breaking news
Eluru District Latest News
-
బాస్కెట్బాల్ పోటీలు నూజివీడుకు గర్వకారణం
నూజివీడు: బాస్కెట్బాల్ పోటీలు నూజివీడుకే గర్వకారణమని మున్సిపల్ చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణీదుర్గ అన్నారు. స్థానిక ధర్మఅప్పారావు కళాశాల ఆవరణలో శ్రీరాజా వెంకటాద్రి అప్పారావు బహద్ధూర్ 49వ స్మారక జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలను ఆదివారం రాత్రి మున్సిపల్ చైర్పర్సన్ త్రివేణీదుర్గ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశనుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్నారు. 49 ఏళ్లుగా దేశంలో ఎక్కడా లేని విధంగా నూజివీడులో బాస్కెట్బాల్ పోటీలను నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. పురుషుల విభాగంలో తొలి మ్యాచ్ నూజివీడు–కావలి జట్ల మధ్య నిర్వహించారు. సీఐ పీ సత్య శ్రీనివాస్, టోర్నమెంట్ కన్వీనర్ పీ సాధన, కృష్ణాజిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సత్యన్నారాయణ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): కలెక్టరేట్లో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి ఓబన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటంలో ఆయనకు సహాయకుడిగా ఉంటూ వడ్డే ఓబన్న చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. -
కుట్రలతోనే కవ్వింపులు
సాక్షి, భీమవరం: తణుకు ప్రశాంతతను భగ్నం చేసేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టే ధోరణిలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారు. మొన్న తణుకులో మొదలైన కూటమి కవ్వింపు చర్యలు తాజాగా ఉదరాళ్లపాలెంకు వ్యాపించాయి. సాధారణంగా పండుగల సందర్భంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏ పార్టీ నేతల విగ్రహాల చెంతన ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఫ్లెక్సీలు పెట్టడం పరిపాటి. అందుకు భిన్నంగా తణుకు వై.జంక్షనన్లో వైఎస్సార్ విగ్రహం ముందుభాగంలో గత నెల 25న రాత్రి సమయంలో పట్టణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు కూటమి అగ్రనాయకత్వం, ఎమ్మెల్యే ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం వివాదాస్పదమైన విషయం విదితమే. తమ అభిమాన నాయకుడి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కూటమి ఫ్లెక్సీని తొలగించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ ఏర్పాటుకు ప్రయత్నించగా పోలీసులు లాక్కున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణంలో ఉన్న మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు విషయం తెలిసి హుటాహుటిన తణుకు చేరుకుని పార్టీ శ్రేణులతో ఆందోళనకు దిగారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఘటన స్థలం వద్ద వైఎస్సార్సీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. 26వ తేదీ తెల్లవారుజామున పోలీసులు రెండు ఫ్లెక్సీలు తొలగించారు. 144 సెక్షన్ విధించామని మైకులో ప్రచారం చేయడంతో పాటు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటుచేశారు. ఘటన స్థలం నేషనల్ హైవేకు సంబంధించిందని, ఇక్కడ ఏ విధమైన ఫ్లెక్సీలు ఏర్పాటుచేయరాదని హెచ్చరిక బోర్డుతో విగ్రహం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. ఆ రోజు నుంచి విగ్రహం వద్ద పగలు, రాత్రి పోలీసులు గస్తీ కొనసాగిస్తున్నారు. తణుకులో పరిస్థితి ఇలా ఉంటే శనివారం అత్తిలి మండలంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి పర్యటనను పురస్కరించుకుని ఉదరాళ్లపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. మెయినన్ రోడ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు మంత్రికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద మాజీ మంత్రి కారుమూరిని కించపర్చేలా ఊరు, పేరు లేకుండా ఫ్లెక్సీలు వెలిశాయి. ఉదయం నుంచి ఫ్లెక్సీలు ఉన్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరించారని, వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పార్టీ శ్రేణులు నిరసన చేపట్టగా వాటిని తొలగించారంటున్నారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రశాంతంతకు పేరొందిన తణుకు నియోజకవర్గంలో ప్రతిపక్ష సభ్యులను కవ్వించి గొడవలు సృష్టించే కుట్రల్లో భాగంగానే ఈ తరహాలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి దుశ్చర్యల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. అధికారం ఇచ్చిన ప్రజానీకానికి మంచి పాలన అందించడం కంటే ప్రతిపక్షం వారిని ఏదోరకంగా కవ్వించి విధ్వంసాలు సృష్టించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీలో చేసిన సంక్షేమం, అభివృద్ధికి ధీటుగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే సంతోషిస్తాం. ఫ్లెక్సీలు పెట్టి గొడవలు సృష్టించాలనే చీఫ్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటు. వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ ఫ్లెక్సీ కట్టడం ఏమిటని ప్రశ్నిస్తే మాపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఉరదాళ్లపాలెంలో నన్ను అవమానించాలనే ఉద్దేశ్యంతో ఫ్లెక్సీలు పెట్టి శునకానందం పొందుతున్నారు. గొడవలు సృష్టించి మాపై కేసులు నమోదుచేయించడమే లక్ష్యంగా ఉన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. నేడు వారు చేస్తున్నవన్నీ వారికి చేరే రోజులు వస్తాయి. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి ఫ్లెక్సీలతో ప్రశాంతతను భగ్నం చేసే కుట్రలు మొన్న తణుకులో.. నిన్న ఉదరాళ్లపాలెంలో కూటమి నేతల కవ్వింపు చర్యలు -
పెద్దింట్లమ్మకు విశేష పూజలు
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు పాల పొంగళ్లు సమర్పించారు. ఆదివారం ఒక్క రోజున అమ్మవారి ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదులు, అమ్మ చిత్రపటాలు అమ్మకం, విరాళాలు, వాహన పూజల ద్వారా రూ.36,025 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ చెప్పారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కాళ్ల: ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా కాళ్ళకూరు గ్రామంలో వేంచేసియున్న స్వయం భూః శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆదివారం కూడారై పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కూడారై అక్కరసు (పాయసం) ప్రసాదాన్ని తయారు చేసి 1,350 గిన్నెలతో స్వామి, అమ్మ వార్లకు నివేదించారు. ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పాశురములు, గానం చేశారు. దేవాలయంనందు వివిధ రకాల పుష్పాలతో శంఖు, చక్రం, నామాలతో అలంకరణలు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల ప్రసాదాలు స్వీకరించారు. యతిరాజుల ఆండాళ్ గోష్టి వారు గోదాదేవి అమ్మవారికి చీర, సారె సమర్పించారు. దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ మోకా అరుణ్ కుమార్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. భీమవరం: పట్టణంలోని రైతు బజార్ ప్రాంతంలో మద్యం షాపు వద్ద ఒక వ్యక్తిపై మద్యం మత్తులో దాడిచేసి గాయపర్చిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్సై బీవై కిరణ్కుమార్ చెప్పారు. మహిళపై దౌర్జన్యం కేసు భీమవరం వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని చినరంగనిపాలెం ప్రాంతానికి చెందిన మహిళపై ప్రసన్నకుమారి, నర్సింహులు, మరో నలుగురు దౌర్జన్యం చేశారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ ఎస్సై కృష్ణాజీ చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి జంగారెడ్డిగూడెం: పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గులాబీ కలర్ టీ షర్ట్, నల్లరంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడు ఫిట్స్ కారణంగా మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మావుళ్లమ్మ ఆలయానికి ఉత్సవ శోభ
● రేపటి నుంచి 62వ వార్షిక మహోత్సవాలు ● ఫిబ్రవరి 14 వరకు ఉత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14 వరకు జరుగనున్న జాతర మహోత్సవాలకు సంబంధించి నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం సహకారంతో ఆమ్మవారి అలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం వద్ద చలువ పందిళ్లు, ఆలయానికి నాలుగు దిక్కుల్లో ఆధ్యాత్మిక భావన కలిగేలా సెట్టింగ్లు, విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. ఉత్సవాల్లో కార్యక్రమాలు ఇలా.. ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు జానపద, భరత నాట్య ప్రదర్శనలు, హరికథ, బురక్రథ వంటి కళాప్రదర్శనలు, సినీ సంగీత విభావరిలు ఏర్పాటుచేశారు. సుమారు 30 నాటకాలు, 20 హరికథ, బురక్రథలు, 15 వరకూ సినీసంగీత విభావరి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 5 నుంచి ప్రత్యేక అలంకరణలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు శ్రీమావుళ్లమ్మ అమ్మవారికి అష్టలక్ష్మీలుగా ప్రత్యేక అలంకరణలు నిర్వహించి పూజలు నిర్వహిస్తారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, అన్నపూర్ణదేవి అలంకరణలో పూజలు అందుకుంటారు. భారీగా భక్తుల రాక అమ్మవారి ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది భక్తులు రావడంతో పాటు, రాష్ట్రాంలోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కొనసీమ, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే హైదరాబాద్ నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా సంక్రాంతి నాలుగు రోజులు అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపొతుంది. ఫిబ్రవరి 13న లక్ష మందికి అన్నదానం అమ్మవారి ఉత్సవాలను, అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయం వద్ద నెల రోజులపాటు ఉత్సవ నిర్వాహకులు ఉచిత అన్నదానానికి ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో ఆఖరి రోజు ఫిబ్రవరి 13వ తేదీన మహా అన్నదానం నిర్వహిస్తారు. సుమారు లక్ష మందికి అన్నప్రసాదాన్ని అందిస్తారు. అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించడాన్ని జిల్లా ప్రజలు సెంటిమెంట్గా భావిస్తారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం భీమవరం డీఎస్పీ రఘువీర విష్ణు పరిశీలించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాల నిర్వాహకులు, దేవస్ధానం సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాఫిక్కు ఇబ్బందులు రాకుండా పోలీసు సిబ్బంది ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 13 నుంచి భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ 62వ వార్షిక జాతరను నెల రోజులపాటు నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ తెలిపారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ మంగళవారం ఉదయం 5.15 గంటలకు వర్తక సంఘం అధ్యక్షుడు తుటారపు ఏడుకొండలు దంపతులు కలశస్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 1 గంటకు అమ్మవారి గ్రామోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, సాయంత్రం 4 గంటలకు కొటికలపూడి గోవిందరావు కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రరెడ్డి ప్రారంభిస్తారన్నారు. సుమారు రూ.90 లక్షలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల నెల రోజుల పాటు నాటకాలు, బుర్రకథలు, హరికథలు, కూచిపూడి, భరతనాట్యం, సినీ ఆర్కెస్ట్రాలు ప్రతి రోజు ఉంటాయని తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు తూటరపు ఏడుకొండలు, కొప్పుల సత్తిబాబు, రామాయణం చిన్నారి, కొప్పుల రంగారావు, రామాయణం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మాంసాహారం ధరలకు రెక్కలు
తణుకు అర్బన్ : చికెన్, మటన్, చేపల ధరలు షాకిస్తున్నాయి. పది రోజుల క్రితం వరకూ రూ.260 ఉన్న బ్రాయిలర్ చికెన్ నేడు రూ.320కు చేరుకోవడంతో మాంసాహారులు లబోదిబోమంటున్నారు. ముక్కలేనిదో ముద్దదిగని వారంతా మార్కెట్లో మాంసాహారం ధరలు చూసి గగ్గోలు పెడుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహారం తినాల్సిందే అనే ధోరణిలో ఉన్నవారు మార్కెట్లో ధరలు చూసి ఏం తినాలి.. ఏం కొనాలనే ధోరణిలో ఉన్నారు. మటన్ రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉండగా చేప ధర కిలో రూ.220గా ఉంది. చికెన్కు విక్రయాలకు తగ్గట్లుగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో కిలో కొనేవారు అర కిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొనుగోళ్లు తగ్గాయని రిటైల్ వ్యాపారులు వాపోతున్నారు. జిల్లాలో రిటైల్ వ్యాపారంలో రోజుకు 30 వేల కిలోలకుపైగా చికెన్ అమ్మకాలు జరుగుతాయి. ఆది, మంగళవారాల్లో రెట్టింపు అమ్మకాలు జరుగున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మటన్ విషయానికి వస్తే రోజూ 20 వేల కిలోల అమ్మకాలు జరుగుతుండగా, చేపలు ఆదివారం ఒక్కరోజే 50 వేల కిలోలకుపైగా విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. మాంసాహారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంగా మాంసాహార ధరలు విపరీతంగా పెరుగుతున్న ధరలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని విమర్శిస్తున్నారు. -
కోడిపందేల బరి ధ్వంసం
నూజివీడు: సంకాంత్రి సందర్భంగా కోడిపందేలు వేసేందుకు మండలంలోని తుక్కులూరులో సిద్ధం చేసిన కోడిపందేల బరిని రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై జ్యోతీబసు, స్టేషన్ సిబ్బంది ధ్వంసం చేశారు. దీనిలో భాగంగా బరిని ట్రాక్టర్తో దున్నించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పండుగ పేరుతో కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగను శాంతియుతంగా కుటుంబంతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. జూదాలు, కోడిపందేల జోలికి వెళ్లి ఆర్థికంగా నష్టపోవొద్దని విజ్ఞప్తి చేశారు. భీమవరం: చదరంగం క్రీడ అన్ని వయస్సుల వారికి మేథస్సును పెంచడమేగాక మానసిక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తుందని భీమవరం మావుళ్లమ్మ ట్రస్ట్బోర్డు చైర్మన్ బొండాడ నాగభూషణం అన్నారు. అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో ఏపీ స్టేట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ టోర్నమెంట్కు వివిధ జిల్లాల నుంచి 56 మంది చెస్ క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదాసు కిషోర్, గమిని పవన్, ఉపాధ్యక్షుడు పరుచూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): విద్యతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, ప్రతి విద్యార్థి తమ ఇంట భారత దేశ పవిత్ర గ్రంథమైన రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి కోరారు. స్థానిక గిరిజన భవన సమావేశ మందిరంలో ఆదివారం ఎస్టీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 మంది నిరుపేద విద్యార్థులకు విద్యా ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డితోపాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యులు పన్నర్సు వెంకటప్ప, కాకి లక్ష్మి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: సంక్రాంతి పండుగ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర కార్యదర్శి ఆర్ నాగ దుర్గారావు ప్రభుత్వాన్ని కోరారు. 2018 జూలై నుంచి ఇప్పటి వరకూ సీపీఎస్ ఉద్యోగులకు ఒక్క డీఏ ఏరియర్ కూడా చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రకటించలేదని, వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. నూజివీడు: అప్పుల బాధ తట్టుకోలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నూజివీడు మండలం బోర్వంచ శివారు కొన్నంగుంటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొన్నంగుంటకు చెందిన ఆరేపల్లి దేవి(36), శివయ్య దంపతులు. వీరు కూలి పనులకు వెళ్లడంతో పాటు శివయ్య ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఇల్లు నిర్మించుకునే సమయంలో అప్పులు చేయడం, ఆ అప్పులు రోజురోజుకు పెరిగిపోతుండగా వాటిని తీర్చే మార్గం కనపడక మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున ఆరేపల్లి దేవి ఇంటి వద్ద చీరకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు వివాహమైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. రూరల్ ఎస్సై ఎన్ లక్ష్మణ్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
స్వాగత ద్వారంపై రాజకీయ ఫ్లెక్సీ
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో శ్రీవారి కొండపైకి వెళ్లే ఘాట్రోడ్డులోని ఆర్చిగేటు (స్వాగత ద్వారం)కు కొందరు టీడీపీ నాయకులు ఆదివారం రాజకీయ ఫ్లెక్సీని అమర్చడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇది ఆధ్యాత్మిక కేంద్రమా.. లేక రాజకీయ కేంద్రమా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే. ఆదివారం ఉదయం యాదవ కల్యాణ మండప ప్రాంతంలో మల్టీపర్పస్ భవనం అదనపు వసతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కుమార్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. దీనిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు ఏకంగా ఆర్చిగేటుకు ఫ్లెక్సీని అమర్చారు. ఇది వివాదాస్పదమైంది. అయినా దేవస్థానం అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలో గరుడాళ్వార్ సెంటర్లో, లింగయ్య చెరువు మలుపులో వివిధ రాజకీయ పార్టీల నేతల ఫ్లెక్సీలు ఉండగా భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే దేవస్థానం అధికారులు వీటిని తొలగించారు. ముక్కున వేలేసుకుంటున్న భక్తులు -
వడ్డే ఓబన్నకు నివాళి
ఏలూరు(మెట్రో) : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు ఏలూరు జిల్లా కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. కలెక్టర్ వెట్రిసెల్వి ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై ఉయ్యాలవాడ నరసింహరెడ్డి చేసిన పోరాటంలో ఆయనకు సహాయకుడిగా ఉంటూ వడ్డే ఓబన్న చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఈఎల్ బకాయిలు కాలయాపన లేకుండా తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్–1938) ఏలూరు జిల్లా శాఖ అధ్యక్షుడు ఈ.రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీ. మోహన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల కష్టార్జిత హక్కుల కోసం నిరీక్షించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఉపాధ్యాయులు వివిధ అత్యవసర అవసరాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న పీఎఫ్ రుణాలను కూడా ఆలస్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్జిత సెలవుల బకాయిలు, పీఎఫ్ రుణాలు ప్రభుత్వ దయాధర్మాలు కావని, ఉపాధ్యాయుల కష్టార్జిత హక్కులని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన పీఎఫ్ రుణాలను కూడా వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ జీ కృష్ణ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెనుగొండ: జాతీయ విద్యావిధానం–2020 ద్వారా ఉన్నత విద్యా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవచ్చని ఉన్నత విద్య జాతీయ డైరెక్టరు చప్పిడి కృష్ణ అన్నారు. పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో ఉన్నత విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు– పరిష్కారంపై ఆదివారం జాతీయ సదస్సులో పాల్గొన్నారు. 2020 జాతీయవిద్యా విధానం 10 సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని, ప్రస్తుతం ఐదు సంవత్సరాలు గడిచాయన్నారు. పెనుగొండ ఎస్వీకేపీలో నాణ్యమైన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాల కల్పనలో పాలకవర్గం ఎప్పటికపుడు మార్పు చెందుతూ ముందుకు సాగడంతో ముందంజలో ఉందన్నారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ శ్రీనివాసన్, శివనాడార్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జయదేవ్, సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ రామచంద్రరాజు పాల్గొన్నారు. పెనుగొండ: విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలకు చేర్చిన గురువును సిద్ధాంతం విద్యార్ధులు వినూత్న రీతిలో గౌరవించి భక్తిని చాటుకున్నారు. సిద్ధాంతానికి చెందిన ఉపాధ్యాయుడు బండారు వెంకటేశ్వరరావు ఇటీవల పదవీ విరమణ చేశారు. 30 ఏళ్లుగా వెంకటేశ్వరరావు వద్ద విద్యనభ్యసించిన వందలాది మంది విద్యార్థులు ఆదివారం గురువుకు ప్రత్యేక రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. పురవీధుల్లో కేరళ వాద్యాలతో హోరెత్తించారు. వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. -
నత్తనడకన జలజీవన్ మిషన్ పనులు
గణపవరం: గణపవరం పట్టణాన్ని పట్టి పీడిస్తున్న మంచినీటి సమస్యకు పరిష్కారంగా ప్రారంభించిన జలజీవన్ మిషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పట్టణ విస్తీర్ణం పెరిగిపోవడంతో పాటు పాత పైపులైన్లు పాడయ్యాయి. శివారు ప్రాంతాల ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు. పైపుల ద్వారా సురక్షిత మంచినీరు లభించక ప్రజలు ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నుంచి తాగునీరు కొనుగోలు చేస్తున్నారు. వీటికి పరిష్కారంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జలజీవన్ మిషన్ పథకం నుంచి రూ.3.11 కోట్లను మంజూరు చేయించారు. ఈ పథకంలో 1.20 లక్షల లీటర్ల ఓహెచ్ఎస్ఆర్, 100 కెఎల్ సామర్థ్యం కలిగిన సంపు, 200 ఎంఎల్ మైక్రోఫిల్టర్, 15 కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పథకానికి 2022 అక్టోబర్ 26న అప్పటి వాసుబాబు శంకుస్థాపన చేశారు. తొలిదశలో మంచినీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేశారు. గ్రామంలో 15 కిలోమీటర్ల మేర పాత పైపులైన్లు తొలగించి, కొత్తపైపులు వేయాల్సి ఉండగా ఇప్పటికి 5 కిలోమీటర్ల లోపు మాత్రమే కొత్త పైపులు వేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత ముమ్మరంగా సాగిన పనులు సాధారణ ఎన్నికలు రావడంతో మందగించాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఓవర్హెడ్ ట్యాంకు, సంపు నిర్మించినా తుదిదశ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మైక్రో ఫిల్టర్ నిర్మాణం చేయాల్సి ఉంది. 15 కిలోమీటర్ల కొత్త పైపులైన్లు వేయాల్సి ఉండగా ఇప్పటికి 5 కిలోమీటర్ల లోపు మాత్రమే కొత్త పైపులు వేశారు. కొత్త పైపులైన్లు వేయడం పూర్తయితే పట్టణంలో దాదాపు రెండువేల పైచిలుకు ప్రైవేటు కుళాయిలను కొత్త పైపులైన్లకు మార్చాల్సి ఉంది. పైపులైన్ల నిర్మాణం కోసం పలు ప్రాంతాల్లో రోడ్లు ఎక్కడికక్కడ తవ్వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు, మార్జిన్లు తవ్విన సమయంలో కొన్ని చోట్ల పాత పైపులైన్లు దెబ్బతిని వాటి ద్వారా కుళాయిల్లో మురుగునీరు వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు తగిన చర్యలు చేపట్టి జలజీవన్ మిషన్ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజల మంచి నీటికష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. గణపవరం మంచినీటి సమస్యకు మోక్షమెప్పుడో? -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
ఉయ్యూరు: నగల దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఉయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు ఆదివారం ఉయ్యూరు టౌన్ పోలీసుస్టేషన్లో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా అయి భీమవరానికి చెందిన గొర్రెల సత్యనారాయణ చిన్ననాటి నుంచే విలాసాలకు అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారు నగల దుకాణాలను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇరు రాష్ట్రాల్లో 30కి పైగా కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం పోలీసుస్టేషన్లో చోరీ కేసు నమోదైంది. మధ్యాహ్న భోజన సమయాన్ని అదునుగా చేసుకుని నగల దుకాణాల్లోకి చొరబడి ఆభరణాలను అపహరిస్తుంటాడు. చోరీ సొత్తు కొంటున్న వ్యక్తి అరెస్ట్ ఈ క్రమంలో గత నెల 20న ఉయ్యూరు మార్కెట్ సెంటర్ సమీపంలో శ్రీకృష్ణసాయి జ్యూయలర్స్లో షాపు యజమానురాలు భోజనం చేస్తున్న సమయంలో షాపులోకి ప్రవేశించి 80 గ్రాములు విలువైన 35 జతల బంగారు చెవి దిద్దులను అపహరించుకుపోయాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సత్యనారాయణను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీఎస్ సీఐ గోవిందరాజు, ఉయ్యూరు పట్టణ సీఐ రామారావు సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి ఉయ్యూరు మార్కెట్యార్డు సమీపంలో సత్యనారాయణను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 30 జతల చెవి దిద్దులు, 12 చిన్న ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ రూ.12 లక్షలు ఉంటుందన్నారు. సత్యనారాయణతో పాటు చోరీ సొత్తు కొనటానికి వచ్చిన కంచర్ల సాయిసుధీర్ను గుంటూరు నల్లచెరువు సమీపంలో అరెస్టు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
జీడి మామిడి.. జాగ్రత్తలతోనే అధిక దిగుబడి
చింతలపూడి: ఉమ్మడి ఏలూరు – పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించిన ఉన్న జీడితోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జీడిమామిడి రైతులు పూత దశ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యాన శాఖ అధికారిణి ఎండీ షాఫియ ఫర్హీన్ రైతులకు సూచనలు చేశారు. సాధారణంగా జీడి మామిడిలో పూత అక్టోబర్, నవంబర్ నెలల్లో మొదలై జనవరి, ఫిబ్రవరి వరకు వస్తుంది. జీడిచెట్టుకు వచ్చిన పూతలో సుమారు 200 నుంచి 800 వరకు పూలు పూస్తాయి. జీడిమామిడి చెట్లు పరాగ సంపర్కం వల్ల ఫలదీకరణ చెందుతాయి. ఈ చెట్లు పూతకు రావాలంటే సుమారు 25 రోజుల నుంచి 30 రోజులు పొడి వాతావరణం ఉండాలి. ఒకవేళ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వర్షాలు పడినట్లయితే పూత ఆలస్యమై రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తెగుళ్ల తీవ్రత కూడా అధికం. జీడిమామిడి అంట్లు నాటిన రెండవ సంవత్సరం నుంచే పూత వస్తుంది. ఆ పూతను రైతులు తుంచివేసి చెట్ల శాఖలు పెరగడానికి ప్రోత్సహించాలి. దీనివల్ల చెట్లు బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. వర్షాకాలంలో సిఫార్సు చేసిన ఎరువులు రెండు నుంచి మూడు సమ భాగాలుగా వేసుకోవాలి. ఐదు సంవత్సరాలు పైబడిన చెట్టుకు యూరియ 1.5 కేజీలు, సూపర్ ఫాస్ఫేట్ 650 గ్రాములు, పొటాష్ 1 కేజీ వేసుకోవాలి. పూత దశలో తెగుళ్ల ఉధృతి పూత దశలో మంచు ఎక్కువగా పడుతున్నప్పుడు పూత లోపల తేమ చేరి ఎండిన మగపూల వలన తామర పురుగులు లేదా తేయాకు దోమ ఉధృతి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. జీడిమామిడిలో టి దోమ పూత దశ అంటే అక్టోబర్, నవంబర్ నెలలో మొదలవుతుంది. జనవరిలో ఎక్కువై లేత చిగుళ్లు, పూత, పూత కాడలను, చిన్న కాయలను ఆశించి రసం పీల్చడం ప్రారంభిస్తాయి. రసం పీల్చినప్పుడు ఒక రకమైన పదార్థం వదలడం వల్ల కాయలపై, చిగుర్లపై గజ్జిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా పూత, చిగుర్లపై చేసిన రంధ్రాల వలన ఫ్లవర్ బైట్ అనే తెగులు కూడా వ్యాప్తి చెందుతుంది. బూడిద తెగులుతో పూతకు నష్టం పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు కూడా ఎక్కువగా పూతను నష్టపరిచి పూత రాలిపోయేలా చేస్తుంది. బూడిద తెగులు వల్ల లేత చిగుళ్లను, పూతను ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. దీని నివారణకు సల్ఫర్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకు, పూత, కాయమచ్చ తెగుళ్ల నివారణ ఆకులపై చిన్న, చిన్న లేత ఆకుపచ్చ వర్ణంలో మచ్చలు ఏర్పడి క్రమేపీ మచ్చలు పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోయి చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత, పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. దీని నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలు తొలగించుకోవాలి. మంకోజెట్ 1 గ్రాము లీటరు నీటికి, లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి, లేదా క్లోరో తాలోనిల్ 1 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఎండీ షాఫియ ఫర్హీన్, ఉద్యాన శాఖ అధికారిణి దోమ నివారణకు పూత మొదలై పువ్వు విచ్చుకోక ముందు ఒకసారి, పూలు ఫలదీకరణ చెందిన తరువాత రెండో సారి, టి దోమ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు (కాయ గోలీ సైజులో ఉన్నప్పుడు) మూడో సారి పిచికారీ చేయాలి. చెట్లు చిగురించినప్పుడు మొదట పిచికారీకి రైతులు ల్యాండా సైహాలో త్రిన్ 0.6 మిల్లీ లీటర్లు లీటరు నీటికి, లేదా అసిటామాప్రిడ్ 0.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే పూత కొమ్మలు కనిపించినప్పుడు రెండు, మూడు వారాల తరువాత ఇమిడాక్లోప్రిడ్ 0.6 మి.లీ లీటరు నీటికి లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ, లీటర్ నీటికి కలిపి రెండో సారి పిచికారీ చేయాలి. కాయలు గోలీ సైజులో ఉన్నప్పుడు ల్యాండా సైహాలో త్రిన్ 0.6 మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ, లీటర్ నీటికి కలిపి మూడో సారి పిచికారీ చేయాలి. వీటితో పాటు వేపనూనెను తగిన మోతాదులో కలిపి వాడటం వలన మంచి ఫలితాలు వస్తాయి. -
కూటమి నిర్వాకంతోనే ఆలయాల్లో అపచారాలు
ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని హిందూ ఆలయాల్లో వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నాయని, దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఐఎస్ జగన్నాధపురంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలల కాలంలో దేవాలయాలపై దాడులు, అపవిత్రమైన కార్యక్రమాలు ఎన్నో జరిగాయన్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో తాజాగా ఉచిత ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తులకు కరెంట్ షాక్ తగిలిందన్నారు. అమ్మవారికి శ్రీచక్ర అర్చనలో పురుగులతో ఉన్న ఆవు పాలను వినియోగించడమనేది దుర్మార్గమైన చర్య అని అన్నారు. దుర్గమ్మ ఆలయానికి ఏకంగా కరెంటు సరఫరాను నిలిపివేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారికి జరుగుతున్న అపచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే గోవులు చనిపోయాయన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసిందని ఉన్మాదకరంగా మాట్లాడటం దారుణమన్నారు. డిప్యైటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతనమని డ్రామాలు వేస్తున్నాడని ధ్వజమెత్తారు. పొద్దున సనాతన వేషం, రెండో పూట ఇంకేం వేషం వేస్తాడో తెలియదన్నారు. వీకెండ్ వస్తే సీఎం చంద్రబాబు హైదరాబాద్కు వెళిపోతున్నారని, డిప్యూటీ సీఎం అయితే వారంలో ఒకసారి మాత్రమే మన రాష్ట్రానికి వస్తున్నాడన్నారు. ఇక మంత్రులైతే ఉంటే హైదరాబాద్ లోని పబ్బుల్లో, లేదంటే హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తుంటారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, పార్టీ గోపాలపురం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మ, తదితరులున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి -
పండక్కి పప్పన్నం లేనట్లే..!
● పట్టించుకోని చంద్రబాబు సర్కారు ● మార్కెట్లో ధరల దరువు... ప్రభుత్వం నుంచి ఆదరణ కరువు ఏలూరు (మెట్రో) : ఓ వైపు ధరలు రోజురోజుకు పెరిగిపోతుంటే ప్రభుత్వం అందించాల్సిన నిత్యావసరాల సరఫరాను ప్రభుత్వం తగ్గించేస్తుంది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకూ జిల్లా రేషన్కార్డుదారులకు నిత్యావసరాలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉంది. సంక్రాంతి పండుగ అనేది తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పండుగకు నిత్యావసరాలు పూర్తిస్థాయిలో చంద్రబాబు సర్కారు అందించిన పాపాన పోవడం లేదు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. కనీసం బెల్లం, కందిపప్పు వంటివి కార్డుదారులకు అందిస్తే పండుగకు కాస్త ఆదరణ కల్పించినట్లు అవుతుంది. చంద్రబాబు సర్కారు దోపిడీనే రాజ్యంగా పాలన సాగిస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బియ్యాన్ని మాత్రమే కార్డుదారులకు అందిస్తూ చేతులు దులుపుకుంటున్న చంద్రబాబు సర్కారు రాగులు, జొన్నలు వంటివి అందిస్తామని ప్రచారాలు చేసినప్పటికీ ఇంతవరకూ అతీగతీ లేదు. కనీసం పెద్దపండుగ సంక్రాంతికి అయినా అందిస్తారని ఆశించినా అదీ లేకుండా పోయింది. కేవలం బియ్యం, అరకేజీ పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నా ఆ పంచదార కూడా పూర్తిస్థాయిలో అందించడం లేదని కార్డుదారులు లబోదిబోమంటున్నారు. బెల్లం, కందిపప్పు ఊసే లేదు జిల్లాలో 1,123 రేషన్ దుకాణాల ద్వారా 6,31,044 కార్డుదారులకు రేషన్ అందిస్తున్నారు. వీటి ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 8,791.03 టన్నుల బియ్యం, 218.75 టన్నుల పంచదారను మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది. కనీసం కార్డుదారులకు కేజీ చొప్పున కందిపప్పు పంపిణీ చేస్తే 631 టన్నులు అవసరం అవుతుంది. అరకేజీ చొప్పున 315 టన్నుల బెల్లం మాత్రమే అవసరం. ఇవేమీ పండుగకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు, బెల్లం, వంటనూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కంపెనీని బట్టి లీటరు వంట నూనె రు.140 నుంచి రు.160 వరకూ విక్రయిస్తున్నారు. దీంతో సంక్రాంతి పండుగకు పిండివంటలు చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ప్రజలకు అందించే కాస్త సరుకులనూ ప్రభుత్వం అందించేందుకు ముందుకు రావడం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. గతంలో కేజీ కందిపప్పు రూ.180 వరకూ ధర పలికింది. ప్రస్తుతం రూ.110కి చేరుకుంది. కందిపప్పు కొనుగోలు చేయాలంటే ప్రజలు బెంబేలెత్తిపోయారు. చంద్రబాబు సర్కారు చోద్యం చూస్తోంది. -
11 నుంచి బాస్కెట్బాల్ పోటీలు
● నూజివీడులో జాతీయ స్థాయి టోర్నమెంట్ ● తలపడనున్న 49 జట్లు నూజివీడు: సంక్రాంతి సందర్భంగా పట్టణంలో డీఏఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఫ్లడ్లైట్ల వెలుగులో ఈ నెల 11 నుంచి నిర్వహించనున్న శ్రీ రాజా వేంకటాద్రి అప్పారావు బహూద్దూర్ మెమోరియల్ జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు కనువిందు చేయనున్నాయి. గత 48 ఏళ్లుగా సంక్రాంతికి బాస్కెట్బాల్ పోటీలు నిరాటంకంగా జరుగుతున్నాయి. పురుషులు, మహిళల విభాగంలో జరిగే పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 49 జట్లు తమ ఎంట్రీలను నమోదు చేసుకున్నాయి. పురుషుల విభాగంలో 35 జట్లు, మహిళల విభాగంలో 14 జట్లు రానున్నాయి. పోటీల నిర్వహణకు బాస్కెట్బాల్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన 20 మంది రిఫరీలు రానున్నారు. స్థానికంగా ఉన్న పట్టణ ప్రముఖులు, క్రీడామానులు తదితరుల నుంచి అందే విరాళాలతో బాస్కెట్బాల్ పోటీలను అంతరాయం లేకుండా నిర్వహిస్తున్నారు. లీగ్కం నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలను నిర్వహించడానికి కళాశాల ప్రాంగణంలోని రెండు బాస్కెట్బాల్ కోర్టులను సిద్ధం చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా పోటీలు నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. మాజీ రాజ్యసభ్యుడైన స్వర్గీయ ఎమ్మార్ అప్పారావు అధ్యక్షుడిగా, ఎంఎస్ అప్పారావు కార్యదర్శిగా 1969లో మొట్టమొదటిసారిగా నూజివీడు బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆవిర్భవించింది. అనంతరం 1971లో డీఏఆర్ కళాశాల్లో ఆంధ్రా బాస్కెట్బాల్ సంఘం ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. 1973లో ఎంఎస్ అప్పారావు సారథ్యంలో బాస్కెట్బాల్ సంఘం ఏర్పాటైంది. 1975లో చిత్తూరులో జరిగిన ఆంధ్రా చాంపియన్షిప్ పోటీల్లో పురుషుల, మహిళ విభాగాల్లో నూజివీడు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చి ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నారు. 1976 నుంచి నూజివీడులో బాస్కెట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. క్రీడను మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మార్ అప్పారావు నేతృత్వంలో నూజివీడు కేంద్రంగా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఏర్పాటైంది. డీఏఆర్ కళాశాల్లో అప్పట్లో బాస్కెట్బాల్ శిక్షణ నిర్వహించేరు. ఈ శిక్షణలో నూజివీడు ప్రాంతానికి చెందిన వారు బాస్కెట్బాల్ నేర్చుకొని జాతీయ స్థాయి పోటీల్లో తమ సత్తా చాటి నూజివీడుకు మంచి గుర్తింపు తెచ్చారు. -
బియ్యం పట్టివేత
వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలోని శివకాశీపురం గిరిజన బాలికల ఉన్నతపాఠశాల నుంచి అక్రమంగా బియ్యం, నిత్యావసర వస్తువులను వాహనంలో తరలిస్తున్న వార్డెన్ను శుక్రవారం అర్ధరాత్రి గ్రామస్తులు, జనసేన నేతలు పట్టుకున్నారు. పోలీసులు, రెవిన్యూ అధికారులకు సమాచారం అందించారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారించిన అధికారులు వాహనంలో 4 క్వింటాళ్ళ సన్నబియ్యం, కందిపప్పు, మంచినూనె, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వార్డెన్ పరారీలో ఉండటంతో రిజిస్టర్ కనబడలేదు. వార్డెన్ అక్రమాల పై ఉన్నతాధిరులకు నివేదిక అందించారు. -
ఏలూరు జీజీహెచ్లో వైద్యం నిల్
ఏలూరు టౌన్: హనుమాన్జంక్షన్కు చెందిన పోగోలు మౌనీష్కు ఈ నెల 4న ఘర్షణలో తలపై తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఏలూరు జీజీహెచ్ అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. పరీక్షించి తలపై తీవ్ర గాయం కావటంతో 8 కుట్లు వేశారు. సిటీ స్కాన్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తూ.. మందులు, ఇంజెక్షన్లు వాడాలని ప్రిస్కిప్షన్ రాశారు. ఇన్పేషెంట్గా చేర్చుకోకపోవటంతో వైద్యుల సలహాతో మౌనీష్ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్ళి మందులు వాడుతున్నారు. బాధితుడికి వాంతులు కావటం, అనారోగ్యానికి గురికావటంతో స్థానిక వైద్యుల వద్దకు తీసుకువెళ్ళగా జీజీహెచ్కు తీసుకువెళ్ళాలని సూచించటంతో ఏలూరు తరలించారు. శనివారం ఉదయం 9 గంటలకు ఏలూరు చేరుకుని సిటీ స్కాన్ రిపోర్ట్తో జీజీహెచ్ అత్యవసర విభాగానికి వచ్చారు. న్యూరో సర్జన్కు చూపించారు. రిపోర్ట్ ఆధారంగా శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుందని చెప్పిన వైద్యులు ... జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్కు చూపించాలంటూ పంపేశారు. అక్కడకు వెళితే న్యూరో సర్జన్కు చూడాలంటూ బాధితుడితో ఆటలాడుకున్నారు. ఆఖరికి వైద్యచికిత్స చేయమంటూ విజయవాడ వెళ్ళాలని చెప్పేశారు. తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్కు వస్తే నరకం చూపిస్తున్నారంటూ బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకూ వేచి చూసి చేసేది లేక బాధితుడిని ఇంటికి తీసుకువెళ్ళారు. విజయవాడ వెళ్ళాలంటూ దాటవేత -
ఏలూరు వైఎస్సార్సీపీలో జోష్
ఏలూరు టౌన్: ఏలూరు వైఎస్సార్సీపీలో నూతన ఉత్సాహం నెలకొంది. ఏలూరు సమన్వయకర్త మా మిళ్లపల్లి జయప్రకాష్ సారథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండు నెలలపాటు టీడీపీ పాలనలో ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో సక్సెస్ అయ్యారు. ఇక నూతన సంవత్సరంలో పార్టీలో మరింత జోష్తో ముందుకు సాగుతోంది. ఏలూరు నగరంలోని 24వ డివిజన్ నుంచి యువత వైఎస్సార్సీపీలో చేరటంతో పాటు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత గ్జేవియర్ మాస్టర్, ఆర్టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడు స్టాన్లీ బాబు, క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి జక్కుల బెనర్జీ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన యువతకు పార్టీ కండువాలు వేస్తూ సమన్వయకర్త జేపీ సాదరంగా ఆహ్వానం పలికారు. టీడీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనీ, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని సమన్వయకర్త జేపీ అన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుకోవాలనీ, ప్రజల పక్షాన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. -
అప్పుల పండుగ
కనుమ ఉత్సవానికి ఏర్పాట్లు ద్వారకాతిరుమల చినవెంకన్న కనుమ ఉత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈనెల 16న ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. IIలో uఅత్తిలి మండలంలోని బల్లిపాడు గ్రామానికి గతంలో వారంలో బుధ, శనివారాల్లో ఆరుగురు వరకు ఫైనాన్స్ వ్యాపారులు వచ్చేవారు. వీక్లీ, మంథ్లీ పేమెంట్లు చేసేలా అవసరమైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు అప్పులు ఇచ్చేవారు. ఏడాది కాలంలో గ్రామానికి వచ్చే వ్యాపారులు 20 మందికి పైగా పెరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలో రెండు రోజులు మాత్రమే వస్తే ప్రస్తుతం వారం పొడవునా వచ్చి అప్పులు ఇస్తున్నారంటున్నారు. ఫైనాన్స్ వ్యాపారం బాగుందన్న ఉద్దేశంతో స్థానికంగాను కొందరు యువకులు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి, భీమవరం: గోదావరి జిల్లాల్లో జరిగే అతిపెద్ద పండుగ సంక్రాంతి. విద్య, ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడ ఉంటూ స్వస్థలాలకు వచ్చిన వారితో సందడిగా ఉంటుంది. కొత్త దుస్తులు, పిండి వంటలు, జాతరలు, విహారయాత్రలు, ఇంటికి వచ్చే అల్లుళ్లు, మనవళ్లకు కానుకలు రూపంలో పండగ ఖర్చు ఎక్కువే. అయినా లెక్కచేయకుండా ఏడాదికో పండుగ అన్నట్టుగా ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతులు కరువు : సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మొదటి ఏడాది సంక్షేమాన్ని విస్మరించింది. 2025లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సబ్సిడీ, మత్య్సకార భృతి, వాహనసేవ పథకాల ద్వారా జిల్లావాసులకు జమచేసింది కేవలం రూ.409 కోట్లు మాత్రమే. మరోపక్క విద్యుత్ చార్జీలు, ఇంటి పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. అభివృద్ధి పనులు నిలిచిపోవడం, రియల్ ఎస్టేట్ రంగం కుదేలై కార్మికులకు సరిగా పనులు ఉండటం లేదు. విపత్తులు, దళారీల దోపిడీతో తొలకరి పంట నష్టాలనే మిగిల్చింది. ఆయా కారణాలతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అధిక వడ్డీలకు.. సాధారణంగా రూ.10 లక్షలలోపు ఫైనాన్స్ చేసే చాలా మంది వ్యాపారులు పెద్ద వ్యాపారుల నుంచి రూపాయి నుంచి రెండు రూపాయల వడ్డీకి (వడ్డీ అడ్జస్ట్మెంట్) తెచ్చి బయట పద్దుల రూపంలో అధిక వడ్డీలకు అప్పులు ఇస్తుంటారు. కొద్ది వారాలుగా మార్కెట్లో అప్పులు తీసుకుంటున్న వారు పెరుగుతున్నారని వ్యాపారులు అంటున్నారు. సంక్రాంతి సందర్భంగా వారి సంఖ్య మరింత పెరగడంతో తమ వద్ద డబ్బులు చాలక అదనంగా వడ్డీ అడ్జెస్ట్మెంట్పై డబ్బులు తెచ్చి ఇస్తున్నారు. పండుగ గడిస్తే చాలు.. మెల్లగా వాయిదాలు కట్టేసుకోవచ్చన్నట్టుగా అధిక వడ్డీలను లెక్కచేయకుండా అప్పులు తీసుకుంటున్నారు. పండుగల రూపేణా జిల్లాలో రూ.100 కోట్ల వరకు ఫైనా న్స్ వ్యాపారం జరుగుతుందని అంచనా. కొన్నాళ్లుగా సరిగా బేరాలు లేక ఖాళీగా ఉన్న క్లాత్ రెడీమేడ్, జ్యూయలరీ, కిరాణా తదితర షాపులు కొద్దిరోజులుగా అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. అవస్థలే నిండుగా.. జాడలేని సంక్షేమం నిర్మాణ రంగం కుదేలు డబ్బుల్లేక జనం విలవిల సంక్రాంతి కోసం అధిక వడ్డీలకు అప్పులు పాత పద్దులు తిరగేయిస్తున్న మరికొందరు గ్రామాలకు క్యూ కడుతున్న ఫైనాన్స్ వ్యాపారులు జిల్లాలో పండుగ ఫైనాన్స్ రూ.100 కోట్లకు పైనే.. ప్రస్తుతం పూటగడవడం కష్టంగానే ఉన్నా ఏడాదికోసారి వచ్చే సంక్రాంతి పండుగను ఇంటిళ్లపాదీ కలిసి ఆనందంగా జరుపుకోవాలని చాలా మంది ఫైనాన్స్ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం తదితర ప్రాంతాలకు చెందిన స్థానిక వ్యాపారులతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారులకు జిల్లాలో ఫైనాన్స్ లైన్లు ఉన్నాయి. ఇంట్లోని వారందరికీ కొత్త దుస్తులు, పిండివంటల కోసం కిరాణా సరుకులు, ప్రయాణం, వినోదం ఖర్చుల నిమిత్తం కొందరు, కోడిపందేలు, గుండాట, పేకాటల జూదం కోసం మరికొందరు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో వీక్లీ, మంథ్లీ వాయిదాల్లో తిరిగి చెల్లించేలా అప్పులు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాత పద్దులుండి కొంతవరకు చెల్లించిన వారు వాటిని తిరగేయించుకుని కొత్త అప్పులు తీసుకుంటున్నారు. కొందరు ఇద్దరు ముగ్గురు వ్యాపారుల వద్ద పద్దులు తీసుకుంటున్నారు. -
