breaking news
Feroze Varun Gandhi
-
న్యాయవ్యవస్థ స్వతంత్రతే పరమావధి
న్యాయవ్యవస్థకూ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్న చారిత్రక ఘర్షణ ఫలితంగా న్యాయవ్యవస్థ సామర్థ్యం క్షీణిస్తోంది. ప్రజాస్వామ్య ఆరోగ్యం కోసం న్యాయవ్యవస్థ స్వతంత్రత కొనసాగాలి. న్యాయవ్యవస్థ రాజకీయ భావజాలానికీ, ప్రజా ఒత్తిడికీ దూరంగా ఉండాలి. దాన్ని ప్రభుత్వ శాఖల నుంచి స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించాలి. దీనికోసం న్యాయమూర్తులను నియమించే విశ్వసనీయ, పక్షపాత రహిత వ్యవస్థ అవసరం. కొలీజియం వ్యవస్థను కొనసాగిస్తూనే, జడ్జీలను నియమించే అధికారాన్ని కార్యనిర్వాహక వ్యవస్థకు ఇస్తూనే న్యాయమూర్తులను సిఫారసు చేయడానికి ఒక సెక్రటేరియట్ను బలోపేతం చేయవచ్చు. ప్రస్తుత న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయ శాఖ, సామాన్యులు ఇందులో ప్రతినిధులుగా ఉండొచ్చు. కేరళలోని ఎడ్నీర్ మఠం ఆస్తుల నిర్వహణ విషయంలో మఠంపై నిబంధనలు విధించడా నికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను సవాలు చేస్తూ మఠాధి పతి స్వామి కేశవానంద భారతి 1970 ఫిబ్రవరిలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మూడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు 7–6 మెజారిటీతో రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సిద్ధాం తాన్ని వివరిస్తూ, రాజ్యాంగ కీలక సూత్రాలను, స్వరూపాన్ని సవ రించడంలో పార్లమెంట్కు ఉన్న పరిమితులను నొక్కిచెప్పింది. అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు సుప్రీంకోర్టును కూడా నూతన న్యాయమూర్తుల బృందంతో నింపారు. ఆయన కంటే ముగ్గురు సీనియర్ జడ్జీలను పక్కకునెట్టి ఏఎన్ రాయ్ని ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించారు. కేశవానంద కేసు తీర్పుపై సంతకం చేయని ఆ ఒక్క న్యాయమూర్తి ఈయనే. ఈయన నేతృ త్వంలో 13 మంది న్యాయమూర్తుల బెంచ్ నాటి చారిత్రాత్మక తీర్పును తిరగదోడింది. కేసును రెండు రోజులపాటు విచారించింది. ఈ కేసుపై ఎలాంటి రివ్యూ పిటిషన్ని దాఖలు చేయలేదనీ, మౌఖిక అభ్యర్థన ప్రాతిపదికగా తప్పు ప్రక్రియతో ఈ కేసును సమీక్షించారనీ త్వరలోనే గుర్తించారు. దాంతో బెంచ్ మొత్తాన్నీ రద్దు చేయాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి నిబద్ధత చూపే న్యాయవ్యవస్థ ఉన్నప్ప టికీ ఆనాడు రాజ్యాంగ ప్రాథమిక స్వరూపం బతికి బట్టకట్టింది. ఈ చారిత్రాత్మక తీర్పు నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి సమ తుల్యతను కలిగించడంలో తోడ్పడింది. కొంతకాలంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (2), 217 (1)లను వ్యాఖ్యానించడంలో కేంద్రప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఆర్టికల్ 124(2) ప్రకారం సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రతి న్యాయమూర్తినీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (ప్రత్యేకించి చీఫ్ జస్టిస్), రాష్ట్రాల్లోని హైకోర్టు న్యాయమూర్తులతో చర్చించి రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా హైకోర్టు న్యాయ మూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో, రాష్ట్ర గవర్నర్తో, హైకోర్టు చీఫ్ జస్టిస్తో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి నియ మిస్తారని ఆర్టికల్ 217 (1) నొక్కి చెబుతుంది. