Eluru District Latest News
-
కేంద్ర బడ్జెట్లో రైతులకు అన్యాయం
ఏలూరు (టూటౌన్): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గెద్దలకు పెట్టిన చందంగా, కార్మికులు, రైతులపై భారాలు వేసి కార్పొరే ట్ కంపెనీలకు దోచి పెట్టే బడ్జెట్గా ఉందంటూ వా మపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో గురువారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మా ట్లాడుతూ బడ్జెట్లో వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల ప్రస్తావన లేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు, కనీస మద్దతు ధరల జాడే లేదన్నారు. ఉపాధి హామీ పథకానికి భారీగా నిధుల కోత పెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం, పునరావాసం ప్రస్తావనే లేదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, నాయకులు పాల్గొన్నారు. -
గ్రూప్–2 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
ఏలూరు(మెట్రో): ఏలూరులో ఈనెల 23న జరిగే గ్రూప్–2 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జేసీ పి.ధాత్రిరెడ్డితో కలిసి అధికారులతో ఆమె సమీక్షించారు. ఆది వారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఉదయం 9:30 గంటలలోపు, మధ్యాహ్నం 2.30 గంటలలోపు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారని స్పష్టం చేశారు. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో 4,415 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఈనెల 21 నుంచి ఏలూరు కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలని, పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. విద్యుత్ అంతరాయం కాకుండా చూడాలన్నారు. ప్రశ్నపత్రాలకు భద్రత గ్రూప్–2 పరీక్షల ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీ ట్లకు పటిష్ట భద్రత కల్పించాలని జేసీ ధాత్రిరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో పరీక్షల ఓఎంఆర్ షీట్ల భద్రతను ఆమె పరిశీలించారు. ఓఎంఆర్ షీట్లు జిల్లాకు చేరుకున్నాయని జేసీ చెప్పారు. -
కమిషనర్ మాటతీరుపై ఆందోళన
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ వీడియో కాన్ఫరెన్స్లో వాడుతున్న భాష తమ మనోభావాలు దెబ్బతీసేలా, అగౌరవ పరిచేలా ఉందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. గురువారం కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన వీసీలో ఉద్యోగుల విషయంలో ఆయన ప్రవర్తించిన తీరుతో మానసిక క్షోభకు గురైనట్టు చెబుతున్నారు. మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా పరుష పదజాలంతో మాట్లాడటం తగదని అంటున్నారు. అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన కమిషనర్ దారుణంగా మాట్లాడటం తగదని వాపోతున్నారు. తమను రోజూ కమిషనర్ మానసిక వేదనకు గురి చేస్తున్నారని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కలెక్టర్ వెట్రిసెల్వి చర్యలు తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. కమిషనర్ తీరుపై ముఖ్యమంత్రి తదితరులకు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు ఓ ఉద్యోగి తెలిపారు. -
కొరుటూరులో చిరుత
పోలవరం రూరల్: గోదావరి నదీ పరీవాహకంలోని ఏజెన్సీ ప్రాంతంలో వన్య మృగాలు సంచరిస్తున్నాయి. పోలవరం మండలం కొరుటూరు సమీపంలో చిరుత సంచరిస్తోంది. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో దీనిని గుర్తించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో ఎవరూ సంచరించవద్దని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 26 గిరిజన గ్రామాలు ఖాళీ అయ్యాయి. దీంతో జనసంచారం ఉండటం లేదు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో నీటి కోసం పలురకాల జంతువులు గోదావరి ఒడ్డుకు చేరుకుంటున్నాయి. జనసంచారం లేకపోవడంతో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. -
ఆటో స్టాండ్ తొలగింపుపై మండిపాటు
ఏలూరు (టూటౌన్): ఏలూరులోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్న ఆటో స్టాండ్ను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడాన్ని ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ సంఘ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి జె.గోపి ఖండించారు. గురువారం ఇక్కడ నగర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.రాజు, బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న 300 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డున పడేశారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమర్కుమార్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ తీరు దారుణంగా ఉందన్నారు. ఉపాధి చూపించాల్సిన ప్రభుత్వా లు పరిశ్రమలు మూతపడుతున్నా మాట్లాడటం లేదని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు య థావిధిగా ఆటో పార్కింగ్ స్టాండ్ను కొనసాగించాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని హె చ్చరించారు. అనంతరం కో–ఆప్షన్ సభ్యు డు ఎస్ఎంఆర్ పెదబాబుకి వినతి పత్రం అందజేశారు. ట్రిపుల్ఐటీలో వాట్సాప్ గవర్నెన్స్ నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ప్రత్యేకంగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించామని, ఆ నంబర్ ద్వారా విద్యార్థులు సమస్యలను తెలియజేయవచ్చని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు గురువారం పరుపులు పంపిణీ చేసి డైనింగ్ హాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. ఏఓ లక్ష్మణరావు మాట్లాడుతూ మౌలిక సదుపాయాలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. డీన్ అకాడమిక్స్ చిరంజీవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజశేఖర్ పాల్గొన్నారు. అనంతరం మెస్ హాళ్లను సందర్శించి ఆహార పదార్థాల వంటల ప్రక్రియను పర్యవేక్షించారు. గురుకులంలో ఆకస్మిక తనిఖీ ముసునూరు: గురుకుల విద్యార్థినులకు మంచి ఆశయాలు, లక్ష్యాలు, నడవడిక అలవర్చి వా టిని నెరవేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చే యాలని ఏపీ గురుకుల విద్యాలయ సొసైటీ జాయింట్ సెక్రటరీ అబేదుల్లా ఆదేశించారు. ఇటీవల గురుకుల పాఠశాలలో ఏర్పడిన సమస్యలపై పాఠశాల కమిటీ సభ్యులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ముసునూరులోని బాలికల గురుకుల పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి, సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థినులు, ఎస్ఎంసీ సభ్యులతో మాట్లాడారు. -
పలకాలి అందరి నోట
అమాతృభాష.. ఇఈఆఏలూరు (ఆర్ఆర్పేట): మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలు, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విదేశాల్లో కొలువుల కోసం ఇంగ్లిష్పై పట్టు తప్పనిసరిగా మారింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నతనం నుంచే ఇంగ్లిష్కే పరిమితం చేస్తుండగా మాతృభాషకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు, యువత తెలుగుకు దూరమవుతున్నారని భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి లక్ష్యంగా ఇంగ్లిష్, హిందీ నైపుణ్యాలను పెంచుకుంటూ తెలుగును మరిచేపోయే పరిస్థితికి వస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఉద్యమంలా భాషా పరిరక్షణ మాతృభాష పరిరక్షణకు జిల్లాలో ఇప్పటికే తెలుగు భాషా సంఘాలు, రచయితల సంఘాలు పూనుకున్నాయి. కరపత్రాల పంపిణీ, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు, తెలుగుభాషపై పోటీలు నిర్వహణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు తెలుగు సాహిత్య కార్యక్రమాలు, అవధానాలు, పుస్తక పరిచయాలు వంటి కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తూ భాషాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నాయి. నండూరి.. బుచ్చిబాబు.. మరెందరో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగు భాషకు పట్టు గొమ్మ. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మాండలికాలు వేరుగా ఉన్నా ‘పశ్చిమ’ యాస ప్రత్యేకతను సంతరించుకుంది. పత్రికలు, పుస్తకాలు, నవలలు, సినిమాల్లో ఈ యాస ఎక్కువగా కనిపిస్తుంది. జిల్లాకు చెందిన పలువురు రచయితలు తమ రచనల ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎంకి, నాయుడు బావ పాటల సృష్టికర్త నండూరి వెంకట సుబ్బారావు ఈ జిల్లాకు చెందిన వారే. ఆయనతో పాటు బుచ్చిబాబు, కావలి సోదరులు, బొడ్డు బాపిరాజు, తిరుపతి వేంకట కవులు, కొనకళ్ల వెంకటరత్నం, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ వంటి రచయితలు తెలుగు భాషను శిఖరాగ్రాన నిలిపారు.‘తెలుగు భాష తియ్యదనం.. తెలుగు భాష గొప్పతనం.. తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఓ మూలధనం.. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. కాని నీ భాషలో నువ్వు సంభాషించు..’ అంటూ మాతృభాష ఔన్నత్యాన్ని ఓ సినీ కవి ఎంతో గొప్పగా అభివర్ణించారు. పాశ్చాత్య ధోరణులతో మాతృభాషను విస్మరించవద్దని భాషాభిమానులు గొంతెత్తి చాటుతున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ ఖ్యాతి గడించిన తెలుగుపై అభిమానం యువతలో సన్నగిల్లుతోంది. కార్పొరేట్ కొలువులే లక్ష్యంగా ఆంగ్లంపై మక్కువ పెంచుకుంటూ తెలుగును విస్మరించడం తగదని భాషా నిపుణులు సూచిస్తున్నారు. నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. మానసిక పరిపక్వతకు.. మాతృభాషలో విద్యాబోధనతోనే విద్యార్థి మానసిక ఎదుగుదల, పరిపక్వత సాధ్యమవుతాయని పరిశోధ నలు స్పష్టం చేశాయి. 26 అక్షరాల (ఇంగ్లిష్) వెంటపడుతూ 56 అక్షరాల సంపదను మనం విస్మరించడం బాధాకరం. శక్తివంతమైన భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే గొప్ప భాష తెలుగు. తెలుగు భాష మాధుర్యాన్ని, గొప్పతనాన్ని భావితరాలకు అందించాలి. –డాక్టర్ కొండా రవి, తెలుగు అధ్యాపకుడు, నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుర్తింపే ప్రశ్నార్థకంగా.. మాతృభాష అంటే ప్రతిఒక్కరికీ మమకారం పెరగాలి. ముఖ్యంగా తెలుగు ప్రజల్లో అదే లోపిస్తోందనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు మాట్లాడానికి కూడా సిగ్గుపడే పరిస్థితికి నేటితరం వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలానికి తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. తెలుగు ప్రజల గుర్తింపే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో పడతాం. – గురు శర్మ, తెలుగు రచయిత పరభాషల కోసం యువత పాకులాట ఇంగ్లిష్ మోజులో తెలుగును విస్మరిస్తున్న వైనం మాతృభాష మాధుర్యాన్ని మరుస్తున్న నేటితరం తెలుగు గొప్పతనాన్ని గుర్తించాలంటున్న భాషాభిమానులు నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 2,800
శురకవారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు కోసం ఫారం–12 సమర్పణకు గురువారం తుది గడువుగా విధించారు. ఈ క్రమంలో ఆరు జిల్లాల్లో కలిపి కేవలం 220 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు మాత్రమే అందాయి. మొత్తంగా 440 పోలింగ్ కేంద్రాల్లో సుమారు పోలీస్ సిబ్బందితో సహా 2,800 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. పోలీస్ శాఖ, ఇతర ప్రధాన విభాగాల నుంచి మరికొందరి పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు రావాల్సి ఉంది. 3.15 లక్షల మంది ఓటర్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 3,15,261 మంది ఈనెల 27న ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కూటమి పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్ధి దిడ్ల వీరరాఘవులుతో పాటు 33 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. 25న సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఆఫీసర్తో పాటు మరో ముగ్గురు సిబ్బంది, మైక్రో అబ్జర్వర్ ఇలా ఐదుగురు ఉద్యోగులను నియమించారు. అలాగే ప్రతి చోటా ఇద్దరు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 62, పశ్చిమగోదావరిలో 93, తూర్పుగోదావరిలో 82, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 92, కాకినాడ జిల్లాలో 96, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్నికల విధుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం రిటర్నింగ్ అధికారి, ఏలూరు కలెక్టర్కు దర ఖాస్తు చేసుకోవాలి. 40 శాతం స్లిప్పుల పంపిణీ పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం–12 దరఖాస్తు ఇచ్చిన వారికి రెండు రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ను ఏలూరు కలెక్టరేట్ నుంచి రిజిస్టర్ పోస్టు చేయనున్నారు. మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న క్రమంలో 2న సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించే అవకాశం కల్పించారు. మరోవైపు ఆరు జిల్లాల్లో ఓటర్ల స్లిప్పుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు 40 శాతం స్లిప్పల పంపిణీ పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలి ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పా ల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జేసీ పి.ధాత్రిరెడ్డి తెలి పారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం పోస్టల్ బ్యా లెట్ పత్రాల పంపిణీని ఆమె పరిశీలించారు. న్యూస్రీల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ స్లిప్పుల పంపిణీ రెండు రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల జారీ ప్రక్రియ ఆరు జిల్లాల్లో 440 పోలింగ్ కేంద్రాలు 27న పోలింగ్.. 3న కౌంటింగ్ -
ఆకతాయిల వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
కామవరపుకోట: ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం కామవరపుకోట పంచాయతీ వడ్లపల్లిలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడ్లపల్లి గ్రామానికి చెందిన గంజి నాగ దీప్తి (19) ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా నాగ దీప్తి కాలేజీకి వచ్చి, వెళ్లే సమయాల్లో కామవరపుకోటకు చెందిన ఆకతాయిలు ఆమెను ప్రేమించాలని, లేకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించేవారు. ఈ విషయంపై ఆమె అన్నయ్య అరవింద్ ఆ యువకులను నిలదీశాడు. దీంతో ఇటీవల కామవరపుకోటలో జరిగిన వీరభద్రస్వామి తిరునాళ్లలో అరవింద్ను తీవ్రంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బుధవారం మళ్లీ ఆ యువకులు నాగ దీప్తికి ఫోన్ చేసి తమను ప్రేమించకపోతే మీ అన్నయ్యతో సహా మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురైన నాగదీప్తి గురువారం ఇంట్లో ఫ్యాన్కు ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసమయంలో తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రాణి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వెళ్లగా అన్నయ్య అరవింద్ గదిలో నిద్రపోతున్నాడు. నాగ దీప్తి ఫ్యానుకు వేలాడుతూ ఉండడాన్ని గమనించిన అరవింద్ చుట్టుపక్కల బంధువుల సహాయంతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నా కుమార్తె మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై తడికలపూడి ఎస్సై చెన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఏజెన్సీలో ఆదివాసీలకు అందని వైద్యం
కుక్కునూరు: ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు వైద్యం అందని ద్రాక్షలా తయారైందని సీపీఐ మండల కార్యదర్శి మైసాక్షి వెంకటాచారి విమర్శించారు. గురువారం కుక్కునూరు మండలంలోని బండారిగూడెం గ్రామానికి చెందిన ముచికి దేవమ్మ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతూ రాజమ్రండి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిందని ఆయన తెలిపారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన దేవమ్మను కుటుంబసభ్యులు భద్రాచలం, చింతూరు, రంపచోడవరం ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయించారన్నారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో రాజమండ్రి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ దేవమ్మ మృతిచెందిందన్నారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు కూడా కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు లేకపోవడంతో తానే చొరవ తీసుకోని స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాటు చేసినట్లు మైపాక్షి చెప్పారు. వెంకటాపురం నుంచి బండారిగూడెం గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీలో 3 కిలోమీటర్లు మృతదేహాన్ని మోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని తెలిపారు. గిరిజనులు ఇటువంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఇకనైనా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయిల్పామ్ రైతుల ధర్నా గ్రేడింగ్ పేరుతో గెలల ఏరివేత ఆపాలని డిమాండ్ పెదవేగి : గ్రేడింగ్ పేరుతో ఆయిల్పామ్ గెలలు ఏరివేత ఆపాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆయిల్ ఫెడ్ కర్మాగారం వద్ద గురువారం ఆయిల్పామ్ రైతులు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్ రికవరీ శాతం (ఓ.ఇ.ఆర్) పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్పామ్ గెలలు గ్రేడింగ్ పేరుతో ఏరివేయడం అన్యాయమని విమర్శించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా ఉందన్నారు. అనంతరం డిప్యూటీ మేనేజర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెదవేగి, లింగపాలెం మండలాలకు చెందిన ఆయిల్ పామ్ రైతులు బొల్లు రామకృష్ణ, మన్నె బాబూరావు, తాతినేని రమేష్, బొప్పన పూర్ణచంద్రరావు, బి.మురళీ, జాస్తి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి ఆగిరిపల్లి: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతసాగరం గ్రామానికి చెందిన మెతుకుమిల్లి నవీన్ (25) మల్లవల్లిలోని స్పిన్నింగ్ మిల్లులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నవీన్ దుస్తులు ఆరవేసిన తీగపై ఉన్న కరెంట్ వైరుకు పొరపాటున చేయి తగలడంతో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
పట్టిసం ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
పోలవరం రూరల్: ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు పట్టిసంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ లక్షమందికి పైగా భక్తులు ఉత్సవాలకు హాజరవుతారనే అంచనాతో అధికార యంత్రాంగం ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టింది. పంచాయతీ చేపట్టే పనులు ఈ ఏడాది కొంత ఆలస్యమయ్యాయి. గత నాలుగేళ్లుగా పనులు చేపట్టిన టెండర్దారులకు రూ.28 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని, అందువల్ల టెండర్దారులు ముందుకు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. ఫెర్రీ టిక్కెట్ రేటును ప్రస్తుతం రూ.30 వసూలు చేస్తుండగా, ఈ ఏడాది అదనంగా మరో రూ.10 పెంచి రూ.40 వసూలు చేసేందుకు నిర్ణయించారు. భక్తులు శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి రావాల్సిందే. పంచాయతీ చేపట్టే పనులకు సంబంధించి కొంత సొమ్ము దేవస్థానం అధికారులు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే శివక్షేత్రం వద్ద భక్తులు దైవ దర్శనం చేసుకుని వెళ్లే విధంగా చేపట్టే ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయి. అలాగే దర్శనానికి వెళ్లే భక్తులు నది దాటి వెళ్లేందుకు వీలుగా ఫ్లాట్ఫారాలు, పంట్లు, టిక్కెట్ కౌంటర్లు, చలువ పందిళ్లు తదితర పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇంకా చేపట్టాల్సిన పనులు ఇసుక తిన్నెలపై చేపట్టే ఇంకా కొన్ని పనులు ప్రారంభమే కాలేదు. స్నానఘట్టాలతో పాటు, మహిళలు దుస్తులు మార్చుకునే తాత్కాలిక ఏర్పాట్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. వెదురు కర్రలు, తడికలతో వీటిని ఏర్పాటు చేస్తారు. తాగునీటికి పైప్లైన్, చేతిపంపు నిర్మించాల్సి ఉంది. ఏర్పాట్లు పరిశీలించిన సీఐ పట్టిసం రేవులో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను పోలవరం సీఐ సురేష్బాబు, ఎస్సై పవన్కుమార్ పరిశీలించారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు తదితర పనులను పరిశీలించి ఫెర్రీ కాంట్రాక్టర్కు సూచనలు చేశారు. రోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. ఉత్సవాల సమయంలో పోలీసుల అనుమతి లేకుండా పట్టిసీమ, గూటాల, పోలవరం తదితర ప్రాంతాల్లో ప్రయాణికులతో పడవలను నడపరాదని హెచ్చరించారు. -
బియ్యం లారీ చోరీ చేసిన ముగ్గురి అరెస్ట్
వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఏలూరు టౌన్: బియ్యం లారీ చోరీ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం డీఎస్పీ డీ.శ్రవణ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఏలూరు కండ్రికగూడెం సమీపంలోని ఎఫ్సీఐ గోడౌన్ వద్ద 290 బస్తాల బియ్యంతో ఉన్న లారీని గత నెల 29వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. లారీకి ఉన్న జీపీఎస్ ట్రాకర్ను పడేసి ఈ చోరీ చేశారు. బియ్యం విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుంది. దీనిపై లారీ యజమాని ఫిర్యాదు చేయగా ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాధునిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో కేసును పోలీసులు విచారణ చేశారు. గురువారం ఏలూరు రూరల్ పరిధిలో లారీలో ఉన్న బియ్యాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ బియ్యంతో సహా లారీని, నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు కొత్తూరు గ్రామానికి చెందిన జన్యవుల సుధాకర్గా గుర్తించగా పెరవలికి చెందిన దూడల ధనరాజు, కొల్లేపుర మణికంఠ అతడికి సహకరించినట్లు డీఎస్పీ తెలిపారు. సుధాకర్పై రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులు పదుల సంఖ్యలో ఉన్నాయని, షీట్ తెరిచేందుకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన సీసీఎస్ పోలీసులు, ఏలూరు వన్టౌన్ పోలీసులను అభినందించారు. సమావేశంలో ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్, సీసీఎస్ ఏఎస్సై ఎండి రుహుల్ల, శేషు కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అతి వేగం
ఒకరు మృతి.. మరొకరికి స్వల్ప గాయాలు దేవరపల్లి : అతివేగం ఒక యువకుడి ప్రాణం తీసింది. ఆగి ఉన్న వ్యాన్ను మోటార్సైకిల్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం విజయవాడకు చెందిన కల్లూరి విజయ్కుమార్ (30), ఏలూరులోని వినాయకనగర్కు చెందిన ఏలేటి గోవింద్ వరుసకు బావ, బావమరుదులు. ఇద్దరూ కలసి గురువారం ఉదయం విశాఖపట్టణంలో బంధువుల వివాహానికి బయలుదేరారు. విజయ్కుమార్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా, గోవింద్ వెనుక కూర్చున్నాడు. దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్దకు వచ్చే సరికి హైవేపై ఆగి ఉన్న ఐషర్ వ్యాన్ను వెనుక నుంచి బలంగా ఢీ కొన్నారు. ఈ ఘటనలో విజయ్కుమార్ తలకు బలమైన గాయం కాగా చికిత్స కోసం 108 అంబులెన్స్లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గోవింద్కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నట్టు ఏఎస్సై నాగభూషణం తెలిపారు. విజయ్కుమార్కు హెల్మెట్ ఉన్నప్పటికీ ధరించకపోవడం వల్ల మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమాలకు అడ్డాగా గూడెం !