రహదారి భద్రతా నియమాలు పాటించాలి
జంగారెడ్డిగూడెం: ప్రమాదాల నివారణకు రహదా రి భద్రత ఆవశ్యకతను తెలియజేసేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో స్పెషల్ డ్రైవ్ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండని పిలుపునిచ్చారు. రహదారి ప్రమాదాల్లో యువత ఎక్కువగా మరణించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. హెల్మెట్ ధరించడంతో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహన పత్రాలు లేకుండా ప్రయాణించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రుల పైనా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగం ప్రాణాంతకమన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నంబర్ ప్లేట్లు లేనటువంటి వారు, హెల్మెట్లు ధరించినటువంటి వారిపై జరిమానాలతో వదలకుండా, వాహనదారులతో హెల్మెట్లను కొనుగోలు చేయించి, అప్పటికప్పుడే నంబర్ ప్లేట్లను అమర్చుకునేలాగా చర్యలు తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఎంవీ సుభాష్, ఎస్సై వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై ఎం.కుటుంబరావు, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అట్టహాసంగా తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. తొ లుత ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లు, గో దాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామివారి వాహనం క్షేత్రవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ గ్రా మోత్సవం నిర్వహించారు. శివాలయం ఆర్చీగేటు వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా వర్షం చినుకులు పడటంతో స్వామివారి వాహనాన్ని వేగంగా ఆలయంలోకి తీసుకెళ్లారు. దీంతో ధనుర్మాస మండపంలో నిర్వహించాల్సిన పూజలు రద్దయ్యాయి. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని, 10వ తరగతి ఇన్విజిలేషన్, జవాబుపత్రాల మూల్యాంకన విధులకు సంబంధించి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే నియమించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆదినారాయణ డిమాండ్ చేశారు. శనివారం విజయవాడలో డీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ 58 ఏళ్లు దాటిన వారందరినీ మూల్యాంకన విధుల నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కె.కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాష మాధ్యమం కొనసాగించాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ఏవీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కౌన్సిలర్లు శ్రీనివాసరావు, కె.సురేష్కుమార్, ఏలూరు మండల అధ్యక్షుడు కె.దాసు, ముసునూరు మండల గౌరవాధ్యక్షుడు ఎస్వీ సుబ్బారావు, మహిళా ఉపాధ్యక్షురాలు కె.కుమారి పాల్గొన్నారని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. భీమవరం: ఉపాధి హామీ జీ రామ్జీ చట్టం ప్రతులను ఈనెల 14న భోగి మంటల్లో దహనం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బాతిరెడ్డి జార్జి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పాత చట్టంలో 10 శాతం రాష్ట్ర వాటా కాగా కొత్త చట్టంలో 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్నారు. ఒకపక్క 125 రోజులకు పనులు పెంచామని చెబుతూ మరోపక్క 60 రోజుల నిషేధం విధించడం ఉపాధి కూలీలను మోసగించడమే అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వచ్చేనెల 12న దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షుడు కౌ రు పెద్దిరాజు, కండెల్లి సోమరాజు బల్ల చినవీరభద్రరావు, జక్కంశెట్టి వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన ప్రసాదాల కౌంటర్ వద్ద నిమ్మకాయలు విక్రయిస్తున్న ఓ మహిళా వ్యాపారిపై దేవస్థానం సెక్యూరిటీ సూపర్వైజర్ శనివారం కర్రతో దాడి చేశాడు. దీంతో ఆమె స్వల్పంగా గాయపడింది. ద్వారకాతిరుమల క్షేత్రంలోని లింగయ్య చెరువు వద్ద, అలాగే కొండపైన జంటగోపురాలు, ప్రసాదాల కౌంటర్ల వద్ద కొందరు మహిళలు నిమ్మకాయలు విక్రయిస్తున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. భక్తులు వి సుగు చెందేలా చేస్తున్నారు. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఎన్నిసార్లు హెచ్చరించినా వా రిలో మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే కొమ్మరకి చెందిన మానుకొండ సో మాలు అనే మహిళ నిమ్మకాయల విక్రయిస్తుండగా సెక్యూ రిటీ సూపర్వైజర్ ప్రవీణ్ కర్రతో కొట్టాడు. ఆమె మోచేతికి స్వల్ప గాయమైంది. సదరు సూపర్వైజర్పై చర్యలు తీసుకోవాలని బా ధితురాలు అంటోంది. -
పందెం బరుల ధ్వంసం
నూజివీడు/చాట్రాయి: నూజివీడు మండలం, పట్టణంలో ఏర్పాటుచేసిన పలు కోడిపందేల బరులను పోలీసులు శనివారం ధ్వంసం చేశారు. నూజివీడు రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని పాతరావిచర్లలో బరిలో ఎస్సై జ్యోతీబసు సిబ్బందితో కలిసి ట్రాక్టర్తో దున్నించడంతో పాటు స్తంభాలను, ఫెన్సింగ్ను తొలగించారు. అలాగే నూజివీడులోని గొడుగువారిగూడెంలో పందేల బరిని టౌన్ సీఐ పి.సత్యశ్రీనివాస్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. చాట్రాయి మండలంలో.. చాట్రాయి: మండలంలోని కృష్ణారావుపాలెంలో కోడిపందేల బరిని నూజివీడు సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్సై డి.రామకృష్ణ పాల్గొన్నారు. -
వేగంగా పాస్బుక్ల పంపిణీ
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): జిల్లాలో పట్టాదార్ పాస్బుక్లను రై తులకు వెంటనే అందించా లని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలన్నారు. జిల్లాలో 9,134 పాస్బుక్లు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో ఏలూరు డివిజన్లో 5,501, జంగారెడ్డిగూడెం డివిజన్లో 3,614, నూజివీడు డివిజన్లో 90 ఉన్నాయన్నారు. అధికంగా కలిదిండి మండలంలో పెండింగ్లో ఉన్నాయన్నారు. కై కలూరు, దెందులూరు, పోలవరం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో పెండింగ్లో ఉన్న పాస్ పుస్తకాలను వేగంగా పంపిణీ చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో రాష్ట్రం అప్పులమయం
నూజివీడు: సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చెస్తానని చంద్రబాబు చెప్పారని, అయితే ప్రస్తుత కూటమి పాలనలో రాష్ట్రం అప్పుల్లో దూసుకుపోతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ధ్వజమెత్తారు. నాడు జగన్ పాలనలో సంక్షేమ క్యాలెండర్ అమలు చేస్తే నేడు చంద్రబాబు అప్పుల క్యాలెండర్ అమలు చే స్తున్నారని ఎద్దేవా చేశారు. నూజివీడు పట్టణ, మండల పార్టీ నిర్మాణ సంస్థాగత విస్తృత సమావేశాన్ని శనివారం స్థానిక వైఎస్సార్సీపీ నియోజకవర్గ కా ర్యాలయమైన ద్వారకా ఎస్టేట్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎన్నార్ మాట్లాడుతూ పేకాట, మట్టి, ఇసుక, మద్యం మాఫియాలే రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నాయన్నారు. జూదాలే టీడీపీ వాళ్లకు భుక్తిగా మారాయని విమర్శించారు. అవినీతి, అప్పులు, అక్రమాలు, దౌర్జన్యాలతో పాలన సాగుతోందన్నా రు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా తాము మోసపోయామని బాధపడుతున్నారని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమన్నారు. అలాగే పాలకులకు జగన్ ఫోబియా పట్టుకుందని విమర్శించారు. సూపర్ సిక్స్ వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. గ్రామస్థాయి నుంచి వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు జగన్ దృష్టి పెట్టారని, గ్రా మ, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసి వారంద రి వివరాలను డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ విద్యార్థులపై సైతం రౌడీషీట్లు పెడుతున్న ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేసి 2029 ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. పాలనలో ప్రభుత్వం విఫలం చంద్రబాబు ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్ను అనవసరంగా ఓడించామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. పూర్తయిన ప్రభు త్వ భవనాలను కూడా ప్రారంభించకుండా పాలకులు కాలక్షేపం చేస్తున్నారని, వైఎస్ జగన్ ప్రారంభించే బస్సు యాత్రతో రాష్ట్ర ప్రభుత్వ పతనం ప్రా రంభమవుతుందన్నారు. కార్యకర్తలు ఎవరినీ చూసి భయపడాల్సిన పనిలేదని, కలిసికట్టుగా పార్టీ పటిష్టతకు పనిచేయాలన్నారు. 18 నెలలు గడిచినా అభివృద్ధి లేదు చంద్రబాబు అధికారం చేపట్టి 18 నెలలు గడిచినా అభివృద్ధి, సంక్షేమం ఊసే లేదని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ అన్నారు. పేకాట, కోడిపందేలు తప్ప ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎం.జయప్రకాష్, జిల్లా యూత్ అధ్యక్షుడు కామిరెడ్డి నాని మాట్లాడారు. నూజివీడు పట్టణ, మండల, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల అధ్యక్షులు శీలం రాము, పోలిమెట్ల శివ, మూల్పురి నాగవల్లేశ్వరరావు, బెజవాడ రాంబాబు, పుచ్ఛకాయల సుబ్బారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, ముసునూరు జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్, ఏలూరు నగర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, ఎంపీపీలు కొండా దుర్గాభవాని, గోళ్ల అనూష, జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు మలిశెట్టి బాబీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
వైఎస్సార్సీపీలో చేరికలు
కుక్కునూరు: గత వైఎస్సార్సీపీ పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అందించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు టీడీపీ కార్యకర్తలు తెలిపారు. శనివారం మండలంలోని మారేడుబాక గ్రామానికి చెందిన ఏడుగురు టీడీపీని వీడి పంచాయతీ కన్వీనర్ దాడి వెంకన్న, మండల ఉపాధ్యక్షుడు రాయి సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్, రావు వినోద్లు పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు జగన్ నాయకత్వాన్ని మెచ్చి వచ్చారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని, టీడీపీ అసమర్థ పాలనే ఇందుకు కారణమన్నారు. గంటశాల దుర్గాప్రసాద్, గోలి సందీప్, గంటశాల నాగరాజు, మిడి యం లక్ష్మయ్య, మడెం లక్ష్మయ్య, కారం తిరుపతిరావు, మడకం యర్రయ్య తదితరులు వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు గొగ్గులోతు సత్యనారాయణ, రాయి బాలాజీ, వేల్పుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జడ్జిల నియామకం
సత్యప్రసాదరావు శ్రీరామ్ మురళీకృష్ణ ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 8 మంది స్పెషల్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్లను నియమిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఉత్తర్వులు ఇచ్చారు. వీరిలో నండూరి నాగ వెంకట సత్య ప్రసాదరావు స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఏలూరు, రా వూ రి మురళీకృష్ణ, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ ఏలూరు, బొనిగే వెంకటరావు, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ కొవ్వూరు, సుంకవల్లి శ్రీరామ్, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ కొవ్వూరు, గుత్తుల వీర వెంకట సత్యనారాయణ స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ తణుకు, నల్లి శంకర్, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ నరసాపురం, పెంకి సత్యనారాయణ స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ పాలకొల్లు, నక్కా వెంకటేశ్వర్లు స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్–11 క్లాస్ జంగారెడ్డిగూడెం నియమితులయ్యా రు. వీరిలో ప్రసాదరావు, మురళీకృష్ణ, శ్రీరామ్ ఏలూరుకు చెందిన వారు. -
హామీలపై ప్రశ్నిస్తే కేసులు
ఏలూరు (టూటౌన్): ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన విభాగాల నాయకులపై, వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసులకు నిరసనగా శుక్రవారం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీవైఎల్, వైఎస్సార్సీపీ యువజన విభాగం, విధ్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని, నెలకు రూ.3 వేల చొప్పున అందజేస్తామని చంద్రబాబు సర్కార్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రశ్నించిన గొంతుకలను అణగదొక్కాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి నాని, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు తేరా ఆనంద్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజేష్, యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా దొంగల అరెస్టు
ఏలూరు టౌన్: ఏలూరు నగరానికి చెందిన ఇద్దరు స్నేహితులు సులువుగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్నారు. ఏడాది కాలంలో ఏకంగా 50 మోటారు సైకిళ్ళు చోరీ చేస్తూ చివరికి ఏలూరు త్రీటౌన్ పోలీసులకు చిక్కారు. వీరితో పాటు మరో 14 మంది రిసీవర్లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి, కేసులు వివరాలు వెల్లడించారు. ఏలూరు తూర్పువీధి గౌరమ్మగుడి ప్రాంతానికి చెందిన మహ్మద్ షాకీర్ ప్రస్తుతం ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంట గ్రామంలో నివాసం ఉంటున్నాడు. షాకీర్ మోటారు మెకానిక్గా పని చేస్తూ ఉంటాడు. ఏలూరు సుంకరవారితోట, కనకదుర్గమ్మ గుడి ఎదురుగా నివాసం ఉంటోన్న గోపిశెట్టి సురేష్ నగరంలో గోద్రెజ్ కంపెనీ సేల్స్మెన్గా పని చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఈజీ మనీకి అలవాటుపడ్డారు. మెకానిక్ షాకీర్, సురేష్ ఇద్దరూ ఆయా ప్రాంతాల్లో మోటారు సైకిళ్ళు పార్కింగ్ చేసి ఉండటాన్ని ముందుగా గమనించి స్కెచ్ వేస్తారు. షాకీర్ వేరే తాళంతో మోటారు సైకిల్ను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా సురేష్ ఎవరైనా వస్తున్నారా అనేది గమనిస్తూ ఉంటాడు. అనంతరం ఇద్దరూ మోటారు సైకిళ్ళను ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటారు. వీరిద్దరూ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఏడాదిలో సుమారుగా 50 మోటారు సైకిళ్ళు చోరీ చేయగా, వీటి విలువ సుమారు రూ.25లక్షలు ఉంటుందని పోలీస్ అధికారుల అంచనా. కేసును ఛేదించింది ఇలా గత ఏడాది డిసెంబర్ 1న ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో దుగ్గిరాల గ్రామం జోసెఫ్నగర్లోని ఒక ఇంటి గ్రిల్, తాళాలు పగులగొట్టి లోపల ఉన్న హీరో ప్యాషన్ ప్రో మోటారు సైకిల్ చోరీకి గురైంది. ఈ చోరీపై కొరగంటి ప్రభాకర్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై పి.రాంబాబు దర్యాప్తు చేపట్టి చాకచక్యంగా ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టగా నిందితులు ఇద్దరూ ఏకంగా 50కిపైగా మోటారు సైకిళ్ల చోరీ చేసినట్లు గుర్తించారు. వీరిద్దరి నుంచి 50మోటారు సైకిళ్ళను త్రీటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టి.నరసాపురం మండలానికి చెందిన చోరీ సొత్తు రిసీవర్లు 14 మందిని పోలీసులు గుర్తించి వీరిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన త్రీటౌన్ ఎస్ఐ రాంబాబు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
మట్టి మాఫియా కోరల్లో గుట్టలు
● పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు ! ● నిమ్మకు నీరెత్తిన ట్టు వ్యవహరిస్తున్న అధికారులు ● ఆవాసాలు కోల్పోతున్న వన్యప్రాణులు చింతలపూడి: ఒకప్పుడు పచ్చని చెట్లతో, గుట్టలతో కళకళలాడిన ప్రాంతాలు నేడు కనుమరుగవుతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన సంపదను మట్టి మాఫియా యథేచ్ఛగా దోచుకుంటోంది. గ్రామాల సమీపంలోని కొండలు, గట్లు కనుమరుగవుతుంటే, పర్యవేక్షించా ల్సిన అధికార యంత్రాంగం మాత్రం గాడ నిద్రలో మునిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవ వైవిధ్యానికి గొడ్డలి పెట్టు గ్రామాలకు ఆనుకుని ఉండే కొండలు, గట్లు కేవలం రాళ్ల కుప్పలు మాత్రమే కావు. అవి ఔషధ మొక్కలకు, అనేక వన్యప్రాణులకు, పక్షులకు, క్రిమి కీటకాలకు సురక్షితమైన ఆవాసాలు. జింకలు, దుప్పులు, కోతులు, కొండ ముచ్చులు, కుందేళ్లు, నెమళ్లు, నక్కలు, అడవి పందులు వంటి జీవులకు ఇవి నిలయాలు. నేడు జేసీబీల సవ్వడితో ఆ మూగజీవాలు భయంతో గ్రామాలపైకి వస్తున్నాయి. ఫలితంగా మనుషులపై దాడులు పెరగడమే కాకుండా, వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న సంఘటనలు ఉన్నాయి. కాసుల కక్కుర్తి : నిర్మాణ రంగంలో మట్టికి, గ్రావెల్కు ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని మాఫియా రెచ్చిపోతోంది. అనుమతులు ఉన్నవి కొద్దిపాటికే అయినా, వందల అడుగుల లోతుకు తవ్వేస్తూ కొండల రూపురేఖలను మార్చేస్తున్నారు. పగలు, రాత్రీ తేడా లేకుండా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. ఈ క్రమంలో సహజసిద్ధమైన నీటి ప్రవాహ మార్గాలు (వాగులు, వంకలు) పూడిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు వాపోతున్నారు. నిద్రావస్థలో అధికార యంత్రాంగం ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు చేసినప్పుడు మాత్రమే నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నిఘా లోపించడంతో మాఫియాకు అడ్డులేకుండా పోయింది. రాజకీయ అండదండలతోనే ఈ దోపిడీ సాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంలో పర్యావరణ సమతుల్యత కొండలు కనుమరుగైతే వర్షపు నీరు నిల్వ ఉండక భూగర్భ జలాలు తగ్గిపోతాయి. వన్యప్రాణులు సహజ సిద్ధమైన ఆవాసాలు కోల్పోయి జీవవైవిధ్యం దెబ్బతింటుంది. నిరంతర తవ్వకాలు, వాహనాల రద్దీతో గ్రామాలపై దుమ్ము పడి ప్రజలు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమ తవ్వకాలను అరికట్టి, మన పూర్వీకులు అందించిన ప్రకృతి సంపదను, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మా చిన్నప్పుడు ఈ కొండల మీద ఎన్నో చెట్లు, జంతువులు ఉండేవి. ఇప్పుడు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. కొండలను తవ్వేస్తుండటంతో నెమళ్లు, అడవి పందులు, కోతులు ఊళ్లలోకి వస్తున్నాయి. రాత్రికి రాత్రే గుట్టలను పిండి చేసి తరలిస్తున్నారు. – మాగసాని గురుబ్రహ్మం, వైఎస్సార్సీపీ బీసీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి వన సంరక్షణ కోసం భూములను కేటాయిస్తోంది. మొక్కలు నాటి అడవులను పెంచాలని చూస్తుంటే, మట్టి మాఫియా మాత్రం ఆ భూములపై కన్నేసింది. చెట్లను వేళ్లతో సహా పెకిలించి, అడుగున ఉన్న మట్టిని, గ్రావెల్ను తవ్వేస్తున్నారు. వన సంరక్షణ భూముల్లో నుంచి మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. – తొర్లపాటి బాబు, సీపీఐ మండల కార్యదర్శి, చింతలపూడి -
మహిళ హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
ఏలూరు (టూటౌన్)/చింతలపూడి: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు 2వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని శుక్రవారం తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన మహిళా హాత్య కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి శ్రీకాకొల్లు సువర్ణరాజు(39) శిక్ష విధించారు. చింతలపూడి మండలం బంధంచర్ల గ్రామానికి చెందిన శ్రీకాకొల్లు సువర్ణరాజుకు ఆ ప్రాంతానికి చెందిన కంచర్ల సునీత అలియాస్ ప్రాంతానికి చెందిన కంచర్ల సునీత అలియాస్ గంగ(35)తో వివాహేతర సంబంధం ఉండేది. ఈ క్రమంలో ఆమె ఇతర వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతుందనే అసూయతో ముద్దాయి హాత్యకు పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో 2023 జనవరి 20న చింతలపూడి మండలం బాలవారిగూడెం అడవికి ఆమెను తీసుకెళ్ళి అక్కడ ఆమైపె దాడి చేసి చీరతో ఉరి బిగించి అత్యంత కిరాతకంగా హత్యా చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు శవాన్ని కొండ దిగువన రాళ్లపై పడేశాడు. ఈ ఘటపై అప్పట్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముద్దాయిపై నేరాలు నిరూపణ అవ్వడంతో న్యాయమూర్తి సెక్షన్ 302 ఐపీసీ కింద జీవిత ఖైదు, రూ.3,000 జరిమానా విధించారు.సెక్షన్ 201ఐపీసీ కింద మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. అయితే సాక్ష్యాధారాలతో దర్యాప్తు పూర్తి చేసి దోషికి శిక్ష పడేలా కృషి చేసిన ఎస్బీ ఈఐ మల్లేశ్వరరావు, సీఐ క్రాంతికుమార్, సీఎంసీ ఇన్స్పెక్టర్ ఎం.సుబ్బారావు, ఎస్సై సతీష్కుమార్ కానిస్టేబుల్స్ను జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. -
వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రెసిడెంట్గా అనురాధ
అల్లవరం/ఏలూరు టౌన్ : అమలాపురం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ ఆ పార్టీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అనురాధ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనపై విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్కు రుణపడి ఉంటానని తెలిపారు. 2029లో వైఎస్సార్ సీపీ అధికారమే లక్ష్యంగా మహిళా శక్తిని సమీకరించి, పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. ఈ నియామకం తన బాధ్యతలను మరింత పెంచిందని, పార్టీ బలోపేతానికి అహర్నిశలూ కృషి చేస్తానని అనురాధ తెలిపారు. పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు (టూటౌన్): పంచాయతీల్లో ఎస్సీ సర్పంచ్ల హక్కులను కాలరాస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఎస్సీ సర్పంచ్లు శుక్రవారం ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహార్కు ఫిర్యాదు చేశారు. దెందులూరు మండలం కండ్రిగ నరసింహపురంలో పంచాయతీ నిధులతో కమ్యూనిటీ హాలు నిర్మించి శ్లాబ్ లెవల్కు తీసుకొచ్చామని, గత 18 నెలల నుంచి పని పూర్తి కానివ్వకుండా పంచాయతీ కార్యదర్శి, ఏఈ, డీఈలు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సర్పంచ్ మెండెం సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దెందులూరు మండలం పోతునూరు సర్పంచ్ బోదుల స్వరూప్, గాలాయగూడెం సర్పంచ్ చిలకా సుబ్బారావు కూడా ఫిర్యాదు చేశారు. -
సంక్షేమానికి గ్రహణం
కామవరపుకోట: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి గ్రహణం పట్టిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు అధ్యక్షతన, మండల పార్టీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వీరిశెట్టిగూడెం సర్పంచ్ దేవరపల్లి రామ్మోహన్రావు నాయకత్వంలో శుక్రవారం మండల పార్టీ నిర్మాణ సంస్థగత సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతంపై నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమని నేడు పార్టీ కోసం కష్టపడిన వారికే భవిష్యత్తులో తగిన గుర్తింపుతో పాటు గౌరవం లభిస్తుందని తెలిపారు. పార్లమెంట్ పరిశీలకుడు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ మోసాల ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత సంక్షేమానికి చెదలు పట్టిందని, పాలన చేపట్టి రెండేళ్లు గడుస్తున్న ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సంక్షేమ కాంతులు చెరిగిపోయాయని, సూపర్ సిక్స్ పథకాలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారని అన్నారు. కంభం విజయరాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనతో ప్రజలు ఇప్పటికే విసుగు చెందారని, గ్రామాల్లో ఎక్కడికి వెళ్లిన చంద్రబాబు ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. అనంతరం జలపవారి గూడెం గ్రామానికి చెందిన కరుటూరి బాలస్వామి, కరటూరి శ్రావణ్ కుమార్, మిధున్ చక్రవర్తి, బంటుమిల్లి రవికుమార్ టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరారు. జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళ సతీష్ చౌదరి, జిల్లా కార్యదర్శి జయమంగళ కాసులు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గురజాల పార్థసారధి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సరిత రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నాని, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు సాయిల స్వాతి యాదవ్, కామవరపుకోట వైస్ ఎంపీపీ గిరిజ, నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు మేరిగ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
బుట్టాయగూడెం: మండలంలోని రెడ్డిగణపవరం, దొరమామిడి గ్రామంలో రాత్రివేళల్లో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సుమారు 10 ట్రాక్టర్లతో జేసీబీల ద్వారా మట్టి గుట్టలను తొలగించి ఇళ్లకు, ఇటుకల బట్టీలకు తరలిస్తున్నారు. అయితే అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందినా అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో అక్రమ మట్టి తవ్వకాలతో, ట్రాక్టర్ల శబ్దాలతో చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకుని తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
పీపీపీ ఉత్తర్వులను భోగి మంటల్లో తగులబెట్టండి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటీకరించే విధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాల లను ప్రైవేటీకరణ చేసే ఉత్తర్వుల కాపీలను, వికసిత్ భారత్ జీ రాం జి కాపీలను భోగి మంటలలో వేసి తగలబెట్టి నిరసన తెలపాలని సీపీఐ కార్యకర్తలకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్లో బాడిశ రాము అధ్యక్షతన శుక్రవారం సీపీఐ జిల్లా కార్యవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ 2024 ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలలో పేద ప్రజలకు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాదని ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని ఆమె పేర్కొన్నారు. నిరుద్యోగులకు సంబంధించి ఉపాధి కల్పిస్తామని, ఉపాధి కల్పించని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందో? అర్థం కావట్లేదని ఆమె రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఈ నెల 18న ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాలు ముగింపు సభకు జిల్లా నుండి 3000 మంది వెళ్లాలని నిర్ణయించామన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వనజ మాట్లాడుతూ జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లకు డిజైన్ చేశారని, మొదటి దశగా డ్యాం 41.15 మీటర్ల ఎత్తు వరకు, రెండవ దశగా 45.72 మీటర్లుగా నిర్ణయిస్తూ ప్రాజెక్టును పూర్తిగా రిజర్వాయర్ గా మార్చే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించడంలోనూ పునరావాసం కల్పించడంలోనూ కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ధ్వజమెత్తారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు కారం ధారయ్య, ఉప్పులూరి హేమ శంకర్, నిమ్మగడ్డ నరసింహ, జేవి రమణ రాజు, తొర్లపాటి బాబు, రెడ్డి శ్రీనివాస్ డాంగే, సిపిఐ నాయకులు టీవీఎస్ రాజు, బి.ఎన్.సాగర్, గోలిమే బాల యేసు పాల్గొన్నారు. -
నయనానందకరం శ్రీవారి గ్రామోత్సవం
ద్వారకాతిరుమల: ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఉభయ దేవేరులు, గోదాదేవితో కలసి క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగుతున్న శ్రీవారికి అడుగడుగునా భక్తులు హారతులు పట్టి, నీరాజనాలు సమర్పిస్తున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన స్వామివారి గ్రామోత్సవం భక్తులకు కనువిందు చేసింది. ముందుగా అర్చకులు ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ ప్రతి ఇంటి ముంగిటకు వచ్చిన శ్రీవారికి భక్తులు హారతులిచ్చి, నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవం అనంతరం గుడి సెంటర్లోని ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు, గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు. -
రొయ్యలు అధరహో
● గత నెల రోజుల్లో భారీగా పెరిగిన ధరలు ● మార్కెట్లో 50 కౌంట్ రూ. 360 వర్షాకాలం, శీతాకాలంలో వైరస్లు వచ్చి రొయ్యల చచ్చిపోతాయి. ఆ సమయంలో అమాంతం రొయ్య ధరలు పెంచేస్తారు. ధరలు పెరిగాయని అప్పులు చేసి రొయ్యల పెంపకం చేస్తే వైరస్లకు పిల్ల సైజులోనే రొయ్యలు చచ్చిపోయి నష్టపోతాం. ఫ్రిబ్రవరి నుంచి రొయ్యల ధరలు తగ్గిపోతాయి. ఒక్కోసారి మే, జూన్ నెలల్లో ఐస్ లేదని రొయ్యలను వ్యాపారస్తులు కొనుగోలు చేయరు. చంద్రబాబు సర్కారు ఫీడ్ ధరలు తగ్గించి, నాణ్యమైన సీడ్ అందించడంతోపాటు విద్యుత్ సబ్సిడీ ఇచ్చి రొయ్య రైతులను ఆదుకోవాలి. – పెనుమాల నరసింహస్వామి, రొయ్య రైతు, గొల్లవానితిప్ప భీమవరం అర్బన్: ఆక్వా రాజధానిగా ఉన్న భీమవరం ప్రాంతంలో తక్కువ సమయంలో వనామీ రొయ్య పెంపకం సిరులు కురిపించడంతో రొయ్యసాగుకు రైతులు మొగ్గు చూపుతుతున్నారు. అయితే శీతాకాలంలో రొయ్యలకు సోకే వైట్ స్పాట్, విబ్రియో, వైట్గడ్ లాంటి వ్యాధులు రైతులను నష్టాల బాట పట్టిస్తున్నాయి. దీంతో పట్టుబడికి వచ్చిన రొయ్యలు ఎక్కువ లేకపోవడంతో రొయ్యల ధరలకు రెక్కలొస్తున్నాయి. భీమవరం మండలంలోని కొత్తపూసలమర్రు, దొంగపిండి, లోసరి, వెంప, పెదగరువు, ఎల్వీఎన్పురం, కొమరాడ, అనాకోడేరు, తోకతిప్ప, నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప తదితర గ్రామాల్లో సుమారు 8 వేల ఎకరాల్లో వనామీ పెంపకం సాగిస్తున్నారు. వీటిపై రొయ్య రైతులు, రొయ్య వ్యాపారస్తులు వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. గత వర్షాకాలం నుంచి రొయ్యల సాగుకు ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో వైరస్ బారిన పడి రొయ్యలు మృత్యువాత పడటం, మోంథా తుపాను ధాటికి కొన్ని చోట్ల రొయ్యల చెరువు గట్లు గండ్లు పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమంది కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. పట్టుబడికి వచ్చిన రొయ్యలు తక్కువ శాతం ఉండటంతో రొయ్యల ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. సిండికేట్తో తక్కువ ధరలు వర్షాకాలం, శీతాకాలంలో వనామీ రొయ్యల సాగుకు ప్రతికూల వాతావరణం కావడంతో వాటికి వైరస్, విబ్రియో, ఈహెచ్పీ, వైట్గట్ తదితర వ్యాధులు సోకి మృత్యువాత పడతాయి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రొయ్యల పెంపకానికి వాతావరణం అనుకూలం కావడంతో ఎక్కువ మంది రైతులు రొయ్యలను పెంపకం సాగిస్తుంటారు. ఆ సమయంలో రొయ్యలను వ్యాపారస్తులు సిండికేట్గా ఏర్పడి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. పెరిగిపోయిన ఫీడ్, సీడ్ ధరలు చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టినాటి నుంచి ఫీడ్ ధరలు తగ్గించకపోవడం, నాణ్యమైన సీడ్ అందివ్వకపోవడం, నామమాత్రంగా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందివ్వడం, మరోపక్క లేబర్ చార్జీలు, రొయ్యలకు వాడే మెడిసిన్ ధరలు పెరగడంతో ప్రతిసారి రొయ్యల పెంపకంలో నష్టాలు రావడంతో రైతులు పెంపకం చేసేందుకు అనాశక్తి చూపుతున్నారు. రొయ్యల పెంపకంపై మత్స్యశాఖ చిన్నచూపు విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా జిల్లాకు చేర్చే రొయ్యల పెంపకాన్ని మత్స్యశాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది రైతులకు రొయ్యల పెంపకంలో మెళుకువలు తెలియదు. దీంతో లక్షలు పెట్టుబడులు పెట్టి తరచూ నష్టాల్ని చూస్తున్నామని చెబుతున్నారు. మత్స్యశాఖాధికారులు రొయ్యల దిగుబడులపై అవగాహన సదస్సులు, పొలం పిలుస్తోంది కార్యక్రమాలు చేయడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. పట్టుబడికి వచ్చిన కేజీ 20 కౌంట్ రూ.540, 25 కౌంట్ రూ. 500, 30 కౌంట్ రూ. 460, 40 కౌంట్ రూ. 390, 45 కౌంట్ రూ..370, 50 కౌంట్ రూ. 360, 60 కౌంట్ రూ. 340, 70 కౌంట్ రూ.320, 80 కౌంట్ రూ.290, 90 కౌంట్ రూ.275, 100 కౌంట్ రూ.255 ఉన్నాయి. ఈ రొయ్య ధరలు ప్రాంతాన్ని బట్టి, ఎక్కువ టన్నేజిని బట్టి రూ. 30 నుంచి 50 మారుతాయని రొయ్య వ్యాపారస్తులు చెబుతున్నారు. డాలర్ల పంటగా పేరొందిన ఆక్వా రంగంపై చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంతో ఆక్వా రంగం ఏడాదికేడాది కుదేలవుతోంది. రొయ్య ధరల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో వ్యాపారస్తులు చెప్పిన ధరలకు రొయ్యలను అమ్ముకుని నష్టాలపాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. ఈ బాధ తట్టుకోలేక కొందరు రైతులు రొయ్యల పెంపకానికి స్వస్తి పలుకుతున్నారు. -
వైభవంగా శ్రీనివాస కల్యాణోత్సవం
జంగారెడ్డిగూడెం: పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్లో శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహాలతో ఈ కల్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఉభయ దేవేరులతో కూడిన కల్యాణమూర్తికి ఐవీ రామాంజనేయులు ఇంటి వద్ద అభిషేకాలు విశేష అర్చన వంటి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. అనంతరం శోభాయాత్రగా కల్యాణ వేదిక వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి ప్రత్యేక అలంకరణ చేసి గోదా పద్మావతి సమేత శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా ఏర్పాటు చేసిన భక్తిసంగీత విభావరి భక్తులను అలరించింది. కార్యక్రమ వ్యాఖ్యాతగా బ్రహ్మశ్రీ ఈమని శశి కుమార్ శర్మ వ్యవహరించగా, ఎమ్మెల్యే ఎస్.రోషన్ కుమార్, రాజాన సత్యనారాయణ, మహంకాళి రామ్మోహన్రావు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే.కాంతారావు, ఎం.ఆదినారాయణ డీటీఎఫ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమం కోసం శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కార్యవర్గం జూమ్ సమావేశం నిర్వహించింది. సంఘ నాయకులు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలని, పాఠశాలలో మాతృభాషా మాధ్యమం అమలు తదితర డిమాండ్లతో విజయవాడలో ఈ ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో డీటీఎఫ్ ఉపాధ్యక్షుడు ఎస్ఏవీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
జంగారెడ్డిగూడెం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రభుత్వం రానుందని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణ, మండల వైఎస్సార్సీపీ ఆత్మీయ విస్తృత స్థాయి సమావేశం చింతలపూడి కన్వీనర్ కంభం విజయరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు నిర్మాణాత్మక శక్తిగా ఎదగాలన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి జగన్ను సీఎం చేయాలన్నారు. సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి అన్ని విభాగాల కమిటీలు ఏర్పాటు చేసుకుని ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. ఇందుకోసం జగన్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారన్నారు. ఎమ్మెల్సీ, ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు వంకా రవీంద్రనాధ్ మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని సూచించారు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను వివరించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు తమకు ఇచ్చిన పదవులకు న్యాయం చేయాలని, స్థానిక నాయకత్వం బలంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో విజయానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ అక్రమ కేసులు పెడుతూ రెడ్బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు ప్రభుత్వం ఏలుతుందన్నారు. లక్షల కోట్ల ఆస్తులను చంద్రబాబు తమ అనునాయులకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. కోటి సంతకాల ఉద్యమం ఒక అద్భుత ఘట్టమని పేర్కొన్నారు. జగనన్న కార్యకర్తలకు ప్రముఖస్థానం కల్పిస్తున్నారని, నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి జగనన్నను తిరిగి సీఎం చేసుకోవాలన్నారు. కార్యకర్తలకు అగ్రస్థానం: జెట్టి గురనాథరావు రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పరిశీలకుడు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. కార్యకర్తలకు జగనన్న అగ్రస్థానం కల్పిస్తున్నారని, సంస్థాగత ఎన్నికలు పూర్తిచేసి పార్టీ సైన్యాన్ని సిద్దం చేయాలన్నారు. ఇప్పటికే చాలా కమిటీలు వేసి పూర్తి చేశామన్నారు. జగనన్నే మన నాయకుడని పేర్కొన్నారు. 2029లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్పర్సన్ బత్తిన లక్ష్మి, ఉభయగోదావరి జిల్లాల బూత్ కమిటీ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపేయి సుధీర్, సీఈసీ సభ్యులు దయ్యాల నవీన్బాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి తదితరులు మాట్లాడారు. కౌన్సిలర్ మానవత మూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, కర్పూరం గుప్త, వైస్ ఛైర్మన్ ముప్పిడి అంజి, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, గురజాల పార్థసారధి, మేడవరపు విద్యాసాగర్, కనికళ్ల ప్రసాద్, సాయిల స్వాతి, వామిశెట్టి హరిబాబు, భావన రుషి, బత్తిన చిన్న, శ్యామ్, బోను రాధిక, తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
బాధ్యతల స్వీకరణ
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇటీవల నియమితులైన ఉండి నియోజకవర్గానికి చెందిన జుత్తుగ నాగరాజు స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి సమస్యలున్నా పరిష్కరిస్తానని, పాఠకులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలను లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్ను గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు నాగరాజు, డిప్యూటీ లైబ్రేరియన్ ఎ.నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ మత్తు మహమ్మారిలా విస్తరిస్తూ విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికుల జీవితాలను నాశనం చేస్తున్నా ప్రభుత్వం కావాలనే కళ్లు మూసుకుని కూర్చోందని పలువురు నాయకులు ఆరోపించారు. శుక్రవారం విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక రౌండ్ టేబుల్ సమావేశం ఏలూరు ఐద్వా మహిళా సంఘం కార్యాలయంలో నిర్వహించారు. మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాణి అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరా కేంద్రాలు బహిరంగంగానే పనిచేస్తున్నా, మత్తు పదార్థాల అమ్మకాలు కాలనీల్లో నిర్భయంగా సాగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం నిశ్చేష్టంగా వ్యవహరిస్తోందని వక్తలు మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కె.లెనిన్, డీవైఎఫ్ఐ నాయకుడు ఎ.శరత్ చంద్ర, ఐద్వా నాయకురాలు పి.హైమావతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం: వైఎస్సార్సీపీ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీగా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన మద్దు రామ్ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడేనికి చెందిన షేక్ రఫీ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరిని ప్రసాద్ను నియమించినట్లు పార్టీ కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు వచ్చాయి. ఏలూరు (టూటౌన్): రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ సోల్లా బొజ్జిరెడ్డి ఈ నెల 11న ఏలూరులోని రెవెన్యూ అతిథి గృహం చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు ఏలూరులోని గిరిజన భవన్ చేరుకుని, ఎస్టీ కమిషన్ సభ్యులతో కలిసి అసోసియేషన్ ప్రతినిధుల నుంచి సమస్యలు తెలుసుకుంటారు. -
14 నుంచి సంక్రాంతి సంబరాలు
భోగి మంటల్లో తగులబెట్టండి వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఉత్తర్వుల కాపీలను, వికసిత్ భారత్ జీ రాం జి కాపీలను భోగి మంటలలో తగులబెట్టాలని సీపీఐ నేతలు పిలుపునిచ్చారు. IIలో u● 15న నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు ● 16న చినవెంకన్నకు కనుమ ఉత్సవం ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో ఈనెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వై.భద్రాజి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భోగి పండుగను పురస్కరించుకుని 14న ఆలయ తూర్పు రాజగోపురం వైపున ఉన్న ఖాళీ ప్రదేశంలో కోలాట నృత్యాలు, హరిదాసులు, బుడబుక్కల వేషధారణలతో ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతామన్నారు. 15న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. 16న కనుమ పండుగ సందర్భంగా దొరసానిపాడులో శ్రీవారికి కనుమ ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారు ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ దొరసానిపాడుకు బయల్దేరి వెళతారని, అక్కడ కనుమ మండపంలో అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణలతో ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారని తెలిపారు. -
చినవెంకన్న హుండీ ఆదాయం రూ.2.09 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో గురువారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. గడచిన 16 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,09,40,260 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజి తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 79 గ్రాముల బంగారం, 3.552 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రద్దయిన పాత నోట్లు ద్వారా రూ.5,500 లభించినట్టు చెప్పారు. లెక్కింపులో జిల్లా దేవాదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు, ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా దళం సభ్యులు పాల్గొన్నారు. -
గ్రామస్థాయి కమిటీలతో పార్టీ బలోపేతం
వేలేరుపాడు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గ్రామస్థాయిలో కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టినట్టు ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర అన్నారు. వేలేరుపాడులో మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన జరిగిన పార్టీ నిర్మాణ సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ , అనుబంధ విభాగాల కమిటీలను నియమించా లని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ సింగిల్గా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే దమ్ము చంద్రబాబుకు లేదని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కి సూపర్సిక్స్ను అమలు చేయ డం లేదన్నారు. పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునిల్కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనుల వల్లే తాము ధైర్యంగా ప్రజల్లో తిరుగుతున్నామని అన్నారు. పోలవరం ఇన్చార్జి తెల్లం బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, బూత్ కమిటీ జోన్ ఇన్చార్జ్ బీవీఆర్ చౌదరి, నియోజకవర్గ రైతు వి భాగం అధ్యక్షుడు కామినేని వెంకటేశ్వరరావు, జె డ్పీటీసీ గుజ్జా రామలక్ష్మి, ఎంపీపీ వల్లా లక్ష్మీదేవి, గుద్దేటి భాస్కర్, సర్పంచ్లు ఉదయ్కిరణ్, లక్ష్మ ణ్, వైస్ ఎంపీపీలు కేస గాని వెంకటేశ్వరమ్మ, మే డవరపు నాగశ్రీ, ఎంపీటీసీ కొమ్మరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