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1981)లో న్యాయపరమైన భాష్యం కానీ, సుప్రీంకోర్టు రికార్డ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా (రెండో జడ్జీల కేసు) (1993) కానీ, అర్టికల్ 143(1) ... వర్సెస్ అనామక (మూడో జడ్జీల అభిప్రాయం) (1998) వంటివి కానీ... న్యాయమూర్తుల స్వాతంత్య్ర సూత్రాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయాయి. న్యాయమూర్తులను సిఫారసు చేసే కొలీజియం వ్యవస్థకు దారి తీశాయి. ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం కొలీజియం వ్యవస్థ సిఫార్సులను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు– కానీ కొలీజియం రెండో సారి కూడా ఆ సిఫార్సులను చేస్తే ప్రభుత్వం తప్పకుండా ఆమోదించాల్సి ఉంటుంది. ఇటీవలే ఈ ఏకాభిప్రాయం స్తంభనకు దారి తీసింది. నవంబర్ 12న కొలీజియం తిరిగి సిఫార్సు చేసిన ప్రతి పాదనలను కేంద్రం నిలిపివుంచింది. దీంతో సెకండ్ జడ్జీల కేసులో విధించిన కాలక్రమాన్ని పాటించనందుకు సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. ఖాళీలను పూరించడానికి నిర్దిష్ట సమయాన్ని సూచించ నందుకు న్యాయ శాఖ పట్ల న్యాయ, పర్సనల్ వ్యవహారాలపై స్టాండింగ్ పార్లమెంటరీ కమిటీ కూడా తన అసంతృప్తిని వెళ్లగక్కింది. స్వతంత్ర న్యాయవ్యవస్థకూ, మితిమీరి వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్న ఈ చారిత్రక ఘర్షణ ఫలితంగా భారత న్యాయవ్యవస్థ సామర్థ్యం క్షీణిస్తోంది. 2022 ఆగస్టులో సుప్రీం కోర్టులో మొత్తం 34కి గానూ 3 ఖాళీలు, హైకోర్టుల్లో 1,108 ఖాళీలకు గానూ 381, దిగువ కోర్టుల్లో 24,631 జడ్జీ పదవులకుగానూ 5,342 ఖాళీలు ఉన్నాయి. అంటే 20 శాతం మేర ఖాళీలు ఉన్నాయి. బాంబే, పంజాబ్–హరియాణా, కలకత్తా, పట్నా, రాజస్థాన్ హైకోర్టుల్లో ఇలాంటి ఖాళీలు న్యాయవ్యవస్థ సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి. (2022 ఆగస్టు నాటికి నాలుగు కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయి). న్యాయవ్యవస్థలో సంస్కరణలు దీర్ఘకాలం పెండింగులో ఉండటం నిజమే కావచ్చు. రాజకీయ సంస్థల చేత జడ్జీల నియామ కాలు జరుగుతున్న దేశాలను చూడండి. ఇటలీలో రాజ్యాంగబద్ధ న్యాయస్థానం నియామకాలకు అధ్యక్షుడు, లెజిస్లేచర్, సుప్రీంకోర్టు ఇలా ప్రతి సంస్థా అయిదుగురు జడ్జీలను నామినేట్ చేయడానికి అనుమతిస్తారు. అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను శాశ్వత ప్రాతిపదికన అధ్యక్షుడు నామినేట్ చేస్తారు. తర్వాత సెనేట్ మెజారిటీ ద్వారా ఆమోదిస్తుంది. సహజంగానే ఇది పక్షపాత న్యాయవ్యవస్థకు దారితీస్తుంది. న్యాయవ్యవస్థ పారదర్శకతను మెరుగుపర్చడానికి న్యాయమూర్తుల ఎన్నికలు కూడా ఉపయోగపడతాయి. అమెరికా లోని అనేక రాష్ట్రాలు రాష్ట్ర సుప్రీంకోర్టుల న్యాయ నియామకాల కోసం ఎన్నికలను ఉపయోగించుకుంటున్నాయి. అయితే ఇవి ప్రజా కర్షక తీర్పులు ఇచ్చేలా న్యాయమూర్తులను