తాడేపల్లిగూడెం: గత ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న గూడెం పట్టణం మళ్లీ అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్గా మారుతోంది. పాతికేళ్ల క్రితం పట్టణం పేకాట బ్యాచ్, దొంగనోట్లకు అడ్డా. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గడిచిన ఐదేళ్ల కాలంలో అసాంఘిక శక్తుల బెండు తీశారు. దొంగనోట్ల ముఠాలు, రౌడీ షీటర్లు పత్తాలేకుండా పోయారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యినట్టు కనిపిస్తోంది. పట్టణంలో వరుసగా జరుగుతున్న కొన్ని ఘటనల ఆధారంగా ఈ విషయం స్పష్టమవుతోంది. తాజాగా జూదశాలలు పట్టణంలో యథేచ్ఛగా సాగుతున్నట్టు సమాచారం. ఇక్కడ పార్టీలు, కూటములతో సంబంధం లేకుండా జూదాలు నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బ్లేడ్ బ్యాచ్లు కాస్తా, గంజాయి బ్యాచ్లుగా రూపాంతరం చెందారు. నెల రోజుల క్రితం వరకు పట్టణంలో గంజాయి వాసన కనిపించగా అరకొర దాడులు, కేసులు నమోదుతో ఆగినట్టుగా కనిపిస్తోంది. అన్ని వైపులా జూదశాలలున్నాయా! పట్టణంలో మూడు దిక్కుల్లో జూదశాలలు రహస్యంగా నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. కడకట్ల, టూటౌన్ తణుకు మార్గంలో ఒక ప్రాంతంలో ఇవి ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటి నిర్వహణకు ఆమోద ముద్ర ఎవరు వేశారన్నది బహిరంగ రహస్యమేనని చెబుతున్నారు. రిమోట్ మాత్రం కడకట్ల ప్రాంతంలో ఉన్నట్టుగా జూదరులు బాహాటంగా అంటున్నారు. గతంలో పట్టణంలో ఆమోదిత జూదశాలలు ఉండేవి. ఆఫీసర్స్ క్లబ్, ఎన్జీఓస్ హోం వంటి చోట నిర్ధేశిత సమయాల్లో సీక్వెన్స్ ఆడుకొనే వెసులుబాటు ఉండేది. అలాంటి సమయంలో పోలీసుల దయాదాక్షిణ్యాలతో కొందరు పేకాటలను రహస్య ప్రాంతాల్లో నిర్వహించేవారు. క్లబ్లను అప్పట్లో ప్రభుత్వమే మూసివేసియడంతో పేకాటలపై పోలీసులు దాడులు పరిపాటిగా మారింది. తాజాగా జూద సంస్కృతి మళ్లీ తెరమీదకు వచ్చింది. పాత బ్యాచ్లు జూలు విదిల్చామనే సంకేతాలను వీటి నిర్వహణ ద్వారా ఇస్తున్నట్టు తెలుస్తోంది. దొంగనోట్ల ముఠాలూ వచ్చాయా! ఒకప్పుడు పట్టణం దొంగనోట్ల ముఠాలకు అడ్డా. నకిలీ కరెన్సీని బ్యాంకుల్లో కూడా జమచేసే కేటుగాళ్లు ఇక్కడ ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దొంగనోట్ల ముఠా ఎక్కడ దొరికినా మూలాలు ఇక్కడే ఉండేవి. జెకోస్లోవేకియా నకిలీ నోట్లను ఇక్కడ మార్చే ముఠాలు ఉండేవి. కాలక్రమంలో కనుమరుగయ్యాయి. తాజాగా మద్యం దుకాణాలలో, రద్దీగా ఉన్న వ్యాపార సముదాయాల్లో కొందరు యువకులు దొంగనోట్లు మారుస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై గూడెం పట్టణం, రూరల్, తణుకు సర్కిళ్ల పరిధిలో ఉన్న అధికారులు కూపీలాగే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం ఉంది. సుమారు 15 సెల్ఫోన్లలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి ముఠా ఆనవాళ్లు తదితర అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి నిందితులను కటకటాల వెనక్కి పంపించనున్నారని తెలుస్తోంది. వ్యాపార కేంద్రం నుంచి విద్యా కేంద్రంగా మారి అభివృద్ధి పథంలో వెళుతున్న పట్టణంలోని తిరిగి పాత జాడ్యాల వాసనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్లుగా ప్రశాంతంగా పట్టణం ప్రస్తుతం సీన్ రివర్స్ జూదాలు, గంజాయి, దొంగనోట్ల బ్యాచ్లకు అడ్డాగా మారుతున్న వైనం భయాందోళన చెందుతున్న ప్రజలు -
వైఎస్సార్ సీపీలో నూతన నియామకాలు
పార్టీ అనుబంధ విభాగ కమిటీల్లో పలువురికి చోటు కై కలూరు: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో ఏలూరు జిల్లాకు చెందిన పలువురి పార్టీ నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు అందాయి. నియామకాల్లో పార్టీ రాష్ట్ర మహిళా విభాగ సెక్రటరీలుగా గంటా సంధ్య, కూసనపూడి కనకదుర్గారాణి (బుజ్జమ్మ), రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీగా సయ్యపురాజు గుర్రాజు, రాష్ట్ర రైతు విభాగ జాయింట్ సెక్రటరీగా ఐనాల బ్రహ్మా జీ, రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీలుగా పరసా చిన్నారావు, కిలారపు శ్రీనివాసరావు(బుజ్జి), బలే నాగరాజు, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీగా కోటగిరి రాజా నాయన, పెద్దిరెడి శ్రీరామ దుర్గాప్రసాద్ ఉన్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఎంపికైన నాయకులు చెప్పారు. రాష్ట్ర స్థాయి పదవులు అందించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కమిటీలో చింతలపూడి నేతలు చింతలపూడి: వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా కమిటీలో పార్టీ చింతలపూడి నియోజకవర్గ నాయకులు ఏడుగురు చోటు సంపాదించారు. జిల్లా వైఎస్ ప్రెసిడెంట్గా జగ్గవరపు జానకిరెడ్డి, జనరల్ సెక్రటరీగా మోరంపూడి జగన్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ముప్పిడి శ్రీను, రాయంకు సత్యనారాయణ, యాక్టివ్ సెక్రటరీగా వామిశెట్టి హరిబాబు, అయినాల వెంకటరమణ మూర్తి, అధికారిక ప్రతినిధిగా రాఘవరాజు ఆదివిష్ణు నియమితులయ్యారు. వీరిని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు, పలువురు అభినందించారు. ఏలూరు నుంచి రాజేష్ ఏలూరు టౌన్: ఏలూరుకు చెందిన వైఎస్సార్ సీపీ నేత పాతినవలస రాజేష్ (కరుణ)ను పార్టీ ఏలూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నియమించారు. రాజేష్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పార్టీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ సూచనలతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. -
మామిడి.. తగ్గనున్న దిగుబడి
నూజివీడు/చింతలపూడి: పండ్లలో రారాజు.. మామిడి. కానీ మామిడిని సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మాత్రం ఏటా దారుణంగా తయారవుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు, పురుగుల బెడద కారణంగా ఆదాయం రాకపోగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. నూజివీడు డివిజన్లో ప్రధాన వాణిజ్య పంటగా మామిడి దశాబ్దాలుగా భాసిల్లుతోంది. నూజివీడు రసాలు.. బంగినపల్లి ఖండాంతరాల్లో ఎంతో ఖ్యాతినార్జించింది. అలాంటి మామిడి పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. గతేడాది కాపులేకపోవడంతో ఈ ఏడాదైనా మామిడి ఆదుకుంటుందనే గంపెడాశతో ఉన్న రైతులను నట్టేట ముంచింది. ఆశలు ఆవిరి నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం మండలాల్లో ఉన్న మామిడి తోటల్లో డిసెంబరు నుంచి పూతలు గణనీయంగా రావడంతో రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. బంగినపల్లి, తోతాపురి, రసాలు తదితర అన్ని రకాల్లో పూతలు ముమ్మరంగా వచ్చాయి. డివిజన్లోని మొత్తం విస్తీర్ణంలో 80 నుంచి 90 శాతంకు పైగా తోటల్లో ఈ ఏడాది పూతలు వచ్చాయి. అయితే జనవరి రెండో వారం నుంచి మామిడి తోటలపై తామర పురుగు దాడి చేయడంతో వచ్చిన పూతంతా నిలువునా మాడిపోయింది. తామర పురుగుకు బూడిద తెగులు తోడవ్వడంతో మామిడి రైతుల పరిస్థితి కోలుకోలేని విధంగా తయారైంది. ఒక్కొక్క రైతు మామిడి పూత నిలుపుకోవడం కోసం 10 నుంచి 12 సార్లు రసాయన మందులను పిచికారీ చేసినప్పటికీ తామర పురుగును నియంత్రించలేకపోవడం గమనార్హం. దీంతో మామిడిపై రైతుల ఆశలన్నీ అడియాశలైపోయాయి. డివిజన్లోని 40వేల ఎకరాల్లో విస్తరించిన మామిడి తోటల పరిస్థితి దయనీయంగా మారింది. పూత దశలోనే.. నష్టాల ఊబిలో చింతలపూడి నియోజకవర్గంలో సైతం మామిడి రైతులకు ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పూత దశలోనే మామిడి రైతులు నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. నియోజకవర్గంలో 80 శాతం పైగా మామిడి తోటలు ఈ సంవత్సరం పూత పూసినప్పటికీ మంచు వల్ల పూత మాడిపోయి, పిందెలు రాలిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. 30 ఏళ్ల క్రితం దాదాపు 60 వేల ఎకరాల్లో ఉండే మామిడి..ఏటా వివిధ కారణాలతో మామిడి రైతులు నష్టపోతుండడంతో ఇప్పుడు కేవలం 7 వేల ఎకరాలకు పడిపోయింది. రైతులు మామిడి తోటలు నరికివేసి ప్రత్యామ్నాయంగా పామాయిల్, మొక్కజొన్న, పొగాకు, వేరుశనగ వంటి వాణిజ్య పంటలు పండిస్తున్నారు. నియోజకవర్గంలో ఏటా 90 శాతం బంగినపల్లి, 10 శాతం కలెక్టర్ (తూతాపురి) దిగుబడి ఉంటుంది. ప్రభుత్వం నుంచి మామిడి పంటకు సరైన ప్రోత్సాహం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మామిడి తోటలపై తామర పురుగు దాడి నిలువునా మాడిపోయిన పూత పెట్టుబడులు రాక నష్టాల ఊబిలో రైతాంగం రెండేళ్లుగా మామిడి రైతులకు నష్టాలు -
ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలి
జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ఉమ్మడి జిల్లా కార్గో అసిస్టెంట్ కమర్షియల్ ట్రాఫిక్ మేనేజర్ జి.లక్ష్మీప్రసన్న సుబ్బారావు అన్నారు. బుధవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కార్గో పార్సిల్ సర్వీస్ ద్వారా రూ.187 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో గూడ్స్ ట్రాన్స్పోర్ట్లో మొదటి స్థానంలో ఉందన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్గో లాజిస్టిక్స్ ద్వారా రూ.91 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 22 రీజియన్లలో పశ్చిమగోదావరి జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోనూ పరిసర ప్రాంతాలలోనూ ఆథరైజ్డ్ ప్యాకింగ్ పార్సిల్ బుకింగ్ సెంటర్కు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. రూ.1000 రూపాయలతో ప్యాకింగ్ పార్సిల్ బుకింగ్ కౌంటర్ను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు, సలహాల కోసం 73311 47263, 9959225489, 7382994699 నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం పీవీవీ గంగాధర్, స్థానిక ఆర్టీసీ కార్గో డీఎంఈ టి.సత్తిబాబు పాల్గొన్నారు. -
వర్సిటీల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, యూనివర్సిటీల్లో రాజకీయ జోక్యం నిషేధించాలని, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల రాకను వ్యతిరేకించాలని, ఢిల్లీ యూనివర్శిటీలో సస్పెన్షన్కు గురైన 17 మంది విద్యార్ధులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా బుధవారం పట్టణంలోని నన్నయ యూనివర్శిటీ సబ్ సెంటర్ వద్ద విద్యార్ధులతో కలిసి ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అప్పలస్వామి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, విశ్వ విద్యాలయాలలో వీసీ నియామకాలలో రాష్ట్ర హక్కులను కాలరాసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగ విలువలను ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ చేసేందుకు చట్టాలను సవరిస్తున్నారని ధ్వజమెత్తారు. విశ్వ విద్యాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బి.సౌజన్య, డి. దేవి, ఎం.మానస, జ్ఞానేంద్ర, ఎ.ప్రదీప్ పాల్గొన్నారు. -
లంచావతార ఉద్యోగి తొలగింపు?
నిడమర్రు: ‘అడిగినంత ఇస్తేనే ఆక్వా సాగు’ అంటూ సాక్షిలో ఈనెల 14న వచ్చిన కథనంపై జిల్లా ఫారెస్టు అధికారులు స్పందించారు. లంచం డిమాండ్ చేసిన ఫారెస్ట్ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నబిగారి శ్రీనివాసబాబును విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. శ్రీనివాసబాబుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మి రైతులను విచారించారు. అనంతరం నివేదికను జిల్లా ఫారెస్టు అధికారికి సమర్పించారు. నివేదికలోని అంశాలు బహిర్గతం కాకపోయినప్పటికీ అనధికారికంగా అందిన సమాచారం మేరకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న శ్రీనివాసబాబును విధులనుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మిని సంప్రదించడానికి ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. -
కాలుష్యం పేరుతో పేదలపై కుట్ర
భీమవరం: అభివృద్ధి ముసుగులో ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు పేదల ఇళ్లను తొలగించే బుల్డోజర్ రాజకీయాలను తక్షణం విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్వీ గోపాలన్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాలుష్యమంటూ ఎన్నో ఏళ్లుగా కాలువలు, పంట బోదుల పక్కన నివసిస్తున్న పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేయడం దారుణమన్నారు. ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలం ఐ.భీమవరం నుంచి పాలకోడేరు మండలం ఏఎస్ఆర్ నగర్ వరకు కాలుష్యం పేరుతో పేదల ఇళ్ళను కూల్చివేసి పేదలకు నిలువ నీడలేకుండా చేస్తున్నారని గోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం చేసే పనులను సమర్ధిస్తామని అయితే అభివృద్ధి పేరుతో పేదలను రోడ్లపాలు చేయాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో భూస్వాముల పక్కనే పేదల ఇళ్లు ఉండడమే తొలగింపునకు అసలు కారణమన్నారు. ప్రభుత్వ పోరంబోకు భూములను భూస్వాములు, పెత్తందారులకు కట్టబెట్టడానికే పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనకు విరుద్ధంగా నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న ఉప్పునీటి బోర్లు రఘురామ కృష్ణంరాజుకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.వాసుదేవరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, సేశపు ఆశ్రియ్య పాల్గొన్నారు. -
గ్రూపు–2 పరీక్షలకు సమన్వయ అధికారుల నియమాకం
ఏలూరు(మెట్రో): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 23న నిర్వహించనున్న గ్రూపు– 2 మెయిన్ పరీక్షలకు సీనియర్ జిల్లా అధికారులను సమన్వయ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. పరీక్షల పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్ను కో–ఆర్డినేటర్గా నియమించారు. ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాలకు సమన్వయ అధికారులను నియమించారు. పెదపాడు మండలం వట్లూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రానికి జెడ్పీ సీఈఓ కె.సుబ్బారావు, పెదపాడు మండలం వట్లూరు సీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల సెంటర్కు డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, ఏలూరు సీఆర్ఆర్ కళాశాల సెంటర్కు డ్వామా పీడీ కె.వి.సుబ్బారావు, పెదపాడు మండలం వట్లూరు సీఆర్ఆర్ మహిళా కళాశాల సెంటర్కు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా, పెదవేగి మండలం దుగ్గిరాలలోని ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల సెంటర్కు సెరీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్ డి.వాణి, ఏలూరు జీజీహెచ్కు ఎదురుగా ఉన్న సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల సెంటర్కు జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎస్.రామ్మోహన్ను నియమించారు. -
జీబీ సిండ్రోమ్పై అప్రమత్తం
ఏలూరు(మెట్రో): గులియన్ బారి సిండ్రోమ్(జీబీఎస్)పై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జీబీఎస్, ఇమ్యునైజేషన్, మాతా శిశుమరణాల నివారణ తదితర అంశాలపై డీసీహెచ్ఎస్ డా.పాల్ సతీష్, డీఎంహెచ్ఓ డా.ఆర్.మాలిని తదితరులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జీబీఎస్ను ఎదుర్కోవడానికి వైద్యాధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ వ్యాధిపై ఎలాంటి అపోహలకు తావులేకుండా అవగాహన కలిగించాలన్నారు. అనుమానాస్పద కేసులను గుర్తించిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జీబీఎస్ సిండ్రోమ్ వ్యాప్తి, కారణాలు నిరోధానికి తీసుకోవల్సిన చర్యలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో వైద్యాధికారుల పనితీరు మరింత మెరుగుపడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారి ఆరోగ్య నివేదికను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే విషయాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. -
అర్జీల పరిష్కారంలో అలక్ష్యం
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ఏలూరు(మెట్రో): ప్రజా సమస్యలే పరిష్కారం దిశగా ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ప్రజాసమస్యల పరిష్కార వేదిక అంటూ కూటమి సర్కారు పేరు మార్చిందే తప్ప సమస్యలను పరిష్కరించడంలో మాత్రం శ్రద్ధ చూపించడం లేదు. వేలాది ఫిర్యాదులు వస్తున్నప్పటికీ వాటి పరిష్కారంపై దృష్టి సారించకుండా కాలం గడుపుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతీ సోమవారం సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులందరూ అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసి సంబంధిత శాఖలకు వచ్చిన ఫిర్యాదులను బదిలీ చేస్తున్నారు. అయితే వందలాది ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వచ్చిన ఫిర్యాదులే పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఫిర్యాదిదారులు మళ్లీ మళ్లీ జిల్లా కేంద్రానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు. సీఎం డాష్ బోర్డులో సైతం స్పష్టంగా ఫిర్యాదులు కనిపిస్తున్నప్పటికీ జిల్లాల సమాచారం ఎప్పటికప్పుడు నమోదవుతున్నా.. ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఏలూరు జిల్లాలో 35 శాతం ఫిర్యాదులు పెండింగ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1845 ఫిర్యాదులు రాగా, 712 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉన్నాయి. 1125 ఫిర్యాదులను పరిష్కరించినట్లు సీఎం డాష్బోర్డులో అంకెలు స్పష్టం చేస్తున్నాయి. 8 ఫిర్యాదులు రీ ఓపెన్లో ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 1149 ఫిర్యాదులు రాగా, 335 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉండగా, 805 ఫిర్యాదులు పరిష్కరించారు. 9 ఫిర్యాదులను రీ ఓపెన్ చేశారు. ఏలూరు జిల్లాతో పోల్చుకుంటే పశ్చిమగోదావరి జిల్లా ఫిర్యాదుల పరిష్కారంలో ముందు వరుసలోనే ఉంది. సుమారు 70 శాతం పైగా ఫిర్యాదులను పరిష్కరించగా, ఏలూరు జిల్లాలో 65 శాతం ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకున్నాయి. మిగిలిన సమస్యలు పరిష్కరించడంలో అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమాలకు పేర్లు మార్చడంలో చూపించిన శ్రద్ధ ఫిర్యాదులను పరిష్కరించడానికి చొరవ చూపడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా భూ సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు, పెన్షన్ సమస్యలు అధికంగా వస్తున్నాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. గత ప్రభుత్వంలో సచివాలయాల్లోనే పరిష్కారం గతంలో ప్రతీ వారం స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై నివేదికలు ప్రభుత్వం పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణం ఆదేశాలు జారీ చేసేది. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే ఫిర్యాదులు పరిష్కరించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి సచివాలయాల పరిధిలోనే చర్యలు తీసుకునేది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా సమస్యలు కనిపిస్తున్నప్పటికీ ప్రజా ఫిర్యాదులపై మాత్రం స్పందన అరకొరగా ఉంది. న్యూస్రీల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సగానికి పైగా ఫిర్యాదులు పెండింగ్లో ఫిర్యాదులపై పర్యవేక్షణ కరువు ఏలూరు కంటే మెరుగ్గా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1,845కు 712 ఫిర్యాదులు పెండింగ్ -
సచివాలయ ఉద్యోగులపై పూటకో మాట