పాలకోడేరు: పలుచోట్ల చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగను పాలకోడేరు పోలీసులు పట్టుకున్నారు. నేరస్తుడి నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పాలకోడేరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పి.రఘువీర్ విష్ణు గురువారం వివరాలు వెల్లడించారు. గత నెల 29వ తేదీన విస్సాకోడేరు కు చెందిన కలిదిండి లావణ్య, భర్త శ్రీనివాసరావు ఇంటికి తాళం వేసి భీమవరం ఆసుపత్రికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బంగారం, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో మచిలీపట్నం రూరల్, మోకావారి పాలెం, నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన నిందితుడు ఆరేపల్లి దుర్గారావును ఈనెల 7వ తేదీ సాయంత్రం గొల్లలకోడేరు సెంటర్లో పాలకోడేరు ఎస్సై రవివర్మ అరెస్టు చేశారు. అతడిపై ఇప్పటికే కృష్ణా, గుంటూరు, ఏలూరు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 145 దొంగతనాల కేసులున్నాయని, 30 సార్లు జైలుకు కూడా వెళ్లనట్లు డీఎప్పీ చెప్పారు. చోరీ కేసుల్లో పాలకోడేరు పోలీస్ స్టేషన్కు సంబంధించి రూ.2.35 లక్షలు, పెనమలూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించి రూ.4.25 లక్షలు, కై కలూరు పోలీస్ స్టేషన్కు సంబంధించి రూ.18 వేలు, శ్రీ కాళహస్తి పోలీస్ స్టేషన్ కు సంబంధించి రూ.40 వేలు విలువైన బంగారం, వెండి ఆభరణాలు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డీఎప్పీ చెప్పారు. -
అద్దె బస్సులు ఆపేస్తాం
సాక్షి, భీమవరం: ఆర్టీసీ అద్దె (హైర్) బస్సుల యజ మానులు పోరుబాట పట్టారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో నెలవారీ మెయింటెనెన్స్ రూ.40 వేల వరకు పెరిగితే.. ఏపీఎస్ఆర్టీసీ కేవలం రూ. 5,200లు మాత్రమే పెంచడంపై అసంతృప్తితో ఉన్నారు. ఆర్టీసీ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర అద్దె బస్సుల యజమానుల సంఘం పిలుపు మేరకు ఈనెల 12 నుంచి బస్సులు నిలిపివేసి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో.. జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల పరిధిలో వెన్నెల, స్టార్లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లెవెలుగు తదితర బస్సులు 295 ఉన్నాయి. ఇవి మొత్తం రోజుకు లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుండగా, 90 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితమంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లకు మాత్రమే ఫ్రీ సర్వీసును పరిమితం చేసింది. 40 శాతం హైర్ బస్సులే.. జిల్లాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు మొత్తం 197 ఉండగా వీటిలో 73 హైర్ బస్సులు. ఫ్రీ బస్సుతో ఆయా సర్వీసుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. బస్సు సిట్టింగ్ కెపాసిటీ 56 కాగా ప్రస్తుతం వంద మందికి పైనే ప్రయాణిస్తున్నట్టు ఓనర్లు చెబుతున్నారు. లీటరుకు 5.6 కి.మీ చొప్పున బస్సు తిరిగే రూటు, వేసే ట్రిప్పులు (టార్గెట్) మేరకు హైర్ బస్సులకు ఆర్టీసీ డీజిల్ పోయిస్తుంది. మైలేజ్ షార్టేజ్తో అదనంగా డీజిల్ వినియోగమైతే ఆ భారాన్ని యజమానులే భరించాలి. మెయింటినెన్స్ కింద కిలోమీటరుకు రూ.12 నుంచి రూ.13ల చొప్పున ఇస్తుంది. ఏలూరు జి ల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డి పోల పరిధిలో 303 బస్సులు ఉండగా ఫ్రీ సర్వీసు అందిస్తున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు 177 ఉన్నాయి. రూ.40 వేల వరకు భారం ప్రయాణికుల రద్దీతో టైర్లు అరుగుదల పెరిగిందని, తరచూ టైర్లు పేలిపోవడం, సీట్లు దెబ్బతినడం, కట్టలు విరిగిపోవడం, ఇంజి సంబంధిత సమస్యలతో మెయింటెనెన్స్ పెరిగిపోయిందని ఓనర్లు అంటున్నారు. రోజుకు 10 లీటర్ల వరకు ఆయిల్ షార్టేజీ వస్తుండటంతో ఆ భారం తమపై పడుతోందని చెబుతున్నారు. మెయింటెనెన్స్, ఆయిల్ షార్టేజీ రూ పాల్లో ఒక్కో బస్సుపై నెలకు రూ.40 వేల వరకు అ దనపు భారంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిమెంట్లో ఫ్రీ బస్సు ప్రస్తావన లే దని, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మైలేజీ లీటరుకు 5.6 కి.మీ నుంచి 4.6 కి.మీ తగ్గించాలని, మెయింటినెన్స్ కి.మీ రూ.13 నుంచి రూ.18కు పెంచాలని, అనుమతి మేరకు ప్రయాణికులను అనుమతించేందుకు ఆదేశాలివ్వాలని, రద్దీకి అనుగుణంగా బస్సు ల సంఖ్యను పెంచాలని కొద్దినెలలుగా అద్దె బస్సు ల యజమానులు ఆర్టీసీని కోరుతున్నారు. 12 నుంచి సమ్మెలోకి.. ఆయిల్, మెయింటెనెన్స్ కింద ఒక్కో బస్సుకు నెలకు కేవలం రూ.5,200లు పెంచుతూ ఆర్టీసీ బుధవారం సర్క్యులర్ జారీచేయడాన్ని అద్దె బస్సు ల ఓనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నష్టాల కోర్చి తాము బస్సులు నడపలేమని, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈనెల 12 నుంచి బస్సులు నిలిపివేసి సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు. ఎంఎస్ఎంఈలో లోన్పై బస్సు తీసుకుని ఆర్టీసీలో హైర్కు న డుపుతున్నాను. ఫ్రీ బస్సు రద్దీతో నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అదనపు భా రం పడుతుంటే కేవలం రూ. 5,200 మాత్రమే ఆర్టీసీ పెంచింది. డిమాండ్లు పరిష్కరించకుంటే 12 నుంచి బస్సులు ఆపేస్తాం. – రాపాక మహేష్, హైర్ బస్ యజమాని, సిద్దాంతం బస్సులో 56 మందికు గాను వంద మందికి పైనే ప్రయాణిస్తున్నారు. ఓవర్లోడ్తో తరచూ మరమ్మతులతో మెయింటినెస్స్ పెరిగిపోయింది. నెలనెలా అదనపు భారంతో అద్దె బస్సుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నాం. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సమ్మె చేస్తాం. – ఎ.ప్రియాంక, హైర్ బస్సు యజమాని, తణుకు ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పోరుబాటలో హైర్ బస్సుల యజమానులు ఫ్రీబస్సు ఓవర్ లోడ్తో భారీగా పెరిగిన మెయింటెనెన్స్ ఒక్కో బస్సుపై నెలకు రూ.40 వేల వరకు అదనపు భారం ఆర్టీసీ కేవలం రూ.5,200 పెంపుపై అసంతృప్తి 12 నుంచి బస్సుల నిలిపివేతకు రాష్ట్ర హైర్ బస్ ఓనర్స్ సంఘం పిలుపు -
గురువులపై కర్ర పెత్తనం
నిడమర్రు: చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 8 పిరియడ్స్ బోధించేలా ప్రతీ సబ్జెక్ట్కు ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి జులై నెలలో టీచర్ హ్యాండ్ బుక్స్ అందించారు. దీని ప్రకారం ఉపాధ్యాయుల బోధన జరుగుతోంది. ఇటీవల 8 పిరియడ్స్ బోధనను 4 పిరియడ్స్కు కుదించి ఉదయం 4 పిరియడ్స్లో 8 పిరియడ్స్కు సంబంధించిన బోధన పూర్తిచెయ్యాలని, మధ్యాహ్నాం 4 పిరియడ్స్ ఎఫ్ఎల్ఎన్ తరగతులు నిర్వహించాలని 75 రోజుల ఎఫ్ఎల్ఎన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వమే 8 పిరియడ్స్ ఎలా బోధించాలో టీచర్ హ్యాండ్ బుక్స్ ఇచ్చి, ఇప్పుడు వాటిని 4 పిరియడ్స్లో బోధించాలనే నిర్ణయంపై ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి సబ్జెక్ట్కు అన్ని పరీక్షలు ఒకే పుస్తకంలో రాయించేలా అందించిన మూల్యాంకన పుస్తకాలతో తలలు పట్టుకుంటున్నారు. 10వ తరగతి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత చెందేలా ఎస్ఎస్ఎసీ పరీక్షల వరకూ 100 రోజుల ప్రణాళిక రూపొందించింది. ప్రతి రోజు ఆరోజు బోధించిన సబ్జెక్ట్పై సాయంత్రం వేళల్లో పరీక్షలు పెట్టి రోజువారీ విద్యార్థుల మార్కులు ఆన్లైన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలవుతోంది. ఈ 100 రోజుల ప్రణాళిక అమలుపై విద్యాశాఖ జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకూ పర్యవేక్షణ కొనసాగుతోంది. తాజాగా ఈ పర్యవేక్షణ, పరిశీలన బాధ్యతలను మండలంలోని ఇతర శాఖలకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో విద్యాశాఖపై పరాయి శాఖల పెత్తనం చేసేలా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పర్యవేక్షణకు 256 మంది అధికారుల నియామకం పదో తరగతి 100 రోజుల ప్రణాళిక అమలుపై ఏలూరు జిల్లాలోని 256 ఉన్నత పాఠశాలలకు ఆయా మండలాల, పట్టణాల్లోని వ్యవసాయశాఖ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీరాజ్ శాఖ, వెలుగు, ఇరిగేషన్, ఉద్యానవనశాఖ, సీ్త్రశిశు సంక్షేమశాఖ, పశువర్ధకశాఖ, వైద్యశాఖ, గృహనిర్మాణశాఖ, మత్య్సశాఖ, పోలీస్శాఖ, టౌన్ప్లానింగ్ వంటి శాఖలకు చెందిన గెజిటెడ్ అధికారులను ప్రత్యేక తరగతుల నిర్వహణా పర్యవేక్షణకు నియమించారు. ఈ మేరకు జిల్లా ఉన్నత అధికారుల నుంచి ఉత్తర్వులు గత నెలలో జారీ అయ్యాయి. గణపవరం జెడ్పీస్కూల్లో విద్యార్థుల ప్రగతి పరిశీలిస్తున్న డీవైఈవో రామాంజనేయులు (ఫైల్)చానమిల్లి జెడ్పీస్కూల్లో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంపీడీవో (ఫైల్)ఇప్పటికే విద్యాశాఖలోని అన్ని స్థాయిల్లో అధికారులు ప్రతి రోజు టెన్త్ విద్యార్థులకు అమలవుతున్న 100 రోజుల ప్రణాళికల అమలుపై తనిఖీలు చేస్తూ ఉన్నత అధికారులకు నివేదికలు ఇస్తున్నారు. అయినా ఇతర శాఖలను ఉపాధ్యాయులపై పెత్తనం చేసేలా, వారి పనితీరును, బోధనను పర్యవేక్షించేలా తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పలు రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. డీఈఓ, డీప్యూటీ డీఈఓ, ప్రతి మండలానికి ఇద్దరేసి చొప్పున మండల విద్యాశాఖ అధికారులు, ప్రతి ఉన్నత పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులను కాదని.. ఇతర శాఖల అధికారులను ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమించడాన్ని ఆక్షేపిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో ఏమైనా తేడాలొస్తే ఈ మానిటరింగ్ ఆఫీసర్లు బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. టెన్త్లో వంద శాతం ఉత్తీర్ణతకు 100 రోజుల ప్రణాళిక పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారుల నియామకం ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయుల ఆగ్రహం ప్రత్యేక తరగతులు నిర్వహించే విషయంలో ప్రభుత్వం, ఇతర శాఖల వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. విద్యాశాఖలో ఎంతో అనుభవం ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వారిని కాదని ఇతర ఽశాఖలకు పెత్తనం వల్ల విద్యార్థులకు ఒరిగేది ఏమి ఉండదు. ఒత్తిడి వల్ల ఆశించిన ఫలితాలు రావు. – పుప్పాల సూర్యప్రకాశరావు, స్టేట్ కౌన్సిలర్, ఎస్టీయూవిద్యాశాఖ అమలు చేస్తున్న ప్రణాళిక అమలు తీరుపై విద్యాశాఖ అధికారులు ఉండగా ఇతర శాఖలను పర్యవేక్షణ అధికారులుగా నియమించడం ఉపాధ్యాయుల అస్థిత్వం దెబ్బతీసే కుట్రగా భావిస్తున్నాం. ఇలాంటి పర్యవేక్షణలను ఏమాత్రం సహించేది లేదు. ఇది మంచి పరిణామం కాదు. – గెడ్డం సుధీర్, రాష్ట్ర నాయకులు, వైఎస్సార్టీఏ ఇప్పటికే సెలవు దినాలు, ఆదివారాలు సైతం ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ రోజువారీ పరీక్షల ఫలితాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఉపాధ్యాయుల బోధనా పనితీరును పర్యవేక్షించేందుకు ఇతర శాఖల అధికారులను నియమించడం ఉపాధ్యాయులను అవమానించడమే. – బోర్రా గోపీ మూర్తి, టీచర్స్ ఎమ్మెల్సీ -
ప్రాణాలైనా అర్పిస్తాం
శురకవారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2026భూసేకరణ కోసం ప్రభుత్వం కనీసం ఎలాంటి గ్రామ సభలు నిర్వహించలేదు. రైతుల అభిప్రా యాలు తీసుకోలేదు. ఏకపక్షంగా భూసేకరణ అప్రజాస్వామికం. ఒక ప్రజాప్రతినిధిగా ఈ చర్యను వ్యతిరేకిస్తున్నా. – అబ్బు సుబ్రహ్మణేశ్వరరావు, సర్పంచ్, మంగపతిదేవిపేట, కొయ్యలగూడెం మండలం భూములను కోల్పోయే వారిలో అంతా చిన్న, సన్నకారు రైతులే. వీరికి వ్యవసాయమే జీవనాధారం. భూములను కోల్పోతే వీరంతా రోడ్డున పడతారు. ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవాలి. – టి.శ్రీనివాస్, ఎంపీటీసీ, మంగపతిదేవిపేట, కొయ్యలగూడెం మండలం నాకు ఎకరా భూమి వారసత్వంగా రాగా దీనిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నా. ఇప్పుడు ఆ భూమిని తీసుకుని కొంత పరిహారం ఇస్తే సరిపోతుందా. జీవనాధారాన్ని కోల్పోతాం. – ఏకుల శ్రీను, రైతు, బోడిగూడెం ఒకరిద్దరు అవినీతిపరుల వల్ల భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారంటూ అధికారు లు ప్రకటిస్తున్నారు. మాకు నా లుగెకరాలు ఉండగా నాలుగు కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నాం. – జక్కు చల్లారావు, రైతు, బోడిగూడెం ఏలూరు (టూటౌన్): ‘మా ప్రాణాలైనా అర్పిస్తాం.. కానీ మా భూములను మాత్రం నేవీ ఆయుధ క ర్మాగారానికి ఇచ్చేది లేదు’ అంటూ బాధిత రైతులు తెగేసి చెబుతున్నారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, బర్కెట్ నగరం, మంగపతిదేవిపేట, ఊట్లగూడెం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రేగులగుంట గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు నిరసన బాట పట్టారు. బోడిగూడెం పంచాయతీ పరిధి బర్కెట్ నగరం ప్రాంతంలో 1,200 ఎకరాల్లో నేవీ ఆయుధ కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడాన్ని వీరంతా వ్యతిరేకిస్తున్నారు. ఈ కర్మాగారం ఏర్పా టుతో చిన్న, సన్నకారు రైతులు జీవనోపాధి కో ల్పోయి రోడ్డుపాలవుతామని ఆవేదన చెందుతు న్నారు. కనీసం తమ అనుమతి తీసుకోకుండా, గ్రా మసభలు నిర్వహించకుండా భూములను లాక్కోవాలని చూడటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా ఇటీవల ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అధికారుల నిర్లక్ష్యం : కర్మాగారం ఏర్పాటు విషయంలో అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం గ్రామసభలు పెట్టి ప్రాజెక్టు పరిధిలోని రైతులతో మాట్లాడలేదని ఆరోపిస్తున్నారు. స్థానిక రైతు ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా భూములను సేకరించాలని చూస్తే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా చిన్న, సన్నకారు రైతులే.. ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల్లో అందరూ చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఎకరా, రెండెకరాలు ఉన్న వారే అధికం. ఈ ప్రాంతంలో భూసేకరణ చేస్తే సుమారు 500 మందికి పైగా రైతులు నిర్వాసితులు కానున్నారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర పరిహారం వల్ల వీరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. బలవంతంగా భూసేకరణ చేస్తే తామంతా చెల్లాచెదురవుతామని, తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పునరాలోచన చేయాలని కోరుతున్నారు. కుక్కునూరులో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్. చిత్రంలో పార్లమెంట్ ఇన్చార్జి సునీల్, నియోజకవర్గ ఇన్చార్జి బాలరాజు, పరిశీలకుడు రవీంద్ర జాగిలంతో తనిఖీలు చేయిస్తున్న దృశ్యంజిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు ఆయుధ డిపోపై సమరభేరి నేవీ ఆయుధ కర్మాగార బాధిత రైతుల్లో ఆందోళన కర్మాగారానికి భూములిచ్చేది లేదంటూ తేల్చిచెప్పిన వైనం గ్రామ సభలు నిర్వహించకపోవడంపై మండిపాటు జీవనాధారం కోల్పోతామంటున్న కర్షకులు బోడిగూడెం పరిసర గ్రామాల రైతుల నిరసన బాట తమ ప్రాంతంలో నేవీ ఆయుధ కర్మాగారం ఏర్పాటుచేస్తున్నట్టు గతనెలలో పత్రికల్లోనే చూశామని, అప్పటివరకూ ఈ విషయం తమకు తెలియదని బాధితులు అంటున్నారు. అయితే తమ వాదనలకు భిన్నంగా రెవెన్యూ అధికారులు మాత్రం స్థానిక రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధం ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక పంపడం విడ్డూరంగా ఉందంటున్నారు. తమ ప్రాంతంలోని ఒకరిద్దరు అవినీతిపరుల చర్యలను సాకుగా చూపి వందలాది మంది రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలనుకోవడం దుర్మార్గమని మండిపడుతున్నారు. భూములను ఇచ్చేందుకు తామెవరికీ ఇష్టం లేదని అలాంటప్పుడు మా భూములను ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. -
కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్కు కోకో రైతులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, పానుగంటి అచ్యుతరామయ్య, గుది బండి వీరారెడ్డి, కోనేరు సతీష్ బాబు, ఆలపాటి శ్రీనివాసరావు మాట్లాడారు. కంపెనీలు సిండికేట్గా మారి ధరలు తగ్గించి వేసి రైతులను మోసగిస్తున్నాయని చెప్పారు. విదేశీ కోకో దిగుమతులపై దిగుమతి సుంకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో కోకో గింజలకు రూ.550లకు పైగా ధర ఉండగా కంపెనీలు రూ.350లకు కొనుగోలు ప్రారంభించి గత రెండు రోజుల నుంచి రూ.400 లకు రైతుల ఆందోళనతో పెంచారని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ ధర రైతులకు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. దేశంలోనే ఏలూరు జిల్లాలో అత్యధిక కోకో పంట విస్తీర్ణం ఉన్నదని, కేంద్ర కోకో పరిశోధనా కేంద్రాన్ని, రాష్ట్రంలో కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఫలితంగా కోకో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. దీనిపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కోకో రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కోకో గింజల ధర ఫార్ములా కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కోకో రైతులు పాల్గొన్నారు. ఏలూరు ఎంపీకి కోకో రైతుల వినతి -
రేషన్ బియ్యం పట్టివేత
పాలకొల్లు (సెంట్రల్) : పాలకొల్లు పట్టణం, చెంబునిపేటలో గురువారం విజిలెన్స్, రెవెన్యూ, పౌర సరఫరా అధికారులతో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రవాణాకు సిద్ధంగా ఉన్న 3 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వ్యాన్ను సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం తెలిపారు. బియ్యం విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందన్నారు. యజమాని కనమర్లపూడి శేషగిరిరావు, డ్రైవర్ పీతాని మోహనకృష్ణలపై నిత్యవసర వస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. నూజివీడు: జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు పట్టణంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థి పీ రేవంత్ ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జోజిబాబు తెలిపారు. జార్ఘండ్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి బాస్కెట్బాల్ జట్టుకు రేవంత్ నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ను ప్రిన్సిపాల్ అభినందించి గురువారం క్రీడా కిట్ను అందజేశారు. రేవంత్ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్.జవహర్ శుక్రవారం ఏలూరు రానున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై.విశ్వమోహాన్రెడ్డి గురువారం ప్రకటనలో తెలియజేశారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి మీటింగ్ హాల్లో జిల్లాలోని ఎస్సీ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారన్నారు. ముందుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏలూరు, రెవెన్యు గెస్ట్హౌస్ నందు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని తెలియజేశారు. కుక్కునూరు: తల్లిదండ్రులపై కుమార్తె దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడడంతో కేసు నమోదు చేసినట్లు కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి పేర్కొన్నారు. వింజరం గ్రామానికి చెందిన కరేటి చిట్టెమ్మ, కృష్ణయ్య దంపతులు, వారి వ్యవసాయ భూములకు వచ్చిన పోలవరం ముంపు పరిహార డబ్బులను వారి బ్యాంక్ ఖాతాల నుంచి మోసపూరితంగా కుమార్తె చిమడబోయిన మంగమ్మ, ఆమె కుటుంబసభ్యుల ఖాతాలకు బదిలీ చేసుకుంది. అలాగే వారి గొర్రెలు, మేకలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడంతో ప్రశ్నించిన వృద్ధ దంపతులను అసభ్య పదజాలంతో దూషించి, శారీరకంగా దాడి చేసి, చంపుతామని బెదిరింపులకు గురిచేసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు. చోరీ కేసు నమోదు పోలవరం రూరల్: తాళం వేసి ఉన్న ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలవరం ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం మండలం పాతపట్టిసీమ గ్రామానికి చెందిన రాపాక శ్రీను కుటుంబసభ్యులతో కలిసి బుధవారం రాత్రి శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లో ఉన్న 10 కాసుల బంగారం, 10 తులాల వెండి వస్తువులను దొంగిలించినట్లు గుర్తించారు. శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులను రప్పించి గుర్తిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పెదపాడు: మానవత సేవాసంస్థ రాష్ట్ర చైర్మన్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారుబోయిన కోటేశ్వరరావు తన భార్య సూర్య నాగమణి భౌతికకాయాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేశారు. నాగమణి అనారోగ్యంతో బుధవారం మరణించారు. తన మరణంలో కూడా సేవ ఉండాలనే ఆశయంతో తమ మరణాంతరం తమ శరీరాలను మెడికల్ కళాశాలలకు అప్పగించేందుకు ముందస్తుగా అనుమతి పత్రాన్ని అందించారు. దీంతో సూర్యనాగమణి భౌతికకాయాన్ని కోటేశ్వరరావు మెడికల్ కళాశాలకు అప్పగించారు. వివిధ జిల్లాలకు చెందిన మానవత ప్రతినిధులు సూర్య నాగమణి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
వైఎస్సార్సీపీలోకి చేరికలు
కుక్కునూరు: మండలంలోని చిరవెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబా లు వైఎస్సార్సీపీలో చేరాయి. కుక్కునూరులో గురువారం జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు (డీఎన్నార్) వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వరక రవికుమార్, యర్నం ప్రవీణ్, సారంగి రాంబాబు, సున్నం సురేష్, సున్నం ప్రవీణ్, సరి యం శివ తదితరులు ఉన్నారు. ఏలూరు(ఆర్ఆర్పేట): వాహనాల తాత్కాలిక నమోదు (టీఆర్)కు అధిక చార్జీలు వసూలు చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఉప ర వాణా కమిషనర్ కేఎస్ఎంవీ కృష్ణారావు హె చ్చరించారు. ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో గురువారం టీఆర్ చార్జీలపై డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాల తాత్కాలిక నమోదు సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన చా ర్జీలను మాత్రమే వినియోగదారుల నుంచి వ సూలు చేయాలని, అదనపు లేదా అనధికార వ సూళ్లకు తావివ్వొద్దన్నారు. అలాగే ప్రతి షోరూమ్లో రుసుముల వివరాలు తెలిపేలా బోర్డులు ప్రదర్శించాలన్నారు. ఆర్టీఓ (ఇన్చార్జి) ఎస్ బీ శేఖర్, ఎంవీఐలు బి.భీమారావు, జి.ప్రసాదరావు, పి.రమేష్బాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.రాము, ఎం.ఆనందకుమార్, 18 మంది వాహన డీలర్లు పాల్గొన్నారు. వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్టు నిమిత్తం కుక్కునూరు, వేలేరుపాడు మండల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో నిర్మాణ (స్ట్రక్చర్) విలువలకు సంబంధించి సర్టిఫికెట్లు సమర్పించని వారు ఈనెల 10లోపు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూసేకరణ అధికారి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, కుడి ప్రధాన కాలువ, యూనిట్–2, ఏలూరు ఎదుట హాజరుకావాలని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, ఆర్ఎంసీ యూనిట్–2 ఇన్చార్జి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.ముక్కంటి ప్రకటనలో తెలిపారు. నిర్మాణ విలువలకు భూసేకరణ చేశామని, నష్టపరిహారాన్ని భూ యజమానులకు చెల్లిస్తామన్నారు. అయితే ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వని వారు (ఆధార్ కార్డు, ఇంటి పన్ను, బ్యాంక్ అకౌంటు మొదటి పేజీ, డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, నోటరీ అఫిడవిట్, స్ట్రక్చర్ ఆధారాలు మొదలైనవి) హాజరుకావాలన్నారు. వేలేరుపాడు మండలంలో 145, కుక్కునూరు మండలంలో 46 మంది మొత్తంగా 191 మంది అవార్డుదారులు వారి వివరాలు సమర్పించాల్సి ఉందని పేర్కొన్నారు. పెనుగొండ: కోడేరు ఇసుక ర్యాంపులో అనధికారంగా చేస్తున్న బాట పనులు తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్సీపీ నాయకులు గురువారం ఆచంట తహసీల్దార్ సోమేశ్వరరావుకు, ఆచంట పోలీస్స్టేషన్లో వినతిపత్రాలు ఇచ్చారు. అ నంతరం వారు మాట్లాడుతూ కోడేరు ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలించడానికి ఇప్ప టికీ బాట పనులు చేస్తున్నారని, అయినా అధి కారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్నా రు. అధికార పార్టీ నాయకులకు అండగా అధికారులు ఉంటున్నారని ఆరోపించారు. ఇసుక తరలింపుపై త్వరలో హైకోర్టులో కేసు వేయనున్నామన్నారు. అక్రమంగా ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సీనియర్ నా యకులు సుంకర సీతారామ్, కోట వెంకటేశ్వరరావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కేతా తాతరావు, టౌన్ అధ్యక్షుడు పెచ్చెట్టి సత్యనారాయణ, బీసీ నాయకులు తదితరులు ఉన్నారు. -
కూటమిలో బయటపడిన విభేదాలు
కొయ్యలగూడెం: పోలవరం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం అట్టహాసంగా నిర్వహించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలకు నియోజకవర్గంలోని ఏడు మండలాల కూటమి పార్టీల ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులతో పాటు దాని మిత్రపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు కూడా ముఖం చాటేశారు. మరోపక్క ఈ కార్యక్రమానికి డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున తరలించారు. వీరితో పాటు సీఏల ద్వారా జన సమీకరణకు అధికారులు సహకరించారు. కొయ్యలగూడెంలోని ఏఎంసీ యార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. ఇదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్రాంతి వేడుకల ఆటవిడుపు కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యే ప్రారంభించి బహుమతులు అందజేశారు. -
భాగవతోత్తముడు త్యాగరాజు
భీమవరం: త్యాగరాజు 96 కోట్ల నారాయణ జపం చేసి శ్రీసీతారామచంద్రుల దర్శనం పొందిన భాగవతోత్తముడని మహా సహస్రావధాని గరికిపాటి నర్సింహారావు అన్నారు. భీమవరం పట్టణంలోని త్యాగరాజ భవనంలో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా బుధవారం గరికిపాటి త్యాగరాజు రామాయణంపై ప్రవచనం చేశారు. దేశమంతా మోగుతున్న నినాదం జై శ్రీరామ్ నామ మంత్రమని, నాదోపాసనతో పరబ్రహ్మను చేరవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు త్యాగరాజు అన్నారు. శ్రీరామ దర్శనం పొంది భగవంతుడున్నాడన్న సత్యాన్ని చాటిన నిష్కార్మయోగి, తెలుగు భాష తీయందనాన్ని, సాహితీ పరిమళాలను విశ్వవ్యాప్తం చేసిన ధన్యజీవి, మోక్ష సాధన మార్గాల్లో సంగీతం ఒకటని తలచి తన సంకీర్తనల ద్వారా భగవంతునికి చేరువై మోక్ష ప్రాప్తి పొందిన మహనీయుడు త్యాగరాజస్వామి అంటూ కీర్తించారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణ పనులన్నీ 2027 మార్చికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రాజెక్ట్ సైట్లోని సమావేశపు హాలులో సమీక్షించారు. ప్రాజెక్టు పనులు, పునరావాస ప్యాకేజీ తదితర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపొందించాలని సూచించారు. మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. -
గోదావరి కాలువ పక్కన డంపింగ్ యార్డ్
● ప్రమాదం అంచున ఐదు గ్రామాల సాగు, తాగునీటి సరఫరా ● కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సర్పంచ్, గ్రామస్తులు దెందులూరు: గోదావరి కాలువ పక్కన ఉండ్రాజవరం వంతెన వద్ద డంపింగ్ యార్డ్ నిర్మాణం నిలుపుదల చేయాలని పోతునూరు గ్రామ సర్పంచ్ బోదుల స్వరూప్, కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఎర్నేని శ్రీను, గ్రామస్తులు కలిసి జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గోదావరి కాలువ పక్కన డంపింగ్ యార్డ్ పెడితే పోతునూరు, కొవ్వలి, సత్యనారాయణపురం, దెందులూరుతో పాటు ఏలూరు గ్రామాలకు సాగు, తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఎన్నడూ గోదావరి కాల్వ పక్కన డంపింగ్ యార్డ్ నిర్మాణం జరగలేదన్నారు. ఫిర్యాదు స్వీకరించిన జిల్లా కలెక్టర్, డీపీఓను విచారణ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం గ్రామ సర్పంచ్ బోదుల స్వరూప్, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఎర్నేని శ్రీను విలేకరులతో మాట్లాడుతూ తాము డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకం కాదన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గోదావరి కాలువ పక్కన ఎవరైనా డంపింగ్ యార్డ్ పెడతారా అని ప్రశ్నించారు. -
15వ రోజుకు ధర్మ పోరాట దీక్ష
నూజివీడు: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నూజివీడు ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష బుధవారం నాటికి 15వ రోజుకు చేరింది. క్యాంపస్లోని ఐ3 భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన టెంట్లో దీక్ష నిర్వహిస్తున్నారు. వీరందరూ తమ క్లాసులకు వెళ్లి టైంటేబుల్ ప్రకారం విద్యార్థులకు పాఠాలు బోధించి తదనంతరం పోరాట దీక్షలో కూర్చుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏడేళ్లకు పైగా తమకు వేతనాలు ఒక్క రూపాయి కూడా పెరగలేదని, దీనిపై తాము గత 15రోజులుగా పోరాడుతున్నా ఆర్జీయూకేటీ యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. యూజీసీ ప్రకారం వేతనాలు ఇస్తామని చెప్పి, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ సుబ్బారావు, రచన గోస్వామి, పీవీ లక్ష్మణరావు, జాడ సీతాపతిరావు, లంకపల్లి రాజేష్, భవాని, ఉదయశ్రీ, దీప్తీ సాహూ తదితరులు పాల్గొన్నారు. కొయ్యలగూడెం: మట్టిని అక్రమంగా తరలిస్తున్న జేసీబీని, టిప్పర్ లారీని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తహసీల్దార్ ఎన్.నాగరాజు తెలిపారు. యర్రంపేట సమీపంలోని పులపాల చెరువులో బుధవారం అదే గ్రామానికి చెందిన వ్యక్తి జేసీబీని ఏర్పాటు చేసి లారీల్లో మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పీడబ్ల్యూడీ ఏఈ ఎంఆర్ భాస్కర్తో కలిసి దాడి చేసినట్లు తహసీల్దార్ చెప్పారు. ఈ సమయంలో జేసీబీ, ఒక టిప్పర్ లారీని పట్టుకుని కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్కి తరలించినట్లు తెలిపారు. పోలవరం రూరల్: పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకై జిల్లా సాధనా సమితి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం 9వ రోజు కొనసాగాయి. దీక్షా శిబిరంలో మహిళలు దీక్ష చేపట్టారు. జిల్లా ఏర్పాటు చేయాలంటూ పలువురు వక్తలు ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంగా ఏటిగట్టు సెంటర్లో సాధనా సమితి సభ్యులు పోలవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్లకార్డులు పట్టుకుని నినదించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాధనా సమతి నాయకులు సొబ్బన మోహన్, బుగ్గా మురళీకృష్ణ, కోటంరాజు రాంబాబు, జేవీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (మెట్రో): ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ప్రకృతి వ్యవసాయం డీపీఎం బి.వెంకటేష్ అన్నారు. స్థానిక ఏలూరు జిల్లా వ్యవసాయ కార్యాలయంలోని ఐడీపీ హాల్లో బుధవారం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రసాయన ఎరువులు, పురుగుమందులతో పండించిన ఆహారం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, సాధ్యమైనంత వరకు అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యతకను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను సత్కరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ ఏడీఏ, ఏలూరు, పెదపాడు ఏవోలు, సెర్ప్ సిబ్బంది, ఏలూరు మండల ఏపీఎం, రైతులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
భీమడోలు: మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన 68వ జాతీయ రైఫిల్ షూటింగ్ చాంపియన్షిఫ్లో సూరప్పగూడేనికి చెందిన వెజ్జు ధరియా జూనియర్ కేటగిరిలో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ ఏడాది చివరిలో జరిగే నేషనల్స్ పోటీల్లో విజేతగా నిలిస్తే ఇండియన్ టీంలో స్థానం పొందుతుందని తండ్రి సోము తెలిపారు. చిన్నతనం నుంచి షూటింగ్ పట్ల ఆసక్తిని పెంచుకుని, అలుపెరుగని శ్రమతో తన లక్ష్యం వైపు ముందుకు సాగుతున్న ధరియా యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. మాజీ సర్పంచ్ వెజ్జు సూర్యకుమారి, కొండలరావు మనవరాలు ధరియా గుంటూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ఆమెను పలువురు అభినందించారు. పెదపాడు: రోడ్డు ప్రమాదంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తిరుపతి జిల్లా, నారాయణ వనం మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన కుంభ విజయ్ ఈనెల 6వ తేదీన తన మోటారు సైకిల్పై విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా రాత్రి 8.30 గంటల సమయంలో స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల వద్దకు వచ్చేసరికి డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో తలకి బలమైన గాయం కావడంతో జాతీయ రహదారి అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి 11 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వీఆర్వో రాగాల కృష్ణ ఫిర్యాధు మేరకు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడిగేదెవరు.. ఆపేదెవరు?
ద్వారకాతిరుమల: ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు సంపాదించుకుంటాం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు కొందరు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎంతో విలువైన గ్రావెల్ మట్టిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగేదెవరు.. ఆపేదెవరు అంటూ ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ద్వారకాతిరుమల మండలంలోని పలు చెరువులు, పోలవరం కుడి కాలువ గట్టుపై నిత్యం పొక్లెయిన్లతో యథేచ్ఛగా గ్రావెల్ మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. అధికారులను మామూళ్ల మత్తులో జోకొడుతున్నారు. నిబంధనలకు పాతర వేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. అక్రమార్కుల మధ్య పంపకాలు తేడా వచ్చినప్పుడు మాత్రమే కథ పోలీస్టేషన్కు చేరుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నేతల అక్రమార్జనకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నిబంధనలను తుంగలోకి తొక్కి ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. గ్రావెల్ మట్టి మాఫియా చెరువులు, పోలవరం కుడి కాలువ గట్లపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తోంది. ముఖ్యంగా గుణ్ణంపల్లి–ఎం.నాగుపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టుపై మట్టి తవ్వకాలు గత కొద్ది రోజులుగా యథేచ్ఛగా జరుగుతున్నాయి. దాంతో ఆ ప్రాంతం పెద్ద పెద్ద అగాథాలను తలపిస్తోంది. అలాగే పలు చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి, గోతులు పెడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఆ గోతులు నీటితో నిండి పశువులు, రైతులు అందులో పడి మృత్యువాత పడే ప్రమాదం ఉంది. పంపకాలు తేడా వచ్చినప్పుడే.. కొందరు పచ్చనేతలు సిండికేట్గా ఏర్పడి ఈ మట్టి దందాను సాగిస్తున్నారు. సాధారణంగా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. అయితే అక్రమార్కుల మధ్య పంపకాలు తేడా వచ్చి, అంతర్గతంగా ఫిర్యాదులు చేసుకున్నప్పుడు మాత్రమే అధికారులు రంగప్రవేశం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుణ్ణంపల్లి–ఎం.నాగులపల్లి మధ్య జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై ప్రజలు మండిపడుతున్నారు. సేవ చేస్తారని కూటమికి అధికారం కట్టబెడితే.. దోచుకు తింటున్నారని ధ్వజమెత్తుతున్నారు. తూతూమంత్రంగా ఫైన్లు సత్తాల పంచాయతీ సండ్రకుంటకు చెందిన ఓ నాయకుడు గతంలో సత్తాల చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి, పెద్దపెద్ద గోతులు పెట్టాడు. రెండు మూడు సార్లు పోలీసులు చిక్కినా అతడి తీరు మారలేదు. మంగళవారం రాత్రి సైతం ఆ నాయకుడు గుణ్ణంపల్లి–ఎం.నాగులపల్లి మధ్య పోలవరం కుడి కాలువ గట్టును తవ్వి, మట్టిని తరలిస్తూ పోలీసులకు పట్టబడడంతో అతడి టిప్పర్ను పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులు కేసులు నమోదు చేయకుండా మైన్స్ అధికారులకు అప్పగిస్తుండడం, అక్కడి అధికారులు తూతూమంత్రంగా ఫైన్లు వేసి వదిలేస్తుండటం వల్ల ఇలాంటి నాయకులకు భయం లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీకి చెందిన వారిపై మాత్రమే కేసులు నమోదు చేస్తూ.. అధికార పార్టీ వారిని మైన్స్ అధికారులకు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి తవ్వకాలు ఎక్కడంటే.. ● తిరుమలంపాలెంకు చెందిన ఓ నాయకుడు ఎటువంటి అనుమతులు లేకుండా సూర్యచంద్రరావుపేటలోని కృష్ణాపురం చెరువు, గొల్లగూడెంలోని దొర చెరువు, తిరుమలంపాలెంలోని నారప్ప చెరువులో మట్టిని తవ్వి తిమ్మాపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ప్రైవేట్ కల్యాణ మండపానికి తరలిస్తున్నాడు. ● పి.కన్నాపురం గ్రామానికి చెందిన ఓ నాయకుడు గుణ్ణంపల్లి–ఎం.నాగులపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టును తవ్వి, గ్రావెల్ మట్టిని దూబచర్లకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నాడు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.5 వేలకు విక్రయిస్తున్నాడు. మొత్తం కాంట్రాక్టు 500 టిప్పర్ల మట్టికి కాగా, రోజుకు 50 టిప్పర్ల మట్టిని తరలిస్తున్నాడు. ● జి.కొత్తపల్లిలో ఓ నాయకుడు రైతుల పొలాల్లో గ్రావెల్ను ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వి, చుట్టు పక్కల ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నాడు. ● తక్కెళ్లపాడుకు చెందిన టీడీపీ నాయకుడు గుణ్ణంపల్లి ప్రాంతంలోని పోలవరం కుడికాలువ–తాడిపూడి కాలువ గట్ల మధ్యలో ఉన్న ఖాళీ భూమిలో ఈ తవ్వకాలు జరుపుతున్నాడు. ఇప్పటికే కాలువకన్నా ఎక్కువ లోతు తవ్వకాలు జరిపాడు. భవిష్యత్తులో ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ● ఐఎస్.జగన్నాధపురంలో ఓ నాయకుడు ఎర్ర చెరువులోని మట్టిని అక్రమంగా తవ్వి ఇటుక బట్టీలకు, ఖాళీ స్థలాలను మెరక చేసేందుకు తరలిస్తున్నాడు. రెచ్చిపోతున్న టీడీపీ నేతల మట్టి మాఫియా కాలువ గట్లు, చెరువుల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు నిత్యం వందలాది టిప్పర్ల మట్టి తరలింపు మా రాజ్యం.. మా ఇష్టం అంటూ నేతల బెదిరింపులు మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం -
మార్కెట్ యార్డులోనే కలెక్టరేట్
భీమవరం: పట్టణంలో గతంలో ప్రతిపాదించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మిస్తారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) స్పష్టం చేశారు. బుధవారం భీమవరంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీంతో కొంతకాలంగా కలెక్టరేట్ తరలిపోతుందనే ప్రచారానికి ఆయన తెరదించడంతోపాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కలెక్టరేట్ను ఉండి ప్రాంతానికి తరలించడానికి చేసిన ప్రయత్నాలకు చెక్ పెట్టినట్లు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పశ్చిమగోదావరి జిల్లాకు భీమవరం కేంద్రంగా ప్రకటించడంతో తాత్కాలిక కలెక్టరేట్ను పట్టణంలోని మల్లితోట ప్రాంతంలోని అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణానికి కుముదవల్లి రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రూ.100 కోట్లు నిధులు మంజూరుచేసినట్లు ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది ఉండి ఎమ్మెల్యే కలెక్టరేట్ను ఉండి నియోజకవర్గానికి తరలించుకుపోడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. దీంతో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజుతో సహా వైఎస్సార్సీపీ నాయకులు తరలింపు వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. వామపక్ష పార్టీలు కలెక్టరేట్ తరలింపును అడ్డుకుంటామంటూ ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో అంజిబాబు ఏఎంసీలోనే కలెక్టరేట్ అంటూ స్పష్టం చేయడంతో కలెక్టరేట్ తరలింపు వ్యూహానికి చెక్ పెట్టినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్పష్టం చేసిన ఎమ్మెల్యే అంజిబాబు -
హమాలీ కార్మికులకు ఉపాధి కల్పించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలో పని చేస్తున్న హమాలీ కార్మికులకు ఉపాధి కల్పించాలని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. రైతులు అవసరాల కోసం నిలువచేసే ఎరువులు, పురుగు మందుల గోదాంలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ బుధవారం డీసీఎంఎస్ కార్యాలయం వద్ద ఇఫ్టూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి బద్దా వెంకట్రావు, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాస రావు మాట్లాడుతూ 40 ఏళ్ల నుంచి డీసీఎంఎస్లో 21 మంది హమాలీ కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. వారికి ఇప్పటికీ చట్టబద్ధమైన సౌకర్యాలు లేవన్నారు. హమాలీ కార్మికులకు పూర్తి రక్షణ కల్పించవలసిన అధికారులు ఉన్న ఉపాధిని ప్రైవేటు వ్యవస్థకు అప్పచెప్పే ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. -
తిరువీధుల్లో శ్రీవారి శోభ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం క్షేత్ర పురవీధుల్లో శ్రీవారికి జరిగిన తిరువీధి సేవ స్వామివారి వైభవాన్ని చాటడంతో పాటు, భక్తులకు కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. గుడి సెంటర్లోని ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని రాత్రి సైతం స్వామివారి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. ఏలూరు (టూటౌన్): చెక్బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షతో పాటు రూ.7.50 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలంటూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం తీర్పును వెలువరించారు. కుటుంబ అవసరాల నిమిత్తం ఏలూరుకు చెందిన మేడపాటి సుధాకర్ వద్ద నుంచి నగరానికి చెందిన ఆవుల అనిత 2023 ఫిబ్రవరి 18న రూ.8.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పును తిరిగి చెల్లించే నిమిత్తం 2024, ఏప్రిల్ 18న రూ.7.50లక్షల చెక్కును ఇచ్చారు. సుధాకర్ రెడ్డి ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా చెల్లుబాటు కాలేదు. దీంతో ఆయన 2025లో కేసు వేశారు. విచారణ అనంతరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో సదరు మహిళపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్షతో పాటు, రూ.7.50 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో ఫిర్యాది దారుని తరుఫున న్యాయవాది చిక్కా భీమేశ్వరరావు తన వాదనలను కోర్టులో వినిపించారు. -
కాయ్ రాజా కాయ్!