ప్రోత్సహిస్తాయి. సంకీర్ణ ప్రభుత్వ ధోరణి కలిగిన ఏ ప్రజాస్వామ్యానికైనా ఇది మంచిది కాదు. ఇతర దేశాలు న్యాయ కౌన్సిల్స్తో ప్రయోగాలు చేస్తాయి. ఇరాక్లో జడ్జీలందరూ ఒక న్యాయ సంస్థలో పట్టభద్రులై ఉంటారు. దరఖాస్తుదారులందరూ రాత, మౌఖిక పరీక్షల్లో పాల్గొంటారు. జడ్జీల ప్యానెల్తో ఇంటర్వ్యూలో పాల్గొంటారు. జపాన్లో సుప్రీంకోర్టు సెక్రటేరియట్ శిక్షణ, ప్రమోషన్లతోపాటు దిగువ స్థాయి న్యాయ నియామకాలను నియంత్రిస్తుంటుంది. ఇటీవలే, కేంద్రప్రభుత్వం న్యాయ కమిషన్ ద్వారా న్యాయమూర్తుల నియామకాలు చేపట్టాలని ప్రతిపాదించింది (జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్ బిల్లు, 2014). 2015 అక్టోబర్ 16న దీన్ని 4–1 మెజారిటీతో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అయితే కొలీజియం వ్యవస్థలో మరింత పారదర్శకతను కల్పించడాన్ని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. అదే సమయంలో న్యాయమూర్తుల నియామకానికి సాధికారిక సెక్రటేరి యట్ అవసరమా ఆనే అంశంపై చర్చపెట్టింది. దీనిపై తదుపరి సంస్కరణలు చేయవచ్చు. కొలీజియం వ్యవస్థ కొనసాగుతుంది; నియమించే అధికారాన్ని కార్యనిర్వాహక వ్యవస్థకు కొనసాగిస్తూనే అభ్యర్థులను సిఫారసు చేయడానికి ఒక సెక్రటేరియట్ను బలోపేతం చేయవచ్చు. దీన్ని ప్రస్తుత న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయ మంత్రిత్వ శాఖ, సామాన్యుల ప్రతినిధుల నుంచి నియమించవచ్చు. ఇది న్యాయ వ్యవస్థలో మన సమాజానికి గొప్ప ప్రాతినిధ్యాన్ని కల్పిస్తుంది. 2022 డిసెంబర్ నాటికి, సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళలు, ఇద్దరు ఎస్సీ జడ్జీలు మాత్రమే ఉన్నారు. న్యాయమూర్తుల నియామకాలకు అవతల, ఒక కొత్త అప్పీల్ కోర్టు ఉండాల్సిన అవసరం ఉంది. హైకోర్టుల్లో తీర్పులకు వ్యతిరే కంగా రెగ్యులర్ అప్పీల్ కోర్టుగా ఉండాలనే ఉద్దేశం సుప్రీంకోర్టుకు ఎన్నడూ లేదు. సుప్రీంకోర్టు బెయిల్ అప్లికేషన్లను వినకూడదు. దానికి బదులుగా లా కమిషన్ సిఫార్సు చేసినట్లుగా, ప్రముఖ మెట్రో నగ రాల్లో బ్రాంచ్లు ఉన్న ఒక ఫెడరల్ అప్పీల్ కోర్టు ఉండాలి. ఈలోపు, సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ కోర్టు (రాజ్యాంగ సవరణ ద్వారా)లోకి పరివర్తన చెందాలి. ఇలా చేయడమంటే అత్యున్నత స్థాయిలో తక్కువ కేసులు (మాట వరసకు 50) మాత్రమే పెండింగులో ఉండేట్టు చూడటం! ఏ స్థాయిలో అయినా జడ్జీలందరికీ కచ్చితమైన రిటైర్మెంట్ వయసు (65 ఏళ్లు) విధించాలి. రిటైర్మెంట్ తర్వాత, ప్రభుత్వంలో పోస్టులకు నామినేట్ చేయడానికి నిర్దిష్టమైన గడువును విధించాలి. భారతీయ ప్రజాస్వామ్య ఆరోగ్యం కోసం న్యాయవ్యవస్థ స్వతంత్రత అవశ్యం. దీన్ని సాధించడానికి న్యాయమూర్తులను నియ మించే విశ్వసనీయమైన, పక్షపాత రహితమైన వ్యవస్థ అవసరం. వ్యక్తి స్థాయిలో, వ్యవస్థ స్థాయిలో న్యాయవ్యవస్థను ప్రభుత్వ శాఖల నుంచి స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించాల్సి ఉంది. ఫిరోజ్ వరుణ్ గాంధీ వ్యాసకర్త లోక్సభలో బీజేపీ ఎంపీ (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో -
ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?