ఏలూరు(మెట్రో): పూటకో మాట.. రోజుకో నిర్ణయం.. సచివాలయ ఉద్యోగులపై కూటమి సర్కారు చేస్తున్న ప్రకటనలతో అయోమయం నెలకొంది. రేషనలైజేషన్ అంటూ ఉద్యోగుల భవితవ్యంతో ఆడుకుంటున్నారు. వారి ఉద్యోగాలను ఉంచుతుందో, తీసేస్తోందో అనే భయంతో సచివాలయ ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. సీనియర్ అధికారులను నియమిస్తామని వారి ద్వారా సర్వీసు నిబంధనలను రూపొందిస్తామంటూ కూటమి నాయకులు ప్రకటించడం మరింత గందరగోళానికి తావిస్తోంది. బెదిరింపు ధోరణిలో సర్కారు తీరు జిల్లావ్యాప్తంగా కూటమి సర్కారు వచ్చిన వెంటనే వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన మాటలు అటకెక్కాయి. జీతాలు పెంచడం కాదు కదా అసలు వలంటీర్ల వ్యవస్థే లేకుండా చేసేసింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులపై కుట్రలు పన్నేందుకు కూటమి సర్కారు సమాయాత్తమైంది. అనేక సర్వేల పేరుతో వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ కనీసం వారి భవిష్యత్తుపై భరోసా లేకుండా రోజుకో ప్రకటన విడుదల చేస్తోంది. సచివాలయాలను తొలగిస్తామని, ఉద్యోగులను ఆయా శాఖలకు పంపుతామని ఒక మంత్రి ప్రకటిస్తే, సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ చేస్తామని, వారిని జనాభా ఆధారంగా నియమిస్తామంటూ మరో మంత్రి ప్రకటన చేస్తున్నారు. ఇలా రేషనలైజేషన్ అంటూ ఒక వైపు, ఉద్యోగులను గ్రేడ్లుగా విభజిస్తామని మరో వైపు ఇలా అనేక విధాలుగా ఉద్యోగులను బెదిరించే విధంగా రోజుకో ప్రకటనను కూటమి సర్కారు విడుదల చేస్తోంది. ఇప్పటికే వలంటీర్ వ్యవస్థ రద్దు గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు వలంటీర్, వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తూ నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే 600 పైచిలుకు సేవలను గ్రామ సచివాలయాల ద్వారా గత ప్రభుత్వం ప్రజలకు అందించింది. జనన ధ్రువీకరణ పత్రం నుంచి మరణ ధ్రువీకరణ పత్రం వరకు, మహిళల సంక్షేమం, రైతు సేవలు, రేషన్కార్డులు, ఇలా ప్రతీ ఒక్క సేవను గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు గత ప్రభుత్వం చేరువచేసింది. ఈ వ్యవస్ధలో ప్రధానమైన వలంటీర్ వ్యవస్థను ఇప్పటికే రద్దు చేయడంతో జిల్లాలో 10 వేల మంది వలంటీర్లు ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం పొంతన లేని ప్రకటనలతో సచివాలయ ఉద్యోగులు సైతం గందరగోళానికి గురవుతూ వారి భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 517 సచివాలయాలు ఉండగా, ఈ సచివాలయాలకు 5,591 పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 4,412మంది సచివాలయ ఉద్యోగులు జిల్లాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. 1,179 సచివాలయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి చర్యలు తీసుకోకపోగా, ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసే ప్రకటనలు కూటమి సర్కారు చేస్తుండటంతో వారి భవిష్యత్తు దినదినగండంగా మారింది. ఇప్పటికే సర్వేల పేరుతో ముప్పుతిప్పలు తాజాగా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరణ అంటూ గందరగోళం -
ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే నియమించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఏలూరు జిల్లా కో కన్వీనర్ తొర్లపాటి రాజు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుకు ఏఐవైఎఫ్ నాయకులు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర ఖాళీల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. డీఆర్ఓని కలిసిన వారిలో ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా నాయకులు ఏ ప్రసన్నకుమార్, ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కోశాధికారి కె.క్రాంతి కుమార్ పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా జరుగుతున్న ప్రయోగ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. పరీక్షల చివరి రోజున జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 14 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 659 మందికి గాను 640 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 317 మందికి 311 మంది హాజరు కాగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 342 మందికి గాను 329 మంది హాజరయ్యారు. ఛత్రపతి శివాజీకి నివాళులు భీమవరం: భీమవరం పట్టణంలో మరాఠీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ముఖ్యఅతిథిగా విచ్చేసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. శివాజీ దేశానికే ఆదర్శమైన మహారాజని, మహిళల పట్ల అతను చూపిన గౌరవం, రాజ్య పరిపాలన దక్షత సువర్ణాధ్యాయంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో మరాఠీ సంఘం నాయకులు చంద్రశేఖర్, శ్రీవిద్య, అల్లు శ్రీనివాస్, మటపర్తి మురళీకృష్ణ, ఇళ్ల హరికృష్ణ, వనమా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సెలవు ఏలూరు(మెట్రో): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్ధలు పోలింగుకు ముందు రోజు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు రోజున అవసరాన్ని బట్టి సెలవులు ప్రకటించాలని రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. ఏలూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడిన కార్యాలయాలు/సంస్థలకు పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు స్థానిక సెలవు ప్రకటించారన్నారు. ఓట్ల లెక్కింపునకు పెదపాడు మండలం, వట్లూరు గ్రామంలోని సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, మార్చి 3న కాలేజీలో స్థానిక సెలవు గా ప్రకటిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 21లోగా ఎమ్మెల్సీ ఓటరు స్లిప్పుల పంపిణీ ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 21లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 16 వేల ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారని, మిగిలిన వాటిని ఈ నెల 21లోగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భీమవరంలోనే కలెక్టరేట్ భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. బుధవారం భీమవరంలో మాట్లాడుతూ కలెక్టరేట్ తరలిపోతుందనేది కేవలం అపోహమాత్రమేనన్నారు. -
చిరువ్యాపారులపై అధికారుల జులుం
ఏలూరు (టూటౌన్): రోడ్డుపక్కన ఆక్రమణల తొలగింపులో భాగంగా కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పోలీసుల సహకారంతో బుధవారం స్థానిక సత్రంపాడు, శాంతి నగర్ ప్రాంతాల్లోని రోడ్డుపక్కన ఉన్న చిరు వ్యాపారస్తుల దుకాణాలను, హోర్డింగ్లను, షెల్టర్లను తొలగించారు. దీనిపై కొందరు వ్యాపారాలు కార్పొరేషన్ వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలపగా వారిని పోలీసులు పక్కకు లాగేశారు. శాంతి నగర్ నేరెళ్ల హోండా షోరూమ్కు ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన పలు దుకాణాలను ఈ సందర్భంగా తొలగించారు. సత్రంపాడు వంతెన వద్ద నుంచి ఇటు సీఆర్ఆర్ పబ్లిక్ స్కూలు సెంటర్ వరకు ఉన్న ఆక్రమణలు తొలగించడంతో వారంతా ఆందోళన చేపట్టారు. నోటీసులు ఇవ్వకుండా రోడ్డుకి ఇరువై అడుగుల దూరంలో ఎటువంటి అడ్డూలేని షాపులను కూల్చడం అన్యాయమని వైఎస్సార్ సీపీ ఏలూరు అసెంబ్లీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వైఎస్ శివరావు అన్నారు. బాధిత చిరు వ్యాపారులకు అండగా నిలబడి అధికారులను నిలదీశారు. ఆక్రమణల పేరుతో రోడ్డు పక్కన దుకాణాల తొలగింపు -
విదేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
జర్మనీ దేశ ప్రతినిధి బృందం ద్వారకాతిరుమల: జర్మనీ, యూరప్ దేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశం తమ పర్యటన ద్వారా బలపడిందని జర్మనీ దేశ ప్రతినిధి బృందం పేర్కొంది. రైతు సాధికార సంస్థ ‘్ఙఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం’ (ఏపీసీఎన్ఎఫ్) ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జర్మన్ ప్రతినిధి బృందం ఏలూరు జిల్లాలో బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా ‘ఫౌండేషన్ ఆన్ ఫ్యూచర్ ఫార్మింగ్ ’ తరపున బృంద సభ్యులు జాస్పర్ జోర్డాన్, బెన్నెడిక్ట్ హెర్లిన్, పోర్చుగల్కు చెందిన ప్రాజెక్టు ఎర్త్ ప్రతినిధి డియోగో కౌటినో, అటెలియర్ ఫుడ్ సిస్టమ్ చేంజ్ ప్రతినిధి లూకస్ కేహ్లే ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుగుంటలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అలాగే ఏటీఎం(ఎనీ టైమ్ మనీ), ఏ గ్రేడ్ మోడల్స్తో పాటు, పీఏండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్), ఆర్డీఎస్ (రబీ డ్రై సోయింగ్) తదితర పంట పొలాలను సందర్శించి, సాగు విధానాలపై ఆరా తీశారు. లెక్కల మాస్టారుపై డీఈఓ విచారణ ద్వారకాతిరుమల: స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్వీ ముత్యాలరావు గతేడాది నవంబర్లో విద్యార్థులను చితకబాదిన ఘటనపై డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ బుధవారం విచారణ జరిపారు. వివరాల్లోకి వెళితే. ద్వారకాతిరుమల ఎంపీయూపీ పాఠశాలలో ఒకటవ తరగతి చదివే గుండె త్రివిక్రమ్, నాల్గో తరగతి చదివే గుండె సహస్రలను గతేడాది నవంబర్ 25న లెక్కల ఉపాధ్యాయుడు ఎంఎన్వీ ముత్యాలరావు అకారణంగా చితకబాదిన ఘటనపై తల్లిదండ్రులు అప్పట్లో కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణలో విద్యార్థులను ముత్యాలరావు కొట్టాడని ఎంఈఓ నివేదికలో పేర్కొన్నా ఆయనపై డీఈఓ చర్యలు తీసుకోకుండా, బదిలీ చేయడంపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ, చైల్డ్రైట్స్ ప్రొటెక్షన్ అధికారి సూర్యచక్ర వేణి బుధవారం పాఠశాలలో విచారణ జరిపి గుండె ధర్మరాజు, మాణిక్యాలు నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అలాగే ఎంఈఓ–1 డి.సుబ్బారావు, ఎంఈఓ–2 పి.వెంకట్రావుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం డీఈఓ మద్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. కాగా మొదటి నుంచి ఉపాధ్యాయుడు ముత్యాలరావును కాపాడుతూ వస్తున్న డీఈఓతో విచారణ జరిపిస్తే బాదితులకు ఏం న్యాయం జరుగుతుందని పలువురు అంటున్నారు. ఇతర అధికారులతో కలెక్టర్ విచారణ జరిపించాలని కోరుతున్నారు. -
జీవితంపై విరక్తితో నిరుద్యోగి ఆత్మహత్య
ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన ఉంగుటూరు: జీవితంపై మీద విరక్తితో ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంసాలిపాలెంలో ఈనెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం యర్రమిల్లిపాడుకు చెందిన దాసరి సత్యనారాయణ, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కల్లుగీత వృత్తి చేసుకునే ఈ కుటుంబం కంసాలిగుంటలో నివసిస్తోంది. సత్యనారాయణ ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కాగా కుమారుడు పృధ్వీ చందు హైదరాబాద్లో ఎంబీఏ చదువుతున్నాడు. తక్కెళ్లపాదులోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం పృధ్వీ చందు హైదరాబాద్ నుంచి ఈనెల 11న వచ్చాడు. ఫంక్షన్ అనంతరం ఈనెల 17న ఒక కుమార్తెను గోపాలపురంలో అత్తారింటి వద్ద దింపేందుకు తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మ వెళ్లారు. అదేరోజు మధ్యాహ్నం ఏమైందో గానీ పృధ్వీ చందు ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్కగదిలో ఉన్న మరో సోదరి ఎంతసేపు తలుపుకొట్టినా చందు తీయకపోవడంతో చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు తీసీ చందుని భీమడోలులోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పృధ్వీ చందు మృతి చెందాడు. హైదరాబాదులో ఇంటర్న్షిప్ చేసే ఉద్యోగాన్ని వదిలేసి, మరొక కంపెనీకి ప్రయత్నం చేస్తుండగా రాకపోవడంతో విరక్తి చెంది పృధ్వీ చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పృధ్వీ చందు మృతితో ఆ కుటుంబం శోకసంద్రమైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేయగా మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఏలూరు (టూటౌన్): ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు ఆమెను రక్షించారు. వివరాల్లోకి వెళితే ఏలూరు రెండో పట్టణ పరిధిలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న హేమకుమారి స్థానికంగా సీనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ శాఖ కార్యాలయంలో పనిచేస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారి వేధింపులు తాళలేక అసహనానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని భీమవరంలో ఉన్న తన సోదరికి తెలియజేసి ఏలూరు తంగెళ్లమూడి బ్రిడ్జి వద్ద తమ్మిలేరులోకి దూకేందుకు ప్రయత్నించింది. హేమకుమారి సోదరి ఈ విషయంపై అభయ రక్షక దళానికి సమాచారం ఇచ్చారు. వెంటనే రెండో పట్టణ సీఐ వెంకటరమణ తన సిబ్బందిని హేమకుమారి వద్దకు పంపి ఆమెను ఆత్మహత్యాయత్నం నుంచి రక్షించి పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమెను రక్షించిన వారిలో మహిళ కానిస్టేబుల్ ప్రియదర్శిని, దేవ మాత తదితరులు ఉన్నారు. -
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ముదినేపల్లి రూరల్: చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెయ్యేరు అలేఖ్య కాలనీలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తూర్పుగోదావరిజిల్లా గొల్లప్రోలుకు చెందిన మమ్మిడివరపు రాంబాబు, సంతోషిణి(26) దంపతులు. వీరు ఉపాధి నిమిత్తం పెయ్యేరులో కొంతకాలంగా నివాసముంటున్నారు. రాంబాబు చేపల చెరువుపై గుమస్తాగా పనిచేస్తుంటాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉండగా స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుకుంటున్నారు. బుధవారం ఉదయమే రాంబాబు విధుల నిమిత్తం బయటకు వెళ్లిపోగా కొద్దిసేపటికి సంతోషిణి ఫ్యాన్కు ఉరి వేసుకుని వేళాడుతుండడం పిల్లలు గమనించి కేకలు వేశారు. స్థానికులు వచ్చి పరిశీలించి ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. తహసీల్దార్ జేఎస్ సుభానీ, ఎస్సై వీరభద్రరరావు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. సంతోషిణి బంధువు సింహాద్రి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతోషిణి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
పైడిపర్రులో టెర్రర్
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే.. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి పైడిపర్రులో శాంతి భద్రతలు క్షీణించాయని, నోరెత్తితే దాడిచేసే పరిస్థితి దాపురించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్లు, జూదాలకుతోడు రౌడీ మూకలు పేట్రేగిపోతుండగా, యువత, చిన్న పిల్లలకు సైతం గంజాయి, మత్తు పదార్థాలను అలవాటు చేసే పరిస్థితి పైడిపర్రులో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సరిగ్గా మూడు నెలల క్రితం పైడిపర్రు స్పార్క్ హోటల్లో భారీ కోతాటను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పైడిపర్రులో పేకాటను కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. గతనెల 31వ తేదీన రూరల్ పోలీస్ స్టేషన్లో వీఆర్లో ఉన్న ఎస్సై ఏజీఎస్ మూర్తి సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనతో పోలీసు యంత్రాంగం కుదేలైంది. ప్రత్యేక బీట్లు నిర్వహిస్తున్నాం ఈ ఘటనలపై రూరల్ ఎస్సై చంద్రశేఖర్ను సాక్షి వివరణ కోరింది. దీనిపై ఆయన మాట్లాడుతూ దొంగతనాల వ్యవహారంపై పోలీసులు బృందాలుగా విచారణ చేస్తున్నారని, అనుమానితులను గుర్తిస్తున్నామని చెప్పారు. పేకాటలపై సమాచారం ఇస్తే దాడులు నిర్వహిస్తామన్నారు. రాత్రి సమయంలో ప్రత్యేక బీట్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. తణుకు అర్బన్: పైడిపర్రు గ్రామంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. దొంగల స్వైరవిహారం.. రౌడీ మూకల బెదిరింపులు.. జూదానికి కేరాఫ్ అడ్రస్గా ఈ ప్రాంతం మారింది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలతో పైడిపర్రువాసులు హడలిపోతున్నారు. ఈనెల 17వ తేదీ అర్ధరాత్రి సయయంలో 1 గంట నుంచి 5 గంటలలోపు పైడిపర్రు ప్రాంతంలో దొంగలు స్వైరవిహారం చేశారు. ఒక మహిళ మెడలో 3 కాసుల బంగారు గొలుసు గుంజుకుని పారిపోగా.. మరో ఇంటి మందు పార్కింగ్ చేసిన మోటార్సైకిల్ను అపహరించారు. గణేశుల సూర్యనారాయణ, ఆరేటి సతీష్, పంగం శంకరం, యర్రంశెట్టి సుబ్రహ్మణ్యం ఇళ్లలో తలుపులు పగులగొట్టి, తాళాలు విరగ్గొట్టి, కిటికీ చువ్వలు విరిచేసి, తలుపుల గెడలు వంచేసి ఇలా విధ్వంసం సృష్టించారు. దొంగలు చేసిన శబ్దాలకు మెలకువ వచ్చి కేకలు వేయడంతో పలాయనం చిత్తగించారు. ఒక దొంగ నిక్కరుతో ఉన్నాడని, మరో దొంగ ఫ్యాంటు ధరించి ఉన్నారని బాధితులు చెబుతుండడంతో ఈ వ్యవహారంలో ఎంతమంది ఉన్నారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ దొంగతనాలన్ని రూరల్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే జరగడం విశేషం. పైడిపర్రు ప్రాంతం మునిసిపాలిటీలో 4 వార్డులుగా కలిసి ఉన్నప్పటికీ ఆ ప్రాంతం ఇంకా గ్రామస్థాయి వాతావరణాన్నే కలిగి ఉంటుంది. 15వేల జనాభా ఉన్న ఈ పైడిపర్రులో 2500 పైగా ఇళ్లు ఉన్నాయి. ఆందోళనలో పైడిపర్రువాసులు ఇటీవల ఫ్లెక్సీ వివాదంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని రౌడీ మూకలు చాకుతో దాడిచేసి తీవ్రంగా గాయపరచడం, అలాగే ఒక ఇంట్లో పేకాట నిర్వహించడం వంటి ఘటనలు జరిగాయి. దీంతో ఈనెల 16వ తేదీన శ్రీబాల వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో గ్రామపెద్దలు సమావేశమై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే రాత్రి దొంగలు స్వైరవిహారం చేయడం విశేషం. గ్రామంలో గాడితప్పిన లా అండ్ ఆర్డర్ ఒకే రాత్రి 6 ఇళ్లలో చోరీకి యత్నం గృహాల్లోనే పేకాట శిబిరాలు ఇటీవల చాకుతో యువకుడిపై దాడిచేసిన పేకాట బ్యాచ్ ఎస్సై ఆత్మహత్యతో కొరవడిన పోలీసు నిఘా బంగారు తాడు గుంజుకుపోయాడు 17వ తేదీ తెల్లవారుజాము 5 గంటల సమయంలో మొదటి అంతస్తు భవనంలో గుమ్మం శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి నా మెడలోని 3 కాసుల బంగారు తాడును గుంజుకుని పారిపోయాడు. నా భర్త గత కొంతకాలంగా వేరొక మహిళతో ఉంటుండగా దొంగ వెళ్తూవెళ్తూ ఆవిడ పేరు ప్రస్తావిస్తూ ఆమె జోలికొస్తే చంపేస్తానని హెచ్చరించి పారిపోయాడు. –దేవ లక్ష్మి నవదుర్గ భయాందోళన సృష్టించారు మా ఇంటి ముందు పెట్టిన మోటార్సైకిల్ 17వ తేదీన తెల్లవారిన తరువాత చూస్తే కనిపించలేదు. అదే రోజు రాత్రి నా బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో కూడా దొంగలు హల్చల్ చేశారు. గతంలో తాళం వేసి ఉన్న ఇళ్లు మాత్రమే దోచుకునే దొంగలు ఇప్పుడు ఇంట్లో మనుషులు ఉన్న ఇళ్లలోకి సైతం ప్రవేశించారు. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి భయాందోళన పరిస్థితులు లేవు. –చల్లా పెద్దిరాజు -
హత్య కేసులో నిందితుల అరెస్టు
గణపవరం: నిడమర్రు మండలం బావాయిపాలెంలో జరిగిన యువకుడి హత్యకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గణపవరం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ శ్రవణ్కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 16వతేదీ రాత్రి బావాయిపాలెం గ్రామానికి చెందిన మజ్జి ఏసు(25) అనే వ్యక్తిని చంపివేసి చేయినరికి కాల్వలో పడవేసినట్లు కేసు నమోదైంది. ఈహత్య కేసును ఛేదించేందుకు ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు గణపవరం సీఐ ఎంవీ సుభాష్, గణపవరం, నిడమర్రు, చేబ్రోలు ఎస్సైలు మణికుమార్, వీరప్రసాద్, సూర్యభగవాన్ల నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించిన మూడు రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించి, హత్యలో భాగస్వాములైన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు. వివాహేతర సంబంధమే కారణం ఈ కేసులో మొదటి ముద్దాయి పిల్లి ఏసుబాబు భార్యతో మజ్జి ఏసుకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఈ హత్యకు ప్రేరణ అన్నారు. మృతుడు తరచూ ముద్దాయి భార్యతో మాట్లాడటం, సెల్ఫోన్ మెసేజీలు పెడుతున్నాడన్న అనుమానంతో గతంలో కులపెద్దల సమక్షంలో తగవు పెట్టినా మృతుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతడిని హతమార్చేందుకు పిల్లి ఏసుబాబు, అతని తండ్రి అన్నవరం, కోలమూరు గ్రామానికి చెందిన గెడ్డాడ శ్రీనివాసరావు పథకం రచించారు. ఈనెల 15వ తేదీన పిల్లి ఏసుబాబు తన భార్య ఫోన్లో ఆమె పెట్టినట్లుగా మజ్జి ఏసుకు ఫోన్లో మెసేజ్ పెట్టాడు. తాను ఉండి మండలం మహదేవపట్నంలో తన పుట్టింట్లో ఉన్నానని, రావాలని మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూసిన మజ్జి ఏసు మోటార్సైకిల్పై మహదేవపట్నం చేరుకుని, ఆమె ఇంటి డాబాపైకి వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ముద్దాయిలు మజ్జి ఏసును పట్టుకుని దారుణంగా చావబాదారు. ఆ దెబ్బలకు తాళలేక మజ్జి ఏసు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆరా తీశారు. దీనితో మా గ్రామంలో కులపెద్దల సమక్షంలో తేల్చుకుంటామని చెప్పి మజ్జి ఏసును పిల్లి ఏసురాజు, గెద్దాడ శ్రీనివాసరావు మోటార్సైకిల్పై ఎక్కించుకుని బావాయిపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో బావాయిపాలెం శివారు కొత్తకోడుపుంత వద్ద ఆగారు. అప్పటికే అక్కడ కొబ్బరి గెలలుకోసే కత్తితో సిద్ధంగా ఉన్న పిల్లి ఏసుబాబు తండ్రి పిల్లి అన్నవరంతో కలిసి మజ్జి ఏసు కుడిచేతిని నరికివేశారు. చెయ్యిని కాలువలో పడేసి, బావాయిపాలెం శివారు పశువుల రేవు వద్ద మజ్జి ఏసును వదిలేసి వెళ్లిపోయారు. అధికరక్త స్రావంతో మజ్జి ఏసు కొద్దిసేపటికే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు వారు ఉపయోగించిన కత్తిని, మూడు మోటార్ సైకిళ్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రవణ్కుమార్ -
మోటారుసైకిల్ అదుపు తప్పి..