సాక్షి ప్రతినిధి,ఏలూరు: సంక్రాంతి జూద క్రీడకు సర్వం సన్నద్ధమైంది. కోడి పందేల బరుల్లో ప్రత్యేకంగా పేకాట శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తూ ముందుగానే శిబిరాలను ఖరారు చేసి విక్రయించడానికి వీలుగా అడ్వాన్సులు తీసుకుంటున్నారు. చిన్నపాటి బరుల్లో లక్షతో మొదలై భారీ బరుల్లో కోటిన్నర వరకు ధరకు జూదక్రీడలను ముందుగానే విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో కోడిపందాల బరుల్లో భారీగా పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వంద కోట్లపైన కోడిపందేలు జరిగే అవకాశం ఉండగా.. దానికి రెట్టింపు స్థాయిలో జూదక్రీడలు ఉండటం విశేషం. ఉమ్మడి పశ్చిమలో కోడి పందేల బరులు సిద్ధమవుతున్నాయి. మినీ స్టేడియాలను తలపించేలా అట్టహాసంగా ఏర్పాట్లు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఉండి, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలోని అత్యధికంగా కోడిపందేల బరులు ఏర్పాటవుతుండగా కై కలూరు, పోలవరం, దెందులూరులో భారీగా ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో చిన్నపాటి బరి నుంచి రూ.30 లక్షల వరకు పందేలు నిర్వహించే స్థాయిలో బరులు ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయ కోడి పందేల ముసుగులో కత్తులు కట్టి నిషేధిత కోడిపందాలు యథేచ్ఛగా ఒకవైపు నిర్వహించడానికి వీలుగా ఏర్పాటు చేస్తుంటే మరోవైపు పూర్తిగా నిషేధమైన జూదక్రీడలను భారీగా కొనసాగించేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగానే అమ్మకాలు పేకాటలో కోత ముక్క, లోన బయట, గుండాట శిబిరాలను ప్రతి బరిలో వేర్వేరుగా ఏర్పాటు చేస్తుంటారు. ముందస్తుగానే బరి రద్దీ, స్థాయి ఏర్పాటైన ప్రదేశాన్ని బట్టి ధరలను నిర్ణయిస్తుంటారు. భారీ బరుల్లో మూడు కలిపి రూ.50 నుంచి రూ.70 లక్షల ధరకు విక్రయిస్తుంటారు. వీటిలో నిర్వాహకులకు గుండాటలో అత్యధిక లాభాలు వస్తుంటాయి. భీమవరంలోని గొల్లవానితిప్ప, ఉండిలోని ఉండి, తాడేపల్లిగూడెం, దెందులూరు మండలంలో దుగ్గిరాల, చింతలపూడి, పాలకొల్లు, నర్సాపురం ఇలా ప్రధాన ప్రాంతాల్లో రూ.50 లక్షల నుండి రూ.5 కోట్ల స్థాయి పందేలు నిర్వహించే చోట అత్యధికంగా రూ.70 లక్షల ధరకు పేకాట శిబిరాలు విక్రయిస్తున్నారు. భీమవరం సమీపంలోని ఒక బరిలో గుండాటకు రూ.70 లక్షలు, పేకాటకు రూ.40 లక్షలు, కోతాటకు రూ.30 లక్షలు అడ్వాన్సులు తీసుకున్నట్లు సమాచారం. కోడి పందేల నిర్వాహకులకు జూద క్రీడలే ప్రధాన ఆదాయం. ఉదాహరణకు... కోటి రూపాయలు పందేలు జరిగే బరిలో మూడు రోజుల మీద 30 పందేలు నిర్వహిస్తే రూ.30 కోట్లు కోడి పందేలు జరిగితే అదే శిబిరంలో జూదక్రీడలు రూ.30 నుంచి రూ.40 కోట్ల స్థాయిలో జరుగుతుంటాయి. వాటిని ముందుగానే విక్రయించి సుమారు రూ.కోటి మేర నిర్వాహకులు వసూలు చేస్తారు. ప్రతి కోడి పందెంలో కోటికి రూ.10 లక్షల చొప్పున మెయింటెనెన్స్కు వసూలు చేస్తుంటారు. అతిథులకు భోజనాలు, బరి ఏర్పాట్లు, నిర్వహణ ఇలా అన్ని ఖర్చులు తీసి మిగిలింది నిర్వాహకుడి ఖాతాలో వేసుకుంటారు. ప్రస్తుతం జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకులో అత్యధిక ధరకు పేకాట శిబిరాలు అమ్ముడైనట్లు సమాచారం. పందెం బరుల్లో పేకాటకు భారీ డిమాండ్ అత్యధిక బరుల్లో ముందే పేకాట శిబిరాల అమ్మకం బరి స్థాయిని బట్టి ధరల నిర్ణయం చిన్న బరుల్లో రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకం గుండాటలో నిర్వాహకులకు భారీగా మిగులు కోడిపందేలను మించి పేకాట -
బరి కోసం చెట్ల నరికివేత
పెనుమంట్ర: పెనుమంట్ర మండలంలో సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహించేందుకు కూటమి నాయకులు భారీ ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటికే పెనుమంట్ర రజక పేట–జుత్తిగ రోడ్లో రైతుకు చెందిన పచ్చిక బీడులో నేలను చదును చేశారు. పంచాయతీరాజ్ రోడ్డును కూడా పార్కింగ్ కోసం లెవల్ చేశారు. బరి ఏర్పాటుకు ఇరువైపులా ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పెంచిన చెట్లను సైతం నరికేశారు. ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారుల అండదండలతోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీఎం నాయకుడు కేతా గోపాల్ విమర్శించారు. -
క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి
భీమవరం: భీమవరం ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ కళాశాలల క్రీడా పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జైత్ర 2026 పేరిట నిర్వహిస్తున్న స్పోర్ట్స్ కార్నివాల్కు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తే విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుందని అన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్వర్మ మాట్లాడుతూ ఈ పోటీల్లో పలు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో 100 టీంలు పాల్గొంటున్నాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దిలీప్ చక్రవర్తి, ఫిజికల్ డైరెక్టర్ పి సత్యనారాయణరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ సీహెచ్ హరిమోహన్, జి సారిక తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా కోళ్ల వ్యర్థాల తరలింపు
ఆగిరిపల్లి: మండలంలో ఇష్టానుసారంగా చేపల చెరువుల కోసం కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఆగిరిపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో పదుల సంఖ్యలో మాంసం దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజు చికెన్ దుకాణాల వద్ద నుంచి చేపల చెరువుల నిమిత్తం కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నారు. ఈ తతంగం మొత్తం ఉదయం పూట జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కోళ్ల వ్యర్థాల తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం: భర్త, అతని కుటుంబ సభ్యులపై ఓ వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎంవీ ప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన గంజి వనజకు జోషిబాబుతో 2024 జనవరిలో గన్నవరంలో వివాహమైంది. వివాహ సమయంలో రూ.5 లక్షల నగదు, 6 కాసుల బంగారం, చీర సారె కింద రూ.2 లక్షలు కట్నంగా ఇచ్చారు. చెడు వ్యసనాలకు బానిసైన జోషిబాబు వివాహం అయిన కొద్దిరోజుల నుంచి భార్య వనజను శారీరికంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీనికి అతని కుటుంబసభ్యులు ఆరుగురు సహకరిస్తున్నట్లు బాధితురాలు వనజ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. వీరవాసరం: శ్రీ కొల్లా భాస్కరమ్మ, శ్రీ గుండా లక్ష్మీ రత్నావతి మెమోరియల్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వాలీబాల్, క్రికెట్ పోటీలు బుధవారం వీరవాసరంలో ప్రారంభమయ్యాయి. నరసాపురం– నెల్లూరు జట్ల మధ్య, వీరవాసరం– బుట్టాయగూడెం, కొవ్వూరు– జంగారెడ్డిగూడెం జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. క్రీడాకారులు, క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి పోటీలను తిలకించారని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండా జయ ప్రకాష్ నాయుడు, ఎంపీపీ వీరవల్లి దుర్గ భవాని, గుండా రామకృష్ణ, కారింశెట్టి మూర్తి, బాజీంకి గంగా మహేష్, పీఎన్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బరుల తయారీలో టీడీపీ నేతలు
మండవల్లి : మండవల్లి మండలం ఉనికిలిలో సంక్రాంతి పండుగకు కోడిపందేల నిర్వహణకు టీడీపీ నాయకులు బరులు సిద్ధం చేస్తున్నారు. ఇంతవరకు గ్రామంలో సంక్రాంతికి పేకాట, కోడి పందేలు పెట్టిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల ప్రాంతంలో టీడీపీ నాయకులు కోడిపందేల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పేకాట కోడిపందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఏలూరు(మెట్రో): జెడ్పీ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్ చేసి ఖాతాదారులకు అందుబాటులో ఉంచాలని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు టి.రామారావు, జనరల్ సెక్రటరీ బి.రెడ్డిదొర కోరారు. బుధవారం జెడ్పీ సీఈవోకు వినతిపత్రం అందజేశారు. జెడ్పీ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్ చేయడం వల్ల ఖాతాదారులకు వారి ఖాతాలలో నిల్వల గురించి తెలియడంతో పాటు, మిస్సింగ్ క్రెడిట్స్ను వెంటనే సరి చూసుకునే అవకాశం కలుగుతుందన్నారు. రుణ దరఖాస్తులను సాధ్యమైనంత తొందరగా పరిశీలించి రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట) : విద్య ఒక్కటే అభివృద్ధికి మార్గమని, ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి మంచి ఫలితాలు సాధించడం ద్వారా కుటుంబ, దేశ అబివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. యువజన అవగాహన వారోత్సవాల్లో భాగంగా కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బుధవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు కష్టపడి విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడతారని, వారి కలలు సాకారం చేయడానికి తమవంతు కృషిచేయాలని సూచించారు. నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. సెలవుల అనంతరం ఈనెల 19న ట్రిపుల్ ఐటీల్లో తరగతులు పునఃప్రారంభమవుతాయన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి విద్యార్థినులు తమ ఇళ్లకు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి 45 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భీమవరం(ప్రకాశం చౌక్): ఏపీఎన్జీవో పశ్చిమగోదావరి జిల్లా అసోసియేషన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భీమవరంలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా యువీ పాండురంగారావు, కార్యదర్శిగా సుకుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్గా అల్లూరి శ్రీనివాసరాజు, ట్రెజరర్గా కృష్ణప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా హరిప్రసాద్బాబు, 17 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఉమెన్ వింగ్ చైర్మన్గా కె.గౌరి, కన్వీనర్గా పి.కిర్తీ, క్యాషియర్గా సీహెచ్.ధనలక్ష్మీ, 14 మంది సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ఏలూరు జిల్లా అధ్యక్షుడు చొడగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తెగ తాగేశారు
ఏలూరు టౌన్ : టీడీపీ సర్కారు ప్రజారోగ్యాన్ని పక్కనబెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. మందుబాబులకు లిక్కర్ను నిత్యం అందుబాటులో ఉంచుతోంది. గత రెండేళ్ళుగా జిల్లాలో మద్యం విక్రయాల జోరు పెరిగింది. ఒకవైపు వైద్యసేవలను నిర్లక్ష్యం చేస్తూ...మరోవైపు సంక్షేమాన్ని పక్కనబెట్టింది. కేవలం ఆదాయమే పరమావధిగా టీడీపీ నేతలు మద్యం విక్రయాలను భారీగా పెంచేశారు. ప్రతి లిక్కర్ షాపుకు అనుసంధానంగా సిట్టింగ్ రూమ్లు ఏర్పాటు చేసి మరీ మద్యం రోజంతా అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేటు మద్యం దుకాణాల యజమానుల పంట పండింది. ఏలూరు జిల్లాలో మద్యం షాపులు మందుబాబులతో కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 155 ప్రైవేట్ మద్యం షాపుల్లో మద్యం నిత్యం అందుబాటులో ఉంటోంది. ఏడాది డిసెంబర్లో రికార్డు స్థాయిలో మద్యం సేల్స్ జరుగుతున్నాయి. డిసెంబర్ 31న ప్రభుత్వం మద్యం దుకాణాలకు అర్థరాత్రి 12 గంటల వరకూ విక్రయాలకు అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. రెండు రోజుల్లో రూ.14.60 కోట్లు ఏలూరు జిల్లాలో డిసెంబర్ 31, జనవరి 1న అమ్మకాలు ఏటా పెరుగుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకల పేరుతో మందుబాబులు, యువత భారీఎత్తున మద్యం తాగుతున్నారు. ప్రైవేటు మద్యం షాపులకు మందుబాబుల ఉత్సాహం కాసులు కురిపిస్తోంది. 2025 డిసెంబర్ 31, 2026 జనవరి 1న జిల్లాలో ఏకంగా రూ.14.60 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. 31న మద్యం కేసులు –7891, బీర్ల కేసులు – 4286 అమ్మకాలు చేయగా, కొత్త ఏడాది మొదటి రోజున 7234 మద్యం కేసులు, 3985 కేసుల బీర్లు తాగేశారు. 2023 డిసెంబర్లో విక్రయాలు – రూ.101.62 కోట్లు 2024 డిసెంబర్లో విక్రయాలు – రూ.110.75కోట్లు 2025 డిసెంబర్లో విక్రయాలు – రూ.118.26కోట్లు 2023 డిసెంబర్ 31న అమ్మకాలు – రూ. 6.54 కోట్లు 2024 డిసెంబర్ 31న – రూ.7.34కోట్లు 2025 డిసెంబర్ 31న – రూ. 8.12కోట్లు ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ప్రైవేటు మద్యం షాపులు 155 ఉండగా, మరో 20 బార్లకు లైసెన్సులు మంజూరు చేశారు. ఇక ప్రైవేటు మద్యం దుకాణాల్లో నెలకు సరాసరి రూ.95 కోట్ల నుంచి గరిష్టంగా రూ.118 కోట్ల వరకూ విక్రయాలు చేయడం గమనార్హం. శీతాకాలంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మద్యం సేల్స్ అధికంగా ఉంటే.. వేసవిలో చల్లటి బీర్లు తాగేందుకు మందుబాబులు ఎగబడుతున్నారు. ఏలూరు జిల్లాలో 2025 ఏడాదిలో సరాసరిన రూ.1140 కోట్ల నుంచి రూ.1250 కోట్ల వరకూ మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ సర్కారు మద్యం ఆదాయంపై మాత్రమే దృష్టి పెట్టిందని, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. రెండు రోజుల్లో రూ.14.60 కోట్ల అమ్మకాలు డిసెంబర్లో రూ.118 కోట్ల విక్రయాలు ఏలూరు జిల్లాలో ఏరులై పారుతోన్న మద్యం -
తవ్వేద్దాం.. దోచేద్దాం
బ్రో.. రెడ్ సిగ్నల్ పడింది ట్రాఫిక్ నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాహనదారులు రూల్స్ పాటించడం లేదు. సిగ్నల్ రూల్స్ సైతం పాటించకుండా ప్రయాణం సాగిస్తున్నారు. 8లో uబుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026నియోజకవర్గంలోని ర్యాంపులన్నీ సీఆర్జెడ్ పరిధిలో ఉండటంతో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు. అధికారులను అడుగుతుంటే అనుమతులు లేవంటున్నారే తప్ప అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మేటలు, నదీ గర్భంలో తవ్వకాలు చేయడం వలన భూగర్భ జలాల్లో ఉప్పునీటి సాంద్రత పెరిగి స్థానిక ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మాజీ మంత్రి ఏలూరు (టూటౌన్): ఏలూరు అటవీ విభాగంలో క్యాంపా పథకంలో 13 వాహనాలు కొనుగోలు చేసినట్లు జిల్లా అటవీశాఖాధికారి సందీప్ రెడ్డి తెలిపారు. అటవీ సంరక్షణ, రక్షణ, అగ్నిప్రమాదాల నియంత్రణ, చెట్ల కొట్టివేత అడ్డుకోవడం, వన్యప్రాణుల సంరక్షణ, క్షేత్రస్థాయిలో వేగవంతమైన పర్యవేక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ వాహనాలు దోహదపడతాయన్నారు. అటవీ వనరుల పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు. ఏలూరు (టూటౌన్): ఈ నెల 11న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యులు ఏలూరు గిరిజన భవన్కు రానున్నారని ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ ఆలిండియా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం వెంకటేశ్వర్ల బృందం కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డిని ఏలూరు ఆస్పత్రి సెంటర్లో కలిసి ఆహ్వానించింది. చైర్మన్, సభ్యులకు అభినందన సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏలూరు (టూటౌన్): జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దని, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ, ఎన్ఎస్ రామరాజు ప్రారంభించిన జనచైతన్య యాత్ర ఏలూరు చేరుకుంది. జనవరి 3న విశాఖపట్నంలో మొదలుపెట్టిన రైడ్ 8న తేదీన తిరుపతి చేరుకుంటుందని జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం ప్రధాన కార్యదర్శి కాళే శ్రీనివాసరావు తెలిపారు. ఆశ్రం ఆసుపత్రి వద్ద యాత్రకు బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం నాయకులు స్వాగతం పలికారు. సాక్షి, భీమవరం: మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఇలాకాలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా ఉంది. గతేడాది కోట్లాది రూపాయల ఇసుకను తరలించేసిన అక్రమార్కులు ఇప్పుడు అదే పనిలో పడ్డారు. తీరం వెంట తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నారు. కోడేరులో బాటలు సిద్ధం చేస్తుండగా వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని సిద్ధాంతం నుంచి బియ్యపుతిప్ప వరకు ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల పరిధిలో వశిష్ట గోదావరిలో ఆరు ఓపెన్ రీచ్లు, ఐదు డీసిల్టేషన్ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు జరిగేవి. సముద్రపు ఆటుపోట్లతో ఈ ప్రాంతంలో ఇసుకలో ఉప్పునీటి సాంద్రత ఎక్కువగా ఉండి నిర్మాణ పనులకు అనుకూలంగా లేకపోవడటం, తీరప్రాంత పరిరక్షణలో భాగంగా రెండేళ్ల క్రితం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్జెడ్) ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. అప్పటినుంచి ఈ ర్యాంపులు తెరుచుకోలేదు. ఇదే అదునుగా టీడీపీ నేతలు చక్రం తిప్పారు. సాధారణంగా ఇసుక తవ్వకాలు చేయాలంటే ఇరిగేషన్, మైనింగ్, పొల్యూషన్, రెవెన్యూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతులు తప్పనిసరి. తీరప్రాంతం కోతకు గురికాకుండా ఇసుక మేట వేసిన చోట పరిమిత అడుగుల లోతున జట్టు కార్మికులతో పగటిపూట మాత్రమే తవ్వకాలు, లోడింగ్ చేయాలి. ఏ విధమైన అనుమతులు లేకుండానే సిద్దాంతం నుంచి నరసాపురం వరకు గతంలో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోయాయి. ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుకాసురుల ఇష్టారాజ్యం అయ్యింది. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయినర్లతో నదీగర్భంలో రెండు మూడు మీటర్లు లోతున ఇసుకను తవ్వి కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొట్టారు. లోడింగ్ రూపంలో బయట అమ్మకాలు చేయడంతో పాటు ఎక్కడికక్కడ అనధికార స్టాకులు పెట్టి వరదల సమయంలో అధిక ధరలకు అమ్ముకున్నా అధికారులు కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలు ఉన్నాయి. బాటలకు సన్నాహాలు : గోదావరిలో వరద ప్రభావం తగ్గడంతో సిద్ధాంతం, నడిపూడి, కోడేరు, కరుగోరుమిల్లి తదితర చోట్ల ఇసుక మేటలు బయటపడుతున్నాయి. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. గోదావరిలోకి లారీల రాకపోకలకు వీలుగా బాటలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే కోడేరు వద్ద గతంలోని వరదలకు కొట్టుకుపోయిన పాత బాటను రాళ్లు వేసి పొక్లెయిన్లతో సరిచేస్తున్నారు. భీమవరం: ఎరువుల డీలర్లు, రైతులు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనుగోలు చేయాలని ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల తయారీ కంపెనీల ప్రతినిధులు, హోల్ సేల్, రిటైల్ డీలర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.బాట పనుల కోసం తీసుకొచ్చిన పొక్లెయిన్ గతేడాది తవ్వకాలు చేస్తున్న దృశ్యం (ఫైల్) టీడీపీ నాయకుడి పాత్రపై ఆరోపణలు కొయ్యలగూడెం: యువకుడిపై సమీప బంధువైన ఓ వ్యక్తి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొయ్యలగూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై వి.చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం సత్యసాయినగర్కి చెందిన రాచూరి రవితేజ ఈ నెల 5న రాత్రి ఇంటి వద్ద ఉండగా సమీప బంధువైన అంగడాల నాగరాజు బీరు సీసాతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రవితేజ ముఖంపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. రవితేజ తండ్రి సుబ్బారావు మాట్లాడుతూ తనకు, టీడీపీ నాయకుడైన తన అన్నకు మధ్య కోర్టు తగాదాలు ఉన్నాయని, తన అన్న బావమరిది నాగరాజు రాజీ పడాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పారు. తన అన్న ప్రోద్బలంతో తన కుమారుడిపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. ఏలూరు (టూటౌన్): సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు దక్షి ణమధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న విశాఖపట్నం–చర్లపల్లి (08513), 19న చర్లపల్లి–విశాఖపట్నం(08514) ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపారు. పలు ప్రత్యేక రైళ్లు రద్దు : సంక్రాంతి సందర్భంగా ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్ళను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13న నడవాల్సిన నర్సాపూర్–చర్లపల్లి, 17న నడవాల్సిన చర్లపల్లి–నర్సాపూర్, 19న వికారాబాద్–చర్లపల్లి, వికారాబాద్–కాకినాడ టౌన్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 20న వికారాబాద్–నర్సాపూర్, వికారాబాద్–కాకినాడ టౌన్ రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కోడేరు వద్ద బాట ఏర్పాటు చేస్తుండటంతో స్థానిక వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం తెలిసి బాట సిద్ధం చేస్తున్నవారు పొక్లెయినర్లను లంకల్లోకి తరలించేశారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ నేతలు తహసీల్దార్ సోమేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తే సహించేది లేదని, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా అడ్డుకుంటామన్నారు. బాట ఏర్పాటుపై మైనింగ్శాఖ అధికారులు స్పందిస్తూ కోడేరు ప్రాంతంలో తనిఖీలు చేశామని, అయితే అక్కడ ఇసుక తవ్వకాలు చేస్తున్నట్టు ఆధారాలు దొరకలేదని, రాళ్లతో ఉన్న మట్టి దిబ్బలు, మధ్యలో అక్కడక్కడ కొట్టుకుపోయిన పాత బాట కనిపించినట్టు పేర్కొనడం గమనార్హం. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు సన్నాహాలు గోదావరి తీరం వెంట పాత ర్యాంపుల్లో బాటలు సిద్ధం చేసే పనిలో టీడీపీ నేతలు కోడేరులో యంత్రాలతో బాటలు అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు గతేడాది అక్రమ తవ్వకాలతో కోట్లాది రూపాయలు స్వాహా -
తణుకు ప్రభుత్వ కళాశాలకు ఐఎస్వో ధ్రువీకరణ
తణుకు అర్బన్: తణుకు చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ కళాశాల పలు విభాగాల్లో ఐఎస్వో ప్రమాణాల్లో ధ్రువీకరణ సాధించిందని ప్రిన్సిపాల్ సీహెచ్ ఏడుకొండలు తెలిపారు. పర్యావరణ నిర్వహణ, విద్యా సేవల నాణ్యత, ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రమాణాల్లో ధ్రువీకరణ పొందినట్లు చెప్పారు. ఈ ధ్రువీకరణలు హైదరాబాద్కు చెందిన హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ద్వారా జారీ చేయబడినట్లు స్పష్టం చేశారు. ఇది కళాశాల నాణ్యతా ప్రమాణాలకు అంతర్జాతీయ గుర్తింపు అని అన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమష్టి కృష్టితో ఈ ఘనత సాధ్యమైనట్లుగా వివరించారు. నరసాపురం: రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏలూరు సీఆర్రెడ్డి కళాశాల గ్రౌండ్లో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన క్రికెట్ బాలుర టాలెంట్ స్పాటింగ్లో నరసాపురం పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. పట్ణణంలోని రుస్తుంబాద బాలాజీ క్రికెట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న మామిడి వెంకట నవసూర్య, యర్రంశెట్టి దేవకీనందన్ ఎంపికయ్యారు. త్వరలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు. మండవల్లి: గోడౌన్లో సిగరెట్ బాక్సుల చోరీ జరిగిన ఘటన లోకుమూడిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లోకుమూడిలో రత్న ఎంంటర్ప్రైజస్ పేరిట నిత్యావసర సరుకుల గోడౌన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 6న ఉదయం యజమాని గోడౌన్ వద్దకు వెళ్లగా షట్టర్ వంచబడి లాకులు తెరిచి ఉన్నాయి. లోపలకి వెళ్లి చూడగా 11 గోల్డ్ఫ్లాక్ సిగరెట్ బాక్సులు చోరీ జరిగినట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలియజేశారు. దీనిపై బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం: భీమవరరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీంగ్ కళాశాలలో ఈ నెల 7వ తేదీ నుంచి మూడు రోజులపాటు అంతర్ రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాలల మెన్ అండ్ ఉమెన్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బీహెచ్వీఎస్ రామకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి మంగళవారం చెప్పారు. కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుధవారం ఉదయం 10 గంటలకు పోటీలను కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభిస్తారన్నారు. వాలీబాల్, కబడ్డీ, పికిల్ బాల్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. తణుకు అర్బన్: ప్రపంచ తెలుగు సభల్లో తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపునకు గోల్డ్ మెడల్ దక్కింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 5 తేదీల్లో గుంటూరులో శ్రీ సత్య సాయి స్పిరిచ్యువల్ సిటీ నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వందకు పైగా చిత్రకారులు పాల్గొని కళాఖండాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో తాను ఎఫెక్షన్ శీర్షికతో రూపొందించిన చిత్రానికి గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందుకున్నట్లు వెంకటాపు వివరించారు. చిత్రకళా ప్రదర్శన కోఆర్డినేటర్ కళారత్న ఎస్.విజయ్కుమార్, అమీర్ ఆర్ట్ అకాడమీ కార్యదర్శి డాక్టర్ అమీర్ జాన్, డ్రీమ్ ఆర్ట్ అకాడమీ డైరెక్టర్ పెరపోగు రమేష్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ చిత్రకారులు కొండూరి నాగేశ్వరరావు, మారేడు రాము, మధు కురువ చేతులమీదుగా గోల్డ్మెడల్ అందుకున్నట్లు చెప్పారు. -
పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలు
● 3 నెలలుగా జీతాలు లేక అవస్థలు ● 18 నెలల పీఎఫ్ బకాయి ● రెండు కాంట్రాక్ట్ సంస్థల దోబూచులాట ఏలూరు టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తోన్న శానిటరీ కార్మికులు ఆకలి కేకలు సర్కారుకు వినిపించడం లేదు. రెండు కాంట్రాక్ట్ సంస్థలు ఆర్థిక కారణాలతో కోర్టుల కెక్కి కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకునే కుట్రలు చేయటంపై వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మూడు నెలలుగా జీతాలు లేకపోవటంతో కుటుంబాలు పండుగ పూట పస్తులు ఉండాల్సిన దైన్యస్థితి ఏర్పడిందని కార్మికులు బాధ పడుతున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు తమ ఆరోగ్యాలను సైతం ఫణంగా పెట్టి సేవలందిస్తుంటే.. ప్రభుత్వం తమపై ఏమాత్రం కనకరం చూపటంలేదంటూ మానసిక ఆవేదనకు గురవుతున్నారు. గతంలో పనిచేసిన ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, కొత్తగా కాంట్రాక్ట్ సంస్థ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల యాజమాన్యాల ఆర్థిక లావాదేవీల గొడవల మధ్య శానిటరీ కార్మికులు నలిగిపోతున్నారు. కార్మికుల వెతలు పట్టవా ? ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తోన్న శానిటరీ కార్మికుల కష్టాలు తీర్చే నాథుడే కానరావటం లేదు. సర్వజన ఆసుపత్రితోపాటు రెండు జిల్లాల్లోని ఏరియా హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్లో సుమారు 368 మంది శానిటరీ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా 3 నెలలుగా జీతాలు లేక జీవనం కష్టంగా మారిందని ఆవేదధన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కాంట్రాక్ట్ సంస్థ సుమారుగా రూ.1.32 కోట్ల జీతాల బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెలలో జీతాలు వేస్తారని ఆశించినా ఫలితం లేదంటున్నారు. రూ.4.68 కోట్ల పీఎఫ్ బకాయిలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కలిపి జోన్–2 గా పరిగణిస్తారు. ఈ జోన్–2 పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్లో శానిటరీ వర్కర్లకు 18 నెలలుగా పీఎఫ్ బకాయిలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ సంస్థ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో శానిటరీ వర్కర్కు నెలకు రూ.2 వేల పీఎఫ్గా కటింగ్ చేస్తారు. జోన్–2 పరిధిలో సుమారుగా 1300 మందికి పైగా శానిటరీ వర్కర్లు పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం లేదంటున్నారు. కేవలం జోన్–2లో కాంట్రాక్ట్ సంస్థ పీఎఫ్ బకాయిలు సుమారుగా రూ.4.68 కోట్లు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో జీతాలు, పీఎఫ్ బకాయిలు పేరుకుపోయినా అధికారులు అలసత్వం వహిస్తున్నారు. -
వైభవంగా శ్రీవారి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలు శ్రీవారి వైభవాన్ని చాటుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారికి నిర్వహించిన తిరువీధి సేవ భక్తులకు కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజ గోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనం అయింది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. ఆఖరిలో ఆలయ ప్రధాన కూడలిలో ఉన్న ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పెదపాడు: కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు పెదపాడు పోలీసులు తెలిపారు. మండలంలోని వడ్డిగూడెం గ్రామానికి కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పెదపాడు ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేసి వాహనం సీజ్చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపారు. -
ధర్మ పోరాటానికి సీఐటీయూ మద్దతు
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిర్వహిస్తున్న ధర్మ పోరాట దీక్ష మంగళవారం నాటికి 14వ రోజుకు చేరింది. దీనిలో భాగంగా ఐ3 బిల్డింగ్ వద్ద అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోరాట దీక్ష నిర్వహించారు. ఈనెల 7న చాన్సలర్ను కలిసి చర్చలు జరపనున్న నేపధ్యంలో చర్చల అనంతరం చేపట్టాల్సిన కార్యాచరణను నిర్ణయిస్తామని వారు పేర్కొన్నారు. వీరి ధర్మ పోరాట దీక్షకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలను, న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. నేటి నిత్యవసర ధరలకు అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కారం అయితేనే విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు దృష్టి సారించగలరని నిజాన్ని పాలకులు గుర్తించాలన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు జాడ సీతాపతిరావు, పీవీ లక్ష్మణరావు, జడ సుబ్బారావు, రాజేష్ పాల్గొన్నారు. -
యువకుడిపై హత్యాయత్నం
ఆకివీడు: ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగిన ఘటన ఆకివీడు మండలంలోని కోళ్లపర్రు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడి తల్లిదండ్రులు సరోజనీ, బుల్లియ్య తెలిపిన వివరాల ప్రకారం కోళ్లపర్రు గ్రామ శివారు సగర్లపేటకు చెందిన గండికోట శివ సోమవారం రాత్రి ఆకివీడు వెళ్లి గ్రామానికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు కాపుకాసి దాడి చేశారు. దీంతో అతడి తలకు, ఛాతిపైన, కుడి చేతి భుజం ఎముకకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న శివను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీహెచ్సీలో చికిత్స చేయించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. బాధితుడి వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. దీనిపై ఆసుపత్రి నుంచి తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఆదాయంలో ఎదురులేని వెదురు
● జిల్లాలోని మన్యంలో 5,381 ఎకరాల్లో వెదురు వనరు ● ప్రతి ఏటా అక్టోబర్ నుంచి జూన్ వరకూ వెదురు కర్రల కటింగ్ ● ఒక్కసారి నరికినా మూడేళ్లలో మళ్లీ పెరుగుదల బుట్టాయగూడెం: వెదురును పచ్చ బంగారం అంటారు. వెదురు బొంగులను కోష్టాలు, పందిళ్ల నిర్మాణానికి, ఇంటి పైకప్పులకు వాడతారు. నిచ్చెనల తయారీకీ ఉపయోగిస్తారు. వెదురును బద్దలుగా చీల్చి పలు రకాల వస్తువులను తయారు చేస్తారు. బుట్టలు, తట్టలు, గంపలు, చేటలు మొదలైనవి వెదురుతోనే చేస్తారు. వెదురు కలప పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని అడవిలో వేల ఎకరాల్లో సహజ సిద్ధంగా విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో వెదురు కూపులు పచ్చదనంతో ఎత్తయిన చెట్లతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. ఈ వెదురు కర్రలను ప్రతి ఏటా అక్టోబర్ నెల నుంచి జూన్ నెలాఖరు వరకూ నరికించి జంగారెడ్డిగూడెంలో ఉన్న అటవీశాఖ వెదురు డిపోకు తరలించి అక్కడ వెదురు కర్రలను వేలం వేస్తారు. మన్యంలో 5,381 ఎకరాల్లో వెదురు వనాలు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, కన్నాపురం అటవీ రేంజ్ పరిధిలో ఉన్న బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఉన్న అటవీ పరిధిలో సుమారు 5,318 ఎకరాల్లో వెదురు వనాలు ఉన్నాయి. బుట్టాయగూడెం మండలంలోని రేగులపాడు, ముంజులూరు, మోతుగూడెం, పోలవరం మండలంలోని కొల్లుమామిడి–1, 2 గుమ్ములూరు, తదితర ప్రాంతాల్లో వెదురు కొమ్ములను అటవీశాఖ అధికారులు పెంచుతున్నారు. వీటిలో ఒక్కో కూపును మూడు కూపులుగా విభజించారు. వెదురు బాగా పెరిగిన తర్వాత వాటిని అధికారులు నరికిస్తారు. అయితే వీఎస్ఎస్ కూపులుగా కూడా ఉన్నాయి. బుట్టాయగూడెం మండలంలోని ఒర్రింక, ముంజులూరు, రేగులపాడు, చింతపల్లి, రేపల్లె అటవీ ప్రాంతంలో కూడా వెదురు వనాలు ఉన్నాయి. ఒక్కసారి నరికిన ప్రదేశంలో తిరిగి మళ్లీ మూడేళ్లకు వెదురు తయారవుతుంది. దానిని కూడా అటవీశాఖ అధికారులు కూలీలతో నరికిస్తారు. ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో వెదురు నరికే కార్యక్రమాన్ని అధికారులు చేపడతారు. ఇక్కడ నరికిన వెదురు కర్రలను లారీల్లో ఆరు నెలల పాటు జంగారెడ్డిగూడెం అటవీశాఖ డిపోకు తరలిస్తారు. ప్రస్తుతం వెదురు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ నరికిన వెదురు కర్రలను లారీల్లో గిరిజనులు జంగారెడ్డిగూడెం డిపోకు తరలిస్తున్నారు. 200 కొండరెడ్డి కుటుంబాలకు జీవనోపాధి పశ్చిమ ఏజెన్సీప్రాంతంలోని మారుమూల కొండరెడ్డి గిరిజన గ్రామాల్లో ఉపాధి అవకాశాలు ఉండవు. పూడు వ్యవసాయమే వారికి ఆదాయం. అది కూడా కేవలం తిండి గింజలు సమకూర్చుకోవడానికే తప్ప ఆదాయం కోసం కాదు. బుట్టాయగూడెం కుక్కునూరు, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు మండలాల పరిధిలో సుమారు 200 కొండరెడ్డి గిరిజన కుటుంబాలు వెదురు కలప నరికివేత జీవనోపాధి కల్పిస్తుంది. ప్రతి ఏటా అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే ఈ వెదురు కలపను కొండరెడ్డి గిరిజనులకు ఆరు నెలలపాటు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. -
అయోమయంగా ఉపాధి పనులు
ముసునూరు మండలంలో పనులు చేయకుండానే ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులు చర్చనీయాంశంగా మారింది. సామాజిక తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. 8లో uఏలూరు (టూటౌన్): బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా గత డిసెంబర్ 3 నుంచి 100 రోజులపాటు బాల్య వివాహాల నిరోధంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కోసం గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొనే సీతారాం పాల్గొన్నారు. -
రెడ్ సిగ్నల్ పడితే మాకేంటి!
ఏలూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు, క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నా వాహనదారులు మాత్రం రూల్స్ పాటించడం లేదు. సిగ్నల్ రూల్స్ సైతం పాటించకుండా ఇష్టారాజ్యంగా ప్రయాణం సాగిస్తూ ప్రమాదాలకు ఎదురు వెళుతున్నారు. రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా వెళ్లిపోవడం.. ఆపిన కానిస్టేబుల్తో వాగ్విదానికి దిగడం షరా మాములైపోయింది. రూల్స్ పాటించండి.. క్షేమంగా ఇంటికి వెళ్లండి అంటూ ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టినా మనకేమిటిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏలూరు ప్రధాన కూడలి అయిన ఫైర్స్టేషన్ సెంటర్, పాతబస్టాండ్ సెంటర్లో సిగ్నల్ పడినా ఆగకుండా ప్రయాణాలు సాగిస్తున్న దృశ్యాలు ఇవి. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
కార్మికుల కష్టాలు పట్టవా ?