ఇన్ఫోసిస్, విప్రో వంటి సాఫ్ట్వేర్ సంస్థల ఉద్యోగులతో ముడిపడిన ఘటనలను ఆసక్తికరంగా, పతాక వార్తలుగా చూపించే మన మీడియా అదే సమయంలో రిలయెన్స్ ఉద్యోగుల విషయాలకు అంత ప్రాధాన్యత ఇవ్వదు. కారణం రిలయెన్స్కు ఉన్న ప్రకటనలిచ్చే శక్తి. అంగబలం, అర్థబలం కూడా. ఈ వారం పత్రికలలో వచ్చిన రెండు ప్రధాన వార్తలు నన్ను ఆశ్చర్యం లో ముంచెత్తాయి. వీటి లో మొదటిది భారతీ యజనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఫెరోజ్ వరుణ్ గాంధీ రాసిన ఒక వ్యాసం. ‘ఒక అనిశ్చితమైన, మత్స్య న్యాయాన్ని పోలిన జీవితం’ గురించి వరుణ్ ఇక్కడ వర్ణించారు. భారతదేశంలో వ్యవసాయ పరిస్థితిని వర్ణిస్తూ ఆయన ఈ మాట లన్నారు. అంటే పెద్ద చేప చిన్న చేపను మింగే తర హా జీవితం భారతీయ రైతులదని అర్థం. నామ మాత్రంగా మిగిలిపోయిన భారతీయ రైతులు శతా బ్దాలుగా ఘోరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతు న్నారని ఆయన వ్యాసాన్ని ముగించారు. పైగా భారతీయ రైతులలో చాలామంది అనిశ్చితమైన మత్స్యన్యాయాన్ని పోలి ఉండే ‘నిరుపేద, మురికి, పశుప్రాయమైన, అల్ప జీవితం బారిన పడి నలుగు తున్నారన్నది ఆయన వ్యాసం ముగింపు. ఇక వరుణ్ గాంధీ పేర్కొన్న రెండో ప్రధాన వార్త ఏదంటే.. ‘కోట్లకు పడగలెత్తిన ముంబై మహిళ దిక్కులేని మరణం, ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన ఉన్నత న్యాయస్థానం’. ముంబై నగరంలోని వెర్సో వాలోని యారి రోడ్డులో రూ. 30 కోట్ల విలువైన ఆస్తి ఉన్న 68 ఏళ్ల ముంబై మహిళ నిర్లక్ష్యం కారణంగా మరణించిన తీరును విని ఆగ్రహించిన హైకోర్టు, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిశంసించిందని ఈ వార్త పేర్కొంది. నగరంలోని ఈ శివారు ప్రాంతంలో చాలా మంది సంపన్నులు నివసిస్తుంటారు. ఆమె కుటుంబం కానీ, ప్రభుత్వం కానీ.. సీని యర్ పౌరుల సంక్షేమానికి, వైద్య సహాయానికి, వృద్ధుల శరణాలయాలకు బాధ్యత వహించే చట్టం ద్వారా ఆ వృద్ధురాలి బాగోగులను ఏమాత్రం పట్టిం చుకోకపోవడం దురదృష్టకరమని న్యాయస్థానం పేర్కొంది. నగరంలోని ఇతర సీనియర్ పౌరులు ఇలాంటి దుస్థితిని ఎదుర్కోకూడదని కోర్టు అభిప్రా యపడింది. పైగా, తల్లిదండ్రులు, సీనియర్ పౌరుల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007 పరిధి, పరిమితు లను తాను సమీక్షించాలనుకుంటున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఆ వృద్ధురాలి తరఫున వాదించిన న్యాయ వాది... గత ఐదేళ్లుగా ఆమె అలాంటి దీనస్థితిలోనే గడిపిందని ఇతరులకు ఆమె దుస్థితి ఎదురు కాకూ డదని