ఏలూరు (టూటౌన్): మోటారుసైకిల్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏలూరు రూరల్ మండలంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమడోలు మండలం ఆగడాలంక గ్రామానికి చెందిన భలే బాలాజీ (34) బంటా మేస్త్రిగా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇతనికి వివాహం జరిగినప్పటికీ భార్యాభర్తల మధ్య విభేధాలతో ఇరువురు వేరుగా ఉంటున్నారు. బాలాజీ తన సొంత గ్రామంలో కాకుండా తన అక్క ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో మాదేపల్లి గ్రామం నుంచి మంగళవారం అర్ధరాత్రి కోటేశ్వర దుర్గాపురం వైపు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో తలపై బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం బుధవారం సాయంత్రం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. వాగులో దిగబడిన స్కూల్ బస్సు జంగారెడ్డిగూడెం: పట్టెన్నపాలెం వద్ద బుధవారం జల్లేరు వాగును దాటుతుండగా ప్రైవేట్ స్కూల్ బస్సు దిగబడిపోయింది. అదృష్టవశాత్తూ ప్రస్తుతం వాగులో నీరు లేకపోవడంతో బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. పట్టెన్నపాలెం గ్రామస్తులు స్పందించి ట్రాక్టర్ సహాయంతో బస్సును బయటకు తీసుకువచ్చారు. ఇక్కడ హైలెవల్ బ్రిడ్జి నిర్మించి సురక్షిత రాకపోకలకు అవకాశం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. సొమ్ముల కోసం వెళ్లి.. నూజివీడు: పట్టణంలోని విస్సన్నపేట రోడ్డులో పంజాబీ దాబా వద్ద బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దేవరగుంటకు చెందిన పల్నాటి రామ్మోహన్రావు (55) పట్టణంలోని అమ్మవారితోట ప్రాంతంలో స్థిరపడ్డాడు. వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండిస్తున్నాడు. ఉదయం పంజాబీ దాబాకు సొరకాయలు దిగుమతి చేసిన రామ్మోహన్రావు వాటి డబ్బుల కోసం ఇంటి సమీపంలో ఉండే విబూది రాంబాబు అనే వ్యక్తితో కలిసి పంజాబీ దాబా వద్దకు వెళ్లారు. రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేసి దాబాలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా విస్సన్నపేట వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి అక్కడికక్కడే కన్నుమూశాడు. ఎస్సై జ్యోతిబసు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సీఐ సత్య శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బలివేలో ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ముసునూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం బలివేలోని శ్రీరామ లింగేశ్వరాలయం. పూర్వపు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ, ప్రాచీన తూర్పు వేంగీ చాళుక్యుల రాజధాని వేంగీ పురం(నేటి పెదవేగి)కి అతి సమీపాన కృష్ణా జిల్లా, ముసునూరు మండలం బలివేలో తమ్మిలేరు ఒడ్డునే ఈ ఆలయం ఉంది. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజులపాటు ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఏటా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించేందుకు ఏటా రెండు లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా నూజివీడు సబ్కలెక్టర్ స్మరణ్రాజ్ ప్రత్యేకాధికారిగా, తహసీల్దార్ కె.రాజ్కుమార్ నోడల్ అధికారిగా, సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఈఓ పామర్తి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో తమ్మిలేరుపై ప్రారంభమైన చెక్డ్యామ్ కమ్ హైలెవెల్ బ్రిడ్జి, స్నానఘట్టాల నిర్మాణం పూర్తి కావడంతో విశాల ప్రాంగణంగా రూపుదిద్దుకుని భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానాల ఏర్పాట్లు ప్రారంభించగా, తమ్మిలేరు జలాశయం నుంచి నీటిని కూడా విడుదల చేశారు. ఇప్పటికే మిఠాయిల దుకాణాలు, వినోద సౌకర్యాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ కోరింది. బలివే చేరాలంటే బస్సురూట్లు ఇలా రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న బలే రామ లింగేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్న దృష్ట్యా మొత్తం నాలుగు భాగాలుగా నూజివీడు, ఏలూరు, సత్తుపల్లి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు నడుపుతున్నారు. ● నూజివీడు నుంచి బలివే ఉత్సవ ప్రాంగణం వరకు ● ఏలూరు నుంచి వేల్పుచర్ల మీదుగా ● ఏలూరు నుంచి విజయరాయి మీదుగా ● సత్తుపల్లి, చింతలపూడిల నుంచి బలివే వరకు. 25 నుంచి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఏటా ఘనంగా ఉత్సవాలు రెండు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా -
తాబేళ్ల రక్షణకు చర్యలు
తాబేళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. నరసాపురం మండలంలోని తాబేళ్ల గుడ్ల సేకరణ, పునరుత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. 8లో uబలివే ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం బలివే(ముసునూరు): దైవ దర్శనానికి ఆటంకం కలుగకుండా అధికారులంతా సమన్వయంతో బలివే మహా శివరాత్రి ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బలివే శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్కలెక్టర్ స్మరణ్రాజ్ అధ్యక్షతన మంగళవారం ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో లక్షలాదిగా హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలుగకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. రూ. 100, రూ.25తో పాటు ఉచిత దర్శనానికి ప్రత్యేకమైన క్యూ లైన్ల ద్వారా, దర్శన మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. స్నానఘట్టాల వద్ద జల్లు స్నానాలకు, పిండ ప్రదానాలకు ప్రత్యేక ప్రదేశాల ఏర్పాటు, మహిళల దుస్తుల మార్పిడికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలన్నారు. నూజివీడు, ఏలూరు రహదారికి మరమ్మతులు తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్సవ ప్రాంగణ పరిసరాల్లో మద్యం విక్రయాలు నిరోధించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండు శిబిరాలు, రెండు అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగ భృతి కల్పించాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నెల నెల ఇస్తానన్న భృతిని వెంటనే చెల్లించాలి, అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని ఎన్నికల ముందు లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. – తంగెళ్ల రాధాకృష్ణ. తూర్పుతాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఆర్భాటంగా ప్రకటించడమే కాక ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నేటి వరకు జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. నిరుద్యోగ భృతి సైతం మరిచిపోయారు. – సాకా సుబ్రహ్మణ్యం దేవ, బీఎస్సీ బీఈడీ హామీ నెరవేర్చలేకపోయారు నేను ఎంఏ చేశాను. కూటమి ప్రభుత్వం వస్తే నిరుద్యోగ భృతిగా రూ.3 వేలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచిన ఇంతవరకు ఆ ఊసే లేదు. ఎన్నికల హామీల అమలులో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. – అంబేడ్కర్, వేల్పూరు జాబ్ లేక వ్యవసాయం.. ఎంఏ సోషల్ చేసి జాబ్ లేక వ్యవసాయం చేస్తున్నాను. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడగానే డీఎస్సీ ఇస్తామన్నారు, ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా ఏ ఒక్క దానికి ప్రభుత్వం కట్టుబడి లేదు. – పడవల నాని, బాలేపల్లి, ఎంఏ సోషల్ ● -
చిరు వ్యాపారులపై ప్రతాపం
ఏలూరు (టూటౌన్): ఏలూరు కార్పొరేషన్ ఎదురుగా స్థానిక పాండురంగ థియేటర్ వరకు గత 40 ఏళ్లుగా కార్మికులు రవాణా ఆటోలు పెట్టుకుంట్నుఆరు. వీరంతా మార్కెట్లో తమ వాహనాల్లో వివిధ రకాల సరుకులను లోడ్ చేసుకుని వాహనాన్ని కాలువ గట్టు వద్ద ఆపుతారు. ఏలూరు పాత బస్టాండ్ వైపు నుంచి మార్కెట్లోకి వచ్చే దారిలో కృష్ణా కాలువపై ఇరువైపులా రెండు వంతెనలు ఉన్నాయి. వీటి మధ్య ఖాళీ ప్రదేశంలో ఎన్నో ఏళ్లుగా కొందరు చిరు వ్యాపారులు పూల దుకాణాలు, పండ్ల దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరందరినీ మూకుమ్మడిగా నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పోలీసులు సాయంతో మంగళవారం ఉదయం ఖాళీ చేయించారు. ఆక్రమణల తొలగింపులో భాగంగానే వీటిని తొలగించామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా ఖాళీ చేయించడం పట్ల వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బాధితులంతా ఎమ్యేల్యే బడేటి చంటి వద్దకు ప్రదర్శనగా వెళ్లి తమ సమస్యను తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కార్మికులు, పూల దుకాణదారులు, ఇతర చిరు వ్యాపారాలు చేసుకునే వారికి నష్టం లేకుండా చూస్తామంటూ హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. -
పంచాయతీ నీరు.. పొలానికి మళ్లింపు
ద్వారకాతిరుమల: ప్రజలకు పంచాయతీ ద్వారా అందాల్సిన తాగునీటిని.. టీడీపీ కార్యకర్త తాను సాగు చేస్తున్న పొలానికి అక్రమంగా వినియోగిస్తున్నాడు. దాంతో గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై పంచాయితీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ద్వారకాతిరుమల మండలంలోని సత్తాలలో 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ వాటర్ ట్యాంక్ లేదు. దాంతో పంచాయతీ బోరు నుంచి వచ్చే మంచి నీటిని డైరెక్ట్ పంపింగ్ ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఈ తాగు నీటిని, తాను సాగు చేస్తున్న పొలానికి సాగు నిమిత్తం వినియోగిస్తున్నాడని పలువురు చెబతున్నారు. మంచినీటి పైప్లైన్ను కట్చేసి మరీ అక్రమంగా పొలానికి మంచినీటిని మళ్లిస్తున్నాడని, దీని వల్ల తమకు తాగు నీరు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న వేసవిలో తమకు మంచినీటి కష్టాలు తప్పవని వాపోతున్నారు. దీనిపై సదరు టీడీపీ కార్యకర్తను ఎన్నిసార్లు మందలించినా ఫలితం లేదని గ్రామ సర్పంచ్ తెలిపారు. -
పీడీఎఫ్ అభ్యర్థిని గెలిపించాలి
ఏలూరు (టూటౌన్): ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులును గెలిపించాలని ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే శక్తి పీడీఎఫ్ అభ్యర్థులకు మాత్రమే ఉందని చెప్పారు. రాఘవులు గత 40 ఏళ్లుగా యుటీఎఫ్లో వివిధ స్థాయిల్లో పనిచేసి ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడి ప్రసాద్ మాట్లాడుతూ శాసనసభలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సమస్యలపై అడిగేవారే లేరని ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, టి.రామకృష్ణ, కే.శ్రీనివాస్, ఎం.నాగమణి పాల్గొన్నారు. నేడు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలకు జర్మనీ బృందం ఏలూరు(మెట్రో): రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం(ఏపీసీఎన్ఎఫ్) ద్వారా అమలుచేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించేందుకు జర్మన్ ప్రతినిధి బృందం ఈ నెల 19న ఏలూరు జిల్లాలో పర్యటించనుంది. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం సభ్యులు తమ పర్యటనలో భాగంగా ఏలూరు మండలం వెంకటాపురం, కామవరపుకోట మండలం ఆడమిల్లి, ద్వారకతిరుమల మండలం గుండుగొలనుగుంట గ్రామాల్లో పర్యటిస్తారు బలివే తీర్థానికి తమ్మిలేరు నీరు విడుదల చింతలపూడి: మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని బలివే తీర్థానికి తమ్మిలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేసినట్లు తమ్మిలేరు ఇరిగేషన్ డీఈ సీతారామ్ మంగళవారం తెలిపారు. ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి 100 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి విడుదల చేశామని తెలిపారు. దాదాపు 40 కిలోమీటర్లు ప్రధాన కాల్వ ద్వారా ప్రయాణించి నడిపల్లి చెరువులోనికి చేరుతుందని చెప్పారు. అక్కడి నుంచి బలివేకు భక్తుల కోసం నీటిని వంతుల వారీగా తరలిస్తామన్నారు. పెద్దింట్లమ్మ జాతరను విజయవంతం చేద్దాం కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆర్డీవో, జాతర నిర్వాహణ చైర్మన్ డాక్టర్ అచ్యుత అంబరీష్ చెప్పారు. మార్చి 1 నుంచి 13 వరకు జరిగే జాతర(తీర్థం) నిమిత్తం కొల్లేటికోట దేవస్థానం వద్ద రెండో విడత వివిధ శాఖల అధికారుల సమన్వయ సమావేశం మంగళవారం జరిగింది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ జాతర సమయంలో భక్తులకు ఎటువంటి అసౌక్యరాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో అందరూ పనిచేయాలన్నారు. జాతర అన్ని రోజులు పారిశుద్ధ్య కార్మికులతో పాటు తాత్కలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓపీఆర్డీ చెప్పారు. ముందుగా జాతర గోడపత్రి, బుక్లెట్, కరపత్రాలను అవిష్కరించారు. గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ద్వారకాతిరుమల: గురుకులంలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ీస్వీకరిస్తున్నట్టు స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ బి.రాణి తెలిపారు. మార్చి 6తో ఈ గడువు ముగుస్తుందన్నారు. అర్హులైన విద్యార్థినులు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1న అడ్మిట్ కార్డులు జారీ, అదే నెల 6న ఉదయం 10 గంటల నుంచి 5వ తరగతి ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. -
ఇంటర్ ప్రయోగ పరీక్షలకు 2005 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ప్రయోగ పరీక్షలకు మంగళవారం 2005 మంది హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 34 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 2059 మందికి 2005 మంది హాజరు కాగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 975 మందికి 957 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 1,084 మందికి 1048 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాన్ తెలిపారు. -
నిరుద్యోగుల్లో నిరుత్సాహం
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాక్షి, భీమవరం: డీఎస్సీ, గ్రూపు పరీక్షలు, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర వాటి ద్వారా ప్రభుత్వ కొలువుల కోసం ఇంటి వద్ద, జిల్లాలో, విశాఖ, విజయవాడ, హైదరాబాద్ తదితర నగరాల్లోని కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్న వారు ఎందరో ఉన్నారు. వీరంతా వేలు, లక్షల్లో ఫీజులు చెల్లించి శిక్షణ తీసుకుంటున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అయినకాడికి అప్పులు చేసి శిక్షణ ఇప్పిస్తున్నారు. బయటి ప్రాంతాల్లో ఉంటున్న వారికి హాస్టల్, మెస్ నిమిత్తం నెలకు ఆరు వేలకు పైనే ఖర్చవుతుంది. మరోపక్క డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర చదువులు చదువుకుని కుటుంబ ఆర్ధిక పరిస్థితులతో చాలీచాలనీ జీతంపై వివిధ వ్యాపార, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిలో ఎంతోమంది తమ చదువుకు తగిన ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు. పత్తాలేని హామీలు కూటమి ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్లో నిరుద్యోగ యువతకు పెద్దపీట వేశామని చెప్పారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేస్తామన్నారు. అంతవరకూ నిరుద్యోగ భృతి అందజేస్తామంటూ ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది నెలలైనా వాటి ఊసెత్తకపోవడం ఆయా వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మరోపక్క తొలి సంతకం పేరిట 16 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించినా షెడ్యూల్ విడుదల చేయకుండా విద్యాసంవత్సరం పాటు కాలయాపన చేసింది. ఇప్పుడు ఉన్న పోస్టులకు కోత పెట్టేందుకు మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఎత్తుగడ వేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 5.17 లక్షలు, ఏలూరు జిల్లాలో ఐదు లక్షల కుటుంబాలు ఎన్నికల వాగ్దానాల అమలుకోసం ఎదురుచూస్తున్నారు. పెల్లబుకుతున్న అసంతృప్తి నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీగా ఉందంటూ సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించిన విషయం విదితమే. నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగభృతి హామీలదీ అదే దారి. సామాజిక మాద్యమాల ద్వారా ఇప్పటికే వివిధ వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుత తరుణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి నేతలకు తలనొప్పిగా తయారయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,08,019 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా వీరిలో కొత్త పశ్చిమగోదావరి జిల్లాలో 64,327 మంది, ఏలూరు జిల్లాలో 43,692 మంది ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్ జరుగనుంది. ఎన్నికల్లో గెలుపుకోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూటమి నేతలు ఆపసోపాలు పడుతున్నారు. 2024 జూన్ నుంచే హామీలు అమలని చెప్పి ముఖం చాటేసి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేస్తామంటూ కూటమి నేతల మాటలను ఎన్నికల జిమ్మిక్కుగానే కొట్టిపారేస్తున్నారు. న్యూస్రీల్ఏపీలోని యువతను ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాం. పరిశ్రమలు తెస్తాం. ఉద్యోగాలిస్తాం. హైటెక్ టవర్లు నిర్మించి వర్క్ఫ్రం హోమ్ తెస్తాం. మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. – పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల సభల్లో చంద్రబాబు రాసిపెట్టుకోండి తమ్ముళ్లు.. అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మొదటిగా 2025 జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. – జిల్లాలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ జాడలేని జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి మెగా డీఎస్సీపై నోరు మెదపని సర్కారు హామీల అమలు కోసం నిరుద్యోగుల ఎదురుచూపు పట్టభద్రుల ఓట్లు వేటలో కూటమి నేతల అంతర్మథనం ఉమ్మడి జిల్లాలో 1,08,019 గ్రాడ్యుయేట్ ఓటర్లు నిరుద్యోగులకుప్రతి నెలా రూ.3 వేల భృతితొమ్మిది నెలలైంది. హామీల అమలు ఎప్పుడు ?మెగా డీఎస్సీ -
బర్డ్ఫ్లూ పంజా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బర్డ్ఫ్లూ విజృంభన కొనసాగుతోంది. బర్డ్ఫ్లూతో ఇప్పటికే లక్షల సంఖ్యలో చనిపోయాయి. దాదాపు 19 ఏళ్ళ తరువాత జిల్లాలో బర్డ్ఫ్లూ వల్ల పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. సంక్రాంతి ముందు నుంచే వైరస్ లక్షణాలతో కోళ్ళు చనిపోతుండగా శీతల ప్రభావమంటూ అధికారులు కొట్టిపడేశారు. ఒక్కసారిగా గత వారం పది రోజుల నుంచి బర్డ్ఫ్లూ పంజా విసరడంతో సుమారు 15 లక్షల వరకు లేయర్ కోళ్ళు, 50 వేల వరకు బ్రాయి లర్ కోళ్ళు చనిపోయినట్టు అంచనా. కోళ్ళ మేత, గుడ్లు, అన్నింటి విలువ కలుపుకొని సుమారు రూ. 70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పౌల్ట్రీ రంగం గణనీయంగా విస్తరించింది. జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీలు ఉండగా వాటిలో 2.20 కోట్ల లేయర్ కోళ్లు ఉన్నాయి. ప్రస్తుతం సగటున ప్రతిరోజూ 1.30 కోట్ల కోళ్ల ద్వారా 1.10 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ప్రధానంగా ఒడిశా, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు 70 శాతం గుడ్ల ఎగుమతులు జరుగుతుండగా, మిగిలిన 30 శాతం గుడ్లు స్థానిక అవసరాలకు వినియోగిస్తున్నారు. 2006లో రూ.50 పైసలకు పడిపోయిన గుడ్డు 2006లో జిల్లాలో మొట్టమొదటిసారిగా పౌల్ట్రీల్లో బర్డ్ఫ్లూను గుర్తించారు. అప్పట్లో జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్ళు చనిపోయాయి. రూ.1.90 ఉన్న గుడ్డు ధర రూ.50 పైసలకు పడిపోవడంతో పౌల్ట్రీలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ క్రమంలో వ్యాక్సినేషన్లు, ఇతర జాగ్రత్తల ద్వారా వైరస్లను అధిగమిస్తూ రెండేళ్ళలోనే పౌల్ట్రీల వ్యవస్థను గాడిలో పెట్టారు. 19 ఏళ్ళ తరువాత జిల్లాలో వైరస్ను గుర్తించడం, అది కూడా లక్షల సంఖ్యలో కోళ్ళు చనిపోయాక గుర్తించడం గమనార్హం. వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగ్గా చేయకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందనేది పౌల్ట్రీ వర్గాల భావన. జిల్లాలో ఉంగుటూరు, బాదంపూడి, తణుకు రూరల్, వేల్పూరు, పెరవలి, తాడేపల్లిగూడెంతో పాటు అనేక ప్రాంతాల్లో కోళ్ళ ఫారాలున్నాయి. 11న జిల్లాలో వైరస్ గుర్తింపు ఈ నెల 11న జిల్లాలో వైరస్ను గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో బాదంపూడిలోని పౌల్ట్రీలో రోజుకు 3 నుంచి 4 వేల కోళ్లు చనిపోవడం గుర్తించారు. అధికార యంత్రాంగం వారం రోజుల తరువాత అలెర్ట్ అయింది. వాస్తవానికి ప్రతి రోజూ పౌల్ట్రీల్లో సాధారణ పరిస్థితులను బట్టి లక్షల కోళ్ళు ఉన్నచోట 30 నుంచి 50 కోళ్లు చనిపోతుంటాయి. బాదంపూడి, వేల్పూరు, తణుకు రూరల్లో ఎక్కువగా కోళ్లు చనిపోవడంతో వాటిని ల్యాబ్కు పంపగా ఏమియాన్ ఇన్ఫ్లుయాంజ్ (హెచ్ 5ఎన్–1) వైరస్గా గుర్తించారు. లక్షల కోళ్ళు, గుడ్లు పూడ్చివేత జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఫారం కోళ్లు, 50 వేల బ్రాయిలర్ కోళ్లు వైరస్తో చనిపోయాయని పౌల్ట్రీ వర్గాల అంచనా. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖాధికారులు వైరస్ గుర్తించిన పౌల్ట్రీలకు 10 కిలోమీటర్ల దూరం వరకు అలెర్ట్ జోన్లుగా ప్రకటించి చికెన్, గుడ్ల విక్రయాలను నిషేధించారు. వైరస్ ఉన్న కోళ్ళ ఫారాల ప్రాంతాలను ఇన్ఫెక్షన్ జోన్లుగా ప్రకటించి వెటర్నరీ వైద్యులతో 25 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏలూరు జిల్లాలో 1.24 లక్షల కోళ్ళు, 1.85 లక్షల కోళ్ళ మేతలు, లక్షకు పైగా గుడ్లను భూమిలో పూడ్చివేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2 పౌల్ట్రీల్లో 22 వేల కోళ్ళు, 24,660 గుడ్లు, 20 కిలోల మేతను పూడ్చివేశారు. ఇంతవరకు 15 లక్షల లేయర్ కోళ్ల మృత్యువాత సుమారు రూ.70 కోట్లకు పైగా పౌల్ట్రీలకు నష్టం జిల్లా వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ జోన్ల గుర్తింపు రెడ్ జోన్ పరిధిలోని పౌల్ట్రీలు మూడు నెలల పాటు మూసివేత మూడు రోజులుగా కొనసాగుతున్న శానిటేషన్ ప్రక్రియ -