ఆర్థిక లావాదేవీల గొడవలతో రెండు కాంట్రాక్ట్ సంస్థలు కోర్టుకు వెళ్లటంతో కార్మికుల జీతాల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని కార్మికుల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయాలి. కుటుంబ పోషణకు శానిటరీ పనులు చేసే కార్మికులను పండుగ రోజుల్లో పస్తులు ఉంచటం దారుణం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వందలాది కార్మిక కుటుంబాల ఆకలితో అలమటించే దుస్థితి నెలకొంది. – కె.కృష్ణమాచార్యులు, జిల్లా అధ్యక్షుడు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ యూనియన్ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తోన్న పేద కుటుంబాలపై అధికారులు మానవత్వం చూపించాలి. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేసే శానిటరీ వర్కర్లకు మాత్రం శాపంలా మారింది. మూడు నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్ట్ సంస్థలు కోర్టుల్లో కేసులు వేసుకుని, కార్మికులను ఇబ్బందులకు గురిచేయటం దారుణం. పీఎఫ్ బకాయిలు సైతం 18 నెలలుగా ఇవ్వకుండా మోసం చేశారు. – తుర్లపాటి బాబు, చింతలపూడి ఏరియా కార్యదర్శి, ఏఐటీయూసీ -
ఉపాధి పనుల్లో అవకతవకలు
● పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపులు ● ఉపాధి హామీ సామాజిక తనిఖీల్లో వెల్లడి ● రికవరీకి ఆదేశించిన అధికారులు ముసునూరు: ప్రభుత్వ పథకాన్ని సవ్యంగా అమలు చేయకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించబోనని సోషల్ ఆడిట్, పబ్లిక్ హియరింగ్ ప్రొసీడింగ్ అధికారి పురుషోత్తం ఉపాధి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 16 గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనుల 18 వ విడత సామాజిక తనిఖీలపై ప్రజావేదిక కార్యక్రమాన్ని స్థానిక ఉపాధి హామీ కార్యాలయం వద్ద ఎంపీడీఓ పి.ఏసుబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీల్లో పలు గ్రామాల క్షేత్ర సహాయకులు, సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల్లో నాణ్యతాలోపం, అవగాహన లేమి, బిల్లుల చెల్లింపుల్లో ఉన్న ఆరాటం, ఆత్రుత తదితర అంశాలు వెల్లడయ్యాయి. రహదారి వేయకుండానే.. 61 మీటర్ల రహదారి వేసినట్లు బిల్లుల చెల్లింపు, కూలీలు పనికి రాకపోయినా హాజరువేయడం, వేలి ముద్రలు వేయకున్నా వేతనాల చెల్లింపులు, మొక్కలు వేయకుండానే.. వేసినట్లు లెక్కలు చూపడం, తదితర తప్పులు బహిర్గతం అయ్యాయి. 2,467 పనులు నిర్వహించగా, వాటిపై జరిమానాలు రూ.44 వేలతో కలిపి మొత్తం రూ.51 వేలు రికవరీలకు జిల్లా విజిలెన్స్ అధికారిణి అనుపమ ఆదేశించారు. అనంతరం ప్రొసీడింగ్ అధికారి పురుషోత్తం మాట్లాడుతూ సిబ్బంది సక్రమంగా పనిచేయకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో అవసరమైన సమగ్ర సౌకర్యాలు చేపట్టాలని, ఎక్కువ మందిని సమకూర్చాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కొండా దుర్గాభవాని, వైస్ ఎంపీపీ రాజానాయన, ఏపీడీ శ్రీనివాస్, అంబుడ్స్మెన్ మహబూబ్ బాషా, మణికంఠ, స్టేట్ రిసోర్స్ పర్సన్స్, ఏపీఓ రోజ్లీల, టీఏలు, ఎఫ్ఏలు పాల్గొన్నారు. -
మా భూముల కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
ఏలూరు (టూటౌన్): మా ప్రాణాలైనా అర్పిస్తాం.. కానీ మా భూములను మాత్రం నావీ ఆయుధ కర్మాగారానికి ఇచ్చేది లేదంటూ కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, బర్కెట్ నగరం, మంగపతిదేవిపేట, ఊట్లగూడెం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం రేగులగుంట గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ కొయ్యలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీ పరిధిలోని బర్కెట్నగరం ప్రాంతంలోని 1,166 ఎకరాల్లో నావీ ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడం దారుణమన్నారు. దీని వల్ల ఐదు గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు రోడ్డు పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తామంతా జీవనోపాఽధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కనీసం రైతుల అనుమతి తీసుకోకుండా, గ్రామసభలు నిర్వహించకుండా భూములను బలవంతంగా లాక్కోవాలని చూడటం దుర్మార్గమన్నారు. భూములను ఇచ్చేందుకు తామెవరికీ ఇష్టం లేదని స్పష్టం చేశారు. రైతుల అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్ను కోరారు. తమకు న్యాయం చేయకపోతే ఎంతటి పోరాటానికై నా సిద్ధమన్నారు. -
మందు వికటించి 19 గొర్రెలు మృతి
ఉంగుటూరు: ఉంగుటూరు మండలం ఎ.గోకవరంలో జలగ మందు వికటించడంతో 19 గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఆకుల గంగరాజు 50 గొర్రెలకు జలగ నివారణ మందును ఆదివారం పట్టించారు. ఆదివారం సాయంత్రానికి 12 గొర్రెలు చనిపోయాయి. సోమవారం మరో 7 గొర్రెలు చనిపోయాయి. విషయం పశు సంవర్ధక శాఖ అధికారులకు తెలియడంతో చేబ్రోలు, కై కరంలోని పశువైద్యులు అప్రమత్తమయ్యారు. గొర్రెలను చేబ్రోలు తెప్పించుకుని 30 గొర్రెలకు వైద్యం చేయించారు. ఆ గొర్రెలు తేరుకుంటున్నాయి. గొర్రెలు ఎందుకు చనిపోయాయో తెలుసుకోడానికి ఏలూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. సోమవారం సాయంత్రానికి నివేదిక రాగా.. ఎక్కువ మోతాదులో మందు వాడటం వల్ల గొర్రెలు చనిపోయినట్లు తేలిందని చేబ్రోలు పశువైధ్యాదికారి కిషోర్ వివరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు చేబ్రోలు పశువులు ఆసుపత్రి వద్దకు వెళ్ళి బాధిత రైతులను పరామర్శించారు. -
108 ఉద్యోగుల సమ్మె సైరన్
భీమవరం(ప్రకాశం చౌక్): కుయ్.. కుయ్.. అంటూ ఆపదలో ఉన్న వారి చెంతకు నిమిషాల్లో చేరి ప్రాణాలు రక్షించే 108 అంబులెన్స్ సేవలకు అంతరాయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం 108 వాహన ఉద్యోగులు నెలలు తరబడి ఎదురుచూస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతనెల 25 వరకు ఎదురుచూసిన ఉద్యోగులు పోరాటబాట పట్టారు. ఆరోగ్యశ్రీ లేబర్ కమిషనర్కు గతనెల 26న సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు. అలాగే సమస్యలతో కూడిన 18 డిమాండ్లను పొందుపర్చారు. అయితే సమస్యల పరిష్కారానికి చ ర్చలు జరుగుతున్నా సఫలం కాలేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 108 వాహన సిబ్బంది మొత్తం 203 మంది పనిచేస్తున్నారు. డిమాండ్లు ● ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.4 వేలల్లో రూ.2 వేలు మాత్రమే పెంచి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆర్ ఎఫ్పీ ప్రకారం ఈపీఎఫ్ఓ యాజయాన్య వాటాను యాజమాన్యమే చెల్లించాలని చెప్పినా ఇప్పటికీ పట్టించుకోలేదు. ● గత సర్వీసు ప్రొవైడర్ ఇప్పటికీ పుల్, ఫైనల్ సెటిల్మెంట్ చేయకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. ● పోలీస్ ఎఫ్ఐఆర్ ఉందని, ఫీల్డ్ విజిట్లో పలురకాల పనిష్మెంట్ల పేరుతో భవ్య సంస్థ ఉద్యోగుల విధులను నిలుపుదల చేయడం లేదా టెర్మినేషన్ చేయడం చేస్తోంది. ఇలా టెర్మినేట్ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ● ఉద్యోగులను తొలగించకుండా మెరుగైన ట్రైనింగ్ ఇవ్వాలి. ● భవ్య సంస్థ వచ్చి 7 నెలలు పూర్తయినా ఏ ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకపోవడం, జీతాలపై స్పష్టత లేకపోవడంపై తీవ్ర ఆందోళన నెలకొంది. ● 5 నుంచి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి వెంటనే ఆటోమెటిక్ శ్లాబ్ అప్గ్రేడ్ చేయాలి. ● భవ్య సంస్థ పనిష్మెంట్ కాలాన్ని చూపుతూ జీతాన్ని తగ్గించడం మానాలి. శ్లాబ్కు అనుగుణంగా వేతనాలు చెల్లించాలి. ● గత సర్వీస్ ప్రొవైడర్ రిలీవింగ్ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదు. గతంలో మాదిరిగా షిఫ్ట్కు రూ.200 చెల్లించాలి. ● కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగా ఫెస్టివల్ హాలిడేస్ ప్రయోజనాలు అందించాలి. ● సిబ్బంది నియామకం చేపట్టాలి. ● వాహనాల మరమ్మతులకు జిల్లాకు ఒక గ్యారేజీ ఉండటంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలి. ● వాహనం మైనర్ రిపేర్కు గురైతే ఆ ఖర్చులను సిబ్బంది భరించాలని అధికారులు చెబుతున్నారు. సంస్థ ఆ ఖర్చులు భరించేలా చర్యలు తీసుకోవాలి. ● రోజుకు 12 గంటల పని ఒత్తిడితో కూడకుందని, 8 గంటల పనివిధానం అమలు చేయాలి. ● వాహనాలు నిలుపు ప్రదేశంలో షెల్టర్ లేదని, వాహనాల క్లీనింగ్లకు, ఉద్యోగులకు వాష్రూంలు ఏర్పాటు చేయాలి. ● బ్రేక్ డౌన్ అయిన వాహన సిబ్బందికి అటెండెన్స్ ఇవ్వాలి. ● సంస్థ సీపీఆర్ ఫోన్లు ఇవ్వడం వల్ల మొబైల్ డేటా లేకపోవడంతో అవాంతరాలు ఏర్పడుతున్నా యి. ప్రతి వాహనానికీ డేటాతో కూడిన ఆండ్రాయిడ్ ఫోన్లు అందించాలి. ● ఐఎఫ్టీ కేసుల విషయంలో సరైన గైడెన్స్ రూపొందించి మెడికల్ ఆఫీసర్లకు, 108 సర్వీస్ ప్రొవైడర్కు తెలియజేయాలి. ఉమ్మడి జిల్లాలో 108 ఉద్యోగులు జిల్లా మేనేజర్ 1 సూపర్వైజర్లు 2 పైలెట్లు 90 ఈఎంటీలు 110 కుయ్.. కుయ్.. కష్టాలేనోయ్! సమస్యల పరిష్కారానికి నోటీసు 18 డిమాండ్ల సాధనే లక్ష్యం ప్రభుత్వం స్పందించకుంటే 12 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి.. ఉమ్మడి జిల్లాలో నిలిచిపోనున్న సేవలు -
వైఎస్సార్సీపీ శ్రేణుల జోలికొస్తే ఊరుకోం
ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కక్ష గట్టి దాడులు చేస్తే సహించేది లేదని, మా కార్యకర్తలకు ఏమైనా జరిగితే దేనికై నా సిద్ధమని, ఎక్కడికై నా వెళ్లేందుకు వెనుకాడబోమని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. భీమడోలు మండలం అంబర్పేట గ్రామంలో దళితులైన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కూరపాటి నాగభూషణంపై కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకునేలా వేధించడం దుర్మార్గమన్నారు. కూటమి నేతల భూదందాలు అధికారులకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ఏలూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న నాగభూషణాన్ని సోమవారం వాసుబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నా రు. పార్టీ అండగా ఉంటుందని నాగభూషణానికి భ రోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగభూషణం 40 ఏళ్ల క్రితం ముగ్గురు అన్నదమ్ముల వద్ద 60 సెంట్ల భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారని, ఈ భూమిపై కూటమి నేతల కన్ను పడిందన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కావటంతో స్థానిక టీడీపీ, జనసేన నేతలు టార్గెట్ చేశారని విమర్శించారు. అంబర్పేటలో ఏకంగా 100 ఎకరాల పోరంబోకు భూమి ఉందని, క్వారీలు కూటమి నేతలు, భూస్వాముల స్వాధీనంలో ఉన్నాయని, అధికారులు వాటి జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కూటమి పార్టీలకు చెందిన పెద్ద రైతులు పలు ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని, అయితే దళితుడైన నాగభూషణం కొనుగోలు చేసిన భూమికి సంబంధించి మాత్రమే ప్రభుత్వ అధికారులు అలజడులు సృష్టించటం, లాక్కునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటని వాసుబాబు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు -
హోరాహోరీగా కబడ్డీ పోటీలు
వీరవాసరం: కొల్లా భాస్కరమ్మ, గుండా లక్ష్మీ రత్నావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరవాసరంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. 25 జిల్లాల నుంచి జట్లు తలపడ్డాయి. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను తిలకించారు. ఈ పోటీల్లో కృష్ణా, ఎన్టీఆర్, అనంతపురం, విజయనగరం జిల్లా జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి. తూర్పుగోదావరి– కర్నూలు జట్ల మధ్య జరిగిన పోటీలో కర్నూలు జట్టు విజయం సాధించింది. కాకినాడ– ఏలూరు జట్ల మధ్య పోటీలో కాకినాడ, పశ్చిమగోదావరి– తిరుపతి మధ్య పోటీలో పశ్చమ గోదావరి జట్టు విజయం సాధించింది. విశాఖపట్నం–అన్నమయ్య జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో అన్నమయ్య జట్లు విజయం సాధించింది. గుంటూరు– పల్నాడు జిల్లా మధ్య పోటీలో పల్నాడు, శ్రీకాకుళం– కడప మధ్య పోటీలో శ్రీకాకుళం విజయం సాధించారు. సత్య సాయి జిల్లాపై కృష్ణ, తూర్పుగోదావరిపై అనంతపురం, ఏలూరుపై పశ్చిమ గోదావరి, తిరుపతిపై కాకినాడ జట్లు గెలుపొందాయి. నంద్యాలపై పల్నాడు జట్టు, కడపపై బాపట్ల, సత్యసాయిపై నెల్లూరు విజయం సాధించింది. కర్నూలుపై అనంతపురం, ఏలూరుపై తిరుపతి, నంద్యాలపై గుంటూరు, చిత్తూరుపై ఎన్టీఆర్ జిల్లా విజయం సాధించింది. విజయనగరం– ప్రకాశం జట్ల మధ్య జరిగిన పోటీల్లో విజయనగరం 18 పాయింట్లతో, నెల్లూరు–కృష్ణా మ్యాచ్లో కృష్ణా జట్టు 32 పాయింట్లతో విజయం సాధించింది. -
ఏపీఎన్జీజీఓ సంఘ కార్యవర్గం ఏకగ్రీవం
ఏలూరు(మెట్రో): ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ ఏలూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఎన్నికలు నిర్వహించగా ఒక్కో పోస్టుకు ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జిల్లా కార్యవర్గం ఏకగ్రీవమైందని, మొత్తం 17 మంది ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి కె.శరత్బాబు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా చోడగిరి శ్రీనివాసరావు (జలవనరుల శాఖ), సహాధ్యక్షుడిగా నోరి శ్రీనివాసరావు (జలవనరులు) , ఉపాధ్యక్షులుగా ఎం.ఫణికుమార్ (పశు సంవర్ధక), ఏవీవీయల్ నరసింహారావు (మున్సిపల్), బి.లక్ష్మీపతి (రాష్ట్ర ఆడిట్), పూడి శ్రీనివాస్ (బీసీ వెల్ఫేర్), ఎండీ రెహమాన్ (సహకార), ఉపాధ్యక్షురాలి గా ఎం.లీలారాణి ఎన్నికయ్యారు. అలాగే సెకండరీ హెల్త్ కార్యదర్శిగా నెరుసు వెంకటరామారావు (వైద్య ఆరోగ్య), కార్యనిర్వాహక కార్యదర్శిగా బి.నరేంద్ర బాబు (వైద్య ఆరోగ్య), సంయుక్త కార్యదర్శులుగా ఎం.సాంబశివరావు (పబ్లిక్ హెల్త్), ఎండీ ఖాదర్ బేగ్ (వ్యవసాయ), కె.ఉమామహేశ్వరరావు (వైద్యారోగ్య), కె.కనికరాజు (పంచాయతీరాజ్), ఎంవీఎన్ఎల్ తులసి (వైద్యారోగ్యశాఖ), సంయుక్త కార్యదర్శిగా (మహిళ) ఎన్.ఝాన్సీ లక్ష్మీబాయి (బీసీ వెల్ఫేర్), కోశాధికారిగా వి.శ్రీనివాసరావు (స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కె.శరత్బాబు, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.రంజిత్నాయుడు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల సభ్యులు పాల్గొన్నారు. -
పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు
మండవల్లి: సంక్రాంతి పండుగకు ఎవరూ కోడి పందేలు, పేకాట నిర్వహించవద్దని, పేకాట నిర్వాహకులకు 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని ఎస్ఐ సీహెచ్ఎస్ రామచంద్రరావు అన్నారు. శ్రీ నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో కోడి పందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలపై సోమవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని పేర్కొన్నారు. నూజివీడు: ఆలిండియా సాఫ్ట్బాల్ ఇంటర్ యూనివర్శిటీ పోటీలకు ట్రిపుల్ ఐటీ బాల బాలికల జట్లను ఎంపిక చేశారు. జట్టులో నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన మేఘన, అమృత, భాగ్యశ్రీ, తేజస్విని, దివ్య, సంధ్యారాణి ఎంపికయ్యారు. బాలుర జట్టుకు గణేష్, రామ్ ప్రసాద్, రాంబాబు, పరమేష్, రాజేష్, లోవరాజు, కోటిరెడ్డి ఎంపికయ్యారు. బాలుర జట్టు వచ్చే నెల 1 నుంచి 5 వరకు మహారాష్ట్రలో నిర్వహించే పోటీలకు హాజరుకానున్నారు. బాలికల జట్టు 6 నుంచి 10 వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు. హ్యాండ్బాల్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్శిటీ పోటీల కోసం జ్ఞానేంద్ర, రాజు ఎంపికయ్యారు. భీమవరం: పట్టణంలోని హన్సీ కల్యాణ మండపంలో చీరల ఎబ్జిబిషన్లో చీరలు దొంగతనం చేసిన నలుగురు మహిళలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పారు. సోమవారం టూటౌన్ పోలీసుస్టేషన్లో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలో ఈ నెల 3న చీరల ఎగ్జిబిషన్ ఏర్పాటుచేయగా 4న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లికి చెందిన మేడారపు రజనీ, పొన్న చుక్కమ్మ, పొన్నూరు మల్లి, మేడారపు లక్ష్మి ఎగ్జిబిషన్ తిలకించడానికి వచ్చి సుమారు రూ.80 వేలు చీరలను దొంగిలించారు. ఎగ్జిబిషన్ నిర్వాహకురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా నిందితులను గొల్లవానితిప్ప రోడ్డులో సోమవారం అరెస్ట్ చేసి వారి నుంచి చీరలను స్వాధీనం చేసుకున్నారు. పోలవరం రూరల్: ఈ నెల 7న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు రానున్నారని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. దీనికి సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్తో కలిసి ఆమె సోమవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. భీమవరం: భీమవరంలో బుధవారం రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. ఆగి ఉన్న మినీ లారీని మరో లారీ ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం బలుసుమూడి ప్రాంతంలోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం దింపేందుకు మినీ లారీ ఆగింది. ఆ సమయంలో వెనకనుంచి వస్తున్న మరో లారీ ఆ లారీని ఢీకొంది. ఆగి ఉన్న మినీలారీ వేగంగా వెళ్లి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని, రోడ్డు మార్జిన్లో దిగబడి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. -
త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు
భీమవరం: భీమవరం త్యాగరాజ భవనంలో త్యాగరాజ స్వామి 107వ ఆరాధనోత్సవంలో భాగంగా సోమవారం చైన్నెకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు పతంగి బ్రదర్స్ గాత్ర కచేరి ఆకట్టుకుంది. ముందుగా త్యాగరాజ ఆరాధనోత్సవాల అధ్యక్షుడు ఉద్దరాజు కాశీ విశ్వనాథ్ రాజు, గౌరవాధ్యక్షుడు గంధం విశ్వేశ్వరరావు, ఉపాధ్యక్షుడు గన్నబత్తుల శ్రీనివాసరావు, ఎన్ఆర్ కే రాజులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ధాత్రే ఎస్ పతంగి, ధ్రువ ఎస్ పతంగి ఆలపించిన త్యాగరాజ కృతులు, అన్నమయ్య పదాలు అలరించాయి. కారుమూరి ఆదిత్య, చెరుకువాడ వెంకట్రామయ్య, కారుమూరి నరసింహమూర్తి, వబిలిశెట్టి కనకరాజు, వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన పరిష్కారం చూపాలి
ఏలూరు(మెట్రో): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందే అర్జీలకు న్యాయమైన పరి ష్కారం చూపాలని జేసీ ఎంజే అభిషేక్ గౌడ అ న్నారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్లో ఆగంగా డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్తో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్తో పాటు రెవెన్యూ క్లినిక్లో భాగంగా జిల్లాలో 28 మండలాలకు సంబంధించి 28 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, వినతులు స్వీకరించామన్నారు. అర్జీల్లో కొన్ని.. ● అప్పనవీడుకి చెందిన కనికిచర్ల కుమార్బాబు ఎన్హెచ్–16 విస్తరణలో భాగంగా డ్రెయినేజీ స మస్య ఇబ్బంది పెడుతోందని అర్జీ అందించారు. ● ఏలూరులోని శాంతినగర్కు చెదిన కట్నేని వెంకట గోపాలకృష్ణ తన 3.16 సెంట్లను భూసేకరణ చేశారని, అయితే ఇప్పటివరకూ నష్టపరిహారం రాలేదన్నారు. భూసేకరణ నుంచి తన భూమికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ● కామవరపుకోటకి చెందిన పోపూరి శ్రీనివాసు ఆయిల్పామ్ మొక్కల సబ్సిడీ సొమ్ములకు వినతిపత్రం అందించారు. ● పెనుమల్లి నివాసి వీరమల్లు పెదకొండలరావు గ్రామం మధ్యలో డ్రైనేజీ కాలువకు ఆనుకుని ఆ క్వా ప్రాసెసింగ్ యూనిట్లతో పర్యావరణ కా లుష్యం ఏర్పడుతుందని ఫిర్యాదు చేశారు. -
పశువుల పాక దగ్ధం
పెంటపాడు: మండలంలోని కె.పెంటపాడులో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదంలో పశువుల పాక దగ్ధమైంది. దోమల కోసం పెట్టిన పొగ రాజుకొని ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో సుమారు 10 గేదెలు పాకలో ఉన్నాయి. కొన్ని పశువులు తప్పించుకోగా 4 పాడి పశువులకు గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కాకి వీరాస్వామికి చెందిన పశువుల పాకతో పాటు, సమీపంలో ఉన్న గడ్డి వాము అగ్నికి ఆహుతైంది. గూడెం అగ్నిమాపక అధికారి కేవీఎం కొండబాబు, మండల పశువైద్యాఽధికారి పి.అశోక్కుమార్ తమ సిబ్బందితో వచ్చి కాలిన పశువులకు వైద్యపరీక్షలు చేసారు. సిబ్బంది మంటలను అదుపు చేశారు. మూడు పశువులు కోలుకుంటున్నాయని, మరో పశువు 90 శాతం పైగా కాలిపోయిందని, వైద్యాధికారి అశోక్కుమార్ తెలిపారు. -
విధుల్లో అలసత్వం సరికాదు
ఏలూరు టౌన్: పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, విధుల్లో అలసత్వం సరికాదని జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా 41 ఫిర్యా దులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజలు తమ సమీపంలోని డీఎస్పీ, సీఐ కార్యాలయాలకు వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చని, ఆన్లైన్లో మీకోసం.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే 1100 టోల్ఫ్రీ నంబర్లోనూ సంప్రదించవచ్చన్నారు. ప్రజలు సైబ ర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సత్యసాయి సేవా సంఘం స భ్యులు బాధితులకు భోజన ఏర్పాట్లు చేశారు. -
టీడీపీ నేత.. రేషన్ బియ్యం మేత
● 210 బస్తాల బియ్యం, 342 కిలోల పంచదార బ్లాక్ మార్కెట్కు? ● రూ.6 లక్షలకుపైగా ప్రజాధనం లూటీ ● 6ఏ కేసుతో సరిపెట్టిన అధికారులు తణుకు అర్బన్ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని తణుకులో టీడీపీ మా జీ కౌన్సిలర్ బొక్కేసిన వ్యవహారం ఆలస్యంగా వె లుగు చూసింది. తణుకు పాతవూరు శివాలయం ప్రాంతంలోని 23వ నంబరు చౌకడిపోను తెరవకుండా విసుగు తెప్పించడంతో పాటు తెరిచినా గంటలోపు తలుపులు మూసివేయడం వంటి వ్యవహారంపై పలువురు కార్డుదారులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అలాగే లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా కొందరితో వేలిముద్రలు వేయించుకుని, కొందరికి ఏ సమాధానం చెప్పకుండా డిపో మూసేసి సరుకును నేరుగా బియ్యం మాఫియాకు విక్రయిస్తున్న వ్యవహారం బట్టబయలైంది. బి య్యం, పంచదార రేషన్ డిపోలోనే ఉన్నట్టు ఆన్లైన్ లో సరుకు చూపిస్తుండటంతో రెవెన్యూ అధికారులకు చిర్రెత్తుకొచ్చింది. సదరు డిపోలో 105.75 క్వింటాళ్ల బియ్యం (సుమారు 210 బస్తాలు), 342 కిలోల పంచదార నిల్వలు తేడా గమనించి గత నెల లో డీలరుపై 6ఏ కేసు నమోదు చేసి మరో డిపో డీలర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. టీడీపీ వర్గమనే.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత డీలర్ను తొలగించి టీడీపీ మాజీ కౌన్సిలర్ అభ్యర్థన మేరకు ఈ డిపోను అతడి భార్య పేరున కేటాయించారు. రేషన్ షాపు పెత్తనమంతా సదరు మాజీ కౌన్సిలర్ చూడటం, తదితర సమస్యలపై నాలుగు నెలలుగా పలు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే టీడీపీ నాయకుడు కావడంతో రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేని పరిస్థితి. అయినా మార్పు లేకపోవడంతో చివరకు కేసు నమోదు చేశారు. ఈ డిపో డ్వాక్రా గ్రూపునకు చెందిన వారికి కేటాయించిన డిపోగా తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్కు.. చౌక డిపో పరిధిలో 740 రేషన్ కార్డులు ఉండగా 30 శాతం కూడా సరుకులు పంపిణీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కార్డుదారులతో బయోమెట్రిక్ వేయించకుండానే బియ్యాన్ని బయట మార్కెట్కు తరలించారు. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ లాగిన్లో మాత్రం బియ్యం స్టాకు కనిపించేది. మొ త్తంగా 210 బస్తాల బియ్యానికి సంబంధించి రూ.6 లక్షలకు పైగా ప్రజాధనం లూటీ చేసినట్టు సమాచారం. దీనిపై తణుకు తహసీల్దార్ దండు అశోక్వర్మను ‘సాక్షి’ వివరణ కోరగా 23వ నంబరు చౌకడిపోపై పలు ఫిర్యాదులు వచ్చాయని, పరిశీలనలో 105.75 క్వింటాళ్ల బియ్యంతోపాటు 342 కిలోల పంచదార షార్టేజీ ఉండటంతో డీలరుపై 6ఏ కేసు నమోదు చేసి, తాత్కాలికంగా మరో డీలరును ఇన్చార్జిగా నియమించినట్టు చెప్పారు. అలాగే తణుకులో మరో ముగ్గురు డీలర్లు ఇదే తరహాలో డిపోను నడుపుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. -
జోరుగా నల్ల బెల్లం విక్రయాలు
● సారా తయారీకి వినియోగం ● చింతలపూడికి టన్నుల కొద్దీ దిగుమతి చింతలపూడి : ఏలూరు జిల్లాలో నల్ల బెల్లంతో పా టు సాధారణ బెల్లం అమ్మకాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. వ్యవసాయ అవసరాల పేరుతో విక్రయిస్తున్న నల్ల బెల్లం వాస్తవానికి సారా తయారీలో ప్రధాన ముడి పదార్థంగా మారుతోంది. ఈ అక్రమ వ్యాపారం వల్ల పేదల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. చిత్తూరు నుంచి భారీగా.. చింతలపూడిలో సారా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. స్థానిక బెల్లం వ్యాపారులు కొందరు సిండికేట్గా మారి టన్నుల కొద్దీ బెల్లాన్ని చిత్తూరు జిల్లా నుంచి దిగుమతి చేసి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. సారా తయారీకే ఈ బెల్లాన్ని వినియోగిస్తారని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేసినా నామమాత్రపు దాడులు చేస్తూ బెల్లం వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా గత నెలలో అధికారులు బెల్లం దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. బెల్లం వ్యాపారులతో సమావేశం నిర్వహించి సారా తయారీదారులకు బెల్లం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే బెల్లం విక్రయాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. వ్యాపారులు కూడా నిబంధనలను అడ్డుపెట్టుకుని కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. చింతలపూడి మార్కెట్కు లారీల్లో టన్నుల కొద్దీ బెల్లం వస్తుందనేది బహిరంగ రహస్యం. ఉన్నతాధికారులు బెల్లం గోడౌన్లపై దాడులు చేసి వ్యాపారులను కట్టడి చేస్తే సారా తయారీని అరికట్టవచ్చు. చింతలపూడి నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్లం అ మ్మకాలు సాగిస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. బెల్లం వ్యాపారులతో సంబంఽధిత అధికారులు కుమ్మక్కు కావడంతో సారాను అరికట్టలేకపోతున్నారు. బెల్లం అమ్మకాలను నియంత్రిస్తే సారా తయారీని నిర్మూలించవచ్చు. – తొర్లపాటి బాబు, సీపీఐ మండల కార్యదర్శి -
కనులపండువగా శ్రీవారికి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారు ఉభయ దేవేరులతో కలసి, తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. ఈ వేడుక ఆధ్యంతం భక్తులకు కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం పూజలు జరిపి హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, అశ్వ, గజ సేవల నడుమ శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం: బంగారం తీసుకుని వస్తువులు తయారు చేస్తానని, పాత బంగారం రిపేర్ చేయిస్తానని చెప్పి ఏడుగురిని మోసం చేసిన తండ్రీకొడుకులను అరెస్టు చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మున్సిబు గారి వీధిలో స్వర్ణకారులైన తండ్రీకొడుకులు పడగ రాము, విజయ్ప్రకాష్ బంగారు నగలు తీసుకుని మోసం చేసినట్లు తెలిపారు. నూకారపు చంద్ర అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. వారిని జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు. ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లిలో సోమవారం ఓ భారీ కొండచిలువ స్థానికుల చేతిలో హతమైంది. పోలవరం కుడి కాలువ పక్కనున్న శ్రీనివాస రెడ్డి, తన తోటలోకి వెళుతుండగా 13 అడుగుల ఈ కొండ చిలువ ఆయన కంటపడింది. దాంతో ఒక్కసారిగా ఆయన హడలిపోయారు. వెంటనే చుట్టుపక్కల ఉన్న వారిని పిలువగా, వారొచ్చి ఈ కొండ చిలువను హత మార్చారు. ఇంత పెద్ద కొండ చిలువను చూడడం ఇదే మొదటిసారని స్థానికులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో ఇంకా కొండ చిలువలు ఉన్నాయని, పశువులపై దాడి చేస్తున్నాయని రైతులు అంటున్నారు. అంతా అప్రమత్తంగా ఉండాలని గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కో–కన్వీనర్ వసంతాటి శ్రీనివాస్ సూచించారు. -
స్వర్ణోత్సవ సంబరాలకు ఎస్వీకేపీ సిద్ధం
పెనుగొండ: మెరుగైన విద్యతో పేరెన్నికగన్న ఎస్వీకేపీ విద్యా సంస్థలు స్వర్ణత్సోవ సంబరాలకు ముస్తాబవుతున్నాయి. పెనుగొండలో 1974లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థలు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నారు. దీని కోసం కళాశాలలో దేశ విదేశాల్లో స్థిరపడిన విద్యార్ధులు తరలిరానున్నారు. ఈ కళాశాలను డాక్టర్ కేఎస్ రాజు, 8 మంది సభ్యులతో ప్రారంభించారు. 1974లో కేవలం నాలుగు కోర్సులతో ప్రారంభమై, 1976లో జాతీయ సేవా పథకం, 1978లో క్రీడా విభాగం, 1984లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, 1987లో బీఎస్సీ కంప్యూటర్స్ ప్రారంభించారు. 1992లోనే ఎంసీఏ కోర్సు స్థాపించి, ఎందరో సాఫ్ట్వేర్ ఇంజినీర్లను తయారుచేసింది. సంబరాలకు 5 వేలకు పైగా పూర్వ విద్యార్థులు హజరవుతున్నారని, దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ కే రామచంద్రరాజు తెలిపారు. -
బల ప్రదర్శనకు వేదికగా జాతర
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రజలను భక్తిమార్గంలో నడిపిస్తూ, ఆధ్యాత్మికతను పెంపొందించే దిశగా జరగాల్సిన శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. జాతరలో రాజకీయాల ప్రవేశంతో వేరుకుంపట్లు పెట్టుకుని ఎవరికి వారుగా ఉత్సవాలను నిర్వహించే పరిస్థితికి ఉత్సవాన్ని దిగజార్చారు. గతంలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతర మహోత్సవాలను కొన్ని కమిటీల ప్రతినిధులు ఆదాయ వనరుగా పరిగణించి ప్రతి ఏడేళ్ళకు ఒకసారి నిర్వహించేలా సంప్రదాయాన్ని మార్చేశారు. అయినప్పటికీ అమ్మవారి జాతర నగర ప్రజల్లో సెంటిమెంట్గా నిలిచిపోవడంతో కమిటీల నిర్ణయానికి ప్రజలు అంగీకారం తెలిపి ఎప్పుడు అమ్మవారి జాతరకు పిలుపునిచ్చినా ఉత్సవాల విజయవంతానికి తమవంతు సహకారం అందిస్తున్నారు. బల ప్రదర్శనకు వేదికగా గంగానమ్మ జాతర తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు జాతర జరుగుతుందని నగర ప్రజల్లో చర్చ నడుస్తోంది. గతంలో జాతర మహోత్సవాలన్నీ టీడీపీ అధికారంలో ఉండగా జరిగినవే కావడంతో ఈ చర్చకు బలం చేకూరుతోంది. వివిధ ప్రాంతాల్లో నిర్వహించే జాతర మహోత్సవాలకు సంబంధించి కమిటీల్లో అందరూ టీడీపీకి చెందిన నాయకులే ఉండడంతో ఈ వాదన నిజమే అంటున్నారు. ప్రస్తుతం కొన్ని కమిటీలు తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవడం కోసం అదే పార్టీకి చెందిన, అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరిని కమిటీలకు దూరం చేయడంతో అలా బయటకు వెళ్ళాల్సి వచ్చిన వారు తమ ప్రాంత వాసులతో చర్చించి వేరుకుంపటి పెట్టుకున్నారనే చర్చ జరుగుతోంది. అలా వేరు కుంపటి పెట్టుకున్న వారు తమ బలాన్ని ప్రదర్శించే కార్యక్రమాలు చేపడుతున్నారని భక్తులు అంటున్నారు. సినీ బృందాలు, ప్రజాప్రతినిధుల సందర్శన వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జాతరకు ఆయా కమిటీల ప్రతినిధులు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తూ తమ బలాన్ని నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల విజయోత్సవ యాత్రలు, చిత్ర ప్రమోషన్ కోసం పర్యటన చేస్తూ నగరానికి విచ్చేసిన సినీ బృందాలను కొందరు కమిటీల వారు తమ మేడల వద్దకు రప్పిస్తున్నారు. మరి కొందరు రాజకీయ ప్రముఖులను, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను ఈ మేడల వద్దకు తీసుకొచ్చి అమ్మవార్లను దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. మరోప్రాంతంలో రోజూ ప్రత్యేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించడానికి తిప్పలు పడుతున్నారు. బృందాలుగా సారెల సమర్పణ నగరంలోని అమ్మవారి భక్తులు మాత్రం తమ భక్తిప్రపత్తులు చాటుకుంటూనే ఉన్నారు. ఏడేళ్ళ తరువాత వచ్చిన జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటున్నారు. అమ్మవార్లు వేంచేసిఉన్న మేడల వద్దకు తండోపతండాలుగా భక్తులు వెళ్ళి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. చద్ది నైవేద్యాలు, చలిమిడి, వడపప్పు, పానకం సమర్పిస్తున్నారు. నగరంలోని వివిధ పేటలకు చెందిన భక్తులు, ఒక్కో అపార్ట్మెంట్లో నివశిస్తున్న భక్తులు సామూహికంగా అమ్మవార్లకు సారెలు సమర్పిస్తున్నారు. కమిటీల్లో పోటీ వాతావరణం గతంలో రెండు మూడు ప్రాంతాలకు పరిమితమైన జాతర ప్రస్తుతం ఏడు ప్రాంతాలకు విడిపోయింది. కేవలం పడమర వీధి, తూర్పువీధి, పవర్పేటల్లో మాత్రమే ఇలా 12 ఏళ్ళకు ఒకసారి జరిగే జాతరను నిర్వహించేవారు. ఈ కమిటీల్లో ఇతరులకు స్థానం కల్పించడానికి ఆయా కమిటీల ప్రతినిధులు నిరాకరించడంతో మరి కొన్ని ప్రాంతాల వారు వీరికి పోటీగా జాతర కొలుపులు ప్రారంభించారు. ముఖ్యంగా దక్షిణపు వీధిలో జాతర మహోత్సవం పడమర వీధి కమిటీకి వ్యతిరేకంగా ప్రారంభమైనట్టు అనుకుంటున్నారు. లక్ష్మీవారపు పేట, ఆదివారపు పేట, తంగెళ్ళమూడి ప్రాంతాల్లో కూడా జాతర నిర్వహిస్తున్నారు. భక్తుల్లో గందరగోళం పోటీ వాతావరణంలో జరుగుతున్న జాతర మహోత్సవాలు భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా గంగానమ్మ జాతరలో భాగంగా స్థానిక పడమర వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారు నగరంలోని ఎక్కువ ప్రాంతాల్లో సంచరించే వారు. ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా పడమర వీధి మేడల వద్దకే వెళ్ళి మొక్కులు చెల్లించుకునే వారు. ప్రస్తుతం మరికొన్ని ప్రాంతాల్లో కూడా జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా తాము గతంలో కొలిచిన అమ్మవారి వద్దకు వెళ్ళాలా, లేకుంటే కొత్తగా తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మేడలవద్దకు వెళ్ళాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. అటూఇటూ తేల్చుకోలేని వారు మాత్రం ఎందుకై నా మంచిదని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మేడలను సందర్శించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఏలూరులో సినీ బృందాలు, ప్రజాప్రతినిధుల సందర్శనలు బృందాలుగా అమ్మవార్లకు సారెల సమర్పణ కమిటీల్లో పోటీ వాతావరణం -
కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలి
పోలవరం రూరల్: కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని ఏజెన్సీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. సోమవారం పోలవరం మండలం వింజరం సచివాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు మాట్లాడారు. 10శాతం నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉంటే కొత్త చట్టం ప్రకారం 40 శాతం నిధులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాల హక్కులు కాలరాస్తూ ఉపాధి హామీ పనులు ఏ ప్రాంతంలో, ఎలా కల్పించాలో కేంద్రం నిర్ణయిస్తుందనడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు కొమరం రామారావు, మడి వెంకటగిరి, పాములేటి పెంటారెడ్డి, శబల శివకుమార్, అరగంటి జోగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంఎన్ఆర్ఈజీఎస్ను కొనసాగించాలి జంగారెడ్డిగూడెం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు జీవరత్నం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మండలంలోని పంగిడిగూడెం గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ చట్టంపై గ్రామసభ నిర్వహించారు. సభ అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యదర్శి జె.సతీష్ కి అందించారు. సామాన్యల జీవన హక్కులపై ప్రభావం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ చట్టంలో తీసుకువచ్చిన మార్పులు గ్రామీణ పేదలు, కూలీలు, నిరుద్యోగ యువత జీవన హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని డీవైఎఫ్ఐ ఏలూరు జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ ఖండించారు. ఈ మార్పులను వెంటనే ఉపసంహరించుకొని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మైసన్నగూడెం సచివాలయం వద్ద కార్యక్రమం నిర్వహించి వినతి పత్రం అందజేశారు. -
స్కూల్ స్వీపర్ల నిరసన
ఏలూరు (టూటౌన్): మున్సిపల్ స్కూల్ స్వీప ర్లు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలంటూ యూనియన్ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పీజీఆర్ఎస్ లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు కె.విజయలక్ష్మి మాట్లాడు తూ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 180 మంది స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారన్నారు. స్వీపర్లకు రూ.4 వేలు, శానిటేషన్ వర్కర్లకు రూ.6 వేలు ఇచ్చి గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారన్నారు. ట్రిబ్యునల్ తీర్పు, కౌన్సిల్ తీర్మానాలను అనుసరించి కార్మి కులకు ఫుల్ టైమ్ వేతనాలు ఇప్పించాలని డి మాండ్ చేశారు. లేకుంటే ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. సీహెచ్ లక్ష్మి, ఎస్కే యాస్మిన్, టి.నాగమణి, ఎల్.రమణ, పి.సారమ్మ, వై.భవానీ పాల్గొన్నారు. కై కలూరు: రైలు పట్టాలు మరమ్మతుల నిమిత్తం మండవల్లి–కై కలూరు రైలు మార్గంలో లెవిల్ క్రాసింగ్ నంబరు–81 (కోరుకొల్లు గేట్)ను వారం రోజులపాటు మూసివేస్తున్నట్టు కై క లూరు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎండీ అబ్దుల్ రహ్మాన్ సోమవారం తెలిపారు. ఈనెల 7న ఉదయం 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటలకు వరకు గేటు మూసివేస్తామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు. దెందులూరు: గోపన్నపాలెం గ్రామ పంచాయతీలో విధి నిర్వహణలో అలసత్వం, ఇతర కారణాల నేపథ్యంలో గ్రేడ్–3 సెక్రటరీ స్పానిష్బా బు, గ్రేడ్–5 సెక్రటరీ విజయకుమార్కు జిల్లా పంచాయతీ అధికారి కొడాలి అనురాధ షోకా జ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి సోమవారం ఆకస్మికంగా పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభను సందర్శించారు. అలాగే పోతునూరు పంచాయతీలో ప్రభుత్వ స్థలంలో కట్టిన భవనంపై దళిత సర్పంచ్ అనే సాకుతో తన పేరు ముద్రించలేదని పోతునూరు సర్పంచ్ బోదుల స్వరూప్ కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ కార్యదర్శికి డిప్యూటీ ఎంపీడీఓ ఆశీర్వాదం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఒకే మండలంలో ముగ్గురు గ్రామ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఏలూరు (టూటౌన్): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనతా వారధిగా వచ్చిన ట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న అన్నారు. బీజేపీ రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూ రు కలెక్టరేట్ వద్ద జనతా వారధి నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషిచేస్తుందని నాయకులు అన్నారు. జిల్లా అధ్యక్షు డు విక్రమ్ కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపాటి సత్యనారాయణ పాల్గొన్నారు. ముసునూరు: రూ.లక్ష జరిమానా, కుల వెలివేత బాధిత కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం తీవ్ర గాలింపు నిర్వహిస్తున్నట్టు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. మండలంలోని లోపూడిలో కుల పెద్దల తీర్పుతో బెంబేలెత్తి కుటుంబసభ్యులంతా మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పా ల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా ప్రకటించి, అదృశ్యమైన బోట్ల కనకారావు కుటుంబం ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసు బృందాలు ఏలూరు, చింతలపూడి, నూజివీడు, హను మాన్ జంక్షన్, విసన్నపేట పరిసర ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గాలింపు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకూ ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. కుల పెద్దలు పోలీసుల అదుపులో ఉన్నారు. -
ముద్రా రుణమంటూ సైబర్ మోసం
మిర్చికి కొత్త క్రేజ్ వేలేరుపాడు మండలం నడిమిగొమ్ము గ్రామంలో ఓ యువ రైతు సాగు చేసిన రంగురంగుల మిర్చి ఆకట్టుకుంటోంది. మంచి దిగుబడి వచ్చింది. 8లో uరూ.2.50 లక్షలకు టోకరా తణుకు అర్బన్: తణుకులో ముద్రా రుణం మంజూరైందని వచ్చిన ఫోన్కాల్కు ఆశపడి ఓ మహిళ రూ.2.50 లక్షల ను సైబర్ నేరగాళ్లకు స మర్పించుకున్న వ్యవహారం వెలుగులోకి వ చ్చింది. వివరాల్లోకి వెళితే.. తణుకు పాత పోలీస్స్టేషన్ వీధిలో సిద్ధార్థ కర్రీ పాయింట్ (పంతులు కర్రీ పాయింట్) ద్వారా ఉపాధి పొందుతున్న మహిళ సూరికుర్చి లక్ష్మికి కొంతకాలం క్రితం వచ్చిన ఫోన్ కాల్లో మీకు రూ.5 లక్షలు ముద్ర లోన్ మంజూరైనట్లు సైబర్ నేరగాడు నమ్మించాడు. తాను హైదరాబాద్ బేగంపేటలోని ఆఫీసులో ఉంటానని తన పేరు అరు ణ్గా పరిచయం చేసుకున్నాడు. రుణం కావాలంటే ముందుగా ఫీజు, ఇతర రుసుముల కింద రూ.50 వేలు చెల్లించాలని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన లక్ష్మి పలు దఫాలుగా రూ.2.50 లక్షలు ఆన్లైన్ పేమెంట్ యాప్ల రూపంలో చెల్లించింది. త్వరలో రూ.7.50 లక్షలు ఇస్తామని చెప్పి చివరగా మరో రూ.50 వేలు చెల్లించాలనడంతో ఆమె నిరాకరించింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా సైబర్ మోసగాడు లిఫ్ట్ చేయకపోవడంతో బాధితురాలు హైదరాబాద్ వెళ్లినా అక్కడ ఎవరూ సమాధానం చెప్పలేదు. దీంతో ఆమె ఆదివారం తణుకులో పోలీసులను ఆశ్రయించింది. -
మిర్చికి కొత్త క్రేజ్
వేలేరుపాడులో గుంటూరు కారం ఘాటు వేలేరుపాడు : సాధారణంగా ఎరుపు రంగులో ఉన్న వివిధ రకాల మిర్చిని రైతులు సాగుచేస్తుంటారు. కానీ ఆ యువ రైతు వైరెటీగా ఉంటుందని పసుపు పచ్చ మిర్చీని సాగు చేశాడు. దీంతో ఆ యువ రైతు పంట పండింది. యూట్యూబ్లో చూసి, గుంటూరు నుంచి తెప్పించి పచ్చ మిర్చి రకం విత్తనాలు నాటిన ఆ రైతుకు మంచి ఆదాయం వచ్చింది. అరుదుగా పండించే ఈ పసుపు పచ్చ మిర్చికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఆ రైతు పంట పండింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం నడిమిగొమ్ము గ్రామానికి చెందిన బుడిపిటి విక్రమ్ అనే యువ రైతు మొత్తం ఐదు ఎకరాల మిర్చి పంట సాగు చేశాడు. ఇందులో పసుపు పచ్చ రకం మిర్చి ఒక ఎకరం సాగు చేయగా, మిగతా నాలుగు ఎకరాల్లో నంబర్ 5 రకం ఎర్ర మిర్చి సాగు చేశాడు. పచ్చ మిర్చికి మంచి డిమాండ్ ఉండడంతో.. యూ ట్యూబ్లో చూసిన విక్రమ్ గుంటూరు నుంచి యువీ, నరింగ ఎఫ్–1 హైబ్రేడ్ చిల్లీ విత్తనాలను తెప్పించి ఎకరం సాగు చేశాడు. ఎకరానికి లక్షా 15 వేల వరకు పెట్టుబడి పెట్టగా 25 క్వింటాళ్ళ పసుపు మిర్చి దిగుబడి వచ్చింది. క్వింటా ధర గుంటూరు మార్కెట్లో ప్రస్తుతం రూ.40 వేలు పలుకుతుండగా, గత ఏడాది క్వింటా ధర రూ.65 వేల వరకు పలికింది. పసుపు రంగు మిర్చి గుంటూరు మార్కెట్ నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి అవుతోంది. దేశ, విదేశాల్లో వివిధ వంటకాల్లో వినియోగిస్తున్నారు. ఈ మిర్చిని వివిధ కంపెనీలు చిన్న పిల్లలు తినే బింగో, లేస్, తదితర స్నాక్స్లో వినియోగిస్తున్నారు, రంగుల తయారీకి కూడా వాడుతున్నారు. యూట్యూబ్లో ఎల్లో రకం మిర్చి సాగు లాభసాటిగా ఉంటుందని చూశాను. ఈ ప్రాంతంలో ఈ రకం ఎవరూ సాగు చేయలేదు. వైరెటీ ఉంటుందని ఎకరం వేశాను. ఎకరాకు రూ.1.15 లక్షలు పెట్టుబడి పెడితే రూ.13 లక్షల వరకు లాభం వచ్చింది. నల్ల రేగడి నేల కావడంతో మంచి దిగుబడి వచ్చింది. -
కళ్లకు గంతలు కట్టుకుని దీక్షలు
నూజివీడు: 8 ఏళ్లుగా జీతాలను పెంచడంలో ఆర్జీ యూకేటీ ఉన్నతాధికారులు చేస్తున్న జాప్యానికి నిరసనగా నూజివీడు ట్రిపుల్ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న ధర్మపోరాట దీక్ష ఆదివారం కొనసాగింది. 12వ రోజు వీరంతా కళ్లకు గంతలు కట్టుకుని దీక్ష చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ క్యాంపస్లో ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైస్ చాన్సలర్ ఆచార్య ఎం.విజయకుమార్ దీక్షా శిబిరం వద్దకు రాగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం తమ సమస్యపై నివేదికను ఇవ్వమని అడిగినా మూడు నెలలుగా ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. జీతాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, దీక్షను విరమించాలని వైస్ చాన్సలర్ కోరారు. వేతనాల పెంపుపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసు కునే వరకూ ఆందోళనను విరమించేది లేదని అసిస్టెంట్ ప్రొఫెసర్లు తేల్చిచెప్పారు. ఏదో ఒక హామీతో రాకుండా చాన్సలర్తో చర్చిస్తానని చెప్పడం తమను మభ్యపెట్టడమే అవుతుందని, ఇలాంటి దాటవేత ధోరణితోనే తమకు అన్యాయం చేస్తున్నారని వారు వాపోయారు. అనంతరం విలేకరులు అడుగుతున్నా మాట్లాడకుండా వీసీ విజయకుమార్ క్యాంపస్ నుంచి వెళ్లిపోయారు. దీక్షల్లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీవీ లక్ష్మణరావు, బొత్స శ్రీనివాసరావు, లంకపల్లి రాజేష్, వెంకటేశ్వర్లు, సామినేని భవాని, రచనా గోస్వామి, యూ విజయశ్రీ, దీప్తి సాహూ పాల్గొన్నారు. -
తీరని చింత
బుట్టాయగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంత వరప్రదాయినిగా ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం పలనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పథకం ప్రారంభమై 17 ఏళ్లు కావొస్తున్నా పలు దశల్లోనే పనులు ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కి 19 నెలలు కావస్తున్నా కనీసం పనులను కన్నెత్తి చూడటం లేదని రైతులు అంటున్నారు. 2009లో శ్రీకారం : 2009లో అప్పటి సీఎం వైఎస్సార్ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో సుమారు రూ.1,708 కోట్ల అంచనాలతో చేపట్టారు. మొదట్లో పనులు వేగంగా జరిగినా వైఎస్సార్ అకాల మరణంలో మందగించాయి. 2017లో టీడీపీ హయాంలో రూ.4,909 కోట్లతో ఫేజ్–2 పనులు చేపట్టారు. అయితే అవి కూడా కొంత మేర జరిగి నిలిచిపోయాయి. 2019లో వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బకాయిల చెల్లింపు, పనులను వేగవంతం చేశారు. అయితే కోవిడ్ తర్వాత పనులు ముందుకు సాగలేదు. అలాగే భూసేకరణ సమస్యలతో కూడా పనులు ముందుకు సాగని పరిస్థితి. జగన్ హయాంలో నాబార్డు నుంచి పథకానికి రూ.1,930 కోట్లు మంజూరు చేశారు. 33 మండలాలలకు ప్రయోజనం.. పథకం పూర్తయితే ఉమ్మడి పశ్చిమగోదావరితోపాటు కృష్ణా జిల్లా పరిధిలో సుమారు 33 మండలాలు, 410 గ్రామాలకు సాగు, తాగునీరు అందుతుంది. ఉమ్మడి పశ్చిమలో 15 మండలాలు, కృష్ణా జిల్లాలో 18 మండలాలకు ప్రయోజనం చేకూరుతుంది. జిల్లాలో 2 లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని 2.80 లక్షల ఎకరాలకు మొత్తం 4.80 లక్షల ఎకరాలకు నీరందుతుంది. గోదావరి నుంచి 6,870 క్యూసెక్కుల నీరు చొప్పున 90 రోజులపాటు 53.50 టీఎంసీల నీటిని ఎత్తిపోయొచ్చని అధికారులు చెబుతున్నారు. జల్లేరు.. అదే తీరు : బుట్టాయగూడెం–జీలుగుమిల్లి మండలాల మధ్య సుమారు రూ.470 కోట్ల వ్యయంతో జల్లేరు రిజర్వాయర్ పనులను చేపట్టారు. ఇక్కడ 14 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. ఇక్కడ నుంచి సాగర్ ఎడమ కాల్వ కింద ఉండే 2.80 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వయోడక్ నిర్మాణం ప్రాంతం పిచ్చిమొక్కలతో కనిపిస్తుంది. అలాగే కాలువ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఉన్నాయి. చింతలపూడి ఎత్తిపోతలు, జల్లేరు రిజర్వాయర్ పనుల పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. నిలిచిన చింతలపూడి ఎత్తిపోతల కాలువ పనులు కన్నెత్తి చూడని చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వంలో రూ.1,931 కోట్ల మంజూరు జల్లేరు రిజర్వాయర్ పనులలోనూ అలసత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకం పనుల పూర్తికి ప్రభుత్వం కృషి చేయాలి. ఎన్నికలకు ముందు పలుమార్లు హామీలు ఇచ్చిన చంద్రబాబు, పవన్కల్యాణ్లు అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా ఎందుకు పట్టించుకోవడంలేదు. ఇప్పటికై నా దీనిపై దృష్టి పెట్టాలి. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, పోలవరం చింతలపూడి పథకం పూర్తయితే మాకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇటు సాగు, తాగునీరు పుష్కలంగా లభిస్తాయి. భూగర్భజలాలు పెరగడం వల్ల పంటలకు పుష్కలంగా నీరు అందుతుంది. పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. – కోర్సా బాలకృష్ణ, గిరిజన రైతు, బెడదనూరు -
వైభవంగా శ్రీవారి తిరువీధి సేవ
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం ఉదయం జరిగిన స్వామివారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను విశేష పుష్పమాలికలతో అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామివారి వాహనం తిరువీధి సేవకు పయనమైంది. అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, అశ్వ, గజ సేవల నడుమ స్వామివారు క్షేత్ర పురవీదుల్లో అట్టహాసంగా ఊరేగారు. ప్రతి ఇంటి ముంగిట భక్తులు శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు విశేష పూజలు జరిపి, భక్తులకు తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు. -
బకాయిలు విడుదల చేయాలి
చింతలపూడి: ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల మూడు నెలల జీతాలు, 12 నెలల పీఎఫ్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు తొర్లపాటి బాబు డిమాండ్ చేశారు. బకాయిల విడుదల కోరుతూ ఐదు రోజులుగా కార్మికులు నిరసన తెలియజేస్తున్నా వెంటనే స్పందించకుంటే డీసీహెచ్ఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. పాత కాంట్రాక్టు ముగిసి కొత్త కాంట్రాక్టర్కు బాధ్యతలు అప్పగించే సమయంలో కా ర్మికులకు రావాల్సిన జీతాలను చెల్లించకపోగా, ఆందోళన చేస్తున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే వీరి జీతాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే మంగళవారం నుంచి జిల్లా అధికారుల కార్యాలయం ఎదుట ఆందోళనలకు దిగుతామన్నారు.ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు టి.మరియ మ్మ, కుమారి, వాణి తదితరులు పాల్గొన్నారు. -
అవును.. ఇది పంట కాలువే!
