ఆప్టిమస్ రోబో డ్యాన్స్ చేస్తున్న వీడియోను కోట్ చేస్తూ టెస్లా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. ప్రధానంగా కార్ల తయారీదారుగా ఉన్న టెస్లా రోబో డ్యాన్స్ను ఉటంకిస్తూ ‘మాది కార్ల కంపెనీ కదా’ అని సరదాగా పోస్టు చేసింది. టెస్లా తదుపరి వాటాదారుల సమావేశంలో తనతో పాటు ఆప్టిమస్ నృత్య బృందాన్ని వేదికపైకి తీసుకెళ్తానని ఎలాన్ మస్క్ ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు.🕺 pic.twitter.com/NzqAmN3F5z— gorklon rust (@elonmusk) May 13, 2025pic.twitter.com/ZbrZmfjHpd— gorklon rust (@elonmusk) May 14, 2025This is still very far from our final form https://t.co/6gIAllTPP5— gorklon rust (@elonmusk) May 14, 2025We're a car company right https://t.co/DWCw4i3HQV— Tesla (@Tesla) May 14, 2025 -
ట్విన్స్ కి జన్మనిచ్చిన ప్రముఖ నటి.. తండ్రి ఎలన్ మస్క్?
హాలీవుడ్ ప్రముఖ నటి అంబర్ హెర్డ్.. తాను కవలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది. మదర్స్ డే సందర్భంగా ఆదివారం (మే 11) ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ పిల్లలకు తండ్రి ఎవరు అనే ప్రశ్న ఈమెకు ఎదురవుతోంది. సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్)ఎందుకంటే అంబర్ హెర్డ్.. 2015లో 'పైరేట్స్ ఆఫ్ కరీబియన్' ఫేమ్ నటుడు జానీ డెప్ ని పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ల బంధం పట్టుమని రెండేళ్లు కూడా నిలబడలేదు. 2017లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. మరోవైపు జానీ డెప్ తో విడాకులకు ముందే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఎలన్ మస్క్ తో అంబర్ డేటింగ్ చేసింది.2016-18 మధ్య అంబర్-మస్క్ డేటింగ్ లో ఉన్నారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ పిల్లల్ని కనాలనుకున్నారని.. అప్పుడు కుదరకపోవడంతో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నారని, వాటితోనే ఇప్పుడు అంబర్.. ట్విన్స్ కి జన్మనిచ్చిందేనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పిల్లలకు తండ్రి ఎవరనేది సదరు నటి చెబితే తప్ప క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే) View this post on Instagram A post shared by Amber Heard (@amberheard)