విలేకరిపై దాడిని నిరసిస్తూ ర్యాలీ
ఏలూరు (ఆర్ఆర్పేట): పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి రామారావును చంపుతానని బెదిరించిన మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ జర్నలిస్టు సంఘాల నాయకులు మంగళవారం ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్కు వినతిపత్రం సమర్పించారు. దాడిని జిల్లాలోని అన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, సామ్నా ఇతర జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు హాజరై ర్యాలీ నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేపీకే కిషోర్, ఐజేయూ కార్యవర్గ సభ్యుడు జీవీఎస్ఎన్ రాజు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.మాణిక్యరావు తదితరులు ఎస్పీతో మాట్లాడుతూ జర్నలిస్టులపై ఇలాంటి దాడులు బాధాకరమన్నారు. రాజకీయ నాయకుల తప్పులు ఎత్తిచూపితే విలేకరులను బెదిరించి దాడి చేస్తున్నారని, వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
ఉపాధి కూలీలను ఢీకొన్న ట్రాక్టర్
కొయ్యలగూడెం: ఉపాధి పనుల కోసం వెళుతున్న కూలీలను ట్రాక్టర్ ఢీకొన్న ఘటన కుంతలగూడెం సమీపంలో మంగళవారం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం కుంతలగూడెంకు చెందిన కొందరు కూలీలు మంగళవారం ఉపాధి పనుల కోసం వెళ్తున్నారు. ఆ సమయంలో చిన్నాయగూడెం వైపు వెళుతున్న ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి కూలీలను ఢీకొంది. ఈ ప్రమాదంలో అల్లె భాగ్యవతి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈమెతో పాటుగా మరో ముగ్గురు కూలీలు రాపాక నాగమణి, చాపల ఇమ్మెలియా, బాసుబోయిన పోసమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మెరుగైన వైద్యం నిమిత్తం తరలించినట్లు ఏపీవో నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో ఇమ్మెలియా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు 108 టెక్నీషియన్ బద్రి పేర్కొన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వలనే ప్రమాదం సంభవించిందని కూలీలు ఆరోపించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలానికి ఎస్సై వి.చంద్రశేఖర్ చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు -
ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్
ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తపాలా బ్యాలెట్కు అవకాశం కల్పించినట్లు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఇందుకోసం ఏలూరు కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ జారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం, ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది వారి ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చన్నారు. ఫారం–12ను జిల్లా రిటర్నింగ్ అధికారి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం/జిల్లా కలెక్టర్, ఏలూరు వారికి 20 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలన్నారు. ఓటు హక్కు వినియోగానికి ప్రత్యేక సెలవు 27న పోలింగ్ నేపథ్యంలో ఆ రోజున తూర్పు పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్ర నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.వెట్రిసెల్వి తెలిపారు. -
రక్తదానమే లక్ష్యంగా.. హోప్ పయనం
కై కలూరు: నిండు ప్రాణాలను కాపాడటంలో కలిగే సంతోషం ఎన్ని లక్షలు పెట్టినా రాదు. ఇదే నినాదంతో 2022లో ఏర్పాటైన హోప్ చారిటబుల్ ట్రస్ట్ సేవలందిస్తోంది. కై కలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన అల్లాడి రవితేజ స్నేహితులతో కలసి ఓ వాట్సాప్ గ్రూఫ్ను క్రియేట్ చేశాడు. ఒక్క అడుగుతో మొదలైన సేవా ప్రస్థానం ఇప్పుడు ఏకంగా 200 మంది సభ్యులకు చేరింది. రక్తదానమే పరమావధిగా సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25 ప్రముఖ బ్లడ్ బ్యాంకులలో రక్తాన్ని అందించే స్థాయికి చేరింది. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు, గర్భిణీలు, క్యాన్సర్ పేషెంట్లు, తలసేమియా చిన్నారులు, అత్యవసర చికిత్సలు ఇలా 16,700 యూనిట్ల రక్తదానం సభ్యులు చేశారు. సేవే పరమార్థంగా పనిచేస్తున్న సభ్యులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. తలసేమియా చిన్నారులకు దేవుళ్లు తలసేమియా చిన్నారులకు ప్రతి 21 రోజులకు రక్తమార్పిడి జరగాలి. వీరి ఇబ్బందులను గుర్తించిన సంస్థ సభ్యులు భీమవరం, ఉండి, కై కలూరు, కలిదిండి, పాలకొల్లు, నరసాపురం, తణుకు ఇలా అనేక ప్రాంతాల్లో జల్లిడ పట్టి మొత్తం 52 మంది చిన్నారులను గుర్తించారు. వీరి కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆనంద్ బ్లడ్ బ్యాంకులో వివిధ గ్రూఫుల రక్తాన్ని నిల్వ చేస్తున్నారు. చిన్నారులకు అమృత హాస్పటల్లో రూ.1000 ఖరీదు కలిగిన రక్తం ఎక్కించే ఫిల్టర్లను సైతం వీరే అందిస్తున్నారు. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, అంబేడ్కర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావుల వర్ధంతి, చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజులు ఇలా పలు సందర్భాల్లో రక్తదానం సేకరించి ప్రమాదంలో ప్రజలకు సంస్థ సభ్యులు సేవ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో 25 బ్లడ్ బ్యాంకులకు రక్తదానం వాట్సాప్లో 200 మంది సభ్యుల చేరిక 52 మంది తలసేమియా చిన్నారులకు ప్రతినెలా రక్తదానం రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 వేల మందికి రక్తదానం -
ఉపాధి కూలీలను ఢీకొన్న ట్రాక్టర్
కొయ్యలగూడెం: ఉపాధి పనుల కోసం వెళుతున్న కూలీలను ట్రాక్టర్ ఢీకొన్న ఘటన కుంతలగూడెం సమీపంలో మంగళవారం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం కుంతలగూడెంకు చెందిన కొందరు కూలీలు మంగళవారం ఉపాధి పనుల కోసం వెళ్తున్నారు. ఆ సమయంలో చిన్నాయగూడెం వైపు వెళుతున్న ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి కూలీలను ఢీకొంది. ఈ ప్రమాదంలో అల్లె భాగ్యవతి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈమెతో పాటుగా మరో ముగ్గురు కూలీలు రాపాక నాగమణి, చాపల ఇమ్మెలియా, బాసుబోయిన పోసమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మెరుగైన వైద్యం నిమిత్తం తరలించినట్లు ఏపీవో నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో ఇమ్మెలియా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు 108 టెక్నీషియన్ బద్రి పేర్కొన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వలనే ప్రమాదం సంభవించిందని కూలీలు ఆరోపించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలానికి ఎస్సై వి.చంద్రశేఖర్ చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు -
తాబేళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు
నరసాపురం రూరల్: సముద్ర పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం నరసాపురం మండలం సముద్ర తీర ప్రాంతమైన చినమైనవానిలంక గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని జేసీ రాహుల్కుమార్రెడ్డితో కలసి ఆమె పరిశీలించారు. అటవీశాఖ అధికారులను గుడ్లు సంరక్షణకు చేపట్టిన ప్రత్యేక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ సముద్ర వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా సముద్రజీవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. గత నెలలో పదుల సంఖ్యలో తాబేళ్లు చనిపోయి సముద్రతీర ప్రాంతానికి కొట్టుకురావడం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ విషయమై సంబందిత అధికారులతో సమావేశమై తాబేళ్లు చనిపోవడానికి గల కారణాలను విశ్లేషించేందుకు పోస్టుమార్టం చేయించామన్నారు. ఆ నివేదక ఇంకా అందాల్సి ఉందన్నారు. తదుపరి చర్యల్లో బాగంగా అటవీశాఖ పర్యవేక్షణలో తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టే ప్రాంతాలను గుర్తించి వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకూ తాబేళ్లు సముద్రపు ఒడ్డున అనువైన ప్రాంతంలో గుడ్లు పెట్టే సమయం అని, అనంతరం ఆ గుడ్లనుంచి పిల్లలు బయటకు వస్తాయన్నారు. ఆలీవ్రెడ్లీ జాతి తాబేళ్లు పెట్టిన సుమారు 4,400 గుడ్లను హేచరీలో ఉంచామని, రానున్న రెండు నెలల కాలంలో మరో 25 వేల గుడ్లు పెట్టే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చిన అనంతరం వాటిని సముద్రంలోని విడచి పెట్టే కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తామన్నారు. తద్వారా సముద్ర జీవుల పట్ల అవగాహన కలుగుతుందన్నారు. తాబేళ్లు ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టేందుకు అనువుగా సముద్రం అంచున వలలను అడ్డంకిగా లేకుండా చూడాలని మత్స్యకారులకు సూచించారు. మానవ మనుగడకు సముద్ర వాతావరణం సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మడ అడవులను నరికితే చర్యలు చినమైనవానిలంకలో తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ నాగరాణి దర్బరేవు, రాజల్లంక ప్రాంతాల్లోని మడ అడవులను బోటులో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మడ అడవులను పెరగనివ్వాలని, వాటిని అక్రమంగా నరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సముద్రతీర ప్రాంతం కోతకు గురికాకుండా మడ అడవులు రక్షణగా నిలుస్తాయన్నారు. ఇప్పటికే సముద్రం పెదమైనవానిలంక, చినమైనవానిలంక ప్రాంతాల్లో ముందుకు చొచ్చుకుని వచ్చిన విషయం తెలిసిందన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పెదమైనవానిలంక గ్రామంలో ఒక కిలోమీటర్ మేర నిర్మించనున్న సముద్ర రక్షణ గోడకు రూ.35 కోట్లు వ్యయం అవుతుందని ఈ నిధులను మంత్రి కేటాయించారన్నారు. పనులను ఎలైట్ కంపెనీ త్వరలో ప్రారంభిస్తుందన్నారు. వాస్తవంగా ఏడు కిలోమీటర్ల మేర ఈ రక్షణ గోడను నిర్మించాల్సి ఉందని ప్రస్తుతం ఒక కిలోమీటరు మాత్రమే ఈ గోడను నిర్మిస్తారన్నారు. చినమైనవానిలంకలోని నల్లీక్రీక్పై వంతెనను ఆర్అండ్బీ అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. వంతెన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయని వెంటనే పనులు ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి ఆశాకిరణ్, ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ శ్రీవేద, నరసాపురం తహసీల్దార్ రాజరాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. తాబేళ్ల గుడ్ల సంరక్షణకు హేచరీ ఏర్పాటు మడ అడవులను పరిశీలించిన పశ్చిమ కలెక్టర్ తీరప్రాంత గ్రామాల్లో కలెక్టర్ నాగరాణి పర్యటన -
● దివ్యం.. శేష సాయి దర్శనం
● సాయిబాబాపై ‘సర్పం’ దర్శనం స్థానిక సాయిబాబా ఆలయంలో మంగళవారం రాత్రి బాబా విగ్రహంపై ఒక తాచు పాము దర్శనమిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించిన ఈ పాము బాబా శిరస్సుపై ఉండటం ఆలయ నిర్వాహకుడు పుప్పాల మురళీకి కనిపించింది. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకోవడంతో, పాము నెమ్మదిగా బాబా విగ్రహం నుంచి ఫొటో మీదకు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. – ద్వారకాతిరుమలద్వారకాతిరుమల: స్థానిక సాయిబాబా ఆలయంలో మంగళవారం రాత్రి బాబా విగ్రహంపై ఒక తాచు పాము దర్శనమిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించిన ఈ పాము తొలుత బాబా శిరస్సుపై ఉండటం భక్తులకు, ఆలయ నిర్వాహకుడు పుప్పాల మురళీకి కనిపించింది. అయితే విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకోవడంతో, ఆ అలజడికి పాము నెమ్మదిగా బాబా విగ్రహం పైనుంచి, పక్కనే ఉన్న బాబా ఫొటో మీదకు వెళ్లి, కొద్దిసేపు అక్కడే ఉంది. చివరకు నెమ్మదిగా బయటకు వెళ్లిపోయింది. -
27న ఖేలో ఇండియా సెంటర్ ఎంపిక పోటీలు
ఏలూరు రూరల్: ఈ నెల 27వ తేదీన ఏలూరు స్టేట్ లెవెల్ ఖేలో ఇండియా సెంటర్లో శిక్షణ కోరే బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని సెంటర్ ఇన్చార్జి డీఎన్వీకే ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్లో బాలబాలికలకు, వెయిట్ లిఫ్టింగ్లో బాలికలకు మాత్రమే ఎంపిక పోటీలు చేపడతామన్నారు. 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు గలవారు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు వయసు ధ్రువీకరణ పత్రంతో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సాధించిన సర్టిఫికెట్లతో ఏలూరు ఆల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఉదయం 8 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న వారికి వార్డెన్ పర్యవేక్షణలో కోచ్తో ఉచిత శిక్షణ, వసతి, పౌష్టికాహారం, రూ.4 వేలు స్కూల్ ఫీజ్, ఆరోగ్య బీమా, స్పోర్ట్ కిట్ అందిస్తామని వెల్లడించారు. ఆసక్తి గలవారు 98853 12356 నంబర్లో సంప్రదించాలన్నారు. వర్జీనియా బేరన్ దగ్ధం కొయ్యలగూడెం: దిప్పకాయలపాడులో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదంలో వర్జీనియా పొగాకు బేరన్ దగ్ధం అయ్యింది. పొగాకు బేరన్ ఉదయం వేళ క్యూరింగ్ దశలో ఉండగా రేషన్ కర్ర విరిగి పొయ్యి గొట్టంపై పడడంతో ప్రమాదం సంభవించిందని రైతు బొట్ట వెంకటరమణ వాపోయాడు. జంగారెడ్డిగూడెం అగ్నిమాపక కేంద్రం అధికారి జి.అబ్రహం సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేశారు. బేరన్ పూర్తిగా దగ్ధం అయ్యిందని, సుమారు రూ.3 లక్షల నష్టం ఉంటుందని అబ్రహం తెలిపారు. 8 క్వింటాల బేరన్ పొగాకు దగ్ధం కామవరపుకోట: ప్రమాదవశాత్తు నిప్పుంటుకొని 8 క్వింటాల బేరన్ పొగాకు దద్ధమైంది. రావికంపాడు పంచాయతీ రెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాణికుల శ్రీను, మానికల సత్యనారాయణ పొగాకు సాగు చేస్తారు. మంగళవారం మధ్యాహ్నం పొగాకును క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బేరన్లో ఉన్న పొగాకు పూర్తిగా దగ్ధమైంది. స్థానిక రైతులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. రైతులకు సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. యువతి ఆత్మహత్య నరసాపురం రూరల్: కొప్పర్రు గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని పంటకాలువ సమీపంలో ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటున్న ఎరిచర్ల సిరి అనే యువతి సోమవారం రాత్రి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు చందు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే ఈ సమాచారంపై పోలీసులను సంప్రందించినా వారు స్పందించలేదు. -
బంగారు, వెండి ఆభరణాలతో నవ వధువు పరారీ
ఏలూరు (టూటౌన్): నవ వధువు బంగారం, వెండి ఆభరణాలు పట్టుకుని పరారైన ఘటన ఏలూరు నగరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఏలూరు గజ్జల వారి చెరువు సమీపంలో వి.శివ నాగ సాయి కృష్ణ జ్యూస్ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. గత నెల 31వ తేదీన అతనికి విశాఖపట్టణం కంచరపాలెం ప్రాంతానికి చెందిన బోడేపు చంద్రహాసినితో వివాహమైంది. అత్తవారింటి నుంచి ఏడు రోజుల క్రితం ఏలూరు నగరానికి చేరుకున్న కొత్తజంట కొత్త కాపురాన్ని బిట్టుబారు సమీపంలో ఉన్న అద్దె ఇంట్లో మొదలుపెట్టారు. అయితే ఈ నెల 16వ తేదీన భార్యాభర్తలు ఇద్దరు నిద్రకు ఉపక్రమించగా, 17వ తేదీన శివ నిద్రలేచి చూసేసరికి నవవధువు ఇంటి నుంచి పరారైనట్లు గుర్తించాడు. ఆమె వెళ్తూవెళ్తూ నాలుగు కాసుల బంగారు గొలుసు, ఉంగరం, వెండి పట్టీలు సెల్ఫోన్తో పరారైనట్లు శివ గుర్తించాడు. ఆమె ఆచూకీ కోసం ఆమె తండ్రితో కలిసి వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సారా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు కామవరపుకోట: ఈస్ట్యడవల్లి గ్రామంలో నిర్వహిస్తున్న నాటు సారా స్థావరాలపై మంగళవారం ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన మరీదు రాజు అనే వ్యక్తి సారా తయారుచేస్తుండగా అతడిని పట్టుకుని, బట్టి వద్ద ఉన్న 10 కేజీల బెల్లం, 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. అలాగే సారా తయారీదారుడికి బెల్లం విక్రయిస్తున్న మహాలక్ష్మి జనరల్ స్టోర్స్పై తనిఖీలు నిర్వహించి 70 కేజీల బెల్లం, 50 కేజీల అమ్మోనియా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దుకాణం యజమాని భాస్కర శ్రీ సాయి రంగ ప్రకాష్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సైలు ఆర్వీఎల్ నరసింహరావు, అబ్దుల్ ఖలీల్, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ బహిష్కరణపై ఫిర్యాదు మండవల్లి: తనకు గ్రామ బహిష్కరణ లేకుండా రక్షణ కల్పించాలని ఓ గొర్రెల పెంపకందారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొవ్వాడలంక గ్రామవాసి త్రిమూర్తులు గొర్రెల పెంపకందారుడు. గొర్రెల పెంపకం వలన గ్రామ వాతావరణం కాలుష్యమౌతుందంటూ గ్రామం నుంచి బహిష్కరిస్తామని సర్పంచ్తోపాటు స్థానిక పెద్దలు గ్రామ సభ ద్వారా హెచ్చరికలు జారీ చేశారని త్రిమూర్తులు మంగళవారం మండవల్లిలో పేర్కొన్నాడు. గ్రామసభ ఏర్పాటు చేసి, గొర్రెలను స్వాధీనం చేసుకుని కఠినమైన చర్యలు తీసుకుంటామని గ్రామ చావడి మైక్ ద్వారా తెలియజేశారన్నాడు. తనకు గ్రామ బహిష్కరణ లేకుండా రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అదుపుతప్పి లారీ బోల్తా దెందులూరు: జాతీయ రహదారిపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. వివరాల ప్రకారం విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న లారీ దెందులూరు మండలం కొవ్వలి వంతెన దగ్గర జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
స్నేహితుల సహకారం మరువను
రక్తం అందక నిండు గర్భిణీ మరణం నన్ను కలచివేసింది. సమాజానికి మేలు చేయాలని అప్పుడే భావించాను. నాకు స్నేహితులందరూ అండగా నిలిచారు. ఆపదలో ఉన్న వారికి మేము ఉన్నాం.. అనే చిన్న భరోసా కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ సంస్థలో ఇప్పుడు ఇంత మంది తోడుగా రావడం సంతోషం. మరిన్నీ సేవా కార్యక్రమాలు చేస్తాం. – అల్లాడి రవితేజ, సంస్థ ఫౌండర్, ఆడిటర్, హైదరాబాద్ సేవే లక్ష్యంగా పనిచేస్తున్నాం సేవే పరమార్థంగా అందరం పనిచేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సభ్యులందరూ సకాలంలో స్పందిస్తున్నారు. శనివారం భీమవరంలో మహిళకు రక్తం అవసరమయ్యింది. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్లి ఆమెకు రక్తదానం చేశాను. ఇలా అందరూ సభ్యులు చేస్తున్నారు. అపోహలు విడనాడి అందరూ రక్తదానానికి ముందుకు రావాలి. – ఉండి రాజశేఖరరెడ్డి, సభ్యుడు, మూలలంక, కలిదిండి మండలం -
కుటుంబ కలహాలే కారణమా!