ఉండి: నిండా గుర్రపుడెక్క, తూడుతో నిండి అర్తమూరు వెళ్లే పంట కాలువ అ ధ్వానంగా మారింది. ఒక వైపు గట్లు లేకపోవడంతో పల్లపు ప్రాంతాలకు నీరు వెళ్లిపోతోంది. దీంతో రైతులు సాగునీరు అందక అల్లాడుతున్నారు. ఎగువ ప్రాంతాలకు నీరు కావాలంటే రైతులు ఇంజిన్ల సాయంతో తోడుకోవాల్సిన పరిస్థితి. ఒక వైపు గట్టు లేకపోవడం, మరో వైపు తూడు, చెత్తతో నిండిపోవడంతో పాటు పూర్తిస్థాయిలో పూడిక తీసిన దాఖలాలు లేవు. దీంతోపాటు నీటి ప్రవాహం మందగించి పసర్లతో నిండిపోవడంతో అరకొర నీరు కూడా సాగుకు పనికిరావడం లేదని రైతులు అంటున్నారు. ఆక్వా చెరువుల మధ్య నుంచి ప్రవహించే పంట కాలువ కావడంతో నీటి కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. రాత్రిళ్లు ఆక్వా వ్యర్థాలను ఈ కాలువలోకి వదులుతున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువ బాగుచేయించాలని కోరుతున్నారు. -
జగన్ కటౌట్ చూసి కూటమికి కంగారు
● అందుకే అక్రమ అరెస్ట్లు ● మాజీ మంత్రి వనిత మండిపాటు ద్వారకాతిరుమల: కూటమి నాయకులు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కటౌట్ను చూసి.. కంగారు పడే పరిస్థితికి వచ్చారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత ఎద్దేవా చేశారు. గత నెల 21న జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా రామసింగవరంలో వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారంటూ గ్రామానికి చెందిన యువకులు మానుకొండ హిమకుమార్, మానుకొండ రాజ్కుమార్, బిరుదుగడ్డ రాజు, కనికెల్లి కిషోర్, కనికెల్లి ఏసులపై ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వారిని బెయిల్పై విడుదల చేశారు. ఈ సందర్భంగా వనిత ఆదివారం బాధిత యువకుల ఇళ్లకు వెళ్లి వారికి, వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. తానున్నానని భరోసా ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగనన్న పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతటా జరిగిన విధంగానే గోపాలపురం నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగాయన్నారు. వీటిని చూసి కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైందన్నారు. దీంతో కటౌట్లలో ఏ తప్పులున్నాయని వెతుక్కునే పరిస్థితికి కూటమి నేతలు దిగజారిపోయారని మండిపడ్డారు. ఒక సినిమా డైలాగ్ను వాడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఏవైతే హామీలిచ్చారో వాటిలో ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేదని తానేటి వనిత చెప్పారు. దీంతో ప్రజలంతా వారిని తిరస్కరిస్తున్నారన్నారు. దా నిని కవర్ చేసుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి, జగనన్న పుట్టినరోజును కూ డా రాజకీయానికి వాడుకున్నారని విమర్శించారు. ఈ దుస్థితి మన రాష్ట్రంలో, మన రాజకీయాల్లో మాత్రమే కనిపించడం దౌర్భాగ్యమన్నారు. మేకను నరికిన దానికి జంతు బలి అంటూ రచ్చ చేయడం దారుణమన్నారు. చంద్రబాబు, పవన్కల్యాణ్, బాలకృష్ణ కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బలిచ్చినవి వారికి కనిపించలేదా అని ప్రశ్నించారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, ఎప్పుడో పెట్టిన పోస్టులను వెతికి పట్టుకుని మరీ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మన రాష్ట్రంలో మాత్రమే చూశామన్నారు. వైఎస్సార్సీపీని అణగదొక్కడమే లక్ష్యంగా కూటమి పాలన సాగిస్తోందని మండిపడ్డారు. అందుకే ప్రజ లు కూటమి ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని వనిత భరోసా ఇచ్చారు. ఆమె వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
వెలివేశారంటూ ఆత్మహత్యాయత్నం
ముసునూరు: తన కుటుంబాన్ని వెలివేసినట్లు కుల పెద్దలు ప్రకటించడంతో మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఎస్సై ఎం.చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. మండలంలోని లోపూడి గ్రామానికి చెందిన బోట్ల కనకారావు ఇటీవల నాటు సారా తయారీ, విక్రయాలు నిర్వహిస్తుండగా ఎకై ్సజ్ అధికారులు దాడులు చేసి పట్టుకుని రిమాండ్కు తరలించారు. బెయిల్పై వచ్చిన తర్వాత గ్రామంలోని తన సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలు అతనిని పంచాయతీకి పిలిపించి, రూ.లక్ష జరిమానా విధించారని, కట్టలేమని బతిమాలినా వినిపించుకోలేదని జరిమానా చెల్లించకపోతే వెలివేస్తున్నామని ప్రకటించారని వీడియోలో పేర్కొన్నారు. తమ కులస్తులు ఎవరూ తమతో మాట్లాడకుండా ఉండాలని, తన తల్లిదండ్రులను కూడా బెదిరించారని, తమకు మంత్రి పార్థసారథి అండదండలున్నాయని ఏమీ చేయలేవని తనను బెదిరించారని వీడియోలో పేర్కొన్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పురుగుమందు డబ్బాతో సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై చెప్పారు. సీసీ కెమేరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. సారా తయారీ విక్రయాలు మానేయాలని హెచ్చరించామని తమ మాటను ధిక్కరించడంతో మిన్నకుండి పోయామని, వెలి వేయడం, కుల బహిష్కరణ చేయడం వంటి నిర్ణయాలు తాము చేయలేదని కుల పెద్దలు పేర్కొంటున్నారు. పురుగుల మందు డబ్బాతో కుటుంబం సెల్ఫీ వీడియో -
20 కాసుల బంగారం చోరీ
తణుకు అర్బన్: ఇంట్లో నిద్రిస్తుండగానే చోరీ జరిగిన ఘటన తణుకు మండలం దువ్వ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దువ్వ సంతమార్కెట్ ప్రాంతంలోని భవనంలో నివసిస్తున్న సింహాద్రి సూర్య భగవాన్ నివాసంలోకి శనివారం రాత్రి దొంగలు ప్రవేశించి 20 కాసుల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. సూర్యభగవాన్ ఇంటి కింది భాగంలో మందుల దుకాణం, వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. వ్యాపారం ముగిసిన అనంతరం రాత్రి ఒంటిగంటకు తన భార్యతో కలిసి దుకాణం వెనుక ఉన్న బెడ్రూమ్లో నిద్రించారు. తెల్లవారుజామున 5 గంటలకు మందుల కోసం గ్రామస్తులు తలుపుకొట్టి నిద్రలేపగా మందుల దుకాణంలోకి వెళ్లాడు. క్యాష్ పెట్టె చిందరగా ఉండడంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బెడ్రూమ్లో ఉన్న బీరువా తలుపు తెరిచి ఉంది. చూడగా బంగారు ఆభరణాలు లేవని గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చి తణుకు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. చోరీ ఘటనలో దువ్వ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చోరీ జరిగిన ఇంటిని తాడేపల్లిగూడెం డీఎస్పీ కె.విశ్వనాఽథ్ పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందం, క్లూస్ టీం ఇంటి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దువ్వలో ప్రధానమైన సంతమార్కెట్ ప్రాంతం ఎంతో రద్దీగా ఉంటుంది. ఎటుచూసినా ఇళ్లు ఉన్నప్పటికీ ఇంట్లోకి చొరబడి చోరీ చేసి తీరు అనుమానాస్పదంగా మారింది. బంగారు ఆభరణాలు ఉన్న ప్రాంతంలోనే ఉన్న రూ.10ల నోట్ల కట్టలు తీసుకోకపోవడం గమనార్హం. బీరువాలో ఉన్న బ్యాంకు పుస్తకాలు ఇతర కాగితాలను సందులో గోడపై వదిలివెళ్లారు. రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భక్తుల తిప్పలు.. ఎమ్మెల్యే డప్పులు
ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో గతనెల 30న జరిగిన ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లన్నీ తానే చేయించానని, భక్తులకు ఎక్కడా ఇబ్బందులు కలగలేదని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గొప్పలు చెప్పుకోవడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఆరోజు భక్తులు పడిన ఇబ్బందుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నల్లజర్ల మండలంలోని ప్రకాశరావుపాలెంలో గత శనివారం జరిగిన టీడీపీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గతేడాది ముక్కోటి ఏర్పాట్లను తానే దగ్గరుండి పర్యవేక్షించానని, అప్పుడు 30 నుంచి 35 వేల మంది భక్తులు వచ్చారని, ఈ సారి రెట్టింపు అవుతుందని అనుమానం కలిగిందన్నారు. అందుకే కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేయించానన్నారు. పెద్ద తిరుపతిలో ముక్కోటి మరుసటి రోజు 64 వేల మంది భక్తులు దర్శిస్తే, ద్వారకాతిరుమలలో ముక్కోటి నాడు 60 వేల మంది భక్తులు దర్శించారన్నారు. ఇబ్బంది కలగకుండా మంచినీరు, మజ్జిగ, అల్పాహారం ఇవ్వాలని రాత్రి 9 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వెంటపడుతూ దేవస్థానం వారికి, పోలీసులకు డైరెక్షన్ ఇచ్చానన్నారు. కనీసం మంచినీరు కూడా అందలేదని, టాయిలెట్స్ లేవని, రూ. 500 లు టికెట్లు తీసుకుని నానా తిప్పలు పడుతున్నామని, ఇప్పటికే 4 గంటల సమయం పట్టిందని, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని, అధికారులపై భక్తులు మండిపడ్డారు. టీడీపీ నాయకుల వల్లే ఫెయిల్ వీఐపీ గేట్ నుంచి, ధ్వజస్తంభం మీదుగా వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులను మాత్రమే పంపుతామని కలెక్టర్, ఎస్పీలకు వివరించారు. ముక్కోటి నాడు కొందరు టీడీపీ నాయకులు తమ కుటుంబ సభ్యులను, పార్టీకి చెందిన వారిని ఆ గేటు నుంచి లోపలికి పంపారు. దేవస్థానం అధికారులు గేటు తాళాలను సైతం నాయకులకే అప్పగించినట్టు తెలుస్తోంది. ధ్వజస్తంభం వద్ద రద్దీ పెరిగి, రూ. 500 టికెట్లు తీసుకున్న భక్తులు, గోవింద స్వాములు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులంతా అష్టకష్టాలు పడ్డారు. వీఐపీ గేటు లోంచి సుమారు 5 వేల మందికి పైగా వెళ్లినట్టు తెలుస్తోంది. ముక్కోటి ఏర్పాట్లపై గోపాలపురం ఎమ్మెల్యే గొప్పలు 60 వేల మంది శ్రీవారిని దర్శించారని, అన్ని సౌకర్యాలు కల్పించామని ప్రకటన ఆ రోజు సౌకర్యాలు అందక ఇబ్బందులు పడ్డ భక్తులు -
రామేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
పెనుమంట్ర: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు దంపతులు ఆదివారం సాయంత్రం పెనుమంట్ర మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన నత్త రామేశ్వరంలోని ఉమా రామలింగేశ్వర స్వామిని, జుత్తిగలో సోమేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట అడిషనల్ సొలిసిటర్ జనరల్ చెల్ల ధనుంజయ్, హైకోర్టు సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ద్వారకాతిరుమల : గోవిందా.. గోవిందా.. అంటూ శ్రీవారి భక్తులు చేసిన గోవింద నామస్మరణలతో క్షేత్ర పరిసరాలు ఆదివారం మార్మోగాయి. సెలవుదినం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట, ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపంలో భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. పెదవేగి: మహిమ గల తల్లి శ్రీ రాట్నాలమ్మకు భక్తులు విశేష రీతిలో పూజలు నిర్వహించారు. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన శ్రీ రాట్నాలమ్మ అమ్మవారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి దేవస్థానానికి విచ్చేసిన భక్తులు వారి మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ వారం అమ్మవారికి పూజా రుసుం వల్ల రూ.18,100, విరాళంపై రూ.4,622, లడ్డూ ప్రసాదంపై రూ.9,975, పులిహోర ప్రసాదంపై రూ.690, ఫొటోల అమ్మకంపై రూ.1,890, మొత్తం రూ.35,277 ఆదాయం లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్ కుమార్ తెలిపారు. కై కలూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మను దర్శించుకున్నారు. మహిళలు అమ్మకు పాలపొంగళ్లు సమర్పించారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క అదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గధుల అద్దెలు, చిత్రపఠాలు అమ్మకం, వాహన పూజలు, విరాళాలు కలపి రూ.19,426 ఆదాయం వచ్చిందని తెలిపారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఏలూరు (మెట్రో) : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా యూనిట్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఏలూరులో జరిగాయి. శ్రీధర్ రాజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా హెచ్.గోపాలకృష్ణ, ఇతర కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. -
మీర్జాపురంలో ‘బరి’తెగింపు
నూజివీడు: నూజివీడు పేరు చెబితే.. మామిడి తోట లు, బాస్కెట్బాల్, చెడుగుడు పోటీలు గుర్తుకు వస్తా యి. అయితే ప్రస్తుతం పేకాట శిబిరాలు, గ్రావెల్ మా ఫియా గుర్తుకు వస్తుంది. దీనికితోడు సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందేల నిర్వహణకు అడ్డాగా మారనుంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నూజివీడు ప్రాంతంలో జూదాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పండగ సాంప్రదాయం ముసుగులో కోడి పందేలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు నూజివీడు మండలం మీర్జాపురంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం : కోడి పందేలకు బాపులపాడు మండలం అంపాపురం, ఏలూరు స మీపంలోని కొప్పాక సరసన మీర్జాపురం చేరనుంది. ఇక్కడ భారీ బరి ఏర్పాటు చేయడంతో పాటు సోష ల్ మీడియాలో విస్తృతంగా వీడియోలు పెట్టి ప్రచా రం నిర్వహిస్తున్నారు. ప్రధాన బరిని మూడు ఎకరా ల్లో సిద్ధం చేశారు. కోడి పందెం వేసేందుకు ఒక ప్లాట్ఫాం, పందెలను చూసేందుకు మూడు వైపులా గ్యాల రీ, మరోవైపు వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీర్జాపురం గ్రామ పరిధిలో నేషనల్ హైవే–216 హెచ్ నూజివీడు–హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారికి సమీపంలో మీర్జాపురం–బిళ్లనపల్లి రోడ్డులో ఈ భారీ బరి సిద్ధమవుతోంది. సంక్రాంతి సంబరాల పేరుతో ఇక్కడ ముసుగు పందేలతో పా టు రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.9 లక్షల చొప్పున రాత్రీపగలూ తేడా లేకుండా పందేలు వేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జూదగాళ్లు, కోడిపందేలు చూసేందుకు వచ్చే వారు నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరులోని హోటళ్లలో రూమ్లను బుక్ చేసుకున్నారు. రూ.కోట్లలో పందేలు మీర్జాపురంలో కోడి పందేలు కోట్లలో జరగనున్నాయి. మొదటి పందెం రూ.కోటి అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. బరి పందేంతో పాటు చూడటానికి వచ్చే వారు కూడా పెద్ద ఎత్తున పందేలు కాస్తారు. కోడి పందేలకు అనుబంధంగా పేకాట, గుండాట, ఇతర జూద క్రీడలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి జూదాలతో పేదల జేబులు గుల్లకావడం ఖాయంగా కనిపిస్తోంది. వీటిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారో లేదో చూడాలి మరి. కోడి పందేల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు -
అందని సహకారం
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026ఏలూరు (ఆర్ఆర్పేట): గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేవలందించడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీ) కీలకం. వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆయా సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఖజానాకు ఏమాత్రం భారం కాని చిన్నపాటి సమస్యల పరిష్కారానికి మనసొప్పడం లేదు. ఆయా సమస్యలపై ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక ద్వారా మంత్రులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. కంటితుడుపు చర్యలు ప్రకటనలతో సరిపెట్టడం తప్పించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో విసుగు చెందిన ఉద్యోగులు నెల రోజులుగా దశల వారీగా ఆందోళనలు చేస్తున్నారు. దశల వారీగా ఆందోళనలు గతేడాది నవంబర్ 27న సహకార రంగంలో ఉన్న రెండు యూనియన్లు ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించాయి. దీనిలో భాగంగా గతనెల 6న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులకు హాజరయ్యారు. 8న డీసీసీబీ బ్రాంచి ఆఫీసుల వద్ద ధర్నాలు చేశారు. 16న జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి వినతిపత్రాలు అందించారు. 22న డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. 29న రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. కనీసం చర్చలకూ పిలవలేదు సహకార ఉద్యోగులు దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కనీసం ఉద్యోగులతో చర్చలు కూడా జరపలేదు. దీంతో సహకార ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళనలు మరింత ఉధృతం చేసేందుకు నిర్ణయించి సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలకు నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ దీక్షలను ఈనెల 26 వరకు కొనసాగించాలని కార్యాచరణ ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన సహకార ఉద్యోగులు రోజుకు ఒక జిల్లా చొప్పున రిలే దీక్షల్లో పాల్గొనేలా ఆయా జిల్లాల నా యకులకు సూచించారు. ఈమేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగులు ఈనెల 6న విజయవాడ ధర్నాచౌక్లో నిర్వహించే దీక్షల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. జీఓ నం.36ని అమలు చేసి ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి డీఎల్ఎస్ఎఫ్ ఏర్పాటుతో జీతభత్యాలు చెల్లించాలి. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 2019, 2024 వేతన సవరణలు జరగాలి. అప్పటివరకూ మధ్యంతర భృతి ఇవ్వాలి. గ్రాట్యూటీ సీలింగ్ ఎత్తివేసి చట్టప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 ఏళ్ల రిటైర్మెంట్ వయసు అమలుచేయాలి. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇ న్సూరెన్స్ చేయించాలి. డ్యూ టు పద్దులను రద్దు చేయాలి. 2019 తరువాత సంఘాల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. డీసీసీబీకి సహకార సంఘాలు చెల్లించిన షేరు ధనం 6 శాతానికి తగ్గకుండా డివిడెండ్ లేదా వడ్డీ సొసైటీలకు చెల్లించాలి. సమస్యలు పట్టవా? నెల రోజులుగా ఉద్యోగుల ఆందోళనలు అయినా ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కారు నేటి నుంచి రిలే దీక్షలకు పిలుపు నెల రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించి సోమవారం నుంచి రిలే దీక్షలకు పిలుపునిచ్చాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకూ వెనకాడబోం. – కేవీవీ సత్యనారాయణ, సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఆహ్లాదం.. ఆటపాక పక్షుల కేంద్రం
కై కలూరు: పెద్ద పండగ సంక్రాంతి కళ ఆటపాక పక్షుల విహార కేంద్రంలో కనిపిస్తోంది. నూతన ఏడాదికి ఇటీవల సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు పక్షుల కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. విదేశీ పక్షుల రాకకు అనువైన శీతాకాలం కావడంతో ఇప్పటికే పక్షులు ఆటపాకలో కనువిందు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆదివారం పలు జిల్లాల నుంచి పర్యాటకులు పక్షుల వీక్షణకు వచ్చారు. బోటు షికారు చేస్తూ పెలికాన్ పక్షుల కేరింతలను దగ్గర నుంచి తిలకించారు. అదే విధంగా సమీప ఈఈసీ కేంద్రంలో పక్షి నమూనా మ్యూజియంలో పక్షుల విశేషాలను తెలుసుకున్నారు. సమీప చిల్డ్రన్ పార్కులో చిన్నారులు ఆటలాడుకున్నారు. అటవీశాఖ ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాజేష్ కొల్లేరు పక్షుల విశేషాలు, నైసర్గిక స్వరూపం వంటి విషయాలను పర్యాటకులకు వివరించారు. ద్వారకాతిరుమల: మండలంలోని జి.కొత్తపల్లి గ్రామంలో కోడి పందేల స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 17 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 31,630 నగదు, కోడి పుంజు, 17 బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. జంగారెడ్డిగూడెం: కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన నాగరాజు అతని భార్యతో విడిపోయి ఉంటున్నాడు. భార్య జంగారెడ్డిగూడెంలో తన 8 ఏళ్ల కూతురితో జీవిస్తోంది. శనివారం రాత్రి నాగరాజు భార్య ఇంటికి వెళ్లి భార్యను దూషించి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
విరాళాలను దేవస్థానం ఖాతాలో జమ చేస్తాం
ఆగిరిపల్లి: రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి భక్తులు అందించే కానుకలకు దేవస్థానం తరపున రసీదు అందిస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి సీహెచ్ సాయి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ శోభనాచల లక్ష్మీ నరసింహస్వామి మాఘమాస రథసప్తమి ఉత్సవాలు ఈనెల 19 నుంచి 29 వరకు వైభవంగా నిర్వహించునున్నట్లు తెలిపారు. 26న రథోత్సవం నిర్వహించునున్నట్లు తెలిపారు. అన్నదానానికి భక్తులు అందించే విరాళాలకు ఎలాంటి రసీదులు ఇవ్వమని కొంతమంది అంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి అపోహలు నమ్మవద్దని అన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం అన్నదానానికి భక్తులు అందించిన విరాళాలు రూ.6,24899 దేవస్థానం తరఫున ఉన్న బ్యాంక్ అకౌంట్లోనే జమ చేశామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తామని తెలిపారు. వేలేరుపాడు: 2024, 2025వ సంవత్సరంలో ఉపాఽధి హామీ పథకం కింద చేపట్టిన చెరువులు, రహదారుల పనుల్లో అనేక అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీలో బయటపడింది. శనివారం వేలేరుపాడు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రేపాకగొమ్ము సర్పంచ్ సోడే వెంకమ్మ అధ్యక్షతన నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. మొత్తం రూ.8 కోట్ల వ్యయంతో 520 పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రొసీడింగ్ ఆఫీసర్గా ఉన్న నూజీవీడు ఏపీడీ శ్రీనివాసరావు వివిధ పనుల రికార్డులు పరిశీలించగా, రూ.26.31 లక్షల అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ పనులు ఎక్కడ చేపట్టారో చూపాలని ఏపీడీ సిబ్బందిని ప్రశ్నించగా, సరైన సమాధానం ఇవ్వకపోగా, గోదావరి వరదలకు కొట్టుకుపోయాయని సమాధానమిచ్చారు. దీనిపై ఏపీడీ పూర్తి విచారణకు ఆదేశించారు. ఫీల్డు అస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.22 వేల చొప్పున జరిమానా విధించారు. దుర్వినియోగం చేసిన సొమ్మును ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల వద్ద రికవరీ చేయాలని ఆదేశించారు. పెదపాడు: మండలంలోని అప్పనవీడులో గత నెల 23న రెడ్డి జ్యోతి అనుమానస్పద రీతిలో మృతి చెందడంతో పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా భర్త అనిల్, మరో మహిళ పాకలపాటి జ్యోతిని అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపర్చామని పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపారు. -
కమ్మేసిన పొగమంచు
భీమడోలు: జాతీయ, రాష్ట్ర రహదారులను దట్టమైన పొగమంచు కమ్మేసింది. శనివారం తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరడంతో మంచు కురిసి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదయం 9 గంటలైన మంచు తెరలు వీడనే లేదు. భీమడోలు బస్టాండ్ ప్రయాణికులు లేక వెలవెలబోయింది. రహదారులపై మంచు కమ్ముకోవడంతో రహదారులు కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం సాగించారు. ఉదయం పనులకు వెళ్లే కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు. వృద్ధులు, చిన్నపిల్లలు మంచులో తిరగవద్దని, తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
తమ్ముడు కాకపోయినా తలకొరివి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను (45) అనారోగ్యంతో బాదపడుతూ శనివారం మృతి చెందాడు. బంధువులు ఉన్నా ఎవరింటికీ వెళ్లడు. పొరుగున ఉండే పతివాడ మావుళ్లమ్మను అక్కా అని పిలిచేవాడు. ఆ అనుబంధంతో ఆమె తలకొరివి పెట్టింది. తాను ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసి వయసు మీదపడడంతో మానేశానని.. శ్రీనును ఇంటి వద్దే పెట్టుకుని చూసుకునేదాన్నని మావుళ్లమ్మ తెలిపింది. శ్రీనుకు ఇద్దరు అక్కలున్నట్లు సమాచారం. శనివారం శ్రీను మృతి చెందడంతో కుటుంబ సభ్యలుకు సమాచారం ఇచ్చినా రాలేదని.. తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే పెట్టినట్లు ఆమె తెలిపింది. -
బతుకు చక్రం సాగేదెలా?
బుట్టాయగూడెం: సమాజంలో మనిషికి గౌరవం, హుందాతనం వచ్చేలా చేసేది అతను ధరించే దుస్తులే. ఆ దుస్తులకు మంచి రూపురేఖలతో సాధారణ గుడ్డను దుస్తులుగా తయారు చేయడంలో టైలరింగ్దే కీలకపాత్ర. అయితే టైలర్ బతుకు చక్రం అంధకారంగా మారింది. రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో కుట్టు మిషన్ల చక్రం వేగం తగ్గింది. వివిధ డిజైన్లతో రెడీమేడ్ దుస్తులు సరసమైన ధరలకే లభించడంతో యువత వాటిపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీని ఫలితంగా టైలర్ల కుటుంబ పోషణ భారమై దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు రెడీమేడ్ దుస్తులపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో టైలర్స్ చేతుల్లో పనిలేక అనేక మంది రోడ్డున పడుతున్నారు. కొందరైతే ఈ పనిమానేసి వేరే పనుల్లో స్థిరపడుతున్నారు. 30 ఏళ్లపాటు టైలరింగ్ వృత్తిలో అనుభవం ఉన్న టైలర్లు ప్రస్తుతం చేసేందుకు పనిలేక ఇల్లు గడవక బడ్డీ కొట్లు ఏర్పాటు చేసుకుని సరుకులను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలో 600కు పైగా టైలర్లు జిల్లాలో సుమారు 600కు పైగా టైలర్లు ఉన్నట్లు తెలుస్తుంది. అత్యధికంగా 30 నుంచి 40 సంవత్సరాలు అనుభవం ఉన్న టైలర్లు ఉన్నారు. ఒకప్పుడు ఎలాంటి దుస్తులు కుట్టాలన్నా టైలర్లపైనే ఆధారపడవలసి వచ్చేది. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, పాఠశాలల పునఃప్రారంభం సమయాల్లో టైలర్లకు తీరికలేక రాత్రీ పగలు పనిచేయాల్సి వచ్చేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనుచూపుమేర కనిపించడంలేదని టైలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెడీమేడ్ దుస్తుల ప్రభావం గుదిబండలా మారింది. క్రిస్మస్, సంక్రాంతి పండుల్లో కుట్టేందుకు తమకు పనులు లేక మహిళల చీరల పాలు, పాత ప్యాంట్లు సైజులు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నామని టైలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 600 మంది టైలర్ల పరిస్థితి ఇలానే ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో రూ.10 వేల ఆర్థిక భరోసా: వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాదికి రూ.10 వేల చొప్పున టైలర్ల బ్యాంక్ ఖాతాలో జమ చేసేవారు. నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా టైలర్స్ డే రోజున టైలర్ల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఇలా ఒక్కో టైలర్కు నాలుగేళ్లలో రూ.40 వేలు సొమ్ము బ్యాంకు ఖాతాలో జమయ్యేవి. ప్రస్తుతం పనులు లేక ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారంలేక తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని టైలర్లు కోరుతున్నారు. టైలర్లకు తగ్గిన గిరాకీ పండుగ రోజుల్లో పనులు లేక వెలవెలబోతున్న షాపులు ప్రత్యామ్నాయ పనుల వైపు చూపు వైఎస్సార్సీపీ పాలనలో ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం టైలర్ వృత్తినే నమ్ముకుని జీవనం సాగించే వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో పనులు లేక టైలర్లు దుర్భర జీవితం గడుపుతున్నారు. రాబోయే రోజుల్లో టైలర్లు కనుమయ్యే పరిస్థితి నెలకొంది. నేను 1982 నుంచి టైలర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం టైలర్లకు ఇటువంటి పరిస్థితులు వస్తాయని నేను ఊహించలేదు. ప్రభుత్వం టైలర్లను ఆదుకోవాలి. దొండపాటి గంగులు, టైలర్, బుట్టాయగూడెం ప్రస్తుతం రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం టైలర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పండుగ రోజుల్లో కూడా పనులు లేక పస్తులు ఉండే పరిస్థితి నెలకొంది. నేను గత 30 సంవత్సరాలుగా టైలరింగ్ పనిచేస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర ఇద్దరు టైలర్లు పనిచేస్తున్నారు. వారికి పని చూపించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. పండుగ రోజుల్లో సరైన పనులు లేక ముగ్గురం ఖాళీగా ఉంటున్నాము. గత వైఎస్సార్సీపీ పాలనలో మా బ్యాంక్ ఖాతాలో ఏడాదికి రూ. 10వేలు చొప్పున నాలుగేళ్లలో రూ. 40 వేలు అందించారు. షేక్ లాల్సాహెబ్, బాబూ టైలర్, బుట్టాయగూడెం -
మధ్యవర్తిత్వంపై ప్రత్యేక సదస్సు
ఏలూరు (టూటౌన్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఈ నెల 2 నుంచి 31 వరకు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం నిమిత్తం స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఎ.మేరీ గ్రేస్ కుమారి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శిక్షణ పొందిన మధ్యవర్తులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మధ్యవర్తులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, కక్షిదారులకు న్యాయ సహాయం అందించడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి ఏ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్లో సామగ్రి అగ్నికి ఆహుతి
దెందులూరు: విద్యుదాఘాతంతో గోపన్నపాలెంలో ఆకుల సురేష్కు చెందిన ఇంట్లో ఫ్రిడ్జ్, సామగ్రి అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆకుల సురేష్ ఇంట్లో మంటలు ఎక్కువ కాకుండా అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో ఫ్రిజ్తో పాటు రూ.లక్ష విలువచేసే సామగ్రి కాలిపోయింది. పెనుగొండ: అప్పుల బాధతో చిట్ఫండ్ వ్యాపారి దొంగరావిపాలెం బ్రిడ్జి వద్ద శనివారం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండపేట మండలం ఏడిదకు చెందిన పల్లా సురేష్(52) చిట్ఫండ్ చేస్తూ నష్టాల పాలయ్యాడు. భార్య నాగలక్ష్మీకి చెందిన బంగారం అమ్మినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య నాగలక్ష్మి తణుకులో జాన్వీ బ్యూటీ అకాడమీలో బ్యూటిషియన్గా పనిచేస్తోంది. అప్పులు బాధ ఎక్కువ కావడంతో ఏడిదలో ఉన్న ఇంటిని అమ్మే విషయంలో మనస్పర్ధలు రావడంతో తణుకు నుంచి ఏడిద వెళ్తూ గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని 21వ వార్డు కొబ్బరితోట, మహంకాళమ్మ గుడి సమీపంలో ఉంటున్న నడపన రంగారావు(50) శనివారం సాయంత్రం టూ టౌన్లోని ఏలూరు కాలువలో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. రంగారావు టీ సెంటర్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. అగ్నిమాపక అధికారి కేవీ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. -
నేరాల అదుపునకు సాంకేతిక పరిజ్ఞానం సాయం
కై కలూరు: రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మండలంలోని పోలీసుస్టేషన్లను ఎస్పీ శనివారం తనిఖీ చేశారు. అనంతరం టౌన్ పోలీసుస్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నేరాల నియంత్రణలో సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నేరాల సంఖ్య తగ్గుతోందని ఇందుకు సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడమే ప్రధాన కారణమన్నారు. కై కలూరు స్టేషన్ల పరిధిలో ఇటీవల నమోదైన కేసుల్లో సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించి కేసులను ఛేదించడం అభినందనీయమన్నారు. తాడేపల్లిగూడెం: పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని శనివారం విజిలెన్సు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా చేసిన దాడిలో స్వాధీనం చేసుకున్నారు. చిన్నంశెట్టి మణికంఠ 4.50 టన్నుల రేషన్ బియ్యం నిల్వ చేసినట్టుగా సోదాల్లో గుర్తించారు. అతనిని అధికారులు ప్రశ్నించగా రేషన్ కార్దుదారుల నుంచి కిలో రూ.20కి కొనుగోలు చేసి , జంగారెడ్డిగూడెంకు చెందిన మంచాల సాయికి కిలో రూ.22 చొప్పున విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు నిల్వ ఉన్న సుమారు రూ.1.80 లక్షల విలువైన బియ్యం స్వాధీనం చేసుకుని, నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేశారు. విజిలెన్సు ఎస్పీ కె.నాగేశ్వరరావు ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడిలో విజిలెన్సు ఎస్ఐ కె.సీతారాం, గూడెం సీఎస్డీటి. వి.అన్నపూర్ణ, వీఆర్ఓ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వ్యూహాలకు పదును పెట్టాలి
తాడేపల్లిగూడెం: లక్ష్యాలు సాధించాలంటే విద్యార్థులు వ్యూహాలకు పదును పెట్టాలని నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు పిలుపునిచ్చారు. ఇనిస్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్, ఏపీ నిట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఎంటర్ప్రెన్యూర్ షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంటు ప్రోగ్రామ్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఏపీఎంఎస్ఎంఈ టెక్నాలజీ సహకారంతో ఈనెల 20 నుంచి 20 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి ద్యార్థులు సృజన శీల వ్యాపార ఆలోచనలకు ఆకృతినిస్తే అంకుర పరిశ్రమలు రూపుదిద్దుకుంటాయన్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలన్నారు. విభిన్న ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకొచ్చే విద్యార్థులను సంస్థ ప్రోత్సహిస్తోందన్నారు. నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, కార్యక్రమం చైర్మన్ జి.రవికిరణ్శాస్త్రి మాట్లాడుతూ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యవంతులుగా తయారు కావడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, నిట్ అధికారులు పాల్గొన్నారు. -
కోడి పందేలకు సన్నద్ధం
దుగ్గిరాలలో సిద్ధం చేస్తున్న బరిసాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందేలకు సర్వం స న్నద్ధమైంది. హైకోర్టు నిషేధాజ్ఞలు.. నూరు శాతం కట్టడి చేస్తామన్న పోలీసుల ప్రతిజ్ఞలు.. సాంప్రదాయ పందాలనే నిర్వహిస్తామంటూ ప్రజాప్రతినిధుల మాటల ముసుగున కత్తికట్టిన కోడి పందేలకు వేదికలు సిద్ధమవుతున్నాయి. మినీ స్టేడియాలను తలపించే రీతిలో ప్రతి నియోజకవర్గంలో భారీ పందెం బరులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆగకుండా సోషల్ మీడియా వేదికగా పందెంరాయుళ్లను ఆకర్షించేలా హడావుడి చేయడం విశేషం. ఇంత జరుగుతున్నా పోలీసులు మొక్కుబడిగానైనా స్పందించని పరిస్థితి. గతేడాది సంక్రాంతి సీజన్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు పందేలు జరిగినట్టు అంచనా. ఈసారి అంతకు మించి అనే స్థాయిలో పందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, కర్నాటకలకు చెందిన బడా నాయకులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పలుకుతున్నారు. మండలానికి 15కు తగ్గకుండా.. ప్రతి నియోజకవర్గంలోనూ భారీ పందెం బరులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి మండలానికీ 15కు తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలోని దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు సంబంధించిన బరి మినీ స్టేడియం తరహాలో సిద్ధమైంది. పందెంరాయుళ్లు కూర్చోవడానికి వీలుగా సాధారణ గ్యాలరీలు మొదలు వీఐపీల గ్యాలరీ వరకు పందెం బరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియాలో సైతం పోస్టులు చేస్తున్నారు. ఇదే తరహాలో తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆస్పత్రి వెనుక భారీ బరి సిద్ధం చేస్తున్నారు. తణుకు నియోజకవర్గంలోని అత్తిలి, తేతలి, ఆచంట నియోజకవర్గంలోని మార్టేరు, వెలగలేరు, పాలకొల్లు నియోజకవర్గంలో చించినాడ బ్రిడ్జి వద్ద, భీమవరంలోని వీరవాసరం, సీసలి, జువ్వలపాలెం, ఉండి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో, జంగారెడ్డిగూడెం, చింతలపూడి ప్రాంతాల్లోనూ బరులు సిద్ధమవుతున్నాయి. ప్రజాప్రతినిధులకు పర్సంటేజీలు కూటమి పార్టీల నేతలే పూర్తిస్థాయిలో పందేల నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పందేల స్థాయిని బట్టి ప్రజాప్రతినిధులతో పర్సంటేజీలు ఖరారు చేసుకుంటున్నారు. జిల్లాలో ఇద్దరు, ముగ్గురు ప్రజాప్రతినిధులు ఇంకో అడుగు ముందుకేసి సొంత బరులు, సొంత స్థలాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.లక్షల నుంచి రూ.కోట్ల స్థాయి మొ దలు, పందేల జరిగే బరుల వరకూ ముడుపులను పర్సంటేజీల వారీగా ఖరారు చేస్తున్నారు. వీటిల్లో సింహభాగం ప్రజాప్రతినిధి ముఠాకే దక్కుతుంది. అవన్నీ కూడా ఖర్చుల పేరిట వసూలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇక పేకాట, గుండాట నిర్వాహకులకు కూడా పందేల స్థాయిని బట్టి రేట్లు ఖరారు చేస్తున్నారు. పండగ పేరు.. జూదాల జోరు ఉమ్మడి పశ్చిమలో బరులకు ఏర్పాట్లు భారీస్థాయిలో పందేలకు సన్నాహాలు మినీ స్టేడియాలను తలపించేలా వేదికలు ప్రజాప్రతినిధులతో నిర్వాహకుల వాటాల మంతనాలు పేకాట, గుండాట, కోతాటలకు స్పెషల్ ప్యాకేజీ సోషల్ మీడియా వేదికగా బరుల వివరాలు వెల్లడి అడ్డగోలుగా బరులు ఏర్పాటుచేస్తున్నా పట్టించుకోని పోలీసు యంత్రాంగంఉమ్మడి జిల్లాలో ఏటా సంక్రాంతి సీజన్లో భారీగా కోడి పందేలు నిర్వహిస్తుంటారు. రూ.5 వేల నుంచి మొదలు రూ.5 కోట్ల వరకు పందేలు కాస్తూ మూడు రోజులపాటు నిర్వహిస్తుంటారు. వీటితో పాటు పేకాట, గుండాట, కోతాట, ఇతర జూదక్రీడలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. పోలీసులు యథావిధిగా కోడిపందాల సీజన్ ముందు మొక్కుబడి బైండోవర్లు, నియోజకవర్గానికి ఓ చోట పందెం బరులను ధ్వంసం చేయడం, కోడికి కట్టే కత్తులను పదుల సంఖ్యలో సీజ్ చేసి నివేదికను హైకోర్టుకు పంపి కట్టడి చేస్తున్నట్టు ప్రకటించి పండగ దాటించేస్తుంటారు. అయితే ఈ ఏడాది జిల్లాలో పోలీస్ స్పందన మాత్రం నామమాత్రంగానే ఉంది. ఉమ్మడి పశ్చిమ రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతంలోనే కోడి పందేలకు ప్రసిద్ధి. ఆంధ్ర, తెలంగాణతో పాటు బెంగళూరు, చైన్నె నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్ల వస్తుంటారు. ముఖ్యంగా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, కై కలూరులో మూడు రో జుల పాటు మకాం వేసి రూ.లక్షలు మొదలు రూ.కోట్ల వరకు పందేలు కడుతుంటారు. -
వేటకు పోటు
సముద్రంలో వేట సాగించే బోట్లకు డీజిల్ సబ్సిడీ సొమ్ములు ప్రభుత్వం మూ డు నెలలుగా జమ చేయడం లేదు. ఇది చాలా దారుణం. మత్స్యకార భృతి పెంచామని చెబుతున్న ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ లేకుండా చేసి నడ్డివిరిచింది. వెంటనే ప్రభుత్వం పెండింగ్ సొమ్ములు జమచేయాలి. నెలకు రిజిస్టర్ బోటుకు డీజిల్ సబ్సిడీ కింద రూ.10 వేలు అందించాలి. – బర్రి శంకరం, మత్యకార నేత డీజిల్ సబ్సిడీ సొమ్ములు కొంతకాలంగా జమకాకపోవడం నిజమే. అయితే సాంకేతిక ఇబ్బందులు కారణంగానే ఇది జరిగింది. త్వరలో డీజిల్ సబ్సిడీ బోటు యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమవు తుంది. నరసాపురంలో 139 రిజిస్టర్ బోట్లు ఉన్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వేట సాగించే బోట్లకు ఆ బోట్లు ఏ జిల్లాలో రిజిస్టర్ అయ్యి ఉంటే అక్కడే సొమ్ములు జమవుతాయి. – వై.ఏడుకొండలు, ఇన్చార్జ్ మత్స్యశాఖ అధికారి, నరసాపురంనరసాపురం: సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు చంద్రబాబు ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని మూడు నెలలుగా నిలిపివేసింది. ఇక ఈ సబ్సిడీని పూర్తిగా నిలిపివేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. దీంతో గంగపుత్రులపై డీజిల్ భారం పడుతోంది. అలాగే సముద్రపు వేట కష్టం కానుంది. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో వేట సవ్యంగా సాగడం లేదు. దీనికి తోడు డీజిల్ సబ్సిడీకి బ్రేక్ వేయడంతో వేటకారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరోవైపు ఐస్ ధరలు, నిర్వహణ వస్తువు ల ధరలు కూడా పెరగడంతో వేటకు ఖర్చు తడిసిమోపెడు అవుతోందని అంటున్నారు. బోటుకు 300 లీటర్లు ప్రభుత్వం వేట బోటుకు నెలకు 300 లీటర్ల డీజిల్పై సబ్సిడీ కింద రూ.2,700 ఇస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబందించి నరసాపురంలో రిజిస్టర్ వేట బోట్లు 139 ఉన్నాయి. గతంలో డీజిల్ సబ్సిడీ లీటరు రూ.6 ఉండగా.. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.9కు పెంచింది. ఇలా సముద్రపు వేటకు ఊతమిచ్చింది. జిల్లాలో సుమారు 5 వేల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. నరసాపురం తీరంలో రోజూ 80కి పైగా మెకనైజ్డ్ బోట్లు వేట సాగిస్తాయి. మత్స్య సంపద ఎక్కువగా లభిస్తుండటంతో విశాఖ, మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు ప్రాంతాలకు చెందిన బోట్లు కూడా ఇక్కడ వేట సాగిస్తాయి. డీజిల్ దెబ్బకు విలవిల ప్రస్తుతం డీజిల్ ధర లీటరు రూ.98లుగా ఉంది. వేట బోట్లకు డీజిల్ ప్రధానం. ఒక్కో బోటు సముద్రంలోకి వేటకు వెళ్లి రోజుల తరబడి ఉంటుంది. సరుకు సరిగా పడకపోతే 10 నుంచి 20 రోజుల వరకు వేచి ఉంటారు. దీంతో అన్ని రోజులకు సరిపడా డీజిల్ నింపుకుని వెళుతుంటారు. బోటు కండీషన్ను బట్టి రోజుకు ఒక్కో బోటుకు 20 నుంచి 30 లీటర్ల డీజిల్ అవసరం. వేటకు వెళ్లాలంటే దాదాపు 300 నుంచి 400 లీటర్లు డీజిల్ నింపుకోవాలి. సగటున 400 లీటర్ల డీజిల్కు రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. మొత్తంగా వలలు, ఐస్, నిర్వహణ ఖర్చులు కలిపి ఒక బోటుకు సుమారు రూ.లక్షకు పైగా ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో డీజిల్ సబ్సిడీ అందకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మత్స్య కార్మికులపైనా భారం ఒక్కోబోటుపై 10 మంది వరకు మత్స్యకారులు పని చేస్తారు. వీరికి ప్రత్యేకంగా జీతాలు ఉండవు. వేట ఖర్చులు పోను పడిన సరుకులో వచ్చిన లాభాన్ని బోటు యజమాని కార్మికులకు కొంత శాతం వాటాగా పంచుతాడు. ప్రస్తుతం డీజిల్ సబ్సిడీ అందకపోవడంతో మత్స్య కార్మికులపైనా ఈ ప్రభావం పడుతోంది. అలాగే గోదావరిలో వేట సాగించే ఇంజిన్ చెక్క నావలు కూడా నరసాపురం తీరంలో 200 వరకూ ఉంటాయి. వీరికీ డీజిల్ పోటు తప్పడం లేదు. లీటర్ల లెక్కతో సంబంధం లేకుండా డీజిల్ సబ్సిడీ నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మత్స్యకార సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయి నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మూకుమ్మడిగా వేట సాగిస్తున్న మత్స్యకారులు ఆటు‘బోట్లు’ మూడునెలలుగా డీజిల్ సబ్సిడీకి బ్రేక్ చేపల వేటకు ఖర్చులు తడిసిమోపెడు నష్టాలు చవిచూస్తున్న మత్స్యకారులు డీజిల్ పథకానికి కత్తెరపై నిట్టూర్పు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీజిల్ సబ్సిడీని పెంచాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రాయితీని ఇవ్వకపోవడంపై మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఏడాదిన్నరగా చంద్రబాబు ప్రభు త్వం పలు నిబంధనలతో మత్స్యకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్స్యశాఖ వద్ద రిజిస్టర్ అయిన బోట్లు యజమానులు ముందుగా డీజిల్కు డబ్బులు పెట్టుకోవాలి. తరువాత బిల్లును మత్స్యశాఖకు సమర్పిస్తే ఆరు నెలలకోసారి బిల్లులు మంజూరవుతాయి. -
సందడిగా గోదావరి క్రీడా ఉత్సవాలు
భీమవరం: మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి, శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి క్రీడలు దో హదపడతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అ న్నారు. స్థానిక ఎస్ఆర్కేఆర్ కళాశాలలో శనివారం గోదావరి క్రీడా ఉత్సవాలు (ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాస్థాయి పోటీలు)ను ఆమె క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. శని, ఆదివారాల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, టెన్నికాయిట్, త్రో బాల్, క్యారమ్స్, షాట్పుట్ వంటి క్రీడాంశాల్లో 235 బృందాలు, అథ్లెటిక్స్ 56 మందితో క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఉద్యోగులకు ఆటవిడుపు, శాఖల మధ్య స్నేహపూరిత వాతావరణం పెంపొందించేలా క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి మాట్లాడుతూ మండల, డివిజన్ స్థాయిల్లో ప్రతిభ కనబర్చిన వారు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. -
ఈవీ.. పట్టించుకోరేమీ?