కోర్టుముందు పేర్కొన్నారు. సీనియర్ పౌరు లపట్ల నిర్లక్ష్యం వహించి దురదృష్ట పరిణామాలకు కారణభూతులైన వారు అలాంటి వారి ఆస్తులకు వారసులు కానివిధంగా ఒక చట్టాన్ని తీసుకురా వాలని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే సహజ కారణాలతోనే ఆమె మరణించినట్లు ఆ వృద్ధురాలి శవ పంచనామా నివేదిక తెలిపిందని కోర్టు తెలిపింది. పతాక వార్త ప్రకటిస్తున్నట్లు, ఈ కథనంలో అంతకంటే తీవ్ర నేరంగా కనిపించిన అంశం ఏదం టే సంపన్న మహిళ అలాంటి దుస్థితిని అనుభవిం చిందన్న వాస్తవమే. వరుణ్ గాంధీ వ్యాఖ్య స్పష్టం చేసినట్లుగా బత కడానికి కొన్ని కోట్లమంది పోరాటం సల్పుతున్న దేశంలో సంపన్నురాలైన వ్యక్తిపై మీడియా దృష్టి పెడుతోంది. కొంతవరకు ఇది ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రముఖ వ్యక్తుల జీవితాలపై వార్తలు కవర్ చేయడం సాధారణంగా జరిగేదేనని ప్రపంచ మీడియా ఆమోదించింది. సంపన్నుల జీవితాలు మీడియా కవరేజ్ దృష్టిలో అత్యంత విలువైనవే మరి. అయితే భారత్లో దీన్ని సంప న్నులకే కాకుండా, మధ్యతరగతికి కూడా విస్తరిం చారు. అదే సమయంలో చాలా తరచుగా విశాల ప్రజారాసుల జీవితాలను మీడియా పూర్తిగా మిన హాయిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రమాదాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. కానీ తరచుగా బీఎండబ్ల్యు ప్రమాదం అనే అంశాన్ని ప్రధాన వా ర్తగా ఎంచుకుంటుంటారు. ఎందుకంటే ఒక ఫ్యాన్సీ కారు మరింత ప్రాధాన్యమైన వార్తగా అర్హతను పొం దుతుంది. మన వార్తా పత్రికలతో బాగా పరిచ యమున్న వారిని బాగా ఇబ్బందిపెట్టే, కలవరపర్చే అంశాల్లో ఇదొకటి. ఈ అంశానికి సంబంధించి మరో ఉదాహర ణను తీసుకుందాం. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థకు, ప్రత్యేకించి సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన ఉద్యోగిని తీసుకుందాం. సాఫ్ట్వేర్ సంస్థలు పెద్దగా ప్రకటనలు ఇవ్వవన్నది తెలిసిందే. బెంగళూరుకు కేంద్రంగా పనిచేసే ఇన్ఫోసిస్కు లక్ష మంది ఉద్యోగు లున్నారు. ఈ సంస్థ ఉద్యోగి ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా, అత్యాచారానికి, హింసకు గురైనా, దొంగతనం బారిన పడినా సాధారణ ప్రజానీకం కూడా అలాంటి స్థితిని ఎదుర్కొనడంలో భాగంగానే వీటిని చూడాలి. అంతకుమించిన ప్రాధాన్యత ఇలాంటి ఘటనలకు ఉండదు. కాని మన మీడియా మాత్రం అనివార్యంగా ఇలాంటి సందర్భాల్లో ఆ సంస్థ పేరును తాటికా యంత అక్షరాలతో ప్రధాన వార్తగా తీసుకొస్తుంది. పైగా ఇంటర్నెట్లో ‘ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య’, ‘విప్రో ఉద్యోగి ఆత్మహత్య’ అనే పదాలతో ఇంటర్నె ట్లో సెర్చ్ కూడా చేస్తుండటం చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం పొందటం అనేది ఆసక్తి గొలుపుతుంటుంది కాబట్టి వార్త అలాగే రూపొందుతుందని మీడియా వాదించ వచ్చు. కానీ ‘రిలయెన్స్ ఉద్యోగి ఆత్మహత్య’ అనే పదాన్ని సెర్చ్ చేయండి మరి. ఈ పదానికి ఇంటర్నె ట్లో లభించే ప్రాధాన్యత పూర్తి విరుద్ధంగా ఉం టుంది. రిలయెన్స్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకో కపోవచ్చు లేదా ఒకవేళ వారు నిజంగా ఆత్మహత్య చేసుకున్నా, మీడియా ఆ కంపెనీకి సంబంధించిన వార్తలను ప్రచురించడానికి వెనుకడుగు వేస్తుంది. అదే సమయంలో ఇన్ఫోసిస్, విప్రో సంస్థల విష యానికి వస్తే మీడియా ఇలాంటి సందర్భాల్లో చాలా ఆసక్తిని ప్రదర్శిస్తుంది. ఎందుకు? ఎందుకంటే సాఫ్ట్వేర్ సంస్థల కంటే రిలయెన్స్కు అంగబలం, అర్థబలం మెండు. అంతేకాకుండా అది వాటికంటే పెద్ద ప్రకటనదారు కూడా. దీంతో పోలిస్తే భారతీయ పత్రికలకు, టీవీ స్టేషన్లకు ప్రకటనలు ఇస్తే సాఫ్ట్వేర్ సంస్థలకు ఒరిగే దేమీ ఉండదు. రిలయెన్స్ కంపెనీకి దాని ఉద్యోగు లకు సంబంధించిన విషయాలను కూడా మీడియా నివేదించాలని నేను ఇక్కడ చెప్పడం లేదు. కాని అదే సమయంలో సాఫ్ట్వేర్ సంస్థల పట్ల మీడియా తప్పు చేస్తున్నదని మాత్రమే చెబుతున్నాను. ప్రాధా న్యతలను బట్టి వార్తలను నివేదించే సమస్యను మరో కవరేజ్లో కూడా మనం చూడవచ్చు. భార త్లో ఏటా 25 వేల అత్యాచారాలు జరుగుతున్నా యి. (వాస్తవానికి పశ్చిమ దేశాలతో సహా ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే), కానీ మీడి యా మాత్రం ఈ అత్యాచారాల్లో అత్యంత ప్రాధా న్యత కలిగి ఉన్నారని తను భావించే బాధితులనే వార్తల కోసం ఎంచుకుంటుంది. ఢిల్లీ నగరంలో ట్యాక్సీ సర్వీసులో అనేకమంది అమ్మాయిలు అత్యా చారాలకు గురవుతున్న వాస్తవం కట్టెదుట కనిపిస్తు న్నప్పటికీ ఉబెర్ క్యాబ్లో ఎగువ తరగతి మహిళ అత్యాచారానికి గురైన కథనం విపరీత ప్రాధాన్య తను పొందుతుంది. స్పష్టంగానే భారతీయ మీడియా మధ్యతరగతి భారతీయుల మనోభావాలకు నిత్యం విలువనిస్తోం ది. వీరి దృష్టిలో పేదలు అంతగా పట్టించుకోదగి నంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే పేదల జీవి తాలే అంత ప్రాధాన్యమైనట్టివి కాదు. (థామస్ హాబ్స్ మాటల్లో చెప్పాలంటే అవి ‘మురికి, పశు ప్రాయమైన, అల్ప’ జీవితాలు మరి). (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) - ఆకార్ పటేల్ Aakar.patel@icloud.com)