● గోస్తనీ కాలువలో దూకి ఆదివారం మహిళ ఆత్మహత్య ● సోమవారం కాలువలో లభ్యమైన మృతదేహం ● విలపిస్తున్న కుటుంబసభ్యులుతణుకు అర్బన్: తణుకు సజ్జాపురంలో నివసించే గుమ్మళ్ల శాంతి (48) మంగళవారం ఆంధ్రాసుగర్స్ ప్రాంతంలోని కాలువలో శవమై తేలింది. ఆమె ఆదివారం రాత్రి 2.30 గంటలకు ఇంటి నుంచి బయటకు రావడం, సోమవారం ఉదయం గోస్తనీ కాలువ జాతీయరహదారి వంతెనపై ఆమె బూట్లు కనిపించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని నిర్థారణకు రావడంతో పోలీసులు, అగ్నిమాపక అధికారులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆమె మృతదేహం ఆంధ్రా సుగర్స్ ప్రాంతంలో లభ్యమైంది. ఇటీవల కుటుంబ కలహాలతో కొన్ని మనస్పర్ధలు ఏర్పడ్డాయని అందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పోలీసుల పంచనామా అనంతరం పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబమంతా వెల్నెస్పైనే ఉపాధి శాంతి కుటుంబమంతా వెల్నెస్ సెంటర్లపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. వృద్ధులైన తన తల్లిదండ్రులతోపాటు ఇద్దరు కుమారులతో సజ్జాపురం పార్కు ప్రాంతంలో శాంతి నివసిస్తోంది. పెద్దకుమారుడు దుర్గాప్రసాద్ వివాహానంతరం కాకినాడలో వెల్నెస్ సెంటర్ నడుపుతూ అక్కడే నివసిస్తుండగా, చిన్న కుమారుడు పవన్ తణుకు బొమ్మల వీధిలో వెల్నెస్ సెంటర్ కోచ్గా ఉన్నారు. అయితే గతంలో స్థూలకాయంతో ఉండే శాంతి వెల్నెస్ సెంటర్లో వాడిన మందులతో సన్నబడి ఎంతో హుషారుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. తను మారిన విధానాన్ని అందరికీ తెలిసేలా ఫొటోలు, వీడియోలను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేవారని, తన కుటుంబంతో కూడా ఎంతో సంతోషంగా గడిపేవారని, కుమారులిద్దరితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసేవారని అటువంటి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందోనని స్థానిక ప్రజానీకం చర్చించుకుంటున్నారు. గోస్తనీ కాలువలో ఆమె శవమై తేలడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఆమె విగతజీవిగా కనిపించడంతో కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. -
పోక్సో కేసులో 8 ఏళ్ల జైలు
ఇరగవరం: పోక్సో కేసులో ముద్దాయికి 8 ఏళ్ల జైలు శిక్ష, రూ.60 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం భీమవరం పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. ఎసై జానా సతీష్ తెలిపిన వివరాలివి. గొల్లమాలపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన తోట నరేష్ (27) లైంగికంగా వేధించేవాడు. అడ్డుపడిన వారిని సైతం చంపుతానని బెదిరించడంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా 2022 జనవరి 27వ ఎసై జానా సతీష్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టు విచారణలో నేరం నిర్ధారణ కావడంతో ముద్దాయి నరేష్కు భీమవరం పోక్సో కోర్టు జడ్జి బి లక్ష్మీనారాయణ ఎనిమిదేళ్ల జైలు, రూ.60 వేలు జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి బ్రహ్మయ్య వాదనలు వినిపించగా హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు సహకరించారు. చెల్లని చెక్కు కేసులో జైలు శిక్షనూజివీడు: చెల్లని చెక్కు కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూరి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన మల్లవల్లి ప్రవీణ్కుమార్ 2020 ఆగస్టు 2న జంగారెడ్డిగూడెంకు చెందిన ఎర్నెస్ట్ కుమార్కు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత బాకీ తీర్చమని అడుగగా ఎర్నెస్ట్ కుమార్ 2020 డిసెంబర్ 27న ప్రవీణ్కుమార్కు ఒకొక్కటి రూ.5లక్షలు చొప్పున రెండు చెక్కులను ఇచ్చారు. ఆ చెక్కులను నగదు నిమిత్తం బ్యాంకులో వేయగా ఖాతాలో నగదు లేదని వెనక్కు తిరిగి వచ్చాయి. దీంతో ప్రవీణ్కుమార్ కోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం ఎర్నెస్ట్ కుమార్కు న్యాయమూర్తి జైలుశిక్ష, జరిమానా విధించారు. -
సూరీడు.. అప్పుడే సుర్రుమంటున్నాడు
నరసాపురం: ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొడుతున్నాయి. సూరీడు సుర్రుమంటూ రానున్న రోజుల్లో తన ప్రతాపం ఎలా ఉండబోతుందోననే హింట్ ఇస్తున్నట్టుగా ఉంది. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో గత వారం రోజుల నుంచి 40 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా ఫిబ్రవరి మాసం ద్వితీయార్థంలో ఉన్నాము. సాధారణంగా మార్చి చివరివారం నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వేసవి తాలూకూ ప్రభావం కనిపిస్తోంది. మొన్నటి వరకూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కూడా జిల్లాల్లో మంచు ప్రభావం చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నప్పటికీ, ఉదయం పూట ఉష్ణోగ్రతలు మాత్రం పెరిగాయి. దీనిని బట్టి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎంత పెద్దస్థాయిలో ఉంటాయో? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గాలిలో ఉండే తేమశాతంలో కూడా భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా ఉక్కబోత ప్రజలను కాస్త ఇబ్బంది పెడుతుంది. తగ్గుతున్న తేమశాతం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సాధారణంగా పగటి పూటల్లో గాలిలో తేమశాతం 50 శాతం పైనే నమోదవుతుంది. తెల్లవారుజామున 95 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గాలిలో తేమశాతం పడిపోతోంది. పగటిపూట 40 నుంచి 50 శాతం, తెల్లవారుజాము సమయంలో 85 నుంచి 90 శాతంగా గత 10 రోజులుగా నమోదవుతోంది. ఇక ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. గత 10 రోజులుగా ఉమ్మడి పశ్చిమలో అత్యధికంగా 38 నుంచి 41 డిగ్రీలు, అత్యల్పంగా 32 నుంచి 37 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే, ఈ సంవత్సరం వేసవి మొత్తం భానుడు తన ప్రతాపాన్ని గట్టిగానే చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు మొన్నటి వరకూ శీతాకాలం. ఇప్పుడు చలిగాలులు తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ధీర్ఘకాల రోగాలకు మందులు తీసుకుంటున్న వారు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వేసవి ప్రారంభంలోనే హెచ్చరికలు జారీ చేస్తున్న ఎండలు ఉమ్మడి జిల్లాలో 40 డిగ్రీల చేరువలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు తేమశాతంలో భారీ హెచ్చుతగ్గులు ఉక్కబోతలు కూడా ప్రారంభం -
23 నుంచి శివయ్య కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివయ్య కల్యాణ మహోత్సవాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 1 వరకు ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి సోమవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 23న ఉదయం 10 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. 26న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి 10 గంటలకు లింగోధ్భవకాల అభిషేకం అనంతరం స్వామివారి కల్యాణోత్సవం, ఆ తర్వాత గ్రామోత్సవం జరుగుతుంది. వచ్చేనెల 1న ఆలయంలో జరిగే శ్రీపుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈఓ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. 26న రాత్రి స్వామివారి కల్యాణం -
ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
భీమవరం అర్బన్: ఓ మహిళ ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భీమవరం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూట్లపాడు గ్రామానికి చెందిన ఆకుల శ్రీరామ్మూర్తికి, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందిపువారిపాలెంకు చెందిన ఆకుల దేవి సాయి రామ నాగలక్ష్మి (29)కి 2018లో వివాహమైంది. అప్పట్లో పసుపు కుంకుమల కింద 50 సెంట్లు భూమి, రూ. 3 లక్షలు, ఆడపొడుచలు లాంఛనంగా రూ.లక్షా 50 వేలు, 5 కాసులు బంగారం ముట్టజెప్పారు. కొంతకాలం దాంపత్య జీవితం సాఫీగా సాగింది. వీరికి బాబు, పాప ఉన్నారు. గత కొంతకాలంగా రామ నాగలక్ష్మిని భర్త శ్రీరామ్మూర్తి, అత్త వరలక్ష్మి, మామ ఆదినారాయణమూర్తి, ఆడపొడుచులు ముత్యాల పష్పవతి, మేడ్చర్ల లక్ష్మి, సీహెచ్ సత్యవాణి వేధిస్తున్నారు. భీమవరంలో నివసిస్తున్న శ్రీరామ్మూర్తి తన కుటుంబంతో కలిసి ఈ నెల 15న సొంతూరు గూట్లపాడు గ్రామానికి వచ్చాడు. 16వ తేదీన బాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే సోమవారం ఏమైందో తెలియదు కాని రామ నాగలక్ష్మి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే తన అక్క మృతి చెందిందని దేవి సాయి రామ నాగలక్ష్మి సోదరుడు నందిపు వీర వెంకట సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్సై ఐ వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త, అత్తమామల వేధింపులే కారణమని సోదరుడి ఫిర్యాదు -
ఇప్ప పువ్వు.. గిరిజనుల కల్పతరువు
బుట్టాయగూడెం: ఆదివాసీ గిరిపుత్రులకు అడవిలో లభించే ఉత్పత్తులే జీవనాధారం. అందులోనూ కాలానుగుణంగా లభించే ఇప్ప పవ్వు అతి ప్రధానమైనది. వేసవిలో మాత్రమే దొరికే వీటిని విక్రయించి గిరిజనులు ఉపాధి పొందుతుంటారు. తెల్లవారుజామునే అడవిలోకి వెళ్లి ఇప్పపువ్వును గిరిజనులు సేకరిస్తారు. చెట్లపై నుంచి కిందపడిన ఇప్ప పువ్వును మధ్యాహ్ననికి సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడతారు. మూడు నెలల పాటు ఉపాధి మన్య ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు ఇప్ప చెట్ల ద్వారా మూడు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. ఖరీఫ్, రబీ పనులు ముగిసే సమయానికి ఇప్ప చెట్లు విరగ పూస్తాయి. వీటి పువ్వులు గాలికి నేలరాలుతుంటాయి. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రి పండ్లు సేకరించి ఇంటికి తీసుకువస్తుంటారు. వీటిని సేకరించి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విక్రయించి ఉపాధి పొందుతుంటారు. ఔషధాల తయారీ గిరిజనులు సేకరించిన ఇప్ప పువ్వును జీసీసీల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఇప్ప పువ్వును ఔషధాల తయారీకి విక్రయిస్తారు. ఈ పువ్వు నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. అలాగే దంతాలను శుభ్రం చేసుకోవడంతోపాటు దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యాధులకు ఔషదంగా పనిచేస్తుంది. ప్రధానంగా స్వచ్ఛమైన ఇప్ప పువ్వుతో తయారు చేసిన సారాను సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని గిరిజనులు అంటున్నారు. వైద్యశాస్త్రంలోనూ ఇప్ప పువ్వు ప్రాధాన్యతను సంపాదించుకుంది. ఆయుర్వేదంలోనూ మధుక వృక్షం అని పేరుపొందింది. గిరిజన ప్రాంతంలోని ప్రజలు ఈ ఇప్పచెట్లను మాతృమూర్తిగా భావిస్తారు. ఇప్ప పువ్వులో ఎన్నో పోషకాలు అడవిలో లభించే ఇప్ప పువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నో పోషక విలువలున్నట్లు శాసీ్త్రయంగా నిరూపించబడింది. భారత శాసీ్త్రయ సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయంతో 1999లో నిర్వహించిన పరిశోధనలో ఎండిన ఇప్ప పువ్వుల నుంచి పంచదారను తయారు చేసి దీనితో జామ్, కేక్లు, చాక్లెట్లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. ఇప్పపువ్వు ఎక్కువకాలం నిల్వ ఉండడానికి మధ్యమధ్యలో ఎండిన వేప ఆకును వేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు. కొందరు గిరిజనులు ఇప్పపువ్వును ఆహారంగా కూడా తీసుకుంటారు. ధరలేక ఇప్ప పువ్వు సేకరణపై తగ్గిన ఆసక్తి పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంతో పాటు పాపికొండల అభయారణ్యంలో ఇప్ప చెట్లు దాదాపుగా 10 వేలకు పైగా ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ ఇప్ప చెట్లు ఆధికంగా ఉన్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా 5 వేల చెట్ల వరకూ అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో నాటి వాటిని పెంచుతున్నారు. గిరిజనులు సేకరించిన ఈ ఇప్ప పువ్వులను జీసీసీ అధికారులే కాదు బయటి నుంచి అనేక మంది వ్యాపారులు కూడా కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. ప్రస్తుతం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుత్తుకోయలు, బుట్టాయగూడెం మండలంలో కొండరెడ్లు ఈ పువ్వులను సేకరిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే సరైన ధర లభించకపోవడంతో కాలక్రమేపీ గిరిజనులు కూడా ఇప్ప పువ్వు సేకరణపై ఆసక్తి చూపడంలేదు. అలాగే పలుచోట్ల ఇప్ప పువ్వు చెట్లను కూడా నరికివేస్తున్నట్లు సమాచారం. పోషకాలు పుష్కలం.. వైద్య శాస్త్రంలోనూ ప్రాధాన్యత వేసవి నుంచి మూడు నెలల పాటు అడవి బిడ్డలకు ఉపాధి గిట్టుబాటు ధర లేక.. తగ్గుతున్న పువ్వుల సేకరణ జీసీసీ ద్వారా ఇప్ప పువ్వుకొనుగోలు చేయాలని డిమాండ్ జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి మా గ్రామ సమీపంలోని అడవుల్లో ఇప్ప పువ్వుతోపాటు పలు ఉత్పత్తులు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్ప పువ్వు సీజన్ ప్రారంభమవుతుంది. జీసీసీ ద్వారా ఇప్ప పువ్వు కొనుగోలు చేయాలి. – కెచ్చెల బాలిరెడ్డి, కొండరెడ్డి గిరిజనుడు, మోదేలు సరైన ధర లేక.. సరైన ధర రాకపోవడంతో గిరిజనులు ఇప్ప పువ్వుల సేకరణకు ఆసక్తి చూపడంలేదు. రానురానూ చెట్లు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో చెట్లను పెంచడంతోపాటు జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి. – కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకులు, అలివేరు -
గోస్తనీ కాలువలో దూకి మహిళ గల్లంతు
తణుకు అర్బన్: గోస్తనీ కాలువలో దూకి మహిళ గల్లంతైన ఘటన తణుకు సజ్జాపురం ప్రాంతంలోని జాతీయరహదారి వంతెన ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం సజ్జాపురంలో నివసిస్తున్న గుమ్మళ్ల శాంతి (48) ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు రావడం.. ఆపై కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు సోమవారం ఉదయం నుంచి వెతుకులాట చేపట్టారు. ఈ క్రమంలో ఆమె కాళ్లకు వేసుకునే బూట్లు గోస్తనీ కాలువ వంతెనపై భాగంలోని జాతీయరహదారిపై ఉండడంతో రాత్రి సమయంలో కాలువలోకి దూకి ఉంటారని కుటుంబసభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహకారంతో గజ ఈతగాళ్లు గోస్తనీ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ కాలువలో దూకారనే వార్త తెలిసిన సజ్జాపురవాసులతోపాటు జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు వంతెన ప్రాంతంలో భారీగా చేరుకుని గుమిగూడారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వెల్నెస్ సెంటర్ కోచ్గా శాంతి సజ్జాపురం పార్కు ప్రాంతంలో తన ఇద్దరు కుమారులతో కలిసి శాంతి నివసిస్తోంది. భర్త లేకపోవడంతో తన నివాసంలోనే వెల్నెస్ సెంటర్ కోచ్గా ఆమె ఉపాధి పొందుతోంది. శాంతి అందరితో కలుపుగోలుగా ఉండే స్వభావమని, సామాజిక మాధ్యమాల్లో సైతం రీల్స్ చేస్తూ హుషారుగా ఉంటుందని స్నేహితులు చెబుతున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుమారులిద్దరిలో ఒకరికి వివాహం కూడా అయినట్లు బంధువులు వివరిస్తున్నారు. శాంతి కాలువలో దూకినట్లుగా ఎవరూ చూడకపోవడంతో గోస్తనీ కాలువ వంతెనపై ఉన్న బూట్లు ఆధారంగా మాత్రమే కాలువలో దూకినట్లు అంచనా వేస్తున్నారు. వంతెనపై ఉన్న ఆమె బూట్ల ఆధారంగా గోస్తనీ కాలువలో గాలింపు -
వెలగలేరులో చోరీ
పెనుమంట్ర: వెలగలేరు శివాలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున తాళం వేసిన ఇంటిలో దొంగలు పడి బంగారు ఆభరణాలు, నగదును అపహరించారు. గ్రామానికి చెందిన పడాల సూర్యకుమారి వారం రోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి వైజాగ్లోని కుమార్తె ఇంటికి వెళ్లింది. అయితే సోమవారం ఉదయం తలుపులు తెరచి ఉండటాన్ని గమనించిన స్థానిక బంధువులు సమాచారాన్ని ఆమెకు తెలియజేయడంతో వైజాగ్ నుంచి వచ్చిన ఆమె పెనుమంట్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ చోరీలో ఇరవై మూడున్నర కాసుల బంగారం, రూ.1.80 లక్షల నగదును దొంగలు దోచుకుపోయినట్లు ఆమె బంధువులు తెలిపారు. పెనుమంట్ర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే!