నూజివీడు: పట్టణంలోని ఇరుకు సందుల్లో నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేందు కు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందించిన ఈ వీ ఆటోలు మూలకు చేరాయి. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)లో భాగంగా అందించిన ఆరు ఈవీ ఆటోలు మున్సిపాలిటీ అలసత్వం, నిర్వహణలోపం కారణంగా మరమ్మతులకు గురవడంతో పక్కన పెట్టేశారు. బ్యాటరీలు పనిచేయకపోవడంతో అ లాగే వదిలేశారు. సప్లయి చేసిన కంపెనీ సైతం సర్వీసు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. వీటికి చార్జింగ్ ఎక్కుతున్నా వాహనం కదలడం లేదంటూ గాంధీపార్కు పక్కనే ఉన్న మీసేవా కేంద్రం భవనం ఆవరణలో పెట్టారు. విద్యుత్ ద్వారా నడిచే ఈ వాహనాల ద్వారా మున్సిపాలిటీపై ఆర్థిక భారం తగ్గుతుంది. వీటిని రన్నింగ్లో పెట్టకపోవడంపై పలువురు కౌన్సిలర్లు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. వీటిని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. -
మళ్లీ రోడ్డెక్కిన చెత్త సమస్య
నరసాపురం: నరసాపురంలో చెత్త డంపింగ్ సమ స్యను ఎమ్మెల్యే గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. దీంతో చెత్త డంపింగ్ విషయంలో రోజుకో ఉద్రిక్తత తలెత్తుతోంది. తాజాగా చెత్తను పట్టణంలో మార్కెట్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న పార్కు రోడ్డులోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద డంప్ చేయడం మొదలుపెట్టారు. అక్కడున్న ము న్సిపల్ చేపల మార్కెట్ భవనం వద్ద చెత్తను వేయడంతో శనివారం స్థానికులు అభ్యంతరం చెప్పారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ షాన్వాజ్ఖాన్, బూసరపు జయ తదితరులు మద్దతు తెలిపారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా షాన్వాజ్ఖాన్ మాట్లాడుతూ ఇళ్లు, వ్యాపార సముదాయాలు ఉన్నచోట చెత్తను వేస్తే స్థానికులు ఎలా బ తుకుతారని ప్రశ్నించారు. చెత్తను పార్కు రోడ్డులో డంప్ చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వాటర్ ట్యాంక్ ఏరియాలో.. 12వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ సఖినేటిపల్లి సురేష్ శానిటరీ ఇన్స్పెక్టర్తో వాగ్వాదానికి దిగారు. 18 వార్డులకు నీటిసరఫరా చేసే ట్యాంకర్ ఉన్నచోట చెత్త ఎలా వేస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషన ర్ ఆదేశాలతోనే ఇక్కడ వేస్తున్నామని చెప్పడంతో సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఖిత పూర్వకంగా లేఖ ఇస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. మొత్తంగా మున్సిపాలిటీలో చెత్త సమస్య జటిలమవుతోంది. నరసాపురం పార్కు రోడ్డులో ఉద్రిక్తత -
విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించాలి
భీమవరం: విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి నైపుణ్యాలను పెంపొందించేలా గైడ్స్ ట్రైనింగు వినియోగించుకోవాలని డీఈఓ నారాయణ, ఏపీసీ శ్యామ్సుందర్ తెలిపారు. గైడ్ కెప్టెన్ అడ్వాన్స్, పేసీ కోర్సులకు సంబంధించి స్థానిక ఎస్సీహెచ్బీఆర్ఎస్ స్కూల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శనివారం ఆయన పా ల్గొని మాట్లాడారు. రెసిడెన్షియల్ ట్రైనింగ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా సెక్రటరీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రాముఖ్యత ఉంటుందని, విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని తెలిపారు. హెచ్ఎంలు శ్రీనివాస్, ఎంఓ చంద్రశేఖర్, అడ్వాన్స్ రిసోర్స్ పర్సన్ కస్తూరి సుధాకర్ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మావుళ్లమ్మవారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని శనివారం లెక్కించారు. 105 రోజులకు రూ.1,02,81,455 ఆదాయం సమకూరింది. అలాగే బంగారం 215 గ్రాములు 200 మిల్లీగ్రాములు, 360 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభించినట్టు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్ తెలిపారు. జిల్లా ఎండోమెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, భీమవరం తనిఖీదారు వి.వెంకటేశ్వరరావు, శక్తీశ్వర స్వామి దేవస్థానం ఈఓ దండు కృష్ణంరాజు, భీమేశ్వరస్వామి దేవస్థానం ఈఓ తోట శ్రీనివాస్, చిక్కాల దేవస్థానం ఈఓ కడలి సాగర్ పర్యవేక్షించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ద్వారకాతిరుమల: గొడవ పడుతున్న తల్లి, భా ర్యకు సర్దిచెప్పలేక చెప్పలేక పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందా డు. ద్వారకాతిరుమల పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం.. మండలంలోని శరభాపురం గ్రామానికి చెందిన గుంపుల రాజశేఖర్(30) పి.కన్నాపురంలోని కోకోకోలా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈనెల 1న సాయంత్రం అతడి తల్లి, భార్యకు మధ్య గొడవ జరిగింది. ఈ స మయంలో వారిద్దరికీ సర్దిచెప్పలేక ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్ గ్రామంలోని గొ ప్పగుంట చెరువు వద్ద పురుగుల మందు తాగి పడిపోయాడు. అటుగా వెళ్లినవారు అపస్మారక స్థితిలో ఉన్న రాజశేఖర్ను హుటాహుటిన భీమడోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథ మ చికిత్స అనంతరం రాజశేఖర్ తండ్రి రాంబాబు అతడిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖర్ మృతిచెందగా పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి రాంబా బు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ చెప్పారు.కాళ్ల: దాళ్వాలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనువైన వరివంగడాల వినియోగంపై ఉండి కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. శనివారం సీసలిలో జరిగిన రైతు శిక్షణా కార్యక్రమంలో సూచనలిచ్చారు. దాళ్వాలో ఎంటీయూ 1121 వేయడం వల్ల పంట కోత 130 రోజులపైనే పడుతుందని దీని వల్ల వేసవి ప్రభావం పడి బియ్యం నూక అయ్యే ప్రమాదం ఉందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా 11 ఎంటీయూ 1121తో సంకరపరచి చిరు సంచి దశలో ఉన్న ఎంటీయు 1426 వంగడం సాగు చేయాలన్నారు. జింకు లోపం గమనించి ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలో చొప్పున ముడి జింకును నేలకు వేయాలని సూచించారు. ఎకరాకు 45 కిలోల పొటాషి యం రెండు దఫాలుగా పిచికారీ చేయాలన్నారు. శాస్త్రవేత్తలు మల్లికార్జున, విజయలక్ష్మి, మత్య శాస్త్రవేత్త శ్రీనివాస్, హర్టీకల్చర్ శాస్త్రవేత్త బిందు, వ్యవసాయాధికారి పి.రమేష్నాయుడు పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై పడిగాపులు
జంగారెడ్డిగూడెం: మండలంలోని దేవులపల్లిలో శుక్రవారం ఆర్టీసీ బస్సు మొరాయించింది. భీమవరం డిపోకు చెందిన బస్సు జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం వెళ్తున్న క్రమంలో దేవులపల్లి సమీపంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు రోడ్డుపై మరో బస్సు కోసం ఎదురుచూడాల్సిన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పల్లె వెలుగు బస్సులు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులతో పాటు, కండిషన్ సరిగా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. -
ఉత్తమ వర్జీనియా రైతుగా షేక్ బాజీ
కొయ్యలగూడెం: మండలంలోని కన్నాపురానికి చెందిన షేక్ బాజీ ఉత్తమ వర్జీనియా రైతు అవార్డును అందుకున్నారు. గుంటూరులో శుక్రవారం జరిగిన పొగాకు బోర్డు గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ, వేలం డైరెక్టర్ బి.శ్రీనివాస్, కార్యదర్శి డి.వేణుగోపాల్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా బాజీ మాట్లాడుతూ వర్జీనియా పొగాకు పండించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రైతులను పొగాకు బోర్డు సత్కరించి, అవార్డులు అందిస్తుందన్నారు. కొయ్యలగూడెం: సెంట్రల్ ఎకై ్సజ్ సవరణ చట్టం 2025 ద్వారా పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జాతీయ ప్రధాన రహదారిపై ఎఫ్ఏఐఎఫ్ఏ నాయకులు రైతులు ఆందోళన నిర్వహించారు. ఇప్పటికే ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం, దేశీయ మార్కెట్లో ధరలు స్ధిరంగా ఉండటం, సాగు ఖర్చులు పెరగడం, నియంత్రణ కారణంగా సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నారు. ఈ క్రమంలో అధిక పన్నులు రైతుల ఆదాయంపై ప్రభావం చూపడంతో పాటు, అక్రమ వ్యాపారం పెరుగుతుందన్నారు. -
రుచి మధురం.. నాణ్యతలో ప్రథమం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న మధురమైన ప్రసాదానికి మొదటి ర్యాంక్ దక్కింది. అలాగే భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనలో రెండో ర్యాంక్ లభించింది. రాష్ట్రంలోని ఏడు ప్రధా న ఆలయాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానా లు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ద్వారకాతిరుమల దేవస్థానానికి సంతృప్తికర ఫలితాలు వచ్చాయి. శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, అన్నవరం, విజయవాడ, సింహాచలం, కాణిపాకం, శ్రీశైలం దేవస్థానాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం గత నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకూ వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేను నిర్వహించి, ర్యాంకులను ప్రకటించింది. ఇందులో శ్రీకాళహస్తి 71.2 శాతంతో మొదటి ర్యాంక్ సాధించింది. అలా గే ద్వారకాతిరుమల 70.7 శాతంతో రెండో ర్యాంక్, విజయవాడ 68.1 శాతంతో మూడో ర్యాంక్, అన్న వరం 67.9 శాతంతో నాల్గో ర్యాంక్, సింహాచలం 67.8 శాతంతో ఐదో ర్యాంక్, శ్రీశైలం 67.5 శాతంతో ఆరో ర్యాంక్, కాణిపాకం 66 శాతంతో ఏడో ర్యాంక్ను సాధించాయి. అయితే ప్రసాదాల నాణ్య త, రుచిలో మాత్రం ద్వారకాతిరుమల దేవస్థానా నికి మొదటి స్థానం లభించింది. రుచి, శుచిలో మేటి శ్రీవారి దేవస్థానం భక్తులకు లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి, వడ ప్రసాదాలను అందిస్తోంది. అలాగే నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందజేస్తోంది. నాణ్యత, రుచిలో ఈ ప్రసాదాలు అద్భుతమని భక్తుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ఆలయాల్లో ద్వారకాతిరుమల శ్రీవా రి ప్రసాదాలకు రుచి, నాణ్యతలో మొదటి స్థానం లభించింది. డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన రాష్ట్రంలోని 15 ఆలయాల్లో ఉరుకుంద దేవస్థానానికి మొదటి ర్యాంక్ లభించింది. దేవస్థానాల వారీగా మోపిదేవికి 2వ, విశాఖపట్నంకు 3వ, వాడపల్లికి 4వ, చౌడేపల్లికి 5వ ర్యాంక్, పెంచలకోనకు 6వ ర్యాంక్, మహానందికి 7వ ర్యాంక్, తునికి 8వ ర్యాంక్, అరసవెల్లికి 9వ ర్యాంక్, పెనుగంచిప్రోలుకు 10వ ర్యాంక్, కదిరికి 11వ ర్యాంక్, పెదకాకానికి 12వ ర్యాంక్, బేతంచర్లకు 13వ ర్యాంక్, తిమ్మరాజుపాలెంకు 14వ ర్యాంక్, కసాపురానికి 15వ ర్యాంకులు లభించాయి. దర్శనం సంతృప్తికరంగా జరిగిందా, లేదా. ఆలయాల్లో మౌలిక వసతులు, తాగునీరు, వాష్ రూమ్లు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు బాగున్నాయా, లేదా. ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా, లేదా. ఆలయాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ సంతృప్తికరంగా ఉందా, లేదా. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో చినవెంకన్న దర్శనం సంతృప్తికరంగా జరిగిందని 71.5 శాతం మంది, జరగలేదని 28.5 శాతం మంది తెలిపారు. అలాగే తాగునీరు సదుపాయం, ఇత ర మౌలిక వసతులు బాగున్నాయని 65.5 శాతం మంది, బాగోలేదని 34.5 శాతం మంది తెలిపారు. ప్రసాదం తాజాగా, రుచిగా బాగుందని 81.7 శాతం మంది, బాగోలేదని 18.3 శాతం మంది తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని 66.4 శాతం మంది, బాగోలేదని 33.6 శాతం మంది తెలిపారు. శ్రీవారి ప్రసాదానికి ఫస్ట్ ర్యాంకు చినవెంకన్న దేవస్థానం అందిస్తున్న సేవలకు భక్తుల సంతృప్తి ప్రభుత్వం నిర్వహించిన వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి నాలుగు అంశాలపై సర్వే -
చాలా ఆశలు పెట్టుకున్నాం
బంగినపల్లి, తోతాపురి రకాల్లో మొగ్గ వచ్చి మాడిపోతోంది. మామిడిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. గతేడాది గిట్టుబాటు ధర లేక నష్టాలే మిగిలాయి. దిగుబడి వచ్చిన తరువాత గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – పాలడుగు విజయ్కుమార్, తుక్కులూరు, నూజివీడు మండలం తోటల్లో ఇప్పుడిప్పుడే పూతలు వస్తున్నాయి. పూత కోసం రెండుసార్లు మందులు పిచికారీ చేశా. బంగినపల్లి, తోతాపురి రకాల్లో పూతలు కనిపిస్తున్నాయి. మొగ్గదశ, పచ్చపూత దశల్లో ఉంది. అక్కడక్కడా తేనె మంచు పురుగు కనిపిస్తోంది. – బాణావతు రాజు, లైన్తండా, నూజివీడు. మామిడి తోటల్లో పూత త్వరగా రావాలంటే నీటిలో కరిగే నల్ల గంధకం 5గ్రాములు, పోటాషియం నైట్రేట్ 5 గ్రాములు, బోరాన్ 2 గ్రాములు, జింక్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే వీటికి జతగా లీటరు నీటికి 0.5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కలిపి పిచికారీ చేయాలి. – ఆర్.హేమ, ఉద్యాన అధికారి, నూజివీడు -
గెస్ట్ ఫ్యాకల్టీ ఆందోళన
నూజివీడు ట్రిపుల్ఐటీలో తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గెస్ట్ ఫ్యాకల్టీలు చేపట్టిన ఆందోళన రెండో రోజు శుక్రవారంకొనసాగింది. IIలో uబుట్టాయగూడెం: 40 ఏళ్లుగా తమ తాతల కాలం నుంచి సాగులో ఉన్న భూములపై కొందరు దళారులు కన్నేసి తమను బెదిరించి ఆర్అండ్ఆర్ భూసేకరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ జీలుగుమిల్లి మండలం తాటిరామన్నగూడెంకు చెందిన గిరిజనులు శుక్రవారం జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గిరిజనుడు కుంజా సోమరాజు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో సుమారు 80 ఎకరాల వరకు భూమిని గ్రామస్తులం సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు తమ భూములను ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. సాగులో ఉన్న భూములను ఆర్అండ్ఆర్లో విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు విచారణ చేసి తమ కు న్యాయం చేయాలని, తమను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామస్తులు గుజ్జు మంగరాజు, కుంజా లక్ష్మణరాజు, మడకం కళ్యాణి, పూసం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగిన పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
జంగారెడ్డిగూడెం: ఏపీ మెడికల్ కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపులో భాగంగా 4వ రోజైన శుక్రవారం జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్, సెక్యూరిటీ సిబ్బంది హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ గౌరవా ధ్యక్షుడు జంపన వెంకటరమణ రాజు, మండల కార్యదర్శి కుంచె వసంతరావు మాట్లాడుతూ కార్మికులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు, ప్రభుత్వానికి ఏజెన్సీల పేరిట దళారుల వ్యవస్థను కొనసాగించడం సహేతుకం కాదని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పారిశుద్ధ్య కార్మికుల ప్రధాన సమస్య అయిన కాంట్రాక్ట్ ఏజెన్సీను తొలగించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరంలో మావుళ్లమ్మవారి 62వ జాతర మహోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్లో ఉత్సవ ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్పై ప్రత్యేక దృష్టి సా రించాలని, క్యూలైన్లో భక్తులు తాగునీరు, పా లు అందించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. జేసీ రాహుల్కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు, హెల్ప్డెస్క్ ఏర్పాటుచేయాలన్నారు. పెంటపాడు: తణుకు నుంచి ఏలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ ప్రత్తిపాడు జాతీయరహదారి సమీపంలో పంట బోదెలోకి దూసుకెళ్లింది. బస్సు 80 శాతానికిపైగా ఒరిగి బోల్తా కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉండగా అత్యవసర మార్గం మీదుగా స్థానికులు వారిని బయటకు తీసుకువచ్చారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్ కళ్లు తిరగడం వల్ల బస్సు అదుపు తప్పినట్టు చెబుతు న్నారు. సంఘటనా ప్రాంతాన్ని తాడేపల్లిగూడెం ఎంవీఐ నాయక్ పరిశీలించారు. తణుకు డిపోకు చెందిన సూపర్లగ్జరీ బస్సును ప్యాసింజర్ సర్వీసుగా నడుపుతున్నారు. ప్రమాదంలో ఎవరి కీ గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించి బస్సును బోదె నుంచి బయటకు తీశారు. భీమవరం (ప్రకాశంచౌక్): జంతువులను హింసించేలా ఏ ఒక్కరి చర్య ఉండకూడదు, సంక్రాంతి కోడిపందేలను నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా జంతు సంక్షేమ సంఘ సమావేశా న్ని నిర్వహించారు. కోడిపందేల నియంత్రణ, జంతు సంక్షేమం, మానవ జంతు సంబంధా లు, జంతు సంక్షేమ నియమాలు, జంతు సంక్షేమ చట్టాలు, జంతువుల రవాణా నియమా లు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భీమవరం అంటే కోడి పందేలు అనే ప్రచారం ఉందని, రాష్ట్ర నలుమూలల నుంచి పందేలు, పేకాట, గ్యాంబ్లింగ్, బెట్టింగ్లకు వస్తారని వీటిని పూర్తిగా నిరోధించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జూద క్రీడల నిర్వాహకులు, కోళ్లకు కత్తులు కట్టేవారిపై నిఘా ఉంచాలన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): సచివాలయంలో అర్జీదారు దరఖాస్తు సమర్పణలో వీఆర్వో లే దా పంచాయతీ కార్యదర్శి సంతకం కావా లని డిజిటల్ అసిస్టెంట్లు ఎట్టి పరిస్థితుల్లో దర ఖాస్తులు తిరస్కరించకూడదని ఆదేశించినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టరేట్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, పాజిటివ్ పబ్లిక్ పెర్ఫా ర్మెన్స్ తదితర అంశాలపై సమీక్షించారు. -
కౌలు రైతుల రక్షణకు చట్టం తేవాలి
ఏలూరు(టూటౌన్): కౌలు రైతుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలని, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం, రబీ పంట రుణాలు అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలో దేవాలయ కౌలు రైతుల సమావేశాన్ని అనగాని శ్రీరామ్మూర్తి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్త చట్టం తీసుకువచ్చి కౌలు రైతులకు మేలు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఆలస్యం చేయడం తగదన్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చేలా కొత్త కౌలు రైతుల చట్టం తేవాలన్నారు. ప్రతి కౌలు రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలన్నారు. ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన సర్వీస్ ఇనాం భూముల కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి పంట రుణాలు, నష్టపరిహారాలు, పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. వడాలి ఇనాం భూముల కౌలు రైతుల హక్కులు కాపాడాలన్నారు. పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పల్లి శ్రీధర్, కుంచాల బుల్లిబాబు, కొరికాని వెంకటేశ్వరరావు, బెండు పాపారావు, వెలమల రాంబాబు, ముంగట నాగ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత లేని ప్యాచ్ వర్కులు
ఉండి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో అధికారులు హడావుడిగా రోడ్డు మరమ్మతులు చేపట్టారు. అయి తే ప్యాచ్ వర్కులు తూతూమంత్రంగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఉండి–గణపవరం రోడ్డులో కొంతకాలం క్రితం కోలమూరు–ఆరేడు రోడ్డు మర్మమతుల పనులు ముగించారు. కొత్త ఏడాదిలో ఉండి సెంటర్ నుంచి కోలమూరు వరకు పనులు చేపట్టారు. అయితే ఈ పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారని వాహనచోదకులు అంటున్నారు. గోతులు పూడ్చే సమయంలో మట్టిని పూర్తిగా తొలగించాల్సి ఉండగా కొన్ని ప్రాంతాల్లో పట్టించుకోవడం లేదు. ఇష్టానుసారం గోతులు పూ డ్చుతున్నారు. గ్రావెల్ దానిపై తారు అతి తక్కు వగా వేసి పైన బేబీ చిప్స్ వంటివి వేసి మమ అనిపించేస్తున్నారు. దీని వల్ల ప్రజాధనం వృథా తప్ప అవుతుందని, కొద్దిరోజుల్లోనే గోతులు యథాతథంగా నిలిచి రోడ్డు సాధారణ స్థితికి వచ్చేయడం ఖా యమని స్థానికులు అంటున్నారు. పనులు జరిగే సమయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని చెబుతున్నారు. -
మాతా శిశు మరణాలు నివారించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో మాతాశిశు మరణాలను నివారించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం మాతాశిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులు, బాధిత కుటుంబాల సమక్షంలో వైద్యాధికారులతో సమీక్షించారు. జిల్లాలో గతేడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మాతృ మరణాలు ఒకటి, శిశు మరణాలు 47 నమోదు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మాతాశిశు మరణాలు జీరో శాతం ఉండేలా కృషి చేయాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసూతి సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్లో చివరివరకు వేచి చూడకుండా గర్భం దాల్చిన నాటి నుంచే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ దిశగా మహిళలకు అవగాహన కల్పించాలని వైద్యులను ఆదేశించారు. గర్భిణులు, రోగులకు సేవాభావంతో ఉన్నతమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. స్కానింగ్ చేసినప్పుడు శిశువుకు ఇబ్బందులు ఉంటే ముందుగానే వైద్యసేవలు అందించాలన్నారు. తల్లి పాలిచ్చే విధానం, ఆరోగ్య గుణాలపై బాలింతలకు అవగాహన కల్పించాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. జిల్లా ప్రధాన హాస్పిటల్లో పూర్తిస్థాయిలో పరికరాలకు నివేదిక అందించాలని డీఎంహెచ్ఓకు సూచించారు. డీఎంహెచ్ఓ పీజే అమృతం, డీసీహెచ్ఎస్ బి.పాల్ సతీష్కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి యు.శోభ, ఐసీడీఎస్ పీడీ పి.శారద, డాక్టర్లు పాల్గొన్నారు. -
జాడ లేని డూడూ బసవన్నలు
● కష్టతరంగా గంగిరెద్దు కుటుంబాల జీవనం ● కనుమరుగవుతున్న సంక్రాంతి సందడి చింతలపూడి : తెలుగువారి సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీక గంగిరెద్దులాట. సంక్రాంతి వస్తుందంటే చాలు.. రంగు రంగుల బట్టలు, గంటలు, మువ్వలతో అలంకరించిన బసవన్నలు ఇంటింటికీ తిరిగి అలరించేవి. కాలక్రమేణా శ్రీడూడూ బసవన్నశ్రీ గొంతులు మూగబోతున్నాయి. ఆదరణ కరువై, పొట్టకూటి కోసం గంగిరెద్దులను ఆడించే వారు వేరే పనులు చూసుకుంటున్నారు. పూర్వకాలం నుండి ఈ కళనే నమ్ముకున్నారు. ఎడ్లను తమ కన్న బిడ్డల్లా సాకుతూ, వాటికి విద్యలు నేర్పి, ఊరూరా తిరుగుతూ తెలుగు లోగిళ్లలో పండుగ వెలుగులు నింపుతారు. ఆధునిక కాలంలో యాంత్రిక జీవనం పెరగడం, వినోద సాధనాలు మారడంతో ఈ కళ తన ప్రాభవాన్ని కోల్పోతుంది. ఒకప్పుడు ఊరు మొత్తం ఎదురుచూసే ఈ ప్రదర్శనను ఇప్పుడు గడప దాటి పలకరించే నాథుడే కరువయ్యాడు. సంక్రాంతి రోజుల్లోనే.. గంగిరెడ్ల వారికి ఏడాది పొడవునా పనేమీ ఉండదు. కేవలం సంక్రాంతి పండుగ (ధనుర్మాసం) ప్రారంభంలో పండుగ వచ్చే నెల రోజుల ముందే వీరికి కాస్తో కూస్తో ఆదరణ లభిస్తుంది. పండుగ సమయంలో గ్రామస్తులు ఇచ్చే పాత బట్టలు, ధాన్యం, చిల్లర డబ్బులే వీరికి ప్రధాన ఆదాయ వనరు. బసవన్నలను అలంకరించడానికి, వాటి మేత కోసం చేసే ఖర్చులతో పోలిస్తే వచ్చే ఆదాయం నామమాత్రమే.. అపార్ట్మెంట్ సంస్కృతి పెరగడం వల్ల నగరాల్లో గంగిరెద్దుల రాక దాదాపు నిలిచిపోయింది. వృత్తిని వదిలేయలేక, పొట్ట నింపుకోలేక గంగిరెద్దుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఊరూరా తిరిగే సంచార జీవనం వల్ల వీరి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. వీరి తాత, ముత్తాతలు, తండ్రులు పడుతున్న కష్టాలు చూడలేక తర్వాతి తరం కూలి పనులకు వెళ్తోంది. వీరికి స్థిర నివాసం లేకపోవడం వల్ల రేషన్ కార్డులు, ఓటరు కార్డులు వంటి ప్రభుత్వ ఫలాలు అందడం గగనంగా మారుతోంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సుమారు 250 కుటుంబాలకు పైగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒకప్పుడు ఊరురా గౌరవం పొందిన ఈ కళాకారులు, నేడు సరైన ఆదరణ లేక ఇతర పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రాభవం తగ్గడానికి కారణాలు యాంత్రీకరణ వల్ల వ్యవసాయంలో ఎద్దుల వినియోగం తగ్గిపోయింది. వినోద సాధనాలు, టీవీలు, స్మార్ట్ఫోన్ల రాకతో జానపద కళలపై ఆసక్తి తగ్గింది. ఆర్థిక ఇబ్బందులు, ఎద్దుల పోషణ ఖరీదుగా మారింది. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదు సంస్కృతిని కాపాడుకుందాం గంగిరెద్దులాట కేవలం ప్రదర్శన కాదు, అది మన వ్యవసాయ ఆధారిత నాగరికతకు ప్రతిరూపం. తెలుగు వారి సంప్రదాయాన్ని ప్రతిబింబించే గంగిరెద్దులాట అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రభుత్వం ఈ కళాకారులను గుర్తించి, పెన్షన్లతో పాటు ఎద్దుల మేతకు సబ్సిడీ వంటి రాయితీలు కల్పించి, ఈ జానపద కళను కాపాడాలి. సాంస్కతిక ప్రదర్శనల్లో వారికి ప్రాధాన్యత కల్పించాలి. మా తాతలు, తండ్రుల కాలంలో మాకు రాజమర్యాదలు జరిగేవి. ఇప్పుడు పట్టణాల్లో అయితే అడుక్కునే వారిలా చూస్తున్నారు. ఎద్దును చూసి మురిసిపోయే కాలం పోయింది. ఎద్దు పొట్ట నింపడమే ఇప్పుడు మాకు గగనమైపోయింది దీంతో చాలా మంది ఈ కష్టాన్ని భరించలేక కూలీ పనులకు వెళ్తున్నారు. – ఆవుల మంగయ్య, గంగిరెద్దుల కళాకారుడు -
గెస్ట్ ఫ్యాకల్టీ ఆందోళన రెండో రోజుకు
నూజివీడు: ట్రిపుల్ ఐటీలో గెస్ట్ఫ్యాకల్టీ వేతనాలను యాజమాన్యం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆర్జీయూకేటీ కాంట్రాక్టు టీచింగ్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న ఆందోళన శుక్రవారం రెండో రోజుకు చేరింది. దీనిలో భాగంగా ట్రిపుల్ఐటీ ప్రధాన గేటు వద్ద గెస్ట్ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ 2018లో నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 44మందిని గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించారని, అప్పటి నుంచి రూ.25వేల వేతనానికే పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీతో పాటు డాక్టరేట్ చేసిన టీచర్లు ఎక్కడైనా ఇంత తక్కువ వేతనానికి పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నోమార్లు తమ వేతనాలను పెంచాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఏడేళ్లుగా వేతనాన్ని ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమతో పనిచేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించకపోవడం దారుణం నూజివీడు: ట్రిపుల్ ఐటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్లు పరిష్కరించాలని గత పది రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం అనాగరికమని సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి జీ.రాజు ధ్వజమెత్తారు. ఈ దీక్షకు సీఐటీయూ, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు. -
దేశ సేవలో అసువులు బాసి.. తీరని వేదన మిగిల్చి..