నూజివీడు: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ఎంతో కొంత మెరుగ్గా ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బోధనేతర ఉద్యోగి వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రానురాను అతని తీరు ట్రిపుల్ ఐటీ అధికారులను సైతం ఇబ్బంది పెట్టేలా పరిణమించడం గమనార్హం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకు చెప్పాలని, నేను చెప్పినట్లే అందరూ నడుచుకోవాలంటూ డైరెక్టర్, ఏవోలకు సైతం హుకుం జారీ చేస్తుండటంతో మిగిలిన ఉద్యోగులందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్చార్జి బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి, ఎవరిని తొలగించాలో కూడా తానే చెప్తానంటూ తన మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. తనకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఇవ్వాలని, సెంట్రల్ డీన్ హోదా ఇవ్వాలని, తన డిజిగ్నేషన్ మార్చాలని, జీతం పెంచాలని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అంతేగాకుండా తనకు లోకేష్ తెలుసని, లోకేష్ టీం తెలుసంటూ ట్రిపుల్ ఐటీలోని అధికారులను బెదిరిస్తూ కర్రపెత్తనం చేస్తుండటం, తనకు నచ్చని వారికి అదనపు బాధ్యతలు ఇస్తే వారిని ఆ బాధ్యతల నుంచి తొలగించాలంటూ ఒత్తిడి చేయడం నిత్యకృత్యంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. విద్యార్థులపైనా వేధింపులు ఒకవైపు అధికారులపై కర్ర పెత్తనం చేస్తుండటంతో పాటు తమకు నచ్చని విద్యార్థులపైనా వేధింపులు చేస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా విద్యార్థులు తమకు నచ్చిన హీరో ఫొటోనో, నాయకుడి ఫొటోనో ఫోన్లస్టాటస్గా పెట్టుకుంటే ఆ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తుండటంపై ట్రిపుల్ ఐటీలో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ట్రిపుల్ ఐటీలను స్థాపించి 16 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని పలువురు వాపోతున్నారు. ఈ ఉద్యోగితో పాటు కొందరు ప్రభుత్వ అనుకూల వర్గంగా ఏర్పడి తమకు అనుకూలంగా లేని ఉద్యోగులపై ఫిర్యాదులు సైతం చేస్తుండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో బయటి నుంచి కనబడే శత్రువు కంటే మనలోని కనబడని శత్రువు నుంచే ట్రిపుల్ ఐటీలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయంటూ ఒక అధికారి పేర్కొన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఇంతకీ ఆ బోధనేతర ఉద్యోగి కాంట్రాక్టు ఉద్యోగి కావడం కొసమెరుపు. కర్ర పెత్తనం చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి లోకేష్ టీం పేరుతో బెదిరింపులు ట్రిపుల్ ఐటీలో అధికారులపై ఒత్తిడి విద్యార్థులపై లేనిపోని ఫిర్యాదులు వివాదాస్పదంగా బోధనేతర ఉద్యోగి తీరు -
రాష్ట్రస్థాయి నెట్బాల్ విజేత ‘పశ్చిమ’
పాలకోడేరు: రాష్ట్రస్థాయి అండర్ 19 బాలబాలికల నెట్బాల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు విజేతగా నిలవగా జిల్లా బాలుర జట్టు తృతీయస్థానం సాధించిందని జిల్లా నెట్ బాల్ సంఘ కార్యదర్శి ఎన్.విజయలక్ష్మి తెలిపారు. ఈనెల 16 17 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని డాన్ బాస్కో హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో 10వ రాష్ట్రస్థాయి జూనియర్ అండర్ 19 బాల బాలికల నెట్ బాల్ పోటీలు జరిగాయన్నారు. విజేతలకు తూర్పుగోదావరి జిల్లా నెట్ బాల్ సంఘ అధ్యక్షుడు కె.అశోక్ రెడ్డి, డాన్ బాస్కో హైస్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ ఐ.బల్కదర్ బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈ నెలలో జరగనున్న జాతీయస్థాయి జూనియర్ నెట్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని కోచ్ పి.దావూద్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులను పలువురు అభినందించారు. -
నకిలీ నగలతో ముత్తూట్లో రుణం
సంస్థలో పనిచేసే ఇద్దరిపై కేసు నమోదు ఏలూరు టౌన్: ప్రైవేట్ ఫైనాన్స్ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందే నకిలీ నగలు తాకట్టుపెట్టి భారీగా డబ్బులు కాజేశారు. ఈ మోసం బయటపడడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు పవర్పేటలో ముత్తూట్ ఫైనాన్స్ పేరుతో బంగారు నగల తాకట్టు దుకాణం ఉంది. ఈ బ్రాంచ్లో ఏలూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు. వీరు కొంతకాలం క్రితం ముత్తూట్ ఫైనాన్స్లో నకిలీ నగలను తాకట్టుపెట్టి రూ.12,31,600 రుణంగా తీసుకున్నారు. బ్రాంచ్లో పనిచేస్తున్న సిబ్బంది కావడంతో పూర్తిస్థాయిలో తనిఖీ చేయకుండానే రుణం మంజూరు చేశారు. రెండు రోజుల క్రితం మూత్తూట్ ఫైనాన్స్ రీజనల్ మేనేజర్ వేల్పూరి రాజేష్ ఏలూరులోని పవర్పేట బ్రాంచ్కు వచ్చారు. ఆయన బ్రాంచ్లో తాకట్టు పెట్టిన బంగారు నగలను తనికీ చేశారు. ఈ తనికీల్లో తాకట్టులోని నగలు నకిలీగా నిర్థారించారు. ఈ నగలను తాకట్టు పెట్టిన వ్యక్తుల వివరాలు ఆరా తీయగా బ్రాంచ్లో పనిచేస్తున్న సిబ్బందిగా గుర్తించారు. దీనిపై రీజనల్ మేనేజర్ రాజేష్ ఏలూరు టూటౌన్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ వైవీ రమణ ఆధ్వర్యంలో ఎస్ఐ నాగకళ్యాణి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిచ్చికుక్క దాడి.. 8 మందికి గాయాలు కొయ్యలగూడెం: కన్నాపురంలో పిచ్చికుక్క స్వైర విహారంతో 8 మంది గాయాలపాలయ్యారు. దీంతో గ్రామస్తులు ఆ పిచ్చికుక్కను వెంటాడి హతమార్చారు. పిచ్చికుక్క మరికొన్ని కుక్కలపై దాడి చేసిందని, ఈ నేపథ్యంలో మిగిలిన కుక్కల పరిస్థితి పట్ల అప్రమత్తతతో ఉండాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
వర్గీకరణ చేస్తే ప్రాణత్యాగాలకు సిద్ధం
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ దేశ వ్యాప్తంగా చేయాలి తప్పా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రాల పరిధిలో చేస్తే ప్రాణత్యాగాలు చేయడానికి కూడా సిద్ధమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటమిల్లి మంగరాజు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రావడానికి మాలలే ప్రముఖ పాత్ర వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు మాలలు కృషి చేస్తే అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంద కృష్ణకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకు చూస్తున్నారని, ఇది సరికాదన్నారు. మందకృష్ణ మాత్రం మతతత్వ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, ఈ విషయాన్ని ఇతర పక్షాలు గుర్తించాలని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య, ఏపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పుష్పాంజలి, మహానంది, శేషు పాల్గొన్నారు. గ్యాస్ లీకై వ్యక్తికి తీవ్ర గాయాలు బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం కనకాపురంలో సోమవారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పైప్ లీక్ అయ్యి మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన బంగారయ్య వంట కోసం గ్యాస్ స్టౌను వెలిగించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో గ్యాస్ పైప్ లీక్ అవ్వడంతో మంటలు చెలరేగి అతనికి తీవ్ర గాయాలయ్యాయి. బంగారయ్యను చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా మంటలు ఆర్పేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా గ్యాస్ సిలిండర్ కావడంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఎస్సై నవీన్కుమార్ అక్కడికి చేరుకుని ఆ మంటలను ఆర్పించారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి తాడేపల్లిగూడెం రూరల్: లారీ ఢీకొని మోటార్సైక్లిస్టు మృతి చెందాడు. రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపిన వివరాలివి. ముత్యాలంబాపురం గ్రామానికి చెందిన పప్పు సంజీవరావు (64) సోమవారం తన మోటారు సైకిల్పై దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వెళ్లి తిరిగి వస్తుండగా పెదతాడేపల్లి జాతీయ రహదారిపై ఏపీ 28 టిడి 5445 నెంబరు గల లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడ్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై సంజీవరావు కుమారుడు అశోక్ కుమార్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. సారా తయారీదారుల అరెస్ట్ చాట్రాయి: సారా తయారీదారులను అరెస్ట్ చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ ఎస్సై మస్తానరావు తెలిపారు. మండలంలోని పోతనపల్లి తండాలో సారా నేరాలకు పాల్పడుతున్న హసావతు బాలరాజు, వడిత్యా బిక్షాలు, ధారావతు శ్రీరాములును అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం తిరువూరు కోర్టుకు తరలించినట్లు సోమవారం ఆయన చెప్పారు. -
బలివే ఉత్సవాల్లో సౌకర్యాలకు ప్రాధాన్యం
బలివే(ముసునూరు) : భక్తుల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అందరి సహకారంతో బలివే మహా శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయనున్నట్లు ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్రాజ్ అన్నారు. బలివే శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉత్సవాల నోడల్ అధికారి, తహసీల్దార్ కె.రాజ్కుమార్ అధ్యక్షతన సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని, పంచాయతీరాజ్, పోలీస్శాఖల ఆధ్వర్యంలో భక్తుల స్నానాలు, దైవ దర్శనానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నూజివీడు, ఏలూరు రహదారుల మరమ్మతులు తక్షణం పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఉత్సవ ప్రాంగణ పరిసరాల్లో మద్యం విక్రయాలు లేకుండా ఆ శాఖలను అప్రమత్తం చేశామన్నారు. అనంతరం క్యూలైన్ల కోసం నిర్మించిన బారికేడ్లను, జల్లు స్నాన ఏర్పాట్ల్లను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సుందరి ,ఎంపీడీఓ జి.రాణి, ఈఓపీఆర్డీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 3,109 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట) : ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రయోగ పరీక్షలకు సోమవారం 3,109 మంది హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 36 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 3,208 మందికి 3,109 మంది హాజరు కాగా 99 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 1716 మందికి గాను 1,647 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్షకు 1,492 మందికి 1462 మంది హాజరయ్యారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాన్ తెలిపారు. క్లాప్ ఆటో డ్రైవర్లను తొలగించడం అన్యాయం ఏలూరు (టూటౌన్): క్లాప్ (చెత్త సేకరణ)ఆటో డ్రైవర్లను ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా ఫిబ్రవరి ఒకటి నుంచి నిలుపుదల చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ ఏలూరు అసెంబ్లీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు శివరావు విమర్శించారు. ఇంటింటి చెత్త సేకరణ కోసం ఏలూరులో 60 క్లాప్ ఆటోలను కేటాయించారని, ఇందులో 60 మంది డ్రైవర్లను నియమించారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారి జీవితాలను రోడ్డున పడేసిందని విమర్శించారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ జమ చేయలేదన్నారు. తక్షణమే క్లాప్ ఆటో డ్రైవర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైరస్ కోళ్లు ఖననం తాడేపల్లిగూడెం రూరల్ : బర్డ్ ఫ్లూ నేపథ్యంలో మండలంలోని పెదతాడేపల్లి పౌల్ట్రీ ఫారంలోని కోళ్లను సోమవారం వెటర్నరీ అధికారులు ఖననం చేశారు. వెటర్నరీ సిబ్బంది పీపీ కిట్లు ధరించి సుమారు 23 వేల కోళ్లను దశల వారీగా గోతుల్లో వేసి పూడ్చారు. వెటర్నరీ జేడీ మురళీకృష్ణ, డీడీ డాక్టర్ సుధాకర్, ఎంపీడీవో ఎం.విశ్వనాథ్, వెటర్నరీ ఏడీ డాక్టర్ అనిల్కుమార్, ఈవోపీఆర్డీ ఎం.వెంకటేష్, పాల్గొన్నారు. ఇళ్ల తొలగింపును నిరసిస్తూ ధర్నా భీమవరం : భీమవరంలోని కోర్టు పక్కన నివాసితుల ఇళ్లు తొలగించవద్దంటూ గణపతినగర్ పేదలు మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు బి.వాసుదేవరావు మాట్లాడుతూ పట్టణంలో బడాబాబులు ఆక్రమించిన స్థలాలు, కాల్వలను వదిలి పేదల ఇళ్లను తొలగించడం దారుణమన్నారు. గణపతినగర్లో చంటిపిల్లలు, వృద్ధులతో ఉంటున్న పేదల ఇళ్లు తొలగించడంతో చెట్టు కింద ఉండాల్సిన దుస్థితి కల్పించారని విమర్శించారు. మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
స్కూళ్లలో ఎన్నికల ప్రచారం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడుగడుగునా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళితో సంబంధం లేకుండా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు మొదలుకొని ప్రభుత్వ ప్రాంగణాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూటమి అభ్యర్ధికి మద్దతుగా ఉమ్మడి పశ్చిమలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తూ అడుగడుగునా కోడ్ను ధిక్కరిస్తున్నా జిల్లా యంత్రాంగం దృష్టి సారించడం లేదు. ఈ నెల 27న ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఏలూరు జిల్లాలో 62 పోలింగ్ కేంద్రాల్లో, పశ్చిమగోదావరి జిల్లాల్లో 93 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గ్రాడ్యుయేట్ బరిలో మొత్తం స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 35 మంది పోటీలో ఉన్నారు. కూటమి పార్టీ నుంచి కాకినాడ రూరల్కు చెందిన టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేస్తున్నారు. దీంతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, క్యాంపు కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించడం, మండలాల వారీగా ముఖ్య నాయకుల ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే నడుస్తుంది. ఈ నెల 25న సాయంత్రం 5 గంటలతో ప్రచారం పర్వం ముగించాల్సి ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రాంగణాలు, స్కూళ్లలో సమావేశాలు నిర్వహించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా కోడ్ ఉల్లంఘనే. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అధికార యంత్రాంగం నామమాత్రంగా ఫ్లెక్సీలను తొలగించి ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేస్తున్నామని ప్రకటించారు. క్లస్టర్ సమావేశాల పేరుతో ఎన్నికల ప్రచారం ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో 116 క్లస్టర్లలో సమావేశాలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 మండలాల్లో 84 క్లస్టర్లలో అదే రోజు సమావేశం నిర్వహించేలా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్క క్లస్టర్ పరిధిలో 8 నుంచి 20 వరకు స్కూళ్లు ఉన్నాయి. అన్ని స్కూళ్ల ఉపాధ్యాయులు క్లస్టర్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి. కేవలం గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసమే క్లస్టర్ సమావేశాలు నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి. సమావేశ ప్రధాన అజెండా కూడా వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ అంశాల మార్పులు, చేర్పులపై ఉపాధ్యాయులు చర్చించుకోవడానికి అని చెబుతున్నారు. విద్యా సంవత్సరానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ క్రమంలో క్లస్టర్ సమావేశాలు ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచార సభలుగా మార్చేసుకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు కై కరం, పెదనిండ్రకొలను, గణపవరం పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించారు. కై కరంలో హెచ్ఎం అభ్యంతరం తెలపడంతో స్కూల్ బయట నిర్వహించారు. గణవపరంలో బాయ్స్ హైస్కూల్లో క్లస్టర్ సమావేశానికి హాజరై కూటమి అభ్యర్థిని గెలిపించాలని కరపత్రాలను పంపిణీ చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా పాఠశాలల సమయాల్లో ప్రాంగణాలకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఎన్నికల ప్రచారం చేసినట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అడుగడుగునా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన ప్రచార సభలుగా స్కూల్ క్లస్టర్ సమావేశాలు గణపవరంలో సమావేశం వద్దని అడ్డుకున్న హెచ్ఎం కై కరంలోనూ స్కూల్ ప్రాంగణంలో సమావేశంపై అభ్యంతరం -
పెళ్లి బృందాలను తరలిస్తున్న బస్సుల సీజ్
భీమవరం(ప్రకాశం చౌక్) : పెళ్లి బృందాలను తీసుకెళ్తున్న మూడు స్కూల్ బస్సులను రవాణా శాఖ అధికారులు అడ్డుకుని సీజ్ చేసి, జరిమానా విఽధించారు. భీమవరం నుంచి గణపవరం వెళుతున్న రెండు బస్సులు, ఆకివీడు వెళుతున్న ఒక బస్సును సీజ్ చేసి మూడు బస్సులకు కలిపి రూ.1,85,540 జరిమానా విధించినట్టు జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావు తెలిపారు. గురజాడ విద్యానికేతన్ (గణపవరం), ఇండియన్ డిజిటల్ స్కూలు(గణపవరం), భారతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ(ఆకివీడు)కు చెందిన బస్సులు సీజ్ చేసినట్లు చెప్పారు. పెళ్లిళ్లకు, ఇతర కార్యక్రమాలకు స్కూల్ బస్సులను వినియోగించడం చట్ట విరుద్ధమని చెప్పారు. -
19 నుంచి టెక్నికల్ పరీక్షలు
భీమవరం: డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు ఈ నెల 19 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ తెలిపారు. పరీక్షలకు హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పట్టణంలోని ఎస్సీహెచ్బీఆర్ హైస్కూల్లో నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 131 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. డ్రాయింగ్ లోయర్, హయ్యర్ పరీక్షలు 19 నుంచి 22 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు జరుగుతాయని టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలు 19 నుంచి 20 వరకు నిర్వహిస్తామన్నారు. సొంత కుట్టుమిషన్, హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు తీసుకుని పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని తెలిపారు. -
పక్కా ‘ప్లానింగ్’తో అక్రమాలు
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ కట్టడాలపై ఆరోపణలు వెల్లువెత్తగా.. మున్సిపల్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి దాదాపు 20 రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ప్లానింగ్ ఉద్యోగి ఒక ప్రజా ప్రతినిధికి నమ్మిన బంటు కావడంతో ఎలాంటి చర్యలు లేవని తెలుస్తోంది. ఆ ప్రజా ప్రతినిధి జోక్యంతోనే విచారణ ముందుకు సాగకుండా తొక్కి పెడుతున్నారే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు ఉద్యోగి నగరపాలక సంస్థ పట్టణ ప్లానింగ్ విభాగంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడని అదే కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా ప్రతినిధులు తమకు విధేయులుగా ఉండే ఉద్యోగులకు కొమ్ము కాస్తూ వారు ఏం చేసినా కాపాడుకుంటు వస్తున్నారనే వాదనలు బలంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వడ్డించే వాడు మనవాడైతే కడ బంతిలో ఉన్నా అన్నీ అందుతాయనే సామెతలా ఎన్ని తప్పులు, పొరపాట్లు చేసినా కాపాడే ప్రజా ప్రతినిధులు ఉన్నప్పుడు ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడక తప్పదనే భావన వ్యక్తమవుతుంది. అక్రమాలని తేల్చినా.. ఏలూరు నగర పాలక సంస్థలో సూపర్ వైజర్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. బీ–ఫాం పట్టాలు ఉన్న స్థలాల్లో కూడా పక్కా భవనాలు కట్టుకునేందుకు, ఏలూరు కోర్టు సెంటర్లోని దుకాణాలకు, అశోక్ నగర్లోని కొన్ని కట్టడాలకు, ఒకటో పట్టణ పరిధిలోని కొన్ని భవనాలకు అనుమతులు ఇవ్వడం వంటి అంశాలపై గత నెల 28న రాజమండ్రి ఆర్జేడీ కార్యాలయానికి చెందిన బృందం నగరంలో తనిఖీలు నిర్వహించింది. బీ–ఫాం పట్టాలు ఉన్న స్థలాల్లో కూడా పక్కా భవనాలకు అనుమతులు ఎలా ఇచ్చారని తనిఖీ బృందం ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆ ఉద్యోగిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయినా సదరు ఉద్యోగి ఉన్నతాధికారుల ప్రశ్నలకు ఏ విధమైన సమాధానం ఇవ్వకుండా మౌనంగానే ఉన్నారు. తన గురువు చూసుకుంటారులే అని ధీమాగా ఉన్నట్లు సమాచారం. రెండోసారి తనిఖీలు నిల్ గత నెల 28న తనిఖీకి వచ్చిన అధికారులు మళ్లీ వారంరోజుల్లో రెండోసారి తనిఖీలు నిర్వహించి ఆర్జేడీకి విచారణ రిపోర్టు అందజేస్తామని ప్రకటించారు. వారు మొదటిసారి తనిఖీకి వచ్చి దాదాపు 20 రోజులు కావస్తున్నా ఇంతవరకు రెండో సారి తనిఖీకి రాలేదు. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగిపై ఇంత వరకు విచారణ రిపోర్టు ఇచ్చిందనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ఏలూరు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు సైతం ఎలాంటి సమాచారం చెప్పలేని పరిస్థితి. ఆర్జేడీ కార్యాలయం నుంచి రెండోసారి తనిఖీలు నిర్వహించకుండా సదరు ఉద్యోగికి అండదండలు అందిస్తున్న ఆ ప్రజా ప్రతినిధి మోకాలు అడ్డుతున్నట్లు సమాచారం. పై అధికారుల ఆదేశాలు బేఖాతరు ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని పట్టణ ప్లానింగ్ విభాగానికి ఏసీపీ హెడ్గా ఉంటారు. ఆయన కింద టౌన్ ప్లానింగ్ విభాగంలోని మిగతా ఉద్యోగులు పనిచేయాలి. వీరికి పైన కార్పొరేషన్ పరిఽధిలో అసిస్టెంట్, డిప్యూటీ కమిషనర్లు చివరగా నగర కమిషనర్ ఉంటారు. కింది స్థాయి ఉద్యోగి అన్నీ తానై చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్న పై అధికారుల ఆదేశాలు బేఖాతారు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏలూరు టౌన్ ప్లానింగ్లో చక్రం తిప్పుతున్న చిరుద్యోగి విచారణ చేపట్టి 20 రోజులైనా చర్యలు శూన్యం ప్రజా ప్రతినిధి అండతో రెచ్చిపోతున్న వైనం -