కాళ్ల: దేశ సేవలో తరించాలన్న ఆ యువకుడి ఆశ యం నెరవేరలేదు.. కొడుకుపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.. కుమారుడి మృతి వార్త తెలియగానే ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శిక్షణను దిగ్విజయంగా పూర్తిచేసుకుని విధుల్లో చేరిన తమ ఊరి బిడ్డ ఇక లేడని తెలిసి ఊరంతా కన్నీరు పెట్టింది.. ఢిల్లీలో జరిగిన రైలు ప్రమాదంలో కాళ్ల మండలం బొండాడపేటకు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బొర్రా సత్యనారాయణ (నాని) (26) మృతిచెందారు. సీఆర్పీఎఫ్ అధికారులు మృతదేహాన్ని గ్రా మానికి తీసుకువచ్చి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బొండాడపేటలో విషాద ఛాయలు బొండాడపేటకు చెందిన బొర్రా నాగరాజు, జయ దంపతుల రెండో కుమారుడు సత్యనారాయణ గతేడాది సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఢిల్లీ విధులు నిర్వహిస్తున్నారు. శిక్షణతో పాటు ఆయన పనిచేసింది కేవలం 9 నెలలు మా త్రమే. కనీసం ఇల్లు కూడా సరిగాలేని నాగరాజు కూలీ పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించారు. మిలట్రీలో చేరాలన్న కొడుకు ఆశలు నెరవేర్చారు. ఇటీవల సెలవుపై వచ్చిన నాని త్వరలో ఇల్లు కట్టించి తల్లిదండ్రుకు ఏ కష్టం రానివ్వనని మాటిచ్చి వెళ్లారు. ఇంతలోనే డిసెంబర్ 31న ఢిల్లీలో మధుర వద్ద జరిగిన రైలు ప్రమాదంలో నాని మృతిచెందినట్టు సమాచారం వచ్చింది. ప్రత్యేక విమానంలో భౌతికకాయం నాని భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం రాజమహేంద్రవరానికి పంపించా రు. అక్కడి నుంచి సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండర్ దినేష్కుమార్ శర్మ, ఎస్సై వెంకన్న, ఎనిమిది మంది సిబ్బందితో గ్రామానికి తీసుకొచ్చారు. మండలంలోని జక్కరం కాటన్ పార్కు వద్దకు చేరుకున్న గ్రా మస్తులు, యువత అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా భౌతికకాయాన్ని నాని ఇంటికి తీసుకువచ్చారు. స్థానిక పాఠశాల విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నానికి సంబంధించి వస్తువులు, దుస్తులు అన్నీ జాతీయ జెండాలో మూటకట్టి కమాండర్ దినేష్కుమార్ శర్మ వాటిని తండ్రి నాగరాజుకు అప్పగించారు. దినేష్కుమార్ శర్మ ఆధ్వర్యంలో సర్పంచ్ మధుసూదనరావు, ఎస్సై శ్రీనివాసరావు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి సిబ్బంది నివాళులర్పించారు. మిన్నంటిన రోదనలు నాని మృతి వార్త తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రు లు, సోదరి రోదనలు మిన్నంటాయి. భౌతి కకాయం వద్ద వారు రోదించిన తీరు కన్నీరు పెట్టించింది. శివయ్యా.. నా కొడుకును ఎందుకు తీసుకున్నావ్ అంటూ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కుమారుడి మరణ వార్త తెలిసి విలపిస్తున్న తల్లి జయభౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకువస్తున్న గ్రామస్తులు ఢిల్లీలో రైలు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి కన్నీటి సంద్రమైన బొండాడపేట భారీ ర్యాలీగా భౌతికకాయం తరలింపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు -
ఆశల పూత
● మామిడి తోటల్లో మొదలైన పూత ● గతేడాది నష్టాలపాలైనా ఆదుకోని చంద్రబాబు ప్రభుత్వం ● ఈ సీజన్పై రైతుల గంపెడాశలు నూజివీడు: జిల్లాలో మామిడి రైతులు సాగుపై కోటి ఆశలతో ఉన్నారు. కొందరు పూతల కోసం, మరికొందరు వచ్చిన పూతలు నిలవడం కోసం రసాయన మందులను మామిడి తోటల్లో పిచికారీ చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లోని తోటల్లో పచ్చిపూత, మొగ్గదశ కనిపిస్తుండగా, మ రికొన్ని ప్రాంతాల్లో తెల్లపూత కనిపిస్తోంది. సాధారణంగా వర్షాలకు అక్టోబర్లో తోటలలో ఇగురు వచ్చి డిసెంబరు మొదటి నుంచి పూతలు కనిపి స్తాయి. ఇదే పరిస్థితి మామిడి తోటల్లో ఉండటంతో రైతులు ఆశాభావంతో ఉన్నారు. సుమారు 40 వేల ఎకరాల్లో.. ఏలూరు జిల్లాలో నూజివీడు రెవిన్యూ డివిజన్ పరిధిలోనే మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో కలిపి దాదాపు 38 వేల ఎకరాల్లో, చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో 2 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. తో టల నుంచి ఏటా 1.40 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని అంచనా. మొత్తం విస్తీర్ణంలో 50 శాతం బంగినపల్లి, 30 శాతం తోతాపురి, మిగిలిన 20 శాతం చిన్నరసాలు, ఇతర రకాలు ఉన్నాయి. మామిడి తోటలు డిసెంబరు మొదటి వారం నుంచి జనవరి నెలాఖరు వరకు పూతలు పూస్తాయి. ఫిబ్రవరి ద్వితీయార్థం నుంచి ముదురు పూత వచ్చిన తోటల్లో కాయలు కోతకు వస్తాయి. మే నెలాఖరు వరకు మామిడి కాయల కాపు వస్తుంది. మామిడి తోటలను రైతులు కొందరు కాపు వరకు వ్యాపారులకు విక్రయించడం, మరికొందరు తామే కాయలు కోసం మార్కెట్కు తరలించి విక్రయించుకోవడం చేస్తూ ఉంటారు. గతేడాదిలో పీకల్లోతు నష్టాలు గతేడాది మామిడికి గిట్టుబాటు ధర లేక రైతులు పీకల్లోతు నష్టపోయినా ప్రభుత్వానికి ఏ మాత్రం కనికరించలేదు. రైతులను ఆదుకునే చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తూ ఉండిపోయింది. తోతాపురి రకం కాయలకు అయితే టన్ను ధర రూ.3 వేలకు పడిపోవడంతో కోత ఖర్చు రావడం లేదని రైతులు కాయలను కోయకుండా మామిడి చెట్లకే వదిలేశారు. అంత దారుణమైన పరిస్థితులను రైతులు చవిచూశారు. -
జాతీయస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో ఫార్మసీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఇరపా అమ్మాజీ కిరణ్ యోగాసన పోటీల్లో ప్రతిభ చాటారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 1 వరకు మహారాష్ట్రలో సంగమనేరు ధ్రువ గ్లోబల్ స్కూల్లో పోటీలలో ఐదో స్థానం సాధించారు. అమ్మాజీ రాష్ట్రస్థాయి పోటీలలో గతంలో బంగారు పతకం సాధించిదింద. అమ్మాజీ మాట్లాడుతూ యోగా మానసిక, శారీరక రుగ్మతలకు చక్కటి పరిష్కారమని, యోగా ప్రతి ఒక్కరికి జీవన విధానంగా మారాలని అన్నారు. అంతర్జాతీయ పోటీల్లో కూడా ప్రతిభను చాటి దేశానికి మంచి పేరు తీసుకువస్తానని తెలిపారు. ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన స్వామివారి తిరువీధి సేవ భక్తులకు నేత్రపర్వమైంది. తొలుత ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామివారి వాహనం క్షేత్ర వీధులకు పయనమైంది. గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. అనంతరం ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరువీధి సేవ రాత్రి వైభవంగా నిర్వహించారు. చింతలపూడి: చింతలపూడి మండలం పట్టాయిగూడెం, ఊటసముద్రం గ్రామాల్లో పేకాట శిబిరాలపై శుక్రవారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.28,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆదేశాల మేరకు, సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించినట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. పట్టాయగూడెంలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.16,800 నగదు, ఊటసముద్రంలో 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.11,450 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై సతీష్ కుమార్ మాట్లాడుతూ పేకాట, కోడి పందాలు తదితర అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. తణుకు అర్బన్ : రైలు ఢీకొట్టి వృద్ధుడు మృతిచెందిన ఘటన తణుకు రైల్వే అవుట్ పోస్టు ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. తణుకు మండలం కోనాలకు చెందిన సనమండ్ర గాంధీ(60) కొబ్బరికాయల దింపు కార్మికుడుగా పనిచేసేవాడు. పదేళ్ల క్రితం చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో వైద్యులు కుడి చేయి తొలగించారు. అప్పటి నుంచి కొబ్బరికాయలు కొని, అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఇంటి నుంచి బయటకు వచ్చిన గాంధీ తిరిగి ఇంటికి వెళ్లలేదు. శుక్రవారం ఉదయం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన ఉదంతంతో గుర్తించిన కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టి మృతిచెందినట్లు రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. -
శ్రీవారి దేవస్థానం ఈఓగా భద్రాజీ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానంలో ఉప కార్యనిర్వాహణాధికారిగా పనిచేస్తున్న వై.భద్రాజీ గురువారం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్వీఎస్ఎన్ మూర్తి పదవీ కాలం డిసెంబర్ 31తో ముగియడంతో భద్రాజీకి ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భద్రాజీ గురువారం ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆలయ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): కుకునూరు, వేలేరు లోని కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారని, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.పంకజ్కుమార్ ప్రకటనలో తెలిపారు. కుకునూరులో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, వేలేరులో ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయని, సంబంధిత మండలాలకు చెందిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఏలూరులోని తన కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. నూజివీడు: ట్రిపుల్ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని వెంకట రామారావు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న ధర్మ పోరాట దీక్ష గురువారం తొమ్మిదో రోజుకు చేరింది. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీవీ లక్ష్మణరావు, సుధీర్కుమార్ రిలే నిరాహార దీక్షను చేపట్టారు. వీరి నిరసనకు ఏఐటీయూసీ మద్ద తు పలికింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఆర్జీయూకేటీలో కాంట్రాక్ట్ అ సిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎనిమిదేళ్లుగా జీతాలు పెంచకపోవడం దారుణమన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడం సరికాదన్నారు. వేత న సవరణను తక్షణమే చేయాలని, ఆలస్యమయ్యే పక్షంలో మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. ఏఐటీయూసీ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి చాట్ల పుల్లారావు, ట్రిపుల్ఐటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు జాడ సీతాపతి, వేణుగోపాల్, దుర్గాబాబు, వెంకటేశ్వర్లు, చింతమనాయుడు, గణేష్, జడ సుబ్బారావు, విజయశ్రీ, దీప్తి సాహూ, రచన,సుధీర్, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. సీపీఎం సైతం.. ఏలూరు (టూటౌన్): కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల న్యాయమైన పోరాటానికి సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తిచేయనందున అజాయ వెంచర్స్ ఎల్ఎల్పీ కాంట్రాక్టర్పై పోలీస్ కేసు నమోదు చేశామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలపై కాంట్రాక్టర్లతో, పీఎంఏవై 1.0 ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. పీఎంఏవై 1.0 ఆప్షన్–3కి సంబంధించి అజాయ వెంచర్స్ కాంట్రాక్టర్ 2025 డిసెంబర్ నాటికి 1,780 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 7 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారన్నారు. పూర్తిగా అలసత్వం వహించిన వీరిపై ఇళ్ల నిర్మాణాలకు మ్యాప్ చేసిన డివిజన్ల పరిధిలో పోలీస్ కేసులు నమోదు చేశామన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో బాధ్యతారాహిత్యంగా ఉంటే క్షమించ బోమని హెచ్చరించారు. జిల్లాలో కాంట్రాక్టర్లు ఆప్షన్–3 కింద 6,271 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉండగా 1,191 ఇళ్లను పూర్తిచేశారని, నిర్మాణాలు వేగిరపర్చాలన్నారు. పీఎంఏవై 1.0లో వివిధ కేటగిరీల కింద జిల్లాలో 56,210 గృహ నిర్మాణాలు మంజూరు కాగా ఇప్పటివరకు 36,052 నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. -
భక్తుల కొంగు బంగారం.. మావుళ్లమ్మ
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పట్టణ ఇలవేల్పు, భక్తులపాలిట కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే తల్లి మావుళ్లమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం సహకారంతో ఈనెల 13 నుంచి వచ్చేనెల 14 వరకు జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే అమ్మవారి అలంకరణ పనులు పూర్తయ్యాయి. ఆలయం వద్ద చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్లు, క్యూలైన్, లైటింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయానికి నలుదిక్కులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్లు, విద్యుత్ దీపా ల అలంకరణలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా భక్తులు : ఉత్సవాలను తిలకించేందుకు జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజుల్లో ఆలయం కిటకిటలాడుతుంది. సంక్రాంతికి జిల్లాకు వచ్చే ఇతర ప్రాంతాల వాసులు అమ్మవారిని దర్శించుకోవడం సెంటిమెంట్గా భావిస్తారు. ఇలా నెల రోజుల పాటు ఆలయం వద్ద భక్తజన సందడి ఉంటుంది. ముఖ్యంగా ఆలయం వద్ద విద్యుత్ అలంకరణ, సెట్టింగులు చూసేందుకు పలువురు వస్తుంటారు. మహా అన్నసమారాధన ఉత్సవాల రోజుల్లో ఆలయం వద్ద ఉత్సవ నిర్వాకు లు అన్నదానం నిర్వహిస్తారు. రోజుకు 7 వేల మంది వరకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఉ త్సవాల చివరి రోజు మహా అన్నదానం నిర్వహిస్తా రు. సుమారు లక్ష మంది ప్రసాదాన్ని స్వీకరిస్తారు. 61 ఏళ్లుగా ఉత్సవాలు 61 ఏళ్లుగా నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో నెలరోజుల పాటు నిర్వహించే ఏకైక ఉత్సవంగా మావుళ్లమ్మ జాతర నిలుస్తుంది. గతంలో ఉత్సవాల్లో సినిమా నటులను సన్మానించి బంగారాన్ని బహూకరించేవారు.సిరుల తల్లి.. కల్పవల్లి 13 నుంచి అమ్మవారి ఉత్సవాలు నెల రోజులపాటు వేడుకలు ఆలయం వద్ద చురుగ్గా ఏర్పాట్లు రూ.90 లక్షలతో జాతర నిర్వహణ రూ.90 లక్షల వ్యయంతో.. ఏటా రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సెట్టింగ్స్, లైటింగ్స్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జానపద, భరత నాట్య ప్రదర్శనలు, హరికథ, బుర్రకథ వంటి కళాప్రదర్శనలు, సినీ సంగీత విభావరులు ఏర్పాటుచేస్తారు. సుమారు 30 నాటకాలు, 20 హరికథ, బుర్రకథలు, 15 వరకూ సినీ సంగీత విభావరీ కార్యక్రమాలు ఉంటాయి. ఇలా ఆదరణ కోల్పోతున్న నాటకాలను ప్రోత్సహించి నాటక కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నారు. -
ఎరువు.. ధర బరువు
రకం పాత ధర కొత్త ధర 10:26:26 రూ.1,700 రూ.1,920 14:35:14 రూ.1,800 రూ.1,950 20:20:013 రూ.1,300 రూ.1,400 సాక్షి, భీమవరం: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉంది రైతుల పరిస్థితి. ఖరీఫ్ చివరిలో మోంథా, దిత్వా తుపాన్ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు రబీ ఆరంభంలోనే ఎరువుల ధరల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. కాంప్లెక్స్ ఎరువులు బస్తాకు రూ.100 నుంచి రూ.220లు వరకు పెరిగాయి. జిల్లాలో 2.22 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగనుండగా ఎరువుల రూపంలో రైతులపై దాదాపు రూ.15.40 కోట్ల మేర భారం పడుతుంది. రబీలో వినియోగం ఎక్కువ ఖరీఫ్తో పోలిస్తే రబీలో ఎరువుల వినియోగం ఎక్కువ. ఎకరాకు నాలుగు బస్తాల వరకు రెండు మూడు రకాల కాంప్లెక్స్ ఎరువులు, రెండు బస్తాల యూరియా, అర బస్తా వరకు పొటాష్ వినియోగిస్తుంటారు. జిల్లాలోని 2.22 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగనుంది. 70 శాతం మేర ఎంటీయూ 1121, మిగిలిన విస్తీర్ణంలో పీఆర్ 126, ఎంటీయూ 1153, ఎంటీయూ 1156 రకాలను సాగు జరుగనుంది. వ్యవసాయ లెక్కలు ప్రకారం ఈ సీజన్లో 41,921 టన్నుల యూరియా, 64,992 టన్నుల ఇతర ఎరువులు అవసరం కానున్నాయి. నత్తనడకన సాగు మోంథా, దిత్వా తుపాన్లు వలన రైతులకు ఖరీఫ్ కలిసి రాలేదు. మోంథా ప్రభావంతో ఆకివీడు, నరసాపురం, భీమవరం, పెంటపాడు, మొగల్తూరు తదితర మండలాల్లోని 25వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మాసూళ్లు సమయంలో దిత్వా తుపాను మరింత నష్టం కలిగించింది. తొలకరిలో ఎకరాకు సగటున 26.25 క్వింటాళ్లు చొప్పున జిల్లాలో సాగు చేసిన 2.08 లక్షల ఎకరాలకు 5.77 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా తుపాన్ల వలన సగటు 21 క్వింటాళ్లతో 4.62 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. ఈ మేరకు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,369 మేరకు తగ్గిన దిగుబడి 1.15 లక్షల టన్నులకు గాను రూ.242.43 కోట్ల మేర రైతులు నష్టపోయారు. పంట పెట్టుబడులు దక్కకపోవడంతో దాళ్వా పైనే ఆశలు పెట్టుకున్నారు. ముందుగా తొలకరి మాసూళ్లు పూర్తయిన తాడేపల్లిగూడెంలో నాట్లు మొదలవ్వగా పెంటపా డు, అత్తిలి, పాలకోడేరు, ఇరగవరం, పెనుమంట్ర, వీరవాసరం, పోడూరు, పెనుగొండ తదితర మండలాల్లో నారుమడులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో నారుమడులు పోయడం దాదాపు పూర్తికావాల్సి ఉండగా బ్యాంక్ కెనాల్, నరసాపురం, అత్తిలి, జీఅండ్వీ, ఉండి, కాకరపర్రు తదితర కాలువల పరిధిలోని శివార్లకు పూర్తిస్థాయిలో నీరందక పనులకు ఆలస్యమైంది. ప్రారంభంలోనే సాగునీటి స మస్య ఎదురవ్వడంతో మున్ముందు వంతుల వారీ విధానం మొదలై ఎండలు ముదిరేకొద్దీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఉంది. ఖరీఫ్ మి గిల్చిన నష్టంతో రబీ పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఎరువుల ధరలు పెరగడం వా రిని మరింత ఆవేదనకు గురిచేస్తోంది. రైతు నెత్తిన పిడుగు కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలు బస్తాకు రూ.100 నుంచి రూ.220 వరకు పెంపు జిల్లాలో 2.22 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు రైతులపై రూ.15.40 కోట్ల అదనపు భారం ఇప్పటికే ఖరీఫ్ కలిసిరాక, దాళ్వా పెట్టుబడులకు సొమ్ములు లేక అవస్థలు రూ.15.40 కోట్ల భారం కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఇటీవల కంపెనీలు పెంచేశాయి. ఈ సీజన్లో ఎక్కువగా వినియోగించే 10:26:26 కాంప్లెక్స్ ఎరువు (50 కేజీలు) రూ.220లు పెరగ్గా, 14:35:14, 20:20:013, ఇతర రకాలు రూ.100 నుంచి రూ.150ల వరకు పెరిగాయి. ఈ మేరకు ఎకరాకు రూ.700ల వరకు రైతులపై అదనపు భారం పడనుందని అంచనా. జిల్లాలోని 2.22 లక్షల ఎకరాలకు గాను రైతులపై రూ.15.40 కోట్ల మేర అదనంగా భారం పడుతోంది. -
అభయారణ్యం.. స్వేచ్ఛా విహారం
బుట్టాయగూడెం: పాపికొండల అభయారణ్యంలో పెద్ద పులులు, చిరుతలు గాండ్రిపులతో, పక్షుల కిలకిలరావాలతో సందడి చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో అభయారణ్యం పరిధిలోకి వచ్చే 23 గ్రామాలు ఖాళీ చేసి ఆయా గ్రామాల్లో ఉండే నిర్వాసితులను ప్రభుత్వం పునరావాస కాలనీలకు తరలించడంతో వన్యప్రాణుల స్వేచ్ఛా జీవనానికి అవకాశం కలిగింది. గోదావరి ఒడ్డున ఉండే గ్రామాలు ఖాళీ కాగా జనసంచారం లేకపోవడంతో పాపికొండల్లో వన్యప్రాణులు మరింత స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం ఏర్పడింది. ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం 2008లో పాపికొండల అభయారణ్యంగా ప్రకటించింది. దీంతో అప్పటివరకు రాష్ట్ర పరిధిలో ఉన్న పాపికొండ లు కేంద్రం పరిధిలోకి మారింది. ఫారెస్టు, వైల్డ్లైఫ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వన్యప్రాణులు సంరక్షణకు కృషి చేస్తున్నారు. 1012 చ.కిలోమీటర్ల పరిధిలో.. పాపికొండల అభయారణ్యం ఏలూరు జిల్లా పరిధిలోని బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు రంపచోడవరం నియో జకవర్గంలోని దేవీపట్నం, వీఆర్పురం, చింతూరు, మండలాల పరిధిలో సుమారు 1,012.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. నాలుగేళ్లకోసారి గణన పాపికొండల అభయారణ్యంలో ప్రతి నాలుగేళ్లకోసారి అధికారులు జంతుగణన నిర్వహించి అడవుల్లో ఉండే వన్యప్రాణులను గుర్తించే ప్రక్రియ చేపడతారు. 2018, 2022ల్లో జంతుగణన నిర్వహించారు. ఆ సమయంలో 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి సర్వే చేశారు. సింహాలు, ఏనుగులు తప్ప అన్నిరకాల జంతువులు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. నేటి నుంచి పులుల జాడ కోసం.. పాపికొండల అభయారణ్యంలో పులుల జాడ కోసం అటవీ శాఖ అధికారులు శుక్రవారం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సుమారు 130 ప్రాంతాల్లో 300కు పైగా కెమెరాలు ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గతనెల 1న జాతీయ పులుల గణన, వన్యప్రాణుల లెక్కింపు కార్యక్రమం సుమారు 8 రోజులపాటు నిర్వహించారు. ఇందుకోసం అటవీశాఖ అధికారులు ట్రయిల్రన్ను కూడా నిర్వహించారు. అయి తే పులుల జాడ కోసం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రిప్రజెంటేటివ్ల ఆధ్వర్యంలో పులుల జాడపై ట్రాప్ కెమెరాల ద్వారా సర్వే చేయనున్నారు. గోదావరి తీరం.. స్వేచ్ఛా విహారం గోదావరి పరీవాహక ప్రాంతంలో నది ఒడ్డున ఉన్న తెల్లదిబ్బలు, సిరివాక, కొరుటూరు, శివగిరి, చీడూరు, టేకూరు, తూటిగుంట, ఎర్రవరం, సరుగుడు, పల్లపూరు, పైడాకులమామిడి, వాడపల్లి, కోండ్రుకోట, మాదాపురం, ములగలగూడెం, గాజులగొంది, తల్లవరం, కొత్తూరు, కొత్తమామిడిగొంది, చేగొండపల్లి తదితర గ్రామాలను పోలవరం ప్రాజెక్టులో ముంపు గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఆయా గ్రామాల నిర్వాసితులను బుట్టాయగూడెం, జీలు గుమిల్లి మండలాలకు తరలించారు. దీంతో ప్రస్తు తం ఆయా గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. జనసంచారం కూడా లేకపోవడంతో ఆయా గ్రామాల్లో వ న్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతూ నీటి కోసం గో దావరి తీరానికి వస్తున్నాయి. పాపికొండల విహార యాత్రకు వెళ్లే పర్యాటకులు నెమళ్లు, అడవి దున్నలు, దుప్పిలు కనిపించినట్టు చెబుతున్నారు.వన్యప్రాణుల ఆవాసం లక్ష ఎకరాల్లో పాపికొండల అభయారణ్యం పులులు, చిరుతలు, అడవి దున్నల సంచారం పోలవరం ముంపు గ్రామాల తరలింపుతో మరింత స్వేచ్ఛగా జీవనం 235 రకాలకుపైగా పక్షి జాతుల గుర్తింపు వన్యప్రాణుల సంరక్షణపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి పాపికొండల అభయారణ్యంతోపాటు ఆ ప్రాంతంలోని 23 గ్రామాలు ఖాళీ కావడంతో వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు గస్తీ కూడా నిర్వహిస్తున్నాం. వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. – ఎస్కే వల్లీ, అటవీశాఖ అధికారి, పోలవరం రేంజ్ -
మార్మోగిన గోవింద నామస్మరణలు
● కొత్త వత్సరం వేళ పోటెత్తిన భక్తులు ● కిటకిటలాడిన చినవెంకన్న ఆలయం ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లలో భక్తులు శ్రీవారిని దర్శిస్తున్న భక్తులు ద్వారకాతిరుమల: ఏడాదంతా శుభప్రదం కావాలని కోరుతూ.. వేలాది మంది భక్తులు గురువారం చిన వెంకన్నను దర్శించారు. దీంతో ద్వారకాతిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు, పినకడిమి నుంచి పాదయాత్రగా బుధవారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయాన్నే స్వామి, అమ్మవార్లను దర్శించారు. క్షేత్రంలోని అన్ని విభాగాల్లో భక్తులతో రద్దీ కనిపించింది. పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో నిండిపోయాయి. వేలాది మంది భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం వరకూ క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులకు సౌకర్యాలు శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు అధికారులు పలు సౌకర్యాలు కల్పించారు. పులిహోర, ఉప్మా, పండ్లను అల్పాహారంగా అందించారు. అలాగే పిల్లలకు పాలు, భక్తులకు నిరంతరాయంగా మంచినీరు అందించారు. భక్తుల సౌకర్యార్థం మధ్యాహ్నం కొంత సమయం రూ.500ల అంతరాలయ దర్శనం టికెట్ల విక్రయాలను అధికారులు నిలుపుదల చేశారు. తరువాత మళ్లీ పునరుద్ధరించారు. -
కోడి పందేల్లో ఎమ్మెల్యే చింతమనేని
సాక్షి, టాస్క్ఫోర్స్: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతికి ముందస్తుగానే కోడి పందేల నిర్వహణకు అనుమతులు ఇచ్చేసినట్టు పందేలరాయుళ్లు బహిరంగంగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. పెదవేగి మండలం పెదకడిమిలో గురువారం టీడీపీ నేతలు కోడి పందేల బరి ఏర్పాటు చేశారు. ఈ పందేల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని వీక్షించారు. కోడి పందేలను చూసేందుకు యువకులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. జిల్లా కేంద్రమైన ఏలూరుకు కూత వేటు దూరంలో ఇలా బహిరంగంగా కోడి పందేలు నిర్వహిస్తున్నా అధికారులు మిన్నకుండిపోయారు. -
ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం ఏర్పాటు
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా ఆరోగ్య శాఖలోని ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. గురువారం భీమవరంలో రాష్ట్ర ఆరోగ్య ఎంపీఈఓ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గుడాల హరిబాబు అధ్యక్షతన ఎన్నిక జరిగింది. సంఘ అధ్యక్షుడిగా కడలి శాంతమూర్తి, సహ అధ్యక్షుడిగా జి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా జె.సత్యనారాయణ, పి.సుకుమార్, పి.ప్రభాకర్, జనరల్ సెక్రటరీగా ఏఎస్ఎన్ మూర్తి, జా యింట్ సెక్రెటరీగా సీహెచ్ సత్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా యు.ప్రసాద్, ట్రెజరర్గా కె.అప్పారావు, ఈసీ మెంబర్లుగా ఎస్వీఎస్ ప్రసాద్, ఎం.ఫాల్సన్ను ఎన్నుకున్నారు. -
మోటార్సైకిళ్లు ఢీకొని వ్యక్తి మృతి
మరొకరికి గాయాలు తాడేపల్లిగూడెం రూరల్: ఎదురెదురుగా రెండు మోటారు సైకిళ్లు గురువారం తెల్లవారుజామున్న ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్లు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపారు. తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లి గ్రామానికి చెందిన తాడేపల్లి మహిమారావు (21) బైక్పై మెట్ట ఉప్పరగూడెం వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా, కుంచనపల్లి శ్మశాన వాటిక సమీపంలో ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ను ఢీకొన్నాడు. అనంతరం పక్కనే ఉన్న రాయిని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయాడు. దీంతో మహిమారావు తలకు బలమైన గాయం కావడంతో తొలుత ఏలూరు, అక్కడ నుంచి విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మోటార్సైకిల్పై ఉన్న కోమటి నాగబాబుకు గాయాలు కాగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్షతగాత్రుడు నాగబాబు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరో ఇద్దరికి గాయాలు జంగారెడ్డిగూడెం: కేఆర్పురం ఐడీటీఏ డీడీకి చెందిన వాహనం మోటార్సైకిల్ను ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్కు చెందిన అమరారాం చౌదరి (24) జంగారెడ్డిగూడెంలోని ఓ ఫ్యాన్సీ స్టోర్లో పనిచేస్తున్నాడు. గురువారం వేగవరం సమీపంలో ఒక వ్యక్తి నడుచుకుని వెళుతుండగా, మరో వ్యక్తి సైకిల్పై వెళుతున్నాడు. వీరిద్దరిని తప్పించే క్రమంలో కేఆర్పురం ఐడీటీఏ డీడీకి చెందిన వాహనం ఎదురుగా వస్తున్న అమరారాం చౌదరి మోటార్సైకిల్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అమరారాం చౌదరి అక్కడికక్కడే మృతిచెందాడు. చౌదరి వ్యాపారం నిమిత్తం అశ్వారావుపేట వెళ్లి తిరిగి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు, సైకిల్పై వెళుతున్న వ్యక్తి బేతాళ వెంకటపతి గాయపడినట్లు ఎస్సై తెలిపారు. -
కొత్త సొబగులతో కనువిందు
కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల విహార కేంద్రం కొత్త సొబగులను సంతరించుకుంది. మోంథా తుపాను ధాటికి కోతకు గురైన పక్షుల విహార చెరువుకు అటవీశాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. ఐసీఐసీఐ బ్యాంకు సామాజిక సేవలో భాగంగా రూ.20 లక్షలతో పక్షులు నివసించడానికి 50 కృత్రిమ ఇనుప స్టాండ్లు, విద్యుత్ సోలార్ను సమకూర్చింది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలకు పర్యాటకులను ఆకర్షించడానికి అటవీశాఖ అధికారులు కేంద్రంలో అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. కొల్లేరులో పక్షుల వీక్షణకు అనువైనది శీతాకాలం. ఏడాదిలో నవంబరు నుంచి మార్చి వరకు స్వదేశీ, విదేశీ పక్షులు సందడి కొల్లేరులో కనిపిస్తుంది. అరుదైన పెలికాన్(గూడబాతు) పక్షుల వేలాదిగా ఆటపాక కేంద్రానికి రావడంతో దీనికి ‘పెలికాన్ ఫ్యారడైజ్’ నామకరణం చేశారు. ఇక్కడ పక్షుల విహారానికి 285 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. పక్షుల సంతానోత్పత్తి, అవాసాల కోసం 176 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆటపాక పెలికాన్ పక్షులు సంతానోత్పత్తి చేశాయి. ప్రస్తుతం ఆటపాకలో పెలికాన్, పెయింటెడ్ స్టార్క్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, గ్రేహెరాన్, గ్లోబిహైబీస్ పక్షులు సందడి చేస్తున్నాయి. ఆటపాకలో అభివృద్ధి పనులు.. ఇటీవల మోంథా తుపాను దాటికి ఆటపాక పక్షుల విహార కేంద్రం అతలాకుతలమైంది. చెరువు గట్లు కోతకు గురయ్యాయి. దీంతో కొన్ని వారాల పాటు పక్షుల కేంద్రాన్ని మూసివేశారు. అనంతరం అటవీశాఖ రూ.9 లక్షల నిధులతో పక్షుల కేంద్రం టికెట్ కౌంటర్ నుంచి ఈఈసీ కేంద్రం వరకు 600 మీటర్ల రోడ్డును ఏర్పాటు చేసింది. కోతకు గురైన గట్లకు మరమ్మతులు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రూ.20 లక్షలతో పక్షుల ఆవాసాలకు 50 ఇనుప కృత్రిమ స్టాండ్లు, ఈఈసీ కేంద్రం విద్యుత్ అవసరరాలకు సోలార్ యంత్రాన్ని అందించారు. ఇటీవల రూ.15 లక్షలతో నూతన బోటును తీసుకొచ్చారు. ఇప్పుడు పక్షుల వీక్షణకు పర్యాటకులకు మూడు బోట్లు అందుబాటులో ఉన్నాయి. కొల్లేరు ప్రాంతంలో కొల్లేరు ఉత్సవాన్ని రెండు రోజుల పాటు నిర్వహించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పక్షుల వీక్షణకు ఇదే అనువైన కాలమవడంతో త్వరలో తేదీలను ప్రకటించనున్నారు. జిల్లా టూరిజం శాఖకు కొల్లేరు ఉత్సవ ఏర్పాట్లను అప్పగించారు. ఆటపాక, ఏలూరు మండలంలో పక్షుల విహార ప్రాంతాలను ఎంపిక చేసి కొల్లేరు ఉత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. పక్షుల వీక్షణ, బైనాక్యులర్స్ ఏర్పాటు, బోటింగ్, తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. వీటిలో పాటు దేవాలయాలు, పర్యాటక కేంద్రాల వివరాలతో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు వాటి వివరాలు తెలిపేలా సూచికలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పక్షుల రాకతో కొల్లేరు సరస్సు కళకళలాడుతోంది. పర్యాటలకు కోసం అటవీశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. త్వరలో నిర్వహించనున్న కొల్లేరు ఉత్సవం మరింత శోభ తేనుంది. ఆటపాక పక్షుల విహార కేంద్రానికి మరమ్మతులు చేశాం. నూతన బోటు పర్యాటలకు అందుబాటు ఉంచాం. నూతన ఏడాది, సంక్రాంతి పండగలకు ఏక్కువ సంఖ్యలో యాత్రికులు విచ్చేస్తారని భావిస్తున్నాం. – కే.రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజర్, కై కలూరు. పక్షుల విహార కేంద్రానికి పర్యాటకుల సందడి ఐసీఐసీఐ బ్యాంకు రూ.20 లక్షల సాయంతో కృత్రిమ స్టాండ్లు, సోలార్ కొల్లేరు ఉత్సవానికి సన్నాహాలు -
కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్
నూజివీడు: ముసునూరు మండలం రమణక్కపేటలో ప్రియుడిని స్తంభానికి కట్టేసి కొట్టి, ప్రియురాలిని తీసుకెళ్లిన ఆరుగురు నిందితులను ముసునూరు పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ గురువారం రాత్రి నూజివీడు రూరల్ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మండవల్లి మండలం కానుకొల్లుకు చెందిన అల్లం సాయిచందు (22) హైదరాబాద్లో చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కందుల సాయిదుర్గ ముసునూరు మండలం రమణక్కపేటలో పోస్టు ఉమన్ గా పనిచేస్తోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గతనెల 30న సాయిచందు, సాయిదుర్గను ఏలూరులోని గంగానమ్మ గుడి వద్ద వివాహం చేసుకున్నాడు. అనంతరం గతనెల 31న తన భార్య సాయిదుర్గను సాయిచందు డ్యూటీ నిమిత్తం రమణక్కపేట తీసుకెళ్లాడు. అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సాయిదుర్గ తల్లిదండ్రులు కందుల బాబు, విజయలక్ష్మిలతో పాటు బంధువులు శివకృష్ణ, శిరీషా, గూడూరు విజయ, కందుల శివనాగప్రసాద్ అక్కడికి వచ్చి సాయిదుర్గను బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అడ్డుకోవడానికి వెళ్లిన సాయిచంద్ను స్తంభానికి కట్టేసి అతనిపై కర్ర, వైర్లు, రాయి, చేతులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మరో పోస్టు ఉమన్ చెన్నకేశ్వరిపై కూడా దాడికి పాల్పడి సాయిదుర్గను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. తీవ్రంగా గాయపడిన అల్లం సాయిచందు, చెన్నకేశ్వరి ఇతరుల సాయంతో నూజివీడు ఏరియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముసునూరు ఎస్సై ఎం చిరంజీవి కేసు నమోదు చేశారు. దర్యాప్తు లో భాగంగా గురువారం విజయవాడ సమీపంలోని నున్న వద్ద ఆరుగురిని అరెస్టు చేసి, కిడ్నాప్కు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. -
మెప్మా.. న్యాయం చెప్పమ్మా
ఆకివీడు: యానమిటేర్లు డ్వాక్రా మహిళలను ముంచేశారు. వారి పేరిట రుణాలు రూ.2.80 కోట్లు తీసుకుని పరారయ్యారు. రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి డ్వాక్రా మహిళలకు నోటీసులు రావడంతో విషయం బయటపడింది. ఇది జరిగి 20 రోజులు గడుస్తున్నా పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) అధికారుల్లో మాత్రం చలనం లేదు. దీంతో తీసుకుని రుణాలు తాము ఎక్కడ చెల్లంచగలమని బాధితులు లబోదిబోమంటున్నారు. డ్వాక్రా మహిళల నిరసన ఆకివీడు యూనియన్ బ్యాంకు అధికారులు సుమారుగా 32 గ్రూపులకు చెందిన 320 మంది మహిళళలు అప్పులు చెల్లించాలని తాకీదులు పంపారు. ఇంత సొమ్ము తామెక్కడ తీసుకున్నామని మహిళలంతా రోడ్కెక్కి నిరసన తెలిపారు. దీంతో యానిమేటర్ల ఖాతాలు తనిఖీ చేశారు. యానిమేటర్ సుధాకు సంబంధించిన డ్వాక్రా గ్రూపుల నుంచి రూ.1.90 కోట్లు, మేర, స్థానిక సమతానగర్కు చెందిన యానిమేటర్ హేమలత డ్వాక్రా గ్రూపులకు సంబంధించి రూ.90 లక్షల మేర అక్రమాలు జరిగాయని తేల్చారు. నిరక్షర్యాస్యులైన డ్వాక్రా మహిళలు తీర్మానాలు, సంతకాలు, వేలిముద్రలు, స్టాంపులు వంటివాటితో పాటు విత్డ్రా ఫారాలు కూడా యానిమేటర్ల వద్దే ఉంచడంతో అవినీతి, అక్రమాలకు తావిచ్చినట్లయింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు యానిమేటర్లు పరారీలో ఉన్నట్లు తెలిసింది. అయితే డ్వాక్రా గ్రూపుల నుంచి లక్షల రూపాయలు డ్రా చేసిన వైనంపై నేటికీ మెప్మా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సంబంధిత బ్యాంకు నుంచి మాత్రమే పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. యానిమేటర్లపై తక్షణం చర్యలు తీసుకుని దుర్వినియోగమైన సొమ్మును జమ చేయించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అసలే వడ్డీల భారం డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీలపై వడ్డీల భారం పడుతుంది. ప్రతినెలా వాయిదాలు సకాలంలో చెల్లించకుంటే బ్యాంకులు వడ్డీపై వడ్డీలు వేస్తాయి. తీసుకున్న అప్పును కొంత (లక్షలు) చెల్లించిన వెంటనే మళ్లీ రూ.5 లక్షల మేర రుణం అందజేయడంతో మహిళలు అత్యాశతో రుణం తీసుకుని తీవ్ర నష్టానికి గురవుతున్నారు. రూ. 5 లక్షల్లో మూడు లక్షలకు మాత్రమే సున్నా వడ్డీ వర్తిస్తుంది, మిగిలిన రూ. 2 లక్షలకు సాధారణ వడ్డీ చెల్లించాల్సిందే. గ్రూపులో కొందరు సకాలంలో వాయిదా కట్టకపోయినా సున్నా వడ్డీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం సున్నా వడ్డీ సొమ్ము వెనక్కి రావడంలేదని మహిళలు వాపోతున్నారు. కొద్దిమంది ఖాతాల్లో మాత్రమే సొమ్ము జమ అవుతుందని చెబుతున్నారు. డ్వాక్రా మహిళలను ముంచేసిన యానిమేటర్లు రూ.2.80 కోట్లు డ్రా చేసి పరారీ రుణాలు చెల్లించాలని డ్వాక్రా మహిళలకు నోటీసులు లబోదిబోమంటున్న బాధితులు 20 రోజులు గడుస్తున్నా.. నోరు మెదపని మెప్మా అధికారులు డ్వాక్రా అప్పు చూసి భయం వేస్తోంది. మాకు తెలియకుండా మా గ్రూపుల నుంచి లక్షలాది రూపాయాలు డ్రా చేసిన యానిమేటర్లపై నేటికీ ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. యానిమేటర్లను పట్టుకుని వారి నుంచి సొమ్ము జమ చేయించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. – పిల్లా రంగమ్మ, సంతపేట, బాధితురాలు, ఆకివీడు -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి
● ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ ● భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు తణుకు అర్బన్: నూతన సంవత్సరం తొలి రోజున దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న దంపతులపై మృత్యువు లారీ రూపంలో కబళించింది. తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా భర్తను ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. తణుకు మండలం వేల్పూరు చింతలదొడ్డిలో నివసిస్తున్న అందే లోకేశ్వరరావు, వెంకటలక్ష్మి దంపతులు తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి ద్వారకాతిరుమల, మద్ది ఆంజనేయస్వామి ఆలయాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఆలయాల్లో స్వామివార్ల దర్శనాల అనంతరం తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో సరిగ్గా తేతలి జాతీయ రహదారి ప్రాంతంలోకి వచ్చేసరికి తమిళనాడుకు చెందిన లారీ వేగంగా ఢీకొట్టడంతో వెంకటలక్ష్మి (43) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త లోకేశ్వరరావును ముందుగా తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవలకు ఏలూరు ఆశ్రం హాస్పిటల్కు తరలించారు. మిన్నంటిన భర్త రోదన ఘటనా ప్రాంతంలో కళ్ల ముందే భార్య వెంకటలక్ష్మి మరణాన్ని దగ్గరగా చూసిన లోకేశ్వరరావు తట్టుకోలేకపోయారు. బంధువులకు ఫోన్లు చేసి నా వెంకటలక్ష్మి ఇక లేదంటూ తల్లడిల్లిపోయారు. భార్య మృదదేహం వద్ద ఆయన రోదనలు మిన్నంటాయి. లోకేశ్వరరావు ఉండ్రాజవరం మండలం పాలంగిలో మెడికల్ దుకాణం నిర్వహిస్తున్నారని, కుమారుడు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా కుమార్తె ఫార్మసీ విద్యనభ్యసిస్తున్నట్లు బంధువులు తెలిపారు. కుమార్తె అందే వల్లి ధన దుర్గ ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుమేరకు తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు
ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు జంగారెడ్డిగూడెం: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. లక్కవరం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం గ్రామానికి చెందిన కాకుళ్ల స్టాలిన్ (18), మాండ్రు సాగర్, కాకుళ్ల జస్వంత్, మానుకొండ జస్వంత్ నలుగురు స్నేహితులు. వీరంతా కలిసి ద్వారాకాతిరుమల, ఐఎస్ జగన్నాధపురం వెళ్లేందుకు జంగారెడ్డిగూడెంలో ఒక కారును అద్దెకు తీసుకుని వారే స్వీయ డ్రైవింగ్ చేస్తూ బయలుదేరారు. కారును మాండ్రు సాగర్ నడుపుతుండగా లక్కవరం సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పి కారు చెట్టును ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కాకుళ్ల స్టాలిన్ కారులో నుంచి పక్కనే ఉన్నం పొలంలోకి ఎగిరిపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవింగ్ చేస్తున్న మాండ్రు సాగర్కు తీవ్ర గాయాలయ్యాయి. కాకుళ్ల జస్వంత్, మానుకొండ జస్వంత్కు స్వల్ప గాయాలు కాగా, జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాకుళ్ల స్టాలిన్ పెయింట్ పనులు చేసుకుని జీవిస్తుండగా, మిగిలిన ముగ్గురు చదువుకుంటున్నారు. ఘటనపై లక్కవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లుడి బైక్ను దహనం చేసిన మామ
భీమడోలు: అల్లుడి బైక్ను మామ పెట్రోలు పోసి దహనం చేసిన ఘటన గురువారం రాత్రి పెదలింగంపాడులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బిరుదుగడ్డ బాబూరావు తన కుమార్తెను అదే గ్రామానికి చెందిన కొండా సుబ్బారావుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా రెండేళ్ల కితం సుబ్బారావు తన భార్యను పుట్టింటికి పంపించి వేయడంతో ఆమె పుట్టింటిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో పలుసార్లు తన కుమార్తెను కాపురానికి తీసుకువెళ్లాలని అల్లుడిని మామ బాబూరావు కోరాడు. నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన మామ తన అల్లుడి ఇంటి వద్ద ఉన్న బైక్ను పెట్రోలు పోసి దహనం చేశారు. దీంతో సుబ్బారావు భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం: నూతన సంవత్సరం సందర్భముగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానానికి వివిధ సేవల రూపేణా రూ.3,97,450 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ చందన తెలిపారు. స్వామివారిని బిగ్బాస్ సీజన్ 9 సెకండ్ రన్నరప్ డెమోన్ పవన్ దర్శించుకున్నారు. నూజివీడు: జాతీయస్థాయి సీనియర్ బాస్కెట్బాల్ పోటీలకు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న బేతాళ ప్రభుదీపిక, షేక్ ఆస్రా చైన్నెలో ఈనెల నాలుగో తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. వీరిని నూజివీడు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, పరిపాలనాధికారి లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, పీడీ సుబ్బలక్ష్మి అభినందించారు. ద్వారకాతిరుమల: క్షేత్రంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు శ్రీవారి వైభవాన్ని చాటుతున్నాయి. నిత్యం ఆలయంలో సుప్రభాత సేవకు బదులు, తిరుప్పావై పాశురాలను పఠిస్తున్నారు. అలాగే స్వామివారి గ్రామోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం ఉదయం జరిగిన శ్రీవారి తిరువీధి సేవ ఆదం్యతం భక్తులకు నేత్రపర్వమైంది. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అశ్వ, గజ సేవలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు విశేష పూజలు జరిపి, హారతులిచ్చారు. పెనుమంట్ర: ప్రభుత్వ ఆదేశాల పుణ్యమా అని ఒక సీనియర్ జర్నలిస్టుకు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం అర్ధరాత్రి పెనుమంట్ర తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న బ్రాందీ షాపు ఎదురుగా జరిగింది. పొలమూరు గ్రామానికి చెందిన వేండ్ర ప్రసాద్ ఏలూరులోని ప్రజాశక్తి కార్యాలయంలో డెస్క్ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి తన విధులను ముగించుకొని మోటార్ సైకిల్పై పొలమూరు గ్రామానికి తిరిగి వస్తుండగా పెనుమంట్రలోని స్టేట్ హైవే రోడ్డు పక్కనే ఉన్న బ్రాందీ షాపులో మద్యం సేవించి వస్తున్న అదే గ్రామానికి చెందిన జోగి వెంకటేష్ అనే వ్యక్తి స్కూటర్తో బలంగా ఢీకొట్టాడు. దీంతో ప్రసాద్కు తీవ్రంగాను, వెంకటేష్కు స్వల్పంగాను గాయాలయ్యాయి. ఇరువురిని 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తణుకులోనే మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై పెనుమంట్ర ఎస్సై ఏ స్వామిని వివరణ కోరగా ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని అయితే పూర్తి వివరాలు తెలియరాలేదన్నారు. -
ఏలూరులో ‘పచ్చ’పాతం
ఏలూరు టౌన్: ఏలూరులో ‘పచ్చ’పాతం పెచ్చుమీరుతోంది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను కక్షపూరితంగా అధికారులు తొలగించడంతో వివాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే ఏలూరు 19వ డివిజన్ హనుమాన్నగర్ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ ఉండగా.. నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై స్థానిక నాయకులు ఇదేమి విధానమంటూ టౌన్ప్లానింగ్ సిబ్బందిని నిలదీశారు. దీంతో వారు ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను రూరల్ పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారు. పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ సూచనలతో ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి రూరల్ పోలీస్స్టేషన్కు చేరుకుని పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. టౌన్ప్లానింగ్ అధికారులకు నగరంలో ఏర్పాటు చేసిన ఇతర పార్టీలు, వ్యాపార సంస్థల ఫ్లెక్సీల కనిపించకపోవటం శోచనీయన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా వైఎస్సార్ సీపీ శ్రేణులపై నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఇప్పటికే తాము నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్కు ఈ విషయంపై వినతిపత్రం సమర్పించామని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