ఉత్తమ ఇంగ్లీష్ టీచర్గా కంకర్ల దాస్
ఏలూరు (ఆర్ఆర్పేట): మండలంలోని చొదిమెళ్ళ ఎంపీపీ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ కంకర్ల దాస్ దక్షిణ భారత స్థాయిలో ఉత్తమ ఇంగ్లీష్ టీచర్గా ఎంపికయ్యారు. సర్టిఫికెట్ ఇన్ ఇంగ్లీస్ లాంగ్వేజ్ టీచింగ్ (సీఈఎల్టీ)కోర్సులో భాగంగా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా (ఆర్ఐఈఎస్ఐ)ఆధ్వర్యంలో బెంగళూరులో జనవరి 16 నుంచి ఫిబ్రవరి 14 వరకూ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన ఇంగ్లీష్ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఏలూరు జిల్లా నుంచి పాల్గొన్న ఇంగ్లీష్ టీచర్ కంకర్ల దాస్ ఉత్తమ ఇంగ్లీష్ టీచర్గా ఎంపికయ్యారు. బెంగళూరు ఆర్ఐఈఎస్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎస్ మణి, పలు రాష్ట్రాలకు చెందిన ఇంగ్లీష్ ఉపాధ్యాయులు దాస్ను ప్రత్యేకంగా అభినందించారు. దాస్ మాస్టారును ఏలూరు మండల విద్యాశాఖాధికారి –1 ఏ. రవిప్రకాష్, 2 డీవీ రమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ. రవికుమార్ తదితరులు అభినందించారు. -
సమ్మె ఒప్పందాన్ని అమలు చేయాలి
ఏలూరు (టూటౌన్): అంగన్వాడీల 42 రోజుల సమ్మె సందర్భంగా ఒప్పందాలను అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ ఐిసీడీఎస్ సీడీపీఓ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్– హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు. సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని, వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని నినదించారు. యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షులు రజనీ అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ఒప్పందం మేరకు ఏ ఒక్క డిమాండ్ను నెరవేర్చలేదని విమర్శించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 42 రోజుల సమ్మె ఒప్పందం అమలు చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని అమలుకు దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కే. విజయలక్ష్మి, పి.హైమావతి తదితరులు పాల్గొన్నారు. -
లంచాల బాగోతంపై మీనమేషాలు
● రైతుల నుంచి అటవీ అధికారి లంచాల వసూలు ● ఫిర్యాదు చేసినా విచారణలో జాప్యం నిడమర్రు: కొల్లేరు జిరాయితీ భూముల వ్యవహారంలో రైతుల నుంచి లంచాలు వసూలు చేసిన ఏలూరు అటవీ శాఖ రేంజ్ కార్యాలయ ఉద్యోగి శ్రీనివాస్ వ్యవహారాన్ని నీరుగార్చేందుకు ఆ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీఅడిగినంత ఇస్తేనే అక్వా సాగుశ్రీ అనే శీర్షిక ఈ నెల 14న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై స్పందించిన డీఎఫ్వో.. విచారణ అధికారిగా ఏలూరు రేంజర్ పి.మోహిని విజయలక్ష్మిని నియమించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న ఆ అధికారి.. శ్రీనివాస్పై లంచాల ఆరోపణలు చేసిన రైతులతో మాట్లాడి ఏలూరులోని తన కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని తెలిపారు. రైతులు విచారణ నిమిత్తం ఏలూరుకు వెళ్లేందుకు నిరాకరించారు. నిడమర్రుకు వచ్చి గ్రామంలోని రైతులతో మాట్లాడితే శ్రీనివాస్ లంచాలు తీసుకున్నట్టు సాక్ష్యాధారాలు అందిస్తామని రేంజర్ మోహినీ విజయలక్ష్మికి తెలిపినట్టు బాధిత రైతులు శ్రీసాక్షిశ్రీకి వెల్లడించారు. విచారణ అధికారి సోమవారం రైతు మండా పోలయ్యకు ఫోన్ చేసి ఈరోజు విచారణ నిమిత్తం నిడమర్రు వస్తున్నట్టు తెలపడంతో రైతులంతా సాయంత్రం ఐదు గంటల వరకు నిరీక్షించారు. విచారణ నిమిత్తం ఎవ్వరూ రాకుండా ఐదు గంటల తర్వాత వాట్సప్ చేసి ఈ నెల 15న విచారణకు రైతులు ఏలూరు రావాలని సూచించారు. 15న విచారణకు రావాలంటూ 17న నోటీసు పంపించడంతో వారు అవాక్కయ్యారు. నిడమర్రులోని వెంకటాపురం జిరాయితీ భూముల్లో సాగుపై సెక్షన్ అధికారి లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు చేస్తే, భీమడోలు మండలం చెట్టున్నపాడు గ్రామంలోని జీకేఎఫ్కు చెందిన 300 ఎకరాల భూముల్లో చేపల చెరువుల్లో సాగు నిమిత్తం లంచాలు ఇచ్చినందుకు విచారణకు వస్తున్నట్టు నోటీసులో ఉండటంతో కంగుతిన్నామని రైతులు చెబుతున్నారు. ఈ విషయంపై డీఎఫ్వో విజయను వివరణ కోరగా, విచారణ అధికారులు నిడమర్రు రైతుల వద్దకే మంగళవారం వస్తారన్నారు. సోమవారం ప్రత్యేక వర్క్షాప్ ఉండటం వల్ల రాలేకపోయారని చెప్పారు. ఈ అధికారులతో న్యాయం జరగదు 15న విచారణకు హాజరవ్వాలని 17న నాకు ఏలూరు రేంజర్ మోహిని విజయలక్ష్మి వాట్సప్లో సమాచారం పంపడం చూస్తుంటే.. ఈ విచారణ అధికారుల వల్ల మాకు న్యాయం జరగదనిపిస్తోంది. సోమవారం ఉదయం వస్తున్నట్టు ఫోన్ చేయడంతో అందరూ పనులు మానుకుని ఎదురు చూశాం. అయినా సాయంత్రం 5.30 గంటల వరకు ఎవరూ రాలేదు. – మండా పోలయ్య, రైతు, నిడమర్రు -
63 వేల కోడి గుడ్లు పూడ్చివేత
ఉంగుటూరు: కోళ్లకు బర్డ్ఫ్లూ నిర్ధారణ కావడంతో బాదంపూడి వెంకట మణికంఠ ఫౌల్ట్రీ ఫారంలో మూడోరోజు ఆదివారం కోళ్ల ఖననం కార్యక్రమం కొనసాగింది. పశుసంర్ధకశాఖ డా క్టర్లు, సిబ్బంది 43 వేల కోళ్లను ఖననం చేశారు. దీంతో ఫారంలోని 1.13 లక్షల కోళ్ల ఖననం ప్రక్రియ పూర్తయ్యింది. అలాగే వ్యాధి సోకిన కోళ్లు పెట్టిన 63 వేల గుడ్లను గొయ్యి తవ్వి పూడ్చిపెట్టారు. పశుసంవర్ధకశాఖ జేడీ డి.గో విందరాజు పర్యవేక్షించారు. సోమవారం సమీ ప పెదతాడేపల్లిలోని ఫారంలో కోళ్ల ఖననం ప్రక్రియ చేపట్టనున్నారు. డ్రోన్తో హైపోక్లోరైడ్ పిచికారీ గ్రామంలో పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని రెండు డ్రోన్ల ద్వారా పిచికారీ చేయించారు. 300 లీటర్ల హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించినట్టు పంచాయతీ కార్యదర్శి గిరిధర్ తెలిపారు. గ్రామంలోని రెడ్జోన్లో ఉన్న కిలోమీటర్ పరిధిలో ఈ పనులు చేయించారు. నేటి మీకోసం రద్దు ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గ (ఎమ్మెల్సీ) ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఏలూరు కలెక్టరేట్, డివిజనల్, మున్సిపల్, మండల కార్యాలయాల్లో సోమవారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. -
●ఇంటిని తవ్వి.. ఎత్తును పెంచి..
ఆధునిక టెక్నాలజీతో ఇంటిని ఐదడుగుల మేర ఎత్తు లేపుతున్నారు. దెందులూరు మండలం చల్లచింతలపూడి గ్రామంలో చేస్తున్న పనులను చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. గ్రామానికి చెందిన మోదుగుమూడి రాంబాబు సుమారు 29 ఏళ్ల క్రితం నాలుగు సెంట్ల స్థలంలో రెండస్తుల భవనం నిర్మించారు. అనంతరం రోడ్ల నిర్మాణంతో ఇల్లు లోతట్టు ప్రాంతమై వర్షం నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇంటిని పైకి లేపించాలని భావించిన యజమాని నెల్లూరులో ఓ కాంట్రాక్టర్ను కలిశారు. 230 జాకీలు, 41 మంది కా ర్మికులతో పనులు మొదలుపెట్టారు. భవనం కింద ఐదడుగుల మేర తవ్వి ఇంటి చుట్టూ గోడ కట్టి చెక్కలు పెట్టారు. చెక్కల మీద 230 జాకీలను అమర్చారు. బుధవారం కార్మికులను తీసుకువచ్చి ఇంటిని పైకి లేపనున్నారు. 40 రోజుల్లో పనులు పూర్తిచేయనున్నారు. – దెందులూరు -
కూటమి నేతల బెదిరింపులకు భయపడొద్దు
పెదవేగి: కూటమి నేతల తప్పుడు కేసులకు భయపడవద్దని, పార్టీ శ్రేణులంతా ధైర్యంగా ఉండాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌ దరి అన్నారు. ఆదివారం మండలంలోని కొండలరావుపాలెంలో దెందులూరు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీల ఏర్పాటుపై సమీక్షించా రు. అనంతరం అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ త క్కువ సమయంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజ లు పూర్తి అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇదే సమయంలో కరోనా వంటి విపత్తు సమయంలో నూ మాజీ సీఎం జగన్ అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచి నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసు లు బనాయిస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని హెచ్చరించారు. దెందులూరులో రౌడీ రాజకీయం నడుస్తోందని మండిపడ్డారు. నాయకులు ఎంపీపీ తాతా రమ్య, కొత్తూరు సూర్యనారాయణ, తొత్తడి వేదకుమారి, కామిరెడ్డి నాని, మేక లక్ష్మణరావు, జా నంపేట బాబు, జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, సర్పంచ్ మాత్రపు కోటేశ్వరరావు, లీగల్ సెల్ కన్వీనర్ బైగాని రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
చేపల దొంగలు !
● చెరువులు ఎండగడుతున్న పచ్చ నేతలు ● అక్రమంగా చేపలు పట్టివేత ● పట్టించుకోని అధికారులు సాక్షి, టాస్క్ఫోర్స్: మట్టి.. పుట్ట.. చెట్టు.. చేమ.. కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు పచ్చనేతలు చెలరేగిపోతున్నారు. బడానేతలు పట్టిసీమ, తమ్మిలేరు మ ట్టి దోచుకుంటుంటే.. చోటామోటా నాయకులు గ్రా మాల్లో చెరువులపై కన్నేశారు. ప్రజలకు తాగునీరు అందించే చెరువులను ఎండగట్టేస్తున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉన్నా అధికారు లు మిన్నుకుండిపోయారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా ప్రశ్నించలేకపోతున్నారు. పోణంగి చెరువుకు ఎసరు ఏలూరు నగర కార్పొరేషన్, 14 డివిజన్ పరిధి పో ణంగిలో ఐదు ఎకరాల తాగునీటి చెరువు ఉంది. అధికారులు ఈ చెరువు నీటిని శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేసేవారు. పశువులు దాహం తీర్చుకునేవి. రెండురోజుల క్రితం ఈ చెరువులో ఉన్న చేపలపై స్థానిక టీడీపీ నాయకుడి కన్ను పడింది. అధికారం అడ్డం పెట్టుకుని చెరువులో నీటిని తోడించేశాడు. ఆదివారం కూలీలతో చేపలు పట్టి అమ్ముకున్నాడు. ఇది చూసిన గ్రామ ప్రజలు ముక్కున వేలేసుకున్నా రు. రానున్నది వేసవికాలం కావడంతో చెరువు ఎండగడితే కనీసం పశువులు తాగేందుకు కూడా నీరు ఉండదని ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గతేడాది ఏలూరు కార్పొరేషన్ అధికారులు చెరువులో చేపల వేలం పాట నిర్వహించి సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. చాటపర్రులోనూ ఇదే తంతు ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో సైతం ప చ్చనేతలు ఇదే తరహా దందా కొనసాగించారు. కొద్దిరోజుల క్రితం పంచాయతీకి చెందిన 40 ఎకరా ల తాగునీటి చెరువును ఎండగట్టారు. అక్రమంగా చేపలు పట్టి సొమ్ము చేసుకున్నారు. వారం పాటు సాగిన ఈ దందాపై అధికారులు కనీసం ప్రశ్నించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఈ చెరువులో చేపలను వేలం వేయగా సుమారు రూ.90 వేలు పంచాయతీ ఖజానాకు జమైంది. -
గల్లీ నుంచి ఢిల్లీకి
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని కేఆర్పురం ఐటీడీఏ వద్ద గిరిజన మహిళలు తయారు చేస్తున్న చిరుధాన్యాల మిల్లెట్ బిస్కెట్లు ఢిల్లీలో ఆదిమహోత్సవ్ కార్యక్రమంలో స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఏజెన్సీలో తయారీ చేసిననీ బిస్కెట్లు ఢిల్లీలో విక్రయించే అవకాశం రావడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొందరు గిరిజన మహిళలు ఐటీడీఏ అధికారుల సహకారంతో చిరుధాన్యాలతో గిరి వనిత పేరుతో మిల్లెట్ బిస్కెట్లు తయారీ చేసి కేఆర్పురంలోనే విక్రయాలు ప్రారంభించారు. రాగులు, సజ్జలు, సోయా, పెసలు, అలసందలు, మినుములు, ఓట్స్, బెల్లంతో బిస్కెట్లు తయారు చేయడంతో అందరూ వీటిని తినేందుకు ఇష్టపడుతున్నారు. అనతి కాలంలోనే ఈ బిస్కెట్లకు గిరాకీ పెరగడంతో క్రమంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు షాపుల్లో ఈ బిస్కెట్లు విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో కూడా బిస్కెట్లు విక్రయిస్తున్నారు. ఇటీవల టాటా గ్రూప్ కంపెనీ ముంబయిలో నిర్వహించిన సమావేశానికి వచ్చిన వారికి ఇచ్చిన గిఫ్ట్ ప్యాకెట్లో గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆదిమహోత్సవ్ (2025) కార్యక్రమంలో కూడా గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్ల స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు తయారు చేసిన వస్తువులు ప్రదర్శనగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానంతో మిల్లెట్ బిస్కెట్ల తయారు చేసే పొట్టోడి బుల్లమ్మకు అక్కడ విక్రయించే అవకాశం లభించింది. జీలుగుమిల్లి మండలంలో ఉన్న నిర్వాసిత గ్రామం కొరుటూరు నుంచి మరో ఇద్దరు ఐటీడీఏ ద్వారా ఢిల్లీలో స్టాల్స్ను ఏర్పాటు చేసి వారు తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఐటీడీఏల పరిధిలో ఎంపిక చేసిన వస్తువులు ఈ స్టాల్స్లో విక్రయిస్తున్నారు. ఆదిమహోత్సవ్లో కేఆర్ పురం ఐటీడీఏ మిల్లెట్ బిస్కెట్ల స్టాల్ -
యువకుడి దారుణ హత్య
నిడమర్రు: నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో యువకుడి హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువకుడు మజ్జి ఏసు(26)ను శనివారం రాత్రి అత్యంత దారుణంగా హత్య చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏసు తండ్రి ప్రసాద్ మరణించగా, తల్లి దుబాయ్లో ఉంది. ఏసు దుర్గా శ్రీవల్లిని 2023లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఉండి మండలం కలిగొట్ల గ్రామంలోని ఆక్వా చెరువుల కాపలాదారుడిగా పని చేస్తున్నాడు. భార్య 8వ నెల గర్భవతి కావడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మృతుడితోపాటు అమ్మమ్మ మాత్రమే ఉంది. శనివారం అర్ధరాత్రి దాటాక బావాయిపాలెం శివారులో ఉన్న చినకాపవరం పంటకాల్వ వద్ద ఏసును చంపి, శవాన్ని కాలువ రేవు వద్ద పడేశారు. అతని కుడి చేయిని నరికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం సమాచారం అందిన వెంటనే నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై వీర ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. భార్య శ్రీవల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్ కూడా క్లూస్ టీమ్తో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హంతకులు ఒకరి కన్నా ఎక్కువ మంది ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి ఇంటి పరిసరాల్లోనే డాగ్ స్క్వాడ్ కలియ తిరిగింది. మృతుడి చేయి మాయం చేసిన హంతకులు -
విద్యార్థుల్లో పోటీతత్వాన్ని అలవాటు చేయాలి
తణుకు అర్బన్: విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పోటీతత్వాన్ని అలవాటుచేయాలని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఆదివారం తణుకు తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చిన్ననాటి నుంచే మంచి నడవడిక, పెద్దలతో గౌరవంగా మెలగడం, పోటీతత్వాన్ని అనుకరించేలా చేస్తే భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతారని స్పష్టం చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ (జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్) నీట్ పరీక్షల్లో ఎంతో పోటీ ఉందని, ఆ ఒత్తిడిని తట్టుకుని మన పిల్లలు నిలవాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. పిల్లలు ఎక్కువ సమయం మొబైల్స్తో గడుపుతున్నారని అది ఎంతో నష్టమన్నారు. విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజినీదేవి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులదే ప్రముఖ పాత్ర అని, తల్లిదండ్రులనురోల్ మోడల్గా తీసుకుని వారిని అనుకరిస్తారని చెప్పారు. సదస్సుల్లో అకడమిక్ డైరెక్టర్ సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, తణుకు కాలేజ్ ప్రిన్సిపాల్ కె.దుర్గాప్రసాద్, తణుకు స్కూలు ఇన్చార్జ్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
సూర్యహంసినికి ఆర్చరీలో గోల్డ్ మెడల్
భీమవరం: ఎన్టీపీసీ జూనియర్ నేషనల్ ఆర్చరీ చాంయపియన్షిప్ పోటీల్లో భీమవరం భారతీయ విద్యా భవన్స్ విద్యార్థిని ఎం.సూర్యహంసిని ప్రతిభ చూపిందని కోచ్ కమల్ కిషోర్ తెలిపారు. బాలికల వ్యక్తిగత విభాగంలో హంసిని ఢిల్లీకి చెందిన కుమిత్ సనానిపై గెలిచి బంగారు పతకం సాధించిందన్నారు. హంసినిని స్టేట్ ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీ చెరుకూరి సత్యనారాయణ, జిల్లా ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీ జయరాజు అభినందించారు. శ్రీవారి పథకాలకు రూ.7.21 లక్షల విరాళం ద్వారకాతిరుమల: శ్రీవారి పథకాలకు ఒక భక్తుడు ఆదివారం రాత్రి రూ.7.21 లక్షలు విరాళంగా అందజేశారు. హైదరాబాద్లోని అంబర్పేటకు చెందిన బొప్పరపు వెంకట లోహిత్ ముందుగా కుటుంబసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించారు. అనంతరం ఆలయ కార్యాలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.5 లక్షలు, గోసంరక్షణ పథకానికి రూ.2,21,000 వెరసి రూ.7,21,000 జమచేశారు. పెద్దింట్లమ్మా.. కోర్కెలు తీర్చమ్మా కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ భక్తుల కోర్కెలు తీర్చమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. ఆదివారం అమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ కనిపించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మకు వేడి నైవేద్యాలు, పాలపొంగళ్లు సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజు ప్రత్యేక, అంతరాలయ, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి ఫొటోల అమ్మకం, భక్తుల విరాళాలు, వాహన పూజలు ఇలా అన్ని కలిపి రూ.52,396 ఆదాయం వచ్చిందని తెలిపారు. పంట కాల్వలో గుర్తుతెలియని మృతదేహం కైకలూరు: గుర్తుతెలియని మృతదేహం శ్యామలాంబపురం శ్మశాన వాటిక సమీప పంట కాల్వలో ఆదివారం కొట్టుకువచ్చింది. వీఆర్వో ఫిర్యాదు మేరకు కై కలూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మాట్లాడుతూ మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండొచ్చన్నారు. ఎత్తు 5.5 అడుగులు ఉంటుందని, వివరాలు తెలిస్తే 9440796434, 9440796433 నంబర్లకు తెలియజేయాలన్నారు. -
ఎస్పీ–11 జట్టు గెలుపు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లా జర్నలిస్టులు, ఏలూరు జిల్లా ఎస్పీ–11 జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీలో ఎస్పీ–11 జట్టు విజయం సాధించింది. ఆదివారం ఆశ్రం వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో ఫెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్పీ జట్టులో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచి బ్యాటింగ్లో 56 పరుగులు, బౌలింగ్లో 4 వికెట్లు తీశారు. ఎస్పీ 11 జట్టు 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. జట్టులో సీఐ బోణం ఆదిప్రసాద్ 50 పరుగులు సాధించి ఆకట్టుకున్నారు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జర్నలిస్టుల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్పీ శివకిషోర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు.